breaking news
India
-
ప్లీజ్ భారత్ మా చక్కెర కొనవా?: పాకిస్థాన్
సాక్షి,న్యూఢిల్లీ: పండగల సీజన్లో అమాంతం పెరుగుతున్న చక్కెర ధరల్ని నియంత్రించేందుకు సరఫరాను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 31, 2026 వరకు ఎలాంటి సుంకం లేకుండా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను దిగుమతి చేసుకునేందుకు వీలుగా విధానాన్ని సవరించింది. గత ఏడాదితో పోలిస్తే రిటైల్ ధరలు సుమారు 13 శాతం పెరగడం, మిల్లుల వద్ద ఎక్స్-మిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడం దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు ఇదే అంశంపై పాక్.. భారత్ను అర్రులు చాస్తోంది. తమ వద్ద ఉన్న షుగర్ కొనులు చేసి ఆర్థికంగా తమని ఆదుకోవాలనే ప్రతిపాదనలు చేసే యోచనలో ఉందంటూ ఆదేశ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. .భారత్ దిగుమతికి మార్గం సుగమం చేయడంతో పాకిస్థాన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ దీనిని ఒక అవకాశంగా మలచుకోవాలని భావిస్తోంది. ఈక్రమంలో హుంజా షుగర్ మిల్స్ ప్రతినిధి పీఎస్ఎంఏ సీనియర్ సభ్యుడు చౌదరి ముహమ్మద్ వహీద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్లో ప్రస్తుతం 12 లక్షల టన్నులకు పైగా మిగులు నిల్వలు ఉన్నాయి. వచ్చే చెరుకు పంట చేతికొచ్చే సమయానికి ఈ నిల్వలను విక్రయించకపోతే కొత్త పంట కొనుగోలు చేయడానికి మిల్లులకు ఇబ్బందులు ఎదురవుతాయి.భారత్కు సమీపంలో ఉండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్యం లభిస్తుందని. మిల్లుల ద్రవ్యత మెరుగుపడి రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించడానికి వీలవుతుందని పాకిస్థాన్ వర్గాలు భావిస్తున్నాయి.వాణిజ్య సంబంధాల సవాళ్లుఇరు దేశాల మధ్య గతంలోనే రాజకీయ, భద్రతా ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య మార్గాలు (అటారీ-వాఘా సరిహద్దు, విమాన మార్గాలు) మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ప్రకారం పాకిస్థాన్ నేరుగా భారత్కు చక్కెర ఎగుమతి చేయడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మిల్లులు తమ ప్రభుత్వాన్ని ప్రత్యేక అనుమతులు కోరుతున్నాయి. అందువల్ల భారత్ తీసుకున్న దిగుమతి నిర్ణయం తక్షణ వాణిజ్య ఒప్పందంగా కాకుండా, కేవలం ఒక ఆరంభంగానే చూడాల్సి ఉంది.ఇథనాల్ ప్రభావం..ప్రభుత్వ వాదనభారత్లో చక్కెర ధరల పెరుగుదలకు కేవలం ఇథనాల్ వైపు చెరకు మళ్లింపు మాత్రమే కారణం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోల్లో 20శాతం ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్, బయోఫ్యూయల్ రంగాన్ని బలోపేతం చేయడానికి గత కొన్ని సీజన్లలో లక్షలాది టన్నుల చక్కెరను ఇథనాల్ వైపు మళ్లించింది. అయితే ప్రస్తుత ధరల అస్థిరతకు మార్కెట్లో కొంతమంది చేసే అసాధారణ నిల్వలు, ఊహాజనిత లావాదేవీలే కారణమని ఆహార, ప్రజా పంపిణీ శాఖ పేర్కొంది. -
మీలాంటి మిలీనియల్స్ ఇల్లు ఎందుకు కొనలేకపోతున్నారో తెలుసా?
విద్య పూర్తిచేసుకుని ఉద్యోగం సంపాదించడం, సొంత ఇల్లు కొనడం, ఆ తర్వాత పెళ్లి చేసుకుని భార్య, పిల్లలతో కుటుంబ జీవితాన్ని ప్రారంభించడం.. గత తరాలు అనుసరించిన ఈ జీవన విధానం ప్రస్తుతం చాలా మంది మిలీనియల్స్కు దూరమైన కలలా మారింది. భారత్లోని మెట్రో నగరాలతో పాటు ఎన్నో దేశాల్లో సొంత ఇల్లు కట్టుకోవడం గగనంగా మారింది. ఇల్లు కొనడం అంటే మొదటగా గుర్తువు వచ్చేది మిలీనియల్స్. జెన్ జీలో చాలా మంది ఇప్పుడిప్పుడే ఉద్యోగం, పెళ్లి బంధంలోకి అడుగుపెడుతుంటారు. మిలీనియల్స్లో చాలా మంది ఇల్లు కొనే ఆలోచనలో ఉంటారు. దీంతో మిలీనియల్స్ తరానికి సొంత ఇల్లు కొనడం చాలా కాలంగా పెద్ద సవాలుగా మారిన తీరుపై ఓ సర్వే చేశారు. అక్కడ 1990 దశకం మధ్యలో బ్రిటన్లో జన్మించిన వారికి ప్రస్తుతం సొంత ఇల్లు ఉండే అవకాశం సుమారు 25 శాతమే ఉంది. 1990 దశకంలో 20 ఏళ్ల వయసులో ఉన్నవారికి సొంత ఇల్లు ఉండే అవకాశం దీనికి దాదాపు రెండింతలు ఉండగా, అంతకుముందు తరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉండేది.ప్రధాన కారణం ఇళ్ల ధరలు దీర్ఘకాలంగా ఇళ్ల ధరలు మన ఆదాయాల కంటే వేగంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. తనఖా రుణాల మార్కెట్లో మార్పులు కూడా ప్రభావం చూపినప్పటికీ, ఇళ్ల నిర్మాణం తగినంతగా జరగకపోవడమే అసలు సమస్యగా హౌసింగ్ ఆర్థికవేత్త పాల్ చెషైర్ పేర్కొంటున్నారు.జనాభా పెరుగుదల, చిన్న కుటుంబాల్లో నివసించే ధోరణికి అనుగుణంగా ఇంగ్లాండ్లో ఏటా మరో 300,000 ఇళ్లు అవసరమని ప్రభుత్వం గతంలో అంచనా వేసింది. అయితే గత ఏడాది 208,000 ఇళ్లు మాత్రమే నిర్మించారు. కనీసం మూడు దశాబ్దాలుగా ఏ ఏడాదిలోనూ 300,000 కొత్త ఇళ్ల నిర్మాణం జరగలేదు.నిర్మాణ వ్యయాలు పైపైకి భూమి, నిర్మాణ కార్మికుల వేతనాలు, ఇటుకలు సహా నిర్మాణ వ్యయాలు పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కలప, ఉక్కు, ప్లాస్టర్బోర్డ్, కాంక్రీట్, ఇన్సులేషన్ వంటి ముడి పదార్థాల లభ్యత తగ్గడంతో వాటి ధరలు మరింత పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం ఇంధన వ్యయాలను ఒక్క ఏడాదిలో 15 శాతం పెంచి నిర్మాణ ఖర్చులను మరింత పెంచింది. ఇరాన్లో యుద్ధం కూడా ధరలను మరింత పెంచింది. 2015లో £150,000తో నిర్మించగలిగిన ఇల్లు ఇప్పుడు £230,000 వరకు ఖర్చవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ వ్యయం మరో 15 శాతం పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.అయితే ఇటీవల ఇళ్ల ధరలు వేతనాల కంటే నెమ్మదిగా పెరుగుతున్నాయి. 2021లో సగటు ఆదాయానికి ఇళ్ల ధరల నిష్పత్తి దాదాపు 9 రెట్లు ఉండగా, ఇప్పుడు 7.6 రెట్లకు తగ్గింది. కొన్ని రుణ సంస్థలు 5 శాతం డిపాజిట్తోనే తనఖా రుణాలు ఇస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో 40 ఏళ్ల వరకు రుణ కాలపరిమితి కూడా అందుబాటులో ఉంది.వడ్డీ రేట్లు ఇటీవలి గరిష్ఠ స్థాయి నుంచి తగ్గడం, ఇళ్ల ధరల పెరుగుదల మందగించడంతో వేతనాలతో పోలిస్తే తనఖా చెల్లింపుల భారం కూడా తగ్గింది. నేషన్వైడ్ గణాంకాల ప్రకారం, 2007లో తొలిసారి ఇల్లు కొనేవారి తనఖా చెల్లింపులు చేతికి వచ్చే ఆదాయంలో 45 శాతం ఉండగా, ప్రస్తుతం 32 శాతంగా ఉన్నాయి. దీర్ఘకాల సగటు 30 శాతంతో పోలిస్తే ఇది ఇంకా ఎక్కువే అయినా పరిస్థితి మెరుగుపడుతున్న దిశలో ఉంది.అయితే తక్కువ డిపాజిట్, ఎక్కువ కాలపరిమితి రుణాలకు ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎక్కువ కాలం వడ్డీ చెల్లించాల్సి రావడంతో మొత్తం ఖర్చు పెరుగుతుంది. ఇళ్ల విలువ పెరగకపోతే కొనుగోలుదారులు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది.ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కీర్ స్టార్మర్ ప్రభుత్వం ప్రణాళికా అనుమతుల ప్రక్రియను సరళీకరించే చర్యలు చేపట్టింది. గ్రీన్ బెల్ట్ ప్రాంతాల్లో మరిన్ని ఇళ్ల నిర్మాణానికి కూడా సంస్కరణలు అవకాశం కల్పించనున్నాయి. అయితే నిర్మాణ సంస్థలు మరింత నమ్మకంతో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకునే చర్యల ఫలితాలు కనిపించేందుకు మాత్రం ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులే అనేక దేశాల్లో ఉన్నాయని అంచనా.ఇదీ చదవండి: 24 గంటల్లో ‘జంతర్ మంతర్ 2.0’.. సీజేపీ హెచ్చరిక -
భారీ సంఖ్యలో టెక్ సిబ్బంది అవసరం..
దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎకోసిస్టమ్ వృద్ధికి బడా టెక్ సంస్థల ఆధిపత్య ధోరణి కంటే నిపుణుల కొరత, డేటా ప్రామాణీకరణ లోపించడం అనేవి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. ‘భారతదేశ ఏఐ ఎకోసిస్టమ్లో పోటీతత్వం, నవకల్పనలు, మార్కెట్ స్వరూపం’ పేరుతో ది డైలాగ్ అనే సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దేశంలో ఏఐ రంగం వేగవంతమైన అభివృద్ధి, విస్తరణ దశలో ఉంది, అయితే, తగినంత మంది ప్రతిభావంతులు లేకపోవడం, డేటా వినియోగంలో లోటుపాట్లు కీలక సమస్యలని పేర్కొంది. స్టార్టప్లు, బిజినెస్ యూజర్లు, వినియోగదారుల్లో 308 మందిని ఈ అధ్యయనంలో భాగంగా సర్వే చేశారు.ముఖ్యాంశాలివీ...నైపుణ్యగం గల సిబ్బంది లభ్యత భవిష్యత్తు పోటీతత్వానికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని అని సర్వేలో పాల్గొన్న వారిలో 47.2 శాతం గుర్తించారు. అదేవిధంగా కస్టమర్లు ఏఐ సేవలను అందిపుచ్చుకోవడం కూడా అంతే స్థాయిలో కీలక సవాలుగా పేర్కొన్నారు.భారీ సంఖ్యలో టెక్ సిబ్బంది అవసరంతో పాటు ఏఐ వ్యవస్థలను రూపొందించడం, శిక్షణ ఇవ్వడం, అమలు చేయడం, దాన్ని విస్తరించడానికి ప్రత్యేక నైపుణ్యలు కావాలని ది డైలాగ్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ భూమిక అగర్వాల్ పేర్కొన్నారు.ఏఐ అభివృద్ధిలో డేటా వినియోగం మరో పెద్ద సమస్యగా ఉంది. డేటా కొరత కంటే వినియోగంలో ఒకే విధమైన ప్రమాణాలు లేకపోవడం ప్రధాన ఇబ్బంది అని 63.2 శాతం మంది ఏఐ డెవలపర్లు అభిప్రాయపడ్డారు. కాపీరైట్ సమస్యలను 44 శాతం మంది, డేటా కొరతను 42 శాతం మంది సవాలుగా చెప్పారు. ప్రభుత్వ అ«దీనంలోని డేటాసెట్స్ సులభంగా అందుబాటులో ఉన్నాయని కేవలం 15 శాతం మంది మాత్రమే పేర్కొనడం గమనార్హం.భారత్లోని ఏఐ స్టార్టప్లు, డెవలపర్లు ఓపెన్ సోర్స్ మోడళ్లు, టూల్స్పై కొంతమేర ఆధారపడుతున్నట్లు 96.2 శాతం మంది చెప్పారు. 62.3 శాతం మంది వాటిపై అధికంగా ఆధారపడుతున్నామని వెల్లడించారు.ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’! -
భారీగా పెరిగిన బంగారం.. ధర ఎంతంటే..!
-
గాలె టెస్టులో టీమిండియా ఘన విజయం
-
భారత్ తన కొడుకు ప్రాణాలు కాపాడటంతో పాకిస్థానీ తల్లి భావోద్వేగ సందేశం
-
మరణశిక్ష.. ఎన్ని రకాలున్నాయో తెలుసా?
ఒక నేరానికి విధించే అత్యంత కఠినమైన శిక్ష.. మరణశిక్ష. అయితే దాన్ని అమలు చేసే విధానం మాత్రం దేశానికో రకంగా ఉంటుంది. ఉదాహరణకు.. భారత్లో ఉరి. అలాగే కొన్నిదేశాల్లో లెథల్ ఇంజెక్షన్, కొన్ని చోట్ల తుపాకీతో కాల్చిచంపడం.. ఇంకొన్ని చోట్ల రాళ్లతో కొట్టి చంపడం, శిరచ్ఛేదం.. ఇలా ఎన్నో. అయితే భారత్లో ఉరి విధానంపై సుప్రీంకోర్టు తీర్పుతో.. నొప్పి లేకుండా చంపే మార్గాలపై, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న మరణశిక్ష పద్ధతులపై మరోసారి చర్చ మొదలైంది.మన దేశంలో ప్రస్తుతం మరణశిక్ష అమలు చేసే చట్టబద్ధమైన పద్ధతి ఉరి. అంటే మెడకు ఉరి బిగించి మరణం సంభవించే వరకు వేలాడదీయడం. ఉరి విధానం క్రూరమైనదని, దాని స్థానంలో తక్కువ బాధ కలిగించే పద్ధతిని తీసుకురావాలని కోరుతూ వచ్చిన పిటిషన్ను తాజాగా(మంగళవారం) సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ప్రత్యామ్నాయ పద్ధతులపై భవిష్యత్తులో కొత్త శాస్త్రీయ ఆధారాల ఆధారంగా పరిశీలనకు అవకాశం ఉంటుందని కోర్టు సంకేతం ఇచ్చింది.ఉరి.. 40 నిమిషాలుభారత్లో అమలయ్యే ఉరి విధానం ఎక్కువ సమయం తీసుకుంటుందని పిటిషనర్ వాదించారు. ఉరిలో ఖైదీ చనిపోయినట్లు నిర్ధారించడానికి 40 నిమిషాలకుపైగా పట్టొచ్చని, షూటింగ్లో కొన్ని నిమిషాలు, ఇంట్రావీనస్ లెథల్ ఇంజెక్షన్లో సుమారు 5 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పోలికను లా కమిషన్ 187వ నివేదికలోని వివరాలతోనూ సమర్థించారు.లెథల్ ఇంజెక్షన్: అమెరికాలో అత్యంత సాధారణంగా ఉపయోగించే విధానం. 2025లో అమెరికాతో పాటు చైనా, వియత్నాంలోనూ ఈ పద్ధతి ద్వారా మరణశిక్షలు అమలైనట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఫైరింగ్ స్క్వాడ్: తుపాకులతో కాల్చి మరణశిక్ష అమలు చేసే పద్ధతి. 2025లో అఫ్గానిస్థాన్, చైనా, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, సోమాలియా, తైవాన్, యూఏఈ, అమెరికా, యెమెన్ తదితర దేశాల్లో ఈ విధానం నమోదైంది.ఎలక్ట్రిక్ చైర్: విద్యుత్ ప్రవాహం ద్వారా మరణశిక్ష అమలు చేసే పద్ధతి. ఇది ప్రధానంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ విధానంగా కొనసాగుతోంది.గ్యాస్/నైట్రోజన్: గ్యాస్ ద్వారా మరణశిక్ష విధించే పద్ధతులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. 2025లో అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ అస్ఫిక్సియేషన్ ద్వారా మరణశిక్ష అమలు నమోదైంది. ఓ చాంబర్లో దోషుల్ని ఉంచి ఈ శిక్ష అమలు చేస్తారు.సౌదీలో.. శిరచ్ఛేదంప్రపంచంలో అత్యంత భిన్నమైన పద్ధతుల్లో ఒకటి శిరచ్ఛేదం. 2025లో సౌదీ అరేబియాలో ఈ విధానం ద్వారా మరణశిక్షలు అమలయ్యాయి. అమ్నెస్టీ గణాంకాల ప్రకారం.. అదే దేశంలో కాల్చివేత, లెథల్ ఇంజెక్షన్ వంటి పద్ధతులూ నమోదయ్యాయి.ఉరి ఎక్కడెక్కడ?భారత్లో మాత్రమే కాదు.. మరణశిక్ష అమలుల్లో ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, జపాన్, కువైట్, సింగపూర్, దక్షిణ సూడాన్ దేశాల్లో ఉరి విధానం ఉపయోగించినట్లు అమ్నెస్టీ పేర్కొంది. అలాగే.. కొన్ని దేశాల్లో చట్టాలతో సంబంధం లేకుండా నైతిక శిక్షల పేరిట రాళ్లతో కొట్టి చంపడం, బహిరంగంగా ఉరి తీయడం లాంటివి చేస్తున్నారు.ప్రపంచంలో మరణశిక్ష తగ్గుతున్నా..అయితే.. మరణశిక్షను రద్దు చేస్తున్న దేశాలు పెరుగుతున్నప్పటికీ.. కొన్ని దేశాల్లో అమలులు మాత్రం కొనసాగుతున్నాయి. 2025లో అమ్నెస్టీ 17 దేశాల్లో కనీసం 2,707 మరణశిక్షల అమలును నమోదు చేసింది. ఈ సంఖ్య 2024తో పోలిస్తే 78 శాతం ఎక్కువ. చైనాలో అమలు చేసినట్లు భావిస్తున్న వేలాది మరణశిక్షలు ఈ లెక్కల్లో లేవు. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాలు ఇప్పటికే మరణశిక్షను చట్టపరంగానో, ఆచరణలోనో రద్దు చేశాయి. అంటే.. ఒకవైపు భారత్లాంటి దేశాల్లో మరణశిక్ష అమలులు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రపంచంలోని మెజారిటీ దేశాలు దానికి దూరమవుతున్నాయి. -
ట్రంప్ కితాబుపై భారత్ రియాక్షన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎన్నికల వ్యవస్థను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలన్న తన వాదనకు భారత్ ఎన్నికల విధానాన్ని ట్రంప్ ఉదాహరణగా చూపించారు. భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే భారత్లో గుర్తింపు ఆధారిత ఓటింగ్ విధానం అమలవుతోందని.. అందుకే అమెరికాలోనూ ఆ తరహా చట్టం రావాలంటూ ఆయన చట్టసభలపై ఒత్తిడి పెంచారు. దీంతో భారత్ స్పందించింది.భారత ఎన్నికల యంత్రాంగం విశ్వసనీయత, పటిష్ఠత ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో నిరూపితమయ్యాయని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై తాను ప్రత్యేకంగా స్పందించబోనని చెప్పారు. అయితే భారత ఎన్నికల నిర్వహణ వ్యవస్థ విశ్వసనీయత, పటిష్ఠత ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన వాస్తవమని పేర్కొన్నారు. భారత్లో ఎన్నికలు భారీ స్థాయిలో జరిగినప్పటికీ.. ఓటింగ్ ప్రక్రియలో గుర్తింపు, పారదర్శకతకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.అమెరికాలో ఓటర్ల అర్హతను మరింత కఠినంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని వాదిస్తున్న ట్రంప్.. ఇందుకు భారత్ ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపించారు. ఇటీవల భారత్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అంత భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నప్పటికీ.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారి సంఖ్య ఒక శాతానికి లోపే ఉందని చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఓటరుకూ చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు పత్రం అవసరమని ప్రస్తావించారు.భారత్ సీఈసీతో అమెరికా అధికారుల చర్చలుట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేరును కూడా ప్రస్తావించారు. ఈ నెల ప్రారంభంలో ఆయన అమెరికా ప్రభుత్వ అధికారులతో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డు లేకుండానే ఎన్నికలు ఎలా నిర్వహించగలుగుతున్నారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రశ్నించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఓటరు గుర్తింపు నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆయన వాదిస్తున్నారు.‘సేవ్ అమెరికా యాక్ట్’కు ట్రంప్ పట్టుదలఅమెరికా ఎన్నికల ప్రక్రియలో పౌరసత్వ ధ్రువీకరణ, ఓటరు గుర్తింపును తప్పనిసరి చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ ‘SAVE America Act’కు మద్దతు కూడగడుతున్నారు. అమెరికా ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హతను నిర్ధారించే నిబంధనలను ఈ బిల్లు మరింత కఠినతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వానికి ఆధారాలు సమర్పించడంతో పాటు.. దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు నిబంధన అమలు చేయాలని ట్రంప్ కోరుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్పైనా ఆంక్షలు విధించాలన్నది ఆయన ప్రతిపాదనలో కీలక అంశం.భారత్ మోడల్నే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?అమెరికా ఎన్నికల్లో ఓటరు అర్హత, పౌరసత్వ ధ్రువీకరణపై రాజకీయ చర్చ తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో ట్రంప్ భారత్ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే ఎన్నికలను భారత్ నిర్వహిస్తున్న తీరును ఆయన తన వాదనకు మద్దతుగా ఉపయోగించుకున్నారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం మాత్రం ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. భారత ఎన్నికల వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం, విశ్వసనీయత ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే స్పష్టం చేసింది. దీంతో అమెరికా ఎన్నికల సంస్కరణల చర్చలో భారత్ ఓటరు గుర్తింపు విధానం మరోసారి అంతర్జాతీయంగా ప్రస్తావనకు వచ్చింది. -
వహ్వా.. ఇక వందేభారత్ హవా!
(జోధ్పూర్ సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు)దేశంలో వందేభారత్ రైళ్ల హవా కొనసాగుతోంది. సౌకర్యవంతమైన ప్రయాణం, ఆధునిక సాంకేతికతతో వహ్వా అనిపించుకుంటున్న వందేభారత్ రైళ్ల కోసం కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రత్యేక నిర్వహణ డిపో నిర్మాణం వేగంగా సాగుతోంది. నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని జోధ్పూర్ డివిజన్లో భగత్ కీ కోఠి వద్ద ఏర్పాటైన ఈ హైటెక్ డిపోలో మొదటి దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 13 నాటికి తొలిదశ నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నారు. విశాఖç³ట్నం–బెంగళూరు, విశాఖపట్నం–తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే జోధ్పూర్ డిపో కీలక కేంద్రంగా మారనుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విజయవాడ ఆధ్వర్యంలో ఏపీ మీడియా ప్రతినిధుల బృందం ఈ డిపోను సందర్శించగా.. డివిజినల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) అనురాగ్ త్రిపాఠి వివరాలు వెల్లడించారు.స్లీపర్ సర్వీసులు పెరగాలంటే..వందేభారత్ స్లీపర్ రైళ్లకు ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు రైల్వే మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తోంది. సర్వీసుల సంఖ్య పెరగాలంటే నిరంతర పీరియాడిక్ సర్వీసింగ్, అధునాతన నిర్వహణ సౌకర్యాలు అత్యవసరం. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) రష్యా–భారత్ సంయుక్త సంస్థ కినెట్ రైల్వే సొల్యూషన్స్ సహకారంతో వందేభారత్ స్లీపర్ డిపో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి దశ పనులు రూ.167 కోట్లతో దాదాపు పూర్తయ్యాయి.రెండో దశతో కలిపి మొత్తం వ్యయం సుమారు రూ.362 కోట్లు. రెండు దశల పనులు పూర్తయితే ఒకేసారి 24 కోచ్లతో కూడిన మూడు వందేభారత్ స్లీపర్ రైళ్లకు కేవలం ఆరు గంటల్లో పూర్తిస్థాయి పీరియాడిక్ మెయింటెనెన్స్, సర్వీసింగ్ చేసే సామర్థ్యం ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన నాలుగు ప్రత్యేక డిపోల్లో ఇది ఒకటి. ఢిల్లీ, జైపూర్, అజ్మీర్, బార్మర్, అహ్మదాబాద్ మార్గాల్లో తిరిగే రైళ్లకు ఇది ప్రధాన సేవా కేంద్రంగా నిలుస్తుంది. ఇతర డివిజన్ల రైళ్లు కూడా నిర్వహణ కోసం ఇక్కడికే వస్తాయి.ప్రపంచస్థాయి సాంకేతికత.. భద్రతకు ప్రాధాన్యంవందేభారత్ రైళ్లలో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచస్థాయి సాంకేతికతను వినియోగిస్తున్నారు. అండర్ గేర్, అప్పర్ గేర్ తనిఖీలతో పాటు కవచ్ భద్రతా వ్యవస్థ, అడ్వాన్స్డ్ వీల్ అలైన్మెంట్, ప్రత్యేక వీల్ లేత్ లైన్లు, పిట్ లైన్లు, భారీ మరమ్మతుల కోసం అత్యాధునిక క్రేన్లతో కూడిన సిక్ లైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ట్రాక్లు, షెడ్లు వంటి మౌలిక వసతులు రైల్వే యాజమాన్యంలోనే ఉంటాయి. రైల్వే ఉద్యోగులు, ప్రైవేట్ నిపుణులు వీటిని సంయుక్తంగా నిర్వహిస్తారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దేశీయ తయారీని ప్రోత్సహించే విధంగా విడిభాగాలు, పరికరాల కొనుగోలు జరుగుతుంది.జోధ్పూర్ డివిజన్లో మెగా పనులు⇒ జోధ్పూర్ డివిజన్లో బర్మేర్, జైసల్మేర్లలో కూడా కోచింగ్ డిపోలు అభివృద్ధి చేస్తున్నారు. ⇒ 1,625 కి.మీ. రైల్వే మార్గాలున్న ఈ డివిజన్లో రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో జోధ్పూర్, జైసల్మేర్, పాలి ప్రాంతాల్లోని మూడు ప్రధాన స్టేషన్లతో పాటు 15 ⇒ అమృత్ భారత్ స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. ⇒ ఒక్క జోధ్పూర్ స్టేషన్ పునరాభివృద్ధికే రూ.500 కోట్లు కేటాయించారు. రూ.3,000 కోట్లకు పైగా వ్యయంతో 270 కిలోమీటర్ల సమ్ద్రి–భిల్ది ట్రాక్ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి.⇒ తొలి భాగం 2026 నాటికి, మొత్తం ప్రాజెక్టు 2028 నాటికి పూర్తికానుంది.⇒ గూడ్స్ రైలు సేవల ద్వారా ఆదాయం పెంచడంపై దృష్టి సారించారు.⇒ సిమెంట్, సున్నపురాయి రవాణాకు 8 కొత్త ప్రైవేట్ ఫ్రైట్ సైడింగులు నిర్మాణంలో ఉన్నాయి. ⇒ ఇవి రాబోయే మూడేళ్లలో రూ.3,000 నుంచి రూ.4,000 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ చేపట్టారు.⇒ వందేభారత్ స్లీపర్ రైల్ డిపో రాకతో జోధ్పూర్ ప్రాధాన్యత మరింత పెరగనుంది. -
భారత్ ఎన్నికలపై ట్రంప్ ఫోకస్..! అమెరికాలో కొత్త రూల్స్ కు పిలుపు
-
‘భారత్ను చూడండి’.. ఓటర్ ఐడీపై అమెరికాకు ట్రంప్ క్లాస్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల సంస్కరణల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమెరికాలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు, పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్న ఆయన.. ఈసారి తన వాదనకు భారత్ ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా చూపించారు. అమెరికా కాంగ్రెస్ సేవ్ అమెరికా యాక్ట్(SAVE America Act)ను ఆమోదించాల్సిందేనని పట్టుబడుతూ.. భారత్లో ఓటర్ల గుర్తింపు కోసం అమలవుతున్న విధానాన్ని ప్రశంసించారు.భారత్లో ఎన్నికల సమయంలో ఓటర్లు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రంతో ఓటు వేస్తున్న విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్తో తనకు జరిగిన సంభాషణను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘ఎన్నికల నిర్వహణపై భారత సీఈసీ మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమెరికాలో తగిన గుర్తింపు కార్డు లేకుండా ఎన్నికల నిర్వహణను ఆయన తప్పుబట్టారు. 2024లో సుమారు 60 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత్లో ప్రతీ ఓటర్ దగ్గర గుర్తింపు కార్డు ఉంది’’ అని ట్రంప్ అన్నారు. భారత్లో ఓటర్ల గుర్తింపునకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాలోనూ ఇలాంటి విధానం ఉండాల్సిన అవసరం ఉందని ట్రంప్ వాదిస్తున్నారు. అమెరికా ఫెడరల్ ఎన్నికల్లో అర్హత కలిగిన పౌరులు మాత్రమే ఓటు వేసేలా పౌరసత్వాన్ని నిర్ధారించడంతో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరి చేయాలని ఆయన కోరుతున్నారు.SAVE America Act అంటే..ట్రంప్ మద్దతు ఇస్తున్న SAVE America Act ప్రధానంగా అమెరికా ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం అవసరమయ్యేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించారు.ఓటర్ల జాబితాల్లో పౌరసత్వ అర్హత లేని వ్యక్తులు ఉంటే వారిని గుర్తించి తొలగించే ప్రక్రియను కూడా కఠినతరం చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. మెయిల్ ద్వారా ఓటింగ్పైనా పరిమితులు విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. వైద్య కారణాలు, వైకల్యం, సైనిక సేవ, ప్రయాణం వంటి కొన్ని పరిస్థితులకు మినహాయింపులు ఇవ్వాలని ప్రతిపాదించారు. తక్షణమే ఈ బిల్లును ప్రతిపాదించాలని ట్రంప్ కోరుతున్నారు.‘పౌరులే ఓటు వేయాలి’అమెరికా ఎన్నికల్లో పౌరసత్వం లేని వ్యక్తులు ఓటు వేస్తున్నారన్న ఆరోపణలను ట్రంప్ చాలాకాలంగా ప్రస్తావిస్తున్నారు. **‘అమెరికా ఎన్నికల్లో ఓటు హక్కు అమెరికా పౌరులకే ఉండాలి’** అన్నది ఆయన ప్రధాన వాదన. అందుకే ఓటరు నమోదు దశలోనే పౌరసత్వాన్ని నిర్ధారించాలని కోరుతున్నారు. అయితే అందుబాటులో ఉన్న పరిశోధనలు, ఎన్నికల డేటా ప్రకారం పౌరేతరుల అక్రమ ఓటింగ్ చాలా అరుదైన ఘటన అని విశ్లేషణలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ అంశాన్ని ట్రంప్ ఎన్నికల సంస్కరణల చర్చలో కీలకంగా ముందుకు తీసుకెళ్తున్నారు.భారత్నే ఎందుకు ఉదాహరణగా చూపించారు?భారత్లో ఎన్నికల సమయంలో ఓటర్ల గుర్తింపు కోసం ఫొటో ఓటర్ ఐడీతో పాటు ఎన్నికల సంఘం ఆమోదించిన ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగిస్తారు. ఓటరు జాబితాలో పేరు ఉండటంతో పాటు పోలింగ్ కేంద్రంలో గుర్తింపు నిర్ధారణకు ఈ పత్రాలు కీలకంగా ఉంటాయి. ఈ విధానాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాలోనూ ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే భారత్, అమెరికా ఎన్నికల వ్యవస్థలు, ఓటరు నమోదు విధానాలు, చట్టపరమైన నిబంధనలు ఒకేలా ఉండవు. కాబట్టి భారత్లోని విధానాన్ని అమెరికాలో యథాతథంగా అమలు చేయడం సాధ్యమా? అనేది వేరే ప్రశ్న.అమెరికాలో రాజకీయ దుమారంSAVE America Actపై అమెరికాలో తీవ్ర రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్, రిపబ్లికన్లు ఈ బిల్లును ‘ఎన్నికల సమగ్రతను కాపాడే కీలక సంస్కరణ’గా అభివర్ణిస్తున్నారు. మరోవైపు డెమొక్రాట్లు, పౌరహక్కుల సంస్థలు మాత్రం అదనపు గుర్తింపు, పౌరసత్వ పత్రాలను తప్పనిసరి చేయడం వల్ల అర్హత ఉన్న కొంతమంది ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా పాస్పోర్టు, జనన ధ్రువీకరణ పత్రం వంటి పత్రాలను సమర్పించడం తప్పనిసరి అయితే.. వాటిని సులభంగా పొందలేని ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని విమర్శకులు చెబుతున్నారు.మధ్యంతర ఎన్నికల వేళ మళ్లీ చర్చ2026 అమెరికా మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల భద్రత, ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణ అంశాలు మరోసారి రాజకీయ చర్చలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ SAVE America Actపై తన ఒత్తిడిని మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో భారత్ ఓటర్ ఐడీ విధానాన్ని ఆయన ఉదాహరణగా చూపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్లో అమలవుతున్న గుర్తింపు ఆధారిత ఓటింగ్ విధానాన్ని ప్రశంసిస్తూ.. అమెరికాలోనూ ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణకు కఠిన నిబంధనలు ఉండాలన్న తన వాదనకు ట్రంప్ మరింత బలం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ఓటర్ ఐడీ విధానం ట్రంప్ రాజకీయ వాదనలో కొత్తగా ప్రస్తావనకు రావడం.. అమెరికా ఎన్నికల సంస్కరణలపై సాగుతున్న చర్చకు మరో కోణాన్ని జోడించింది. -
భారత్కు భారీ ఆధిక్యం
గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో భారత జట్టు విజయావకాశాన్ని సృష్టించుకుంది. అయితే మూడు రోజుల పాటు మ్యాచ్ను వెంటాడుతూ ప్రభావం చూపించిన వర్షం మరో రెండు రోజులు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. గరిష్టంగా 196 ఓవర్లు పడే అవకాశం ఉండగా, రెండో ఇన్నింగ్స్లో భారత్ ఎన్ని పరుగులు చేసి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం. మ్యాచ్ మూడో రోజు సోమవారం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సోనాల్ దినుషా (168 బంతుల్లో 100; 4 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించగా, నిరోషన్ డిక్వెలా (115 బంతుల్లో 80; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. భారీ భాగస్వామ్యం...తొలి సెషన్లోనే శ్రీలంకపై భారత్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శిస్తూ ఐదు వికెట్లతో దెబ్బ కొట్టింది. లంక ఇన్నింగ్స్లో రెండో బంతికే మదుషంక (0)ను అవుట్ చేసి సిరాజ్ శుభారంభం అందించాడు. సుతార్ తన తొలి బంతికే చండీమల్ (4)ను వెనక్కి పంపించాడు. కొద్దిసేపు క్రీజ్లో నిలిచిన ఉడారా (44 బంతుల్లో 27; 6 ఫోర్లు) వికెట్ కూడా సుతార్ ఖాతాలోకే చేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కమిందు మెండిస్ (14)ను కుల్దీప్, ధనంజయ డిసిల్వా (21)లను జడేజా పెవిలియన్ పంపించి తామూ వికెట్ల ఖాతా తెరిచారు. భారత బౌలర్ల జోరు చూస్తూ లంక కుప్పకూలడానికి ఎంతోసేపు పట్టదనిపించింది. లంచ్ సమయానికి స్కోరు 99/5 కాగా, ఆ తర్వాత డిక్వెలా, దినుషా ద్వయం ఆతిథ్య జట్టును గట్టెక్కించింది. 20 పరుగుల వద్ద డిక్వెలా ఇచి్చన క్యాచ్ను స్లిప్ను రాహుల్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అనంతరం డిక్వెలా, దినుషా అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. టీ విరామానంతరం ఎట్టకేలకు ఈ జోడీని విడదీయడంలో భారత్ సఫలమైంది. ప్రసిధ్ బౌలింగ్లో డిక్వెలా వెనుదిరగ్గా, తక్కువ వ్యవధిలో లంక మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. మరోవైపు పట్టుదలగా ఆడిన దినుషా 167 బంతుల్లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు. అయితే అదే స్కోరు వద్ద దినుషా ఆట ముగియగా, మరో పది పరుగులకు లంక ఆలౌటైంది.స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: 462; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: మదుషంక (సి) పడిక్కల్ (బి) సిరాజ్ 0; ఉడారా (సి) జైస్వాల్ (బి) సుతార్ 27; చండీమల్ (సి) పంత్ (బి) సుతార్ 4; కమిందు (సి) గిల్ (బి) కుల్దీప్ 14; ధనంజయ (సి) రాహుల్ (బి) జడేజా 21; దినుషా (ఎల్బీ) (బి) జడేజా 100; డిక్వెలా (సి) పంత్ (బి) ప్రసిధ్ 80; నువాంతా (సి) గిల్ (బి) జడేజా 2; జయసూర్య (సి) జురేల్ (బి) సుతార్ 10; కుమార (స్టంప్డ్) పంత్ (బి) సుతార్ 10; ఫెర్నాండో (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (79.4 ఓవర్లలో ఆలౌట్) 284. వికెట్ల పతనం: 1–0, 2–27, 3–53, 4–59, 5–90, 6–236, 7–243, 8–274, 9–274, 10–284. బౌలింగ్: సిరాజ్ 9–3–29–1, ప్రసిధ్ 14–0–47–1, సుతార్ 21.4–1–76–4, కుల్దీప్ 14–0–65–1, జడేజా 21–5–57–3.350: జడేజా 350 వికెట్ల మైలురాయిని దాటాడు. భారత్ తరఫున కుంబ్లే, అశ్విన్, కపిల్, హర్భజన్ తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా జడేజా నిలిచాడు. బోథమ్, కపిల్, వెటోరి తర్వాత టెస్టుల్లో 350కి పైగా వికెట్లు, 4 వేలకు పైగా పరుగులు చేసిన నాలుగో ఆల్రౌండర్గా జడేజా నిలవడం విశేషం. -
ఓ ఫేక్ న్యూస్.. అమెరికా–ఇరాన్ అణు చర్చల్లో కలకలం
క్షిపణులు, డ్రోన్లతో సాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. యుద్ధం కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియా వేదికలపైనా సాగుతోంది. తాజాగా ఓ తప్పుడు సమాచారం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఇజ్రాయెల్, అమెరికా రాజకీయ వర్గాల్లోకి చేరి.. చివరకు అణు చర్చలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది.ఆగస్టు 5న ‘ఎక్స్’ (X) వేదికగా ఓ గుర్తుతెలియని భారతీయ ఖాతా నుంచి ఓ సంచలన పోస్టు వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీది.. ‘‘అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంత కాలం.. ఇరాన్ కూడా తన అణు ఆయుధాల లక్ష్యాన్ని వదులుకోదు’’ అని వ్యాఖ్యానించినట్లు అందులో పేర్కొన్నారు. దీనికి అణు పేలుడు మేఘాన్ని పోలిన ఏఐ రూపొందించిన చిత్రాన్ని కూడా జత చేశారు.అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా వహీది చేశారనే ఆధారాలు ఏవీ లేవు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసిందనే ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ ఆ పోస్టు వేగంగా వైరల్ అయింది.భారత్ టు అమెరికా వయా ఇజ్రాయెల్.. సుమారు 1.75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆ భారతీయ ఖాతా నుంచి మొదలైన ఈ ప్రచారం.. కొన్ని గంటల్లోనే మరో భారతీయ ఖాతా ద్వారా హిందీలోకి అనువదించబడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు దీనిని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇజ్రాయెల్లోని ఓ టీవీ ఛానల్ ఈ తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని.. ‘‘ఇరాన్ తొలిసారి అణుబాంబు తయారీ లక్ష్యాన్ని అంగీకరించింది’’ అన్నట్టుగా కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ జెరూసలేంలోని మౌంట్ హెర్జెల్ వద్ద చేసిన ప్రసంగంలో కూడా దీనిని ఇరాన్ ఉద్దేశాలకు నిదర్శనంగా ప్రస్తావించారు.అమెరికాలోనూ ఈ ప్రచారం ప్రభావం చూపింది. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధి మైక్ వాల్ట్జ్ ఈ పోస్టును షేర్ చేస్తూ.. ఇరాన్ అసలు ఉద్దేశాలను అంగీకరించిందన్న అర్థంలో వ్యాఖ్యానించారు. అమెరికా సెనేటర్ రిక్ స్కాట్ కూడా దీన్ని పంచుకున్నారు. అయితే తర్వాత మైక్ వాల్ట్జ్ తన పోస్టును ఎలాంటి వివరణ లేకుండా తొలగించారు.అణు చర్చలపై ప్రభావంఅమెరికా–ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. తాము శాంతియుత అవసరాల కోసమే అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని టెహ్రాన్ చెబుతోంది. ఇలాంటి సమయంలో అణ్వాయుధాలపై ఇరాన్ నేత వ్యాఖ్యలంటూ వచ్చిన తప్పుడు ప్రచారం.. దౌత్య చర్చల వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఫేక్ న్యూస్ పవర్ అది!ఈ ఘటన సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారానికి ఉన్న ప్రభావాన్ని మరోసారి బయటపెట్టింది. ఒక గుర్తుతెలియని ఖాతా నుంచి వచ్చిన నిర్ధారణ లేని పోస్టు.. భాషలు, దేశాల సరిహద్దులు దాటి.. ప్రపంచ నాయకుల ప్రసంగాల్లోకి చేరింది. నిజానిజాలు నిర్ధారించకుండానే ప్రచారం జరిగితే.. అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ నిర్ణయాలపైనా ప్రభావం చూపగలదని ఈ ఉదంతం స్పష్టం చేసింది. -
భారత్ పరుగుల జోరు
గాలె: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్నైట్ స్కోరు 288/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో రోజు 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు మరో 36 పరుగులు జోడించి అవుట్ కాగా... ధ్రువ్ జురేల్ (68 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గాయం నుంచి కోలుకొని బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ (175 బంతుల్లో 82; 10 ఫోర్లు, 1 సిక్స్) మరో ఐదు పరుగులే చేశాడు. రిషభ్ పంత్ (39), మానవ్ సుతార్ (24) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కుల్దీప్ యాదవ్ (12 బ్యాటింగ్), ప్రసిధ్ కృష్ణ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు పడగొట్టగా... కుషారా నువాంతా 175 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. పిచ్ స్పిన్కు అనుకూలిస్తుండగా... మూడో రోజు ఇక్కడ బ్యాటింగ్ మరింత కష్టం కానుంది. ఆదుకున్న జురేల్... భారీ వర్షం కారణంగా ఆదివారం రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుని పోయింది. మధ్యాహ్నం తర్వాత మైదానం ఆటకు అనుకూలంగా మారగా... తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు లంక మెరుగ్గా బౌలింగ్ చేసింది. పంత్ ఎక్కువసేపు నిలవలేకపోగా... కండరాలు పట్టేయడంతో తొలి రోజు మైదానాన్ని వీడిన రాహుల్ క్రీజులోకి వచ్చాడు. బౌలింగ్కు సహకరిస్తున్న పిచ్పై అతడు అదనపు బౌన్స్కు దొరికిపోయాడు. 12 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ వెనుదిరగగా... ఈ దశలో జురేల్ సంయమనం పాటించాడు. మరో ఎండ్లో పడిక్కల్ 150 పరుగుల మార్క్ దాటగా... జురేల్ వేగంగా ఆడాడు. భారీ ఇన్నింగ్స్ అనంతరం పడిక్కల్ స్టంపౌట్ కాగా... రవీంద్ర జడేజా (13) విఫలమయ్యాడు. అయినా వీలు చిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ జురేల్ ఇన్నింగ్స్ను నడిపించాడు. మానవ్తో కలిసి ఏడో వికెట్కు 55 పరుగులు జోడించాడు. అర్ధశతకం అనంతరం ధనంజయ డిసిల్వా పట్టిన చక్కటి క్యాచ్కు జురేల్ పెవిలియన్ చేరాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 32; రాహుల్ (సి) ఫెర్నాండో (బి) కేషారా 82; పడిక్కల్ (స్టంప్డ్) డిక్వెల్లా (బి) ప్రభాత్ జయసూర్య 167; గిల్ (సి) లహిరు (బి) ప్రభాత్ జయసూర్య 16; పంత్ (సి) దినుషా (బి) కేషారా 39; జురేల్ (సి) ధనంజయ డిసిల్వా (బి) ప్రభాత్ జయసూర్య 51; జడేజా (ఎల్బీ) (బీ) కేషారా 13; మానవ్ సుతార్ (సి) లహిరు (బి) ప్రభాత్ జయసూర్య 24; సిరాజ్ (సి) ధనంజయ డిసిల్వా (బి) ఫెర్నాండో 11; కుల్దీప్ (బ్యాటింగ్) 12; ప్రసిధ్ (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 460. వికెట్ల పతనం: 1–47, 2–236, 3–307, 4–319, 5–357, 6–377, 7–432, 8–447, 9–447. బౌలింగ్: అషిత ఫెర్నాండో 17–1–61–1; లహిరు కుమార 13–1–76–0; కేషారా నువాంతా 39–1–175–3; ప్రభాత్ జయసూర్య 39–6–109–4; ధనంజయ డిసిల్వా 4–0–15–0; సోనల్ దినుషా 4–0–17–0. -
సింధు ‘సిక్సర్’ కొడుతుందా!
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ గత దశాబ్దన్నర కాలంగా తమదైన ముద్ర వేసింది. 2011నుంచి ప్రతీ టోర్నీలో కనీసం ఒక పతకమైనా భారత్ గెలుస్తూ వస్తోంది. ఇదే జోరును కొనసాగించే క్రమంలో సొంతగడ్డపై ఈ మెగా టోర్నీకి మన ఆటగాళ్లు సిద్ధమయ్యారు. నేటినుంచి ఆగస్టు 23 వరకు న్యూఢిల్లీలో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ జరుగుతుంది. 2009 (హైదరాబాద్) తర్వాత ఈ టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండో సారి. భారత స్టార్ పీవీ సింధు మహిళల సింగిల్స్లో అత్యధిక (5) పతకాలు గెలిచిన ప్లేయర్గా జాంగ్ నింగ్ (చైనా)తో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆరో పతకంతో శిఖరాన నిలిచే లక్ష్యంతో ఆమె బరిలోకి దిగుతోంది. ఇటీవల జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ గెలిచిన ఆమె పూర్తి ఫిట్తో చక్కటి ఫామ్లో ఉంది. సెమీస్ చేరే క్రమంలో వాంగ్ జి యి, పుత్రి కుసుమవంటి ప్రత్యర్థులను ఆమె దాటాల్సి ఉంటుంది. మరో వైపు పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడి కూడా పతకాన్ని ఆశిస్తోంది. గాయాలనుంచి కోలుకొని మళ్లీ కోర్టులోకి అడుగు పెడుతున్న ఈ జంటపై మంచి అంచనాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్లో తొలి రౌండ్లో వరల్డ్ నంబర్వన్ షి యు ఖితో తలపడుతున్న ఆయుశ్ శెట్టి, ఇటీవల ఫామ్లో లేని లక్ష్య సేన్, మహిళల సింగిల్స్లో ఉన్నతి హుడా సంచలనంపై దృష్టి పెట్టారు. మహిళల డబుల్స్లో కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతూనే టోర్నీకి అర్హత సాధించిన గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ ఎలాంటి ఫలితం సాధిస్తారో చూడాలి. -
న్యూయార్క్లో స్వాతంత్య్ర వేడుకల్లో గిన్నిస్
న్యూయార్క్: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అమెరికాలోని న్యూయార్క్ ట్రై–స్టేట్ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగాయి. న్యూజెర్సీలోని పర్సిప్పనీ వెటరన్స్ మెమోరియల్ పార్క్లో భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవం, అమెరికా 250వ అవతరణ వార్షికోత్సవం సందర్భంగా అత్యధిక ఫ్లాగ్పోల్స్తో 250 ఆకారాన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఈ విషయాన్ని భారత కాన్సులేట్ ఎక్స్లో ప్రకటించింది. కార్యక్రమంలో భాగంగా 1,300కు పైగా అమెరికా జెండాలను, వాటి చుట్టూ త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేశారు. న్యూయార్క్ సిటీ భారత సంతతి మేయర్ జొహ్రాన్ మమ్దానీ క్వీన్స్లోని ఫ్లోరల్ పార్క్లో జరిగిన ఇండియా డే పరేడ్లో పాల్గొన్నారు. అనంతరం, మమ్దానీ ఎక్స్లో తనను తాను మొట్టమొదటి భారత–అమెరికన్ న్యూయార్క్ నగర మేయర్గా చెప్పుకుంటూ..‘ఇదొక అద్భుత అనుభవం. ఎన్నటికీ మర్చిపోలేనిది’అని పేర్కొన్నారు. కాగా, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సహా పలు ప్రముఖ కట్టడాలు త్రివర్ణ శోభతో మెరిసిపోయాయి. టైమ్స్ స్క్వేర్లో జరిగిన కార్యక్రమంలో భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. -
ప్రపంచ కప్లో భారత్కు పోరాట ఆరంభం
ఆమ్స్టెల్వీన్: 2026 మహిళల FIH హాకీ వరల్డ్ కప్లో భారత జట్టు పోరాట ఆరంభం చేసింది. నెదర్లాండ్స్లోని వాగెనర్ స్టేడియంలో ఆదివారం జరిగిన పూల్-డీ మ్యాచ్లో ఒలింపిక్ రజత పతక విజేత చైనాతో 2-2 డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండుసార్లు ఆధిక్యంలోకి వెళ్లినా.. చైనా ప్రతిసారీ పుంజుకుని స్కోరును సమం చేసింది.రెండుసార్లు ఆధిక్యంలో భారత్మ్యాచ్ ప్రారంభం నుంచే భారత జట్టు దూకుడుగా ఆడింది. 8వ నిమిషంలో నవ్నీత్ కౌర్ గోల్ చేయడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.అయితే తొలి క్వార్టర్ ముగిసే సమయానికి చైనా తిరిగి పుంజుకుంది. 15వ నిమిషంలో జాంగ్ గోల్ చేయడంతో స్కోరు 1-1గా సమమైంది.రెండో క్వార్టర్లో భారత్ మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. 25వ నిమిషంలో దీపిక గోల్ చేయడంతో భారత్ 2-1తో ముందంజ వేసింది.భారత్ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయంపై ఆశలు పెంచుకున్న సమయంలో చైనా మరోసారి ఎదురుదాడి చేసింది. 39వ నిమిషంలో మా నింగ్ గోల్ చేయడంతో స్కోరు 2-2గా మారింది.ఆ తర్వాత ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ మరో గోల్ రాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.దక్షిణాఫ్రికాతో తదుపరి మ్యాచ్చైనాతో పాయింట్లు పంచుకున్న భారత్కు పూల్-డీలో తదుపరి మ్యాచ్ కీలకంగా మారింది. ఆగస్టు 18న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది.వరల్డ్ కప్లో నాకౌట్ దశకు చేరుకోవాలంటే భారత్ ఇకపై పూల్ మ్యాచ్ల్లో మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. చైనా వంటి బలమైన ప్రత్యర్థిపై రెండు సార్లు ఆధిక్యంలోకి రావడం సానుకూల అంశమే అయినప్పటికీ, ఆధిక్యాన్ని విజయంగా మలచలేకపోవడం మాత్రం భారత్ సరిదిద్దుకోవాల్సిన అంశంగా నిలిచింది. -
షారుక్ సినిమా చూసి స్ఫూర్తి పొందా.. అందుకే ఇప్పుడు ఇలా..: దీప్కే
ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇటీవల బాలీవుడ్తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. షారుక్ ఖాన్ నటించిన ‘స్వదేశ’ సినిమాను 100 సార్లకు పైగా చూశానని, అందులోని మోహన్ పాత్ర తనను భారత్కు తిరిగి రావడానికి ప్రేరేపించిందని దీప్కే గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా చూసిన తర్వాత తన సమాజానికి సేవ చేయాలని అనుకున్నట్లు సీజేపీ నేత తెలిపారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తన స్వగ్రామం నుంచి “స్కూల్ ఠీక్ కరో” ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత అభిజీత్ దీప్కే ఎక్స్లో చిత్రాలను పోస్ట్ చేశారు. ఆయన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, సరిపడా కూర్చునే సదుపాయాలు, నీటి సరఫరా, కిటికీలు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న సమస్యలను ప్రస్తావించారు.దీప్కే ఎక్స్లో స్పందిస్తూ. “స్వదేశ సినిమా చూస్తూ పెరిగాను. ఆ సినిమాపై ఎంతో ప్రేమ ఏర్పడింది. ఇప్పటివరకు ఆ సినిమాను 100 సార్లకు పైగా చూసి ఉంటాను. ఆ సినిమాలోని ఒక భాగం ఎప్పుడూ నా మనసులో నిలిచిపోయింది. మోహన్ హరిదాస్ను కలవడానికి వెళ్లి, తన కుటుంబానికి కనీసం ఆహారం అందించడానికి కూడా అతను ఎంత కష్టపడుతున్నాడో చూస్తాడు. తిరిగి వస్తూ రైలులో కూర్చున్నప్పుడు, పాఠశాలలో ఉండాల్సిన ఓ చిన్న బాలుడు రైల్వే స్టేషన్లో నీళ్లు అమ్మడం చూస్తాడు. మోహన్ మౌనంగా కన్నీరు కార్చినప్పుడు నేను కూడా కన్నీరు పెట్టుకున్నాను. ప్రతిసారీ అలాగే జరిగింది” అని తెలిపారు.‘స్వదేశ’లోని మోహన్లా..సినిమాలో షారుక్ ఖాన్ పోషించిన మోహన్ పాత్రలా తాను కూడా తన గ్రామానికి ఏదైనా చేయాలని కోరుకున్నట్లు దీప్కే చెప్పారు. “అప్పటి నుంచి నా మనసులో ఎక్కడో ఒక మూల.. ఏదో ఒక రోజు మోహన్ చరణ్పూర్కు చేసినట్లే నేను కూడా నా సొంత గ్రామానికి ఏదైనా చేయాలని కోరుకున్నాను.కొన్నేళ్ల తర్వాత జీవితం ఇలాంటి మలుపు తిరిగి, అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చి నా సొంత గ్రామానికి దాదాపు అదే విధంగా ఏదైనా చేసే అవకాశం నాకు లభిస్తుందని నేను ఊహించలేదు. కొన్నిసార్లు జీవితం నిజంగానే పూర్తి వృత్తంలా తిరిగి అదే చోటుకు తీసుకువస్తుంది. ఈ అవకాశం లభించినందుకు, ప్రజల నుంచి అందుకున్న ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని. మీ అందరినీ ప్రేమిస్తున్నాను. అర్థవంతమైన పని చేసి నిజమైన మార్పు తీసుకురావడానికి నా శక్తినంతా ఉపయోగిస్తాను” అని ఆయన పేర్కొన్నారు.దీప్కే ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంసీజేపీ ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని మరిన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించనున్నట్లు అభిజీత్ దీప్కే ఇటీవల తెలిపారు. పాఠశాలల్లోని సదుపాయాలపై సామాజిక తనిఖీలు నిర్వహించాలని తల్లిదండ్రులను కూడా కోరారు. సీజేపీ ప్రకటించిన “జంతర్ మంతర్ సీజన్ 2”లో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా “ప్రజల మాట వినే పర్యటన” నిర్వహిస్తామని, ప్రజల సమస్యలపై ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెడతామని సీజేపీ తెలిపింది. As Fatima bi said to Kaveri Amma: “Bata dena uss ladke ko apne hi paani mein pighal jaana barf ka muqaddar hota hai…”Grew up watching Swades and fell so deeply in love with the film that I must have watched it over 100 times by now.There’s one part that has always stayed… pic.twitter.com/d6MSD1BMAS— Abhijeet Dipke (@abhijeet_dipke) August 15, 2026 -
బుల్లెట్ రైలు: ముంబై-సూరత్ స్టేషన్ల ఫస్ట్ లుక్!
ముంబై: ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), సూరత్ స్టేషన్ల తాజా దృశ్యాలు ప్రాజెక్ట్ పురోగతిని స్పష్టం చేస్తున్నాయి. సూరత్ స్టేషన్లో ఇంటీరియర్ ఫినిషింగ్ పనులు తుది దశకు చేరుకోగా, ముంబైలోని భూగర్భ బీకేసీ స్టేషన్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భారతదేశపు తొలి ప్రత్యేక హై-స్పీడ్ రైలు ప్రాజెక్టైన 508 కిలోమీటర్ల ఈ కారిడార్ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 12 స్టేషన్లతో అనుసంధానమై ఉంది. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా ఈ ప్రాజెక్ట్ను రూపకల్పన చేశారు. #WATCH | Surat, Gujarat: Construction work is progressing at the Surat station for the Mumbai-Ahmedabad Bullet Train project, with structural and roofing work completed and interior finishing underway. The station's design draws inspiration from Surat's diamond-cutting industry.… pic.twitter.com/b6CTQBO7Tp— ANI (@ANI) August 15, 2026సూరత్ డైమండ్ ఇండస్ట్రీ స్ఫూర్తితో స్టేషన్ డిజైన్ఈ కారిడార్లో అత్యంత ఆధునిక స్టేషన్లలో సూరత్ ఒకటి. దీని నిర్మాణం, రూఫింగ్ పూర్తికాగా ప్రస్తుతం ఇంటీరియర్ ఫినిషింగ్ కొనసాగుతోంది. సూరత్ నగరానికి గుర్తింపు అయిన వజ్రాల కటింగ్ పరిశ్రమ స్ఫూర్తితో ఈ స్టేషన్ను తీర్చిదిద్దారు. మెట్లు, ప్లాట్ఫారమ్లు, సీలింగ్ పనులతో పాటు ట్రాక్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే గుజరాత్లో సూరత్-వాపి సెక్షన్ మధ్య సివిల్ పనులు పూర్తయ్యాయి.భూగర్భంలో ముంబై బీకేసీ స్టేషన్ముంబై వైపు ఈ కారిడార్కు ప్రారంభ స్టేషన్గా ఉన్న బీకేసీ స్టేషన్ను భూగర్భంలో సుమారు 30 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఇదే అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ పనులలో ఇది ఒకటి. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో ముంబై బీకేసీ, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి సహా మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి.మొదటి సర్వీస్ ఎప్పుడంటే?ఈ ప్రాజెక్ట్కు సంబంధించి తొలి సెక్షన్ సేవలు 2027 ఆగస్టులో ప్రారంభం కానున్నాయి. సూరత్ నుంచి వాపి మధ్య సుమారు 100 కిలోమీటర్ల మేర తొలి సర్వీస్ నడుపనున్నారు. ఈ తొలి సర్వీస్ కోసం బీఈఎంఎల్లో తయారవుతున్న మేడ్ ఇన్ ఇండియా ‘భారత్’ బుల్లెట్ రైలును ఉపయోగించనున్నారు. ఈ పూర్తి కారిడార్ అందుబాటులోకి వస్తే ముంబై-అహ్మదాబాద్ ప్రయాణ సమయం కేవలం ఒక గంట 58 నిమిషాలకు తగ్గనుంది.ఇది కూడా చదవండి: ఒకే నంబరుతో రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం! -
బామ్మ మాట.. దేశభక్తి బాట
హైదరాబాద్: నానక్రాంగూడలోని స్టార్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న 84 ఏళ్ల బామ్మ చెప్పిన దేశభక్తి ఉదంతం శనివారం స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో అక్కడి డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని కంటనీరు పెట్టించింది. సీతారావమ్మ అనే వృద్ధురాలు 1962 నాటి భారత్– చైనా యుద్ధ సమయం నాటి జ్ఞాపకాలను వైద్యులు, సిబ్బందితో గుర్తు చేసుకున్నారు. యుద్ధ సమయంలో మన సైనికులకు అండగా నిలవాలని, దేశ రక్షణ నిధికి తోచిన సాయం చేయాలని భారత ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. ఆ సమయంలో సీతారావమ్మ కుటుంబం కూడా దేశం కోసం ముందుకొచ్చింది. తమకు ఎంతో పవిత్రమైన, జీవితాంతం గుర్తుగా దాచుకునే తమ పెళ్లి ఉంగరాన్ని స్వచ్ఛందంగా విరాళం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చందనారెడ్డి మాట్లాడుతూ.. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల మనోధైర్యాన్ని తాము నిత్యం గమనిస్తూనే ఉంటామని.. కానీ.. సీతారావమ్మ 1962 నాటి త్యాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మేమంతా భావోద్వేగానికి గురయ్యామని చెప్పారు. మంచి మనసున్న వ్యక్తికి వైద్యం అందించడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. -
సప్తధారతో వికసిత భారతం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సిద్ధికి వందేళ్లు నిండేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. పన్నెండేళ్లలో సాధించిన పురోగతిని వివరిస్తూనే.. 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించేందుకు ఒక్కొక్కరూ కంకణం కట్టుకుని తమవంతు తోడ్పాటు, కృషి చేయాలని ఆయన ఎర్రకోట వేదికగా శనివారం జరిగిన 80వ స్వాతంత్య్రోత్సవ వేడుకల్లో కోరారు. ఏడు రకాల శక్తులు కలిస్తే (సప్త ధార) ఇది అసాధ్యం కానేకాదని భరోసానిచ్చిన మోదీ.. లక్ష్యసాధనకు సాధించాల్సిన ప్రగతిపై కూడా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించారు. దేశీ కంపెనీల్లో కనీసం యాభై ఫార్చ్యూన్ 500 జాబితాలో చోటు సంపాదించుకోవాలని, అంతర్జాతీయంగా టాప్ 5 బ్యాంకుల్లో ఒకటైనా భారత్ది అయి ఉండాలని స్పష్టం చేశారు. ప్రపంచ భవిష్యత్తును శాసించనున్న కృత్రిమ మేధ రంగంలో అగ్రస్థానంలో నిలిచే లక్ష్యంతో వచ్చే ఏడాది కోటి మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ప్రకటించారు. శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు విభేదాలు మరచి రాజకీయ పార్టీలన్నీ ముందుకు రావాలని కోరారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో యువత నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో సాయుధ నక్సలిజం లేకుండా పోయినా ‘దిమాగీ నక్సల్స్’ఇంకా ఉన్నారని హెచ్చరించారు. దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాజధాని ఢిల్లీలో ఘనంగా మొదలయ్యాయి. శనివారం ఉదయం 6.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మాగాం«దీకి నివాళులు అర్పించి ఎర్రకోటకు చేరుకున్నారు. రక్షణశాఖ కార్యదర్శి, గార్డ్ ఆఫ్ హానర్ కమాండర్ సుమారు 7.15 గంటల ప్రాంతంలో ప్రధానిని ఆహ్వానించారు. ఆ తరువాత ప్రధాని గార్డ్ ఆఫ్ హానర్ను అందుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని చిరస్మరణీయం చేస్తూ ఆర్మీబ్యాండ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మొదటిసారి దీన్ని ఆలపించడం, ఆ తరువాత 21 తుపాకులతో ‘రాష్ట్రీయ సెల్యూట్’, జాతీయ గీతాలాపన జరిగాయి. ఇదే సమయంలో భారతీయ వాయుసేనకు చెందిన రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు వేదికపై పుష్ఫవర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ జాతీయ పతాకాన్ని, మరోటి ‘వందే మాతరం’అని రాసి ఉన్న జెండాను మోసుకెళుతూ కనిపించాయి. అనంతరం 7.40 గంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం భారతీయులు అందరి లక్ష్యం కావాలని నిర్దేశించిన ప్రధాని మోదీ ఎర్రకోటపై తొలిసారి వందేమాతరం పాడటంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి దేశం దన్నుగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రధాని గత పన్నెండేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని సోదాహరణంగా వివరించారు. అనంతరం వికసిత భారత లక్ష్యాన్ని అందుకునేందుకు సాయం చేయగల సప్తధార శక్తులను ప్రకటించారు. అంతేకాకుండా దేశం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేందుకు వేయాల్సిన ముందడుగులను వివరించారు. యువత ఉన్నత శిఖరాలను అందుకునేందుకు దేశం అండగా ఉంటుందని చెప్పిన ప్రధాని మత్తుమందుల మహమ్మారిని పారదోలే లక్ష్యంతో వలంటీర్లు, ఎన్జీవోలు, సామాజిక, సాంస్కృతిక సంస్థలు, ఆధ్యాతి్మక నాయకులతో కలిసి వంద వారాల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. పురోగతి బాటలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో గత పన్నెండేళ్లలో దేశం సాధించిన పురోగతిని ఇలా వివరించారు... → రక్షణ రంగ ఉత్పత్తులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. → ఖాదీ, గ్రామీణ పరిశ్రమల్లో పురోగతి ఐదు రెట్లు → ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల తయారీలో పెరుగుదల ఏడు రెట్లు. → ఆధునిక రైల్వే కోచ్ల ఉత్పత్తి 21 రెట్లు పెరిగింది. → మొబైల్ ఫోన్ల తయారీలో పెరుగుదల 33 రెట్లు ఎక్కువైంది. → ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువైంది. → పేటెంట్లు కూడా 4 రెట్లు ఎక్కువయ్యాయి. → డిజిటల్ లావాదేవీలు దాదాపు 100 రెట్లు పెరిగాయి. → నల్లాల ద్వారా తాగునీటి కనెక్షన్లు గతం కంటే 15 రెట్లు వేగంగా అందిస్తున్నాం. → గ్యాస్ కనెక్షన్లు అందించే వేగం కూడా ఆరు రెట్లు ఎక్కువైంది. → స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం నాలుగు రెట్లు వేగంగా జరుగుతోంది. → పీఎం ఆవాస్ యోజన కింద పేదల కోసం ఇళ్ల నిర్మాణ వేగం మూడు రెట్లు పుంజుకుంది. → పేదరికం నుంచి బయటపడ్డ వారి సంఖ్య 25 కోట్లు. → ‘‘ఫ్రాజైల్ ఫైవ్’’నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుదల → దేశం మొత్తమ్మీద 2.5 లక్షలకు పైగా స్టార్టప్లు → 650 కొత్త యూనివర్సిటీల స్థాపనలక్ష్య నిర్దేశం 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు భారతీయ సంస్థలు, బ్రాండ్లు పలు లక్ష్యాలను సాధించాలి. ఫార్చ్యూన్ 500లో 50 భారతీయ కంపెనీలు ఉండాలి. బ్యాంకులు, ఫార్మా, లాఫర్మ్లు, రేటింగ్ ఏజెన్సీలు, ఐటీ, కన్సల్టింగ్, అకౌంటింగ్ సంస్థలు కూడా ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరాలి. భారతీయ బ్రాండ్లు విశ్వాసానికి ప్రతీకలుగా మారాలి. దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలన్నీ కలిసికట్టుగా పని చేయాలి. భారతీయ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కంపెనీలు కొత్త ఉపాధి అవకాశాలకు దారులు తెరుస్తోంది. 2036 ఒలింపిక్స్, 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు దేశం సిద్ధం. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా సెమీకండక్టర్లు, క్రిటికల్ మినరల్స్, శక్తి భద్రతపై దృష్టి సారించాలి మూడు సెమీకండక్టర్ ప్లాంట్లలో ఉత్పత్తి మొదలైంది. వచ్చే ఏడు, ఎనిమిదేళ్లలో మరో ఎనిమిది ప్లాంట్ల స్థాపన. 2047 నాటికి వంద గిగావాట్ల అణు శక్తి లక్ష్యం. ఈ దశాబ్దంలో ఐదు కొత్త అణు రియాక్టర్లు ప్రారంభం. సౌర శక్తి సామర్థ్యం రెండు గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు వృద్ధి. పీఎం సూర్య ఘర్ పథకం కింద 50 లక్షలకు పైగా రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లు. యువత, క్రీడలు, మహిళా సాధికారత దేశంలో 2.5 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయి. రూ.లక్ష కోట్లతో ఇన్నోవేషన్ ఫండ్. డ్రగ్–ఫ్రీ ఇండియా జాతీయ మిషన్గా మారాలి.సప్తధార: ఏడు శక్తి ప్రవాహాలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ‘‘సప్తధార’’అనే ఏడు శక్తి ప్రవాహాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రానున్న ఐదు, ఏడేళ్లు చాలా కీలకమని, ప్రజలు పని సంస్కృతి తోపాటు మైండ్సెట్నూ మార్చుకుని దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలిని అన్నారు. ప్రధాని వివరించిన సప్తధారల వివరాలు... → తయారీ శక్తి: డిజైన్ నుంచి తయారీ వరకు మొత్తం అన్ని దశలూ భారత్లోనే పూర్తవ్వాలి. నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి కేంద్రంగా మారాలి. ఖర్చు, నాణ్యతల పరంగా భారతీయ పరిశ్రమలు ప్రపంచ దేశాలతో పోటీపడాలి. నమ్మదగ్గ, యూజర్ ఫ్రెండ్లీ, ఆకర్శణీయమైన ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా పనిచేయాలి. → వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్: చిరుధాన్యాలు, మసాలా దినుసులు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహారాలను ప్రపంచ బ్రాండ్లుగా మార్చాలి. రసాయన–రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల కారణంగా అందుబాటులోకి వచ్చిన ప్రపంచ మార్కెట్లను రైతులు సది్వనియోగం చేసుకోవాలి. పొలాల నుంచి నేరుగా ఎగుమతులు జరగాలి → టెక్నాలజీ, ఇన్నొవేషన్: ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష ప్రయోగాలు, రోబోటిక్స్, డేటా సెంటర్లలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేలా ఎదగాలి యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ప్రపంచానికి మార్గదర్శకం కావాలి. 6జీ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేయాలి. → గతి శక్తి: హై–స్పీడ్ రైలు, ఆధునిక హైవేలు, అంతర్గత జలమార్గాలు, ప్రపంచ స్థాయి విమానాశ్రయాలు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ వ్యవస్థల ద్వారా నగరాలను అనుసంధానించాలి. పోర్టులను పోర్ట్–ఆధారిత అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలి. → రక్షణ శక్తి: రక్షణ రంగంలో దేశం స్వావలంబన సాధించడంతోపాటు ప్రపంచదేశాలకు రక్షణ ఉత్పత్తులను సరఫరా చేసేదిగా ఎదగాలి. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్లతోపాటు హైపర్ సోనిక్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. సైబర్ సెక్యూరిటీ రంగంలో భారత యువత కీలక పాత్ర పోషించాలి. → గ్రీన్, బ్లూ ఎకానమీ: గ్రీన్ హైడ్రోజన్, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇంధన నిల్వ, పర్యావరణ హితమైన రవాణా, తయారీల కోసం కృషి జరగాలి. మత్స్య, తీరప్రాంత పర్యాటకం, ఓషన్ టెక్నాలజీల సాయంతో దేశం బ్లూ ఎకానమీలోనూ అగ్రస్థానానికి చేరవచ్చు. దేశ సంపదైన సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉపాధి, ఆర్థిక వృద్ధికి అవకాశాలు సృష్టికి అనుకూలం. → సాఫ్ట్ పవర్: భారతదేశ సాఫ్ట్ పవర్కు యోగా, ఆయుర్వేదం, ఆధ్యాతి్మకత, ఆరోగ్య సంరక్షణ, హస్తకళలు, సంస్కృతి, సినిమా, వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్లు నిదర్శనాలు. యువతకు అపార అవకాశాలు కల్పించగల సత్తా వీటికి ఉంది. హెల్త్ టూరిజమ్ ప్రోత్సాహానికి ‘హీల్ ఇన్ ఇండియా’ఉపయోగపడుతుంది. వేవ్స్ సమ్మిట్ దేశ సృజనాత్మక, వినోద పరిశ్రమల సత్తాను చాటింది. వందకు పైగా ఉన్న జాతీయ పార్కులతోపాటు వన్యప్రాణి సంపద పర్యాటక రంగాన్ని ఆకర్శించేందుకు సాయపడుతుంది. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు, కచేరీలు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించగలవు. -
హాకీ వరల్డ్ కప్లో భారత్ శుభారంభం
పురుషుల హాకీ ప్రపంచ కప్ 2026ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. శనివారం వాగెనర్ స్టేడియం వేదికగా పూల్ డి ఆరంభ మ్యాచ్లో వేల్స్పై 3-1 తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలి క్వార్టర్లోనే భారత ఆటగాళ్ళు పెనాల్టీ కార్నర్ల రూపంలో లభించిన అవకాశాలను భారత ఆటగాళ్లు చక్కగా వినియోగించుకున్నారు. మనజట్టుకు మొత్తం ఐదు పెనాల్టీ కార్నర్లు లభించగా.. మూడింటిని గోల్స్గా మార్చింది. తొలి క్వార్టర్లో సంజయ్, కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ చెరో రెండు పెనాల్టీ కార్నర్ గోల్స్తో భారత్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. రెండో క్వార్టర్లో ఇరుజట్లూ ఒక్క గోల్ చేయలేకపోయాయి. మూడో క్వార్టర్లోని 43వ నిమిషంలో హర్మన్ప్రీత్ తన రెండో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి 3-0తో జట్టు విజయాన్ని లాంఛనం చేశాడు.మ్యాచ్ 55వ నిమిషంలో వేల్స్ ఆటగాడు శామ్ వెల్ష్ ఓ గోల్ సాధించి తన జట్టు ఖాతా తెరిచాడు. అయినప్పటికే మ్యాచ్ వేల్స్ చేజారిపోయింది. భారత్ తమ రెండో మ్యాచ్లో ఆగస్టు 17న ఇంగ్లండ్తో తలపడనుంది. -
సూపర్ ఎల్ నినో విలయం తప్పదా?
