India
-
ఈ–కామర్స్ @ 250 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుత 90 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 250 బిలియన్ డాలర్లకు చేరనుంది. జెన్ జెడ్ షాపర్స్, క్విక్ కామర్స్ వేగంగా విస్తరిస్తుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. గూగుల్, డెలాయిట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దశాబ్దం ఆఖరు నాటికి భారత డిజిటల్ ఎకానమీలోకి 15 కోట్ల మంది కొత్త షాపర్స్ ప్రవేశించనున్నారు. మొత్తం ఆన్లైన్ వ్యయాల్లో 22 కోట్ల పైగా ఉన్న జెన్ జెడ్ వినియోగదారుల వాటా 45%కి చేరనుంది.దేశీయంగా ప్రజల షాపింగ్ చేసే తీరుతెన్నులు మారుతున్న నేపథ్యంలో ఈ–కామర్స్ కీలక దశలో ఉందని గూగుల్ ఇండియా ఎండీ (కనెక్టెడ్ కన్జూమర్ కామర్స్) రోమా దత్త చౌబే తెలిపారు. ఏఐ, ఇతరత్రా సాంకేతికతలతో వినియోగదారులు కొత్త కొనుగోలు ధోరణులను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆల్గోరిథమ్ శకం వైపు మార్కెట్ మళ్లుతోందని డెలాయిట్ దక్షిణాసియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ పేర్కొన్నారు. డిజిటల్ జనులైన జెన్ జెడ్ వినియోగదారులు ఈ మార్పులకు కారణమవుతున్నారని వివరించారు. వినియోగదారులు తమ అవసరాన్ని వివరిస్తే, ఏఐ దాన్ని విశ్లేషించుకుని, సత్వరమే సొల్యూషన్స్ కూడా అందించే జనరేటివ్ కామర్స్ వేగవంతంగా అమల్లోకి వచ్చేందుకు ఇది దోహదపడుతోందన్నారు. మరిన్ని కీలకాంశాలు.. ⇒ ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ఉంటున్న క్విక్ కామర్స్ మార్కెట్ రాబోయే రోజుల్లో 50 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. ఈ విభాగంలో కొనుగోలుదారుల సంఖ్య రెట్టింపై 7 కోట్లకు చేరనుంది. ఈ మార్కెట్లో ద్వితీయ శ్రేణి నగరాలు, అంతకన్నా చిన్న పట్టణాల వినియోగదారుల వాటా 30 శాతం స్థాయిలో ఉండనుంది. ⇒ 2030 నాటికి మొత్తం క్విక్ కామర్స్ వ్యయాల్లో సౌందర్య సాధనాలు, ఫ్యాషన్, ఎల్రక్టానిక్స్లాంటి ఆహారయేతర కేటగిరీల వాటా 45 శాతానికి చేరుతుంది. తద్వారా ఆయా విభాగాల్లో స్పెషలిస్టులకు 10 బిలియన్ డాలర్ల వ్యాపారావకాశాలు లభిస్తాయి. ⇒ క్రియేటర్ ఎకానమీ కూడా కీలకంగా మారనుంది. కంటెంట్ క్రియేటర్లు 2030 నాటికి మొత్తం రిటైల్ వ్యయాల్లో 30 శాతం భాగాన్ని ప్రభావితం చేస్తారు. ప్రతి 10 ఆన్లైన్ కొనుగోళ్లలో ఒకటి నేరుగా క్రియేటర్ స్టోర్ఫ్రంట్ ద్వారా జరుగుతుంది. లైవ్ కామర్స్ 8 బిలియన్ డాలర్ల స్థాయికి పెరుగుతుంది. ⇒ పరిశ్రమ వృద్ధిలో కృత్రిమ మేధ ముఖ్య పాత్ర పోషించనుంది. హైపర్ పర్సనలైజేషన్, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం ద్వారా రిటైల్ లాభదాయకత 30–35% మేర పెరిగేందుకు దోహదపడనుంది. -
పాకిస్థాన్ మరిన్ని ముక్కలవ్వడం ఖాయం : రాజ్నాథ్ సింగ్
ఢిల్లీ: పాకిస్థాన్కు భారత రక్షణశాఖ రాజ్నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ ‘కోల్కతాపై దాడి’ వ్యాఖ్యల్ని ఖండించారు. పశ్చిమ బెంగాల్పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్థాన్ మరిన్ని ముక్కలవుతుందని హెచ్చరించారు.మంగళవారం ఖ్వాజా అసిఫ్ చేసిన వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ స్పందించారు. అసిఫ్ ఇటీవల ఓ కార్యక్రమంలో భారత్పై నోరు పారేసుకున్నారు. భవిష్యత్తులో భారత్ తమ దేశాన్ని దోషిగా నిలబెట్టి దాడులు చేస్తే ప్రతిస్పందనగా.. కోల్కతాపై దాడులు చేస్తామని అని అన్నారు. దీనిపై రాజ్నాథ్ సింగ్ పాక్ చరిత్రను గుర్తుచేశారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసే 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్పై రెండు ముక్కలైంది. ఇప్పుడు బెంగాల్పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్నిముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి’ అని హెచ్చరించారు.1971లో పాక్ రెండు ముక్కలుగా విడిపోయింది. అందులో బంగ్లాదేశ్ విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్ సైన్యం అండగా నిలిచింది. నాటి చరిత్రను తాజాగా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. మరోసారి అదే తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాకిస్థాన్ ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. నాటి నుంచి పాకిస్థాన్.. భారత్పై కవ్వింపు చర్యలకు దిగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఖవాజా మరోసారి ప్రగల్భాలు పలికారు. ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ కూడా స్పందించింది. కోల్కతాపై దాడి చేస్తే పాక్లోని వారి ఇళ్లలోకి దూరి మరి చంపుతామని అధికార టీఎంసీ నేతలు వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. రాజ్నాథ్ సింగ్ చేసిన హెచ్చరికలు మాత్రం భారతదేశం తన భూభాగాన్ని రక్షించేందుకు ఎలాంటి రాజీపడదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బెంగాల్పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్కు మరింత విభజన తప్పదని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. -
పెట్టుబడులకు బూస్ట్.. వడ్డీరేట్ల కట్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ అటు పెట్టుబడులకు ఊతమిస్తూనే ఇటు పశ్చిమాసియా సంక్షోభంతో దెబ్బతిన్న రంగాలను ఆదుకునేలా వడ్డీ రేట్లను కూడా తగ్గించగలిగే సామర్థ్యాలు భారత్కి ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దశాబ్దకాలంగా పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ ప్రతిఫలం ఇదని ఆమె పేర్కొన్నారు. కఠినతరమైన పరిస్థితులను అధిగమించాలంటే మేలైన ఆర్థిక విధానాలు పాటించడం అవసరమని ఆమె పేర్కొన్నారు. భారీ రుణ భారాలు, ద్రవ్య లోటుతో సతమతమవుతున్న కొన్ని దేశాల్లో భారత్లో ఉన్నటువంటి వెసులుబాటు లేదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ముందుంది గడ్డుకాలం... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలనేవి ప్రాంతీయ భద్రతా సవాళ్ల స్థాయి నుంచి వ్యవస్థాగతంగా ప్రకంపనలు సృష్టించే స్థాయికి విస్తరించాయని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు కీలకమైన మార్గాలకు పెను ముప్పుగా మారాయని మంత్రి చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత కఠినతరంగా ఉండబోతోందని తెలిపారు. గతేడాది వాణిజ్యపరమైన ఉద్రిక్తతలతో గ్లోబల్ సరఫరా వ్యవస్థల్లో అనిశ్చితి నెలకొని, గ్లోబల్ వృద్ధి అంచనాలను దిగువముఖంగా తిరగరాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అయినప్పటికీ భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. జీడీపీలో ప్రభుత్వ రుణభారం సుమారు 81 శాతమేనని, జర్మనీ మినహాఅతి పెద్ద ఎకానమీల్లో ఇదే తక్కువ స్థాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
‘పసిడి’ రేసులో లలిత్
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఒక పతకం ఖరారైంది. మరో రెండు పతకాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్ లలిత్ (55 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నేడు జరిగే స్వర్ణ–రజత పతక బౌట్లో ఇఖ్తియోర్ బొతిరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో తలపడతాడు. అంతకుముందు లలిత్ క్వార్టర్ ఫైనల్లో 9–8తో మిజుకి అరాకి (జపాన్)పై, సెమీఫైనల్లో 11–3తో హువోయింగ్ షి (చైనా)పై గెలుపొందాడు. మరోవైపు భారత్కే చెందిన అమన్ (77 కేజీలు), సునీల్కుమార్ (87 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి నేడు కాంస్య పతకాల కోసం పోటీపడనున్నారు. జోగిందర్ రాఠి (130 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, సన్నీ కుమార్ (63 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్లో నిష్క్రమించారు. జోగిందర్, సన్నీ కుమార్లను ఓడించిన రెజ్లర్లు ఫైనల్కు చేరుకోవడంలో విఫలం కావడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం కూడా చేజారింది. నేడు జరిగే ఐదు వెయిట్ కేటగిరీల్లో సాహిన్ (60 కేజీలు), సచిన్ (67 కేజీలు), అనిల్ (72 కేజీలు), ప్రిన్స్ (82 కేజీలు), నితేశ్ (87 కేజీలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ పతకావకాశాలపై దెబ్బ పడింది. మంగళవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్ నుంచి భారత రెండు డబుల్స్ స్టార్స్ జోడీలు వైదొలిగాయి. గాయం కారణంగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ఈ టోర్నీకి దూరమయ్యారు. సాత్విక్ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదని... అందుకే ఈ టోర్నీలో ఆడటంలేదని భారత డబుల్స్ కోచ్ టాన్ కిమ్ హెర్ తెలిపాడు. డబుల్స్లో పతకం ఆశలు ఆవిరి కావడంతో ఇక అందరి దృష్టి సింగిల్స్ స్టార్స్ లక్ష్య సేన్, పీవీ సింధులపై ఉంది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ప్రణయ్, ఆయుశ్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్... మహిళల సింగిల్స్లో సింధు, మాళవిక, ఉన్నతి హుడా, తన్వీ శర్మ బరిలో ఉన్నారు. 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్లో పసిడి పతకం గెలిచిన తర్వాత భారత్కు సింగిల్స్లో మరో స్వర్ణ పతకం లభించలేదు. -
ఇరాన్ మాస్టర్ మైండ్.. పశ్చిమాసియా యుద్ధంలోకి భారత్?
వాష్టింగన్: హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లేదంటే ఇరాన్లో విధ్వంసం తప్పదని హూంకరిస్తున్నారు. అయితే, ట్రంప్ బెదరింపుల్ని ఇరాన్ ఖాతరు చేయడం లేదు. హర్మూజ్ జలసంధిని తెరిచేది లేదని తేల్చి చెబుతోంది. అమెరికాను ఏకాకిని చేస్తూ.. పశ్చిమాసియా యుద్ధంలో తమకు భారత్, చైనాతో పాటు ఇతర దేశాలు తమకు అండగా ఉన్నాయని తెలిసేలా సెటైరికల్ ట్వీట్లు వేస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయాలు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా ట్వీట్లు వేస్తున్నాయి. ఆ ట్వీట్లలో దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ట్రంప్:హర్మూజ్ జలసంధిని తెరవండి అని ఇరాన్ అడుగుతుంటే మిగిలిన దేశాలు ఇలా అభిప్రాయం వ్యక్తం చేశాయని అర్ధం వచ్చేలా ట్వీట్లలో హైలెట్ చేశాయి. భారత్: హర్మూజ్ జలసంధిని మూసేశారా?పాకిస్థాన్: హర్మూజ్ జలసంధిని మూసేసింది. రష్యా: విచిత్రంగా ఉంది…దక్షిణాఫ్రికా: లేదు హర్మూజ్ జలసంధి తెరిచే ఉందిఫ్రాన్స్: అబ్బే అలా ఏం లేదే. హర్మూజ్ జలసంధిని చూస్తుంటే మాకు అలా అనిపించడం లేదేచైనా: హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది. మేం ఇప్పుడే అక్కడి నుంచి వచ్చేశాం’అని ట్వీట్లలో పేర్కొంది. బల్గేరియా ఎంబసీ: ‘టేక్ ఇట్ ఈజీ టైగర్, కీప్ యువర్ కూల్’ అంటూ ట్రంప్ను ఎగతాళి చేసింది జింబాబ్వే ఎంబసీ: “ట్రంప్, నాతో మాట్లాడు. మాకు చాలా బోర్గా ఉంది” అని సరదాగా వ్యాఖ్యానించింది మరికొన్ని ఎంబసీలు ‘తాళాలు పోయాయి’ అంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాయి.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇరాన్ ట్వీట్లలో భారత్, చైనా వంటి దేశాల పేర్లు ప్రస్తావించడం వెనుక వ్యూహం ఉంది. తాను ఒంటరిగా లేనని, తనకు మిత్రదేశాలు అండగా ఉన్నాయని ప్రపంచానికి సంకేతం ఇవ్వడమే. అమెరికాను ఏకాకిగా చూపించడమే కాకుండా, హోర్ముజ్ జలసంధి సురక్షితంగా ఉందని అంతర్జాతీయ సమాజానికి ధైర్యం చెప్పడమేనని వారు విశ్లేషిస్తున్నారు.హర్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన ఎనర్జీ కారిడార్. ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇక్కడి ఉద్రిక్తతలు చమురు ధరలను వెంటనే ప్రభావితం చేస్తాయి. తాజా పరిణామాల వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగాయి.ఇటీవలి అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్లో 25 మందికి పైగా మరణించారు. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ నగరం హైఫాపై దాడి చేశాయి. సౌదీ అరేబియా, కువైట్, యుఎఈ తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి. టెహ్రాన్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రివల్యూషనరీ గార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదెమీ మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.ఇరాన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఒకవైపు అమెరికా అధ్యక్షుడిని ఎగతాళి చేస్తే, మరోవైపు ప్రపంచానికి “మా వెనుక ఇతర దేశాలు ఉన్నాయి, పరిస్థితి నియంత్రణలో ఉంది” అనే సందేశాన్ని పంపుతున్నాయి. అయితే, హర్మూజ్ వివాదం కొనసాగితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు కుదిపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Trump: "Open the Strait of Hormuz!"India: "Is it closed?"Pakistan: "Closed?"Russia: "Strange…"South Africa: "but it's Open, of course"France: "Doesn't look like it…"China: "Open… we just passed through! 🚢😏"Trump: 🙁 https://t.co/vnNc1EQy54— Iran Embassy SA (@IraninSA) April 5, 2026 -
యుద్ధం టెన్షన్.. ఇరాన్, గల్ఫ్తో భారత్ చర్చలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ట్రంప్ విధించిన 48 గంటల డెడ్లైన్ సమీపిస్తుండంతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై పెద్దఎత్తున దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో చర్చలు జరిపారు.చమురు సరఫరాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉండడంతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గల్ప్ దేశాలలో దౌత్య చర్చలు జరిపారు.ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్ థానీతో పాటు యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఫోన్లో సంభాషించారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో వివిధ అంశాలపై ఈ నేతలతో చర్చించినట్లు సమాచారం. ఈ సంక్షోభం వల్ల భారత్పై పడే ప్రభావం గురించి జైశంకర్ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.మరోవైపు ట్రంప్ 48 గంటల డెడ్లైన్ సమీపిస్తుండడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతోనూ సమకాలిన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ భారత్ వంటి స్నేహపూర్వక దేశాల నౌకలను హర్మూజ్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతిస్తోంది. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా జైశంకర్ దౌత్య పరంగా ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. -
పాక్ మధ్యవర్తిత్వం? ఇరాన్ ఏమందంటే?
పట్నా: పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తోందంటూ వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ భారత ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి తిరస్కరించారు. బిహార్ రాజధాని పట్నాలో ఆదివారం ఇలాహి ఓ ఇంటరర్వ్యూలో మాట్లాడారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు పాకిస్థాన్ ద్వారా జరుగుతున్నాయనే వాదనలు నిజం కాదని తెలిపారు."ఈ విషయంలో పాక్కు ఎలాంటి పాత్ర లేదు. పాకిస్థాన్ ద్వారా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిగాయన్న వాదనల్లో నిజం లేదు. ఇటువంటి మాటలను అమెరికా కేవలం చమురు ధరలను తగ్గించడానికే చెబుతోంది. వారు నిజంగా చర్చలకు సిద్ధంగా లేరు. కొన్ని దేశాలను ఉపయోగించాలనుకున్నారు. చర్చలు జరపాలనుకుంటున్నామని చెప్పారు.. కానీ, అది నిజం కాదు" అని ఆయన తెలిపారు.శాంతి ప్రయత్నాల్లో భారతదేశం పాత్ర పోషించగలదా? అనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. భారతదేశం సహా ఇతర అన్ని దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ఆపడానికి సహకరించవచ్చని అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మంచి పాత్రను పోషించవచ్చని పేర్కొన్నారు.యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. యుద్ధం ముగింపు అనేది అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఆధారపడి ఉందని చెప్పారు. ఫిబ్రవరి 28న వారు యుద్ధాన్ని ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వంటి పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని అన్నారు."ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలపైనే యుద్ధం ముగింపు అంశం ఆధారపడి ఉంది. వారు ఇరాన్పై దాడులు ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మానవ వనరుల కేంద్రాలు, గనులపై దాడులు చేశారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది పౌరులు మరణించారు. వారు ఆపితే యుద్ధం ముగుస్తుంది" అని చెప్పారు.ఇరాన్ యుద్ధాన్ని కోరుకోలేదని.. ఈ ఘర్షణ వల్ల అనేక దేశాల పౌరులు బాధపడుతున్నారని ఇలాహి చెప్పారు. ప్రపంచ నాయకులు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు."దురదృష్టవశాత్తు ఇది అధర్మ యుద్ధం. ప్రపంచంలోని అనేక మంది బాధపడుతున్నారు. ప్రపంచ నాయకులు కలిసి ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలను ఆపాలని కోరాలి" అని తెలిపారు. -
ఎప్స్టిన్ ఫైల్స్లో అనిల్ అంబానీ.. లైంగిక నేరాల్లో ప్రమేయం ఉందా?
వాష్టింగన్: అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఆ పత్రాల్లో భారత్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా ప్రస్తావనకు రావడం ఆసక్తి కలిగించింది. దీంతో ఎప్స్టీన్ లైంగిక నేరాల్లో అంబానీ ప్రమేయం ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆ ఫైల్స్ను పరిశీలిస్తే, అంబానీకి ఎప్స్టీన్తో ఉన్నది వ్యాపార సంబంధాలే తప్ప లైంగిక సంబంధాలు లేవని స్పష్టమైంది.ఎప్స్టీన్ ఫైల్స్లో అంబానీ పేరు ప్రస్తావన రావడం ఆయన వ్యాపార సమస్యల సమయంలో ఎప్స్టీన్ ఇచ్చిన సలహాలు, అమెరికా రాజకీయ పరిణామాలపై సమాచారం, పరిచయాలకే పరిమితమైంది. లైంగిక నేరాల విషయంలో ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవని స్పష్టంగా తేలింది. అంటే, ఎప్స్టీన్ వ్యవహారంలో అంబానీ పేరు వినిపించడం ఆయన వ్యాపార సంబంధాల కోణంలో మాత్రమేనని, లైంగిక నేరాలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఈ పత్రాలు నిర్ధారించాయి.అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్ ప్రకారం.. అనిల్ అంబానీ–జెఫ్రీ ఎప్స్టీన్ మధ్య 2017 నుండి 2019 వరకు సంభాషణలు జరిగాయి. ఈ చర్చలు ప్రధానంగా అమెరికా–భారత్ సంబంధాలు, ట్రంప్ ప్రభుత్వ విధానాలు, అలాగే అంబానీ ఎదుర్కొంటున్న వ్యాపార సమస్యలపై స్నేహపూర్వక సలహాల చుట్టూ తిరిగాయి. అంబానీతో పరిచయం పెంచుకోవడానికి, తాను వైట్ హౌస్లో లోపలి వ్యక్తి అని చూపించుకోవడానికి ఎప్స్టీన్ ప్రయత్నించినట్లు పత్రాలు సూచిస్తున్నాయి.ట్రంప్ ప్రభుత్వ జాతీయ భద్రతా వ్యూహంలో భారత్ స్థానం ఏమిటో తెలుసుకోవాలని అంబానీ ఎప్స్టీన్ను సంప్రదించగా.. ‘వైట్ హౌస్లోని అంతర్గత సమాచారం అందిస్తాను’ అంటూ ఎప్స్టీన్ స్పందించాడు. అలాగే ట్రంప్ నియామకాలపై ముందుగానే సమాచారం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఉదాహరణకు, 2017లో అంబానీ, డేవిడ్ పేట్రేయస్ను భారత్కు అమెరికా రాయబారిగా నియమిస్తారా అని అడిగితే, ఎప్స్టీన్ లేదని అని చెప్పాడు. అన్నట్లుగా ఆ పదవి కెన్నెత్ జస్టర్కు దక్కింది.తనకి ట్రంప్ సన్నిహితులు స్టీఫెన్ బానన్, థామస్ బారాక్లను పరిచయం చేయాలని ఎప్స్టీన్ సూచించాడు. వ్యాపార సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ‘మానసికంగా బలంగా ఉండాలి’ అని సలహా ఇచ్చాడు. నీతో పరిచయం .. డబ్బు కోసం కాదు, స్నేహితుడిగా మాత్రమే’అని పలుమార్లు చెప్పాడు. 2019 ఏప్రిల్లో అంబానీ ‘ట్రాన్సాక్షన్ పూర్తయింది.. కాఫీకి వస్తాను’ అని మెయిల్ పంపించారు. మే 23న న్యూయార్క్లోని ఎప్స్టీన్ ఇంట్లో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా వారు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫారమ్లలో మాట్లాడుకున్నారు. అంబానీ ‘ఆర్మనీఏ’ అనే హ్యాండిల్తో కనెక్ట్ అయ్యారు.ఎప్స్టీన్ అరెస్టుకు మూడు రోజుల ముందు వరకు ఈ సంభాషణలు కొనసాగాయి. ముఖ్యంగా, అనిల్ అంబానీపై ఎటువంటి లైంగిక దుర్వినియోగ ఆరోపణలు లేవని న్యూయార్క్ టైమ్స్ స్పష్టంచేసింది. ఈ సంబంధం వ్యాపార సమస్యల సమయంలో ఎప్స్టీన్ ఇచ్చిన సలహాలు, అమెరికా రాజకీయ పరిణామాలపై సమాచారం అనే కోణంలో మాత్రమే నిలిచింది. -
నెక్స్ట్-జనరేషన్ అమృత్ భారత్ శాంపిల్ కోచ్ అదరహో
న్యూఢిల్లీ: నెక్స్ట్-జనరేషన్ అమృత్ భారత్ కోచ్ల అంతర్గత భాగాల అప్గ్రేడేషన్ జరుగుతోంది. శాంపిల్ కోచ్ సిద్ధమైంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా న్యూఢిల్లీ స్టేషన్లో ప్రతిపాదిత అంతర్గత డిజైన్, రంగులతో అభివృద్ధి చేసిన నెక్స్ట్-జనరేషన్ అమృత్ భారత్ కోచ్ల శాంపిల్ కోచ్ను పరిశీలించారు. ప్రయాణికులకు మంచి సౌకర్యం, ఆకట్టుకునే రూపం, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ మోడల్ కోచ్ను రూపకల్పన చేశారు.పీవీసీ ఫ్లోరింగ్, సీటు, బెర్త్ రెక్సిన్, స్నాక్ టేబుళ్లు, కర్టెన్లు, లావేటరీ ప్రాంతాలు వంటి ముఖ్య భాగాల్లో వాటికి తగ్గ రంగులతో ప్రత్యేక అంతర్గత రంగుల థీమ్లు ఏర్పాటు చేశారు. ఈ కోచ్లలో వాడిన అన్ని పదార్థాలు హెచ్ఎల్ 3 అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. హెచ్ఎల్3 (హజార్డ్ లెవల్ 3) యూరోపియన్ రైల్వే స్టాండర్డ్ ఈఎన్ 45545-2కి అనుగుణంగా వీటి రూపకల్పన చేస్తున్నారు. హజార్డ్ లెవల్ 3 అంటే అగ్ని ప్రమాదంలో పదార్థాల భద్రత స్థాయి కొలిచే అత్యున్నత ప్రమాణం. ఈఎన్ 45545-2 అంటే యూరోపియన్ రైల్వే అగ్ని భద్రత ప్రమాణాల నియమావళి.ఈ రైళ్లకు వాడుతున్న ఈ కలర్ స్కీమ్ ఆధునిక రూపాన్ని ఇస్తూ దీర్ఘకాలికంగా మన్నికగా ఉండేలా చేస్తుంది. నిర్వహణ కూడా సులభతరంగా ఉంటుంది. రైల్వేలో ఉపయోగించే అన్ని రకాల బోగీలు, లోకోమోటివ్లను ఆధునికీకరించారు. ఈ సూపర్ఫాస్ట్ ప్రయాణికుల రైలులో పీవీసీ ఫ్లోరింగ్ నుంచి రెక్సిన్ సీటు బెర్త్లు, స్నాక్ టేబుళ్లు, కర్టెన్లు, మరుగుదొడ్డి వరకు వాటికి తగ్గ రంగుల ప్యాలెట్లు వేయడంతో ఈ రైలు చూడగానే ఆకట్టుకుంటోందది.ప్రయాణికుల భద్రత, మెరుగైన సౌకర్యాల కోసం కొత్త డిజైన్లు, మెరుగైన మరుగుదొడ్డి సౌకర్యాలతో కోచ్ల శాంపిల్స్ సిద్ధం చేశామని, ఉన్న కోచ్ను మెరుగుపరచి నమూనా కోచ్గా తయారు చేశామని అశ్విని వైష్ణవ్ ఎక్స్లో పేర్కొన్నారు. 🚆 Passengers की सुरक्षा और सुविधा बढ़ाने के लिए रेलवे ने नए डिज़ाइन के coach और बेहतर टॉयलेट्स के मॉडल तैयार किए हैं। मौजूदा coach को अपग्रेड कर एक सैंपल coach तैयार किया गया है। pic.twitter.com/nIXwplAI5A— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 4, 2026 -
గ్లోబల్గా పోటీకి సెజ్ల దన్ను
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత్ మరింతగా పోటీపడేందుకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్) తోడ్పడుతున్నాయి. దీనితో వీటిని బలోపేతం చేసే దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్లో సమగ్ర సంస్కరణలు ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్య మార్పులు, సరఫరా గొలుసు సవాళ్లను దృష్టిలో ఉంచుకొని సెజ్లను తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు కీలకమని పేర్కొన్నారు. వీటిలో తయారైన ఉత్పత్తులను పరిమితంగా దేశీయ మార్కెట్లో తక్కువ సుంకంతో విక్రయించుకునే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో సెజ్ల పురోగతిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 2026 ఫిబ్రవరి 28 నాటికి దేశీయంగా నోటిఫై అయిన సెజ్ల సంఖ్య 368గా ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో (డిసెంబర్ వరకు) రూ.11.70 లక్షల కోట్ల ఎగుమతులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 32.02 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం పెట్టుబడులు రూ.7.86 లక్షల కోట్లకు చేరగా, 31.73 లక్షల మందికి పైగా ఉపాధి లభించింది. ఈ గణాంకాలు భారత ఆర్థిక వృద్ధికి ఎస్ఈజెడ్ల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాయని పీఐబీ పేర్కొంది. సెజ్ల పరిణామక్రమం ఇలా: 1965లో కాండ్లాలో ఆసియాలోనే తొలి ఎగుమతి ప్రాసెసింగ్ జోన్ (ఈపీజెడ్)ని ఏర్పాటు చేసిన అనుభవంతో 2000లో సెజ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చట్టం–2005 అమల్లోకి తెచ్చి, 2006 నుంచి అమలు ప్రారంభించారు. దీని కింద సింగిల్ విండో క్లియరెన్స్, సరళతరంగా నియంత్రణ, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించారు. వాణిజ్య, పెట్టుబడి వ్యవస్థకు మూల స్తంభాలైన సెజ్లు దేశీయంగా ప్రత్యేక డ్యూటీ–ఫ్రీ ప్రాంతాలుగా, కస్టమ్స్ పరిధి వెలుపల పని చేస్తున్నాయి. ఇక్కడి యూనిట్లలో ఉత్పత్తుల తయారీ, సేవలు, గిడ్డంగుల తదితర కార్యకలాపాలు ఉంటున్నాయి. 2026–27 బడ్జెట్లో కీలక నిర్ణయం సాధారణంగా సెజ్ల నుంచి దేశీ టారిఫ్ ప్రాంతానికి (డీటీఏ) సరఫరాను దిగుమతులుగా పరిగణించి పూర్తి సుంకాలు విధిస్తారు. అయితే తాజా పరి స్థితుల నేపథ్యంలో ఉత్పత్తిలో కొంత భాగాన్ని త క్కువ సుంకాలతో డీటీఏలో విక్రయించునేందుకు సర్కార్ వెసులుబాటు కల్పించింది. ఖర్చులు తగ్గి, ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, సెజ్లు బలోపేతం అయ్యేందుకు ఈ చర్యలు తోడ్పడనున్నాయి. మరో వైపు, టెక్నాలజీ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని సెజ్లలోని డేటా సెంటర్లకు పన్ను రాయితీలు, గ్లోబల్ టెక్ కంపెనీలను ఆకర్షించేలా విధానాల్లో మార్పు లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం ప్రత్యేక సెజ్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రకటించింది. 2025 జూన్లో సాణంద్, ధార్వాడ్ ప్రాంతాల్లో కొత్త సెజ్లను నొటిఫై చేసింది. పెట్టుబడులకు ఊతమిచ్చేలా డ్యూటీ ఫ్రీ దిగుమతులు, రాష్ట్ర పన్ను రాయితీలు, సింగిల్ విండో అనుమతులు మొదలైన చర్యలు ఉంటున్నాయి. -
వీసీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రైవేట్ క్యాపిటల్ మార్కెట్లు నెమ్మదించినప్పటికీ, భారత్లో వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు మాత్రం గతేడాది జోరుగానే వచ్చాయి. 2025లో 16 బిలియన్ డాలర్ల మేర వీసీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అధికం. వివిధ స్థాయుల్లో 1,300 పైగా లావాదేవీలు జరిగాయి. గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ, ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) సంయుక్తంగా రూపొందించిన ఇండియా వెంచర్ క్యాపిటల్ రిపోర్ట్ 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, లిక్విడిటీ కఠినతరం కావడం తదితర సవాళ్లు నెలకొన్నప్పటికీ పెట్టుబడులు వృద్ధి చెందడం గమనార్హం. 2023లో రీసెట్ అయిన తర్వాత దేశీ వెంచర్ క్యాపిటల్ వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పట్టిందని బెయిన్ అండ్ కంపెనీ అసోసియేట్ పార్ట్నర్ ఆదిత్య మురళీధర్ తెలిపారు. మెరుగైన గవర్నెన్స్, సమర్ధవంతంగా పెట్టుబడుల వినియోగం, నిష్క్రమించేందుకు అవకాశాల పునాదులతో ఈ వ్యవస్థ దీర్ఘకాలికంగా నిలకడగా వృద్ధి చెందే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → 50 మిలియన్ డాలర్ల లోపు డీల్స్ గణనీయంగా నమోదయ్యాయి. → భారీ డీల్స్ కూడా పుంజుకున్నాయి. 250 మిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే ఒప్పందాల సంఖ్య నాలుగు నుంచి రెట్టింపై ఎనిమిదికి చేరింది. యూనిట్ ఎకనామిక్స్ పటిష్టంగా ఉండి, మానిటైజేషన్పై స్పష్టత ఉన్న కంపెనీల వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. తీరుతెన్నూ లేని విస్తరణ కన్నా వ్యాపార నాణ్యతకే ప్రాధాన్యమిచ్చే ధోరణి పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → కన్జూమర్ టెక్ సంస్థలకు నిధులు నెమ్మదించాయి. అయితే దీర్ఘకాలిక సత్తాను ప్రదర్శిస్తూ, ఈ విభాగంలోకి పెట్టుబడులు 2023 నుంచి వార్షికంగా 25 శాతం స్థాయిలో పెరిగాయి. → అన్ని ఉత్పత్తులు కాకుండా నిర్దిష్ట ప్రోడక్టులను మాత్రమే సత్వరం డెలివరీ చేసే క్విక్ కామర్స్ సంస్థల్లోకి ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చాయి. → టెక్నాలజీ ఆధారిత రంగాలు ఫండింగ్ రికవరీలో కీలక పాత్ర పోషించాయి. ఇందులో ఫిన్టెక్ రంగం ప్రత్యేకంగా నిల్చింది. ఈ విభాగంలో డీల్స్ విలువ వార్షికంగా సుమారు 2.2 రెట్లు పెరిగింది. పెట్టుబడుల్లో పేమెంట్స్ కేటగిరీ అత్యధిక వాటా దక్కించుకోగా, డిజిటల్ వినియోగం, కుటుంబాల పొదుపు మొత్తాల పెరుగుదలతో వెల్త్టెక్ డీల్స్ విలువ అయిదు రెట్లు పెరిగింది. → సాఫ్ట్వేర్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) ఫండింగ్ 1.5 రెట్లు పెరిగింది. ఓ స్థాయికి చేరుకున్న ప్రస్తుత సంస్థలు కూడా మళ్లీ నిధుల బాట పట్టాయి. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), జనరేటివ్ ఏఐ–నేటివ్ బీ2బీ కంపెనీలకు, ప్రధానంగా బ్యాంకింగ్, హెల్త్కేర్ రంగాల్లో వాటికి ఆదరణ లభిస్తోంది. → దీర్ఘకాలిక ఇన్వెస్టర్లలో ధీమాని ప్రతిఫలిస్తూ, భారత్పై ఫోకస్ చేసే వీసీలు, గ్రోత్ ఈక్విటీ ఫండ్స్ సమీకరించిన నిధులు వార్షికంగా రెట్టింపై 5.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించుకుని వైదొలిగేందుకు కూడా గత ఏడాది పరిస్థితులు అనుకూలించాయి. మొత్తం ఎగ్జిట్ విలువలో పబ్లిక్ మార్కెట్ల మార్గంలో జరిగినది 65 శాతంగా నమోదైంది. -
పెళ్లికి ముందు సూది మందు
సాక్షి, హైదరాబాద్: పెళ్లికి ముందు బరువు తగ్గే సులభమైన మార్గాల వెతుకులాటలో యువతీ యువకులు నిమగ్నమవుతున్నారు. వెయిట్లాస్కు సంబంధించిన ప్రత్యేక ఇంజెక్షన్లు, మందులపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో భారత్లో వీటి వినియోగం వేలంవెర్రిగా పెరిగిపోతోంది. పెళ్లికి ముందు వ్యాయామం, ఆహార నియమాలతో ఆశించిన ఫలితాలు రాలేదంటూ సడన్గా బరు వు తగ్గేందుకు ‘మౌంజారో’(టిర్జెపాటైడ్) ఇంజెక్షన్ తీసుకోవడం ఇటీవల పెళ్లీడు యువతలో బాగా పెరిగింది. పెళ్లి రోజు న నాజూగ్గా, అందంగా కనిపించాలనే తాపత్రయం కారణంగా భారత్లో ఇదొక కొత్త ట్రెండ్గా మారింది. ఇది ఎక్కడివరకు వెళ్లిందంటే... ఢిల్లీలోని ఓ క్లినిక్ ఏకంగా ‘మౌంజారో బ్రైడ్’పేరిట ఓ ప్రత్యే క ప్యాకేజీని ప్రకటించింది. మరికొన్ని క్లినిక్లు.. చర్మ, కేశాలంకరణతోపాటు ఈ ఇంజెక్షన్లను ప్రీ–వెడ్డింగ్ ప్యాకేజీల్లో చేర్చే వరకు పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో మధుమేహం, బరువు తగ్గుదల కోసం అను మతి పొందిన తొలి జీఎల్పీ–1 మందు ‘మౌంజారో. దీన్ని ఎలి లిల్లీ సంస్థ ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. దీని పోటీ దారు నోవో నార్డిస్క్ తయారుచేసిన ‘వెగోవీ’కూడా అందుబాటులోకి వచ్చింది. శారీరక రూపానికి ప్రాధాన్యంతో... భారత్లో సంప్రదాయ వివాహాల్లో వధువు, వరుడి శారీరక రూపం, ఆర్థిక స్థితికి సంబంధించి అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటున్నాయి. పెళ్లిలో ఒక నిర్దిష్ట పద్ధతిలో కనిపించాలనే సామాజిక ఒత్తిడి దీనికి కారణం. గతేడాది భారత్లో ఈ రెండు సంస్థలు తమ ఊబకాయ నివారణ మందులను విడుదల చేయగా, కొన్ని నెలల్లోనే మౌంజారో అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఈ మందులోని క్రియాశీల పదార్ధమైన సెమాగ్లుటైడ్ పేటెంట్ గడువు ముగియడంతో, భారతీయ ఔషధ తయారీదారులు ఇటీవల నోవో మందు చౌక వెర్షన్ల విక్రయాలు ప్రారంభించి, దాని లభ్యతను విస్తృతం చేశారు. ఈ మందులు ఊబకాయం ఉన్నవారిగా వర్గీకరించిన పెద్దలు లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా స్లీప్ అప్నియా వంటి బరువు సంబంధిత వైద్య పరిస్థితితో అధిక బరువు ఉన్నవారి కోసం ఉద్దేశించినవిగా ఉన్నాయి. భారత్లో మౌంజారో ఇంజెక్షన్ పెన్ అత్యల్ప డోస్ ధర నెలకు రూ.13,125, గరిష్ట డోస్ ధర రూ. 25,781గా ఉంది. వెగోవీ అత్యల్ప డోస్ను నెలకు రూ.5,660, గరిష్ట డోస్ను రూ.16,400కి విక్రయిస్తున్నారు. ఇమ్యునో డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఎలాంటి వెయిట్లాస్ చికిత్స అయినా మెటబాలిక్ సిండ్రోమ్తో సడన్గా బరువు తగ్గితే రోగ నిర్ధారణ శక్తికి నష్టం జరుగుతుంది. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా ‘ఓవర్ ద కౌంటర్’గా ఈ మందులు తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఈ ఇంజెక్షన్లను మెడిసిన్గా వాడాలే తప్ప జ్వరం, ఒళ్లు నొప్పులకు క్రోసిన్ టాబ్లెట్గా వాడకూడదు. ఈ మందులతో సడన్గా బరువు తగ్గితే తీవ్రమైన ఇమ్యునో డిప్రెషన్తో క్షయ, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదముంది. సడన్ వెయిట్లాస్తో యాంగ్జయిటీ ట్రమెర్స్, తీవ్రమైన వెన్నునొప్పుల బారిన కూడా పడే అవకాశాలున్నాయి. ఈ బరువు తగ్గుదల మందులు కూడా శాశ్వత పరిష్కారంకాదు. ఈ ఇంజెక్షన్లను తీసుకోవడం ఆపేస్తే వెంటనే బరువు పెరుగుతారు. సాధారణంగా అయితే 6 నెలల నుంచి ఏడాది వరకు ఈ మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్ మార్కెట్లోకి వచ్చి ఏడాదే అవుతోంది. అందువల్ల వీటి దీర్ఘకాల ప్రభావాలు, దు్రష్పభావాలు ఏమిటనేది ఇంకా పూర్తిస్థాయిలో తెలియడం లేదు. తగిన డైట్, వ్యాయామానికి ఇది ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. –డా. బూర నర్సయ్యగౌడ్, బేరియాట్రిక్ సర్జన్ -
హార్మూజ్ను దాటిన గ్రీన్ శాన్వీ
న్యూఢిల్లీ: భారత్ దిశగా ఎల్పీజీ నౌకల ప్రయాణపరంపర కొనసాగుతోంది. తాజాగా ఉద్రిక్తమయ హార్మూజ్ జలసంధిని ఎల్పీజీ రవాణా నౌక ‘గ్రీన్ శాన్వి’విజయవంతంగా దాటింది. మరోవైపు మరో ఎల్పీజీ నౌక ఇరాన్ నుంచి బయల్దేరి క్షేమంగా భారత్కు చేరుకుంది. ఇది మంగళూరుకు చేరుకుని ఎల్పీజీని దిగుమతిచేస్తోంది. తాజాగా హార్మూజ్ను దాటిన గ్రీన్ శాన్వీ నౌక 46,650 టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. ఇదే నౌకలో 25 మంది నావికులు సైతం ఉన్నారు. భారతీయ జెండాతో బయల్దేరి విజయవంతంగా హార్మూజ్ను దాటిన ఎల్పీజీ నౌకల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. వీటిలో ఏడు శివాలిక్, నందాదేవి, జగ్ లడ్కీ, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్ఎం ఇప్పటికే భారత్కు చేరుకున్నాయి. గ్రీన్ శాన్వీ మార్గమధ్యంలో ఉంది. ఇరాన్ ప్రభుత్వం తరఫున ఎల్పీజీ నౌక ‘సీ బర్డ్’రాకతో గత ఏడేళ్లలో ఆ దేశం నుంచి భారత్కు చేరుకున్న తొలి నౌకగా ఇది గుర్తింపు పొందింది. ఈ నౌకలో 44,000 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇన్నాళ్లూ ఇరాన్ దేశ చమురు ఉత్పత్తులపై అమెరికా అంతర్జాతీయ నిషేధం విధించగా అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పెరగడంతో తప్పని పరిస్థితుల్లో ఆ ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. చైనా దిశగా ఇరాన్ నౌకపై భారత్ స్పష్టీకరణ ఏడేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ దిశగా వస్తున్న ఇరాన్ చమురు నౌక ‘పింగ్ షున్’హఠాత్తుగా దిశ మార్చుకోవడంలో చెల్లింపుల అంశం అస్సలే లేదని, చెల్లింపుల ఆలస్యం కారణంగానే అది భారత్కు రావట్లేదనే వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఈ మేరకు శనివారం మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టింది. ‘‘అంతర్జాతీయంగా మార్గమధ్యంలో ఇంధన నౌకలు తమ గమ్యస్థానాన్ని మార్చుకోవడం సాధారణం. గిట్టుబాటు, వాణిజ్య వెసులుబాట్లు, నిర్వహణ సౌకర్యాలకు అనుగుణంగా నౌకలు తమ దిశలను మార్చుకుంటాయి. తాజాగా భారత్కు ఏడేళ్ల తర్వాత గుజరాత్లోని వడినార్కు వస్తున్న ముడిచమురు నౌక ‘పింగ్ షున్’హఠాత్తుగా దిశమార్చుకోవడంలో చెల్లింపుల అంశం ఇమిడిలేదు. ఇరాన్తో భారత్కు ఎలాంటి చెల్లింపుల వివాదాలు లేవు. నౌకల సంబంధ నగదు చెల్లింపులు సవ్యంగా జరుగుతున్నాయి’’అని మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. -
భారత్తో మాది వేల ఏళ్ల అనుబంధం: ఇరాన్
ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది. అయితే భారత్ నౌకలు మాత్రం జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో 7వ ఎల్పీజీ ట్యాంకర్ జలసంధి గుండా భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా భారత్ ధన్యవాదాలు తెలుపగా ఇరాన్ దానికి స్పందించింది.చమురు నౌక గుజరాత్ చేరుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ఈ ట్యాంకర్ ప్రయాణాన్ని భారతీయ దౌత్య విజయంగా అభివర్ణించారు. దీనిపై ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ స్పందించింది. "భారతదేశం, ముఖ్యంగా గుజరాత్, మా ఉమ్మడి చరిత్రలో ఒక మధురమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. శతాబ్దాల క్రితం మా దేశం నుండి వచ్చిన వారిని మీరు సాదరంగా ఆహ్వానించారు. ఈ నాగరికత సంబంధాల ఆధారంగా, మన మధ్య స్నేహం మరియు సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము." అని తెలిపింది.కాగా ఇరాన్ కాన్సులేట్ తన సందేశంలో సింధూ నాగరికతకు చెందిన లోథల్ ఓడరేవును ఉద్దేశించి మాట్లాడింది. సుమారు 4,000 ఏళ్ల క్రితమే సింధు లోయ నాగరికతకు మరియు పర్షియా తీరానికి మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను ఇది గుర్తుచేస్తుంది. కాగా గ్రీన్ సాన్వీ అనే నౌక 46,650 మెట్రిక్ టన్నుల గ్యాస్తో హర్ముాజ్ జలసంధిని దాటింది.అయితే హర్మూజ్ జలసంధి విషయమై ఇప్పుడు యుద్ధం మరింత తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. దానిని ఎట్టిపరిస్థితుల్లో తెరవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేస్తుండగా ఇరాన్ ససేమిరా అంటుంది. దీంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ కేవలం 5 మిత్ర దేశాలకు భారతదేశం,రష్యా, చైనా, ఇరాక్,పాకిస్థాన్ అనుమతినిచ్చింది. -
ఆ చమురు నౌక చైనాకు మళ్లింది!
న్యూఢిల్లీ: 6 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురుతో భారత్కేసి బయల్దేరిన పింగ్ షున్ అనే నౌక తన ప్రయాణ దిశను ఉన్నట్టుండి చైనా వైపు మార్చుకుంది! ముందుగా నిర్దేశించిన మేరకు ఈ చమురు నౌక గుజరాత్లోని వదినార్ రేవుకు చేరాల్సి ఉంది. మూడు రోజులుగా నౌక ప్రయాణం వదినార్ వైపే సాగింది. అక్కడికి కొద్ది దూరంలో ఉండగా శుక్రవారం ఉన్నట్టుండి చైనాలోని డోంగ్యింగ్ కేసి మళ్లినట్టు నౌకల ప్రయాణాన్ని గమనించే ‘కోలా డేటా’పేర్కొంది. పింగ్ షున్ తాజాగా తన గమ్యస్థానాన్ని డోంగ్యింగ్గానే చూపుతున్నట్టు తెలిపింది. ఈ నౌక గనక భారత్ చేరితే ఏడేళ్ల అనంతరం ఇరాన్ నుంచి మన దేశానికి తొలిసారి చమురు దిగుమతి జరిగేది. ఈ నౌకలోని చమురు తాలూకు క్రయ, విక్రయదార్ల వివరాలు వెల్లడి కాలేదు. ఎస్వాతిని దేశపు జెండాతో కూడిన ఈ చమురు నౌక ఈ వారం మొదట్లో భారత్కు బయల్దేరింది. ఇప్పుడిలా సముద్ర మధ్యంలో ఉన్నట్టుండి చైనా వైపు ఎందుకు మళ్లిందన్నది తెలియాల్సి ఉంది. బహుశా చెల్లింపుల అంశమే దీనికి ప్రధాన కారణమై ఉంటుందని కోలా అభిప్రాయపడింది. ‘‘చమురు చెల్లింపులకు సరఫరా కంపెనీలు గతంలో కనీసం 30 నుంచి 60 రోజుల గడువిచ్చేవి. కానీ పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు సరఫరా పూర్తిగా అడుగంటి డిమాండ్ చుక్కలనంటింది. దాంతో కంపెనీలు తక్షణ చెల్లింపులను డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ముందుకొచ్చే దేశాలకే పెద్దపీట వేస్తున్నాయి’’అని పేర్కొంది. ఇరాన్ చము రును సరఫరా చేస్తోందంటూ పింగ్ షున్ నౌకపై 2025లో అమెరికా నిషేధం విధించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు ఎత్తేయడం తెలిసిందే. దాంతో ఇప్పటికే సముద్రంలో ఉన్న ఇరాన్ చమురు నౌకలపై మన చమురు కంపెనీలన్నీ జల్లెడ పడుతున్నాయి. ఆ క్రమంలోనే పింగ్ షున్ ఇరాన్ చమురుతో భారత్కేసి బయల్దేరి తాజాగా ఉన్నట్టుండి చైనా బాట పట్టింది. అయితే, చెల్లింపు సంబంధిత అంశాలు కొలిక్కి వచ్చే పక్షంలో ఈ నౌక భారత్కే వచ్చే అవకాశాలూ లేకపోలేదని ‘కోలా’లో ప్రధాన పరిశోధకునిగా పని చేస్తున్న సుమిత్ రిటోలియా చెప్పుకొచ్చారు. చమురు కొనుగోళ్ల కోసం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ముమ్మర పోటీకి ఈ ఉదంతం తాజా నిదర్శనమన్నారు. 2018 వరకు భారత్కు అతి పెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఇరాన్ కూడా ఉండేది. మన చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా 11.5 శాతం దాకా ఉండేది. 2019లో ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు కఠినతరం చేసింది. దాంతో ఇరాన్ చమురు కొనుగోళ్లను భారత్ నిలిపేసింది. -
భారత్కు అండగా రష్యా.. చమురు సంక్షోభానికి తెర?
భారత్కు రష్యా గుడ్న్యూస్ చెప్పింది. పశ్చిమాసియా యుద్ధ తీవ్రత దృష్ట్యా చమురు సంక్షోభం నేపథ్యంలో తాను అండగా ఉన్నానంటూ భరోసా ఇచ్చింది. ఈ మేరకు ముడి చమురు సరఫరా పెంపుకు ఆ దేశ ఉప ప్రధాని భారత్కు హామీ ఇచ్చినట్లు సమాచారం.చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. భారత్తో సహా ఎన్నో దేశాలు ఈ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత పర్యటనలో ఉన్న రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్ కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.భారతవిదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ సలహాదారు అజిత్ ధోబల్తో ఇంధన అంశమై రష్యా ఉపప్రధాని భేటీ జరిగినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో భారత్కు కావాల్సిన ముడి చమురు,లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG),సరఫరాను మరింత పెంచుతామని ఆయన హామీ ఇచినట్లు తెలుస్తోంది.అనంతరం ఆయన ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే కేవలం చమురు మాత్రమే కాకుండా.. అణుశక్తి , సాంకేతికత, మరియు కీలక ఖనిజాల రంగాల్లో కూడా కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. -
దేశంలో యాపిల్ నగరంగా పేరొందిన సిటీ ఎక్కడ ఉంది?
భారతదేశం అనేక హిల్ స్టేషన్స్కు ప్రశాంతమైన పర్వత గ్రామాలకు నిలయం, అందులోనూ విశేషం ఏమిటంటే.. ప్రతిదానికీ దాని కంటూ ఒక స్వంత కథ ఉంటుంది. అదే విధంగా హిమాచల్ ప్రదేశ్లో దాగి ఉన్న అటువంటి ఒక చిన్న పట్టణం, భారతదేశపు యాపిల్ సాగులో కీలక పాత్ర పోషించింది. దట్టమైన కొండలు, స్వచ్ఛమైన పర్వత గాలి నలువైపులా యాపిల్ తోటలతో నిండి ఉండే ఈ పట్టణం ప్రశాంతంగా సహజమైన సౌందర్యంతో కనిపిస్తుంది. సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో కనిపించే రద్దీకి భిన్నంగా ఈ గ్రామంలో జీవనం స్లోగా ప్రశాంతంగా సాగుతుంది. సందర్శకులు దాని సహజ సౌందర్యానికి సరళమైన, ప్రశాంతమైన జీవనశైలికి ఆకర్షితులవుతారు. అయితే, ఈ చిన్న పట్టణానికి యాపిల్ పండ్ల వల్లే గొప్ప ప్రాచుర్యం వచ్చింది.హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా సమీపంలో ఉన్న చిన్న పట్టణమైన కోట్గఢ్, దేశానికి యాపిల్ సాగును పరిచయం చేయడంలో చారిత్రక పాత్ర పోషించింది. తద్వారా భారతదేశపు యాపిల్ సిటీగా గుర్తింపు పొందింది. దీనికి 20వ శతాబ్దం ప్రారంభంలో తొలి బీజం పడింది , అమెరికన్ మిషనరీ కి చెందిన శామ్యూల్ ఎవా న్స్ స్టోక్స్ వాణిజ్యపరంగా మొదటి యాపిల్ తోటలను నాటారు. కోట్గఢ్లోని సారవంతమైన నేల, చల్లని వాతావరణం అనువైన ఎత్తులో యాపిల్ సాగుకు చాలా అనుకూలంగా ఉండడంతో ఈ అభివృద్ధి చెందుతున్న ఉద్యానవన పరిశ్రమకు పునాది వేశాయి. కాలక్రమేణా, యాపిల్ సాగు కోట్గఢ్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి, హిమాచల్ ప్రదేశ్ను దేశంలోని ప్రముఖ యాపిల్ ఉత్పత్తిదారుగా నిలిపింది.సందర్శనీయ ప్రాంతం..ముఖ్యంగా ఆగస్టు నుంచి∙అక్టోబర్ వరకు పంట కోత కాలంలో, కోట్గఢ్లోని విస్తారమైన యాపిల్ తోటలు, ఇక్కడి ప్రధాన ఆకర్షణ. పండ్లతో నిండిన ఆపిల్ చెట్ల వరుసల మధ్య నడవడం ప్రశాంతమైన అనుభూతిని అందిస్తుంది. అనేక స్థానిక కుటుంబాలు యాపిల్ సాగు తమ తోటల నడుమ జీవితం గురించిన కథలను సంతోషంగా మనతో పంచుకుంటాయి. కోట్గఢ్కు కొద్ది దూరంలో ఉన్న తాని జుబ్బర్ సరస్సు, దేవదారు అడవులు చుట్టుముట్టిన ఒక ప్రశాంతమైన ప్రదేశం. ప్రశాంతమైన జలాలు స్వచ్ఛమైన పర్వతపు గాలి ఆహ్లాదపరుస్తాయి. ఏకాగ్రతతో ఆలోచించుకోవడానికి, ఫోటోగ్రఫీకి లేదా విశ్రాంతిని అందించే పిక్నిక్కు అనువుగా అనిపిస్తాయి. కోట్గఢ్తో తరచుగా ముడిపడి ఉండే థానేదార్ గ్రామీణ ప్రాంతంలో మొట్టమొదటి యాపిల్ మొక్కలు నాటిన ప్రదేశం ఉంటుంది. సాంప్రదాయ గృహాలు, మెట్ల పొలాలు హిమాలయాల విశాల దృశ్యాలతో ఈ గ్రామం ఆకట్టుకుంటుంది. కోట్గఢ్లో స్థానిక దేవతలకు చెందిన పురాతన ఆలయాలు అనేకం ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలు ప్రాంతీయ నమ్మకాల గురించి తెలియజెబుతాయి. ఇక్కడి హోమ్స్టేలో బస చేయడం ద్వారా సందర్శకులు కోట్గఢ్లోని రోజువారీ జీవితాన్ని అనుభవించవచ్చు. సాధారణ, ఇంట్లో వండిన భోజనం నుంచి పండ్ల తోటల యజమానులతో సంభాషణల వరకు, ఇది ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలతో మమేకయే అవకాశాన్ని అందిస్తుంది.కోట్గఢ్ను సందర్శించడానికి మార్చి నుంచి జూన్ నెల మధ్య అనువైనది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కొండల అంతటా పువ్వులు వికసించడం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఉండే శరదృతువు మరో విధంగా ప్రత్యేకం. ఎందుకంటే యాపిల్ పంట కోత కాలం ఈ పట్టణాన్ని చైతన్యవంతమైన కార్యకలాపాల కేంద్రంగా మారుస్తుంది. అయితే శీతాకాలాలు చల్లగా ఉంటూ మంచు కురుస్తుంది, ఇది ఈ ప్రాంతం మీదుగా ప్రయాణాన్ని సవాలుగా మారుస్తుంది,ఎలా వెళ్లొచ్చు?విమాన మార్గంలో వెళ్లాలంటే..ఈ పట్టణానికి సమీపంలోని ప్రధాన విమానాశ్రయం జుబ్బర్హట్టిలో ఉన్న సిమ్లా విమానాశ్రయం, ఇది కోట్గఢ్కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చండీగఢ్ విమానాశ్రయం కూడా మరో ఎంపిక, రైలు మార్గంలో అయితే సమీపంలోని రైల్వే స్టేషన్ సిమ్లా, ఇది వారసత్వ నారో–గేజ్ రైల్వే ద్వారా కల్కాతో అనుసంధానితమై ఉంది. సిమ్లా నుంచి కోట్గఢ్కు రోడ్డు మార్గం ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది. సాధారణ బస్సులు టాక్సీలు అందుబాటులో ఉంటాయి. -
అజిత్ దోవల్ రెడ్ ఫైల్ లో ఏముంది? యుద్ధానికి సిద్ధమవుతున్న ఇండియా!
