breaking news
India
-
నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (IWT) పక్కనబెట్టాలన్న భారతదేశం నిర్ణయం పాకిస్తాన్ను ఒక రేంజ్లో వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే సింధూ జలాలను ఆపితే యుద్ధమే అంటూ పాక్ కొత్త హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌర ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యం కూడా తమ దేశానికి దక్కాల్సిన నీటి వాటా కోసం అవసరమైన అన్ని తీసుకుంటామని ప్రకటించడం కలకలం రేపింది.పాక్ సైనిక దళాల అధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ అధ్యక్షతన 276వ కోర్ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సింధూ జలాల వివాదంపై పాక్ సైన్యం కీలక నిర్ణయాలు ప్రకటించింది. సైనిక కమాండర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 24 నాటి నేషనల్ సెక్యూరిటీ కమిటీ (NSC) ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని పునరుద్ఘాటించింది .అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధూ నదీ జలాల వాటాను దక్కించు కునేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సింధూ జలాల హక్కుల కోసం పోరాడుతామని సైన్యం వెల్లడించింది. గతేడాది 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Water Treaty) భారతదేశం నిలిపివేసింది (Abeyance లో పెట్టింది). దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యం, మంత్రులు భారత్పై అక్కసు వెళ్లగక్కడంతోపాటు, వార్ వార్నింగ్లివ్వడం శోచనీయం.పాకిస్తాన్ NSC మార్గదర్శకాలు ఏమిటి?నీటిని ఆపడం లేదా మళ్లించడం వంటి ఏ చర్యకైనా పాల్పడితే దానిని "యుద్ధ చర్య" (Act of War)గా పరిగణించాలని పాకిస్తాన్ NSC గతంలోనే నిర్ణయించింది. ఆఫ్ఘన్ తాలిబాన్ పాలనలో ఉన్న భూభాగాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్పై దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిపై 'ఆపరేషన్ గజబ్-లిల్-హక్' కింద పోరాడుతామని తెలిపింది. అలాగే కాశ్మీరీలకు తమ దౌత్య, రాజకీయ, నైతిక మద్దతు ఎప్పటికీ ఉంటుందని పేర్కొంది.బిలావల్ భుట్టో జర్దారీ హెచ్చరిక వైరల్పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఒక వీడియో వైరల్ అవుతోంది. సింధు నదీ జలాల ఒప్పందంపై రాజీ పడే ప్రసక్తి లేదు. భారత్ ఈ జలాలను ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఇందుకోసం భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే, అన్ని రంగాలలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము."పాకిస్తాన్ శాశ్వతంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంతవరకు ఈ సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని భారతదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.సరిహద్దుల్లో శత్రుత్వం కొనసాగుతు న్నప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలు మామూలుగా సాగవని, భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఒప్పందాలు నడుస్తాయని భారత్ స్పష్టం చేసింది.సింధు జలాలు- పాకిస్తాన్ 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్ జలాలు భారత్కు.. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలు పాకిస్తాన్కు దక్కాలి. అయితే సాధారణంగా వర్షాకాలంలో వరద హెచ్చరికల సమాచారాన్ని భారత్ పాకిస్తాన్తో పంచుకునేది. కానీ ఒప్పందం నిలిపివేయడంతో భారత్ ఆ సమాచారాన్ని పంచు కోవాల్సిన అవసరం ఉండదు.భారత్ ప్రాజెక్టులు: సింధు బేసిన్లో సావల్కోట్, రట్లే, బుర్సార్, పకాల్ దుల్, క్వార్, కిరు, కీర్తాయ్ వంటి పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. పాక్ వ్యవసాయం అతలాకుతలం: పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో దాదాపు 80-90 శాతం ఈ సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్లోని ప్రధాన జలాశయాలైన తర్బెలా, మంగ్లా డ్యామ్లలో నీటి నిల్వలు దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.దీంతో తమ అత్యంత బలహీనమైన పాయింట్ను భారత్ టార్గెట్ చేయడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడానికి పాక్ రాయబారులను పంపడం, ఐక్యరాజ్యసమితికి లేఖలు రాయడం, చట్టపరమైన చర్యలకు దిగడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్ -
భారత్ కు సవాల్ బుడ్డాడు గెలిపిస్తాడా!
-
వణికిస్తున్న వర్షాలు: పలు రాష్ట్రాల్లో వరద భీభత్సం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా, రైలు, రోడ్డు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. 🚨🌊 कोल्हापुरात मुसळधार पाऊस जिल्ह्यातील कासारी आणि पंचगंगा नद्या दुथडी भरून वाहत असून पंचगंगेची पातळी ३० फुटांवर पोहोचली आहे. (इशारा पातळी ३९ फूट, धोका पातळी ४३ फूट). जिल्ह्यातील ३३ बंधारे पाण्याखाली गेले आहेत. महापुराचा धोका नसला, तरी प्रशासनाने नागरिकांना नदीकाठी न जाण्याचे… pic.twitter.com/w81z1GC9w1— DD Sahyadri News | सह्याद्री बातम्या (@ddsahyadrinews) July 5, 2026ఒడిశాలోని పలు పట్టణాలు జలమయమయ్యాయి. మహారాష్ట్రలో వర్షాల తీవ్రత అత్యధికంగా ఉంది. పుణేలో మరో ముగ్గురు మరణించడంతో, గత మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో మరణాల సంఖ్య 13కు చేరింది. ముంబై, ఠాణే, రాయ్గఢ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబై-పుణే ఎక్స్ప్రెస్వేపై కొండచరియలు విరిగిపడటం, కాంక్రీట్ పిల్లర్ కూలిపోవడంతో రవాణా నిలిచిపోయింది.ముంబైలో లోకల్ రైళ్లు, విమాన సర్వీసులు కూడా ప్రభావితమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదల వల్ల రోడ్లు, పంట పొలాలు దెబ్బతిన్నాయి. చంబాలో రాయి పడి 14 ఏళ్ల బాలిక మరణించింది. జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఆకస్మిక వరదలకు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సమీపంలో వాహనాలు, యంత్రాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఒడిశాలో వాయుగుండం ప్రభావంతో వరుసగా మూడో రోజు భారీ వర్షాలు కురుస్తుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. రాజస్థాన్లో సైతం రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. -
తొలి విజయం దక్కేనా!
నాటింగ్హామ్: టి20 ప్రపంచ చాంపియన్గా నిలిచిన తర్వాత భారత జట్టు మళ్లీ గెలుపు రుచి చూడలేకపోతోంది. ఐర్లాండ్ చేతిలో రెండు మ్యాచ్లలో ఓడి సిరీస్ కోల్పోయిన తర్వాత ఇంగ్లండ్తో గత మ్యాచ్లో పరాజయం పాలైంది. శ్రేయస్ అయ్యర్ ఇంకా కెప్టెన్గా గెలుపు ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో మరో పోరుకు భారత్ సిద్ధమైంది. నేడు ఇంగ్లండ్తో జరిగే మూడో టి20లోనైనా పైచేయి సాధించి ఈ టూర్లో తొలి విజయాన్ని అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. భారత బ్యాటింగ్కు సంబంధించి మరోసారి అభిõÙక్ శర్మ ఇచ్చే ఆరంభం కీలకం కానుంది. అరంగేట్రంపై చర్చ ముగిసింది కాబట్టి ఇక వైభవ్ సూర్యవంశీ నుంచి అంచనాలకు తగినట్లుగా భారత్ ఒక చక్కటి ఇన్నింగ్స్ను ఆశిస్తోంది. ఇషాన్ కిషన్ తన వైఫల్యాల నుంచి బయటకు రావాల్సి ఉండగా... మిడిలార్డర్లో అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే చెలరేగడం అవసరం. ముఖ్యంగా కెపె్టన్ అయ్యర్ ఇంకా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. బౌలింగ్ విషయంలో ఒక మార్పు ఖాయమైంది. గత మ్యాచ్లో చెత్త ప్రదర్శనలో భారత్ ఓటమికి కారణంగా నిలిచిన లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో మరో పేసర్కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. కాబట్టి ప్రిన్స్ యాదవ్ తుది జట్టులో రావచ్చు. అర్‡్షదీప్ విఫలమైనా.. మరో తగిన ప్రత్యామ్నాయం జట్టుకు లేదు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ పరిస్థితిని బట్టి ప్రభావం చూపించగలరు. ఇంగ్లండ్ మాత్రం గత మ్యాచ్లో ఆడిన టీమ్లో ఎలాంటి మార్పూ చేయకుండా ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. బ్యాటింగ్ భారం ప్రధానంగా కెపె్టన్ బ్రూక్, బెతెల్లపై ఉంది. రెండో టి20లో బెతెల్ జోరు చూస్తే అతడిని నిలువరించడం అంత సులువు కాదని అర్థమవుతోంది. అయితే గత పోరులో డకౌటైన ఓపెనర్లు సాల్ట్, బట్లర్ ఈ సారి ఎలాంటి ప్రభావితం చూపిస్తారనేది ఆసక్తికరం.ఆ తర్వాత కూడా బ్యాటింగ్ ఆర్డర్లో బాంటన్, జాక్స్, స్యామ్ కరన్లతో టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. ప్రధాన పేసర్లు ఆర్చర్, టంగ్ భారత్ను ఎంత వరకు నిలువరిస్తారనేదానిపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ట్రెంట్బ్రిడ్జ్ మైదానం అటు బ్యాటింగ్కు, ఇటు బౌలింగ్లో సమంగా సహకరిస్తుంది. గత కొంత కాలంగా ఇక్కడి పిచ్పై భారీ స్కోర్లు నమోదు కాలేదు. మ్యాచ్ రోజున ఎలాంటి వర్షసూచన లేదు. -
జపాన్తో కాలానుగుణ ఒప్పందాలు
జపాన్ ప్రధాని సనాయే తకాయిచీ భారత పర్యటన రెండు ప్రత్యేక నేపథ్యాల మధ్య జరిగింది. ఒకటి ఆర్థికమైనది, మరొకటి రక్షణ పరమైనది. ఈ రెండు నేపథ్యాలు ఇరు దేశాలకూ వర్తించేవే. అదే సమయంలో ఒకటి గుర్తించాలి. ఆర్థికమైన వర్తింపు ఉభయులకూ సమానమే కాగా, రక్షణ కోణంలో కొన్ని సామ్యాలతో పాటు కొన్ని తేడాలున్నాయి. ప్రధాని మోదీ, తకాయిచీ మధ్య ఢిల్లీలో ఈ నెల 2న జరిగిన చర్చలు, ఒప్పందాలు కూడా ఈ పరిస్థితులన్నింటిని ప్రతిఫలించాయి. వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, వాటి అభివృద్ధి ప్రయత్నాలు ఎప్పుడూ ఉండేవే. ఆర్థిక వ్యవస్థల రీత్యా ప్రముఖమైనవి అయిన ఇండియా, జపాన్ వంటి దేశాల మధ్య ఇవి ఇంకా బహు ముఖంగా ఉంటాయి. ఆ మేరకు వేర్వేరు రంగాలలో వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు ఎల్లప్పుడూ ఉన్నవే. అటువంటి స్థితిలో కొత్తగా ఏర్పడిందంటున్న ప్రత్యేక నేపథ్యం ఏమిటి?ప్రత్యేక నేపథ్యంఈ ప్రశ్నకు సమాధానం చర్చల అనంతరం ఇరువురు ప్రధానులు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఉంది. అది, ‘‘నేటి అనిశ్చిత పరిస్థితుల మధ్య ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను రెండు దేశాలు పూర్తిగా అర్థం చేసుకోవటం. దానిని దృష్టిలో ఉంచు కుని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్ మ్యాప్ను రూపొందించటం’’. నేటి అనిశ్చిత పరిస్థితులన్నవి కేవలం ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తినవి కావు. భారత్, జపాన్లతో పాటు ప్రపంచానికంతా అటువంటి ఒడిదుడుకులు ఉక్రెయిన్ యుద్ధంతో నాలుగేళ్ల క్రితం మొదలై, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు, కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల మీదుగా ఇరాన్ యుద్ధం వరకు సాగివస్తున్నాయి. ఇవి స్థూలంగా పైకి కనిపించేవి. కొంత లోతుకు వెళితే,ప్రపంచ ఆర్థిక రంగానికి అనిశ్చితిని సృష్టిస్తున్న పరిణామాలు మరికొన్ని ఉన్నాయి. అవి, రెండవ ప్రపంచ యుద్థం తర్వాత బ్రెట్టన్వుడ్స్ వ్యవస్థలతో మొదలై ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యాలను, ఆర్థిక సంస్కరణలను సులభతరం చేసిన నియమ నిబంధనలు ఇటీవల కొద్ది సంవత్సరాలుగా భంగపడుతుండటం. ఆ వ్యవస్థలను, నిబంధనలు సృష్టించిన దేశాలే వాటిని బలహీన పరుస్తుండటం. వాటి ప్రతికూల ప్రభావాలు మధ్యమ స్థాయి దేశాలపై అట్లుంచి, మొదటి 10 స్థానాలలో గల భారత, జపాన్ వంటి ఆర్థిక వ్యవస్థలకు సైతం అనిశ్చితిని కల్పిస్తున్నది. ఇది ఇరాన్ యుద్ధంతో మరింత తీవ్రమైంది. ఇండియా, జపాన్ గత అక్టోబర్లో తకాయిచీ అధికారానికి రాక ముందు కూడా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మోదీ ప్రభుత్వంపై ఇతరత్రా ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు గాక. కానీ, వేర్వేరు దేశాలతో, ప్రాంతీయ ఆర్థిక కూటములతో వీలైనన్ని ఆర్థిక ఒప్పందాల కోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు అనిశ్చితులు ఉండగా, మరొకవైపు ఈ పోటీ ప్రపంచం, దేశంలో అంతర్గతంగా ఎదురవుతున్న ఆర్థిక ఒడిదుడుకులు ఈ విధా నాల వెనుక ముప్పేటగా పనిచేస్తున్నాయని చెప్పాలి. అసమ వాణిజ్యంజపాన్ పరిస్థితి భారత్ కన్న కొంత