ప్రశాంత మహాసముద్రంలో ఎల్ నినో ప్రభావం క్రమంగా బలపడుతోంది. 2026 చివరి నాటికి ఇది అత్యంత శక్తివంతమైన వాతావరణ పరిణామంగా మారే అవకాశం 90 శాతానికి పైగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, గాలుల మార్పులు ఈ పరిణామానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ (NOAA) తాజా అంచనాల ప్రకారం.. తూర్పు పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సముద్ర ఉపరితలంతో పాటు లోతుల్లోనూ వేడి నీరు విస్తరించడం ఎల్ నినో బలపడేందుకు మరింత దోహదం చేస్తోంది.ప్రపంచ వాతావరణంపై ప్రభావంఎల్ నినో ప్రభావంతో ఇప్పటికే పసిఫిక్ ప్రాంతంలో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. మధ్య, తూర్పు పసిఫిక్లో వర్షపాతం పెరుగుతుండగా.. ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే పొడి వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు, వర్షపాతం, కరువులు, తుపాన్లపై ఎల్ నినో ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.చరిత్రలో అత్యంత ఘోరమైందిగా!ప్రస్తుత అంచనాల ప్రకారం గనుక ఎల్ నినో పరిణామం కొనసాగితే.. 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్నినో ఘటనల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. కొన్ని వాతావరణ నమూనాల ప్రకారం.. ఇది గతంలో నమోదైన తీవ్ర ఎల్నినో పరిణామాలతో పోటీ పడే స్థాయికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.భారత్పై ప్రభావం ఎలా?ఎల్ నినో బలపడితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రతి ప్రాంతంపై ప్రభావం ఒకేలా ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులు, సముద్ర పరిస్థితుల ఆధారంగా ప్రభావం మారవచ్చని పేర్కొంటున్నారు. భారత్పై రుతుపవనాల తీవ్రతను బట్టి ఈ ప్రభావం కొనసాగనుందని చెబుతున్నారు.శాస్త్రవేత్తల నిఘాప్రశాంత మహాసముద్రంలోని పరిస్థితులను ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్లో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎల్ నినో తీవ్రతను బట్టి రాబోయే నెలల్లో వర్షాలు, ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితుల్లో మార్పులపై స్పష్టత రానుంది. -
సుదీర్ఘ సమరానికి సై
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత జట్టు... శ్రీలంకతో టెస్టు సిరీస్కు సిద్ధమైంది. సొంతగడ్డపై వరుస సిరీస్ పరాజయాల నుంచి కోలుకొని టీమిండియా సత్తా చాటాలని భావిస్తుంటే... శ్రీలంక స్పిన్తో ప్రత్యరి్థని దెబ్బతీయాలని ప్రణాళికలు రచిస్తోంది. భారత జట్టుకు ఇది 600వ టెస్టు మ్యాచ్ కావడం మరో విశేషం. గాలె: సుదీర్ఘ విరామం అనంతరం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. 1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్ కానుండగా... మైలురాయి మ్యాచ్లో విజయం సాధించాలని శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. ఇందులో ఏడింట గెలిస్తే భారత్ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్పై కూడా అదనపు ఒత్తిడి ఉంది. స్పిన్కు ఎదురొడ్డితేనే... 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజు్ఞలు కరువయ్యారు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... దేవదత్ పడిక్కల్ వన్డౌన్లో బ్యాటింగ్కు రానున్నాడు. కెపె్టన్ గిల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనుండగా... ఆ తర్వాత పంత్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తారు. సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో చోటు కష్టమే. ఒకప్పుడు స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొంటారనే పేరున్న భారత ప్లేయర్లు... ఇటీవలి కాలంలో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. లంక జట్టులో ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగడం ఖాయమే కాగా... సిరాజ్తో పాటు ప్రసిధ్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. జడేజా, కుల్దీప్, మానవ్ స్పిన్ భారం మోస్తారు. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రాహుల్, జైస్వాల్, పడిక్కల్, పంత్, జురేల్, జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్, సిరాజ్, ప్రసిధ్. శ్రీలంక: ధనంజయ డిసిల్వా (కెపె్టన్), లహిరు, నిషాన్, దినేశ్, కమిందు, డిక్వెల్లా, సోనల్, ప్రభాత్, రమేశ్, అషిత ఫెర్నాండో, లహిరు కుమార.పిచ్, వాతావరణం గాలె పిచ్ గతంలో మాదిరిగా పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చని శ్రీలంక కెప్టెన్ ధనంజయ్ పేర్కన్నాడు. పిచ్పై తేమ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్కే మొగ్గుచూపనుంది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. -
ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి
న్యూఢిల్లీ: ఇటలీతో భారత్కు బలమైన సంబంధాలు ఉన్నాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ శుక్రవారం స్పష్టంచేశారు. ఎవరైనా సరే బహిరంగ కార్యక్రమాల్లో మాట్లాడేటప్పుడు గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలని చెప్పారు. గౌరవం అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని అన్నారు. విదేశీ నేతలను ఆలింగనం చేసుకోవడమే ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానంగా మారిందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై రణ«దీర్ జైస్వాల్ పరోక్షంగా స్పందించారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీని ప్రధాని మోదీ ఆలింగనం చేసుకోవడం పెద్ద తప్పు అన్నట్టుగా రాహుల్ ఎద్దేవా చేయడాన్ని ఖండించారు. ఇటీవలి కాలంలో భారత్, ఇటలీ మధ్య సంబంధాలు మరింత విస్తరించాయని చెప్పారు. పరస్పర గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం దౌత్యపరమైన విధానంలో కీలకమైన అంశమని తెలిపారు. -
80 ఏళ్ల భారతం.. నాటి కలలు.. నేటి వాస్తవాలు
ఒకప్పుడు బ్యాంకులో డబ్బు కోసం క్యూ.. ఇప్పుడు ఫోన్లోనే డబ్బు. ఒకప్పుడు ఉత్తరం కోసం రోజులు.. ఇప్పుడు క్షణాల్లో వీడియో కాల్. కానీ.. సామాన్యుడి జేబులో మిగిలేది ఎంత?1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటికి ఒక సాధారణ భారతీయుడి జీవితాన్ని ఊహించుకుంటే.. మట్టి ఇల్లు, కిరోసిన్ దీపం, ఎద్దుల బండి, రేషన్ దుకాణం, ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలకు వెళ్లే కొద్దిమంది పిల్లలు కనిపిస్తారు. దేశం ముందున్న లక్ష్యం ఒక్కట.. ఎలాగైనా బతకాలి, దేశాన్ని నిలబెట్టాలి.80 ఏళ్ల తర్వాత అదే దేశాన్ని చూస్తే దృశ్యం పూర్తిగా మారిపోయింది.ఒకప్పుడు ఇంట్లో టెలిఫోన్ ఉండటం గొప్ప విషయం. ఫోన్ చేయాలంటే పక్కింటికో, పోస్టాఫీసుకో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు చేతిలో ఉన్న చిన్న మొబైల్నే బ్యాంకు, టీవీ, కెమెరా, పుస్తకం, టికెట్ కౌంటర్.. అన్నీ అయిపోయాయి. డబ్బు పంపడానికి బ్యాంకు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. కొన్ని సెకన్లలోనే చెల్లింపు పూర్తవుతోంది.ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయంలో ఒక సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అదే పని చాలావరకు ఇంట్లో కూర్చునే చేయగలుగుతున్నాం. రైల్వే టికెట్ కోసం స్టేషన్ క్యూలో నిలబడిన రోజులు పోయాయి. పిల్లల చదువు నుంచి ఉద్యోగ దరఖాస్తుల వరకు.. డిజిటల్ ప్రపంచం సామాన్యుడి చేతిలోకి వచ్చింది. కానీ కథ ఇక్కడితో పూర్తికాదు.దేశం ఎదిగింది.. మరి సామాన్యుడి జేబు కూడా అదే స్థాయిలో ఎదిగిందా?.ఇదే అసలు ప్రశ్న. నగరాల్లో జీతాలు పెరిగాయి. కానీ ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, వైద్యం, ప్రయాణ ఖర్చులు కూడా పెరిగాయి. ఒకప్పుడు నెల జీతంతో కుటుంబాన్ని నడిపిన తండ్రి.. ఇప్పుడు ఇద్దరి సంపాదన వచ్చినా నెలాఖరుకు లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. మధ్యతరగతి కుటుంబానికి ‘సొంత ఇల్లు’ ఇప్పటికీ పెద్ద కలగానే ఉంది.గ్రామాల్లోనూ మార్పు వచ్చింది. రోడ్లు వచ్చాయి. కరెంట్ వచ్చింది. మొబైల్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చింది. కానీ వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబానికి వాతావరణం, పంట ధర, అప్పులు ఇంకా పెద్ద సవాళ్లే. చదువుకున్న యువకుడికి గ్రామంలో ఉద్యోగం లేకపోతే.. నగరానికి వెళ్లాల్సిందే.అయినా 80 ఏళ్ల ప్రయాణాన్ని తక్కువ చేసి చూడలేం. ఒకప్పుడు ఆకలితో పోరాడిన దేశం.. నేడు ప్రపంచానికి ఆహారం, ఔషధాలు, సాంకేతిక సేవలు అందించే స్థాయికి వచ్చింది. ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన దేశం.. నేడు అంతరిక్షంలో తన జెండాను ఎగురవేస్తోంది. ప్రపంచంలోని పెద్ద దేశాలతో భారత్ సమానంగా మాట్లాడుతోంది.అయితే స్వాతంత్ర్యానికి అసలు కొలమానం జీడీపీ కాదు. స్టాక్ మార్కెట్ కాదు. భారీ భవనాలు కాదు. ఒక పేద తల్లి తన పిల్లాడిని మంచి స్కూల్లో చదివించగలుగుతుందా? ఒక రైతు తన పంటకు గిట్టుబాటు ధర పొందుతున్నాడా?. ఒక సాధారణ కుటుంబం అనారోగ్యం వస్తే అప్పులపాలు కాకుండా చికిత్స పొందగలుగుతుందా?. ఒక యువకుడికి తన ఊర్లోనే గౌరవంగా బతికే ఉద్యోగం దొరుకుతుందా?ఈ ప్రశ్నలకు సమాధానమే.. రాబోయే భారతదేశం ఎలా ఉండాలో చెబుతుంది. 80 ఏళ్ల క్రితం మన పెద్దలు దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం తెచ్చారు. వచ్చే తరాల బాధ్యత మాత్రం మరో స్వాతంత్ర్యం తీసుకురావడం.. పేదరికం నుంచి, నిరుద్యోగం నుంచి, ఆకలి నుంచి, అన్యాయం నుంచి సామాన్యుడికి స్వేచ్ఛ. అప్పుడే ఆగస్టు 15న ఎగిరే జెండా.. ప్రతి ఇంటి జీవితంలోనూ నిజమైన అర్థాన్ని సంతరించుకుంటుంది. -
సెన్సస్–2027 ప్రశ్నావళి మీ కులం ఏమిటి?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్లో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఇందుకు సంబంధించిన 40 ప్రశ్నలను అధికారికంగా నోటిఫై చేసింది. మొట్టమొదటిసారి కులంతోపాటు కోవిడ్ టీకా వేయించుకున్న ప్రదేశం వివరాలను కూడా సేకరించనున్నారు. జమ్మూ కశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మంచుతో కూడిన ప్రాంతాల్లో వచ్చే సెపె్టంబరు ఒకటవ తేదీ నుంచే పాపులేషన్ ఎన్యూమరేషన్ దశ మొదలవుతుందని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు స్పష్టం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ సారి జనాభా లెక్కల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర కులాల వివరాలు తెలుసుకోనున్నారు. ప్రజలు తమంతట తామే వివరాలు సమరి్పంచేందుకు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ఆగస్టు 17 నుంచి 31 వరకు అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జనాభా లెక్కింపు (పీఈ) వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. తాజా జనాభా లెక్కల్లో భాగంగా తొలిసారి కులం వివరాలు సేకరిస్తున్నప్పటికీ అడిగే ప్రశ్నల్లో కులాల జాబితా ఏదీ ఉండే అవకాశం లేదు. ప్రజలు ఇచ్చే సమాధానాన్ని నేరుగా నమోదు చేస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. గత ఏడాది ఏప్రిల్ 30న కులాల వారీ జనాభా వివరాలు సేకరించాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ సమావేశం తీర్మానించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న సెన్సస్–2027కు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇళ్ల జాబితా, లెక్కల సేకరణ కోసం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపారు. ఎన్యూమరేటర్లు అన్ని రకాల ఇళ్లు, నిర్మాణాల వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే అధికారులు ఒక్కో ఇల్లు/భవనాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. పదేళ్లకు ఒకసారి జరిపే జనాభా లెక్కలు వాస్తవానికి 2021లోనే మొదలు కావాల్సి ఉన్నా అప్పట్లో కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం సెన్సస్–2027 కోసం రూ.11,718 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలు: కాంగ్రెస్ జనాభా లెక్కల్లో భాగంగా కులాల వివరాలు కూడా సేకరించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆక్షేపణ తెలిపింది. కులాల జాబితా ఆధారంగా కాకుండా స్పందనలను మాత్రమే నమోదు చేయడం అనుమానాలు రేకెత్తిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఈ అంశంపై అధికార పక్షం ఏ రాజకీయ పారీ్టతోనూ చర్చించలేదని ఆరోపించింది. బిహార్, తెలంగాణల్లో మాదిరిగానే సిద్ధంగా ఉన్న కులాల జాబితా సాయంతో జనాభా లెక్కలు నిర్వహిస్తారని ఆశించామని అందుకు భిన్నంగా జరుగుతూండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా గత ఏడాది ప్రధాని మోదీకి రాసిన లేఖలో తెలంగాణ మోడల్ను అనుసరించాలని, అన్ని రాజకీయ పారీ్టలతో చర్చించాలని కోరారని, ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని విమర్శించారు. ఇవీ ప్రశ్నలు.. → వ్యక్తిగత, జనాభా వివరాలు వ్యక్తి పేరు ఇంటి యజమాని స్త్రీ లేదా పురుషుడు? పుట్టిన తేదీ, వయసు (పూర్తయిన సంవత్సరాల్లో) ప్రస్తుత వైవాహిక స్థితి వివాహమై ఎంత సమయం? (పూర్తయిన సంవత్సరాల్లో) భార్య/భర్త పేరు జాతీయత (ప్రకటించిన విధంగా) మతం షెడ్యూల్డ్ కులం (ఎస్సీ)/షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)/కులం తండ్రి వివరాలు తల్లి వివరాలు వైకల్యం స్థితి (ఏదైనా ఉంటే) మాతృభాష, తెలిసిన ఇతర భాషలు→ విద్య అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత స్థితి విద్యాసంస్థలో హాజరు (ప్రస్తుత స్థితి) సాధించిన అత్యున్నత విద్యా స్థాయి విద్యా శాఖ/విభాగం→ ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలు గత ఏడాదిలో ఏ సమయంలోనైనా పనిచేశారా ఆర్థిక కార్యకలాపాల వర్గం వృత్తి పరిశ్రమ/వ్యాపారం/సేవల స్వభావం కారి్మక వర్గం ఆర్థికేతర కార్యకలాపం (మార్జినల్, సెమీ మార్జినల్, నాన్వర్కింగ్) పని కోసం చూస్తున్నారా?/అందుబాటులో ఉన్నారా (మార్జినల్, సెమీ మార్జినల్, నాన్వర్కింగ్) పని చేసే చోటికి ప్రయాణం అవసరమా?→ వలసలు, నివాసం పుట్టిన స్థలం చివరి నివాస ప్రదేశం వలసకు కారణం ప్రస్తుత గ్రామం/పట్టణంలో ఉన్న కాలం శాశ్వత నివాస చిరునామా→ సంతాన సాఫల్యం, కుటుంబం (మహిళలకు) ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య ఇప్పటి వరకు పుట్టిన మొత్తం పిల్లల సంఖ్య (వివాహిత, వితంతువు, విడాకులు తీసుకున్న, వేరుపడిన మహిళలకు) గత ఏడాదిలో జని్మంచిన శిశువుల సంఖ్య (వివాహిత మహిళలకు మాత్రమే)→ ఆరోగ్యం, గుర్తింపు కోవిడ్–19 టీకా వేయించుకున్న ప్రదేశం మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య మొబైల్ నంబర్ (ఉంటే) ఆధార్ నంబర్ (ఉంటే) ఓటర్ ఐడీ నంబర్ (ఉంటే) పాస్పోర్ట్ నంబర్ (భారత పాస్పోర్ట్ ఉంటే), డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా? -
దేశభక్తి అంటే?
పిల్లలూ... నేడు ఆగస్టు 15. జెండా ఎగరేశాం. ‘జైహింద్’, ‘వందేమాతరం’ అని స్కూల్లో నినాదాలు చేశాం. కానీ దేశభక్తి అంటే ఏమిటి? కేవలం జెండా ఎగురవేయడమా? నినాదాలు చేయడమా? కాదు పిల్లలూ! దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం. మన అమ్మను, నాన్నను ప్రేమించినట్టే దేశాన్ని కూడా ప్రేమించడం. దేశభక్తి అంటే ఇదే...1. పరిశుభ్రత పాటించడం దేశభక్తి: రోడ్డు మీద చెత్త వేయకుండా డస్ట్బి¯Œ లో వేయడం. మన ఇల్లు, స్కూల్, పార్క్ను శుభ్రంగా ఉంచడం. మన దేశం అందంగా ఉంటే మనకే గర్వం కదా!2. కష్టపడి చదవడం దేశభక్తి: డాక్టర్ అయ్యి రోగులకు సేవ చేయడం. ఇంజనీర్ అయ్యి కొత్త కొత్త వస్తువులు కనిపెట్టడం. సైనికుడై సరిహద్దు కాపాడడం. టీచర్ అయ్యి మంచి పౌరులను తయారు చేయడం. ఇవన్నీ దేశభక్తే!3. అందరినీ ప్రేమించడం దేశభక్తి: మన దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరం కలిసి ఉంటాం. ఒకరితో ఒకరు గొడవ పడకుండా, స్నేహంగా ఉండడం. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటే ఇదే.4. చిన్న చిన్న నియమాలు పాటించడం దేశభక్తి: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగడం. నీళ్లు, కరెంట్ వృథా చేయకపోవడం. చెట్టు నాటడం. పెద్దలను గౌరవించడం. ఇవన్నీ చిన్న పనులే. కానీ కోటిమంది చేస్తే దేశం ఎంత బాగుంటుంది! గుర్తుంచుకోండి పిల్లలూ!దేశం అంటే భూమి మాత్రమే కాదు. అందులో ఉండే మనుషులు, చెట్లు, నదులు, భాషలు – అన్నీ కలిపితేనే దేశం. వాటన్నిటినీ గౌరవించడమే అసలైన దేశభక్తి. ఈ ఆగస్టు 15న మనం ప్రమాణం చేద్దాం. ‘నేను మంచి పౌరుడిగా ఉంటా. నా దేశం కోసం ఏదో ఒక మంచి పని చేస్తా’ అని. సరేనా.∙ -
‘వ్యాపార స్వాతంత్య్రం’ ఎలా వచ్చిందంటే..
ఒకప్పుడు భారత్లో వ్యాపారం అంటే అనుమతులు, పన్నులు, ప్రభుత్వ నియంత్రణల మధ్య సాగేది. స్వాతంత్య్రం తర్వాత దేశ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం పరిశ్రమలపై మరింత నియంత్రణ సాధించింది. 1991 ఆర్థిక సంస్కరణలతో పరిస్థితి పూర్తిగా మారింది. నేడు డిజిటల్ సింగిల్ విండో, డీరెగ్యులేషన్, లేబర్ కోడ్లతో వ్యాపారం ప్రారంభించే విధానం మరో దశలోకి వెళ్లింది.స్వాతంత్యానికి ముందు.. వ్యాపారం అంటే?1947కు ముందు ‘బిజినెస్ ప్రారంభించడానికి ఒకే చట్టం’ అంటూ ఏదీ లేదు. కంపెనీలు, కర్మాగారాలు, గనులు, ఉప్పు, మద్యం, బ్యాంకింగ్, దిగుమతులు-ఎగుమతులకు వేర్వేరు చట్టాలు, నిబంధనలు ఉండేవి. బ్రిటిష్ ఇండియా, సంస్థాన ప్రాంతాల్లోనూ విధానాలు భిన్నంగా ఉండేవి.కంపెనీల ఏర్పాటుకు 19వ శతాబ్దంలోనే చట్టపరమైన వ్యవస్థ మొదలై, చివరకు కంపెనీల చట్టం, 1913 అమల్లోకి వచ్చింది. కంపెనీల ఏర్పాటు, నిర్వహణ, మూసివేతకు ఇది ప్రాతిపదికగా నిలిచింది. అయితే నేటి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో దీన్ని పోల్చలేం. వలస పాలనలో ఆర్థిక విధానాలు ప్రధానంగా బ్రిటిష్ పాలన అవసరాలకు అనుగుణంగా ఉండేవి.ఉప్పుపై ప్రభుత్వ నియంత్రణ ఇందుకు ఉదాహరణ. 1882 ఉప్పు చట్టం ద్వారా ఉప్పు తయారీ, సేకరణ, నిర్వహణపై నియంత్రణ ఉండేది. ప్రజలు స్వయంగా ఉప్పు తయారు చేయడం, విక్రయించడం స్వేచ్ఛగా చేయలేకపోయారు. ఈ పరిస్థితి మహాత్మాగాంధీ నేతృత్వంలోని ఉప్పు సత్యాగ్రహానికి కీలక నేపథ్యంగా మారింది.కర్మాగారం పెట్టాలంటే కార్మిక చట్టాలుపరిశ్రమలపై నియంత్రణతో పాటు కార్మిక చట్టాలు కూడా వచ్చాయి. 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టం అమల్లోకి వచ్చింది. పిల్లల పనివేళలు, కొన్ని భద్రతా అంశాలపై పరిమితులు విధించింది. 1891, 1911, 1922, 1934లో చట్టాలు మరింత విస్తరించాయి. పని గంటలు, కార్మిక సంక్షేమం, భద్రత వంటి అంశాలు కూడా నియంత్రణలోకి వచ్చాయి.1947 తర్వాత.. ప్రభుత్వ ఆధిపత్యంస్వాతంత్య్రం తర్వాత భారత్ స్వయం సమృద్ధి కలిగిన పారిశ్రామిక దేశంగా ఎదగడంపై దృష్టి పెట్టింది. 1948 పారిశ్రామిక విధానంతో పరిశ్రమల్లో ప్రభుత్వ పాత్రకు రూపం వచ్చింది. కొన్ని కీలక రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచి, మరికొన్నింటిలో ప్రైవేటు రంగానికి అవకాశం ఇచ్చారు. 1951లో వచ్చిన పరిశ్రమల (Development and Regulation) చట్టం ద్వారా కొన్ని పరిశ్రమల స్థాపన, విస్తరణపై కేంద్రానికి లైసెన్సింగ్ అధికారం లభించింది.1956 పారిశ్రామిక విధానంతో ప్రభుత్వ పాత్ర మరింత పెరిగింది. పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి కేటాయించినవి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి అనువైనవి, ప్రైవేటు రంగానికి చెందినవిగా విభజించారు. దీంతో పరిశ్రమ ప్రారంభించడం, ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, విస్తరించడం వంటి వాటికి ప్రభుత్వ అనుమతులు కీలకమయ్యాయి. ఇదే ‘లైసెన్స్ రాజ్’కు బలం చేకూర్చింది.1991.. అతిపెద్ద మలుపు1991 ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ పారిశ్రామిక విధానాన్ని పూర్తిగా మార్చుకుంది. జూలై 24, 1991న ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానంలో చాలా పరిశ్రమలకు లైసెన్సింగ్ను రద్దు చేశారు. వ్యూహాత్మక, భద్రత, పర్యావరణ, ప్రమాదకర ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని రంగాలను మాత్రం మినహాయించారు.సామర్థ్య నియంత్రణలు కూడా గణనీయంగా తొలగడంతో కంపెనీలకు ఉత్పత్తి, విస్తరణ నిర్ణయాల్లో స్వేచ్ఛ పెరిగింది. ప్రైవేటు రంగానికి మరిన్ని అవకాశాలు, విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరుచుకున్నాయి. అంటే 1950–80లలో ‘ముందు ప్రభుత్వ అనుమతి.. తర్వాత పెట్టుబడి’ విధానం ఉంటే, 1991 తర్వాత మార్కెట్ ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగింది.కంపెనీల చట్టంలోనూ మార్పులు1913 కంపెనీల చట్టం స్థానంలో స్వాతంత్య్రం తర్వాత కంపెనీల చట్టం, 1956 వచ్చింది. ఆ తర్వాత పారదర్శకత, పెట్టుబడిదారుల రక్షణ, కార్పొరేట్ పాలనకు ప్రాధాన్యం పెరగడంతో కంపెనీల చట్టం, 2013 అమల్లోకి వచ్చింది.ఇప్పుడు.. డిజిటల్గా వ్యాపారం2026 నాటికి వ్యాపారం ప్రారంభించే విధానం మరింత డిజిటల్గా మారింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరమైన అనుమతులను గుర్తించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం NSWS 32 కేంద్ర విభాగాల మార్గదర్శకత్వాన్ని, 34 రాష్ట్ర ప్రభుత్వాల అనుమతుల కోసం అప్లికేషన్ సదుపాయాలను అందిస్తోంది. కొత్త ఇండస్ట్రియల్ లైసెన్స్, ఇండస్ట్రియల్ ఎంట్రాప్రెన్యూర్ మెమొరాండం (IEM) దరఖాస్తుల ప్రక్రియ కూడా ఇందులోకి మారింది.2025లో మరో కీలక సంస్కరణ2025 నవంబర్ 21 నుంచి నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు సమగ్ర కోడ్లుగా ఏకీకృతం చేశారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, ఉద్యోగుల భద్రత-ఆరోగ్యానికి సంబంధించిన నిబంధనలను ఒకే విస్తృత చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావడం వీటి లక్ష్యం.మొత్తంగా చూస్తే.. బ్రిటిష్ కాలంలో పరిమితులు, పన్నులు, ఏకాధికారాల నుంచి స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వ ఆధిపత్యం, ఆపై 1991లో మార్కెట్ సంస్కరణలు.. ఇప్పుడు డిజిటల్ అనుమతులు, సరళీకృత నిబంధనల వరకు భారత్లో వ్యాపార వ్యవస్థ ఎన్నో దశలను దాటింది. -
79 నుంచి 80కి.. మన జీవితంలో ఏం మారింది?
జాతీయ జెండా రెపరెపలాడుతుంది.. దేశభక్తి గీతాలు మార్మోగుతాయి.. ఎర్రకోట వేదికగా దేశ ప్రగతి ప్రస్థానం మరోసారి వినిపిస్తుంది. రహదారుల నుంచి రాకెట్ల వరకు.. డిజిటల్ చెల్లింపుల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు భారత్ సాధించిన విజయాలను ప్రభుత్వం దేశం ముందుంచుతుంది. కానీ ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం కేవలం విజయాలను లెక్కించుకునే సందర్భమే కాదు.. ఆ అభివృద్ధి సామాన్యుడి జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో సమీక్షించుకునే సమయం కూడా.79వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి 80వ దినోత్సవం వరకు భారత్ ఎన్నో రంగాల్లో ముందడుగు వేసింది. ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, డిజిటల్ విప్లవం, అంతరిక్ష పరిశోధనలు, ప్రపంచ వేదికపై పెరిగిన ప్రాధాన్యం.. ఇవన్నీ కొత్త భారత్ చిత్రాన్ని చూపిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగాలు, ధరల భారం, ఆదాయ అసమానతలు, వ్యవసాయ సమస్యలు వంటి ప్రశ్నలు కూడా కొనసాగుతున్నాయి. అభివృద్ధి వేగం పెరిగిన ఈ ఏడాదిలో.. ఆ మార్పు ప్రతి భారతీయుడి జీవితంలో ఎంతవరకు కనిపించింది? ఇదే 80వ స్వాతంత్ర్య దినోత్సవం ముందున్న అసలు ప్రశ్న.జీడీపీ నుంచి జేబు దాకా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. తయారీ రంగం, సేవల రంగం, మౌలిక వసతులు, స్టార్టప్ వ్యవస్థల్లో పెట్టుబడులు పెరిగాయి. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు పరిశ్రమలకు ఊతమిస్తున్నాయి.భారత్ ఆర్థిక పరిమాణం పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిలో భారత మార్కెట్ ఆకర్షణీయంగా మారిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.అయితే మరోవైపు సామాన్య కుటుంబాల లెక్కలు వేరుగా ఉన్నాయి. నిత్యావసర ధరలు, విద్య, వైద్య ఖర్చులు, ఇళ్ల అద్దెలు పెరగడం మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్పై ప్రభావం చూపుతోంది. దేశ సంపద పెరుగుతున్న వేగం.. ప్రతి కుటుంబ ఆర్థిక భద్రత పెరుగుతున్న వేగంతో సమానమా? అనే చర్చ కొనసాగుతోంది.మన డిజిటల్ భారతం.. భారత్లో అత్యంత వేగంగా కనిపించిన మార్పుల్లో డిజిటల్ విప్లవం ఒకటి. ఒకప్పుడు బ్యాంకు సేవల కోసం రోజుల తరబడి వేచి చూసిన ప్రజలు ఇప్పుడు మొబైల్ ద్వారా క్షణాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చిన్న వ్యాపారి, కూరగాయల విక్రేత, ఆటో డ్రైవర్.. ఇలా సామాన్యుడి జీవితంలోనూ డిజిటల్ చెల్లింపులు భాగమయ్యాయి. యూపీఐ వంటి వ్యవస్థలు భారత ఆర్థిక లావాదేవీల రూపాన్ని మార్చాయి.అదే సమయంలో కృత్రిమ మేధస్సు (AI) కొత్త అవకాశాలను తెస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, మీడియా రంగాల్లో సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అయితే AI కారణంగా ఉద్యోగాల స్వరూపం ఎలా మారుతుందన్న ఆందోళన కూడా పెరుగుతోంది.రయ్.. రయ్..తిరిగేయ్దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటిగా కొనసాగుతోంది. కొత్త ఎక్స్ప్రెస్వేలు, రహదారులు, మెట్రో ప్రాజెక్టులు, రైల్వే ఆధునీకరణతో ప్రయాణ రూపం మారుతోంది. వందే భారత్ వంటి రైళ్లు ఆధునిక రైల్వేకు ప్రతీకగా నిలుస్తున్నాయి. నగరాల మధ్య కనెక్టివిటీ పెరుగుతోంది. విమానాశ్రయాల విస్తరణతో విమాన ప్రయాణం కూడా ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తోంది.అయితే మరోవైపు గ్రామీణ రహదారులు, ప్రజా రవాణా, నగరాల్లో ట్రాఫిక్, కాలుష్యం వంటి సమస్యలు ఇంకా సవాళ్లుగానే ఉన్నాయి. అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తికి చేరడం కూడా అంతే ముఖ్యం.అంతరిక్ష విజయాలే..చంద్రయాన్ విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మానవ సహిత అంతరిక్ష ప్రయాణం, ప్రైవేటు అంతరిక్ష సంస్థలకు అవకాశాలు, కొత్త పరిశోధనలపై దృష్టి పెరిగింది. అంతర్జాతీయ రాజకీయాల్లోనూ భారత్ పాత్ర పెరిగింది. అమెరికా, రష్యా, యూరప్, ఇండో-పసిఫిక్ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూ ప్రపంచ సమస్యలపై తన అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తోంది. ప్రపంచ వేదికపై పెరిగిన ఈ ప్రాధాన్యం భారత్ ఆర్థిక, దౌత్య శక్తిని ప్రతిబింబిస్తోంది.యువ భారత్.. ఆశలు పెద్దవి, సవాళ్లు కూడాభారత్ యువ జనాభా దేశానికి అతిపెద్ద బలం. అదే సమయంలో వారికి అవకాశాలు కల్పించడం అతిపెద్ద బాధ్యత. ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, కొత్త పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది. కొత్త రంగాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే లక్షలాది మంది యువతకు స్థిరమైన ఉద్యోగం, మెరుగైన వేతనం, ఉద్యోగ భద్రత ఇప్పటికీ కీలక అంశాలుగానే ఉన్నాయి. పోటీ పరీక్షలు, నియామకాల ఆలస్యం వంటి అంశాలు యువతలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. జెన్జీ ఉద్యమాలు తెరపైకి వస్తున్నాయి.అభివృద్ధి కథలో మరో వైపు79 నుంచి 80కి భారత్ ప్రయాణం చూస్తే విజయాలు స్పష్టంగా కనిపిస్తాయి. డిజిటల్ శక్తి పెరిగింది. మౌలిక వసతులు విస్తరించాయి. అంతరిక్షం నుంచి ప్రపంచ రాజకీయాల వరకు భారత్ తన ముద్ర వేస్తోంది. కానీ ఒక దేశ అభివృద్ధిని కేవలం జీడీపీ, భారీ ప్రాజెక్టులు, అంతర్జాతీయ గుర్తింపుతో మాత్రమే కొలవలేం.ఒక రైతు ఆదాయం పెరిగిందా?ఒక యువకుడికి ఉద్యోగం దొరికిందా?ఒక కుటుంబానికి వైద్యం, విద్య భారం తగ్గిందా?ఒక సామాన్యుడి జీవన ప్రమాణం మెరుగుపడిందా?.. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే అసలు అభివృద్ధికి కొలమానం.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్ తన విజయాలను వేడుకగా జరుపుకుంటోంది. అదే సమయంలో ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భమూ ఇదే. గత ఏడాదిలో భారత్ చాలా మారింది.. కానీ ఆ మార్పు ప్రతి భారతీయుడి జీవితంలో మరింత స్పష్టంగా కనిపించడమే వచ్చే ప్రయాణానికి అసలైన సవాల్.:::వెబ్ ప్రత్యేకం -
భారత్ పై పాక్ అణుబాంబు వాడితే.. ప్రొఫెసర్ జియాంగ్ సంచలనం
-
సమావేశాలు సరే, సమస్యల మాటేంటి?
భారతదేశ భవిష్యత్తును నిర్దేశించేది, నిర్ణయాలకు కేంద్ర బిందువుగా ఉండేది, 143 కోట్ల భారతీయుల తలరాతలను మార్చేది పార్లమెంట్. తమ తమ ప్రాంతాలలో చోటు చేసుకున్న సమస్యలను ఎంపీలు ప్రస్తావించేందుకు పార్లమెంటు ఓ కీలకమైన వేదిక. ఇప్పుడు కేవలం ఆరోపణలు, విమర్శలకే ఎక్కువ సమయం సరిపోతోంది.దేశంలో పెద్ద గుంతలతో నిండిన రహదారులను దాటడం, మునిగి పోయిన నగరాల్లో నడవడం, అంతులేని ఉద్యోగ దరఖాస్తు లతో చెమటలు పట్టడం, దొంగతనాల వల్ల కోట్లు నష్టపోయే విద్యుత్ రంగానికి ధర చెల్లించడం దేశంలో సాధారణ దృశ్యాలు అయ్యాయి. ప్రతి వారం ప్రజల తెరలపై ఒక వంతెన వంగిపోవడం, ఒక కారును రహదారి మింగేయడం వంటి దృశ్యాలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలు, ప్రభుత్వ సమాధానాలు చూస్తే దేశంలో పరిస్థితి కళ్లముందు ప్రత్యక్షమవుతుంది.‘ఎన్ని రహదారులు కూలిపోయాయి?’ అనే ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం 49 అని. ఇది 2014 నుండి 2025 వరకు ఉన్న డేటా. ప్రతి వర్షాకాలం కల్లోలం సృష్టిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టణ వరదల బాధ్యతను రాష్ట్రాలు, స్థానిక సంస్థలపై మోపుతుంది. ఇది రాజ్యాంగపరంగా సరైనదే. అయితే, అతి పెద్ద పట్టణా భివృద్ధి కార్యక్రమం ఢిల్లీ నుండి నిర్వహించబడుతోంది. ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ కింద 8,064 ప్రాజెక్టులలో 7,790 పూర్తయ్యాయి. ఖర్చు రూ. 1,56,257 కోట్లు. ఖర్చు అంటే కేవలం డబ్బు కదలిక మాత్రమే, పరిష్కారం కాదు.ఈ వారం ఎంపీలు నీటి కాలుష్యం, అంచనాలు, ప్రమాణాలు, పరిష్కారాలపై కూడా గొంతెత్తారు. 2023–24 నుండి 2.52 కోట్ల ప్రయోగశాల నమూనాల సేకరణ జరిగిందనీ, 2.87 కోట్ల ఫీల్డ్ పరీక్షలు జరిగాయనీ, ట్యాంకర్ మాఫియా నీటి కొరత నిజమనీ ప్రభుత్వం అంగీకరించింది.ఇక ప్రాథమిక విద్య విషయానికి వస్తే, భవిష్యత్తు ఆశల వెన్నె ముక విరిగిపోయింది. ప్రభుత్వం 10.05 లక్షల పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 11.89 కోట్ల పిల్లలు చదువుతున్నారు. ప్రైవేట్ రంగం 3.42 లక్షల పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 8.89 కోట్ల పిల్లలు చదువుతున్నారు. విధానాలు, కంప్యూటరైజేషన్ గురించి చర్చల మధ్య ఈ వివరాలు వెల్లడయ్యాయి. 73,481 పాఠశాలలకు విద్యుత్ లేదు. 1,00,843 పాఠశాలల్లో ఒక్క గురువు మాత్రమే ఉన్నారు. అందుకే యువత వ్యవస్థలోని సమస్యలతో పోరాడు తున్నారు. మొన్న జంతర్ మంతర్లో, ఇప్పుడు జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటకల్లో కనిపిస్తున్న ఆగ్రహం చదువు, ఉపాధి రంగా లపై అసంతృప్తిని ఎలుగెత్తి చాటుతున్నది.ఇంతలోపే ఆగస్ట్ 15 వచ్చేసింది. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగించడం మామూలే. కానీ రోజురోజుకూ రూపాయి మరింత బలహీనమవుతోంది. ముడి చమురు ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆర్థిక లోటు పెరుగుతోంది. దివాళా చట్టం కింద 2020 నుండి డిసెంబర్ 2025 వరకు 25,900 కేసులు దాఖలయ్యాయి. పాలనలో బాధ్యత, సమర్థత లోపించడం వల్లనే ఈ సమస్యలు కొనసాగుతున్నాయి. – కృష్ణ తేజ, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి -
‘ప్రతీ నీటి బొట్టూ మా రెడ్లైన్’.. భారత్కు పాక్ హెచ్చరిక!
ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ మధ్య నీటి వివాదం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘పాకిస్తాన్ నీటిలో ప్రతి ఒక్క చుక్కా మా రెడ్లైన్’ అంటూ భారత్ను ఆయన హెచ్చరించారు. భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే నేరుగా స్పందిస్తామని వ్యాఖ్యానించారు.శాంతి గురించి మాట్లాడుతూనే.. భారత్కు హెచ్చరికలు జారీ చేయడం పాకిస్థాన్ రాజకీయాల్లోని ద్వంద్వ వైఖరిపై మరోసారి చర్చకు దారితీసింది. ఓవైపు శాంతిని కోరుకుంటున్నామని చెబుతూనే.. మరోవైపు నీటి విషయంలో ఎలాంటి చర్యనైనా సహించేది లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.అసలు వివాదం?1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. సింధు నదీ వ్యవస్థలోని నీటిని రెండు దేశాలు ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఈ ఒప్పందం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సింధు, జీలం, చీనాబ్ నదులను ప్రధానంగా పాకిస్తాన్కు, రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్కు కేటాయించింది. అయితే ఇరు దేశాలకు కొన్ని పరిమిత వినియోగ హక్కులను కూడా ఒప్పందం కల్పించింది. అయితే 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ దాడికి పాక్ మద్దతున్న ఉగ్రవాదులే కారణమని భారత్ ఆరోపించింది. ఆ తర్వాత పాకిస్తాన్పై తీసుకున్న కీలక చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ‘అబేయన్స్’లో ఉంచింది. ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ మొదలైంది.భారత్ ట్విస్ట్.. ఒప్పందం అమలులో ఉన్న సమయంలో భారత్ నుంచి పాకిస్తాన్కు నదుల నీటి మట్టాలపై కీలక సమాచార మార్పిడి జరిగేది. ముఖ్యంగా వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం పెరిగితే ముందస్తు హెచ్చరికలు పాకిస్తాన్కు ఉపయోగపడేవి. ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత ఈ సమాచారాన్ని పంచుకోవడం కూడా భారత్ ఆపేసింది. దీంతో నీటి అంశం కేవలం రెండు దేశాల మధ్య జల వివాదంగా కాకుండా.. భద్రత, ఉగ్రవాదం, దౌత్యం, రాజకీయ ఒత్తిడి అన్నీ కలిసిన పెద్ద అంశంగా మారింది. ఇప్పుడు షెహ్బాజ్ షరీఫ్ వ్యాఖ్యలు కూడా అదే రాజకీయ నేపథ్యంలో చూడాల్సి ఉంది. “మేము శాంతిని కోరుకుంటున్నాం.. కానీ మా శాంతిని బలహీనతగా భావించొద్దు” అంటూ ఆయన ఒకవైపు చెబుతూనే.. భారత్ తమ నీటి హక్కులను ప్రభావితం చేసే చర్యలు తీసుకుంటే గట్టిగా స్పందిస్తామని హెచ్చరించారు. అంటే.. శాంతి సందేశమా? లేక రాజకీయ హెచ్చరికా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.పాక్ మాత్రం సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా నిలిపివేసిందని ఆరోపిస్తోంది. తమకు ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగానే ఉందని వాదిస్తూ అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశాన్ని పదేపదే లేవనెత్తుతోంది. కానీ, భారత్ మాత్రం ఉగ్రవాదాన్ని ఒకవైపు, నీటి సహకారాన్ని మరోవైపు విడదీసి చూడాలనే పాక్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూనే నీటి విషయంలో పాత ఒప్పందం ప్రకారం హక్కులు కావాలనుకోవడం ఎలా? అన్నది భారత రాజకీయ వాదనలో కీలక అంశంగా మారింది. ఇదే ఇప్పుడు పాకిస్తాన్కు పెద్ద సవాలుగా మారుతోంది. ఎందుకంటే నీటి అంశాన్ని అంతర్జాతీయ ఒత్తిడి కోసం ఉపయోగించాలనుకుంటున్న ఇస్లామాబాద్కు.. భారత్ మాత్రం దీనిని తన భద్రతా ప్రయోజనాలతో ముడిపెడుతోంది. -
మానవ చరిత్రలో కన్నీటి అధ్యాయం.. మోదీ
సాక్షి, ఢిల్లీ: దేశ చరిత్రలో అత్యంత బాధాకరమైన అధ్యాయాలలో దేశ విభజన ఒకటని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ఆగస్టు 14 "విభజన భయానక స్మృతి దినం" సందర్భంగా ఎక్స్ ఖాతాలో విభజన దినోత్సవ విషాద స్మృతులను ఆయన పంచుకున్నారు. దేశ విభజన అంతులేని జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందని, కుటుంబాలను నిర్వాసితులను చేసిందని అపారమైన మానవ వేదనకు కారణమైందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.ప్రధాని ఎక్స్ ఖాతాలో "ఈరోజు మనం విభజన విషాధ స్మృతి దినాన్ని పాటిస్తున్నాము. విభజన కారణంగా ప్రభావితమైన ప్రతి ఒక్కరి ధైర్యాన్ని మనం గుర్తుచేసుకుంటున్నాము. ఇది అనేక జీవితాలను ఛిన్నభిన్నం చేసిన చారిత్రక క్షణం... కుటుంబాలు నిర్వాసితులయ్యాయి, ప్రియమైన వారిని కోల్పోయారు అపారమైన బాధను అనుభవించారు. " అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ఈ విషాదాన్ని తట్టుకుని నిలబడిన వారి పట్టుదలను ఆ సందర్భంగా ఆయన కొనియాడారు.ఊహించని కష్టాలు ఎదురైనప్పటికీ, చాలా మంది తమ జీవితాలను మళ్లీ నిర్మించుకుని దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. "వారి జీవిత ప్రయాణాలు మానవ ఆత్మ యొక్క బలాన్ని మనకు గుర్తుచేస్తాయి. మన దేశంలో ఐక్యతను, సౌభాత్రాన్ని కాపాడుకోవాలనే మన సంకల్పాన్ని ఈ రోజు మరింతగా బలోపేతం చేయాలి. ఒక వికసిత్ భారత్ను నిర్మించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం" అని ఆయన జోడించారు.కాగా విభజన బాధితులకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సైతం నివాళులర్పించారు. భారతదేశ విభజన వల్ల జరిగిన అపారమైన మానవ వేదనను ఆయన గుర్తుచేసుకున్నారు. ఎంతటి కష్టాలు ఎదురైనా తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్న ప్రజల ధైర్యాన్ని మరియు పట్టుదలను ఆయన ప్రశంసించారు.లక్షలో సంఖ్యలో మరణాలు1947లో జరిగిన దేశ విభజన మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద విషాదకరమైన వలసలలో ఒకటి. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ దేశాలుగా విడిపోయింది. ఆ సమయంలో దాదాపు 1 కోటి 50 లక్షల మంది ప్రజలు సరిహద్దులు దాటారు. విభజన రేఖల వల్ల రెండు వైపులా తీవ్రమైన మతకల్లోలాలు జరిగాయి. ప్రజలు తమ ఇళ్లు, భూములు, వ్యాపారాలను ఉన్నపళంగా వదిలి శరణార్థులుగా మారారు. రవాణాపై దాడులు శరణార్థులతో వెళ్తున్న రైళ్లు, బస్సులు నడిచి వెళ్తున్న కాన్వాయ్లపై దాడులు జరిగాయి. సుమారు 2 లక్షల నుండి 20 లక్షల మంది వరకు చనిపోయారని అంచనా. లక్షలాది మంది ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయి, ఏళ్ల తరబడి శరణార్థుల శిబిరాల్లో మగ్గిపోయారు. ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన ప్రజల త్యాగాల జ్ఞాపకార్థం 2021 నుండి ఏటా ఈ రోజును "విభజన భయానక స్మృతి దినం" గా జరుపుకుంటున్నారు. -
ఎల్ నినో ముప్పు.. కానీ భారత్పై మేఘాల మాయాజాలం!
ఎల్ నినో ప్రభావంపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. రుతుపవనాలు మరోసారి బలాన్ని పుంజుకుంటున్నాయి. ఆకాశం నుంచి తీసిన ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని చాలా ప్రాంతాలు దట్టమైన మేఘాలతో కప్పుకున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం తూర్పు, మధ్య భారతంలో వర్షాలకు ఊతమిస్తోంది.ప్రస్తుతం వాతావరణ నిపుణుల దృష్టి మొత్తం బంగాళాఖాతం వైపే ఉంది. అక్కడ ఏర్పడే అల్పపీడనాలు రుతుపవనాలకు కీలకమైన ఇంధనంలా పనిచేస్తాయి. సముద్రం నుంచి తేమను తీసుకువచ్చి భూభాగంపైకి వర్షాలను తీసుకువస్తాయి. తాజాగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.శాటిలైట్ చిత్రాల్లో..భారత ఉపగ్రహాలు, అంతర్జాతీయ వాతావరణ ఉపగ్రహాలు పంపిన చిత్రాల్లో అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం మీదుగా గంగా మైదానాలు, ఈశాన్య రాష్ట్రాల వరకు మేఘాల విస్తరణ కనిపిస్తోంది. ముఖ్యంగా బంగాళాఖాతం పరిసరాల్లో దట్టమైన మేఘాలు ఉండటం బలమైన వర్ష వ్యవస్థకు సంకేతంగా భావిస్తున్నారు. తూర్పు భారతంపై కనిపిస్తున్న చల్లటి మేఘ శిఖరాలు బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు సూచనగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల స్థానికంగా వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.ఎల్ నినోతో ఎందుకు టెన్షన్?సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన సంవత్సరాల్లో భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణ గాలుల మార్పులు చోటుచేసుకుని వర్షపాతంపై ప్రభావం చూపుతాయి. అయితే ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ కచ్చితంగా కరవే వస్తుందని చెప్పలేం. ఇతర వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు బలపడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నప్పటికీ.. బంగాళాఖాతం నుంచి వరుసగా ఏర్పడుతున్న వర్ష వ్యవస్థలు రుతుపవనాలకు కొంత ఊరటనిస్తున్నాయి.కీలకమైన ఆగస్టు వర్షాలుభారత వ్యవసాయానికి రుతుపవనాలు ఎంతో కీలకం. దేశంలోని కోట్లాది మంది రైతులు వర్షాధార పంటలపై ఆధారపడుతుంటారు. జూన్, జూలైలో వర్షాల తీరును బట్టి పంటల సాగు ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో వచ్చే వర్షాలు పంటల ఎదుగుదలకు చాలా అవసరం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపించగా.. మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు నమోదవుతున్నాయి. ఈ అసమాన పరిస్థితులను సమతుల్యం చేయడంలో బంగాళాఖాతం నుంచి వచ్చే అల్పపీడనాలు కీలకంగా మారుతున్నాయి.రుతుపవనాలకు కొత్త ఊపుప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు పూర్తిగా బలహీనపడలేదని సూచిస్తున్నాయి. ఎల్ నినో ముప్పు ఉన్నప్పటికీ.. బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ, వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు వర్షాలకు బలాన్ని ఇస్తున్నాయి.ఆగస్టు రెండో భాగంలో తూర్పు, మధ్య, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మరింత చురుగ్గా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎల్ నినో ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది రాబోయే వారాల్లోని వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఆకాశంలో కనిపిస్తున్న మేఘాలు.. రుతుపవనాలకు మరోసారి ఆశలు రేకెత్తిస్తున్నాయి. -
జూలైలో ఎగుమతులు జూమ్!
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్–ఇంజినీరింగ్ గూడ్స్, సముద్ర ఉత్పత్తుల దన్నులతో జూలైలో భారత్ ఎగుమతులు భారీగా ఎగబాకాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 19.63% వృద్ధితో 44.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 జూన్ (3.12% అప్) తర్వాత ఎగుమతులు ఈ స్థాయిలో వృద్ధి చెందడం ఇదే తొలిసారి. మరోపక్క, దిగుమతులు కూడా పెరగడంతో వాణిజ్య లోటు 6 నెలల గరిష్టానికి చేరింది. 31.98 బిలియన్ డాలర్లను తాకింది. క్రూడాయిల్ అధిక దిగుమతుల ప్రభావంతో జూలైలో మొత్తం దిగుమతులు 17.52% ఎగసి 76.22 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలివీ.. → జూలైలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 72–95 డాలర్ల మధ్యలో కదలాడింది. 17.64 శాతం పెరుగుదలతో 18.31 బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంది. మొత్తం దిగుమతుల్లో ఇది 24 శాతం కావడం గమనార్హం. → పశ్చిమాసియా దేశాలకు కూడా జూలైలో ఎగుమతులు 8.62 శాతం పెరిగి 5.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. → పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 7 బిలియన్ డాలర్లకు (67.64 శాతం వృద్ధి), ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 6 బిలియన్ డాలర్లకు (57.4% అప్), ఇంజినీరింగ్ గూడ్స్ ఎగుమతులు 12.24 బిలియన్ డాలర్లకు (17.7 శాతం వృద్ధి) చేరాయి. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై కాలంలో ఎగుమతులు 17 శాతం జంప్ చేసి 173.78 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దిగుమతులు సైతం 19.27 శాతం ఎగసి 292.38 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ కాలంలో వాణిజ్యలోటు 118.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. → కాగా, జూలై నెలలో సరీ్వసుల ఎగుమతులు 35.89 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 18.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.పసిడి దిగుమతులపై సుంకాల ఎఫెక్ట్కస్టమ్స్ సుంకాల భారీ పెంపు ప్రభావంతో జూలైలో బంగారం, వెండి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ దిగుమతులు కేవలం 4.77% వృద్ధితో 4.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సిల్వర్ దిగుమతులు ఏకంగా 66.1% దిగజారి 171.68 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మే 13న ఈ రెండు విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను 6% నుంచి 15%కి పెంచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్–జూలై కాలంలో 15.17 బిలియన్ డాలర్ల (32.4% అప్) విలువైన పసిడి దిగుమతులు జరగ్గా... వెండి దిగుమతులు 50.8% ఎగసి 718.42 మిలియన్ డాలర్లను తాకాయి. అమెరికా, చైనాలకు రయ్... జూలైలో అమెరికాకు భారత్ నుంచి 9.02 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. గతేడాది జూలైతో పోలిస్తే 12.85% వృద్ధి చెందాయి. అమెరికా నుంచి మన దేశానికి దిగుమతులు సైతం 18.1% పెరిగి 5.5 బిలియన్ డాలర్లను తాకాయి. అమెరికా జూలై 24 నుంచి భారత్పై 10% అదనపు సుంకాలను విధించడం తెలిసిందే. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇక చైనాకు మన ఎగుమతులు 2.2 బిలియన్ డాలర్లకు (64.57% వృద్ధి) చేరాయి. దిగుమతులు 34.42% ఎగసి 14.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.. -
మనం ఫ్రెండ్స్ కాదు.. సొంత అక్కాచెల్లెళ్లం.. ఇప్పుడే ఇలా తెలిసింది..
భారత్లో పుట్టిన మీనా, మినాల్ చిన్న వయసులోనే వేర్వేరు డచ్ కుటుంబాలకు దత్తతగా వెళ్లారు. 1996లో దత్తత పిల్లల కోసం నిర్వహించిన ఒక కార్యక్రమంలో వారు తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో వారు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో నివసించేవారు. మొదటి పరిచయంతోనే ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. వారి రూపురేఖలు, స్వభావంలో ఉన్న పోలికలు చూసి స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత వారు స్నేహితులుగా మారి చిరునామాలు ఇచ్చిపుచ్చుకున్నారు.కొన్ని ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. దాదాపు 15 ఏళ్ల పాటు ఒకరి గురించి మరొకరికి సమాచారం లేకపోయింది. అనంతరం మీనా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకుంది. అలాగే, వేరే ప్రాంతంలో మినాల్ కూడా డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంది. ‘‘మైహెరిటేజ్’’ డీఎన్ఏ పరీక్ష ఫలితాల్లో మీనా, మినాల్ మధ్య 100% సరిపోలిక కనిపించింది. దీంతో వారు కేవలం స్నేహితులు మాత్రమే కాదని, నిజానికి రక్తసంబంధం ఉన్న అక్కాచెల్లెళ్లు అని బయటపడింది.ఈ విషయం తెలిసిన తర్వాత ఇద్దరూ నెదర్లాండ్స్లో మళ్లీ కలుసుకున్నారు. ఎంతో భావోద్వేగభరితంగా మాట్లాడుకున్నారు. చాలా ఏళ్లుగా తన హృదయంలో ఏదో వెలితి ఉన్నట్టుగా అనిపించేదని మీనా చెప్పింది. ఇప్పుడు తప్పిపోయిన పజిల్ ముక్క దొరికినట్టుగా ఉందని ఆమె పేర్కొంది. తన సోదరిని చూసి “నిన్ను చూస్తే ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది” అని చెప్పింది.ప్రస్తుతం 43 ఏళ్ల మీనా ముగ్గురు పిల్లల తల్లి. 44 ఏళ్ల మినాల్ ప్రేమాభిమానాలతో నిండిన డచ్ కుటుంబంలో తోబుట్టువుల మధ్య పెరిగింది. “మేము సోదరీమణులు కావడానికి ముందే స్నేహితులం. నిజానికి మేము ఎప్పటినుంచో అక్కాచెల్లెళ్లమే, కానీ ఆ విషయం మాకు తెలియదు” అని మినాల్ తెలిపింది.కాగా, మైహెరిటేజ్ అనేది కుటుంబ వంశవృక్షం, పూర్వీకుల వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ ఆన్లైన్ సంస్థ. ఈ సంస్థ నిర్వహించే డీఎన్ఏ పరీక్ష జన్యు సమాచారాన్ని విశ్లేషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తమ డేటాబేస్లో ఉన్న ఇతర వ్యక్తుల డీఎన్ఏతో పోల్చుతుంది. మీకు తెలియని బంధువులను గుర్తించే అవకాశం ఇస్తుంది. మీ కుటుంబ మూలాలు, పూర్వీకులు ఏ ప్రాంతాలకు చెందినవారో తెలుసుకునే సమాచారం అందిస్తుంది. -
ఏదో మెరుస్తున్నట్లు అనిపించింది.. అది రూ.50 లక్షల వజ్రం
భోపాల్: మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో సర్కోహా గ్రామానికి చెందిన గనిలో పనిచేస్తున్న ఏడుగురు కూలీలు 17.96 క్యారెట్ల వజ్రాన్ని గుర్తించారు. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఈ రత్నం విలువ రూ.50 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా. అయితే, కచ్చితమైన విలువ ప్రభుత్వ వేలం తర్వాతే తేలనుంది. ఈ కార్మికులు రోజువారీ కూలి పనుల ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఈ వజ్రం దొరకడంతో చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం లభించే అవకాశం వచ్చింది.వర్షం సమయంలో వజ్రం మెరుపులుఈ వజ్రం సర్కోహా గ్రామంలోని గనిలో దొరికింది. వర్షం పడుతున్న సమయంలో ఏడుగురు కార్మికులు గనిని పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో లీజుదారు అఖిలేశ్ పాల్ మట్టిలో ఏదో మెరుస్తున్న వస్తువును గమనించారు. దగ్గరగా పరిశీలించగా అది వజ్రమని గుర్తించారు. ఈ విషయం గ్రామంలో, సమీప ప్రాంతాల్లో వేగంగా వ్యాపించింది. దీంతో కార్మికులు, స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది.వేలం ద్వారా విలువ నిర్ణయంనిపుణులు, వజ్ర కార్యాలయం అంచనా ప్రకారం 17.96 క్యారెట్ల వజ్రం విలువ రూ.50 లక్షలకు పైగా ఉండొచ్చు. అమల్లో ఉన్న విధానం ప్రకారం, వేలం ద్వారా వచ్చే మొత్తంలో నుంచి ప్రభుత్వ రాయల్టీ మినహాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని గనిలో పనిచేస్తున్న ఏడుగురు కూలీలకు సమానంగా పంచుతారు.ముగ్గురు కార్మికులకు పెళ్లి ఆశసంతోష్, శర్మన్, అరుణ్ కుటుంబాలకు ఈ వజ్రం బాగా ఉపశమనం ఇచ్చేలా దొరికింది. 30 నుంచి 38 ఏళ్ల మధ్య వయసు ఉన్న వీరు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పటివరకు వివాహం చేసుకోలేకపోయారు. వజ్రం అమ్మకం ద్వారా తమకు వచ్చే వాటాతో కుటుంబ జీవితం ప్రారంభించే ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లగలమని వారు భావిస్తున్నారు. ఈ వజ్రం తమ ఉమ్మడి కృషి, కష్టానికి ఫలితమని ఏడుగురు కూలీలు తెలిపారు. గనిలో అందరూ కలిసి పనిచేయడంతో, రాయల్టీ మినహాయించిన తర్వాత మిగిలే మొత్తాన్ని సమానంగా పంచుకుంటారు.ఇళ్లు కట్టుకోవాలని..తమకు వచ్చే ఆదాయాన్ని ఎలా వినియోగించాలనే అంశంపై కార్మికులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇళ్ల స్థానంలో శాశ్వత గృహాలు నిర్మించుకోవడం, పిల్లలకు మెరుగైన విద్య అందించడం వారి ప్రధాన లక్ష్యాలు. 17.96 క్యారెట్ల వజ్రాన్ని పన్నాలోని ప్రభుత్వ వజ్ర కార్యాలయంలో భద్రత నడుమ జమ చేశారు. అవసరమైన చట్టపరమైన, పరిపాలనా ప్రక్రియలు పూర్తైన తర్వాత దానిని వేలం వేస్తారు. -
రూ.100 కోట్ల ఆస్తిని చాక్లెట్ ఇచ్చినట్లు ఇచ్చి పడేసిన వృద్ధుడు
హమీర్పూర్: హిమాచల్ ప్రదేశ్లో ఓ వృద్ధుడు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. వ్యక్తిగత ఆస్తిని సమాజ ప్రయోజనాలకు అంకితం చేస్తూ ఆయన చూపిన ఉదారత స్ఫూర్తిగా నిలిచింది. నాదౌన్ జిల్లాలో జోలాస్పాడ ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యుడు రాజేంద్ర కన్వర్ (77) తన పేరిట, తన భార్య పేరిట ఉన్న రూ.100 కోట్ల విలువైన ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చారు. 2021లో డాక్టర్ కన్వర్ తన చరాస్తులు, స్థిరాస్తులు అన్నింటినీ ప్రభుత్వానికి దానం చేశారు. ఇప్పుడు జీవించి ఉండగానే, స్వచ్ఛందంగా, పూర్తి స్పృహతో దానపత్రం రూపొందించి తన ఆస్తిని ప్రభుత్వానికి బదిలీ చేశారు.దానపత్రం అనంతరం సంబంధిత భూమి బదిలీ నమోదు రాష్ట్ర ప్రభుత్వం పేరిట, అంటే హమీర్పూర్ డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ వైద్య కళాశాల పేరిట జరిగింది. అంతేకాదు, తన మరణానంతరం శిక్షణ పొందుతున్న వైద్యుల అధ్యయనం కోసం తన శరీరాన్ని దానం చేయాలని కూడా కన్వర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి వైద్య కళాశాల శరీర నిర్మాణ శాస్త్ర విభాగానికి లిఖితపూర్వకంగా సమ్మతి ఇచ్చారు. గుర్తింపు కార్డు కూడా పొందారు.ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?డాక్టర్ రాజేంద్ర కన్వర్ దీనిపై మాట్లాడుతూ.. తాను, తన భార్య తమ ఆస్తిని సమాజ ప్రయోజనాల కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తమకు సంతానం లేదని తెలిపారు. దానం చేసిన ఆస్తిలో 2 అంతస్తుల బంగ్లా, సుమారు 5 కనాల్ భూమి, వందల ఎకరాల భూమి, కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, వాహనాలు, ఫర్నిచర్, బ్యాంకులో జమ చేసిన డబ్బు సహా ఇతర ఆస్తులు ఉన్నాయి.ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ మొత్తం ఆస్తి విలువ రూ.100 కోట్లకు పైగా ఉంది. ఈ ఆస్తిని అవసరమైన ప్రజల ఆరోగ్య సౌకర్యాల కోసం వినియోగించాలని కన్వర్ అన్నారు. భవిష్యత్తులో తన భార్య జ్ఞాపకార్థం సంస్థకు “కృష్ణ రాజేంద్ర” అనే పేరు పెట్టాలని కూడా చెప్పారు.భార్య ప్రిన్సిపల్ హోదా నుంచి పదవీ విరమణ డాక్టర్ కన్వర్ భార్య కృష్ణా కన్వర్ విద్యాశాఖలో 32 సంవత్సరాలు సేవలందించారు. 2011లో ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేశారు. 2020 డిసెంబర్ 6న ఆమె మరణించారు. అంతకు ముందే ఈ దంపతులు తమ ఆస్తిని సమాజ ప్రయోజనాల కోసం దానం చేయాలని నిర్ణయించారు. డాక్టర్ రాజేంద్ర కన్వర్ 1977 జనవరి 3న మెడికల్ ఆఫీసర్గా ఆరోగ్య శాఖలో చేరారు. 33 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగం అనంతరం 2010లో పదవీ విరమణ చేశారు. 77 ఏళ్ల వయసులో కూడా తన ఇంటి నుంచే తక్కువ ఫీజుతో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, కన్వర్ దంపతులు తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన వర్గాలు కూడా వారికి కృతజ్ఞతలు తెలిపాయి. డాక్టర్ కన్వర్ లాంటి వ్యక్తులు చాలా అరుదు. తన ఆస్తిని సమాజ వినియోగానికి ఇవ్వాలనే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం సమాజానికి స్ఫూర్తిదాయకం అని నాదౌన్ ఎస్డీఎం నిశాంత్ శర్మ వ్యాఖ్యానించారు. -
బుడ్జోడి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే
-
ఎర్రకోట ఘటన: యూఎన్ నివేదికలో షాకింగ్ విషయాలు
ఎర్రకోట బాంబు పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి వెనుక అల్ఖైదా అనుబంధ సంస్థ ప్రమేయం ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ఓ నివేదిక విడుదల చేసింది. అంతేకాదు.. దక్షిణాసియాలో ఉగ్రవాద నెట్వర్క్లు విస్తరిస్తున్నాయన్న ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని చెబుతూనే.. పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది.2025 నవంబర్ 10 సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (రెడ్ఫోర్ట్) సమీపంలో లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ దాడి అల్ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్కాంటినెంట్ (AQIS) పనేనని ఐరాస భద్రతా మండలి పర్యవేక్షణ బృందం తెలిపింది.గతంలో పెద్ద స్థాయిలో కార్యకలాపాలు సాగించిన ఉగ్ర సంస్థలు ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయని యూఎన్ వెల్లడించింది. అల్ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్కాంటినెంట్ కూడా చిన్న చిన్న రహస్య సెల్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోందని.. లాజిస్టిక్స్, ఆర్థిక నెట్వర్క్లను బలోపేతం చేసుకుంటోందని.. అక్కడి నుంచి ాడులు జరుపుతోందని నివేదిక వెల్లడించింది. భద్రతా సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు వికేంద్రీకృత నెట్వర్క్లను ఉగ్ర సంస్థలు ఉపయోగిస్తున్నాయని హెచ్చరించింది.కొనసా..గుతున్న దర్యాప్తుఎర్రకోట పేలుడు ఘటనపై భారత దర్యాప్తు సంస్థలు లోతైన దర్యాప్తు జరుపుతున్నాయి. పలువురిని అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA).. పేలుడు వెనుక ఉన్న కుట్ర, నిధుల మార్గాలు, ఉగ్ర నెట్వర్క్లపై దృష్టి సారించింది. ఈ మధ్యలో మరికొన్ని కుట్రలు వెలుగులోకి రావడం గమనార్హం. అయితే రెడ్ఫోర్ట్ పేలుడు వ్యవహారంలో ఉగ్ర నెట్వర్క్ల పాత్రపై భారత్ తీవ్రంగా స్పందించింది. సరిహద్దు దాటి పనిచేస్తున్న ఉగ్ర సంస్థలపై అంతర్జాతీయ స్థాయిలో కఠిన చర్యలు అవసరమని భారత్ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. మరోవైపు ఈ తరహా ఆరోపణలపై పాకిస్థాన్ సాధారణంగా తనపై వచ్చే ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. ఉగ్రవాదానికి తాము మద్దతు ఇవ్వడం లేదని ఇస్లామాబాద్ పేర్కొంటోంది.బంగ్లాదేశ్పై కన్ను?అల్ఖైదా ఐఎస్(AQIS) తన కార్యకలాపాలను విస్తరించేందుకు బంగ్లాదేశ్ను వేదికగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని యూఎన్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాసియాలో కొత్త సెల్స్ను ఏర్పాటు చేసి ప్రాంతీయ స్థాయిలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోందని పేర్కొంది.పాకిస్థాన్–అఫ్గానిస్థాన్ ఉద్రిక్తతల మధ్య...పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్ర దాడులపై కూడా యూఎన్ నివేదిక ప్రస్తావించింది. తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) దాడులు పెరగడం, వాటికి ప్రతిగా పాకిస్థాన్ చర్యలు తీసుకోవడం వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయని తెలిపింది. అల్ఖైదా అనుబంధ గ్రూపులు పాకిస్థాన్లోని కొన్ని దాడులతో సంబంధం కలిగి ఉన్నాయని కూడా నివేదిక పేర్కొంది.ఉగ్రవాదుల చేతుల్లో ఏఐ ఆయుధం?ఉగ్ర సంస్థలు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాయని యూఎన్ హెచ్చరించింది. బాంబుల తయారీ సమాచారం, లక్ష్యాల ఎంపిక వంటి అంశాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ (ISIL-K) కూడా ఏఐ సాయంతో ప్రచార కంటెంట్ను పలు భాషల్లో వేగంగా వ్యాప్తి చేస్తోందని వెల్లడించింది.మారుతున్న ఉగ్ర వ్యూహాలు.. పెరుగుతున్న ముప్పుఉగ్ర సంస్థలు కేవలం ఆయుధాలతో కాకుండా ఫైనాన్స్, డిజిటల్ ప్రచారం, చిన్న సెల్స్, కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ తమ నెట్వర్క్లను బలోపేతం చేసుకుంటున్నాయని యూఎన్ పేర్కొంది. రెడ్ఫోర్ట్ పేలుడు ఘటనను AQISతో అనుసంధానించడం భారత్కు అత్యంత కీలక పరిణామంగా మారింది. దక్షిణాసియాలో అల్ఖైదా అనుబంధ సంస్థలు మళ్లీ పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఈ నివేదిక కొత్త హెచ్చరికలు జారీ చేసింది. -
ఐరోపాలో ‘చీకట్లు’ కమ్ముకున్న వేళ..