-
యుద్దానికి సిద్ధమవుతున్న భారత్!..అజిత్ దోవల్ రెడ్ఫైల్లో ఏముంది?
ఢిల్లీలోని సౌత్ బ్లాక్.. రాత్రి సమయం. దేశం మొత్తం నిద్రపోతున్న వేళ, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. సాధారణంగా కనిపించే మీటింగ్లు కావు ఇవి. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్ వంటి అగ్రనేతలతో పాటు, ఒక వ్యక్తి అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆయనే భారత జేమ్స్ బాండ్ – అజిత్ దోవల్! అసలు ఏం జరుగుతోంది? భారత్ మరో మహా యుద్ధానికి సిద్ధమవుతోందా? గత వారం రోజులుగా ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. NSA అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, ఆయన భారత రక్షణ కవచం. రా (RAW) , ఎన్ఐఏ (NIA) ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి, ఆయన ఒక 'రిస్క్ అసెస్మెంట్ ఫైల్' రూపొందించారు. దీనినే 'రెడ్ ఫైల్' అని పిలుస్తారు. సాధారణంగా ప్రపంచ నేతలెవరైనా 30 నుండి 40 నిమిషాలకు మించి చర్చలు జరపరు. కానీ మోదీ, దోవల్తో ఏకంగా మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చించారంటే, అది చమురు ధరల గురించో, ఆర్థిక స్థితిగతుల గురించో కాదని ఇక్కడ స్పష్టమవుతోంది. అమెరికా , పాకిస్థాన్లు కలిసి భారత్ను ఇబ్బంది పెట్టడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ దోవల్ చేతికి చిక్కింది.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సమావేశాల్లో డిఫెన్స్ మినిస్టర్ తోపాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (NSA) గంటల తరబడి గడుపుతున్నారు. మరోవైపు, భారత త్రివిధ దళాధిపతులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదో పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతోంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పూరీ జగన్నాథుని సన్నిధిలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్వర్ణ దేవాలయంలో, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉజ్జయిని మహాకాళి చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా దైవ ప్రార్థనలు చేస్తున్నారంటే, భారత్ ఏదో భారీ "నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్"కు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్థాన్ తన గాలి సరిహద్దులను (Air Space) అప్పగించబోతోంది. ఒకవేళ పాకిస్థాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకెళ్తే, ఇరాన్ ఖచ్చితంగా పాకిస్థాన్పై యుద్ధం ప్రకటిస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! పాకిస్థాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్ను యుద్ధంలోకి లాగాలని చూస్తోంది. భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో 'నోటామ్' (NOTAM) జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా ఏం జరగొచ్చనేదానికి ఇది సంకేతం.మరోవైపు, పీఓకే (PoK) సరిహద్దుల్లో సుమారు 1500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ ,పాకిస్థాన్ కలిసి భారత్ను "టూ ఫ్రంట్ వార్" (రెండు వైపుల నుండి యుద్ధం) లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకే ఈ మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్, ఎస్-400, రాఫెల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పుడు పాకిస్థాన్ను ఎలా దెబ్బకొట్టాలి? ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలి? అనే వ్యూహంలో ఉంది. శతృవు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత వార్-రూమ్ అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. ఈ మహా-సంగ్రామంలో భారత్ పైచేయి సాధిస్తుందా? మోదీ, దోవల్ వ్యూహం పాకిస్థాన్ను కోలుకోలేని దెబ్బ తీయబోతోందా? అనే చర్చ అంతర్జాతీయ మీడియాలో మొదలైంది. -
భక్తిలో భారతావని: రాష్ట్రానికో రీతిలో హనుమజ్జయంతి
న్యూఢిల్లీ: అమోఘమైన బలం, అచంచల భక్తి, అకుంఠిత ధైర్యం, అలవికాని స్వామి భక్తికి నిలువుటద్దం.. హనుమంతుడు. నేడు (గురువారం) హనుమజ్జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మన దేశ సంస్కృతిలో ఉన్న వైవిధ్యం హనుమాన్ జయంతి వేడుకల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాదిలో ఒకలా, దక్షిణాదిలో మరోలా.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీతిలో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఉత్తర భారతం: ఉపవాసాలు, సుందరకాండ పఠనం ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, బిహార్ తదితర రాష్ట్రాల్లో చైత్ర పూర్ణిమ నాడు హనుమాన్ జయంతిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భక్తులు తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించి, ఆలయాలకు వెళతారు. రోజంతా కఠిన ఉపవాసం ఉండి, సాయంత్రం హనుమంతుడికి పూజలు నిర్వహించిన తర్వాతే ఆహారం తీసుకుంటారు. ఆలయాల్లో హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. భక్తులకు బూందీ, లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేయడం ఉత్తరాది ప్రత్యేకత.మహారాష్ట్ర: వీధుల్లో శోభా యాత్రల సందడిమహారాష్ట్రలో హనుమాన్ జయంతి అంటే భారీ ఉత్సవం. ఇక్కడ జరిగే ‘శోభా యాత్రలు’ అత్యంత ప్రధానమైనవి. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించిన రథాలపై హనుమంతుని విగ్రహాలను ఉంచి ఊరేగిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని భజనలు, కీర్తనలతో వీధులను హోరెత్తిస్తారు. అనేక చోట్ల ‘భండారా’ పేరుతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక: సింధూరార్చన, తమలపాకు పూజలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు చైత్ర పూర్ణిమ రోజున నిర్వహిస్తారు. స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం, సింధూరాన్ని సమర్పించడం ఈ ప్రాంతాల్లో ప్రధాన ఆచారం. ఇక కర్ణాటకలో ఈ పండుగను మార్గశిర మాసంలో (డిసెంబర్ - జనవరి) జరుపుకోవడం విశేషం. భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.తమిళనాడు, కేరళ: వడమాల, వెన్న పూతతో అభిషేకాలుదక్షిణాదిలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఉత్సాహంగా సాగుతాయి. భక్తులు స్వామివారికి ‘వడమాల’ సమర్పించడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. అలాగే స్వామి విగ్రహానికి వెన్న పూయడం , తులసి దళాలతో పూజించడం, అభిషేకాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి.గుజరాత్, రాజస్థాన్: దానధర్మాలు, సత్సంగాలుపశ్చిమ భారత దేశంలోని గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భక్తులు హనుమాన్ చాలీసాను 108 సార్లు పఠించడం ఆచారంగా పెట్టుకున్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక సత్సంగాలు అధికంగా జరుగుతాయి. కేవలం పూజలకే పరిమితం కాకుండా, పేదలకు అన్నదానం చేయడం, దుస్తులు పంపిణీ చేయడం వంటి దానధర్మాలకు ఈ రోజున అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రాంతాలు వేరైనా, సంప్రదాయాలు వేరైనా.. హనుమంతుడిపై ఉన్న భక్తి భారతీయులందరినీ ఒక్కటి చేస్తోంది. ‘అష్టసిద్ధి నవనిధి దాత’ అయిన ఆ ఆంజనేయుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం.ఇది కూడా చదవండి: సురేష్ గోపి నిజంగా గెలవలేదా? -
సాధారణ రైతు.. జీవితాలను మార్చేలా అసాధారణ విజయం
చింతల వెంకట రెడ్డి.. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) ద్వారా అంతర్జాతీయ పేటెంట్లు పొందిన భారత మొట్టమొదటి స్వతంత్ర రైతు. ఆయన రైతుల సంక్షేమమే లక్ష్యంగా చురుకుగా పనిచేస్తూ, వ్యవసాయంలో ఉత్తమ విధానాలను వేలాది మంది అన్నదాతలకు ఉచితంగా బోధిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా అధిక దిగుబడి రాబట్టవచ్చని నిరూపిస్తున్నారు. రైతుల కోసం నిలబడిన ఆయన స్ఫూర్తిదాయక గాథను తెలుసుకుందాం..హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ఆర్గానిక్ రైతు చింతల వెంకట రెడ్డి భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ‘మట్టి-కేంద్రీకృత విధానం’తో పేరు తెచ్చుకున్నారు. ఆయన సికింద్రాబాద్ అల్వాల్లో 1950 డిసెంబరు 22న సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చిన్న వయసు నుంచే తండ్రికి పనుల్లో సాయం చేస్తుండేవారు. 12వ తరగతి తర్వాత కుటుంబానికి చెందిన 40 ఎకరాల పొలాన్ని చూసుకోవడానికి చదువు ఆపేశారు.జీవితాన్ని మలుపుతిప్పిన ఘటనచింతల వెంకట రెడ్డి 1970 దశాబ్దం చివరలో రసాయన ఎరువులు మట్టి సహజ శక్తిని తగ్గిస్తున్నాయని గుర్తించారు. దీంతో మట్టి ఆరోగ్యం (పోషకాలతో, సమతుల్యంగా ఉండి పంటలకు అవసరమైన అన్ని సహజ లక్షణాలు కలిగి ఉండడం) పునరుద్ధరణపై ప్రయోగాలు ప్రారంభించారు. చివరకు విజయం సాధించారు. మట్టి పునరుద్ధరణకు జెనీవాలోని ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్ల్యూఐపీఓ నుంచి అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఆయన ఆవిష్కరణల్లో ప్రధానమైనది “సోయిల్ స్వాపింగ్”.టెక్నిక్ ఇదేభూమిలోని రెండో పొర (4-5 అడుగుల లోతు) నుంచి తీసిన మట్టిలో ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ మట్టిని పైపొరపైకి తీసుకురావడం ద్వారా ఎలాంటి రసాయన ఎరువు లేకుండా భూసార పునరుద్ధరణను సాధించారు చింతల వెంకట రెడ్డి.మట్టి ద్రావణం.. ఎలా పనిచేస్తుంది?రసాయన స్ప్రేలకు బదులుగా మట్టి ద్రావణ పద్ధతిని చింతల వెంకట రెడ్డి అభివృద్ధి చేశారు. భూమిలోని రెండో పొర నుంచి తీసిన మట్టిని ఎండబెట్టి, వడకట్టి, నీటిలో కలిపి ద్రావణంగా తయారు చేస్తారు. దీన్ని పంటలపై పిచికారీ చేస్తే పలుచని మట్టి పొర ఏర్పడుతుంది. ఈ మట్టిని తినే పురుగులు జీర్ణించుకోలేక చనిపోతాయి. అదే సమయంలో ఖనిజాలు మొక్కకు ఆహారంగా పనిచేస్తాయి.బియ్యం, గోధుమలో సమృద్ధిగా విటమిన్-డీ వెంకట రెడ్డి 2021లో సహజ పద్ధతిలో ప్రధాన ఆహార పంటల్లో విటమిన్-డీ ఎక్కువ ఉండేలా చేయడంలో విజయం సాధించారు. సాధారణంగా బియ్యంలో 0 శాతం విటమిన్ డీ ఉంటుంది. ఆయన పంటల్లో 100 గ్రాములకు 102 నుంచి 141 ఐయూ వరకు నమోదైంది. గోధుమలో 100 గ్రాములకు 1832 ఐయూ ఉంటోంది. పోషకాహార లోప సమస్యకు తక్కువ ఖర్చుతో పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా వీటిపై పనిచేశారు.అంతర్జాతీయ గుర్తింపుతెలంగాణలోని చింతల వెంకట రెడ్డి వ్యవసాయ క్షేత్రం ప్రపంచ నాయకులకు సందర్శన కేంద్రంగా మారింది.బిల్ క్లింటన్ (2001): ద్రాక్ష సాగు విధానాన్ని ప్రశంసించారు.జార్జ్ డబ్ల్యూ బుష్ (2006): హైదరాబాద్ వచ్చిన సమయంలో చింతల వెంకట రెడ్డిని కలిసి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పద్ధతులపై వివరాలు తెలుసుకున్నారు.పురస్కారాలుపద్మశ్రీ (2020): వ్యవసాయ ఆవిష్కరణల్లో ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అందజేసింది.డబ్ల్యూఐపీఓ పేటెంట్లుమట్టి పోషక నిర్వహణ, బయో-ఫోర్టిఫికేషన్ పద్ధతులకు అనేక అంతర్జాతీయ పేటెంట్లు వచ్చాయి. బయో-ఫోర్టిఫికేషన్ అంటే పంటల్లో పోషక విలువలను సహజంగా పెంచే ప్రక్రియ.ప్రపంచ రికార్డు: అనాబ్-ఎ-షాహీ ద్రాక్ష రకంలో హెక్టారుకు 105 టన్నుల దిగుబడి సాధించారు.వెంకట రెడ్డి సిద్ధాంతం“మట్టి అంటే మొక్క కడుపు. మట్టి ఆరోగ్యంగా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఆ మొక్కను తినే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు” అనేది ఆయన సిద్ధాంతం. -
‘డాడీ’ అని పిలుస్తున్న పిల్లలు… కానీ చట్టం ఒప్పుకోదా..?
ఆమె తన మొదటి భర్తతో హిందూ వివాహ చట్టం ద్వారా 2015లో విడాకులు పొందిన తర్వాత నేను ఆమెను 2016లో వివాహం చేసుకున్నాను. ఆమెకు మొదటి వివాహం ద్వారా ఒక అబ్బాయి, ఇద్దరు కవల అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిని తండ్రి తన సంరక్షణలోకి తీసుకున్నాడు కానీ అమ్మాయిల బాధ్యత ఏనాడూ పట్టించుకోలేదు. ఇద్దరు అమ్మాయిలు 2015 నుండి నా భార్యతోనే ఉంటున్నారు. ప్రస్తుతం వారికి 12 సంవత్సరాలు. నేను వారిని నా పిల్లల్లాగే చూసుకుంటున్నాను. నన్ను వాళ్ళు ‘డాడీ’ అని పిలుస్తారు. అందువల్ల ఇంక నాకు మళ్ళీ పిల్లలు వద్దు అని నిర్ణయించుకున్నాను. నా భార్య గతంలో తన మాజీ భర్త నుండి తీవ్రమైన గృహహింసకు గురైంది, ముఖ్యంగా కవల పిల్లలకు (అమ్మాయిలకు) జన్మనిచ్చిన కారణంగా. ఇద్దరు అమ్మాయిలను నేను చట్టపరంగా దత్తత తీసుకుని, నా ఇంటిపేరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అతని నుంచి దత్తతకు అనుమతి పొందడం అసాధ్యం. నా మీద కూడా కక్షధోరణి ఉంటుంది. తండ్రి అనుమతి లేకుండా దత్తత తీసుకోవడం సాధ్యమా? సాధ్యం కాకపోతే, ఏ చట్టపరమైన మార్గాలు ఉన్నాయి?– మచ్చా అనికేత్, విశాఖపట్నం ముందుగా మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కంటేనే సంతానం కాదు – ప్రేమానురాగాలకు పేగుబంధమే అవసరం లేదు అని నిరూపించారు. మీరు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం.మీ సమస్యలోని సున్నితత్వాన్ని , భావోద్వేగాలను అర్థం చేసుకోగలను. భారతదేశంలో, పైగా హిందూ చట్టాలలో పిల్లల తల్లి/తండ్రి బతికే ఉంటే, సాధారణంగా ఏ ఒక్కరి అనుమతి లేకుండా దత్తత సాధ్యం కాదు. మీ కేసులో కూడా తండ్రి అనుమతి కావాలి.ఎందుకంటే...1. దత్తత తీసుకున్న తర్వాత జన్మనిచ్చిన తండ్రి హక్కులు పూర్తిగా ముగుస్తాయి.2. మీరు చట్టపరంగా తండ్రిగా మారతారు.3. ఆస్తి, వారసత్వ హక్కులు మారతాయి.ఈ పరిస్థితుల్లో తండ్రి అనుమతి లేకుండా కోర్టు దత్తతకు అనుమతించాలి అంటే ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.1. తండ్రి పిల్లలను ఉద్దేశపూర్వకంగా వదిలేశారా?2. పిల్లలను ఇన్ని సంవత్సరాలుగా చూసుకున్నారా లేదా – కనీసం వారి బాగోగులు పట్టించుకున్నారా లేదా?3. తండ్రి హింసాత్మకంగా లేదా పిల్లల పోషణకు అనర్హుడిగా ఉన్నారా?4. పిల్లలకు అతని వల్ల హానికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా?ఈ అంశాలను కోర్టు మాత్రమే నిర్ణయించగలదు – మీ సొంత నిర్ణయాలు చెల్లవు. ముందుగా కస్టడీ/గార్డియన్షిప్ పొందడం కోసం మీ భార్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి. పిల్లలు 2015 నుండి తనతోనే ఉన్నారని. తండ్రి బాధ్యతలు నిర్వర్తించలేదని / హింస (ఆర్థిక, మానసిక, శారీరక) చేశాడని, పైన తెలిపిన అంశాలకు ΄ాల్పడ్డాడు అని నిరూపించాలి.ఆ తర్వాత మీరు దత్తత కోసం కోర్టులో పిటిషన్ వేయవచ్చు. అందులోనే తండ్రి అనుమతి అవసరం లేదని కూడా కోర్టును అభ్యర్థించవచ్చు. పిల్లలు 12 సంవత్సరాలు ఉన్నందున కోర్టు వారి అభి్ర΄ాయం అడగవచ్చు. వారు మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు, జన్మనిచ్చిన తండ్రిపై వారికి ఎటువంటి ప్రేమ లేదు అంటే అది మీకు బలమైన అంశంగా మారుతుంది. చట్టపరంగా దత్తత తీసుకోకుండా సర్టిఫికెట్లలో ఎటువంటి మార్పులు చేయకండి. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తల ఎత్తవచ్చు. మీ దగ్గరలోని మంచి లాయర్ గారిని కలవండి. మీ భార్యకు తన మాజీ భర్తకు జరిగిన కోర్టు వివాదాలు, పత్రాలు, ఒప్పందాలు ఏవైనా ఉంటే తీసుకుని వెళ్ళండి. మాజీ భర్త తన పిల్లలను ఏనాడు పట్టించుకోలేదు అని చెప్పడానికి ఆధారాలు సేకరిస్తే మరీ మంచిది. -
మొబైల్స్, ఏసీ రేట్లకు రెక్కలు
ముడి వస్తువుల వ్యయాల పెరుగుదల, రూపాయి విలువ క్షీణిస్తుండటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్లాంటి ప్రతికూల పరిస్థితులతో మొబైల్స్, టీవీల నుంచి ఎయిర్ కండీషనర్ల వరకు అన్నింటి రేట్లకు రెక్కలొస్తున్నాయి. గత నవంబర్–డిసెంబర్ నుంచి స్మార్ట్ఫోన్లు, టీవీల రేట్లు ప్రతి 30–60 రోజులకోసారి పెరుగుతూనే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఉత్పత్తి పరిమాణం పెరిగే కొద్దీ, ముడి వస్తువుల వ్యయాలు తగ్గి కంపెనీలు చౌకగా ఉత్పత్తులను అందించేందుకు ప్రయత్నిస్తాయి.ఒకవేళ కొన్నాళ్లు పరిస్థితి అటూ ఇటూ అయినా అమ్మకాలను పోగొట్టుకోవడానికి ఇష్టపడక, అదనపు భారమేదైనా పడితే తామే భరించి, రేట్లను పెంచకుండా జాగ్రత్త పడుతుంటాయి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో భారాన్ని వినియోగదారులకి బదలాయిస్తున్నాయి. దీనితో ఎంట్రీ లెవెల్ టీవీలు, స్మార్ట్ఫోన్ల ధరలు తిరిగి 6–8 ఏళ్ల క్రితం నాటి స్థాయికి చేరుకుంటున్నాయి.వేసవి వడగాలి..: ఏసీల్లో పెద్ద ఎత్తున అమ్ముడయ్యే కేటగిరీ ఉత్పత్తులు, ఫ్రిజ్లు,, వాషింగ్ మెషిన్ల ధరలు కూడా ఈ నెల నుంచి భారీగా పెరుగుతున్నాయి. తొలిసారిగా కొనుక్కునే వారు ఎక్కువగా మొగ్గు చూపే 3 స్టార్ 1.5 టన్ను ఏసీల రేట్లు గతేడాది వేసవిలో సుమారు రూ. 32,000–34,000గా ఉండగా ఈ ఏప్రిల్లో రూ. 37,000–40,000కు పెరగనున్నాయి. కమోడిటీల ధరలు పెరగడం, కొత్త ప్రమాణాల అమలు కారణంగా ఏసీల రేట్లు 12 శాతం వరకు పెరగనున్నట్లు బ్లూస్టార్ గ్రూప్ ప్రెసిడెంట్ మోహిత్ సూద్ ఇటీవలే వెల్లడించారు. ఏప్రిల్ నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు వివరించారు.మరోవైపు, ఎంట్రీ లెవెల్ 5జీ స్మార్ట్ఫోన్ల రేట్లు దీపావళి సమయంలో రూ. 10,000 లోపు ఉండగా, ప్రస్తుతం 13,000–14,000కి చేరాయి. కొన్ని బ్రాండ్స్ అయితే రాబోయే 2–3 నెలల్లో ఈ ఫోన్ల రేట్లు రూ. 20,000కి కూడా చేరొచ్చని చెబుతున్నాయి. 32 అంగుళాల స్మార్ట్ టీవీ రేటు గతేడాది రూ. 6,500 స్థాయిలో ఉంటే, ఇప్పుడు రూ. 8,500గా ఉందని, మే నాటికి రూ. 10,000కు చేరొచ్చనేది పరిశ్రమ వర్గాలు మాట. వివో, ఒప్పో, శాంసంగ్, షావోమీలాంటి బ్రాండ్లు కొన్ని స్మార్ట్ఫోన్ల రేట్లను 10 శాతం వరకు పెంచనున్నట్లు సంకేతాలిచి్చనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మెమొరీ చిప్ల రేట్లు గత 5–6 నెలలుగా పెరగడం, గల్ఫ్ యుద్ధంతో పాటు రూపాయి బలహీనపడటమనేది కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వివరించాయి. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ వైపు చూపు..సాధారణంగా త్రైమాసికాలవారీగా రేట్లను తగ్గించడం, డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు ప్రకటించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించేందుకు, తమ ఉత్పత్తులకు డిమాండ్ పెంచుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకపోగా రేట్లు మరో పది శాతం వరకు పెరగనున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనితో డిమాండ్పైనా ప్రభావం పడుతోంది. కొత్త ఫోన్లకు బదులు సెకండ్ హ్యాండ్, రీఫర్బి‹Ù్డ ఫోన్ల వైపు కొందరు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండగా, మరికొందరు పూర్తిగా కొనుగోలు నిర్ణయాన్నే వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రూ. 20,000 వరకు ఖరీదు చేసే ఫోన్లపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలంటూ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసేందుకు మొబైల్ రిటైలర్ల సంఘం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇది 18 శాతంగా ఉంది. -
భారత్లో ఒరాకిల్ 12,000 మందికి ఉద్వాసన
న్యూఢిల్లీ: యూఎస్ ఐటీ దిగ్గజం ఒరాకిల్ తాజాగా దేశీయంగా విధులు నిర్వహిస్తున్న 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ బాటలో ప్రపంచవ్యాప్తంగా 30,000 ఉద్యోగాలకు కోత పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెలలో మరింత మందిని ఉద్యోగాల నుంచి తప్పించనున్నట్లు సమాచారం. దేశీయంగా కంపెనీలో సుమారు 30,000 మంది పనిచేస్తున్నారు.అయితే ఈ అంశాలపై స్పందించేందుకు ఒరాకిల్ నిరాకరించడం గమనార్హం! సిబ్బందికి ఈమెయిల్ ద్వారా ఉద్యోగ కోత వివరాలను ఒరాకిల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. కనీసం ఏడాదిపాటు సేవలందించిన ఉద్యోగులకు 15 రోజుల వేతనంసహా.. లీవ్ ఎన్క్యా‹Ùమెంట్, అర్హతగలవారికి గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు ఆఫర్ చేస్తోంది. -
అమెరికాలో భారతీయులకు అవమానం
-
పాతికేళ్లకే కుంగుబాటు!!
ఆమె శరీరానికి జ్వరం వస్తేనే ఇంట్లో సరిగా పట్టించుకోరు. ఇక మనసుకు జ్వరం వస్తే? మన దేశంలో స్త్రీల మానసిక సమస్యలను గుర్తించడం, వైద్యం చేయించడం చాలా తక్కువ. తల్లి, భార్య, చెల్లెలు, అక్క, కుమార్తె... వీరి మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలుసుకునేలోపు మానసిక సమస్యలు ముదిరిపోయి ఉంటాయి. అనేక వొత్తిళ్లు, పరిమితులు స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. వాటి పట్ల అవగాహనే సగం వైద్యం. ఇంటిల్లిపాది తెలుసుకోవాల్సిన వరుస కథనాలు నేటి నుంచి...హాస్పిటల్స్లో సైకియాట్రీ, సైకాలజీ విభాగాల్లోని వెయిటింగ్ రూమ్స్లోకి చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఎందుకంటే, అక్కడ మానసిక సమస్యలతో కనిపిస్తున్నవారు 35 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. 84 దేశాలలో వరల్డ్ మెంటల్ హెల్త్ రిపోర్ట్ చేసిన మైండ్ హెల్త్ కోషెంట్ స్కోర్లో భారతీయ యువత 60వ స్థానంలో ఉండి, తక్కువ పనితీరును కనబరిచినట్టు వెల్లడైంది. ఈ విషయంలో ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. అంటే, మన దేశ యువత మానసిక ఆరోగ్య సమస్యల ముఖచిత్రం ఇప్పుడు చిన్నవయసుకే చేరిపోయిందన్నమాట.వరల్డ్ మెంటల్ హెల్త్ పరిశోధనలో భారతదేశంలోని యువత ఎం.హెచ్.క్యూ స్కోరు సుమారు 33గా ఉంది. ఇది ‘బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్న’ వర్గం కిందకు వస్తుంది. దీని వల్ల 18–34 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో దాదాపు 64 శాతం మంది ఇంకా కుటుంబాలపై ఆధారపడుతున్నట్టుగానే తెలిసింది. సాధారణంగానే ఇటీవలి కాలంలో పదమూడు, పద్నాలుగేళ్ల లోపు వయసు నుంచే మానసిక సమస్యలు మొదలవుతున్నాయి. ఇక 25 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ సమస్యలు 62 శాతానికి పెరుగుతున్నాయి. వీరిలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, మత్తు పదార్థాలపై ఆధారపడటం.. వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిని త్వరగా గుర్తించకపోతే తాత్కాలిక సమస్యలుగా ఉండాల్సినవి, జీవితాంతం వెంటాడే పెను భారంగా మారిపోతాయి.మానసిక ఒత్తిడిఈ రోజుల్లో యువత డబ్బును సంపాదించడంలోనూ, విచ్చలవిడిగా ఖర్చు చేయడంలోనూ ఇండిపెండెంట్గా ఉంటున్నారని అనుకుంటారు. కానీ, మానసికంగా, భావోద్వేగ పరంగా ఇతరులపై ఆధారపడుతున్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ ప్రపంచం, గ్లోబల్ పోటీ వల్ల విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కానీ అదే సమయంలో అవన్నీ మనసుపై ఒత్తిడిని కూడా పెంచుతున్నాయి. దీని వల్ల 20–25 ఏళ్ల వయస్సులోనే బర్నౌట్, క్లినికల్ డిప్రెషన్ కేసులు కనిపిస్తున్నాయి అంటున్నారు సైకియాట్రిస్టులు.సామాజిక ఒత్తిడిఈ రోజులు ఎలా ఉంటున్నాయంటే చిన్న వయస్సులోనే ‘పనితీరును అద్భుతంగా ప్రదర్శించాలి’ అనే ఒత్తిడి మొదలవుతోంది. పిల్లల్లో వారి మైండ్ పూర్తిగా ఎదగకముందే ‘కంపారిజన్’ అనే భారం పడుతోంది. ఒక దశలో చదువుల ఒత్తిడి, మరొక దశలో ఉద్యోగ అనిశ్చితి, వివిధ రకాల ప్రతిభ, డిజిటల్ స్మార్ట్.. రోజువారీ స్ట్రెస్గా మారిపోయాయి. అన్నీ సాధించేయాలనే తపన కూడా మైండ్ను ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు. డిజిటల్ అడిక్షన్ – కంపారిజన్ ట్రాప్సోషల్ మీడియాలో అందరి జీవితాలు ‘పర్ఫెక్ట్’గా కనిపిస్తాయి. అవి నిజం కాకపోయినా మనలో మనకే తక్కువవాళ్లమనే భావనను పెంచుతాయి. తెలిసినవారి, పరిచయస్తుల సోషల్మీడియా పర్ఫెక్ట్ ఫొటోలు చూసి పోల్చుకోవడం పెరిగింది. ‘నేను అంతగా బాగోలేను, నేనేమీ చేయలేను’ అనే భావనలో సెల్ఫ్–ఎస్టీమ్, సోషల్ ఐసోలేషన్... వంటివి పెరుగుతున్నాయి.ఒంటరితనం సృష్టించిన వలయంఇప్పటి జనరేషన్ సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువగా కనెక్ట్ అయి ఉంది. కానీ, గాఢమైన, వాస్తవ సంబంధాలు మాత్రం తగ్గిపోయాయి. అదే ఒంటరితనానికి, డిప్రెషన్ కు ప్రధాన కారణంగా మారుతోంది. యువత ఈ విధంగా ఉండటం వల్ల దేశ భవిష్యత్తు ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. యువత ఆరోగ్యంగా, ఉత్పాదకంగా ఉంటేనే దేశం సర్వ సంపన్నంగా ఎదుగుతుంది. కానీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో 70–80 శాతం మందికి సరైన సమయంలో చికిత్స అందడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఒక తరం యువత తమ సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.నియంత్రణ తప్పనిసరి→ చాలా మానసిక సమస్యలు ముందే గుర్తించి, నిపుణులను సంప్రదించి, తగిన సూచనలు పాటిస్తే నియంత్రణలో ఉంటాయి.→ ఆలస్యమైతే సులభంగా నయం అయ్యే సమస్య జీవితాంతం ఉండే డిసేబిలిటీగా మారిపోతుంది.→ స్కూళ్లు, కాలేజీల్లో మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ తప్పనిసరి ఏర్పాటు చేయాలి. → నేటి తరాన్ని మన ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మెరుగైన ఫలితాలను పొందుతాం.చర్చించే స్వేచ్ఛ ఉండాలిమానసిక కుంగుబాటు, సమస్యలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. మన దేశంలో ఇప్పటికీ కొన్నిచోట్ల మానసిక సమస్య అంటే ‘సంకోచం’తో ఆగిపోతారు. ఇతరులతో పోటీ, పోలిక అనేవి ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే బాగా పెరిగాయి. అలా కాకుండా స్వీయ సమర్థతను వెలికి తీయగలగాలి. ఏ పని ఎంతవరకో హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. సమయ పాలన, పోషకాహారం, ఉత్సాహభరితమైన జీవనశైలి.. మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఎలాంటి సంకోచం లేకుండా మానసిక సమస్యలపై కుటుంబంలోనూ, సమాజంలోనూ చర్చించే స్వేచ్ఛ ఉండాలి. మానసిక ఆరోగ్యానికి సంబంధించి యువతకు అనుకూలమైన హెల్త్కేర్ సిస్టమ్ అవసరం.– డాక్టర్ మంజులారావు, క్లినికల్ సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
భారత్కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
న్యూఢిల్లీ: ఇరాన్ అనుమతితో హార్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’, ‘బీడబ్ల్యూ టీవైఆర్’వేగంగా భారత్ దిశగా కదులుతున్నాయి. భారతీయ జెండాతో వస్తున్న ఈ నౌకలు శనివారం హార్మూజ్ను దాటేసి ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’దిశగా ముందుకెళ్తున్నాయని నౌకల ట్రాకింగ్ సంస్థ శనివారం ప్రకటించిన విషయం తెల్సిందే. ‘బీడబ్ల్యూ టీవైఆర్’నౌక మార్చి 31వ తేదీకల్లా ముంబైకి చేరుకునే అవకాశముంది. ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’నౌక ఏప్రిల్ ఒకటో తేదీన న్యూ మంగళూరు పోర్ట్కు చేరుకునే ఆస్కారముందని భారత ప్రభుత్వ వర్గాలు ఆదివారం ప్రకటించాయి.ఈ రెండు నౌకలు 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్నాయి. ఈ నిల్వలు దేశ ఒక రోజు ఎల్పీజీ అవసరాలను తీరుస్తాయి. ఇప్పటికే నాలుగు భారత ఎల్పీజీ నౌకలు హార్మూజ్ను దాటి సురక్షితంగా ఇండియాకు చేరుకున్నాయి. మార్చి 16–17 తేదీల మధ్య ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు ఉమ్మడిగా 92,712 టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చాయి. మార్చి 26–28 తేదీల మధ్య పైన్ గ్యాస్, జగ్ వసంత్ నౌకలు 92,612 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చాయి.భారత 60 శాతం వంటగ్యాస్ అవసరాలను గల్ఫ్ దేశాలు తీరుస్తున్నాయి. గత ఏడాది భారత్లో 3.315 కోట్ల టన్నుల ఎల్పీజీని ప్రజలు వినియోగించారు. హార్మూజ్ గుండా ఇప్పుడు సరకు రవాణా నౌకల రాకపోకలు దాదాపు తగ్గిపోవడంతో భారత అవసరాలను కొంతమేరకు అమెరికా, అర్జెంటీనాలు తీరుస్తున్నాయి. 485 మంది నావికులతో భారతీయ జెండాతో 18 నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉన్నాయని భారత అధికారులు వెల్లడించారు. -
భారత్ నుంచి భారీగా ఇంధనం వచ్చింది: శ్రీలంక అధ్యక్షుడు
న్యూఢిల్లీ: ‘పశ్చిమాసియా’ సంక్షోభం వేళ భారత్ నుంచి 38,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని అందుకుంది శ్రీలంక. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాల్లో ఆటంకాలు కలిగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ తన ‘పొరుగు దేశాల పాలసీ’లో భాగంగా శ్రీలంకకు ఇంధనాన్ని పంపింది. దీంతో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే ఆదివారం (మార్చి 29) భారత్కు కృతజ్ఞతలు తెలిపారు.“పశ్చిమాసియా ఘర్షణ కారణంగా ఇంధన సరఫరాల విషయంలో శ్రీలంక ఎదుర్కొంటున్న ఆటంకాల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కొన్ని రోజుల క్రితం మాట్లాడాను. భారత్ త్వరితగతిన సాయం చేసింది.. కృతజ్ఞతలు. నిన్న 38,000 ఎంటీ ఇంధనం కొలంబోకు చేరింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కోఆర్డినేషన్కు కూడా ధన్యవాదాలు” అని దిస్సానాయకే ఎక్స్లో పేర్కొన్నారు.ఈ వారం ప్రారంభంలో, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభంపై దిస్సానాయకేతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. “భారత్-శ్రీలంక ఇంధన సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ భద్రతను పెంచే కీలక కార్యక్రమాల పురోగతిని సమీక్షించాం. సన్నిహిత, విశ్వసనీయ భాగస్వాములుగా ఇరుదేశాలు సవాళ్లను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయాలన్న స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని నిర్ణయించాం” అని మోదీ ఎక్స్లో తెలిపారు. కాగా, ఈ 38,000 మెట్రిక్ టన్నుల్లో 20,000 ఎంటీ డీజిల్.. 18,000 ఎంటీ పెట్రోల్ ఉన్నాయి.మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్లో పాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రుల భేటీ అయ్యారు. ఇరాన్ యుద్ధంపై వారు చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్యవర్తులుగా ఈ నాలుగు దేశాలు ఉన్నాయి. యుద్ధం మరింత విస్తరించకుండా ఆపడం ప్రధాన లక్ష్యం. Spoke with PM @narendramodi a few days ago about the fuel supply disruptions Sri Lanka is facing due to the Middle East conflict. Grateful for India’s swift support. 38,000 MT of fuel arrived in Colombo yesterday. My thanks also to EAM @DrSJaishankar for his close coordination.— Anura Kumara Dissanayake (@anuradisanayake) March 29, 2026 -
ఎగుమతులు షురూ.. 75 దేశాలకు సెమాగ్లూటైడ్!
మధుమేహం, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ జనరిక్ వెర్షన్ల ఎగుమతులను ప్రారంభించినట్లు హెటిరో వెల్లడించింది. ట్రూగ్లిక్స్, రోల్మోడల్, మోటో జీ బ్రాండ్ల పేరుతో వీటిని విక్రయించనున్నట్లు వివరించింది. ఇవి డిస్పోజబుల్ పెన్ డివైజ్ల రూపంలో 0.25 ఎంజీ నుంచి 2.4 ఎంజీ వరకు వివిధ డోసేజీల్లో లభిస్తాయి.75 పైగా దేశాలకు దశలవారీగా వీటిని ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ముందుగా ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియా దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది. నియంత్రణ సంస్థ సీడీఎస్సీవో అనుమతులు వచ్చాక దేశీయంగా కూడా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. వర్ధమాన మార్కెట్లలో అందుబాటు ధరలో నాణ్యమైన జనరిక్ సెమాగ్లూటైడ్ని అందించాలనేది తమ లక్ష్యమని హెటిరో ఎండీ వంశీకృష్ణ బండి తెలిపారు. -
బిగ్ షాక్.. భారత్లో ఆ బ్యాంక్ పూర్తిగా క్లోజ్!
భారతదేశంలో పదేళ్లకు పైగా తన కార్యకలాపాలను సాగించిన దోహా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. కటార్లోని దోహా బ్యాంక్ తన భారత్లోని రెండు శాఖలను మూసివేయాలని నిర్ణయించింది. కాగా ఇకపై కేవలం ఒక ప్రతినిధి కార్యాలయాన్ని మాత్రమే కొనసాగించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.దోహా బ్యాంక్ భారతదేశంలో తన కార్యకలాపాలను జూన్ 2014 లో ప్రారంభించింది. మొదటి శాఖ ముంబైలో, తరువాత కొచ్చిలో రెండవ శాఖ ప్రారంభించింది. ఆ తరువాత 2016లో ఈ బ్యాంక్ భారతీయ మార్కెట్లో వృద్ధి చెందుతున్న ఆర్థిక పరిస్థితులను ఉపయోగించుకుని, గల్ఫ్ దేశం, భారతదేశం మధ్య రిమిటెన్స్ (ప్యారమిటెన్స్) అవకాశాలను లబ్ధిపరచడానికి ఇండియాలో సబ్సిడియరీ స్థాపించేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తుందని వార్తలు వచ్చాయి.ఇప్పుడు దోహా బ్యాంక్ వ్యూహం మార్పుతో.. భారతదేశంలో ప్రత్యక్ష కార్యకలాపాలను తగ్గిస్తూ, ప్రతినిధి కార్యాలయం ద్వారా మాత్రమే తన ఉనికిని కొనసాగించనున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బులు జమ చేసుకోవడం విత్డ్రా చేయడం వంటివి ఇకపై ఉండదు. అయితే ఇది ఖతార్లోని ప్రధాన బ్యాంకుకు, భారతీయ కస్టమర్లకు మధ్య ఒక వారధిలా మాత్రమే పనిచేస్తుంది. అంటే వ్యాపార అవకాశాలను వెతకడం, దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం వంటి పనులకు మాత్రమే ఇది పరిమితమై ఉంటుందన్నమాట.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు' -
సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..
-
భారత ఆర్మీ చేతికి ప్రహార్
గ్వాలియర్: రక్షణరంగ ప్రైవేట్ సంస్థ ‘అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్’తయారుచేసిన తేలికపాటి మెషీన్ గన్(ఎల్ఎంజీ) ‘ప్రహార్’తొలిసారిగా భారత సైన్యం చేతికొచ్చింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయంగా ఈ గన్లను తయారుచేశారు. గ్వాలియర్లోని ఆయుధ కర్మాగారంలో తొలి దఫాలో తయారుచేసిన 2,000 మెషీన్ గన్లను ఆర్మీకి అందజేశారు. శనివారం గ్వాలియర్లో జరిగిన ఈ ఆయుధాల బదిలీ కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖలో ఆయుధాల సమీకరణ విభాగ డైరెక్టర్ జనరల్ ఏ అన్బరసు, అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సీఈఓ ఆశిష్ రాజ్వంశీ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.7.62 ఎంఎం కాలిబర్(బుల్లెట్) సామర్థ్యంతో ఈ తేలికపాటి మెషీన్గన్లను తయారుచేశారు. దీని బ్యారెల్ పొడవు 508 మిల్లీమీటర్లు. బరువు 8 కేజీలు. గన్ మొత్తం పొడవు 1.1 మీటర్. ‘‘గరిష్టంగా ఒక కిలోమీటర్ దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో గురిపెట్టి కాల్చవచ్చు. ఈ గన్ల తయారీకి బిడ్డింగ్, అమనుతులు, ఫ్యాక్టరీ నిర్మాణం ఇలా మొత్తంగా ఆరేళ్ల ప్రయాణం పూర్తయింది. గడువు కన్నా 11 నెలల ముందుగానే తొలి బ్యాచ్ గన్లను తయారుచేసి ఇస్తున్నాం. మొత్తంగా 40,000 గన్లను షెడ్యూల్లోపు ఇచ్చేస్తాం’’అని అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సీఈఓ ఆశిష్ రాజ్వంశీ చెప్పారు. -
బయోఎకానమీ బూమ్...!
న్యూఢిల్లీ: భారతీయ బయోఎకానమీ విలువ గణనీయంగా పెరుగుతోంది. బయోటెక్నాలజీ ఆధారిత రంగాల్లో వేగవంతమైన అభివృద్ధితో దేశీయ ‘బయోఎకానమీ విలువ 2025లో 195 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది (2024) విలువ 166 బిలియన్ డాలర్లతో పోలిస్తే 18 శాతం వృద్ధి చెందింది. బయోటెక్ రంగాన్ని బలోపేతం చేయడానికి పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ‘బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్’ (బీఐఆర్ఏసీ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విస్తరిస్తున్న బయోఎకానమీ పరిధి: ఒకప్పుడు ‘బయోఎకానమీ’ అనేది బయోఫార్మా, బయోఇండ్రస్టియల్ వంటి రంగాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. ప్రస్తుతం దీని పరిధి పెరిగింది. బయోఫ్యూయల్స్, ఎంజైమ్ సొల్యూషన్స్, డిజిటల్ బయాలజీ ప్లాట్ఫారŠమ్స్, కాంట్రాక్ట్ రీసెర్చ్, బయోలాజిక్స్ తయారీ, వ్యవసాయ బయో ఇన్పుట్స్ వంటి విభాగాలకు విస్తరించింది. దీంతో బయోఎకానమీ విస్తృత పారిశ్రామిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలుస్తోంది. వృద్ధికి ప్రధాన కారణాలు: బయోఎకానమీ వృద్ధికి నాలుగు ప్రధాన కారణాలున్నాయి. ⇒ పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం అమలు వల్ల ఇంధన దిగుమతులు తగ్గడం ⇒ జీఎల్పీ–1 ఔషధాల వినియోగం పెరగడం ⇒ పరిశ్రమల్లో ఎంజైమ్స్, సూక్ష్మజీవాల ఆధారిత బయోసొల్యూషన్స్ వినియోగం పెరగడం... ⇒ మూడు లక్షలకు పైగా భారతీయ నిపుణులకు ఉపాధి కల్పిస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణ ఈ అంశాలన్నీ బయోఎకానమీ విస్తరించేందుకు ప్రధాన కారకాలుగా నిలిచాయి. ఈ పరిణామాల వల్ల 2025లో బయోఎకానమీకి అదనంగా 29.6 బిలియన్ డాలర్ల విలువ చేకూరింది. గడిచిన కొన్నేళ్లలో ఇదే అత్యధిక వృద్ధి రేటుగా నిలిచింది. కీలకంగా బీఐఆర్ఏసీ పాత్ర బీఐఆర్ఏసీ గ్రాంట్ ఫండింగ్, ఈక్విటీ సపోర్ట్, మెంటరింగ్, భాగస్వామ్యాల ద్వారా బయోఫార్మా, మెడ్టెక్, అగ్రి బయోటెక్, హెల్త్టెక్, ఇండ్రస్టియల్ బయోటెక్, క్లీన్టెక్ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.7,000 కోట్ల పెట్టుబడులను ప్రోత్సహించింది. 900కిపైగా ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడింది. దాదాపు 35,000కు పైగా నైపుణ్య ఉద్యోగాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది.2030 నాటికి బయోఎకానమీని 300 బిలియన్ డాలర్లకు, 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ‘‘గత 14 ఏళ్లలో బీఐఆర్ఏసీ భారత బయోటెక్నాలజీ రంగాన్ని ఆవిష్కరణల ఆధారిత శక్తివంతమైన వ్యవస్థగా మార్చింది. స్టార్టప్స్, సంస్థలలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ వందలాది ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడింది,’’ అని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రాజేష్ ఎస్ గోఖలే తెలిపారు. -
సవాల్కు ప్రజ్ఞానంద సిద్ధం
పఫోస్ (సైప్రస్): ప్రపంచ చాంపియన్ను ఢీకొట్టే అర్హత కోసం భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ‘ఫిడే’ క్యాండిడేట్స్ టోర్నమెంట్లో బరిలోకి దిగుతున్నాడు. ఎనిమిది మంది ఎలైట్ గ్రాండ్మాస్టర్లు తలపడే ఓపెన్ కేటగిరీలో అతను సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. భారత్ తరఫున తమిళనాడు గ్రాండ్మాస్టర్ మాత్రమే బరిలో ఉండగా... 8 మంది డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు సై అంటున్నారు. ప్రతి ఆటగాడు మిగతా ఏడు మంది ప్రత్యర్థులను రెండేసి సార్లు ఢీకొంటాడు. ఇందులో అగ్ర స్థానంలో నిలిచిన ఆటగాడే చివరకు ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్తో టైటిల్ కోసం పోటీపడతాడు. ఈ ఏడాది చివర్లో ప్రపంచ చాంపియన్షిప్ సమరం జరుగుతుంది. ప్రస్తుత క్యాండిడేట్స్ టోర్నమెంట్లో అమెరికన్ స్టార్లు ఫేబియానో కరువాన, హికరు నకముర, డచ్ గ్రాండ్మాస్టర్ అనిశ్ గిరి, వే యి (చైనా), జావొఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), అండ్రీ ఎసిపెంకో (రష్యా), మథియస్ బ్లూబామ్ (జర్మనీ)లు చాంపియన్ గుకేశ్ను ఢీకొట్టే వేటలో ఉన్నారు. ఇటీవలి టోర్నీల ఫలితాలు, ఫామ్ దృష్ట్యా అమెరికన్ గ్రాండ్మాస్టర్ ఫేబియానో కరువాన క్యాండిడేట్స్లో ఫేవరెట్గా కనిపిస్తున్నాడు. దీంతో భారత ఆటగాడు ప్రజ్ఞానందకు కఠిన సవాళ్లు తప్పవు. బరిలోకి ప్రపంచ శ్రేణి గ్రాండ్మాస్టర్లు ఉండటంతో దీనికి తగినట్లుగానే తమిళ గ్రాండ్మాస్టర్ సన్నద్ధమయ్యాడు. ప్రత్యేకించి క్యాండిడేట్స్ ఈవెంట్ కోసం మరే ఇతర టోర్నీలవైపు కన్నెత్తి చూడలేదు. తన కోచింగ్ బృందం, సాంకేతిక నిపుణులతో కలిసి క్యాండిడేట్స్లో ఎదురయ్యే ప్రత్యర్థుల ఎత్తుగడ్డలపైనే దృష్టిసారించాడు. కరువాన ఫేవరెట్ అయితే ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ సిందరోవ్ డార్క్హార్స్గా బరిలోకి దిగుతున్నాడు. గతేడాది గోవాలో జరిగే చెస్ వరల్డ్ కప్లో విజేతగా నిలిచి అందరి కంటా పడిన ఈ యువ సంచలనం ఇదే జోరును ఇక్కడా కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నాడు. మహిళల విభాగంలో రెండు సార్లు ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ అయిన తెలుగుతేజం, వెటరన్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ఫేవరెట్గా దిగాల్సివున్నా... చివరి నిమిషంలో ఆమె టోర్నీ నుంచి తప్పుకుంది. పశ్చిమాసియా పరిస్థితులే తను వైదొలగడానికి కారణమని, భయంతో ఆడలేనని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఆమె స్థానాన్ని నార్వే చెస్ టోర్నీ విజేత అన్న ముజిచుక్ (ఉక్రెయిన్)కు కేటాయించారు. హంపి లేకపోయినా భారత ఆశల పల్లకిని మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్ముఖ్, ఆర్. వైశాలి మోస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి టోర్నీ ఆరం¿ోత్సవ వేడుక జరిగింది. ఇందులో ప్లేయర్ల పరిచయ కార్యక్రమం, ర్యాంకింగ్ (ఎలో రేటింగ్), క్యాండిడేట్స్కు అర్హత సాధించిన వైనం వివరించారు. ఆదివారం నుంచి తొలిరౌండ్ పోటీలు జరుగుతాయి.‘క్యాండిడేట్స్’ కహానీ... టోర్నీ మొత్తం ప్రైజ్మనీ: 1 మిలియన్ డాలర్లు (రూ. 9.49 కోట్లు) ఓపెన్ కేటగిరీ: 7,00,000 డాలర్లు (రూ. 6.65 కోట్లు) మహిళల విభాగం: 3,00,000 డాలర్లు (రూ. 2.85 కోట్లు) -
సూపర్ ‘పవర్గేమ్’లో భారత్ డైలమా!