మెరుగైనప్పటికీ పైన పేర్కొన్న పరిణామాల మధ్య సమస్యలు తప్పటం లేదు. వాటికి ఇటీవల మరొకటి తోడవుతున్నది. అది, చైనాతో పెరుగుతున్న వివాదాలు. తైవాన్ విషయమై తకాయిచీ వైఖరికి ఆగ్రహించిన చైనా, పలు విధాలైన చర్యలతో జపాన్ ఆర్థిక రంగాన్ని వీలైనంత కుంటుపరచటం మొదలు పెట్టింది. మరొకవైపు ఇండో–పసిఫిక్ రక్షణ బాధ్యతల నుంచి అమెరికా కనీసం పాక్షికంగా ఉపసంహరించుకుంటూ ఆ బరువును ఆ ప్రాంతంలోని జపాన్ తదితర మిత్ర దేశాలపై మోపుతుండటంతో జపాన్ సైనిక వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక భారాలన్నీ మోసేందుకు తకాయిచీ ప్రభుత్వం ఆసియా నుంచి యూరప్ వరకు వేర్వేరు దేశాలతో శరవేగంగా ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటున్నది. ఈ విధంగా ఆర్థిక అనిశ్చితులు, వాటిని తట్టుకునే చర్యలన్నవి భారత్, జపాన్లకు ఒకే విధంగా ఉన్నట్లు గమనించవచ్చు. కనుక, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో 2వ తేదీన జరిగిన ఆర్థిక ఒప్పందాలన్నీ హర్షించవలసినవే. ఒప్పంద వివరాలు వెంటనే తెలియరాలేదు గానీ తకాయిచీ వెంట సుమారు 100 జపనీస్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు రావటాన్ని బట్టి చర్చలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో ఊహించవచ్చు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్వయంగా చెప్పిన దానిని బట్టి, రెండు దేశాల మధ్య గత సంవత్సర కాలంలో 100కు పైగా వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. వాటివల్ల జపాన్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది గాక వచ్చే పదేళ్లలో రెట్టింపు జపనీస్ కంపెనీలను, 10 ట్రిలియన్ల జపనీస్ యెన్ పెట్టుబడులను (మారకం విలువ 1 రూపాయికి 1.69 యెన్లు) ఆకర్షించటం లక్ష్యమన్నారు. ఇండియాలో ఇప్పటికే 1,400కు పైగా జపాన్ కంపెనీలు, 5,000కు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ సంఖ్యలు రెట్టింపు కావటం ఎట్లున్నా, ఇరువురు ప్రధానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులలో ఎంత విస్తరిస్తే అంత మేలు కలుగుతుంది. అదే సమయంలో భారత ప్రభుత్వంపై కొన్ని పెద్ద బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సాలీనా ఎగుమతి దిగుమతుల విలువ 27 బిలియన్ డాలర్ల మేర ఉంది. అది సంతృప్తి కరమైనదే. కానీ, ఇండియా ఎగుమతులు కేవలం 6 బిలియన్లు, దిగుమతులు 21 బిలియన్లు (మూడున్నర రెట్లు) అంటే ఆ వివరాలు ఎంత అసంతృప్తికరమైనవో వేరుగా చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పుకోవాలంటే, భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 6వ ర్యాంకుకు చేరినప్పటికీ, సాలీనా వాణిజ్య లోటు 10 బిలియన్ డాలర్లకు మించి ఉంది. జరగాల్సిన కృషిఆర్థిక రంగానికి సంబంధించి జపాన్ ప్రధానితో జరిగిన చర్చలలో చమురు తదితర ఇంధన భద్రతలు, ప్రత్యామ్నాయ ఇంధ నాలు, అరుదైన లోహాలు, ఖనిజాల ప్రస్తావనలు అనివార్యంగా వచ్చాయి. వాటికి అనుబంధంగా ఇండో–పసిఫిక్ సముద్ర మార్గాల ద్వారా స్వేచ్ఛాయుత రవాణాకు అవకాశాలను కల్పించుకోవటం. ఈ నిర్దిష్టమైన అంశాలన్నీ ఇండియా, జపాన్లతో పాటు అన్ని దేశాలలో చర్చలు జరుగుతున్నవే. అయితే ఇవి ఎంత కీలకమైనవో అంత క్లిష్టమైనవి కూడా. వీటి గురించి ఎవరికి వారు అంతర్గత కృషి చేయటం, ఇతరుల సహకారంతో సామరస్య పరిష్కారాలు కనుగొనటం రెండూ అవసరం. ఈ కొత్త పరిస్థితులలో ఆ ప్రయత్నాలు లోగడ కన్నా ఎక్కువగా జరగక తప్పదు. చర్చలలో ప్రస్తావనకు వచ్చిన మరొక కీలకాంశం రక్షణ. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఇండో–పసిఫిక్ ద్వారా సముద్రయానాలు. ఇది రెండు దేశాలకు సంబంధించినది. రెండు, ఈ మార్గాలలో, అంతకన్నా ఎక్కువగా పసిఫిక్లో చైనాను కట్టడి చేసే విషయం. ఈ విధమైన కట్టడి అవసరం ఇండియాకు పరిమిత స్థాయిలో ఉండగా, జపాన్కు, దానిని తమ సమగ్ర వ్యూహంలో భాగంగా చేసుకున్న అమెరికాకు అపరిమిత స్థాయిలో ఉంది. అమెరికా ఇటీవల ‘క్వాడ్’ ప్రత్యక్ష బాధ్యతల నుంచి నెమ్మదిగా తగ్గుతూ జపాన్, ఆస్ట్రేలియాల బాధ్యతను పెంచుతుండటంతో కొత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ బాధ్యతను తలకెత్తుకున్న తకాయిచీ రక్షణ వ్యయాన్ని పెంచుతూ, పలుదేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ రక్షణ విషయాలైతే ఢిల్లీలో ‘చర్చకు’ వచ్చాయి గానీ, ‘ఒప్పందాలు’ లేకపోవటం ఇండియా విధానాలకు అనుగుణమైనదేనని చెప్పాలి. టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మీ స్నేహం మరిచిపోం.. భారత్పై ఇరాన్ భావోద్వేగ పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు భారత్ ప్రతినిధులు హాజరవడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్ భావోద్వేగ పోస్ట్ చేసింది. భారత సమాజానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఈ కష్టకాలంలో భారత్ చూపిన స్నేహం, సానుభూతి, హృదయపూర్వక గౌరవాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ (ఇరాన్) ఎప్పటికీ మరచిపోదని ఎక్స్ వేదికగా పేర్కొంది.ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియ వేడుకలకు భారత ప్రభుత్వం తరపున బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటాతో బృందం హాజరయి నివాళులర్పించింది. అదే విధంగా వ్యక్తిగతంగా కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీలతో పాటు భారతదేశానికి చెందిన సిక్కు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు కూడా ఇరాన్ దివంగత నేతకు అంజలి ఘటించారు.అయితే దీనిపై భారత్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది.."భారత స్నేహపూర్వక ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు, ముఖ్యంగా భారత్ తరపున హాజరైన అధికారిక ప్రతినిధి బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇరాన్ అమరవీరుడు, హిస్ ఎమినెన్స్ అయాతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొని నివాళులర్పించినందుకు ధన్యవాదాలు." అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది."ఈ జాతీయ శోక సమయంలో ఇరాన్ ప్రజలతో భారత్ చూపిన హృదయపూర్వక సంఘీభావం, పరస్పర గౌరవానికి ఇది ఒక బలమైన నిదర్శనం. ఇరాన్ ప్రజలు ఈ స్నేహపూర్వక, సానుభూతితో కూడిన గౌరవపూర్వకమైన సంజ్ఞను ఎప్పటికీ మరచిపోలేరు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య ఉన్న దీర్ఘకాలిక బంధానికి ఇదొక విలువైన నిదర్శనంగా వారు భావిస్తారు. అలాగే ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక విలువైన పునాదిగా నిలుస్తుంది." అని పోస్ట్ చేసిందిఅలీ ఖమేనీ అంత్యక్రియలుఇరాన్ ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ 'ప్రెస్ టీవీ' నివేదిక ప్రకారం.. అలీ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపు సోమవారం ఉదయం టెహ్రాన్లో ప్రారంభమైంది. ఈ ఊరేగింపు దాదాపు 10 నుండి 12 గంటల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఆ దేశ ఆధునిక చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద ప్రజా ప్రదర్శన (సమీకరణ) కానుంది. A tribute that amazed the whole world.. The Iranian Ummah paints a historical picture at the funeral of the martyred Imam Leader Khamenei.PS: NOT AI #Iran pic.twitter.com/3MJLyTayGX— Zeinab Al Saffar | زينـــب الصفّـــار (@ZeinabSaffar) July 6, 2026 -
అందుకే పాక్ ఆ పరిస్థితిలో ఉంది: భారత్
ఢిల్లీ: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్కు మతి భ్రమించిందని భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసిఫ్ ఏ పనీలేక తనకు అవగాహన లేని విషయాలపై పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తి రక్షణ మంత్రిగా కొనసాగడం వల్లే పాక్ ప్రస్తుత ఆ పరిస్థితుల్లో ఉందని చురకలు వేసింది.ద్వీపదేశం సెషల్స్ కొత్తగా ఏర్పాటు చేసిన ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజాన్’ను ఇటీవల ప్రధాని మోదీకి ఇచ్చి గౌరవించిన విషయం తెలిసిందే. దీనిపై ఆసిఫ్ ‘అది అడిగి తెచ్చుకున్న కృత్రిమ గుర్తింపు’ అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసూయ మహాచెడ్డదని, ఇతరులను ద్వేషించే వారికి ఇది ఎక్కువగా ఉంటుందని ఎద్దేవా చేసింది.గత వారం సెషల్స్ దేశంలో ప్రధాని మోదీ పర్యటించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రధాని మోదీ చూపుతున్న నిబద్ధతకు, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లటానికి ఆయన చేస్తున్న కృషికిగాను ప్రస్తుత సెషల్స్ ప్రభుత్వం ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. -
రుతుపవనాలు ఉధృతం.. పలు నగరాలు అతలాకుతలం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉధృత రూపం దాల్చాయి. ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబైలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగగా.. కేరళ, ఒడిశా రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.ముంబైలో శనివారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురవడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వే కార్యకలాపాలను గంటపాటు నిలిపివేశారు. దీనివల్ల విమానాల రాకపోకల్లో సగటున 30 నుంచి 75 నిమిషాల ఆలస్యం చోటుచేసుకుంది. నగరంలో 24 గంటల్లో గరిష్టంగా 200 నుంచి 300 మి.మీ వర్షపాతం నమోదైంది.మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఒడిశాలోని అన్ని జిల్లాలను యంత్రాంగం అప్రమత్తం చేసింది. కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కన్నూర్, కాసరగోడ్ సహా పలు ఉత్తర జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ప్రకటించారు. వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. జాతీయ రాజధాని ఢిల్లీ, జార్ఖండ్లలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.ఇది కూడా చదవండి: ‘కలల నగరం’ కథలే వేరు.. -
భారత్పై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వాఖ్యలు
ఇజ్రాయెల్కు అమెరికా మాత్రమే ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అంటూ యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు. అమెరికాకు ఆవల కూడా భారత్ సహా ఇతర దేశాల మద్దతు ఇజ్రాయెల్కు ఉందన్నారు. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు, ఇరాన్-అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం.. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.వాన్స్ చేసిన వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందిస్తూ.. తమకు అనేక దేశాల అండ ఉందని.. వాటిలో చిన్న దేశమైన ఇండియా కూడా ఉందన్నారు. అక్కడ 140 కోట్ల జనాభా ఉంది. అక్కడ మాకు ఎంతటి అపారమైన మద్దతు ఉందో తెలుసా" అంటూ ఆయయన వ్యాఖ్యానించారు. అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ వాన్స్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని నెతన్యాహు చెప్పారు. ఆయనకు నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అంతమాత్రాన ఆయన చెప్పే ప్రతిదానితో నేను ఏకీభవిస్తానని కాదు. అలాగే వైట్హౌస్లో తమకు లభించిన అత్యంత గొప్ప స్నేహితుడని.. తాను భావించే ప్రెసిడెంట్ ట్రంప్కు, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.నెలల తరబడి సాగుతున్న ఘర్షణలను ముగించడానికి, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి విస్తృత ప్రాంతీయ చర్చలు కోసమే ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని రూపొందించినట్లు వాన్స్ సమర్థించుకున్నారు. వాషింగ్టన్ అందిస్తున్న సైనిక మద్దతును ఇజ్రాయెల్ నాయకులకు గుర్తు చేస్తూ, ఇజ్రాయెల్ రక్షణ ఆయుధాలలో మూడింట రెండు వంతులు అమెరికా తయారు చేసిందని వాన్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్కు సమస్య ట్రంప్ కాదు. అమెరికా అధ్యక్షుడే తమ పెద్ద సమస్య అని ఇజ్రాయెల్లో ఎవరైనా భావిస్తే.. వారు వాస్తవ పరిస్థితులను గ్రహించాలి" అంటూ వాన్స్ వ్యాఖ్యానించారు. -
భారత్కు చైనా బిగ్ షాక్.. చేజారిన ‘మోంగ్లా’ డ్రీమ్ ప్రాజెక్ట్!