న్యూఢిల్లీ: ఆగస్టు 12(బుధవారం) నాడు ఐరోపా ఖండంలో అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు స్పెయిన్, గ్రీన్లాండ్, ఐస్లాండ్ తదితర ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు ఆకాశం వైపు ఆసక్తిగా చూశారు. 1999 ఆగస్టు 11 తర్వాత ఐరోపా ప్రధాన భూభాగంలో కనిపించిన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే కావడం విశేషం. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపైకి రావడం వల్ల, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకోవడంతో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.స్పెయిన్లోని పలు నగరాల్లో ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని కళ్లారా చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఆకాశం నిర్మలంగా ఉండటంతో, పగటిపూట కాసేపు చీకటి అలముకున్న దృశ్యాన్ని చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇక స్విట్జర్లాండ్లో ఖగోళ ప్రేమికులు గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. బ్రిటన్లో సూర్యుడిలో 90 శాతానికి పైగా భాగాన్ని చంద్రుడు కమ్మేయడంతో, అక్కడ వాతావరణం మరింత నాటకీయంగా మారింది.లండన్లోని ప్రసిద్ధ బిగ్ బెన్ టవర్ వద్ద ఈ అద్భుత దృశ్యాన్ని పలువురు ఫొటోల రూపంలో బంధించారు. హంగేరీలోనూ ప్రజలు ప్రత్యేక అబ్జర్వేషన్ టవర్ల ద్వారా ఈ గ్రహణాన్ని తిలకించారు. అయితే, భారతీయులకు మాత్రం ఈ అరుదైన దృశ్యం కనిపించలేదు. ఈ గ్రహణం సంభవించిన సమయంలో (భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 2:15 గంటల వరకు) భారతదేశంలో రాత్రి సమయం కావడంతో, సూర్యాస్తమయం కారణంగా భారత ఉపఖండంలో ఎక్కడా గ్రహణం కనిపించలేదు. -
చదువు అమెరికాలో.. ఉద్యోగం స్వదేశంలో
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ద్వారా ఒకట్రెండేళ్లు పని చేయాలి. ఆపై హెచ్–1బీ వీసా సాధించి అక్కడే స్థిరపడాలి. ఇదీ ఓ సగటు భారతీయ విద్యార్థి ఆలోచన. అంతర్జాతీయ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన కార్మికులపై గతంలో లేనంతగా అమెరికా ప్రభుత్వం ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ గ్లోబల్ మొబిలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం విదేశాల్లో చదువుకోవాలని యోచిస్తున్న భారతీయ విద్యార్థుల్లో 81 శాతం మంది చదువు పూర్తి కాగానే స్వదేశానికి వచ్చేయాలని భావిస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం ప్రతీ ఐదుగురు భారతీయ విద్యార్థుల్లో నలుగురు తాము విదేశీ విద్యను కేవలం అంతర్జాతీయ అనుభవం, నైపుణ్యాల పెంపుదల, విదేశీ డిగ్రీని పొందే మార్గంగానే చూస్తున్నారు. అక్కడ శాశ్వతంగా స్థిరపడటానికి కాదని స్పష్టం చేశారు. కేవలం 15 శాతం మంది మాత్రమే చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుకుతామని చెప్పారు. అయితే వారు భారత్లోనా లేదా విదేశాల్లోనా అనేది స్పష్టం చేయలేదు. నాలుగేళ్ల పరిమితి 2026 జూలైలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దశాబ్దాల నాటి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేస్తూ అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో ఉండే సమయాన్ని నాలుగేళ్లకే పరిమితం చేసింది. కోర్సులు మారడం, విద్యాసంస్థల బదిలీలపై కూడా ఆంక్షలు విధించింది. విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టి స్వదేశానికి తిరిగి వెళ్లేలా చూడటమే దీని ఉద్దేశం.2026 మార్చిలో వన్–స్ట్రైక్ విధానం కింద రెండో విడత సెవిస్ రికార్డుల రద్దు జరిగింది. రికార్డు రద్దయితే విద్యార్థి చట్టపరమైన హోదా వెంటనే ముగుస్తుంది. చదువు తర్వాత పని చేసుకోవడానికి వీలు కల్పించే ఓపీటీ కార్యక్రమాన్ని కూడా రద్దు లేదా పరిమితం చేయడానికి అధికారులు యత్నిస్తున్నారు. 2025 జూన్, జూలైలో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్–1 వీసాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 69 శాతం తగ్గి 41,336 నుండి 12,776కి పడిపోయాయి. అలాగే 2026లో అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 20 శాతం తగ్గుతుందని అంచనా. ప్రస్తుతం అమెరికాలోచదువుతున్న భారతీయ విద్యార్థులు 3,72,000నిబంధనలతో సవాళ్లుఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో పదవీకాలం ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులను ప్రభావితం చేసే అనేక కఠిన చర్యలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2025 మార్చిలో వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సెవిస్) రికార్డులను అకస్మాత్తుగా రద్దు చేశారు. ఇందుకు చిన్నపాటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, గత రాజకీయ కార్యకలాపాలు వంటి అస్పష్టమైన కారణాలను చూపారు.2025 జనవరి నాటికి స్టేట్ డిపార్ట్మెంట్ 8వేల కంటే ఎక్కువ విద్యార్థి వీసాలను రద్దు చేసింది. 2025లో 4,730 సెవిస్ రికార్డులు రద్దయ్యాయి. కనీసం 6వేలు ఎఫ్, ఎమ్, జే వీసాలను వెనక్కి తీసుకున్నారు. 2025 మే 27న స్టేట్ డిపార్ట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎఫ్, ఎమ్, జే దరఖాస్తుదారుల కోసం కొత్త వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను అకస్మాత్తుగా నిలిపివేసింది. ఆంక్షల మీదఆంక్షలు2025 జూన్లో ఇరాన్, లిబియా, సోమాలియా, అఫ్గానిస్తాన్, పాలస్తీనాతోపాటు 39 దేశాల పౌరులకు వీసాల జారీని నిలిపివేశారు. 2025 సెప్టెంబర్లో కొత్త హెచ్–1బీ పిటిషన్లపై లక్ష డాలర్ల రుసుము విధించారు. దీనిని వ్యతిరేకిస్తూ 20 రాష్ట్రాలు కోర్టుకు వెళ్లగా, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఈ విధానాన్ని పాక్షికంగా మార్చింది. ఒక విశ్వవిద్యాలయం మొత్తం విద్యార్థుల జనాభాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను 15 శాతానికి పరిమితం చేస్తూ కొత్త నిబంధన తెచ్చారు. ఇందులో ఏ ఒక్క దేశం వాటా కూడా 5 శాతం మించకూడదు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఈ పరిమితి వారి ప్రవేశాన్ని మరింత కష్టతరం చేస్తుంది. -
'కప్' కథాకమామీషు
హాకీ పురుషుల ప్రపంచకప్లో ఓవరాల్గా 6 జట్లు ట్రోఫీని అందుకున్నాయి. వరల్డ్ కప్లో విజేతకు అందించే ట్రోఫీకి ఘనమైన చరిత్రే ఉంది. ఈ ట్రోఫీని పాకిస్తాన్కు చెందిన బషీర్ మూజిద్ డిజైన్ చేయగా పాకిస్తాన్ ఆర్మీ దీనిని రూపొందించింది. దీనికి ఒక బలమైన కారణం ఉంది. హాకీలో ప్రపంచకప్ నిర్వహించాలని ముందుగా ప్రతిపాదన చేసిన వ్యక్తి పాకిస్తాన్ ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ కాగా... తొలి వరల్డ్ కప్ 1971లో పాక్ వేదికగానే జరగాల్సింది. అయితే భారత్–పాక్ మధ్య యుద్ధ నేపథ్యం, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ అభ్యంతరం చెప్పింది. దాంతో చివరి నిమిషంలో వేదికను స్పెయిన్కు మార్చారు. అయినా సరే పాక్ రూపొందించిన డిజైన్తో మాత్రం ట్రోఫీ సిద్ధం కావడంతో దానిని పాక్ రాయబారి మసూద్ అధికారికంగా ప్రపంచ హాకీ సమాఖ్య అధ్యక్షుడు రెనే ఫ్రాంక్కు అందజేశారు. అప్పటి నుంచి డిజైన్లో ఎలాంటి మార్పు లేకుండా ట్రోఫీ అలాగే కొనసాగుతోంది. 2018 వరల్డ్ కప్కు ముందు మాత్రం లండన్కు చెందిన బంగారు, వెండి ఆభరణాల తయారీ సంస్థ థామస్ లైట్ ట్రోఫీకి ప్రపంచ పటంలోని దేశాలు, ఖండాలు, మహా సముద్రాలు స్పష్టంగా కనిపించేలా మెరుగులు దిద్ది దానికి కొత్త తరహాలో మెరుపుదనం తెచ్చారు. – సాక్షి క్రీడావిభాగం » పూల డిజైన్లతో చెక్కిన చిన్న సైజు వెండి పళ్లెంపై ప్రపంచ పటం (గ్లోబ్) కనిపిస్తుంది. దీనిని బంగారం, వెండితో తాపడం చేశారు. గ్లోబ్పై హాకీ స్టిక్ నమూనాను నిలపగా, ఏనుగు దంతాలతో డిజైనింగ్ చేసిన అడుగు భాగంపై ఈ మొత్తాన్ని ఉంచారు. » అడుగు భాగాన్ని పక్కన పెడితే... అసలు ట్రోఫీ 4.75 అంగుళాల ఎత్తు ఉంటుంది. బేస్తో కలుపుకుంటే ఇది 25.59 అంగుళాలు ఉంటుంది. » ట్రోఫీ మొత్తం బరువు 11,560 గ్రామ్లు. ఇందులో 895 గ్రామ్ల బంగారం, 6,815 గ్రామ్ల వెండి, 350 గ్రామ్లు ఏనుగు దంతపు మెటీరియల్, 3,500 గ్రామ్ల టేకు ఉన్నాయి. » ప్రపంచ హాకీలో యూరోప్ జట్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు పురుషుల, మహిళల ప్రపంచకప్ టోర్నీ 15 సార్లు జరిగింది. పురుషుల విభాగంలో పాకిస్తాన్ జట్టు అత్యధికంగా నాలుగుసార్లు విజేతగా నిలిచింది. నెదర్లాండ్స్, జర్మనీ, ఆ్రస్టేలియా జట్లు మూడుసార్లు చొప్పున టైటిల్ అందుకోగా... భారత్, బెల్జియం జట్లు ఒక్కోసారి విన్నర్స్ ట్రోఫీని ముద్దాడాయి. జర్మనీ జట్టు ఈనెల 15 నుంచి జరగనున్న 16వ ప్రపంచకప్లో జర్మనీ జట్టు డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. మరోవైపు మహిళల ప్రపంచకప్లో నెదర్లాండ్స్ జట్టుకు ఎదురునిలిచే జట్లు కనిపించడంలేదు. 15 సార్లు ప్రపంచకప్ జరగ్గా... నెదర్లాండ్స్ జట్టు ఏకంగా తొమ్మిదిసార్లు విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా, ఆ్రస్టేలియా, జర్మనీ రెండుసార్లు చొప్పున టైటిల్ అందుకున్నాయి. నెదర్లాండ్స్ జట్టు మహిళల హాకీ వరల్డ్ కప్ ట్రోఫీ డిజైనింగ్కు పెద్దగా ప్రత్యేక చరిత్ర లేదు. కానీ 1974లో నెదర్లాండ్స్ అందుకున్న తొలి ట్రోఫీ ‘13 సెంటీమీటర్ల’ఎత్తుతోనే ఉంది. దాంతో ఈ ట్రోఫీని సరదాగా ‘సలాడ్ బౌల్’ అని అందరూ పిలవడం మొదలు పెట్టారు! ఇప్పుడు మాత్రంభారీ సైజులో ఉన్న ట్రోఫీనే విజేతకు అందజేస్తున్నారు. మహిళల హాకీ వరల్డ్ కప్ ట్రోఫీ డిజైనింగ్కు పెద్దగా ప్రత్యేక చరిత్ర లేదు. కానీ 1974లో నెదర్లాండ్స్ అందుకున్న తొలి ట్రోఫీ ‘13 సెంటీమీటర్ల’ ఎత్తుతోనే ఉంది. దాంతో ఈ ట్రోఫీని సరదాగా ‘సలాడ్ బౌల్’ అని అందరూ పిలవడం మొదలు పెట్టారు! ఇప్పుడు మాత్రంభారీ సైజులో ఉన్న ట్రోఫీనే విజేతకు అందజేస్తున్నారు. -
మన వ్యవసాయ విధానాలకు పరీక్ష
ఎల్ నినో కేవలం ఏదో ఒక పరిణామం కాదు. అది భూగోళం మొత్తంమీద వాతావరణ మార్పు వైపరీత్యానికి సంకేతం. పరస్పరాధారిత జీవావరణ వ్యవస్థలకు, వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు ఎదురవుతున్న సవాళ్ళను గుర్తు చేస్తున్న ప్రమాదఘంటిక. ఈ రకమైన ఉపద్రవం తరచు తలెత్తుతున్నా దాని దీర్ఘకాలిక పర్యవసానాలను ఎదుర్కోవడంలో భారతదేశ సన్నద్ధత అసమతుల్యంగానే ఉంది. ఎల్ నినో ప్రభావాలను రైతులకు ఎరుక పరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కృషి చేస్తున్న మాట వాస్తవమే. అయితే, వ్యవసాయ ఉత్పత్తి చుట్టూ అలముకుంటున్న అస్థిరత, పంటల తీరుతెన్నులపై పెరిగిపోతున్న ఒత్తిడిపై మరింతగా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అనిశ్చితిలోనూ స్థిరమైన పనితీరుఈ నేపథ్యంలో, వ్యవసాయ స్థితిస్థాపకత విధానపరంగా ఒక ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకోవాలి. పంట నష్టాలను తగ్గించుకోవడం మాత్రమే స్థితిస్థాపకత అనిపించుకోదు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ, సాపేక్షంగా చూస్తే స్థిరమైన పనితీరు కనబరచగల వ్యవసాయ పద్ధతులను రూపొందించుకోవాలి. దీర్ఘకాలిక స్థితిస్థాపక శక్తిని సమకూర్చుకునేందుకు మౌలిక వసతులు, టెక్నాలజీ, జల నిర్వహణ, ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగల వంగడాలను అభివృద్ధి చేయడం, పరిశోధనలపై పెట్టుబడులు అవసరమవుతాయి. వాతావరణ అశనిపాతాల పట్ల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తు న్నాయన్నది ఒక పార్శ్వం మాత్రమే. అటువంటి షాక్లు ఎదురవ డానికి ముందే ప్రభుత్వ సంస్థలు రైతులను ఎంత పకడ్బందీగా సన్నద్ధపరుస్తున్నాయన్నది కీలక ప్రశ్న. పంట మార్పిడిలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాల ప్రయత్నాలు ఎంతవరకు సఫల మవుతున్నాయి? ప్రత్యామ్నాయ పంటలు, వాటిని నాటవలసిన కాల పరిధులు, రిస్క్–మేనేజ్మెంట్ వ్యూహాల గురించి రైతులకు సలహాలిచ్చేందుకు తగినంత సామగ్రి దిగువ స్థాయి వ్యవసాయ వ్యవస్థల వద్ద ఉంటోందా? పంటలకు నష్టాలు వాటిల్లినప్పుడు పరిహారం, బీమా, ఇతర సహాయక యంత్రాంగాలు దెబ్బతిన్న రైతుల ముంగిళ్ళకు ఎంత వేగంగా చేరుకోగలుగుతున్నాయి? కేవలం అధిక దిగుబడులను సాధించడంపైనే కాకుండా, వాస్తవిక పరిస్థితులలో స్థిరమైన పనితీరును నిలబెట్టుకోగలగడంపైనే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దేశంలో కర్షకులు సుమారుగా 11.88 కోట్ల మంది ఉన్నారని, వ్యవసాయ కూలీలు 14.43 కోట్ల మేరకు ఉంటారని 2011 నాటి జనాభా లెక్కల వివరాలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ వైపరీత్యాల ప్రభావం పంట పొలాలకే పరిమితం కాదనీ, అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆహార భద్రత, విస్తృత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనీ గుర్తుంచుకోవాలి. సాంకేతిక సాయంభారత వ్యవసాయ రంగం ప్రధానంగా రుతువుల మార్పులపై ఆధారపడి నడుస్తోంది. వాతావరణానికి సంబంధించి తగినంత సమాచారం లేకుండా నారుపోయడం లేదా ఇతర సేద్య కార్యకలా పాలు చేపట్టడంలో ఇబ్బందులున్నాయి. తీరా అవి చేపట్టాక వర్ష పాత ధోరణుల్లో మార్పులొస్తే, రైతులు ఆర్థికంగా నష్టపోతారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పైకి అంతగా కనిపించని దుర్భ లత్వాలలో ఇది ఒకటి. పంటలు దెబ్బతిన్నప్పుడు వచ్చే నష్టాలే కాకుండా, అనువుకాని సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ఈ సమస్య ఒక పూర్తి స్థాయి సంక్షోభంగా పరిణమించకముందే, ఆ ముప్పు ఏర్పడగల అవకాశాన్ని గుర్తించడంలో ప్రవర్ధమాన టెక్నాలజీలు ముఖ్యంగా ఉపగ్రహ ఆధారిత భూ పరిశీలనలు తోడ్పడుతున్నాయి. దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు తరిగిపోతున్న వృక్ష సంపద ఆరోగ్యాన్ని గుర్తించడంలో, విస్తారమైన వ్యావసాయిక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గుదల వంటివాటిని గుర్తించడంలో ఉపగ్రహ పరిశీ లనలు సహాయపడతాయి. కనుక, ఎల్ నినో విసురుతున్న సవాల్ను ఎదురు దెబ్బగా చూడనవసరం లేదు. భారతీయ వ్యవసాయ వ్యవస్థలను పటిష్టపరచుకునేందుకు లభించిన ఒక అవకాశంగా దీన్ని పరిగణించవచ్చు. అనిశ్చిత పరిస్థితుల్లో ఏ పంటలు పండించగలుగుతున్నాం, దానికి ఏ విధమైన సేద్యపు విధానాలు అనుసరిస్తున్నాం, సంస్థా పరమైన స్పందనల మెరుగుదల వంటి అంశాలకు సంబంధించి విలువైన పరిజ్ఞానాన్ని ప్రతి క్లిష్టమైన వ్యవసాయ సీజన్ నుంచి గ్రహించవచ్చు. వాతావరణంలో మార్పు గురించిన సాధారణ హెచ్చరికలు చేస్తే రైతులకు సరిపోదు. పరిస్థితిని బట్టి వివిధ పంటలు వేసుకోగల వెసులుబాటు కల్పించాలి. ప్రత్యామ్నాయ ఉపకరణాలు, వంగడాలను అందుబాటులోకి తేవాలి. సమర్థ పంట బీమా అవసరం. అస్థిర పరిస్థితులను తట్టుకోగలిగిన విధంగా సంస్థాపరమైన మద్దతును కూడా అందించాలి.ప్రపంచమంతటా పెను ప్రభావమే!ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిపైన కూడా వాతావరణ వ్యత్యాస ప్రభావం పెరుగుతూ వస్తోందని 2026 ఆగస్టు 6న ప్రచురించిన గ్లోబల్ క్రాప్ మానిటర్ నివేదిక వెల్లడించింది. అది నాలుగు ప్రధాన (గోదుమ, మొక్కజొన్న, వరి, సోయాబీన్) పంటల స్థితిగతులను మదింపు చేసింది. సాపేక్షంగా చూస్తే గోదుమకు సానుకూల పరిస్థితులున్నాయని ఆ నివేదిక తెలిపింది. బియ్యానికి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. వరి రైతులు వాతావరణ ప్రతికూలత, నీటి సౌలభ్యం తక్కువగా ఉండటం, పంటకు చీడపీడలు సోకడంతో పాటు, దిగుబడులకు సంబంధించి ఇతర ప్రతిబంధకాలను కూడా ఎదుర్కొంటున్నారు. భారత్ విషయంలో దీని ప్రధాన సందేశం ముఖ్యమైంది. వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేని పరిస్థితులు పెరుగు తున్నాయి. వాటిని తట్టుకుని నిలబడగలిగిన విధంగా పంటలు రూపొందాలి. వ్యవసాయ విధానాలు వేగంగా మారిపోతున్న రిస్కు లకు తగ్గట్లుగా స్పందించగలిగిన సామర్థ్యం ఉన్నవై ఉండాలి. మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు కాదు. అది మెరుగైన సమాచారంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలిగినదిగా ఉండాలి. క్షేత్ర స్థాయిలో మారుతున్న పరిస్థితులను అవగాహన చేసుకుని, ఎదురుకాగల ముప్పులను ఊహించగలిగినప్పుడే ప్రభుత్వాలు స్థితిస్థాపక శక్తి కలిగిన వ్యవసాయ వ్యవస్థలను నిర్మించగలుగుతాయి. అప్పుడే ఎల్ నినోను అడపాదడపా తలెత్తే వాతావరణ భూతంగా కాక దేశ వ్యవసాయ పాలనకు ఒక పరీక్షగా చూడటం సాధ్యపడుతుంది.– డా‘‘ సుంకరి సత్యం ‘ అసిస్టెంట్ ప్రొఫెసర్;– కంచర్ల శ్రీదేవి ‘ రిసెర్చ్ స్కాలర్; కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, హైదరాబాద్ -
నేడు సంపూర్ణ సూర్యగ్రహం.. 2 నిమిషాలు పట్టపగలే చీకటి!
ఆకాశంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చి పూర్తిగా కప్పివేయడంతో బుధవారం (ఆగస్టు 12) సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళే చీకట్లు కమ్ముకోగా.. సూర్యుడి బాహ్య వాతావరణమైన ‘కరోనా’ స్పష్టంగా కనిపించనుంది. అయితే ఆకాశంలో అద్భుతం జరుగుతున్నా.. భారత్ మాత్రం ఈసారి సూర్యుడి ‘మాయ’ను ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని కోల్పోనుంది.భారత కాలమానం ప్రకారం.. పాక్షిక గ్రహణం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. రాత్రి 9.15 గంటల ప్రాంతంలో సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. రాత్రి 11.16–11.17 గంటల సమయంలో గరిష్ఠ దశకు చేరుకుంది. ఆగస్టు 13 తెల్లవారుజామున సంపూర్ణ దశ ముగుస్తుంది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గ్రహణం పూర్తిగా వీడిపోతుంది. జ్యోతిష విశ్వాసాలు.. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం?జ్యోతిష సంప్రదాయాల ప్రకారం.. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కర్కాటక రాశిలోని ఆశ్లేషా నక్షత్రంలో కేతుగ్రస్త సూర్యగ్రహణంగా సంభవిస్తుందని భావిస్తారు. గ్రహణం కనిపించే ప్రాంతాల్లో నివసించే ఆశ్లేషా నక్షత్రజాతకులు, కర్కాటక రాశివారు గ్రహణ శాంతి, జపం, దానధర్మాలు చేయడం శ్రేయస్కరమని జ్యోతిష పండితులు సూచిస్తారు. అయితే ఈ గ్రహణం భారత్లో కనిపించదు కాబట్టి.. ఇక్కడ నివసించే వారికి ప్రత్యేక గ్రహణ శాంతులు అవసరం లేదని సంప్రదాయాలు చెబుతున్నాయి. అయితే..జ్యోతిష విశ్వాసాల ప్రకారం కర్కాటక, సింహ, మేష, ధనుస్సు రాశులపై ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉండొచ్చని, వృషభ, కన్య, తుల, కుంభ రాశులకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెబుతారు. మిగిలిన రాశులైన మిథున, వృశ్చిక, మకర, మీన రాశులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని పేర్కొంటారు. ఇవి సాధారణ గోచార ఫలితాలు మాత్రమేనని, వ్యక్తిగత ఫలితాలు జన్మకుండలి ఆధారంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో గాయత్రీ మంత్రం, ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం, మహామృత్యుంజయ మంత్ర జపం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.2034 వరకు భారత్కు ఎదురుచూపులే!ఆగస్టు 12న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో జరుగుతుంది. గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారత్లో సూర్యుడు అస్తమించి ఉంటాడు. దీంతో దేశంలోని ఏ ప్రాంతం నుంచీ ఈ గ్రహణాన్ని చూడలేం. భారత్ నుంచి తదుపరి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడాలంటే ఇంకా కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సిందే. 2034 మార్చి 20న భారత్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే అవకాశం ఉంది. అంతవరకు భారతీయ ఖగోళ అభిమానులు ఈసారి గ్రహణాన్ని అంతరిక్ష సంస్థల ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మాత్రమే వీక్షించాల్సి ఉంటుంది. అంటే 27 ఏళ్ల తర్వాత యూరప్కు అరుదైన అవకాశంఈ సంపూర్ణ సూర్యగ్రహణం యూరప్కు ప్రత్యేకమైనది. 1999 తర్వాత యూరప్ ప్రధాన భూభాగంలో కనిపించే తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. సుమారు 98 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పాక్షిక గ్రహణాన్ని చూడగల అవకాశం ఉంది. దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు సంపూర్ణ గ్రహణ మార్గంలో ఉండి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.ఎక్కడ కనిపించనుంది?సంపూర్ణ గ్రహణ మార్గం ఉత్తర ప్రాంతాల నుంచి ప్రారంభమై యూరప్ వైపు సాగుతుంది. ప్రధానంగా.. గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్లోని కొన్ని ప్రాంతాలు సంపూర్ణ గ్రహణాన్ని వీక్షించే అవకాశం పొందనున్నాయి. స్పెయిన్లోని లియోన్, వల్లడోలిడ్, జరగోజా, టెరుయెల్, వాలెన్సియా వంటి నగరాలు గ్రహణాన్ని చూసేందుకు అత్యుత్తమ ప్రాంతాలుగా నిలవనున్నాయి. మాడ్రిడ్, బార్సిలోనా నగరాల్లో సూర్యుడిలో 99 శాతానికి పైగా భాగం కప్పుకున్నా.. సంపూర్ణ గ్రహణం మాత్రం కనిపించదు.రెండు నిమిషాలకు పైగా పగలే చీకటిసంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడి ముఖాన్ని పూర్తిగా కప్పివేస్తాడు. ఆ సమయంలో సూర్యకాంతి తగ్గిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పగటి వేళే చీకటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ దశ గరిష్ఠంగా 2 నిమిషాల 18 సెకన్ల వరకు కొనసాగనుంది.ఈ సమయంలో..సూర్యుడి కరోనా స్పష్టంగా కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయి. ప్రకాశవంతమైన నక్షత్రాలు, గ్రహాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఖగోళ శాస్త్రవేత్తలకు ఇది పరిశోధనలకు కీలక సమయం.సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది?చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యకు వచ్చినప్పుడు సూర్యకాంతిని అడ్డుకుంటాడు. చంద్రుడి నీడ భూమిపై పడిన ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పితే దాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. కొంత భాగం మాత్రమే కప్పితే అది పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది.గ్రహణాన్ని చూసేవారు జాగ్రత్త!గ్రహణాన్ని వీక్షించే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. ✅ ప్రత్యేక సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ మాత్రమే ఉపయోగించాలి.❌ సాధారణ సన్గ్లాసెస్తో సూర్యుడిని చూడకూడదు.❌ టెలిస్కోప్, బైనాక్యులర్, కెమెరా, సెల్ఫోన్ కెమెరాలతో నేరుగా చూడటం ప్రమాదకరం. సరైన రక్షణ లేకుండా గ్రహణ సమయంలో సూర్యుడిని చూడటం కంటి చూపుకు శాశ్వత నష్టం కలిగించే ప్రమాదం ఉంది. -
జాబిల్లిపై స్థావరం కడదాం రండి
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్, అమెరికాల మధ్య సహకారంలో నూతన అధ్యాయం మొదలైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) భూమి∙సహజ ఉపగ్రహమైన చందమామపై స్థావరాన్ని నిర్మించడంలో పాలుపంచుకోవాల్సిందిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ఆహ్వానం పలికింది. జాబిల్లి దక్షిణ ధ్రువం సమీపంలో ‘‘మూన్ బేస్ మిషన్’’ పేరుతో వ్యోమగాముల నివాస, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్షాన్ని పరిశోధించేందుకు, సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు సైతం ఈ కేంద్రం ఉపయోగపడుతుందని నాసా భావిస్తోంది. అంతరిక్ష రంగంలో పరస్పరం సహకరించేందుకు ఉన్న అవకాశాలపై ఇరుదేశాల సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూపులు గత వారం బెంగళూరులో సమావేశమై చర్చలు జరిపాయి. ‘‘మూన్ బేస్ ప్రోగ్రామ్లో పాల్గొనాల్సిందిగా ఇస్రోను నాసా ఆహ్వానించింది. ఆర్టిమిస్ ఒప్పందం ఆధారంగా ఇరు దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములవుతాయి’’ అని ఈ జాయింట్ వర్కింగ్ గ్రూపు తాజాగా ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది. -
గుర్నూర్... గేమ్ చేంజర్!
కోల్కతా: స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో... శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత కొత్త పేసర్ గుర్నూర్ బ్రార్ కీలకం అవుతాడని శ్రీలంక మాజీ ఆల్రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డాడు. భారత్, శ్రీలంక మధ్య ఈ నెల 15 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దానికి ముందు జరిగిన ప్రాకీస్ట్ మ్యాచ్లో గుర్నూర్ తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బ్రార్... బుమ్రా అందుబాటులో లేకపోవడంతో లంకతో టెస్టు సిరీస్లో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లతో టెస్టు సిరీస్లు ఓడిన టీమిండియా... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు చేరాలంటే లంకపై సత్తా చాటాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో మహరూఫ్ మాట్లాడుతూ... ‘బుమ్రా అద్భుతమైన బౌలర్. అతడు బంతిని రివర్స్ స్వింగ్ చేయగలడు. ముఖ్యంగా పాత బంతితో అయితే అతడు మరింత ప్రమాదకరం. కానీ గాయం కారణంగా అతడు ఈ సిరీస్కు అందుబాటులో లేడు. అది భారత జట్టుకు అతి పెద్ద లోటు. మొహమ్మద్ సిరాజ్ మంచి బౌలరే... కానీ బుమ్రాతో పోల్చుకుంటే మాత్రం ఇద్దరి మధ్య చాలా అంతరం ఉంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు కూడా గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో గుర్నూర్ బ్రార్కు తుది జట్టులో చోటు దక్కుతుంది అనుకుంటున్నా. ఈ సిరీస్లో బ్రార్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ కావొచ్చు. అతడి బౌలింగ్లో మంచి వేగంతో పాటు అదనపు బౌన్స్ ఉంది. దానితో ఫలితాలు రాబట్టవచ్చు. అతడిలో పోరాట పటిమ ఉంది... అవసరమైతే దూకుడు ప్రదర్శించే స్వభావం గుర్నూర్ది’ అని వెల్లడించాడు. పంత్కు అరగంట చాలు.. ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలకగా... వాషింగ్టన్ సుందర్ గాయంతో అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు మానవ్ సుతార్ను మూడో స్పిన్నర్గా బరిలోకి దింపే అవకాశం ఉందని మహరూఫ్ అన్నాడు. ‘రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లతో పాటు మూడో స్పిన్నర్గా మానవ్ సుతార్కు అవకాశం దక్కొచ్చు. గాలె పిచ్ కుల్దీప్కు బాగా అనుకూలిస్తుంది. ఇక్కడి పిచ్లు కేవలం స్పిన్ మాత్రమే కావు... కాస్త బౌన్స్ కూడా అవుతాయి. ఈ నేపథ్యంలో మానవ్కు ఈ తరహా పిచ్ బాగా ఉపయోగపడుతుంది. రెండు జట్లు కూడా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగొచ్చు. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్తో లంక జట్టు జాగ్రత్తగా ఉండాలి. అతడు అరగంటలో ఆట స్వరూపాన్ని మార్చేయగలడు. గతంలో అతడి బ్యాట్ నుంచి అలాంటి ఎన్నో ప్రదర్శనలు వచ్చాయి. స్పిన్ను మెరుగ్గా ఎదుర్కొన్న వారే సిరీస్లో విజేతగా నిలుస్తారు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య నుంచి టీమిండియా బ్యాటర్లకు ఇబ్బందులు ఎదురవొచ్చు. నా అంచనా ప్రకారం రెండు మ్యాచ్ల సిరీస్ 1–1తో ‘డ్రా’ అవుతుంది’ అని మహరూఫ్ వివరించాడు. బాడీలైన్ బౌలింగ్...శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తన పేస్తో ఆకట్టుకున్న గుర్నూర్... తుది జట్టులో మంచి వైవిధ్యం తీసుకొస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్లో గుర్నూర్ కొన్నిసార్లు బాడీలైన్ బౌలింగ్ కూడా చేశాడని మహరూఫ్ గుర్తు చేశాడు. ‘మీరు ప్రాక్టీస్ మ్యాచ్ను సరిగ్గా గమనిస్తే... బ్రార్ విభిన్న బంతులు వేశాడు. అవసరమైన సమయంలో ప్రత్యర్థుల శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని కూడా బంతులు విసిరాడు. నేను భారత జట్టు సహాయక బృందంలో ఉంటే అతడికి తప్పక అవకాశం కల్పించే దిశగా ప్రయత్నించేవాడిని. అతడు కేవలం పరిమిత ఓవర్లలోనే ఆడాడని నాక్కూడా తెలుసు.అయితే సుదీర్ఘ ఫార్మాట్కు అవసరమైన నైపుణ్యం బ్రార్లో మెండుగా ఉంది. బ్యాటర్ లయను దెబ్బతీయాల్సిన సందర్భాల్లో అతడు వేసే చిన్నపాటి స్పెల్స్ అత్యంత ప్రమాదకర ఆయుధాలుగా మారవచ్చు’ అని మహరూఫ్ అన్నాడు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్పై వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రార్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 6 వన్డేలు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్కు ఐపీఎల్లో పెద్దగా అనుభవం లేకపోయినా... ఫస్ట్క్లాస్ క్రికెట్లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. గత నెలలో భారత ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక ‘ఎ’ జట్టుతో మ్యాచ్లో గుర్నూర్ 10 వికెట్లు పడగొట్టాడు. -
ఆ దేశ సైనిక పాలకులు ఆడుతున్న మైండ్ గేమ్స్ ఇవే..
ఎన్నో ఏళ్లుగా గృహనిర్బంధంలో మగ్గుతున్న మయన్మార్ ప్రజాస్వామ్య నేత ఆంగ్ సాన్ సూ కీని ఎట్టకేలకు రెడ్ క్రాస్ ప్రతినిధి కలవడం ప్రపంచ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఒకవైపు దేశంలో దారుణమైన సివిల్ వార్ (అంతర్యుద్ధం) కొనసాగుతుండగా, మరోవైపు మయన్మార్ సైనిక పాలకులు అంతర్జాతీయ వేదికలపై తమపై ఉన్న ఏకాకితనాన్ని (International Isolation) పోగొట్టుకునేందుకు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్, చైనా, లావోస్, థాయ్లాండ్ దేశాలతో దౌత్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. కంటికి కనిపించకుండా సాగుతున్న ఈ దౌత్య రాజకీయాల వెనుక అసలు మయన్మార్ సైన్యం పన్నిన వ్యూహం ఏమిటి? అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటుతో మయన్మార్ ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. ఎన్నికల్లో విజయం సాధించిన ఆంగ్ సాన్ సూ కీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు, 'పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్' (PDF) రూపంలో తిరుగుబాటు చేయడంతో దేశం పూర్తిస్థాయి అంతర్యుద్ధంలోకి జారిపోయింది.గత కొన్నేళ్లుగా జరిగిన పోరులో జాతి సాయుధ సంస్థల చేతిలో సైన్యం భారీగానే భూభాగాన్ని కోల్పోయింది. అయితే, జనాభా ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాలపై పట్టు నిలుపుకున్న సైన్యం, గత ఏడాదిన్నరగా కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దాడులను తీవ్రం చేసింది.ఒత్తిళ్లను తట్టుకునేందుకు యత్నాలు అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకునేందుకు, తన ప్రభుత్వాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు సైనిక చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ డ్రామాలు మొదలుపెట్టారు. గత డిసెంబర్, జనవరి నెలల్లో ఎన్నికలు నిర్వహించి, తానే స్వయంగా సైనిక పదవి నుంచి తప్పుకుని అధ్యక్షుడిగా పీఠం ఎక్కారు. సివిల్ ప్రభుత్వం ముసుగు వేసుకున్న తర్వాత ఆయన తన అంతర్జాతీయ పర్యటనలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా దేశాల్లో అధికారిక పర్యటనలు చేసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు భద్రత, చైనా ఆధిపత్యం, వాణిజ్య ప్రయోజనాలరీత్యా పొరుగు దేశాలు కూడా మయన్మార్ ప్రభుత్వంతో తిరిగి సంబంధాలు నెరపుతున్నాయి.ఆసియాన్ కూటమిలో చోటు కోసం.. ముఖ్యంగా ఆసియాన్ (ASEAN) కూటమిలో తిరిగి చోటు దక్కించుకోవడానికి మయన్మార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. థాయ్లాండ్ వంటి దేశాలు సరిహద్దు భద్రత, శరణార్థుల సమస్యలు, డ్రగ్స్ అండ్ సైబర్ స్కామ్ కాంపౌండ్ల నియంత్రణ కోసం మయన్మార్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఆసియాన్ విధించిన 'ఐదు సూత్రాల శాంతి ఒప్పందాన్ని' మయన్మార్ పార్లమెంట్ ఏకంగా విదేశీ జోక్యంగా అభివర్ణించి తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆంగ్ సాన్ సూ కీని రెడ్ క్రాస్ ప్రతినిధి కలవడానికి అనుమతించడం అనేది మయన్మార్ మారుతోందడానికి సంకేతం కాదని, ఆసియాన్ కూటమిలో దేశాల మధ్య ఐక్యతను దెబ్బతీసి, తమపై ఒత్తిడి తగ్గించుకునేందుకు సైన్యం ఆడిన ఒక 'కాస్ట్-ఫ్రీ' మైండ్ గేట్ మాత్రమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. -
ఆగస్టు 15వ తేదీనే ఎందుకు ఫిక్స్ చేశారో మీకు తెలుసా?
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీన ఘనంగా జరుపుకుంటాం. అయితే ఈ తేదీని ఫిక్స్ చేయడానికి చాలానే చర్చలు జరిగాయట. మనకు స్వాత్వంత్యం వచ్చిన తర్వాత ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి ఒక తేదీని నిర్ణయించాలని అప్పటి పెద్దలు సమాలోచనలు చేశారట. 1946లో భారతదేశ స్వాతంత్ర్యం ఖరారైన తర్వాత 1947లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నమ్మకస్తుడైన గోస్వామి గణేష్ దత్ మహారాజ్ ద్వారా ఉజ్జయిన్కు చెందిన జ్యోతిష్కుడు పండిట్ సూర్యనారాయణ వ్యాస్ను ఢిల్లీకి పిలిపించారు. పండిట్ సూర్యనారాయణ వ్యాస్ అనే ఆయన జ్యోతిష్యంలో సిద్ధహస్తుడు. అందులోనూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సైతం జ్యోతిష్యం అంటే అమితమైన నమ్మకం. దాంతో పండిట్ సూర్యనారయణ ద్వారా ఒక తేదీని ఫిక్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.రెండింటిలో ఏది బెస్ట్..?భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరపడానికి రెండు తేదీలను ఫిక్స్ చేశారు. ఒకటి ఆగస్టు 14వ తేదీ కాగా, రెండోది ఆగస్గు 15వ తేదీ. అయితే ఈ రెండు తేదీలలో ఒకదాన్ని ఎంచుకోవడం సవాల్గా మారింది. బ్రిటిష్ వారి నుండి అధికారాన్ని బదిలీ చేయడానికి ఆగష్టు 14, 15 అనే రెండు తేదీలు అందుబాటులో ఉన్నాయని పండిట్ సూర్యనారాయణకు చెప్పారు.ఫలితంగా ప్రఖ్యాతగా జ్యోతిష్కునిగా ఉన్న పండిట్ సూర్యనారాయణ వ్యాన్ ఈ రెండు తేదీలను పరిశీలించిన తర్వాత ఆగస్టు 15వ తేదీకి మొగ్గుచూపారు. ఆగస్టు 14వ తేదీ లగ్న బలం లేదని, అంటే జాతక చక్రంలో తొలి స్థానంలో బాలేదని, అది అంత కూలమైనది కాదని తేల్చిచెప్పారు. అదే సమయంలో ఆగస్టు 15వ తేదీనే అనుకూలంగా ఉందని డేట్ ఫిక్స్ చేశారట. స్వాతంత్ర్యానికి ఆగస్టు 15వ తేదీ అత్యంత అనువైన తేదీ అని ఆయన ప్రకటించారుజాతకంలో ఆగస్టు 14వ తేదీన లగ్నం అస్థిరంగా ఉంటుందని ఆయన విశ్వసించారు. అందువల్ల, స్వాతంత్ర్యానికి ఆగస్టు 15వ తేదీ అత్యంత అనువైన తేదీ అని ఆయన ప్రకటించారు..ఇలా వచ్చింది ఆగస్టు 15వ తేదీ.ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పండిట్ సూర్యనారాయణ వ్యాస్ కుమారుడు, దూరదర్శన్ మాజీ డైరెక్టర్ జనరల్, రచయిత అయిన రాజశేఖర్ వ్యాస్ అందించారు. ఆయన ప్రకారం, శుభ సమయాన్ని నిర్ధారించిన తర్వాత, స్వాతంత్ర్యానికి అర్ధరాత్రి సమయం అనుకూలంగా ఉందని పండిట్ వ్యాస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో చెప్పారట. జెండా ఎగురవేయడం, స్వాతంత్ర్య వేడుకను అర్ధరాత్రి నిర్వహించాలని, ఇతర కార్యక్రమాలను ఉదయాన్నే జరపాలని ఆయన సూచించారట.పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయన సలహాను పాటించి, అర్ధరాత్రి ఎర్రకోటపై జెండాను ఎగురవేశారని చెబుతారు. అయితే ఆగస్టు 15వ తేదీ ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ భవనం (నాటి కౌన్సిల్ హౌస్) పై జరిగింది. ఆ సమయంలో లార్డ్ మౌంట్బాటన్ సమక్షంలో బ్రిటిష్ జెండా 'యూనియన్ జాక్'ను కిందకు దించి, మన భారత జాతీయ జెండాను తొలిసారిగా పైకి ఎగురవేశారు. మరి కొన్ని ఆసక్తికర విషయాలు.. పండిట్ సూర్యనారాయణ వ్యాస్ 1902లో జన్మించారు. ఆయనకు సంబంధించిన పుస్తకాల ప్రకారం, ఆయన 1921లోనే స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందని, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దేశానికి రాష్ట్రపతి అవుతారని ఆయన 1930లోనే జోస్యం చెప్పారని అంటారు.1952లో, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పదవీకాలం ముగింపు దశకు వస్తున్నప్పుడు, ఆయన తిరిగి రాష్ట్రపతిగా ఎన్నికవుతారని పండిట్ వ్యాస్ మరోసారి జోస్యం చెప్పారు. ఈ ప్రకటన ఆ తర్వాత నిజమని రుజువైంది. అప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తాను చెప్పినట్లే జరిగిందని అంగీకరిస్తూ పండిట్ వ్యాస్కు ఒక లేఖ రాసినట్లు సమాచారం.14వ తేదీని ఎంచుకున్న జిన్నా..పండిట్ వ్యాసుడు పాకిస్తాన్ గురించి కూడా ఒక జోస్యం చెప్పారు. భారతదేశ స్వాతంత్ర్యానికి శుభ ముహూర్తాన్ని లెక్కిస్తున్నప్పుడు, పండిట్ వ్యాసుడు పాకిస్తాన్ ఏర్పాటు గురించి కూడా హెచ్చరించారు. ఒకవేళ ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పడితే, అది శాశ్వతంగా అస్థిరంగా ఉంటుందని అంటారు. ఆ రోజున మేష లగ్నం ఉండటం, గురు గ్రహం శత్రు స్థానంలో ఉండటమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. మహమ్మద్ అలీ జిన్నా క్యాలెండర్ను, శుభ సమయాన్ని నమ్మేవారు కాదు. అందువల్ల, పాకిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఆగస్టు 14వ తేదీని ఎంచుకున్నారనేది సారాంశం. అలా పండిట్ సూర్యనారాయణ భారతదేశ స్వాతంత్య్ర తేదీని ఫిక్స్ చేయడంలో ముఖ్య భూమిక పోషించారట.ఇదీ చదవండి: 79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్? -
హసీనా తిరిగి వస్తే అధికార పీఠం కదిలిపోతుందా..?
గత వారం షేక్ హసీనా చేసిన ప్రసంగం ఒక ముఖ్యమైన రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, ఆమెకు ఉన్న మద్దతు స్థాయి ఎంత? అది ఎంత విస్తరించి ఉందో అంచనా వేసే ప్రయత్నం కూడా. ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్, సౌత్ ఏషియా వర్చువల్గా నిర్వహించింది. తాను బంగ్లాదేశ్కు తిరిగి వస్తానని, దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ప్రాణాలకు ముప్పు వచ్చినా సిద్ధంగా ఉన్నానని హసీనా ప్రకటించారు. తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ వారసత్వం, స్వాతంత్య్ర పోరాటం, 1971 విమోచన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, 1981, 1983, 1985 సంవత్సరాల్లో తన ప్రవాస జీవితం, అరెస్టు, 2004 హత్యాయత్నాన్ని గుర్తుచేశారు. అయితే 2007లో అప్పటి సైన్య మద్దతు ఉన్న కేర్టేకర్ ప్రభుత్వం తన ప్రవేశాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం, ఢాకాలో లభించిన భారీ స్వాగతాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.ఇది రానున్న డిసెంబరులో ఆమె తిరిగి బంగ్లాదేశ్కు రావాలనే యత్నానికి ముఖ్యమైన సూచనగా నిలుస్తోంది. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, హసీనా ప్రతిపాదించిన పునరాగమనం బంగ్లాదేశ్లో రాజకీయ పోటీని మళ్లీ తెరపైకి తీసుకువస్తుందా? లేక ఇప్పటికే ఉన్న వ్యవస్థలో విభేదాలను మరింత పెంచుతుందా? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానమే అవామీ లీగ్ భవిష్యత్తు, బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలు, భారతదేశంతో సంబంధాలను నిర్దేశించనుంది.హసీనా మూడు ప్రధాన డిమాండ్లు ముందుంచారు. అవామీ లీగ్పై నిషేధం ఎత్తివేయాలి, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి, మీడియా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ స్వతంత్రతను పునరుద్ధరించాలి. జులై ఉద్యమాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా రూపొందించారని మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యను ఆమె ప్రస్తావించారు. 2024 ఉద్యమం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయనే అంశానికి దీన్నే ఆధారంగా చూపించారు. న్యాయపరమైన దర్యాప్తులు అడ్డుపడుతున్నాయని, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ చట్టబద్ధతపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.రెండు సంకేతాలు ఇందులో రెండు సంకేతాలు ఉన్నాయి. మొదటిది, “1971 స్ఫూర్తి” ప్రాధాన్యాన్ని, అవామీ లీగ్ వారసత్వాన్ని మళ్లీ బలంగా నిలబెట్టడం. రెండోది, తన పునరాగమనానికి రాజకీయ వాతావరణాన్ని సిద్ధం చేయడం. ఆసక్తికర అంశం ఏమిటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా 1971 వారసత్వానికి తామే సంరక్షకులమని చెబుతోంది. వారి వాదన ప్రకారం సాయుధ పోరాటానికి జనరల్ జియౌర్ రెహ్మాన్ నాయకత్వం వహించారని, ఆయనే బంగ్లాదేశ్ విమోచన ప్రకటన చేశారని చెబుతున్నారు. అయితే ముజిబ్ హత్య తర్వాత రెహ్మాన్ కూడా పాకిస్థాన్ తరహాలోనే ఇస్లామిక్ రాజకీయాలను రాజ్యాంగబద్ధం చేసే ప్రయత్నం చేశారు.అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బీఎన్పీ రాజకీయాలు అవామీ లీగ్కు ప్లేస్ ఇవ్వడం లేదు. భారత భూభాగం నుంచి షేక్ హసీనా ప్రత్యక్షంగా మీడియాతో మాట్లాడడంపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2013 ఒప్పందం కింద ఆమెను అప్పగించాలని తమ డిమాండ్ను ప్రభుత్వం మళ్లీ పునరుద్ఘాటించింది. భారత భూభాగం నుంచి ఇలాంటి రాజకీయ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడం ద్వైపాక్షిక సంబంధాలపై నేరుగా ప్రతికూల ప్రభావం చూపుతుందని అధికారికంగా తెలిపింది.ఇక్కడ చారిత్రక నేపథ్యం చాలా ముఖ్యమైనది. బంగ్లాదేశ్లో జరిగిన ప్రతి ప్రధాన రాజకీయ మార్పులో భారత అంశం కనిపించింది. 1971 విమోచన యుద్ధం నుంచి హసీనా ప్రవాస జీవితం వరకు ఇదే పరిస్థితి. రాజ్యాంగేతర ఏర్పాట్ల కంటే ప్రజాస్వామ్య రాజకీయాలకే భారత్ ఎప్పుడూ మద్దతు ఇచ్చింది. అయితే తన చివరి పాలనా కాలంలో హసీనా రాజకీయ ప్రత్యర్థులకు తగిన ప్లేస్ ఇవ్వలేదు. దీనిపై దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి.నిషేధం అమలులో ఉన్నప్పటికీ, దేశంలోనే అత్యంత పురాతన రాజకీయ పార్టీ అయిన అవామీ లీగ్కు బంగ్లాదేశ్ అంతటా బలమైన ఉనికి, మద్దతు ఉంది. ఇటీవల ముగిసిన ఫిబ్రవరి ఎన్నికలు సమగ్రంగా జరిగి ఉంటే అవామీ లీగ్ రెండో అతిపెద్ద రాజకీయ శక్తిగా నిలిచే అవకాశం ఉండేది. ప్రజాభిప్రాయ సర్వేల ప్రకారం ఇప్పటికీ దాదాపు 30 శాతం ఓటర్లపై ఆ పార్టీ ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో హసీనా తిరిగి వస్తే, 2007లో జరిగినట్టే ఆమెకు స్వాగతం పలకడానికి మద్దతుదారులు వీధుల్లోకి రావచ్చు. ప్రస్తుత వ్యవస్థకు ఇది రాజకీయ అసౌకర్యాన్ని కలిగిస్తోంది.అవామీ లీగ్ వేగంగా పునర్వ్యవస్థీకరణ? రాజకీయ కార్యకలాపాలు తిరిగి తెరుచుకుంటే అవామీ లీగ్ వేగంగా పునర్వ్యవస్థీకరణ చెందవచ్చనే ఆందోళన వారికి ఉంది. అందుకే హసీనా ప్రసంగాన్ని బంగ్లాదేశ్లో ప్రసారం చేయనివ్వలేదు. ప్రధానమంత్రి తారిక్ రెహ్మాన్ ఇప్పటికీ ప్రజలపై బలమైన పట్టు సాధించలేదు. మరోవైపు జమాత్-ఇ-ఇస్లామీకి అవామీ లీగ్తో చాలా కాలంగా ఉన్న విభేదాల నేపథ్యంలో, జమాత్ తీవ్రవాద రాజకీయాలను నియంత్రించేందుకు అవామీ లీగ్ రాజకీయ కార్యకలాపాలను తారిక్ రెహ్మాన్ అనుమతించే అవకాశం ఉంది.ఢాకాతో సంబంధాల్లో సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ను ఆహ్వానించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మాజీ ప్రధానమంత్రి ఖలేదా జియా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఢాకా వెళ్లారు. ఆ తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తారిక్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అయినప్పటికీ ఈ ప్రయత్నాల వల్ల స్పష్టమైన రాజకీయ హామీ గానీ, విశ్వాసం గానీ ఏర్పడలేదు. భారత్తో మరింత దగ్గరవ్వాలనే విషయంలో తారిక్ రెహ్మాన్ సందిగ్ధత స్పష్టంగా కనిపిస్తోంది. తన తొలి విదేశీ పర్యటనలకు ఆయన మలేషియా, ఆ తర్వాత చైనాను ఎంచుకున్నారు. చైనా పర్యటనలో మోంగ్లా పోర్టు వంటి సున్నిత అంశాలపై ఒప్పందాలు జరిగాయి. ఇవి భారత్ భద్రతా ఆందోళనలకు కారణమవుతున్నాయి.ఇరు దేశాల మధ్య ఇంకా పలు అంశాలు పెండింగ్లో ఉన్నాయి. మొదటిది 1996 గంగా జల ఒప్పందం పునరుద్ధరణ. దీనిపై బిహార్, పశ్చిమ బెంగాల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండోది తీస్తా జలాల పంపిణీ ఒప్పందం. మూడోది షేక్ హసీనా అధికారిక అప్పగింత. నాలుగోది సరిహద్దు వాణిజ్యాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం. బంగ్లాదేశ్ మారుతున్న రాజకీయాలు, వ్యూహాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశాలకు మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. అప్పగింత విషయానికి వస్తే, రాజకీయ నేరాల కేసుల్లో దాన్ని తిరస్కరించే అవకాశం ఒప్పందంలో ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఆర్టికల్ 6 రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసులపై అప్పగింతను నిరాకరిస్తుంది.వనరులు, అనుసంధానం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో ఇరు దేశాలు సంక్లిష్ట పరస్పర ఆధారిత సంబంధాలు కలిగి ఉన్నాయి. భారత ఈశాన్య ప్రాంత అభివృద్ధి, బంగ్లాదేశ్ అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. రాజకీయ విభేదాలు మౌలిక వసతుల అభివృద్ధి, ప్రాంతీయ పురోగతి వంటి పెద్ద లక్ష్యాలను మసకబార్చకుండా ఢిల్లీ, ఢాకా చూసుకోవాలి. -
2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు!
ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం భారతదేశంలో రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. దీంతో.. ఈవీ పరిశ్రమలు, అనుబంధ సంస్థలు కూడా విస్తరిస్తున్నాయి. వాహనాల తయారీ, బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్లు, సర్వీసింగ్, సాఫ్ట్వేర్, ఫ్లీట్ మేనేజ్మెంట్, బ్యాటరీ రీసైక్లింగ్ వంటి అనేక రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని 'అడెక్కో ఇండియా' తన నివేదికలో వెల్లడించింది.అడెక్కో ఇండియా డేటా ప్రకారం.. 2030 నాటికి భారతదేశ ఈవీ రంగం 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. అయితే.. ఈ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం నేరుగా వాహనాల తయారీకి సంబంధించినవి కాకపోవడం గమనార్హం. ఇందులో కేవలం 10-15 శాతం మాత్రమే ప్రత్యక్ష ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది.అంటే.. ఒక వ్యక్తి కార్లు లేదా బైకులు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేయకపోయినా ఈవీ రంగంలో ఉద్యోగం పొందవచ్చు. ఛార్జింగ్ స్టేషన్ నిర్వహణ, బ్యాటరీ సర్వీసింగ్, డ్రైవర్ ట్రైనింగ్, కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్, లాజిస్టిక్స్, రీసైక్లింగ్ వంటి రంగాల్లో కూడా మంచి అవకాశాలు రావచ్చు. తయారీ రంగం మాత్రం ఈవీ ఉద్యోగాల్లో ప్రధాన పాత్ర పోషించనుంది. కాబట్టి మొత్తం ఈవీ ఉద్యోగ డిమాండ్లో సుమారు 50-55 శాతం తయారీ రంగం నుంచి ఉండవచ్చని ఒక అంచనా.ఈవీ రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి భవిష్యత్తులో మంచి జీతాలు కూడా లభించే అవకాశం ఉంది. బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, ఛార్జింగ్ సిస్టమ్స్, టెలిమాటిక్స్ వంటి కొత్త నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. అడెక్కో ఇండియా ప్రకారం, ఇలాంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారు సాధారణ ఉద్యోగుల కంటే కూడా 45 శాతం ఎక్కువ జీతం పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత ఆటోమొబైల్ కార్మికులు కూడా కొత్త ఈవీ టెక్నాలజీలను నేర్చుకోవడం చాలా ముఖ్యం.ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలతో.. కమర్షియల్ ఫ్లీట్లు, టాక్సీలు, డెలివరీ వాహనాలు వంటి రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. వాహనాల బ్యాటరీ పనితీరును గమనించడం, ఛార్జింగ్ సమయాలను నిర్వహించడం, రూట్లను ప్లాన్ చేయడం, వాహనాలను సర్వీస్ చేయడం వంటి పనులకు ప్రత్యేక సిబ్బంది అవసరం అవుతారు. అయితే.. ఈ ఉద్యోగాల్లో కొన్ని మొదట కాంట్రాక్ట్ లేదా ఫ్లెక్సీ ఉద్యోగాలుగా రావచ్చు. -
పరిచయం లేని క్రీడలో భారత్కు కాంస్యం.. ఏమిటీ సెపక్ టక్రా?
భారత్లో పెద్దగా పరిచయం లేని సెపక్ టక్రా గేమ్స్లో మన జట్టు మరోసారి సత్తా చాటింది. ఆసియాగ్నేసియా ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన సెపక్ టక్రా గేమ్లో భారత్ తాజాగా కాంస్య పతకం సాధించింది. థాయ్లాండ్ వేదికగా జరిగిన కింగ్స్ కప్ సెపక్ టక్రా చాంపియన్షిప్లో పురుషుల క్వాడ్రాంట్ (నలుగురు ఆటగాళ్లు కలిసి) ఈవెంట్లో భారత్ ఈ పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో భాగంగా సెమీఫైనల్లో భారత్ 15-9, 9-15, 9-15తో ఆతిథ్య థాయ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఆద్యంతం థ్రిల్లింగ్గా సాగిన పోరులో భారత ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడం విశేషం. ఈ విజయంతో భారత్ ఆసియా గేమ్స్లో పతకం ఆశలు రేపుతోంది. ఎందుకంటే సెప్టెంబర్లో జరగనున్న ఆసియా క్రీడల్లో సెపక్ టక్రా గేమ్ ఉండడమే దీనికి కారణం. ప్రతిష్టాత్మ ఆసియా క్రీడల్లో సెపక్ టక్రాలో భారత్ పతకం సాధించాలని ఆశిద్దాం.ఏమిటీ సెపక్ టక్రా?సెపక్ టక్రా లేదా సెపక్ట క్రా అనేది ఆగ్నేయాసియాకు చెందిన ప్రసిద్ధ క్రీడ. దీనిని బ్యాడ్మింటన్ కోర్టును పోలిన కోర్టులో ఇరు జట్ల నుంచి రెండు నుంచి నలుగురు ఆటగాళ్లు ఆడడం జరుగుతుంది. ఇక మ్యాచ్లో బెత్తన్ లేదా ప్లాస్టిక్తో చేసిన బంతిని ఉపయోగిస్తారు. ఈ ఆటలో బంతిని తాకడానికి ప్లేయర్లు తమ పాదాలు, మోకాలు, భుజాలు, ఛాతీ, తలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే సెపక్ టక్రా గేమ్ వాలీబాల్, ఫుట్బాల్ను పోలి ఉంటుంది. సెపక్ టక్రాను మలేషియా జాతీయ క్రీడగా పరిగణిస్తారు. అయితే ఇదే క్రీడను పలు దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. మలేషియాలో సెపక్ టక్రా, ఇండోనేషియాలో సెపక్ రాగా, థాయ్లాండ్లో టక్రా, మయన్మార్లో చిన్లోన్, ఫిలిప్పీన్స్లో సిపా, లావోస్లో లతావ్, కంబోడియాలో సెక్ డై, వియత్నాంలో కౌ మే వంటి పేర్లతో పిలుస్తుంటారు. పేర్లు ఏదైనా ఆట మాత్రం అన్నింటిలో అదే విధంగా ఉంటుంది. ఇక 1965లో కౌలలంపూర్లో జరిగిన ఆగ్నేయాసియా ద్వీపకల్ప క్రీడల్లో సెపక్ టక్రాను మెడల్ ఈవెంట్గా ప్రవేశపెట్టడం జరిగింది. 🚨BREAKING🚨🇮🇳 INDIA MEN'S QUADRANT SEPAKTAKRAW TEAM WINS WORLD C'SHIPS BRONZE 🥉 India lost SF vs Hosts Thailand in a 3-setter 15-9, 9-15, 9-15 to settle for Bronze🥉 Sepaktakraw (Quadrant) also features in Asian GamesIndia's 2nd medal this World's / Thai King's Cup… pic.twitter.com/XqKXQUW7LS— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) August 7, 2026Read: ‘షమీ అదొక్కటి చెయ్యు.. నీ రీఎంట్రీ తథ్యం’ -
79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్?
న్యూఢిల్లీ: రాబోయే ఆగస్టు 15(2026)న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. అయితే, ఈ ఏడాది అంటే 2026లో దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోందా లేక 80వదా అనే అంశంపై ప్రజల్లో కొంత సందిగ్ధత నెలకొంది.ఈ గందరగోళానికి ప్రధాన కారణం లెక్కింపు విధానమే. చాలామంది స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయనే కోణంలో లెక్కిస్తున్నారు. దీని ప్రకారం, 2026 నుండి 1947ని తీసివేయగా 79 సంవత్సరాలు వస్తుంది. అంటే ఆగస్టు 15, 2026 నాటికి భారత్ స్వాతంత్ర్యం పొంది 79 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అయితే 1947 ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు మనం జరుపుకున్న మొత్తం స్వాతంత్ర్య దినోత్సవాల సంఖ్యను లెక్కిస్తే వేరే లెక్క వస్తుంది.1947లో మొదటి స్వాతంత్ర్య దినోత్సవం జరుగగా, 1948లో రెండవది, ఇలా ప్రతి ఏటా కలుపుకుంటూ వస్తే 2026 నాటికి ఇది 80వ స్వాతంత్ర్య దినోత్సవం వస్తుంది. దీనిని లెక్కించేందుకు 2026 - 1947 + 1 సూత్రాన్ని ఉపయోగిస్తారు. దీనిని బట్టి స్పష్టత ఏమిటంటే, ఆగస్టు 15, 2026న మనం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే భారత్ స్వాతంత్య్రం సాధించి, 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నదన్నమాట.ఇది కూడా చదవండి: గర్భస్థ పిండం నోటిలో మరో పిండం.. షాక్లో వైద్యులు! -
పసిడి ప్రియులకు షాక్.. తులం 2 లక్షలు?
-
రష్యా నుంచి భారత్కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్?
మాస్కో: సముద్ర మార్గాల్లో ఎదురవుతున్న రవాణా ముప్పును అధిగమించేందుకు హిందూ మహాసముద్రానికి ఒక ప్రత్యక్ష రైల్వే కనెక్షన్ను ఏర్పాటు చేసే అంశాన్ని రష్యా పరిశీలిస్తున్నట్లు ఆ దేశ ఉప ప్రధాని మరాత్ ఖుస్నుల్లిన్ తెలిపారు. తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మీదుగా వెళ్లే భూమార్గ కారిడార్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. బోస్ఫరస్, హోర్ముజ్ జలసంధి వంటి కీలకమైన వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో తలెత్తుతున్న రవాణా ప్రమాదాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.వార్తా సంస్థ ‘టాస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుస్నుల్లిన్ ఈ విషయాలను వెల్లడించినట్లు ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ తెలిపింది. జలమార్గాల్లో ఎదురవుతున్న అంతరాయాల నుండి రష్యా రవాణా రక్షణను మెరుగుపరిచేందుకు ఈ ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధి దోహదపడుతుందని మరాత్ ఖుస్నుల్లిన్ అన్నారు. భారత్తో కనెక్టివిటీని పెంపొందించే ఏ మార్గమైనా ఆచరణాత్మకమైనదిగా పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నెట్వర్క్ కనుక భవిష్యత్తులో రూపుదిద్దుకుంటే, రష్యా- భారత్ మధ్య నేరుగా వస్తువుల రవాణాకు ఒక ప్రత్యామ్నాయ భూమార్గ రైల్వే మార్గం అందుబాటులోకి రానుంది.ఈ ప్రతిపాదన సంప్రదాయ సముద్ర మార్గాలకు అతీతంగా కనెక్టివిటీని నిర్మించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నల్ల సముద్రాన్ని మధ్యధరా సముద్రంతో కలిపే బోస్ఫరస్ జలసంధి, ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన మార్గమైన హోర్ముజ్ జలసంధి వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. హిందూ మహాసముద్రం మీదుగా భారత్కు సరుకులను తరలించడంలో మరింత వెసులుబాటును కల్పించే మార్గాలపై రష్యా పరిశీలిస్తున్నదని ఖుస్నుల్లిన్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.అయితే, తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ , పాకిస్తాన్ ల గుండా వెళ్లే ఈ కారిడార్ బహుళ దేశాల గుండా సాగాల్సి ఉంటుంది. దీనికి గణనీయమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశాల మధ్య సమన్వయం అవసరమవుతాయి. ఒకవేళ ఈ ప్రతిపాదిత రైల్వే నెట్వర్క్ సాకారమైతే, ప్రమాదకరమైన సముద్ర రవాణా మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ రష్యాకు భారత్తో ప్రత్యామ్నాయ భూమార్గ రవాణా మార్గం ఏర్పాటవుతుంది. ఇది కూడా చదవండి: ‘నో మ్యాన్స్ ల్యాండ్’.. ఈ భూమిపై ఎవరికీ హక్కు లేదా? -
‘నో మ్యాన్స్ ల్యాండ్’.. ఈ భూమిపై ఎవరికీ హక్కు లేదా?