డామిట్, కథ అడ్డం తిరిగింది. ట్రంపూ, నెతన్యాహూ కలిసి రాసుకున్న స్క్రిప్టులో లేని సన్నివేశం ఎదురైంది. ఈ యాంటీ క్లైమాక్స్ వాళ్లు ఊహించింది కాకపోవచ్చు. వ్యూహం ప్రకారమే దాడులు జరిగిన తొలిరోజున ఇరాన్ ఆధ్యాత్మిక అధినేత అలీ ఖమేనీని హతం చేశారు. ఈ దెబ్బకు ఇరాన్ జావకారిపోయి ఉండాలి. మత పాలనను వ్యతిరేకించే ఇరాన్ ప్రజలు లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ట్రంపు మహాశయునికి జైకొట్టి ఉండాలి. మహా అయితే నాలుగు రోజుల్లో ఇరాన్ సర్కార్ను పీక పట్టుకొని మోకాళ్ల మీద కూర్చోబెట్టి అవమానకరమైన షరతుల మీద సంతకం పెట్టించి ఉండాలి. ఇదీ వ్యూహం. నాలుగు రోజులు కాదు. నాలుగు వారాలు గడిచిపోయాయి. ఏమైంది?హార్మూజ్ అనే ఒక సముద్రపు ఇరుకు సందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పీకను దొరకబుచ్చుకొని దాని కణత మీద తుపాకీ గురిపెట్టి కూర్చున్న ఇరాన్ దృశ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపి స్తున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా ఇరాన్ మీద ఆర్థిక ఆంక్ష లను అమెరికా అమలు చేస్తున్నది. దాని చమురు అమ్మకాలను నిషేధించింది. తాజా పరిణామాలతో, చమురు నౌకల రవా ణాకు ఆటంకాలను తొలగించాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ఇరాన్ కూడా అమ్ముకోవచ్చంటూ తాత్కాలిక ‘అనుమతి’ని ప్రసాదించింది. ఇదేమీ ట్రంప్ ‘కరుణ’ కాదు, కాళ్ల బేరమని అర్థమవుతూనే ఉన్నది. ఇరాన్పై యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంపై ప్రపంచ దేశాలు తనను వేలెత్తి చూపకుండా ఓ నెలరోజుల సడలింపును ఆయన ప్రకటించారు. గతంలో చాటుమాటుగా చైనాకు చమురు సరఫరా చేసి, దాన్నుంచి వస్తు–సేవలను పొందుతున్న ఇరాన్ ఇప్పుడు రైట్ రాయల్గా రోజుకు 140 మిలియన్ డాలర్ల విలువైన చమురు అమ్మకాలను ప్రారంభించింది. దాడుల్లో ఇరాన్కు జరిగిన ఆస్తి నష్టంపై స్పష్టమైన అంచనాలు ఇంకా రాలేదు గానీ, చమురు విక్రయం ద్వారా బహిరంగంగా రోజుకు సుమారు 1400 కోట్ల రూపాయలను (ఇండియన్ కరెన్సీలో) ఇరాన్ ఆర్జిస్తున్నది. అమె రికా మాత్రం చేతి చమురును బాగానే వదిలించుకుంటున్నదని ఆ దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు సగటున ఒకటిన్నర బిలియన్ డాలర్ల చొప్పున యుద్ధ జ్వాలలకు అమెరికా ఆహుతిస్తున్నదని లెక్కలు తేలుతున్నాయి. మొదటి మూడు వారాల్లో 30 బిలియన్ డాలర్లను అర్పించు కోవలసి వచ్చింది. ఇరాన్ దాడుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అమె రికా సైనిక స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయి. వాటి పున రుద్ధరణ పేరుతో ఇంకో 200 బిలియన్ డాలర్లను కేటాయించాలని అమెరికా కాంగ్రెస్ను పెంటగన్ (రక్షణ శాఖ కేంద్రం) కోరుతున్నది.పెంటగన్ అభ్యర్థనపై ప్రతిపక్ష డెమోక్రాట్లే కాదు, కొందరు పాలక రిపబ్లికన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా ప్రజల జీవన ప్రమాణాలను ఫణంగా పెట్టి ఏం సాధించాలని ఇరాన్ యుద్ధంలో ఇంత పెద్దమొత్తంలో తగలేస్తున్నారని వారు ట్రంప్ సర్కార్ను నిగ్గదీస్తున్నారు. ఇప్పటికే 39 ట్రిలియన్ డాలర్ల అప్పులతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ నిరర్థక యుద్ధ ఖర్చు మోయలేని భారాన్ని మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్పై హఠాత్తుగా ఇజ్రాయె ల్తో కలిసి దాడులకు తెగబడటానికి స్పష్టమైన కారణాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పలేకపోయింది. అణ్వస్త్ర బూచీ అనే అరిగిపోయిన రికార్డునే అది ఇప్పటికీ ప్లే చేస్తున్నది.ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం ఆరోపణలపై ఇప్పటికే అంత ర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఏఐఈఏ) అక్కడ తనిఖీలు చేసింది. అణ్వాయుధాలను తయారుచేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్న దనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసీ స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ అమెరికాకు, ఇజ్రాయెల్కు మాత్రం ఇరాన్ అణుబూచీ కనిపి స్తూనే ఉన్నది. ఇరాన్ను నిర్వీర్యం చేస్తే పశ్చిమాసియాలో పెత్తనం చేసే అవకాశం ఇజ్రాయెల్కు లభిస్తుంది. ఇరాన్ దన్నుతో ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా తయారైన టెర్రరిస్టు గ్రూపులు హెజ్బుల్లా (లెబనాన్), హూతీ (యెమెన్), హమాస్ (పాలస్తీనా)లు కూడా తోక ముడుస్తాయి. ఇదీ ఇజ్రాయెల్ ఆలోచన. మరి అమెరికాకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి?1979లో జరిగిన ఇస్లామిక్ రివల్యూషన్లో పదవీ చ్యుతుడైన రాజు రెజా పహ్లవీ. ఆయన అమెరికా కీలుబొమ్మ. ఆ కాలంలో ఇరాన్ నుంచి కారుచౌకగా అమెరికా చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడింకో కీలుబొమ్మను కూర్చోబెడితే మళ్లీ ఆ అవకాశం ఉండొచ్చు. కానీ, యుద్ధానికి అదేమంత పెద్ద కారణం కాదు. అమెరికా ఇంధన భద్రతకు అంత ప్రమాదమేమీ లేదు. పైగా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెను జువేలా దేశం అమెరికాకు కూతవేటు దూరంలోనే ఉన్నది. దాని అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని కిడ్నాప్ చేసి ఆ దేశాన్ని అమెరికా తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నది. వెనుజువేలా కూడా ఇరాన్లాగే చైనాకు మిత్రదేశం కావడం ఇక్కడ గమనార్హం.భారత్ లాగే చైనా కూడా ఇంధన భద్రత గల దేశం కాదు. పైగా దాని ఇంధనావసరాలు చాలా ఎక్కువ. వెనుజువేలా, ఇరాన్ దేశాలు అమెరికా ఆంక్షల నేపథ్యంలో మలేసియా, రష్యా వంటి దేశాల ద్వారా క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేసి చైనాకు పంపి స్తాయి. చైనాకు ప్రధాన చమురు సరఫరాదారైన రష్యా కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నదే కావడం విశేషం. ప్రపంచ చమురు రవాణాలో ఇరవై శాతానికి పైగా సాగే హార్మూజ్ జలసంధిని యుద్ధ నేపథ్యంలో ఇరాన్ తన పూర్తి నియంత్రణలోకి తీసుకున్నది. అక్కడి నుంచి చమురు రవాణా చేసే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఒక లీక్ను ఇరాన్ వదిలింది. అంతేకాదు, ఆ ఫీజు అమెరికా డాలర్లలో కాకుండా చైనా యువాన్లలో వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే ట్రంప్ ఐదు రోజుల దాడుల విరామాన్ని ప్రకటించాడు. దాన్ని తర్వాత ఏప్రిల్ 6 దాకా పొడిగించాడు. ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగలేదు.డాలర్కు సవాల్ ఎదురైతే అమెరికా తట్టుకోలేదు. అందు లోనూ డాలర్ ఆధిపత్యానికి ఊపిరిపోసిన చమురు రంగంలో పోటీ ఎదురైతే చేటుకాలం దాపురించినట్టే. యాభయ్యేళ్ల కింద చమురు ఎగుమతి చేసే గల్ఫ్ దేశాల రక్షణ బాధ్యతను అమెరికా తీసుకున్నది. ప్రతిగా చమురు కొనుగోలు చేసే దేశాలు అందుకు చెల్లించాల్సిన సొమ్మును అమెరికా డాలర్లలో చెల్లించాలి. ఇంధన అవసరాలు అన్ని దేశాలకూ ఉంటాయి కనుక డాలర్ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నుంచి వెనక్కు తగ్గి అమె రికా తోక ముడిస్తే, ఇరాన్ దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న అరబ్ దేశాల రక్షణ బాధ్యత నుంచి అమెరికా వైదొలగి నట్టవుతుంది. అప్పుడు చమురు అమ్మకాన్ని డాలర్లలోనే కొనసాగించవలసిన అవసరం ఈ దేశాలకు ఉండదు. యువాన్, రూబుల్, యెన్ దేన్నయినా వాళ్లు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిణామం సంభవిస్తే అమెరికా శిరస్సు మీద నుంచి అగ్రరాజ్యం అనే కిరీటం ఊడి కిందపడ్డట్టే!విరామం తాత్కాలికమే. ఇరాన్ పూర్తిగా లొంగిపోయి, తమ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించే దాకా దాడులు చేయాలని అమెరికా తొలుత భావించింది. అలా జరగాలంటే ఇరాన్ గడ్డమీద తన సేనలను దించాల్సి ఉంటుంది. ఇరాన్ భౌగోళిక స్వరూపం దృష్ట్యా దాంతో భూతల యుద్ధం సాధ్యం కాదని రక్షణ నిపుణులు చెబుతారు. ఉత్తర దక్షిణ సరిహద్దుల్లో సహజమైన కోట గోడగా ఉన్న పర్వత శ్రేణులే ఇందుకు కారణం. మధ్యేమార్గంగా ఇరాన్ చమురు నిల్వచేసే ఖార్గ్ దీవినో, పర్షియన్ గల్ఫ్లో ఉన్న దీవుల్లో మరోదాన్నో ఆక్రమించాలని అమెరికా భావిస్తున్నది. ఆ దీవి ద్వారా హార్మూజ్ నుంచి చమురు కంటెయినర్లు సజావుగా వెళ్లేలా పర్యవేక్షించి యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించుకోవాలని భావిస్తున్నది.పర్షియన్ గల్ఫ్ దీవుల ఆక్రమణ కూడా అమెరికా – ఇజ్రాయెల్ ఊహిస్తున్నంత సులభం కాదు. ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటననే ఎదుర్కోవలసి ఉంటుంది. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్షియా దీవులపైకే క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ పట్టుమని పది కిలోమీటర్ల దూరం లేని దీవుల్లో అమెరికా సైన్యం దిగితే మిన్నకుంటుందా? పర్షియల్ గల్ఫ్లో పెనుమంటలు చెలరేగవచ్చు. దుబాయ్, అబుధాబీ, దోహా, రియాద్ నగరాల వైభవోజ్వల కాంతులు మసక బారవచ్చు. అన్నిటినీ మించి ప్రపంచ ఆర్థిక గమనం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనుకావచ్చు. మన దేశం సంగతి సరేసరి. ఇరాన్ మన దేశం పట్ల కొంత ఉదారంగా ఉన్నప్పటికీ నాలుగు వారాల ఘర్షణే దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతున్నది. ఈ ఘర్షణ వారాల్లోంచి నెలల్లోకి మారితే తీవ్ర సంక్షో భాన్ని చవిచూడవలసి రావచ్చు. మన రాజకీయ నాయకత్వ దీక్షా దక్షతలకు, ప్రజా సమూహాల సమైక్యతకు ఇది పరీక్షా కాలం.ప్రపంచాన్ని ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఈ అంతర్జాతీయ పరిణామాల్లో ఒక ప్రముఖ దేశంగా, అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న భారత్ పోషించవలసిన పాత్ర ఏమిటన్నది కూడా చర్చించుకోవలసిన సందర్భం. తన సూపర్ పవర్ హోదాను, తన ఆధిపత్యంలోని ఏకధ్రువ ప్రపంచ గమనాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఆర్థికంగా – సాంకేతిక పరంగా అనూహ్యమైన ప్రగతిని సాధించిన చైనా ఈ తరహా ప్రపంచ గమనపు దిశను మార్చాలని సహజంగానే భావిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తొలిరోజు నుంచీ నేటి దాకా దాదాపు ఎనభయ్యేళ్ల శత్రుత్వం అమెరికా – రష్యాలది. నలభయ్యేళ్లుగా ఇరాన్ పట్ల అమెరికా అసహనంగా ఉన్నది. ఇజ్రాయెల్ అమెరికాకు అనుబంధ సంస్థ. పశ్చిమాసియాలో దాని బ్రాంచి ఆఫీసు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ తదితర చమురు ఎగుమతి దేశాలన్నీ అమెరికాకు మిత్రులుగానే మనుగడ సాగిస్తున్నాయి.ప్రస్తుత సంక్షోభంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ దేశాలన్నీ పాత్రధారులు. ఇరాన్తో సరిహద్దును పంచుకునే మరో ఇస్లామిక్ దేశం పాకిస్తాన్. అమెరికా తరఫున బ్రోకరేజి చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఈ దేశానికి సౌదీ అరేబియాతో ఈమధ్యనే ఒక రక్షణ ఒడంబడిక కుదిరింది. దాని ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా తన మీద దాడి జరిగినట్టే రెండో దేశం భావించి స్పందించాలి. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ ఎక్కుపెట్టిన దాడులు సౌదీ అరేబియాను కూడా వదల్లేదు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రాన్ని టార్గెట్ చేసి డ్రోన్ దాడులు చేసింది. అయినా పాకిస్తాన్ కిమ్మనలేదు. దీంతో పాక్ ప్రతాపమేమిటో తేలి పోయింది.రెండు శిబిరాలుగానో, మూడు శిబిరాలుగానో ప్రపంచ దేశాలు చీలిపోయి ఆ శిబిరాల తరఫున వకాల్తా పుచ్చుకునే రోజులు ఎప్పుడో గతించాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో జాతీయ ప్రయోజనాలే గీటురాయి. మన ప్రయో జనాలను కాపాడుకోవడానికి ఏకకాలంలో రెండు శత్రు దేశా లతో రెండు రకాల ఒడంబడికల్లో భాగస్వామిగా ఉండటం ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. గల్ఫ్ సంక్షోభంలో భాగస్తులుగా ఉన్న అమెరికా, ఇజ్రా యెల్, యూఏఈ దేశాలతోపాటు ఇండియా కూడా ఐ2యూ2 ఒప్పందంలో భాగస్వామి. ఇండియా మినహా మిగిలిన మూడు దేశాల మీద దాడులు చేస్తున్న ఇరాన్తో మనకు వేల సంవ త్సరాల సాంస్కృతిక బంధం ఉన్నది. భారత ప్రజల పట్ల స్నేహ పూర్వకంగా, భారత సంస్కృతిపై అభిమానపూర్వకంగా పర్షియన్లు ఉంటారనేది కూడా వాస్తవమే. ఇరాన్కు మిత్ర దేశంగా ఉండే రష్యాతో మనది కాలపరీక్షలో నిలబడి నిగ్గుదేలిన స్నేహం.ఈ పరిస్థితిలో మనం ఎవరి పక్షం వహించాలి? అమెరికా, గల్ఫ్ దేశాలు భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. కోటిమంది భారతీయులు గల్ఫ్లో, 50 లక్షలమంది అమెరికాలో జీవిస్తున్నారు. ఎన్నారైలు సాలీనా మాతృభూమికి పంపిస్తున్న పన్నెండు లక్షల కోట్ల రూపాయల్లో గల్ఫ్, అమెరికాలదే సింహ భాగం. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్కు ఈ విషయంలో నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్. రక్షణ, సాంకే తిక, వ్యవసాయ రంగాల్లో మనకు సహకరిస్తున్నది. కనుక భారత్ ఎవర్నీ దూరం చేసుకోలేదు. ఆచితూచి వ్యవహరించడంతోపాటు ఉద్రిక్తతల ఉపశమనానికి శక్తి మేరకు ప్రయత్నించడమే భారత్ ముందున్న మార్గం. మోదీ ప్రభుత్వం ఇదే దిశలో పయనిస్తున్నది. కనుకనే ఇప్పటిదాకా చమురు సంక్షోభాన్ని తట్టుకొని నిలబడగలిగింది.కాకపోతే తన స్థాయికి తగ్గట్టుగా కొన్ని విషయల్లోనైనా గొంతు విప్పాల్సిందనే అభిప్రాయం కూడా బలపడుతున్నది. అప్పుడే ప్రపంచ వేదికపై మనం నాయకత్వ స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి కవ్వింపు లేకుండా అమెరికా – ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సూత్ర ప్రాయంగానైనా భారత్ ఖండించి ఉండవలసింది. దాడుల్లో చనిపోయిన ఖమేనీకి సంతాపం ప్రకటించడంలో మీనమేషాలు లెక్కించకుండా ఉండవలసింది. ఇరాన్ పాఠశాల మీద దాడి చేసి 165 మంది విద్యార్థుల చావుకు కారణమైన అమెరికా చర్యను ఖండించి ఉండవలసింది. భారత్ ఆహ్వానం మేరకు వైజాగ్కు వచ్చి నౌకా విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న ఇరాన్ నౌకపై దాడి చేసి 150 మందిని హతం చేసిన అమెరికా చర్యను ఖండించి ఉండ వలసింది. అంతర్జాతీయ సంబంధాల్లో జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేయవలసిందే. దాంతోపాటు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా కూడా వ్యవహరించాలి. అప్పుడే విశ్వగురు హోదాకు అర్హత పొందగలం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎక్సైజ్ తగ్గినా ధరలు యథాతథం..!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడిపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ నగరంలో మాత్రం రిటైల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్ రూ.107.46, డీజిల్ రూ. 95.70 వద్ద స్థిరంగా కొనసాగాయి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించింది. తాజా తగ్గింపుతో పెట్రోల్పై కేంద్ర ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.13 నుంచి రూ. 3కి పడిపోయింది. డీజిల్పై రూ.10 సుంకాన్ని పూర్తిగా (సున్నాకు) తొలగించడం గమనార్హం. సాధారణంగా ఎక్సైజ్ సుంకం తగ్గితే వెంటనే పెట్రోల్ బంకుల్లో ధరలు తగ్గాలి. కానీ.. ధరలు స్థిరంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులు అంటున్నాయి ఆయిల్ కంపెనీలు. సామాన్యుడిపై భారం పడకుండా కేంద్రం నిర్ణయం ఉపశమనం కలిగించింది. 2021 నవంబర్లో పెట్రోల్పై రూ. 5, డీజిల్పై రూ. 10., 2022 మేలో పెట్రోల్పై రూ. 8, డీజిల్పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. -
‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. ఇజ్రాయెల్పైకి..
టెహ్రాన్: ‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. వాటిని ఇజ్రాయెల్పైకి వదిలింది ఇరాన్. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా ప్రెస్ టీవీతో పాటు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ పోస్ట్ చేశాయి. ప్రతీకార చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.ఇరాన్ ఏరోస్పేస్ ఫోర్స్ సిబ్బంది క్షిపణులపై బ్లూ మార్కర్లతో “భారత ప్రజలకు ధన్యవాదాలు” వంటి వాక్యాలు రాస్తున్నట్లు కనిపించింది. స్పెయిన్, పాకిస్థాన్, జర్మనీ ప్రజలకు కూడా థ్యాంక్స్ చెబుతూ ఇలాంటి సందేశాలే రాసినట్లు సమాచారం. ఇరాన్కు అనుకూలంగా ఉన్న దేశాలకు కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది.దీన్ని “ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4”లో భాగంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జరిపిన చర్యగా ఇరాన్ నెట్వర్క్ ప్రెస్ టీవీ తెలిపింది. పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక లక్ష్యాలపై దాడులు చేశామని ఐఆర్జీసీ తెలిపింది. ఇందులో అష్డోడ్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలు, మోడీన్ సమీపంలోని సైనిక స్థావరాలు, అమెరికా సైనిక సమాచార మార్పిడి కేంద్రం ఉన్నట్లు ప్రెస్ టీవీ తెలిపింది.అల్-ధఫ్రా, అల్-ఉదైరి ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలు, అలాగే అలీ అల్-సలేం ఎయిర్ బేస్, షేఖ్ ఈసా బేస్లపై దాడులు జరిగాయని పేర్కొంది. ఇరాన్, దీర్ఘ శ్రేణి, మధ్య శ్రేణి క్షిపణులు, డ్రోన్లను వినియోగించిందని, ఆపరేషన్ విజయవంతమైందని తెలిపింది.భారత్కు ఎందుకు థ్యాంక్స్ చెప్పారు?భారత్-ఇరాన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇరాన్ తాజాగా, వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధి ద్వారా భారత నౌకలకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో, అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భారత్ను స్నేహపూర్వక దేశంగా పేర్కొని, యుద్ధ పరిస్థితుల్లో కూడా భారత నౌకలను అడ్డుకోబోమని చెప్పారు.మరొక కారణం ఏంటంటే, భారత ప్రజల నుంచి ఇరాన్కు మానవతా సాయం అందింది. ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతం నుంచి. జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లోని ప్రజలు ఇరాన్కు సాయం అందించేందుకు విరాళాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. నగదు, ఆభరణాలు, గృహ సంబంధిత వస్తువులు వంటి సాయం అందించారు. ఒక కశ్మీరీ మహిళ తన భర్త జ్ఞాపకంగా దాదాపు 3 దశాబ్దాలుగా దాచుకున్న బంగారాన్ని ఇచ్చేసింది. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ చర్యలను గుర్తించి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సాయం ఎప్పటికీ మర్చిపోమని పేర్కొంది. Iran launches WAVE 83 missile AND drone attack on ‘Zionist soldiers’ — IRIBTHANK YOUS written on missiles in English to people across globe pic.twitter.com/wjjVietkAo— RT (@RT_com) March 26, 2026 -
సీఎంలతో ముగిసిన మోదీ సమావేశం
ఢిల్లీ: దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. సుమారు రెండున్నరగంటల పాటు చర్చలు కొనసాగాయి. పశ్చిమాసియా యుద్ధం వేళ ఇంధన సంక్షోభం, తదితర అంశాలపై చర్చించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఫర్టిలైజర్స్ సప్లైకి ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. దీనిలో భాగంగా పీఎం మోదీ మాట్లాడుతూ.. కలిసికట్టుగా పని చేస్తేనే పరిస్థితులను అధిగమించవచ్చన్నారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రాధాన్యమని, ప్రజాప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా అంతా పని చేయాలన్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేశామని, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించాలని సీఎంలకు సూచించారు. ఎరువుల నిల్వ, పంపిణీపై ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఎంలకు మోదీ ఆదేశించారు. PM Narendra Modi is chairing the meeting with CMs through video conferencing on the West Asia conflict to review preparedness and plans of states. pic.twitter.com/pqJS3iCgro— ANI (@ANI) March 27, 2026 -
రెండు నెలల దాకా నో ఫికర్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఇండియాలో భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఇంధనం విషయంలో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పంపుల వద్ద బారులు తీరుతున్నారు. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య ఎల్పీజీ సరఫరా తగ్గింది. హోటళ్లు మూతపడుతున్నాయి. ఇంధనం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో గందరగోళం మరింత పెరిగిపోతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నా వదంతులు మాత్రం ఆగడం లేదు. అందుకే ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరో రెండు నెలల దాకా మనకు ఢోకా లేదని భరోసా ఇచ్చింది. అలాగే 8 లక్షల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, దీంతో దేశమంతటా ఒక నెల మొత్తం గ్యాస్ అవసరాలు తీరుతాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఎంతమాత్రం లేదని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేయడం వల్ల జనం ఆందోళనకు గురై ఇంధనం కోసం ఎగబడ్డారని తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రభుత్వం మన దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వల వివరాలను బయటపెట్టడం ఇదే మొదటిసారి. ‘క్యాష్ అండ్ క్యారీ’వల్ల అంతరాయం నిజమే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పష్టంచేసింది. అవి సాధారణంగానే పని చేస్తున్నాయని, చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ వివరణ ఇచ్చింది. కొన్నిచోట్ల పరిమితంగానే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించింది. చమురు కంపెనీలు కొత్తగా అమలు చేస్తున్న ‘క్యాష్ అండ్ క్యారీ’విధానం వల్ల చిన్న పట్టణాల్లో కొంత అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనని అంగీకరించింది. నిధుల సమస్య కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో పంపుల యజమాన్యాలకు సహకరిస్తున్నట్లు పేర్కొంది. ఇంధనం, ఎల్పీజీ సరఫరా ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించింది. అన్ని రిటైల్ ఇంధన కేంద్రాల్లో తగినంత నిల్వలు ఉన్నాయని పునరుద్ఘాటించింది. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా దురుద్దేశపూర్వకంగా సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. 150కిపైగా దేశాల నుంచి దిగుమతి ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన నాలుగో దేశం భారత్. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో ఐదో స్థానంలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ముడి చమురు, గ్యాస్ దిగుమతులు సగానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా 150కిపైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. మనదేశంలో అన్ని రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని, రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు సరఫరాల ఒప్పందాలను భారతీయ చమురు కంపెనీలు ఇప్పటికే ఖరారు చేసుకున్నాయని స్పష్టంచేసింది. మన దగ్గర మొత్తం 74 రోజులకు సరిపడా ముడి చమురును, ఇంధనాన్ని నిల్వ చేసకొనే సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.ఇంధన ఎమర్జెన్సీకి ఆస్కారం లేదు ప్రపంచంలో ఎక్కడం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా సరే మన దగ్గర ప్రతి పౌరుడికి రెండు నెలలపాటు స్థిరంగా ఇంధనం సరఫరా చేయగలమని కేంద్రం తెలిపింది. రాబోయే కొన్ని నెలలపాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని వెల్లడించింది. ఎల్పీజీ విషయంలో దేశీయంగానే ఉత్పత్తిని పెంచుతున్నామని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నామని కేంద్రం స్పష్టంచేసింది. ఇంధనం, గ్యాస్పై తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొన్ని దేశాల్లో జాతీయ ఇంధన ఎమర్జెన్సీ విధించారని, సరఫరా తగ్గించారని, ధరలు పెంచారని.. మన దేశంలో అలాంటి పరిస్థితికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. -
భారత్ సహా 5 దేశాలకు హార్మూజ్లో గ్రీన్సిగ్నల్
టెహ్రాన్/న్యూఢిల్లీ: వాణిజ్య నౌకాయానానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకోవడానికి భారత్కు ఇరాన్ అనుమతి ఇచ్చింది. భారత్, చైనా, రష్యాతో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ‘మేం స్నేహపూర్వక దేశాలుగా భావించే కొన్ని దేశాలను హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించాం. చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్లను అనుమతించాం’అని అరాగ్చీ తెలిపారు. ఇరాన్ శత్రు నౌకలను మాత్రం ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘మనం యుద్ధంలో ఉన్నాం. ఈ ప్రాంతం కూడా ఒక యుద్ధ క్షేత్రం. మన శత్రువులు, వారి మిత్రుల నౌకలను దీని గుండా వెళ్ళడానికి అనుమతించాల్సిన అవసరం లేదు. కానీ ఇతరులకోసం ఇది తెరిచే ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఇరుకైన నౌకా మార్గం హార్మూజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు)లో సుమారు 20 శాతం రవాణా జరుగుతుంది. ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని దాదాపు మూసివేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దేశ ఇంధన కొనుగోళ్లకు పశ్చిమ ఆసియా ఒక ప్రధాన వనరుగా ఉంది. ఈ నౌకాయాన మార్గంపై దిగ్బంధనం కొనసాగితే, దేశంతో సహా అనేక దేశాల ఇంధన, ఎరువుల భద్రతపై తీవ్ర పరిణామాలు ఉంటాయని భావించింది. దీంతో జలసంధి గుండా ఇంధన ప్రవాహం నిరాటంకంగా సాగేలా చూడటంపై దృష్టి సారించిన భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేసింది. -
అమెరికా-ఇరాన్ యుద్ధం.. థరూర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల వేళ భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం పాకిస్తాన్ నాయకత్వం వహించడం భారత్కు ‘అవమానకరం’ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.భారత్కు దక్కిందేమిటి?ఫిబ్రవరి 28న ఇరాన్పై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఆపై సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్య ప్రాచ్యం అగ్నిగుండంగా మారింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన సంక్షోభం ముంచుకొస్తోంది. ఇలాంటి కీలక సమయంలో పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు దేశాలు శాంతి చర్చలకు చొరవ చూపుతుంటే, భారత్ వెనుకబడిపోవడంపై థరూర్ అసహనం వ్యక్తం చేశారు.‘ప్రధాని మోదీ ఎప్పుడూ చెప్పేవిధంగా.. భారత్ శాంతి దూతగా నిలుస్తుందని ఆశించి, ప్రభుత్వం వహిస్తున్న మౌనాన్ని సమర్థించాను. కానీ ఇప్పుడు క్రెడిట్ అంతా పాకిస్తాన్కు వెళ్తుంటే చూడటం బాధాకరం. ఇది మనందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ తనకున్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకోవడంలో విఫలమైందని విమర్శించారు.‘దళారీ దేశం కాదు’: జైశంకర్ కౌంటర్విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విపక్షాల విమర్శలకు అత్యంత ఘాటుగా స్పందించారు. ‘భారత్ ఏమీ దళారీ దేశం కాదు" అంటూ విపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. 1981 నుండి అమెరికా పాకిస్తాన్ను ఒక సాధనంగా వాడుకుంటూనే ఉందని, ఇందులో కొత్తేమీ లేదని ఎద్దేవా చేశారు. యుద్ధం వల్ల అన్ని పక్షాలు నష్టపోతున్నాయని, దీనిని త్వరగా ముగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్పష్టం చేశారని కేంద్రం వెల్లడించింది. ఇది కూడా చదవండి: పెట్రోల్కు ప్రత్యామ్నాయం.. జనం షాకింగ్ నిర్ణయం! -
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ .. భారత్లో వీటి ధరలు పెరగనున్నాయా?
ఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత ఔషధ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ (ఇండియా) వెల్ఫేర్ అసోసియేషన్ (DCOIWA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఔషధ ఉత్పత్తి, ఎగుమతి దేశాలలో ఒకటిగా ఉన్నందున అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలతో ముడిపడి ఉందని, గల్ఫ్ ప్రాంతంలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా మెడిసిన్ అ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతం కీలక రవాణా కేంద్రంగా ఉండటంతో, నౌకాయాన మార్గాల అంతరాయం, మధ్యవర్తి రసాయనాల సరఫరాను దెబ్బతీస్తోంది. రవాణా ఖర్చులు పెరగడం, సరుకు రాకలో ఆలస్యం తయారీదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. అల్యూమినియం ఫాయిల్స్, ప్లాస్టిక్ పాలిమర్స్, గ్లాస్ వైల్స్, రబ్బర్ స్టాపర్స్ వంటి ప్యాకేజింగ్ పదార్థాల కొరత, ధరల పెరుగుదల తయారీ ఖర్చులను పెంచుతున్నాయి.గల్ఫ్ దేశాలకు ఔషధ ఎగుమతులు రవాణా సమస్యలు, పోర్ట్ ట్రాఫిక్, బీమా సమస్యల కారణంగా ప్రభావితమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక ఔషధాల దిగుమతులు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఎగుమతిదారులు డిమాండ్ మార్పులు, చెల్లింపుల సమస్యలు, రవాణా ఆలస్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిగుమతిదారులు అధిక ఖర్చులు, అస్థిర సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశీయ వ్యాపారులు స్టాక్ కొరత, ధరల మార్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది వినియోగదారులకు ఔషధాల లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యాంటీబయోటిక్స్, గుండె సంబంధిత ఔషధాలు, మధుమేహ ఔషధాలలో మెడిసిన్ పని చేసేందుకు వినియోగించే రసాయనాలు (APIs) కొరత ఏర్పడే అవకాశం ఉందని, ప్యాకేజింగ్ పదార్థాల కొరత వల్ల ఉత్పత్తి తగ్గుదల, ప్రాణ రక్షక ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అసోసియేషన్ హెచ్చరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీఐ, కీలక ముడి పదార్థాల స్వదేశీ తయారీని ప్రోత్సహించాలి. అవసరమైన ఔషధాలు, ముడి పదార్థాల భద్రతా నిల్వలను ప్రభుత్వ స్థాయిలో నిర్వహించాలి. గల్ఫ్ ప్రాంతానికి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అభివృద్ధి చేయాలి. పోర్ట్ క్లియరెన్స్ వేగవంతం చేయడం, రవాణా, బీమా ఖర్చులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. ఔషధ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు నియంత్రణ సంస్థలు పర్యవేక్షణ చేయాలి. నియంత్రణ సంస్థలు, తయారీదారులు, పంపిణీదారుల మధ్య సమన్వయం పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితి మారుతూ ఉన్నప్పటికీ, ప్రభుత్వం, ఔషధ రంగానికి చెందిన అన్ని భాగస్వాములు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు అవసరమైన ఔషధాల సరఫరాను నిరంతరంగా కొనసాగించగలమని జి. కోటేశ్వరరావు స్పష్టం చేశారు. -
భారత్కు అండగా మరో దేశం.. పెద్ద కష్టం తీరినట్టే?
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అనేక దేశాలు ఇంధన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధి మూత పడటంతో పెను సంక్షోభం ఏర్పడింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంధన రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. దీంతో, చమురు సరఫరా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రభావం భారత్పై కూడా తీవ్రంగా పడింది.కాగా, భారత్ తన అవసరాల కోసం దాదాపు 90 శాతం గల్ఫ్ దేశాల నుంచే ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా భారత్కు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి మూత పడటంతో సమస్య తలెత్తింది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ మిత్రదేశమైన అర్జెంటీనా భారత్కు భారీ ఆఫర్ ఇచ్చింది. 2024 కంటే ముందు అర్జెంటీనా నుంచి భారత్కు గ్యాస్ సరఫరా అస్సలు ఉండేది కాదు. కానీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2025లో 22,000 టన్నుల దిగుమతులు జరగగా, 2026 తొలి మూడు నెలల్లోనే అది ఏకంగా 50,000 టన్నులకు చేరడం గమనార్హం. మార్చి 5న అదనంగా 11,000 టన్నులు గ్యాస్తో భారత్ చేరుకుంది.అయితే, అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండం చివరిలో ఉంది. భారత్, అర్జెంటీనా మధ్య దూరం సుమారు 20,000 కిలోమీటర్లు. అక్కడి నుంచి భారత్కు రవాణా చేయడం పెను సవాలుతో కూడుకుంది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత పొడవైన నౌకా మార్గం ఇది. రవాణా ఖర్చులు భారమైనప్పటికీ, దేశంలో గ్యాస్ కొరత రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా రాయబారి మారియానో అగస్టిన్ కౌసినో ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ దేశంలో అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని, భారత్కు దీర్ఘకాలం పాటు సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుతం భారత్ అర్జెంటీనాకు 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గ్యాస్తో పాటు సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, పప్పుధాన్యాలను కూడా మనం అక్కడి నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. -
విశ్వ వేదికపై మన విద్యాసంస్థలు
సాక్షి, అమరావతి: భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థలు అందించే కోర్సులకు ప్రపంచంలో టాప్ కోర్సులుగా గుర్తింపు లభించింది. బుధవారం ప్రకటించిన తాజా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ), బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) వివిధ సబ్జెక్టుల్లో ప్రపంచంలోని టాప్ –50 సంస్థల్లో స్థానం సంపాదించుకున్నాయి. యూనివర్సిటీ ర్యాంకింగ్స్కు పేరుగాంచిన లండన్కు చెందిన క్యూఎస్ క్వాక్వారెల్లి సైమండ్స్, సబ్జెక్ట్ వారీగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 16వ వార్షిక ఎడిషన్ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలలో 1,900 విశ్వవిద్యాలయాలు అందిస్తున్న 21 వేలకు పైగా అకడమిక్ ప్రోగ్రామ్స్, 55 విభాగాలు ఐదు విస్తృత అధ్యాపక ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటించారు. ఇందులో భారతదేశం నుంచి 27 సబ్జెక్టులు టాప్–50లో నిలిచాయి. ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ యూనివర్సిటీ మినరల్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్లో ప్రపంచ వ్యాప్తంగా 21వ స్థానంలో నిలిచింది. ఐఐఎం అహ్మదాబాద్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, మార్కెటింగ్ రెండు కోర్సుల్లోనూ 21వ స్థానంలో నిలిచింది. భారతదేశంలోని ఓ విద్యా సంస్థ మార్కెటింగ్ సబ్జెక్టులో గ్లోబల్ ర్యాంకింగ్ సాధించడం ఇదే తొలిసారి. టాప్–50లో ఐఐటీ ఢిల్లీ, బోంబే ఈ సంవత్సరం దేశంలోని విద్యా సంస్థలు టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా మన నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రపంచానికి చాటాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఘనతను చాటాయి. దేశంలోని టాప్ కోర్సులు అందించే సంస్థల్లో ఢిల్లీ–ఐఐటీ అత్యధికంగా 6 కోర్సులతో టాప్–50లో ముందుంది. ఇందులో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్ ఇంజినీరింగ్లో 36వ స్థానం, మెకానికల్, ఏరోనాటికల్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్లో 44వ స్థానం, సైన్స్ అండ్ టెక్నాలజీలో 45, కెమికల్ ఇంజినీరింగ్లో 48 స్థానంలో నిలిచాయి. మద్రాస్ ఐఐటీ పెట్రోలియం ఇంజినీరింగ్లో 29 ర్యాంకు సాధించగా, మినరల్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్లో ఐఐటీ ఖరగ్పూర్ 22వ ర్యాంకు, ఐఐటీ బోంబే 36వ ర్యాంకులు సాధించాయి. -
ఇరాన్ యుద్ధంలో ఇండియా వైఖరి
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో భారత వైఖరిపై దేశంలో అంత ర్గతంగా చర్చ జరుగుతున్నది. భారత్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లగా కన్పడుతున్నది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్తవగానే యుద్ధ భేరీలు మోగటం, భారత్కు సమీపంలోని హిందూ మహాసముద్రపు అంతర్జాతీయ జలాలలో భారత్ ఆతిథ్యం తరువాత తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమె రికా జలాంతర్గామి దాడి, యుద్ధం మొదటి రోజే అలీ ఖమేని హత్య భారత్ను ఇరకాటంలో పెట్టాయి. ఇరాన్ అధినేత మృతికి సంతాపం తెలియజేయటంలో ఆలస్యాన్ని కూడా విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. ఒక రకంగా ఇజ్రాయెల్–యూఎస్ శిబిరంలో భారత్ చేరినట్లేనని కూడా కొంతమంది వాదిస్తున్నారు.బహుళ అలీన విధానంప్రస్తుత ఇరాన్ యుద్ధంలో భారత్ ప్రతిస్పందనను భారత స్థూల విదేశాంగ నీతిలో భాగంగా చూడాల్సి ఉంటుంది. మన ప్రతి స్పందన ప్రధానంగా అయిదు అంశాలపై ఆధారపడి ఉన్నది: 1. దేశ ప్రయోజనాలు 2. ట్రంప్ ఫ్యాక్టర్ 3. ఇరాన్, యూఎస్ఏ, ఇజ్రా యెల్, రష్యా, చైనా, జీసీసీ, ఈయూ దేశాలతో భారత్ సంబంధాలు 4. ప్రాంతీయ, ప్రపంచ జియో పాలిటిక్స్లో భారత్ స్థానం 5. భారత్ బలాలు – బలహీనతలు.21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత యూఎస్ఏ నాయ కత్వంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. యూఎస్ఏ, యూరోపి యన్ దేశాలతో కూడిన నాటో కూటమి తూర్పు ఐరోపా, బాల్టిక్ ప్రాంతంలోనికి విస్తరించింది. సోవియట్ నుండి వేరుపడి స్వాతంత్య్రం పొందిన దేశాల లోనికి నాటో విస్తరించింది. పుతిన్ నాయకత్వంలో బలోపేతమైన రష్యా క్రమంగా నాటో విస్తరణను అడ్డు కోవటం మొదలుపెట్టింది. నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఇదే మూల కారణం. రష్యాతో పాటుగా చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి యూఎస్ఏ (డాలర్, సాయుధ) గుత్తాధిపత్యాన్ని సవాలు చేయటం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో విలువలు, సిద్ధాంతాలు, అలీన విధానం ఆధారంగా రూపుదిద్దుకున్న మన విదే శాంగ విధానానికి కాయకల్ప చికిత్స అనివార్యమయింది. దేశ ప్రయోజనాలు మాత్రమే కేంద్రకంగా వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ, బహుళ అలీన విధానం దిశగా మన విదేశాంగ విధానం పయనిస్తున్నది. ఎందుకు దగ్గర? ఎందుకు దూరం?ఇరాన్ యుద్ధంలో భారత్ వైఖరిని గతిశీలక అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ సమీకరణాల కోణం నుండి పరిశీలించాల్సి ఉంటుంది. ఇరాన్తో భారతదేశానికి చారిత్రకంగా సత్సంబంధా లున్నప్పటికీ, ఇరాన్ మత ఛాందస వ్యవస్థల చెప్పుచేతల్లో ఉన్నదన్న విషయాన్నీ, కశ్మీర్ విషయాల్లో ఎల్లప్పుడూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న విషయాన్నీ పరిగణించాల్సి ఉంటుంది. పాల స్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పరచాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్న ప్పటికీ, హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి సంస్థలకు భారత్ వత్తాసు పలకలేదు. వీటిద్వారా పరోక్షంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న ఇరాన్ విధానాన్ని సమర్థించటం ఆత్మహత్యాసదృశం.భారతదేశ అభివృద్ధికి, సమగ్రతకు, ఉన్నతికి రెండు ప్రధాన అవరోధాలున్నాయి. అవి: 1. తీవ్రవాద సమస్య 2. ఇంధన వనరుల కొరత. మన దౌత్య నీతి ఎల్లప్పుడూ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తీవ్రవాదం విషయంలో రాజీకి ‘ఆపరేషన్ సిందూర్’ స్వస్తి పలికింది. ‘ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’. ప్రస్తుత అనిశ్చిత జియో పొలిటికల్ వాతావరణంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు, మిత్రుడి శత్రువు శత్రువు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది.తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత్కు ఇజ్రాయెల్ మొదటి నుండీ వెన్నంటి ఉంటున్నది. తీవ్రవాద సంస్థల కదలికలు, ఆర్థిక కార్యకలాపాల నిఘా సమాచారాన్ని పంచుకోవడంలోనూ, సాంకే తిక పరిజ్ఞానాన్ని అందజేయటంలోనూ ఇజ్రాయెల్ భారత్కు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తున్నది. రష్యా కూడా భారత్కు మొదటినుండీ అంతర్జాతీయ వేదికలపైన మద్దతు ద్వారానూ, ఆయుధాలు, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం అందించటం ద్వారానూ మద్దతు నిచ్చింది. అందుకే రష్యా, ఇజ్రాయెల్కు సంబంధించినంత వరకు భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఖండించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇజ్రా యెల్ను ఖండించలేదు. ఈ రెండు యుద్ధాలతో భారత్కు సంబంధం లేదు. ఈ రెండు యుద్ధాలు ప్రపంచ జియో పొలిటికల్ చదరంగంలో భాగం. నాటో విస్తరణను అడ్డుకోవటాన్ని ప్రతిఘటిస్తూ రష్యా ఉక్రెయిన్పై దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ శక్తిగా మత ఛాందస ఇరాన్ ఎదగకూడదని అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ వ్యూహాత్మక యుద్ధాలలో భారత్ తలదూర్చి తన జియో పొలిటికల్ లక్ష్యాలను ప్రమాదంలో పడేయకూడదు.కిం కర్తవ్యం?జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే భారత్ ముందు లక్ష్యాలు: 1. దక్షిణాసియాలో బలమైన ప్రాంతీయ శక్తిగా సుస్థిరతను సాధించటం. 2. పాకిస్తాన్–చైనా సవాళ్లను ఎదుర్కోవటం 3. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై యూఎస్ఏ–ఐరోపాల గుత్తాధిపత్యాన్ని తగ్గించి ఆసియా–ఆఫ్రికా–ద.అమెరికాలు పట్టు సాధించటం. 4. శక్తి భద్రతను సాధించటం.ఇరాన్ యుద్ధంలో ఏ మాత్రం తొందరపడినా సౌదీ, యూఏఈ వంటి దేశాలతో మనకున్న సంబంధాలపై ప్రభావం పడుతుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవటం లేదు. భారత్ ముందున్న తక్షణ సమస్య హార్మూజ్ జలసంధి నుండి మన చమురు–సహజ వాయువు, ఎల్పీజీ ట్యాంకర్ల రవాణా సాఫీగా జరిగేట్లుగా చూడటం. ఇరాన్తో మనకున్న సత్సంబంధా లను వినియోగించుకొని కొన్ని ట్యాంకర్లను క్షేమంగా రప్పించుకో వటం చిన్న విషయం కాదు.‘అమెరికాకు మిత్రుడుగా ఉండటం ప్రమాదకరం. కానీ అమె రికాకు శత్రువుగా మారటం మరణాన్ని కోరుకోవటమే’– అమెరి కాతో వ్యవహారంలో ప్రస్తుత పరిస్థితి. అమెరికా ప్రవర్తనతో పాటుగా ట్రంప్ వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో తప్ప ప్రాంతీయ యుద్ధాలలో భారత్ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. విలువలు, సిద్ధాంతాల భేషజాల సంకెళ్లకు బందీ కాకూడదు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి ఇస్లామిక్ దేశాలు కూడా మత ప్రాతిపదికన ఇరాన్కు మద్దతు తెలపలేదు. వ్యూహాత్మకంగా మసలుతున్నాయి.రష్యా, చైనా వంటి అంతర్జాతీయ శక్తులు అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను, సాయుధ సంపత్తి సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇండో పసిఫిక్లో చైనా–తైవాన్ విషయంలో యూఎస్ఏ, పాశ్చాత్య దేశాల శక్తి ఏ మేరకు ఉండవచ్చనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. భారతదేశం కూడా భవిష్యత్తులో పాకిస్తాన్–చైనా సమష్టిగా దాడి చేసినట్లయితే ఏ విధంగా ఎదుర్కో వాలో ఇరాన్ నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.యుద్ధానంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవచ్చును. అమెరికా అంతర్జాతీయ స్థాయిలో బలహీనపడవచ్చు. నాటో కూటమి మనుగడ ప్రశ్నార్థకమవవచ్చు. రష్యా మరింత బలపడే అవకాశాలున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు అమెరికాతో తమ సంబంధాలను పునఃసమీక్షించుకునే అవకాశా లున్నాయి. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు’, నెతన్యాహు – ట్రంప్ దుందుడుకు నిర్ణయం వలన బహుళ ధ్రువ ప్రపంచం మరింత త్వరలోనే అవతరించవచ్చును.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు -
భయపడాల్సిన పనిలేదు: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలలోనూ తాము అండగా నిలుస్తామని ప్రతిపక్ష పార్టీలన్నీ తమకు హామీ ఇచ్చాయని తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన సమావేశం జరిగిందని కిరణ్ రిజిజు అన్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించిదని తెలిపారు. ‘దేశీయంగా 60% ఎల్పీజీని ఉత్పత్తిని పెంచాం. ఇంధన సరఫరా పెంచేందుకు అన్ని దేశాలతో చర్చలు జరుపుతున్నాం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్ని అఖిలపక్ష పార్టీలకు వివరించాము. సవాళ్లు ఎదురవుతున్న ఈ సమయంలో, అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించాము. దేశంలో ఇంధన భద్రతకు ఢోకా లేదు ఇంధన భద్రత విషయంలో భయపడాల్సిన పనిలేదు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతిస్తామని అన్ని పార్టీలు వెల్లడించాయి. హార్మూజ్ జలసంధి నుంచి భారత నౌకలు సురక్షితంగా వస్తున్నాయి’ అని అన్నారు.కాగా, ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశం పార్లమెంటులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ తరఫున సమావేశానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. -
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సంక్షోభం, కేంద్రం కీలక ప్రకటన
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్, వంటగ్యాస సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ధరలలో కూడా ఎటువంటి పెరుగుదల లేదని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయనీ, వదంతులను నమ్మవద్దు అని బుధవారం (మార్చి 25, 2026) పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదు, ధరలు పెంచంఏటా సుమారు 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం మనకు ఉందనే విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అన్నారు. గత రెండు రోజులుగా, అనేక ప్రాంతాల్లోని రిటైల్ అవుట్లెట్లు మరియు పెట్రోల్ పంపుల బయట క్యూలు కనిపించాయి. భయాందోళనలతో కొనుగోళ్లు కూడా జరిగాయి. కానీ మన వద్ద తగినంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయి. ఏ పెట్రోల్ పంపు వద్ద కూడా కొరత లేదు. పెట్రోల్ పంపులకు సరఫరా టెర్మినళ్లలో కూడా తగినంత పరిమాణంలో ఇంధన నిల్వలున్నాయి. అందువల్ల, వదంతులను నమ్మవద్దు , భయాందోళనలతో కొనుగోళ్లు మానుకోండి అని ఆమె చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని కూడా ఆమె స్పష్టం చేశారు. LPG విషయానికి వస్తే, ఏ పంపిణీ కేంద్రం వద్ద కూడా ఎలాంటి కొరత లేదని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 26 రాష్ట్రాలకు 22,000 టన్నుల వాణిజ్య ఎల్పిజిని కేటాయించారని, గత 25 రోజుల్లో 2.5 లక్షల కొత్త పిఎన్జి కనెక్షన్లు మంజూరు చేశారని ఆమె తెలిపారు. సుమారు 30,005 కిలోల సిలిండర్లు పంపిణీ చేశామని ఆమె చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన కిరోసిన్ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనపు కేటాయింపులు చేసిందన్నారు. సుమారు 16 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే నల్లబజారు, అక్రమ నిల్వలను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం వివిధ రాష్ట్రాల్లో సుమారు 2700 దాడులు నిర్వహించి, సుమారు 2000 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు సుజాత శర్మ వెల్లడించారు.ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు #WATCH | Delhi: Sujata Sharma, Joint Secretary (Marketing & Oil Refinery), Ministry of Petroleum & Natural Gas, says, "In the last 25 days, 2.5 lakh new connections (PNG) have been given. Additionally, approximately 2.20 lakh consumers have shifted from LPG to PNG. Additionally,… pic.twitter.com/o3pDx5KbMs— ANI (@ANI) March 25, 2026 -
కోట్లాది మందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు
మధ్యప్రాచ్య (Middle East) యుద్దంతో నెలకొన్న చమురు సరఫరా సంక్షోభం పెట్రోల్, డీజిల్పై ఆందోళనల నేపథ్యంలో భారతీయులకు భారీ ఊరటనిచ్చే అంశమిది. భారత రిఫైనరీలు వచ్చే నెల డెలివరీ కోసం సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా చమురు కొనుగోలులో అమెరికా ఇచ్చిన వెసులు బాటు భారత్ సమర్ధవంతంగా వినియోగించుకున్నట్టు అవుతోంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో సౌదీ అరేబియా, ఇరాక్ నుండి రావాల్సిన చమురు నిలిచి పోవడంతో, భారత్ తన ఇంధన అవసరాల కోసం మళ్ళీ రష్యా వైపు మొగ్గు చూపింది. మనీ కంట్రోల్ కథనం ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారతీయ రిఫైనరీలు మే నెల డెలివరీ కోసం దాదాపు 6 కోట్ల (60 Million) బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేశాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ కొనుగోళ్లు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి. చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ కంటే బ్యారెల్కు 5 డాలర్ల నుండి 15 డాలర్ల ప్రీమియం ధరలకు బుక్ అయ్యాయి. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ ప్రకారం, ఈ పరిమాణం ఈ నెల కొనుగోళ్లకు సమానంగా ఉన్నప్పటికీ, ఫిబ్రవరి నెల కొనుగోళ్ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ.(ట్రంప్ యూటర్న్ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు)గత డిసెంబర్ నుండి రష్యా చమురుకు దూరంగా ఉన్న మంగళూరు రిఫైనరీ (MRPL), హిందుస్థాన్ మిట్టల్ ఎనర్జీ వంటి సంస్థలు ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ప్రధానంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంతో ఏర్పడిన చమురు కొరతను అధిగమించేందుకు, మార్చి 12 లోపు సముద్రంలో లోడ్ అయిన రష్యన్ చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.2022 ప్రారంభంలో ఉక్రెయిన్పై దాడి జరిగిన తర్వాత, భారత్కు తక్కువ ధరకు లభించే రష్యన్ ముడి చమురుకు ఇది ఒక ప్రధాన కొనుగోలుదారుగా మారింది. అయితే, అమెరికా ఒత్తిడితో గత ఏడాది చివరి నుంచి భారత్ కొనుగోళ్లను తీవ్రంగా తగ్గించుకుంది. దానికి బదులుగా సౌదీ అరేబియా, ఇరాక్ల నుంచి బ్యారెళ్ల వైపు మళ్లింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత, అందులో అధిక భాగం పర్షియన్ గల్ఫ్లోనే చిక్కుకుపోయింది. అమెరికా మినహాంపుతోపాటు, కేవలం రష్యా పైనే ఆధార పడకుండా, భారత్ తన చమురు వనరులను పెంచుకుంటోంది. అక్టోబర్ 2020 తర్వాత అత్యధికంగా వెనిజులా నుండి కూడా ఏప్రిల్ నెలలో 80 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోనుంది.ఇదీ చదవండి: కోటక్ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలంరష్యాకు భారీ లాభాలుభారత్ , ఇతర దేశాలనుంచి వస్తున్న భారీ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల రష్యా భారీ లాభాలను ఆర్జిస్తోంది. మార్చి 2022 తర్వాత రష్యా చమురు ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న సమయం ఇదేనని నివేదికలు చెబుతున్నాయి. -
వీలునామా రిజిస్టర్ చేయించడం అత్యుత్తమం
నేను గతంలో ఒక వీలునామా రాసి, ఆ విషయాన్ని నా కుటుంబ సభ్యులకు – స్నేహితులకి చెప్పి ఉంచాను. ఇప్పుడు ఆ వీలునామా తిరగరాయాలనుకుంటున్నాను. వీలవుతుందా?– వి.ఆర్.ఎన్. శాస్త్రి, హైదరాబాద్మీరు సంపాదించిన లేదా మీకు సంక్రమించిన ఆస్తులను మీ తదనంతరం ఎవరికి పంచాలో నిర్ణయిస్తూ వీలునామా రాయడమనేది మీ హక్కు. మీ జీవిత కాలంలో మీ వీలునామాని మార్చుకోవచ్చు. అలా మార్చుకోవాలి అనుకున్నప్పుడు గతంలో చేసిన వీలునామా తాలూకు అంశాన్ని, వివరాలను ప్రస్తావిస్తూ, పాత వీలునామా ఇక చెల్లదు అని మీరు రాయబోయే వీలునామాలో పేర్కొనాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ వీలునామాలో మీరు ‘ఇదే చివరిది కాదు, నాకు మార్చుకోవాలనిపిస్తే మరోసారి కూడా వీలునామా మార్చుకునే అవకాశం ఉంది’ అని, అలా మార్చకపోతే ఇదే ఆఖరి వీలునామా అవుతుందని కూడా రాయించవచ్చు.మీరు వీలునామా రాయించి, ఆ విషయాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు చెప్పాను అని అన్నారు. అలాంటి వీలునామాలు చట్టరీత్యా చెల్లినప్పటికీ మీ తదనంతరం మీ ఆస్తిలో భాగం కోరుకునే వారు ఎవరైనా ఆ వీలునామా సరైనది కాదు అని లేదా మరొక కారణం చూపి లేని΄ోని కేసులు వేయవచ్చు. సొంతంగా రాసుకున్న వీలునామాలలో కచ్చితంగా పోందుపరచవలసిన కొన్ని అంశాలను విస్మరించడం తరచూ చూస్తుంటాము. అలాంటి వీలునామాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవు. వీలునామా లో మీరు పేర్కొనే వారసులు ఒకవేళ మైనర్ అయితే, వారికి సంరక్షకులను (గార్డియన్)ను నియమించటం, శానిటీ ఓత్(చిత్తశుద్ధి ప్రమాణం/ధ్రువీకరణ) చేయటం, అచ్చు తప్పులు లేకుండా రాయటం, ఆస్తి వివరాలను క్షుణ్ణంగా వివరించటం వంటి అంశాలు వీలునామా చెల్లుబాటునకు అవసరం. అలా లీగల్ గా మెరుగైన వీలునామా మీ దగ్గరలోని లాయర్ గారితో రాయించుకుని, వీలునామాలో మీరు పోందుపరచాలి అనుకున్న నిబంధనలు ఏవైనా ఉంటే అవి చట్టరీత్యా చెల్లుతాయా లేదా అనే అంశాలను కూడా అడిగి తెలుసుకోవడం మంచిది. వీలునామా రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. అలా రిజిస్ట్రేషన్ చేయించిన వీలునామా అయితే అన్ని విధాల మీ తదనంతరం కూడా అందరికీ మేలు చేస్తుంది. తక్షణ అమలుకూ నోచుకుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
అత్యంత కాలుష్య దేశంగా పాక్.. నగరాల్లో మాత్రం?