భారతదేశానికి అత్యంత సమీపంలో సుందరబన్ వనాలకు ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ రెండవ అతిపెద్ద నౌకాశ్రయం ‘మోంగ్లా’ ఇప్పుడు చైనా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ ఇటీవల బీజింగ్లో జరిపిన తొలి అధికారిక పర్యటనలో చైనాతో కుదుర్చుకున్న ఒక ‘అవగాహనా ఒప్పందం’ సరిహద్దుల్లో సరికొత్త వ్యూహాత్మక ఉత్కంఠకు తెరలేపింది. ‘చైనా-బంగ్లాదేశ్ మోంగ్లా పోర్ట్ ఎకనామిక్ జోన్’ అభివృద్ధి కోసం చైనా ప్రభుత్వ రంగానికి చెందిన ‘చైనా సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్’తో ఈ ఒప్పందం కుదిరింది. గతంలో భారత్ దక్కించుకున్న ప్రాజెక్టును కాదని, బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకోవడం భారత రక్షణ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.చేజారిన భారత్ డ్రీమ్ ప్రాజెక్ట్2015లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢాకా పర్యటన సందర్భంగా ఈ మోంగ్లా పోర్ట్ పరిధిలోని 110 ఎకరాల భూమిలో ప్రత్యేక ఆర్థిక మండలి (ఎకనామిక్ జోన్) అభివృద్ధి చేసేందుకు ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. అప్పట్లో షేక్ హసీనా ప్రభుత్వం భారత్కు ఈ ప్రాజెక్టును కేటాయించింది. దీనికోసం భారత్ భారీగా రుణ సహాయం (లైన్ ఆఫ్ క్రెడిట్) అందించడమే కాకుండా, రవాణా సులభతరం చేయడానికి మోంగ్లా పోర్ట్ నుంచి ఖుల్నా వరకు సరికొత్త రైల్వే లైన్ను కూడా నిర్మించింది. అయితే, 2024లో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న రాజకీయ తిరుగుబాటు, షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత సమీకరణలు వేగంగా మారిపోయాయి.చైనాకు దక్కిన సువర్ణావకాశంభారత డెవలపర్ అయిన హీరానందానీ గ్రూప్ నిర్ణీత గడువులోగా పనులు ప్రారంభించలేకపోయిందనే కారణాన్ని చూపుతూ, 2025లో బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నుంచి భారత్ను తొలగించింది. భారత్ తప్పుకున్న తరుణం కోసమే ఎదురుచూసిన చైనా, తారిఖ్ రెహమాన్ నూతన ప్రభుత్వం రాగానే ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు చైనా ప్రభుత్వ సంస్థ ఇదే 110 ఎకరాల భూమిలో ‘చైనీస్ ఎకనామిక్ జోన్’ నిర్మించనుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, టెలికాం మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లతో పాటు భారీ లాజిస్టిక్స్ గోదాములను చైనా ఏర్పాటు చేయబోతోంది.భారత్కు తగిలిన డబుల్ స్ట్రోక్ఈ రేవు పట్టణం కేవలం బంగ్లాదేశ్కే కాకుండా భారత ఈశాన్య రాష్ట్రాలు (నార్త్-ఈస్ట్ స్టేట్స్), నేపాల్, భూటాన్ దేశాల వాణిజ్యానికి ఒక వ్యూహాత్మక హబ్గా మారే సత్తా ఉన్నది. 2024 మే నెలలో ‘ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్’ ద్వారా మోంగ్లా పోర్ట్ టెర్మినల్ నిర్వహణ హక్కులను భారత్ సాధించి బెంగాల్ ఖాళీలో చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ చైనా ఆర్థిక, పారిశ్రామిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తుండటంతో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతాకు ఇంత దగ్గరగా చైనా రావడం భారత తీరప్రాంత భద్రతకు పెను సవాలుగా మారనుంది.గూఢచర్యమే అతిపెద్ద ముప్పుఈ ప్రాజెక్టును చైనా కేవలం వాణిజ్యపరమైనదని చెబుతున్నప్పటికీ, రక్షణ నిపుణుల విశ్లేషణల ప్రకారం ఇది తీవ్రమైన నిఘా ముప్పును తెచ్చిపెట్టనుంది. గతంలో శ్రీలంకలోని హంబన్తోట, పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టులను కూడా చైనా ఇలాగే వాణిజ్య అవసరాల కోసమని చెప్పి, ఆ తర్వాత తన నౌకాదళ యుద్ధ నౌకలను, జలాంతర్గాములను (సబ్మెరైన్లను) మొహరించడానికి ఉపయోగించుకుంది. ఇప్పుడు మోంగ్లా పోర్ట్ ద్వారా భారత నౌకాదళ (ఇండియన్ నేవీ) కదలికలపై నిఘా ఉంచడానికి, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడానికి చైనా దీనిని ఒక గూఢచర్య కేంద్రంగా మార్చే ప్రమాదం ఉంది.సిలిగురి కారిడార్కూ సెక్యూరిటీ థ్రెట్బంగ్లాదేశ్ ప్రధానమంత్రి చైనా పర్యటనలో కేవలం మోంగ్లా పోర్ట్ మాత్రమే కాకుండా, తీస్తా నది నిర్వహణ ప్రాజెక్టులోనూ చైనా సహకారాన్ని కోరడం భారత్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తీస్తా నది ప్రాంతం భారతదేశానికి అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన ‘సిలిగురి కారిడార్’ (చికెన్స్ నెక్) కు అతి సమీపంలో ఉంటుంది. ఈ కారిడార్ దేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుంది. దీనికి తోడు బంగ్లాదేశ్-చైనా దేశాలు విదేశీ, రక్షణ వ్యవహారాలను సమన్వయం చేసుకునేందుకు '2+2 డైలాగ్' ప్రారంభించాలని నిర్ణయించడం బంగ్లాదేశ్ పూర్తిగా చైనా వైపు మొగ్గు చూపుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ వ్యూహం ఉచ్చుభారతదేశాన్ని సముద్ర మార్గాల్లో చుట్టుముట్టేందుకు చైనా ఎప్పటినుంచో వ్యూహాత్మక ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ (ముత్యాల హారం) విధానాన్ని అమలు చేస్తోంది. దీని కింద ఇప్పటికే హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దాదాపు 17 పోర్ట్ ప్రాజెక్టులలో చైనా భాగస్వామ్యం వహిస్తోంది. ఇప్పుడు అందులోకి బంగ్లాదేశ్కు చెందిన వ్యూహాత్మక మోంగ్లా పోర్ట్ కూడా చేరిపోవడంతో, భారత్ను తూర్పు వైపు నుంచి కూడా ఒత్తిడిలోకి నెట్టడానికి చైనాకు ఒక బలమైన స్థావరం దొరికినట్లయింది. భౌగోళిక రాజకీయాల పరంగా ఇది బంగాళాఖాతంలో భారత ఆధిపత్యానికి పెను సవాలుగా నిలవనుంది.ఇది కూడా చదవండి: తరం మారినా.. ముంబై వాన పాట మారలేదు! -
నేరేడులో మనమే టాప్
నేరేడు పండును జంబూఫలం అంటారు. నేరేడు వల్లనే మన భారతదేశానికి జంబూద్వీపం అనే పేరు వచ్చింది. ఇప్పటికీ శుభకార్యాలు, పూజాదికాలలో సంకల్పం చెప్పేటప్పుడు ‘జంబూద్వీపే భరతవర్షే భరతఖండే’ అని చెబుతుంటారు. నేరేడు పండు భారత ఉపఖండ ప్రాంతంలో విస్తారంగా పండుతుంది. వేసవి చివరి రోజుల నుంచి వర్షాకాలం వరకు విరివిగా దొరుకుతుంది.‘జంబూఫలం’ అనే పేరు నుంచే హిందీలో దీనికి ‘జామున్’ అనే పేరు వచ్చింది. పురాతన కాలంలోనే కాదు, ఇప్పటికీ నేరేడు ఉత్పాదనలో మన దేశమే అగ్రస్థానంలో కొనసాగుతోంది. నేరేడు ఉత్పాదనలో తొలి పది దేశాల గణాంకాలు చూద్దాం...నేరేడులోని పోషకాలునేరేడును మధుమేహానికి విరుగుడుగా ఉపయోగిస్తారు. నేరేడు రసంతోను, నేరేడు గింజలతోనూ మధుమేహాన్ని అదుపు చేసే ఔషధాలు తయారవుతాయి. నేరేడు సహజసిద్ధంగా దొరికే పోషకఫలం. ఇందులోని పోషకాల వివరాలు తెలుసుకుందాం...నేరేడు ఉత్పాదనలోనే కాకుండా, నేరేడు ఎగుమతుల్లోనూ మన భారతదేశం అగ్రగామిగా కొనసాగుతోంది. నేరేడు ఎక్కువకాలం నిల్వ ఉండే పండు కాదు. అందువల్ల ‘ఇతర తాజాపండ్లు’ కేటగిరీ కింద వీటి ఎగుమతికి పరిమిత అవకాశాలు మాత్రమే ఉంటున్నాయి. నేరేడు వార్షిక ఎగుమతుల్లో టాప్–10 దేశాలు గణాంకాల్లో చూద్దాం... -
జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు శనివారం వెల్లడించారు."భారత ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలిపారు" అని ఆయన ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.On the recommendation of the Govt of India, Hon’ble President, Smt. Droupadi Murmu ji has approved the summoning of both the Houses of Parliament for the Monsoon Session 2026.The Session will commence on 20 July, 2026 and continue till 13 August, 2026 for meaningful debate,… pic.twitter.com/TaEYH4F1cK— Kiren Rijiju (@KirenRijiju) July 4, 2026ఇదిలా ఉండగా, వివాదాస్పదమైన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) జూలై 17న తన నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులు అరెస్టై వరుసగా 30 రోజుల పాటు న్యాయస్థాన కస్టడీలో ఉంటే, వారు ఆటోమేటిక్గా పదవిని కోల్పోవాలనే నిబంధనను యథాతథంగా ఉంచే సూచనలు కనిపిస్తున్నాయి.జూలై 17న మరోసారి కమిటీ సమావేశం జరగనుంది. చర్చల సమయంలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, వివాదాస్పద నిబంధనను తొలగించాలని కమిటీ సిఫారసు చేసే అవకాశం కనిపించడం లేదు. అయితే రాజకీయ కక్ష సాధింపు లేదా ఉద్దేశపూర్వక కేసుల పేరిట ఈ నిబంధనను దుర్వినియోగం చేయకుండా రక్షణ చర్యలను నివేదికలో చేర్చే అవకాశం ఉంది.ఈ ప్రతిపాదిత సవరణపై తీవ్ర రాజకీయ చర్చ సాగింది. దీనికి మద్దతు ఇస్తున్న వారు ప్రజాప్రతినిధుల జవాబుదారీతనం పెరుగుతుందని వాదిస్తున్నారు. మరోవైపు, ప్రతిపక్షం మాత్రం రాజకీయ ప్రేరేపిత దర్యాప్తులు, అరెస్టుల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.జూలై 17న జరిగే సమావేశంలో జేపీసీ తన నివేదికను ఖరారు చేసి ఆమోదించిన తర్వాత పార్లమెంటుకు సమర్పించనుంది. అటు, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనికుల ప్రాణనష్టంపై సభను తప్పుదోవ పట్టించేలా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ "స్పష్టమైన అబద్ధం చెప్పారు" అని కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో, ఆయనపై ప్రత్యేక హక్కుల ఉల్లంఘన చర్యల అంశాన్ని కూడా ప్రతిపక్షం పార్లమెంటులో ప్రస్తావించే అవకాశం ఉంది. -
యూఎస్లో రూ. 85 వేల టాబ్లెట్, ఇండియాలో రూ.35లకే
భారతదేశం, అమెరికా మధ్య వైద్య ఖర్చుల్లో తేడాలపై గతంలో అనేక కథనాలు చూశాం. తాజాగా ఒక అమెరికన్ మహిళ మరో ఇంట్రస్టింగ్ స్టోరీని పోస్ట్ చేశారు. ఇండియా, యూఎస్లోని వైద్య ధరల మధ్య భారీ వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ అమెరికాలో తమని దోచుకుంటున్నారంటూ ఆమె పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.వైరల్ వీడియో విశేషాలు'లిజ్' అనే అమెరికన్ మహిళ "ఇండియన్ వర్సెస్ అమెరికన్ హెల్త్కేర్" అనే టైటిల్తో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అమెరికాతో పోలిస్తే భారతదేశంలో వైద్య ఖర్చులు చాలా తక్కువని, అమెరికాలో ప్రజలను 'దోచుకుంటున్నారని' ఆరోపించింది. ఇందుకు 'రెవ్లిమిడ్' (Revlimid) అనే టాబ్లెట్ ధరను ఆమె ఉదాహరణగా చూపింది.తన అత్తగారి బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు వాడే టాబ్లెట్ ధర అమెరికాay 900 డాలర్లు (సుమారు రూ. 85,000) ఉండగా, భారతదేశంలో దీని జెనరిక్ ప్రత్యామ్నాయం కేవలం 30 సెంట్ల నుండి 3 డాలర్ల (రూ. 35 నుండి రూ. 300) లోపే లభిస్తోందని వెల్లడించింది. ఈ వీడియోకు ఇప్పటికే దాదాపు 8 లక్షల వ్యూస్ వచ్చాయి. భారతదేశంలోని చౌకైన వైద్య విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అలాగే ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత క్యాన్సర్ చికిత్స కూడా అందుబాటులో ఉందని ఒక యూజర్ పేర్కొనగా, అమెరికన్లు భారత్కు వచ్చి మందులు కొనుగోలు చేసినా ప్రయాణ ఖర్చులు పోను డబ్బులు మిగులు తాయని మరొకరు కామెంట్ చేశారు.ఇదీ చదవండి: కేతన్ హత్య : కోడ్వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’ View this post on Instagram A post shared by Liz & Shiv (@spicygori)గత నెలలో 'విక్టోరియా' అనే మరో అమెరికన్ మహిళ కూడా యూఎస్ హెల్త్కేర్ సిస్టమ్ను ఒక "స్కామ్" అని అభివర్ణించింది. అమెరికాలో ఆమెకు అత్యవసరమైన మందును ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయకపోవడంతో, అక్కడ వెయ్య డాలర్లు పలికే ఆ మందును, ఇండియాలోని తయారీదారు నుండి నేరుగా కేవలం 25 డాలర్లకే కొనుగోలు చేయగలిగింది. అమెరికాలో సామాన్య ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారని, ఇంత భారీ మొత్తంలో అదనపు డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ఆమె ప్రశ్నించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్! -
ఇంగ్లాండ్ తో పోరుకు సిద్ధమైన భారత్
-
ఇరాన్లో భావోద్వేగ దృశ్యాలు.. ఖమేనీకి కన్నీటి నివాళి
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తుదివీడ్కోలు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్రాండ్ మోసల్లా ప్రాంగణం కన్నీళ్లు, నినాదాలు, సంతాప సందేశాలతో శోకసంద్రంగా మారింది. ప్రార్థన మందిరం వద్ద నిశ్శబ్దం అలుముకోగా.. ఖమేనీ పార్థివదేహం రాకతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి.ఖమేనీ భౌతికకాయాన్ని జాతీయ జెండాతో కప్పి ప్రాంగణానికి తీసుకురాగా, ఆయన తలపై ఉండే నల్ల టర్బన్ను కూడా సంప్రదాయంగా ఉంచారు. కుటుంబ సభ్యుల పార్థివదేహాలను ప్రత్యేక పేటికల్లో ఆయన పక్కపక్కనే ఉంచారు. ఈ క్రమంలో అత్యంత భావోద్వేగ దృశ్యంగా ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మది గోల్పాయెగాని చిన్న శవపేటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. జాతీయ జెండాతో కప్పిన ఆ చిన్న పేటిక పక్కనే ఆమె ఫోటోను ఉంచడంతో అక్కడున్నవారు తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సహా పలువురు ఉన్నతాధికారులు భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు.Un cadre du cercueil de la martyre Zahra Mohammadi Golpayegani, #petite-fille du Guide suprême martyr de la Révolution islamique, à la Mosalla de #Téhéran.#بدرقه_آقای_شهید_ایران#باید_برخاست#NousDevonsNousSoulever#MartyrKhamenei pic.twitter.com/8JemW4zW4A— Iran en France (@IRANinFRANCE) July 3, 2026ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అప్పటి నుంచి భద్రపరచిన భౌతికకాయాన్ని ఇప్పుడు ఆరు రోజుల పాటు జరిగే సంతాప కార్యక్రమాల కోసం ప్రజల సందర్శనార్థం ఉంచారు.టెహ్రాన్లోని గ్రాండ్ మోసల్లా వద్దకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గేట్లు తెరవగానే భారీ జనసంద్రం లోపలికి ప్రవేశించింది. అమెరికాకు వ్యతిరేక నినాదాలతో పాటు ప్రతీకారాన్ని సూచించే ఎరుపు రంగు జెండాలు ప్రదర్శించారు. మరోవైపు.. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హతమార్చాలని, అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని’’ వేలమంది నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.ఈ సంతాప కార్యక్రమానికి దాదాపు 100 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైనట్లు సమాచారం. భారత్ సహా రష్యా, పాకిస్థాన్, టర్కీ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం రెండు కోట్ల మంది వివిధ దశల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని అంచనా వేశారు. అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఖమేనీ భౌతికకాయం టెహ్రాన్లో సోమవారం వరకు ఉంచి, అనంతరం ఖోమ్కు తరలించనున్నారు. మంగళవారం కర్బలా, నజాఫ్ వంటి పవిత్ర నగరాల మీదుగా ప్రయాణించి, చివరగా గురువారం ఆయన స్వస్థలమైన మష్హద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఆరు రోజుల సంతాప యాత్రతో ఇరాన్ అంతటా శోక వాతావరణం కొనసాగుతోంది. Mohammad Bagher Ghalibaf cries during the farewell ceremony of Ali Khamenei. pic.twitter.com/i4DC5OgM2y— Raz Zimmt (@RZimmt) July 3, 2026 -
పాకిస్తాన్కు బిగ్ ఝలక్..