రెండు దేశాల సరిహద్దుల మధ్య ఎవరికీ చెందని భూమిగా పిలిచే ‘నో మ్యాన్స్ ల్యాండ్’ (No Man's Land), ‘జీరో లైన్’ (Zero Line) గురించి తరచూ చర్చలు జరుగుతుంటాయి. దేశాల మధ్య వివాదాలు, సరిహద్దు భద్రత మధ్య ఈ ప్రత్యేక ప్రాంతంపై ఎవరికి అధికారాలు ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.సరిహద్దుల్లో ‘నో మ్యాన్స్ ల్యాండ్’ అంటే ఏమిటి?ప్రపంచంలోని పలు దేశాలు తమ పొరుగు దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్నాయి. ఇలా రెండు దేశాల సరిహద్దుల మధ్య వదిలివేసిన ఖాళీ భూమిని ‘నో మ్యాన్స్ ల్యాండ్’ అని పిలుస్తారు. దీనిని కొన్నిసార్లు ‘జీరో లైన్’ అని కూడా వ్యవహరిస్తారు. ప్రత్యేకించి భారత్-పాకిస్తాన్ సరిహద్దుల సందర్భంలో ఈ పదం ఎక్కువగా వాడుకలో వినిపిస్తుంటుంది. ఈ ప్రత్యేక ప్రాంతంపై ఏ ఒక్క దేశానికీ ప్రత్యేకమైన యాజమాన్య హక్కులు ఉండవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఎవరికీ చెందని భూమి మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఒక ‘బఫర్ జోన్ ’ మాదిరిగా పనిచేస్తుంది.‘జీరో లైన్’ ఎక్కడ ఉంటుంది?.. ప్రత్యేకత ఏమిటి?రెండు దేశాల సరిహద్దులు ముఖాముఖిగా కలిసే వాస్తవిక రేఖను ‘జీరో లైన్’ అని అంటారు. భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని పలు ప్రాంతాలలో ఈ జీరో లైన్ స్పష్టంగా హైలైట్ చేసి ఉంటుంది. అదే సమయంలో జమ్ము కశ్మీర్ లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)వద్ద దీని పరిస్థితి మరింత సున్నితంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో రెండు దేశాల సైనిక చౌకీలు ఎదురుగా మోహరించి ఉంటాయి. సరిహద్దుల్లో జరిగే ప్రతీ చిన్న కదలికను ఇరు దేశాల భద్రతా బలగాలు అత్యంత నిశితంగా గమనిస్తూ ఉంటాయి.నిజంగా ఎవరికీ హక్కులు ఉండవా?జీరో లైన్ చుట్టుపక్కల ఉండే భూభాగాన్ని సాధారణంగా ‘నో మ్యాన్స్ ల్యాండ్’ అంటారు. ఇది ఏ దేశపు పౌరులు కూడా వినియోగించడానికి వీలు లేని ప్రాంతం. సాధారణ పరిస్థితుల్లో ఇక్కడ ఏ దేశపు ప్రత్యక్ష పౌర నియంత్రణ ఉండదు. భద్రతాపరమైన కఠిన నిబంధనల కారణంగా సామాన్య ప్రజల ప్రవేశంపై ఇక్కడ నిషేధం కొనసాగుతుంది. కొన్నిసార్లు ఇదే వివాదాస్పద ప్రాంతం ఇరు దేశాల మధ్య జరిగే ఘర్షణలు, కాల్పులు, సైనిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారుతుంది.రక్షణ వలయంగా మారిన సరిహద్దు భద్రతజీరో లైన్ పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కఠినంగా, పటిష్టంగా ఉంటాయి. భారతదేశం వైపు నుంచి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ రేంజర్స్ నిరంతరం గస్తీ కాస్తుంటాయి. పలు అత్యంత సున్నితమైన ప్రాంతాలలో మందుపాతరలు, అత్యాధునిక స్పై గ్యాజెట్లు, భారీ సైనిక శిబిరాలు ఏర్పాటై ఉంటాయి. ఈ కారణాల వల్ల ఎలాంటి అనుమతి లేకుండా ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం చట్టపరమైన నేరం మాత్రమే కాకుండా, ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది.చారిత్రక వివాదాలు.. సరిహద్దు ఉద్రిక్తతలుప్రపంచ చరిత్రలో ఇలాంటి భూమిని చేజిక్కించుకోవాలనే దురాశతో పలు దేశాల మధ్య భీకర యుద్ధాలు కూడా జరిగాయి. నేటికీ భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న జమ్ముకశ్మీర్ లోని ప్రాంతాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ సున్నితమైన సరిహద్దుల వల్లే ‘నో మ్యాన్స్ ల్యాండ్’ ప్రాముఖ్యత మరింత పెరిగింది.ఒక చిన్న పొరపాటు తెచ్చే మృత్యువు‘నో మ్యాన్స్ ల్యాండ్’, ‘జీరో లైన్’ ప్రాంతాలలో నిఘా వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా ఉంటుంది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఈ ప్రాంతంలోకి కాలుపెట్టాలని చూస్తే, క్షణాల్లో ప్రణాలు పోయే అవకాశం ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు, నిఘా నేత్రాల మధ్య ఉండే ఈ భూభాగంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను ముప్పుకు దారి తీస్తుంది. అందుకే సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రజలు అనునిత్యం అప్రమత్తంగా మెలుగుతారు.సరిహద్దుల నిర్వహణ - ఒక నిరంతర సవాలురెండు దేశాల మధ్య శాంతి భద్రతలను కాపాడటంలో ‘జీరో లైన్’, ‘నో మ్యాన్స్ ల్యాండ్’ కీలక పాత్ర పోషిస్తాయి. సరిహద్దు ఉల్లంఘనలను అరికట్టడానికి, అసాంఘిక శక్తుల చొరబాట్లను నివారించడానికి ఇరు దేశాల రక్షణ దళాలు నిత్యం సిద్ధంగా ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, ఈ సున్నితమైన సరిహద్దులను భద్రంగా ఉంచేందుకు ప్రభుత్వాలు నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: జపాన్ పర్యటనకు ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ! -
ఒకటి పోతే 2.6 కొత్త జాబ్స్
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కోల్పోతున్న ఉద్యోగాల కంటే కొత్తగా పుట్టుకొస్తున్న ఉద్యోగాల సంఖ్యే భారత్లో చాలా ఎక్కువగా ఉంది. ఆసియాలో ఉపాధి పరిణామాలను విశ్లేషిస్తూ అంతర్జాతీయ ఆర్థిక పరిశోధన సంస్థ నొమురా రూపొందించిన తాజా నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి ఒక ఉద్యోగం నష్టపోతుంటే, దానికి బదులుగా 2.6 కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కృత్రిమ మేధ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను కొల్లగొడుతుందనే ఆందోళనల నడుమ ఈ రిపోర్ట్ రావడం దేశీయ ఐటీ రంగంలో సరికొత్త చర్చకు దారితీసింది. నొమురా ఆర్థిక నిపుణులు సోనాల్వర్మ, సీఇంగ్టో నేతృత్వంలో ఆసియాలో 2002 నుంచి 2026 ఆగస్ట్ వరకు ఉపాధి మార్పులపై సుదీర్ఘ అధ్యయనం సాగింది. ఈ పరిశోధన ప్రకారం భారత్లో సాంకేతిక మార్పుల కారణంగా 31,921 మంది ఉద్యోగాలు కోల్పోవడం లేదా స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఇదే సమయంలో కొత్తగా 83,100 మందికి ఏఐ, అనుబంధ రంగాల్లో నియామకాలు జరిగాయి. అంటే నికరంగా దాదాపు 51,000 పైగా అదనపు ఉపాధి అవకాశాలు లభించాయి. ఆసియాలో ఈ సాంకేతికత ఆధారిత నియామకాలు, ఉద్యోగాల తొలగింపుల్లో భారతదేశమే అత్యధిక వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ ప్రధాన కేంద్రం.. ప్రపంచవ్యాప్త దిగ్గజ సంస్థలకు భారత్ ఒక ప్రధాన సేవా కేంద్రంగా (గ్లోబల్ బ్యాక్ ఆఫీస్) విరాజిల్లుతోంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్, డేటా అనాలిసిస్, కస్టమర్ కేర్ సేవలు వంటి నిర్వహణ పనుల కోసం ఇక్కడి అపారమైన మానవ వనరులపై అంతర్జాతీయ సంస్థలు ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కృత్రిమ మేధస్సు ప్రభావం కూడా ఇక్కడే అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది. అందుకే ఉపాధి మార్పులను అధ్యయనం చేయడానికి భారత్ను ప్రధాన కేంద్రంగా నొమురా అభివర్ణించింది. సవాల్గా నైపుణ్యాల కొరత.. ఉపాధి సంఖ్య పెరిగినా, పాత ఉద్యోగాలు కోల్పోతున్న వారే కొత్త ఉద్యోగాలను పొందుతున్నారా అంటే లేదనే సమాధానం వస్తోంది. ప్రస్తుత మార్కెట్లో కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది స్థానంలో స్వయంచాలక చాట్బాట్లు వచ్చి చేరుతున్నాయి. దీనివల్ల సాధారణ సేవల సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారు. మరోవైపు ఐటీ కంపెనీలు ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, వాటిని నిర్వహించడానికి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం గల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి. దీనివల్ల మార్కెట్లో నైపుణ్యాల మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడుతోంది. కొత్త గ్రాడ్యుయేట్లపై ప్రభావం.. సాధారణంగా కళాశాల విద్య పూర్తి చేసుకొని వచ్చే యువతకు ప్రారంభంలో సాధారణ కంపెనీ నిర్వహణ పనులు నేర్చుకుంటూ పైస్థాయికి ఎదిగే అవకాశం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు నియామకాల శైలిని పూర్తిగా మార్చేశాయి. ఉద్యోగంలో చేరిన తర్వాత శిక్షణ ఇవ్వడం కంటే ముందే ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుండగా, కింది స్థాయి ఉద్యోగాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. భవిష్యత్ మార్గం ఏమిటి? ఈ మార్పులు కేవలం ఉద్యోగాల తొలగింపునకు సంకేతం కాదు. ఉపాధి అవసరాల వేగవంతమైన పునర్నిర్మాణాన్ని ఇవి సూచిస్తున్నాయి. ఏఐ విప్లవంలో భారతీయులు తమ ఉత్పాదకతను పెంచుకుంటే, అంతర్జాతీయ మార్కెట్లో మరిన్ని ఉన్నత స్థాయి ప్రాజెక్టులను దక్కించుకునే అవకాశం ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా శ్రామిక శక్తినంతటినీ నూతన సాంకేతిక రంగాల వైపు మళ్లించడం, వారికి తగిన శిక్షణ అందించడమే ప్రస్తుతమున్న అతిపెద్ద సవాల్. 1. అత్యధిక డిమాండ్ ఉన్న ప్రధాన రంగాలు.. – ఏఐ – మెషీన్ లెర్నింగ్ – డేటా అనలిటిక్స్ – సైబర్ సెక్యూరిటీ – క్లౌడ్ కంప్యూటింగ్ 2. నైపుణ్యాలను ఇలా పెంపొందించుకోవాలి.. – పైథాన్, జావా స్క్రిప్ట్ వంటివి నేర్చుకోవడం ఏఐ రంగంలోకి అడుగుపెట్టడానికి తొలి అడుగు. – అంతర్జాతీయ గుర్తింపు పొందిన విద్యా వేదికల ద్వారా తాజా సాంకేతిక కోర్సులు పూర్తి చేసి ధృవీకరణ పత్రాలు సాధించాలి. – లైవ్ ప్రాజెక్టులు చేయడం, ఉచిత కోడింగ్ ప్లాట్ఫామ్లలో భాగస్వామ్యం కావాలి. – సాంకేతిక నైపుణ్యాలతో పాటు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి, ఇతరులతో కలిసి పనిచేసే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. -
జంపింగ్లో డబుల్ ధమాకా
యుజీన్ (అమెరికా): నాలుగు దశాబ్దాల చరిత్రగల ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ మూడోసారి తమ అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసింది. ఆదివారం ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషుల హైజంప్లో బసంత్ కుమార్ మేఘ్వాల్ రజత పతకం సాధించగా... పురుషుల లాంగ్జంప్లో షానవాజ్ ఖాన్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. పురుషుల జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్ రజత పతకం గెలిచిన సంగతి విదితమే. వెరసి ఈ మెగా ఈవెంట్లో భారత్ మొత్తం మూడు పతకాలు గెల్చుకుంది. 2021, 2022 ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్లోనూ భారత్ మూడు పతకాల చొప్పున సాధించింది. ఆఖరిరోజు సోమవారం మహిళల హైజంప్ ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ పూజా సింగ్ బరిలో ఉంది. పూజా పతకం గెలిస్తే భారత్ తొలిసారి నాలుగు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తుంది. ప్రస్తుతం ఆసియా అండర్–20 చాంపియన్గా ఉన్న 19 ఏళ్ల బసంత్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకాన్ని సంపాదించాడు. తద్వారా ప్రపంచస్థాయి అథ్లెటిక్స్ మీట్లో పతకం గెలిచిన తొలి భారతీయ హైజంపర్గా బసంత్ గుర్తింపు పొందాడు. బసంత్ 2.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. స్వర్ణం గెలిచిన యూనుస్ అయాచి (అల్జీరియా), కాంస్యం సాధించిన ఒటిస్ పూలే (బ్రిటన్) కూడా 2.21 మీటర్ల ఎత్తుకు ఎగిరారు. ముగ్గురూ 2.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి సమఉజ్జీగా నిలిచారు. యూనుస్ తొలి ప్రయత్నంలోనే 2.21 మీటర్లను అధిగమించగా... బసంత్ రెండో ప్రయత్నంలో... ఒటిస్ మూడో ప్రయత్నంలో సఫలమయ్యారు. దాంతో యూనుస్కు స్వర్ణం ఖరారు చేయగా.. బసంత్కు రజతం, ఒటిస్కు కాంస్యం లభించాయి. రాజస్తాన్లోని గంగానగర్ జిల్లాకు చెందిన బసంత్ ప్రస్తుతం భారత నావికాదళంలో ఉద్యోగిగా ఉన్నాడు. బసంత్ తండ్రి గంగారాం డ్రైవర్గా, దినసరి కూలీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆసియా అండర్–20 చాంపియన్ అయిన షానవాజ్ ఖాన్ తనపై పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయకుండా పతకంతో మెరిశాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల షానవాజ్ 7.84 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. డేనియల్ లియోనారో ఇంజోలి (ఇటలీ; 7.97 మీటర్లు) స్వర్ణం... మేసన్ మెక్గ్రోడర్ (ఆస్ట్రేలియా; 7.96 మీటర్లు) రజతం గెలిచారు. షానవాజ్ తండ్రి నసీముద్దీన్ టాక్సీ డ్రైవర్గా పని చేసేవారు. 2018లో ఆయన క్యాన్సర్తో చనిపోయారు. తండ్రి మృతి చెందాక షానవాజ్ను అతని బాబాయిలు, క్రీడాకారులైన షారుఖ్, మొహమ్మద్ హాదీస్ దిశానిర్దేశం చేశారు. షారుఖ్ 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో జాతీయ చాంపియన్ కాగా, హాదీస్ మాజీ జావెలిన్ త్రోయర్. వీరిద్దరి స్ఫూర్తితో షానవాజ్ అథ్లెటిక్స్లో ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే స్థాయికి ఎదిగాడు. -
అబ్బురపరుస్తున్న ఘటన.. నడిరోడ్డుపై గిఫ్ట్, చిన్నారుల కేరింతలు
స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న చిన్నారుల ఉత్సాహాన్ని గమనించిన ఓ లంబోర్ఘిని యజమాని వారికి ఊహించని విధంగా ఆనందాన్ని పంచాడు. రెండు లగ్జరీ కార్లను దగ్గరగా చూసే అవకాశం ఇవ్వడమే కాకుండా, వాటిని పరిశీలించేలా, డ్రైవర్ సీట్లో కూర్చునేలా, ఫొటోలు దిగేలా చేసి ఆ క్షణాన్ని మరపురాని అనుభూతిగా మార్చాడు.ఈ వీడియోను రాకేశ్ కుమార్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వీడియోలో కుమార్ తన నలుపు రంగు లంబోర్ఘిని నడుపుతుండగా, స్కూల్ బస్సులో ఉన్న చిన్నారులు కిటికీల్లోంచి అతని కారును చూస్తూ ఆనందంగా కేరింతలు కొడుతున్నట్టు కనిపించింది.వారి ఉత్సాహాన్ని చూసిన కుమార్.. బస్సు పక్కనే కారు నడుపుతూ కిటికీ అద్దాన్ని కిందకు దించి వారికి చేతులు ఊపాడు. ఆ తర్వాత సూపర్కార్ను దగ్గరగా చూసేలా తాను కారును ఆపేందుకు అనువైన చోటుకు దారి చూపాలని సరదాగా విద్యార్థులను కోరాడు.కారు ఆపిన తర్వాత కుమార్ స్కూల్ బస్సులోకి ఎక్కి చిన్నారులతో మాట్లాడాడు. తన కారు ఏదో గుర్తుపట్టగలరా అని అడగగా, అది లంబోర్ఘినినని విద్యార్థులు ఉత్సాహంగా సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బస్సు నుంచి దిగివచ్చి కారును దగ్గరగా చూడాలని వారిని ఆహ్వానించాడు. చిన్నారులు కారును తాకుతూ, లోపల పరిశీలిస్తూ, ఒక్కొక్కరిగా డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. అలాగే కారుతో ఫొటోలు కూడా దిగారు.ఈ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాలని భావించిన కుమార్, తన ఫోన్లో “పప్పు డ్రైవర్” పేరుతో సేవ్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి మరో లగ్జరీ కారును అక్కడికి తీసుకురావాలని కోరాడు. కొద్దిసేపటి తర్వాత ఎరుపు రంగు సూపర్కార్ అక్కడికి చేరుకుని, నలుపు రంగు లంబోర్ఘిని, పసుపు రంగు స్కూల్ బస్సు పక్కనే ఆగింది. రెండు సూపర్కార్లను చూసిన చిన్నారులు ఆనందంతో మురిసిపోయారు. వారు కేరింతలు కొడుతూ, డ్యాన్స్ చేస్తూ, కార్ల చుట్టూ చేరి మరిన్ని ఫొటోలు దిగారు.వీడియోను పంచుకుంటూ కుమార్.. కొంతమంది పిల్లలు కార్ల గురించి కలలు కంటారని, తాను కూడా అలాంటి వారిలో ఒకడినని రాశాడు. బస్సు నిండా ఉన్న చిన్నారులకు ఆ కలను అనుభవించే అవకాశం ఇచ్చానని తెలిపాడు. అక్కడ రెండు సూపర్కార్లు, ఎన్నో చిరునవ్వులు, చిన్ననాటి కలను నెరవేర్చుకున్న ఒక వ్యక్తి ఉన్నాడని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by RAKESH KUMAR (@rakesh_knv) -
పడిక్కల్ బ్యాటింగ్ జోరు
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా జరుగుతున్న వామప్ మ్యాచ్లో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (164 బంతుల్లో 142 నాటౌట్; 18 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా సాయి సుదర్శన్ శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ నుంచి తప్పుకోగా... తుది జట్టులో అతడి స్థానంలో పడిక్కల్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్లో శనివారం రెండో రోజు ఆట ముగిస సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. పడిక్కల్ భారీ శతకంతో కదం తొక్కగా... రవీంద్ర జడేజా (117 బంతుల్లో 63; 7 ఫోర్లు) హాఫ్సెంచరీతో రాణించాడు. గిల్ స్థానంలో ఈ మ్యాచ్లో భారత కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ (40; 5 ఫోర్లు, 1 సిక్స్), మానవ్ సుతార్ (41; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో గుర్నూర్ బ్రార్ (18 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) ఐదు బంతుల వ్యవధిలో నాలుగు సిక్స్లు కొట్టడం విశేషం. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్, అసాంక మనోజ్ చెరో రెండు వికెట్లు తీశారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... ఇరు జట్లు చెరో 45 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయనున్నాయి. జైస్వాల్, పంత్ విఫలం... ఓవర్నైట్ స్కోరు 363/8 వద్దే శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) రెండో బంతికే అవుటయ్యాడు. ఈ దశలో రాహుల్తో కలిసి పడిక్కల్ ఇన్నింగ్స్ను నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 96 పరుగులు జోడించారు. అనంతరం రాహుల్ అవుట్ కాగా... నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చక్కటి డిఫెన్స్తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎంత ప్రయత్నించినా పడిక్కల్, జడ్డూ జోడీని విడదీయలేకపోయారు. హాఫ్ సెంచరీ అనంతరం జడేజా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా... రిషభ్ పంత్ (2) విఫలమయ్యాడు. ధ్రువ్ జురేల్ (1) కూడా త్వరగానే అవుట్ కాగా... మానవ్ సుతార్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పడిక్కల్ పకడ్బందీ డిఫెన్స్, పక్కా టైమింగ్తో షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు.సుదర్శన్ అవుట్ఈ నెల 15 నుంచి శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు టీమిండియా బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యాడు. జట్టు ఎంపిక సమయంలోనే బుమ్రా, సుదర్శన్ ఫిట్నెస్ సాధిస్తేనే సిరీస్లో ఆడించనున్నట్లు సెలక్టర్లు ప్రకటించగా... ఇప్పుడు ఆ ఇద్దరూ జట్టుకు దూరమయ్యారు. గత నెల భారత ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక ‘ఎ’ జట్టుతో ఆడుతున్న సమయంలో సుదర్శన్ కాలి వేలికి గాయమైంది. అప్పటి నుంచి సుదర్శన్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ)లో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. ‘సుదర్శన్ లంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతడు పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని వైద్య బృందం తెలిపింది’ అని బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆంధ్ర ఆటగాడు రషీద్ ఖాన్, మహారాష్ట్ర ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్లో ఒకరిని భారత జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. -
80వ ఏట అడుగిడుతున్న స్వాతంత్య్రం
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఆగస్టు 15 నాటితో 79 ఏళ్లు పూర్తవుతున్నాయి. మన స్వాతంత్య్రం 80వ ఏట అడుగిడుతోంది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్వారు మన దేశాన్ని దాదాపు రెండువందల సంవత్సరాలు పాలించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857లో సిపాయిల తిరుగుబాటు చెలరేగింది. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి పోరాటమది. ఆ పోరాటం విఫలమైన తర్వాత కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు నడిచాయి. దక్షిణాఫ్రికాలో 1906లో అహింసా పోరాటంతో విజయం సాధించిన గాంధీజీ స్వదేశానికి తిరిగి వచ్చాక 1917 ఏప్రిల్ 17న తొలిసారిగా ‘చంపారన్ సత్యాగ్రహ’ ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ నాయకత్వంలో ఏకమైన ప్రజానీకం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉద్ధృతం చేసింది. చివరకు బ్రిటిష్ పాలకులు గద్దె దిగడంతో 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది.భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రభుత్వం ‘స్వేచ్ఛను గౌరవిస్తూ, భవితకు స్ఫూర్తిన్తూ’ నినాదాన్ని నేపథ్యంగా ఎంచుకుంది. గడచిన 79 ఏళ్లలో అధిగమించాల్సిన సమస్యలు చాలానే ఉన్నా, మన దేశం శాస్త్ర సాంకేతిక ఆర్థిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది. ఈసారి ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జరగనున్న వేడుకల్లో తొలిసారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సైనిక సామగ్రిని ప్రదర్శించనున్నారు. ప్రధాని ప్రసంగాన్ని ‘డిజిటల్ ఇండియా భాషిణి’ ద్వారా ఏకకాలంలో ఇరవై భాషల్లో అప్పటికప్పుడే ప్రసారం చేయనున్నారు.ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర పోరాటంలో కొన్ని కీలకమైన మైలురాళ్లు...1857ఆనాటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది.1858భారత ప్రజల రాజకీయ ఆకాంక్షల సాధన కోసం భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది.1905బెంగాల్ విభజన. దీనికి పర్యవసానంగా స్వదేశీ ఉద్యమం మొదలైంది.1919జలియన్వాలాబాగ్ దురంతం జరిగింది. తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమజ్వాలలు ఎగసిపడ్డాయి.1920–22గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరకరణోద్యమం దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా నడిచింది.1930గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు.1942‘క్విట్ ఇండియా’ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో ఊరూరా నిరసనలు జరిగాయి.1947 ఆగస్టు15బ్రిటిష్ ప్రభుత్వం భారత్కు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. -
భారత్ కి బిగ్ అలర్ట్! వచ్చేసిన 3,500 KM రాక్షస మేఘాలు!
-
మిసైల్ సక్సెస్.. ఒక్కసారి పేల్చితే పాకిస్తాన్ మొత్తం బూడిద
-
భారత్పై 100 శాతం టారిఫ్.. తిప్పలు అమెరికాకే?
రష్యా చమురు వంకతో.. భారత్, చైనాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే ప్రతిపాదన అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయం అమెరికా ప్రయోజనాలకే నష్టం కలిగిస్తుందని రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ హెచ్చరించారు. భారీ టారిఫ్లు విధించడం అంటే.. స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించారు.రష్యాపై ఆంక్షలకు సంబంధించిన బిల్లుపై అమెరికా సెనేట్లో చర్చ సందర్భంగా భారత్, చైనాల నుంచి వచ్చే వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే సెనేట్ ఆమోదం పొందడంతో.. నెక్స్ట్ ప్రతినిధుల సభ వద్దకు వెళ్తుంది. ఆ తర్వాత ట్రంప్ దాని మీద సంతకం చేస్తే.. అమల్లోకి వస్తుంది. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా స్పందించిన సెనేటర్ రాండ్ పాల్.. ఇలాంటి చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.“భారం అమెరికన్లపైనే పడుతుంది”టారిఫ్ల వల్ల విదేశీ కంపెనీలే నష్టపోతాయన్న ట్రంప్ వాదనను రాండ్ పాల్ కొట్టిపారేశారు. దిగుమతి సుంకాల అసలు భారం అమెరికా దిగుమతిదారులు, వినియోగదారులపైనే పడుతుందని అన్నారు. ఇప్పటికే జీవన వ్యయాల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లపై మరింత భారం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.Breaking: "America imposing 100% tariffs on India and China is the economic equivalent of shooting ourselves in the foot," warns US Senator Rand Paul pic.twitter.com/C2GvQOg3HY— Shashank Mattoo (@MattooShashank) August 8, 2026“100 శాతం టారిఫ్లు విధించడం ఆర్థికంగా మన కాళ్లపై మనమే తుపాకీతో కాల్చుకున్నట్లే” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి నిర్ణయాలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.భారత్తో సంబంధాలపై ప్రభావం?భారత్ అమెరికాకు కీలక భాగస్వామి అని పేర్కొన్న రాండ్ పాల్.. ఇలాంటి భారీ సుంకాలు రెండు దేశాల మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని సూచించారు. సెనేటర్ రాన్ వైడెన్ కూడా ఈ టారిఫ్ ప్రతిపాదనలపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం.రష్యా చమురు కొనుగోళ్లే కారణంరష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ టారిఫ్ ప్రతిపాదన తీసుకొచ్చారు. భారత్, చైనాలతో పాటు రష్యా ఇంధన వాణిజ్యానికి సహకరిస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఇచ్చేలా బిల్లు రూపొందించారు. ఈ బిల్లు అమెరికా సెనేట్లో 86-11 ఓట్లతో ఆమోదం పొందింది. అయితే ఇది చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ ఆమోదం పొందాల్సి ఉంది.ట్రంప్ విధానాలపై చర్చగతంలో కూడా రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేయడాన్ని కారణంగా చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 25 శాతం టారిఫ్లు విధించారు. అయితే విస్తృత వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నాల నేపథ్యంలో తర్వాత వాటిని సడలించారు.ప్రస్తుతం 100 శాతం టారిఫ్ల ప్రతిపాదన మళ్లీ తెరపైకి రావడంతో భారత్పై ప్రభావం కంటే.. అమెరికా వినియోగదారులపై పడే భారం, రెండు దేశాల సంబంధాలపై దాని ప్రభావంపై చర్చ మొదలైంది. -
అమెరికానే కాపాడలేకపోయింది.. ఇంక పాక్-టర్కీ ఏం చేస్తాయి?
పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా సమీకరణాలకు సంకేతంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మూడు దేశాలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక దేశంపై దాడిని మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించేలా రూపొందించిన ఈ రక్షణ కూటమి.. సౌదీ భద్రతా వ్యూహంలో కీలక మార్పుగా మారింది. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.టర్కీ, పాకిస్థాన్తో చేసుకున్న రక్షణ ఒప్పందాలు సౌదీ అరేబియాకు శాశ్వత భద్రతను అందించలేవని ఇరాన్ విమర్శించింది. అమెరికానే కాపాడలేకపోతోంది.. ఇంక పాక్ టర్కీలు వచ్చి ఏం చేస్తాయి?.. ఏం సాధిస్తాయి? అంటూ డీల్పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల కమిషన్ సభ్యుడు ఎబ్రహీం రెజాయీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘కాగితపు ఒప్పందాలతో భద్రత రాదు’సోషల్ మీడియా వేదికగా స్పందించిన రెజాయీ.. “టర్కీ, పాకిస్థాన్తో కుదుర్చుకున్న కాగితపు ఒప్పందాలు సౌదీకి భద్రతను తీసుకురావు. అమెరికాతో ఎన్నో ఏళ్లుగా కొనసాగించిన సంబంధాలు కూడా సౌదీకి భద్రత ఇవ్వలేదు” అని వ్యాఖ్యానించారు. సౌదీ తన విధానాలను మార్చుకుంటే ఇతర దేశాల నుంచి భద్రత కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. గతంలో సౌదీ భద్రత కోసం అమెరికాపై ఆధారపడిన తీరును ప్రస్తావిస్తూ ఇరాన్ ఈ విమర్శలు చేసింది.మక్కా వేదికగా మూడు దేశాల డిఫెన్స్ డీల్అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఈ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది. మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఉమ్మడి భద్రతా వ్యూహాలను రూపొందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.ఒకరిపై దాడి.. ముగ్గురిపై దాడిగానే!ఈ రక్షణ ఒప్పందంలోని కీలక అంశం పరస్పర భద్రత. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించేలా నిబంధనలు రూపొందించారు. దాడి జరిగిన సమయంలో పరస్పర సహకారం, రక్షణ రంగంలో సమన్వయం పెంచుకోవడం ఈ ఒప్పందం లక్ష్యమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మూడు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.సౌదీ ఎందుకు కొత్త రక్షణ భాగస్వామ్యాల వైపు?ఇరాన్తో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరిస్తోంది. గతంలో సౌదీ చమురు కేంద్రాలు, కీలక మౌలిక వసతులపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్లోని మిలీషియా గ్రూపులు ఉన్నాయని సౌదీ ఆరోపించింది. దీంతో భద్రత విషయంలో కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవాలని రియాద్ భావిస్తోంది.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానం ప్రభావితమవడం వంటి పరిణామాలు కూడా ఈ రక్షణ ఒప్పందానికి కారణాలుగా మారాయి.భారత్-పాక్ కోణంలోనూ చర్చఈ ఒప్పందం మరో కోణంలోనూ చర్చకు దారితీస్తోంది. ఒకవేళ భవిష్యత్లో పాకిస్థాన్పై భారత్ సైనిక చర్య చేపడితే ఈ రక్షణ ఒప్పందం ఎలా ప్రభావితం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందంలోని పరస్పర రక్షణ నిబంధన ప్రకారం.. పాకిస్థాన్పై జరిగే దాడిని మిగిలిన దేశాలు ఎలా పరిగణిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి రక్షణ ఒప్పందాల్లో ప్రతిస్పందన విధానం, సైనిక సహాయం, దౌత్య మద్దతు వంటి అంశాలు ఆయా దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఆ లెక్కన.. ఈ ఒప్పందం ఉన్నంత మాత్రాన సౌదీ అరేబియా, టర్కీ వెంటనే ఏదైనా ఘర్షణలోకి దిగాల్సిందేనని స్పష్టమైన హామీ లేదు.మారుతున్న సమీకరణాలుపాక్, సౌదీ, టర్కీ రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు సౌదీ తన భద్రతా వ్యవస్థను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దేశాల కొత్త రక్షణ కూటమి భవిష్యత్లో పశ్చిమాసియా శక్తి సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
బిల్లు పాస్.. భారత్పై ట్రంప్ 100% టారిఫ్ అస్త్రం!
ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు అందుతున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇచ్చే బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లలోనే కాకుండా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లోనూ చర్చకు దారితీసింది.రష్యా ఇంధన ఆదాయాన్ని తగ్గించడం ద్వారా మాస్కోపై ఒత్తిడి పెంచాలన్నది అమెరికా వ్యూహం. అయితే ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలు కొత్త ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది.ఏమిటీ రష్యా శాంక్షన్స్ బిల్లు?అమెరికా సెనేట్ ఆమోదించిన ఈ బిల్లు పేరు “లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026”. రష్యా చమురు, గ్యాస్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని తగ్గించడం, ఉక్రెయిన్పై యుద్ధానికి ఉపయోగపడుతున్న ఆర్థిక వనరుల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.ఈ బిల్లు సెనేట్లో 86-11 ఓట్లతో భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. ఇక ఇది అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అధ్యక్షుడు ట్రంప్ సంతకం తర్వాత ఇది చట్టంగా మారనుంది.అయితే.. ఈ బిల్లు పేరులో ఇరాన్ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిణామాల్లో ప్రధాన దృష్టి రష్యా చమురు ఆదాయాన్ని అడ్డుకోవడంపైనే ఉంది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్లు విధించే అధికారం ట్రంప్కు ఇవ్వడమే ఈ బిల్లులో అత్యంత కీలక అంశంగా మారింది.రష్యా ఇంధనం కొనే దేశాలపై టారిఫ్ పిడుగురష్యా చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా మాస్కో ఆదాయానికి గండికొట్టాలని అమెరికా భావిస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా ఇంధనాన్ని అత్యధికంగా కొనుగోలు చేసే టాప్ ఐదు దేశాలపై అమెరికా అధ్యక్షుడికి 100 శాతం వరకు టారిఫ్లు విధించే అధికారం లభిస్తుంది.అంటే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించే దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. దీంతో ఇంధన కొనుగోళ్ల అంశం కేవలం ఆర్థిక వ్యవహారంగా కాకుండా అంతర్జాతీయ దౌత్య అంశంగా మారనుంది.భారత్, చైనాలపైనే ఎందుకు గురి?ప్రస్తుతం రష్యా చమురు, గ్యాస్కు అతిపెద్ద కొనుగోలుదారుల జాబితాలో చైనా, భారత్, అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియా ఉన్నాయి. ఈ దేశాల ఇంధన కొనుగోళ్లే రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలక మద్దతుగా మారాయని అమెరికా వాదిస్తోంది.2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత పాశ్చాత్య దేశాలు మాస్కోపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే రష్యా చమురు తక్కువ ధరకు లభించడంతో భారత్, చైనా వంటి దేశాలు కొనుగోళ్లను కొనసాగించాయి. దీంతో రష్యా ఇంధన ఆదాయాన్ని పూర్తిగా నిలువరించాలన్న అమెరికా ప్రయత్నాల్లో ఈ దేశాలు ప్రధానంగా మారాయి.భారత్కు అసలు పరీక్ష ఎక్కడ?రష్యా చమురు భారత్కు గత కొన్నేళ్లుగా కీలక ఇంధన వనరుగా మారింది. తక్కువ ధరకు ముడి చమురు లభించడం వల్ల దేశ ఇంధన అవసరాలను తీర్చుకోవడంలో ఇది ఉపయోగపడుతోంది. 2026 జూన్లో భారత్ రష్యా ముడి చమురు కొనుగోళ్లు భారీగా పెరిగాయి. మే నెలతో పోలిస్తే 34 శాతం పెరిగి 4.5 బిలియన్ యూరోలకు చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి.అయితే ఇప్పుడు భారత్ ముందు రెండు కీలక అంశాలు నిలిచాయి. ఒకవైపు తక్కువ ధరకు లభించే రష్యా చమురు ద్వారా ఇంధన భద్రతను కొనసాగించాల్సి ఉంది. మరోవైపు అమెరికాతో ఉన్న వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.చైనాపైనా భారీ ప్రభావంఈ బిల్లు ప్రభావం ఎక్కువగా చైనాపై ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా శిలాజ ఇంధనాల అతిపెద్ద కొనుగోలుదారుగా చైనా కొనసాగుతోంది. 2026 జూన్ గణాంకాల ప్రకారం రష్యా ఇంధన ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయంలో చైనా వాటా గణనీయంగా ఉంది. ఐదు అతిపెద్ద కొనుగోలుదారుల ఆదాయంలో 41 శాతం చైనా నుంచే వచ్చినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.రష్యా చమురు ఎగుమతుల్లో చైనా దాదాపు సగం కొనుగోలు చేస్తుండగా.. భారత్ కూడా 36 శాతం వాటాతో కీలక కొనుగోలుదారుగా ఉంది. దీంతో ఈ బిల్లు రష్యాపైనే కాకుండా అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.లిండ్సే గ్రాహమ్ పేరుతో ఎందుకు?ఈ బిల్లుకు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కీలక రూపకర్తల్లో ఒకరు. ఉక్రెయిన్ పర్యటన అనంతరం జూలై 11న ఆయన ఆకస్మికంగా మరణించారు. అయినప్పటికీ ఆయన రూపొందించిన ఆంక్షల ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. ఆయనకు గౌరవంగా ఈ బిల్లుకు ఆయన పేరు పెట్టారు.పుతిన్, రష్యా సంస్థలపైనా చర్యలుఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే కాదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉన్నతాధికారులు, సంపన్న వర్గాలు, ఆర్థిక సంస్థలపై కూడా ఆంక్షలు విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్న “షాడో ఫ్లీట్” చమురు నౌకల నెట్వర్క్పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.500 శాతం నుంచి 100 శాతానికి తగ్గిన టారిఫ్ ప్రతిపాదనఈ బిల్లు మొదటి రూపంలో మరింత కఠినంగా ఉంది. రష్యా ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 500 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదన ఉండేది. అయితే అమెరికా ప్రభుత్వం, చట్టసభ సభ్యుల మధ్య జరిగిన చర్చల తర్వాత దీనిని సవరించారు. చివరకు రష్యా ఇంధన కొనుగోలుదారులపై గరిష్ఠ టారిఫ్ను 100 శాతానికి పరిమితం చేశారు.ట్రంప్కు అధికారం ఇవ్వడంపై విమర్శలుఈ బిల్లుకు అమెరికాలోనే భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు డెమొక్రాట్లు ట్రంప్కు విస్తృత టారిఫ్ అధికారాలు ఇవ్వడం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. టారిఫ్ల భారం చివరకు అమెరికా వ్యాపారాలు, వినియోగదారులపైనే పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఈ చర్య అవసరమని బిల్లు మద్దతుదారులు వాదిస్తున్నారు.ఇక ముందు ఏం జరగనుంది?ప్రస్తుతం ఈ బిల్లు అమెరికా ప్రతినిధుల సభ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే ట్రంప్ సంతకం తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు ప్రశ్న.. ట్రంప్ ఈ అధికారాన్ని వెంటనే ఉపయోగిస్తారా? లేదంటే భారత్, చైనా వంటి దేశాలతో చర్చలు, మినహాయింపులు, దౌత్య మార్గాలను ఎంచుకుంటారా? అన్నదే. అయితే..టారిఫ్లు అమల్లోకి రాకముందే వాటి ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికా చర్యల భయంతో చమురు కంపెనీలు, బ్యాంకులు, షిప్పింగ్ సంస్థలు తమ భవిష్యత్ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది.రష్యా చమురు ఆదాయాన్ని అడ్డుకోవాలన్న అమెరికా వ్యూహం ఇప్పుడు భారత్, చైనా వంటి దేశాలకు కొత్త ఆర్థిక పరీక్షగా మారింది. ట్రంప్ తీసుకునే తదుపరి నిర్ణయాలపైనే ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల భవిష్యత్ ఆధారపడనుంది. -
ఆకట్టుకోని మన బౌలర్లు
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా వామప్ మ్యాచ్లో భారత బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఎలెవన్తో జరుగుతున్న ప్రాక్టీస్ పోరులో మన ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. మూడు రోజుల మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఎల్సీ ఎలెవన్ జట్టు శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. రవిందు రసంతా (143 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్), నిషాన్ ఫెర్నాండో (65 బంతుల్లో 66; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సొనాల్ దినుషా (72 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించారు. పసిండు సూర్యబండారా (35; 6 ఫోర్లు), పవన్ రత్నాయకే (39; 3 ఫోర్లు, 2 సిక్స్లు), అహాన్ విక్రమసింఘే (31; 4 ఫోర్లు), రమేశ్ మెండిస్ (32; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టు మంచి స్కోరు సాధించింది.ఓపెనర్లు నిషాన్, రవిందు తొలి వికెట్కు 110 పరుగులు జోడించి జట్టుకు గట్టి పునాది వేశారు. భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ (13 ఓవర్లలో 0/44), ప్రసిధ్ కృష్ణ (8 ఓవర్లలో 0/32) పెద్దగా ప్రభావం చూపకపోవడంతో... లంక ఓపెనర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. తొలి సెషన్ పూర్తిగా లంక ఆధిపత్యం సాగగా... రనౌట్ రూపంలో భారత్కు మొదటి వికెట్ దక్కింది. అయితే ఆ తర్వాత కూడా ఎస్ఎల్సీ ఎలెవన్ జట్టు ఎక్కడా తగ్గలేదు. క్రీజులోకి వచ్చిన ప్రతీఒక్కరూ తమవంతు పరుగులు రాబట్టడంతో వాళ్ల ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లు ఓడిపోయిన భారత జట్టు... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మార్గాన్ని సుగమం చేసుకోవాలంటే లంకపై సిరీస్ విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆడుతున్న ఈ మ్యాచ్లో భారత పేసర్లు ఆకట్టుకోలేకపోగా... స్పిన్నర్లు ఫర్వాలేదనిపించారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సారాంశ్ జైన్ 11 ఓవర్లలో వికెట్ పడగొట్టకుండా 54 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్కు ఫస్ట్ క్లాస్ హోదా లేకపోవడంతో తొలి రోజంతా శ్రీలంక క్రికెట్ ఎలెవన్ బ్యాటింగ్ చేయగా... శనివారం మనవాళ్లు బ్యాటింగ్ చేయనున్నారు. చివరిదైన మూడో రోజు ఆదివారం చెరో 45 ఓవర్లు ఆడనున్నారు. గిల్కు గాయం గాయం కారణంగా భారత రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ ఈ వామప్ మ్యాచ్ బరిలోకి దిగలేదు. గురువారం నెట్ ప్రాక్టీస్ సమయంలో గిల్ కుడి చేతి వేలికు గాయమైంది. దీంతో ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతినిచ్చారు. గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు కెపె్టన్గా వ్యవహరిస్తున్నాడు. ‘గిల్ కుడి చేతి ఉంగరం వేలికి గాయమైంది. అందుకే వామప్ మ్యాచ్ తొలి రోజు అతడు మైదానంలోకి రాలేదు. బీసీసీఐ వైద్య బృందం అతడిని పరిశీలిస్తోంది. గిల్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ జట్టును నడిపిస్తాడు’ అని బీసీసీఐ ‘ఎక్స్’లో పేర్కొంది. గిల్ పూర్తిగా కోలుకుంటేనే బ్యాటింగ్కు రానున్నాడు. లేకపోతే... ఈ నెల 15 నుంచి శ్రీలంక జట్టుతో జరగనున్న తొలి టెస్టులోనే నేరుగా బరిలోకి దిగుతాడు. -
చైనా ప్లాన్కు భారత్ చెక్! ఆ 27 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు..
చైనా అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాల పేర్లను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం ఇదివరకు తెలిసిందే. అయితే, దీనికి ప్రతిస్పందనగా భారత్ ఆ రాష్ట్రంలోని 27 కీలక ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో గుర్తించింది. ఈ ప్రాంతాలను స్థానికులు, స్వదేశీయులలో అవగాహన పెంచేదిశగా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.చైనా అరుణాచల్ ప్రదేశ్ను 'జాంగ్నాన్'గా పేర్కొంటూ అక్కడి ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతోంది. ఈ చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. కేవలం పేర్లు మార్చడం ద్వారా భూభాగంపై హక్కులు మారవని భారత్ మరోసారి స్పష్టం చేసింది.అయితే, తాజాగా సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించిన మ్యాప్ ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (LAC) సమీపంలోని లాంగ్జు కూడా ఉంది. 1959లో చైనా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు తొలి ప్రధాన ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఎగువన ఉన్నటువంటి సుబన్సిరి జిల్లాలోని సమీప మాజా గ్రామాన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు.అదేవిధంగా డ్జో లా (Dzo La), రిజా లా (Riza La), పుకుర్ లా (Pukur La) వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ఎత్తైన పర్వత మార్గాలు ఉన్నాయి. 1962 భారత్-చైనా యుద్ధం ప్రారంభంలో దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒకటైన థాగ్ లా (Thag La) కూడా ఈ అధికారిక మ్యాప్లో భాగమే.27 ప్రదేశాల జాబితా..అలాగే, 1962 భారత్-చైనా యుద్ధంలో కీలక పాత్ర పోషించిన జస్వంత్ గఢ్, షేర్-ఎ-థాపా మెమోరియల్ వంటి చారిత్రక ప్రాంతాలతో పాటు చాంగ్లాంగ్ జిల్లాలోని జైరాంపూర్ను కూడా ఈ జాబితాలో ఉంది. ఇది తూర్పు అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాల భద్రతా దళాల కదలికలకు ముఖ్యమైన కేంద్రం.అయితే, భారత భూభాగాలకు కల్పిత పేర్లు పెట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు 'ఆధారరహిత కథనాలను సృష్టించే ప్రయత్నాలు' మాత్రమేనని న్యూఢిల్లీ పేర్కొంది. ఇటువంటి చర్యలు వాస్తవ పరిస్థితులను ఎప్పటికీ మార్చలేవని స్పష్టం చేయడంతోపాటు ఇలాంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నాలకు ఆటంకం కలిగించవచ్చని భారత్ హెచ్చరించింది.చైనా తొలిసారిగా 2017లో అరుణాచల్ ప్రదేశ్లోని ఆరు ప్రాంతాలు, 2021లో 15 ప్రాంతాలు, 2023లో మరో 11 ప్రాంతాలకు పేర్లు మార్చినట్లు ప్రకటించింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని భాగమని భారత్ నిరంతరం స్పష్టం చేస్తోంది. అయితే, చైనా చేపట్టే పరిపాలనా లేదా మ్యాప్లకు సంబంధించిన చర్యలు భారతదేశ చట్టపరమైన, భౌగోళిక హక్కులపై ఎలాంటి ప్రభావం చూపవని ఈ సందర్భంగా పేర్కొంది. -
IND vs SL: స్పిన్ ప్రాక్టీస్పై దృష్టి
కొలంబో: సొంతగడ్డపై భారత జట్టు ఇటీవల రెండు టెస్టు సిరీస్లు కోల్పోయింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిన ఈ సిరీస్లలో అనూహ్యంగా ప్రత్యర్థి స్పిన్నర్లు మనపై ఆధిపత్యం ప్రదర్శించారు. స్పిన్ బౌలింగ్ను ఆడటంలో తిరుగులేని రికార్డు ఉన్న టీమిండియా కూడా పూర్తిగా తడబడింది. ఇప్పుడు శ్రీలంకతో భారత్కు అదే తరహా సవాల్ ఎదురు కావచ్చు. లంక జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో పాటు సొంతగడ్డపై వారి బలం రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్కు ముందు స్పిన్లో మరింత సాధన అవసరమని జట్టు భావిస్తోంది. అందుకే నేటి నుంచి జరిగే వామప్ మ్యాచ్లో స్పిన్ను ఎదుర్కోవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ మూడు రోజుల పోరులో శ్రీలంక క్రికెట్ (ఎస్ఎస్సీ) ఎలెవన్లో భారత్ తలపడుతుంది. స్థానిక ఎన్సీసీ గ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్ శ్రీలంకలోని పరిస్థితులపై అలవాటు పడేందుకు కూడా ఉపయోగపడనుంది. భారత్ చివరిసారిగా 2017లో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడింది. నాటి జట్టులో ఉన్న కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మాత్రమే ఇప్పుడు మళ్లీ ఆడుతున్నారు. మిగతా వారందరికీ లంకలో టెస్టు ఆడటం ఇదే మొదటిసారి కానుంది. వామప్ పోరులో భారత బ్యాటర్లంతా బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలింగ్లో ప్రధాన పేసర్ సిరాజ్తో పాటు ప్రసిధ్, గుర్నూర్, ఆకిబ్ నబీ ఉన్నారు. కొత్త స్పిన్నర్లు సుతార్, సారాంశ్లకు తమ స్పిన్ బలాన్ని ప్రదర్శించేందుకు ఇది మంచి అవకాశం. ఇటీవల భారత ‘ఎ’ జట్టు తరఫున బ్రార్, సారాంశ్ మెరుగైన ప్రదర్శన కనబర్చడం సానుకూలాంశం. మరోవైపు శ్రీలంక తరఫున 3 టెస్టులు ఆడిన సొనాల్ దినుష ఎస్ఎల్సీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. ఇషిత విజేసుందర్, రమేశ్ మెండిస్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. -
డిస్కస్ త్రో ఫైనల్లో అమానత్
యుజీన్ (అమెరికా): ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ ఈరోజు పతకాల బోణీ చేసే అవకాశముంది. మహిళల డిస్కస్ త్రో ఈవెంట్లో అమానత్ కంబోజ్... పురుషుల జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్, ధరణీధరన్ ఫైనల్లోకి ప్రవేశించారు. డిస్కస్ త్రో క్వాలిఫయింగ్లో అమానత్ డిస్క్ను 52.58 మీటర్ల దూరం విసిరి ఓవరాల్గా 12వ స్థానంలో నిలిచి ఫైనల్కు చేరింది. డిస్కస్ త్రో ఫైనల్ నేడు జరుగుతుంది. ఆశిష్ జావెలిన్ను 69.87 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో, ధరణీధరన్ 68.07 మీటర్ల దూరం విసిరి 12వ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మొగలి వెంకట్రామ్ రెడ్డి పురుషుల 800 మీటర్ల విభాగంలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించాడు. హీట్–5లో వెంకట్రామ్ 1 నిమిషం 52.81 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్కు చేరుకున్నాడు. -
హసీనా అప్పగింత సాధ్యమా?
రెండేళ్ల క్రితం ఉవ్వెత్తున ఎగిసిపడిన విద్యార్థి ఉద్యమాన్ని అదుపుచేయటం అసాధ్యమని తేలాక హెలికాప్టర్లో అక్కడినుంచి నిష్క్రమించి భారత్లో ఆశ్రయం పొందిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సరిగ్గా ఆ తేదీనే ఎంచుకుని తొలిసారి బుధవారం మీడియాతో మాట్లాడారు. వచ్చే డిసెంబర్లో స్వదేశానికి వెళ్లబోతున్నానని గతంలో చెప్పిన మాటనే పునరుద్ఘాటించారు. తనను జైల్లో బంధిస్తారని తెలిసినా, ఉరికంబం తన కోసం ఎదురు చూస్తున్నదని అర్థమైనా తిరిగి వెళ్లటానికే ఆమె సంసిద్ధులవుతున్నారు. దేశానికి సారథ్యంవహించే నాయకత్వానికి పరిణతి లోపిస్తే కక్ష సాధింపులే సమర్థతగా అనిపిస్తాయి.సాధించిన స్వాతంత్య్రం అర్థరహితమవుతుంది. ఇది బంగ్లాదేశ్ ప్రస్తుత నాయకత్వానికి మాత్రమే కాదు... హసీనాతోసహా బంగ్లా మాజీ పాలకులందరికీ వర్తిస్తుంది. ఆ మాట కొస్తే పాకిస్తాన్ పరిస్థితి కూడా మొదటినుంచీ ఇంతే. అదృష్టవశాత్తూ మన దేశంలో స్వాతంత్య్రోద్యమ నాయకత్వం నుంచి తొలి తరం సారథులు రావటంవల్ల కావొచ్చు...ఆ బెడద లేదు. ఇక్కడ సైతం ఆ పోకడలు తలెత్తుతూనే ఉన్నా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తమై వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. బంగ్లాదేశ్లో తనకెదురైన దుఃస్థితికి హసీనా తనను తానే నిందించుకోవాలి. ప్రజలు మెచ్చి అధికారం కట్టబెట్టాక ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. జీడీపీ పెరిగింది. అంతక్రితంతో పోలిస్తే ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. కానీ ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకోవటానికి ఆమె వేసిన ఎత్తుగడలు అవధులు మీరాయి. వస్తున్న మెజారిటీ చాలదనుకుని ఎన్నికల ఫలితాలు ఏమార్చారు. చివరకు మొత్తం ఎన్నికలే రిగ్గింగ్ చేసే స్థాయికి దిగజారారు. మతోన్మాద శక్తుల ఆటకట్టించేందుకు చర్యలు తీసుకున్నా, సహేతుకమైన అసమ్మతికి సైతం ముద్రలేసి పబ్బం గడుపుకోవాలనుకున్నారు. మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) అధినేత బేగం ఖలీదా జియాను అవినీతి ఆరోపణలతో దీర్ఘకాలం చెరసాలపాలు చేశారు. ఖలీదా సైతం అంతే. తాను రాజ్యమేలిన మూడు దఫాలూ కక్షసాధింపు రాజకీయాల్లోనే మునిగితేలారు. ఆమె కుమారుడు, ప్రస్తుత ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆ వారసత్వాన్నే కొనసాగించదల్చుకున్నట్టు కనబడుతోంది. హసీనా సర్కార్కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పోలీసులు, సైన్యం జరిపిన కాల్పుల్లో 1,400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి లెక్కలే చెబుతున్నాయి. నిజమే కావొచ్చు. జరిగిన తప్పిదాలకు ఆమె బాధ్యత వహించాల్సిందే. కానీ న్యాయవ్యవస్థను మహ్మద్ యూనస్ సలహాదారుగా ఉన్న తాత్కాలిక ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. మతతత్వవాదులు రెచ్చిపోయి హసీనా ఏలుబడిలోని న్యాయమూర్తుల్ని వేధించి రాజీనామాలు చేయించారు. ఉన్నతాధికారుల్ని అరెస్టు చేశారు. హిందూ మైనారిటీల ఇళ్లపై దాడులకు దిగారు. ఇలాంటి వాతావరణంలో జరిగిన విచారణకు విశ్వసనీయత ఉంటుందా?హసీనాను అప్పగించటంలేదన్న ఆగ్రహం బంగ్లాకు ఉంది. ఇదేమీ అసహజం కాదు. కానీ అధికారంలోకొచ్చాక భారత్ను రెచ్చగొట్టేలా తారిఖ్ రెహ్మాన్ చర్యలుంటున్నాయి. జూన్లో చైనాలో నాలుగు రోజులు పర్యటించి, 17 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ‘2+2 డైలాగ్’ పేరిట విదేశాంగ విధానాన్నీ, భద్రతనూ నిర్ణీత వ్యవధిలో చర్చించుకుంటూ ఉండాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. అమెరికాతో ఆయన సాన్నిహిత్యం తెలియందేమీ కాదు. బంగ్లాలో అలజడుల వెనక అమెరికా పాత్ర జగద్విదితం. ఇదిగాక భారత్కు సన్నిహితమైతే విపక్షమైన జమాతే ఇస్లామీ బలపడుతుందేమోనన్న భయంతో రెహ్మాన్ మనవైపు కన్నెత్తి చూడటానికే సాహసించటం లేదు. ఇలాంటి స్థితిలో హసీనాను భారత్ అప్పగిస్తుందని ఆ దేశం అనుకోవటం హాస్యాస్పదం. అందరి మాదిరే మన దేశం ఎటూ స్వీయప్రయోజనాలు చూసుకుంటుంది. దౌత్యరంగంలో ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. బంగ్లా చిత్తశుద్ధితో వ్యవహరిస్తే, ఇంటా బయటా భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపే అత్యుత్సాహాన్ని ఆపుకుంటే ఏ సమస్య అయినా తప్పక పరిష్కారమవుతుంది. అంతకన్నా ముందు హసీనా కుమారుడు ఈ మీడియా సదస్సులో ఆరోపించినట్టు బంగ్లా మరో పాకిస్తాన్గా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెహ్మాన్కుంది. -
రేర్ ఎర్త్ ఖనిజాల్లో ఇండియా ఎక్కడ?
రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ మరింత వేగం పుంజుకుంటు న్నట్లు ఇటీవల చోటుచేసుకుంటున్న పరి ణామాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రంగంలో దాదాపు గుత్తాధిపత్యం చలాయించిన చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికా సహా పలు దేశాలు, ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థ లను అభివృద్ధి చేయడంపై భారీగా పెట్టు బడులు పెడుతున్నాయి. ఈ ఖనిజాల తవ్వకం, శుద్ధీకరణ, శాశ్వత అయస్కాంతాల తయారీని వేగవంతం చేయడానికి ఇటీవల అమెరికా ప్రభుత్వం ‘మైన్–టు–మాగ్నెట్’ పథకం కింద భారీ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. భారత్ కూడా ఈ దిశలో అడుగులు వేస్తోంది. అణుశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్ఈఎల్ విశాఖపట్నంలో రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కేంద్రం ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేసింది. అంతకుముందు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్లు’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భిన్న దేశాల్లో, భిన్న సందర్భాల్లో దాదాపు ఒకే సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి– అసలు రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత తీవ్రంగా పోటీ పడుతున్నాయి?ఎందుకు రేర్?పేరులో ‘రేర్’ అనే పదం ఉన్నప్పటికీ, ఇవి ప్రకృతిలో అత్యంత అరుదుగా లభించే ఖనిజాలు కావు. భూమి పొరల్లో అనేకప్రాంతాల్లో లభిస్తాయి. అయితే, అధిక స్వచ్ఛతతో, లాభదాయకంగా తవ్వి, ఇతర ఖనిజాల నుంచి సులభంగా వేరు చేసి శుద్ధి చేయగల నిల్వలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. అందుకే వీటికి ‘రేర్’ అనే విశేషణం వచ్చింది. అలాగే ‘ఎర్త్’ అనే పదం కూడా ఆ ఖనిజాల మూలస్థానమైన మట్టినిగానీ, నేలనుగానీ సూచించదు. తొలినాళ్లలో ఈ మూలకాలు భూమి నుంచి వెలికితీసిన ఖనిజ ఆక్సైడ్ల రూపంలోనే శాస్త్రవేత్తలకు మొదటిసారిగా పరిచయం కావడంతో, వాటికి ‘రేర్ ఎర్త్’ అనే పేరు స్థిరపడింది. మొత్తం 17 రేర్ ఎర్త్ మూల కాలు ఉన్నాయి.ఈ మూలకాలపై ప్రపంచం ఇంతటి ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం, సాధారణ లోహాలకు భిన్నంగా ఉండే వాటి అసాధారణ రసాయన, భౌతిక లక్షణాలే. వీటితో తయారయ్యే శాశ్వత అయ స్కాంతాలు పరిమాణంలో చిన్నవైనా, ఆకర్షణ శక్తిలో బలంగా ఉంటాయి. విద్యుత్ వాహనాల మోటార్లు, విండ్ టర్బైన్లు, విమా నాలు, రక్షణ రంగ పరికరాల్లో సుమారు 200 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకునే అధిక ఉష్ణోగ్రతల్లోనూ డిస్ప్రోసియం వంటి రేర్ ఎర్త్ మూలకాలు తమ అయస్కాంత శక్తిని పదిలపరచుకోగలవు. ఎందుకంత ప్రాముఖ్యం?ఇవి నేడు మనం నిత్యం ఉపయోగిస్తున్న అనేక ఆధునిక పరిక రాలకు కీలక ఆలంబనగా మారాయి. స్మార్ట్ఫోన్ , ఎల్ఈడీ టీవీ, ఇయర్బడ్స్, విద్యుత్ వాహనం, విండ్ టర్బైన్ , ఎంఆర్ఐ యంత్రం, ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ విమానాలు– ఇలా నేడు మనం ఉపయోగించే దాదాపు ప్రతి ఆధునిక పరికరం తయారీలో రేర్ ఎర్త్ మూలకాల పాత్ర ఉంటుంది. వీటిలో నియోడిమియంను అత్యంత శక్తిమంతమైన శాశ్వత అయస్కాంతాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తే, లాంథనం అధిక నాణ్యత గల కెమెరా లెన్సులు, బ్యాటరీల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్, అంతరిక్ష సాంకేతికత, స్వయంనియంత్రిత వాహనాల వంటి సమకాలీన ఆవిష్కరణలకు కూడా ఈ మూలకాలే చోదక శక్తిగా నిలుస్తున్నాయి.కోవిడ్ మహమ్మారి, తాజాగా హోర్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా శృంఖలల బలహీనతను మరోసారి తేటతెల్లం చేశాయి. అత్యవసర వనరుల కోసం ఒకే దేశంపై అధికంగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ప్రపంచం అనుభవపూర్వకంగా ఈ సందర్భాల్లో గ్రహించింది. ఇదే సమయంలో అమెరికా, చైనా మధ్య సాంకేతిక ఆధిపత్య పోటీ తీవ్ర తరమైంది. రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా పరిమితులు విధించడం ఆందోళనను మరింత పెంచింది. ప్రపంచంలోనే అత్యధిక రేర్ ఎర్త్ ఖనిజ నిల్వలు చైనాలో లేనప్పటికీ, గత మూడు దశాబ్దాల కృషి ఫలితంగా ఈ రంగంలో గుత్తాధిపత్యం మాత్రం దానిదే. ముడి ఖనిజాల తవ్వకంతో ఆగిపోకుండా, వాటి శుద్ధీకరణ, శాశ్వత అయ స్కాంతాలు, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ వరకు మొత్తం విలువ గొలుసుపై చైనా క్రమంగా ఆధిపత్యం సాధించింది.భారత్ ఏం చేయాలి?భారత్లో విస్తారమైన రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నప్పటికీ, వెలికితీత అనంతర దశల్లో ఇంకా వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన వ్యూహానికి పదును పెట్టుకుంటూ, రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకానికే పరిమితం కాకుండా, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీ కేంద్రాన్ని ఐఆర్ఈఎల్ ప్రతిపాదించడం ఆహ్వానించదగ్గ పరిణామం. రేర్ ఎర్త్ ఖనిజాల రంగంలో ప్రపంచంతో పోటీ పడాలంటే గనులతో పాటుగా వాటిని శుద్ధి చేయగల, శాశ్వత అయస్కాంతా లుగా మలచగల, అత్యాధునిక ఉత్పత్తులుగా తీర్చిదిద్దగల నిపుణుల లభ్యత కూడా కీలకం. ఈ దిశగా భారతదేశంలో ఇప్పటివరకూ అంతగా ఆదరణకు నోచుకోని మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెటీరి యల్స్ సైన్స్, రేర్ ఎర్త్ సాంకేతికతలను మరింత ప్రోత్సహించాలి. ఐఐటీలు, ఎన్ ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో రేర్ ఎర్త్ మెటలర్జీ, క్రిటికల్ మినరల్స్, మాగ్నెట్ టెక్నాలజీ వంటి ప్రత్యేక కోర్సులు, పరిశోధన కేంద్రాల ఏర్పాటు తక్షణావసరం. అయితే వీటికి సమర్థమైన ప్రత్యామ్నాయాలను కనుగొనగలమా? సముద్ర గర్భం, చంద్రుడిపై ఉన్న ఈ ఖనిజ నిక్షేపాలను వినియోగించడం సాధ్యమవుతుందా? వీటి తవ్వకం, శుద్ధీకరణ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలు పరిశోధనా సంస్థలకే పరిమితం కాకూడదు. అవి సామాన్య ప్రజలకు ఉపయోగపడే, అందుబాటులో ఉండే ఉత్పత్తులు, సాంకే తిక పరిష్కారాలుగా రూపాంతరం చెంది నప్పుడే ఆ పరిశోధనల పరమార్థం నెరవేరినట్లవుతుంది.కృష్ణ బాలాజి పల్లపోతువ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు -
ఇదీ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి
జైపూర్: ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పైకప్పు ఓ భాగం కూలి మహిళపై పడటంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమెకు 2 కుట్లు వేయాల్సి వచ్చింది. సాధారణంగా బయట గాయాలైతే కుట్లు వేయించుకోవడానికి ఆసుపత్రికి వస్తారు. కానీ, ఆసుపత్రుల్లోనే గాయాలు అవుతుండడం మన దౌర్భాగ్యం.రాజస్థాన్లోని చూరు జిల్లా సుజన్గఢ్లోని దుర్గాదత్ ఫతేపురియా మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కిరణ్ మేఘ్వాల్ (25) బయటకు వస్తుండగా, వరండాలోని పైకప్పు ఓ భాగం ఆమెపై పడింది. సుజన్గఢ్ ప్రధాన వైద్య అధికారి డాక్టర్ పురుషోత్తం కర్వా దీని గురించి మాట్లాడుతూ.. మేఘ్వాల్కు 2 కుట్లు వేయాల్సి వచ్చిందన్నారు. “ఆగస్టు 4న మరమ్మతుల కోసం ప్రజా నిర్మాణ శాఖకు లేఖ రాశాం. ఇప్పుడు మళ్లీ లేఖ పంపాం” అని చెప్పారు.వరండాతో పాటు మరో గదిలో కూడా ప్లాస్టర్ కొంత ఊడిపోయిందని ఆయన తెలిపారు. అయితే ఆసుపత్రి అంతటా ఇదే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. “ఆ భాగాన్ని కూల్చాలా లేక మరమ్మతులు చేయాలా అన్న విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఓ మేస్త్రీని కూడా పిలిచాం” అని చెప్పారు.సిగ్గుచేటు అంటున్న కాంగ్రెస్ ఈ ఘటనను కాంగ్రెస్ సిగ్గుచేటుగా పేర్కొంది. “ప్రజలు చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్తారు. కానీ రాజస్థాన్లో ఆసుపత్రులే ప్రాణాంతకంగా మారుతున్నాయి” అని కాంగ్రెస్ ఎక్స్లో పోస్టు చేసింది. “ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. వైద్యుడిని కలిసేలోపే పైకప్పు ప్లాస్టర్ ఆమెపై పడింది. బీజేపీ ప్రభుత్వ ఘోర అవినీతి కారణంగా ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాలు కూలిపోతున్నాయి. ఈ ప్రభుత్వ దృష్టిలో ప్రజల ప్రాణాలకు విలువ లేదు. ప్రజలు బతికినా చనిపోయినా పట్టించుకోకుండా సంపద దోచుకోవడం, భారీ స్థాయిలో కమీషన్లు తీసుకోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉంది” అని విమర్శించింది.రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతాస్రా దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా అభివర్ణించారు. “పాఠశాల అయినా, ఆసుపత్రి అయినా బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. శిథిలావస్థకు చేరిన భవనాలు, కూలిపోతున్న వ్యవస్థలు, ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది” అని అన్నారు.“రాజస్థాన్లో ఒకసారి పాఠశాల పైకప్పు కూలిపోతుంది, మరోసారి ఆసుపత్రిలో ప్లాస్టర్ రోగులపై పడుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇది కేవలం ప్రమాదం కాదు. బీజేపీ ప్రభుత్వ హయాంలో పెరిగిపోయిన అవినీతి, నిర్లక్ష్యం, దెబ్బతిన్న వ్యవస్థలకు ఇది కఠిన వాస్తవం” అని ఆయన అన్నారు. -
సీజేపీ జాతీయ కార్యవర్గం ఇదే.. తెలుగు వ్యక్తికి చోటు
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గురువారం జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దేశవ్యాప్త కార్యక్రమం ‘క్యా బోల్తీ పబ్లిక్’ను కూడా ఇవాళే ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నుంచి పార్టీ దేశమంతా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతుందని తెలిపారు. సీజేపీ ఇకపై నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను తమ రాజకీయ కార్యాచరణలో ప్రధానంగా నిలపనుంది.సీజేపీ జాతీయ కార్యవర్గంజాతీయ కన్వీనర్- అభిజీత్ దీప్కేకో-కన్వీనర్లు - అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ - అజింక్యా షిండేఆర్గనైజేషన్ కో ఇన్చార్జ్- దీపక్ బలియన్జాతీయ కార్యదర్శి- ఆఫ్రీన్ నవాజ్సీజేపీ మీడియా లీడ్ -విజయ్ రెడ్డి మల్లంగి (తెలుగు వ్యక్తి )న్యాయ వ్యవహారాల ఇన్చార్జ్ - రత్న సింగ్రీసెర్చ్ & పాలసీ లీడ్ - వైష్ణవి గౌర్టెక్నాలజీ లీడ్- రోహన్ దేశ్పాండేఫైనాన్స్ లీడ్ -యోగేష్ ఇంగాలేజోనల్ లీడర్షిప్గా..నార్త్ జోన్- దీపక్ బలియన్దక్షిణ జోన్ -విజయ్ రెడ్డి మల్లంగి (తెలుగు వ్యక్తి)తూర్పు & ఈశాన్య జోన్లు- అంకిత్ భరద్వాజ్పశ్చిమ జోన్- యోగేష్ ఇంగలేరాబోయే ఆరు నెలల్లో, సీజేపీ భారతదేశవ్యాప్తంగా రాష్ట్ర సమన్వయ కమిటీలతో పాటు లోక్సభ, నగర స్థాయి సమన్వయ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. -
సీఆర్పీఎఫ్ జవాన్ల ఆత్మహత్యలు .. అత్యధికం విధుల్లో ఉన్నప్పుడే..
న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందిలో ఆత్మహత్యల ఘటనలు ఆందోళనకర స్థాయికి చేరాయి. అధికారిక సమాచారం ప్రకారం 2025లో సీఆర్పీఎఫ్ సిబ్బందిలో ఆత్మహత్యల సంఖ్య గత ఐదేళ్లలో అత్యధికంగా 59కి చేరింది. 2021 నుంచి మే 2026 వరకు ఉన్న కాలానికి సంబంధించి సేకరించిన ఈ డేటా, సిబ్బంది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. వృత్తిగత, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత సాధించలేకపోవడమే ఈ దుర్ఘటనలకు ప్రధాన కారణమని సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.వివరాల ప్రకారం 2021లో 57, 2022లో 43, 2023లో 57, 2024లో 46, 2025లో 59 ఆత్మహత్యలు నమోదయ్యాయి. అలాగే 2026 మే నాటికి మరో 19 కేసులు వెలుగుచూశాయి. మొత్తం పరిశీలనా కాలంలో 281 ఆత్మహత్యలు జరిగాయి. వీటిలో దాదాపు 77 శాతం (216 కేసులు) సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడే జరగడం గమనార్హం. సెలవులో ఉన్నప్పుడు 65 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా 2025లో సెలవులో ఉండి బలవన్మరణానికి పాల్పడిన వారి సంఖ్య 19కి చేరి, మునుపటి మూడేళ్ల సగటు కంటే రెట్టింపు కావడం గమనించదగ్గ విషయం.వీరు ఆత్మహత్యలకు ఉపయోగించిన పద్ధతులను విశ్లేషిస్తే, ఉరి వేసుకోవడం, ఆయుధాలతో కాల్చుకోవడం ద్వారానే దాదాపు అన్ని (94 శాతం) ఘటనలు జరిగాయి. 281 కేసుల్లో 136 మంది ఉరివేసుకుని, 127 మంది కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు. భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సభ్యుల మరణాలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువుకు సంబంధించి తగిన అవకాశాలు లేకపోవడం వంటి వ్యక్తిగత కారణాలే ప్రధానంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయని ప్రభుత్వ టాస్క్ఫోర్స్ నివేదిక వెల్లడించింది. మగ సిబ్బందిలో సమస్యలను తోటివారితో పంచుకోవడానికి వెనుకాడటం వల్ల ఒత్తిడి పెరుగుతోందని, మహిళా సిబ్బందిలో ఆత్మహత్యల ప్రయత్నాలు తక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: ల్యాండ్మైన్ పేలి ఇద్దరు సైనికులకు తీవ్ర గాయాలు! -
కోర్టు ధిక్కారంపై చట్టం ఏమంటోంది?
‘హైడ్రా’ కమిషనర్పై అరవైకి పైగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలున్నాయనీ, ఆయన్ని ఈ బాధ్యత నుంచి తప్పించాలనీ ఇటీవల తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘అధికార వికేంద్రీకరణ’ ముఖ్యం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. శాసన సభలు చట్టాలు చేస్తాయి, ‘కార్యనిర్వాహకవర్గం’ ఆ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలు జరగకపోతే జరిగేలా ఆదేశా లిస్తుంది.స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా న్యాయ స్థానాలు వ్యవహరించేందుకు రాజ్యాంగం ద్వారా తగు ఏర్పాటు జరిగింది. హైకోర్టు, సుప్రీం కోర్టు లకు కంటెంప్ట్ అధికారం కూడా రాజ్యాంగంలోని 215, 129 అధికరణాల ద్వారా దఖలుపడింది. దేశంలోని అన్ని న్యాయ స్థానాలు, అధికారులు సుప్రీం కోర్టుకు సహాయ సహకారాలు అందించాలని 144వ అధికరణం నిర్దేశించింది.కోర్టులు చట్టాలననుసరించి న్యాయ నిర్ణయం చేయాలి. కానీ, సంపూర్ణ న్యాయం చేయడానికి, చట్టాలను దాటి కూడా న్యాయ నిర్ణయం చేసే అధికారం ఆర్టికల్ 142 ద్వారా, సుప్రీంకోర్టుకు (విశేషాధికారాలను) కల్పించింది రాజ్యాంగం. న్యాయస్థానాల తీర్పులను గౌరవించి వాటిని అమలుపరచాలన్నది ప్రాథమిక సూత్రం. ఒక వేళ, న్యాయం జరగలేదని అనిపిస్తే, సుప్రీంకోర్టు వరకు అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంది.చట్టం ఏం చెబుతోంది?న్యాయస్థానాల తీర్పులను గౌరవించకపోతే, న్యాయవ్యవస్థ ఉనికే ప్రశ్నార్థకమౌతుంది. అందుకే న్యాయస్థానాల తీర్పులను గౌరవించ డానికి, అమలుపరచడానికి కోర్టులకు ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం– 1971’ ద్వారా ‘కంటెంప్ట్’ అధికారం కలుగచేసింది పార్లమెంటు. ఈ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం, న్యాయస్థానాల ఆదే శాలు ఉల్లంఘించినవారికి, ఆరు నెలల వరకు జైలు శిక్ష, రెండు వేల రూపాయల వరకు జరిమానా లేక ఈ రెండూ కూడా విధించవచ్చు. కక్షిదారులేకాక, మరెవరైనా న్యాయస్థానాల ఆదేశాల అమలులో అడ్డంకులు కలిగిస్తే, వారు కూడా శిక్షార్హులే. ‘కంటెంప్ట్’ అధికారం కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే కలుగచేసింది ఈ చట్టం. కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికి కాక నిజాయితీగా ‘క్షమార్పణ’ వేడితే శిక్ష వేయకుండా, లేదా తక్కువ కాలానికి శిక్ష విధించవచ్చని ఈ చట్టం స్పష్టం చేసింది. కిందిస్థాయి న్యాయ స్థానాల ఆదేశాలను పాటించనివారిపై ‘కంటెంప్ట్’ను విచారించి శిక్షించే అధికారాన్ని హైకోర్టులకే ఇచ్చింది ఈ చట్టం.కోర్టులు చాలా అరుదుగా ఈ అధికారాన్ని వినియోగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కోర్టు తీర్పులను నిజాయితీగా విమర్శించ డాన్ని ఈ చట్టం ‘కంటెంప్ట్’గా పరిగణించదు. కోర్టు తీర్పులను గుణాత్మకంగా విమర్శించవచ్చు. కానీ, తీర్పునిచ్చిన న్యాయ మూర్తిని వ్యక్తిగతంగా విమర్శిస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారవుతారు. ఇంతవరకు, కోర్టు ధిక్కరణ నేరానికి ఎక్కువ కాలానికి శిక్ష అనుభవించింది జస్టిస్ కర్ణణ్. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతర్ చేయకపోవడమే కాకుండా, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే సమన్లు పంపి, వారికి జైలు శిక్ష విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. మొత్తం మీద ప్రభుత్వ అధికారులే ఎక్కువగా కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కోవడం గమనార్హం.– హరీష్ కుమార్ కొలిచాల, న్యాయవాది, అసిస్టెంట్ జనరల్ మానేజర్ (విశ్రాంత), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
ఉద్యోగానికి గుడ్బై.. సేవే అసలైన విజయం!