2025 సంవత్సరాలనికి గానూ ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరాల జాబితాను ఐక్యూ ఎయిర్ విడుదల చేసింది. ఇందులో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది. అదే విధంగా అత్యంత కాలుష్య నగరంగా భారత్లోని లోనీ నగరం ఉన్నట్లు నివేదిక తెలిపింది.ప్రపంచంలోని వాయి నాణ్యతపై స్విట్జర్లాండ్కు లోని ఐక్యూఎయిర్ సంస్థ నివేదిక విడుదల చేసింది. అందులో అత్యంత కాలుష్యం దేశంగా పాకిస్థాన్ నిలువగా, రెండవ స్థానంలో బంగ్లాదేశ్, మూడవ స్థానంలో కజకిస్థాన్ నిలిచింది. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. మెుత్తంగా 143 దేశాల్లో వాయు నాణ్యత పరీక్షలు నిర్వహించగా వాటిలో 130 దేశాలు WHO వాయు నాణ్యత ప్రమాణాలు చేరుకోలేక పోయాయి.ఈ నేపథ్యంలోనే భారత్లోని లోనీ నగరం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన నగరంగా నిలిచింది. ఘజియాబాద్కు సమీపంలో, ఢిల్లీ సరిహద్దులో ఉండే ఈ పట్టణంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇక్కడ పీఎం2.5 కణాల సాంద్రత 112.5 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే 22 రెట్లు ఎక్కువ. అదే విధంగా రెండవ స్థానంలో చైనా హోటన్ ,3. బర్నీహత్ (మేఘాలయ) - 4. న్యూఢిల్లీ (భారత్) నిలిచాయి. మెుత్తంగా ప్రపంచంలోని టాఫ్ 10 కాలుష్య నగరాల్లో ఐదు భారతీయ నగరాలే ఉండడం ఆందోళన కలిగించే విషయం -
హర్మూజ్ ప్రయాణంపై భారత్ కీలక వ్యాఖ్యలు: భారత్
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అది అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని తెలిపారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే ఈ అంశాలపై భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు.హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. భద్రత, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే షిప్పింగ్ కంపెనీలు, వాటి కాంట్రాక్టు సంస్థలు ఈ జలసంధి గుండా ప్రయాణం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందాల పరిధిలోకి వస్తుంది. దీని గుండా నౌకాయానానికి స్వేచ్ఛ ఉంది. ఆ జలసంధి ఇరుకుగా ఉన్నందున, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మాత్రమే గుర్తించారు, వాటిని నౌకా రవాణా సంస్థలు అనుసరించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా జలసంధి గుండా ప్రయాణించాలనే నిర్ణయం షిప్పింగ్ కంపెనీకి, ఓడను అద్దెకు తీసుకున్న కంపెనీకి మధ్య ఉంటుంది. ఎప్పుడు ప్రయాణించాలి, ఎప్పుడు ప్రయాణించకూడదు అనేది వారి నిర్ణయం అని తెలిపారు. అయితే ప్రస్తుతం యుద్ధం నడుస్తున్నందున వారు నిర్ణయం తీసుకునే ముందు భద్రత మొదలైన వాటికి సంబంధించి పరిస్థితిని అంచనా వేస్తారు. అంతేగాని హార్మూజ్ గుండా ప్రయాణానికి ఎటువంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదు అని ఆయన తెలిపారు. కాగా నిన్న (సోమవారం) మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇవి ఈ నెల 26 లేదా 27 తేదీలలో భారత్ను చేరుకుంటాయి. వీటివల్ల దేశానికి దాదాపు ఒక రోజు వంటగ్యాస్ సరఫరా చేయవచ్చు. -
మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నాం: రష్యా
భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం రష్యా ఎదురు చూస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అన్నారు. ఢిల్లీతో ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలు నిరంతరంగా కొనసాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.2025 చివరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా కుదిరిన కీలక ఒప్పందాలు, వ్యూహాత్మక లక్ష్యాలను మోదీ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. 2025లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లకు చేరుకుందని దీనిని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.భారత్, రష్యాది కాల పరీక్షను ఎదుర్కొని నిలబడ్డ నిలిచిన స్నేహ బంధమని, సమానత్వం, విశ్వాసం, గౌరవం, ప్రయోజనాలను ఇరుదేశాలు పరిగణలోకి తీసుకోవడం ద్వారా భారత్, రష్యాల మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం భారత్-రష్యా మధ్య జరుగుతున్న వాణిజ్యంలో 96 శాతం జాతీయ కరెన్సీలలోనే (రూపాయి-రూబుల్) జరుగుతుండటం విశేషమని ఆయన గుర్తుచేశారు.వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం పట్ల రష్యాకు ఎంతో గౌరవం ఉందని లావ్రోవ్ కొనియాడారు. 21వ శతాబ్దంలో భారత్ ఒక గొప్ప శక్తిగా, ప్రపంచ రాజకీయ మరియు ఆర్థిక కేంద్రంగా ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు -
భారత్ చేరిన మరో ఎల్పీజీ నౌక
మంగళూరు(కర్ణాటక): పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో భారత్లో ఎల్పీజీ కష్టాలు పెరగడంతో ఆ సమస్యను తీర్చేందుకు అమెరికా ముందుకొచి్చంది. అమెరికా నుంచి 16,714 మెట్రిక్ టన్నుల ఎలీ్పజీతో బయల్దేరిన సరుకు రవాణా నౌక ‘పైక్సిస్ పయనీర్’ ఆదివారం భారత్కు చేరుకుంది. ఫిబ్రవరి 14వ తేదీన టెక్సాస్ రాష్ట్రంలోని పోర్ట్ ఆఫ్ నెదర్లాండ్ నుంచి బయల్దేరి పయనీర్ నౌక ఆదివారం న్యూ మంగళూరులోని నౌకాశ్రయానికి చేరుకుంది. మంగళూరు రిఫైనరీ, పెట్రో కెమికల్స్ ప్లాంట్ సమీపంలో భారత్ అతిపెద్ద భూగర్భ ఎల్పీజీ నిల్వ కేంద్రాన్ని నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇక్కడ 80 వేల మెట్రిక్ టన్నుల ద్రవరూప పెట్రోలియంగ్యాస్(ఎల్పీజీ)ను భద్రపరచవచ్చు. వ్యూహాత్మక అవసరాలకు ఈ నిల్వలు అక్కరకొస్తాయి. రష్యా చమురు నౌక ఆగమనం మంగళూరు: చైనాకు వెళ్లాల్సిన రష్యా నౌక ఆక్వా టైటాన్ దిశమార్చుకుని మంగళూరుకు చేరుకుంది. చైనాకు బదులుగా భారత్ దిశగా బయల్దేరిన ఏడు నౌకల్లో ఇండియాకు చేరుకున్న తొలి నౌక ఇదే కావడం విశేషం. పశి్చమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా సముద్రమార్గంలో చమురు రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నంకావడంతో తాత్కాలికంగా రష్యా నుంచి భారత్ చమురుకొనేందుకు అమెరికా అనుమతి మంజూరుచేసింది. దీంతో చైనాకు వెళ్లే ముడిచమురు నౌకలను సైతం భారత్ ఆగమేఘాల మీద కొనేసింది. దీంతో చైనాలోని రిజావూ పోర్ట్కు వెళ్లాల్సిన ఆ నౌకలు మార్చి నెల భారత్ వైపు దిశమార్చుకున్నాయి. జనవరి చివర్లో బాల్టిక్ సముద్రంలో సరుకు నింపుకున్న ఆక్వా టైటాన్ చివరకు భారత్కు చేరుకుంది. మార్చి 25వ తేదీన మరో రష్యా చమురునౌక సూయిజ్మ్యాక్స్ జౌజౌ సైతం త్వరలో భారత్కు చేరుకోనుంది -
ప్రభుత్వాధినేతగా 8,931 రోజులు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆదివారం మరో అరుదైన మైలురాయికి చేరుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా రికార్డుకెక్కారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా నిరాటంకంగా 8,931 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఈ విషయంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ తిరగరాశారు. చామ్లింగ్ సీఎంగా 8,930 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఆదివారంతో మోదీ 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. కేంద్ర మంత్రుల అభినందనలు ప్రభుత్వాధినేతగా 8,931 రోజుల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న కేంద్ర మంత్రులు తదితరులు అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాని గత 24 ఏళ్లకుపైగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం, ప్రజల కోసం పని చేస్తున్నారు. ఇది ఆయన అంకితభావానికి నిదర్శనం. ‘మోదీ యుగం’ దేశ రూపురేఖలనే మార్చివేసింది. ఈ 8,931 రోజుల ప్రస్థానం దేశం పట్ల ఆయన నిబద్ధత, ప్రతి పౌరుడి పట్ల ఆయన చూపే అసమాన సేవానిరతికి ప్రతీక’’ అని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మంత్రులు రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, కిరణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు కూడా మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశంపట్ల, ప్రజల పట్ల ఉన్న అచంచలమైన అంకితభావం కలిగిన గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. ‘‘మోదీ జీవితమంతా నిరంతర సేవా ప్రయాణం. ప్రధానిగా ఆయన సేవా దృక్పథం దేశాన్ని మరింత బలోపేతం చేస్తూనే ఉంది. మోదీ నాయకత్వంలో పేదలు, యువత, రైతులు, అన్నదాతల సాధికారతకు పెద్దపీట వేస్తూ దేశం ‘వికసిత్ భారత్’ దిశగా సాగుతోంది’’ అన్నారు.ఎన్నెన్ని రికార్డులో! → మోదీ తొలిసారి 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ప్రధానిగా ఎన్నికయ్యే దాకా సీఎంగా కొనసాగారు. గుజరాత్కు ఎక్కువ కాలం సీఎంగా చేసిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2001 అక్టోబర్ 7 నుంచి 2014 మే 21 దాకా 13 ఏళ్లకు పైగా సీఎంగా సేవలందించారు. 2001, 2002, 2007, 2012ల్లో నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసి, ప్రధానమంత్రిగా ఎన్ని కైన అరుదైన నాయకుడు కూడా మోదీయే. → స్వతంత్ర భారతదేశంలో జని్మంచిన తొలి ప్రధానిగా మోదీ మరో రికార్డు నెలకొల్పారు. మోదీకి ముందు ప్రధానులుగా చేసిన వారంతా స్వాతంత్య్రానికి ముందు పుట్టిన వారే. → ప్రధానిగా రెండు పర్యాయాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏకైక కాంగ్రెసేతర నేత మోదీ. ప్రస్తుతం వరుసగా మూడో టర్మ్లో పదవిలో కొనసాగుతున్నారు. → వరుసగా 3 సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా మోదీ మరో ఘనత సాధించారు. ఆయన సారథ్యంలో 2014, 2019, 2024ల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. → వరుసగా ఎక్కువకాలం పదవిలో రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డును మోదీ గతేడాది బద్ధలు కొట్టారు. ఇందిర 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 దాకా 4,077 రోజులపాటు వరుసగా పదవిలో ఉన్నారు. మోదీ 2025 జూలై 25న ఆ రికార్డును దాటేశారు. → అత్యధిక కాలం ప్రధానిగా చేసిన రికార్డు నెహ్రూదే. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27న మరణించేదాకా 16 ఏళ్ల 286 రోజులపాటు పదవిలో ఉన్నారు. మోదీ నాలుగోసారి ప్రధానిగా ఎన్నికైతే ఆ రికార్డును తిరగరాసే అవకాశముంది. → నెహ్రూ మూడు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించారు. ఈ రికార్డును మోదీ ఇప్పటికే సమం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపిస్తే ఆ రికార్డునూ అధిగమిస్తారు. → ఆరు వరుస ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నాయకుడు కూడా మోదీయే. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ పక్షనేతగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 2014, 2019, 2024లో లోక్సభ ఎన్నికల్లో నెగ్గి బీజేపీపక్ష నేతగా, ప్రధానిగా ఎన్నికయ్యారు. -
అనాహత్, అభయ్లకు టైటిల్స్
ముంబై: ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లే టైటిల్స్ సాధించారు. టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగిన అనాహత్ సింగ్ మహిళల టైటిల్ చేజిక్కించుకుంది. పురుషుల ఈవెంట్లో అభయ్ సింగ్ నిలకడైన ఆటతీరుతో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన అమ్మాయిల ఫైనల్లో యువ సంచలనం అనాహత్ 3–1 (11–5, 11–6, 9–11, 11–6)తో ఈజిప్టు క్రీడాకారిణి హనా మొతాజ్ను ఓడించింది. భారత ప్లేయర్ తొలి రెండు సెట్లను అలవోకగా గెలుచుకోగా... మూడో సెట్ను ఈజిప్టు అమ్మాయి దక్కించుకుంది. వెంటనే పుంజుకున్న అనాహత్ నాలుగో సెట్ నెగ్గి మ్యాచ్ను ముగించింది. గత నెలలో ఈ భారత ప్లేయర్ కెరీర్ బెస్ట్ ప్రపంచ 19వ ర్యాంకుకు ఎగబాకింది. ఇపుడు తాజా టైటిల్ విజయంతో టాప్–20 ర్యాంకింగ్స్లో నిలకడగా కొనసాగనుంది. 2022 ఆసియా క్రీడల్లో పతకం గెలిచిన అనాహత్... గతేడాది ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్షిప్లో కాంస్యంతో భారత్ 15 ఏళ్ల పతక నిరీక్షిణకు తెరదించింది. చెన్నైలో జరిగిన స్క్వాష్ ప్రపంచకప్లోనూ ఆమె బంగారు పతకంతో సత్తాచాటింది. భారత ఆటగాళ్ల మధ్యే జరిగిన పురుషుల ఫైనల్లో అభయ్ సింగ్ తన సహచరుడికి ఏమాత్రం అవకాశమివ్వకుండా వరుస సెట్లలో గెలుపొందాడు. అతను 11–9, 11–8, 11–4 వీర్ చొత్రానిపై విజయం సాధించాడు. -
2047 నాటికి సంపన్న దేశంగా భారత్: అమెరికన్ మ్యాగజైన్ సంచలన రిపోర్ట్!
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం 2047 నాటికి.. సంపన్న దేశంగా మారుతుందని అమెరికా మ్యాగజైన్ 'వాషింగ్టన్ ఎగ్జామినర్' నివేదించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వాషింగ్టన్ ఎగ్జామినర్ ప్రకారం.. గత రెండు దశాబ్దాలుగా దేశం బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. 2003 నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ.. సగటు వార్షిక వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంది. రాబోయే 20 ఏళ్లపాటు ఇదే ఊపు కొనసాగితే తలసరి జీడీపీ 15,000 డాలర్లు దాటేస్తుంది. ఇంతటి స్థిరమైన వృద్ధి సాధించడం వల్ల భారత్.. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తుర్కీయే వంటి ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసిన మధ్య ఆదాయ ట్రాప్ను (మిడిల్ ఇన్కమ్ ట్రాప్) దాటేయగలదు.భారతదేశం అభివృద్ధి చెందడానికి అనుకూలమైన విధానాలు, జనాభా, పెరుగుతున్న టెక్నాలజీ అని వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది. ఇండియాలో 28 సంవత్సరాలు మధ్య వయసున్న వారు.. యునైటెడ్ స్టేట్స్, చైనా దేశాల కంటే ఎక్కువ. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశంలో యువకులు శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ జనాభా ధోరణి బలమైన దేశీయ మార్కెట్కు మద్దతునిస్తుందని, తద్వారా వృద్ధి కోసం ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వాషింగ్టన్ ఎగ్జామినర్ నివేదించింది.ఈ ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి.. విధాన రూపకర్తలు ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ కారిడార్ల వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు వేగవంతమవుతున్నాయి. మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ సరఫరా గొలుసులను బలోపేతం చేసి, దేశీయ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది.నిరంతర పెట్టుబడులు, కార్మిక శక్తిని విస్తరించడం, సాంకేతికతను స్వీకరించడం ద్వారా దేశాలు అధిక - ఆదాయ హోదాకు మారగలవని చారిత్రక ధోరణులు చూపిస్తున్నాయి. ఈ మూడు లక్షణాలు భారతదేశానికి ఉన్నట్లు కనిపిస్తోందని వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది.వికసిత భారత్ - మోదీ కలభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల. ఈ లక్ష్యం ద్వారా దేశాన్ని ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో శక్తివంతంగా మార్చడం ప్రధాన ఉద్దేశ్యం.వికసిత భారత్ అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చేయడం. గ్రామాలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందాలి. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కూడా ఈ లక్ష్యంలో భాగం.మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడం వంటివి కూడా ఇందులో ప్రధాన లక్ష్యాలు.ఇదీ చదవండి: బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా.. -
అమెరికా మాపై దాడి చేస్తే మేము భారత్ పై దాడి చేస్తాం: పాక్ మాజీ హై కమీషనర్
-
‘మన గ్యాస్ని ఎవర్రా ఆపేది?’.. భారత్కు అమెరికా గ్యాస్!
మంగళూరు: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల కారణంగా మన దేశంలో ఏర్పడుతున్న ఎల్పీజీ (ఎల్పీజీ) కొరతకు పరష్కారం దొరికింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి భారీ గ్యాస్ నిల్వలతో కూడిన ‘పిక్సిస్ పయనీర్’ (Pyxis Pioneer) నౌక ఎట్టకేలకు భారత్ చేరుకుంది. ఆదివారం ఉదయం కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు ఈ నౌక సురక్షితంగా వచ్చి చేరింది.టెక్సాస్ టు మంగళూరు ..సింగపూర్ ఫ్లాగ్తో ప్రయాణించిన ఈ భారీ ట్యాంకర్ ఫిబ్రవరి 14న టెక్సాస్లోని నెదర్లాండ్ పోర్టు నుంచి బయల్దేరింది. న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ వివరాల ప్రకారం.. 47,236 టన్నుల గ్రాస్ టన్ను సామర్థ్యం ఉన్న ఈ నౌక, ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 13వ నంబర్ బెర్త్కు చేరుకుంది. ఇది ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కోసం సుమారు 16,714 టన్నుల ఎల్పీజీని ఇక్కడ అన్లోడ్ చేయనుంది. సోమవారం ఉదయం ఈ నౌక తిరిగి ప్రయాణం కానుంది.భారత్కు ఊరటగత మూడు వారాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల భారత్కు ఇంధన సరఫరాలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. సరఫరా తగ్గడంతో గృహ అవసరాలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు, హోటళ్లు వంటి వాణిజ్య సంస్థలకు గ్యాస్ కోత విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్లిష్ట సమయంలో అమెరికా నుంచి గ్యాస్ నిల్వలు రావడం దేశానికి పెద్ద ఊరట లభించింది.ఇరాన్ హామీతో..ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారతీయ నౌకలకు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. దీంతో పాటు ఇటీవల ‘జగ్ లాడ్కీ’ ముడి చమురును, ‘నందాదేవి’, ‘శివాలిక్’ నౌకలు గ్యాస్ నిల్వలను విజయవంతంగా భారత తీరానికి చేరవేసాయి. కాగా భారత్ తన ఇంధన అవసరాల కోసం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దేశానికి కావాల్సిన ముడి చమురులో 88 శాతం, సహజ వాయువులో 50 శాతం, ఎల్పీజీలో దాదాపు 60 శాతం దిగుమతుల ద్వారానే అందుతోంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇంధన సరఫరా వ్యవస్థ కొంత అస్తవ్యస్తమయ్యింది. అయితే తాజా షిప్మెంట్లతో పరిస్థితులు దారికి వస్తున్నాయి.ఇది కూడా చదవండి: ట్రంప్ షాకింగ్ పోస్ట్.. ‘అతని చావుతో సంతోషం’ -
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ‘‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ ’గా పేరొందిన భారత్ ఔషధ పరిశ్రమ... దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానిస్తూ, ఆరోగ్య రంగంలోనే కాక ఆర్థిక అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తక్కువ ధరలతో నాణ్యమైన మందులు, భారీ ఎగుమతులు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలతో ప్రపంచ ఫార్మా రంగంలో భారత్కి ప్రత్యేక స్థానమని హర్షం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో ఫార్మా రంగం అభివృద్ధి చెందుతున్న విధానంపై ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’(పీఐబీ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య రంగానికి, ఆర్థికాభివృద్ధికి అనుసంధానకర్త ‘ఫార్మాస్యూటికల్’ రంగం కీలక స్థానాన్ని ఆక్రమించినట్లు తెలిపింది. అవసరమైన మందులు, టీకాలను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉపాధి అవకాశాలు, సప్లై చైన్ బలోపేతం, సామాజికాభివృద్ధికి ఈ రంగం తోడ్పడుతున్నట్లు వివరించింది. ప్రపంచ ఫార్మా మార్కెట్లో భారత్ది ప్రత్యేక స్థానం: భారత ఔషధ పరిశ్రమ ప్రపంచంలో వాల్యూమ్(పరిమాణం) పరంగా మూడవ స్థానం, విలువ పరంగా 11వ స్థానంలో ఉందని పీఐబీ తెలిపింది. దేశంలో 3 వేలకు పైగా కంపెనీలు, 10,500 తయారీ యూనిట్లు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 60 బిలియన్ డాలర్ల విలువ కలిగిన దేశీయ మార్కెట్ 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరనుంది. భారత్ ప్రపంచంలో జనరిక్ మందుల అతిపెద్ద సరఫరాదారుగా నిలవనుంది. ప్రపంచ సరఫరాలో దాదాపు 20శాతం వాటా భారత్దే కావడం గమనార్హం. సుమారు 60వేల జనరిక్ బ్రాండ్లు 60 చికిత్స విభాగాల్లో ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ నమ్మకం, నాణ్యతకు గుర్తింపు: అమెరికా వెలుపల అత్యధికంగా యూఎస్ఎఫ్డీఏ ఆమోదం పొందిన ఔషధ తయారీ యూనిట్లు భారత్లోనే ఉన్నాయని తెలిపింది. సుమారు 500 ఏపీఐ(యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్)తయారీ సంస్థలు ఉండటం ద్వారా ప్రపంచ ఏపీఐ మార్కెట్లో భారత్కు ఎనిమిది శాతం వాటా ఉంది. ఇక ఎగుమతుల్లోనూ భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. భారత్ డిప్తీరియా, టెటనస్, పెర్టుసిస్ (డీపీటీ), బీసీజీ మీజిల్స్ టీకాల సరఫరాలో ప్రథమ స్థానంలో ఉంది. యూనిసెఫ్కు 60% టీకాలను భారత్ సరఫరా చేస్తుండటం గరి్వందచదగ్గ విషయంగా పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ మీజిల్స్ టీకా అవసరాల్లో 90% భారత్ నుంచే సరఫరా అవుతోంది. ఇక 2024–25లో ఔషధ ఎగుమతులు 30.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుతం భారత్ 191 దేశాలకు ఔషధాలు ఎగుమతి చేస్తున్నట్లు వివరించింది.ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలుఫార్మా రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక పథకాలను అమలు చేస్తున్నట్లు పీఐబీ తెలిపింది. ఇందులో భాగంగా ప్రధానంగా.. ‘పీఎల్ఐ పథకం’. ఈ పథకం ప్రభావం రూ.3.16 లక్షల కోట్ల అమ్మకాలు, రూ.2.03 లక్షల కోట్ల ఎగుమతులు, సుమారు 97వేల ఉద్యోగాలు, బల్క్ డ్రగ్ – మెడికల్ డివైస్ పార్కులు అని వివరించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్కులు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్లో మెడికల్ డివైస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ‘ప్రధాన్ మంత్రి భారతీయ జనఔషధి పరియోజన’ కింద దేశవ్యాప్తంగా 18,600కి పైగా కేంద్రాలు పనిచేస్తున్నాయి. తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందిస్తూ ప్రజల ఖర్చులను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇక ‘ఇన్నోవేషన్, పరిశోధన’కు కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపింది. ఈపథకం కింద పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తున్నారు. 111 పరిశోధన ప్రాజెక్టులు, పేటెంట్లు నమోదు కావడం ఈ రంగం పురోగతిని సూచిస్తుందన్నారు. 2026–27 బడ్జెట్లో ‘‘బయోఫార్మా శక్తి’’ పథకానికి రూ.10వేల కోట్లు కేటాయించారు. బయోలాజిక్స్, బయోసిమిలర్స్ ఉత్పత్తిలో భారత్ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ వంటి సంస్థలు ఔషధాల నాణ్యత, ధరలు, భద్రతపై కట్టుదిట్టమైన నియంత్రణ నిర్వహిస్తున్నట్లు పీఐబీ వివరించింది.కొత్త మార్కెట్లలో విస్తరణ: నైజీరియా, మెక్సికో, బ్రెజిల్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతులు పెంచుతూ భారత్ తన మార్కెట్ను విస్తరిస్తూ అగ్రస్థానంలో నిలుస్తుందని పీఐబీ పేర్కొంది. ఇక విదేశీ పెట్టుబడులు కూడా పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఫార్మా రంగం విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రధాన రంగాల్లో ఒకటిగా నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సెపె్టంబర్ వరకు రూ.13,193 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇక వాణిజ్య ఒప్పందాలతో భారత్ గ్లోబల్గా విస్తరిస్తోంది. యూరోపియన్ యూనియన్, యూనైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్తో కుదిరిన వాణిజ్య ఒప్పందాలు భారత ఔషధ రంగానికి కొత్త అవకాశాలు తెరిచాయి. టారిఫ్ తగ్గింపులతో ఎగుమతులు పెరగనున్నాయి. ముఖ్యంగా యూకే మార్కెట్లో భారత జనరిక్ మందులకు మరింత పోటీ సామర్థ్యం లభించనున్నట్లు పీఐబీ పేర్కొంది. -
అమెరికా మాపై దాడిచేస్తే మేం భారత్పై బాంబులేస్తాం
న్యూఢిల్లీ: కరడుగట్టిన ఛాందసవాదం, వితండవాదానికి పాకిస్తాన్ చిరునామా అని ఆ దేశ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ మారోమారు నిరూపించారు. భారత్ మీద తమ అంతులేని విద్వేషాన్ని తన వాచాలత్వం ద్వారా బాసిత్ మరోమారు రుజువుచేసుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం దక్షిణాసియాకు విస్తరించి అమెరికాగనక పాకిస్తాన్పై దాడి చేస్తే ప్రతిగా అమెరికాపై దాడిచేయాల్సిందిపోయి భారత్పై బాంబులేస్తామని బాసిత్ అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో పాకిస్తాన్ దౌత్యవర్గాల్లోనూ జిహాదీవాదం ఒంటబట్టించుకున్న వితండవాదులకు కొదవలేదని భారత్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సీఎన్ఎన్–న్యూస్18తో జరిగిన ఒక చర్చావేదికలో బాసిత్ మాట్లాడారు. ‘‘యుద్ధంలో ఇరాన్పై ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తే ఆ తర్వాత సమీపంలో ఉన్న పాకిస్తానే ఇజ్రాయెల్కు తదుపరి లక్ష్యంకావొచ్చు. ఇజ్రాయెల్ చెప్పుడుమాటలు వినే అమెరికాకు అప్పుడు పాకిస్తాన్ అణుకార్యక్రమాలు రుచించకపోవచ్చు. అప్పుడు పాకిస్తాన్పై అమెరికా దాడులు చేయొచ్చు. ఇలా జరగడానికి అవకాశం లేదు. కానీ ఒకవేళ దాడి చేస్తే ప్రతిదాడి చేసే సత్తా పాకిస్తాన్కు ఉంది. అయితే ప్రతిదాడి కోసం అమెరికా ప్రధాన భూభాగం లేదా గల్ఫ్ లేదా ఇజ్రాయెల్పై మేం దాడిచేయడం కష్టమవుతుంది. అవన్నీ మాకు సుదూరంగా ఉన్నాయి. సమీప లక్ష్యం మీదే మేం దాడిచేయగలం. అలాంటి సమీప లక్ష్యం ఒక్క భారత్ మాత్రమే. ఏమాత్రం ఆలస్యంచేయకుండా ముంబై, న్యూఢిల్లీలపై దాడులుచేస్తాం. తర్వాత ఏం జరుగుతుందనే దానితో మాకు సంబంధంలేదు. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం’’అని అన్నారు. ‘‘మాపై దాడులు జరుగుతున్నప్పుడు మాకు కనిపించే ఏకైక మార్గం ఇండియానే. భారత్లోని మెట్రోపాలిటన్ నగరాలపై దాడులు చేస్తాం’’అని అన్నారు. దీంతో భవిష్యత్లో అమెరికాతో సంబంధాలు చెడిపోతే దాని విపరిణామాలను భారతే ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్లు బాసిత్ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శత్రుదేశం(అమెరికా)పై ఎదురుదాడి చేసే దమ్ములేక పొరుగుదేశంపై బాంబులేసే నిస్సహాయ పాకిస్తాన్ వైఖరి బాసిత్ మాటలతో బహిర్గతమైందని అంతర్జాతీయ రాజకీయవిశ్లేషకులు తప్పుబడుతున్నారు. ‘‘బాసిత్ వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టేయడానికి వీల్లేదు. సైన్యం కనుసన్నల్లో నడిచే పాక్ ప్రభుత్వాల కుటిలనీతిలో నిర్లజ్జ నియమాలు ఎలా ఉంటాయో బాసిత్ మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. యుద్ధం దక్షిణాసియాకు విస్తరిస్తే పాకిస్తాన్ పట్ల మనం ఇంకెంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని బాసిత్ మాటలు హెచ్చరిస్తున్నాయి’’అని భారత నిఘా వర్గాలు సూచించాయి. -
అమెరికా తర్వాత మనమే..
పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ జాబ్ ఆఫర్స్.. తీరు ఏదైనా సైబర్ మోసాలు ఇప్పుడు నిత్యకృత్యం అయ్యాయి. ఇంటర్నెట్ వినియోగం అధికం అవుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలకు అత్యధికంగా గురవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచిందంటే ముప్పు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా ఉన్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ నిలిచింది. భారత్లో ఆంగ్లం మాట్లాడే డిజిటల్ వినియోగదారులు అధికంగా ఉండటం, ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు వేగంగా విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మెటా పేర్కొంది. ప్రస్తుతం ఈ ముఠాలు ఒక ప్రొఫెషనల్ వ్యాపార సంస్థల తరహాలో అత్యంత వ్యవస్థీకృతమై పనిచేస్తున్నాయని తెలిపింది.వీరు తమ లక్ష్యిత వ్యక్తులను గుర్తించడానికి, భారీ స్థాయిలో మోసాలకు పాల్పడటానికి సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్స్, ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారని 2026 ప్రథమార్థానికి సంబంధించిన అడ్వర్సరియల్ థ్రెట్ రిపోర్ట్లో వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కోట్లాది ఖాతాలకు చెక్.. కంపెనీ విధానాలను ఉల్లంఘించిన, అలాగే మోసాలు, మోసపూరిత పద్ధతులు అవలంబించిన వ్యక్తులు, ప్రమాదకరమైన సంస్థలకు చెందిన 15.9 కోట్ల పైచిలుకు అడ్వరై్టజింగ్ ఖాతాలను, 1.09 కోట్ల కంటే ఎక్కువ ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్ ఖాతాలను, 6,00,000 ఫేస్బుక్ పేజీలను 2025లో తొలగించినట్టు మెటా ప్రకటించింది. గత ఏడాది మోసపూరిత అడ్వరై్టజింగ్ ఖాతాల్లో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే 92% తొలగించినట్టు తెలిపింది. కొత్త తరహా మోసాలు.. ప్రజల బలహీనమైన పరిస్థితులను, మానసిక ఆందోళనను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని మెటా తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి తక్కువ ధరలో అద్దె ఇళ్ల కోసం వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ అద్దె ఇళ్ల ప్రకటనలను పోస్ట్ చేసే నెట్వర్క్లను పరిశోధకులు కనుగొన్నారు. మరో కలవరపరిచే ధోరణి ఏమంటే నకిలీ అంత్యక్రియల లైవ్స్ట్రీమ్ మోసాలు. ఇందులో అంత్యక్రియల సేవా నిర్వాహకులుగా నటిస్తూ ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను సైబర్ నేరగాళ్లు సంప్రదిస్తారు. లేని స్మారక సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పి అందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని మెటా తెలిపింది.సులభంగా నేరాలు.. భారత్లో సైబర్ నేరాలకు సంబంధించిన ఆర్థిక నష్టాలు భారీగా పెరిగాయి. 2024లోనే అంచనా వేసిన నష్టాలు రూ.22 వేల కోట్లు దాటాయి. ఇది సైబర్ దాడుల తీవ్రతను నొక్కిచెబుతోంది. ప్రస్తుతం అనేక ఫిషింగ్ మోసాలు ఏఐ ద్వారా రూపొందించిన సందేశాలతో జరుగుతున్నాయి. దీనివల్ల వాటిని గుర్తించడం మరింత కష్టతరంగా మారుతోంది. జెనరేటివ్ ఏఐ వల్ల మోసగాళ్లకు నేరం చేయడం సులభతరమైంది.ఏఐ ఆధారిత యాప్స్తో.. వాస్తవికమైనవిగా భ్రమించేలా సందేశాలను, నకిలీ ప్రొఫైల్స్ను, అత్యంత క్లిష్టమైన ఫిషింగ్ వెబ్సైట్స్ను సృష్టించడానికి నేరగాళ్లు ఏఐని ఉపయోగిస్తున్నారు. డీప్ఫేక్ సాంకేతికత అసలైన కంటెంట్కు, మార్చిన కంటెంట్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనుగొనడం మరింత క్లిష్టతరం చేసింది. అశ్లీల చిత్రాలను రూపొందించే ఏఐ ఆధారిత యాప్స్ వెల్లువెత్తడం కూడా ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ సాధనాలతో వ్యక్తుల సమ్మతి లేకుండా నకిలీ నగ్న చిత్రాలను సృష్టిస్తున్నారు. వీటి ద్వారా వ్యక్తుల గోప్యతకు, వ్యక్తిగత భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగి స్తున్నారు. వీటిని బహిర్గతం చేస్తామంటూ బెదిరించి వేధింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటువంటి యాప్స్ను అరికట్టడానికి, వీటిని ప్రచారం చేసే లక్షలాది ప్రకటనలను తొలగించామని, ఆ సేవలను ప్రోత్స హించే అనేక ఖాతాలు, నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకున్నామని మెటా నివేదించింది.ఆగ్నేయాసియా నుంచి.. భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న అనేక నెట్వర్క్లు ఆగ్నేయాసియాలోని మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత స్కామ్ కేంద్రాల నుంచి పనిచేస్తున్నాయి. మోసగాళ్ల ముఠాలు ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. వీరు నిరంతరం తమ ప్రాంతాలను మారుస్తూనే మోసపూరిత విధానాలను మరింత మెరుగుపరుస్తున్నారని మెటా వెల్లడించింది. -
టైటిల్ పోరుకు అనాహత్ సింగ్
ముంబై: జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్కే టైటిల్ లభించనుంది. ఎందుకంటే భారత్కే చెందిన ఇద్దరు ప్లేయర్లు అభయ్ సింగ్, వీర్ చోత్రాని ఫైనల్లోకి దూసుకొచ్చారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్, టాప్ సీడ్ అనాహత్ సింగ్ కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ 20వ ర్యాంకర్ అనాహత్ 11–6, 9–11, 11–8, 11–2తో భారత్కే చెందిన తన్వీ ఖన్నాపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్ హనా మొతాజ్ (ఈజిప్్ట)తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో వీర్ చోత్రాని 11–7, 11–5, 5–11, 11–6తో సంజయ్ జీవా (మలేసియా)పై, అభయ్ సింగ్ 11–9, 9–11, 11–3, 11–8తో అమీòÙన్రాజ్ చందారన్ (మలేసియా)పై విజయం సాధించారు. -
యుద్ధం ఆగాలంటే.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నారంటే?
టెహ్రాన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ శనివారం ఫోనులో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పేజెష్కియన్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం రావాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలను నిలిపివేయాలని చెప్పారు. అలాగే ప్రాంత స్థిరత్వం కోసం బ్రిక్స్ మరింత ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరారు.ఇద్దరు నేతల మధ్య టెలిఫోన్ సంభాషణలో ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరిగినట్టు పేజెష్కియన్ పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన ప్రస్తావించారు.ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులను నిలిపివేయడం, ప్రాంతీయ, గ్లోబల్ స్థిరత్వాన్ని కాపాడటం కోసం బ్రిక్స్ స్వతంత్ర పాత్ర పోషించాలని పేజెష్కియన్ కోరారు. భారతదేశం ప్రస్తుతం బ్రిక్స్కు అధ్యక్ష హోదాలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు ప్రస్తావనకు తెచ్చారు.పశ్చిమాసియా దేశాల మధ్య ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పాటును కూడా పేజెష్కియన్ ప్రతిపాదించారు. విదేశీ జోక్యం లేకుండా శాంతి, స్థిరత్వం సాధించాలని సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రకటనలో బ్రిక్స్ గురించి ప్రస్తావించలేదు. అయితే, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత వారం ఇరాన్తో జరిగిన సంభాషణల్లో బ్రిక్స్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపారు.ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో తాను ఇటీవల ఫోన్లో మాట్లాడినట్లు జైశంకర్ చెప్పారు. “ఇరాన్ విదేశాంగ మంత్రితో మరోసారి మాట్లాడాను. ద్వైపాక్షిక అంశాలు, బ్రిక్స్ సంబంధిత విషయాలపై చర్చించాం” అని తెలిపారు.హామీలు అవసరం: పేజెష్కియన్ ఘర్షణ తగ్గాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆగాలని, భవిష్యత్తులో దాడులు జరగవన్న హామీలు అవసరమని ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఆయన అమానుషం, అనైతికం అని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభించలేదని, అన్యాయంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులు ప్రారంభించాయని మోదీకి పేజెష్కియన్ తెలిపారు. అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయని అన్నారు. ఈ దాడుల్లో ఉన్నత స్థాయి నాయకులు, సైనికాధికారులు, పౌరులు మరణించారని, పాఠశాల పిల్లలు కూడా బలయ్యారని తెలిపారు. ప్రజా మౌలిక వసతులపై కూడా దాడులు జరిగినట్టు చెప్పారు. మినాబ్ ప్రాంతంలో ఒక పాఠశాలపై దాడి జరిగి 168 మంది పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఈ దాడి సమీప దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల నుంచి జరిగినట్టు ఆరోపించారు. -
గుడ్న్యూస్.. రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొన్న వేళ రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. రాష్ట్రాలకు అదనంగా మరో 20 శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు తెలిపారు.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల 10 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను పెంచింది కేంద్రం. తాజాగా మరోసారి 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్/పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలతో నడిపే రాయితీ క్యాంటీన్లు/అవుట్లెట్లు, కమ్యూనిటీ కిచెన్లకు సరఫరా చూడాలని లేఖలో పేర్కొంది.మరోవైపు.. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నౌకల కదలికలు, పోర్టు కార్యకలాపాలు, భారతీయ సముద్ర కార్మికుల భద్రత, సముద్ర వాణిజ్య కొనసాగింపును నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ సముద్ర కార్మికులు అందరూ సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది. మొత్తం 22 భారత నౌకలు, 611 భారతీయ సముద్ర కార్మికులు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నారని, డీజీ షిప్పింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. -
Fact Check: ఇరాన్పై దాడికి భారత్లో యుఎస్ మిలటరీ బేస్?
ఇరాన్పై దాడులకు అమెరికా భారత భూభాగాన్ని వాడుకుంటుందన్న వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికాతో అటువంటి ఒప్పందం ఏమి జరగలేదని అవి పూర్తిగా అవాస్తవాలని తెలిపింది. ప్రస్తుతం మధ్యప్రాచ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్, అమెరికాలు పరస్పర దాడులతో తీవ్రకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు జరుపుతుంది. ఇదిలా ఉండగా టెహ్రాన్పై దాడులకు భారత భూభాగాన్ని యుఎస్ఏ వాడుకోనుందని LEMOA ఒప్పందాన్ని అనుసరించి కొంకణ్ తీరంలో అమెరికా తన స్థావరాలను ఏర్పాటు చేయనుందని కథనాలు ప్రచురితమయ్యాయి.దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. అమెరికాతో అటువంటి ఒప్పందం ఏమి జరగలేదు. అవన్నీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని ప్రకటనలో పేర్కొంది. ఇటువంటి ప్రకటనలను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ అధికారిక ఖాతాలో పేర్కొందిLEMOA నేపథ్యంలాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (LEMOA) అనేది 2016లో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య కుదిరిన ఒక ద్వైపాక్షిక లాజిస్టిక్స్ ఒప్పందం. ఇది ఇరు దేశాల సాయుధ దళాలు ఒకరి సైనిక సౌకర్యాలను మరొకరు ఇంధనం నింపుకోవడానికి, మరమ్మతులకు, సరఫరాలకు విశ్రాంతికి తదితర సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తుంది. అయితే ఈ ఒప్పందం ఒకరి భూభాగంపై మరొకరు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదు దానికి ప్రత్యేక ఆమోదం అవసరం. కానీ ఈ ఒప్పందం కింద అమెరికా మిలటరీ స్థావరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగగా భారత్ దానిని ఖండించింది. -
నయా ట్రెండ్.. లివింగ్ రిలేషన్ వైపు యువత..
-
యుద్ధ విరమణ మార్గాలేమిటి?