న్యూఢిల్లీ: సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ పాకిస్తాన్ను నేరుగా, నిర్మొహమాటంగా విమర్శించారు. అమెరికా-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం పాకిస్తాన్ ప్రపంచ ప్రతిష్టను పెంచవచ్చేమో, కానీ.. దేశంలో అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించలేదన్నారు. కౌసికన్ సూటిగా పాక్ వైఫల్యం అంచున ఉన్న దేశమన్నారు. పాకిస్తాన్ సమస్య భారత్, ఆఫ్ఘనిస్థాన్ కాదని, దాని సొంత రాజకీయ నాయకులు, సైన్యమేనని స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందని ఒక ప్రపంచ సదస్సులో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా కౌసికన్..‘పాకిస్తాన్ దౌత్యపరమైన ఎత్తుగడలను బాగా వేసి ఉండవచ్చు, కానీ అది దేశ ప్రజలకు అన్నం పెట్టదని నొక్కి చెప్పారు. ఒక దౌత్యపరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పాకిస్తాన్ చాలా చురుకుగా, చాలా విజయవంతంగా వ్యవహరించిందని, అమెరికా దృష్టిలో దౌత్యపరంగా పాకిస్తాన్ను పునరుద్ధరించడానికి అది కొంతవరకు దోహదపడిందని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించడానికి అది పెద్దగా ఏమీ చేయలేదన్నారు. తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మొదటి 10 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. పాక్ ఇటీవలి దౌత్య విజయాలు దీర్ఘకాలంలో అమెరికాతో దాని సంబంధాలను మారుస్తాయన్న అంచనాలపైనా ఆయన నీళ్లు చల్లారు. పాక్పై విధించిన ఆంక్షలన్నింటినీ అమెరికా ఎప్పటికీ ఎత్తివేయదని స్పష్టం చేశారు. భౌగోళిక కారణాలు సాకు మాత్రమే... భారత్, ఆఫ్ఘనిస్థాన్లతో ఉన్న సరిహద్దుల వల్లే పాకిస్తాన్ సమస్యలు ఎదుర్కొంటోందన్న ఓ పాక్ జర్నలిస్ట్ అభిప్రాయాన్ని ఆయన తిప్పికొట్టారు. ‘‘ప్రతిదానికీ భౌగోళిక స్థానాన్ని కారణంగా చూపలేరు. అది కేవలం ఒక సాకు మాత్రమే. ఆ సంక్షోభం పాక్ రాజకీయ నాయకులు, సైన్యం సృష్టించుకున్నదే’’ కౌసికన్ పేర్కొన్నారు. ప్రారంభం నుంచీ పాక్లో పాలన దారుణంగా ఉంది. నాకు ఎలాంటి పరిష్కారం కనిపించడం లేదు. అక్కడి రాజకీయ నాయకులు, పారీ్టలు వృధా. ఈ సమస్యలో సైన్యం కూడా పెద్ద భాగంగా ఉంది’’ అని ఆయన అన్నారు. పాకిస్తాన్ స్వతంత్ర చరిత్రలో దాదాపు సగం కాలం పాటు సైన్యం పాలనలోనే ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యకలాపాలపై సైన్యం ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కౌసికన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
వైభవ్కు చాన్స్ దక్కేనా!
మాంచెస్టర్: ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో ఇంకా గెలుపు బోణీ చేయని భారత జట్టు మరో పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే రెండో టి20లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. వర్షంతో రద్దయిన గత మ్యాచ్లో భారత్ 189 పరుగులు చేసినా... ఇంకా అంచనాలకు తగిన రీతిలో ఆడలేదనేది వాస్తవం. ఆరంభంలో జట్టు 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. సామ్సన్, ఇషాన్ కిషన్ వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమయ్యారు. అయినా సరే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై భారత్ ఇంకా ఆలోచిస్తూనే ఉంది. తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చంటూ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే టీమ్ మేనేజ్మెంట్ వైభవ్ విషయంలో నిర్ణయం తీసుకోలేదని అర్థమవుతోంది. అయితే నాయకుడిగా వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ కెపె్టన్సీతో పాటు జట్టులో స్థానం కూడా కోల్పోయిన స్థితిని బట్టి చూస్తే సామ్సన్ ఇంకా ఎంతో కాలం తన వరల్డ్ కప్ మెరుపులతోనే జట్టులో కొనసాగలేడు. కాబట్టి కచ్చితంగా బాగా ఆడాల్సిన స్థితిలో అతను నిలిచాడు. మరోవైపు అభిషేక్ శర్మ ఫామ్ జట్టుకు సానుకూలాంశం. ఇంగ్లండ్పై ఆడిన గత ఏడు మ్యాచ్లలో 220 స్ట్రయిక్రేట్తో అభిషేక్ శర్మ 3 అర్ధసెంచరీలు చేయడం ఈ జట్టుపై అతని జోరుకు ఉదాహరణ. కెపె్టన్ శ్రేయస్ అర్ధ సెంచరీ చేసినా అతని బ్యాటింగ్లో తగిన ధాటి కనిపించలేదు. ఆసియా కప్ ఫైనల్ తర్వాత తనదంటూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని తిలక్ వర్మపై రాణించాల్సిన ఒత్తిడి ఉందనేది వాస్తవం. గత మ్యాచ్లో ఎవరికీ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు కాబట్టి బౌలర్ల బృందంలోనూ ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.మరోవైపు ఆర్చర్ రాకతో ఇంగ్లండ్ పేస్ పదును పెరిగింది. జోష్ టంగ్ కూడా ఈ మ్యాచ్తో టి20ల్లో అరంగేట్రం చేయనున్నాడు. మహమూద్, ల్యూక్వుడ్ స్థానాల్లో వీరిద్దరు బరిలోకి దిగుతారు. బట్లర్, బ్రూక్, బెతెల్, జాక్స్లతో పదునైన బ్యాటింగ్ లైనప్ జట్టు సొంతం. ఫిల్ సాల్ట్ తన సొంత స్టేడియంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. ఓల్డ్ట్రఫోర్డ్ మైదానంలో అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు కూడా బాగా ప్రభావం చూపగలరు. అయితే మంచి బౌన్స్తో చక్కటి షాట్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. గత ఏడాది ఇక్కడి పిచ్పై దక్షిణాఫ్రికాతో జరిగిన టి20లో ఇంగ్లండ్ 300కు పైగా స్కోరు నమోదు చేసింది. -
పతకాలు గెలిచే వారినే పంపించాలి
న్యూఢిల్లీ: అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే వారికే అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు జరగనున్నాయి. వేర్వేరు క్రీడాంశాల్లో ఇప్పటికే పలువురు క్రీడాకారులకు ఏషియన్ గేమ్స్కు అర్హత సాధించారు. అయితే కేవలం ‘పార్టిసిపేషన్ సర్టిఫికెట్’ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకునే లాంటి వారిని కాకుండా... దేశం కోసం పతకం గెలవగల సత్తా ఉన్నవాళ్లనే ఆసియా క్రీడలకు పంపుతామని మాండవీయ స్పష్టం చేశారు. ‘ఆసియా క్రీడలు కేవలం ప్రచార యాత్ర కాదు. అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచేందుకు చక్కటి వేదిక. అత్యుత్తమ ఆటతీరు కనబర్చగలిగే వారు మాత్రమే ఏషియన్ గేమ్స్కు వెళ్తారు. కేవలం సంఖ్యను భర్తీ చేసేందుకు వచ్చేవారికి అనుమతి ఇవ్వబోం. దేశం నుంచి 600 మందిని మాత్రమే ఆసియా క్రీడలకు పంపాలనుకుంటున్నాం. అంతర్జాతీయ అనుభవం సాధించేందుకు, ఆ సాకుతో ఉద్యోగాలు పొందేందుకు ఆసియా క్రీడలు వేదిక కాకూడదు’ అని మాండవీయ వెల్లడించారు. ఆసియా క్రీడల ఎంపిక ప్రక్రియలో భాగంగా గతేడాదే కేంద్ర క్రీడా శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఏ క్రీడాంశంలోనైనా పతకం గెలవగల వాళ్లనే ఎంపిక చేయాలని క్రీడా సమాఖ్యలకు సూచించింది. ఎంపిక ప్రక్రియను వీడియో రూపంలో చిత్రించి పొందుపరచాలని ఆదేశించింది. ‘జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు గతంలో మార్గదర్శకాలు పంపాం. సిఫార్సు చేసిన ఆటగాళ్ల జాబితాను భారత ఒలింపిక్ సంఘానికి పంపాలని సూచించాం. ఆ పేర్లను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పరిశీలిస్తుంది. ఆ తర్వాతే క్రీడా శాఖ అమోదం తెలుపుతుంది. గతంలో మాదిరిగా సమాఖ్యలు ఇష్టానుసారంగా వ్యవహరించే పద్ధతికి ఈ సారి స్వస్తి పలికాం’ అని మాండవీయా తెలిపారు. అనూశ్ అగర్వాలాకు అవకాశం! ఇప్పటికే దేశంలోని పలు క్రీడా సమాఖ్యలు... ఆసియా క్రీడలకు ఎంపికైన ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రయల్స్ అనంతరం జాతీయ క్రీడా సమాఖ్యలు విడుదల చేసే జాబితాలు... ఫెడరేషన్ అంతర్గత ఎంపిక ప్రక్రియ నుంచి సిఫార్సు చేసిన జాబితాగా మాత్రమే పరిగణిస్తాం. దాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లు కాదు. వాటిని పరిశీలించిన అనంతరం క్రీడా శాఖ అంగీకారం తెలిపిన అథ్లెట్లు, కోచ్లు, సహాయక సిబ్బంది మాత్రమే ఆసియా క్రీడల్లో పాల్గొంటారు’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక మరోవైపు ఈక్వేస్ట్రియన్ అనూశ్ అగర్వాలాను ఆసియా క్రీడలకు ఎంపిక చేయకపోవడంపై కూడా క్రీడా శాఖ పునరాలోచనలో పడింది. అనూశ్ను ఆసియా క్రీడల జట్టు నుంచి తొలగించాలని భారత ఈక్వేస్ట్రియన్ సమాఖ్య తాత్కాలిక కమిటీ నిర్ణయించగా... దీనిపై అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కనీస అర్హత ప్రమాణాలు పాటించకుండా... సెలెక్షన్ కమిటీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని అగర్వాలా ఆరోపించారు. ఈ నేపథ్యంలో అనూశ్కు ఆసియా క్రీడల్లో అవకాశం దక్కొచ్చని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు సెలెక్షన్ ప్రక్రియపై తొలుత ప్రశ్నలు లేవనెత్తి ఆ తర్వాత వెనక్కి తగ్గిన స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా అంశాన్ని మాత్రం క్రీడా శాఖ పరిగణించలేదు. -
పాక్ హెచ్చరికలను తిప్పికొట్టిన భారత్
ఢిల్లీ: పాక్ బెదిరింపుల వేళ.. సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదని పాకిస్థాన్కు భారత్ తెగేసి చెప్పింది. సింధు జలాల ఒప్పందంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ.. పొరుగు దేశం.. ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి చెప్పేంత వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత్ తేల్చి చెప్పింది. ఒప్పందం ఇప్పటికీ అమలులోనే ఉందని.. నీళ్లను ఆయుధంగా మార్చవద్దంటూ పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సహా ఇతర మంత్రులు చేసిన హెచ్చరికలను భారత్ తిప్పికొట్టింది.గత ఏడాది (2025) ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన తర్వాతే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, నాటి నుంచి పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు అబద్ధాలు చెప్తోంది. సరిహద్దు నదులను పంచుకునే ఇతర దేశాలకు భారత్ నిర్ణయం ఒక ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి సమాధానంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నేడు పాకిస్తాన్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపనంత వరకు ఏదీ మారదని తేల్చిచెప్పింది.సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి స్థిరంగా ఉంది. పాకిస్తాన్ నిరంతరం సాగిస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఈ ఒప్పందం ప్రస్తుతం నిలిపివేయబడింది. పాకిస్తాన్ నమ్మదగిన విధంగా శాశ్వతంగా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలంటూ రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదానికి సురక్షిత స్థావరంగా మారిన పాకిస్తాన్, సింధు జలాల విషయంలో తానే తవ్వుకున్న గోతిలో పడి విలవిలలాడుతోందని.. కానీ ఆ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న ఈ దేశం, ఇప్పటికీ భారత్పై, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్పై దాడులు చేయడానికి ఉగ్రవాదులకు తన భూభాగాన్ని వాడుకునేలా అనుమతిస్తూనే ఉంది’’ అంటూ రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు.1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చెనాబ్ నదుల జలాల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని చెబుతున్న భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
భారత్ vs అమెరికా: భారీ ధర తేడాపై చర్చ!