స్విట్జర్లాండ్లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని, ఆర్థిక భద్రతను, సకల సౌకర్యాలనూ వదిలి ఇండియాను వెదుక్కుంటూ వచ్చిన సాండ్రా లావి గోజ్కోవిచ్ ఇక్కడ ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతోంది. ‘ఇండియాలో నేను ఇలా చేయాలనుకుంటున్నాను’ అని లావి ఒక ప్రణాళిక వేసుకొని రాలేదు. ఇక్కడ ఆమె అడుగు పెట్టిన తరువాత ఊహించని ప్రణాళిక పుట్టింది. ఆ ప్రణాళికలో నుంచే తన జీవిత లక్ష్యం రూపుదిద్దుకుంది..పశ్చిమబెంగాల్లోని ఒక గ్రామంలో ఒక స్కూల్ ప్రారంభించి పేద పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టిన లావి సాండ్రా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేసింది. మానవ అక్రమరవాణ, గృహహింసకు వ్యతిరేకంగా గళం విప్పింది. తమ కుటుంబాల్లో మార్పు తెచ్చే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది.తాజా విషయానికి వస్తే...తన జీవితంలోని కొన్ని విశేషాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది లావి సాండ్రా. కార్పొరెట్ బోర్డ్ రూమ్ను వదిలి భారతదేశంలోని మారుమూల ప్రాంత స్కూల్ రూమ్లోకి ఎలా వచ్చిందో వివరించింది. గ్రామస్తుల నమ్మకాన్ని చూరగొనడం లాంటి సవాళ్లు ఎన్నో ఆమెకు ఎదురయ్యాయి.ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాలలో ఒకటైన జ్యూరీచ్లో పెరిగిన లావి తన బాల్యం చాలా సంతోషంగా గడిచింది అని చెబుతుంటుంది. తల్లిదండ్రులు ఏది కాదనకుండా ఇచ్చారు. అందులో ఒకటి... ప్రపంచాన్ని చూసే అవకాశం.‘ప్రయాణాల వల్ల ఎన్నో సంస్కృతులను చూసే అవకాశం వచ్చింది. తల్లిదండ్రులు నాకు ఇచ్చిన విలువైన బహుమానం... ప్రయాణించే అవకాశం’ అంటుంది లావి. ఆ ప్రయాణాలలో ఒక జ్ఞాపకం ఆమె మదిలో స్థిరంగా నిలిచిపోయింది. చెప్పులు లేకుండా నడిచి వెళుతున్న ఒక పేద బాలికను చూసి బాధ పడిన లావి తన బూట్లను ఆ అమ్మాయికి ఇచ్చేసింది.‘పంచడంలోని ఆనందం నాకు తొలిసారిగా తెలిసొచ్చిన క్షణం అది’ అని గుర్తు తెచ్చుకుంటుంది లావి.‘ఎంతోమందికి కనీస సౌకర్యాలు లేవు. నాలాంటివారికి చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకు ఇలా?’ అనే ప్రశ్న ఆమెను వెంటాడింది. సామాజిక సేవ రూపంలో కొత్త మార్గాన్ని చూపింది.‘కెరీర్కు సంబంధించిన విజయం నాకు ఆర్థిక సౌకర్యం ఇచ్చింది కానీ, లక్ష్యాన్ని మాత్రం ఇవ్వలేదు అనే విషయాన్ని గ్రహించాను. ఈ క్రమంలోనే నా గురించి కాదు సమాజం గురించి ఎంతో కొంత పని చేయాలనుకున్నాను. అందుకే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు చొక్కాలు, రెండు ప్యాంట్లు సర్దుకొని ఇండియాకు వన్–వే టికెట్ కొనుక్కున్నాను’ అంటోంది లావీ. -
అది కుట్ర ప్రకారం జరిగింది.. షేక్ హసీనా
బంగ్లాలో జరిగింది శాంతియుత విద్యార్థి ఉద్యమం కాదని ఆ విషయంలో విద్యార్థులతో చర్చలు జరపాలనుకుంటున్నామని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. నిరసనల పేరుతో ఉగ్రవాదులు క్రిమినల్స్ రిలీజ్ అయ్యారని ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన కుట్రని ఆరోపిస్తూ వాయిస్ మెసేజ్ రిలీజ్ చేశారు. ఇది తాము నిర్మించిన బంగ్లాదేశ్ కాదని తాను మళ్లీ బంగ్లాదేశ్కు వెళతానని తన దేశాన్ని పునర్నిర్మిస్తానని పేర్కొన్నారు. కాగా గత కొద్ది సంవత్సరాలుగా దేశం విడిచి భారత్లో ఉంటున్న ఆమె.. ఈ రోజు (బుధవారం) ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రసంగించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీనా ప్రసంగాన్ని ప్రసారం చేయడం, ప్రచురించడం చట్టవిరుద్ధమని దేశీయ మీడియాను హెచ్చరించింది.2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్లోనే ఉంటున్నారు. 2025లో నిరసనల అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును హసీనా చట్టబద్ధం కాదంటూ కొట్టిపారేశారు.ఈ నేపథ్యంలో.. తాను స్వదేశం విడిచి రెండేళ్లయిన సందర్భంగా ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె వీడియో లింక్ ద్వారా ప్రసంగించనున్నారు. తన కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్తో పాటు ఇతర వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హసీనా ప్రధానంగా ఏ అంశాలపై మాట్లాడతారన్న వివరాలు వెల్లడికాలేదు.అయితే హసీనా ప్రసంగంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ఆడియో, వీడియో సందేశాలను ప్రసారం చేయడంపై గతంలో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విధించిన నిషేధాన్ని గుర్తుచేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మీడియాను హెచ్చరించింది.మరోవైపు హసీనా వర్గం మాత్రం ప్రభుత్వ వైఖరిని ఖండించింది. దేశ సరిహద్దులు దాటి కూడా భిన్నాభిప్రాయాలను అణచివేయలేరని వ్యాఖ్యానించింది. హసీనా, ఆమె పార్టీ నేతలు డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటారని గతంలో ప్రకటించారు.ఈ పరిణామాలపై భారత్ స్పందిస్తూ.. ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమమని స్పష్టం చేసింది. ఇందులో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రమేయం లేదని, అక్కడ వ్యక్తమయ్యే అభిప్రాయాలకు తాము బాధ్యత వహించబోమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. -
భారత్ నుంచి హసీనా ప్రసంగం.. బంగ్లా మీడియాకు బెదిరింపులు!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరోసారి రాజకీయ కేంద్రబిందువుగా మారారు. దేశం విడిచి భారత్లో ఉంటున్న ఆమె.. బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రసంగించనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీనా ప్రసంగాన్ని ప్రసారం చేయడం, ప్రచురించడం చట్టవిరుద్ధమని దేశీయ మీడియాను హెచ్చరించింది.2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్లోనే ఉంటున్నారు. 2025లో నిరసనల అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును హసీనా చట్టబద్ధం కాదంటూ కొట్టిపారేశారు.ఈ నేపథ్యంలో.. తాను స్వదేశం విడిచి రెండేళ్లయిన సందర్భంగా ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె వీడియో లింక్ ద్వారా ప్రసంగించనున్నారు. తన కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్తో పాటు ఇతర వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హసీనా ప్రధానంగా ఏ అంశాలపై మాట్లాడతారన్న వివరాలు వెల్లడికాలేదు.అయితే హసీనా ప్రసంగంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ఆడియో, వీడియో సందేశాలను ప్రసారం చేయడంపై గతంలో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విధించిన నిషేధాన్ని గుర్తుచేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మీడియాను హెచ్చరించింది.మరోవైపు హసీనా వర్గం మాత్రం ప్రభుత్వ వైఖరిని ఖండించింది. దేశ సరిహద్దులు దాటి కూడా భిన్నాభిప్రాయాలను అణచివేయలేరని వ్యాఖ్యానించింది. హసీనా, ఆమె పార్టీ నేతలు డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటారని గతంలో ప్రకటించారు.ఈ పరిణామాలపై భారత్ స్పందిస్తూ.. ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమమని స్పష్టం చేసింది. ఇందులో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రమేయం లేదని, అక్కడ వ్యక్తమయ్యే అభిప్రాయాలకు తాము బాధ్యత వహించబోమని భారత విదేశాంగ శాఖ తెలిపింది.ఇదిలా ఉంటే.. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను కోరుతూనే ఉంది. హసీనా భారత భూభాగం నుంచి రాజకీయ ప్రకటనలు చేయడంపై ఢిల్లీకి తమ అభ్యంతరాలను తెలియజేసినట్లు బంగ్లాదేశ్ అధికారులు చెబుతున్నారు.హసీనా అధికారం కోల్పోయిన తర్వాత భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆమె వర్చువల్ ప్రసంగం నేపథ్యంలో మరోసారి రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలకు తెరలేచింది. **భారత్ వేదికగా హసీనా గళం వినిపించనుండటం.. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
మోదీ వీడియో.. క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు!
సోషల్ మీడియా దిగ్గజం మెటా చుట్టూ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన ఘటనపై ఇప్పటికే వివరణ ఇచ్చిన మెటా.. దీనిని “టెక్నికల్ ఎర్రర్”గా పేర్కొంటూ క్షమాపణలు చెప్పింది. అనంతరం వీడియోను పునరుద్ధరించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా.. మెటా పనితీరు, అల్గారిథంల నిర్ణయాలపై మరిన్ని వివరాలు కోరుతోంది.ఈ క్రమంలో మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ జోయెల్ కప్లాన్ను కేంద్రం మరోసారి వివరణ కోసం పిలిచినట్లు సమాచారం. వారం రోజుల్లోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. బుధవారం జరిగే సమావేశానికి ఇన్స్టాగ్రామ్ టెక్నికల్ టీమ్ ప్రతినిధులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మెటా అల్గారిథంలు ఎలా పనిచేస్తున్నాయి? ఏ కంటెంట్ను తొలగించాలనే నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు? ప్రముఖ వ్యక్తుల ఖాతాలకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి? అనే అంశాలపై కేంద్రం వివరణ కోరే అవకాశం ఉంది. అలాగే ప్రధాని వీడియో తొలగింపునకు కారణమైన “టెక్నికల్ గ్లిచ్”పై మెటా నుంచి లిఖితపూర్వక వివరణ, క్షమాపణ కోరనున్నట్లు సమాచారం.అసలు వివాదం ఏంటి?జూలై 23న ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. జెన్-జెడ్ యువతను ఉద్దేశించి మాట్లాడిన ఈ వీడియోలో పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనల సమయంలో పోస్టు చేసిన ఈ వీడియోను కొంతకాలం తర్వాత ఫేస్బుక్ నుంచి తొలగించారు.దీనిపై స్పందించిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని, ఆటోమేటెడ్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగానే వీడియో తొలగించబడిందని వివరణ ఇచ్చింది. అనంతరం వీడియోను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దేశ ప్రధాని స్థాయి వ్యక్తికి సంబంధించిన కంటెంట్ కూడా అల్గారిథంల నిర్ణయాల్లో చిక్కుకోవడం టెక్ సంస్థల జవాబుదారీతనంపై కొత్త చర్చకు దారితీసింది.‘టెక్నికల్ ఎర్రర్’తో సరిపెట్టుకోవద్దుసోషల్ మీడియా సంస్థలు కోట్లాది పోస్టులను పరిశీలించేందుకు ఆటోమేటెడ్ అల్గారిథంలను ఉపయోగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్ను గుర్తించి తొలగించడం వీటి ప్రధాన ఉద్దేశం. అయితే కొన్నిసార్లు సరైన కంటెంట్ కూడా పొరపాటున తొలగించబడుతోందనే విమర్శలు ఉన్నాయి. 2016లో వియత్నాం యుద్ధానికి సంబంధించిన పులిట్జర్ అవార్డు పొందిన ప్రసిద్ధ ఫొటోను ఫేస్బుక్ తొలగించింది. నగ్నత్వ నిబంధనల ఉల్లంఘనగా అల్గారిథం గుర్తించడంతో ఈ చర్య తీసుకుంది. తీవ్ర విమర్శల తర్వాత ఫేస్బుక్ తన నిర్ణయం తప్పని అంగీకరించింది. తాజాగా మోదీ వీడియో ఘటనలోనూ మళ్లీ “టెక్నికల్ సమస్య”నే కారణంగా చెప్పడం.. అల్గారిథంల పారదర్శకతపై ప్రశ్నలు పెంచుతోంది.పార్లమెంట్ కమిటీ కూడా ప్రశ్నలుమరోవైపు ఈ వ్యవహారంపై పార్లమెంట్ సమాచార సాంకేతిక వ్యవహారాల కమిటీ కూడా మెటా ప్రతినిధులను ప్రశ్నించింది. సోమవారం జరిగిన సమావేశంలో మెటా అధికారులు వీడియో తొలగింపుపై క్షమాపణలు తెలిపారు. అయితే కేవలం క్షమాపణలు చెప్పడం సరిపోదని, ఇలాంటి నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహిస్తారనే అంశంపై స్పష్టత అవసరమని కమిటీ సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం.ఐటీ కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఈ ఘటనపై స్పందిస్తూ.. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ స్వయంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని వీడియోను తొలగించడం తీవ్రమైన అంశం. అవసరమైతే మెటాకు లభిస్తున్న “సేఫ్ హార్బర్” రక్షణపై కూడా పునరాలోచించాల్సి ఉంటుంది. మూడు రోజుల్లో జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పాలి. బాధ్యులైన వాళ్లందరిపైనా చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.మెటా కొత్త భద్రతా చర్యలుఈ వివాదం నేపథ్యంలో ప్రముఖ ఖాతాల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటామని మెటా కేంద్రానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రధాని వంటి హైప్రొఫైల్ ఖాతాలకు సంబంధించిన పోస్టులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులపై చర్య తీసుకునే ముందు సీనియర్ అధికారులు సమీక్షించే విధానాన్ని అమలు చేయనున్నట్లు మెటా వెల్లడించింది. కనీసం ఇద్దరు సీనియర్ అధికారుల పరిశీలన తర్వాతే తుది నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపింది.అల్గారిథంల వెనుక దాక్కోవద్దుటెక్ సంస్థలు తమ అల్గారిథంలను ఒక “బ్లాక్ బాక్స్”లా ఉంచుతున్నాయనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఏ పోస్టు ఎందుకు తొలగించబడుతుంది? ఏ కంటెంట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు? అనే విషయాల్లో పారదర్శకత తక్కువగా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధాని వీడియో తొలగింపు ఘటనను కేవలం సాంకేతిక లోపంగా కాకుండా.. డిజిటల్ వేదికలపై జవాబుదారీతనం పెంచేందుకు వచ్చిన అవకాశంగా భారత్ చూస్తోంది. క్షమాపణలతో సమస్య ముగియదని.. అల్గారిథంల నిర్ణయాలకు టెక్ సంస్థలు బాధ్యత వహించాల్సిందేననే డిమాండ్ బలపడుతోంది. -
ఎక్కడి బంగ్లాదేశ్? ఎక్కడి ఆదిలాబాద్?
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్లో జరిగిన దొంగతనం కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు మహ్మద్ జౌని అలీ గత కొన్నేళ్లుగా సుమారు 10 నుంచి 12 సార్లు అక్రమంగా, చాలా సులభంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబడ్డాడు. వివిధ రాష్ట్రాల్లోని ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇదే తరహాలో పనిచేసే 12 నుంచి 15 మంది బంగ్లాదేశ్ వాసులతో కూడిన ముఠాతో అతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో జిల్లా పోలీసులు ఇద్దరు బంగ్లాదేశీవాసులతోపాటు ఒక భారతీయ నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. సుమారు తొమ్మిదేళ్లుగా దేశ వ్యాప్తంగా పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు మహ్మద్ జౌని అలీని విచారించగా, పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజస్తాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సంచరిస్తూ ఇళ్ల తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు, బంగారం, వాహనాలు చోరీలకు పాల్పడుతున్నారు. నిందితులు పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్లు నటిస్తూ కాలనీల్లో సంచరిస్తారు. ఇళ్లను రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న వాటిని గుర్తిస్తారు. రాత్రివేళల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతారు. జౌనిపై దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎనిమిదికిపైగా నేరాల కేసులు ఉన్నాయి. ఇదే కేసులో పట్టుబడ్డ మరో సహ నిందితుడు భారత్కు చెందిన తరుణ్ సింగ్పై ఆరుకుపైగా కేసులు నమోదై ఉన్నాయి. ముఠాలోని ఇతర సభ్యులపై కూడా వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు.సహకరించిన వ్యక్తుల పాత్రపై దర్యాప్తు..సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, నిఘా సమాచారం, వివిధ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి కేసును ఛేదించారు. మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన ఇతర సభ్యులు, సహచరులు, అక్రమంగా భారతదేశంలో నివసించేందుకు సహకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు సమకూర్చిన వారి పాత్రపై సంబంధిత రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా పోలీసులు ముందుకెళ్తున్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారే అక్రమ విదేశీయులు, అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర నేర ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఐబీకి వివరాలు పంపిస్తున్నాంఈ దొంగతనం కేసులో మరికొంత మంది బంగ్లాదేశ్ వాసులు ముఠాగా సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రధాన నిందితుడి ద్వారా తెలిసింది. ఆ మిగిలిన వారి కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)కి వివరాలు పంపిస్తున్నాం. అక్రమంగా దేశంలోకి ఎలా ప్రవేశిస్తున్నారు? ఇంకా ఎలాంటి నేరాలు చేస్తున్నారు? అనే విషయాలను రాబడుతున్నాం. వివిధ రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నాం. – అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ -
శ్రీలంక చేరిన భారత బృందం
కొలంబో: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్లో తలపడేందుకు శుబ్మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు కొలంబోకు చేరుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా ఈ మ్యాచ్లు జరుగుతాయి. టాపార్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్ మినహా మిగతా 14 మంది మంగళవారం శ్రీలంకలో అడుగు పెట్టారు. ఈ నెల 15 నుంచి గాలేలో తొలి టెస్టు, 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు నిర్వహిస్తారు. వీటికి ముందు ఈ నెల 7 నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ ఆడుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ రెండు టెస్టుల్లో భారత్ గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాలు మెరుగుపడతాయి. చివరిసారిగా 2017లో శ్రీలంకలో మూడు టెస్టుల సిరీస్ కోసం పర్యటించిన భారత్ 3–0తో క్లీన్స్వీప్ చేసింది. అయితే గత ఏడాది నవంబర్లో సొంతగడ్డపై ఆఖరి టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా... దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో ఓటమి పాలైంది. మరోవైపు సాయి సుదర్శన్ ఫిట్నెస్పై బీసీసీఐ మరింత స్పష్టతను ఆశిస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో రీహాబిలిటేషన్ తర్వాత కూడా అతను పూర్తిగా కోలుకోలేదు. దాంతో జట్టుతో కలిసి అతను శ్రీలంకకు వెళ్లలేదు. ప్రస్తుతం సుదర్శన్ గాయం పరిస్థితిని బోర్డు వైద్యులు సమీక్షిస్తుండగా... అతను త్వరలోనే పూర్తి ఫిట్గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే శుక్రవారం నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లోనే సుదర్శన్ బరిలోకి దిగుతాడు.భారత ఫీల్డింగ్ కోచ్గా శుభదీప్...శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ నుంచి భారత జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు చేపడుతున్నాడు. హైదరాబాద్కు చెందిన టి.దిలీప్ స్థానంలో బీసీసీఐ శుభదీప్ ఘోష్ను కొత్త ఫీల్డింగ్ కోచ్గా నియమించింది. 57 ఏళ్ల శుభదీప్ గతంలో రెండేళ్ల పాటు భారత మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా పని చేశాడు. భారత ‘ఎ’, అస్సాం సీనియర్ టీమ్కు కూడా కోచింగ్ ఇచ్చిన అనుభవం అతనికి ఉంది. అస్సాంకు చెందిన శుభదీప్ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 17 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్లు ఆడాడు. భారత ఫీల్డింగ్ కోచ్గా 2021–2025 వరకు నాలుగేళ్ల పాటు పని చేసిన దిలీప్ ... ఆ తర్వాత కాంట్రాక్ట్ పొడిగింపుతో మరో ఏడాది పని చేశాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ తర్వాత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే కూడా తప్పుకున్నాడు. డస్కటే, దిలీప్ల సేవలను ప్రశంసిస్తూ మంగళవారం బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది. -
‘బంగ్లా’ రాజకీయాల్లో సునామీకి షేఖ్ హసీనా సిద్ధం!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేఖ్ హసీనా ఆగస్టు 5, 2024 నుంచి భారతదేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. ఢాకాలో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా ఆమె తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది. నాటి నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను తమకు అప్పగించాల్సిందిగా భారత్ను పలుమార్లు డిమాండ్ చేసింది. తాజాగా షేఖ్ హసీనా మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె మొదటిసారిగా మీడియా అడిగే ప్రశ్నలకు ఆగస్టు 5న లైవ్లో సమాధానాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం..2024 ఆగస్టులో జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత ఆమె బంగ్లాదేశ్ వీడి భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె కొన్ని లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేశారు కానీ, ఎప్పుడూ నేరుగా మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు ఆమె లైవ్లో మాట్లాడనున్నారనే వార్తలు రావడంతో, హసీనా స్వయంగా కెమెరా ముందుకు వస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. షేఖ్ హసీనా బుధవారం(ఆగస్టు 5)నాడు అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈ సమయంలో ఆమె కెమెరా ముందుకు మాత్రం రారు. ‘ఫస్ట్పోస్ట్’ నివేదిక ప్రకారం.. భద్రత, గోప్యతా కారణాల దృష్ట్యా షేఖ్ హసీనా కెమెరా ముందుకు రారని, భారతదేశంలోని ఒక రహస్య ప్రదేశం నుండి కేవలం ఆడియో లింక్ ద్వారా మాత్రమే ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.ప్రసంగంలో ముఖ్యాంశాలివే..ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియాకు చెందిన ‘ఫారెన్ కరస్పాండెన్స్ క్లబ్’ నిర్వహిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లే తమ ప్రణాళికలు, వ్యూహాలను హసీనా ఈ వేదికగా వెల్లడించే అవకాశం ఉంది. అలాగే, తనపై బంగ్లాదేశ్లో నమోదైన కేసులు, అక్కడి ట్రిబ్యునల్ విధించిన తీర్పులపై ఆమె సమాధానం ఇవ్వనున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ , మాజీ విద్యా మంత్రి మొహిబుల్ హసన్ చౌదరి నౌఫెల్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.బంగ్లాదేశ్లో కలకలం.. భారత్కు హెచ్చరిక..ఈ ప్రసంగానికి సంబంధించిన వార్తలు వెలువడగానే బంగ్లాదేశ్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్కు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నాడు ఢాకా వర్గాలు దీనిపై స్పందిస్తూ.. ఆగస్టు 5న షేఖ్ హసీనా ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయకుండా కట్టడి చేయాలని భారత్ను కోరాయి. ఇటువంటి కార్యకలాపాల వల్ల ఇటీవల రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు హుమాయూన్ కబీర్ మాట్లాడుతూ.. హసీనా కానీ, ఆమెకు సంబంధించిన వ్యక్తులు కానీ, లేదా అవామీ లీగ్ వంటి నిషేధిత సంఘాల నేతలు కానీ భారత భూభాగం నుండి రాజకీయ ప్రకటనలు చేయడానికి లేదా బంగ్లాదేశ్లో అశాంతిని సృష్టించే కార్యకలాపాలకు పాల్పడకుండా భారత్ తగిన చర్యలు తీసుకుంటుందని బంగ్లాదేశ్ ఆశిస్తోందని పేర్కొన్నారు.డిసెంబర్ నెలలో స్వదేశానికి..గత నెలలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షేఖ్ హసీనా మాట్లాడుతూ.. తన అరెస్ట్ ఖాయమని తెలిసినప్పటికీ, డిసెంబర్ నెలలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. తాము ఏ పరిస్థితుల్లోనైనా బంగ్లాదేశ్కు కచ్చితంగా తిరిగి వెళ్తామని స్పష్టం చేశారు. వలస వెళ్లిన అవామీ లీగ్ నాయకులతో కలిసి స్వదేశానికి వెళ్లి, కోర్టులో లొంగిపోతామని ఆమె పేర్కొన్నారు. కాగా హింసాత్మక నిరసనల సమయంలో అణచివేతకు పాల్పడ్డారనే ఆరోపణలపై అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ షేఖ్ హసీనాకు మరణశిక్ష విధించింది.ఇది కూడా చదవండి: భారత అధికారికి పాక్ రేంజర్ సెల్యూట్.. వీడియో వైరల్ -
మా వాళ్లు 30 మంది ఖతమయ్యారు.. భారత్ పనే ఇది!
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు చెందిన ఓ ఆపరేటివ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత మూడు, నాలుగేళ్లలో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో హతమైనట్లు ఆ సంస్థ ప్రతినిధి రిజ్వాన్ హనీఫ్ పేర్కొన్నాడు. అయితే ఈ హత్యల వెనుక భారత నిఘా సంస్థలు ఉన్నాయని అతడు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియోలో రిజ్వాన్ హనీఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో లష్కరే తోయిబా సభ్యులు లక్ష్యంగా దాడులకు గురయ్యారని పేర్కొన్నాడు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలకోట్ వంటి ప్రాంతాల్లో తమకు చెందిన వ్యక్తులు మరణించారని చెప్పాడు.“గత మూడు నుంచి నాలుగేళ్లలో 30 మందికి పైగా మా సభ్యులు భారత నిఘా ఏజెంట్ల చేతిలో హతమయ్యారు” అని అతడు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ ఘటనలను అతడు “తెలియని గన్మెన్ మోడల్”unknown gunman modelగా అభివర్ణించాడు.Lashkar-E-Taiba's First Ever Explosive Admission 🔥🔥🔥Lashkar-e-Taiba/JKUM terrorist Rizwan Hanif openly admits that more than 30 members of the outfit were eliminated by unknown gunmen (Indian agents), across Peshawar, Karachi, Rawalpindi, Rawalakot and Muzaffarabad over the… pic.twitter.com/gXr0jIeYmH— OsintTV 📺 (@OsintTV) August 3, 2026అయితే ఈ ఆరోపణలకు సంబంధించి భారత ప్రభుత్వంగానీ, ఇటు భద్రతా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్థాన్ తరచూ ఈ దాడులకు భారత్ను కారణంగా చూపుతుండగా.. న్యూఢిల్లీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నాయి.తొలిసారి.. ఒప్పుకోలులష్కరే తోయిబా అనుబంధ వ్యక్తి ఒకరు తమ సంస్థకు చెందిన ఇంతమంది సభ్యులు వరుసగా హతమైనట్లు బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి అని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్లో పలువురు ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో మరణించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఎలా పుట్టింది లష్కరే తోయిబా?లష్కరే తోయిబా పాకిస్థాన్లో ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ. 1980ల చివర్లో హఫీజ్ మహ్మద్ సయీద్, జఫర్ ఇక్బాల్, అబ్దుల్లా అజామ్లు ఈ సంస్థను స్థాపించారు. తొలినాళ్లలో ఇది మర్కజ్-ఉద్-దవా-వల్-ఇర్షాద్ అనే సంస్థకు అనుబంధంగా పనిచేసింది. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో ఏర్పాటైన ఈ సంస్థ.. ఆ తర్వాత తన కార్యకలాపాలను జమ్మూ కశ్మీర్పై కేంద్రీకరించింది. కశ్మీర్లో సాయుధ పోరాటం పేరుతో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిందని భారత్ ఆరోపిస్తోంది.ముంబై దాడులతో ప్రపంచ దృష్టిలోకిలష్కరే తోయిబా పేరు 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా చర్చకు వచ్చింది. ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, నరిమన్ హౌస్ సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని భారత్ ఆరోపించింది. అనంతరం ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పలు దేశాలు ఈ సంస్థను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చాయి.భారత్, పాశ్చాత్య దేశాలు లష్కరే తోయిబాకు పాకిస్థాన్లోని కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని గతంలో ఆరోపించాయి. అయితే పాకిస్థాన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది.విద్వేష వ్యాఖ్యలపై వివాదంతాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన రిజ్వాన్ హనీఫ్.. గతంలోనూ ఇతర మతాలపై అభ్యంతరకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాద సంస్థలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు.అసలు ఎవరి హస్తం?లష్కరే తోయిబా సభ్యులుగా చెప్పబడుతున్న వ్యక్తుల హత్యల వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. అయితే రిజ్వాన్ హనీఫ్ వ్యాఖ్యలు పాకిస్థాన్లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, వాటిపై జరుగుతున్న దాడులపై మరోసారి చర్చకు తెరలేపాయి. భారత్ షరామామూలుగానే ఈ ఆరోపణలను ఖండించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. -
ట్రంప్కు బిగ్ షాక్.. టారిఫ్లపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టారిఫ్ విధానానికి సొంత దేశంలోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. భారత్ సహా 60 దేశాలపై విధించిన కొత్త దిగుమతి సుంకాలను నిలిపివేయాలని కోరుతూ అమెరికాలోని 25 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ ప్రభుత్వం తన అధికారాలను మించి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన ఈ పిటిషన్.. ఆయన వాణిజ్య విధానానికి మరో న్యాయ పరీక్షగా మారింది.ట్రంప్ ప్రభుత్వం గత నెలలో ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 301 కింద కొత్త టారిఫ్లను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సుంకాలు 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ఉన్నాయి. భారత్, యూరోపియన్ యూనియన్ సహా మొత్తం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఇవి వర్తిస్తున్నాయి. అయితే బలవంతపు కార్మిక వ్యవస్థ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడం, వాణిజ్య నిబంధనలను కఠినతరం చేయడమే ఈ టారిఫ్ల ఉద్దేశమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.“అధ్యక్ష అధికారాలను ఆయన దాటారు”ఈ టారిఫ్లను వ్యతిరేకిస్తూ 25 డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్(U.S. Court of International Trade) దాఖలు చేశాయి. ఒరెగాన్, న్యూయార్క్ వంటి రాష్ట్రాలు ఈ న్యాయపోరాటంలో ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం గతంలో కోర్టులు తప్పుబట్టిన విస్తృత టారిఫ్ విధానాన్నే మరో చట్టపరమైన మార్గంలో అమలు చేస్తోందని రాష్ట్రాలు ఆరోపించాయి. సెక్షన్ 301ను సాధారణంగా నిర్దిష్ట దేశాలు లేదంటే పరిశ్రమల అన్యాయ వాణిజ్య చర్యలపై ఉపయోగిస్తారని.. దాదాపు అన్ని దిగుమతులపై భారీ సుంకాలు విధించేందుకు ఉపయోగించలేమని వాదించాయి.ఈ కేసు ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు పరిశీలనలో ఉంది. పిటిషన్పై తదుపరి విచారణ షెడ్యూల్ కోసం ఇరు వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కోర్టు నిర్ణయం ట్రంప్ టారిఫ్ విధాన భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది.భారత్పై ప్రభావం ఎంత?ట్రంప్ కొత్త టారిఫ్ల పరిధిలో భారత్ కూడా ఉంది. తొలుత భారత్పై 12.5 శాతం సుంకం విధించగా.. కొన్ని చర్యల తర్వాత దాన్ని 10 శాతానికి తగ్గించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే చమురు, సహజ వాయువు, ఎరువులు వంటి కొన్ని ఉత్పత్తులకు ఈ కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినప్పటికీ భారత్ నుంచి అమెరికాకు వెళ్లే పలు ఉత్పత్తులపై ఈ టారిఫ్ల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.ట్రంప్ టారిఫ్ విధానంపై వరుస ఎదురుదెబ్బలుటారిఫ్లను అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు కీలక ఆయుధంగా ట్రంప్ భావిస్తున్నారు. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి.. అమెరికా తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. అయితే ఆయన తీసుకున్న టారిఫ్ నిర్ణయాలకు ఇప్పటికే న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. గతంలో అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విధించిన భారీ సుంకాలపై అమెరికా కోర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనంతరం ట్రంప్ ప్రభుత్వం ఇతర చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.మరోసారి కోర్టు తీర్పుపైనే ఉత్కంఠతాజాగా 25 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్.. ట్రంప్ వాణిజ్య విధానానికి కీలక పరీక్షగా మారింది. కోర్టు ఈ టారిఫ్లను నిలిపివేస్తే ట్రంప్ ఆర్థిక ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. ఒకవేళ కోర్టు ప్రభుత్వం వైపు మొగ్గుచూపితే.. భవిష్యత్తులో మరిన్ని దేశాలపై సుంకాల విధింపుకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం అమెరికా కోర్టు నిర్ణయం కోసం వాణిజ్య వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ తీర్పు భారత్ సహా పలు దేశాలతో అమెరికా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. -
ఆ సంప్రదాయ గోడలను బద్దలు కొడుతున్న జెన్ జీ
జెన్ జీ జీవనశైలి గత తరాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా మారుతోంది. ముఖ్యంగా వీకెండ్ను గడిపే విధానంలో యువత కొత్త ట్రెండ్ను సృష్టిస్తోంది. అధిక ఖర్చులు, ఆర్థిక భద్రతపై పెరిగిన అవగాహన, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ఆసక్తి కారణంగా సంప్రదాయ వినోదాలకు దూరమవుతోంది. బయట తిరగడం, పార్టీల కంటే పొదుపు, వ్యక్తిగత అభివృద్ధి, ప్రశాంతమైన సామాజిక కలయికలకు ప్రాధాన్యం ఇస్తూ జెన్ జీ వీకెండ్ సంస్కృతిని కొత్త దిశలో తీసుకెళ్తోంది.ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి వస్తువు ధర పెరిగిన నేపథ్యంలో డబ్బును ఆదా చేయడానికి జెన్ జీ కొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో 62 శాతం మంది వీకెండ్కు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవడం లేదని చెప్పారు. ఖర్చు చేసిన తర్వాత ఆర్థిక ‘‘ఎందుకు ఖర్చు చేశాం?’’ అనే భావన కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పోలింగ్ సంస్థ హారిస్ పోల్ గత నెల విడుదల చేసిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ఈ సర్వేలో 603 మంది జెన్ జీ యువతతో పాటు మొత్తం 4,100 మంది పెద్దలు పాల్గొన్నారు.యువతలో కనిపిస్తున్న ఈ పొదుపు ధోరణి, ఆర్థిక, సామాజిక, శారీరక ఆరోగ్యంపై వారి ఆసక్తిని చూపుతోందని నిపుణులు చెప్పారు. "జెన్ జీ మృదువైన సామాజిక కలయికలను కోరుకుంటోంది. అవి ప్రశాంతంగా, తక్కువ ఖర్చుతో, మద్యం తప్పనిసరి కాని విధంగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఉంటాయి. సామాజిక ఆకర్షణ కేంద్రం నైట్క్లబ్ నుంచి వ్యాయామం, తరగతి గది, ప్రశాంత వాతావరణం వైపు మారిపోయింది" అని ఆమె తెలిపారు.వీకెండ్లో బయటకు వెళ్లడం ఖర్చుకు తగిన విలువ ఇవ్వడం లేదని 68 శాతం సందర్భాల్లో జెన్ జీ అభిప్రాయపడుతోంది. ఈ ఫలితాలు చూస్తే, డబ్బు ఖర్చు చేసే నిర్ణయాల్లో లాభనష్టాలను అర్థం చేసుకునే, ఉద్దేశపూర్వక ఆర్థిక దృక్పథం ఉన్న తరం అని తెలుస్తోంది.వీకెండ్లలో ఇంట్లోనే ఉండటానికి జెన్ జీ చూపుతున్న ఆసక్తి, మరింత విస్తృతమైన ఆలోచనా విధానానికి నిదర్శనమని నిపుణులు చెప్పారు. "జెన్ జీ నిర్లక్ష్యంగా ఉండటం కంటే తెలివిగా వ్యవహరిస్తోంది. వారి ప్రవర్తన చుట్టూ ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న తీరును చూపుతోంది" అని అంటున్నారు. గత తరాల మాదిరిగా వస్తువులను కూడబెట్టడం కంటే, స్వేచ్ఛను పొందేందుకు డబ్బును ఒక సాధనంగా చూస్తున్నారని పేర్కొన్నారు.ఒత్తిడులను తట్టుకునే తరం?అమెరికాలో చాలా మంది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రంగాల్లో జెన్ జీ డబ్బు నిర్వహణ విధానం ఉపయోగకరంగా నిరూపితమైంది. పదవీ విరమణ దీనికి ఒక ఉదాహరణ. 2026లో వెలువడిన పలు అధ్యయనాలు, అమెరికన్లు తమ పదవీ విరమణ జీవితానికి అవసరమైనంత డబ్బు పొదుపు చేయలేదని వెల్లడించాయి.ఆర్థిక సేవల సంస్థ ష్రోడర్స్ జూలైలో నిర్వహించిన సర్వే ప్రకారం, సౌకర్యవంతమైన పదవీ విరమణ జీవితం కోసం సగటు ఉద్యోగి $1.25 మిలియన్ అవసరమని భావిస్తున్నారు. కానీ ఉద్యోగ జీవితం ముగిసే సమయానికి సగానికి పైగా వ్యక్తుల వద్ద $500,000 కన్నా తక్కువే ఉంది.సైలెంట్ జనరేషన్, బేబీ బూమర్ తరాలు పొందిన పెన్షన్ వ్యవస్థ ఇప్పుడు దాదాపు కనుమరుగైంది. పెన్షన్ రూపంలో పదవీ విరమణ ఖర్చును భరించే విధానానికి బదులుగా, అనేక సంస్థలు 401(కే) ఖాతాలకు మారాయి. వీటిలో ఉద్యోగులే డబ్బు జమ చేయాలి. డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చనే నిబంధనలు కూడా ఉంటాయి. 401(కే) అంటే అమెరికాలో ఉద్యోగుల పదవీ విరమణ పొదుపు పథకం.24 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న జెన్ జీ ఉద్యోగులు ఈ పరిస్థితికి అనుగుణంగా మారిపోయారు. 2025 నవంబరులో బ్రోకరేజ్ సంస్థ వాన్గార్డ్ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం, సౌకర్యవంతమైన పదవీ విరమణ లక్ష్యానికి చేరువలో ఉన్న వయస్సు వర్గాల్లో వీరే ముందున్నారు. బేబీ బూమర్లను కూడా అధిగమించారు.ఇల్లు కొనుగోలు చేయడం సగటు అమెరికన్కు అందని కలగా కనిపిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం, అమెరికాలో మధ్యస్థ ధర గల ఇల్లు, 20-34 ఏళ్ల వయస్సు గల వారి మధ్యస్థ జీతం కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ ధరలో ఉంది. 1990లో ఈ నిష్పత్తి 3.2 మాత్రమే.అయినా సొంత ఇంటి కలను జెన్ జీ వదిలిపెట్టలేదు. 2025 నవంబరులో రియల్టర్.కామ్ నిర్వహించిన సర్వే ప్రకారం, 67 శాతం మంది సొంత ఇల్లు కలిగి ఉండటం "ముఖ్యమైన జీవిత లక్ష్యం" అని చెప్పారు.వారు ఉద్దేశపూర్వక దృక్పథాన్ని అనుసరిస్తున్నారు. జీవిత ప్రారంభ దశలో ఇల్లు కొనుగోలు చేయడం కంటే వృత్తి జీవితంపై దృష్టి పెట్టి, భవిష్యత్తులో పెద్ద కొనుగోలుకు ఆర్థికంగా సిద్ధమవుతున్నారు. దాదాపు 75 శాతం మంది ముందస్తు చెల్లింపు కోసం పొదుపు ప్రారంభించారు. -
నాకు అస్సలు సిగ్గు లేదు.. అంత ఖర్చు చేసి..: మాధవన్
‘‘నా జీవితంలో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైనది ఈ యాచ్.. ఇది దుబాయ్లో ఉంది’’ అని సినీనటుడు ఆర్.మాధవన్ వెల్లడించారు. ఆ యాచ్ దాదాపు 40 అడుగులు ఉంటుంది. మాధవన్ వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా బయటకు చెప్పరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలు కూడా చెప్పారు.దుబాయ్లో తనకు ఉన్న యాచ్ కేవలం ఓ విలాసవంతమైన పడవ మాత్రమేకాదని, లైసెన్స్ పొందిన కెప్టెన్ కావాలన్న తన చిరకాల కలను నెరవేర్చిందని చెప్పారు. తన ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాధవన్ బహిరంగంగా మాట్లాడారు. తన బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉందో తాను తరచుగా చూసుకోనని చెప్పారు.“నా బ్యాంకు ఖాతా విషయంలో నాకు చాలా అభద్రతా భావం ఉంటుంది. నా దగ్గర ఎంత డబ్బు ఉందో, ఎంత ఖర్చు చేయగలనో నాకు నిజంగా తెలియదు. అయితే, నా దగ్గర ఎంత ఉందో ఓ స్థూల అవగాహన మాత్రం ఉంది” అని చెప్పారు.తన యాచ్ను ‘సాధారణ, చిన్న పడవ’గా మాధవన్ పేర్కొన్నారు. కుటుంబ అవసరాలకు సరిపడే చిన్న పడవగానే దానిని అభివర్ణించినప్పటికీ, అది తన జీవితంలో చేసిన అత్యంత ఖరీదైన కొనుగోలు అని తెలిపారు. ఆ కొనుగోలు తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తిగత లక్ష్యంతో ముడిపడి ఉండటంతో డబ్బు ఖర్చు చేసినందుకు “నాకు అస్సలు సిగ్గు లేదు” అని చెప్పారు.“నా దగ్గర కుటుంబానికి సరిపడే సాధారణ, చిన్న పడవ ఉంది. కానీ నేను ఎప్పటినుంచో కెప్టెన్ లైసెన్స్ పొందాలని అనుకున్నాను. ప్రతి ఏడాదిని కొత్త నైపుణ్యం నేర్చుకుంటూ ప్రత్యేకంగా మార్చుకోవాలనుకుంటాను” అని మాధవన్ చెప్పారు. ఆయన కొవిడ్-19 సమయంలో పడవను నడపడం నేర్చుకుని, కెప్టెన్ లైసెన్స్ పొందేందుకు అవసరమైన అర్హతలు పూర్తి చేశారు.“కొవిడ్ సమయంలో నేను నేర్చుకున్న కొత్త నైపుణ్యం కెప్టెన్ లైసెన్స్ పొందడం, పడవను నడపడం. అది అంత కష్టమైన పని కాదు. 10-15 రోజులు కూర్చొని చదవాలి. పరీక్షలు, ప్రాక్టికల్స్ రాయాలి. ఆ తర్వాత లైసెన్స్ ఇస్తారు” అని వివరించారు.మాధవన్ దుబాయ్కు ఎందుకు మారారు?తన కుమారుడు వేదాంత్ ప్రొఫెషనల్ స్విమ్మింగ్ కెరీర్ కోసం మాధవన్ కుటుంబం తాత్కాలికంగా దుబాయ్ మెరీనాకు మారింది. అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ కొనసాగిస్తున్న వేదాంత్కు అత్యుత్తమ సదుపాయాలు దగ్గరగా ఉండేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడింది. దుబాయ్లో వారి ఇల్లు జలతీర ప్రాంతంలో ఉంది. ఆధునిక సౌకర్యాలు, మెరీనా దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం అది. విలాసవంతమైన కార్లు, బైక్లు దుబాయ్ ఇల్లు, యాచ్తో పాటు మాధవన్ వద్ద పలు విలాసవంతమైన వాహనాలు కూడా ఉన్నాయి. ఆయన కార్ల సేకరణలో సుమారు రూ.80 లక్షల విలువైన మెర్సిడెస్-బెంజ్, దాదాపు రూ.కోటి విలువైన రేంజ్ రోవర్ ఉన్నట్టు సమాచారం. మాధవన్కు మోటార్సైకిళ్లపై కూడా ఆసక్తి ఉంది. సుమారు రూ.40 లక్షల విలువైన రోడ్మాస్టర్ క్రూయిజర్, యమహా వి-మ్యాక్స్, బీఎండబ్ల్యూ కె1600 జీటీఎల్, డుకాటి డియావెల్ ఉన్నట్టు తెలుస్తోంది. -
39 పతకాలకే పరిమితం.. 24 ఏళ్లలో అత్యల్పం.. అయినా..!
గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే 1998 తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో భారత్ సాధించిన అత్యల్ప పతకాల సంఖ్య ఇదే. అయితే గ్లాస్గో గేమ్స్లో భారత్ ఎదుర్కొన్న పరిస్థితులను పరిశీలిస్తే ఈ ప్రదర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.పరిమితుల కారణంగా ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో కేవలం 10 క్రీడలనే నిర్వహించారు. భారత్కు సంప్రదాయంగా భారీగా పతకాలు అందించే షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ వంటి క్రీడలు ఈసారి పోటీల్లో లేకపోవడం భారత పతకాల అవకాశాలను గణనీయంగా దెబ్బతీసింది.2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో ఈ ఐదు క్రీడల నుంచే భారత్ 30 పతకాలు (13 స్వర్ణాలు) సాధించింది. అంటే గతసారి భారత్ సాధించిన మొత్తం పతకాలలో దాదాపు సగం ఈ క్రీడల నుంచే వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనూ భారత్ గ్లాస్గోలో 39 పతకాలు సాధించడం గమనార్హం.బాక్సింగ్లో చారిత్రాత్మక ప్రదర్శనభారత బాక్సర్లు ఈసారి అద్భుతంగా రాణించారు. మొత్తం 10 పతకాలు సాధించగా, అందులో ఏకంగా 7 స్వర్ణాలు, 3 రజతాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఒకే దేశానికి చెందిన బాక్సింగ్ బృందం సాధించిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటిగా నిలిచింది.జూడోలో కొత్త చరిత్రజూడోలోనూ భారత్ సత్తా చాటింది. హర్ష్ సింగ్, అస్మితా డే తమ విభాగాల్లో స్వర్ణాలు సాధించి, కామన్వెల్త్ గేమ్స్ జూడోలో భారత్కు తొలి స్వర్ణ పతకాలను అందించారు. యామిని మౌర్య రజతం, ఉన్నతి శర్మ కాంస్యం సాధించారు.అథ్లెటిక్స్లోనూ మెరుపులుఅథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో రజత పతకం సాధించాడు. గుల్వీర్ సింగ్ 10,000 మీటర్లలో రజతం, 5,000 మీటర్లలో కాంస్యం సాధించి ఒకే కామన్వెల్త్ గేమ్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ట్రాక్ అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు.తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్లో కాంస్యం సాధించి ఈ ఈవెంట్లో భారత్కు తొలి కామన్వెల్త్ పతకాన్ని అందించాడు.వెయిట్లిఫ్టింగ్, పారా-స్పోర్ట్స్లోనూ సత్తావెయిట్లిఫ్టింగ్లో మీరాబాయి చాను వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించి అరుదైన ఘనత అందుకుంది. భారత వెయిట్లిఫ్టింగ్ బృందం మొత్తంగా 8 పతకాలు సాధించింది.పారా-అథ్లెటిక్స్లోనూ భారత్ అద్భుతంగా రాణించింది. ఈ విభాగంలో 7 పతకాలు వచ్చాయి. శర్మిలా ధంకర్, దిలీప్ మహదు గవిత్, సోమన్ రాణా స్వర్ణాలు సాధించారు.నాలుగో స్థానంలో భారత్మొత్తంగా ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్-3లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా ఉన్నాయి. భారత్, ఆతిథ్య స్కాట్లాండ్ చెరో 39 పతకాలు సాధించినప్పటికీ, భారత్ ఎక్కువ రజతాలు సాధించడంతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.సంఖ్యాపరంగా 39 పతకాలు భారత్కు 1998 తర్వాత అత్యల్పమే అయినప్పటికీ, సంప్రదాయ పతకాల వనరులైన ఐదు క్రీడలు లేకుండానే ఈ స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం గ్లాస్గో గేమ్స్లో భారత బృందం సాధించిన కీలక విజయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా బాక్సింగ్, జూడో, అథ్లెటిక్స్, పారా-స్పోర్ట్స్లో వచ్చిన పురోగతి భారత బహుళ క్రీడా సామర్థ్యానికి కొత్త ఆశలు కలిగిస్తోంది. -
జంతర్ మంతర్ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆందోళనలు, నినాదాలు, ప్రజా ఉద్యమాలు. ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయాలన్నా.. తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నా.. అనేక వర్గాలకు ఇది దశాబ్దాలుగా కీలక వేదికగా మారింది. తాజాగా నీట్ పరీక్షల అక్రమాలపై విద్యార్థుల నిరసనలకు కూడా ఇదే ప్రాంతం వేదికైంది. ఇలాంటి చరిత్ర ఉన్న జంతర్ మంతర్ను నిరసనల కోసం వినియోగించడంపై పునరాలోచించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం, కేంద్రం–ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడంతో ఈ చారిత్రక ప్రాంతం మరోసారి చర్చలోకి వచ్చింది.అయితే జంతర్ మంతర్ పుట్టుక నిరసనల కోసం కాదు. ఖగోళ పరిశోధనల కోసం నిర్మించిన ఈ ప్రదేశం.. కాలక్రమేణా ప్రజల సమస్యలు ప్రతిధ్వనించే ప్రజాస్వామ్య వేదికగా మారింది. ఒకప్పుడు సూర్యుడు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత పాలకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రజలు తమ గళాన్ని వినిపించే వేదికగా పరిణామం చెందింది. మరి ఈ మార్పు ఎలా జరిగింది? జంతర్ మంతర్ చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు ఏవి? ఆ లోతులోకి వెళ్తే. ఖగోళ కేంద్రం నుంచి ఉద్యమాల వేదిక వరకుజంతర్ మంతర్ను 18వ శతాబ్దంలో జైపూర్ మహారాజు సవాయి జైసింగ్-2 నిర్మించారు. 1724లో నిర్మించిన ఈ ఖగోళ పరిశోధనా కేంద్రంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసేందుకు భారీ పరికరాలను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో భారతదేశ శాస్త్రీయ ఆలోచనలకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది.జంతర్ మంతర్ అనే పేరు కూడా దాని చరిత్రతో ముడిపడి ఉంది. సంస్కృతంలోని ‘యంత్ర’ (పరికరం), ‘మంత్ర’ (సూత్రం లేదా లెక్కింపు) అనే పదాల నుంచి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఖగోళ గణనలకు ఉపయోగించే ప్రత్యేక యంత్రాల కారణంగా ‘యంత్ర మంత్ర’ కాలక్రమంలో ‘జంతర్ మంతర్’గా ప్రాచుర్యంలోకి వచ్చింది.కానీ కాలం మారింది. ఢిల్లీ నగరం విస్తరించడంతో పాటు జంతర్ మంతర్ చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు సమీపంగా ఉండటం వల్ల తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం మొదలైంది. అలా ఖగోళ పరిశోధనలకు వేదికగా ప్రారంభమైన ఈ ప్రదేశం.. క్రమంగా దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిరసన వేదికల్లో ఒకటిగా మారింది.అన్నా ఉద్యమంతో దేశవ్యాప్త గుర్తింపుజంతర్ మంతర్కు భారీ గుర్తింపు తెచ్చిన ఉద్యమాల్లో 2011లో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒకటి. బలమైన లోక్పాల్ చట్టం కోసం జరిగిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో భాగమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని దేశం మొత్తం చూసేలా చేసిన ఈ ఉద్యమం తర్వాత జంతర్ మంతర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.అయితే అన్నా ఉద్యమంతోనే జంతర్ మంతర్ నిరసనల చరిత్ర ప్రారంభం కాలేదు. అంతకుముందు నుంచే ఉద్యోగాలు, కార్మిక హక్కులు, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అనేక సంఘాలు, రాజకీయ పార్టీలు ఇక్కడ ఆందోళనలు నిర్వహించాయి. అన్నా ఉద్యమం మాత్రం ఈ ప్రాంతాన్ని ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా నిలిపింది.నిర్భయ ఘటనతో యువత కదిలి..2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. న్యాయం కోసం, కఠిన చట్టాల కోసం జరిగిన నిరసనల్లో జంతర్ మంతర్ కీలక కేంద్రంగా మారింది. యువత ఒక్కటిగా పోరాటానికి దిగింది. ఈ ఉద్యమం ఒక ఘటనకు వ్యతిరేకత మాత్రమే కాదు.. దేశంలో మహిళల భద్రత, న్యాయ వ్యవస్థ, చట్టాలపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల ఆగ్రహం ప్రభుత్వాలను స్పందించేలా చేసిన సందర్భాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.రైతు ఉద్యమాలకు సాక్ష్యంజంతర్ మంతర్ చరిత్రలో రైతు ఉద్యమాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయ సమస్యలు, కనీస మద్దతు ధర, రైతుల ఆదాయం వంటి అంశాలపై రైతు సంఘాలు ఎన్నోసార్లు ఇక్కడ తమ గళాన్ని వినిపించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020–21లో జరిగిన రైతు ఉద్యమ సమయంలో జంతర్ మంతర్ మరోసారి కీలకంగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఆందోళనలు సాగినప్పటికీ.. రైతు సంఘాలు ఇక్కడ ప్రత్యేక నిరసనలు నిర్వహించి తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యవసాయ విధానాలపై పెద్ద చర్చకు దారితీసింది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది.రెజ్లర్ల ఆందోళనతో మరోసారి చర్చలోకి2023లో మహిళా రెజ్లర్ల నిరసనలతో జంతర్ మంతర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఆరోపణలకు సంబంధించి సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు క్రీడా రంగంలో మహిళల భద్రత, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై పెద్ద చర్చకు కారణమయ్యాయి.నీట్ నిరసనలు.. కొనసాగుతున్న గళంఇటీవల నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై విద్యార్థులు కూడా జంతర్ మంతర్ను ఆశ్రయించారు. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్ వంటి అంశాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం, వివిధ ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలపై కూడా అనేక వర్గాలు ఇక్కడ నిరసనలు చేపట్టాయి. ఇలా జంతర్ మంతర్ కేవలం ఒక ప్రాంతంగా కాకుండా.. ప్రజల సమస్యలు దేశవ్యాప్తంగా వినిపించే వేదికగా మారింది.ఇబ్బందులు కూడా ఉన్నాయా?అయితే జంతర్ మంతర్ నిరసనల వల్ల సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. తరచూ జరిగే ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని, స్థానిక ప్రజలు, అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్కు బదులుగా ప్రత్యేక నిరసన వేదిక ఏర్పాటు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నుంచి వివరాలు కోరింది.ప్రజాస్వామ్యానికి ప్రతీక.. మార్పు అవసరమా?జంతర్ మంతర్ భారత ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించే హక్కుకు ఇది ప్రతీకగా నిలిచింది. అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రజల గొంతు పాలకుల వరకు చేరే అవకాశం కల్పించింది. అయితే నగర నిర్వహణ, సాధారణ ప్రజల సౌకర్యాలు కూడా అంతే ముఖ్యమని న్యాయస్థానం పరిశీలిస్తోంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న.. జంతర్ మంతర్ ఉద్యమాల వేదికగా కొనసాగుతుందా? లేక కొత్త నిరసన కేంద్రానికి మారుతుందా? అనేది. -
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు..
-
ప్రపంచానికి షాక్.. భారత్ సహా విదేశీయులపై చైనా సీక్రెట్ మిషన్?
బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ... ఈ మాట చైనా విషయంలో నిజమవుతోందా?. విదేశీయుల పాస్పోర్ట్ నుంచి ఆస్పత్రి రికార్డులు.. విమాన టికెట్లు నుంచి గ్యాస్ బిల్లుల వరకు వేలాది వ్యక్తిగత వివరాలను ఒకే ప్లాట్ఫామ్లో చైనా భద్రపరిచినట్లు వెల్లడైంది. మీరు ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. ఎవరిని కలిసినా.. ఆ సమాచారం అంతా ఒక రహస్య డేటాబేస్లో చేరుతుందనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వందలాది విదేశీయుల వ్యక్తిగత జీవితాలను అక్షరాలా ‘డిజిటల్ ఫైల్’గా మార్చిన ఈ నిఘా వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కొత్త భయాలకు తెరతీస్తోంది. ఓ సైబర్ పరిశోధకుడు అనుకోకుండా కనిపెట్టిన ఈ రహస్య డేటాబేస్ ఇప్పుడు ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తోంది. ఈ డేటాబేస్లో భారతీయులతో పాటు వందలాది మంది విదేశీయుల సమాచారం ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.ఈ సంచలన విషయాన్ని మాజీ విదేశీ పాత్రికేయుడు, సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మార్క్ హోఫర్ గుర్తించారు. చైనాకు సంబంధించిన డిజిటల్ వ్యవస్థలను పరిశీలిస్తున్న సమయంలో ఆయనకు ‘డైనమిక్ కంట్రోల్ ప్లాట్ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్’ అనే వెబ్సైట్ కనిపించింది. వెబ్సైట్ తెరిచిన వెంటనే స్క్రీన్పై తన ఫొటో, పాస్పోర్ట్ నంబర్, ఒకప్పుడు చైనాలో ఉపయోగించిన మొబైల్ నంబర్ కనిపించడంతో ఆయన షాక్కు గురయ్యారు. తనకు కనిపించిన సమాచారం నిజమైనదేనని, అది కేవలం నమూనా డేటా కాదని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవం తనకు హాలీవుడ్ చిత్రం మైనారిటీ రిపోర్ట్ గుర్తు చేసిందని వ్యాఖ్యానించారు.ఆ డేటాబేస్లో జాంగ్జియాకౌ నగరంతో సంబంధం ఉన్న 700 మందికి పైగా విదేశీయుల సమాచారం, మొత్తం దాదాపు 12 వేల రికార్డులు ఉన్నట్లు గుర్తించారు. అందులో విదేశీ జర్నలిస్టులు, విద్యార్థులు, హాంకాంగ్, తైవాన్కు చెందిన వ్యక్తులు, పోలీసులు వెతుకుతున్న కొందరి వివరాలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా, ఆ నగరానికి ఎప్పుడూ వెళ్లని కొంతమంది విదేశీయుల పేర్లు కూడా అందులో కనిపించాయి. ఈ డేటాబేస్లో కేవలం పేరు, ఫోన్ నంబర్, పాస్పోర్ట్ వివరాలు మాత్రమే కాదు.. ఇంటి చిరునామా, ముఖ గుర్తింపు సాంకేతికత ఆధారంగా నమోదైన సీసీటీవీ కదలికలు, ఆసుపత్రి సందర్శనలు, గ్యాస్ బిల్లుల చెల్లింపులు, విమానాలు, రైలు ప్రయాణాల వివరాలు, సీటు నంబర్లు, తరచూ వెళ్లే ప్రదేశాలు వంటి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం కూడా నమోదు చేసినట్లు వెల్లడైంది.చైనాలో పలు యూనివర్సిటీలో చదువుతున్న భారత్, పాకిస్తాన్కు చెందిన విద్యార్థుల వివరాలు కూడా ఈ డేటాబేస్లో ఉన్నట్లు గుర్తించారు. వారు ఏ కోర్సు చదువుతున్నారు, వారి మతం, వైవాహిక స్థితి, యూనివర్సిటీ గేటు ఎప్పుడు దాటారు, కెమెరాల్లో ఎప్పుడు నమోదయ్యారు వంటి వివరాలు కూడా అందులో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పౌరులను "ఫైవ్ ఐస్ అలయన్స్" పేరుతో ఒకే విభాగంలో వర్గీకరించగా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, పాకిస్తాన్, సూడాన్ వంటి దేశాల వారిని "కీ కంట్రీస్"గా గుర్తించారు. హాంకాంగ్, తైవాన్ ప్రజలకు వేర్వేరు ఫోల్డర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది.ఈ వెబ్సైట్ లాగిన్ చరిత్రలో అనేక పోలీసు స్టేషన్ల నుంచి యాక్సెస్ చేసిన ఆనవాళ్లు కనిపించాయని హోఫర్ తెలిపారు. దీంతో ఇది సాధారణ సాఫ్ట్వేర్ కాదని, అధికారిక నిఘా వ్యవస్థలో భాగమై ఉండే అవకాశం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ డేటాను చైనా పోలీసులు వాస్తవంగా ఎలా ఉపయోగించారనే విషయంపై స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు. మరో ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఈ డేటాబేస్కు సంబంధించిన లాగిన్ పేజీలో యూజర్నేమ్, పాస్వర్డ్ ముందే నమోదు చేసి ఉండటాన్ని హోఫర్ గుర్తించారు. అంటే వందలాది మంది వ్యక్తిగత సమాచారం తగిన భద్రత లేకుండా ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆయన భావించారు. జనవరిలో ఈ సమాచారాన్ని భద్రపరిచిన ఆయన, మే నెల నాటికి ఆ వెబ్సైట్ పూర్తిగా అదృశ్యమైనట్లు తెలిపారు.ఈ ఘటన చైనా డిజిటల్ నిఘా వ్యవస్థపై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తింది. విదేశీయుల రోజువారీ జీవితానికి సంబంధించిన అనేక అంశాలను ఒకేచోట సమీకరించే సామర్థ్యం ఉన్న వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయన్న దానిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్దిష్ట డేటాబేస్ను చైనా అధికారులు అధికారికంగా ఎలా ఉపయోగించారనే విషయం ఇప్పటికీ స్పష్టంగా నిర్ధారించబడలేదు. ఈ వివరాలు ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన పరిశోధన ఆధారంగా వెలుగులోకి వచ్చాయి. -
ఇండియా చిప్.. ఇంకెప్పుడు?
‘చంద్రయాన్–3’విజయాన్ని కోట్ల మంది భారతీయులు సంబరంగా ఆస్వాదించారు. కానీ అందులోని ఇబ్బందికర వాస్తవాల్ని కొందరే అర్థం చేసుకున్నారు. అదేంటంటే ఉపగ్రహంలోని కీలక ఎల్రక్టానిక్ వ్యవస్థల్లో వాడిన చాలా సెమీకండక్టర్ చిప్లు ఇప్పటికీ మన దగ్గర పరిమితంగానే తయారవుతున్నాయి. ఉపగ్రహంలోనే కాదు. మనం వాడే స్మార్ట్ ఫోన్లు... ల్యాప్టాప్లు.. టీవీలు.. కార్లలో కూడా!. సెమీ కండక్టర్ చిప్ అంటే ప్రతి ఆధునిక యంత్రానికీ మెదడు. చాలా రకాల చిప్లను ఇండియా డిజైన్ చేస్తోంది. కానీ తయారు చేయటంలేదు. అందుకే... స్వదేశీ చిప్ మన కల. మరి సాకారానికి ఎన్నేళ్లు పడుతుంది? ఎంతవరకూ వచ్చాం? ఇంకెంత దూరం?సాక్షి, బిజినెస్మనిషి చేసిన అద్భుతం... సెమీకండక్టర్ చిప్. వందల కోట్ల ట్రాన్సిస్టర్లు.. మైక్రోస్కోపిక్ స్విచ్లు.. కాంతిని మించిన వేగంతో లెక్కలు.. సైజు మాత్రం వేలిగోటి కన్నా స్వల్పం!. ఇదీ... చిప్ స్వరూపం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు డిజిటల్ ప్రపంచం యావత్తూ ఈ చిప్ల చుట్టూనే తిరుగుతోంది. చిప్ కనక లేకుంటే ఫోన్లు.. ఇంటర్నెట్.. ఏఐ.. ఎలక్ట్రిక్ వాహనాలు.. శాటిలైట్లు.. ఆధునిక రక్షణ వ్యవస్థలు.. ఏవీ లేనట్టే. టెక్నాలజీకి గుండె లాంటి ఈ చిప్లను 21వ శతాబ్దపు ఇంధనంగా ఎకనమిస్టులు పోలుస్తున్నది ఇందుకే. సెమీకండక్టర్ టెక్నాలజీని నియంత్రించే దేశాలకు ఆర్థికంగా, వ్యూహాత్మంగా అత్యంత ప్రాధాన్యమిస్తున్నది కూడా ఇందుకే. ఇండియా వెనకబడిందెక్కడ? భారత్లో టెకీల సంఖ్య తక్కువేమీ కాదు. వాళ్లలో ఎన్విడియా, ఇంటెల్, క్వాల్కామ్, ఏఎండీ వంటి చిప్ దిగ్గజాల దగ్గర పనిచేస్తున్న వాళ్లూ ఎక్కువే. పైపెచ్చు చిప్ డిజైన్లో ఇండియాకు మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న అనేక చిప్ల డిజైన్లో భారతీయుల పాత్ర ఎంతో కీలకం. మరి తయారీ మాత్రం తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లోనే ఎందుకు జరుగుతోంది? నిజానికి చిప్ డిజైన్ కష్టమైనదే. కానీ వాటి తయారీ ఇంకా కష్టం. ఆధునిక సెమీకండక్టర్ ఫ్యాక్టరీ నిర్మించాలంటే ఆ టెక్నాలజీలో దశాబ్దాల అనుభవం కావాలి. బిలియన్ల కొద్దీ డాలర్లు కావాలి. అత్యాధునిక యంత్రాలు.. అత్యంత స్వచ్ఛమైన నీరు.. నిరంతరాయ విద్యుత్... వందలకొద్దీ అనుబంధ పరిశ్రమలు కావాలి. ఎందుకంటే ఒక్క ధూళి కణం కూడా మొత్తం చిప్ను దెబ్బతీయగలదు మరి!!. అందుకే అతికొద్ది దేశాలే ఈ తయారీ సామర్థ్యాన్ని సాధించగలిగాయి. కోవిడ్తో మారిన పరిస్థితి... కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన సమయంలో... చిప్ల కోసం కొద్దిమందిపై ఆధారపడితే ఎలా ఉంటుందో ప్రతి దేశానికీ తెలిసొచ్చింది. చిప్ల కొరతతో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఆటోమొబైల్ ఉత్పత్తి ఆగిపోయింది. ఎల్రక్టానిక్స్ దొరకటం కష్టమైంది. దేశాలు కళ్లు తెరిచాయి. అమెరికా చిప్స్ చట్టం తెచ్చింది. యూరప్ సొంత సెమీకండక్టర్ పాలసీలు ప్రకటించింది. చైనా ఒకవంక ఎగుమతులను నియంత్రిస్తూనే పెట్టుబడులు పెంచింది. భారత్ కూడా చిప్ల డిజైన్కే పరిమితం కాకూడదని నిర్ణయించుకుంది. తయారీలోకి అడుగుపెట్టే ప్రణాళికలు ప్రకటించింది. చిప్ల తయారీ రాత్రికిరాత్రే సాధ్యం కాదు కాబట్టే.. ఇండియా దశలవారీగా ముందుకు వెళుతోంది. డిజైన్... తయారీ... ప్యాకేజింగ్... ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి అనేవి ఒక్కొక్కటిగా సాధించడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈ ప్రక్రియలు ఒకదానికొకటి దన్నుగా నిలుస్తాయి. అడుగులు పడుతున్నాయి... దాదాపుగా అంతర్జాతీయ చిప్ డిజైన్ కంపెనీలన్నిటికీ ఇండియాలో ఇంజనీరింగ్ సెంటర్లున్నాయి. వాటిలోని మన టెకీలు స్మార్ట్ఫోన్లు, ఆటోమొబైల్స్, కమ్యూనికేషన్ పరికరాలు, ఏఐకి ప్రాసెసర్లు డిజైన్ చేస్తున్నారు. కానీ డిజైన్ పూర్తయ్యాక విదేశాల్లో తయారవుతున్నాయి. ఆ తయారీ చిత్రాన్ని మార్చడానికి దేశంలోనే తొలి కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను టాటా ఎల్రక్టానిక్స్ సంస్థ గుజరాత్లో నిర్మిస్తోంది. తైవాన్కు చెందిన పీఎస్ఎంసీ దీనికి టెక్నాలజీ అందిస్తోంది. ఆటోమొబైల్స్, పారిశ్రామిక యంత్రాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్లో వాడే 28ఎన్ఎం మెచ్యూర్– నోడ్ చిప్స్ను తయారు చేస్తారు. దీంతోపాటు టాటా సంస్థ అస్సాంలో సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ప్లాంట్నూ నిర్మిస్తోంది. అంటే గుజరాత్లో తయారయ్యే చిప్లను అస్సాంలో ప్యాకింగ్ చేస్తారన్న మాట. గుజరాత్లోనే అమెరికా మెమొరీ చిప్స్ దిగ్గజం మైక్రాన్ కూడా భారీ ప్లాంట్ నిర్మిస్తోంది. ఇక్కడ మైక్రాన్ సంస్థ సిలికాన్ వేఫర్స్ తయారీ బదులు వాటి అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది. చెన్నైకి చెందిన ‘సీజీ పవర్’కూడా జపనీస్ కంపెనీ రెనెసాస్ ఎలక్ట్రానిక్స్, థాయ్లాండ్ సంస్థ స్టార్స్ మైక్రోతో జట్టుకట్టి గుజరాత్లో చిప్ ‘ఓశాట్’ప్లాంట్ను నిర్మించింది. చిప్ల టెస్టింగ్, ప్యాకేజింగ్ వంటివి చేసే ఈ ప్లాంట్లో వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ఇప్పటికే ఆరంభమైంది. మరోవైపు చైనా దిగ్గజం ఫాక్స్కాన్తో హెచ్సీఎల్ సంస్థ జట్టుకట్టి... డిస్ప్లే డ్రైవర్ చిప్స్ తయారీ ప్లాంటును నిర్మిస్తోంది. ఆటోమొబైల్స్, స్మార్ట్ఫోన్లు, టీవీల్లోని డిస్ప్లే స్క్రీన్లను ఈ చిప్లు నియంత్రిస్తాయి. డబ్బుకన్నా... టెక్నాలజీ ముఖ్యం భారత్లో సెమీకండక్టర్ ఫ్యాబ్ తయారీ చేపడతామని గతంలోనే వేదాంతా గ్రూప్– ఫాక్స్కాన్ ప్రకటించాయి. కానీ వారికి సరైన టెక్నాలజీ భాగస్వామి దొరకలేదు. దీంతో ఫాక్స్కాన్ తప్పుకుంది. ప్రాజెక్టు మూలనపడింది. నిజానికి సెమీకండక్టర్ ఫ్యాక్టరీకి డబ్బులకన్నా టెక్నాలజీ ప్రధానం. పెట్టుబడులు ఎలాగైనా వస్తాయి. కానీ టెక్నాలజీ మాత్రం కొందరి దగ్గరే ఉంది. ఉదాహరణకు చిప్ల తయారీకి అవసరమైన డిజైన్ సాఫ్ట్వేర్లో (ఈడీఏ టూల్స్) కెడెన్స్, సినాప్సిస్, సీమెన్స్ వంటి అతికొద్ది సంస్థలదే ఆధిపత్యం.తయారీకి అత్యంత కీలకమైన లిథోగ్రఫీ యంత్రాలను నెదర్లాండ్స్కు చెందిన ఒక్క ఏఎస్ఎంఎల్ సంస్థే తయారు చేస్తోంది. తైవాన్కు చెందిన టీఎస్ఎంసీ, దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ వంటి సంస్థలు తయారీ ప్రక్రియలో పట్టు సా«ధించడానికి కొన్ని దశాబ్దాలు శ్రమించాయి. మరి ఇంత క్లిష్టమైన టెక్నాలజీని రాత్రికి రాత్రే కొనుగోలు చేయాలంటే సాధ్యమా? అందుకే భారత్ ఈ ప్రక్రియను సొంతంగా ఆది నుంచీ మొదలుపెట్టడం... పునరావిష్కరించడం వంటి ప్రయత్నాలు చెయ్యకుండా అంతర్జాతీయ దిగ్గజాలతో జట్టుకడుతోంది. భారత్లో ‘చిప్’తయారవుతుందా? నిజానికి భారత్లో చిప్ తయారు చేయడానికి, దాన్ని ‘భారతీయ చిప్’అనడానికి చాలా తేడా ఉంది. విదేశీ టెక్నాలజీతో... విదేశీ సంస్థల భాగస్వామ్యంతో... వాటి లైసెన్సింగ్ ఒప్పందాల ప్రకారమే దేశంలో తొలుత చిప్లు తయారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదేమీ అసహజం కాదు కూడా. ఎందుకంటే భారత్లో తొలి మారుతీ కారు తయారయ్యింది సుజుకీ సంస్థ టెక్నాలజీతోనే. ఏళ్లు గడుస్తున్న కొద్దీ భారత ఇంజనీరింగ్ సామర్థ్యాలు పెరిగాయి. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీ సంస్థలు కూడా కార్ల తయారీలోకి ప్రవేశించాయి. ఇపుడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఉత్పత్తిదారులలో ఒకటిగా ఎదిగింది. సెమీకండక్టర్ పరిశ్రమ కూడా ఇదే తరహాను అనుసరించే అవకాశముంది. ఎందుకంటే సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడానికి తైవాన్ దాదాపుగా నాలుగు దశాబ్దాలు శ్రమించింది.వేల మంది సప్లయర్లు, యంత్రాల తయారీదారులు, కెమికల్ కంపెనీలు, పరిశోధక సంస్థలు సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది కూడా. భారత్ ఇపుడు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ అవకాశాలైతే అపారం. ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాలు, 5జీ, రోబోటిక్స్, ఆధునిక రక్షణ వ్యవస్థలకు రానున్న దశాబ్దాల్లో వందల కోట్ల అదనపు చిప్లు అవసరమవుతాయి. డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ భారత్ డిజైన్– తయారీ– ప్యాకేజింగ్– రీసెర్చ్లతో కూడిన పూర్తిస్థాయి చిప్ ఇన్ఫ్రాను నిర్మించగలిగితే అది ప్రపంచంలో అత్యంత ప్రధానమైన టెక్నాలజీ హబ్గా మారుతుంది. ఇదీ... రోడ్ మ్యాప్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే... భారతదేశంలో 2027–28లో సెమీకండక్టర్ల తయారీ వాణిజ్యపరంగా మొదలయ్యే అవకాశముంది. అది కేవలం ఆరంభమే. అంతర్జాతీయ సంస్థలతో పోటీపడే స్థాయిలో సెమీకండక్టర్ పరిశ్రమను నిర్మించాలంటే మరో దశాబ్దానికి పైనే పడుతుంది. కాకపోతే తొలిసారిగా భారత్ ఈ రంగంలో వీక్షకుడి స్థాయి నుంచి ఆటగాడి స్థాయికి చేరుకుంది. ట్రాక్పై అడుగుపెట్టింది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే త్వరలోనే ఫోన్లమీదే కాకుండా ఫోన్లలోని చిప్పై కూడా ‘మేడిన్ ఇండియా’అని చూడొచ్చు. -
చైనా సోషల్ మీడియాలో భారత్పై విషం
బీజింగ్: చైనా సోషల్ మీడియాలో భారత్కు వ్యతిరేకంగా దూషణాత్మక కంటెంట్ పెరిగిపోతోంది. భారత వృత్తి నిపుణులకు చైనా ప్రభుత్వం వర్క్ వీసాలు జారీ చేయకుండా తిరస్కరిస్తోంది. చైనాలో పని చేస్తున్న భారతీయుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు, ఉపాధి పొందడంపై ఆంక్షల విధిస్తోంది. ఈ పరిణామాలపై చైనాలోని ప్రవాస భారతీయలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమలో వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. భారతీయ వృత్తి నిపుణులను ఒకచోట చేర్చి, ఆ వర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాయబార కార్యాలయం శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి, కౌన్సిలర్లు నితిన్జీత్ సింగ్, రమేష్ సింగ్లతో కలిసి ప్రవాస భారతీయులు వివిధ అంశాలపై చర్చించారు. చైనా సోషల్ మీడియా వేదికలపై భారతీయుల ఆహారపు అలవాట్లు, సంస్కృతిని లక్ష్యంగా చేసుకుని వారిపై దూషణలతో కూడిన కంటెంట్ పెరుగుతోందని వెల్లడించారు. కాన్సులర్ సేవలకు సంబంధించిన ఇబ్బందులను ప్రస్తావించారు. తమ జీవిత భాగస్వాములకు ఇక్కడ ఉద్యోగాలు నిరాకరిస్తున్నారని తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని విక్రమ్ దొరైస్వామి చెప్పారు. చైనా సోషల్ మీడియాలో ప్రతికూల, దూషణాత్మక కంటెంట్ పట్ల వ్యక్తమవుతున్న ఆందోళనలపై స్పందించారు. అటువంటి కంటెంట్ పెరుగుదల పట్ల చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. తమ వంతుగా వాస్తవ ఆధారిత సమాచారాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేయడం ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తిని ఎదుర్కొంటున్నామని ప్రకటించారు. భారతదేశపు విభిన్న సంస్కృతి, వంటకాలను ప్రదర్శించేందుకు చైనాలో పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఎంబసీ యోచిస్తున్నట్లు తెలిపారు. -
అహ్మదాబాద్లో కలుద్దాం!