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం నాలుగవ వారంలోకి ప్రవేశించింది. అయినా ముగింపు సూచనలు కన బడటం లేదు సరికదా మరింత తీవ్రతర మవుతున్నది. యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక మార్కెట్ల పైన, చమురు మార్కెట్ల పైన స్పష్టంగా కనపడుతున్నది. భారత దేశం కూడా ఈ జియో పొలిటికల్ చరంగంలో చిక్కుకున్నది. చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్ఫైన్స్, సింగపూర్, పాకిస్తాన్ వంటి దేశాలలోని సగటు పౌరులకు యుద్ధ సెగ తగులు తున్నది. సుమారుగా ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి దాదాపుగా మూతపడింది.యుద్ధాలను ప్రారంభించటం దేశాధినేతల చేతిలో ఉంటుంది కానీ ముగింపు మాత్రం వాళ్ల చేతుల్లో ఉండదని ప్రస్తుత సంక్షోభం సూచిస్తున్నది. ప్రారంభం నుండి కూడా యుద్ధ ‘అంతిమ లక్ష్యం’ ఏమిటనే దానిపై యూఎస్–ఇజ్రాయెల్ విధానంలో గందరగోళం కన్పడుతున్నది. ఇరాక్, అఫ్గాన్ యుద్ధాల్లో అగ్రశ్రేణి నాయకత్వాన్ని అంతమొందించి యూఎస్ఏ సులువుగా అక్కడి ప్రభుత్వాలను పడ గొట్టింది. ఇరాక్ అనుభవాల నేపథ్యంలో ఇరాన్ తన నాయకత్వాన్ని పూర్తిగా వికేంద్రీకరించినట్లు స్పష్టమవుతున్నది.ఇరాన్ వ్యూహంఅమెరికా–ఇజ్రాయెల్లు ఇరాన్ను తమ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నాయి. ఈ ముప్పు తప్పాలంటే మూడు లక్ష్యాలను నిర్దే శించుకున్నాయి: 1. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం. 2. ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేయటం. 3. ఇరాన్లో అధికారం మతతత్వ శక్తుల నుండి బాధ్యతా యుతమైన వర్గాలకు బదలాయింపు. ఈ మూడు లక్ష్యాలు కేవలం గగనతల యుద్ధం ద్వారా సాధించాలనుకోవటం అత్యాశ. వెని జులాలో మాదిరిగా అధ్యక్షుడిని తప్పించటంతో ప్రభుత్వం మారు తుందని ట్రంప్ భావించినట్లయితే అది హాస్యాస్పదం. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ఒక బలమైన రాజకీయ శక్తి. రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ బలమైన సాయుధ సంపత్తిని ఏర్పరచుకున్నది. రష్యా–చైనాలతో వ్యూహాత్మక సంబంధాలనుపెంపొందించుకున్నది. 2025 జూన్లో జరిగిన పన్నెండు రోజుల యుద్ధం తర్వాత ఒక సుదీర్ఘ పోరాటానికి సమగ్ర ప్రణాళికతో సున్నద్ధంగా ఉన్నట్లుగా కన్పిస్తున్నది. అందుకే ప్రస్తుత యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్ నేరుగా గల్ఫ్ దేశాలను ఈ యుద్ధం లోనికి లాగింది. ఇది ఊహించని పరిణామం ఏమీ కాదు. మధ్యప్రాచ్యంలో సంక్షోభానికి, పాలస్తీనా సంక్షోభానికి ముఖ్య కారణం యూఏఈ, సౌదీ, ఖతర్ వంటి దేశాలు యూఎస్ఏ కొమ్ముకాయటమేనని ఇరాన్ మొదటినుండీ వాదిస్తున్నది. యూఎస్ఏ మధ్యవర్తిత్వంతో అరబ్ దేశాలు 2020లో ఇజ్రా యెల్తో సంబంధాలు మెరుగు పరచుకోవటానికి ఒప్పందాలు (అబ్రహాం ఒప్పందాలు) చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా యూఏఈ, బహ్రెయిన్లు ఇజ్రాయెల్తో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతర్ గత దశాబ్ద కాలంగా తమ ఆర్థిక వ్యవస్థలను కేవలం చమురు ఎగుమతులపై ఆధారపడకుండా పారిశ్రామికాభివృద్ధి, ఐటీ, పర్యాటక రంగం, బ్యాంకింగ్–ఫైనాన్స్ రంగాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తు న్నాయి. యూఎస్ఏ – ఐరోపా ఆర్థిక వ్యవస్థలతో తమ ఆర్థిక వ్యవ స్థలను అనుసంధానిస్తున్నాయి. ఇందులో భాగంగానే పాలస్తీనా (గాజా), ఇజ్రాయెల్ విషయాలలో కొంత మెతక లేదా పాశ్చాత్య సానుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ హమాస్ (గాజా), హెజ్బొల్లా (లెబనాన్), హౌతీ (యెమెన్) వంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థలను పెంచి పోషిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇరాన్తో బాటుగా, లెబనాన్లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో సౌదీ యువరాజు యూఎస్ఏ ఒత్తిడిని తట్టుకుని అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికీ నిరాకరించాడు.పోరాడితే పోయేదేమీ లేదు!ఇరాన్ – ఖతర్లలో విస్తరించిన దక్షిణ పార్స్ సహజ వాయువు నిల్వల క్షేత్రం ప్రపంచంలో కెల్లా అతిపెద్దది. ఈ క్షేత్రం మీద దాడి ద్వారా ఇజ్రాయెల్ యుద్ధాన్ని క్లిష్ట దశలోనికి నెట్టివేసినట్లే. ఇప్పటి వరకూ యుద్ధంలో ఇరాన్ కొత్తగా ఆర్థికంగా నష్టపోయిందేమీ లేదు. ఇరాన్ చౌకగా తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, అమెరికా లక్ష్యాలను దెబ్బతీస్తున్నది. అమెరికా – ఇజ్రా యెల్ ఈ చౌక డ్రోన్లను, క్షిపణులను పేల్చి వేయటానికి అత్యంత ఖరీ దైన పేట్రియాట్, థాడ్ క్షిపణులను వాడాల్సి వస్తున్నది. ఈ రకంగా యూఎస్–ఇజ్రాయెల్లకు ఇది ఖరీదైన యుద్ధంగా పరిణమించింది.అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరగటం ఇరాన్కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలోనే యూఎస్ మొదటగా ఇరాన్ చమురు ఎగుమతి కూడలి అయిన ఖర్గ్ దీవిపైనా, ఇజ్రాయెల్... ఇరాన్ ప్రధాన సహజ వాయువు క్షేత్రమైన దక్షిణ పార్స్ నిల్వలపైనా దాడి చేశాయి. ఆర్థికంగా ఇరాన్ను దిగ్బంధించటానికి ఈ ఎత్తుగడ. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయువుపట్టులపై ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఖతార్ ప్రధాన ఎల్ఎన్జీ కేంద్రం ‘రస్ లఫాన్’పై దాడికి దిగింది. దీనివల్ల ఐరోపా దేశాలకు గ్యాస్ ఎగుమతికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అమెరికా– ఇజ్రాయెల్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. అమెరికాలో కూడా ఇంధన ధరలు పెరిగిక్రమంగా ప్రజాభిప్రాయం యుద్ధానికి వ్యతిరేకంగా మారుతున్నది. రష్యాకు ఉపయుక్తంనిశితంగా పరిశీలిస్తే, యూఎస్–ఇజ్రాయెల్లకు ఈ యుద్ధాన్ని ముగించటానికి మార్గాలు చాలా తక్కువ. అవి కూడా క్లిష్టమైనవి. ఇరాన్ తనంత తానుగా బేషరతుగా లొంగిపోయి యుద్ధాన్ని విర మించే అవకాశాలు మృగ్యం. అమెరికా ప్రత్యేక దళాలను రంగంలోకి దించి, ఇరాన్ పాక్షికంగా శుద్ధి చేసిన యురేనియంను మెరుపు దాడిలో చేజిక్కించుకొని, ఆ సాకుతో యుద్ధ విరమణ చేయటం ఒక ప్రత్యామ్నాయం. కుర్ద్ తిరుగుబాటు దారులను ప్రోత్సహించి వారి ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయటం మరొక మార్గం. టర్కీ లేదా ఇరాక్ భూతల మార్గాల ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సైనిక బలగాలు ఇరాన్లో ప్రవేశించి ప్రభుత్వాన్ని కూలదోయటం అతిసంక్లిష్టమయిన ప్రత్యామ్నాయం. ఈ ప్రత్యామ్నాయాలన్నింటిలో పెద్ద సంఖ్యలో యూఎస్/ఇజ్రాయెల్ సైనికులు చనిపోయే అవకాశా లున్నాయి. ఇవి వాటికి రాజకీయంగా ఆత్మహత్యా సదృశం. ఈ యుద్ధం ఒక రకంగా రష్యాకు ఉపయుక్తంగా మారినట్లుగా కన్పిస్తున్నది. రష్యా చమురు గ్యాస్కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది. తప్పనిసరి పరిస్థితులలో రష్యా నుండి చమురు కొనుగోళ్ల ఆంక్షలను అమెరికా సడలించాల్సి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధంనుండి యూఎస్ఏ–ఐరోపా దృష్టి మరలటం కూడా రష్యాకు కలి సొస్తుంది. మధ్య ప్రాచ్యం, గల్ఫ్ దేశాలలో రష్యా ప్రాపకం మరింతగా బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే, అమెరికా ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే వ్యూహంలో ఈ యుద్ధాన్ని ఒక భాగంగా పరిగణించవచ్చు. మధ్య ఆసియాలో ఇరాన్–ఇరాక్ సహజప్రాంతీయ శక్తులు. వీటిని బలహీనపరచటానికి యూఎస్ఏ మొదటి నుండి సౌదీ అరేబియా, యూఏఈలను బలోపేతం చేస్తున్నది. ఇదివరకు గల్ఫ్ యుద్ధంలో భాగంగా ఇరాక్ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ సందర్భంగా కూడా ఇరాక్లో అణ్వాయుధాలు (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్) ఉన్నాయని నింద మోపింది. ఏ రకమైన అణ్వా యుధాలు లేవని చివరకు ఒప్పుకొన్నది. ప్రభుత్వాల మార్పిడి, ముందస్తు దాడులు వంటి సిద్ధాంతాలను యూఎస్ఏ తన జియో పొలిటికల్ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్నది. ఇరాన్పై యుద్ధాన్ని కూడా ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు-గురజాల శ్రీనివాసరావు -
ఇంధన వనరులపై దాడులా?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కీలక ఇంధన వనరులపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ‘‘ప్రపంచమంతటినీ ఎంతగానో కలతకు గురి చేసే అంశమిది. ఇప్పటికే ఒడిదొడుకుల్లో ఉన్న అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను ఈ దాడులు మరింతగా దెబ్బ తీస్తాయి’’అంటూ ఆందోళన వెలిబుచ్చింది. ఇరాన్లోని సౌత్ పార్స్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడి, ప్రతీకారంగా ఖతర్లోని ఎల్ఎన్జీ క్షేత్రం రస్ లఫాన్తో పాటు సౌదీ అరేబియాలో అతి పెద్ద చమురు క్షేత్రమైన ఆరాంకోపైనా ఇరాన్ దాడులు కలకలం రేపడం తెలిసిందే. ఇవి భారత్ను తీవ్రంగా కలచివేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. పౌర సదుపాయాలు, ఇంధన వనరులపై దాడులు కూడదని భారత్ ముందునుంచీ చెబుతూనే వస్తోందని గుర్తు చేశారు. వాటికి తక్షణం తెర దించాలని గురువారం మీడియా సమావేశంలో ఆయన సూచించారు. భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో 40 శాతానికి పైగా ఖతర్ నుంచి వస్తుండటం తెలిసిందే. దాడులు గర్హనీయం: మోదీ పశ్చిమాసియా తాజా పరిణామా లపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చా రు. ఈ విషయమై పలువురు దేశాధినేతలతో ఆయన వేర్వేరుగా సంభాషించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులను గురించి వారితో లోతుగా చర్చించారు. ఇంధన వ్యవస్థలపై దాడులు తీవ్రంగా గర్హనీయమన్నారు. ఉద్రిక్తతలకు తక్షణం తెర దించి శాంతి, సుస్థిరత పాదుగొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హార్మూజ్ జలసంధి గుండా సురక్షిత నౌకాయాన్ని తక్షణం పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వీటన్నింటికీ దౌత్యం, మధ్యవర్తిత్వమే మార్గాలని స్పష్టం చేశారు. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు భారత్ అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు. అధినేతలతో చర్చలు ఫలప్రదంగా సాగినట్టు ఎక్స్ పోస్టుల్లో ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా విషయమై ఆందోళనలతో వారంతా ఏకీభవించినట్టు తెలిపారు. ‘‘అబ్దుల్లా–2, తారిఖ్తో చర్చల సందర్భంగా జోర్డాన్, ఒమన్ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపా. ఇంధన వనరులపై దాడులను ఖండించా’’అని తెలిపారు. గత ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒమన్, జోర్డాన్ అధినేతలతో మోదీ సంభాషించడం ఇది రెండోసారి.పాక్ నైజమే అంత: భారత్న్యూఢిల్లీ: అణ్వాయుధాల వ్యాప్తికి, అధునాతన క్షిపణి వ్యవస్థల విస్తరణకు పాకిస్తాన్ గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందంటూ ఒక నివేదికలో అమెరికా నిఘా వర్గాలు వెలిబుచ్చిన ఆందోళనతో భారత్ ఏకీభవించింది. ‘‘ఇలాంటి వేషాలు పాక్కు కొత్త కాదు. ఆ దేశం నైజమే అంత’’ అంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ గురువారం ఎద్దేవా చేశారు. ‘‘ప్రపంచానికి పాక్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అమెరికా నివేదిక ఆ వాస్తవాన్ని మరోసారి అందరి ముందూ ఉంచంది’’ అని అభిప్రాయపడ్డారు. -
రస్ లఫాన్.. ఇండియాకు కీలకం
ఖతర్ పాలకుల దార్శనికతకు ప్రత్యక్ష రూపమే రస్ లఫాన్ సహజవాయు క్షేత్రం. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యంత అధునాతన సాంకేతికతతో సృష్టించిన అతిపెద్ద సహజవాయు ప్రాసెసింగ్ కర్మాగారంగా ‘రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీ’ ప్రఖ్యాతిగాంచింది. ఖతార్, ఇరాన్ మధ్యలోని పర్షియన్ గల్ఫ్ సముద్రగర్భంలో సహజవాయు నిక్షేపాలను కనుగొనేందుకు 1996లో రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీని నిర్మించారు. వీళ్ల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 1970 దశకంలో అపార సహజవాయు నిక్షేపాలను ఇక్కడి సముద్రగర్భంలో కనుగొన్నారు. ఇరాన్తో కలిసి గ్యాస్క్షేత్రాన్ని అభివృద్ధిచేసి ఖతర్ తన వాటాగా నార్త్ ఫీల్డ్ను తీసుకుంది. దీనినే నార్త్ డోమ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ 20 శాతం ద్రవరూప సహజవాయు అవసరాలను రస్ లఫాన్ క్షేత్రమే తీరుస్తోంది. తమ అ«దీనంలోని 900 ట్రిలియన్ల ఘనపు చదరపు అడుగుల (టీసీఎస్ఎఫ్) మేర సహజవాయువును రస్ లఫాన్ కాంప్లెక్స్ ద్వారా ఖతార్ ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇక్కడే భారీ నౌకలను నిలిపేందుకు వీలుగా ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ నౌకాశ్రయాన్ని నిర్మించారు. దీంతో సీఎన్జీ కంటైనర్ షిప్లు నేరుగా ప్రాసెసింగ్ ప్లాంట్ల దాకా వచ్చి సరుకు నింపుకుని పయనమవుతాయి. ఇక్కడి నుంచి డజన్లకొద్దీ దేశాలకు ఎల్ఎన్జీ ఎగుమతి అవుతోంది. ఖతర్కు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ ప్రత్యక్షంగా భారత ద్రవరూప సహజవాయువు అవసరాలను తీరుస్తోంది. దోహా నగరానికి 80 కిలోమీటర్ల దూరంలోని ఈ పారిశ్రామిక నగరమే భారత 45 శాతం లిక్విడ్ నేచురల్ గ్యాస్ అవసరాలను తీరుస్తోంది. ఖతర్ ఆర్థికవ్యవస్థ పునాదులను పెకళించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు పరోక్షంగా భారత్కు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఎరువులు, సీఎన్జీ, పీఎన్జీ అంతా ఇక్కడే.. భారత్లో దాదాపు 45 శాతం ఎరువుల తయారీ, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) అవసరాలు తీరాలంటే రస్ లఫాన్ క్షేత్రం నుంచి ద్రవరూప సహజవాయువు రావాల్సిందే. భారత్లో 34 శాతం ఎరువుల తయారీతోపాటు వాహనాల్లో సీఎన్జీకి, గృహావసరాలు తీర్చే పీఎన్జీకి రస్ లఫాన్ నుంచి దిగుమతి చేసుకునే ద్రవరూప సహజవాయవునే ఉపయోగిస్తున్నారు. పరిశ్రమల్లో పెట్రోరసాయనాల తయారీకి సైతం ఇదే ఎల్ఎన్జీ అవసరం. కొంతమేర భారత విద్యుత్ అవసరాలనూ ఇదే గ్యాస్ తీరుస్తోంది. అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి పోలిస్తే భారత్ రస్ లఫాన్ క్షేత్రం నుంచి ఎల్ఎన్జీ దిగుమతి చేసుకోవడమే అత్యంత చవకైన వ్యవహారం. అందుకే భారత్ దీనిపైనే అధికంగా ఆధారపడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2028లో భారత్లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్కు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న భారత్కు 2028లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహించే అవకాశం దక్కింది. నేటినుంచి పోలాండ్ వేదికగా ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2026 ప్రారంభం కానుండగా... అంతకంటే ఒక్క రోజు ముందు గురువారం 2028 ఆతిథ్య హక్కులు భారత్కు దక్కినట్లు వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ వెల్లడించింది. భువనేశ్వర్లో ఈ పోటీలు జరుగుతాయి. అయితే శుక్రవారం నుంచి జరిగే పోటీల్లో మన దేశం నుంచి ఒక్క అథ్లెట్ కూడా పాల్గొనడం లేదు! ఈ ఏడాది ఆరంభంలో ఈ ఆతిథ్య హక్కుల కోసం న్యూజిలాండ్తో పాటు భారత్ బిడ్ వేయగా... మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం సంతృప్తి చెందిన కౌన్సిల్ భువనేశ్వర్ను వేదికగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆసియా దేశాల్లో జపాన్ (1999), ఖతర్ (2010), చైనా (2025) మాత్రమే ఈ చాంపియన్షిప్నకు ఆతిథ్యమివ్వగా... ఇప్పుడు భారత్ నాలుగో దేశంగా నిలవనుంది. -
హ్యాపినెస్లో భారత్ స్థానం ఎంతో తెలుసా..?
వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026 మార్చి 19న విడుదలైంది. ఈ నివేదికలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదో ఏడాది ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ రూపొందించిన ఈ నివేదికలో జీవన సంతృప్తి, సామాజిక మద్దతు, అవినీతి తక్కువ స్థాయిలు వంటి అంశాలు ప్రధానంగా పరిగణించబడ్డాయి.ఫిన్లాండ్ తరువాతి స్థానాల్లో ఐస్లాండ్ రెండో స్థానంలో, డెన్మార్క్ మూడో స్థానంలో నిలిచాయి. లాటిన్ అమెరికా దేశమైన కోస్టా రికా నాలుగో స్థానాన్ని సాధించడం విశేషం. ఇది ఆ దేశానికి ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ర్యాంక్. స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వరుసగా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. భారత్ ఎక్కడ..?ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన 147 దేశాల జాబితాలో భారత్ 116 స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రెండు స్థానాలు మెరుగుపడింది. 2025లో ఈ జాబితాలో భారత్ 118 స్థానంలో ఉండింది.చిట్టచివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్అతి తక్కువ సంతోషకరమైన దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఆ దేశం 147వ స్థానానికి పరిమితం కాగా.. దానికి ముందు స్థానాల్లో నియెర్రా లియోన్, మాలావీ, జింబాబ్వే, బోట్స్వానా వంటి దేశాలు ఉన్నాయి.అమెరికాలో సంతోషం క్రమంగా తగ్గిపోతుంది..!వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026లో అమెరికా 23వ స్థానంలో నిలిచింది. గత కొద్ది రోజులుగా ఈ జాబితాలో అమెరికా ర్యాంక్ క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. 2022లో 15వ స్థానంలో ఉండిన ఆ దేశం.. నాలుగేళ్లు తిరిగేసరికి 8 స్థానాలు దిగజారి 23వ స్థానానికి పడిపోయింది.ఈ జాబితాలో అమెరికా సహా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు ఒక్కటి కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాయి. నార్డిక్ దేశాలు మళ్లీ అగ్రస్థానాలను ఆక్రమించాయి. ఈ దేశాల్లో సామాజిక మద్దతు, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు, తక్కువ అవినీతి వంటి అంశాలు ప్రజల సంతోషాన్ని పెంచుతున్నాయని నిర్ధారించబడింది. కోస్టా రికా లాంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ, సామాజిక ఐక్యత, సాంస్కృతిక విలువలతో సంతోష సూచీలో గణనీయమైన పురోగతి సాధించాయి. అమెరికా, భారత్ వంటి పెద్ద దేశాలు సంతోష సూచీలో వెనుకబడటానికి ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక విభజన, రాజకీయ అస్థిరత వంటి అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ నివేదికలో సోషల్ మీడియా, టెక్నాలజీ ప్రభావం వెల్బీయింగ్పై ఎలా ఉందో ప్రత్యేకంగా విశ్లేషించారు. -
ఏఐలో భారత్కి ప్రత్యేక స్థానం: కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో భారత్కి విశిష్ట స్థానం ఉందని టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్ బాబక్ హోద్జాత్ తెలిపారు. డిజిటల్ సిస్టమ్లు, ప్రక్రియల గురించి అపార అవగాహన ఉన్న ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం ఇందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు.ఏఐ సిస్టమ్లను రూపొందించడంలో, వివిధ పరిశ్రమలవ్యాప్తంగా వినియోగాన్ని వేగవంతం చేయడంలో ఈ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఏఐ సాధనాలతో కోడింగ్ సులభతరమవుతున్నప్పటికీ, ఔట్పుట్ నాణ్యతను మదింపు చేయడానికి డెవలపర్లు ఇప్పటికీ అవసరమేనని ఆయన చెప్పారు.వివిధ రంగాలవ్యాప్తంగా మరింత మంది ప్రొఫెషనల్స్కి ఏఐ సాధికారత కల్పిస్తోందని వివరించారు. కంపెనీలు కృత్రిమ మేథ టెక్నాలజీలను వినియోగించుకోవడంలో సహకరించే దిశగా కాగ్నిజెంట్ ఇప్పుడు ఏఐ బిల్డర్ కంపెనీగా రూపాంతరం చెందిందని బాబక్ చెప్పారు.ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. కంపెనీలో అంతర్గతంగా కోడ్ జనరేషన్లో ఏఐ వాటా సుమారు 30 శాతంగా ఉండగా, ఇది గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. -
ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. ఖతార్లోని అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ రాస్ లాఫ్ఫాన్పై ఇరాన్ క్షిపణి దాడి చేసిన విషయం తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్ తమపై చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ దాడి చేసింది. అలాగే, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. అదే సమయంలో ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తుండడంతో భారత్ వంటి దేశాలకు కూడా ఆందోళన కలిగిస్తోంది. చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరులు ఉన్న దేశాలు ఇరాన్ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఫ్యాక్టరీపై దాడి జరిగిన వెంటనే అక్కడ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రపంచంలో అత్యధికంగా ఎల్ఎన్జీ ఉత్పత్తి చేసే దేశాల్లో ఖతార్ ఒకటి. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఖతార్పై ఇరాన్ దాడి మొదటి సారికాదు. మార్చి మొదటి వారంలో ఖతార్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దీంతో ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపింది. ఖతార్ గ్యాస్ క్షేత్రాలు, రాస్ లాఫ్ఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు.. ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిగా జరిగినవని సమాచారం.ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ నాయకత్వంపై వరుస దాడులు చేశాయి. తాజా దాడిలో గూఢచారి విభాగం అధిపతి ఎస్మాయిల్ ఖతిబ్ హతమయ్యాడు. ఇరాన్లో వేల సంఖ్యలో మరణాలు జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలను తగ్గిస్తోంది.భారత్పై ప్రభావం ఈ పరిస్థితులు భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన సహజ వాయువు అవసరాల్లో సుమారు 50 శాతం అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 20 శాతం ఖతార్ నుంచే వస్తుంది.“భారత్ తన సహజ వాయువు అవసరాల్లో 50% విదేశీ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తుంది. అందులో సుమారు 40% ఎల్ఎన్జీ ఖతార్ నుంచి వస్తుంది. అంటే మొత్తం దిగుమతుల్లో దాదాపు 20 శాతం కతార్ నుంచే. భారత్ గ్యాస్ వినియోగాన్ని తగ్గించాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్ రంగంలో వినియోగం తగ్గించాలి” అని ఇంధన ఆర్థిక నిపుణుడు కిరిట్ పారిఖ్ తెలిపారు.ప్రస్తుతం భారత్ రోజువారీ సహజ వాయువు వినియోగం 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు. ఇందులో 97.5 మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు దేశీయంగా ఉత్పత్తి అవుతుంది.గత వారం నాటికి 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇది దిగుమతుల్లో భాగం. ఫోర్స్ మజ్యూర్ పరిస్థితుల వల్ల ఈ అంతరాయం జరిగింది. దీంతో ప్రభుత్వ గ్యాస్ సంస్థలు ఇతర సోర్సుల నుంచి ఎల్ఎన్జీ కోసం ఆర్డర్లు ఇచ్చాయి. -
ముంబై నిద్రపోదు.. ఢిల్లీ త్వరగా లేవదు.. మన భాగ్యనగరం?
ఉరుకుల పరుగుల నగర జీవితంలో భారతీయులు ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఒక కీలక విషయాన్ని విస్మరిస్తున్నారు.. అదే ‘కంటినిండా నిద్ర’. తాజాగా వెలువడిన ఒక జాతీయ సర్వే నివేదిక ప్రకారం.. భారతీయ నగరాల్లో నిద్ర నాణ్యత ఆందోళనకరంగా పడిపోతోంది. ముఖ్యంగా ముంబై నగరం దేశంలోనే అత్యధికంగా నిద్రలేమితో సతమతమవుతుండగా, ఢిల్లీ వాసులు ఆలస్యంగా నిద్రలేవడంలో రికార్డు సృష్టించారు. మరి మన హెదరాబాద్ పరిస్థితి ఏమిటి?ఆరోగ్యానికి నిద్రే ప్రాణాధారంశారీరక ఆరోగ్యానికే కాకుండా, మెదడు పనితీరుకు, మానసిక స్థిరత్వానికి తగినంత నిద్ర అత్యవసరం. నిద్ర తక్కువైతే ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా, దీర్ఘకాలంలో గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, ఆందోళన (Anxiety) వంటి సమస్యలకు దారితీస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా భారతీయులు నిద్రకు దూరమవుతున్నారు.నగరాల వారీగా నిద్ర తీరు తెన్నులుWakefit.co నిర్వహించిన తాజా సర్వే (జనవరి 2025 - మార్చి 2026 మధ్య) భారతీయ మెట్రో నగరాల్లో నిద్ర అలవాట్లపై ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.ముంబై (అత్యంత నిద్రలేమి నగరం): ముంబై వాసుల్లో 76.5 శాతం మంది అర్ధరాత్రి దాటాక నిద్రపోతున్నారు. దాదాపు 60 శాతం మంది పనివేళల్లో కూడా నిద్రతో తూగుతున్నట్లు సర్వే పేర్కొంది.హైదరాబాద్ (సమతుల్య నగరం): మన భాగ్యనగరం ఇతర మెట్రోలతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉంది. ఇక్కడ 42 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతుండగా, 31 శాతం మంది మాత్రమే నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్ని సర్వే 'బ్యాలెన్స్డ్ స్లీపర్ సిటీ'గా అభివర్ణించింది. ఢిల్లీ (ఆలస్యంగా మేల్కొనే నగరం): దేశ రాజధానిలో 45 శాతం మంది ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం.చెన్నై (క్రమశిక్షణ కలిగిన నగరం): నిద్ర వేళల విషయంలో చెన్నై వాసులు కొంత క్రమశిక్షణ పాటిస్తున్నారు. కేవలం 23.8 శాతం మంది మాత్రమే ఆలస్యంగా నిద్రలేస్తున్నారు.కోల్కతా (లేట్ నైట్ సిటీ): ఇక్కడ 75.5 శాతం మందికి రాత్రిపూట చాలా ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంది.బెంగళూరు (నిద్ర వైరుధ్యం): ఐటీ హబ్లో 36.3 శాతం మంది అర్ధరాత్రి దాటాక పడుకుంటున్నారు. అయితే నిద్రలేచిన తర్వాత కూడా 54 శాతం మంది తాము విశ్రాంతి పొందినట్లు భావించడం లేదని వెల్లడయ్యింది.విలన్లుగా మారిన స్మార్ట్ఫోన్లుభారతీయులు నిద్రకు దూరం కావడానికి ప్రధాన కారణం డిజిటల్ వ్యసనమేనని సర్వే స్పష్టం చేసింది. దాదాపు 87.6 శాతం మంది పడుకునే ముందు మొబైల్ ఫోన్లు చూస్తున్నట్లు అంగీకరించారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, ఓటీటీలో బింజ్ వాచింగ్ వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్పాదకతపై పడుతోంది. సుమారు 57.8 శాతం మంది ఆఫీసు పనివేళల్లో నిద్ర వస్తోందని వాపోతున్నారు.ఆందోళనకర గణాంకాలుమరో జాతీయ స్థాయి సర్వే (89,000 మంది స్పందనలు) ప్రకారం 46 శాతం మంది భారతీయులు రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయమే నిద్రపోతున్నారు. రాత్రి 10 గంటల కంటే ముందే నిద్రపోయే వారు కేవలం 12 శాతం మంది మాత్రమే ఉండటం గమనార్హం.నిపుణుల సూచనలుమంచి నిద్ర కోసం రాత్రిపూట స్క్రీన్ టైమ్ తగ్గించాలని, సరైన సమయానికి భోజనం చేసి, బెడ్రూమ్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రను సమతుల ఆరోగ్యానికి ప్రాథమిక అవసరంగా గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: గల్ప్కు మరిన్ని భారత యుద్ధ నౌకలు -
పురుషుల జట్టుకు సులువు మహిళల జట్టుకు క్లిష్టం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లకు భిన్నమైన ‘డ్రా’లు ఎదురయ్యాయి. 2022లో తొలిసారి థామస్ కప్ చాంపియన్గా నిలిచిన భారత పురుషుల జట్టు ఈసారి స్థాయికి తగ్గట్టు ఆడితే క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం ఖాయం. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, కెనడా, ఆ్రస్టేలియా జట్లతో భారత్కు చోటు కల్పించారు. చైనాను మినహాయిస్తే కెనడా, ఆ్రస్టేలియా జట్లపై భారత్ విజయాన్ని ఊహించవచ్చు. రెండు విజయాలు సాధిస్తే భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంటుంది. మరోవైపు ఉబెర్ కప్లో భారత మహిళల జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఆతిథ్య దేశం డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంటుంది. ఉక్రెయిన్పై టీమిండియా సులువుగా గెలవచ్చు. కానీ చైనా, డెన్మార్క్ జట్లపై భారత్ విజయావకాశాలు స్వల్పమే. ఈ నేపథ్యంలో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరాలంటే చైనా లేదా డెన్మార్క్ జట్లలో ఒకదానిపై ఖచ్చితంగా నెగ్గాలి. భారత మహిళల జట్టు 2014, 2016లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. రెండు విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొనే థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీ ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు డెన్మార్క్లోని హోర్సెన్స్ నగరంలో జరుగుతుంది. 2024 థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీలో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో చైనా చేతిలో... భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో జపాన్ చేతిలో ఓడిపోయాయి. -
భారీ ఊరట : చైనాకు వెళ్లాల్సిన 7 రష్యా ట్యాంకర్లు భారత్వైపు
చైనాకు వెళ్లాల్సిన 7 చమురు ట్యాంకర్లు దక్షిణ చైనా సముద్రంలో యూ-టర్న్ తీసుకుని భారత్వైపు మళ్లడం అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కీలకంగా మారింది. రష్యా చమురు నౌకలు చైనా వైపు కాకుండా భారత్ వైపు మళ్లడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు. మాస్కో నుండి దిగుమతులను న్యూఢిల్లీ రెట్టింపు చేయడం ప్రారంభించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.దక్షిణ చైనా సముద్రం గుండా ప్రయాణిస్తూ, మొదట చైనాకు వెళ్లాల్సిన ఏడు రష్యన్ చమురు ట్యాంకర్లు అకస్మాత్తుగా తమ మార్గాన్ని మార్చుకున్నాయి షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, 'ఆక్వా టైటాన్' అనే ఈ నౌక, జనవరి చివరలో బాల్టిక్ సముద్ర ఓడరేవు నుండి లోడ్ చేసుకున్న యురల్స్ కార్గో మార్చి 21న న్యూ మంగళూరుకు చేరుకోనుంది. సూయజ్మాక్స్ జౌజౌ ఎన్. భారతదేశంలోని సిక్కాకు మార్చి 25న చేరుకుంటుందని అంచనా.రష్యా నుండి కొనుగోళ్లను తాత్కాలికంగా పెంచుకోవడానికి భారతదేశానికి అమెరికా అనుమతి ఇచ్చిన కొద్ది రోజులకే, ఈ అఫ్రామాక్స్ నౌక మార్చి మధ్యలో చైనాలోని రిజావో ఓడరేవుకు చేరాల్సి ఉంది. ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!ఎందుకిలా?రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా భారతదేశానికి 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల భారత్ ఎటువంటి ఆంక్షల భయం లేకుండా రష్యా చమురును దిగుమతి చేసుకునే అవకాశం కలిగింది. అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై యుద్ధం ప్రారంభించడంతో, ఇరాన్ ప్రతిచర్యగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేసింది. దీనివల్ల మధ్యప్రాచ్యం నుండి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ వ్యాప్తం చమురు సంక్షోభం ఏర్పడింది. ముడి చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగి, ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు 120 డాలర్లకు చేరుకుంది.ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఇంధన భద్రత కోసం భారత్ రష్యాపై మరింతగా ఆధారపడుతోంది.ఈ ఏడు ట్యాంకర్ల రాకతో దేశీయంగా పెరుగుతున్న చమురు ధరల నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని చైనాకు వెళ్లాల్సిన వనరులు ఇప్పుడు భారత అవసరాలకు ఉపయోగపడనున్నాయని అంచనా ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు -
మాట నిలబెట్టుకున్న ఇరాన్.. హార్ముజ్ నుంచి భారత్ చేరిన భారీ ఆయిల్ షిప్
-
ఇరాన్ కు భారత్ మానవతా సాయం
-
ఖతార్ విమానాల్లో స్వదేశానికి 1,600 మంది
దోహా: ఖతార్ గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ మంగళవారం ఐదు ఖతార్ ఎయిర్ వేస్ విమానాల ద్వారా సుమారు 1,600 మంది భారతీయులు స్వదేశం చేరుకున్నారు. రెండు విమానాలు ఢిల్లీ, ముంబై, కొచ్చి, తిరువనంతపురంలకు ఒక్కోటి చొప్పున విమానాలు వెళ్లాయని అక్కడి భారత దౌత్య కార్యాలయం తెలిపింది.ఖతార్ ఎయిర్వేస్ పరిమిత సంఖ్యలో, నాన్ షెడ్యూల్డ్ విమాన సర్వీసులను మాత్రమే నడుపు తోందని వివరించింది. బుధవారం భారత్లోని తొమ్మిది గమ్యస్థానాలకు మరిన్ని విమానాలు నడుస్తాయని, సీట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. సల్వా భూ సరిహద్దు దాటి సౌదీ అరేబియా మీదుగా భారత్ చేరుకోవాలనుకునే భారతీయ పౌరులకు తాత్కాలిక సౌదీ ట్రాన్సిట్ వీసాల జారీ కొనసాగుతోందని కూడా తెలిపింది. -
ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్
లుసానే (స్విట్జర్లాండ్): హాకీ వరల్డ్ కప్లో పాల్గొనే జట్ల గ్రూప్ల వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వెల్లడించింది. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, రెండు ప్రపంచకప్ విజయాల్లో భాగంగా ఉన్న డచ్ హాకీ క్రీడాకారిణి నవోమీ వాన్ ఆజ్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషుల విభాగంలో, మహిళల విభాగంలో ఒకేసారి ప్రపంచకప్లను నిర్వహిస్తుండటం విశేషం. బెల్జియం, నెదర్లాండ్స్లలో ఆగస్టు 14 నుంచి 30 వరకు పోటీలు జరుగుతాయి. రెండు మెగా టోరీ్నలకు సంబంధించిన వేర్వేరు మస్కట్లను కూడా ఎఫ్ఐహెచ్ విడుదల చేసింది. వరల్డ్ కప్లో మొత్తం 16 జట్ల చొప్పున పాల్గొంటున్నాయి. ఒక్కో పూల్ నుంచి టాప్–2 జట్లు ముందంజ వేస్తాయి. ఎనిమిది టీమ్లతో రెండో దశ నిర్వహిస్తారు. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్లు ఉంటాయి. పురుషుల విభాగంలో పూల్ ‘డి’లో భారత్ బరిలోకి దిగుతోంది. ఈ పూల్లో భారత్తో పాటు పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్ జట్లు ఉన్నాయి. మహిళల విభాగంలో భారత్ పూల్ ‘డి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, చైనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టోర్నమెంట్ మ్యాచ్ల పూర్తిస్థాయి షెడ్యూల్ను నేడు ప్రకటిస్తారు. 2022లో జరిగిన వరల్డ్ కప్లో జర్మనీ, నెదర్లాండ్స్ పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. పూల్ల వివరాలు పురుషుల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్; పూల్ ‘బి’: బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, మలేసియా; పూల్ ‘సి’: ఆ్రస్టేలియా, స్పెయిన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా; పూల్ ‘డి’: భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్. మహిళల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, ఆ్రస్టేలియా, చిలీ, జపాన్; పూల్ ‘బి’: అర్జెంటీనా, జర్మనీ, అమెరికా, స్కాట్లాండ్; పూల్ ‘సి’: బెల్జియం, స్పెయిన్, న్యూజిలాండ్, ఐర్లాండ్; పూల్ ‘డి’: భారత్, ఇంగ్లండ్, చైనా, దక్షిణాఫ్రికా. -
ఉత్తరాలే కాదు.. ఇక లాభాలూ డెలివరీ!
చిన్న పొదుపులు ఇపుడు పెద్ద పెట్టుబడుల దిశగా అడుగులు వేయనున్నాయి.పెట్టుబడుల్లో కొత్త అధ్యాయానికి తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై మీ ఇంటి పక్కన ఉండే పోస్టాఫీసు కేవలం ఉత్తరాలు, సేవింగ్స్ ఖాతాలకు మాత్రమే పరిమితం కాదు. స్టాక్ మార్కెట్ లాభాలను సామాన్యులకు అందించేలా మ్యూచువల్ ఫండ్స్ అమ్మకానికి సిద్ధమవుతోంది. భారత తపాలా శాఖ, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) చేతులు కలపడంతో దేశవ్యాప్తంగా పెట్టుబడుల విప్లవం రాబోతోంది.పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్తో మ్యూచువల్ ఫండ్లు గ్రామీణ ప్రాంతాలతో పాటు, మారు మూల పల్లెలకూ చేరే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన పెంచి, సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిని చేయాలనే సంకల్పంతో పోస్టాఫీసుల ద్వారా ఈ పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు యాంఫి సీఈఓ వెంకట్ చలసాని చెప్పారు. పోస్ట్ ఆఫీసుల నెట్వర్క్తో మ్యూచువల్ ఫండ్లు మెట్రోల నుంచి మండలాలు, పల్లెలోకి అడుగుపెడుతున్నాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో మహారాష్ట్రే దేశంలో అగ్రస్థానంలో ఉంది దేశ మొత్తం ఫండ్ ఆస్తుల్లో 40శాతానికి పైగా వాటా ముంబై, పుణె నగరాలదే. దీంతో మహారాష్ట్రలోని ముంబై, పూణె, నాగపూర్, ఔరంగాబాద్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా తపాలాశాఖ మ్యూచువల్ ఫండ్స్ విక్రయానికి తెరతీసింది. అది విజయవంతం కావడంతో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు కసరత్తు ప్రారంభించింది. రెండో దశలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా పదివేల మంది పోస్టల్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎంపిక చేసిన సిబ్బందికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ శిక్షణ ఇస్తుంది. సర్టీఫై అయిన ఉద్యోగులు పోస్టాఫీసుల ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీములను విక్రయిస్తారు. యాంఫి డి్రస్టిబ్యూటర్గా వ్యవహరిస్తుంది. చిన్న పట్టణాలపై ఫోకస్ దేశంలోని మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో 80 శాతం టాప్ 10 నగరాల నుంచే వస్తున్నాయి. 65 శాతం మందికి అవగాహన ఉన్నా, కేవలం 7 శాతం మాత్రమే అంటే 6 కోట్ల మందే పెట్టుబడి పెడుతున్నారు. గ్రామీణప్రాంతాల, పల్లెలదాకా విస్తరిస్తే వారి సంఖ్య 50 కోట్లకు పెరుగుతుందని యాంఫి అంచనా వేస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ బడ్జెట్ బూస్ట్ఒక్కో కొత్త ఇన్వెస్టర్కు రూ2,000 ప్రోత్సాహకం 2026 బడ్జెట్లో ప్రతి కొత్త మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కు రూ2,000 ప్రోత్సాహకాన్ని ఆరి్ధక మంత్రి ప్రకటించారు. పోస్టల్ సిబ్బందికి ఈ ప్రోత్సాహకంలో భాగస్వామ్యం కల్పించే విధానాన్ని తపాలాశాఖ రూపొందిస్తోంది. ఇది వారి రెగ్యులర్ కమిషన్కు అదనంగా ఉంటుంది. 2025 ఆగస్టు నుంచి అమల్లోకి వచి్చన ఈ ఒప్పందం 2028 ఆగస్టు వరకు మూడేళ్ల పాటు ఉంటుందని యాంఫి వెల్లడించింది. -
ఆత్మనిర్భరతకు సామ్రాజ్యవాద సవాల్
నాలుగు కీలకమైన అంశాల్లో విదేశాలపై ఆధారపడటం ద్వారా స్వతంత్ర భారతదేశం తన అభివృద్ధి ప్రక్రియకు శ్రీకారం చుట్టుకుంది. అవి ఆహారం, విదేశీ మారకద్రవ్యం, రక్షణ సామగ్రి, ఇంధనం. దేశం 1957–58లో ఎదుర్కొన్న విదేశీ మారక ద్రవ్య సంక్షోభం బయట నుంచి ఎదురు కాగల ద్రవ్యపరమైన అవరోధాలను వెల్లడించింది. చైనాతో 1962లో రేగిన యుద్ధం రక్షణ సామగ్రి కొరతను బహిర్గతం చేసింది. 1965–67లో ఏర్పడిన దుర్భిక్ష పరిస్థితులు ఆహార దిగుమతులపై మనం ఎంతగా ఆధారపడి ఉన్నామో తెలిపాయి. గల్ఫ్ యుద్ధం (1990) చమురు ధరలు ఒక్కసారిగా పెరగడానికి దారితీసి, విదేశీ మారక ద్రవ్య చెల్లింపులలో సంక్షోభానికి పురికొల్పింది. అప్పటి ప్రభుత్వాలు ఆ యా సంక్షోభాల నుంచి ఆర్థిక, విదేశాంగ విధాన పాఠాలను నేర్చుకున్నాయి. విదేశాంగ విధానంపై ఒత్తిడిచైనాతో యుద్ధ (1962) కాలంలో రక్షణ పరికరాల లోటుతో అప్పటి ప్రధాని నెహ్రూ గత్యంతరం లేక అమెరికా సాయాన్ని కోరవలసి వచ్చింది. అమెరికా–వియత్నాం యుద్ధంలో భారత్ వైఖరిని మార్పు చేసేందుకు ఆహార ఎగుమతులను పావుగా వాడుకునేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ప్రయత్నించారు. చమురు ధరలు 1990లో అమాంతం పెరిగాయి. తదనంతరం, 1991లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిన సంక్షోభంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ దగ్గర భారత్ చేయి సాచాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ను దౌత్యపరంగా గుర్తించడం దాని పర్యవసాన ఫలితమే. ఈమధ్య కాలంలో, ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత, జి–7 (కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా) దేశాలు బ్యాంక్ ఖాతాలను స్థంభింపజేయడం వంటి చర్యలతో ఆర్థిక లావాదేవీలను ఒక ఆయుధంగా మలచుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంధన సరఫరాలను ఒక ఆయుధంగా వాడుకోవడం మొదలుపెట్టారు. ఇవి విదేశాంగ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించేందుకు అడ్డుపడుతున్నాయి. స్వావలంబనను సాధించడం వ్యూహాత్మకంగా ఎంత ముఖ్యమో తెలియజెబుతున్నాయి. నమ్మక ద్రోహంఅన్ని రకాల వాణిజ్యాలను ముఖ్యంగా ఇంధనం, రక్షణ సామగ్రిని, అధునాతన, కీలక టెక్నాలజీలను ఆయుధంగా వాడుకునే ప్రస్తుత విధానాన్ని అమెరికా ఇకముందు కూడా కొనసాగిస్తుందని మన జాతీయ భద్రతా నిర్వాహకులు గుర్తెరగవలసి ఉంది. గత ఫిబ్రవరిలో అమెరికా–భారత్ చేసిన సంయుక్త ప్రకటన కొంత ఆశలను రేకెత్తించింది కానీ, కడచిన పన్నెండు నెలల పరిణామాలు, అటువంటి భ్రమలేవీ పెట్టుకోకపోవడం మంచిదని సూచిస్తున్నాయి. సైనిక భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను పెంపొందించపజేసుకోవాలని, 21వ శతాబ్దానికి అవసరమైన వాణిజ్యం, టెక్నాలజీలను వేగవంతం చేసుకోవాలని నిర్ణయించుకున్న భారత్–అమెరికా దానికి సంక్షిప్తంగా ఇంగ్లీషులో ‘కాంపాక్ట్’ అనే సంకేత నామాన్ని కూడా పెట్టుకున్నాయి. ‘ట్రస్ట్’గా మరో సంక్షిప్త నామంతో పిలుచుకుంటున్న ఒప్పందం పైన కూడా మోదీ, ట్రంప్ సంతకాలు చేశారు. వ్యూహాత్మక టెక్నాలజీని వినియోగించుకుంటూ అమెరికా–భారత్ తమ సంబంధాలను రూపాంతరం చెందించుకుంటున్నాయని ఆ మాటకు అర్థం. ‘ఇంధనం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేటట్లు చూసేందుకు, ఇంధన మార్కెట్లలో ధరల స్థిరీకరణకు’ వాగ్దానం చేసిన ప్రకటన పైన కూడా ట్రంప్ సంతకం చేశారు. ఆ వాగ్దానానికి విరుద్ధంగా నడచుకోవడం ద్వారా ట్రంప్, గత 25 ఏళ్ళుగా భారత్–అమెరికా మధ్య విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు సాగుతున్న కృషికి తిలోదకాలిచ్చారు. గత పదిహేను రోజుల పరిణామాలు చూశాక, ఇంధన భద్రత విషయంలో ట్రంప్ నేతృత్వంలోని అమెరికాను ఇక ఎంతమాత్రం నమ్మడానికి లేదని భారత్ గ్రహిస్తోంది. పశ్చిమాసియా ఘర్షణలు భారత్ ఇంధన భద్రతకే కాక, ఈ ప్రాంతంలో భారత్ సమీకరించుకోగల ఆర్థిక ప్రయోజనాలకు కూడా చేటు తెస్తాయి. గల్ఫ్లో భారత్ సముపార్జించుకున్న భౌగోళిక–ఆర్థిక ప్రాబల్యానికి అమెరికా–ఇజ్రాయెల్ చర్య ఎసరు పెట్టింది. ఆ రెండు దేశాలు ఒక రకంగా నమ్మక ద్రోహానికి పాల్పడ్డాయి. అవి చేసిన తప్పిదాన్ని ప్రధాని ధైర్యంగా పార్లమెంట్లో ప్రకటించగలగాలి. ట్రంప్ ఆర్థిక–భౌగోళిక రాజకీయ విధానాలు ఏ దిశగా సాగుతున్నాయో తెలుస్తోంది. కనుక, ట్రంప్ పదవీ కాలంలో, అమెరికాతో ఇక ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు మనం సుముఖత చూపకపోవడం మంచిది. మోదీ ప్రభుత్వ ‘ఆత్మనిర్భరత’ విధానం, అమెరికా అనుసరిస్తున్న ‘నయా–సామ్రాజ్యవాద’ విధాన సవాల్కు ఎదురొడ్డి తీరాలి. స్వావలంబన మనకు మనం సాధించుకునేది. అది ఎవరో మంజూరు చేస్తే వచ్చేది కాదు. మూడు దేశాలతో జాగ్రత్త!ఈ బాహ్యపరమైన ఒత్తిడులు కొత్తగా వచ్చిపడుతున్నవి కావు. వాటిని సజావుగా ఎదుర్కొంటూనే భారత్ ముందుకు సాగుతూ వచ్చింది. ప్రస్తుతం, ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరింత అస్థిరంగా, క్లిష్టమైనవిగా పరిణమిస్తున్నాయి. దాంతో మనవైపు కొత్త దుర్బలత్వాలు బయటపడుతున్నాయి. భారతీయ సంతతకి చెందిన వారిని భారత్ చాలా కాలంగా ‘సున్నితమైన శక్తి’గా పరిగణిస్తూ వచ్చింది. విదేశీ మారక ద్రవ్య వనరుగా చూస్తూ వచ్చింది. ట్రంప్ అనుసరిస్తున్న వలస వ్యతిరేక, ‘అమెరికా ఫస్ట్’ విధానాలు, గల్ఫ్లో యుద్ధం, భారతీయ సంతతికి చెందినవారి బలహీన పునాదులను బయటపడేటట్లు చేస్తున్నాయి. పైపెచ్చు, అమెరికా, దాని మిత్ర దేశాలు తమ దేశాల్లో నివసిస్తున్న భారతీయులను చూపి, మన విధానాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ విధంగా, వాటి ఘర్షణల్లోకి మనల్ని లాగుతున్నాయి. బయట నుంచి మనల్ని భయపెట్టే పోకడలను కడసారిగా 1960లు, 1970లలో, ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో చూశాం. మనం అలీన విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, బాహ్య పాత్రధారులకు భారత్ ఒక రంగస్థలంలా మారింది. మరోసారి అదే రకమైన కార్యకలాపాలు కనిపిస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలానికీ, ఇప్పటికీ మధ్య ఒక వైచిత్రి ఉంది. ఒకవైపు భారత్ ఇపుడు మరింత అభివృద్ధి చెందిన, మరింత పలుకుబడి చూపగలిగిన దేశంగా అవతరించిందికానీ, మరోవైపు మరింత దుర్భలమైనదిగా, బాహ్య ప్రభావానికి లోనయ్యేదిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. అనేక రకాల విధానాల విషయంలో ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకున్నట్లుగా మోదీ కనిపిస్తున్నారు. పాలనాపరమైన ముద్రను చాటడంలో ఆయన అచ్చం ఇందిరను తలపిస్తారు. కానీ, బాహ్యపరమైన ఒత్తిడులకు లొంగకుండా ఎదురు నిలవడంలో ఆమెకున్న నిబ్బరాన్ని ఆయన ఇంకా సమీకరించుకున్నట్లు లేదు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పడం బాగానే ఉంది కానీ, అగ్ర దేశాల తప్పులను ఎత్తి చూపడంలోనూ అదే రకమైన తెగువను ప్రదర్శించాలి. మూడు (అమెరికా, రష్యా, చైనా) దేశాలతో సంబంధాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వేటిపై ఆధారపడుతున్నామో అవి మనల్ని లొంగదీసుకునే ఆయుధాలుగా ఉపయోగించుకోకుండా చూసుకోవాలి.సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రధాని మీడియా సలహాదారు -
వాణిజ్య లోటు ఊరట
న్యూఢిల్లీ: దేశం నుంచి గత నెలలో వివిధ వస్తువుల (మెర్కండైజ్) ఎగుమతులు వార్షికంగా 0.8 శాతం క్షీణించి 36.61 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతేకాకుండా ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 27.1 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అయితే పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కావడంతో ఈ ప్రభావం మార్చి నెల వాణిజ్య గణాంకాలపై కనిపించనుంది.మార్చి గణాంకాలు మే నెల మధ్యలో విడుదలవుతాయి. కాగా.. రవాణాపై రాజకీయ, భౌగోళిక సవాళ్లు ప్రభావం చూపడంతో మార్చిలో ఎగుమతులు క్షీణించనున్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ఫిబ్రవరిలో దిగుమతులు 24 శాతంపైగా ఎగసి 63.71 బిలియన్ డాలర్లను తాకాయి. ఇందుకు పసిడి, వెండి దిగుమతులు కారణమయ్యాయి.గోల్డ్ షిప్మెంట్స్ 219 శాతం జంప్చేసి 7.44 బిలియన్ డాలర్లకు చేరగా.. సిల్వర్ దిగుమతులు 285 శాతంపైగా ఎగసి 1.66 బిలియన్ డాలర్లయ్యాయి. మరోపక్క ముడిచమురు దిగుమతులు 9 శాతం అధికమై 12.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే జనవరిలో నమోదైన 34.68 బిలియన్ డాలర్లతో పోలిస్తే గత నెలలో వాణిజ్య లోటు తగ్గింది. వార్షికంగా అంటే 2025 ఫిబ్రవరిలో నమోదైన 14.05 బిలియన్ డాలర్లతో చూస్తే భారీగా పెరిగింది. 11 నెలల్లో..: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– ఫిబ్రవరి కాలంలో దేశ ఎగుమతులు దాదాపు 2 శాతం పుంజుకుని 402.93 బిలియన్ డాలర్లను తాకాయి. ఇదే కాలంలో దిగుమతులు 8.5 శాతం పెరిగి 713.53 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఈ ఏడాది(2025–26) తొలి 11 నెలల్లో వాణిజ్య లోటు 310.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో ఈ లోటు 261.8 బిలియన్ డాలర్లు మాత్రమే.అమెరికాకు ఎగుమతులు డౌన్అధిక టారిఫ్ల భారం కారణంగా అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు ఫిబ్రవరిలో 6.88 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12.88 శాతం తగ్గాయి. భారత్పై అమెరికా 50% పైగా సుంకాలు విధించడం, తర్వాత అక్కడి సుప్రీంకోర్టు వాటిని కొట్టివేయడంతో తిరిగి 150 రోజుల వ్యవధికి 10% విధించడం తెలిసిందే. సుంకాల తగ్గుదల ప్రభావం మార్చి ఎగుమతుల గణాంకాల్లో తెలియనుంది. 11 నెలల వ్యవధిలో..: ఇక ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల వ్యవధిలో అమెరికాకు ఎగుమతులు 3.84% పెరిగి 79.29 బి.డాలర్లకు, దిగుమతులు 15.65% పెరిగి 48.4 బి.డాలర్లకు చేరాయి. మరోవైపు, చైనాకు ఎగుమతులు 37.66% పెరిగి 17.54 బి. డాలర్లకు, దిగుమతులు 119.55 బి. డాలర్లకు ఎగిశాయి. -
USAలో ఆలయాల దాడులపై ఆలోచించండి: రణధీర్ జైశ్వాల్
ఢిల్లీ: భారత్లో మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికాలోని USCIRF కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. అమెరికా ఇతర దేశాల సంస్థలపై నివేదికలు ఇవ్వడం బదులు ఆ దేశంలో హిందువుల ఆలయాలపై దాడులు జరగకుండా చూసుకోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.అమెరికాకు చెందిన (USCIRF) కమిషన్ భారత్లో మతస్వేచ్ఛకు సంబంధించిన విషయాలపై అధ్యయనం చేసింది. భారత్లో క్రమపద్ధతిలో, మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కనుక భారత్ను ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా గుర్తించాలని ప్రభుత్వానికి నివేదించింది. దానితో పాటు మతస్వేచ్ఛ ఉల్లంఘనలకు పాల్పడుతన్నందుకు భారత్కు చెందిన RAW రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ,RSS సంస్థలకు చెందిన వ్యక్తులు మరియు సంస్థల ఆస్తులను స్తంభింపజేయాలని పేర్కొంది.తాజాగా దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. " అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ ఇచ్చిన తాజా నివేదికను మేము పరిశీలించాము. భారతదేశంపై చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాము. అవి ప్రేరేపితమైనవి మరియు పాక్షికమైనవి. గత కొన్ని సంవత్సరాలుగా USCIRF భారతదేశాన్ని వక్రీకృతమైన సమాచారం చూపిస్తూ వస్తోంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే నివేదికలు కమిషన్ యొక్క విశ్వసనీయతను తగ్గిస్తాయి. భారత దేశంపై విమర్శలు మాని అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, అక్కడ నివసిస్తున్న భారతీయ వలసదారులపై పెరుగుతున్న అసహనం, బెదిరింపులపై USCIRF ఆలోచించాలి,” అని తెలిపారు.USCIRF అనేది ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న మతస్వేచ్ఛ పరిస్థితులపై ఏటా నివేదిక అందిస్తుంది. అందులో భాగంగా కొన్ని దేశాలను CPC ప్రత్యేక ఆందోళనకర దేశాలుగా గుర్తించాలని సూచిస్తుంది.. -
భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్!