సోషల్ మీడియాలో ఒక అమెరికన్ మహిళ షేర్ చేసిన వీడియో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె భారత్ vs అమెరికా మధ్య ఆరోగ్య సేవల ఖర్చులను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో చర్చకు దారితీశాయి. వీడియోలో ఆమె అమెరికాలో వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయని, అదే సమయంలో భారతదేశంలో మందులు చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయని చెప్పింది.సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో అమెరికన్ మహిళ ఈ విధంగా చెప్పారు. ''మా అత్తకు ఒక రకమైన రక్త క్యాన్సర్ ఉంది. ఆమె రెవ్లిమిడ్ అనే మందు తీసుకుంటుంది. ఈ మాత్ర ధర అమెరికాలో సుమారు 900 డాలర్లు (దాదాపు రూ.85,000), అదే మందు భారత్లో సుమారు 30 సెంట్స్ నుంచి 3 డాలర్ల వరకు (రూ.35-రూ.300 మధ్య) లభిస్తుందని ఆమె వివరించారు''. ధరల మధ్య భారీ తేడా చూసి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆమె వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ కామెంట్లు పెట్టారు. కొందరు అమెరికా ఆరోగ్య వ్యవస్థపై విమర్శలు చేస్తే, మరికొందరు భారత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా తక్కువ ఖర్చుతో చికిత్స అందుతుందని కూడా గుర్తుచేశారు.ఇంకొక అమెరికన్ మహిళ విక్టోరియా కూడా ఇదే తరహా అనుభవాన్ని కొన్ని రోజులకు ముందు పంచుకున్నారు. ఆమె అమెరికా ఆరోగ్య వ్యవస్థను స్కామ్ అని అభివర్ణించారు. అమెరికాలో సుమారు 1000 డాలర్ల ఖరీదైన మందును భారత్లో కేవలం 25 డాలర్లకు కొనుగోలు చేయగలిగానని ఆమె తెలిపారు. అమెరికాలో సాధారణ ప్రజలు భారీ ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని ఆమె వ్యాఖ్యానించింది. View this post on Instagram A post shared by Liz & Shiv (@spicygori) -
పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
-
ఇక సుదృఢ ఆర్థిక బంధం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా భారత్, జపాన్ కీలకమైన కార్యక్రమాలు, ఒప్పందాలను ప్రకటించాయి. ఆర్థిక భాగస్వామ్య చట్రం, సైనిక పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు రక్షణ ఒప్పందం సహా చమురు సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఇంధన సంబంధాలను పెంపొందించే చర్యలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనే తకాయిచీ గురువారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, రక్షణ, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాల్లో భారత్–జపాన్ సంబంధాలపై సమగ్ర సమీక్ష జరిపారు.ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఆర్థిక భద్రత, కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సహకారం, ఇంధన సరఫరా వ్యవస్థలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. ఇండో–పసిఫిక్ పరిస్థితులపై అభిప్రాయాలు పంచుకున్నారు. అక్కడ చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతుండడంపై చర్చించారు. నౌకా నిర్మాణం, విమానయానం, సరుకు రవాణా(లాజిస్టిక్స్) రంగాల్లో సహకారాన్ని సులభతరం చేయడానికి భారత్, జపాన్ ఒక మొబిలిటీ ఫ్రేమ్వర్క్ను ఖరారు చేశాయి. ఆర్థిక భద్రత, క్లీన్ ఎనర్జీ, కీలక సాంకేతికతలు, పరిశోధన–అభివృద్ధిపై ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై ఈ సందర్భంగా సంతకాలు జరిగాయి. భేటీ అనంతరం మోదీ, తకాయిచీ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇండో–పసిఫిక్లో శాంతి, పురోగతికి మార్గం నేటి అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను భారత్, జపాన్ పూర్తిగా అర్థం చేసుకున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్మ్యాప్ రూపొందించామని తెలిపారు. దీనిద్వారా సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వంటి వ్యూహాత్మక రంగాల్లో సప్లై చైన్లను పటిష్టం చేయబోతున్నామని వివరించారు.స్వేచ్ఛాయుతమైన, సుసంపన్నమైన, నియమ–ఆధారిత ఇండో–పసిఫిక్ ప్రాంతం తమ ఉమ్మడి ప్రాధాన్యత అని ఉద్ఘాటించారు. ఈ ప్రాంతంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా ఈ రోజు అనేక కీలకమైన కార్యక్రమాలను ప్రారంభించామని వివరించారు. వీటి ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, పురోగతికి మార్గం సుగమం చేస్తామన్నారు. ఇంధన భద్రత రంగంలో కూడా ఇరుదేశాలు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయని మోదీ పేర్కొన్నారు. భారత్, జపాన్ సంబంధాల పునాది.. రెండు దేశాల మధ్య గత ఏడాది కాలంలో 100కు పైగా కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా భారత్కు జపాన్ నుంచి 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. రాబోయే పదేళ్లలో జపాన్ నుంచి భారత్కు 10 ట్రిలియన్ల జపాన్ యేన్ల పెట్టుబడులను ఆకర్శించడం, భారత్లో జపనీస్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని తేలి్చచెప్పారు. 17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడులు పెట్టుబడులు, ఆవిష్కరణల రంగంలో సహకారం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించడంపై భారత్, జపాన్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయని సనే తకాయిచీ వివరించారు. 17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడుల ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం, జపాన్ సప్లై చైన్లు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడం తన ధ్యేయమని ప్రకటించారు. భవిష్యత్తులో పరస్పర సహకారం, పెట్టుబడుల ద్వారా మన దేశాలను బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. భారత్, జపాన్ సంబంధాలకు 2027లో 75 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి. తకాయిచీ నా చిట్టి చెల్లెలు జపాన్ ప్రధాని తకాయిచీని నరేంద్ర మోదీ తన చిట్టి చెల్లెలుగా అభివర్ణించారు. ఆమె గొప్ప దార్శనిక, ప్రజాదరణ కలిగిన నాయకురాలు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ, తకాయిచీ మీడియాతో మాట్లాడారు. భారత్–జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం భారత్కు తొలిసారిగా విచ్చేసిన తకాయిచీకి స్వాగతం పలకడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని వివరించారు. ఆమె జపాన్లోని నారా ప్రాంతానికి చెందినవారని, ఈ ప్రాంతం భారత్, జపాన్ల ఉమ్మడి బౌద్ధ వారసత్వానికి అత్యంత ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తోందని తెలిపారు.మోదీ తనను చెల్లెలుగా భావిస్తూ సంబోధించడం పట్ల తకాయిచీ ఆనందం వ్యక్తంచేశారు. అన్నాచెల్లెళ్లుగా పనిచేస్తూ భారత్, జపాన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. నిర్దేశించుకున్న ఉమ్మడి లక్ష్యాలను సాధించుకోవాలని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు స్పష్టంచేశారు. భారత్లో తనకు అద్భుతమైన ఆతిథ్యం లభిస్తోందన్నారు. మోదీకి, భారత ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. -
ప్రశ్నించడమూ విద్యలో భాగమే!
నూతన జాతీయ విద్యా విధానం– 2020 దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్న సందర్భంలో భారతీయ విద్యా వ్యవస్థపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. విద్య కేవలం ఉపాధి సాధనమా? లేక సమాజాన్ని రూపుదిద్దే పరివర్తనాత్మక శక్తా? ఒక దేశం తన భావితరాలను ఎలా తీర్చిదిద్దా లనుకుంటుందో ఆ దేశ విద్యా విధానాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అందుకే విద్యా విధానాలు ప్రభుత్వాల పరిపాలనా నిర్ణయాలు మాత్రమే కావు; అవి ఒక సమాజం తన భవిష్యత్తును గురించి చేసుకునే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఎంపికలు కూడా. సమాజ శాస్త్రవేత్త ఎమిల్ డర్కైమ్ దృష్టిలో విద్య అనేది సమాజం తన విలువలను కొత్త తరాలకు సంక్రమింపజేసే ప్రక్రియ. కార్ల్ మార్క్స్ దృష్టిలో విద్య పాలక వర్గాల భావజాలాన్ని బలపరిచే సాధనంగా కూడా మారవచ్చు.జ్ఞాన బదిలీ రూపాలువేట, ఆహార సేకరణ జీవన విధానం నుండి వ్యవసాయ ఆధారిత స్థిర జీవన విధానానికి మారిన తర్వాత జ్ఞాన బదిలీకి వ్యవస్థీకృత రూపాలు అవసరమయ్యాయి. వైదిక సంస్కృతి ప్రభావంతో గురుకుల వ్యవస్థ అభివృద్ధి చెందింది. భారతీయ విద్యా చరిత్రలో ఇది ముఖ్యమైన దశ. ఈ వ్యవస్థ ద్వారా తత్వ విచారణలు, భాషా సంపద అభివృద్ధి చెందినప్పటికీ, దాని సామాజిక పరిమితులను విస్మరించలేం. జ్ఞానాన్ని సామాజిక ఆధిపత్యాన్ని నిలబెట్టే సాధనంగా ఉపయోగించిన చారిత్రక ఉదాహరణగా దీనిని చూడవచ్చు. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించడం భారతీయ విద్యా చరిత్రలో ఒక ప్రజాస్వామ్య మలుపు. గౌతమ బుద్ధుడు పుట్టుక ఆధారంగా వ్యక్తి విలువను నిర్ణయించే భావనను తిరస్కరించాడు. బౌద్ధ సంఘాలు విద్యా కేంద్రాలుగా పనిచేశాయి. నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు అంతర్జా తీయ ఖ్యాతిని సంపాదించాయి.సాధారణంగా క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు విస్తరించిన మధ్యయుగ కాలాన్ని కొందరు చీకటి యుగంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పటికీ, చారిత్రక వాస్త వాలు అంత సరళంగా ఉండవు. ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు ఉత్తర భారతదేశంలో అధికారాన్ని స్థాపించగా, దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం, ఇతర ప్రాంతీయ రాజ్యాలు తమ ప్రభావాన్ని కొనసాగించాయి. విద్య ప్రధానంగా మత సంస్థల ఆధ్వర్యంలో కొనసాగినప్పటికీ, జ్ఞానవ్యాప్తికి కొత్త మార్గాలు కూడా తెరుచుకున్నాయి. మధ్యయుగ భారతదేశంలో విద్య ప్రజలకు చేరువ కావడంలో భక్తి ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ప్రజాభాషలలో సాహిత్య సృష్టి వల్ల జ్ఞానం సంస్కృతం, పర్షియన్ భాషల పరిమితులను దాటి సామాన్య ప్రజలకు చేరువైంది.విద్య ప్రభుత్వ బాధ్యతబ్రిటిష్ పాలనకు ముందు దేశంలో స్థానిక విద్యా సంస్థలు విస్తృతంగా పనిచేశాయని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వీధిబడులు, పాఠశాలలు, గురుకులాలు, మక్తబ్లు ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యను అందించేవి. ధర్మపాల్ తన ప్రసిద్ధ గ్రంథం ‘ద బ్యూటిఫుల్ ట్రీ’లో మద్రాస్ ప్రెసిడెన్సీలో వేలాది స్థానిక పాఠశాలలు పనిచేస్తున్నట్లు బ్రిటిష్ అధికారుల నివేదికలను ఆధారంగా చూపించాడు. అయితే ఈ విద్యా వ్యవస్థలు అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో ఉన్నాయని చెప్పలేం. స్త్రీల విద్య అత్యంత పరిమిత స్థాయిలోనే ఉండేది.1600లో స్థాపించబడిన ఈస్టిండియా కంపెనీ ప్రారంభంలో పూర్తిగా వ్యాపార ప్రయోజనాలకే పరిమితమైంది. ప్లాసీ, బక్సర్ యుద్ధాల అనంతరం రాజకీయ అధికారాన్ని విస్తరించుకున్న కంపె నీకి పరిపాలన కోసం స్థానిక సిబ్బంది అవసరమైంది. 