క్రీడాంశాలు తగ్గిపోయినా... పతకాల వేటలో మాత్రం భారత క్రీడాకారులు జోరు కొనసాగించారు. 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో సాధించిన ఓవరాల్ నాలుగో స్థానాన్ని 2026 గ్లాస్గో గేమ్స్లోనూ నిలబెట్టుకున్నారు. స్కాట్లాండ్లో 11 రోజులపాటు జరిగిన కామన్వెల్త్ గేమ్స్కు ఆదివారం తెరపడింది. 74 దేశాల నుంచి 2,729 మంది క్రీడాకారులు 10 క్రీడాంశాల్లో పోటీపడ్డారు. ఆ్రస్టేలియా మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకొని 171 పతకాలతో అగ్రస్థానాన్ని అలంకరించింది. 110 పతకాలతో ఇంగ్లండ్ రెండో స్థానం దక్కించుకోగా... 62 పతకాలతో కెనడా మూడో స్థానాన్ని సంపాదించింది. 39 పతకాలతో భారత్, స్కాట్లాండ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాయి. రెండు దేశాలు 13 చొప్పున స్వర్ణాలు గెలుపొందగా... స్కాట్లాండ్కంటే ఎక్కువ రజతాలు నెగ్గిన భారత్కు నాలుగో స్థానం ఖరారైంది. 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలోనే నిలిచింది. బర్మింగ్హామ్ గేమ్స్లో భారత్ పతకాలు నెగ్గిన క్రీడాంశాలు బ్యాడ్మింటన్, హాకీ, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, స్క్వాష్, టి20 క్రికెట్ ఈసారి లేకపోవడంతో ఈసారి మనం గెలిచిన పతకాల సంఖ్య తగ్గింది. తదుపరి 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం ఈ మెగా ఈవెంట్కు వేదిక కానుంది. గ్లాస్గో: ఆఖరి రోజును పతకంతో ముగించాలని ఆశించిన భారత బృందానికి నిరాశ ఎదురైంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో చివరిరోజు భారత్ పతకం గెలవకుండానే ముగించింది. జూడోలో మహిళల 78 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి ఇష్రూప్ నారంగ్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. అయితే కాంస్య పతక బౌట్లో ఇష్రూప్ కెనడా ప్లేయర్ కొరాలీ గాడ్బౌట్ చేతిలో ఓడిపోయింది. ఇక ఆఖరి ఈవెంట్ సైక్లింగ్ 40 కిలోమీటర్ల పాయింట్స్ రేస్లో భారత ప్లేయర్లు హర్ష్ వీర్, దినేశ్ క్వాలిఫయింగ్ రౌండ్లోనే వెనుదిరిగారు. వెరసి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ చివరిరోజు భారత్ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. ఓవరాల్గా భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 39 పతకాలతో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది. తద్వారా 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వరుసగా ఏడో గేమ్స్లోనూ భారత్ టాప్–5లో నిలిచింది. మరోవైపు ఆ్రస్టేలియా 70 స్వర్ణాలు, 45 రజతాలు, 56 కాంస్యాలతో కలిపి 171 పతకాలతో నంబర్వన్ ర్యాంక్ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ 29 స్వర్ణాలు, 45 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి 110 పతకాలతో రెండో స్థానం దక్కించుకుంది. కెనడా 19 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 62 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. గ్లాస్గో గేమ్స్లో చివరి స్వర్ణం ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ దేశం ఖాతాలోకి వెళ్లింది. పురుషుల సైక్లింగ్ 40 కిలోమీటర్ల పాయింట్స్ రేస్ ఫైనల్లో ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ సైక్లిస్ట్ మాథ్యూ బోస్టాక్ పసిడి పతకం గెలిచాడు. అర్ధరాత్రి గం. 1:30 నుంచి జరిగిన ముగింపు వేడుకల్లో భారత బృందానికి స్వర్ణ పతకం గెలిచిన మహిళా బాక్సర్ జైస్మిన్ లంబోరియా ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించింది. తదుపరి 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్లోని అహ్మదాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది.45 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో కనీసం ఒక్క పతకమైనా సాధించిన దేశాలు. ఇందులో 25 దేశాలు కనీసం ఒక్క స్వర్ణ పతకమైనా గెలిచాయి.5 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారులు ఒక్క పతకం నెగ్గని క్రీడాంశాలు జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, సైక్లింగ్, బాస్కెట్బాల్, లాన్ బౌల్స్21 ఈసారి భారత్ గెలిచిన 39 పతకాల్లో 21 పతకాలు తొలిసారి ఈ క్రీడల్లో పాల్గొన్నవారు గెలిచారు. -
శ్రీజకు డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్లో రన్నరప్గా నిలిచింది. మహిళల డబుల్స్లో భారత్కే చెందిన సిండ్రెల్లా దాస్తో కలిసి టైటిల్ సాధించింది. సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 6–11, 1–11, 11–8, 7–11, 11–13తో భారత్కే చెందిన యశస్విని చేతిలో ఓడింది. డబుల్స్ ఫైనల్లో శ్రీజ–సిండ్రెల్లా 11–8, 11–13, 11–8, 11–6తో యశస్విని–దివ్యాంశిలపై గెలిచారు. -
కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..
-
ఆసుపత్రుల్లో ఎలా దోచుకుంటున్నారో ఈ ఘటనే నిదర్శనం
న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రులు వేసే బిల్లులకు భయపడి చాలా మంది వాటిల్లో చేరాలంటేనే దడుచుకుంటారు. కేవలం చికిత్సకు మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాల బిల్లులు వేస్తుంటాయి ఆసుపత్రులు. ఓ వ్యక్తి తనకు ఆసుపత్రిలో ఎదురైన ఇటువంటి అనుభవం గురించి చెప్పాడు. ఇప్పటికే వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తికి ఆసుపత్రి ప్రాంగణంలోని రెస్టారెంట్లో తక్కువ తిన్నప్పటికీ రూ.700కు పైగా బిల్లు రావడంతో షాక్కు గురయ్యాడు.సంతోష్ భారత్వంశీ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన గురించి వివరించాడు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి ఓ కారణంతో వెళ్లినట్లు తెలిపాడు. ఆకలిగా అనిపించడంతో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్న ప్రముఖ ఆహార సంస్థ అవుట్లెట్లో అల్పాహారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే భోజనం ముగిసిన తర్వాత అతడికి రూ.708 బిల్లు వచ్చింది. తాను కేవలం 3 వస్తువులు మాత్రమే ఆర్డర్ చేయడంతో ఆ బిల్లు చూసి ఆశ్చర్యపోయాడు. అవి మసాలా దోశ, ఓ కప్పు టీ, మజ్జిగ. మసాలా దోశ ధర రూ.274, టీ ధర రూ.74, మజ్జిగ ధర రూ.85 అని తెలిపాడు.“అల్పాహారం కోసం 2 మసాలా దోశలు, ఒక టీ, ఒక మజ్జిగ ఆర్డర్ చేశాం. బిల్లు రూ.708 వచ్చింది. అది చూసిన వెంటనే నా తల తిరిగిపోయింది. ఒక మసాలా దోశ ధర రూ.274. 200 మిల్లీలీటర్ల మజ్జిగ బాటిల్ ధర రూ.85. ఒక టీ ధర రూ.74.ఆసుపత్రిలో అడుగుపెట్టిన క్షణం నుంచే రోగి మందులు, డాక్టర్ ఫీజులు, ఆసుపత్రి ఖర్చులతో రోగి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తుంటారు. దీనికి తోడు ఆహారం, పానీయాల విషయంలో ఇలా దోచుకోవడం.. రూ.74 టీ, రూ.20 విలువ చేసే మజ్జిగకు రూ.85 వసూలు చేయడం చాలా ఎక్కువైంది” అని అతడు తన పోస్టులో పేర్కొన్నాడు. ఆ తర్వాత ప్రముఖ ఆహార సంస్థ యజమానుల మానవత్వంపై అతడు ప్రశ్నలు లేవనెత్తాడు.“వారి యజమానుల్లో కనీస మానవత్వం కూడా మిగల్లేదా? బయట ఎక్కడైనా ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నా, కనీసం ఆసుపత్రుల వంటి ప్రదేశాల్లో అయినా ఈ బహిరంగ దోపిడీని ఆపండి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బయట అల్పాహార ఆర్డర్లపై 30%-40% తగ్గింపు ఉంటుంది. కానీ ఆసుపత్రి లోపల ఎలాంటి ఆఫర్లు లేవు.. నేరుగా దోపిడీ మాత్రమే” అని పోస్టులో పేర్కొన్నాడు.ఈ పోస్టు వైరల్ కావడంతో చాలా మంది స్పందించారు. ఎక్కువ మంది ఈ వ్యక్తి సమస్య తమకు కూడా ఎదురైనట్లు తెలిపారు. ఈ పోస్టును ఎక్స్లో ‘ఎస్కేవై జర్నో’ అనే ఖాతాలో షేర్ చేశారు. आज किसी कारणवश दिल्ली के अपोलो हॉस्पिटल में जाना पड़ा।सुबह सुबह का समय था तो भूख लग रही थी सोचा चलो कुछ खाते हैंहॉस्पिटल के अंदर ही हल्दीराम का रेस्टोरेंट थाहमने खाने के लिए 2 मसाला डोसा, एक चाय है एक छाछ ऑर्डर किया।बिल बन गया ₹708 रुपए का, माथा घूम गया बिल देखकर 👉… pic.twitter.com/mqESf2djmu— Santosh Bharatvanshi (@SKYjourno) August 1, 2026 -
రక్షణ రంగం బలోపేతంలో దోవల్ కీలకపాత్ర
పుణె: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భారత రక్షణ సామర్థ్యాన్ని గత పుష్కరకాలంలో సమున్నత స్థాయికి తీసుకెళ్లారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. శనివారం పుణెలో జరిగిన కార్యక్రమంలో అజిత్ దోవల్కు అమిత్ షా ‘లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్,2026’ను ప్రదానంచేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ‘‘రక్షణాత్మక వైఖరితోపాటు విరుచుకుపడే తత్వాన్ని దోవల్ సారథ్యంలో భారత సాయుధ బలగాలు అందిపుచ్చుకున్నాయి. భారత విదేశాంగ విధానం బలపడటంలోనూ దోవల్ తనదైన పాత్ర పోషించారు. ప్రధాని మోదీ జాతీయ భద్రతకు సంబంధించి తీసుకున్న ప్రతి తుది నిర్ణయంలోనూ దోవల్ కీలకమైన పాత్ర పోషించారు. 2008లో నేను గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్లో వరసబెట్టి బాంబుపేలుళ్లు జరిగాయి. నాడు సీఎం హోదాలో మోదీయే దోవల్కు ఈ పేలుళ్ల కారకులను కనిపెట్టాలని సూచించారు. ఈ ఘటనతోపాటు మొత్తం దేశవ్యాప్తంగా 13 బాంబుపేలుళ్ల ఘటనలను దోవల్ ఛేదించారు’’అని అమిత్ షా కొనియాడారు. దేశసేవకు సిద్ధంగా ఉండాలి: దోవల్ ఈ సందర్భంగా దోవల్ మాట్లాడారు. ‘‘స్వేచ్ఛ అంటే మనం ఏదైనా చేయొచ్చని నేటి యువత భావిస్తోంది. అది సబబు కాదు. స్వీయ ప్రయోజనాల కోసమేకాదు యువత దేశ ప్రయోజనాలనూ పట్టించుకోవాలి. ఏరకంగానైనా దేశ సేవ చేసేందుకు యువతరం సంసిద్ధంకావాలి. దేశ చరిత్రలోనే నేడు భారత్ సమున్నతంగా ఎదిగే సువర్ణావకాశం వచ్చింది. దీనిని మనం చేజార్చుకోవద్దు. దేశం కోసం త్యాగాలు చేసేందుకు సిద్దపడాలి. తిలక్ పుణెలో ప్లేగువ్యాధి ప్రబలి తన 21 ఏళ్ల కుమారుడిని కోల్పోయినా ఆయన ఈ నగరాన్ని వీడలేదు. నగరసేవకు ప్రాధాన్యతనిచ్చారు. యువత చిన్నపాటి వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి దేశ సేవ కోసం ఆలోచించాలి. స్వరాజ్యం నా జన్మహక్కు అని తిలక్ అనుకుని అక్కడితో ఆగిపోలేదు. అదే స్పృహ అందరిలో కలిగేలా స్ఫూర్తి కణికలు మండించారు’’అని దోవల్ వ్యాఖ్యానించారు. -
'పంచ్'లతో పసిడి పంట
భారత బాక్సింగ్ బృందం కామన్వెల్త్ గేమ్స్లో పదునైన పంచ్లతో విరుచుకుపడింది...అటు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో పసిడి వేటలో ఒకరితో మరొకరు పోటీ పడినట్లుగా మన బాక్సర్లు చెలరేగిపోయారు... ఫలితంగా ఒకే రోజు మన ఖాతాలో 7 స్వర్ణాలు చేరాయి. ఫైనల్లో ఓటమితో మరో 3 రజతాలు కూడా దక్కడంతో మొత్తంగా 10 పతకాలకు బాక్సింగ్ మనకు అందించింది. జైస్మీన్, సాక్షి, ప్రీతి, ప్రియ, అరుంధతి, అంకుశ్, సచిన్ స్వర్ణ పతకాలు గెలుచుకోగా...జాదూమణి సింగ్, లవ్లీనా బొర్గొహైన్, నరేందర్ రజతాలు సాధించారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో 7 పతకాలు గెలుచుకున్న భారత్...ఇప్పుడు దానిని అధిగమించింది. మొత్తంగా శుక్ర, శనివారాలు కలిపి వేర్వేరు ఈవెంట్లలో పెద్ద సంఖ్యలో పతకాలు గెలిచిన భారత్ కామన్వెల్త్ క్రీడల్లో తమ స్థాయిని ప్రదర్శించింది. నేడు పోటీలకు చివరి రోజు. జైస్మీన్ లంబోరియా (57 కేజీలు): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జైస్మీన్ కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణాన్ని అందుకుంది. ఫైనల్లో జైస్మీన్ 5–0తో మికెలా వాల్ష్ (నార్తర్న్ ఐలాండ్)పై ఘన విజయం సాధించింది. 2022 క్రీడల్లో ఆమె కాంస్యం సాధించింది. సాక్షి చౌదరి (51 కేజీలు): ఫైనల్లో సాక్షి 5–0తో రూబీ వైట్ (ఇంగ్లండ్)ను ఓడించింది. గత కొంత కాలంగా పలు మార్లు కెరీర్లో గాయాలతో ఇబ్బంది పడి కోలుకున్న సాక్షి కెరీర్లో ఇది కీలక విజయం. ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో విరాట్ కోహ్లి ఫౌండేషన్ మూడేళ్ల పాటు సాక్షికి అండగా నిలవడంతో ఆమె పట్టుదలగా పోటీలో నిలవగలిగింది. అరుంధతి చౌదరి (70 కేజీలు): ఫైనల్లో అరుంధతి 5–0తో షాంటెల్ రీడ్ (ఇంగ్లండ్)ను ఓడించి పసిడి గెలుచుకుంది. రాజస్తాన్కు చెందిన అరుంధతి గత ఏడాది వరల్డ్ బాక్సింగ్ కప్లో స్వర్ణం సాధించింది. ప్రియా ఘంఘాస్ (60 కేజీలు): ఫైనల్లో ప్రియ 4–1 తేడాతో మేరీ అల్ అహ్మదీ (కెనడా)పై గెలుపొందింది. సచిన్ సివాచ్ (60 కేజీ): హోరాహోరీగా సాగిన ఫైనల్లో సచిన్ 3–2తో ట్రైగెన్ మార్నింగ్ (నమీబియా)ను ఓడించి స్వర్ణం గెలిచాడు. అతనికి కామన్వెల్త్ పోటీల్లో ఇదే తొలి పతకం కావడం విశేషం. అంకుశ్ పంఘాల్ (80 కేజీలు): ఫైనల్లో అంకుశ్ 4–1 స్కోరుతో దిమెజె షిటు (ఇంగ్లండ్)ను ఓడించి పసిడి గెలిచాడు.గుల్వీర్కు కాంస్యంభారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో ‘డబుల్’ సాధించాడు. ఈ పోటీల్లో ఇప్పటికే 10,000 మీటర్ల పరుగులో రజతం నెగ్గిన అతను శనివారం 5,000 మీటర్ల పరుగులతో కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఈ పరుగును గుల్వీర్ 13 నిమిషాల 24.95 సెకన్లలో పూర్తి చేశాడు.లవ్లీనాకు నిరాశ...ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్కు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం లభించలేదు. మహిళల 75 కేజీల విభాగంలో ఆమె ఫైనల్లో 1–4తో ఎమా స్యూ గ్రీన్ట్రీ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది. పురుషుల 55 కేజీల కేటగిరీ ఫైనల్లో జాదూమణి సింగ్ 0–5తో జై డిక్సన్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల 90+ కేటగిరీలో నరేందర్ బెర్వాల్ 0–5తో డామర్ థామస్ (ఇంగ్లండ్) చేతిలో పరాజయంపాలు కావడం రజతం మాత్రమే దక్కింది.పవర్ ఫుల్ ప్రీతిశనివారం బాక్సింగ్లో ప్రీతి పవార్ భారత్కు తొలి స్వర్ణాన్ని అందించింది. 54 కేజీల ఫైనల్లో ఆమె 5–0 స్కోరుతో స్కార్లెట్ డెల్గాడో (కెనడా)ను చిత్తు చేసింది. తొలి రౌండ్నుంచి ప్రత్యర్థిపై ప్రీతి చెలరేగింది. ఐదుగురూ జడ్జీలు ఆమెకు అనుకూలంగా 10–9 పాయింట్లు ఇచ్చారు. తర్వాతి రెండు రౌండ్లలో కూడా ఇదే సరళి కొనసాగి 10–9, 10–9తో ప్రీతి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. చివరకు 30–27 పాయింట్లతో ఆమె ఏకపక్ష విజయాన్ని అందుకుంది. హరియాణాలోని భివానికి చెందిన 22 ఏళ్ల ప్రీతికి కామన్వెల్త్ క్రీడల్లో ఇదే తొలి పతకం. 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన ఆమె గత ఏడాది వరల్డ్ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలుచుకుంది. బాంటమ్ వెయిట్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న ప్రీతి ప్రస్తుతం భారత ఆర్మీలో నాయబ్ సుబేదార్ హోదాలో పని చేస్తోంది. -
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే.. రెండో రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్మ్యాన్: బ్రాండ్ న్యూ డే'. జూలై 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్ సాధించింది. టామ్ హాలండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.60.60 కోట్ల నెట్.. రూ.72.44 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసి కొత్త చరిత్ర సృష్టించింది.రెండో రోజు కూడా స్పైడర్మ్యాన్: బ్రాండ్ న్యూ డే వసూళ్లు హవా కొనసాగింది. ఇండియావ్యాప్తంగా 16,902 షోల ద్వారా రూ.49.35 కోట్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే భారత్లో ఈ మూవీ రూ.131.46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక నెట్ కలెక్షన్ల విషయానికొస్తే రూ.109.95 కోట్లుగా ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే సుమారు 167 నుంచి 173 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను బద్దలు కొడుతోంది. తొలిరోజు వసూళ్లతో జేమ్స్ కామెరూన్ అవతార్: ది వే ఆఫ్ వాటర్’(రూ.40కోట్లు), రూసో బ్రదర్స్ అవెంజర్స్: ఎండ్గేమ్ (రూ.53కోట్లు) రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీకి గట్టి పోటీ ఇస్తోంది. ఇక ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి భారత్లో రూ.200 కోట్ల మార్కును దాటుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టామ్ హాలండ్తో పాటు జెండాయా, జాకబ్ బాటలాన్, సేడీ సింక్, జాన్ బెర్న్తాల్, ట్రామెల్ టిల్మాన్ కీలక పాత్రలు పోషించారు.A brand new milestone 💯#SpiderManBrandNewDay in cinemas now, in English, Hindi, Tamil, Telugu, Malayalam & Kannada. Book your tickets via the link in bio. pic.twitter.com/1RB5dLBe6I— Sony Pictures India (@SonyPicsIndia) August 1, 2026 -
ఎవరీ తహ్సీన్ పూనావాలా? అభిజీత్ దీప్కే కన్నా ఫేమస్ అవుతాడా?
ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్యక్షుడు అభిజీత్ దీప్కే నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఫేమస్ అయ్యారు. ఇప్పుడు చాలా మంది ఈ20 పెట్రోల్పై గళం విప్పుతున్నారు. ఈ20 ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానానికి వ్యతిరేకంగా నిరసన చేపడతానని తహ్సీన్ పూనావాలా అనే వ్యక్తి పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. నిరసన చేపడతానని ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు తనను గృహ నిర్బంధంలో ఉంచారని తెలుపుతూ వీడియోలు వీడియోలు పోస్ట్ చేశారు. తహ్సీన్ పూనావాలా ఓ వెంచర్ క్యాపిటలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు, కన్సల్టెంట్.పూనావాలా నిరసన కూడా దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న వేళ ఆయన ఎవరన్న ఆసక్తి అందరిలోనూ రేగుతోంది. తహ్సీన్ పూనావాలా తన ప్రాథమిక విద్యను మహారాష్ట్రలోని పూణేలో పూర్తి చేశారు. అక్కడే ఆయన పెరిగారు.ప్రజలకు అందుబాటులో ఉన్న జీవిత విశేషాల సమాచారం ప్రకారం.. తహ్సీన్ పూనావాలా తన విద్యను మహారాష్ట్రలోని పూణేలో పూర్తి చేశారు. అనంతరం ఎంఐటీ పూణేలో (ప్రస్తుతం ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ) ఉన్నత విద్య అభ్యసించారు. అక్కడ న్యాయశాస్త్రం, పాలిటిక్స్ చదివారు.తహ్సీన్ పూనావాలా తన వృత్తి జీవితాన్ని పారిశ్రామికవేత్తగా, వెంచర్ క్యాపిటలిస్ట్గా ప్రారంభించారు. అనంతరం భారతదేశంలో గుర్తింపు పొందిన రాజకీయ వ్యాఖ్యాతల్లో ఒకరిగా ఎదిగారు. వార్తాపత్రికలు, డిజిటల్ ప్రచురణల్లో అభిప్రాయ వ్యాసాలు కూడా రాశారు. టెడ్ఎక్స్ కార్యక్రమాలు సహా పలు ప్రజా వేదికల్లో ప్రసంగించారు.టెలివిజన్కు మాత్రమే పరిమితం కాకుండా, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. పాలన, పారదర్శకత వంటి అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ వ్యాఖ్యానంతో పాటు వినోద రంగంలోనూ పూనావాలా కనిపించారు. 2019లో బిగ్ బాస్ 13లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ప్రవేశించారు. 2022లో కంగనా రనౌత్ నిర్వహించిన లాక్ అప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రాజకీయ వ్యాఖ్యానానికి మించి ఆయనకు మరింత ప్రజాదరణ లభించింది. -
ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయకుండా హౌస్ అరెస్ట్
న్యూఢిల్లీ: రాజకీయ విశ్లేషకుడు తహ్సీన్ పూనావాలా ఈ20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా తాను చేపట్టనున్న నిరసన ర్యాలీ, నిరాహార దీక్షకు ముందు ఢిల్లీ పోలీసులు తనను గృహ నిర్బంధంలో పెట్టారని శనివారం ఆరోపించారు. శుక్రవారం పూనావాలా ఢిల్లీలోని గాంధీ స్మృతి వరకు పాదయాత్ర చేసి, అక్కడ మౌన నిరసనతో పాటు నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. పూనావాలా ఇవాళ తన నివాసం బయట పోలీసు సిబ్బంది ఉన్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తనను ఇంటికే పరిమితం చేశారని ఆరోపిస్తూ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీపై విమర్శలు చేశారు. ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా తనను ఎలా నిర్బంధిస్తారని పూనావాలా ఒక పోలీసు అధికారిని ప్రశ్నిస్తున్నట్లు ఓ వీడియోలో కనిపించారు. “మిత్రులారా, ఢిల్లీ పోలీసులు నన్ను నిర్బంధించారు. ఎలాంటి పత్రాలు లేకుండానే నన్ను గృహ నిర్బంధంలో పెట్టారు” అని ఆయన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.“మహిళా అధికారులు సహా మొత్తం ఢిల్లీ పోలీసు బలగం నన్ను గృహ నిర్బంధంలో పెట్టింది. నితిన్ గడ్కరీ ఇథనాల్కు భయపడుతున్నారు. నన్ను గృహ నిర్బంధంలో పెట్టాలని పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని ఢిల్లీ పోలీసు అధికారి నాకు చెప్పారు’’ అని పూనావాలా పేర్కొన్నారు. ఈ20 విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడితే “చట్ట ఉల్లంఘన జరిగే అవకాశం ఉంది” అని పోలీసు అధికారి చెప్పడం ఓ వీడియోలో వినిపించింది.ఈ20 మిశ్రమ పెట్రోల్పై వివాదంప్రశ్నపత్రాల లీక్లపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత, ఈ20 పెట్రోల్ అంశంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని పూనావాలా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. 80% పెట్రోల్, 20% ఇథనాల్తో కూడిన ఈ20 పెట్రోల్ను ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై ప్రతిపక్ష పార్టీలు, వినియోగదారుల సంఘాలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి.ఈ20కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న పూనావాలా, ఆయన టీమ్ ప్రధానంగా చేస్తున్న డిమాండ్లలో ఒకటి.. 100% పెట్రోల్, ఈ5, ఈ10 ఇంధనాలు కూడా అందుబాటులో ఉండాలి. దీంతో వాహనదారులకు ఆప్షన్ ఉంటుంది.మరోవైపు, గురువారం కేంద్ర మంత్రి గడ్కరీ పార్లమెంట్కు తెలిపిన వివరాల ప్రకారం.. 20 శాతం ఇథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్ (ఈ20) వాహనం రకం, వాహనం వయస్సును బట్టి ఇంధన సామర్థ్యాన్ని 2 నుంచి 6 శాతం వరకు తగ్గించవచ్చు. లోక్సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో గడ్కరీ మాట్లాడుతూ.. ఈ10 ఇంధనంతో పోల్చితే ఈ20 మెరుగైన, వేగవంతమైన స్పందనను ఇవ్వడంతో సుమారు 30 శాతం తక్కువ కార్బన్ ఉద్గారాలను ఇస్తుందని చెప్పారు.ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ20 ఈ విధానానికి వ్యతిరేకంగా ఈ నెల నుంచి ప్రచారం చేపడతామని ఇప్పటికే ప్రకటించింది. అదే సమయంలో ఢిల్లీలోని రవాణా సంఘాలు కూడా నిరసన ర్యాలీకి సిద్ధమవుతున్నాయి.The @DelhiPolice say, following me crowds can turn up againt ethanol and therefore there "maybe" a chance of law being broken! For this reason i am under house arrest : for a "maybe"! Yet police say I am a "good guy!"#EthanolScamBETA BADHAO YOJNASUGAR DADDY pic.twitter.com/3Ik8FjyQCH— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) August 1, 2026An entire battalion of @DelhiPolice cops including women officers have put me under house arrest!! Nitin Gadkari ji sir is scared of #Ethanol. #EthanolScam BETA BADHAO YOJNA SUGAR DADDY pic.twitter.com/THLToM1HyE— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) August 1, 2026 -
నేపాల్లో లౌడ్స్పీకర్ల వల్ల అల్లర్లు.. సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్
న్యూఢిల్లీ: నేపాల్లో ఇటీవల జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో బిహార్లోని మధుబనీ జిల్లా వద్ద భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోషి ప్రావిన్స్లోని సున్సారీ జిల్లాలో గత వారాంతంలో రెండు మత వర్గాల వేడుకల సందర్భంగా లౌడ్స్పీకర్ల వినియోగంపై వివాదం చెలరేగి ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటన తర్వాత నేపాల్లోని పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి అధికారులు కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు అమలు చేస్తూ అదనపు భద్రతా బలగాలను మోహరించారు.జులై 26న జరిగిన ఘర్షణలు, పోలీసుల కాల్పుల్లో దాదాపు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. భారత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మధేశ్ ప్రావిన్స్లోని సప్తరీ జిల్లా కొన్ని ప్రాంతాల్లో జూలై 31న నేపాల్ అధికారులు నిరవధిక కర్ఫ్యూ విధించారు.ముందుజాగ్రత్త చర్యగా బిహార్లోని మధుబనీ జిల్లా పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు భద్రతను మరింత పెంచారు. ప్రధాన రహదారులు, ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల తనిఖీలు, గాలింపు చర్యలు చేపడుతున్నారు. సరిహద్దు పోలీస్ స్టేషన్ల వద్ద అదనపు బలగాలను కూడా మోహరించారు.ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అధికారుల ఆదేశాలను పాటించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. -
CWG 2026: ఇవాళ భారత్కు పతకాల పంట
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో శనివారం (ఆగస్ట్ 1) భారత్కు అత్యంత కీలకమైన రోజు కానుంది. ఈ ఎడిషన్లో ఇప్పటికే 23 పతకాలు (5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు) సొంతం చేసుకున్న భారత్.. ఇవాళ మరిన్ని అద్భుత ప్రదర్శనలు చేస్తే మరో 25 పతకాలు ఖాతాలో చేరే అవకాశం ఉంది.బాక్సింగ్లో 10 పతకాలు ఖాయంభారత్కు అత్యధిక పతక అవకాశాలు బాక్సింగ్లో ఉన్నాయి. ఇప్పటికే 10 మంది భారత బాక్సర్లు సెమీఫైనల్స్ దాటి ఫైనల్కు చేరుకోవడంతో 10 పతకాలు ఖాయమయ్యాయి. వీరిలో ప్రీతి, జాస్మిన్, జడుమణి సింగ్, సాక్షి, ప్రియా, అరుంధతి చౌదరి, లవ్లీనా బోర్గోహైన్, సచిన్, అంకుష్ పాంగల్, నరేందర్ ఉన్నారు.వీరంతా ఫైనల్స్లో విజయం సాధిస్తే భారత్కు బాక్సింగ్లోనే 10 స్వర్ణ పతకాలు వచ్చే అవకాశం ఉంది.అథ్లెటిక్స్లో 8 పతకాలపై కన్నుఅథ్లెటిక్స్లోనూ భారత్కు భారీ అవకాశాలున్నాయి. పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో ప్రవీణ్ చిత్రవేల్, సెల్వ ప్రభు తిరుమారన్, మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి, రవీనా గాయక్వాడ్, పురుషుల పోల్ వాల్ట్లో దేవ్ కుమార్ మీనా, కుల్దీప్ కుమార్ బరిలోకి దిగనున్నారు.అలాగే పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో గుల్వీర్ సింగ్, మిక్స్డ్ 4x400 మీటర్ల రిలేలో భారత జట్టు పతకం కోసం పోటీ పడనుంది.పారా అథ్లెటిక్స్లో 3 అవకాశాలుపురుషుల షాట్పుట్ F57 ఫైనల్లో సోమన్ రాణా, శుభమ్ జుయాల్, పురుషుల 1500 మీటర్ల T54 ఫైనల్లో రమేశ్ షణ్ముగం పతకాల కోసం పోటీ పడనున్నారు.జూడోలో మరో 4 అవకాశాలుజూడోలో ఉన్నతి శర్మ, కరణ్జిత్ సింగ్ మాన్, హర్ష్ తోకస్, ఇనుంగన్బి తఖెల్లంబమ్ తమ తమ విభాగాల్లో ముందడుగు వేస్తే భారత్ పతకాల సంఖ్య మరింత పెరగనుంది.ఇవాళ భారత్ పతకాల అంచనా* బాక్సింగ్: 10* అథ్లెటిక్స్: 8* పారా అథ్లెటిక్స్: 3* జూడో: 4కాగా, ప్రస్తుతం పతకాల పట్టికలో 10వ స్థానంలో ఉన్న భారత్.. ఇవాల్టి ప్రదర్శనల తర్వాత ఒక్కసారి భారీ జంప్ కొట్టే అవకాశం ఉంది. ఒకవేళ స్వర్ణాలు ఎక్కువ సాధిస్తే.. ఆస్ట్రేలియా (128), ఇంగ్లండ్ (80), కెనడా (53) తర్వాత నాలుగో స్థానానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
10 అత్యంత రద్దీ విమానాశ్రయాలు.. భారత్కు మకుటాయమానం!
భారతదేశ ఆకాశ రవాణా మార్గాలు నేడు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, విమానయాన రంగం కూడా అదే స్థాయిలో ముందుకు సాగుతోంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో నిత్యం కళకళలాడే అనేక విమానాశ్రయాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) చేరింది. వైజాగ్ (విశాఖపట్నం) నగరానికి సమీపంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుగా దీనిని అభివృద్ధి చేశారు. అత్యాధునిక సౌకర్యాలు, భారీ కార్గో హ్యాండ్లింగ్, సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్.. ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగ పురోగతికి, ఉపాధి అవకాశాల మెరుగుదలకు దోహదపడనుంది. కాగా ప్రయాణికుల రద్దీ పరంగా దేశంలో టాప్ టెన్గా నిలుస్తున్న ఆ ప్రధాన విమానాశ్రయాల వివరాలు..1. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీదేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్కు సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం.. ప్రయాణికులు, కార్గో రవాణా రెండింటిలోనూ భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా ప్రథమ స్థానంలో ఉంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు మీదుగా ఉన్న ఈ ఎయిర్పోర్ట్ 5,106 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.2. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం , ముంబైప్రయాణికుల రద్దీ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పరంగా భారతదేశంలో రెండవ అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం ఇది. ముంబై నగరానికి ఉత్తరంగా 22 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్పోర్ట్ ఉంది.3. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరుకర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో మూడవ అత్యంత రద్దీ అయినది. బెంగళూరు నగర స్థాపకుడు కెంపేగౌడ I పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు. 2008 మేలో ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్ 2023లో 37.2 మిలియన్ల ప్రయాణికులను చేరవేసింది. ఇది 4,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంతేకాదు, 2016లో కర్ణాటకలోనే తొలిసారిగా పూర్తిగా సౌరశక్తితో నడిచే విమానాశ్రయంగా ఇది రికార్డు సృష్టించింది.4. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని శంషాబాద్లో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం.. బేగంపేట విమానాశ్రయ స్థానంలో 2008 మార్చి 23న ప్రారంభమైంది. 5,500 ఎకరాల విశాలమైన స్థలంలో విస్తరించి ఉన్న ఇది దేశంలో నాల్గవ అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం. భారతదేశంలోనే తొలిసారిగా దేశీయ ఈ-బోర్డింగ్ను (2015) ప్రవేశపెట్టిన ఘనత దీని సొంతం.5. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నైతమిళనాడు రాజధాని చెన్నైలో సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం దేశంలో ఐదవ అత్యంత రద్దీ అయినదిగా, అంతర్జాతీయ ప్రయాణాల పరంగా మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ పాత మీనంబాక్కం టెర్మినల్ (కార్గో కోసం), తిరుశూలం వద్ద దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల కోసం టెర్మినల్స్ ఉన్నాయి.6. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం, కోల్కతాతూర్పు భారతదేశంలోనే అతి పెద్దదైన ఈ విమానాశ్రయం కోల్కతాలో ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మీదుగా ఇది ప్రారంభమయ్యింది. పలు దేశీయ విమాన సంస్థలకు ఇది ప్రధాన హబ్గా ఉంది. గతంలో వేర్వేరుగా ఉన్న టెర్మినల్స్ను 2018లో ఒకే సమీకృత టెర్మినల్గా మార్చారు.7. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం, అహ్మదాబాద్గుజరాత్లోని అహ్మదాబాద్, గాంధీనగర్ జంట నగరాల నుంచి సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం రాష్ట్రంలోనే అతిపెద్దది. దేశంలో ఏడవ స్థానంలో అత్యంత రద్దీ అయినది. ఇక్కడ దేశీయ, అంతర్జాతీయ, కార్గో సేవల కోసం వేర్వేరు టెర్మినల్స్ ఉన్నాయి.8. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, కొచ్చికేరళలోని కొచ్చిలో ఉన్న ఈ విమానాశ్రయం కేరళలోనే అతిపెద్దది. రద్దీ అయినది. దేశీయ, అంతర్జాతీయ రాకపోకల కోసం దీనిలో ప్రత్యేకమైన టెర్మినల్స్ అందుబాటులో ఉన్నాయి.9. గోవా అంతర్జాతీయ విమానాశ్రయాలు గోవాలో ప్రస్తుతం రెండు విమానాశ్రయాలు ఉన్నాయి.దోబోలిమ్ విమానాశ్రయం: దక్షిణ గోవాలో నేవీ ఎయిర్బేస్ పరిధిలో సివిల్ ఎన్క్లేవ్గా నడుస్తోంది. ఇది 2023లో 8.5 మిలియన్లకు పైగా ప్రయాణికులను హ్యాండిల్ చేసింది.మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం: ఉత్తర గోవాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 2023 జనవరి 5న ప్రారంభించిన విమానాశ్రయం ఇది. ప్రారంభ సంవత్సరంలోనే ఇది 4.4 మిలియన్ల ప్రయాణికులను ఆకర్షించింది.10. పూణే అంతర్జాతీయ విమానాశ్రయం మహారాష్ట్రలోని పూణేలో గల లోహెగావ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిధిలో సివిల్ ఎన్క్లేవ్గా ఈ విమానాశ్రయం పనిచేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 9.5 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలందించింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అత్యాధునిక నూతన టెర్మినల్ భవనం ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తోంది.ఇది కూడా చదవండి: స్వర్గంలాంటి అంటార్కిటికాను వదిలేస్తున్న గైడ్లు -
జనరిక్స్కు గుడ్బై.. స్పెషాలిటీ డ్రగ్స్కు వెల్కమ్
భారత ఔషధ పరిశ్రమలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు తక్కువ ధరల జనరిక్ మందులతో ప్రపంచమార్కెట్లో ఆధిపత్యం చాటిన భారత ఫార్మా కంపెనీలు ఇప్పుడు అధిక విలువ కలిగిన స్పెషాలిటీ డ్రగ్స్, బయోసిమిలర్స్, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స మందులు, ఇతర బ్రాండెడ్ వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నాయి. అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరల పోటీ, మార్జిన్ల తగ్గుదలతో కంపెనీలు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. దేశంలోనే అతి పెద్ద ఫార్మా సంస్థలైన సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్, సిప్లా, లుపిన్ కంపెనీ ప్రతినిధుల వ్యాఖ్యలు ఫార్మా రంగంలో వస్తున్న ఈ మార్పును తెలియజేస్తున్నాయి. సంప్రదాయ జనరిక్స్ బదులుగా లాభాలు అందించే ప్రత్యేక ఉత్పత్తులు, కొత్త మార్కెట్లు, వినూత్న చికిత్సలపై కంపెనీలు దృష్టి పెట్టాయి. ఈ మార్పులో సన్ ఫార్మా ఇతర కంపెనీలకన్నా ముందంజలో ఉంది. కంపెనీ గ్లోబల్ ఇన్నొవేటివ్ మెడిసిన్స్ వ్యాపారం 2025–26 ఆర్ధిక సంవత్సరంలో 1.4 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో 22 శాతానికిపైగా స్పెషాలిటీ మందుల నుంచి వస్తోంది. రుమేనియా, బ్రెజిల్, చైనా మార్కెట్లలో ఇలుమ్యా వంటి వినూత్న ఔషధాలు మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయని కంపెనీ తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ కూడా బయోసిమిలర్స్, స్పెషాలిటీ డ్రగ్స్, ఇంకా అనేక విభిన్న ఉత్పత్తులపై దృష్టి సారిస్తోంది. ఉత్పత్తి సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ 2025–26లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక వార్షిక ఆదాయాన్ని రెడ్డీస్ నమోదు చేసింది. ప్రాథమిక వ్యాపారం రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ సీఎఫ్ఓ ఎం.వి. నరసింహం తెలిపారు. మరోవైపు సిప్లా తన ఆఫ్రికా వ్యాపారం, శ్వాసకోశ చికిత్సలు, బ్రాండెడ్ ప్రి్రస్కిప్షన్ ఔషధాల ద్వారా బలమైన వృద్ధిని సాధిస్తోంది. కంపెనీ ఎమర్జింగ్ మార్కెట్లు, యూరప్ వ్యాపారం 400 మిలియన్ డాలర్లకు పైగా నమోదు చేసింది. బయోసిమిలర్స్ను భవిష్యత్తులో భారీ అవకాశాలున్న విభాగంగా కంపెనీ భావిస్తోంది. లుపిన్ కూడా అమెరికా వెలుపల మార్కెట్లు, బ్రెజిల్ వంటి దేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కంపెనీ బ్రెజిల్ వ్యాపారం స్థానిక కరెన్సీలో 113 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం 60కి పైగా ఇంజెక్టబుల్స్, శ్వాసకోశ ఉత్పత్తుల అభివృద్ధి పనులు కొనసాగుతుండగా వచ్చే ఏడాదిలోగా అమెరికా మార్కెట్లో తొలి బయో సిమిలర్ ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మాలో మార్పులు ఇలా కొనసాగుతుండగా దేశీయ ఔషధ మార్కెట్ కూడా బలపడుతోంది. ఈక్విరస్ సెక్యూరిటీస్ విశ్లేషణ ప్రకారం 2026 మే నాటికి భారత ఫార్మా మార్కెట్ 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో 3.2 శాతం నేరుగా జరిగిన అమ్మకాల నుంచే రావడం గమనార్హం. ఇది నిజమైన వినియోగ డిమాండ్ను సూచిస్తోందని ఈక్విరస్ తెలిపింది. భారత ఫార్మారంగం జనరిక్స్ తయారీ కేంద్రం అనే గుర్తింపును దాటి పరిశోధన ఆధారిత అధిక విలువ కలిగిన ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఎదిగే దిశగా ప్రయాణంప్రారంభించింది. వచ్చే రోజుల్లో స్పెషాలిటీ డ్రగ్స్, బయోసిమిలర్స్, కొత్త మార్కెట్లే భారత ఫార్మా వృద్ధికి ప్రధాన ఇంధనంగా మారనున్నాయి. స్పెషాలిటీ మందులు అంటే? సాధారణ జ్వరం, దగ్గు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు మందులు అన్ని మెడికల్ షాపుల్లో సులభంగా లభిస్తాయి. వీటి తయారీ కూడా సులభం, అలా కాకుండా క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మలి్టపుల్ స్లెరోసిస్, సోరియాసిస్, హెపటైటిస్, హెచ్ఐవీ వంటి క్లిష్టమైన దీర్ఘకాలిక వ్యాధుల కోసం తయారుచేసే అత్యాధునిక అధిక ధర ఔషధాలు. వీటి తయారీ, పరిశోధనకి చాలా ఖర్చు అవుతుంది. ఇవి ప్రత్యేక ఆసుపత్రులు, ఫార్మసీల ద్వారానే లభిస్తాయి. సాధారణ మందులతో పోలిస్తే ధరలు ఎక్కువ. చాలావరకు ఇంజెక్షన్, ఇన్ఫ్యూషన్ రూపంలో ఇస్తారు. వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఈ మందుల అమ్మకాలపై లాభాల మార్జిన్ ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. జనరిక్స్ మార్కెట్లో పోటీ పెరగడంతో ఫార్మా కంపెనీలకు స్పెషాలిటీ డ్రగ్స్ ప్రత్యామ్నాయ ఆదాయ వనరులుగా మారుతున్నాయి. పేటెంట్ ఆధారిత ఉత్పత్తులు కావడంతో పోటీ కూడా తక్కువగా ఉంటుంది.– సాక్షి, బిజినెస్డెస్క్ -
ఆర్థిక వ్యవస్థకు ముప్పుతుప్పులు!
సాక్షి, హైదరాబాద్: ఏదైనా ఒక వస్తువుకు తుప్పు పడితే తుప్పే కదా అని తీసి పారేస్తాం. లోహపు వస్తువులో నాణ్యత లోపించిందని భావిస్తాం. కానీ ఇదే తుప్పు దేశానికి భారీ ఆర్థిక ముప్పును తెచ్చిపెడుతోందంటే మాత్రం ముక్కున వేలేసుకోక తప్పదు. వివరంగా చెప్పాలంటే..తుప్పు అనే చిన్న సమస్య ప్రస్తుతం దేశ ప్రగతికి పెద్ద అవరోధంగా మారింది. ఇనుము, ఉక్కు వస్తువులకు పట్టే తుప్పు (కొరోజన్) కారణంగా భారత్కు ఏటా దాదాపు రూ.14.15 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోందని జపాన్కు చెందిన ప్రముఖ ఆర్థిక పరిశోధన సంస్థ నొమురా తాజా నివేదిక వెల్లడించింది. ఈ నష్టం వార్షిక స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) సుమారు 4.3 శాతానికి సమానం. పాడవుతున్న భారీ యంత్రాలు వాతావరణ మార్పులు, తేమ, రసాయనాల ప్రభావం వల్ల లోహాలు క్రమంగా క్షీణించడం మొదలు పెట్టడాన్నే తుప్పు అంటారు. ఈ ప్రక్రియ చిన్న చిన్న వస్తువులనే కాదు.. అనేక కీలక మౌలిక సదుపాయాలను నిశ్శబ్దంగా నిర్వీర్యం చేస్తోంది. దేశంలో నిర్మిస్తున్న వంతెనలు, రహదారులు, రైల్వే లైన్ల వంటి నిర్మాణాలు, ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, పారిశ్రామిక రంగానికి చెందిన భారీ యంత్రాలు ఈ సమస్య కారణంగా వాటి నిర్దేశిత కాల పరిమితికి ముందే పాడైపోతున్నాయి.ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు వాటిని పునరుద్ధరించడానికి, మరమ్మతులు చేయడానికి ఏటా భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. కొత్తగా మరిన్ని ఆధునిక వసతులు, ఆసుపత్రులు, పాఠశాలలు, రహదారుల నిర్మాణానికి ఉపయోగపడాల్సిన నిధులు ఇలా ఉనికిలో ఉన్న పాత ఆస్తులను కాపాడుకోవడానికే వెచ్చించాల్సి రావడం దేశ ఆర్థికాభివృద్ధిని మందగించేస్తోంది.ఈ రంగాల్లో నష్టాలెక్కువ.. లోహపు విడి భాగాలను ఎక్కువగా ఉపయోగించే మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, విద్యుత్ ఉత్పత్తి– సరఫరా, టెలికం, రైల్వే రంగాలు తుప్పు సమస్యతో తీవ్రంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ రంగానికి చెందిన వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, టెలికం టవర్లు.. నిరంతరం ఎండ, వాన కారణంగా నిర్దిష్ట కాలపరిమితికి ముందే దెబ్బతింటున్నాయి.భారత్లో తీవ్రం.. ఎందుకంటే.. భారీ వర్షాలు, తేమ: రుతుపవనాల వల్ల కురిసే భారీ వర్షాలు, ఇక్కడి వాతావరణంలో ఉండే అధిక తేమ లోహాలను త్వరగా పాడుచేస్తాయి. తీరప్రాంత ఉప్పు గాలి: దేశానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం కారణంగా గాలిలో లవణీయత (ఉప్పు శాతం) ఎక్కువగా ఉంటుంది. ఇది సముద్ర తీర ప్రాంతాల్లోని వంతెనలు, ఓడరేవుల నిర్మాణాలను వేగంగా క్షీణింపజేస్తుంది. ఆటో మొబైల్ రంగంపైనా ప్రభావం చూపిస్తోంది. ఒకేతరహా నిర్మాణ నిబంధనలు: అమెరికా, జపాన్ వంటి దేశాలు వాతావరణ పరిస్థితులను బట్టి వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరు భద్రత ప్రమాణాలను పాటిస్తాయి. కానీ మన దేశంలో కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే రకమైన నిర్మాణ నిబంధనలను అనుసరిస్తున్నారు. చౌకైన, నాణ్యత లేని భద్రతా ప్రమాణాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కు సంబంధించిన ప్రమాణాలు కొనసాగుతున్నప్పటికీ వాతావరణ తీవ్రతను బట్టి ఏ ప్రాంతంలో ఎలాంటి తుప్పు నివారణ పద్ధతులు (ఉదాహరణకు ప్రత్యేక పూతలు లేదా గాల్వనైజేషన్) వాడాలో స్పష్టంగా పేర్కొనలేదు. దీనివల్ల నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు కేవలం నిబంధనల కోసమే అన్నట్టుగా అత్యంత చౌకైన, నాణ్యత లేని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారు. ఫలితంగా వంతెనలు, ఫ్లైఓవర్లు కొద్ది సంవత్సరాలకే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాకుండా ప్రజల ప్రాణాలకు కూడా ముప్పుగా పరిణమిస్తోంది. సరైన యాంటీ–కొరోజన్ వ్యవస్థను, నాణ్యమైన స్టెయిన్లెస్ స్టీల్ను వాడితే దేశ ఉత్పాదకత పెరిగి జీడీపీకి అదనంగా 1.5 శాతం లబ్ధి లభిస్తుందని నివేదిక స్పష్టం చేస్తోంది.నొమురా సూచనలు01 కఠిన చట్టాలు: దేశంలో నిర్మించే ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులో తుప్పు నివారణ చర్యలను తప్పనిసరి చేయాలి.02 అంతర్జాతీయ ప్రమాణాలు:వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా మన దేశ నిర్మాణ నిబంధనలను అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా మార్చాలి.03 అవగాహన పెంపు⇒ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లలో అధునాతన యాంటీ–కొరోజన్ సాంకేతికతలపై అవగాహన పెంచాలిఅందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతలుహాట్–డిప్ గాల్వనైజేషన్: ఇనుము, ఉక్కుపై ద్రవరూప జింక్ పూతను పూయడం ద్వారా తుప్పు పట్టకుండా రక్షణ కల్పించవచ్చు. క్యాథోడిక్ ప్రొటెక్షన్: విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించి భూగర్భ పైప్లైన్లు, సముద్రపు వంతెనల లోహ క్షీణతను అడ్డుకోవచ్చు. ఎపోక్సీ కోటింగ్స్: ఉక్కు ఉపరితలాలపై ప్రత్యేక ప్లాస్టిక్ పొరను అమర్చి తేమ, రసాయనాల ప్రభావం పడకుండా చూడొచ్చు. వెదరింగ్ స్టీల్: ఈ రకమైన ప్రత్యేక ఉక్కు వాతావరణ ప్రభావానికి గురైనప్పుడు దానికదే ఒక రక్షణ పొరను ఏర్పరచుకుని మరింత క్షీణించకుండా ఆగుతుంది. నానో–టెక్నాలజీ పూతలు: లోహాల రంధ్రాలను పూడ్చే సరికొత్త రసాయన పూతలు కూడా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.ఇతర దేశాల్లో ఇలా..పర్యావరణ విభజన (జోనింగ్): అమెరికా తన దేశాన్ని వివిధ వాతావరణ మండలాలుగా (తీరప్రాంతం, మంచు ప్రాంతం, పొడి ప్రాంతం) విభజించింది.ఏ ప్రాంతంలో నిర్మించే వంతెనకైనా అక్కడి వాతావరణ తీవ్రతకు సరిపోయే రక్షణ వ్యవస్థలను మాత్రమే వాడాలనే నిబంధన ఉంది.కాలపరిమితి వ్యయ అంచనా:జపాన్లో ఏదైనా ప్రాజెక్టును చేపట్టేటప్పుడు కేవలం నిర్మాణ ఖర్చునే కాకుండా, రాబోయే 50 లేదా 100 సంవత్సరాల పాటు దానికి అయ్యే మరమ్మతుల ఖర్చును కూడా లెక్కించి, అత్యుత్తమ యాంటీ–కొరోజన్ మెటీరియల్ను ఎంపిక చేస్తారు.తప్పనిసరి తనిఖీలు:యూరప్లో వంతెనలు, రైల్వే మార్గాన్నినిర్ణిత కాల వ్యవధిలో అధునాతన సెన్సార్ల ద్వారా తనిఖీ చేసి, తుప్పు ప్రారంభ దశలోనే నివారణ చర్యలు చేపడతారు. -
జూడోలో బంగారు ధగధగ
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో 1990లో జూడోను మెడల్ ఈవెంట్గా ప్రవేశపెట్టగా... భారత్కు ఒక్కసారి కూడా స్వర్ణం లభించలేదు. ఈసారి ఆ లోటును తీరుస్తూ ఒకే రోజు ఇద్దరు భారత జూడో ప్లేయర్లు బంగారు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో హర్ష్ సింగ్ (60 కేజీలు), మహిళల 48 కేజీల విభాగంలో అస్మిత డే ఈ ఘనత సాధించారు. శుక్రవారం జరిగిన 60 కేజీల ఫైనల్లో 23 ఏళ్ల హర్ష్ 10–0 ఆ్రస్టేలియాకు చెందిన జోషువా కట్జ్ను చిత్తు చేశాడు. నిర్ణీత నాలుగు నిమిషాల సమయంకంటే మరో 41 సెకన్లు మిగిలి ఉండగానే ప్రత్యర్థి ఆటను ముగించడంలో హర్ష్ సఫలమయ్యాడు. మహిళల విభాగంలో భారత్కు తొలి కామన్వెల్త్ స్వర్ణం అందించిన జూడోకాగా అస్మిత నిలిచింది. 48 కేజీల ఫైనల్లో అస్మిత 2–1తో హీడీ క్వాచ్ (కెనడా)ను ఓడించింది. జూడోలో మనకు మూడో స్వర్ణం గెలుచుకునే అవకాశం చేజారింది. మహిళల 57 కేజీల ఫైనల్లో యామిని మౌర్య ఓడి రజతంతో సంతృప్తి చెందింది. ఇంగ్లండ్కు చెందిన అసీలియా టోప్రాక్ 100–0 (ఇపాన్ స్కోరింగ్)తో యామినిపై గెలుపొందింది. రేపటితో ముగియనున్న కామన్వెల్త్ గేమ్స్లో ప్రస్తుతం భారత్ 5 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది. తొలిసారి కామన్వెల్త్ బరిలోకి దిగి... కామన్వెల్త్ క్రీడల అథ్లెటిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల డిస్కస్ త్రోలో సీమా కాలిరామ్నా కాంస్యం నెగ్గింది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో బరిలోకి దిగిన సీమా డిస్్కను 58.65 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. లవ్ప్రీత్కు రజతం... వెయిట్లిఫ్టింగ్ పురుషుల ప్లస్ 110 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజతం దక్కించుకున్నాడు. స్నాచ్లో 176 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 212 కేజీలు కలిపి మొత్తం 388 కేజీల బరువెత్తిన లవ్ప్రీత్ రెండో స్థానంతో ముగించాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. భారత్ 1 స్వర్ణం, 6 రజతాలు, 1 కాంస్యంతో మొత్తం 8 పతకాలు గెలుచుకుంది.తండ్రి అండగా నిలవగా... అస్మిత డే స్వస్థలం త్రిపురలోని బెలోనియా. తండ్రి సైకిల్ మెకానిక్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. అయితే కూతురు ఆసక్తి చూపించడంతో ఆమెను జూడోలో చేర్పించి శిక్షణ ఇప్పించాడు. ఆర్థిక సమస్యలతో సతమతమైనా... ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. ఒకదశలో మోకాలి గాయంతో కెరీర్ ఇబ్బందుల్లో పడినా ఢిల్లీలో చికిత్స అందించి ప్రోత్సహించాడు. అయితే అస్మిత కామన్వెల్త్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన విషయాన్ని పంచుకునేందుకు ఆయన లేడు. గత డిసెంబర్లో అస్మిత తండ్రి బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు. పతకం గెలుచుకున్న అనంతరం అస్మిత కన్నీళ్ళతో తన తండ్రిని గుర్తు చేసుకుంది. ‘క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా రాని ఊరునుంచి నేను వచ్చాను. కానీ నాన్న మాత్రం నన్ను నమ్మి అన్ని విధాలా అండగా నిలిచాడు. ఆయన అంత్యక్రియలు ముగిసిన పది రోజులకే నాన్న కల నెరవేర్చమంటూ అమ్మ నన్ను మళ్లీ శిక్షణకు పంపించింది. ఈ పతకం కోసం నేను చాలా కష్టపడ్డాను. నా బౌట్ల గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇక్కడికి వచ్చాక ఎంతో ఒత్తిడికి గురయ్యాను. చివరకు స్వర్ణం సాధించగలిగా’ అని అస్మిత చెప్పింది. ‘పసిడి’ పంచ్లకు గెలుపు దూరంలో భారత బాక్సర్లు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ దూసుకుపోతున్నారు. వేర్వేరు విభాగాల్లో సత్తా చాటిన ఏడుగురు భారత బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు. తద్వారా కనీసం స్వర్ణం లేదా రజతాన్ని ఖాయం చేశారు. మహిళల సెమీఫైనల్స్లో అరుంధతి (70 కేజీలు) 4–0తో డిఫెండింగ్ చాంపియన్ రోజీ ఎకెల్స్ (వేల్స్)పై, వరల్డ్ చాంపియన్ జైస్మిన్ (57 కేజీలు) ‘రిఫరీ స్టాప్స్ ద కాంటెస్ట్’తో రాపెలాంగ్ మస్లెలా (లెసోతో)పై, ప్రీతి పవార్ (54 కేజీలు) 5–0తో కాథరీన్ ఎంవాపె (జాంబియా)పై, సాక్షి (51 కేజీలు) 5–0తో అంబర్ జేన్వాల్ (కెనడా)పై , ప్రియ (60 కేజీలు) 5–0తో లూసీ (ఇంగ్లండ్)పై నెగ్గి తుది పోరుకు అర్హత సాధించారు. పురుషుల సెమీఫైనల్స్లో జాదూమణి సింగ్ (55 కేజీలు) 5–0తో ఫిలిప్ హోసెబ్ (నమీబియా)ను, అంకుశ్ (80 కేజీలు) 5–0తో ఒఫోరి (కెనడా)ను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
ఇక ఉద్యోగాలు, ఉత్పాదకతే లక్ష్యం
1991లో చేపట్టిన సంస్కరణలను అనేకమంది భారతదేశ ఆర్థిక రంగానికి ‘లాంచ్ ప్యాడ్’ (అభివృద్ధికి పునాది)గా భావిస్తారు. 1991 జూలై 4న– సరిగ్గా 35 ఏళ్ళ క్రితం అప్పటి ఆర్థిక మంత్రి మన్మో హన్ సింగ్ తన బడ్జెట్ ప్రసంగంలో విక్టర్ హ్యూగో మాటలను ఉటంకిస్తూ, ‘సమయం ఆసన్నమైన ఆలోచనను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు’ అని పేర్కొన్నారు. ‘ప్రపంచంలో భారత్ ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం అనేది కూడా అలాంటి ఆలోచనే’ అని ఆయన ప్రకటించారు.ముప్పై ఐదు సంవత్సరాల తరువాత, మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటంటే– ఆ రోజున పారిశ్రామిక, వాణిజ్య నియంత్రణలను తొలగించడం అనేది భారతదేశ ఆర్థిక వృద్ధి రేటునూ, అలాగే పేదరిక నిర్మూలన వేగాన్నీ పెంచడానికి ఎంతగానో తోడ్పడింది. అయితే 1991లో చేసిన వాగ్దానం పాక్షికంగా మాత్రమే నెరవేరిందని మనం అంగీకరించక తప్పదు. నిజానికి, అంత అను కూలంగా లేని అంతర్జాతీయ వాతావరణంలో, ఎటువంటి సులువైన పరిష్కారాలు లేని ఆర్థిక భద్రత, సాంకేతిక పరిపక్వత, సమ్మిళిత వృద్ధి అనే నూతన సవాళ్ళను ఎదుర్కొంటూ దేశం మరోసారి ఒక సంక్లిష్టమైన స్థితిలో నిలబడింది.అభివృద్ధి నిజమే కానీ...1990–91 నాటికి అంతకు ముందు 40 సంవత్సరాలలో, మన ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెరిగింది. కానీ అదే సమయంలో జనాభా రెండున్నర రెట్లు పెరగడంతో, తలసరి ఆదాయం కేవలం రెట్టింపు మాత్రమే అయింది. దానికి భిన్నంగా, 1990–91 తర్వాత గత 35 ఏళ్లలో, ఆర్థిక వ్యవస్థ ఎనిమిది రెట్లు పెరిగింది. ఈ మధ్యకాలంలో జనాభా 70 శాతం మాత్రమే పెరగడం వల్ల, తలసరి ఆదాయం నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది.మొదటి కాలంలో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరచగా, రెండవ (ఆర్థిక సంస్కరణల తరువాతి) కాలంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే పోటీ పడగలిగేలా అద్భుతమైన వృద్ధి నమోదు చేసింది. అయితే, ఇంకా ఎంతో సాధించి ఉండవచ్చని చైనా, వియత్నాంలు నిరూపిస్తున్నాయి. భారత్కు సమానమైన స్థాయి నుండి ప్రయాణం ప్రారంభించిన చైనా, ఇప్పుడు ‘అధిక ఆదాయ’ దేశాల జాబితాలోకి చేరే స్థితిలో ఉంది.1991లో భారతదేశ తలసరి ఆదాయంలో సగం కంటే తక్కువ ఆదాయం ఉన్న వియత్నాం ఇప్పుడు భారత్ కంటే 80 శాతం అధిక ఆదాయాన్ని కలిగి ఉంది. భారత్ ఇప్పటికీ ‘దిగువ–మధ్య ఆదాయ’ గ్రూపులోనే ఉంది. మన తలసరి ఆదాయం ప్రపంచ సగటులో నాలుగో వంతు కంటే తక్కువగానే ఉంది. తీవ్ర పేదరికం 1991లో 37 శాతంగా ఉండగా, ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. కానీ బహుమితీయ పేదరిక సూచీ ప్రకారం, ఇప్పటికీ ఆరో వంతు జనాభా పేదరికంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో భారత్ దిగువనే ఉంది. అయినప్పటికీ, వంటగ్యాస్,మంచినీటి కనెక్షన్లు, మరుగు దొడ్లు, గృహ విద్యుత్ వంటి ప్రాథమిక వస్తువుల లభ్యత గతంలో కంటే ఇప్పుడు మెరుగైంది.అయినా ప్రపంచ దృష్టి భారత్పైనే...కొన్ని విజయాలు పరిమి తమైనవిగా అనిపించినప్పటికీ, గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇక్కడి జనాభా పరిమాణమే. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అనేక రకాల ఉత్ప త్తులు, సేవలకు భారత్ ప్రపంచంలోనే అత్యంత భారీ మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఇది, ఖర్చు పెట్టే శక్తి ఉన్న ఒక పెద్ద మధ్యతరగతి విభాగ ఆవిర్భా వాన్ని ప్రతిబింబిస్తుంది.భారత్లోని 145 కోట్ల జనాభాలో 30 నుండి 40 శాతం మంది మధ్యతరగతి పరిధిలోకి వస్తారు. ఈ వర్గంలో దాదాపు 8 నుండి 10 కోట్ల కుటుంబాలు ఉన్నాయనడానికి ఏటా విక్రయించే 2 కోట్ల ద్విచక్ర వాహనాలు, 15 కోట్ల స్మార్ట్ఫోన్లు సాక్ష్యంగా ఉన్నాయి. 1991లో ఏడాది మొత్తం అమ్మిన కార్ల సంఖ్యను ఇప్పుడు కేవలం పదిహేను రోజుల్లోనే విక్రయిస్తున్నారు. ఆదాయంతో పోలిస్తే ఉత్ప త్తులు అందుబాటు ధరల్లో, మెరుగైన నాణ్యతతో లభిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సేవలు, తక్కువ ఖర్చుతో కూడిన ఫార్మాస్యూటికల్స్ తయారీలో భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. భారత్ రూపొందించిన డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, ఆయిల్ రిఫైనింగ్, వైద్యసంరక్షణ రంగాలలో సాంకేతిక పరిణతి కూడా గుర్తింపు పొందాయి. హార్వర్డ్ గ్రోత్ ల్యాబ్ వారి ‘ఎకనామిక్ కాంప్లెక్సిటీ ఇండెక్స్’లోని 145 దేశాలలో భారత్ పైనుండి మూడో స్థానంలో ఉంది. 1991 సంస్కరణల మూల సూత్రాన్ని దేశం సరిగ్గా అనుసరించి ఉంటే ఇంకా ఎంతో సాధించి ఉండేది. ప్రైవేట్ రంగం, మార్కెట్లు అవి సాధించగలిగినవాటిని వదిలేయడం, బయటి ప్రపంచానికి తలుపులు తెరవడం, ప్రభుత్వం మాత్రమే అందించగలిగే వాటిపై శ్రద్ధను కేంద్రీకరించడం–అంటే శాంతిభద్రతలు, న్యాయం, ప్రజారోగ్యం, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, పర్యావరణ పరి రక్షణ, మార్కెట్ల సరైన నియంత్రణ కలిగి ఉండటమే ఆ సూత్రం.వాస్తవ స్థితివీటిలో ప్రతి విషయంలోనూ భారత్ వెనుకబడి ఉంది. దేశంలో 22 లక్షల మంది పోలీసులు ఉంటే, దానికి నాలుగు రెట్లు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. కోర్టుల్లో ఆలస్యం అనేది సర్వసా ధారణమైపోయింది. సగానికి పైగా పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. 40 శాతం ఆసుపత్రి పడకలు ప్రైవేట్రంగానివే. ప్రజల ఆదాయాలు ఇంకా పరిమితంగా ఉన్న సమయంలో ఈ రెండింటికీ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సరిపడా పోషకాహారం లేకపోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రభుత్వ అప్పులు ఆందోళన కరమైన స్థాయికి చేరాయి. విద్య, రక్షణ రెంటిపై ప్రభుత్వం చేసే వ్యయం తగ్గుతోంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. గత దశాబ్దపున్నర కాలంగా రక్షణాత్మక సుంకాలు, ఇతర అడ్డంకులు పెరిగిన కొద్దీ, జీడీపీలో వస్తువుల ఎగుమతుల నిష్పత్తి తీవ్రంగా తగ్గుతూ వచ్చింది. మంచి ఉద్యోగాల కల్పన కష్టంగా మారడంతో మధ్యతరగతి పరిమాణం గతంలోలాగా పెరగడం లేదు. దేశంలోని అత్యున్నత అర్హతలు కలిగినవారు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళ్తున్నారు. స్వదేశీ ప్రైవేట్ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేవు. అత్యంత తీవ్రంగా దెబ్బ తిన్నది మాత్రం మధ్యతరగతికి, పేదలకు మధ్యన ఉన్న ‘ఆకాంక్షల వర్గం’. అసంఘటిత రంగంలో అస్థిరమైన, తక్కువ ఆదాయాల వల్ల వీరిలో అత్యధికులు ‘నిశ్శబ్ద నైరాశ్యంతో కూడిన జీవితాలను’ గడుపుతున్నారు. ఈ వర్గానికి చెందిన కొందరు యువకులు గత నెల రోజు లుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన ప్రాంతంలో కనిపించారు. ఈ వయస్సు వర్గాలలో 25 శాతం నుండి 40 శాతం వరకు నిరుద్యోగం ఉంది. 1991 సంస్కరణల స్ఫూర్తిని కొనసాగిస్తూ, ప్రభుత్వం తన శ్రద్ధను ప్రాథమిక సేవలపై కేంద్రీకరించడం ద్వారా మాత్రమే ఈ స్థితిని మార్చగలదు.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-టి.ఎన్. నైనన్ -
జూడోలో భారత్కు స్వర్ణం.. ఒక్కరోజే 13 పతకాలు ఖరారు!