న్యూఢిల్లీ: భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఖతార్ నుంచి శివాలిక్ నౌక భారత్ చేరుకుంది. ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. ఐఎన్ఎస్ శివాలిక్ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఐఎన్ఎస్ శివాలిక్కు రక్షణగా భారత నావికా దళం వచ్చింది.షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుజరాత్కు చేరింది. ఖతార్లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్ హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించింది. ఇవాళ గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌక సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువచ్చింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఎల్పీజీ గ్యాస్ నౌక భారత్కు సురక్షితంగా రావడం శుభపరిణామ. దేశీయ వంట గ్యాస్ కొరతను తగ్గించడంలో సహాయపడుతోంది. రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. రేపు (మార్చి 17న) ఉదయం 6:30 గంటలకు గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తోంది. ఈ రెండు నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్నాయి. #Fujairah #IranIsraelWar #GlobalEnergy #PMModi #IndianShips #NandaDevi #Shivalik #Delhi $BJP 54 हजार टन LPG लेकर जहाज ‘शिवालिक’ आज मुद्रा पोर्ट पहुंचेगा,नई दिल्ली. मोदी सरकार की कुशल रणनीति और ईरान–इजराइल तनाव के बीच भारत के लिए राहत की खबर है, करीब 54 हजार टन एलपीजी गैस लेकर… pic.twitter.com/YbqSa3dnBM— सिरोही की आवाज (@Sirohikiaawaz) March 16, 2026 -
రన్నరప్గా ముగింపు
సాక్షి, హైదరాబాద్: హాకీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నిలో వరుసగా నాలుగు మ్యాచ్లలో చెలరేగి ఆడిన భారత మహిళల జట్టు చివరి మెట్టుపై నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 0–2 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ తరఫున 13వ నిమిషంలో గ్రేస్ బాల్స్డన్, 43వ నిమిషంలో ఎలిజబెత్ నీల్ గోల్స్ సాధించారు. అయితే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత మహిళల బృందం ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచ కప్కు అర్హత సాధించింది. మ్యాచ్ ఆరంభంనుంచి భారత్ దూకుడు ప్రదర్శించింది. రెండో నిమిషంలోనే జట్టుకు పెనాల్టీ కార్నర్ అవకాశం లభించింది. అయితే దీనిని నిలువరించడంలో ఇంగ్లండ్ గోల్ కీపర్ సఫలమైంది. తొలి క్వార్టర్ ముగియడానికి కొద్ది సేపు ముందు లి క్వార్టర్లో భారత్ జోరు ప్రదర్శించినా...రెండో క్వార్టర్ నుంచి ఇంగ్లండ్కు ఆటపై పట్టు చిక్కి ఆ జట్టు వరుసగా దాడులు చేసింది. చివరకు పెనాల్టీ సాధించిన టీమ్కు బాల్స్డన్ గోల్ అందించింది. ఈ టోర్నికి ఆమెకిది ఐదో గోల్ కావడం విశేషం. రెండో క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా ఎవరికీ గోల్ సాధించే అవకాశం దక్కలేదు. 23వ నిమిషంలో దక్కినా పెనాల్టీని భారత్ వాడుకోలేకపోయింది.అయితే మూడో క్వార్టర్ చివర్లో భారత డిఫెన్స్ను ఛేదించి దూసుకుపోయిన ఎలిజబెత్ గోల్ కీపర్ బిచ్చుదేవిని ఏమార్చడంలో సఫలమై ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. ఈ ఆధిక్యాన్ని సరైన డిఫెన్స్తో కాపాడుకోవడంలో ఇంగ్లండ్ సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి ఒక నిమిషం ముందు కూడా భారత్కు పీసీ దక్కినా అదీ వృథా అయింది. దాంతో గోల్ లేకుండా ఓటమి తప్పలేదు. భారత్ మొత్తంగా నాలుగు పెనాల్టీ కార్నర్లను కూడా ఉపయోగించుకోలేకపోయింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో స్కాట్లాండ్ 1–0తో ఇటలీని ఓడించింది. భారత్కు చెందిన నవనీత్ కౌర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కింది. -
హార్మూజ్ను దాటేసిన... రెండు భారత నౌకలు
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ నిల్వలతో వస్తున్న మరో రెండు భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. భారీస్థాయిలో ఎల్పీజీ నిల్వలతో భారత్ వైపు బయల్దేరాయి. ‘‘శివాలిక్, నందాదేవి అనే రెండు నౌకలు శనివారం ఉదయం హార్మూజ్ను దాటుకుని వచ్చాయి. గుజరాత్లోని ముంద్రా, కాండ్లా రేవులకేసి బయల్దేరాయి’’అని నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. వాటిలో 92,700 టన్నుల ఎల్పీజీ ఉన్నట్టు వెల్లడించారు. శివాలిక్ సోమవారం ముంద్రాకు, ఆ మర్నాడు నందాదేవి కాండ్లాకు చేరే అవకాశముందన్నారు. హార్మూజ్కు పశి్చమాన మరో 22, తూర్పున 4 భారత నౌకలు ఇంకా వెయిటింగ్లోనే ఉన్నట్టు ఆయన వివరించారు.వాటిని కూడా సురక్షితంగా దాటించేలా ఇరాన్ వర్గాలతో కేంద్రం ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. పశి్చమాన నిలిచిన 22 నౌకల్లో ఆరింట్లో ఎల్పీజీ, ఒకదాంట్లో ఎల్ఎన్జీ, నాలుగింట్లో చమురు నిల్వలున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎలీ్పజీకి తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో రెండు నౌకల్లో భారీగా నిల్వల రాక ఉపశమనం కల్పించనుంది. టాంజానియాకు గ్యాసోలిన్ నిల్వలు తీసుకెళ్తున్న జగ్ప్రకాశ్ అనే భారత చమురు నౌక శుక్రవారమే హార్మూజ్ను దాటడం తెలిసిందే. మన దేశీయ ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. వాటిలో 90 శాతం దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచే జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి హార్మూజ్ మూతపడటంతో గల్ఫ్ నుంచి చమురు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయాయి. మళ్లీ రష్యా నుంచే కొనాలని అడుక్కుంటోంది ఇరాన్ ఎద్దేవాదుబాయ్: రష్యా నుంచి ముడిచమురు కొనొద్దని భారత్ను నెలల తరబడి బెదిరించిన అమెరికా ఇప్పుడు గతిలేక భారత్ను బతిమిలాడుతోందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘యుద్ధం మొదలుకాకమునుపేమో రష్యా నుంచి చమురు అస్సలు కొనకూడదని భారత్ను అమెరికా బాగా బెదిరించింది. తీరా యుద్ధం మొదలయ్యాక మార్చి ఐదో తేదీన అమెరికా మాటమార్చింది. యుద్ధం దెబ్బకు హార్మూజ్ మూతబడటంతో రష్యాకాకుండా ఇతర దేశాల నుంచి చమురు కొనాలంటే సాధ్యపడట్లేదు. అందుకే మరో 30 రోజుల సడలింపు ఇస్తున్నాం.. రష్యా నుంచి కొనుక్కోండి అని అమెరికా భారత్కు అడగకపోయినా గడువు పెంచుతూపోతోంది’’అని అబ్బాస్ వెటకారంగా మాట్లాడారు. -
రష్యా నుంచి పెరిగిన చమురు కొనుగోళ్లు
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఈ నెలలో 50 శాతం పెరిగాయి. రోజువారీ 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేస్తోంది. ఫిబ్రవరిలో ఇది 1.04 మిలియన్ బ్యారెళ్లుగానే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో చమురు సరఫరాలు నిలిచిపోవడం తెలిసిందే. దీంతో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకుంది. మన దేశం ప్రతి రోజూ సగటున 5.8 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంటుంది. ఇందులో 2.5–2.7 మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ జలసంధి నుంచే భారత్కు వస్తుంటుంది.అంతేకాదు మన దేశ ఎల్పీజీ అవసరాల్లో 55 శాతం, ఎల్ఎన్జీలో 30 శాతం కూడా ఈ మార్గం నుంచే వస్తుంటుంది. రష్యా నుంచి రోజువారీ 1–1.2 మిలియన్ బ్యారెళ్ల చమురును సమకూర్చుకుంటున్న నేపథ్యంలో హర్మూజ్ను మూసివేయడం కారణంగా మనకు ఏర్పడే లోటు 1.6 మిలియన్ బ్యారెళ్లు (రోజువారీ/బీపీడీ)గా ఉంటుందని కెప్లర్ అనలిస్ట్ సుమిత్ రిటోలియా తెలిపారు. ఇక రోజువారీ ఎల్పీజీ వినియోగం ఒక మిలియన్ బీపీడీగా ఉంటే.. ఇందులో 40–45 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగిలిన మొత్తాన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. ఇందులో 80–90 శాతం హర్మూజ్ జలసంధి నుంచే రావాలి. ఈ మార్గం మూసుకుపోవడంతో దేశీయంగా ఎల్పీజీకి కటకట నెలకొంది. దేశీ సంస్థలు ఉత్పత్తిని 10–20 శాతం పెంచినా సరే, 47–50 శాతం లోటును ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
జాతీయ జెండాతో హార్మోజ్ దాటిన మరో భారత్ గ్యాస్ షిప్..
-
ఫైనల్లో భారత్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు తమ విజయపరంపర కొనసాగిస్తోంది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నిలో టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్–బెల్జియంలలో జరిగే ప్రపంచకప్ టోర్నికి అధికారికంగా అర్హత సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 1–0 గోల్ తేడాతో ఇటలీ జట్టును ఓడించింది. ఆట 40 నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను మనీషా చౌహాన్ గోల్గా మలిచి భారత్కు 1–0 ఆధిక్యాన్ని అందించింది.ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని టీమిండియా విజయాన్ని అందుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ నాకౌట్ మ్యాచ్లోనూ రాణించింది. ఇటలీపై అవకాశం దొరికినపుడల్లా దాడులు నిర్వర్తించింది. మ్యాచ్ మొత్తంలో భారత్కు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. ఇందులో ఒక దానిని మాత్రమే భారత్ సద్వినియోగం చేసుకుంది. ఇటలీ తమకు లభించిన ఒక్క పెనాల్టీ కార్నర్ను వృథా చేసుకుంది. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ 2–0 గోల్స్ తేడాతో స్కాట్లాండ్పై గెలిచింది. ఇంగ్లండ్ తరఫున లాటీ బింఘామ్ (25వ నిమిషంలో), డార్సీ బుర్నీ (29వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ కూడా ప్రపంచకప్ బెర్త్ను దక్కించుకుంది. నేడు జరిగే ఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. మూడో స్థానం కోసం స్కాట్లాండ్తో ఇటలీ పోటీపడుతుంది.9 భారత జట్టు తొమ్మిదోసారి ప్రపంచకప్ టోర్నిలో ఆడనుంది. 52 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నిలో భారత జట్టు 1974లో అత్యుత్తమంగా నాలుగో స్థానాన్ని సాధించింది. 1978లో 7వ స్థానంలో, 2018లో 8వ స్థానంలో నిలిచింది. 2010, 2022లో 9వ స్థానం పొందిన టీమిండియా 1983, 2006లలో 11వ స్థానం, 1998లో 12వ స్థానం సంపాదించింది. -
పాతాళానికి రూపాయి
ముంబై: చమురు ధరల సెగతో దేశీ కరెన్సీ విలువ కరుగుతూనే ఉంది. తాజాగా డాలరుతో మారకంలో రూపాయి 5 పైసలు క్షీణించి 92.30 వద్ద ముగిసింది. వెరసి వరుసగా మూడో రోజు సరికొత్త కనిష్టానికి చేరింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 1.5 శాతం పుంజుకుని 102 డాలర్ల ఎగువకు చేరడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.5 శాతం బలపడి 100ను అధిగమించడం రూపాయిని దెబ్బతీశాయి.దీంతో ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 92.33 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి ఇంట్రాడేలో 92.47 వద్ద మరోసారి చరిత్రాత్మక కనిష్టాన్ని తాకింది. దేశీ స్టాక్స్లో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు కొనసాగుతుండటం సైతం రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఈ ఏడాది జీడీపీ జోరు
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఫిచ్ రేటింగ్స్ పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 7.5 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.7%, 2027–28లో 6.5% మేర వృద్ధి నమోదవుతుందని తాజా అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4%, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.4% చొప్పున వృద్ధి ఉంటుందని లోగడ పేర్కొనడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడిచమురు ధర 2026లో బ్యారెల్కు సగటున 70 బ్యారెళ్ల స్థాయిలో ఉంటుందని అంచనా వ్యక్తం చేసింది.దేశీ డిమాండ్ ఈ ఏడాది వృద్ధిని నడిపించే కీలక అంశమని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల వ్యయాలు 8.6%, పెట్టుబడులు 6.9% చొప్పున పెరుగుతాయని తెలిపింది. 2025 డిసెంబర్తో ముగిసిన క్వార్టర్లో జీడీపీ వృద్ధి 7.8%కి పరిమితం కావడం తెలిసిందే. గతేడాది సెపె్టంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4%గా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఆర్థిక కార్యకలాపాలు భారత్లో నిదానించినట్టు సంకేతాలు కనిపిస్తున్నా యంటూ, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, రుణ వితరణలో రెండంకెల వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. పెట్టుబడుల వృద్ధి పుంజుకుంటుంది.. స్వల్పకాలంలో పెట్టుబడుల వృద్ధి మందగించొచ్చని, సులభతర ఆర్థిక పరిస్థితులు, కనిష్ట స్థాయిలో వడ్డీ రేట్లతో వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధ భాగంలో పుంజుకోవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ ఏడాది, వచ్చే ఏడాదికి వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయిల్లోనే స్థిరపడొచ్చని పేర్కొంది. ప్రపంచ జీడీపీ 2.6 శాతం ప్రపంచ జీడీపీ 2026లో 2.6%గా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇరాన్ యుద్ధంతో ఇంధన ధరలు భారీగా పెరగకపోవచ్చని భావిస్తూ ఈ అంచనాకు వచి్చంది. ఒకవేళ చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లకు చేరి, అక్కడే కొనసాగితే అది ప్రపంచ సరఫరా వ్యవస్థకు పెద్ద షాక్గా మారుతుందని తెలిపింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో క్రూడ్ ఈ నెలాఖరు వరకు 90–100 డాలర్ల స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది. -
వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన
ఢిల్లీ: వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్లో గ్యాస్ సంక్షోభం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్యానిక్ బుకింగ్స్ వద్దని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ కోరారు. అవసరం లేకున్నా ఆందోళనతో గ్యాస్ బుక్ చేయొద్దన్నారు. బ్లాక్ మార్కెట్పై చర్యలు తీసుకుంటున్నామన్న పెట్రోలియం శాఖ.. గ్యాస్ అందుబాటులో ఉందని.. ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. దేశంలో పెట్రోల్ కొరత కూడా లేదని.. 30 శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్పీజీ బదులు ప్రజలు పీఎన్జీ తీసుకోవాలని.. ఎప్పటిలాగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న ప్రజలు.. భారీగా పెట్రోల్ బంక్లు, గ్యాస్ గోడౌన్ల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు, వాణిజ్య సిలిండర్ల కొరతతో అనేక హోటల్స్లలో నుంచి మెనూ మార్చేశారు. కొన్ని డిష్లకు తాత్కాలికంగా మంగళం పాడేశారు. ఇక పలు టీ దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. పలు హోటళ్లు కట్టెలు, పొట్టుతో కూడిన పొయ్యిలపై దృష్టి పెట్టాయి. దీంతో కట్టెలు, పొట్టుకు సైతం డిమాండ్ పెరిగింది. -
నో టెన్షన్.. భూగర్బ రహస్య గుహల్లో చమురు నిల్వలు
పశ్చిమాసియా యుద్ధం భారతదేశ చమురు పరాధీనతను కళ్లకు కట్టింది. విదేశాల నుంచి ముడిచమురు, ద్రవరూప పెట్రోలియం గ్యాస్, ద్రవరూప సహజవాయువు దిగుమతులు హఠాత్తుగా ఆగిపోతే భారత్ కష్టాలకడలిలో పడిపోవడం ఖాయమని వార్తలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితిని చాన్నాళ్ల క్రితమే ఊహించిన భారత్ ముందుజాగ్రత్తగా భారీ స్థాయిలో పెట్రో ఉత్పత్తులను నిల్వచేసుకునే రహస్య భూగర్భ నిల్వ కేంద్రాలను నిర్మించుకుంది. వీటిల్లో మిలియన్ల మెట్రిక్ టన్నుల కొద్దీ ముడిచమురు ఉత్పత్తులను దాచిపెడుతోంది.భారత్ తన 90 శాతం ముడిచమురు, 60 శాతం ఎల్పీజీ, 50 శాతం సీఎన్జీ (CNG) అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ సరకును నిల్వచేసుకోవడంపై దృష్టిసారించింది. ఈ కారణంగానే హార్మూజ్ జలసంధి వంటి కీలక చమురు సరఫరా మార్గాలు మూతబడినా వెంటనే కంగారుపడకుండా తన చమురు నిల్వలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ వంటి దేశాలు ఏకంగా లాక్డౌన్ ప్రకటించి చేతులెత్తేసి చేష్టలుడిగి చూస్తున్నాయి.మూడు చోట్ల మహా గుహలు! చమురు ఉత్పత్తుల దిగుమతులు ఆగిపోయాయనే దిగులుతో భారత్ నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, తమిళనాడులోని పాడూర్లో కేంద్రప్రభుత్వం మూడు భూగర్భ రహస్య నిల్వకేంద్రాలను నిర్వహిస్తోంది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పదేళ్ల క్రితమే 4 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును నిల్వచేసే భారీ భూగర్భ కేంద్రాన్ని నిర్మించారు.ఇందులోని ముడిచమురు (Crude Oil) పది రోజులపాటు యావత్ భారతదేశ అవసరాలను తీర్చగలదు. బాంబు, డ్రోన్ దాడులను తట్టుకునేలా అత్యంత లోతులో వీటిని నిర్మించారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, చమురు ఒలికిపోవడం వంటి లీకేజీ సమస్యలూ ఇక్కడ దాదాపు ఉండవు. గతంలోలాగా ఒకటి రెండు దేశాలపై ఆధారపడకుండా ఏకంగా 40 దేశాల నుంచి ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఏదో ఒకటి రెండు దేశాలు యుద్ధసంక్షోభంలో చిక్కుకున్నాసరే మిగతా దేశాల నుంచి నిరాటంకంగా దిగుమతులు కొనసాగే ఏర్పాట్లు భారత్ చేసుకుంది.అంతర్జాతీయ చమురు సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశంతో తాత్కాలికంగా రష్యా చమురును కొనేందుకు భారత్కు అమెరికా అనుమతి ఇవ్వడంతో వేగంగా భారత్ పావులు కదిపింది. దక్షిణాసియాలో ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన 30 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ కొనుగోలుచేసింది. దీనికితోడు గత పది రోజుల్లోనే ఒక్క అంగోలా నుంచే 34 లక్షల బ్యారెళ్ల ముడిచమురును భారత్ కొనేసింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి మరో 19 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలుచేసింది. ఇలా వచ్చిన సరకును వీలైనంత వరకు భూగర్భం కేంద్రాల్లో దాచేస్తోంది. ఎల్పీజీ స్టోరేజీ సైతం ఊపందుకుంది.అరకిలోమీటర్ లోతులో..కర్ణాటకలోని మంగళూరులో (Mangaluru) ఏర్పాటుచేసిన స్టోరేజీ సామర్థ్యం ఏకంగా 80,000 టన్నులు. ఇది అరకిలోమీటర్ లోతులో ఉంది. ఇదిగాక విశాఖపట్నంలో మరో ఎల్పీజీ నిల్వకేంద్రం ఉంది. దీని సామర్థ్యం 60,000 టన్నులు. ఇవిగాక మరికొన్ని రహస్య భూగర్భ రాతి గుహలను నిర్మించి మరింత ఎక్కువ చమురును నిల్వచేయాలని కొన్ని నెలల క్రితం పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను తమిళనాడులోని పాడూర్లోనూ దాచేస్తోంది. ఒడిశాలోని ఛందీఖోల్లో మరో దానిని నిర్మించనున్నారు.చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే!భూగర్భ గుహలు అనేవి వ్యూహాత్మకంగా సురక్షితమైనవి. భూమి మీది నిల్వకేంద్రాల నుంచి ఎండాకాలంలో కొంతమేర పెట్రో ఉత్పత్తులు వేడికి ఆవిరవుతాయి. భూగర్భంలో ఆ నష్టభయం ఉండదు. యుద్ధకాలంలో తొలిసారిగా స్వీడన్లో ఈ ప్రణాళికను అమలుచేశారు. తర్వాత ఫిన్లాండ్, జపాన్, దక్షిణకొరియా తదితర దేశాలు ఇదే బాటలో పయనించాయి. 1990లో గల్ఫ్ యుద్ధం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో భారత్ ఈ అండర్గ్రౌండ్ స్టోరేజీలకు అంకురార్పణ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గ్యాస్ మంటలు
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు మోదీ ఫోన్
ఢిల్లీ:ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడులు తీవ్రతరంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధం ఇరు వైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తుండడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.ఈమేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ప్రాంతీయ పరిస్థితులపై గంభీరమైన చర్చ జరిపాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను’అని ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘భారతీయ పౌరుల భద్రత, వస్తువులు, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగడం భారత్ ప్రాధాన్యతలు. అంతేకాదు, శాంతి, స్థిరత్వానికి దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన జోక్యం అవసరమని అన్నట్లు ’ప్రధాని మోదీ తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధానికి దారి తీసిన నేపథ్యంలో గత 10 రోజుల్లో ప్రధాని మోదీ అనేక పశ్చిమాసియా దేశాల నాయకులతో మాట్లాడారు. గత నెల ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన తరుణంలో ఇరాన్ ప్రధాని మసూద్ తొలిసారి మాట్లాడారు. తాజాగా మరోసారి మసూద్తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. Had a conversation with Iranian President, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region. Expressed deep concern over the escalation of tensions and the loss of civilian lives as well as damage to civilian infrastructure. The safety and security of…— Narendra Modi (@narendramodi) March 12, 2026అంతకుముందు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత నేతృత్వంలోని ఓ నౌక వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటింది. జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చిన తర్వాత మార్చి 1న రాస్ తనురా నుంచి ముడి చమురుతో బయలుదేరిన షెన్లాంగ్ సూయెజ్మాక్స్ నౌక బుధవారం ముంబయికి చేరుకుందని పోర్ట్ ట్రస్ట్ వెల్లడించింది.ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులతో హర్మూజ్ సంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దీంతో జలమార్గం ద్వారా ముడిచమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
బాహుబలి పాటతో స్ఫూర్తి పొందాం
ముుంబై: భారత్కు టి20 వరల్డ్ కప్ను అందించిన మూడో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఘనత సాధించాడు. ఫైనల్ ముగిసిన రోజునుంచి అతను ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో పలు అంశాలపై అతను మీడియాతో మాట్లాడాడు. విశేషాలు సూర్యకుమార్ మాటల్లోనే... కెప్టెన్సీ, వరల్డ్ కప్ గెలిపించడంపై... రోహిత్ తప్పుకున్న తర్వాత నన్ను కెప్టెన్ను చేస్తారని ఊహించలేదు. ఏడాదిన్నర క్రితం శ్రీలంక వెళ్లడానికి వారం రోజుల ముందు నిన్ను కెప్టెన్గా నియమిస్తున్నామని జై షా చెప్పారు. అప్పుడే కోచ్ గంభీర్తో మాట్లాడి వరల్డ్ కప్ గెలవాలనే ఏకైక లక్ష్యంతో రోడ్మ్యాప్ను సిద్ధం చేశాం. ఆటగాడిగా, కెప్టెన్గా కూడా ప్రపంచ కప్ గెలిస్తే అది చాలా గొప్ప విషయం అవుతుందని అనుకున్నా. ఇప్పుడు అదే జరగడం చాలా సంతోషంగా ఉంది. 2024 ప్రపంచకప్తో పోలిక...అప్పటికంటే మా బ్రాండ్ క్రికెట్కు మార్చాలని నిర్ణయించుకున్నాం. వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టుగా గెలవడం ముఖ్యం అని అందరికీ చెప్పాం. సెమీస్ చేరే వరకు కూడా అత్యధిక పరుగుల, వికెట్ల జాబితాలో మన ఆటగాళ్లెవరూ లేరు. ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించడంతో వరుసగా విజయాలు వచ్చాయి. చాలా మంది మన జట్టు ద్వైపాక్షిక సిరీస్లలో దూకుడుగా ఆడుతుంది. ఐసీసీ ఈవెంట్లలో జాగ్రత్త పడుతుంది అని విమర్శించేవారు. కానీ దీనిని కూడా మార్చాలని, ఇక్కడా అదే ధాటిని కొనసాగించాలని భావించాం.మర్చిపోలేని క్షణాలు... వరల్డ్ కప్ ట్రోఫీని కెప్టెన్గా అందుకోవడం కంటే గొప్ప క్షణం ఏముంటుంది. ఇంకా నమ్మలేకపోతున్నాను అన్నట్లుగా నా చెంపపై రెండు సార్లు దెబ్బ వేసి మరీ ముందుకు సాగాను. మైదానంలో చూస్తే అక్షర్ పట్టిన క్యాచ్ అద్భుతం. నేను 2024 ఫైనల్లో అందుకున్న క్యాచ్ లాంటిదే ఇది కూడా. దక్షిణాఫ్రికా మ్యాచ్ తర్వాత ‘సాహోరే...బాహుబలి’ పాటతో ప్రత్యేకంగా పది నిమిషాల రీల్ చేసి మా వీడియో అనలిస్ట్ మాలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. -
మన నిజమైన భాగస్వాములెవరు?
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశం పోకడలతో చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత దేశపు ‘గొప్ప వ్యూహం’ ఏమిటి? దేశ, విదేశీ వ్యవహారాలలో మన విధానాలు ఏమిటి? అని ప్రశ్నించుకోవడం సము చితం. మనకు మనం నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు అవి ఎలా ఉపకరిస్తాయో ఆలోచించాలి.అసలు వృద్ధి మార్గం‘‘అధికార సమతూకం సూచించే దానికన్నా ఒక పరిస్థితి నుంచి ఎంత ఎక్కువ లాభపడగలమో చూడాలి. అది అధికారాన్ని సృష్టించుకునే కళ’’ అని లారెన్స్ ఫ్రీడ్మ్యాన్ తన ‘స్ట్రాటెజీ: ఎ హిస్టరీ’ అనే పుస్తకంలో వ్యాఖ్యానిస్తారు. అధికారానికి అనేక కొలమానాలుంటా యని బెర్ట్రండ్ రసెల్, ఇంకా చాలామంది చెప్పారు. కనుక, వ్యూహాలు కూడా వాటిని అమలుపరచుకునేందుకు నిర్దేశించుకున్న కాల వ్యవధులను బట్టి అనేక రూపాల్లో, పరిమాణాల్లో ఉంటాయి. మరి గొప్ప వ్యూహం అంటే ఏమిటి? దీనికీ అనేక నిర్వచనాలు న్నాయి. ఎంచుకున్న రంగాన్ని బట్టి అవి మారిపోతూ ఉంటాయి. సైనిక వ్యవహారాల్లో ఒకలా, వ్యాపారంలో ఒకలా! అధికారాన్ని హస్త గతం చేసుకునేందుకే కాదు, దాన్ని నిలబెట్టుకునే, వినియోగించు కునే దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. అయితే, భారతదేశపు గొప్ప వ్యూహం ఏమిటి? అలీనోద్యమం మాదిరిగానే, ‘బహుళ–అనుగుణ్యత’ మన విధానమని ఇపుడు చాలా మంది సూచిస్తున్నారు. కానీ, అది ఆ రెండు భావనలను తప్పుగా అర్థం చేసుకోవడమవుతుంది. అలీనోద్యమమైనా, బహుళ –అనుగుణ్యత అయినా ఒక లక్ష్యాన్ని సాధించుకునే మార్గం. అవి వాటికవే ప్రయోజనాలు కావు. జాతీయ అజెండాయే వ్యూహందివంగత కె.సుబ్రహ్మణ్యం ఈ విషయంలో నాకు గురువు. అభివృద్ధి చెందిన దేశంగా పునరావిర్భవించడం; ఆయుధాలను కాక, విజ్ఞానాన్ని అధికార చలామణీకి సాధనంగా గుర్తించడం భారత దేశపు గొప్ప వ్యూహమని ఆయన చెప్పేవారు. ‘స్వీయ జనాభాతో పాటు మొత్తం మానవాళి సంక్షేమానికి, ప్రపంచ శాంతికి భారత్ పాటుపడాలనీ; పారిశ్రామికీకరణ చెందిన ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తనను తాను అభివృద్ధి చేసుకున్నప్పుడే ప్రపంచంలో దానికి సరైన స్థానం దక్కుతుందనే భావన రాజ్యాంగ పరిషత్ 1947లో చేసిన ప్రమాణంలో ఉందనీ’ సుబ్రహ్మణ్యం 2012లో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. భారత్ చెప్పుకునే ఏ గొప్ప వ్యూహానికైనా ఇదే సరైన నిర్వచనం కావాలని ఆయన సూచించారు. భారత ఉపఖండం ఒకప్పుడు సుసంపన్నమైన ఆర్థిక వ్యవస్థతో వర్ధిల్లింది. 18వ శతాబ్దంలో కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా నాల్గవ వంతుగా ఉంది. చైనాది మరో నాల్గవ వంతు వాటా. ఈ భావనే భారత జాతీయోద్యమ నాయకత్వానికి స్ఫూర్తినిచ్చింది. పదిహేడవ శతాబ్దంలో ప్రపంచ ఆదాయంలో చైనా–భారత్ల వాటా దాదాపు 25 శాతంగా లెక్కకు వచ్చేదని బ్రిటిష్ చరిత్రకారుడు ఆంగస్ మాడిసన్ ఎంతో శ్రమకోర్చి రూపొందించిన గణాంక అధ్యయనంలో వెల్లడించారు. ఈ రెండు దేశాల వాటా 1950 కల్లా 5% కన్నా తక్కువకు పడిపోయింది. రెండు దేశాలు వలస పాలకు లను గద్దె దింపి, ప్రపంచ ఆదాయంలో తమ వాటా తిరిగి దక్కించు కోవాలని కోరుకున్నాయి. ప్రపంచ దేశాల సరసన తనకుండవలసిన గౌరవ స్థానాన్ని పునరుద్ధరించుకునేందుకూ, ప్రపంచ ఆదాయ, వాణిజ్యాలలో రావలసిన వాటాను దక్కించుకునేందుకూ వీలు కల్పించే అంతర్జాతీయ క్రమ వ్యవస్థ రూపుదిద్దుకునేటట్లు చూడటం స్వతంత్ర భారతదేశ జాతీయ అజెండా అయింది. ఒక రకంగా, అదే దాని గొప్ప వ్యూహమని చెప్పుకోవచ్చు. అమెరికాను నమ్మగలమా?ప్రపంచ పర్యావరణం సానుకూలంగా ఉన్నప్పుడే ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేయగలుగుతుంది. ప్రపంచ వ్యవ హారాలలో ప్రస్తుత స్థితిని చూడండి: అమెరికా, ఇజ్రాయెల్ తీసుకునే చర్యలు భారత్ ఆర్థికాభివృద్ధికి దోహదపడే ప్రపంచ, ప్రాంతీయ పర్యావరణాన్ని సృష్టించేవిగా ఉన్నాయా? లేకపోతే, మనం మౌన ముద్ర వహించడానికి బదులుగా వాటి చర్యలకు అభ్యంతరం చెప్ప వద్దా? అల్లకల్లోల పశ్చిమాసియా ‘వికసిత్ భారత్’ దిశగా భారత్ పయనాన్ని మందగింపజేయడం లేదా? అలా అయితే, మోదీ ప్రభుత్వ ప్రస్తుత వైఖరి మన గొప్ప వ్యూహానికి అనువైనదిగానే ఉందా?భారత్ గొప్ప వ్యూహ సాధనకు అమెరికా ఒక భాగస్వామిగా తోడ్పడగలదనే ఉద్దేశంతోనే మనం దానితో వ్యూహాత్మక భాగ స్వామ్యం కుదుర్చుకున్నాం. ఆ లక్ష్య సాధనకు చేసే కృషిలో అమెరి కాను ఇక ఎంతమాత్రం ‘వ్యూహాత్మక’, ‘విశ్వసనీయ’ భాగస్వామిగా పరిగణించడానికి లేదని ఇటీవలి పరిణామాలు, ట్రంప్ ప్రభుత్వ ప్రకటనలు సూచిస్తున్నాయి. మన రాజ్యాంగ సూత్రాలు, విలువలే మనల్ని ఒక ఉదారవాద, బహుళ సాంస్కృతిక, సెక్యులర్ ప్రజాస్వామిక దేశంగా నిల బెడుతూ, ప్రపంచంలో మనకొక స్థాయిని కల్పిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రధాన దేశాలు అనుసరిస్తున్న సైనిక, ఆర్థిక విధానాలు భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించేందుకు; ఉదారవాద, బహుళత్వ, సెక్యులర్ ప్రజాస్వామిక దేశంగా వర్ధిల్లేందుకు దోహదపడే ప్రపంచ పర్యావరణాన్ని సృష్టించేవిగా లేవు.ఈ నేపథ్యంలో మనల్ని మనం ఎలా పరిపాలించుకుంటాం, ఎలా అభివృద్ధికి బాటలు పరచుకుంటామన్నది మరింత ముఖ్యమైనఅంశంగా పరిణమిస్తుంది. మనం దేశీయంగా అనుసరిస్తున్న విధానాలు ఆత్మనిర్భరత, ‘వికసిత్ భారత్’ లక్ష్యాల సాధనకు వీలు కల్పించేవిగా ఉన్నాయా? క్రమేపీ మత భావనలను పెంచుకుంటున్న పాలక వ్యవస్థ అనుస రిస్తున్న విధానాలు ఆర్థికాభివృద్ధిని మందగింపజేసేవిగా ఉన్నాయి. మన రాజ్యాంగం దేన్ని గొప్ప వ్యూహంగా వీక్షించిందో ఆ ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నవిగా లేవు. సరిగ్గా ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వం దేశ, విదేశాలలోని పరిణా మాలను మరింత దీర్ఘకాలిక దృష్టితో పరిశీలించవలసి ఉంది. దేశీయ, ప్రపంచ పరిణామాలను వేటికవిగా తాత్కాలిక దృష్టితో చూడటంతోనే సమస్య వచ్చి పడుతోంది. అంతర్జాతీయ వ్యవస్థలో మౌలికమైన మార్పులు చోటుచేసుకుంటున్నప్పుడు, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు నిజంగా చేయూత నివ్వగల భాగస్వాములెవరో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కర్తవ్యం మన చేతుల్లోనే ఉంది. కానీ, బాహ్య వాతావరణం కూడా లెక్కకు వస్తుంది. సంజయ బారువ్యాసకర్త జర్నలిస్ట్ – ప్రధానికి మాజీ మీడియా సలహాదారు -
హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇంధన కొరతతో హోటళ్ల మూసివేతలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. కొంత మొత్తంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేస్తామని తెలిపింది. లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది.అంతేకాదు, ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు అదనంగా 40,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపు కూడా చేశామని తెలిపింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. రోజూ దాదాపు 50 లక్షల సిలిండర్ల పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఎక్కడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.కానీ భయాందోళనల కారణంగా బుకింగ్లు అనేక రెట్లు పెరిగాయని సుజాత శర్మ చెప్పారు. భయంతో బుకింగ్ చేయవద్దని పౌరులను కోరారు. ప్రాధాన్యం ఆధారంగా కమర్షియల్ సిలిండర్లు పంపిణీ జరిగేందుకు లబ్ధిదారుల జాబితా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థన పంపినట్టు తెలిపారు.ప్రతి త్రైమాసికంలో రాష్ట్రాలకు దాదాపు లక్ష కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపును ప్రభుత్వం చేస్తుందని ఆమె తెలిపారు. ఇవాళ ఉత్తర్వు విడుదల చేసి మరో 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తున్నామని చెప్పారు.ఇప్పుడు ఎల్పీజీ ఉత్పత్తి 28 శాతానికి పెరిగిందని శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ రిటైల్ అవుట్లెట్ నెట్వర్క్ ఉందని చెప్పారు. దాదాపు లక్ష రిటైల్ అవుట్లెట్లు దేశంలో పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం ప్రజా రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధీనంలో ఉన్నాయని చెప్పారు. ఏ రిటైల్ అవుట్లెట్ వద్ద కూడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.భయంతో సిలిండర్ బుకింగ్లుఎల్పీజీ కొరతపై భయాందోళనలు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి. వినియోగదారులు భయంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి సిలిండర్లు బుక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయ ప్రయత్నాలు అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు, గ్యాస్ కొరత కారణంగా దేశంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూసేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. దేశంలో ఇంధన కొరత లేదని ఇవాళ లోక్సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. -
యుద్ధం వేళ.. ఇరాన్తో చర్చించిన భారత్
న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి వద్ద దాడులు పెరుగుతున్న వేళ ఇరాన్తో నౌకాయాన భద్రతపై భారత్ చర్చించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నౌకాయాన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీపై చర్చించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న పరిస్థితి, సముద్ర రవాణాకు ప్రమాదాలు పెరుగుతున్న సమయంలో ఈ చర్చలు జరిగాయి. ఆ మార్గం ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణించటం, చమురు సరఫరా స్థిరంగా కొనసాగటం వంటి అంశాలపై కేంద్రీకృతమైందని ఈ చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిది రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు.ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పలుసార్లు సంప్రదింపులు జరిపారని జైస్వాల్ తెలిపారు. “గత కొన్ని రోజుల్లో భారత విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య పలుసార్లు సంభాషణ జరిగింది. చివరిసారిగా జరిపిన చర్చలో నౌకాయాన భద్రత, భారత ఎనర్జీ భద్రతకు సంబంధించిన అంశాలు చర్చించాం. ఇంకా మేము ఏమి చెప్పినా తొందరపాటే అవుతుంది” అని తెలిపారు.పశ్చిమాసియా యుద్ధం వేళ హోర్ముజ్ జలసంధి వద్ద కూడా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇటీవలి జరిగిన దాడుల్లో పలు నౌకలు దెబ్బతినడంతో ప్రపంచ నౌకాయాన వ్యవస్థ, ఎనర్జీ సరఫరాపై అంతరాయాలు కలుగుతున్నాయి.మరోవైపు, ఇవాళ సౌదీ ఆయిల్ ట్యాంకర్ నౌక ముంబై చేరుకుంది. లైబీరియాకు చెందిన నౌకలో క్రూడాయిల్ దిగుమతి అయింది. యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ దాటిన మొదటి నౌక ఇదే. 1.35 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి అయింది. -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. విదేశీ తయారీ రంగంలో అనుసరిస్తున్న ‘అనుచిత వాణిజ్య విధానాలపై’ విచారణ చేపట్టాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. ఈ జాబితాలో భారత్ సహా ప్రపంచంలోని 16 ప్రధాన ఆర్థిక వ్యవస్థలను చేర్చడం గమనార్హం. అమెరికా పారిశ్రామిక రంగాన్ని కాపాడుకునేందుకు, విదేశాల నుంచి వస్తున్న మిగులు ఉత్పత్తిని అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ట్రంప్ విధించిన సుంకాలను నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ఈ కొత్త విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) జామీసన్ గ్రీర్ బుధవారం ఈ విచారణలపై అధికారిక ప్రకటన చేశారు. 1974 వాణిజ్య చట్టంలోని ‘సెక్షన్ 301’ కింద ఈ విచారణలు ప్రారంభించనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో భారత్ వంటి దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై భారీగా పన్నులు మోపే అవకాశం ఉంది.అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలను ఈ విచారణలో ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. వీటితో పాటు స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, సింగపూర్, థాయ్లాండ్, మలేషియా, కంబోడియా, వియత్నాం, బంగ్లాదేశ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ‘చాలా దేశాలు తమ దేశీయ అవసరాలకు మించి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ మిగులు ఉత్పత్తిని అమెరికాపైకి నెట్టడం వల్ల మా దేశీయ తయారీ రంగం దెబ్బతింటోంది. అమెరికా పారిశ్రామిక పునాదిని ఇకపై బలి చేయబోము’ అని జామీసన్ గ్రీర్ పేర్కొన్నారు.ఇటీవలే భారత్-అమెరికా మధ్య ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందన్న హామీతో, అమెరికా తన సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. గతంలో ట్రంప్ చేపట్టిన ‘లిబరేషన్ డే’ విన్యాసాల తర్వాత భారత్పై 25 శాతం సుంకాలు ఉండగా, రష్యా చమురు కొనుగోలు నెపంతో మరో 25 శాతం పెనాల్టీ విధించారు. తాజా విచారణతో ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం పడుతున్నదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు? -
యుద్ధ ఉద్రిక్తతల వేళ క్షిపణి పరీక్ష!
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు యుద్ధ వాతావరణంతో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్షణక్షణం ఉత్కంఠతో అన్ని దేశాలు పరిస్థితులను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న తరుణంలో భారత్ నోటమ్ జారీ చేసింది. విశాఖపట్నం తీరంలో సముద్రంలో ప్రయోగించనున్న క్షిపణి పరీక్ష కోసం ప్రమాద ప్రాంతాన్ని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటీస్ టు ఎయిర్మెన్ (నోటమ్) ప్రకారం, ఈ మిసైల్ టెస్టింగ్ ఈ నెల 13 నుంచి 16 వరకూ జరగనుందని స్పష్టం చేసింది.నోటమ్ అంటే..ఇందుకోసం విశాఖపట్నం తీరానికి 500 కిలోమీటర్ల తర్వాత ఉన్న ప్రాంతాన్ని డేంజర్ జోన్గా డిక్లేర్ చేశారు. విమాన కార్యకలాపాలు, సముద్ర భద్రతను ప్రభావితం చేసేందుకు యుద్ధ నౌకలు, జలాంతర్గాములను అప్రమత్తం చేసేందుకు ఈ డేంజర్ జోన్ని ప్రకటించారు. దీని ఆధారంగా పైలెట్లు, విమానయాన సంస్థలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు నోటమ్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ని అందజేయనున్నారు. విమాన ప్రయాణానికి ఆటంకం కలిగించే మార్పులు లేదా ప్రమాదాల గురించి పైలెట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, విమానయాన సిబ్బందికి ముందుగానే ఇచ్చే హెచ్చరిక ప్రకటననే ‘నోటమ్’ అని పిలుస్తారు. ఈ డేంజర్ జోన్ ప్రకటన ఉన్నంత వరకూ ఆ పరిధిలో పౌర, యుద్ధ విమానాలు ఎగరనీయకుండా దారి మళ్లిస్తారు. 13 నుంచి 16వ తేదీ మధ్యలో ఎప్పుడైనా ఈ క్షిపణి పరీక్ష ఉండే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు సమాచారం. ఇటీవల కాలంలో విశాఖలో అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ సామర్థ్యం ఉన్న కే – 4 బాలిస్టిక్ మిసైల్ టెస్టింగ్ని ఐఎన్ఎస్ అరిఘాత్ సబ్మెరైన్ నుంచి భారత్ విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరింది. ఈసారి ఏ క్షిపణిని పరీక్షిస్తారనేది రక్షణ వర్గాలు గోప్యంగా ఉంచాయి. యుద్ధ వాతావరణ సమయంలో భారత్ చేస్తున్న క్షిపణి ప్రయోగంపై అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
సామాన్యుడికి షాక్.. పెళ్లిళ్లు వాయిదాపడే పరిస్థితి?