1813 చార్టర్ చట్టం ద్వారా మొదటిసారిగా భారతీయుల విద్యాభివృద్ధికి నిధులు కేటాయించబడ్డాయి. భారతీయుల విద్య పట్ల ప్రభుత్వ బాధ్యతను గుర్తించిన తొలి అధికారిక చర్యగా దీనిని చూడవచ్చు. అయితే థామస్ బాబింగ్టన్ మెకాలే 1835లో సమర్పించిన తన నివేదికలో... రక్తంలో భారతీయులైనా, అభిరుచుల్లో ఆంగ్లేయులుగా ఉండే ఒక మధ్యవర్తి వర్గాన్ని తయారు చేయాలనే వ్యాఖ్య బ్రిటిష్ విద్యా విధాన స్వరూపాన్ని ప్రతిబింబించింది.1854లో వెలువడిన వుడ్స్ డిస్పాచ్ను భారతీయ విద్యకు ‘మాగ్నా కార్టా’గా అభివర్ణిస్తారు. విద్యా పరిపాలనకు వ్యవస్థీకృత రూపాన్ని ఇవ్వడంలో ఈ నివేదిక కీలక పాత్ర పోషించింది. ప్రతి ప్రావిన్స్లో విద్యాశాఖల ఏర్పాటు, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ప్రాథమిక స్థాయిలో స్థానిక భాషలను, ఉన్నత విద్యలో ఆంగ్ల భాషను ఉపయో గించాలని సూచించడం ద్వారా భారతీయ విద్యా నిర్మాణానికి ద్వంద్వ స్వరూపాన్ని కల్పించింది. ఈ సిఫారసుల ఆధారంగా 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఈ దశలో రాజా రామమోహన్ రాయ్ సామాజిక సంస్కరణలకు విద్యే మార్గమని విశ్వసించాడు. జ్యోతిరావు ఫూలే దంపతులు అణగారిన వర్గాల కోసం పాఠశాలల్ని స్థాపించడం ద్వారా విద్యను సామాజిక న్యాయ ఉద్యమంగా మలిచారు. విద్య ప్రాథమిక హక్కుజాతీయోద్యమం నేపథ్యంలో బ్రిటిష్ విద్యా విధానానికి ప్రత్యా మ్నాయంగా జాతీయ విద్యా ఉద్యమం రూపుదిద్దుకుంది. 1906లో బెంగాల్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాపించబడింది. ఈ కాలంలో గోపాలకృష్ణ గోఖలే ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య కోసం చేసిన కృషి గుర్తించదగినది. 1911లో ఇంపీరియల్ లెజి స్లేటివ్ కౌన్సిల్లో ఆయన ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కరించబడినప్ప టికీ, విద్య ప్రతి బాలబాలిక హక్కు కావాలనే భావనను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చింది.ఇరవయ్యవ శతాబ్దంలో రవీంద్రనాథ్ టాగూర్, మహాత్మాగాంధీ, బి.ఆర్. అంబేడ్కర్ వంటి మహనీయుల విద్యా తత్వాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరీక్షల ఒత్తిడితో, యాంత్రిక కంఠస్థంతో, సృజనాత్మకతను అణచివేసే విధానంతో నిజమైన విద్య సాధ్యం కాదని టాగూర్ భావించాడు. చేతి పని, మేధో వికాసం మధ్య సమన్వయం సాధించాలని గాంధీజీ భావించాడు. 1937లో ఆయన ప్రతిపాదించిన ‘నయీ తాలీం’ లేదా ‘బేసిక్ ఎడ్యుకేషన్’ ఈ భావజాలానికి ప్రతిరూపం. అంబేడ్కర్ విద్యకు మరింత విప్లవాత్మక అర్థాన్నిచ్చాడు. ‘అభ్యసించండి, సంఘటితమవండి, పోరాడండి’ అనే ఆయన పిలుపు కేవలం నినాదం కాదు; సామాజిక న్యాయ ఉద్యమానికి మార్గదర్శక సూత్రం. నేడు విద్యపై జరుగుతున్న చర్చలన్నింటికీ ఈ చరిత్ర ఒక అద్దంలా నిలుస్తుంది. విద్యను కేవలం మార్కులు, ర్యాంకులు, ఉద్యో గాలకే పరిమితం చేసే ధోరణి సమాజాన్ని సంకుచిత దిశగా నడిపి స్తుంది. ఒక దేశానికి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులు ఎంత అవస రమో, ప్రశ్నించే పౌరులు, రాజ్యాంగ విలువలను గౌరవించే వ్యక్తులూ అంతే అవసరం. అలాంటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత విద్యా వ్యవస్థపై ఉంటుంది.ప్రొ‘‘ కొండ నాగేశ్వర్వ్యాసకర్త డైరెక్టర్, సివిల్ సర్వీసెస్ అకాడమీ,ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
దేశంలో తొలిసారి: 99 శాతం దాటిన జనన, మరణాల నమోదు!
న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా 2024లో జనన, మరణాల నమోదు అంచనాలలో 99 శాతం మార్కును దాటి సరికొత్త మైలురాయిని అధిగమించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఓఆర్జీఐ) విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) నివేదిక ప్రకారం.. దేశంలో అంచనా వేసిన మొత్తం జననాలలో 99.1శాతం (2,54,73,389 జననాలు), మరణాలలో 99.4శాతం (89,38,301 మరణాలు) అధికారికంగా నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో జననాలు 1.1శాతం, మరణాల నమోదు 3.2శాతం పెరిగాయి. గత దశాబ్ద కాలంలో (2014లో జననాలు 86.6 శాతం, మరణాలు 72.5 శాతం మాత్రమే నమోదయ్యేవి) ఈ నమోదు ప్రక్రియ నిరంతరం మెరుగుపడుతూ రావడం విశేషం.జాతీయ సగటు 100 శాతానికి చేరువవుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియలో ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జననాల నమోదు ఇంకా 80%-90% మధ్యే ఉంది. అలాగే బీహార్ (62.1%), జార్ఖండ్ (50.7%) రాష్ట్రాలు మరణాల నమోదులో వెనుకబడి ఉన్నాయి. అయితే చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ రేటు సాంకేతికంగా ఎక్కువగా కనిపించడానికి గల కారణాలను నివేదిక ప్రస్తావిస్తూ.. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) అంచనాలు నివాస స్థలాన్ని బట్టి, ఎస్ఆర్ఎస్ నమోదు ఘటన జరిగిన స్థలాన్ని బట్టి లెక్కించడమేనని స్పష్టం చేసింది.ఈ నివేదికలో ఆరోగ్య రంగానికి సంబంధించి మరికొన్ని సానుకూల అంశాలు వెల్లడయ్యాయి. వైద్య సహాయం లేకుండా సంభవించే మరణాల శాతం 2023లో 53.4% ఉండగా, 2024 నాటికి అది 52.5%కి తగ్గింది. అదే సమయంలో, ఆసుపత్రులు లేదా వైద్య సంస్థల్లో జరిగే ప్రసవాలు 2023లోని 74.7% నుండి 2024లో 79.4%కి పెరిగాయి. ఇది 2019 (81.2%) తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం. కాగా, ఇటీవల విడుదలైన ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ఈ సంస్థాగత ప్రసవాలను 90.6% గా చూపించింది. -
సీన్ రివర్స్.. ఇంధన దిగ్గజానికి భారత్ దన్ను!
ప్రపంచానికి చమురు, ఇంధనం ఎగుమతి చేసే దిగ్గజం.. ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంధన మౌలిక సదుపాయాలు, ఆయిల్ రిఫైనరీలు యుద్ధంలో తీవ్రంగా దెబ్బతినడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. జనాలు ఇంధనం కోసం కిలోమీటర్ల మేర క్యూలు కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు.. స్వదేశీ అవసరాలు తీర్చుకునేందుకు భారత్ను ఆశ్రయించే పరిస్థితికి చేరింది!. ఇది ప్రపంచ ఇంధన సమీకరణాల్లో అసాధారణ మార్పుగా కనిపిస్తోంది!.ఉక్రెయిన్ గత కొద్ది నెలలుగా రష్యాలోని కీలక ఆయిల్ రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు, రవాణా మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల కారణంగా అనేక రిఫైనరీల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఫలితంగా రష్యా వ్యాప్తంగా పెట్రోల్ కొరత, రేషన్ విధానం, పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు, ధరల పెరుగుదల వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఇప్పుడు ఇంధన సరఫరా కోసం భారత్ వైపు మళ్లింది.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే భారత్ నుంచి కనీసం 60 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ రష్యాకు సముద్ర మార్గంలో చేరింది. మరో రెండు ట్యాంకర్లు కూడా ఒక్కొక్కటి 30–40 వేల మెట్రిక్ టన్నుల ఇంధనంతో రష్యా వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సరఫరా ఏ భారతీయ రిఫైనరీ నుంచి వెళ్తోందన్నది మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.వేసవి కాలంలో రష్యాలో ఇంధన డిమాండ్ భారీగా ఉంటుంది. రోజుకు సుమారు 1.10 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ అవసరం ఉంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో నెలకు దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని మాస్కో యోచిస్తోంది. ఇప్పటికే బెలారస్ కూడా రష్యాకు సహాయక సరఫరాలు పెంచింది. జూన్ మొదటి భాగంలోనే బెలారస్ నుంచి రైలుమార్గంలో 70 వేల మెట్రిక్ టన్నులకుపైగా పెట్రోల్ రష్యాకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి.మరోవైపు భారత్–రష్యా ఇంధన వాణిజ్యం మాత్రం గత కొన్నినెలల్లోనే మరింత బలపడింది. ఉక్రెయిన్ యుద్ధం.. పశ్చిమ దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ధరల ఒత్తిడుల నేపథ్యంలో భారత్ రష్యా నుంచి తక్కువ ధరలకు ముడిచమురు భారీగా కొనుగోలు చేస్తోంది. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, భారత్ తన ఇంధన భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు కొనసాగించింది. భారత రిఫైనరీలు ఈ చమురును శుద్ధి చేసి దేశీయ అవసరాలకే కాకుండా ఇతర మార్కెట్లకు కూడా సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల బంధం మరింత బలపడింది.ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశంలో ఇంధన కొరతను అంగీకరించారు. ఉక్రెయిన్ దాడుల కారణంగానే కొన్ని ప్రాంతాల్లో సరఫరా సమస్యలు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ దాడులు రష్యా సైనిక కార్యకలాపాలపై ప్రభావం చూపలేదని స్పష్టం చేస్తూ, ఇంధన మౌలిక సదుపాయాల రక్షణ కోసం వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.మరోవైపు భారత్–రష్యా మధ్య ఇంధన వాణిజ్యం గత కొద్ది నెలల్లో మరింత బలపడింది. హర్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడిచమురు దిగుమతి చేసింది. తక్కువ ధరలకు లభిస్తున్న రష్యా చమురును భారత రిఫైనరీలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండగా, ఇప్పుడు ఆ సరఫరా చైన్ కొత్త దశకు చేరినట్లు కనిపిస్తోంది.ఇలా ఒకప్పుడు ఇంధన ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న రష్యానే ఇప్పుడు భారత్పై ఆధారపడే పరిస్థితికి చేరడం అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ ప్రభావాలు, ఇంధన మార్కెట్ మార్పులపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. విశ్లేషకుల ప్రకారం, ఇది యుద్ధం తెచ్చిన ఆర్థిక సమీకరణాల “సీన్ రివర్స్” ఉదాహరణగా నిలుస్తోంది. అదే సమయంలో సంక్షోభ సమయంలో భాగస్వామ్య దేశానికి అండగా నిలుస్తూ భారత్ తన మిత్రధర్మాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఎవరు దేశ పౌరులు?
పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన దేశ పౌరసత్వం ఉన్నట్టు కాదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అది కేవలం ప్రయాణానికి సంబంధించిన పత్రమని చెప్పింది. ఇది దేశ ప్రజల్లో అలజడి, ఆందోళనలను రేపింది. దేశ పౌరుడిగా నిరూపించుకోవాలంటే, మరింకేమి పత్రాలు కావాలని ప్రజలు అడుగుతున్నారు.మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 5–11, ఎవరు దేశ పౌరులో నిర్వచించాయి. రాజ్యాంగం అమలు నాటికి ఎవరు భారత పౌరులో, దేశ విభజన వలన ప్రభావితమైనవారికి కొన్ని షరతులకు లోబడి ఈ దేశ పౌరసత్వం పొందే అర్హతను నిర్వచించింది. భారత పార్ల మెంటుకు దేశ పౌరసత్వంపై చట్టం చేయడానికి ఆర్టికల్ 11 అధికార మిచ్చింది. ఆర్టికల్ 5 ప్రకారం, భారత్లో జన్మించినవారు లేక దేశంలో వారి తల్లిదండ్రులు జన్మించినా ఈ దేశ పౌరులే అని తెలిపింది.ఎవరు దేశ పౌరసత్వానికి అర్హులు అన్నది పౌరసత్వ చట్టం– 1955 నిర్దేశించింది. పౌరసత్వ చట్టంలోని 3, 4, 5, 6 సెక్షన్లు పౌర సత్వం ఏ విధంగా లభిస్తుందో నిర్వచించాయి. సెక్షన్ 3 ప్రకారం 1950 జనవరి 26 తరవాత, 1987 మధ్యన భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికీ; 1987 జూలై 1 తరువాత భారతదేశంలో జన్మించి నవారి తల్లితండ్రులిద్దరూ భారతీయ పౌరులు అయితే లేక తల్లితండ్రుల్లో ఒకరు భారతీయ పౌరులు, మరొకరు అక్రమంగా భారత దేశానికి వలస రాకుంటే వారికీ భారత పౌరసత్వం లభిస్తుంది. సెక్షన్ 4 ప్రకారం, భారతదేశంలో జన్మించకున్నా, తల్లి, తండ్రి ఈ దేశ పౌరులైతే వారికీ పౌరసత్వం లభిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థి తుల్లో, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, న్యాచుర లైజేషన్ ద్వారా కూడా సెక్షన్ 5, 6 ప్రకారం పౌరసత్వం లభిస్తుంది.పాస్పోర్ట్కు ఎవరు అర్హులు? పాస్పోర్ట్ చట్టం–1967లో పాస్పోర్ట్ పొందడానికి ఎవరు అర్హులో పేర్కొనలేదు. అయితే, ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, పాస్పోర్ట్ అధికారి, పాస్పోర్ట్ కోసం పెట్టుకున్న దరఖాస్తును కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తిరస్కరించాలి. దానిలో మొట్టమొద టిగా పేర్కొన్న కారణం, దరఖాస్తుదారు భారత పౌరుడు కాక పోవడం. అంటే చట్ట ప్రకారం భారత పౌరుడు కానివారికి భారత దేశ పాస్పోర్ట్ పొందే అర్హత లేదు.మరెందుకు భారత ప్రభుత్వం పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదని చెప్తూ బాంబే హైకోర్టు తీర్పును ఉటంకిస్తున్నది? ‘మోతిమియా రహిమియా వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో తాము భారతదేశంలోనే జన్మించామనీ, దానికి రుజువుగా పాస్పోర్ట్ను కోర్టులో సాక్ష్యంగా చూపి తమను భారత దేశం నుంచి పంపకుండా ఆదేశాలివ్వాలనీ కోరారు. బాంబే హైకోర్టు వారి వాదనను తోసిపుచ్చుతూ, ‘కేవలం వారిచ్చిన సమాచారంపై ఆధారపడి పాస్పోర్ట్ను ప్రభుత్వం ఇచ్చింది. కానీ వారుగానీ, వారి తల్లితండ్రులుగానీ ఈ దేశంలోనే జన్మించారని ఎలాంటి ఆధారం చూపలేదు’ అని పేర్కొంది.చట్టం ప్రకారం పాస్పోర్ట్ అధికారి, తప్పనిసరిగా దరఖాస్తు దారులు భారత పౌరులని నిర్ధారించుకున్న తరవాతనే పాస్పోర్ట్ ఇవ్వడానికి ఆమోదించాలి. పైన చెప్పినట్టుగా, ఎవరు భారత పౌరులో రాజ్యాంగం, పౌరసత్వ చట్టం–1955లో పొందుపరచ బడింది. ఒకవేళ, ఎవరైనా తప్పుడు సమాచారంతో పాస్పోర్ట్ పొందినా, సెక్షన్ 10 ప్రకారం దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వా నికి ఉంది. కాబట్టి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చిన బాంబే హైకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం ఉటంకించి పాస్పోర్ట్ దేశ పౌర సత్వానికి రుజువు కాదని చెప్పడం రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ వక్రీకరించడమే.అంటే, కేవలం దరఖాస్తుదారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పాస్పోర్టులు ఆమోదిస్తూ, దేశ భద్రతను పణంగా పెడుతు న్నారని భావించాలా? అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ... పాస్పోర్ట్ దేశ పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం. కాబట్టి, ప్రజలను ఈ విధంగా ప్రభుత్వమే తికమకపెట్టడం దారుణం. గతంలో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ వంటివి కూడా పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కావని న్యాయస్థానాలు చెప్పాయి. మరి ఏ పత్రం దేశ పౌర సత్వానికి రుజువో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – కె.ఎస్. హరీశ్ కుమార్, ఏజీఎం (లా) రిటైర్డ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
ఎందుకిలా తారుమారు?
యూరప్లో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ చాలా ప్రాంతాల్లో ఎండలకు రోడ్లు మెత్తపడ్డాయని..కరిగిపోయాయనే వార్తలు వస్తున్నాయి.40 డిగ్రీలకే అక్కడి రహదారుల పరిస్థితి అలా అయింది. మరి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేమన దేశంలో మాత్రం రోడ్లు ఎందుకుదృఢంగా ఉంటున్నాయి. అవి నాసిరకమైనవా? ఏంటి తేడా?యూరప్» యూరోప్లో రోడ్లను అత్యంత శీతల ఉష్ణోగ్రతల కోసం రూపొందిస్తారు. » ఫ్లెక్సిబిలిటీ కోసం మెత్తని తారును వాడతారు. దీని వల్ల గడ్డకట్టించే చలిలోనూ రోడ్లు బీటలు వారవు. ఇదే ఫ్లెక్సిబిలిటీ తీవ్రమైన ఎండలసమయంలో ప్రతికూలంగా మారుతుంది.» 40 డిగ్రీలు లేదా అంతకు మించి నమోదైనప్పుడు తారు మెత్తపడి.. వాహనాలబరువుకు రోడ్లు వంకరలు తిరగడం, గుంటలు పడటం లాంటివి జరుగుతాయి. భారత్» మన రోడ్ల నిర్మాణం పూర్తిగా వేరు. తీవ్రమైన ఉష్ణోగ్రతలకు అనుగుణంగా తయారుచేస్తారు. » వీజీ–30, వీజీ–40 రకం గట్టి తారును కంకరతో కలిపి వాడతారు. దీని వల్ల రోడ్డు దృఢంగా ఉంటుంది. » 45 డిగ్రీల ఎండలోనూ రూపుమారదు. ట్రాఫిక్ రద్దీతోపాటు వాహనాల అధిక బరువునూ తట్టుకుంటుంది. అంటే.. ఇందులో నాణ్యత సమస్య లేనే లేదు. ఆయా దేశాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగారోడ్ల రూపకల్పన ఉంటుంది. మనది వేసవికాలానికి అనుగుణంగా రూపొందిస్తే.. యూరప్లో చలికాలానికి అనుగుణంగా రూపొందిస్తారు. అదీ సంగతి. -సాక్షి సెంట్రల్ డెస్క్ -
రూపాయిపై ‘డాలర్’ ఒత్తిడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా ‘డాలర్ ఇండెక్స్’ బలోపేతం కావడం దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ 60 పైసలు క్షీణించి 95.16 వద్ద ముగిసింది.డాలర్ పుంజుకోవడంతో పాటు ఇతర ఆసియా కరెన్సీల బలహీనత, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మూలధనం (పెట్టుబడులు) నిరంతరాయంగా తరలిపోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 94.67 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన రూపాయి... ఇంట్రాడేలో 94.60 – 95.29 శ్రేణిలో కదలాడింది. -
అనలాగ్ ఏఐతో ‘మేఘ’ జట్టు
సాక్షి, బిజినెస్ ప్రతినిధి; ఇన్ఫ్రా రంగ దిగ్గజం ‘మేఘ ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్)’ ‘ఏఐ’లోకి ఎంట్రీ ఇచ్చింది. అబుదాబి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘అనలాగ్ ఏఐ’తో కలిసి కొత్త భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసింది. ఈ జేవీలో ఇద్దరికీ చెరో 50 శాతం వాటా ఉంటుందని మేఘ సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి వెల్లడించారు. బుధవారమిక్కడ అనలాగ్ సీఈఓ అలెక్స్ కిప్మాన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే రెండు మూడేళ్లలో తాము ఈ జేవీలో రూ.3,000 కోట్ల నుంచి 4,500 కోట్ల వరకూ పెట్టుబడి పెడతామని, అనలాగ్ భారత కార్యకలాపాలను పూర్తిగా ఈ జేవీయే చూస్తుందని చెప్పారాయన. కొత్త కంపెనీ పేరు, లోగో తదితర వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా అలెక్స్ కిప్మాన్ చెప్పారు. ఫిజికల్ ఏఐ... అవకాశాలు అపారం మూడేళ్ల కిందట అబుదాబి టెక్నాలజీ దిగ్గజం జీ24తో కలిసి అలెక్స్ కిప్మాన్ అనలాగ్ ఏఐని ఆరంభించారు. ఇది ప్రశ్నలకు టెక్ట్స్ రూపంలో సమాధానాలు చెప్పే ఫౌండేషనల్ ఏఐ కాదు. ఫిజికల్ ఏఐ. యంత్రాలు, పవర్ ప్రాజెక్టులు, వాహనాలు సహా భౌతిక వస్తువుల్ని సెన్సర్లతో అనుసంధానించి వాటి డిజిటల్ ట్విన్స్ను తయారు చేస్తుంది. వాటి సాయంతో దూరంగా ఉండికూడా వీటిని పర్యవేక్షించొచ్చు. యంత్రాల సామర్థ్యం పెరగటంతో పాటు ప్రమాదాల నివారణ, మెయింటెనెన్స్ అవసరాల్ని ముందే తెలుసుకోవచ్చు. స్మార్ట్ సిటీల్లో వాటర్ ఫ్లోను, ట్రాఫిక్ను సైతం దీనిద్వారా సమర్థంగా నిర్వహించవచ్చు.ఇలా చాలా ప్రయోజనాలుండటం వల్ల భారత్లో దీనికి అపార అవకాశాలున్నాయని కృష్ణారెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఇది అత్యాధునిక టెక్నాలజీ. రిఫైనరీలతో సహా అన్నిచోట్లా వినియోగించొచ్చు. మా గ్రూపు సంస్థ ఒలెక్ట్రా త్వరలో బ్యాటరీ తయారీ, ప్యాసింజర్ కార్ల తయారీలోకి ప్రవేశిస్తోంది. దానిక్కూడా అనలాగ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ పనికొస్తుంది’ అని స్పష్టంచేశారు. ఈ జేవీ భారతదేశమంతటా సేవలందిస్తుందని, ఒక్క ఎంఈఐఎల్కే కాదని, ఇప్పటికే తమకు చాలామంది క్లయింట్లున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా కిప్మాన్ చెప్పారు. అబుదాబిలో చాలాచోట్ల దీన్ని వాడుతున్నారని, డేటా సెంటర్లు, పవర్ ప్రాజెక్టుల్లోనూ మోహరించామని చెప్పారాయన.హైదరాబాద్లో డెవలప్మెంట్ సెంటర్ తమ భాగస్వామ్య సంస్థ సారథ్యంలో హైదరాబాద్లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను త్వరలో ఏర్పాటు చేస్తామని కిప్మాన్ చెప్పారు. ఉద్యోగుల సంఖ్య మొదట్లో తక్కువే ఉంటుందని, మెల్లగా విస్తరిస్తూ వెళతామని తెలియజేశారు. వచ్చే 3 నెలల్లో తమ భారత సేవలు వాణిజ్యపరంగా మొదలవుతాయని, పైలట్ ప్రాజెక్టులు ఇప్పటికే కొనసాగుతున్నాయని చెప్పారాయన. కార్యక్రమంలో మేఘ సంస్థ డైరెక్టర్లు పి.వి.ప్రణవ్ రెడ్డి, మానస్ రెడ్డి, అనలాగ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యెన్సీ స్మిత్ పాల్గొన్నారు. -
అభిషేక్, దూబే మెరుపులు
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్తో తొలి టి20 మ్యాచ్లో భారత బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ఐర్లాండ్ చేతిలో రెండు టి20ల్లోనూ ఓడి సిరీస్ కోల్పోయిన టీమ్... ఇంగ్లండ్తో పోరును సాధికారికంగా మొదలు పెట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68; 6 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా...శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) చివర్లో భారీ షాట్లు ఆడాడు. అభిషేక్, అయ్యర్ మూడో వికెట్కు 38 బంతుల్లో 82 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాఖిబ్ మహమూద్కు 3 వికెట్లు దక్కాయి. మ్యాచ్ రద్దుఇంగ్లండ్ ఛేదన సమయానికి భారీ వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. కీలక భాగస్వామ్యం... భారత తుది జట్టులో టీనేజర్ వైభవ్ సూర్యవంశీకి మరోసారి చోటు దక్కలేదు. సంజు సామ్సన్ (1) వరుసగా మూడో మ్యాచ్లోనూ విఫలం కాగా, ఇషాన్ కిషన్ (0) మళ్లీ రనౌట్ కావడంతో 6 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అభిషేక్, అయ్యర్ కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. అభిషేక్ తనదైన శైలిలో ధాటిగా చెలరేగగా, కెప్టెన్గా తొలి రెండు మ్యాచ్లలో విఫలమైన అయ్యర్ ఈ సారి జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. డాసన్ ఓవర్లో సిక్స్ కొట్టిన అభిషేక్ మహమూద్ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదాడు. ల్యూక్వుడ్ ఓవర్లోనూ వరుసగా 3 ఫోర్లు కొట్టిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ అవుటైన తర్వాత భారత్ జోరును నిలువరించడంలో ఇంగ్లండ్ బౌలర్లు సఫలమయ్యారు. 8 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 87/2 కాగా...తర్వాతి 6 ఓవర్లలో జట్టు 38 పరుగులే చేయగలిగింది. తిలక్వర్మ (13) ప్రభావం చూపలేకపోగా, 38 బంతుల్లో అయ్యర్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయ్యర్ వెనుదిరిగాక దూబే దూకుడుతో భారత్ మెరుగైన స్కోరుతో ముగించగలిగింది. రషీద్ బౌలింగ్లో అతను కొట్టిన 2 సిక్స్లు హైలైట్గా నిలిచాయి.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) బాంటన్ (బి) మహమూద్ 1; అభిషేక్ (ఎల్బీ) (బి) కరన్ 59; ఇషాన్ కిషన్ (రనౌట్) 0; అయ్యర్ (ఎల్బీ) (బి) మహమూద్ 68; తిలక్ (సి) డాసన్ (బి) మహమూద్ 13; దూబే (నాటౌట్) 42; హర్షిత్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 0; అక్షర్ (రనౌట్) 3; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–88, 4–124, 5–165, 6–174, 7–189. బౌలింగ్: ల్యూక్వుడ్ 3–0–35–0, మహమూద్ 4–0–33–3, డాసన్ 3–0–26–0, జాక్స్ 3–0–30–0, రషీద్ 4–0–39–1, స్యామ్ కరన్ 3–0–25–1. -