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. జూడోలో మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో కెనడాకు చెందిన హెల్దీ క్వాచ్పై 4-0తో విజయం సాధించిన అస్మితా దే స్వర్ణం సాధించింది. జూడోలో భారత్కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక జూడోలో స్వర్ణం సాధించిన తొలి మహిళా ప్లేయర్గా అస్మితా రికార్డులకెక్కింది. ఈ గేమ్స్లో ఇది భారత్కు 4వ స్వర్ణం కాగా, ఓవరాల్గా భారత్కు ఇది 18వ పతకం. ఇక కామన్వెల్త్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ 18 పతకాలు (4 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) సాధించింది. అయితే గేమ్స్లో భాగంగా 9వ రోజైన శుక్రవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 13 పతకాలు ఖరారయ్యాయి. ఇందులో బాక్సింగ్ నుంచి 10 పతకాలు ఉంటే, జూడో నుంచి మరో మూడు పతకాలు ఉన్నాయి. జూడో గేమ్లో హర్ష్ సింగ్, యామిని మౌర్య, అస్మితా దే ఫైనల్కు దూసుకెళ్లారు. ఫైనల్లో గెలిస్తే స్వర్ణం లేదంటే రజతాలు దక్కనున్నాయి. ఇక బాక్సింగ్లో భారత్ పంచ్ పవర్ అదుర్స్ అనిపిస్తోంది. భారత బాక్సర్లలో ప్రీతి పవార్, అంకుశ్ పంగల్, జాస్మిన్ లంబోరియా, జాదుమణి సింగ్, అరుంధతీ చౌదరీలు శనివారం ఫైనల్ మ్యాచ్లు ఆడనున్నారు. గెలిస్తే ఐదు స్వర్ణాలు.. ఓడితే ఐదు రజతాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. ఇక మరో ఐదుగురు భారత బాక్సర్లు సెమీస్కు అర్హత సాధించడంతో కనీసం కాంస్యం ఖరారు చేసుకున్నారు. ఇక ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. అందరి కళ్లు నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. నీరజ్ కచ్చితంగా స్వర్ణం లేదా కనీసం రజతమైనా ఒడిసిపడతడని అంతా భావిస్తున్నారు. నీరజ్తో పాటు మరో ఇద్దరు భారత జావెలిన్ త్రోయర్లు కూడా బరిలో ఉండడంతో పతకాలపై ఆశలు మరింత పెరుగుతున్నాయి. ఇలా శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13 పతకాలకు పైగా ఖరారు కావడంతో భారత్కు ఆదివారం లోగా 30 నుంచి 31 పతకాలు వచ్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఇవాళ జూడో మహిళల విభాగంలో అస్మితా దే (48 కేజీల విభాగంలో), యామిన్ మౌర్య (57 కేజీల విభాగంలో) ఫైనల్ ఆడనుండగా, పురుషుల విభాగంలో హర్ష్ సింగ్ (60 కేజీలు) ఫైనల్లో ఆడనుండడంతో భారత్ పతకాల సంఖ్య 20కి చేరనుంది. 🇮🇳🥹 India's first-ever Commonwealth Games Gold Medal in Judo.Asmita Dey has etched her name into Indian sporting history! 🥇She defeats Canada's Heidi Quach 2-1 to win the Women's -48kg Judo Gold at the Commonwealth Games 2026.pic.twitter.com/4KEKWaDmXG— Sports Apna 🇮🇳 (@sportsapna1) July 31, 2026 𝐀𝐒𝐌𝐈𝐓𝐀 𝐃𝐄𝐘 𝐂𝐑𝐄𝐀𝐓𝐄𝐒 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘! 🇮🇳🥇 Becomes the FIRST-EVER Indian JUDOKA (male or female) to win a Commonwealth Games GOLD medal! Defeats Heidi Quach in 48kg Final. #Glasgow2026 #Glasgow2026withIAS pic.twitter.com/Ux3mQQ8Jf3— India_AllSports (@India_AllSports) July 31, 2026 -
ఓవర్టైమ్ చేస్తున్నారా?.. యూకే కంపెనీలు ఏమంటాయో తెలుసా?
ఒకప్పుడు చాలామంది ఉద్యోగమే జీవితం అని బ్రతికేవారు. కానీ నేడు కాలం మారింది. ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. అయితే.. ఈ విధానం ప్రతి దేశంలోనూ ఒకే విధంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ముఖ్యంగా భారత్, యూకే వంటి దేశాల మధ్య ఈ విషయంలో చాలా తేడా కనిపిస్తుంది.ఇండియాలో వర్క్ లైఫ్భారతదేశంలో చాలామంది ఉద్యోగులు ఆఫీస్ టైమ్ ముగిసిన తరువాత కూడా.. రాత్రి వరకు పని చేస్తుంటారు. సెలవు రోజుల్లో కూడా ఆఫీస్ వర్క్స్ చేసేవాళ్లు ఇండియాలో కోకొల్లలు. అలాంటి వారిని అంకితభావం ఉన్న ఉద్యోగులుగా, కంపెనీ కోసం కష్టపడేవారిగా భావిస్తారు. మరోవైపు.. సమయానికి పని ముగించి ఇంటికి వెళ్లేవారిని కొన్ని సంస్థలు నిబద్ధత లేని వారిగా చూస్తాయని చెబుతారు.యూకేలో ఇలా..అయితే.. యూకే వంటి దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ వర్క్ పూరవ్వగానే లేదా ఆఫీస్ టైమ్ ముగిశాక పనిచేయడానికి ఆసక్తి చూపించరు. కంపెనీలు కూడా ఎక్కువసేపు పనిచేయాలని ఒత్తిడి చేయవు. ఉద్యోగులు తమ కుటుంబానికి, ఆరోగ్యానికి, వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయించాలని సంస్థలు ప్రోత్సహిస్తాయి. వర్క్ టైమ్ ముగిశాక ఈమెయిల్స్ లేదా మెసేజ్లకు వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని భావిస్తారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుభవంఈ విషయాన్ని ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓమ్ తన అనుభవం ద్వారా వివరించాడు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి అతను రాత్రి 7 గంటల తర్వాత కూడా తన తన సహోద్యోగి పంపిన కామెంట్లకు సమాధానం ఇచ్చాడు. ఆఫీసు సమయం దాటిన తరువాత పనిచేయడాన్ని అలవాటుగా చేసుకోవద్దని, వృత్తిపరమైన.. వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను పాటించాలని సహోద్యోగి సలహా ఇచ్చినట్లు చెప్పాడు.I work with a senior developer from England.Because of the time difference, whenever he reviewed my PR and left comments, I'd reply immediately.Even if it was 9 or 10 PM in India.One day he noticed and asked me, .."Wait.. are you working beyond your work hours?"I said,…— Om (@Om_Codes_) July 30, 2026నెటిజన్ల స్పందనఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు విదేశీ కంపెనీలు ఉద్యోగుల వ్యక్తిగత సమయాన్ని గౌరవిస్తాయని ప్రశంసించగా, మరికొందరు ప్రతి కంపెనీ లేదా ప్రతి దేశాన్ని ఒకేలా చూడకూడదని అభిప్రాయపడ్డారు.కష్టపడి పని చేయడం ఎంత అవసరమో, అదే విధంగా ఆరోగ్యం, కుటుంబం, వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యమైనవని ఈ సంఘటన చెబుతోంది. పని కోసం జీవితాన్ని పూర్తిగా త్యాగం చేయడం కంటే.. పని - వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం ఉద్యోగిలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, పనిలో మెరుగైన ఫలితాలను తీసుకువస్తుంది. అందుకే ప్రతి ఉద్యోగి పని పట్ల బాధ్యతతో పాటు తన వ్యక్తిగత జీవితానికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. -
మోదీపై అభ్యంతకర పోస్టులు.. మెటా హెడ్పై కేసు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలలో ప్రధాని మోదీకి అభ్యంకతరంగా పోస్టులు చేశారంటూ మోటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్పై కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఇద్దరు బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీకి సంబంధించినటువంటి అభ్యంతరకరమైన, తప్పుడు కంటెంట్ను తమ ఫ్లాట్పారమ్లపై (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రసారం కావడానికి అనుమతించారని,అటువంటి పోస్టులను తొలగించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రిని అసభ్యకరంగా, అవమానకరంగా మరియు తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ చేయబడిన, డిజిటల్గా తారుమారు చేయబడిన అనేక వీడియోలు ,చిత్రాలు అందులో కనిపించాయని తెలిపారు.కాగా నీట్లీకేజ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. దీంతో మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని డిమాండ్లను సైతం కేంద్రం ముందుంచింది. -
భారత్తో పోలుస్తావా?.. పాక్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనల విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఆ దేశ అధికార వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ సర్కార్ను చూసి నేర్చుకోండి’’ అంటూ పాకిస్థాన్ పాలకులకు హితవు పలికారు. ప్రజల గొంతును అణచివేయడం కాకుండా.. వారి సమస్యలను వినే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.పాకిస్థాన్లో ఇటీవల విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత్లో విద్యార్థుల నిరసనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, పేపర్ లీక్లపై కఠిన చర్యలు వంటి నిర్ణయాలు తీసుకుందని అలీమా ఖానుమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆవేదనను వినడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ విషయంలో భారత్ను చూసి పాకిస్థాన్ ప్రభుత్వం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.‘‘భారత్లో విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ పాకిస్థాన్లో ప్రజలు ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు, బెదిరింపులే ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతును అణచివేయడం కాదు’’ అంటూ ఆమె మండిపడ్డారు. అధికార యంత్రాంగం ప్రజల హక్కులను గౌరవించకుండా వ్యవహరిస్తోందని, ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని అలీమా హెచ్చరించారు.అలీమా ఖానుమ్ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమైంది. అధికార పక్షానికి చెందిన నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడగా, పాకిస్థాన్ను భారత్తో పోల్చడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ నేతలు మాత్రం ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే విమర్శలను అంగీకరించే సంస్కృతి అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్నారని, న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిళ్లు పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీమా ఖానుమ్ చేసిన "మోదీ సర్కార్ను చూసి నేర్చుకోండి" వ్యాఖ్యలు భారత్-పాకిస్థాన్ పోలికలకే కాకుండా, పాకిస్థాన్లో ప్రజాస్వామ్య పరిస్థితులపై కూడా మరోసారి చర్చను రేకెత్తించాయి.ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. కొందరు అలీమా ఖానుమ్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు భారత్ను ఉదాహరణగా చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా, ఆమె చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కొత్త దుమారానికి తెరలేపాయి.నీట్ యూజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదంపై విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించి.. పరీక్ష రద్దు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివాదం తీవ్రం కావడంతో కేంద్రం విచారణలు, సంస్కరణలపై చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలో ప్రభుత్వం–నిరసనకారుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థులు తమ నిరసనలను విరమించినట్లు ప్రకటించారు. -
అనిశ్చితి వేళ అత్యయిక భేటీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో మళ్లీ రోజురోజుకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో అక్కడి విపరిణామాలు భారత్పై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయమై ప్రధాని మోదీ కీలక సమీక్ష జరిపారు. కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులను పలు అంశాలపై ప్రధాని ఆరా తీశారు. తన అధ్యక్షతన గురువారం ఢిల్లీలో జరిగిన భద్రతపై కేబినెట్ కమిటీ(సీసీఎస్) అత్యవసర సమావేశంలో ప్రధాని మోదీ ఇంధన అవసరాల కోసం కొనసాగుతున్న దిగుమతుల తీరుతెన్నులు, అవలంభిస్తున్న అంతర్జాతీయ విధానాలను సమీక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్, హోం మంత్రి అమిత్షా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, వాణిజ్య మంత్రి పియూశ్ గోయల్, షిప్పింగ్ మంత్రి శర్బానంద సోనోవాల్, పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురితోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హార్మూజ్ జలసంధి, నల్ల సముద్ర, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మార్గాల ద్వారా పెట్రోలియం, సహజవాయువు, ఎరువుల దిగుమతి తీరుతెన్నులపై కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చితి, భద్రతపై దాని దుష్ప్రభావాలు, దేశీయంగా ద్రవరూప సహజ వాయువు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, పెట్రో ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు భారత్ ఆ మేరకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ప్రధానికి విడమర్చి చెప్పారు. ఎల్పీజీని విభిన్న దేశాల నుంచి సమీకరిస్తున్నామని, సరిపడా నిల్వలు దేశంలో ఉన్నాయని సోమనాథన్ వెల్లడించారు. రైతులుకు ఎల్లవేళలా ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆదేశించారు. హార్మూజ్ జలసంధి, సమీప సముద్ర జలాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే సరకు రవాణా నౌకల్లోని భారతీయ నావికులు, సిబ్బంది రక్షణపై మోదీ ఆరాతీశారు. భారతీయ సిబ్బంది యోగక్షేమాలను భారత్లోని వాళ్ల కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేసే యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని మోదీ సూచించారు. -
బెదిరింపుల ప్రభావం తాత్కాలికమే
కోల్కతా: వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు రెండు దశాబ్దాల తరువాత భారత్ తిరిగి రానున్నారు. 2003 తస్లిమా నస్రీన్ రాసిన పుస్తకం ‘ద్విఖండిత’పెద్ద వివాదానికి కారణమైంది. ముస్లింల మనోభావాలను దెబ్బతీశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, నిరసనలకు దిగడంతో ప్రభుత్వం 2007లో ఆ పుస్తకాన్ని నిషేధించడంతోపాటు తస్లీమా దేశం వదిలి వెళ్లేలా చేసింది. అయితే.. ఇన్నేళ్ల తరువాత మళ్లీ కోల్కతా రావడంపై ఆమె గురువారం మాట్లాడుతూ, ‘‘నా సొంత దేశానికి వచ్చినట్లే’’అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. తన తాజా పర్యటన భావ ప్రకటన స్వేచ్ఛ, భిన్న గళాలకు రక్షణ ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేందిగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేవారు. తస్లీమా ఆగస్టు ఒకటవ తేదీ కోల్కతాలో జరిగే ఒక కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ప్రసిద్ధ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయలతో కలిసి పాల్గొననున్నారు. తస్లీమా నస్రీన్ జన్మతః బాంగ్లాదేశీ. అయితే 1994లో ఆమె రాసిన పుస్తకం ‘లజ్జ’పై కూడా పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి. బాబ్రీ మసీదు ధ్వంసం నేపథ్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై దౌర్జన్యం జరగిందని తస్లీమా తన పుస్తకంలో రాసుకొచ్చారు. దీనికి ఆగ్రహించిన అక్కడి మతఛాందసవాదులు నిరసనలకు దిగడంతో 1997లో కోల్కతాకు వచ్చారు. పదేళ్లు ఇక్కడే గడిపిన తరువాత మరో వివాదం కారణంగా మళ్లీ బాంగ్లాదేశ్కు మకాం మార్చాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆమె కోల్కతా రావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో తస్లీమా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కోల్కతా కేవలం పదేళ్లు ఉన్న నగరం మాత్రమే కాదని, తనదన్న సొంత భావనను అందించినదని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లు దూరంగా ఉన్నా పశ్చిమ బెంగాల్తో తన అనుబంధం మాత్రం కొనసాగిందని చెప్పారు. ‘‘నా మనసులో బెంగాల్ ఎన్నడూ ముళ్లకంచెలతో కూడిన సరిహద్దులతో విడిపోలేదు. బెంగాల్ తూర్పు దిక్కున తలుపులు నాకు ఎప్పుడూ మూసే ఉంటాయి. అందుకే నాకు ఈ వైపు బెంగాల్ ఇల్లు అయిపోయింది’’అని వ్యాఖ్యానించారు. కోల్కతా తిరిగి వస్తూండటం తనకు దుఖంతో కూడిన ఆనందాన్ని ఇస్తోందని, పంతొమ్మిదేళ్లు నన్ను నా మిత్రులు, పాఠకులు, సొంతమనే భావనను దూరం చేశారని, ఈ కాలాన్ని ఎవరూ తిరిగి ఇవ్వలేరని భావోద్వేగంతో మాట్లాడారు. ‘‘అలాగని తాను ఏదో అతిథిలానో, అపరిచితురాలి మాదిరిగానో రావడం లేదు. బెంగాల్లో ఒక భాగమనే విశ్వాసంతోనే వస్తున్నా’’అన్నారు. ఆ మాటకొస్తే తాను కోల్కతా వదిలింది కూడా ఇష్టపూర్వకంగా కాదని, ఏదో ఒక రోజు ఇక్కడకు తిరిగి వస్తానన్న నమ్మకం తనకు ఉండిందని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగానే కాకుండా.. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కోసం జరిగిన పోరాటానికి తన రాక ప్రతీక అని వ్యాఖ్యానించారు. ‘‘ఛాందసులు నొక్కేసేందుకు ప్రయత్నించిన గొంతుక తిరిగి వస్తోంది. స్టేజీపై నా ఉనికి ఫత్వాలు, బెదిరింపులు ఒక రచయితను కొంతకాలం ప్రవాసానికి పంపవచ్చునేమో కానీ ఆమె ఆలోచనలను తుడిచివేయలేరు అనేందుకు నిదర్శనంగా నిలుస్తుంది’’అని అన్నారు. అసౌకర్యంగా ఉన్న అభిప్రాయాలకూ రక్షణ కల్పించడమే భావ ప్రకటన స్వేచ్ఛకు కొలమానమని అన్నారు. ‘‘ఒక రచయిత స్వేచ్ఛ ప్రభుత్వ దయపై, లేదా ఒక పార్టీ సిద్ధాంతంపై లేదా మత సంస్థల అనుమతులపై ఆధారపడకూడదు. ప్రాథమిక హక్కులా ఉండాలి’’అన్నారు. భారతీయ పౌరురాలు కానప్పటికీ తనకు ఇక్కడ ఆశ్రయం దక్కడంపై కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీ రచయితలు స్వేచ్ఛగా మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం కల్పిస్తోందని, అదే సమయంలో బెదిరింపులు అందుకేనేందుకూ కారణమవుతుందోని చెప్పారు. యువత ప్రతి విషయాన్ని ప్రశ్నించాలని, మతం, సంప్రదాయం, అధికారం, రాజకీయాలు మాత్రమే కాకుండా... వారికిష్టమైన ఆలోచనలనూ ప్రశ్నించాలని, ఎవరి భావాలనో తమవిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని, వాటిని తమ నమ్మకాలుగా స్వీకరించవద్దు అని పిలుపునిచ్చారు. -
భారత జట్లకే రెండు టైటిల్స్
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్షిప్లో భారత పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. హోరాహోరీగా సాగిన పురుషుల విభాగం ఫైనల్లో భారత్ 3–2 తేడాతో మలేసియాపై విజయం సాధించగా... మహిళల జట్టు కూడా 3–0తో మలేసియానే చిత్తు చేసింది. విజేతగా నిలిచిన మహిళల జట్టులో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ సభ్యురాలిగా ఉంది. విజేతగా నిలిచిన జట్లకు 10 వేల డాలర్ల (రూ. 9 లక్షల 55 వేలు) చొప్పున ప్రైజ్మనీ లభించింది. పురుషుల ఫైనల్లో ముందుగా మానవ్ ఠక్కర్ 12–10, 11–7, 5–11, 11–5తో జావెన్ చూంగ్పై, మనుశ్ షా 11–13, 11–9, 11–7, 2–11, 11–7తో షెన్ వాంగ్పై గెలుపొందడంతో భారత్ 2–0తో ముందంజలో నిలిచింది. అయితే భారత సీనియర్ స్టార్ సత్యన్ జ్ఞానశేఖరన్ 7–11, 8–11, 10–12తో హాంగ్ యూ టే చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. హర్మీత్ దేశాయ్ను భారత్ పక్కన పెట్టడంతో మళ్లీ బరిలోకి దిగిన మానవ్ 11–4, 8–11, 11–8, 7–11, 1–11తో వాంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. చివరి మ్యాచ్లో చెలరేగిన మనుశ్ 11–7, 11–4, 11–4తో చూంగ్పై గెలుపొంది జట్టుకు టైటిల్ ఖాయం చేశాడు. మహిళల ఫైనల్లో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. వరుస మ్యాచ్లలో స్వస్తిక ఘోష్ 11–7, 11–2, 9–11, 11–9తో జిన్ టీపై, ఆకుల శ్రీజ 9–11, 11–6, 11–4, 5–11, 11–3తో లైన్ అనాక్పై, యశస్విని 7–11, 11–3, 17–15, 11–5తో అలైస్ లీ సియాన్పై గెలుపొందారు. -
అమెరికా రాజనీతికి యుద్ధం కేంద్రకం
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలను, వీటిలో యూఎస్ఏ పాత్రను విస్తృత అంతర్జాతీయ జియో పొలిటికల్ క్రీడలో భాగంగా చూడాలి. 2035లో ప్రపంచ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతున్నది. ఈ పరిణామంలో భాగమే ఈ యుద్ధాలు. గత 250 సంవత్సరాల అమెరికా చరిత్ర పూర్తిగా యుద్ధాలతోనే ముడిపడి ఉన్నది. గత శతాబ్దంలో ప్రతి 20 సంవత్సరాలకు కనీసం ఒక పెద్ద యుద్ధానికి తెరతీసింది. పద్దెనిమిది,పందొమ్మిది శతాబ్దాలలో దేశ విస్తరణకు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, మెక్సికోలతో యుద్ధం చేసింది. ఇరవయ్యవ శతాబ్దంలో ఫిలిప్ఫైన్, రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, బోస్నియా, గల్ఫ్ యుద్ధాలలో నిమగ్నమైంది. ఇరవయ్యొకటవ శతాబ్దంలో అఫ్గాని స్తాన్, ఇరాక్, లిబియా, యెమెన్, సిరియా, సోమాలియాలలో యుద్ధాలను లేవనెత్తింది. గత 250 ఏళ్లలో యూఎస్ఏ కేవలం 1865–1898 (33 సం‘‘లు), 1918–1945 (27 సం‘‘లు) మధ్య మాత్రమే యుద్ధానికి దూరంగా ఉన్నది. శాంతి కోసం యుద్ధం, సుభిక్షానికి యుద్ధం, సుస్థిరతకు యుద్ధం అనేది అమెరికా పాలనా విధానం. శక్తిని చాటి చెప్పటానికి యుద్ధాన్ని ఒక పరికరంగా పరిగణిస్తుంది. ఈ యుద్ధ తంత్రానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ఉదారవాద విధానాల ముసుగు కప్పుతుంది. కథ అడ్డం తిరిగింది!సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ప్రపంచంపై తన ఏకచ్ఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి అమెరికా సర్వశక్తులు ఒడ్డింది. ప్రత్యర్థి రష్యాను పూర్తిగా అణచివేయాలని నాటోను విస్త రించింది. 2010కల్లా రష్యా ఆర్థికంగా పుంజుకొని అమెరికాకు సవా లుగా తయారైంది. ఇదే సమయంలో అనూహ్యంగా చైనా బలమైన ప్రత్యర్థిగా ఎదిగింది. 2020కల్లా భారత్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలు కూడా బలమైన శక్తులుగా రూపుదిద్దుకున్నాయి. బ్రిక్స్ రూపంలో కూటమిగా చేరి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను సంకల్పించటంతో కథ అడ్డం తిరిగింది.బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడటం ఖాయమనే విశ్లేషకుల జోస్యాన్ని తప్పుగా నిరూపించాలని కృతనిశ్చయంతో ఉన్నది. అమెరికా ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. 1. ప్రత్యర్థు లను నిర్వీర్యం చేసి ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగటం. 2. ప్రత్య ర్థులతో రాజీపడి పరిమిత ధ్రువ (లిమిటెడ్ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం. 3. ప్రత్యర్థులతో రాజీపడి బహుళ ధ్రువ (మల్టీ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం.మూడింట్లో మొదటి దారిప్రస్తుతం అమెరికా ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగాలనే పట్టు దలతోనే ఉన్నట్లుగా కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే ఇంధన వనరులు, ఇంధన రవాణా మార్గాలపై పెత్తనానికి సర్వశక్తులు ఒడ్డు తున్నది. రష్యాపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించి ఉక్రెయిన్ యుద్ధపు పద్మవ్యూహంలోనికి రష్యాను లాగింది. రష్యానుండి చమురు, గ్యాస్ ఎవరూ కొనగూడదని ఐరోపా, భారత్లను కట్టడి చేసింది. దీర్ఘకాలిక యుద్ధంలో ఉక్రెయిన్ వెనుక నిలబడి రష్యా అలసిపోయి నిర్వీర్యమవటానికి దీర్ఘకాలిక ప్రణాళికను అమలు పరుస్తున్నది. అందుకే నెల లోపున ముగుస్తుందనుకున్న ఉక్రెయిన్ యుద్ధం నాలుగన్నర సంవత్సరాలకు కూడా కొనసాగుతున్నది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చైనా చేతిలో పడకుండా చూడటం ద్వారా చైనాను కట్టడి చేయాలనేది అమెరికా వ్యూహం. ‘చిప్ 4’ అలయన్స్లో భాగంగా అమెరికా, తైవాన్, ద.కొరియా, జపాన్లు చైనాకు అత్యాధునిక సెమీకండక్టర్ చిప్లు అందుబాటు లోనికి రాకుండా ప్రయత్నిస్తున్నాయి. ఆకస్ కూటమిలో భాగంగా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏలు ఏఐ, క్వాంటమ్ మెకానిక్స్ హైపర్సోనిక్ టెక్నాలజీని చైనాకు అందకుండా చేయటానికి ప్రయ త్నిస్తున్నాయి. జీ7, యూరోపియన్ యూనియన్ల ద్వారా అత్యాధు నిక చిప్స్ తయారు చేసే యంత్రాలను ఏఎస్ఎంఎల్ (నెదర్లాండ్స్), టోక్యో ఎలక్ట్రానిక్ (జపాన్) కంపెనీలు చైనాకు ఎగుమతి చేయకుండా ఆంక్షలు పెట్టాయి. తైవాన్ను సమర్థించటం ద్వారా కూడా చైనాకు చెక్ పెట్టటానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.విశేషంగా ఇంధన వనరులున్న ఇరాన్, ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్ మొదలైన గల్ఫ్ దేశాలపై నియంత్రణకు అమెరికా దీర్ఘకాలికంగా వ్యూహాలను అమలుపరుస్తున్నది. సైనిక స్థావరాల ద్వారా గల్ఫ్ దేశాలలో అమెరికా ఇప్పటికే పాగా వేసింది. ఈ ఇంధన వనరుల నియంత్రణలో అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది ఇరాన్. అందుకే హార్మూజ్, బాబెల్ మాండెబ్ జలసంధులపై పెత్తనానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.ఆసియాలో భారత్ ఆధిపత్యం?అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంలో భాగాలే ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు. అందువలన ఈ రెండు ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవు. ఇరాన్ యుద్ధం వలన తీవ్రంగా నష్ట పోయేది భారత్, చైనాలని గుర్తించాలి. చైనా, రష్యా, భారత్లను ఈ రెండు యుద్ధాల ద్వారా కట్టడి చేయటం సాధ్యం కాని పక్షంలో అమె రికా పరిమిత ధ్రువ ప్రపంచానికి రాజీ పడాల్సి వస్తుంది. రష్యా, చైనా/భారత్లను ప్రపంచ శక్తులుగా అంగీకరించాల్సి వస్తుంది. క్రమంగా నాటోను రద్దుపరచి ఐరోపాపై రష్యా ఆధిపత్యానికి అంగీ కరించి ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలకు యూఎస్ఏ తన ఆధిప త్యాన్ని పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణ, తూర్పు ఆసి యాలలో చైనా ఆధిపత్యాన్ని అంగీకరించి గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రా యెల్–యూఏఈ– సౌదీల ద్వారా నియంత్రణకు ప్రయత్నిస్తుంది. అయితే దక్షిణ, తూర్పు ఆసియాలలో ఆధిపత్యంతో చైనా సరిపెట్టుకోక పోవచ్చును. చైనా ప్రపంచాధిపత్యానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాక్రమంగా రష్యాతో ఒప్పందం ద్వారా చైనాకు వ్యతిరేకంగా భార త్ను ఆసియాలో ఆధిపత్యానికి ప్రోత్సహించవచ్చును.2040 కల్లా చైనా ప్రపంచ శక్తిగా అమెరికా, రష్యాలనే సవాలు చేయవచ్చని విశ్లేషకుల అంచనా. ఈనాడు ప్రత్యర్థులుగా ఉన్న రష్యా, అమెరికాలు కలిసి చైనాను నిలువరించాల్సి రావచ్చును. రాజకీయాలలో శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శతృత్వం కానీ ఉండదు. అమెరికా, రష్యాలు, ఆసియాలో భారత్ వైపే మొగ్గు చూప టానికి అవకాశం ఉన్నది. తైవాన్ను చైనా ఆక్రమించటానికి ప్రయ త్నించినప్పుడు చైనాను ఇంకొకవైపు నుండి నిలువరించటానికి భారత్ సిద్ధమవవచ్చును. ఒకవైపు హిమాలయాలలో చైనాపై దాడి చేస్తూనే భారత్ మలక్కా జలసంధిని దిగ్బంధనం చేయవచ్చు. ఆ సందర్భంలో చైనా సముద్రంలో అమెరికా, జపాన్లను చైనా ఎదు ర్కోవటం కష్టమవుతుంది. భారత్కు అమెరికా సైనిక, వ్యూహాత్మక మద్దతును అందించవచ్చును.కాకపోతే, ఈ అమెరికన్ అంతర్జాతీయ రాజకీయ వ్యూహంలో పావుగా మారటానికి భారత్ ఒప్పుకోకపోవచ్చును. ప్రాంతీయంగా ఆసియాలో చైనాను నియంత్రించటానికి భారత్ ఒప్పుకుంటుంది. కానీ అంతర్జాతీయంగా చైనాను నిరోధించే వ్యూహంలో భారత్ భాగ స్వామిగా మారాల్సిన అవసరం భారత్కు లేదు. ఏది ఏమయినా ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు అంతర్జాతీయ రాజకీయ యవనికను నియంత్రించే కీలక ఘట్టాలనటంలో సందేహం లేదు. భారత్ ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు- గురజాల శ్రీనివాసరావు -
మారుతున్న ట్రెండ్.. పెరుగుతున్న లోన్స్!
భారత్లో అధికారిక రుణ వ్యవస్థ గత కొన్నేళ్లలో వేగంగా విస్తరించిందని ట్రాన్స్యూనియన్ సిబిల్ (TransUnion CIBIL) విడుదల చేసిన తాజా నివేదిక 'అన్లాకింగ్ యాక్సెస్: జర్నీ ఆఫ్ క్రెడిట్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇండియా' వెల్లడించింది. 2017లో లోన్ తీసుకోవడానికి అర్హత కలిగిన వారిలో కేవలం 35 శాతం మంది మాత్రమే కనీసం ఒక్కసారైనా లోన్ తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ సంఖ్య 2026 నాటికి 74 శాతానికి చేరింది. అంటే.. గత తొమ్మిదేళ్లలో భారతీయులు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది.లోన్స్ తీసుకునే వారిలో మహిళలు, యువత, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం కూడా వేగంగా పెరుగుతోంది. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు వంటి సంప్రదాయ మార్కెట్లతో పాటు.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో కూడా రుణాల వృద్ధి వేగంగా నమోదవుతోంది.ప్రజల్లో క్రెడిట్పై అవగాహన కూడా పెరిగిందని నివేదికలో వెల్లడైంది. 2018లో తమ క్రెడిట్ స్కోర్ను పరిశీలించే వారి సంఖ్య కేవలం 1 శాతం ఉండగా, 2026 నాటికి అది 35 శాతానికి పెరిగింది. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, వ్యాపార రుణాల వినియోగం కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. అయితే.. కొత్తగా రుణాలు తీసుకునే వారి సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ఇంకా అధికారిక రుణ వ్యవస్థలోకి రాని వ్యక్తులు, చిన్న వ్యాపారాలను చేర్చుకునేందుకు భారీ అవకాశాలు ఉన్నాయని ట్రాన్స్యూనియన్ సిబిల్ అభిప్రాయపడింది. డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, ఫిన్టెక్ సేవల విస్తరణతో దేశంలో రుణాల లభ్యత మరింత పెరిగిందని సంస్థ పేర్కొంది. -
‘వందేమాతరం’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: వందేమాతరం గేయాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. స్వల్ప చర్చ అనంతరం గందరగోళం మధ్య గురువారం లోక్సభ ఈ చట్టాన్ని ఆమోదించింది.“జాతీయ గౌరవాలను అవమానించకుండా నిరోధించే (సవరణ) బిల్లు, 2026”కు రాజ్యసభ బుధవారమే ఆమోదం తెలిపింది. దిగువ సభ ఆమోదంతో ఇది చట్టంగా మారేందుకు మరో అడుగు ముందుకు వేసింది.నీట్ ప్రశ్నపత్ర లీక్పై నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసు చర్యల అంశంపై చర్చ కోరుతూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టిన సమయంలోనే లోక్సభలో వందేమాతరం బిల్లు మూజువాణి ఓటు (వాయిస్ ఓటు)తో ఆమోదం పొందింది. సభలో గందరగోళం కొనసాగుతున్నప్పటికీ శాసన కార్యక్రమాలు కొనసాగాయి. 1971 జాతీయ గౌరవాలను అవమానించకుండా నిరోధించే చట్టంలో వందే మాతరాన్ని చేర్చే లక్ష్యంతో ఈ సవరణ తీసుకొచ్చారు.ప్రస్తుతం రాజ్యాంగం, జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి జాతీయ చిహ్నాలను అవమానించిన వారికి గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి. ఈ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత వందే మాతరం పాడే సమయంలో అవమానించడం, అడ్డుకోవడం, అంతరాయం కలిగించడం వంటివి చేసినా అదే శిక్ష వర్తిస్తుంది. గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. 1875లో బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన వందే మాతరం 1882లో ఆయన ఆనందమఠ్ నవలలో తొలిసారి ప్రచురితమైంది. వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఈ బిల్లు భాగం. జూలై 29న రాజ్యసభలో జరిగిన చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు చర్చ సమయంలో వాకౌట్ చేశాయి.ఎగువ సభలో చర్చకు సమాధానమిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. దేశ గౌరవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడమే ఈ బిల్లు ఉద్దేశమన్నారు. వందే మాతరాన్ని భారత స్వాతంత్య్ర పోరాటానికి, జాతీయ చైతన్యానికి ప్రతీకగా అభివర్ణించారు.ఈ బిల్లును జూలై 24న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జూలై 29న రాజ్యసభ, జూలై 30న లోక్సభ ఆమోదించాయి. నీట్ ప్రశ్నపత్ర లీక్ అంశంపై రెండు సభల్లోనూ వారం రోజులకుపైగా కొనసాగుతున్న అంతరాయాల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది. -
ఆగస్టులో హాలిడేస్: ఈ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు!
భారతదేశంలోని బ్యాంకులకు జాతీయ సెలవులతో పాటు రాష్ట్రాల వారీగా స్థానిక పండుగలు, సాంస్కృతిక వేడుకలు, ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా కూడా సెలవులు ఉంటాయి. వీటికి అదనంగా ప్రతి నెల రెండో శనివారం, నాలుగో శనివారం, అన్ని ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. అందువల్ల బ్యాంకుకు సంబంధించిన పనులు ముందుగానే ప్రణాళిక చేసుకోవడం మంచిది. ఈ కథనంలో 2026 ఆగస్టులో బ్యాంక్ హాలిడేస్ గురించి తెలుసుకుందాం.ఆగస్టు 8: టెండోంగ్ రో రమ్ ఫాత్ - ఈ పండుగ సందర్భంగా సిక్కిం రాష్ట్రంలోని బ్యాంకులు మూసివేయబడతాయి. ఇది సిక్కిం ప్రజలకు చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన పండుగ.ఆగస్టు 13: పేట్రియాట్ డే - మణిపూర్ రాష్ట్రంలో ఈ రోజు వీరమరణం పొందిన దేశభక్తులను స్మరించుకుంటారు. ఈ సందర్భంగా మణిపూర్లోని బ్యాంకులు సెలవు పాటిస్తాయి.ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం - భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.ఆగస్టు 16: పార్సీ నూతన సంవత్సరం - పార్సీ సమాజం నూతన సంవత్సరాన్ని జరుపుకునే సందర్భంగా డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని బ్యాంకులు సెలవు పాటిస్తాయి.ఆగస్టు 25: ఈద్-ఎ-మిలాద్ - ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే అండమాన్ & నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి.ఆగస్టు 26: ఓణం -కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పండుగ అయిన ఓణం సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు.ఆగస్టు 27: ఝూలన్ యాత్ర - ఒడిశా రాష్ట్రంలో జరుపుకునే ఝూలన్ యాత్ర సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు ఉంటుంది.ఆగస్టు 28: రక్షా బంధన్ - అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ప్రేమకు ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్ సందర్భంగా ఛత్తీస్గఢ్, డామన్ & డయ్యూ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.ఈ సెలవుల కారణంగా బ్యాంక్ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోయినా, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు, అలాగే ఏటీఎం సేవలు సాధారణంగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. -
‘పాకిస్తానీ కశ్మీర్’ కాదు.. పీవోకే మాత్రమే: అమెరికా పత్రికకు భారత్ కౌంటర్
కశ్మీర్ అంశంపై భారత్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను ‘పాకిస్తానీ కశ్మీర్’గా పేర్కొంటూ అమెరికా ప్రముఖ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదప్రయోగం వాస్తవాలను వక్రీకరించేలా, తప్పుదారి పట్టించేలా ఉందని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. సదరు కథనంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.అమెరికాలోని భారత రాయబార కార్యాలయం న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. పాకిస్తానీ కశ్మీర్ అంటూ ఎలాంటి ప్రాంతం లేదు. ఉన్నది పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్ (పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్) మాత్రమే అని స్పష్టం చేసింది. అలాగే, జమ్ము కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగాలేనని భారత్ పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లోని కొంత భాగాన్ని అక్రమంగా ఆక్రమించిందని ఆరోపించింది. భారత రాయబార కార్యాలయం ప్రకారం.. ఆక్రమిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై పాకిస్తాన్ బలప్రయోగం చేస్తోందని ఆరోపించింది. అక్కడి ప్రజల హక్కులు, భద్రతపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని పేర్కొంది.పీవోకేలో హింసపై కథనంఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని మీర్పూర్లో జరిగిన నిరసనలు, ఘర్షణలపై న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. స్థానిక సమస్యలు, పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన నిరసనల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది. ఈ ఘర్షణల్లో కాల్పుల కారణంగా పలువురు మృతి చెందినట్లు, పరిస్థితిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని పాకిస్తాన్ను మానవ హక్కుల సంఘం కోరినట్లు కథనంలో పేర్కొంది. అయితే నిరసనకారుల ఆరోపణలను స్వతంత్రంగా నిర్ధారించలేదని కూడా ఆ కథనం పేర్కొంది.పదప్రయోగమే వివాదానికి కారణంన్యూయార్క్ టైమ్స్ కథనంలోని ఘటనల కంటే, దాని శీర్షికలో ఉపయోగించిన ‘పాకిస్తానీ కశ్మీర్’ అనే పదమే భారత్ అభ్యంతరానికి ప్రధాన కారణమైంది. కశ్మీర్కు సంబంధించి ఉపయోగించే పదాలు కేవలం భాషా పరమైనవి మాత్రమే కాకుండా, అంతర్జాతీయ రాజకీయాల్లో ఎంతో సున్నితమైన అంశాలుగా మారుతుంటాయి. భారత్ దృష్టిలో పీవోకే అనేది పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న భారత భూభాగం కాగా, పాక్ మాత్రం దానిపై భిన్నమైన వాదనను కొనసాగిస్తోంది.ఇదిలా ఉండగా.. కశ్మీర్ విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా భిన్న అభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా ఇరు దేశాలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ ఉపయోగించిన పదప్రయోగంపై భారత్ స్పందించడం ద్వారా కశ్మీర్ అంశం మరోసారి అంతర్జాతీయ చర్చలోకి వచ్చింది. భౌగోళిక అంశాలతో పాటు పదాల ఎంపిక కూడా దౌత్యపరంగా ఎంత కీలకమో ఈ పరిణామం మరోసారి చాటిచెప్పింది. -
తెలుగు రాష్ట్రాల్లో 98% మంది నాన్-వెజ్ ప్రియులే..!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్న నానుడి వినిపించేది. ఇప్పుడు ఆ ప్లేట్లో అన్నంతో పాటు చికెన్ ముక్క తప్పనిసరి అయిపోయింది. దేశం మొత్తం ‘మాంసాహార భారత్’గా మారిపోతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 డేటా చూస్తే షాక్ తినాల్సిందే. దేశంలో 76.6 శాతం మంది నాన్ వెజ్ తింటున్నారు. అంటే ప్రతి 4 మందిలో ముగ్గురికి పైగా మాంసాహారులే. తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ ప్రియులు తెలుగు రాష్ట్రాలు నాన్ వెజ్కు పెట్టింది పేరు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం తెలంగాణలో శాకాహారులు కేవలం 1.3 శాతం మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో 1.7 శాతం. అంటే 98 శాతం పైగా ప్రజలు వారంలో ఏదో ఒక రోజు మాంసం, చేపలు, గుడ్లు తింటున్నారు. హైదరాబాద్ బిర్యానీ, కోస్తా చేపల పులుసు, రాయలసీమ నాటుకోడి కూర.. ఇవే మన ఫుడ్ ఐడెంటిటీ. నమూనా సర్వే ప్రకారం, తెలంగాణలో 58 శాతం మంది వారానికోసారి చికెన్ తింటే, ఏపీలో 63 శాతం మంది చేపలను ఇష్టపడతారు. రాజస్థాన్లో 75 శాతం మంది శాకాహారులే.. దేశంలో శాకాహారానికి కేరాఫ్ అడ్రస్ రాజస్థాన్. ఇక్కడ 74.9 శాతం మంది పూర్తి శాకాహారులు. హరియాణా 69.2 శాతం, పంజాబ్ 66.7 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మతపరమైన విశ్వాసాలు, జైన–వైష్ణవ సంప్రదాయాలు ఇందుకు కారణం. దేశ సగటు వెజ్ 23.4 శాతం అయితే, పశి్చమ రాష్ట్రాలు మాత్రం 60 శాతం పైగా శాకాహారాన్ని పాటిస్తున్నాయి. భౌగోళికంగా చూస్తే దేశాన్ని రెండుగా చూడొచ్చు. పశి్చమం వెజ్ బాటలో ఉంటే, దక్షిణం–తూర్పు–ఈశాన్య రాష్ట్రాలు నాన్ వెజ్ దారిలో ఉన్నాయి. తమిళనాడు 97.8 శాతం, కేరళ 97.4 శాతం పశి్చమ బెంగాల్ 98.7 శాతం, ఒడిశా 97.3 శాతం నాన్ వెజ్. తీర ప్రాంతాల్లో చేపలు, ఈశాన్యంలో పంది మాంసం, దక్షిణాదిన కోడి, మేక మాంసం ప్రధాన ఆహారం. అమెరికా బాటలో భారత్ ప్యూ పరిశోధన కేంద్రం 2024 నివేదిక ప్రకారం అమెరికాలో 95 శాతం మంది నాన్ వెజ్ తింటారు. భారత్ కూడా 76.6 శాతంతో అదే దారిలో వెళ్తోంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక శాతం శాకాహారులున్న దేశంగా ఉన్న భారత్ ఇమేజ్ మారుతోంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ లెక్కల ప్రకారం, భారత్లో తలసరి మాంసం వినియోగం 2006లో 3.2 కేజీలు ఉంటే, 2023 నాటికి 4.8 కేజీలకు పెరిగింది. రెండు దశాబ్దాల్లో శాకాహారుల శాతం 35 నుంచి 24 శాతానికి జారిపోయింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–3 జరిగిన 2005–06లో దేశంలో శాకాహారులు 35%. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 జరిగిన 2019–21 నాటికి అది 23.4 శాతానికి పడిపోయింది. 2026 నాటికి అంచనా 24%. అంటే 20 ఏళ్లలో 11% మంది శాకాహారం నుంచి మాంసాహారానికి మారారు. ఆదాయం పెరగడం, పట్టణీకరణ, ఫుడ్ డెలివరీ యాప్ల విస్తరణ, యువత ఫుడ్ ప్రాధాన్యాలు మారడం దీనికి కారణాలు. శాకాహారుల శాతం తగ్గుదల(2006–2026)2006: 35% ████ 2016: 29% ████████████ 2021: 23.4% ██ 2026: 24%– █████████ నాడు ‘శాకాహార దేశం’గా.. ఒకప్పుడు ‘శాకాహార దేశం’గా పేరున్న భారత్ ఇప్పుడు ‘మిక్స్డ్ ప్లేట్’దేశంగా మారింది. మతం, ప్రాంతం, ఆదాయం.. అన్ని హద్దులూ చెరిగిపోయి నాన్ వెజ్ కల్చర్ విస్తరిస్తోంది. ఇది కేవలం ఆహారపు అలవాటు మార్పు కాదు. వ్యవసాయం, పౌల్ట్రీ పరిశ్రమ, ఆరోగ్యం, పర్యావరణంపై దీని ప్రభావం భారీగా ఉంటుంది. ప్లేట్లో మార్పు.. దేశ భవిష్యత్తుకు సూచికగా ఉంటుందని నిఫుణులు అంటున్నారు. -
రైతు కాళ్ల కిందే కర్మాగారం
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది.దేశ యూరియా అవసరాల్లో నాలుగోవంతును దిగుమతి చేసుకునే భారత్కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్దపశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనినిఅందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ. మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది. ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలోసేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండోకాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు« దాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది. జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. -వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తాను.. నన్ను చంపేయొచ్చు: షేక్ హసీనా
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా (78) తన ప్రాణాలకు ముప్పు ఉన్నా డిసెంబర్ నాటికి స్వదేశానికి తిరిగి రావాలని దృఢంగా నిర్ణయించుకున్నానని మీడియాకు తెలిపారు. "నన్ను చంపేయొచ్చు. నన్ను అరెస్టు చేయొచ్చు. నన్ను జైలుకు పంపొచ్చు. నా భవిష్యత్తు ఏంటో నాకు పూర్తిగా తెలుసు. అయినా నేను తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రజలు నన్ను పిలుస్తున్నారు" అని చెప్పారు.విద్యార్థుల నేతృత్వంలో 2024 ఆగస్టులో జరిగిన తిరుగుబాటుతో హసీనా పదవి కోల్పోయారు. ఆమె నివాసాన్ని జనాలు చుట్టుముట్టడంతో హెలికాప్టర్లో భారతదేశానికి వచ్చేశారు. అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో జరిగిన అణచివేత చర్యల్లో 1,400 మంది వరకు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.నవంబర్లో ఢాకా కోర్టు హసీనాను మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన నేరాల కేసులో దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును ఆమె "చట్టం రూపంలో కనిపిస్తున్న రాజకీయ ప్రతీకారం"గా అభివర్ణించారు. భారతదేశంలో రహస్య ప్రదేశంలో నివసిస్తున్న హసీనా తాను తిరిగి బంగ్లాదేశ్కు రావాలనే నిర్ణయంపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.హసీనా పదవి కోల్పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తాత్కాలిక ప్రభుత్వ హయాంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తారిక్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి కాస్త స్థిరపడింది. హసీనాను అప్పగించాలని ఢాకా అధికారికంగా కోరింది. ఆ అభ్యర్థనను పరిశీలిస్తున్నామని భారత్ తెలిపింది.అయితే తన తిరుగు ప్రయాణ నిర్ణయానికి ఆ అంశంతో సంబంధం లేదని హసీనా చెప్పారు. తాను భారతదేశంలో గౌరవప్రదంగా ఉంటున్నానని అన్నారు. "నన్ను అప్పగించే అంశంపై భారత అధికారులు నాతో చర్చించలేదు. నా దేశానికి తిరిగి రావాలని నేనే నిర్ణయించుకున్నాను" అని తెలిపారు.ప్రత్యర్థుల హత్యలు, ప్రతిపక్ష పార్టీల అణచివేత, పక్షపాత న్యాయస్థానాలు, ఏకపక్ష ఎన్నికలు వంటి అనేక దుర్వినియోగాలకు హసీనా ప్రభుత్వం పాల్పడిందని మానవ హక్కుల సంస్థలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. అయితే ఆ ఆరోపణల్లో చాలా వరకు "రాజకీయంగా సృష్టించిన ప్రచారాలు" అని హసీనా సమర్థించుకున్నారు.తన పదవి కోల్పోవడానికి దారితీసిన విద్యార్థుల నిరసనల సమయంలో అధిక బలప్రయోగానికి తానే అనుమతి ఇచ్చానన్న ఆరోపణలను కూడా హసీనా ఖండించారు. "నా ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో సహనాన్ని ప్రదర్శించింది. విద్యార్థుల ఉద్యమాన్ని శాంతియుత పరిష్కారం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది" అని ఆమె చెప్పారు. ఆ తిరుగుబాటు కేవలం సాధారణ విద్యార్థుల నిరసన కాదని ఆమె వ్యాఖ్యానించారు."అది రహస్య ఆదేశాలు, వ్యవస్థీకృత హింస, ప్రచారం, ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే లక్ష్యంతో నడిచిన ప్రణాళికాబద్ధ చర్యగా మారింది" అని ఆమె అన్నారు. భారత విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించేందుకు భారతదేశ వ్యాప్తంగా జరిగిన నిరసనలపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. -
పీవోకేలో మంటలు: పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులపై భద్రతా బలగాల కాల్పుల్లో 14 మంది మృతి చెందిన ఘటనపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని కూడా భారత్తో సమానంగా శత్రువులుగా చూస్తానని ఆయన పేర్కొన్నారు.స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని వ్యాఖ్యానించారు. ‘‘నేను నిరసనకారులను కూడా భారత్ మాదిరిగానే శత్రువులుగా పరిగణిస్తాను’’ అని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది. ఆందోళనకారులతో చర్చలకు అవకాశం లేదని, వారు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.పీవోకేలో కాల్పులు.. 14 మంది మృతిపీవోకేలోని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు సాగిన భారీ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో కనీసం 14 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినట్లు నిరసనకారులు వెల్లడించారు. పలువురు గాయపడ్డారు.పీవోకే అసెంబ్లీలో కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 స్థానాలను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వ్ సీట్ల విధానం వల్ల స్థానిక ప్రజల రాజకీయ హక్కులు ప్రభావితం అవుతున్నాయని JAAC ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్కు చెందిన రాజకీయ పార్టీలు పీవోకే రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతోందని వారు విమర్శిస్తున్నారు.అయితే పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. నిరసనకారుల వద్ద ఆధునిక ఆయుధాలు ఉన్నాయని, వారు భద్రతా సిబ్బందిపై దాడి చేయడంతోనే బలగాలు స్పందించాయని అధికారులు చెబుతున్నారు. ఇరువర్గాల వాదనలను స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు.కారణాలు ఉన్నాయిపీవోకేలో ప్రస్తుత ఆందోళనలు ఒక్కసారిగా మొదలైనవి కావు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యుత్ కొరత, నిరుద్యోగం, పాలనా వైఫల్యాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. చౌక ధరలకు విద్యుత్, గోధుమ పిండి సరఫరా, స్థానిక ప్రజలకు మెరుగైన పాలన, ఎక్కువ రాజకీయ హక్కులు కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న నిరసనలు ఇప్పుడు ఇస్లామాబాద్ పాలనపై పెద్ద ఎత్తున వ్యతిరేకతగా మారాయి.భారత్ స్పందన ఇదే..పీవోకేలో జరుగుతున్న పరిణామాలపై ఇటు భారత్ కూడా స్పందించింది. అక్కడ చేపడుతున్న ఎన్నికల ప్రక్రియను కేవలం పాకిస్థాన్ ఆక్రమణను సమర్థించుకునే ప్రయత్నంగా భారత్ అభివర్ణించింది. పీవోకేలో ప్రజల అసంతృప్తికి కారణం ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పాలనా వైఫల్యాలేనని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.ఇదిలా ఉండగా.. పీవోకే నిరసనకారులను భారత్తో పోల్చుతూ ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన సమయంలో మరింత కఠిన వైఖరి ప్రదర్శించడం ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
నౌకలపై దాడులు.. ఐరాసలో భారత్ ఆగ్రహం
న్యూయార్క్: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హోర్ముజ్ జలసంధిలో సముద్ర నౌకలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన భారత్.. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నిరంతర నౌకాయానం, వాణిజ్యాన్ని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ పశ్చిమ ఆసియాను భారత్కు అత్యంత కీలకమైన ప్రాంతంగా అభివర్ణించారు. ఇటీవల కొంతకాలం దాడులు ఆగిపోయిన తర్వాత మళ్లీ ప్రారంభం కావడం ఆందోళనకరమని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ గట్టిగా కోరుతోందని ఆయన స్పష్టం చేశారు.ఐరాస భద్రతా మండలిలో మంగళవారం జరిగిన చర్చలో హరీశ్ మాట్లాడుతూ, ఈ నెలలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న జిఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంఎం మొంబాసా సహా పలు నౌకలపై జరిగిన దాడులను ఖండించారు. ఈ దాడుల్లో పలువురు భారతీయులు గాయపడగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు అదృశ్యమయ్యారు. నావికులను టార్గెట్ చేయడం, అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా నౌకాయానానికి ఆటంకం కలిగించడాన్ని భారత్ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని ఆయన పేర్కొన్నారు.ప్రాంతీయ శాంతి, భద్రతల కోసం చర్చలు దౌత్య మార్గాల్లో జరగాలని భారత్ వాదించింది. వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిపివేయాలని కోరింది. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో జూలై 11న ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. కాగా ఈ ప్రాంతంలో భారత్కు భారీగా వాణిజ్య, ఇంధన ప్రయోజనాలు ఉన్నాయని, దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో జీవిస్తున్నారని, వారి భద్రతే తమ అత్యున్నత ప్రాధాన్యమని హరీశ్ ఉద్ఘాటించారు. కేవలం హోర్ముజ్ మీదే కాకుండా గాజాలో కొనసాగుతున్న మానవతా సంక్షోభాన్ని కూడా విస్మరించకూడదని భారత్ పేర్కొంది.ఇది కూడా చదవండి: కోడింగ్ టెస్ట్లు, ఇంటర్వ్యూలు వృథా.. టెకీ ఆవేదన! -
అటు అజయ్... ఇటు సర్వేశ్
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్లిఫ్టింగ్లో ఆంధ్రప్రదేశ్ అబ్బాయి వల్లూరి అజయ్ బాబు రజతం అందించగా... హైజంప్లో తొలిసారి రజతాన్ని అందించిన ఘనతను సర్వేశ్ కుశారే సొంతం చేసుకున్నాడు. పారా అథ్లెట్లు కూడా తమ వంతుగా రెండు పతకాలను భారత్ ఖాతాలో చేర్చారు. షాట్పుట్లో షర్మిల స్వర్ణంతో, శిల్ప కాంస్యంతో మెరిశారు.గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్లిఫ్టర్లు తమపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. ఈ క్రీడాంశం ద్వారా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 79 కేజీల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు మొత్తం 330 కేజీల బరువెత్తి రజతం గెలుచుకున్నాడు. స్నాచ్లో 149 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 181 కేజీల బరువెత్తిన అజయ్కు రెండో స్థానం దక్కింది. మలేసియాకు చెందిన హిదాయత్ (331 కేజీలు) స్వర్ణం సాధించగా, క్రిస్ ముర్రే (ఇంగ్లండ్; 325 కేజీలు) కాంస్యం గెలిచాడు. పురుషుల హైజంప్లో సర్వేశ్ కుశారే రజతాన్ని సొంతం చేసుకున్నాడు. 2.25 మీటర్ల ఎత్తుకు ఎగిరిన సర్వేశ్ రెండో స్థానంలో నిలిచాడు. జమైకా అథ్లెట్ రొమైన్బెక్ఫోర్డ్ (2.25 మీటర్లు) స్వర్ణం దక్కించుకోగా... కిమాని జాక్ (ఇంగ్లండ్; 2.20 మీటర్లు) కాంస్యం సాధించాడు. సర్వేశ్, బెక్ఫోర్డ్ ఇద్దరూ 2.25 మీటర్ల ఎత్తే ఎగిరినా... కౌంట్బ్యాక్లో జమైకా అథ్లెట్ పైచేయి సాధించాడు. సర్వేశ్తో పోలిస్తే బెక్ఫోర్డ్ విఫల ప్రయత్నాల సంఖ్య తక్కువ కావడమే అందుకు కారణం. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇది తొలి రజతం కావడం విశేషం. హైజంప్లో ఇప్పటి వరకు తేజస్విన్ శంకర్ (2022 బర్మింగ్హామ్) గెలుచుకున్న కాంస్యమే భారత్కు ఏకైక పతకం కాగా... ఇప్పుడు సర్వేశ్ దానిని సవరించాడు. మరో భారత హైజంపర్ ఆదర్శ్రామ్ (2.15 మీటర్లు) ఐదో స్థానంతో ముగించాడు. మరోవైపు బాక్సింగ్లో మూడు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ప్రీతి (54 కేజీలు), ప్రియ (60 కేజీలు), పురుషుల విభాగంలో జాదుమణి సింగ్ (55 కేజీలు) సెమీఫైనల్కు చేరుకొని కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు. మరో బాక్సర్ పర్విన్ 2–3తో సాషా హెకీ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది. మహిళల వెయిట్లిఫ్టింగ్ 63 కేజీల విభాగంలో నిరుపమా దేవి విఫలమైంది. స్నాచ్లో 93 కేజీలు బరువెత్తిన నిరుపమా క్లీన్ అండ్ జెర్క్ మూడు ప్రయత్నాల్లోనూ ఫౌల్ చేసింది. పారా స్విమ్మింగ్ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో భారత స్విమ్మర్ రవి బుడిగిన (ఆంధ్రప్రదేశ్; 25.68 సెకన్లు) 6వ స్థానంలో నిలిచాడు.స్వర్ణ, కాంస్యాలు మనవే...కామన్వెల్త్ పారా క్రీడల అథ్లెటిక్స్ పోటీల చరిత్రలో భారత్ తొలిసారి స్వర్ణం గెలుచుకుంది. మహిళల షాట్పుట్ (ఎఫ్57)లో హరియాణకు చెందిన షర్మిల ధన్కర్ పసిడి సొంతం చేసుకుంది. ఆమె తన మూడో ప్రయత్నంలో ఇనుప గుండును 9.81 మీటర్ల దూరం విసిరింది. భారత్కే చెందిన కంచుగరకొప్పలు శిల్పా శైలా (కర్ణాటక) కాంస్యం సొంతం చేసుకుంది. ఆమె గుండును 7.26 మీటర్లు విసిరింది. గృహ హింసకు గురై... హరియాణాలోని చిత్రోలికి చెందిన 40 ఏళ్ల షర్మిల గృహ హింస బాధితురాలు. రెండేళ్ల వయసులోనే పోలియో బారిన పడిన ఆమెకు చిన్నతనంలోనే పెళ్లయింది. అయితే వివాహానంతరం ఆమె తీవ్ర హింసకు గురైంది. దీనిని తట్టుకోలేక చివరకు ఆ బంధం నుంచి తప్పుకున్న ఆమె మరో పెళ్లి చేసుకుంది. భర్త అజిత్ సింగ్ ఆమెకు అండగా నిలుస్తూ అన్ని విధాలా ప్రోత్సహించాడు. దాంతో ఆరేళ్ల క్రితం ఆమె పారా అథ్లెట్ కెరీర్ మొదలైంది. ఏడాదిలోపే జాతీయ టైటిల్ గెలుచుకోవడంతో పాటు పారా షాట్పుట్, పారా డిస్కర్త్రోలో భారత అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా ఎదిగింది. ఇంటర్నేషల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన షర్మిల 2022 కామన్వెల్త్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచింది.ఒక్కో మెట్టు ఎదుగుతూ... ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఈవెంట్లో టాప్–3లో నిలిచిన నాలుగో భారత ఆటగాడి గా సర్వేశ్ గుర్తింపు పొందాడు. గతంలో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, లాంగ్జంపర్ మురళీ శ్రీశంకర్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇటీవల మొనాకోలో జరిగిన పోటీల్లో సర్వేశ్ ఈ ఘనత సాధించాడు. ఆలస్యంగా ఆటలోకి అడుగుపెట్టి సత్తా చాటిన అరుదైన అథ్లెట్గా సర్వేశ్ అందరి దృష్టిలో పడ్డాడు. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన సర్వేశ్ తండ్రి ఉల్లిగడ్డలు పండించే రైతు. 20 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ జూనియర్ చాంపియన్షిప్లో అతను పాల్గొన్నాడు. జాతీయ సీనియర్ పోటీల్లో వరుసగా రెండేళ్లు ఇండియన్ ఓపెన్లో స్వర్ణం గెలిచిన అతను గత నెలలో ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లో 2.31 మీటర్ల ఎత్తు ఎగిరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. 2025 వరల్డ్ చాంపియన్ షిప్లో ఆరో స్థానంలో నిలిచిన సర్వేశ్...ఈ పోటీల్లో ఫైనల్స్కు అర్హత సాధించిన తొలి భారత హైజంపర్గా నిలిచాడు. -
తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం
కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్లిఫ్టింగ్లో భారత అథ్లెట్లు తమ జోరును ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్లిఫ్టింగ్ కేటగిరీలో రజతం ఒడిసిపట్టాడు. ముందుగా స్నాచ్ కేటగిరీలో 149 కేజీలు ఎత్తిన అజయ బాబు క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీల బరువును ఎత్తాడు. మొత్తంగా రెండు విభాగాలు కలిపి 330 కేజీలు ఎత్తిన అజయ బాబు రెండో స్థానంలో నిలిచాడు. మలేషియాకు చెందిన ఎర్రీ హిదయత్ ముహమ్మద్ 331 కేజీలు (స్నాచ్ 147 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్లో 184 కేజీలు) ఎత్తి ఒక్క కేజీ బరువు తేడాతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ వెయిట్లిఫ్టర్ క్రిస్ ముర్రే 325 కేజీల బరువు ఎత్తి కాంస్యం ఒడిసిపట్టాడు. వెయిట్లిఫ్టింగ్లో భారత్కు ఇది ఆరో పతకం కావడం విశేషం. Photo Credit: IOA Twitterతొలి ప్రయత్నంలో హిదయత్ క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీలు ఎత్తగా, ఆ వెంటనే అజయ బాబు కూడా 181 కేజీలు ఎత్తడంతో 330 కేజీల వద్ద సమంగా నిలిచారు. అయితే రెండో ప్రయత్నంలో హిదయత్ 184 కేజీల బరువు ఎత్తగా, అజయ బాబు విఫలమయ్యాడు. దీంతో ఒక్క కేజీ బరువు తేడాతో అజయ బాబు తృటిలో స్వర్ణం చేజార్చుకున్నాడు. ఇక స్నాచ్ విభాగంలో మాత్రం అజయ బాబు 149 కేజీలు ఎత్తగా, హిదయత్ మాత్రం 147 కేజీలకే పరిమితమయ్యాడు.2010లో తండ్రికి కాంస్యంఇక అజయ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా వెయిట్లిఫ్టరే కావడం విశేషం. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో శ్రీనివాసరావు పురుషుల 56 కేజీల విభాగంలో కాంస్య పతకం ఒడిసిపట్టాడు. తాజాగా వల్లూరి అజయ బాబు 2026 కామన్వెల్త్ గేమ్స్లో రజతం సాధించి తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు పొందాడు. Photo Credit: IOA Twitterవిజయనగరం జిల్లాకు చెందిన అజయ బాబు వెయిట్లిఫ్టింగ్లో రోజురోజుకు తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటున్నాడు. 2025 కామన్వెల్త్ చాంపియన్షిప్లో ఇదే 79 కేజీల విభాగంలో అజయ బాబు స్వర్ణం సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చాంపియన్షిప్ పోటీల్లో అజయ బాబు 335 కేజీలు ( స్నాచ్లో 152 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్లో 183 కేజీలు) బరువు ఎత్తి పర్సనల్ బెస్ట్ నమోదు చేశాడు. ఈ ప్రదర్శన అతడిని నేరుగా కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించేందుకు ఉపయోగపడింది. 2024 కామన్వెల్త్ చాంపియన్షిప్లోనూ అజయ బాబు డబుల్ స్వర్ణాలతో మెరిశాడు. జూనియర్, సీనియర్ కేటగిరీల్లో 81 కేజీల విభాగంలో అజయ బాబు ఈ ఫీట్ సాధించాడు. #CWG2026 | "It is a mix of happiness and sadness, as I missed out on the gold," says Indian weightlifter Valluri Ajaya Babu after winning silver in the men's 79kg event at the 2026 Commonwealth Games in Glasgow with a total lift of 330kg(Source: ANI) pic.twitter.com/TrdIiENBLL— WION (@WIONews) July 28, 2026Sheer strength on show! 🥈Many congratulations to Khelo India athlete Valluri Ajaya Babu on winning the Silver Medal in the Men's 79kg Weightlifting. With a total lift of 330kg, he also set a Commonwealth Games record in the Snatch. A memorable performance and another proud… pic.twitter.com/GMCQPQtIvm— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 28, 2026 -
పతకాల జోరు.. డబుల్ డిజిట్ దాటిన భారత్
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు జోరును ప్రదర్శిస్తున్నారు. సోమవారం రాత్రి మరో నాలుగు పతకాలు భారత్ ఖాతాలో చేరడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది. పురుషుల వెయిట్లిఫ్టింగ్లో వల్లూరు అజయ బాబు 79 కేజీల విభాగంలో రజతం సాధించగా, పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుషారే రజతం సాధించాడు. ఇక పారా అథ్లెటిక్స్లో షాట్పుట్ ఎఫ్-57 కేటగిరీలో షర్మిలా ధంకర్ స్వర్ణం సాధించగా, శిల్ప కాంస్యం ఒడిసిపట్టింది. ముఖ్యంగా పారా షాట్ ఫుట్ F57 విభాగంలో భారత స్టార్ అథ్లెట్ షర్మిలా ధనకర్ తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించి బంగారు పతకాన్ని ముద్దాడారు. మరోవైపు పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుష్వారే సంచలన ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా సర్వేశ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.వీరితో పాటు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో అజయ బాబు వెండి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఒకే రోజున అటు పారా అథ్లె టిక్స్, ఇటు ట్రాక్ అండ్ ఫీల్డ్, వెయిట్రిఫ్టింగ్ విభాగాల్లో వరుస పతకాలు వరించడంతో భారత క్రీడాభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐదో రోజులు ముగిసేసరికి భారత్ రెండు స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు కలిపి మొత్తం 10 పతకాలతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. An exciting end to Day 4 🇮🇳Team India’s Medal Tally Grew to 10! 🙌🥇 Sharmila Dhankar struck gold in Women’s Shot Put F57🥈 Sarvesh Anil Kushare soared to silver in Men’s High Jump🥈 Valluri Ajaya Babu bagged a silver in Men’s 79kg Weightlifting 🥉 Bindyarani Devi… pic.twitter.com/pNUMnAPLo1— Team India (@WeAreTeamIndia) July 27, 2026Heartiest congratulations to Sharmila on scripting history by winning the Gold medal in the Women's Shot Put F57 event at #CWG2026.Becoming India's first-ever Commonwealth Games Gold medallist in Para Athletics is a truly remarkable achievement. Your unwavering determination,… pic.twitter.com/vuUedWlwuF— Sunil Singhi (@SunilSinghiIND) July 28, 2026Silver for Sarvesh! 🥈 Sarvesh Kushare clears 2.25m to clinch the Silver Medal in the Men's High Jump at Glasgow 2026.👏Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/3e62CEPb5M— Sony Sports Network (@SonySportsNetwk) July 27, 2026Read: తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం -
రజత రాజా... వెండి జ్ఞానేశ్వరి
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. భారత వెయిట్లిఫ్టర్లు ఈ మూడు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో రాజా ముత్తుపండి, మహిళల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్లకు రజతాలు లభించగా... మణిపూర్ ప్లేయర్ బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం భారత్ ఒక స్వర్ణం, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 42 పతకాలతో (18 స్వర్ణాలు, 9 రజతాలు, 15 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహిళల 53 కేజీల కేటగిరీలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం గెలుచుకుంది. స్నాచ్లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 111 కేజీల బరువెత్తి (మొత్తం 199 కేజీలు) ఆమె రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన ఒనోమ్ ఒమొలొలా దీదీ మొత్తం 206 కేజీలు (93+113) స్వర్ణం సాధించి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా... రెబెకా గ్రోక్స్ (కెనడా–178 కేజీలు) కాంస్యం అందుకుంది. స్నాచ్లో వరుసగా 82, 85, 88 కేజీల బరువుతో తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్న జ్ఞానేశ్వరి...క్లీన్ అండ్ జర్క్లో కూడా వరుసగా మూడు ప్రయత్నాల్లో 103, 107, 111 కేజీల బరువును ఎత్తింది. వెయిట్లిఫ్టింగ్ పురుషుల విభాగంలో భారత్కు రాజా ముత్తుపండి రజతంతో మెరిశాడు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్లో 126 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 160 కేజీలు కలిపి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తిన రాజాకు రజతం లభించింది. ఈ ఈవెంట్లో అజ్నిల్ బిన్ బిదిన్ ముహమ్మద్ (మలేసియా) కామన్వెల్త్ రికార్డు 299 కేజీలు (133+166)తో స్వర్ణం గెలుచుకోగా, మోరియా బారు (పవువా న్యూ గినియా; 282 కేజీలు)కు కాంస్యం లభించింది. ఈసారి కాంస్యం.. మహిళల 58 కేజీల కేటగిరీలో బింద్యారాణి దేవి సొరొఖైబమ్కు కాంస్య పతకం దక్కింది. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలుచుకున్న ఆమె ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని బరిలోకి దిగినా... కాంస్యానికే పరిమితమైంది. ఒకదశలో స్వర్ణం దిశగా సాగుతున్నట్లు అనిపించినా... చివర్లో ఆమె తడబడింది. ఓవరాల్గా 199 కేజీలు (స్నాచ్లో 87 + క్లీన్ అండ్ జర్క్లో 112) బరువు ఎత్తిన బింద్యారాణి మూడో స్థానంతో ముగించింది. ఈ పోటీల్లో రఫియతు లవాల్ (నైజీరియా; 229 కేజీలు) కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకోగా... ఆన్ సోఫీ (కెనడా; 215 కేజీలు)కు రజతం దక్కింది. బింద్యారాణి గతంలో కామన్వెల్త్ చాంపియన్షిప్ పోటీల్లో ఒక స్వర్ణం, 2 రజతాలు సాధించింది.పోలీస్ ఖాతాలో పతకం... ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్కు చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)గా పని చేస్తోంది. చిన్న వయసులో ముందు పవర్లిఫ్టింగ్పై ఆసక్తి చూపించిన ఆమెను వెయిట్లిఫ్టింగ్ మరింతగా ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక క్రీడాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జ్ఞానేశ్వరి వెలుగులోకి వచ్చింది. ఎల్రక్టీషియన్ అయిన తండ్రి దీపక్ యాదవ్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురైనా... కూతురిని ఆమె లక్ష్యం దిశగా ప్రోత్సహించడంలో ఎప్పుడూ వెనుకాడలేదు. జూనియర్ స్థాయిలో పలు విజయాలతో గుర్తింపు దక్కించుకున్న ఆమె... పాటియాలాలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో శిక్షణ పొందుతోంది. గత ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో 5వ స్థానంలో నిలిచిన జ్ఞానేశ్వరి ఇటీవలే ఆసియా చాంపియన్షిప్లో కాంస్యం గెలుచుకుంది. ఈ కామన్వెల్త్ క్రీడల కోసం గ్లాస్గోలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో బర్మింగ్హామ్లోని వార్లీ వెయిట్లిఫ్టింగ్ క్లబ్లో ప్రత్యేకంగా సిద్ధమై ఫలితం సాధించింది.ఫైనల్లో సాజన్ ప్రకాశ్ స్విమ్మింగ్ పురుషుల 200 మీటర్ల బటర్ఫ్లయ్ ఈవెంట్లో భారత స్టార్ సాజన్ ప్రకాశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కేరళకు చెందిన ‘డబుల్ ఒలింపియన్’ సాజన్ హీట్–2లో 1ని:58.59 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్గా ఆరో ఫాస్టెస్ట్ స్విమ్మర్గా సాజన్ ఫైనల్లో చోటు సంపాదించాడు. క్వార్టర్స్లో అంకుశ్, సచిన్ పురుషుల బాక్సింగ్ ఈవెంట్లో భారత బాక్సర్లు అంకుశ్, సచిన్ సివాచ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పతకాలు ఖరారు చేసుకోవడానికి విజయం దూరంలో నిలిచారు. 80 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో అంకుశ్ 5:0తో జాన్ జలాన్ (అంటిగ్వా అండ్ బార్బుడా)పై గెలుపొందగా... 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో సచిన్ 4:1తో విలియమ్ హెవిట్ (ఇంగ్లండ్)ను ఓడించాడు.నిరాశపరిచిన సమంత మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఫైనల్లో భారత జిమ్నాస్ట్ ప్రొతీస్థా సమంత నిరాశ పరిచింది. సమంత 12.883 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. లియా మోనిక (కెనడా; 14.000 పాయింట్లు) స్వర్ణం, అబిగెయిల్ మార్టీన్ (ఇంగ్లండ్; 13.799 పాయింట్లు) రజతం, రోపెర్ (వేల్స్; 13.433 పాయింట్లు) కాంస్యం నెగ్గారు.లాంగ్జంప్ ఫైనల్లో శ్రీశంకర్అథ్లెటిక్స్ ఫీల్డ్ ఈవెంట్ లాంగ్జంప్లో భారత్ నుంచి ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టారు. 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో రజతం నెగ్గిన శ్రీశంకర్తోపాటు లోకేశ్ సత్యనాథన్ ఫైనల్లోకి ప్రవేశించారు. క్వాలిఫయింగ్లో శ్రీశంకర్ 8.01 మీటర్ల దూరం గెంతి నేరుగా ఫైనల్కు చేరాడు. క్వాలిఫయింగ్ ప్రమాణం 8 మీటర్ల కావడంతో శ్రీశంకర్ నేరుగా ఫైనల్కు అర్హత సాధించాడు. లోకేశ్ 7.77 మీటర్ల దూరం గెంతి ఓవరాల్గా ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. మరోవైపు పురుషుల 110 మీటర్ల హర్డిల్స్లో తేజస్ శిర్సే కూడా ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్ రేసును తేజస్ 13.76 సెకన్లలో ముగించి ఓవరాల్గా ఆరో స్థానంలో నిలిచి ఫైనల్కు చేరుకున్నాడు. పురుషుల 100 మీటర్ల విభాగంలో జాతీయ చాంపియన్ గురీందర్వీర్ సింగ్ సెమీఫైనల్కు అర్హత సాధించలేకపోయాడు. గురీందర్వీర్ 10.39 సెకన్లలో గమ్యానికి చేరి ఓవరాల్గా 28వ స్థానంలో నిలిచాడు. -
భారత్- చైనా వాణిజ్యం.. కీలక నిర్ణయం
గ్యాంగ్టక్: కోవిడ్ మహమ్మారి మరియు సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా గత ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయిన భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కానుంది. పురాతన సిల్క్ రూట్ (Silk Route) చారిత్రక మార్గంలో భాగమైన నాథూలా పాస్ ఈ వాణిజ్యం ఆగస్టు 1, 2026 నుండి పునఃప్రారంభం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఈ దౌత్యపరమైన ముందడుగుతో సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలకు మార్గం సుగమమైంది. తూర్పు సిక్కింలోని చారిత్రాత్మక నాథులా పాస్ ద్వారా భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం నాథులా తో పాటు హిమాచల్ ప్రదేశ్లోని షిప్కీలా, ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ తదితర హిమాలయ సరిహద్దు మార్గాలను దశలవారీగా తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.నాథూలా సిల్క్ ప్రత్యేకత ఇది ప్రాచీన 'సిల్క్ రూట్' (పట్టుదారి) మార్గంలో అత్యంత కీలకమైన భాగం. ఒకప్పుడు భారత్ నుండి టిబెట్ (చైనా) మధ్య ప్రధాన వాణిజ్యం ఈ మార్గం గుండానే జరిగేది. ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న మోటారు మార్గాల్లో ఇది ఒకటి. ఇక్కడ సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనికులు ముఖాముఖిగా కనిపిస్తారు. సరిహద్దు కంచెను తాకి చూసే అవకాశం ఉండటంతో ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. నాథులా పాస్ అత్యంత ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉండటం వల్ల వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే ఇది ఏడాది పొడవునా తెరిచి ఉండదు డిసెంబర్ నుండి మార్చి వరకు ఉన్న శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతుంది (కొన్నిసార్లు -25°C వరకు). రోడ్లన్నీ మంచుతో కప్పుకుపోవడం వల్ల ప్రయాణం పూర్తిగా అసాధ్యం అవుతుంది. -
టొరంటోలో భారత సంతతి అమ్మాయిని చంపిన యువకుడు
కెనడాలోని టొరంటోలో భారత సంతతికి చెందిన ఓ యువతి(26)ని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఈ హత్య కేసుపై కెనడియన్ పోలీసులు వివరాలు తెలిపారు. ఈ కేసులో భారత సంతతికి చెందిన 37 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు.మృతురాలిని నవనీత్ కౌర్గా, నిందితుడిని బ్రాంప్టన్కు చెందిన శరణ్జీత్ సింగ్గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంకెవరూ పరారీలో లేరని, హత్య కేసుల దర్యాప్తు విభాగం విచారణ కొనసాగిస్తోందని తెలిపారు.హంబర్వుడ్ బులేవార్డ్, రెక్స్డేల్ బులేవార్డ్ కూడలిలో ఈ కాల్పులు జరిగాయని టొరంటో పోలీసు సర్వీస్ తెలిపింది. కాల్పులు జరిగాయని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, తుపాకీ గాయంతో ఉన్న నవనీత్ కౌర్ను గుర్తించారు. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా, ఘటనాస్థలిలోనే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పులకు ముందు బాధితురాలు, నిందితుడు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నిందితుడు ఆమెపై కాల్పులు జరిపి, పోలీసులు చేరుకునేలోపే అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం అంటారియో ప్రావిన్షియల్ పోలీసులు అతడిని గుర్తించి అరెస్టు చేశారు. శరణ్జీత్ సింగ్పై హత్య కేసుతో పాటు, చట్టపరమైన షరతులను ఉల్లంఘించిన అభియోగం కూడా నమోదు చేశారు. -
ట్రంప్ బాంబు పేలుతుందనుకుంటే.. తుస్సుమంది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఒకే ఆరోపణను బలంగా వినిపిస్తున్నారు. ‘‘అమెరికా పౌరులు కాని వాళ్లు భారీ సంఖ్యలో.. అక్రమంగా ఓట్లు వేస్తున్నారు. అదే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తోంది’’ అని పదేపదే చెబుతున్నారు. ఈ వాదననే ఆధారంగా చేసుకుని ఓటరు నమోదు సమయంలో పౌరసత్వాన్ని తప్పనిసరిగా నిరూపించాలనే వాదన తెరపైకి తెస్తున్నారు. అయితే ఆ వాదనలో ఏమాత్రం పస లేదనే ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.ఎన్నికల భద్రతను కాపాడాలంటే పౌరసత్వ ధ్రువీకరణను మరింత కఠినతరం చేయాల్సిందేనని ట్రంప్ వాదిస్తున్నారు. అందుకే సేవ్ అమెరికా యాక్ట్(SAVE America Act) లాంటి చట్టాలకు మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే ఇవి అవసరమని ఇటు రిపబ్లికన్ పార్టీ కూడా చెబుతోంది. అయితే డెమొక్రటిక్ పార్టీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇటు ఈ అంశం భారత పాఠకులకు కొత్తగా అనిపించాల్సిన అవసరం లేదు. ఇటీవల భారత్లో ఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియపై కూడా తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి అర్హుల పేర్లను కొనసాగించడం, అనర్హుల పేర్లను తొలగించడం లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టామని ఎన్నికల సంఘం చెప్పగా.. ప్రతిపక్షాలు మాత్రం పలు ప్రాంతాల్లో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందంటూ ఆందోళనలు వ్యక్తం చేశాయి. దీంతో ఓటరు నమోదు, ధ్రువీకరణ, ఎన్నికల జాబితాల విశ్వసనీయత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అమెరికాలోనూ ఇదే తరహాలో SAVE America Act చుట్టూ చర్చ సాగుతోంది. అయితే అక్కడ అసలు వివాదం విదేశీయుల అక్రమ ఓటింగ్ నిజంగానే విస్తృతంగా జరుగుతోందా? లేదా అనే అంశంపైనే కేంద్రీకృతమైంది.అమెరికాలో 1996 నుంచి ఫెడరల్ ఎన్నికల్లో పౌరులు కానివారు ఓటు వేయడం చట్టరీత్యా నేరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన ఫెడరల్ కోర్టు రికార్డులను రాయిటర్స్ విశ్లేషించగా, దేశవ్యాప్తంగా కేవలం 129 కేసులు మాత్రమే నమోదైనట్లు తేలింది. అందులో 73 మంది మాత్రమే నేరాన్ని అంగీకరించడమో లేదంటే కోర్టులు దోషులుగా నిర్ధారించాయి. అంటే.. అధ్యక్ష ఎన్నికలో కోట్లాది ఓట్లు నమోదయ్యే అమెరికాలో ఈ సంఖ్య చాలా స్వల్పమని పరిశీలన చెబుతోంది.ఈ కేసులను లోతుగా పరిశీలిస్తే మరో విషయం కూడా బయటపడింది. నమోదైన చాలా ఘటనలు పెద్ద ఎత్తున పన్నిన ఎన్నికల కుట్రలకు సంబంధించినవి కావు. గ్రీన్ కార్డు కలిగిన కొందరు శాశ్వత నివాసితులు తాము కూడా ఓటు వేయడానికి అర్హులమని పొరపాటుగా భావించడం, మరికొన్ని సందర్భాల్లో పరిపాలనా లోపాల వల్ల పేర్లు ఓటరు జాబితాలో చేరడం వంటి కారణాలే ఎక్కువగా కనిపించాయి. దేశవ్యాప్తంగా విదేశీయులు సమన్వయంతో ఎన్నికలను ప్రభావితం చేశారనే ఆధారాలు మాత్రం బయటపడలేదు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన వాదనపై వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఎన్నికల నిపుణులు, పౌరహక్కుల సంస్థలు మాత్రం ఈ వాదనను ప్రశ్నిస్తున్నాయి. విదేశీయుల అక్రమ ఓటింగ్ విస్తృతంగా జరుగుతోందని నిరూపించే బలమైన ఆధారాలు లేనప్పుడు కఠిన నిబంధనలు తీసుకురావడం వల్ల చట్టబద్ధమైన అమెరికా పౌరులే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సహజీకృత అమెరికా పౌరులు(అంటే విదేశాల్లో పుట్టి, తర్వాత అమెరికా పౌరసత్వం పొందిన వారు) అవసరమైన పత్రాలు వెంటనే సమర్పించలేక ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ లోపం కారణంగా కొందరు పౌరులు కానివారి పేర్లు పొరపాటున ఓటరు జాబితాలో నమోదైన ఘటన కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆ ఘటనలో కూడా వాస్తవంగా ఓటు వేసిన వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉందని, దానిని దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ ఎన్నికల మోసానికి నిదర్శనంగా చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు.మొత్తంగా చూస్తే, అమెరికా ఎన్నికల్లో విదేశీయులు భారీ సంఖ్యలో అక్రమంగా ఓటు వేస్తున్నారన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు బలమైన మద్దతు ఇవ్వడం లేదని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ పరిశీలన తేల్చింది. ఎన్నికల భద్రతపై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నప్పటికీ, నమోదైన కేసులు మాత్రం సమస్య పరిమిత స్థాయిలోనే ఉందని సూచిస్తున్నాయి. దీంతో ట్రంప్ చేసిన ఆరోపణలు ఒకవైపు ఉంటే... అధికారిక రికార్డులు మాత్రం మరో చిత్రాన్ని చూపిస్తున్నాయని ఈ విశ్లేషణ స్పష్టం చేసింది. -
ఆగని ‘నీట్’ బలవన్మరణాలు.. జాబితాలో..