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై తీవ్రంగా పడింది. నిన్న బెంగళూరు, విశాఖ, ముంబై నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూతపడగా.. ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు సిలిండర్ బండలతో రోడ్డెక్కారు. కొన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెళ్లిళ్లు వాయిదాపడే పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా కష్టాలు మొదలయ్యాయి. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్తో పాటు.. బిహార్లో పోలీసుల బందోబస్తు నడుమ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ఈ రాష్ట్రాల్లోని కీలక నగరాల్లో ఒకట్రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్లో ఎల్పీజీ బ్లాక్ మార్కెటింగ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై దృష్టి సారించాయి.రోజురోజుకీ పరిస్థితి తీవ్రంఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మధ్యప్రదేశ్లో ఆ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే వారం రోజుల్లో ఒక్క భోపాల్లోనే వెయ్యికి పైగా పెళ్లిళ్లు షెడ్యూల్ అయినట్లుగా తెలుస్తోంది. గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం ఉండడంతో.. పెళ్లింట భోజనాలు ఉంటాయా? అనే ఆందోళనలు వధువు, వరుడి తరఫు వారిలో నెలకొంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో క్యాటరింగ్ నిర్వాహకులు, హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు పెళ్లిళ్ల సీజన్ దాటిపోతోందని, అడ్వాన్సులు తీసుకున్న తమకు నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవిధంగా ఇది అత్యయిక స్థితిని తలపిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.యూపీలో పోలీసుల బందోబస్తు నడుమ..యూపీలో గడిచిన నాలుగైదు రోజులుగా ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లు పెరిగాయి. బుకింగ్ల మధ్య 25 రోజుల గ్యాప్ అనే నిబంధన కొనసాగుతున్నప్పటికీ.. అసాధారణంగా బుకింగ్లు పెరుగుతున్నాయని ఎల్పీజీ డీలర్లు చెబుతున్నారు. గోరఖ్పూర్, సిద్ధార్థనగర్ ప్రాంతాల్లో పౌరులు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల ముందు క్యూకట్టారు. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరినట్లు ఇప్పుడు యూపీలో ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఏజెన్సీల వద్ద క్యూకట్టారు. అయితే.. వారందరికీ సిలిండర్లు సర్దుబాటు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, టోకెన్లు ఇచ్చి, రాబోయే రోజుల్లో పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారు దుర్గా..బిహార్లో బుకింగ్ల నిలిపివేత?రెండ్రోజులుగా బిహార్లో కమర్షియల్ సిలిండర్ల బుకింగ్లను చమురు సంస్థలు నిలిపివేశాయి. దీంతో.. బెంగళూరు మాదిరిగానే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు బంద్కు సిద్ధమవుతున్నారు. డొమెస్టిక్ బుకింగ్లు కొనసాగుతున్నప్పటికీ.. బ్లాక్మార్కెటింగ్ భయాలు ఉండడంతో ప్రజలే ఏజెన్సీల వద్దకు ఖాళీ సిలిండర్లతో చేరుకుంటున్నారు. దీంతో.. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా గోపాల్ గంజ్, ఖగారియా, ఔరంగాబాద్, పట్నా నగరాల్లో తెల్లవారుజాము నుంచే ప్రజలు సిలిండర్ బండ కోసం క్యూలైన్లలో నిలబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే.. డీలర్లు తమపై దాడులు జరిగే ప్రమాదాలున్నాయనే భావనతో ఏజెన్సీలను తెరవడం లేదు.రాజస్థాన్లో బ్లాక్ మార్కెటింగ్?కమర్షియల్ సిలిండర్ ధర 19 వందల రూపాయలదాకా ఉండగా.. ఇప్పుడు రాజస్థాన్లో బ్లాక్ మార్కెటర్లు దాన్ని 2,500 నుంచి మూడువేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ ఓ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, అక్రమార్కుల దందాను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించారు. లూథియానా, ఫరీద్కోట్, హోషియార్పూర్, పటియాలా ప్రాంతాల్లో చమురు సంస్థల వెబ్సైట్లు డౌన్ కావడంతో.. కొత్త బుకింగ్లు జరగడం లేదని తెలుస్తోంది దుర్గా..కేంద్ర ప్రభుత్వం చర్యలు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిన్ననే ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో చమురు కంపెనీల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరాను ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే నిబంధనను నిక్కచ్చిగా అమలు చేస్తోంది. గ్యాస్ డెలివరీ బాయ్స్ దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేందుకు ఓటీపీ ఆధారిత డెలివరీని అమలు చేస్తోంది. మరోవైపు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. - సాక్షి వెబ్డెస్క్ -
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
-
వంట గ్యాసే ఫస్ట్.. ప్రజలు ఆందోళన చెందొద్దు
-
విద్యకు విశ్వ ‘భారతం’
సాక్షి, స్పెషల్ డెస్క్: మన దేశంలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దక్షిణాసియా నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు భారత్కు వస్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి కూడా డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వంటి విధాన సంస్కరణలే ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. అయితే మౌలిక సదుపాయాలు, గుర్తింపు, ఉపాధి అవకాశాలతో ముడిపడిన సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. 2025లో వివిధ దేశాలకు చెందిన 58,000 మంది విద్యార్థులు భారత్లో చదువుతున్నట్టు అంచనా. మన దేశంలోని విద్యా సంస్థల్లో చేరే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య 2030 వరకు ఏటా సుమారు 8% పెరుగుతుందని అంతర్జాతీయంగా ఉన్నత విద్య సమాచారం, ర్యాంకింగ్స్ను అందించే లండన్కు చెందిన క్యూఎస్ తన ‘క్యూఎస్ గ్లోబల్ స్టూడెంట్ ఫ్లోస్: ఇండియా 2026’నివేదికలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యా గమ్యస్థానాలలో ఒకటిగా భారత్ నిలుస్తుందని వెల్లడించింది. భారత్కు కొత్త అవకాశాలు.. పదేళ్లలో భారత్కు వచ్చే అంతర్జాతీయ వి ద్యార్థుల సంఖ్య పెరగడానికి దేశీయంగా ప్ర భుత్వ విధాన సంస్కరణలు, దక్షిణాసియా –ఆఫ్రికా నుంచి పెరుగుతున్న డిమాండ్, సంప్రదాయ విదేశీ విద్యా గమ్యస్థానాలలో విపరీతంగా పెరుగుతున్న ఖర్చులు ప్రధాన కారణం. భారత్ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2047 నాటికి 5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తెలి సిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా నాణ్యమై న విద్య కోసం అధికం అవుతున్న డిమాండ్ భారత్కు కొత్త అవకాశాలను కలి్పస్తోంది. వీసా నిబంధనలతో.. ఆంగ్లం మాట్లాడే విద్యా గమ్యస్థానాలైన అమెరికా, యూకే, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలు ఇటీవల వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అక్కడ ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు విపరీతంగా పెరగడం వల్ల ప్రపంచ విద్యా రంగంలో మార్పులు వస్తున్నాయి. దీంతో చాలా మంది విద్యా ర్థులు తక్కువ ఖర్చుతో కూడిన, సులభంగా ప్రవేశం లభించే విద్యా కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్లో విద్యా వ్యయం తక్కువగా ఉండడం, విస్తరిస్తున్న ఉన్నత విద్యా వ్యవస్థ విదేశీ విద్యార్థులకు ప్రధాన ఆకర్షణలుగా మారుతున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి.. ⇒ పెరుగుతున్న ఆదరణ: దక్షిణాసియా తర్వాత ఆఫ్రికా దేశాల నుంచి ప్రధానంగా సబ్–సహారన్ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ⇒ వృద్ధి రేటు: విద్యార్థుల రాక ఏటా 6% వృద్ధి చెందుతుందని అంచనా. ఈ దేశాల్లో యువత ఎక్కువ. ఉన్నత విద్యకు పరిమితమైన అవకాశాలు. ⇒ జింబాబ్వే: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. 2024లో భారత్కు విద్యార్థులను పంపిన దేశాల్లో 7వ స్థానం. 2030 నాటికి 6వ స్థానానికి చేరుకుంటుందని అంచనా. మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా.. ⇒ స్థిరమైన సహకారం: ఈప్రాంతం నుంచి విద్యార్థుల రాక స్థిరంగా కొనసాగుతోంది. ⇒ యూఏఈ: 2030 నాటికి భారత్లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 5% వరకు ఉండే అవకాశం.ఆకర్షణీయమైన అంశాలు..⇒ భౌగోళిక సామీప్యత: పొరుగు దేశాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రయా ణ సౌలభ్యం మెరుగ్గా ఉండటం. ⇒ సాంస్కృతిక సారూప్యత: ఆహారం, జీవనశైలి, భాషాపరంగా ఉన్న దగ్గరి సంబంధాలు విద్యార్థులకు సౌకర్యవంతంగా అనిపించడం. ⇒ తక్కువ ఖర్చు: ఇతర దేశాలతో పోలిస్తే విద్యా, జీవన వ్యయాలు చాలా తక్కువగా ఉండటం. ⇒ ప్రధాన సమస్య: భారతీయ విద్యా సంస్థల విషయంలో కంపెనీల దృష్టిలో గుర్తింపు, విద్యాపరమైన గుర్తింపు మధ్య పెద్ద వ్యత్యాసం. ⇒ మెరుగుపడిన ఎంప్లాయర్ ర్యాంకింగ్: గత దశాబ్దంలో భారతీయ గ్రాడ్యుయేట్లపై కంపెనీలకు ఉన్న నమ్మకం, గుర్తింపు గణనీయంగా పెరిగింది. ⇒ స్థిరంగా ఉన్న అకడమిక్ సూచీలు: విద్యా నాణ్యత, పరిశోధనలు, అంతర్జాతీయ విద్యా ప్రమాణాల పరంగా ఉండే గుర్తింపులో మాత్రం పెద్దగా మార్పు లేదు.భారత్లో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో దక్షిణాసియా దేశాలు దాదాపు సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే విద్యార్థులు మొత్తం ప్రవేశాలలో 30% కంటే ఎక్కువ. రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతం నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా నేపాల్ కొనసాగుతుందని అంచనా. -
టార్పిడోల తయారీ కోసం వీఈఎం, టీకేఎంఎస్ ఒప్పందం
హైదరాబాద్: భారత్లో సంయుక్తంగా టార్పిడోలను ఉత్పత్తి చేయడానికి వీఈఎం టెక్నాలజీస్, టీకేఎంఎస్ సహకార ఒప్పందం (టీమింగ్ అగ్రిమెంట్)పై సంతకాలు చేశాయి. టార్పిడో అంటే జలాంతర్గాములు, యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే సముద్ర యుద్ధ ఆయుధం. టార్పిడోకు సంబంధించిన సాంకేతికత బదిలీ, “మేక్ ఇన్ ఇండియా”కు ఊతం ఇచ్చేలా హెవీవెయిట్ టార్పిడోను సంయుక్తంగా అభివృద్ధి చేయడం కోసం ఈ సహకార ఒప్పందం చేసుకున్నారు. భారత మార్కెట్కు ఆధునిక హెవీవెయిట్ టార్పిడోలు సరఫరా కావడానికి ఈ ఒప్పందం బాగా ఉపయోగపడుతుంది. సాంకేతిక స్వావలంబనకు ఊతం ఇవ్వడం, స్థానిక రక్షణ పరిశ్రమను మరింత విస్తరించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో టీకేఎంఎస్ సంస్థ సహకార ఒప్పందం (టీమింగ్ ఒప్పందం)పై సంతకం చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ ప్రముఖ రక్షణ సంస్థ ఆయుధ వ్యవస్థలు, గగనతల వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, తయారీ రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది. అట్లాస్ ఎలక్ట్రానిక్ విభాగం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు మైఖేల్ ఓజెగోవ్స్కీ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తమ టార్పిడో సాంకేతికత బదిలీ ద్వారా భారత నౌకాదళం మరింత శక్తిమంతం అవుతుందని తెలిపారు. వీఈఎం టెక్నాలజీస్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు.మొదటి దశలో ఈ సహకార ఒప్పందం ద్వారా.. హెవీవెయిట్ టార్పిడో తయారవుతుంది. భవిష్యత్లో అభివృద్ధి చేసే టార్పిడో ప్రోగ్రామ్స్లో టీకేఎంఎస్, వీఈఎం మధ్య మరింత సహకారం కూడా సాధ్యమని భావిస్తున్నారు.వీఈఎం, టీకేఎంఎస్ మధ్య సంయుక్త సంస్థను కూడా స్థాపిస్తారు. ఈ సంస్థ ద్వారా భారత మార్కెట్కు దీర్ఘకాలంగా ఉన్నత ప్రమాణాల హెవీవెయిట్ టార్పిడోల సరఫరా జరుగుతుంది. అదే సమయంలో ఎగుమతి అవకాశాలు కూడా తెరుచుకుంటాయి. టీకేఎంఎస్ విభాగమైన అట్లాస్ ఎలక్ట్రానిక్ వీఈఎంకు అవసరమైన సాంకేతికత బదిలీ చేస్తుంది. సాఫ్ట్వేర్ అనుమతి పత్రాలు కూడా అందిస్తుంది. దీనివల్ల భారత తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి సాధ్యం అవుతుంది.టీకేఎంఎస్ ప్రపంచంలోని ప్రముఖ నౌకాదళ సంస్థల్లో ఒకటి. కీల్, విస్మార్, ఇటజాయి వంటి ప్రాంతాల్లో మూడు నౌకాశ్రయ కర్మాగారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇతర కేంద్రాలు కూడా ఉన్నాయి. మొత్తం 9,100 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. జలాంతర్గామి నౌకలు, సముద్ర ఉపరితల యుద్ధ నౌకలు, సముద్ర ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, భద్రతా సాంకేతికత రంగాల్లో వ్యవస్థ సరఫరాదారుగా సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కీల్ కేంద్రంలో సుమారు 3,300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. -
యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్కొరతతో హెటళ్లు బంద్
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో భారత్తో పాటు ఇతర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు బంద్ను సైతం ప్రకటించాయి. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ పరిస్థితి ఏలా ఉంది అనే వివరాలు తెలుసుకోవాలనుందా అయితే మరెందుకు ఆలస్యం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.ఇరాన్ యుద్దం ఎఫెక్ట్ భారత్పై ఇప్పుడిప్పుడే మొదలైంది. ప్రెట్రోల్, డీజీల్ ధరలపై ఈ ప్రభావం ఇప్పటికే పెద్దగా లేకపోయినా ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రారంభమైంది. గ్యాస్ కొరతతో బెంగళూరులో వ్యాపారులు ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ను పాటిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా 25 శాతానికి పైగా హోటళ్లు మూతపడ్డాయి. రేపటి నుంచి ఈ సంఖ్య 50 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదని ముంబై హోటల్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలోని విశాఖలో కూడా హోటళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్ నగరంలో సాధారణంగానే రద్దీ ఉండగా ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతుంది. దీంతో గ్యాస్ కొరత ప్రభావం హోటళ్లు, బేకరీలపై పడుతుందనే ఆందోళన వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.గ్యాస్ కొరతపై కేంద్రం స్పందన యుద్ధం ప్రారంభమైన ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై ఎలాంటి ప్రభావం ఉండదని, మన వద్ద 21 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటన చేసింది. అయితే.. తాజాగా హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమైంది. ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించింది. అత్యవసర సేవల చట్టం.. ఎస్మా పరిధిలోకి గ్యాస్ సరఫరాను తీసుకువచ్చింది. బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ మేరకు జిల్లాల వారీగా కలెక్టర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. తమ పరిధిలోని ఎల్పీజీ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సిలిండర్ల పంపిణీని రేషనలైజేషన్ చేస్తున్నట్లు సమాచారం. దీని ప్రభావం ఇతర రంగాలపై ఎలా ఉంటుంది?హోటళ్లు, రెస్టారెంట్లకు, పర్యాటక రంగానికి ముడిపడి ఉంటుందనేది నిర్వివాదాంశం. పర్యాటక ప్రదేశాల్లో హోటళ్లు మూతపడితే.. ఆ ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. పట్టణ, నగర ప్రాంత పర్యాటక ప్రదేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆటో ఎల్పీజీమహానగరాల్లో ఇప్పుడు ఆటో ఎల్పీజీ స్థానాన్ని అధికస్థాయిలో సీఎన్జీ ఆక్రమించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో ఆటోరిక్షాలు ఇప్పటికీ ఆటో ఎల్పీజీపైనే ఆధారపడ్డాయి. గత నెలలో ఆటో ఎల్పీజీ ధర లీటరుకు 55 రూపాయల వరకు ఉంది. మూడ్రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరను పెంచడంతో ఇప్పుడు ఆటో ఎల్పీజీ ధర 63 రూపాయలకు చేరుకుంది. ఎల్పీజీ బంకుల్లో కూడా షార్టేజీ భయంతో ఆటోరిక్షాలు, కార్లు క్యూకడుతున్న పరిస్థితులు ఎల్పీజీ బంకుల వద్ద కనిపిస్తోంది. మరెంత కాలం సంక్షోభం?పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ ఇంధన సరఫరా చైన్కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద నౌకలు స్తంభించిపోయాయి. అటుగా వచ్చే నౌకలను ఇరాన్ టార్గెట్గా చేసుకుంటోంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రేషనలైజేషన్ ద్వారా పంపిణీపై దృష్టి సారించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ ఎల్పీజీ విషయాన్ని పక్కనపెడితే.. డొమెస్టిక్తోపాటు.. ఆస్పత్రులు, స్కూళ్లు, హాస్టళ్ల విషయంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలకు అవసరమయ్యే ఎల్పీజీ సరఫరాకు సంబంధించి ఆయిల్ కంపెనీలకు సంబంధించిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ఇదివరకే ఎక్స్లో ట్వీట్ చేసింది.భారత్లో ఎల్పీజీ డిమాండ్ఒకప్పటితో పోలిస్తే.. భారత్లో ఎల్పీజీ డిమాండ్ చాలా పెరిగిందని చెప్పవచ్చు. ఉజ్వల వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సిలిండర్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అంతకు ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దీపం పేరుతో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేలా పథకాలు కొనసాగాయి. మొత్తానికి కమర్షియల్, డొమెస్టిక్ కలిపి దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. ఇందులో 87 శాతం డొమెస్టిక్ వినియోగమే కావడం గమనార్హం. మిగతా 13 శాతంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆటో ఎల్పీజీ వినియోగం ఉంటుంది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి ద్వారా కొరతను అధిగమించలేమా?భారతదేశ ఎల్పీజీ అవసరాలు తీరాలంటే 62 శాతం మేర దిగుమతులు తప్పనిసరి. మిగతా 38 శాతం మాత్రమే ప్రస్తుతం మన వద్ద ఉత్పత్తి అవుతుంది. హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తగ్గితే.. వెను వెంటనే మన దేశానికి దిగుమతి కావాల్సిన ఎల్పీజీ అందుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. మన దిగుమతుల్లో 90 శాతం వరకు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నాయి. అయితే.. భారత్లో ఇంధన నిల్వలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. -
భారత్కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం స్కాట్లాండ్తో జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్ను భారత్ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. తమకంటే బలహీన జట్టయిన స్కాట్లాండ్పై భారత్ పలు అవకాశాలు చేజార్చుకొని విజయాన్ని కోల్పోయింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ (18వ నిమిషంలో), సునెలితా టొప్పో (29వ నిమిషంలో)... స్కాట్లాండ్ తరఫున మెక్ఇవాన్ హీతర్ (6వ నిమిషంలో), ఫియోనా బర్నెట్ (33వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.భారత్కు మొత్తం 9 పెనాల్టీ అవకాశాలు రాగా, రెండింటిలో మాత్రమే జట్టు సఫలమైంది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్ల్లో ఉరుగ్వే 3–2తో వేల్స్పై, ఇంగ్లండ్ 3–0తో కొరియాపై, ఇటలీ 3–0తో ఆస్ట్రియాపై గెలిచాయి. పూల్ ‘బి’లో ప్రస్తుతం భారత్, స్కాట్లాండ్ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఉరుగ్వే 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వేల్స్ ఖాతా తెరువలేదు. నేడు విశ్రాంతి దినం. బుధవారం జరిగే పూల్ ‘ఎ’ మ్యాచ్ల్లో ఇంగ్లండ్తో ఆస్ట్రియా (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), ఇటలీతో కొరియా (మధ్యాహ్నం 3 గంటల నుంచి), ఉరుగ్వేతో స్కాట్లాండ్ (సాయంత్రం గం. 5:15 నుంచి), వేల్స్తో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక రెండు పూల్స్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. వేల్స్తో మ్యాచ్ను భారత్ ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్కు చేరుకుంటుంది. -
ప్రస్తుతానికి పెట్రోల్ రేట్లు పెరగవు
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా ప్రస్తుతానికైతే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే యోచనేదీ కేంద్రానికి లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే అదనపు భారాన్ని భరించనున్నట్లు వివరించాయి. మరోవైపు, వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో కనీస వెయిటింగ్ పీరియడ్ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా, అక్రమంగా నిల్వ చేయడాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపాయి. -
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇజ్రాయెల్-ఇరాన్ ఇష్యూ మొత్తం ముగియవచ్చని భారత్లోని యూఏఈ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మిర్జా అన్నారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో మిర్జా మాట్లాడారు. యూఏఈకి ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించగా.. మోదీ అంటే గల్ఫ్ నాయకులకు మాత్రమే కాదని,. ఆయా దేశాల ప్రజలు, వ్యాపార వర్గాల్లో కూడా ఆయనకు చాలా గౌరవం ఉందని మిర్జా చెప్పారు. “ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలకు మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య ముగుస్తుంది. ఒక ఫోన్ కాల్ చాలు” అని మిర్జా చెప్పారు. ప్రస్తుతం యుద్ధం చేస్తున్న ఇరాన్- ఇజ్రాయెల్ నాయకులతో మోదీకి ఉన్న సత్సంబంధాలపై ఇది ఆధారపడి ఉందని ఆయన చెప్పారు.‘ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలో చేరాలన్న ఆసక్తి యూఏఈకి లేదు. మా భూభాగాన్ని దాడుల కోసం వాడుకోవడానికి ఇరు పక్షాలకు అనుమతి ఇవ్వము. నిజంగా చెప్పాలంటే ఇందులో మేమెందుకు చేరుతున్నామో నాకు స్పష్టంగా తెలియదు. ఈ ఘర్షణలో యూఏఈ జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏమీ లేదు” అని మిర్జా వ్యాఖ్యానించారు. రెండు పక్షాలతో తాము చర్చలు జరపగలమని అన్నారు.యూఏఈ సున్నితమైన భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో ఉంది. అది ఇరాన్ పక్కన ఉన్న దేశం. అలాగే అబ్రహామ్ ఒప్పందాల కింద ఇజ్రాయెల్తో యూఏఈ పార్ట్నర్షిప్ కొనసాగిస్తోంది. అబ్రహామ్ ఒప్పందాలు అంటే కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణం చేసుకోవడానికి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలు.“వాళ్లు మా భూభాగంగాపై పరస్పరం యుద్ధం చేస్తున్నారు. దీన్ని మేము అంగీకరించలేం” అని మిర్జా చెప్పారు. ఇప్పటివరకైతే నష్టం తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు.ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై మరోసారి దాడులు చేసింది. బీరూట్లో హిజ్బుల్లా మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి చెప్పిన వివరాల ప్రకారం యుద్ధంగా వల్ల ఇప్పటివరకు ఇరాన్లో 1,332 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. -
గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర
-
తల్లీబిడ్డల ‘ఎల్లిపాయ కారం’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల నగరానికి చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ కొత్త రకం వంటలను రుచి చూపిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల సోనీ టీవీ మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్–9 వంటల రియాలిటీ షోలో రన్నరప్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించారు. గతంలోనే ఎల్లిపాయ కారంతో వైరెటీలు చేస్తూ కొత్త రుచులను పరిచయం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎల్లిపాయ కారం పేరుతో ఓ రెస్ట్రారెంట్ నిర్వహిస్తున్నారు. చందన తన భర్త రవీందర్ సహకారంతో మంచిర్యాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక కూతురు సాయిశ్రీ బీటెక్ చేయగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ తనకు ఇష్టమైన వంటల రంగాన్నే ఎంచుకున్నారు. నాలుగో తరగతి నుంచే వంట చేసేందుకు ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు అదే దిశగా ప్రోత్సాహించారు. గతంలో జెమిని టీవీలో తెలుగు మాస్టర్లో పాల్గొన్నప్పటికీ ఫైనల్ వరకు చేరలేదు. తాజాగా తల్లీకూతురు మాస్టర్ ఇండియా చెఫ్ జోడిగా కొనసాగిన 45ఎపిసోడ్స్లో వంటల్లో వైవిధ్యతను ప్రదర్శించారు.పుష్పరాజ్ చికెన్, స్పెషల్ లడ్డురియాలిటీ షోలో కఠిన పరీక్షలైన అగ్ని పరీక్ష, నీరు లేకుండా వంట, కట్టల పొయ్యిపై వండడం, వెజ్, నాన్వెజ్ వంటకాలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల వంటకాల్లో మసాలాలు, పదార్థాలతో కొత్త రుచులు వచ్చేలా చేసి సత్తా చాటారు. ప్రఖ్యాత చెఫ్ సంజీవ్ కపూర్తోపాటు న్యాయనిర్ణేతలు వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్, కునాల్ కపూర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.ఆ సమయంలో పుష్పరాజ్ పేరుతో వండిన చికెన్తో న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. ‘మా రెస్టారెంట్లో లడ్డుకు ప్రత్యేక ఆదరణ ఉంది. మహిళలు వంట తెలియకుండానే నేర్చుకునే ఓ గొప్ప నైపుణ్యం. మా పాప అభిరుచి కోసం నేను తోడుగా నిలిచా’ అని తల్లి చందన చెబుతుంటే, అమ్మ అందించిన ప్రోత్సాహంతోనే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని సాయిశ్రీ అంటున్నారు. -
చరిత్ర సృష్టించిన భారత్
-
సక్సెస్ఫుల్ కోచ్
భారత గడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతుల్లో క్లీన్స్వీప్నకు గురి కావడం, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో చిత్తుగా ఓడటం హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. కోచ్గా సమర్థుడు కాకపోయినా... బీసీసీఐ పెద్ద అండదండలంతో సాగుతున్నాడనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను ‘డ్రా’గా ముగించినా అతనికి తగిన క్రెడిట్ దక్కలేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్కు సంబంధించి మాత్రం గంభీర్ను విజయవంతమైన కోచ్గా అంగీకరించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టోరీ్నల్లో జట్టు విజేతగా నిలవడంతో కోచ్గా అతని పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ టి20 వరల్డ్ కప్ టోరీ్నకి సంబంధించి అన్ని అంశాల్లో అతని భాగస్వామ్యం ఉంది. జట్టు ఎంపిక మొదలు తుది జట్టులో మార్పులు, కీలక సమయాల్లో వ్యూహాల విషయంలో గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కెపె్టన్గా పెద్దగా అనుభవం లేని సూర్యకుమార్కు సరైన రీతిలో అతను మార్గనిర్దేశనం కూడా చేశాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టి20 వరల్డ్ కప్లను గెలిపించిన కెపె్టన్ గంభీర్ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో ఆటగాడిగా టి20 వరల్డ్కప్ గెలిచిన గంభీర్ ఇప్పుడు కోచ్గా తన ఖాతాలో మరో ప్రపంచకప్ జమ చేసుకున్నాడు. -
సామ్సన్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఫైనల్లో పవర్ హిట్టింగ్
-
రఫ్పాడించిన భారత్.. టీ20 ఛాంపియన్స్ 2026
-
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం
-
'త్రి'వర్ణ విజయం
సామ్సన్ కొట్టిన సిక్స్లను కరిగే క్షణాలు కూడా కాసేపాగి వీక్షించినట్లు.. అభిషేక్ బాదిన బౌండరీల్ని పదిలంగా దాచుకోవాలని మైదానం తలచినట్లు.. ఇషాన్ ధనాధన్ అర్ధశతకానికి బంతి పెద్ద ఫ్యాన్ అయినట్లు... అహ్మదాబాద్లో పరుచుకున్న ‘పరుగుల’ వెన్నెల యావత్ భారతాన్ని మురిపించింది. ఎందుకంటే ఈ ప్రపంచకప్ విజయం...దీని తాలూకు వచ్చే ఆనందం... ఓ పూటకే సరిపోదు.ఒక్క చోటికే పరిమితం కాదు. మొత్తం దేశాన్నే తమ క్రికెట్ అభిమాన ప్రవాహంలో ఉప్పొంగేలా చేసింది.ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ను ముద్దాడింది.2019 వన్డే ప్రపంచకప్లో మనల్ని ఫైనల్ చేరకుండా సెమీస్లోనే వెళ్లగొట్టిన న్యూజిలాండ్ జట్టుకు... 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మనగడ్డపై మనల్ని ముంచిన అహ్మదాబాద్ వేదికకు.. టీమిండియా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. 2026 టి20 ప్రపంచకప్లో భారత్ విజేతగానిలిచింది. డిఫెండింగ్ చాంపియన్గాకరీబియన్లో పట్టుకొచ్చిన టి20 ప్రపంచకప్ను సొంతగడ్డపైనా నిలబెట్టుకుంది. సెమీస్లోఇంగ్లండ్పై, ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్పై భారత బ్యాటింగ్ దళం గర్జించింది.వందేమాతరం... వందేమాతరం... లక్ష మంది అభిమానులతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తిపోయింది... ఇందులో రెండున్నరేళ్ల క్రితం ఇదే మైదానంలో గుండెకోతను అనుభవించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు అది గతం.. నాటి గాయానికి మందు రాసేలా సొంతగడ్డపై, ఫ్యాన్స్ సమక్షంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్ను సగర్వంగా అందుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడో టైటిల్ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా ఘనత సాధించింది. రెండేళ్ల క్రితం విశ్వ విజేతగా నిలిచిన నాటి నుంచి ఏ రోజూ స్థాయి తగ్గకుండా అదే దూకుడు, జోరుతో ఆడిన టీమిండియా అదే తీవ్రతను కొనసాగిస్తూ టైటిల్ నిలబెట్టుకోవడం విశేషం.ఫైనల్లో న్యూజిలాండ్తో సమరం అంటే ముందుగా మనదే కొంత పైచేయిగా కనిపించింది... దానికి తగినట్లుగా ఆరంభం నుంచే టాప్–3 బ్యాటర్లు విరుచుకుపడ్డారు. సామ్సన్ తన ధాటిని కొనసాగించగా అభిషేక్ అసలు పోరులో తన సత్తాను ప్రదర్శించాడు. తోడుగా ఇషాన్ కిషన్ కూడా చెలరేగడంతో బౌండరీల విధ్వంసం సాగింది. ప్రతీ బంతీ బౌండరీ దాటుతుండగా భారత్ ఆట చూస్తే 300 స్కోరు ఖాయమనిపించింది. అక్కడి వరకు చేరకపోయినా 255 పరుగులతో మ్యాచ్ను శాసించే స్థితిలో టీమిండియా నిలిచింది. వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు వేదికపై ఛేదన ఎంత కష్టమో కివీస్కు తెలిసే సరికి మ్యాచ్ ముగిసిపోయింది... బుమ్రా, అక్షర్ బౌలింగ్తో ఆ జట్టు కునారిల్లింది. సంపూర్ణ ఆధిపత్యంతో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది.అభిషేక్ బౌలింగ్లో డఫీ కొట్టిన షాట్ను బౌండరీ వద్ద హైదరాబాదీ తిలక్ వర్మ అందుకోవడంతో అన్ని వైపుల నుంచి వేడుకలు మొదలయ్యాయి. గత టోర్నీ గెలుపు అనుభవాన్ని కొందరు మళ్లీ రుచి చూస్తే... తొలిసారి వరల్డ్ కప్ నెగ్గిన కుర్రాళ్ల ఆనందానికి అవధుల్లేవు... వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్గా సూర్యకుమార్ చరిత్రకెక్కగా... గత వరల్డ్ కప్ విజేతలు కపిల్, ధోని, రోహిత్ శర్మ గ్యాలరీ నుంచి అభినందిస్తుండగా టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో మువ్వన్నెల జెండాతో సంబరాలు చేసుకున్నారు. అహ్మదాబాద్: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు టి20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచింది. గతంలో 2007, 2024లో టైటిల్ సాధించిన టీమిండియా ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకోవడం విశేషం. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్స్లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. టిమ్ సీఫెర్ట్ (26 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్లు), సాంట్నర్ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్ పటేల్ (3/27) న్యూజిలాండ్ను దెబ్బ తీశారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 27 కోట్ల 48 లక్షల ప్రైజ్మనీ దక్కింది. ధనాధన్ దూకుడు... తొలి ఓవర్లో 7 పరుగులు, రెండో ఓవర్లో 5 పరుగులు... ఇంత వరకు భారత్ కాస్త జాగ్రత్త పడింది. డఫీ వేసిన మూడో ఓవర్తో మొదలైన బ్యాటింగ్ విధ్వంసం చివరి ఓవర్ వరకు సాగింది. టాప్–3 బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి కివీస్ పనిపట్టారు. ఫెర్గూసన్ ఓవర్లో అభిషేక్, సామ్సన్ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టడంతో 24 పరుగులు వచ్చాయి. హెన్రీ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్సర్ బాదగా, డఫీ ఓవర్లో అభిషేక్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 92 పరుగులకు చేరింది. 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అభిషేక్ వెనుదిరిగినా, కిషన్ వచ్చి అదే జోరును కొనసాగించాడు. 33 బంతుల్లో సామ్సన్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఫెర్గూసన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 2 సిక్స్లు బాదగా, కిషన్ మరో సిక్స్ కొట్టాడు. రచిన్ వేసిన 14వ ఓవర్లోనైతే సామ్సన్ వరుసగా 6, 6, 6తో చెలరేగిపోగా, కిషన్ కూడా 23 బంతుల్లోనే అర్ధ సెంచరీని చేరుకున్నాడు. అయితే ఎట్టకేలకు తర్వాతి 16–19 వరకు నాలుగు ఓవర్ల పాటు భారత్ను కట్టడి చేయడంలో కివీస్ సఫలమైంది. నీషమ్ వేసిన ఒకే ఓవర్లో సామ్సన్, కిషన్, సూర్యకుమార్ (0) అవుట్ కాగా... పాండ్యా (18)ను హెన్రీ అవుట్ చేశాడు. ఈ నాలుగు ఓవర్లలో కలిపి 28 పరుగులే వచ్చాయి. అయితే నీషమ్ వేసిన చివరి ఓవర్లో దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగిపోయాడు. దాంతో స్కోరు 250 దాటింది. సీఫెర్ట్ మినహా... తమ జట్టుకు శుభారంభం అందించడంలో కివీస్ ఓపెనర్లు విఫలమయ్యారు. పాండ్యా ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లు బాది సీఫెర్ట్ జోరు ప్రదర్శించినా... మరోవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 4 బంతుల వ్యవధిలో అలెన్ (9), రచిన్(1) అవుట్ కాగా, ఫిలిప్స్ను (5) అక్షర్ బౌల్డ్ చేశాడు. పవర్ప్లేలో జట్టు 52 పరుగులు చేయగలిగింది. వరుణ్ ఓవర్లో 2 సిక్స్లతో 23 బంతుల్లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే నాలుగు బంతుల వ్యవధిలో చాప్మన్ (3), సీఫెర్ట్లు వెనుదిరగడంతో సగం టీమ్ పెవిలియన్ చేరింది. మిచెల్ (17), సాంట్నర్ కొద్దిసేపు పోరాడగలిగారు.అయితే బుమ్రా అద్భుత బంతితో సాంట్నర్ను అవుట్ చేయడంతో కివీస్ ఓటమి లాంఛనమే అయింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) (సబ్) మెక్కోన్కీ (బి) నీషమ్ 89; అభిషేక్ (సి) సీఫెర్ట్ (బి) రచిన్ 52; ఇషాన్ కిషన్ (సి) చాప్మన్ (బి) నీషమ్ 54; పాండ్యా (సి) సాంట్నర్ (బి) హెన్రీ 18; సూర్యకుమార్ (సి) రచిన్ (బి) నీషమ్ 0; తిలక్ (నాటౌట్) 8; దూబే (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–98, 2–203, 3–204, 4–204, 5–226. బౌలింగ్: హెన్రీ 4–0–49–1, ఫిలిప్స్ 1–0–5–0, డఫీ 3–0–42–0, ఫెర్గూసన్ 2–0–48–0, సాంట్నర్ 4–0–33–0, రచిన్ రవీంద్ర 2–0–32–1, నీషమ్ 4–0–46–3. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (సి) ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 52; అలెన్ (సి) తిలక్ (బి) అక్షర్ 9; రచిన్ (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా 1; ఫిలిప్స్ (బి) అక్షర్ 5; చాప్మన్ (బి) పాండ్యా 3; మిచెల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 17; సాంట్నర్ (బి)బుమ్రా 43; నీషమ్ (బి) బుమ్రా 8; హెన్రీ (బి) బుమ్రా 0; ఫెర్గూసన్ (నాటౌట్) 6; డఫీ (సి) తిలక్ (బి) అభిషేక్ 3; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–31, 2–32, 3–47, 4–70, 5–72, 6–124, 7–141, 8–141, 9–152, 10–159. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–32–0, పాండ్యా 4–0–36–1, అక్షర్ 3–0–27–3, బుమ్రా 4–0–15–4, వరుణ్ 3–0–39–1, అభిషేక్ 1–0–5–1. -
అందుకే భారత్కు మినహాయింపు ఇచ్చా: ట్రంప్
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడానికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్కు తాత్కాలిక అనుమతి ఇచ్చామని అన్నారు. పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా మార్గాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. “కొంత ఒత్తిడిని తగ్గించడానికి నేను ప్రయత్నిస్తాను. మా దేశంలో భారీగా చమురు ఉంది. బయటి దేశాల్లో కూడా చాలా చమురు ఉంది. చమురు సరఫరా సమస్య చాలా త్వరగా సర్దుకుంటుంది” అని ట్రంప్ తెలిపారు.కాగా, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు అంశంపై అమెరికా-భారత్ మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. యుక్రెయిన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేయిస్తున్న యుద్ధానికి భారత్ చమురు కొనుగోలు ద్వారా మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా దీని ద్వారా దెబ్బతింటున్నాయని విమర్శించింది.ఇదీ చదవండి: నీటిలో అంతిమ సంస్కారాలు.. స్కాట్లాండ్ అనుమతి మరోవైపు, అమెరికాలోని ప్రజలు, వ్యాపారాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరాలు, మోసాలు, దోపిడీదారులపై విస్తృతంగా చర్యలు తీసుకోవాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సంతకం చేశారు.ఆ ఆదేశం ప్రకారం అమెరికా విదేశాంగ కార్యదర్శి విదేశీ ప్రభుత్వాలతో చర్చలు జరిపి, వారి భూభాగాల్లో పనిచేస్తున్న అంతర్జాతీయ నేరస్థులపై చర్యలు తీసుకోవాలని కోరాల్సి ఉంటుంది. -
భారత్ ను టెన్షన్ పెడుతున్న కీలక అంశాలు..
-
ఇండియా VS న్యూజిలాండ్ మ్యాచ్ పై వరంగల్ లో పబ్లిక్ టాక్
-
T20 World Cup Final: వార్ వన్ సైడ్..! ఆ టీమ్ దే పైచేయి
-
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ఉద్రిక్తతల ప్రభావం మహా నగరంలోని వాణిజ్య వంట గది వరకూ చేరాయి. గృహాపయోగ వంటగది అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర ఆదేశాలు తాజాగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నతరహా పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ , 1955 కింద చమురు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్లోని ప్రధాన గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లలో వాణిజ్య సిలిండర్ల లోడింగ్ను తాత్కాలికంగా నిలిచిపోయి గ్యాస్ కొరతను సృష్టిస్తోంది. హోటళ్లు – రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం నగరంలోని ఫుడ్ ఇండస్ట్రీపై గ్యాస్ ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ సుమారు 70 నుంచి 80 వేలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు వాణిజ్య గ్యాస్ వినియోగంపైనే ఆధారపడి ఉన్నాయి. డిమాండ్కు సరిపడా సిలిండర్లు సరఫరా కాకపోతుండటంతో డీలర్లు చేతులెత్తేస్తున్నారు. వంటగ్యాస్ ఒక్కసారిగా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ధరలు పెరగగా, మరింత పెరుగుతాయనే ఆశతో కొందరు వ్యాపారులు నిల్వలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ శాతం హోటళ్లు, బిర్యానీ పాయింట్లు వాణిజ్య గ్యాస్పైనే ఆధారపడి ఉన్నాయి. చిన్నపాటి తోపుడు బండ్లు, ఫంక్షన్ల ఆర్డర్లు తీసుకునే క్యాటరర్లు సిలిండర్ల కోసం డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సి వస్తోందని హోటల్ యజమానులు వాపోతున్నారు. రోజువారీ గ్యాస్ వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సగటున 7 నుండి 7.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు (19 కేజీలు) అవసరమవుతుండగా, ఇందులో దాదాపు 50 – 60 శాతం వాటా కాగా.. ఒక్క గ్రేటర్ పరిధిలో ప్రతిరోజూ సుమారు 12,000– 15,000 కమర్షియల్ సిలిండర్లు అవసరమవుతాయని అంచనా ఒక మధ్యస్థ రెస్టారెంట్కు రోజుకు 2 నుండి 5 సిలిండర్లు అవసరమైతే, పెద్ద హోటళ్లకు 10 కి పైగా అవసరమవుతాయి. చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు రోజుకు సగటున ఒక చిన్న, సగం పెద్ద సిలిండర్ను వినియోగిస్తాయి. కేంద్ర ప్రభుత్వం గహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, కమర్షియల్ సరఫరాపై తాత్కాలిక ఆంక్షలు విధించడంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద సాధారణంగా 2–3 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంటాయి. సరఫరాలో జాప్యం జరిగితే హోటల్ రంగం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. సిలిండర్ల కోసం ‘పానిక్ బుకింగ్’ మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైతే ముడి చమురు సరఫరా నిలిచిపోతుందని, తద్వారా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ భయంతో సామాన్య ప్రజలు తమకు అవసరం లేకున్నా ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. -
ట్రిపుల్ టైటిల్ వేటలో...
భారత జట్టు 2024 టి20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన తర్వాత ఇప్పటి వరకు 49 మ్యాచ్లు ఆడితే 40 గెలిచింది. 2023 ఆగస్టు నుంచి మన టీమ్ ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. జట్టులో పలు మార్పులు చేసుకున్నా, ఆఖరి క్షణాల్లో ఆటగాళ్లను చేర్చినా ఫలితాల్లో మాత్రం తేడా రాలేదు. ఎలాంటి నిర్ణయం, వ్యూహమైనా అద్భుతంగా పని చేశాయి. ఇలాంటి విజయాల తర్వాత, ఇంత బలమైన జట్టుకు ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉంది. కానీ అనిశ్చితికి మారుపేరైన టి20 క్రికెట్లో కొన్ని అనూహ్య క్షణాలు కూడా రాత మారుస్తాయి. అలాంటివి అధిగమించి టీమిండియా మూడోసారి, వరుసగా రెండోసారి వరల్డ్ కప్ను సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించగలదా?అవతలి వైపు ఉన్న జట్టు మనతో పోలిస్తే చిన్నదే కావచ్చు... బలాబలాల్లో, అనుభవంతో భారత్కు పోటీ కాకపోవచ్చు. కానీ పోరాడితే పోయేదేమీ లేదనే తత్వమే న్యూజిలాండ్ను ఒక్కసారిగా బలంగా మార్చేస్తుంది. రెండున్నరేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన రోజు భారత అభిమానులకు ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకం... కానీ నేటి ఫైనల్లో కివీస్ ఓడితే తర్వాతి వారంలో ఆ దేశంలో అంతా మరచిపోతారు. వారి రోజూవారీ సంవాదనల్లో అది ఒక విషయమే కాదు. ఆ టీమ్లో స్టార్ పేసర్ లేకపోయినా, మిస్టరీ స్పిన్నర్ లేకపోయినా గెలిచేందుకు కావాల్సినంత కసి ఉంది. ఇప్పుడు అలాంటిదే వారికి మొదటి టి20 వరల్డ్ కప్ అందించాలి. ప్రపంచకప్లలో పడిన ‘రన్నరప్’ ముద్రను ఆ జట్టు మార్చగలదా?వ్యూహ ప్రతివ్యూహాలు, భావోద్వేగాలు, ప్రతిభ మాత్రమే సరిపోదు, కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి...చివరకు రోజు ముగిసేసరికి ఒక్క జట్టుకు మాత్రం సంపూర్ణ ఆనందం దక్కితే మరో జట్టుకు తీవ్ర నిరాశ ఖాయం. ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో ఓటమి మినహా టోర్నీ ఆసాంతం టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబర్చగా... పడుతూ, లేస్తూ ప్రయాణం సాగించిన కివీస్ సెమీస్లో దక్షిణాఫ్రికాపైనే భారీ విజయంతో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ నేపథ్యంలో పదో టి20 వరల్డ్ కప్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. దాదాపు లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగే ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్: టి20 ప్రపంచ కప్లో రెండుసార్లు (2007, 2024) విజేతగా నిలిచి ఇప్పుడు మూడో టైటిల్పై గురి పెట్టిన జట్టు ఒకవైపు...తొమ్మిది ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయిన జట్టు మరోవైపు... ఒక టీమ్ టోర్నీ గెలిస్తే తొలిసారి ‘ట్రిపుల్’ సాధించిన జట్టు కావడంతో పాటు సొంతగడ్డపై నెగ్గిన తొలి టీమ్గా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. మరో టీమ్ గెలిస్తే సుదీర్ఘ కాలంగా అందకుండా ఊరిస్తున్న వరల్డ్ కప్ కల నెరవేరుతుంది. ఇలాంటి అంచనాల మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు డిఫెండింగ్ చాంపియన్ భారత్, న్యూజిలాండ్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. స్వదేశంలో టీమిండియా విజయంపై అభిమానులు భారీ ఆశలతో ఉండగా... కివీస్ తమ స్థాయికి మించిన ప్రదర్శనను కనబర్చాలని పట్టుదలగా ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇదే మైదానంలో టి20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచి ట్రోఫీని అందుకోవాలని సూర్యకుమార్ బృందం భావిస్తోంది. వరుణ్ స్థానంలో కుల్దీప్! ప్రపంచకప్లో భారత్ ప్రదర్శన చూస్తే ఇప్పడు ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. కానీ ‘సూపర్ ఎయిట్స్’ దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేలవ ఆట జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఎంత ఘనంగా బౌలింగ్ చేసినా టి20ల్లో తాజా ఫామ్ కీలకం. దాదాపు 12 పరుగుల ఎకానమీతో అతను 4 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. వరుణ్ మిస్టరీని ప్రత్యర్థులు ఛేదించినట్లుగా కనిపిస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే భావిస్తే అతని స్థానంలో ఎడంచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కవచ్చు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్పై కూడా కాస్త సందేహం ఉన్నా... ఒంటిచేత్తో ఆట స్వరూపాన్ని మార్చే అతడిని పక్కన పెట్టే ఆలోచన చేయకపోవచ్చు. సంజు సామ్సన్ గత రెండు మ్యాచ్లలో చెలరేగిన విధంగా మరో నాకౌట్ మ్యాచ్లోనూ ఆడితే జట్టుకు తిరుగుండదు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా సత్తా చాటితే భారీ స్కోరు ఖాయం. చివర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వేగంగా అందించే అదనపు పరుగులతో ప్రత్యర్థికి టీమిండియా సవాల్ విసరడం ఖాయం.ముందుగా బ్యాటింగ్ చేస్తే మరోసారి 200కు పైగా స్కోరు చేస్తే జట్టు నిశ్చింతగా ఉండవచ్చు. డఫీకి చోటు! న్యూజిలాండ్ విజయావకాశాలన్నీ ఇప్పుడు ఓపెనింగ్ జోడీ ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్లపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దక్షిణాఫ్రికాపై మెరుపు వేగంతో చెలరేగిన వీరిద్దరు మరోసారి శుభారంభం అందించగలరు. ఇన్నింగ్స్ మొదట్లోనే బుమ్రా, అర్ష్ దీప్ వీరిని కట్టడి చేయడం కీలకం. రచిన్ రవీంద్ర ఆల్రౌండర్గా రాణిస్తుండగా, ఫిలిప్స్ బ్యాటింగ్ కూడా కీలకం. వరల్డ్ కప్కు ముందు భారత్పై చెలరేగిన మిచెల్ ఈ టోర్నీలో పూర్తిగా విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. అసలు సమరంలోనైనా అతను తన స్థాయికి తగినట్లుగా ఆడాలని టీమ్ కోరుకుంటోంది. చాప్మన్ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. కెపె్టన్ సాంట్నర్పై అటు ఆల్రౌండర్గా, ఇటు కెపె్టన్గా కూడా అదనపు భారం ఉంది. గతంలో ఏ కివీస్ సారథికి సాధ్యం కాని ఘనతను అందుకోవాలంటే అతను కూడా స్వయంగా అసాధారణ ఆటతీరు కనబర్చాల్సి ఉంది. పిచ్ కాస్త అనుకూలిస్తే పేసర్లు హెన్రీ, ఫెర్గూసన్ ప్రమాదకారులు కాగలరు. టీమిండియా లెఫ్ట్ హ్యాండర్లను నిలువరించేందుకు ఆఫ్స్పిన్నర్ మెక్కోన్కీ జట్టు సమర్థంగా వాడుకునే ప్రయత్నం చేయడం ఖాయం. ఆల్రౌండర్ నీషమ్ స్థానంలో పేసర్ డఫీకి చోటు దక్కే అవకాశం ఉంది. 7 అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 10 టి20 మ్యాచ్లు ఆడింది. 7 మ్యాచ్ల్లో గెలిచి, 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ వేదికపై న్యూజిలాండ్తో ఆడిన ఒక టి20 మ్యాచ్లో భారత జట్టే గెలిచింది. పిచ్, వాతావరణం ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి మిశ్రమం కలిపిన పిచ్ను ఫైనల్ కోసం సిద్ధం చేశారు. దీనిపై మంచి పేస్, బౌన్స్ ఉండి బ్యాటింగ్కు చక్కగా అనుకూలిస్తుంది. భారీ స్కోరు సాధించేందుకు అవకాశం ఉంది. స్పిన్కు తగిన టర్న్ లభించకపోవచ్చు. ఈ మైదానంలోనే దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా... ఆ మ్యాచ్ను భారత్ మరో పిచ్పై ఆడింది. గత ఎనిమిది మ్యాచ్లలో తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టే ఐదుసార్లు గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన టీమ్ ఛేదనకే మొగ్గు చూపవచ్చు. అయితే భారత్పై సెమీస్లో ఇంగ్లండ్ ఒత్తిడిలో చిత్తయిన తీరు చూస్తే ముందుగా బ్యాటింగ్ చేయడమే మేలు. వర్షం సమస్య లేదు. ఒకవేళ వాన వచ్చినా రిజర్వ్ డే ఉంది. 2-2 భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన గత నాలుగు ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్లలో ఇరు జట్లూ చెరో రెండు గెలిచి 2–2తో సమంగా ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలవగా... 2019 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ గెలుపొందింది.16 భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 30 టి20 మ్యాచ్లు జరిగాయి. 16 మ్యాచ్ల్లో భారత్, 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మూడు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), సామ్సన్, అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్వర్మ, పాండ్యా, దూబే, అక్షర్, బుమ్రా, అర్ష్ దీప్, వరుణ్/కుల్దీప్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్ ), అలెన్, సీఫెర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, మెక్కోన్కీ, హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్/డఫీ. -
ఇంటర్నెట్ను ఊపేసిన ఈ బాలుడు గుర్తున్నాడా? ఇప్పుడు మరోసారి..
అరుణ్ కుమార్ అనే బాలుడు చేతిలో చాయ్ కప్ పట్టుకుని నవ్విన వీడియో సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఈ బాలుడి వీడియోను మీరు కూడా ఇప్పటికే మీమ్స్లో లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటారు. 15 సెకన్ల అతడి చిన్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇప్పుడు అతడిని అందరూ గుర్తు పడుతున్నారు. ఆ వీడియోను అతని యజమాని ట్రక్ డ్రైవర్ నెహ్రూ ప్రయాణం మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తీసి, పోస్ట్ చేశాడు. అరుణ్ నవ్వు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంటర్నెట్లో అత్యధికంగా షేర్లు వచ్చిన మీమ్లలో ఒకటిగా మారింది. లక్షల మంది ఆ క్లిప్ చూశారు. కానీ, ఆ వీడియోలో కనిపించిన బాలుడి కథ చాలా మందికి తెలియదు.‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ తెలిపిన సమాచారం ప్రకారం.. అరుణ్ చిన్నప్పటి నుంచే తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నాడు. పేదరికం కారణంగా చదువును మధ్యలో ఆపాల్సి వచ్చింది. అరుణ్ 10 సంవత్సరాల వయసులోనే 4వ తరగతి చదువుతున్న సమయంలో పాఠశాల చదువును మానేశాడు. అతడి కుటుంబం పేదరికంతో పోరాడుతోంది. చదువు కొనసాగించడం సాధ్యం కాలేదు. పని చేయడం తప్ప మరో మార్గం అతనికి లేదు.ఆ సమయంలో డ్రైవర్ నెహ్రూ అతనిని ట్రక్ క్లీనర్గా పనికి పెట్టుకున్నాడు. రోజువారీ పనుల్లో నెహ్రూకి అతడు సాయం చేశాడు. వింత ఏమిటంటే అతని వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతుండగా ప్రజలు అతని గురించి రాసిన కామెంట్లు చదవడం కూడా అరుణ్కు సాధ్యం కాలేదు. లక్షల మంది అతని నవ్వును ప్రశంసిస్తున్నా ఆ ప్రశంసలను చదవలేడు.. అర్థం చేసుకోలేడు.క్లీనర్ జీవితాన్ని మార్చుతున్న డ్రైవర్అరుణ్ గురించి నెహ్రూ బాగా ఆలోచించాడు. అతని భవిష్యత్తు మార్చాలని నిర్ణయించాడు. నెహ్రూ కూడా ఒకప్పుడు తన కుటుంబాన్ని పోషించేందుకు కాలేజీ చదువును మధ్యలో ఆపాల్సి వచ్చింది. ప్రజలు ఆన్లైన్లో అరుణ్ను ప్రశంసించడం చూసి ఆ బాలుడి భవిష్యత్తు గురించిహ్రూ బాగా ఆలోచించాడు. అరుణ్కు పుస్తకాలు కొనిచ్చాడు. పరీక్ష ఫీజులు చెల్లించాడు. 10వ తరగతి బోర్డు పరీక్షను ప్రైవేట్గా రాయించాడు.ట్రక్లో ప్రయాణిస్తున్న సమయంలో చాయ్ విరామం సమయాల్లో అరుణ్కు నెహ్రూ అక్షరాలు, గణితం నేర్పించాడు. తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు అరుణ్. ఈ సంవత్సరం అతని కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. పదో తరగతి బోర్డు పరీక్షలో అతను ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతడి కథ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందంటూ అమెరికా ట్రెజరీ శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కామెంట్లు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. ఇప్పటికే సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేయటానికి భారత్కు అనుమతి ఇచ్చినట్టు అమెరికా తెలిపిన విషయం తెలిసిందే. అయితే, అమెరికా మనకు అనుమతి అనుమతి ఇవ్వడం ఏంటని భారత్లో విపక్షాలు మండిపడుతున్నాయి. ఇటువంటి సమయంలో స్కౌట్ కీలక వ్యాఖ్యలు చేశారు.“ప్రపంచానికి చమురు సరఫరా బాగానే కొనసాగుతోంది. ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న రష్యా చమురు కొనుగోలును ప్రారంభించటానికి మా మిత్ర దేశం భారత్కు నిన్న అమెరికా ట్రెజరీ శాఖ అనుమతి ఇచ్చింది” అని స్కాట్ బెసెంట్ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.“భారత్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. ముందుగా ఆంక్షలు ఉన్న రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని మేము కోరాం.. భారత్ ఆపింది. దాని స్థానంలో అమెరికా నుంచి చమురు కొనాలని భారత్ నిర్ణయించింది. కానీ, ప్రపంచ చమురు సరఫరాలో ఏర్పడ్డ తాత్కాలిక లోటును తగ్గించటానికి ఇప్పుడు రష్యా చమురును కొనడానికి మేము భారత్కు అనుమతి ఇచ్చాం. రష్యా చమురుపై ఉన్న మరికొన్ని ఆంక్షలను కూడా తొలగించవచ్చు” అని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుండడంతో మార్కెట్కు ఉపశమనం ఇవ్వటానికి చర్యలు ప్రకటించే ప్రక్రియ కొనసాగుతుంది” అని తెలిపారు.ట్రంప్ పరిపాలనలోని మరికొంతమంది అధికారులు కూడా రష్యా చమురును కొనుగోలు చేయడానికి భారత్కు అనుమతి ఇచ్చామని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొన్ని నెలల క్రితం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో రష్యా నుంచి చమురు కొనుగోలుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చామని అమెరికా అంటోంది.అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై యుద్ధం చేస్తున్న సమయంలో చమురు సరఫరాకు ఆటంకాలు లేకుండా చేయడం, మార్కెట్లో ఒత్తిడి తగ్గించడమే లక్ష్యమని అమెరికా అధికారులు చెప్పారు. హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న పరిస్థితుల వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. -
T20 WC 2026: ఐసీసీ రంగంలోకి దిగినా.. తప్పని చిక్కులు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో వెస్టిండీస్ ఫర్వాలేదనిపించగా.. సౌతాఫ్రికా సెమీస్ వరకు ప్రయాణం కొనసాగించింది. లీగ్ దశలో అదరగొట్టిన విండీస్ జట్టు.. సూపర్-8లో కీలక మ్యాచ్లో టీమిండియా చేతిలో ఓడి నిష్క్రమించింది.మరోవైపు.. సౌతాఫ్రికా లీగ్ దశలో అజేయంగా నిలవడంతో పాటు.. సూపర్-8లోనూ హ్యాట్రిక్ విజయాలతో సెమీస్లో అడుగుపెట్టింది. అయితే, కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి మరోసారి ‘చోకర్స్’ అన్న బిరుదును సార్థకం చేసుకుంది. ఇక ఈ రెండు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినా.. ఇంకా ఇంటికి చేరుకోలేదు.భారత్లోనే చిక్కుకుపోయారుఇందుకు మధ్య ప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం కారణం. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుండగా.. అందుకు ఇరాన్ కూడా గట్టిగానే బదులిస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో గగనతలం మూసివేశారు. దీంతో వెస్టిండీస్, జింబాబ్వే, సౌతాఫ్రికా జట్ల ఆటగాళ్లు భారత్లోనే చిక్కుకుపోయారు. అయితే, జింబాబ్వే జట్టును ప్రత్యేక విమానంలో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)తరలించినట్లు సమాచారం.ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా..ఇక వెస్టిండీస్ జట్టు కోసం కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా.. ఎయిర్ ట్రాఫిక్ అధికారుల నుంచి ఇంత వరకు ఆమోదం లభించనట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లలో మరోసారి ఆందోళన నెలకొంది. కాగా ఇప్పటికే వెస్టిండీస్ హెడ్కోచ్ డారెన్ సామీ (Daren Sammy).. తమను స్వదేశానికి చేర్చమంటూ దీనంగా అర్థించిన విషయం తెలిసిందే.ఇక బౌలర్ అకీల్ హొసేన్ సైతం క్రిస్టియాన్ రొనాల్డోనే ఈ పరిస్థితులలో తమను ఆదుకోగలడంటూ ట్వీట్ చేశాడు. అయితే, ఐపీఎల్లో భాగమైన షెర్ఫానే రూథర్ఫర్డ్, రోవ్మన్ పావెల్, షిమ్రన్ హెట్మైర్ తదితరులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.సౌతాఫ్రికానూ వీడని చిక్కులుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా మరికొన్నాళ్లు భారత్లోనే ఉండాల్సి రావొచ్చు. అయితే, న్యూజిలాండ్తో టీ20 సిరీస్ నేపథ్యంలో దాదాపు నలుగురు ఆటగాళ్లు నేరుగా కివీస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. సెమీస్ మ్యాచ్లలో సౌతాఫ్రికాను న్యూజిలాండ్.. ఇంగ్లండ్ను టీమిండియా ఓడించి ఫైనల్కు అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్ -
AI నైపుణ్యాల్లో మహిళల దూకుడు.. అధ్యయనంలో వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పని వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్న ప్రస్తుత తరుణంలో... భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐని స్వీకరించడంలో పురుషులతో సమానంగానే కాకుండా, వారి కంటే ముందున్నారని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన 'లింక్డ్ఇన్' తాజా పరిశోధనలో వెల్లడైంది.లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలోని మహిళా నిపుణుల్లో 90 శాతం మంది... కార్యాలయాల్లో ఏఐ సాధనాలను ఉపయోగించడం పట్ల తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని చెప్పారు. ఇది పురుషుల (86%) కంటే ఎక్కువ. అంతేకాకుండా, ఏఐ సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో కూడా మహిళలు మరింత చురుకుగా ఉన్నారు. తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి 35 శాతం మంది మహిళలు చురుకుగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటుండగా, పురుషుల్లో ఈ సంఖ్య 29 శాతంగా మాత్రమే ఉంది.ఈ సానుకూల ధోరణి కేవలం కార్యాలయాలకే పరిమితం కాలేదు. వ్యాపారవేత్తల విభాగంలో కూడా... తమ కంపెనీల వృద్ధిపై పురుషుల (66%) కంటే మహిళా వ్యవస్థాపకులు (78%) అత్యంత సానుకూలంగా ఉన్నారు. తమ వ్యాపారాలను మరింత విస్తరించడానికి వీరు 'ఏఐ ఆధారిత ఆటోమేషన్', స్మార్ట్ వర్క్ఫ్లోలు మరియు డేటా ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. తమ సంస్థల్లో 'డిజిటల్ పరివర్తన'కు నాంది పలుకుతున్నారు.దీనిపై లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ.. “భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐ సాధనాలను ఉపయోగించడంలో బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. లేబర్ మార్కెట్ వాస్తవ పరిస్థితులు మాత్రం కాస్త నిరాశజనకంగానే ఉన్నాయి. లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం ఇప్పటికీ 28.1% శాతంతో చాలా తక్కువగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి కేవలం సాంకేతికత ఒక్కటే సరిపోదు. అయితే ఇక్కడో ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే... ఇప్పటికే విధుల్లో ఉన్న అనేక మంది మహిళలు ఏఐ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మరింత ఉత్పాదకతను సాధించే సాధనంగా వారు ఏఐని చూస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు అవసరమైన ఏఐ నైపుణ్యాలను వారు వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. పనిలో (ప్రాజెక్టులలో) తమ ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించడానికి, నాయకత్వ పాత్రల్లో ఎదగడానికి మహిళలకు ఏఐ ఒక బలమైన సాధనంగా ఉపయోగపడుతుంది," అని అన్నారు.వృత్తిపరమైన ఎదుగుదలకు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో మహిళా నిపుణుల కోసం లింక్డ్ఇన్ చెబుతున్న ఐదు సూచనలు ఇక్కడ ఉన్నాయి:👉మనిషి చేసే పనులకు ఏఐని జతచేయండి: విశ్లేషించడం, నిర్వహించడం మరియు పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐని ఉపయోగించండి. ఆ మిగిలిన సమయాన్ని... మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే నైపుణ్యాలైన బృంద స్ఫూర్తిని పెంపొందించడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు సానుభూతిని ప్రదర్శించడం కోసం కేటాయించండి.👉మీ సొంత అభ్యాసానికి ఏఐని ఉత్ప్రేరకంగా మార్చుకోండి: అనుబంధ రంగాలను అన్వేషించడానికి, కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాల లోపాలను గుర్తించడానికి ఏఐని ఉపయోగించండి. మీ ఉద్యోగ పాత్ర, లక్ష్యాలు మరియు ఇప్పటికే ఉన్న నైపుణ్యాల ఆధారంగా నేర్చుకోవాల్సిన కొత్త కోర్సులను... లింక్డ్ఇన్ లెర్నింగ్ యొక్క 'ఏఐ-పవర్డ్ కోచింగ్’ మీకు సూచిస్తుంది. అసలు ఎక్కడ ప్రారంభించాలో తెలియని గందరగోళాన్ని ఇది తొలగిస్తుంది.👉 మీ మానవ నైపుణ్యాలను విస్తృతం చేసుకోండి: మీ సామర్థ్యాలను పదునుపెట్టే సహచరుడిగా ఏఐని భావించండి. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి, సృజనాత్మక పరిష్కారాల కోసం లేదా రాబోయే ఫలితాలను ముందుగానే అంచనా వేయడానికి దీనిని ఉపయోగించండి. ఏఐతో మీ భాగస్వామ్యం మీ ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది. మంచి ఆలోచనలను... అందరూ ఆమోదించదగిన, డేటా-ఆధారిత ప్రతిపాదనలుగా మార్చడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.👉 ప్రాంప్ట్ ఇవ్వడంలో ప్రావీణ్యం పొందండి: ఏఐ సాధనాల వాడకంపై అవగాహన ఉండటం నేడు తప్పనిసరి. అయితే ఆ సాధనాలకు సరైన ఆదేశాలు ఇవ్వడం తెలిస్తేనే అసలైన ప్రయోజనం కలుగుతుంది. సమర్థవంతమైన ప్రాంప్ట్లను (కమాండ్స్ను) రూపొందించడం నేర్చుకోండి. ఈ నైపుణ్యం మిమ్మల్ని హైబ్రిడ్ ప్రొఫెషనల్గా మారుస్తుంది. ఏ సంస్థకైనా మీరు అత్యంత ఆవశ్యకమైన ఉద్యోగిగా మారుతారు.👉 కేవలం రోజువారీ పనులకే కాదు, మీ కెరీర్ కోసం ఏఐని ఉపయోగించండి: ఏఐని కేవలం ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేయడానికి మాత్రమే పరిమితం చేయకండి. మీ వృత్తిపరమైన భవిష్యత్తును నిర్వహించుకోవడానికి దాన్ని అనుమతించండి. లింక్డ్ఇన్ యొక్క 'ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్' వంటి సాధనాలతో, మీరు సహజ భాషను ఉపయోగించి మీ లక్ష్యాలు మరియు నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాల కోసం వెతకవచ్చు. ఆ ఉద్యోగానికి మీరు ఎంతవరకు సరిపోతారో లింక్డ్ఇన్ యొక్క 'జాబ్ మ్యాచ్' మీకు స్పష్టంగా చూపిస్తుంది.👉ఏఐ కేవలం మీరు పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మాత్రమే కాకుండా... మీ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి అవసరమైన సమయాన్ని కూడా ఇస్తుంది. వేగంగా మారుతున్న పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళా నిపుణులకు, ఏఐని స్వీకరించడం అనేది ఒక కెరీర్ అడ్వాంటేజ్ మాత్రమే కాదు.. వారు కోరుకునే కెరీర్ వైపు పయనించడానికి ఇది ఒక స్పృహతో కూడిన పిలుపు. -
వెనక్కి తగ్గిన ట్రంప్.. భారత్ కు గుడ్ న్యూస్
-
యుద్ధం వేళ.. మరో ఇరాన్ నౌకకు భారత్ ఆశ్రయం
న్యూఢిల్లీ: ఇరాన్ నావికా దళానికి చెందిన ఒక యుద్ధ నౌకకు భారత్ అత్యవసర ఆశ్రయం కల్పించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐఆర్ఐఎస్ లవాన్ నౌకలో(IRIS Lavan) సాంకేతిక సమస్య ఏర్పడటంతో మార్చి 4న దాన్ని కోచి నౌకాశ్రయంలోకి అనుమతించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ నౌకలో 183 మంది సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఇటీవల విశాఖ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్కు ఇరాన్కు చెందిన నౌక ఐరిస్ లవన్ వచ్చింది. అయితే తిరుగు ప్రయాణంలో నౌకలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కొచ్చిలో దీన్ని నిలిపేందుకు అనుమతి ఇవ్వాలని ఇరాన్ ఫిబ్రవరి 28న భారత ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అందుకు మార్చి 1నే అనుమతి లభించిందని అధికారులు తెలిపారు. దీంతో ఐరిస్ లావన్ మార్చి 4న కొచ్చి ఓడరేవుకు చేరింది.మరోవైపు, ఇటీవల విశాఖపట్నంలో భారత నౌకాదళంతో సంయుక్త విన్యాసాల్లో పాల్గొని తిరుగుముఖం పట్టిన ఇరాన్ యుద్ధ నౌక ఓఆర్ఐఎస్ దేనాను బుధవారం శ్రీలంక సముద్ర జలాల సమీపంలో అమెరికా దాడి చేసి ముంచేయడం తెలిసిందే. దాంతో అందులోని 87 మంది నావికులు దుర్మరణం పాలయ్యారు. అందుకు ప్రతీకారంగా మర్నాడే పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌకపై ఇరాన్ దాడికి దిగింది. -
రేపు అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్
-
హోటల్ మారితే అదృష్టం మారేనా!
అహ్మదాబాద్: నమ్మకం లేదా సెంటిమెంట్ అనుకోండి లేదా మూఢ విశ్వాసం అనుకోండి కానీ భారత క్రికెట్ జట్టుకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని అనూహ్య, ఆసక్తికర విషయాలు బయటకు వస్తుంటాయి. జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహిస్తుంటాడని సమాచారం. ఏ నగరంలో మ్యాచ్కు వెళ్లినా అక్కడి ప్రఖ్యాత దేవాలయానికి ఆటగాళ్లను తీసుకెళ్లి దర్శనం చేయించడం ఆయనకు రివాజుగా మారిపోయింది. సెమీఫైనల్కు ముందు రోజు ప్రాక్టీస్ కోసం వాంఖెడే స్టేడియానికి జట్టు వచ్చినా... ఆ రోజు చంద్ర గ్రహణం కారణంగా ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్ దాటి బయటకు రాలేదు. గ్రహణం ముగిసిన తర్వాతే గంటసేపు ఆలస్యంగా టీమిండియా సాధన మొదలైంది. ఇప్పుడు కూడా ఫైనల్ కోసం మరో సెంటిమెంట్ అంశం వినిపిస్తోంది. అహ్మదాబాద్లో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడినప్పుడు భారత జట్టు ఐటీసీ నర్మద హోటల్లో బస చేసింది. నాటి మ్యాచ్లో పరాజయం జట్టును తీవ్రంగా బాధించింది. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం అక్కడ మాత్రం ఉండరాదని జట్టు అనుకుంది. అందుకే ఈసారి తాజ్ స్కైలైన్లో భారత బృందం దిగింది. దీంతో తమ అదృష్టం మారవచ్చని టీమ్ భావిస్తున్నట్లుంది. మరోవైపు మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంలో కూడా ‘హోం’ కాకుండా విజిటర్స్ డ్రెస్సింగ్ రూమ్ను వాడుకోవాలని కూడా టీమ్ నిర్ణయించింది. అంపైర్లను ప్రకటించిన ఐసీసీ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్లో పాల్గొనే అధికారుల బృందాన్ని ఐసీసీ ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా ఇంగ్లండ్కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్ వ్యవహరిస్తారు. థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా దక్షిణాఫ్రికాకు చెందిన అలావుద్దీన్ పలేకర్, ఆడ్రియాన్ హోల్డ్స్టాక్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వరల్డ్ కప్ తుది పోరు జరుగుతుంది. సామ్సన్ నామినేట్... టి20 వరల్డ్ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కోసం షార్ట్ లిస్ట్ చేసిన ఎనిమిది ఆటగాళ్ల జాబితాలో భారత్కు చెందిన సంజు సామ్సన్ పేరు కూడా ఉంది. సామ్సన్తో పాటు విల్ జాక్స్ (ఇంగ్లండ్), సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్), రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్), షాడ్లీ వాన్ షాల్విక్ (అమెరికా), మార్క్రమ్, ఎన్గిడి (దక్షిణాఫ్రికా) ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు. బుమ్రా కూడా విఫలం కావచ్చు! భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఒంటిచేత్తో అతను మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. ఈ విషయం న్యూజిలాండ్కు కూడా బాగా తెలుసు. అయితే ఫైనల్లో తమపై మాత్రం బుమ్రా విఫలం కావాలని కోరుకుంటున్నట్లు కివీస్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అన్నాడు. ‘బుమ్రా అద్భుతమైన బౌలర్ అనడంలో సందేహం లేదు. అతని బౌలింగ్లో ఎంతో వైవిధ్యం ఉంది. యార్కర్లను గొప్పగా సంధించగలడు. అయితే అతను కూడా మానవమాత్రుడే. ఏదో ఒకరోజు విఫలం కావచ్చు కూడా. అది ఆదివారమే కావాలని ఆశిస్తున్నాం’ అని ఫిలిప్స్ చెప్పాడు. భారత్తో పోలిస్తే జనాభాలో ఎంతో చిన్నదైన తమ దేశం క్రికెట్లో ఇప్పటి వరకు సాధిస్తూ వచ్చిన ఘనత చిన్నదేమీ కాదని అతను అభిప్రాయపడ్డాడు. సుమారు 50 లక్షల జనాభా ఉన్న కివీస్ వరల్డ్ కప్లాంటి వేదికపై భారత్తో ఫైనల్లో తలపడే అవకాశం రావడం కూడా గొప్ప విషయమని అతను అన్నాడు. -
‘రికార్డులు’ బద్దలు కొట్టిన భారత్–ఇంగ్లండ్ సెమీఫైనల్
ముంబై: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగి రెండో సెమీఫైనల్ మ్యాచ్లో భారీ పరుగులు, బౌండరీలతో రికార్డుల మోత మోగింది. అయితే దీంతో పాటు డిజిటల్ వీక్షకుల సంఖ్య విషయంలో కూడా ఈ మ్యాచ్ కొత్త రికార్డులు నెలకొల్పింది. జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల (సుమారు 6 కోట్ల 25 లక్షలు) మంది చూడటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడా ఈవెంట్లోనైనా ప్రత్యక్ష ప్రసార సమయంలో ఇది అత్యధికం. తాజా గణాంకాలు క్రికెట్ స్థాయిని చూపిస్తున్నాయని, ఇది తమకు గర్వకారణమని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నారు. తాజా రికార్డు ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్తో చెరిగిపోతుందా అనేది ఆసక్తికరం. -
అభివృద్ధిలో ఆమె స్థానం ఎక్కడ?
దేశ జనాభాలో 48%గా ఉన్న మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, భద్రత తదితర అంశాలను తరచుగా సమీక్షించుకుంటూ, లోపాలను సవరించుకుంటూ ముందుకు సాగినప్పుడే దేశం వడివడిగా అభివృద్ధి పథంలోకి సాగుతుంది. మనం ఎంతో గొప్పగా, ఘనంగా చాటుకుంటున్న భారతదేశ ఆర్థికాభివద్ధి కథ (గ్రోత్ స్టోరీ)లో మహిళల భాగస్వామ్యం లేకుంటే అది ఓ అసంపూర్ణ కథాచిత్రంగానే మిగిలిపోతుంది. దేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కావాలన్న కల సాకారం కావాలంటే మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు గణనీయంగా మెరుగుపడక తప్పదు. మెరుగుదల ఉన్నప్పటికీ...నిజం చెప్పాలంటే గత ఆరేళ్లలో దేశంలో మహిళల వికాసం, ప్రగతి అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో మెరుగుపడ్డాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ప్రపంచ బ్యాంకు నివేదిక వంటి ప్రామాణిక సంస్థలు వెలువరించిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత రంగాలలో పెద్ద అడుగులేముందుకు పడ్డాయి. ముఖ్యంగా... 2023–24 నాటికి దేశంలో మహిళల విద్య 73 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు... రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళాసంక్షేమ కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో బాలికల ప్రవేశాలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో గణనీయంగా పెరిగాయి. స్టెవ్ు గ్రాడ్యుయేట్లలో మహిళల వాటా 43%కు పెరిగింది. ఇది ప్రపంచ దేశాలలోనే అత్యధికం. 2023–24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, మహిళా కార్మికశక్తి భాగస్వామ్యం 2017–18లో 23.3% ఉండగా 2024–25 నాటికి 37%కు పెరిగింది. ఇక చిన్న, సన్నకారు పారిశ్రామిక సంస్థలను నిర్వహించే మహిళా పారిశ్రామికవేత్తలసంఖ్య కోటిన్నరకు పెరిగి తద్వారా పుష్కలంగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలలో... ‘స్టాండ్ అప్ఇండియా’, ‘ముద్ర యోజన’, స్వయం సహాయక సంఘాలువంటివి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశ స్థూల ఉత్పత్తిలో ఆర్థికంగా మహిళలు అందిస్తున్న వాటా 18 శాతంగా ఉంది. మహిళల సాధికారత దిశగా సాగిస్తున్న ప్రయాణం అంతకుముందు కంటే సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాలతో, మరీ ముఖ్యంగా దక్షిణాసియా దేశాల కంటే కూడా బాగా వెనుకబడి ఉన్నాం. ఇందుకు అనేక కార ణాలు కనిపిస్తాయి. మహిళల విద్య, వారి భద్రత, ఆరోగ్యం, ఉపాధి రంగాలలో మన దేశం ర్యాంకు సంతృప్తికరంగా లేదు. చైనా,జపాన్లే కాదు థాయిలాండ్, శ్రీలంకల కంటే మనం వెనుకబడి ఉన్నాం అన్నది ఓ చేదు వాస్తవం.కొనసాగుతున్న హింసమహిళలకు భారతీయ సంస్కృతిలో గొప్ప స్థానం ఉందని చెబుతారు. కానీ ఆచరణలో అది అంతగా కనిపించదు. అయితే మహిళలపై ఒకప్పటిలా తీవ్రస్థాయిలో సాగిన దురాచారాలు,అకృత్యాలు ఇప్పుడు లేకపోవచ్చు గాని నేటికీ మహిళలపై భిన్న రూపాలలో హింస చోటు చేసుకుంటూనే ఉంది. మహిళల భద్రత అంశంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాలలో భారత్ ఒకటిగా ఉంది. ‘నేషనల్ క్రైవ్ు రికార్డ్స్ బ్యూరో’ ప్రకారం 2022–23లో దేశంలో మహిళలపై 4.45 లక్షల నేరాలు జరిగాయి. రికార్డులకు ఎక్కని ఘోరాలు ఇంకా మరెన్నో ఉంటాయి.‘సమాన పనికి సమాన వేతనం’ అన్న చట్టం అమలులోకి రాకముందు మహిళలకు అతి తక్కువ వేతనాలు ఇవ్వడం భారత దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. భవన నిర్మాణ రంగం, ఇతర రోజువారీ కూలీ పనులలో మగ కూలీకి ఇచ్చే భత్యం కంటే ఆడకూలీకిచ్చే మొత్తం ఇప్పటికీ తక్కువగా ఉంటోంది. నిజానికి మగవారు చేసే పని కంటే ఆడ వారు చేసే పని పొందికగా, నాణ్యతతో, అధిక ఉత్పాదకతతో ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. అన్ని రంగా లలో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడం ద్వారా సింగపూర్ ఆర్థికాభివృద్ధిలో ఎంతో ముందంజ వేసింది. కాగా, మన దేశంలో ఎటువంటి జీత భత్యాలు లభించని ఇంటి పనుల్లో పనిచేసే ఆడవారి సంఖ్య మగవారి కంటే మూడు నుంచి పది రెట్లు ఎక్కువ అని తేలింది.రాజకీయ విజయందేశ మహిళలకు స్థానిక సంస్థలలో గత కొన్నేళ్లల్లో రాజకీయ భాగస్వామ్యం పెరగటం వారు సాధించిన అతి గొప్ప విజయంగా పరిగణించాలి. మెజారిటీ రాష్ట్రాలు మహిళలకు స్థానిక సంస్థలలో 50 శాతం మేర రిజర్వేషన్లు అందిస్తున్నాయి. దీనివల్ల మొత్తం స్థానిక సంస్థలలో 14 లక్షల మహిళా ప్రజా ప్రతినిధులు భాగస్వాముల య్యారు. మరికొన్నేళ్లలో అసెంబ్లీ, పార్లమెంట్లలో సైతం మహిళ లకు 33% సీట్లు లభించనున్నాయి. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా మహిళల భాగ స్వామ్యం అన్ని రంగాలలో ఉండాలంటే అందుకు నిర్మాణాత్మకమైన ప్రణాళికతో పాటు కార్యాచరణ అవసరం. ప్రధానంగా మహిళలకు నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యాలు అందించాలి. స్కాలర్ షిప్లు, మెంటార్షిప్లతో వారికి ప్రోత్సాహం కల్పించాలి. స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలలో వారిని పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలి. గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి పొదుపు సంఘాలను మరింతగా ప్రోత్సహించాలి. మహిళా ఆంట్రప్రెన్యూర్సును తయారు చేయడానికి అవసరమైన బ్యాంకు రుణాలు, మార్కెట్ లింకేజీలు, ఇంక్యుబేషన్లు వంటివి అందించ గలగాలి. పాఠశాలలు, కాలేజీలు, పనిచేసే ప్రాంతాలలో మహిళలకు పూర్తి భద్రత కల్పించాలి. ప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ చెప్పినట్లు – ప్రతి మహిళ తెలివితేటలను, సామర్థ్యాలను ఆర్థిక వనరుగా తీర్చిదిద్ది దేశ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేయాలి. అప్పుడే భారతదేశం ఎదురుచూస్తున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ముందుగానే సాకారం అవుతుంది.-వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు-డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు -
భారత్ చమురు కొనుగోలుకు అనుమతి అవసరం లేదు
భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడానికి ఎప్పుడూ ఇతర దేశాల అనుమతిపై ఆధారపడలేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి స్పష్టం చేశారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ, భారతదేశం తన జాతీయ ప్రయోజనాల ప్రకారం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.భారతదేశం ప్రపంచంలో పెద్ద చమురు వినియోగ దేశాలలో ఒకటి. దేశంలో ఉత్పత్తి అయ్యే చమురు పరిమితంగా ఉండటంతో, ఎక్కువ భాగం విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందుకే భారత్ వివిధ దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులు గత కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి.కొన్ని సందర్భాల్లో యూనిటెడ్ స్టేట్స్ ప్రభుత్వం.. రష్యాపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ భారతదేశం తన అవసరాలను దృష్టిలో పెట్టుకొని రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కొనసాగించింది. ఇటీవల అమెరికా భారతీయ రిఫైనరీలు రష్యా చమురు కొనుగోలు చేయడానికి 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ మినహాయింపు భారతదేశ విధానాన్ని నిర్ణయించేది కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అది కేవలం వాణిజ్యంలో ఉన్న కొంత ఇబ్బందిని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. -
నేపాల్ ఎన్నికల ఫలితాలు భారత్కు ఎందుకింత కీలకం?
న్యూఢిల్లీ: ‘జెన్-జీ’ ఉద్యమంతో గత సంవత్సరం నేపాల్లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆ తరువాత సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జెన్-జీ ఉద్యమం తర్వాత.. నేపాల్లో గురువారం జరిగిన ఎన్నికలు ఆ దేశ భవిష్యత్తుకు ఎంతో కీలకం. అలాగే, ఈ ఎన్నికలు భారత్కు కూడా కీలకంగా మారాయి. ఎన్నికల ఫలితాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. భౌగోళికంగా, చరిత్ర, సంస్కృతి, ఆర్థిక పరంగా నేపాల్తో భారత్కు సత్సంబంధాలు చాలా ముఖ్యం.జాగ్రత్తగా వ్యవహరించిన భారత్భారత్-నేపాల్ సంబంధాల్లో కొన్ని సంవత్సరాలుగా అనేక సంక్లిష్ట పరిస్థితులను చూస్తున్నాం. ముఖ్యంగా 2025లో రాజకీయ పరంగా అశాంతి నెలకొంది. కొన్ని నెలల ముందు నేపాల్లో తీవ్ర అస్థిరత చోటుచేసుకుంది. అవినీతి, నిరుద్యోగం, సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నియంత్రణలకు వ్యతిరేకంగా 2025 సెప్టెంబర్లో నేపాల్ వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది.నేపాల్ ఆర్థికంగా కుదేలవుతుండడం, రాజకీయ వర్గాల్లో బంధుప్రీతి ఉందనే అంశం యువతలో ఆగ్రహాన్ని పెంచాయి. ఆ అసంతృప్తిని జెన్ జీ నిరసనలు ప్రతిబింబించాయి. ఈ ఎన్నికల ముందు నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా నేపాల్ పట్ల భారత్ జాగ్రత్తగా దౌత్య విధానాన్ని అనుసరించింది. స్థిర ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధాన కార్యక్రమాలను నిలిపివేసింది.భారత్-నేపాల్ ఉద్రిక్తతలకు కారణాలు భారత్-నేపాల్ సంబంధాల్లో పెద్ద సమస్యల్లో ఒకటి కలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలపై సరిహద్దు వివాదం. ఇవి భారత్లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగంగా పరిపాలనలో ఉన్నాయి. 2020లో నేపాల్ విడుదల చేసిన రాజకీయ పటంలో ఈ ప్రాంతాలను తన భూభాగంగా చూపింది.తాజాగా 2025 నవంబర్లో లిపులేఖ్, లింపియాధురా, కలాపాని ప్రాంతాలను తన పటంలో చూపించిన కొత్త ఎన్పీఆర్ 100 నోటును విడుదల చేయాలని నేపాల్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా విమర్శించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో ఈ తీరును ఏకపక్ష చర్యగా పేర్కొంది. భూమి గురించిన వాస్తవాలను ఇది మార్చదని తెలిపింది.‘బిగ్ బ్రదర్ ధోరణి’ ఆరోపణ నేపాల్లో అంతర్గతంగా రాజకీయాల్లో పోటీ నెలకొంటే జాతీయవాద వాదనలు తరచూ వినిపిస్తాయి. ముఖ్యంగా వామపక్ష పార్టీలలో ఈ ధోరణి బలంగా ఉంటుంది. కొంతమంది నేతలు నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు కొంతమంది ఓటర్లలో మద్దతు ఉంది. మరోవైపు, నేపాల్ రాజకీయ వర్గాల్లో చాలా మంది భారత్ “బిగ్ బ్రదర్” ధోరణి చూపుతుందని భావిస్తున్నారు.లిపులేఖ్: చైనాతో వాణిజ్యం వేళభారత్-చైనా వాణిజ్యం ‘లిపులేఖ్’ మార్గం ద్వారా పునఃప్రారంభమైనప్పుడు ( 2025 ఆగస్టులో) నేపాల్ తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నేపాల్ ఈ ప్రాంతాన్ని తన భూభాగమని ప్రకటించి, భారత్-చైనా ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. లిపులేఖ్, లింపియాధురా, కలాపాని ప్రాంతాలను తన సార్వభౌమ భూభాగమని నేపాల్ ప్రకటించింది. లిపులేఖ్ మార్గం ద్వారా భారత్-చైనా మధ్య వాణిజ్యం పునఃప్రారంభం కావడంపై నేపాల్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. నేపాల్ రాజ్యాంగంలో ఉన్న అధికారిక పటంలో లింపియాధురా, లిపులేఖ్, కలాపాని ప్రాంతాలు నేపాల్ అంతర్భాగంగా చూపించడం సరికాదని చెప్పింది.కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక? నేపాల్లో జెన్-జీ ఉద్యమానికి ముందు భారత్-నేపాల్ మధ్య సత్సబంధాలు దెబ్బతిన్నాయి. నేపాల్ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ తమ ప్రధాని అభ్యర్థిగా బాలేంద్ర షాను నిలిపింది. ఆయన జెన్-జీ ఉద్యమంలో పనిచేసిన నేత. ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ద్వారా తెలుస్తోంది. నేపాల్ కొత్త ప్రభుత్వం భారత్లో మళ్లీ సత్సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. Nepal’s new ₹100 note now shows Village Kalapani, Lipulekh Pass & Limpiyadhura Pass as “Nepali territory”.Reality check:• The India–Nepal–Tibet tri-junction lies at Tinkar La (Pass), East of Lipulekh.• The historic Kali Mata temple at Village Kalapani marks the true… pic.twitter.com/SY7eFSrej7— Brigadier Bhupesh Singh, Veteran (@Bhupesh) November 29, 2025 -
కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
న్యూఢిల్లీ: అసోంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ సు-30 ఎంకేఐ యుద్ధ విమానంతో కమ్యూనికేషన్ కట్ అయినట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భారత వాయుసేన పూర్తి వివరాలు తెలిపింది. ఆ యుద్ధ విమానం కుప్పకూలిపోయిందని, భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లు మృతి చెందారని చెప్పింది. మృతి చెందిన పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పుర్వేశ్ దురాగ్కర్గా అధికారులు గుర్తించారు. “భారత వాయుసేనకు చెందిన సిబ్బంది అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం” అని వాయుసేన ఎక్స్ లో తెలిపింది.సుఖోయ్ సు-30 ఎంకేఐ శిక్షణ మిషన్లో ఉండగా జోర్హాట్ వాయుసేన స్థావరం నుంచి ఎగిరిన కొద్ది సేపటికే కనిపించకుండా పోయింది. అది కుప్పకూలిన ప్రాంతం అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో ఉంది.నిన్న రాత్రి 7.42 గంటలకు దానితో కమ్యూనికేషన్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సుఖోయ్ సు-30 ఎంకేఐ రెండు సీట్లు ఉండే, మల్టీరోల్, దీర్ఘ శ్రేణి యుద్ధ విమానం. రష్యా విమాన తయారీ సంస్థ సుఖోయ్ దీన్ని అభివృద్ధి చేసింది.ప్రస్తుతం భారత వాయుసేన అవసరాల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్తో దీనిని తయారు చేస్తోంది. భారత వాయుసేన వద్ద 260కి పైగా సుఖోయ్ సు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఉన్నాయి. IAF acknowledges the loss of Sqn Ldr Anuj and Flt Lt Purvesh Duragkar, who sustained fatal injuries in the Su-30 crash. All personnel of the IAF express sincere condolences, and stand firmly with the bereaved family in this time of grief.@DefenceMinIndia@SpokespersonMoD… pic.twitter.com/zUtfUJ2ewr— Indian Air Force (@IAF_MCC) March 6, 2026 -
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
మాస్కో: ఇజ్రాయెల్, అమెరికాలతో పోరాడుతున్నప్పటికీ ఇరాన్ తమను సైనిక సాయం అడగలేదని రష్యా ప్రకటించింది. మిత్రదేశానికి సాయపడబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్ష కార్యాలయం అధికారిక ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం స్పందించారు. ‘‘ఇరాన్ నుంచి ఇంతవరకు ఎలాంటి అభ్యర్థనా రాలేదు. ఇరాన్తో మా మిత్రత్వం ఎప్పటి లాగానే కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు లేవు. 2025 జనవరిలో ఇరాన్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. కానీ ఆ ఒప్పందంలో ఆపత్కాలంలో ఇలాంటి సైనిక సాయం అంశం లేదు’’ అని పెస్కోవ్ స్పష్టంచేశారు.చైనా ఆఫర్..గతవారం నుంచి అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలకు దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. పోరాటాన్ని ముగించడానికి తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. అలాగే, జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యూఏఈకి చైనా మద్దతు ఇస్తుందని, దౌత్యం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకునేలా ఇతర గల్ఫ్ దేశాలకు కూడా మద్దతు ఇస్తుందని వాంగ్ యీ అన్నారు. ‘‘యుద్ధం వల్ల ప్రజలు మాత్రమే నష్టపోతారు.. శాంతి కోసం చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూనే ఉంటుంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శాంతి ప్రక్రియ కోసం ప్రత్యేక రాయబారిని పంపే ప్రణాళికలను ధ్రువీకరించింది.భారత్ కీలక ప్రకటన..మరోవైపు, ఘర్షణలను వీలైనంత త్వరగా ముగించాలని ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్లకు భారత్ పిలుపునిచ్చింది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత్ చట్టాలను గౌరవిస్తుంది.. సైనిక ఘర్షణలతోనే ఏ సమస్య పరిష్కారం కాదు.. అది ఉక్రెయిన్ అయినా.. పశ్చిమాసియా అయినా’’ అని అన్నారు. -
అమెరికాకు బుద్ధి చెప్తాం
న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధ నౌక ‘దేనా’ను హిందూమహా సముద్ర జలాల్లో అమెరికా ముంచేయడంపై భారత్లో ఆ దేశ రాయబారి మహ్మద్ ఫతాలీ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా పాల్పడిన చర్య దారుణ హత్యతో సమానమని, ఇరాన్ తగు రీతిలో బదులు తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. శాంతియుత విన్యాసాల్లో పాల్గొని తిరిగి వస్తున్న నిరాయుధంగా వస్తున్న నౌకను ధ్వంసం చేయడాన్ని బట్టి చూస్తే అమెరికా, జియోనిస్టులకు అంతర్జాతీయ చట్టాలను నాశనం చేయాలనే దుర్భుద్ధి ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. మా ప్రజలు, ఆత్మవిశ్వాసాన్నే నమ్ముకున్న మా దేశం ఈ చర్యకు తీవ్రమైన రీతిలో సమాధానమిస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్, భారత్ల మధ్య బలమైన సంబంధాలు, ఉమ్మడి ప్రయోజనాలు, బలమైన సాంస్కృతిక వారసత్వం ఉన్నాయన్నారు.హెచ్చరిక లేకుండానే దాడియుద్ధ నౌక దేనాపై అమెరికా సబ్మెరీన్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఆకస్మికంగా టార్పెడో దాడి చేసిందని ముంబైలో ఇరాన్ కాన్సులేట్ జనరల్ సయీద్ రెజా అన్నారు. నౌకా విన్యాసాల నుంచి తిరిగి వెళ్లే యుద్ధ నౌకల్లో సాధారణంగా ఎటువంటి మందుగుండు సామగ్రి ఉందన్నారు. ఒకవేళ ఉన్నా దానిని విన్యాసాల సమయంలో ఉపయోగించే అవకాశం తక్కువని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రిగేట్ దేనాను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు. ఈ ఘటనలో 100 మంది వరకు నౌకా సిబ్బంది, సైనికులు వీరమరణం పొందడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులను రోడ్డు మార్గంలో స్వదేశానికి తరలించేందుకు నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.అన్వేషణలో శ్రీలంకకు తోడుగా..అమెరికా టార్పెడో దాడిలో హిందూ మహా సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధ నౌక వద్ద అన్వేషణ, సహాయ కార్యక్రమాల్లో శ్రీలంకకు భారత్ తోడైంది. లాంగ్ రేంజ్ పెట్రోల్ విమానం సాయంతో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు నేవీ తెలిపింది. ఆ ప్రాంతంలోనే మోహరించి ఉన్న ఐఎన్ఎస్ తరంగిణి కూడా అన్వేషణలో పాల్గొంటోందని పేర్కొంది. ఐఎన్ఎస్ ఇక్షక్ కూడా కొచ్చినుంచి బయలుదేరిందని వివరించింది. -
ధరల మోత.. వంటనూనెలు మొదలు ఔషధాల దాకా
ఇరాన్పై అమెరికా దాడిచేస్తే బదులుగా ఇరాన్.. సౌదీ, బహ్రెయిన్, ఖతార్ సహా పలు గల్ఫ్ దేశాలపై బాంబులేస్తోంది. సుదూరంగా ఉన్న భారత్పై బాంబులు పడకపోయినా ధరల బాంబులు పడొచ్చన్న విశ్లేషణలు ఇప్పుడు సగటు భారతీయుని గుండెల్లో భయాందోళనలను పెంచేస్తున్నాయి. సముద్రమార్గంలో చమురు కూడలిగా పేరొందిన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ముడిచమురు మొదలు పలురకాల వస్తూత్పత్తుల ధరలకు రెక్కలొచ్చే ఆస్కారముంది. తొలుత చమురు మంటలు యుద్ధం ఇలాగే కొనసాగితే మిగతా వినిమయ వస్తువులతో పోలిస్తే మొట్టమొదట ముడిచమురు, చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ద్రవరూప సహజవాయువు(ఎల్ఎన్జీ) సరఫరా ఇరాన్ నుంచి ఆగిపోయింది. సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీ నుంచి భారత్కు సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఫిబ్రవరి నుంచి చమురు ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. హార్మూజ్ జలసంధికి బదులు ఆఫ్రికా ఖండంలోని ‘కేప్ ఆఫ్ గుడ్హోప్’ను చుట్టేస్తూ చమురు ఉత్పత్తులను సరఫరా చేస్తే రవాణా ఖర్చులు కలుపుకుని భారత్లో ఆయిల్ ధరలు పెరగడం ఖాయం. వంటనూనె మరింత ధర.. భారత్ వంటనూనెల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. పామాయిల్ ఎక్కువగా ఇండోనేసియా, మలేసియా నుంచి వస్తోంది. అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ నూనె, రష్యా, ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతున్నాయి. వీటిలో కొంత సరుకు హార్మూజ్ జలసంధి గుండా వస్తోంది. రవాణా గొలుసు తెగిపోవడంతో ధరలు కట్టలు తెంచుకోవచ్చని ‘సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు. ఇప్పటికే వంటనూనెల ధరలు పెరగడం ఆరంభమైంది. కేంద్రప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం మార్చి రెండో తేదీ ధరలతో పోలిస్తే మార్చి మూడో తేదీన సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ నూనెల రిటైల్ ధరలు ఒకటి నుంచి మూడు రూపాయలు పెరిగాయి. పప్పులూ మరింత ప్రియం.. పప్పుల ధరలు పెరిగే వీలుందని ‘ఆల్ ఇండియా దాల్ మిల్ అసొసియేషన్’అధ్యక్షుడు సురేశ్ అగర్వాల్ చెప్పారు. మయన్మార్, కెనడా, ఆఫ్రికాల నుంచి భారత్ ఏటా దాదాపు 60 లక్షల టన్నుల కందులు, మినుములు సహా పలు రకాల పప్పులను దిగుమతిచేసుకుంటోంది. ‘‘ఇరాన్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్ అత్తిపండు, బాదం, పిస్తా, ఖర్జూరా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, అప్రికాట్లను దిగుమతి చేసుకుంటోంది. పాకిస్తాన్తో ఘర్షణ వాతావరణం కారణంగా ఇప్పుడు ఇరాన్, అఫ్గాన్ల నుంచి పాక్కు, అక్కడి నుంచి వాఘా సరిహద్దు గుండా భారత్కు సరుకు రావట్లేదు. సముద్రమార్గంలో వస్తోంది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు సముద్రమార్గం మూసేయడంతో డ్రై ఫ్రూట్స్ సరుకు రావడం దాదాపు ఆగిపోయినట్లే. ధరలు పెరిగే వీలుంది’’అని ‘ముంబై డ్రై ఫ్రూట్, డేట్ మర్చంట్స్ అసోసియేషన్’అధ్యక్షుడు విజయ్ భూటా చెప్పారు. ఎరువులు, సాగు ఉత్పత్తుల రాక సైతం తగ్గిపోయిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానాల రాకపోకలు తగ్గడంతో కార్గో రవాణా పరిమాణం కుచించుకుపోయింది. ఇతర దేశాల మీదుగా విమానాలు తిరిగి రావడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు టికెట్ అధిక చార్జీల మోత మోగుతోంది. ప్లాస్టిక్ సైతం.. ముడిచమురు నుంచే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ను తయారుచేస్తారు. ముడిచమురు సరఫరా తగ్గడంతో గత రెండు రోజుల్లోనే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ధర 12 శాతం ఎగసింది. దీంతో ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తుల ధరలు సైతం పైపైకి పోవడం ఖాయంగా కని్పస్తోంది. ఔషధాలదీ అదే బాట... ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్(ఏపీఐ) కోసం భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. కానీ అత్యంత ఖరీదైన కీ స్టారి్టంగ్ మెటీరియల్స్(కేఎస్ఎం) కోసం ఎక్కువగా ఐరోపా దేశాలపై ఆధారపడుతోంది. యూరప్ నుంచి కేఎస్ఎం సరుకు హార్మూజ్ ద్వారానే రావాల్సి ఉంది. ఇవి తగ్గిపోవడంతో భారత్లో సంక్లిష్ట జనరిక్ మందులతోపాటు సైడ్ ఎఫెక్ట్లను తగ్గించే ‘విలువ జోడింపు ఔషధా(వీఏఎం)’ల తయారీ ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. వీటికితోడు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి మారకం విలువ పతనమవుతుండటంతో పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు మరింత ప్రియంకానున్నాయి. ఇవన్నీ కలసి సగటు భారతీయుని జేబుకు పెద్ద చిల్లు పెడతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
IND Vs ENG: పరుగుల వరదతో ఫైనల్లోకి
భారత జట్టు స్కోరు 253 పరుగులు... ఇందులో 18 ఫోర్లు, 19 సిక్స్లు.. వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టూ కూడా ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇక గెలుపు లాంఛనమే, ఫైనల్ చేరడం ఖాయమనే అనిపించింది. కానీ ఇంగ్లండ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. భారీ స్కోరును చూసి బెదిరిపోకుండా ఆ జట్టు కూడా 21 ఫోర్లు, 15 సిక్స్లతో ఆఖరి వరకూ పోరాడింది... కానీ అదృష్టవశాత్తూ టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో చివరకు 7 పరుగులతో సూర్యకుమార్ బృందం గట్టెక్కింది. గత మ్యాచ్ తరహాలోనే సంజు సామ్సన్ మరో అద్భుత ఇన్నింగ్స్తో జట్టును నడిపించగా... ఇంగ్లండ్ తరఫున జాకబ్ బెతెల్ శతకం జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. చివర్లో కట్టుదిట్టమైన మన బౌలింగ్ భారత్ను ఫైనల్కు చేర్చింది. టి20 వరల్డ్ కప్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచేందుకు ఇక ఒకే ఒక్క విజయం భారత్కు కావాలి. ఆదివారం ఆఖరి సమరంలో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోవడమే టీమిండియాకు మిగిలింది. ముంబై: టి20 వరల్డ్ కప్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత జట్టు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి మన టీమ్ తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం వాంఖెడే మైదానంలో హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్ సమరంలో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా... శివమ్ దూబే (25 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడిపోయింది. జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. భారత్, కివీస్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. పోటీ పడి సిక్సర్లు బాది... ఓపెనర్ అభిషేక్ శర్మ (9) మరోసారి విఫలమైనా... సామ్సన్, ఇషాన్ భాగస్వామ్యంతో భారత్ దూసుకుపోయింది. ఆర్చర్ తొలి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్ అతని రెండో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. మరోవైపు ఇషాన్ కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 67 పరుగులకు చేరింది. డాసన్ ఓవర్లో భారీ సిక్స్తో 26 బంతుల్లో సామ్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, స్యామ్ కరన్ ఓవర్లో ఇద్దరూ కలిసి 20 పరుగులు రాబట్టారు. రెండో వికెట్కు 45 బంతుల్లో 97 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు ఇషాన్ను రషీద్ అవుట్ చేశాడు. అయితే స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతో బ్యాటింగ్లో ముందుగా దూబేను పంపిన భారత్ ఫలితం రాబట్టింది. రషీద్ ఓవర్లో 2 భారీ సిక్స్లతో అతను చెలరేగాడు. ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో మరో రెండు సిక్స్లు బాదిన సామ్సన్ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. సూర్యకుమార్ (11) ఎక్కువసేపు నిలవలేకపోగా, ఒవర్టన్ ఓవర్లో హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మూడు ఫోర్లు కొట్టాడు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ వర్మ (7 బంతుల్లో 21; 3 సిక్స్లు) ఏకంగా మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 20వ ఓవర్లో పాండ్యా మరో 2 సిక్స్లు కొట్టడంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 76 పరుగులు సాధించడం విశేషం. టాపార్డర్ విఫలం... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే ఫిల్ సాల్ట్ (5) వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (7), టామ్ బాంటన్ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే బెతెల్ మాత్రం పోరాటపటిమ కనబర్చాడు. బుమ్రా బౌలింగ్లో సిక్స్ కొట్టిన అతను వరుణ్ చక్రవర్తి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. పాండ్యా ఓవర్లోనూ అతను వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. మరోవైపు విల్ జాక్స్ (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా బెతెల్కు సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 39 బంతుల్లో 77 పరుగులు జోడించారు. జాక్స్ అవుటైన తర్వాత స్యామ్ కరన్ (18)తో కలిసి గెలిపించేందుకు బెతెల్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆఖరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సిన దశలో రెండు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బెతెల్... శివమ్ దూబే వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు కోల్పోయింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆర్చర్ (19 నాటౌట్) మూడు సిక్స్లు బాదినా లాభం లేకపోయింది. 17 ఓవర్ల వరకు ఇంగ్లండ్దే పైచేయి... దాదాపు అసాధ్యమైన లక్ష్యమే అయినా ఇంగ్లండ్ పూర్తిగా తడబడలేదు. వికెట్లు పడుతున్నా పరుగుల వేగం మాత్రం తగ్గించలేదు. ఇరు జట్ల ఇన్నింగ్స్లను పోలిస్తే 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్దే పైచేయిగా ఉంది. 10 ఓవర్లలో స్కోర్లు 119, 119తో సమంగా ఉండగా 15 ఓవర్లలో 177, 185తో ఇంగ్లండ్ ముందంజలో ఉంది. 17 ఓవర్లలో 205/4, 209/5తో వారిదే పైచేయి. అయితే చివరి 3 ఓవర్లు తేడా చూపించాయి. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ కొట్టిన 3 సిక్స్లు కీలకంగా మారాయి. దూబే వేసిన ఆఖరి ఓవర్లో 30 పరుగులు కాపాడుకోవాల్సి వచ్చింది కాబట్టి భారత్ బతికిపోయింది. మరికొన్ని పరుగులు తక్కువగా ఉన్నా కష్టమయ్యేది. సామ్సన్ క్యాచ్ వదిలేసి... గత మ్యాచ్ తరహాలో ఈసారి కూడా సామ్సన్ దూకుడైన బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. అయితే అతనికి ఈసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. సామ్సన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆర్చర్ బౌలింగ్లో మిడాన్ వద్ద కెప్టెన్ బ్రూక్ అతి సునాయాస క్యాచ్ వదిలేశాడు. దానికి ఇంగ్లండ్ ఫలితం అనుభవించింది. క్యాచ్ చేజారడమే కాదు, ఈ క్షణం బౌలింగ్, ఫీల్డింగ్లో ఇంగ్లండ్ లయను బాగా దెబ్బ తీసింది. అప్పటి వరకు పరిస్థితి నియంత్రణలోనే ఉన్నా ఆ తర్వాత భారత్ పరుగుల వరద మొదలైంది. ఈ క్యాచ్ను బ్రూక్ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. లైఫ్ లభించిన తర్వాత సామ్సన్ 36 బంతుల్లో 74 పరుగులు బాదాడు. ఆ ఒక్క ఓవర్లోనే... భారత్ ఇన్నింగ్స్లో ఆటగాళ్లంతా ఏ బౌలర్ను వదలకుండా ప్రతీ ఓవర్లో బౌండరీలతో చెలరేగారు. అయితే జాక్స్ వేసిన ఒక్క 14వ ఓవర్ మాత్రమే దీనికి మినహాయింపు. ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా 7 పరుగులే ఇచ్చిన జాక్స్ తొలి బంతికే సామ్సన్ వికెట్ తీశాడు. అక్షర్ అదరహో... మైదానంలో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా సులువైన క్యాచ్ అందుకొని సాల్ట్ వెనుదిరిగేందుకు కారణమైన అక్షర్ ఆ తర్వాత అసాధారణ క్యాచ్తో బ్రూక్ను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తొలి బంతికే బ్రూక్ షాట్ ఆడగా బంతి ఫీల్డర్లపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. కానీ పాయింట్ నుంచి అక్షర్ వెనుదిరిగి చాలా దూరం పరుగెత్తాడు. బంతి కిందకు పడిపోతున్న దశలో చేతులూ పూర్తిగా చాపి అందుకున్న అతను నేలపై పడినా పట్టు కోల్పోలేదు. అనంతరం కీలక దశలో బౌండరీ వద్ద పరుగెడుతూ వచ్చి జాక్స్ క్యాచ్ను అందుకున్న అతను పట్టు కోల్పోయి బౌండరీ దాటుతున్నట్లు అనిపించిన సమయంలో దూబే వైపు విసిరాడు. ఈ క్యాచ్తో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది.5 టి20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్న ఐదో భారత క్రికెటర్ సంజు సామ్సన్. గతంలో యువరాజ్ సింగ్ (2007లో ఆ్రస్టేలియాపై సెమీఫైనల్లో), ఇర్ఫాన్ పఠాన్ (2007లో పాకిస్తాన్పై ఫైనల్లో), విరాట్ కోహ్లి (2014లో దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో; 2024లో దక్షిణాఫ్రికాపై ఫైనల్లో), అక్షర్ పటేల్ (2024లో ఇంగ్లండ్పై సెమీఫైనల్లో) ఈ ఘనత సాధించారు.4 ఐసీసీ టోర్నీల్లో అత్యధికంగా నాలుగోసారి భారత్–న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.4 టి20 ప్రపంచకప్లో భారత్ నాలుగోసారి ఫైనల్కు చేరింది. 2007లో, 2024లో విజేతగా నిలిచిన భారత్ 2014లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది.105 టి20 వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా బెతెల్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఫిన్ అలెన్ (100 నాటౌట్) స్కోరును బెతెల్ రెండో సెమీఫైనల్లో అధిగమించాడు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 89; అభిషేక్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 9; ఇషాన్ కిషన్ (సి) జాక్స్ (బి) రషీద్ 39; దూబే (రనౌట్) 43; సూర్యకుమార్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 11; పాండ్యా (రనౌట్) 27; తిలక్ (బి) ఆర్చర్ 21; అక్షర్ (నాటౌట్) 2; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–20, 2–117, 3–160, 4–190, 5–212, 6–236, 7–251. బౌలింగ్: ఆర్చర్ 4–0–61–1, జాక్స్ 4–0–40–2, ఒవర్టన్ 3–0–36–0, స్యామ్ కరన్ 4–0–53–0, ఆదిల్ రషీద్ 4–0–41–2, లియామ్ డాసన్ 1–0–19–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) పాండ్యా 5; బట్లర్ (బి) వరుణ్ 25; హ్యారీ బ్రూక్ (సి) అక్షర్ పటేల్ (బి) బుమ్రా 7; బెతెల్ (రనౌట్) 105; బాంటన్ (బి) అక్షర్ 17; జాక్స్ (సి) శివమ్ దూబే (బి) అర్ష్ దీప్ 35; స్యామ్ కరన్ (సి) తిలక్ వర్మ (బి) హార్దిక్ పాండ్యా 18; ఒవర్టన్ (నాటౌట్) 2; ఆర్చర్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–64, 4–95, 5–172, 6–222, 7–225. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–51–1, హార్దిక్ పాండ్యా 4–0–38–2, జస్ప్రీత్ బుమ్రా 4–0–33–1, వరుణ్ 4–0–64–1, అక్షర్ పటేల్ 3–0–35–1, శివమ్ దూబే 1–0–22–0. -
T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట
జింబాబ్వే క్రికెట్ జట్టుకు భారీ ఊరట లభించింది. ఎట్టకేలకు స్వదేశానికి వెళ్లే మార్గం సుగమమైంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే.ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిభారత్- శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీలో గ్రూప్-బి నుంచి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్లతో కలిసి జింబాబ్వే పోటీ పడింది. అనూహ్య రీతిలో మాజీ చాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించి గ్రూప్ టాపర్గా సూపర్-8 చేరింది. అయితే, కీలక దశలో వెస్టిండీస్, టీమిండియా, సౌతాఫ్రికా చేతిలో ఓడి నిష్క్రమించింది.యుద్ధం కారణంగాఈ నేపథ్యంలో మార్చి 2న భారత్ నుంచి జింబాబ్వే జట్టు స్వదేశానికి పయనం కావాల్సింది. కానీ ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్ వేదికగా ప్రయాణించాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఫలితంగా జింబాబ్వే జట్టు బుధవారం వరకు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.ఈ క్రమంలో బ్యాచ్ల వారీగా భారత్ను వీడేందుకు జింబాబ్వే సిద్ధమైనట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. బుధవారం తొలి బ్యాచ్ స్వదేశానికి పయనం కాగా.. శుక్రవారం ఆఖరి బ్యాచ్ ఇండియా నుంచి బయల్దేరుతుందని తెలిపింది.అందుకే విడతల వారీగాఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పేర్కొంది. తగినన్ని విమానాలు అందుబాటులో లేనందున విడతల వారీగా ఆటగాళ్లు జింబాబ్వేకు చేరుకుంటాడని బోర్డు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం జింబాబ్వే జట్టు దుబాయ్ మీదుగా ఎమిరేట్స్ ఫ్లైట్లో వెళ్లాల్సింది. అయితే, యుద్ధ ప్రభావం కారణంగా అదిస్ అబాబా, ఇథియోపియా మీదుగా హరారేకు వారు చేరుకోనున్నట్లు సమాచారం. మరోవైపు.. వెస్టిండీస్ క్రికెట్ జట్టు సైతం భారత్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: మొయిన్ అలీపై నిషేధం..! -
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్
ఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఖమేనీ మృతిపట్ల ఇండియా సంతాపం తెలిపింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. సంతాప సందేశం రాశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ మరణించడం తెలిసిందే.శత్రు దుర్భేద్యమైన భద్రత కలిగిన అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడం సంచలనం సృష్టించింది. ఖమేనీ కోసం కొన్ని నెలలపాటు కొనసాగిన వేట చివరకు రెండు గంటల ఐదు నిమిషాల ఆపరేషన్తో ముగిసింది. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతోనే ఆయనను అంతం చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఏకంగా 30 క్షిపణులను ప్రయోగించాయి. దాంతో ఆయన తప్పించుకోలేకపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తమ హిట్లిస్ట్లో ఉన్న ఖమేనీపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది.ఖమేనీతో జరిగిన భేటీకి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కమాండర్ ఇన్ చీఫ్ మొహమ్మద్ పాక్పౌర్, రక్షణ శాఖ మంత్రి అజీజ్ నజీర్జాదే, మిలటరీ కౌన్సిల్ అధినేత అడ్మిరల్ అలీ షామ్ఖనీ, ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ సయ్యద్ మాజిద్ మౌసావీ, డిప్యూటీ ఇంటెలిజెన్స్ మంత్రి మొహమ్మద్ షిరాజీతోపాటు మరికొందరు ముఖ్యులు హాజరయ్యారు. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో వీరంతా హతమయ్యారు. ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. -
ఇరాన్పై దాడులు.. భారత్ నావల్ బేస్లను అమెరికా వినియోగిస్తోందా?
ఢిల్లీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ నావల్ బేస్లను ధ్వంసం చేసిన తర్వాత అమెరికా భారత్ నావల్ బేస్లను వినియోగిస్తోందంటూ అమెరికా మీడియా విస్తృత ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది.భారత్ స్పష్టంగా తెలిపింది: అమెరికా మీడియా ప్రసారం చేస్తున్న కథనాలు అసత్యమని, భారత నావల్ బేస్లను అమెరికా వినియోగిస్తోందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కథనాలను నిరాధారమైనవిగా, కల్పితమైనవిగా పేర్కొంది.ఇటీవల ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరిగిన నేపథ్యంలో, అమెరికా ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్గ్రెగర్ ఒక అమెరికా మీడియా సంస్థ నిర్వహించిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా అన్ని బేస్లు ధ్వంసం అయ్యాయి. మా నౌకాశ్రయ (Harbour) సదుపాయాలు కూడా నాశనం అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం భారత్, భారత పోర్టులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది సరైన పరిష్కారం కాదు, కానీ పరిస్థితుల వల్ల తప్పనిసరిగా చేయాల్సి వస్తోంది’ అని అన్నారు. అయితే, అమెరికా మీడియా సంస్థ OAN ప్రసారం చేసిన ఈ కథనాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.అమెరికా నేవీ భారత్ పోర్టులను వినియోగిస్తున్నట్లు అమెరికా మీడియా చేస్తున్న తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం. ఇలాంటి నిరాధారమైన, కల్పిత వ్యాఖ్యలను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.Claim: On a US-based channel, One America News Network (@OANN), former U.S. Army Colonel Douglas Macgregor made a statement suggesting that the United States is using Indian naval bases to attack Iran, amidst the ongoing Iran-US conflict.#PIBFactCheck: ❌This claim is #FAKE… pic.twitter.com/nzcXCi7yT9— PIB Fact Check (@PIBFactCheck) March 4, 2026 Fake News Alert!Claims being made on OAN, a US based channel that Indian ports are being used by the US Navy are fake and false. We caution you against such baseless and fabricated comments. pic.twitter.com/xiFWnkoXBk— MEA FactCheck (@MEAFactCheck) March 4, 2026 -
ముంబైలో హై వోల్టేజ్ మ్యాచ్..
-
భారత్కు పుతిన్ భారీ సాయం
ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ చమురు నిల్వలు భారత్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రష్యా మరోసారి భారత్కు అండగా నిలిచింది. ఇరాన్తో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఏకంగా 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో హార్మోజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో దాదాపు 40% హార్మోజ్ ద్వారా జరుగుతోంది. భారత్ వద్ద ప్రస్తుతం కేవలం 25 రోజులకు సరిపడ ముడి చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధమైనట్టు తెలిసింది. భారతీయ సముద్ర జలాలకు సమీపంలోనే ఉన్న నౌకలలోని దాదాపు 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్ చేరుకోగలదని పరిశ్రమ వర్గాలు రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపాయి.అయితే.. రష్యన్ చమురు నౌకల అసలు గమ్యస్థానం వివరాలను మాత్రం వెల్లడించడానికి సదరు పరిశ్రమ వర్గాలు నిరాకరించాయి. దీంతో, రిఫైనరీ సంస్థలకు ఊరట కలిగిస్తూ కొన్ని వారాల్లోనే ఈ చమురు నౌకలు భారత్ చేరుకుంటాయని మాత్రం వారు వెల్లడించారు. అదేవిధంగా గ్యాసాయిల్, గ్యాసోలిన్, ఎల్పీజీ కూడా పరిమిత పరిమాణంలోనే రిఫైనరీల వద్ద ఉన్నాయి. రానున్న 10-15 రోజులు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.ప్రస్తుతం యుద్ధం కారణంగా జలసంధి మార్గం దాదాపు మూతపడడంతో ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత్ అన్వేషించక తప్పని పరిస్థితి నెలకొంది. భారతీయ రిఫైనరీలు రోజుకు సుమారు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు దరిమిలా ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడడంతో హార్మోజ్ జలసంధి సమీపంలో వందలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్కు చమురు సరఫరాకు రష్యా అంగీకరించినట్టు సమాచారం. -
నేడు ప్రధానితో ఫిన్లాండ్ అధ్యక్షుడి భేటీ
న్యూఢిల్లీ: భారత్లో నాలుగు రోజుల పర్యటనకు గాను ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఢిల్లీకి చేరుకున్న ఆయనకు విమానా శ్రయంలో విదేశాంగ శాఖ సహాయమంత్రి కృతి వర్థన్సింగ్ స్వాగతం పలికారు. స్టబ్ గురువారం ప్రధాని మోదీతో సమావేశ మవుతారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. గురువారం సాయంత్రం ప్రారంభమయ్యే రైజినా డైలాగ్ సదస్సులో స్టబ్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసమిస్తారు. స్టబ్ వెంట మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపార వేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వచ్చింది. అలెగ్జాండర్ స్టబ్ రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్లతోనూ భేటీ అవుతారు. శుక్రవారం ముంబైలో వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. శనివారం తిరిగి స్వదేశానికి పయనమవుతారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఓర్పో పాల్గొనడం తెల్సిందే. కొన్ని వారాల వ్యవధిలోనే ఆ దేశాధ్యక్షుడు కూడా భారత్ రావడం గమనార్హం.