న్యూఢిల్లీ: ‘నీట్ యూజీ’పేపర్ లీక్, పరీక్షా విధానంలోని లోపాల కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, సమస్యల పరిశీలన కోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే, పరీక్షా వివాదాలు, మానసిక ఒత్తిడి కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న విషాదకర ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని అహిల్యానగర్కు చెందిన అంకితా సాంగ్లే అనే విద్యార్థిని రీ ఎగ్జామ్లో తక్కువ మార్కులు రావడంతో, మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇదే రకమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న పలువురు విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి.ప్రదీప్ మేఘవాల్ (రాజస్థాన్): జుంఝును జిల్లాకు చెందిన 22 ఏళ్ల ఈ యువకుడు, మే 2026లో నీట్ యూజీ పరీక్ష రద్దు కావడంతో సీకర్లో ఆత్మహత్య చేసుకున్నారు.ఋతిక్ మిశ్రా (ఉత్తర ప్రదేశ్): లఖింపూర్ ఖేరీకి చెందిన 21 ఏళ్ల ఈ విద్యార్థి, పరీక్షలో గందరగోళం, మానసిక ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.సిద్దార్థ్ హెగ్డే (గోవా): 17 ఏళ్ల ఈ విద్యార్థి మే 2026లో నీట్ పరీక్ష రద్దయిన తర్వాత తీవ్ర మనోవేదనతో ప్రాణాలు తీసుకున్నారు.భాగ్యశ్రీ (కర్ణాటక): కలబుర్గికి చెందిన 18 ఏళ్ల ఈ విద్యార్థిని పీయూసీ బోర్డు పరీక్షలో 92 శాతం మార్కులు సాధించినప్పటికీ, నీట్ ఆందోళనలతో మే 2026లో బలవన్మహత్వానికి పాల్పడ్డారు.అంశిక పాండే (ఢిల్లీ): ఆదర్శ్ నగర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఈ పరీక్షార్థిని మానసిక ఒత్తిడి కారణంగా ప్రాణాలు విడిచిపెట్టారు.ఉమేష్ మాలీ(రాజస్థాన్): సీకర్లో నీట్ ప్రిపరేషన్ చేస్తున్న ఈ 22 ఏళ్ల యువకుడు జూన్ 15న ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారు.రేణు మీణా (రాజస్థాన్): అన్వర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఈ ప్రతిభావంతురాలైన విద్యార్థిని జూన్ 2026లో నీట్ వివాదాల కారణంగా ప్రాణాలు తీసుకున్నారు.రియా కుమారి థాపా (ఉత్తరాఖండ్): డెహ్రాడూన్కు చెందిన 23 ఏళ్ల ఈ అభ్యర్థి జూన్ 2026లో పేపర్ లీక్ ఆందోళనలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.శివానీ యాదవ్ (ఉత్తర ప్రదేశ్): లక్నోకు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని పరీక్ష రద్దు, వివాదాలతో ఆత్మహత్య చేసుకున్నారు.కహాన్ పటేల్ (గుజరాత్): అహ్మదాబాద్కు చెందిన 17 ఏళ్ల ఈ విద్యార్థి జూన్ 18, 2026న అపార్ట్మెంట్ పైనుంచి దూకి ప్రాణాలు వదిలారు.ఆకాంక్ష చతుర్వేది (మధ్య ప్రదేశ్): మౌగంజ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఈ విద్యార్థిని నాగ్పూర్లో ఆత్మహత్య చేసుకున్నారు.రీమా బేగం (అస్సామ్): 21 ఏళ్ల ఈ నీట్ అభ్యర్థి జూన్ 2026లో మానసిక ఒత్తిడితో ప్రాణాలు విడిచారు.అవంతిక మౌర్య (మధ్య ప్రదేశ్): ఇండోర్కు చెందిన 21 ఏళ్ల ఈ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో భవనంపై నుంచి పడి మృతి చెందారు.జతిన్ కుమార్ (ఉత్తర ప్రదేశ్): ఘజియాబాద్కు చెందిన 22 ఏళ్ల ఈ విద్యార్థి జూన్ 2026లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఎస్. గోపిక (తమిళనాడు): సేలం జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 19, 2026న రీ-టెస్ట్ ఒత్తిడితో ప్రాణాలు విడిచారు.షేక్ సనా (తెలంగాణ): హైదరాబాద్కు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 21, 2026న జరగాల్సిన రీ-నీట్ పరీక్షకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఆత్మహత్య చేసుకున్నారు.వెత్రియానందం (తమిళనాడు): హోసూర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల విద్యార్థి జూన్ 2026లో పరీక్షా వివాదాల కారణంగా ప్రాణాలు తీసుకున్నారు.సిమ్రన్ (హర్యానా): హిసార్కు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 21, 2026న పునఃపరీక్షకు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.రోషిణి (తమిళనాడు): ధర్మపురి జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 2026లో పరీక్షా ఒత్తిడి కారణంగా బలవన్మహత్వానికి పాల్పడ్డారు.అంకితా సాంగ్లే (మహారాష్ట్ర): అహిల్యానగర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని నీట్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన కారణంగా ప్రాణాలు కోల్పోయారు.ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం! -
ఎల్ నినో ఎఫెక్ట్: భూమికి పొంచి ఉన్న మరో ముప్పు?!
ప్రపంచం ఇప్పటికే వాతావరణ మార్పుల సెగను ఎదుర్కొంటోంది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వేడిగాలులు, కరవు పరిస్థితులు.. మరోవైపు ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్న తుపాన్లు, వరదలు అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న ఓ పరిణామం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. సూపర్ ఎల్నినో.. గాడ్జిల్లా ఎల్నినో అంటూ చర్చకు వచ్చిన ఈ వాతావరణ ప్రభావం 2026పైనే అందరి దృష్టిని మళ్లించింది. అయితే శాస్త్రవేత్తల తాజా అంచనాలు మాత్రం అసలు ప్రభావం మరింత ఆలస్యంగా కనిపించే అవకాశాన్ని సూచిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే.. 2026 ప్రపంచంలో రెండో అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉందని అంటోంది. మరి మొదటి ఏడాది?. దానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని అంటున్నారు. 2027 మాత్రం గత శతాబ్దానికి పైగా ఉన్న ఉష్ణోగ్రత రికార్డులను సవాలు చేసే స్థాయికి చేరవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులను పేర్కొంటున్నారు.సముద్రంలో దాగిన వేడి.. భూమిపై ప్రభావంఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో సహజంగా సంభవించే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు.. ఆ వేడి ప్రపంచవ్యాప్తంగా గాలుల కదలికలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో భారీ స్థాయిలో వేడి నిల్వ ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. సముద్రం లోపల పేరుకుపోయిన ఈ వేడి క్రమంగా పైకి వచ్చి వాతావరణ వ్యవస్థలోకి చేరినప్పుడు.. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.ప్రస్తుత ఎల్ నినోను 1997-98లో నమోదైన అత్యంత బలమైన ఎల్ నినోతో శాస్త్రవేత్తలు పోలుస్తున్నారు. అప్పట్లో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు, వరదలు, కరువులు సంభవించాయి. అయితే ఈసారి పరిస్థితులు మరింత భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు భూమి ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మరింత వేడెక్కిపోయింది.2026లో మొదలై.. 2027లో తీవ్ర ప్రభావం?ఎల్ నినో ప్రభావం ఏర్పడిన వెంటనే బయటపడదు. సముద్రంలో మార్పులు చోటుచేసుకున్న తర్వాత వాటి ప్రభావం వాతావరణ వ్యవస్థపై పడేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన ఏడాది కంటే.. తర్వాతి ఏడాదిలో దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే కారణంగా 2026లో బలపడుతున్న ఎల్ నినో ప్రభావం 2027లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణంలో పెరిగిన గ్రీన్హౌస్ వాయువులు వేడిని బంధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎల్ నినో ప్రభావం కలవడంతో ఉష్ణోగ్రతలు గత అంచనాలను మించి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మారనున్న ప్రపంచ వాతావరణ ముఖచిత్రం!బలమైన ఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను ప్రభావితం చేయగలదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర పొడి పరిస్థితులు ఏర్పడవచ్చు. దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఎండలు, కరవు పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుఫాన్ల తీవ్రత, వాటి ప్రయాణ మార్గాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.భారత్పై ఎలాంటి ప్రభావం?ఎల్ నినో ప్రభావం భారత వాతావరణంపై కూడా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం కనిపించే సందర్భాలు గతంలో ఉన్నాయి. కొన్ని బలమైన ఎల్ నినో పరిస్థితుల సమయంలో వర్షపాతం తగ్గిన ఉదాహరణలు నమోదయ్యాయి. అయితే భారత రుతుపవనాలను ఎల్ నినో ఒక్కటే నిర్ణయించదు. హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల మార్పులు, స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ ఎల్ నినో బలపడితే వ్యవసాయం, నీటి వనరులు, వేసవి ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.సహజ మార్పా? మానవ తప్పిదాల ప్రభావమా?ఎల్ నినో అనేది సహజంగా జరిగే ప్రక్రియే అయినప్పటికీ.. ప్రస్తుతం దాని ప్రభావం తీవ్రంగా కనిపించడానికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక ముఖ్య కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగం వల్ల పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు భూమి ఉష్ణోగ్రతలను నిరంతరం పెంచుతున్నాయి. దీంతో సహజ వాతావరణ మార్పులు వచ్చిన ప్రతిసారి వాటి ప్రభావం గతంతో పోలిస్తే మరింత తీవ్రంగా కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది.మరో వేడి రికార్డుకు రంగం సిద్ధమా?ప్రస్తుత అంచనాలు నిజమైతే.. 2027 భూమి చరిత్రలోనే అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉంది. ఇది కేవలం ఉష్ణోగ్రతల రికార్డు మాత్రమే కాదు.. మారుతున్న వాతావరణ పరిస్థితులు భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లకు ఒక ముందస్తు హెచ్చరికగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో పేరుకుపోతున్న వేడి రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. భూమి వేడెక్కే వేగం ఇంకా తగ్గడం లేదు. కొత్త ఉష్ణోగ్రత రికార్డులకు వాతావరణం మరోసారి వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
పాక్ బాక్సర్ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి
కామన్వెల్త్ గేమ్స్ 2026లో బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ జాదుమణి పతకం ఆశలు రేపుతున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన జాదుమణి పతకానికి అడుగుదూరంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జాదుమణి 5-0తో పాకిస్తాన్ బాక్సర్ సుమామా రెహమాన్ను మట్టికరిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం జాదుమణి ఈ విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. "నా విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితం చేస్తున్నాను. పాకిస్థాన్పై గెలవడం చాలా గొప్పగా అనిపించింది. క్వార్టర్ ఫైనల్స్లో మరింత మెరుగ్గా రాణించి భారత్కు స్వర్ణం సాధించిపెడతాను''అని జాదుమణి పేర్కొన్నాడు. తొలి రౌండ్లో బై లభించిన జాదుమణి రెండో రౌండ్లో స్కాట్లాండ్కు చెందిన ఆరోన్ కల్లెన్పై 5-0తో అజేయ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రిక్వార్టర్స్లో పాకిస్తానీ బాక్సర్పై విరుచుకుపడిన జాదుమణి 5-0తో ఏకగ్రీవ విజయాన్ని సాధించి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. ఇక జాదుమణి మంగళవారం క్వార్టర్స్ ఫైట్లో తలపడనున్నాడు. క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీస్లోకి ప్రవేశిస్తే అతనికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్లో సెమీఫైనల్లో ఓడిపోయిన ఇద్దరికీ కాంస్య పతకాలు లభిస్తాయి.ఇక మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి క్వార్టర్ ఫైనల్కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రీతి పంచ్ల ధాటికి ఆమె ప్రత్యర్థి దెబోరా మావ్ (కెన్యా) రెండో రౌండ్లోనే చేతులెత్తేసింది. ఇక స్విమ్మింగ్లో భారత ఫ్రీస్టయిల్ రిలే జట్టు ఫైనల్కు చేరింది. 4X200 ఫ్రీస్టయిల్ రిలే హీట్లో దక్షణ్, అనీశ్ గౌడ, ఆర్యన్ నెహ్రా, శ్రీహరి నటరాజ్లతో కూడిన భారత జట్టు 7ని:39.48 సెకన్లలో లక్ష్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ ఫైనల్లో భారత ప్లేయర్ తపన్ మొహంతి 70.100 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. లాన్ బౌల్స్లో మహిళల పెయిర్ ఈవెంట్లో రూపా రాణి–పింకీ సింగ్ (భారత్) జోడీ, పురుషుల సింగిల్స్లో పుతుల్ సోనోవాల్ (భారత్) పరాజయాలు చవిచూసి ముందంజ వేయడంలో విఫలమయ్యారు. 🚨 INDIA’S JADUMANI SINGH THRASHED PAKISTANI BOXER 5-0 AT COMMONWEALTH GAMES 2026 🇮🇳🔥Jadumani Singh Mandengbam said - "I dedicate my win to the Kargil heroes. I felt great winning against Pakistan."Another day, Another humiliation for Pakistan 😅pic.twitter.com/1REqzhnEoe— Ajay Jadeja (@AjayJadeja171) July 27, 2026 -
‘వెండి’ కెరటం.. మోచేయి విరిగినా పట్టువదలని విక్రమార్కుడు!
కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్లిఫ్టింగ్లో భారత్కు మూడో పతకం వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తి వెండిని కొల్లగొట్టాడు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి పతకం కొల్లగొట్టిన రాజా ముత్తుపాండి ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు. మరి ఎవరీ రాజా ముత్తుపాండి? అతడి నేపథ్యం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.తొలి ప్రయత్నంలోనే స్వర్ణం..జనవరి 12, 2000న జన్మించిన రాజా ముత్తుపాండి, ఇండియన్ రైల్వేస్కు వెయిట్లిఫ్టర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2017లో కామన్వెల్త్ యూత్/జూనియర్ ఛాంపియన్షిప్లలో స్వర్ణ, రజత పతకాలతో రాజా ముత్తుపాండి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 2019, 2022లో జాతీయ టైటిళ్లను గెలుచుకున్న ముత్తుపాండి వెయిట్లిఫ్టింగ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. మోచేతికి తీవ్రగాయం..అయితే కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే 2019లో రాజా ముత్తుపాండి మోచేతి గాయానికి గురయ్యాడు. మోచేతి లిగ్మెంట్లో చీలిక రావడంతో బరువులు ఎత్తొద్దని డాక్టర్లు చెప్పడంతో రాజా ముత్తుపాండి కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న రాజా ముత్తుపాండి పట్టువదలని విక్రమార్కుడిలా మోచేతి గాయం నుంచి కోలుకొని తన ప్రస్థానాన్ని మళ్లీ మొదటి నుంచే మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రాజా ముత్తుపాండి 2024లో రాజా 61 కేజీల విభాగంలో 289 కేజీల బరువు ఎత్తి జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక 2025లో అహ్మదాబాద్లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో (296 కేజీల బరువు ఎత్తి) రజతం గెలుచుకున్నాడు. నార్వేలోని ఫోర్డేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లలో 65 కేజీల విభాగంలో తొమ్మిదవ స్థానంలో నిలిచిన రాజా ముత్తుపాండి 299 కేజీల (130 కేజీల స్నాచ్ + 169 కేజీల క్లీన్ అండ్ జర్క్) బరువు ఎత్తి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. తద్వారా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు రాజా ముత్తుపాండి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇదే ఏడాది సీనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో 302 కేజీల బరువు ఎత్తిన రాజా ముత్తుపాండి జాతీయ టైటిల్ను కూడా సొంతం చేసుకున్నాడు. Proud Moment for Indian Weightlifting!Many congratulations to Raja Muthupandi for clinching Silver in Men's 65kg Weightlifting. #Cheer4Bharat #CWG2026 pic.twitter.com/qjldVR9ja5— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 27, 2026CWG 2026: On winning the silver medal in the men's 65kg weightlifting event at the Commonwealth Games 2026, Muthupandi Raja says, "I did not perform well enough to win the gold, and it was not my best compared to how I had been performing in training. Still, I am happy to have… pic.twitter.com/OEuklfSq3h— IANS (@ians_india) July 26, 2026 -
CWG 2026: వెయిట్లిఫ్టింగ్లో భారత్కు మరో పతకం
కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్ లిఫ్టర్లు అదరగొడుతున్నారు. ఈ విభాగం నుంచి ఇప్పటికే రెండు పతకాలు రాగా, తాజగా మూడో పతకం వచ్చి చేరింది. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తి వెండిని కొల్లగొట్టాడు. మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిదిన్ 299 కేజీల (133+166) బరువు ఎత్తి వరుసగా మూడో సారి స్వర్ణం గెలుచుకోవగా, పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 282 కేజీల (125+157 ) బరువు ఎత్తి కాంస్యం కైవసం చేసుకున్నాడు. వెయిట్లిఫ్టింగ్లో ఇప్పటికే మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకోగా, 60 కేజీల విభాగంలో రిషికాంత్ సింగ్ రజతం సాధించాడు. ఓవరాల్గా స్వర్ణం, రెండు రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు వచ్చి చేరాయి. Another lift. Another medal. 🥈 Raja Muthupandi muscles his way to Commonwealth Games silver in the Men's 65kg event. 🏋️♂️ Watch the Commonwealth Games 2026 TODAY, 2 PM onwards, LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels and Sony LIV#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/SUTs7cv1mH— Sony Sports Network (@SonySportsNetwk) July 26, 2026 #WATCH | Scotland | Glasgow Commonwealth Games 2026 | On winning the silver medal in men's 65kg weightlifting final, Indian weightlifter Raja Muthupandi says, "... I am certainly disappointed because my coach had placed his trust in me, believing we would put in the full effort… pic.twitter.com/hRcmht7xnc— ANI (@ANI) July 26, 2026 -
శ్రీజ, సత్యన్లపై భారీ అంచనాలు
న్యూఢిల్లీ: ఒకవైపు గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ క్రీడలు కొనసాగుతుండగా... మరోవైపు భారత్ వేదికగా నేటి నుంచి 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్ ప్రారంభం కానుంది. స్వదేశంలో జరగనున్న ఈ టోర్నమెంట్లో పలువురు భారత స్టార్లు బరిలోకి దిగనున్నారు. పురుషుల టీమ్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్, హరీ్మత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, మనుశ్ షా, పాయస్ జైన్లతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. వచ్చే నెల 2 వరకు కొనసాగనున్న ఈ చాంపియన్షిప్లో భారత ప్యాడ్లర్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్లేయర్ల నుంచి ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మహిళల విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ ఆకుల శ్రీజపై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ ప్లేయర్ మనికా బాత్రా ఈ టోర్నీకి ఎంపిక కాకపోగా... శ్రీజతో పాటు సుతీర్థ ముఖర్జీ, యశస్విని, సిండ్రెల్లా దాస్, స్వస్తిక ఘోష్ బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో టాప్ సీడ్ సింగపూర్, కెనడా, మలేసియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి భారత ప్యాడ్లర్లకు ప్రధాన పోటీ ఎదురుకానుంది. ఓవరాల్గా ఈ టోర్నీలో 23 పురుషుల, 18 మహిళల జట్లు పాల్గొననున్నాయి. టోర్నీ మొత్తం ప్రైజ్మనీ 1.10 లక్షల డాలర్లు (1.06 కోట్లు) కాగా... కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ఆధ్వర్యంలో దశలవారీగా పోటీలు జరగనున్నాయి. -
ఆశాకిరణం అనాహత్
స్క్వాష్ అంటే ఈజిప్ట్... ఈజిప్ట్ అంటే స్క్వాష్... ఈ ‘రాకెట్ క్రీడ’లో ఈజిప్ట్ క్రీడాకారులు రాకెట్ వేగంతో అత్యున్నత శిఖరానికి చేరుకున్నారు. కారణాలు ఏమైతేనేం కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్క్వాష్లో ఈజిప్ట్ ప్లేయర్లు సాధిస్తున్న విజయాలు అసాధారణం. ప్రపంచ చాంపియన్షిప్ మొదలుకొని... ప్రొఫెషనల్ టూర్లో... అంతర్జాతీయ టోర్నీల్లో ఈజిప్ట్ క్రీడాకారులే టైటిల్స్ సొంతం చేసుకుంటున్నారు. సీనియర్లు ఓడిపోతే జూనియర్లు... జూనియర్లు కాకపోతే ద్వితీయశ్రేణి ఆటగాళ్లు... కేటగిరీ మారినా... టోర్నీ స్థాయి మారినా... చివరకు టైటిల్స్ ఈజిప్ట్ ఖాతాలోకే వెళ్లడం సాధారణమైపోయింది. కెనడాలోని ఒంటారియోలో శనివారం ముగిసిన ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లోనూ ఈజిప్ట్ క్రీడాకారులు టైటిల్స్ ఎగురేసుకుపోవడం ఖాయమనుకున్నారు. కానీ ఈజిప్ట్ జైత్రయాత్రకు భారత ‘నయా రాకెట్’ అనాహత్ సింగ్ అడ్డుకట్ట వేసింది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఈజిప్ట్ క్రీడాకారిణులను ఓడించి మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త జగజ్జేతగా అవతరించింది. అనాహత్ దెబ్బకు...గత 16 ఏళ్లుగా వరుసగా ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన ఈజిప్ట్ క్రీడాకారిణులు ఈసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నారు. –సాక్షి క్రీడా విభాగం మరో రెండేళ్లలో జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో స్క్వాష్ క్రీడ తొలిసారి మెడల్ ఈవెంట్గా అరంగేట్రం చేయనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్ తొలి ప్రయత్నంలోనే స్క్వాష్లో పతకం సాధించే అవకాశం ఉంది. ఇంత నమ్మకం ఎందుకంటే... భారత రైజింగ్ సాŠట్ర్ అనాహత్ సింగ్ అసాధారణ ప్రదర్శన గమనించాక అంచనాలు అమాంతం పెరిగాయి. నాలుగేళ్లుగా అంతర్జాతీయ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్న అనాహత్ తాజాగా ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో విజేతగా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్గా కొత్త చరిత్ర సృష్టించింది. 2005లో జోష్నా చినప్ప ఫైనల్కు చేరినా... తుది పోరులో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. అనాహత్ మాత్రం ఫైనల్ చేరిన తొలి ప్రయత్నంలోనే జగజ్జేతగా నిలిచింది. గత ఏడాది ఇదే ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ అనాహత్ ఈసారి మాత్రం అదరగొట్టింది. చాంపియన్గా నిలిచిన క్రమంలో ఆమె వరుసగా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో ముగ్గురు ఈజిప్ట్ క్రీడాకారిణులను ఓడించడం విశేషం. ఈ ఏడాది తర్వాత 18 ఏళ్ల అనాహత్ జూనియర్ సర్క్యూట్లో పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రపంచ సీనియర్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో అనాహత్ 20వ స్థానంలో ఉంది. వచ్చే రెండేళ్లలలో ఆమె ర్యాంక్ మరింత మెరుగయ్యే అవకాశముంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో 16 మంది... మహిళల సింగిల్స్లో 16 మంది పోటీపడతారు. ఐదు బెర్త్లను రీజినల్ గేమ్స్ (ఆసియా, ఆఫ్రికా, పాన్ అమెరికా, యూరోపియన్, ఓసియానియా/కరీబియన్ ప్లే ఆఫ్స్) ద్వారా భర్తీ చేస్తారు. సెపె్టంబర్లో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో అనాహత్ సింగ్ స్వర్ణం సాధిస్తే నేరుగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తుంది. ఒలింపిక్స్లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే పోటీపడే వీలుంది. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ నుంచి ఇద్దరు మాత్రమే అర్హత సాధిస్తారు. ఫలితంగా అనాహత్ లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తే పతకం రేసులో కూడా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్ఫూర్తితో ఐదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన అనాహత్... ఆ తర్వాత తన సోదరి అమీరా ప్రేరణతో స్క్వాష్ వైపు మళ్లింది. 2019లో బ్రిటిష్ ఓపెన్లో అండర్–11 సింగిల్స్లో విజేతగా నిలిచి వెలుగులోకి వచి్చన అనాహత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తన ఆటకు పదును పెంచుకుంటూ పోయింది. ఢిల్లీకి చెందిన అనాహత్ మూడుసార్లు ఆసియా జూనియర్ చాంపియన్గా నిలిచింది. 2022 ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు గెలిచింది. 2025 ఆసియా సీనియర్ చాంపియన్షిప్లో మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది. ‘ఈ విజయం నాకు సర్వస్వం లాంటిది. అంతా కలలా అనిపిస్తోంది. ఈ టోర్నీ నాకు శాపంలా అనిపించింది. ఎందుకంటే గత నాలుగేళ్లుగా ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ లేదా సెమీఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాను. అయితే ఈసారి అన్నీ అధిగమించి టైటిల్ అందుకున్నాను. ఈ గెలుపు ఇంకా ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే జూనియర్ విభాగంలో నాకిదే చివరి సంవత్సరం. ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ టైటిల్ గెలిచేందుకు నా ముందున్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. ఒత్తిడి పెంచుకుంటే నా ఆటతీరు దారుణంగా ఉంటుందని తెలుసు. అందుకే ఈసారి ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకుండా ప్రతి పాయింట్ను ఆస్వాదించాలని బరిలోకి దిగాను. అనుకున్నది సాధించాను’– అనాహత్ సింగ్ -
రక్షణ రంగంలో ఉన్నత శిఖరాలకు భారత్
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ రంగ ఉత్పత్తులు, ఎగుమతులు, మిత్రదేశాలతో రాజకీయ సహకారం వంటి రంగాల్లో భారత్ నిరంతరం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో మనదేశం స్వయం సమృద్ధి సాధిస్తోందని, స్వదేశీ పరిజ్ఞానంతో నూతన రికార్డులు సృష్టిస్తోందని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం 136వ ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ రక్షణ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, యువత సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. ఆయన ఏం చెప్పారంటే.. ‘ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్–1’జూలై 18న శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం చరిత్రాత్మక ఘట్టం. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషంగా ఉంది. ‘క్యాచ్ ది రెయిన్’, ‘ఏక్ పేడ్ మా కే నామ్ పే’ కార్యక్రమాలు ఉద్యమంలా కొనసాగుతున్నాయి’’ అని అన్నారు. క్రీడలు, విద్యలో సత్తా చాటుతున్న యువత ‘‘అంతర్జాతీయ క్రీడల్లో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ షట్లర్గా పీవీ సింధు చరిత్ర సష్టించింది. లండన్లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్లో 270 పరుగుల తేడాతో అపూర్వ విజయం సాధించడం మనందరికీ గర్వకారణం. 1983లో పురుషుల జట్టు ఇక్కడే తొలి ప్రపంచకప్ సాధించగా, ఇప్పుడు మన నారీశక్తి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచి్చపెట్టింది’’ అని అన్నారు. చేనేత కళాకారులను గౌరవించాలి‘‘అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్లో సత్తా చాటిన భారత విద్యార్థులను నా అభినందలు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలోని సౌత్ చిట్టూర్కు చెందిన ఉపాధ్యాయుడు అభిలాష్ ఫుట్బాల్ పదాలతో సంస్కృతం నేర్పిస్తున్న ‘అక్షర కందుక్’ ప్రాజెక్టు ప్రయోగం ప్రశంసనీయం. జూలై 27న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి జరుగనుంది. గురు పూరి్ణమ నిర్వహించుకోబోతున్నాం. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలంతా ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి. ఆగస్ట్ 7న ‘నేషనల్ హ్యాండ్లూమ్ డే’జరుగనుంది. చేనేత వ్రస్తాలను ప్రోత్సహించడం ద్వారా చేనేత కళాకారులను గౌరవించాలని ప్రజలను కోరుతున్నా’’ అని అన్నారు. -
భారత జెన్-జీకి పాక్, శ్రీలంక, నేపాల్ సెల్యూట్.. రియాక్షన్లు ఇవే..
భారత జెన్-జీని తరచూ మొబైల్లో ఎక్కువ సమయం గడిపే తరం, ప్రతి విషయాన్నీ మీమ్స్గా మార్చే తరం, తీవ్రమైన అంశాలపై ఎక్కువసేపు దృష్టి పెట్టని తరంగా భావించేవారు. కానీ గత నెల రోజులుగా అదే బలహీనతలు వారి అతిపెద్ద బలంగా మారాయి. వరుసగా సాగిన విద్యార్థి ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేశాయి. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో సంప్రదాయ రాజకీయ ప్రకటనల స్థానంలో మీమ్స్ వచ్చాయి. ఇన్స్టా రీల్స్ ప్రజలను సమీకరించే సాధనంగా మారాయి.ఈ ఉద్యమం ఇప్పుడు భారత్కే పరిమితం కాలేదు. పొరుగు దేశాల్లో కూడా దీని గురించి చర్చ సాగుతోంది. జెన్-జీ దృష్టి త్వరగా మళ్లిపోతుందని సాధారణంగా చెబుతుంటారు. కానీ భారత్లో జరిగిన ఈ ఉద్యమం శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్ యువత దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ దేశాల్లో గతంలో కూడా యువజన ఉద్యమాలు జరిగాయి. అందువల్ల భారత్లోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమంపై అక్కడ ప్రత్యేక ఆసక్తి కనిపించింది.దీనిపై పాకిస్థాన్ యువతి ఒకరు మాట్లాడుతూ.. "ఇలా చేస్తుంటే ప్రేమలో పడిపోతానేమో... మీరు ఇంత బాగా చేస్తుంటే నేను మిమ్మల్ని ఎలా ద్వేషిస్తాను?" అని అన్నారు. భారత జెన్-జీ చూపించిన ధైర్యం, ఐక్యత ఎవరినైనా ఆకట్టుకుంటాయి. సరిహద్దులు వేరు కావచ్చు. కానీ ఈ తరం ఆలోచనలు, ఉత్సాహం ఒక్కటేనని చెప్పారు. పాకిస్థాన్కు చెందిన పలువురు యువకులు అవకాశం వస్తే తామూ భారత విద్యార్థుల్లాగే వీధుల్లోకి వచ్చేవాళ్లమని అన్నారు. ఓ యువకుడు మాట్లాడుతూ.. "కాక్రోచ్ జనతా పార్టీ చాలా కూల్గా ఉంది. వారు అవసరానికి మించి సీరియస్గా ఉండరు. అదే నాకు నచ్చింది. జెన్-జీకి సాటి ఎవరూ లేరు" అని చెప్పాడు.ఒక ప్లేట్ బిర్యానీకే అమ్ముడుపోయేవాళ్లం ముంబైలో వైరల్ అయిన ఓ వీడియోను కూడా అతను ప్రస్తావించాడు. అందులో పోలీసులు విద్యార్థులను వాహనంలో తీసుకెళ్తుండగా, వెనుక నుంచి ఎవరో నిశ్శబ్దంగా తాళం తీసేయడంతో విద్యార్థులు బయటకు వచ్చి పరుగులు తీశారు. మరో పాకిస్థాన్ యువకుడు మాట్లాడుతూ.. భారత విద్యార్థులు మతం, కులానికి అతీతంగా ఐక్యంగా నిలిచారని, కానీ పాకిస్థాన్లో ప్రజలు పంజాబీ-పష్తూన్, సున్నీ-షియా వంటి విభజనల్లో ఉన్నారని అన్నాడు."అదే భారత్ జెన్-జెడ్ అతిపెద్ద బలం. పాకిస్థాన్ జెన్-జీ అంత సులభంగా ఒక్కటవుతుందని నాకు అనిపించడం లేదు." భారత్ ఉద్యమానికి పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణలపై పాకిస్థాన్ కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "మా దేశాన్ని నడపడానికే మా దేశం వద్ద డబ్బు లేదు. భారత ఉద్యమానికి ఎలా నిధులు ఇస్తాం?" అని అన్నాడు.బిలాల్ హసన్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘‘భారత్లో విద్యార్థులపై లాఠీచార్జ్ జరగొచ్చు. కానీ పాకిస్థాన్లో చాలా సందర్భాల్లో ప్రజలను నేరుగా తీసుకెళ్లి అదృశ్యం చేస్తారు’’ అని చెప్పారు. పాకిస్థాన్లో చాలామందిని "ఒక ప్లేట్ బిర్యానీ"కే కొనుగోలు చేయవచ్చని వ్యాఖ్యానించారు.శ్రీలంక యువతపై ప్రభావంభారత విద్యార్థి ఉద్యమం శ్రీలంక యువతపై కూడా ప్రభావం చూపింది. 2022లో శ్రీలంక యువత ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత రాజపక్స ప్రభుత్వం అధికారాన్ని వీడింది. ఇప్పుడు శ్రీలంకలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై కార్టూన్లు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా వచ్చాయి. ప్రముఖ కార్టూనిస్ట్ అవంతా ఆర్టిగాలా పంచుకున్న వ్యంగ్య చిత్రంలో ప్రభుత్వం "బొద్దింకలను" అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, భారత్ ఇళ్లలో వాడే "లక్ష్మణ రేఖ" కూడా వాటిని ఆపలేకపోయినట్టు చూపించారు.భారత్ ఉద్యమంలో ఎక్కువగా చర్చకు వచ్చిన చిత్రం ముంబైకి చెందిన రియా అహీర్ పోలీసు వాహనం ముందు చేతులు చాపి నిలిచిన ఫొటో. చాలామంది దీన్ని 1989 తియానన్మెన్ స్క్వేర్లోని ప్రసిద్ధ "ట్యాంక్ మ్యాన్" చిత్రంతో పోల్చారు. శ్రీలంక లా కాలేజీ విద్యార్థిని స్వస్థిక అరులింగం ఫేస్బుక్లో ఈ చిత్రాన్ని పంచుకుంటూ "వైబింగ్ ఎట్ అనదర్ లెవల్" అని రాశారు. 2022 శ్రీలంక ఉద్యమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త బువాంకా పెరేరా ఇన్స్టాగ్రామ్లో భారత యువతకు సందేశం పంపారు."శ్రీలంక నుంచి ప్రారంభమై ఆసియా అంతటా వ్యాపించిన యువజన ఉద్యమాల జ్వాల భారత్ను చాలాకాలం తాకలేదనిపించింది. కానీ ఇప్పుడు రాజ్యాంగం, దేశ వ్యవస్థాపకులు కలలు కన్న భారత్ కోసం భారత యువత పోరాడుతుండటం చూసి ఆనందంతో కళ్లలో నీళ్లు వస్తున్నాయి" అని ఆయన అన్నారు. నేపాల్ యువత మద్దతునేపాల్లో కూడా భారత్ జెన్-జీ ఉద్యమంపై సానుకూల స్పందనలు వచ్చాయి. కాఠ్మాండూ కంటెంట్ క్రియేటర్ అవినాశ్ మిశ్రా మాట్లాడుతూ.. భారత విద్యార్థుల ఆగ్రహం పూర్తిగా సమంజసమని, దాన్ని అతిగా స్పందించారని చెప్పలేమన్నారు. "వీధుల్లో విద్యార్థులను చూసినప్పుడు నా మనసు అప్పుడూ బాధపడింది. ఇప్పుడూ బాధపడుతోంది" అని చెప్పారు. 2025లో నేపాల్ జెన్-జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, అది కూడా యువత శక్తికి ఉదాహరణగా నిలిచి చివరకు కేపీ ఓలీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసిందని అన్నారు.జెన్-జీ నుంచి ప్రపంచం నేర్చుకుంటోంది..ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచం తొలిసారి భారత్ జెన్-జీ మీమ్స్, నినాదాలు, వైరల్ వీడియోలను చూసి నవ్వడమే కాదు, వాటి నుంచి నేర్చుకోవడం కూడా ప్రారంభించింది. పొరుగు దేశాల నుంచి వచ్చిన స్పందనలు చూస్తే, భారత్ విద్యార్థి ఉద్యమం సరిహద్దులు దాటి యువతకు స్ఫూర్తిగా మారిందని తెలుస్తోంది. శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్కు చెందిన పలువురు యువకులు భారత విద్యార్థుల ఐక్యత, ధైర్యం, సృజనాత్మక నిరసనను ప్రజాస్వామ్య ఉద్యమానికి కొత్త ఆదర్శంగా అభివర్ణించారు. -
మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా.. ఎక్కడంటే..
కాన్బెర్రా: ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ (ఏసీటీ) విద్యార్ధి సంక్షోభం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇవెట్ బెర్రీ తన పదవికి రాజీనామా చేశారు. తన శాఖలోని ఇద్దరు సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు సమగ్ర విచారణలో తేలడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కుంభకోణంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని విచారణ కమిషన్ స్పష్టం చేసినప్పటికీ, నైతిక బాధ్యత వహిస్తూ బెర్రీ కేబినెట్ నుంచి వైదొలగడం విశేషం. రూ. 18.2 మిలియన్ల విలువైన పాఠశాల కాంట్రాక్ట్ను రియల్ ఎస్టేట్ సంస్థకు కట్టబెట్టడంతో ఈ అవినీతి జరిగినట్లు ఏబీసీ నివేదిక వెల్లడించింది.భారతదేశంలో అత్యంత కీలకమైన వైద్యవిద్య ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టడంతో, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలోని బెర్రీ రాజీనామా ఉదంతంతో భారత విద్యాశాఖ మంత్రి వైదొలగిన తీరును పలువురు పోల్చి చూస్తున్నారు. ఏసీటీ రాజకీయాల్లో కీలక నేతగా, సుదీర్ఘకాలం డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన బెర్రీ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.ఇది కూడా చదవండి: జైలుపాలైన లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు! -
చరిత్ర సృష్టించిన అనాహత్.. తొలి ప్లేయర్గా రికార్డు
ఒంటారియో (కెనడా): భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్... ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్షిప్ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ అనాహత్ 11–3, 11–7, 11–9తో రుఖయ్య సలీమ్ (ఈజిప్ట్)పై గెలిచింది. తద్వారా భారత్ నుంచి తొలి ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్గా అవతరించింది. 2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో రన్నరప్గా నిలిచింది. గతేడాది కైరోలో జరిగిన ఈ టోర్నమెంట్లో కాంస్యం నెగ్గిన అనాహత్... ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్గానూ రికార్డుల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో చాంపియన్గా నిలిచిన అనాహత్కు పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. BIG BIG BIGGG NEWS 🔥🔥🔥🔥ANAHAT SINGH IS WORLD JUNIOR CHAMPION 🏆 🇮🇳THE QUEEN FROM INDIA IS AT THE TOP OF WORLD TODAY!Anahat defeated Ruqayya Salem 🇪🇬 3-0 to become the first Indian to win the Junior Squash World Championship 🏆 First Non Egyptian player to win Jr World… pic.twitter.com/eA0rouqE2f— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) July 25, 2026Read: సిరీస్ విజయం.. టీ20ల్లో నంబర్వన్గా టీమిండియా -
ఝండూ పవర్
గ్లాస్గో: పారా పవర్లిఫ్టింగ్లో కాంస్య పతకంతో బోణీ చేస్తూ కామన్వెల్త్ క్రీడల పతకాల జాబితాలో భారత్ కూడా చేరింది. పురుషుల హెవీ వెయిట్ కేటగిరీలో భారత్కు చెందిన ఝండూ కుమార్ కాంస్యం (130.9 పాయింట్లు) సొంతం చేసుకున్నాడు. ఈ పోటిల్లో భారత్కు ఇదే తొలి పతకం తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువెత్తి ఝండూ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. మొదటి ప్రయత్నంలో 181 కేజీల బరువెత్తిన అతను రెండో ప్రయత్నంలో దానిని మరింత మెరుగుపర్చుకున్నాడు. చివరి ప్రయత్నంలో 196 కేజీల కోసం ప్రయత్నించినా అతను విఫలమయ్యాడు. ఈ ఈవెంట్లో రిలువాన్ ఇద్రీస్ (208 కేజీలు; నైజీరియా) స్వర్ణం గెలుచుకోగా, మాథ్యూ హార్డింగ్ (199 కేజీలు; ఇంగ్లండ్)కు రజతం దక్కింది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో ఆరుగురు భారత పవర్లిఫ్టర్లు పతకం సాధించడంలో విఫలమయ్యారు. పారా పవర్ లిఫ్టింగ్ పురుషుల లైట్ వెయిట్ విభాగంలో భారత్ లిఫ్టర్ అశోక్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకున్నాడు. ఇతర ఫలితాలు→ భారత బాక్సర్ సచిన్ సివాచ్ (62 కేజీలు) 4–1తో అహ్మదీ (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్స్కు చేరుకున్నాడు. → మహిళల బౌల్స్ పెయిర్ ఈవెంట్లో భారత జోడి రూపా రాణి – పింకీ సింగ్ ‘టైబ్రేకర్’లో టోంగాపై గెలిచింది. → పురుషుల స్విమ్మింగ్ (400 మీ. ఫ్రీస్టయిల్)లో భారత స్విమ్మర్లు ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. దక్షణ్ శశికుమార్ 15వ, ఆర్యన్ 6వ స్థానంతో ముగించారు. → మహిళల 3X3 వీల్ చెయిర్ బాస్కెట్బాల్ ఈవెంట్ తొలి మ్యాచ్లో భారత్ 1–16 తేడాలో వేల్స్ చేతుల్లో చిత్తుగా ఓడింది. → పురుషుల బౌల్స్ ఈవెంట్ సింగిల్స్లో భారత ఆటగాడు పుతుల్ సోనోవాల్ 4–8, 8–9 స్కోరుతో ఇజ్జత్ జుల్కెప్లె (మలేసియా) చేతిలో ఓడాడు. దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాడ్ లి క్లోజ్ ఖాతాలో 19వ కామన్వెల్త్ పతకం చేరింది. తద్వారా ఈ పోటీల్లో అత్యధిక పతకాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు షూటర్లు ఫిల్ ఆడమ్స్, గౌల్ట్ (18 పతకాలు) పేరిట ఉంది.అవమాన కుమార్!!! అతని అసలు పేరు అవినాశ్ కుమార్. అయితే ఐదేళ్ల వయసులో పోలియోబారిన పడి నడుం కిందిభాగం చచ్చుబడిపోయింది. ‘నువ్వు తండ్రికి భారంగా పుట్టావు. అతడి పరువు తీశావు’ అంటూ కొందరు బంధువులు ఝండ్ (అవమానం) అంటూ పిలవడం మొదలుపెట్టారు. చిన్నప్పుడు రికార్డుల్లో కూడా ఇదే పేరు నమోదు కావడంతో చివరకు అసలు పేరు పోయి అతను ఝండూ కుమార్గా మారాడు! స్వస్థలం బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా హర్నౌత్. తండ్రి కూరగాయలు అమ్మగా వచ్చే ఆదాయంతో జీవనం సాగే పరిస్థితుల్లో అతను చిన్నప్పటి నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే కఠోర శ్రమతో, పట్టుదలతో వాటిని అధిగమించాడు. కుటుంబ పోషణకు తాను కూడా కూరగాయాలు అమ్మాడు. ఉదయం 4 గంటలకే 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హోల్సేల్ మార్కెట్లో కూరగాయలు తెచ్చుకొని హర్నౌత్లో ఫుట్పాత్పై అమ్మడం అతని రోజూవారీ దినచర్య. 4 గంటల వరకు అమ్మకం ముగించి ఆ తర్వాత జిమ్కు వెళ్లడం, ప్రాక్టీస్ చేయడంతోనే పవర్లిఫ్టింగ్లో అతను రాటుదేలాడు. కాళ్లు లేకపోయినా శారీరక సౌష్టవం పెంచుకోగలననే నమ్మకంతో తన ట్రైసైకిల్ను దాదాపు కిలోమీటర్ తోసుకుంటూ జిమ్కు వెళ్లి ఝండూ సాధన చేశాడు. అయితే ఆర్థిక సమస్యలు మరింత పెరగడంతో బ్యాటరీ ఈ–రిక్షా నడిపి కొంత ఆదాయం పొందే ప్రయత్నం చేశాడు. గాందీనగర్లోని స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో అవకాశం లభించడంతో అతని జీవితం మారింది. ఏడాది క్రితం 205 కిలోల బరువెత్తి కొత్త జాతీయ రికార్డు సాధించిన ఝండూ ఆ తర్వాత 206 కేజీలతో దానిని సవరించాడు. ప్రపంచ కప్లో కాంస్యం, ఆసియా ఓషియానియా చాంపియన్షిప్లో కాంస్యం సాధించిన ఝండూ ప్రపంచ చాంపియన్షిప్లో ఐదో స్థానంలో నిలిచాడు. -
కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్వెల్త్లో భారత్ బోణీ
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల బోణీ చేసింది. పురుషుల పారా పవర్లిఫ్టింగ్ హెవీవెయిట్ కేటగిరీలో ఝండు కుమార్ కాంస్యంతో మెరిశాడు. గ్రూప్-బి నుంచి బరిలోకి దిగిన ఝండు తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువును ఎత్తి 130.9 పాయింట్లు స్కోరును సాధించాడు. ఇప్పటివరకు ఝండు కెరీర్లో అత్యుత్తమంగా ఉన్న 198 కేజీల బరువును అధిగమించనప్పటికీ తాజా కామన్వెల్త్ గేమ్స్లో మాత్రం కాంస్యాన్ని ఒడిసిపట్టాడు. మూడో ప్రయత్నంలో 196 కేజీల బరువు ఎత్తే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ తన కంటే ఎక్కువగా ఎవరు బరువు ఎత్తకపోవడంతో గ్రూప్-బి నుంచి తొలి స్థానంలో, ఓవరాల్గా మూడో స్థానంలో నిలిచి పతకం ఖాయం చేసుకున్నాడు. ఇక నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ 208 కిలోల బరువు ఎత్తి 132.8 పాయింట్లు సాధించి పోడియంపై తొలి స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నాడు. ఇక 199 కిలోల బరువు ఎత్తిన ఇంగ్లండ్కు చెందిన మాథ్యూ హార్డింగ్ 131 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి వెండిని కైవసం చేసుకున్నాడు. ఇక కాంస్య పతకం గెలుచుకున్న అనంతరం ఝండు కుమార్ మాట్లాడాడు.‘నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. భారత్కు ఇది చాలా ముఖ్యం. ఈ గేమ్స్లో నాదే దేశానికి తొలి పతకం కావడాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. జాతీయ జెండాను పోడియంపై చూసినప్పుడు గర్వంగా ఫీలయ్యాను. థాంక్యూ ఇండియా. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను పతకం గెలిచిన విషయాన్ని ముందుగా ఇంట్లో అమ్మానాన్నలకు చెప్తాను. అలాగే, చిన్నప్పటి నుంచి నాకు అండగా నిలిచిన నా స్నేహితుడు గౌతమ్ భయ్యాకు కూడా విషయాన్ని చెప్పాలి’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ-రిక్షా నుంచి వెయిట్లిఫ్టర్ దాకాపేదరికం విజయకాంక్షను పెంచుతుందనే మాట పారా పవర్లిఫ్టర్ ఝండు కుమార్ సాధించిన ఘనత ద్వారా మరోసారి నిరూపితమైంది. హర్నౌత్కు చెందిన ఒక కూరగాయల వ్యాపారి కుమారుడైన ఝండు ఒక ఈ-రిక్షా డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. హర్నౌత్లోని ది రాక్ స్టార్ జిమ్ యజమాని గౌతమ్ సింగ్ రాకతో ఝండు జీవితం పూర్తిగా మారిపోయింది. ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్ (కేఐపీజీ)లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. మార్చి 23న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని వెయిట్లిఫ్టింగ్ హాల్లో జరిగిన పురుషుల 72 కేజీల విభాగంలో, ఆ పవర్లిఫ్టర్ 206 కేజీల బరువును ఎత్తి తన సొంత జాతీయ రికార్డును బద్దలు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మార్చి 17-18 తేదీలలో నోయిడాలో జరిగిన పారా నేషనల్ ఛాంపియన్షిప్లో ఝండు 205 కేజీల బరువును ఎత్తి, సుధీర్ కుమార్ యొక్క 192 కేజీల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.పుట్టుకతో పోలియో28 ఏళ్ల అతనికి పుట్టుకతోనే పోలియో సోకిన కాళ్లు ఉన్నాయి. అతని పారా స్పోర్ట్స్ ప్రయాణం 2017లో ప్రారంభమైంది. మొదట్లో, అతను షాట్పుట్, డిస్కస్ త్రోలో పోటీపడ్డాడు. ఆ సమయంలో, అతనికి పారా పవర్లిఫ్టింగ్ గురించి తెలియదు. F-55 కేటగిరీలో, ఝండు అనేక షాట్పుట్డి, డిస్కస్ త్రో ఈవెంట్లలో పాల్గొని విజయం సాధించాడు, కానీ అతని గమ్యం వేరే చోట ఉండటంతో, విధి అతన్ని ఆ దిశగా నడిపించింది.కష్టాలతో కూడిన ప్రయాణం తర్వాత, అతను గాంధీనగర్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(NCOE)కి చేరుకున్నాడు. ప్రముఖ పారా కోచ్ రాజిందర్ సింగ్ రాహేలు మార్గదర్శకత్వంలో పవర్ వెయిట్లిఫ్టర్గా కెరీర్ ప్రారంభించాడు. డిసెంబర్ 2023లో, KIPG తొలి ఎడిషన్లో పవర్లిఫ్టింగ్ విభాగంలో ఝండు కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 2028 లాస్ ఏంజెలెస్ పారా ఒలింపిక్స్లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యమని ఝండు కుమార్ పేర్కొన్నాడు.ప్రధాని మోదీ అభినందనలుకామన్వెల్త్ గేమ్స్లో దేశానికి తొలి పతకం అందించిన ఝండు కుమార్కు ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. 'కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీవెయిట్ పారా పవర్లిఫ్టింగ్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన ఝండు కుమార్కు అభినందనలు. అతడి అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికను తెరవడం గొప్ప విషయం. అతడి విజయం అపారమైన శక్తికి, అతడి సంకల్పానికి, ఎన్నో ఏళ్ల తరబడి క్రమశిక్షణకు నిదర్శనం. తన జీవితంలో ఎదురైన ప్రతీ సవాల్ను అధిగమించి ఇవాళ అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశానికి గర్వకారణంగా నిలిచి భారతీయులందరికి స్ఫూర్తిగా నిలిచాడు.' అని మోదీ కొనియాడారు. A spectacular performance by Jhandu Kumar, who has opened India’s medal tally at the #CWG2026 by winning a Bronze in the Men’s Heavyweight Para Powerlifting event! Congratulations to him. His achievement is a powerful reflection of immense strength, unwavering determination and… pic.twitter.com/kMdkU6RRAF— Narendra Modi (@narendramodi) July 25, 2026 🇮🇳 BRONZE FOR BHARAT! 🥉 Jhandu Kumar opens India’s #CWG2026 medal tally with a massive 190kg lift in Men’s Heavyweight Para Powerlifting. The entire nation is proud! 🇮🇳 #Cheer4Bharat pic.twitter.com/pyZSOZw0uI— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 24, 2026చదవండి: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్! -
భారత్పై పదిశాతం సుంకాలు!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా మరోసారి భారత్పై టారిఫ్ల కొరడా ఝళిపించింది. బలవంతపు చాకిరితో వచ్చిన ఉత్పత్తులను నియంత్రించే లక్ష్యంతోనే ఈ టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించింది. తాజా ఆదేశాలతో అమెరికా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 99 శాతం వస్తువులపై పది నుంచి 12.5 శాతం టారిఫ్ వర్తిస్తుంది. బలవంతపు చాకిరి ద్వారా వచ్చిన ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తూ చట్టసవరణలు చేసిన కారణంగా భారత్పై పది శాతం పన్ను మాత్రమే విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. వాణిజ్య సంస్థల ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ భారత్ లాంటి దేశాలను మరింత ప్రోత్సహించేందుకు పది శాతం టారిఫ్ విధించాలని వాణిజ్య సంస్థల ప్రతినిధులు సూచించారని తెలిపారు. కొత్త టారిఫ్లు మొత్తం అరవై దేశాల దిగుమతులకు వర్తిస్తాయని, బలవంతపు చాకిరితో ఉత్పత్తి అయిన వస్తువుల ఎగుమతులపై నిషేధం లేని చైనా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్లతోపాటు మొత్తం 43 దేశాలకు 12.5 శాతం, మిగిలిన దేశాలపై 10 శాతం టారిఫ్లు వర్తిస్తాయని వాణిజ్య సంస్థల ప్రతినిధి జేమిస్ గ్రీర్ తెలిపారు. కొత్త టారిఫ్లు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి తరువాత అమల్లోకి రానున్నాయి. -
త్రుటిలో చేజారె...
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ తొలి రోజు శుక్రవారం భారత్ పతకాల బోణీ కొట్టలేకపోయింది. పారా స్విమ్మింగ్ ఎస్13 (దృష్టిలోపం) కేటగిరీ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ రవి వీర వెంకట భవాని కార్తీక్ బుడిగిన నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. రవి 100 మీటర్ల లక్ష్యాన్ని 57.57 సెకన్లలో ముగించి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్కే చెందిన మరో స్విమ్మర్ ఇమామ్ అలీ (1ని:03.73 సెకన్లు) ఏడో స్థానంలో నిలిచాడు. నాథన్ హెండ్రిక్స్ (దక్షిణాఫ్రికా; 54.54 సెకన్లు), స్టీఫెన్ క్లెగ్ (స్కాట్లాండ్; 55.16 సెకన్లు), మాథ్యూ రెడ్ఫెర్న్ (ఇంగ్లండ్; 56.86 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. పారా పవర్లిఫ్టింగ్లోనూ భారత్కు నిరాశ ఎదురైంది. పురుషుల లైట్ వెయిట్ కేటగిరీలో భారత లిఫ్టర్లు అశోక్ (143.8 పాయింట్లు) నాలుగో స్థానంలో, పరమ్జీత్ కుమార్ (135.6 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచారు. మహిళల లైట్ వెయిట్ కేటగిరీలో భారత లిఫ్టర్ సుమన్ దేవి (88.4 పాయింట్లు)... హెవీ వెయిట్ కేటగిరీలో కస్తూరి రాజమణి చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. జాదుమణి శుభారంభం పురుషుల బాక్సింగ్ 55 కేజీల విభాగంలో భారత బాక్సర్ జాదుమణి సింగ్ శుభారంభం చేశాడు. ఆరోన్ కులెన్ (స్కాట్లాండ్)తో జరిగిన తొలి రౌండ్లో జాదుమణి 5:0 స్కోరుతో ఘనవిజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల స్విమ్మింగ్లో రెండుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో సెమీఫైనల్కు చేరుకున్నాడు. లాన్ బౌల్స్లో భారత మహిళల జట్టు పెయిర్స్ ఈవెంట్లో 2–0తో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. పురుషుల సింగిల్స్లో పుతుల్ సోనోవాల్ టైబ్రేక్లో సెసిల్ అలెగ్జాండర్ (ఫాల్్కలాండ్ ఐలాండ్స్)పై గెలుపొందాడు. తొలి స్వర్ణం ఇంగ్లండ్ ఖాతాలో కామన్వెల్త్ గేమ్స్ తొలి స్వర్ణ పతకం ఇంగ్లండ్ ఖాతాలోకి వెళ్లింది. పురుషుల పారా పవర్లిఫ్టింగ్ లైట్ వెయిట్ కేటగిరీలో ఇంగ్లండ్ లిఫ్టర్ మార్క్ స్వాన్ విజేతగా నిలిచాడు. మార్క్ స్వాన్ 153.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రొలాండ్ ఇజురికి (నైజీరియా) రజతం, బోనీ గుస్టిన్ (మలేసియా) కాంస్యం సాధించారు. మహిళల పారా పవర్లిఫ్టింగ్ లైట్ వెయిట్ కేటగిరీలో ఎస్తెర్ న్వొర్గో (నైజీరియా; 119 పాయింట్లు) స్వర్ణం, ఎస్తెర్ ఒయెమా (నైజీరియా; 115.5 పాయింట్లు) రజతం, ఒలీవియా (ఇంగ్లండ్; 106.6 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. జూడో ప్లేయర్ తులికపై వేటుకామన్వెల్త్ గేమ్స్ జూడో క్రీడాంశంలో భారత్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో +78 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన తులిక మాన్పై ఈసారి వేటు పడింది. డోపింగ్ నిబంధనలను ఆమె ఉల్లంఘించడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తులికపై సస్పెన్షన్ విధించింది. నిబంధనల ప్రకారం క్రీడాకారులు ఏడాది కాలంలో కనీసం మూడుసార్లు తాము ఎక్కడెక్కడ ఉన్నామో అనే సమాచారం ‘నాడా’కు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మూడుసార్లు విఫలమైతే వారిపై నిషేధం విధిస్తారు. 2024 పారిస్ ఒలింపిక్స్లోనూ పోటీపడ్డ తులిక ఏడాది కాలంలో తన ఆచూకీ వివరాలన ‘నాడా’కు సమర్పించకపోవడంతో ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. కామన్వెల్త్ గేమ్స్ జూడో ఈవెంట్ ఈనెల 31న మొదలుకానుండగా... భారత జూడో ప్లేయర్లు ఈనెల 27న గ్లాస్గోకు బయలుదేరుతారు. పురుషుల 73 కేజీల విభాగంలో భారత జూడో ప్లేయర్ అరుణ్ కుమార్ డోపింగ్ పరీక్షలో విఫలమవ్వడంతో గురువారం జట్టు నుంచి అతడిని తొలగించారు. శుక్రవారం తులికపై వేటు పడటంతో భారత్ నుంచి 14 మందికి బదులుగా 12 మంది జూడో ప్లేయర్లు కామన్వెల్త్ గేమ్స్లో పోటీపడతారు. -
భారత్కు రజతం
హాంగ్జౌ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పతకాల బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సంయం విజ్ భారత్కు రజత పతకాన్ని అందించింది. చండీగఢ్కు చెందిన 22 ఏళ్ల సంయం 243.4 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. యావో కియాన్జున్ (చైనా; 243.6 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... హనియె (ఇరాన్; 221 పాయింట్లు) కాంస్యం దక్కించుకుంది. భారత్కే చెందిన సురుచి సింగ్ 137.6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.