అరుదైన ఆన్సీ ముత్యం
కేరళలోని సముద్ర తీర గ్రామానికి చెందిన ఆ యువకుడు, అథ్లెట్గా పెద్ద స్థాయికి చేరుకోవాలని కలలు కన్నాడు. కలల మాటేమిటోగానీ, పేదరికం వల్ల చేతిలో ఆటో... ఆర్థిక కష్టాలు మాత్రమే మిగిలాయి.కట్ చేస్తే.... ‘నేను సాధించలేనిది మా అమ్మాయి సాధించింది’ అని ఆనందబాష్పాలు నిండిన కళ్లతో చెబుతున్నాడు ఆ తండ్రి. ఆ అమ్మాయి పేరు... ఆన్సీ సోజన్. ప్రఖ్యాత అథ్లెట్ అంజు బాబీ జార్జ్ పేరిట 22 ఏళ్లుగా ఉన్న 6.83 మీటర్ల సుదీర్ఘకాల జాతీయ రికార్డ్ను బ్రేక్ చేసి భారతదేశపు సరికొత్త లాంగ్–జంప్క్వీన్గా అవతరించింది...భువనేశ్వర్లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 6.88 మీటర్లు దూకడం ద్వారా ‘వావ్’ అనిపించింది ఆన్సీ సోజన్. ఆమె తండ్రి సోజన్ ఈటీ ఒకప్పుడు అథ్లెట్. జాతీయ స్థాయిలో రాణించాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే పేదరికం అడుగడుగునా అతడి కలలకు అడ్డు పడింది. ఆటోడ్రైవర్ అయిన సోజన్ తన కలను కూతురు రూపంలో సాకారం చేసుకోవాలనుకున్నాడు.పాటల ప్రపంచం నుంచి ఆటల లోకంలోకి...ఆన్సీకి సంగీతం, డాన్స్ అంటే చాలా ఇష్టం. అయితే తండ్రి కోరిక మేరకు ఆటలపై ఆసక్తి పెంచుకుంది. ఆన్సీని అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్లో చేర్పించడమే కాకుండా, ప్రాక్టీస్ సెషన్లకు తీసుకెళ్తూ ఉండేవాడు తండ్రి. ‘ఎన్నో సంవత్సరాల నా కల నెరవేరింది. ఆన్సీ ద్వారా నా కలను సాకారం చేసుకున్నాను. సంవత్సరాల తరబడి నా నిరీక్షణకు ఫలితం దక్కింది’ ఆనందంగా అంటున్నాడు సోజన్.అతడి అంచనా అక్షరాలా నిజమైంది!ఆన్సీ చిన్ననాటి కోచ్...సనోజ్. ఆన్సీ తండ్రిలాగే సనోజ్ కూడా ప్రతిభావంతుడైన అథ్లెట్. ఆర్థిక కారణాలతో పాటు ఇతరత్రా కారణాల వల్ల ఆయన కలలు అటకెక్కాయి. తన కలలు ఫలించకపోయినా, తనలా కలలు కనే యువత కలలను సాకారం చేయడానికి నడుం బిగించాడు సనోజ్. వారి కోసం చిన్న అథ్లెటిక్స్ అకాడమీని ప్రారంభించాడు. ఆన్సీకి పదమూడేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమెలోని ప్రతిభను మొదటిసారిగా గుర్తించాడు సనోజ్. అండర్–14 స్టేట్ స్కూల్ గేమ్స్లో 4.93 మీటర్ల దూరం దూకి కాంస్య పతకం గెలుచుకున్న ఆన్సీ తన సహజ ప్రతిభతో ఔరా అనిపించుకుంది.‘ఈ అమ్మాయి ఏదో ఒకరోజు రికార్డ్లు బ్రేక్ చేస్తుంది’ అనుకునేవాడు సనోజ్. సంవత్సరాల కాలం తరువాత అతడి అంచనా అక్షరాలా నిజమైంది. పంజాబ్లో జరిగిన జాతీయ పాఠశాలల అథ్లెటిక్స్ మీట్లో 6.26 మీటర్లు దూకినప్పుడు తొలిసారిగా జాతీయ గుర్తింపు పొందింది. అప్పటినుండి అథ్లెటిక్స్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. నట్టికాలోని ఒక సాధారణ సిరియన్ క్రైస్తవ కుటుంబంలో పుట్టింది ఆన్సీ. తల్లి ఝాన్సీ గృహిణి. ఆన్సీ కుటుంబంలో ఆర్థిక కష్టాలు ఎన్నో ఉండేవి.ప్రపంచ స్థాయి ప్రతిభ‘ప్రపంచ స్థాయి ప్రతిభ’ అంటూ ఆన్సీని ప్రశంసించింది అంజు బాబీ జార్జ్. ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ్రపోత్సహించింది. ఏథెన్స్ ఒలింపిక్స్లో అంజు బాబీ రికార్డ్ నెలకొల్పినప్పుడు ఆన్సీ వయసు మూడేళ్లు మాత్రమే. అంజు నెలకొల్పిన రికార్డ్ భారత్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చరిత్రలో అత్యధిక కాలం కొనసాగిన రికార్డులలో ఒకటి. ఈ నేపథ్యంలో తాను ఎంత గొప్ప విజయం సాధించిందో ఆన్సికి బాగా తెలుసు. ఈ అరుదైన ఆణిముత్యం మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలని ఆశిద్దాం. ఆటోడ్రైవర్ కూతురే కదా...అనేవాళ్లు!పక్క ఊళ్లలో పోటీలు ఉంటే ఆన్సిని అక్కడికి తప్పకుండా తీసుకువెళ్లేవాడిని. పోటీలో ఉన్న నా కూతురిని చూస్తే ఎంతో సంతోషంగా ఉండేది. ఈ సంతోషంలో ఆటో కూడా నడిపేవాడిని కాదు. ఇలా అయితే ఎలా? అనేవాళ్లు చాలామంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావో మాకు అర్థం కావడం లేదు. ఆటోడ్రైవర్ కూతురు ఆటోడ్రైవర్ కూతురే. అంతకుమించి అనవసరంగా ఏమీ ఆశించకు... అని నా తోటి ఆటోడ్రైవర్లు నాతో అంటుండేవారు. కానీ నేను వాటిని పట్టించుకునేవాడిని కాదు. మా అమ్మాయి ఏదో ఒకరోజు గొప్ప విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకం ఉండేది. – సోజన్, ఆన్సీ తండ్రినా కోసం నాన్న అప్పులు చేశారుమా నాన్న ఆటోడ్రైవర్. పెద్దగా డబ్బులు ఉండేవి కాదు. అయినా సరే, నేను అథ్లెట్గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా చూశారు. నా కోసం స్నేహితుల దగ్గర అప్పులు చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆయన నన్ను ఒక యువరాణిలా చూసుకున్నారు. నాన్నలో క్రీడాస్ఫూర్తి ఉంది. అంజూ మేడమ్ రికార్డ్ గురించి నాకు తెలుసు. కాని నేను దానిని బ్రేక్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రపంచస్థాయి అథ్లెట్గా ఎదగాలనుకున్నాను. నేను మొదటిసారి కామన్వెల్త్గేమ్స్కు వెళ్లినప్పుడు, కొంతమంది అగ్రశ్రేణి అథ్లెట్లు ఎంత దూరం దూకుతున్నారో ప్రత్యక్షంగా చూశాను. వారి ప్రతిభ, సామర్థ్యాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. – ఆన్సీ సోజన్బరువే అవరోధమై...గత సంవత్సరం హార్మోన్ల సమస్య కారణంగా బరువు పెరిగింది ఆన్సి. ఆ బరువు ఆమె కెరీర్కు అవరోధంగా మారింది. ఆన్సి ఫామ్ ఊహించని విధంగా పడిపోయింది. వైద్యపరీక్షల తరువాత అసలు కారణం తెలుసుకుని ఫిట్నెస్ను తిరిగి సాధించడానికి కఠినమైన శిక్షణ తీసుకుంది. ఆహారనియమాలను పాటించింది. ‘నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. కానీ అటువంటి వాటిని నా ఆహార జాబితా నుంచి పూర్తిగా తొలగించాను. ప్రపంచ స్థాయి జంపర్గా ఎదగాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదు’ అంటుంది ఆన్సి. -
SIR ఫామ్ ఎలా నింపాలో తెలియక తికమకపడుతున్నారా?
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తున్నారు. ఓటరు ఆ ఫామ్ నింపాక మళ్లీ తీసుకుంటున్నారు. బీఎల్వోలు ఇచ్చే ఫామ్లో కింది భాగంలో ఓటర్కు సంబంధించిన వివరాలు ఉంటాయి. అలాగే, పైభాగంలో రెండు కాలమ్లు కనపడతాయి. ఆ పై భాగంలోని ఎడమవైపు... 2002కు ముందే ఓటు హక్కు ఉంటే నింపాలి. ఒకవేళ 2002లో మీకు ఓటు లేకపోతే ఆ సమయంలో ఓటు హక్కు ఉన్న మీ బంధువుల వివరాలను రాయాలి. వారి పేరు, ఓటరు కార్డు నంబరు, వారితో మీకు ఉన్న బంధుత్వం, రాష్ట్రం, అసెంబ్లీ నియోజక వర్గ పేరు, ఫామ్లో అడిగిన మిగతా వివరాలు రాయాల్సి ఉంటుంది. పాత ఫొటో, కొత్త ఫొటో ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్, ఫోన్ నంబర్లు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి వివరాలను కూడా రాయాల్సి ఉంటుంది. ఫామ్లో ప్రధాన భాగంలో ఓటరు లేదా అతని దగ్గరి కుటుంబ సభ్యుడు (తల్లిదండ్రుల్లో ఒకరు వంటి వారు) తెలంగాణలో 2002లో జరిగిన చివరి ఎస్ఐఆర్లో ఏ ఓటరు జాబితాలో నమోదు అయ్యారో ఆ వివరాలు ఇవ్వాలి. ఆ వివరాలు గుర్తులేకపోతే ఓటర్లు వాటిని ఓటర్ల సేవల పోర్టల్ ద్వారా చూసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.మీరు ముందుగానే పలు వివరాలను ఆన్లైన్ ద్వారా తీసుకుని పెట్టుకుంటే మీ పని సులువు అవుతుంది.వీటిని ఇలా తెలుసుకోండి1.2025 ఓటర్ లిస్టులో మీ పేరును సెర్చ్ చేసి చూసుకోండిhttps://ceotelangana.nic.in/ ఓపెన్ చేయండిSearch Your Name in voter list ట్యాబ్ కనపడుతుందిదానిపై క్లిక్ చేయండిమీ ఓటర్ ఐడీ ఎపిక్ నంబర్, రాష్ట్రం పేరు, క్యాప్చాను టైప్ చేయండిమీ ఓటర్ కార్డుకు సంబంధించిన వివరాలు వస్తాయి2.డోర్ నంబరు ద్వారా 2002 ఓటరు జాబితాను కనుక్కోవచ్చు https://mintcream-grouse-474676.hostingersite.com/ క్లిక్ చేయండి2002లో ఓటరు ఉన్న జిల్లా, అసెంబ్లీ, ఇంటి నంబరును టైప్ చేస్తే వివరాలు వస్తాయి3.చివరి ‘సర్’ జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా చూసుకోవచ్చుhttps://voters.eci.gov.in/searchInSIR/S2UA4DPDF-JK4QWODSE ఓపెన్ చేయండిఈ కింది వివరాలను అన్నింటినీ ఇవ్వండిక్యాప్చా టైప్ చేసి, సెర్చ్పై క్లిక్ చేయండిమీ పేరు ఉంటే వస్తుంది4. మీ బీఎల్వో ఎవరు, వారి ఫోన్ నంబరు ఎంత వివరాలను కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు. మీకేమన్నా డౌట్లు ఉంటే బీఎల్వోకు ఫోన్ చేసి అడగొచ్చుhttps://ceotserms2.telangana.gov.in/TS_ERODETAILS/BLO_Details.aspx ఓపెన్ చేయండి మీ జిల్లా, నియోజక వర్గ పేర్లను ఇవ్వండిబీఎల్వోల పూర్తి వివరాలు వస్తాయి -
భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
-
ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో వరుసగా పెరుగుతూ వచ్చిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. తాజాగా ఒక్కో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.183 మేర తగ్గింపు ప్రకటించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, చిన్న వ్యాపారులకు కొంత ఉపశమనం లభించింది.ఇటీవల ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో గత కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ ధరలు వరుసగా పెరిగాయి. మే నెలలో భారీ పెంపు నమోదు కాగా, జూన్లోనూ మరోసారి ధరలు పెరగడంతో వ్యాపార రంగంపై అదనపు భారం పడింది.తాజాగా పరిస్థితులు కొంత మెరుగుపడటంతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఇప్పటి వరకు రూ.3,113.50గా ఉన్న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.2,930కు తగ్గింది. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో ధరల సవరణ అమలులోకి వచ్చింది.పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. దేశీయ ఉత్పత్తి మెరుగుపడటం, దిగుమతి ఎల్పీజీ కార్గోల రాక ప్రారంభం కావడంతో సరఫరా పరిస్థితులు స్థిరపడుతున్నాయి. దీంతో గతంలో విధించిన కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పరిమితులను పూర్తిగా తొలగించి, యుద్ధానికి ముందు స్థాయికి సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపింది.సంక్షోభ సమయంలో భారీగా ప్రభావితమైన సరఫరా వ్యవస్థను క్రమంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం దశలవారీ చర్యలు తీసుకుంది. ప్రారంభంలో 50 శాతం స్థాయికి పడిపోయిన బల్క్ ఎల్పీజీ సరఫరా ఇప్పుడు మళ్లీ 70 శాతం వరకు చేరిందని అధికారులు తెలిపారు. అలాగే రిఫైనరీలను ఎక్కువగా ఎల్పీజీ ఉత్పత్తికి మళ్లించడం ద్వారా దేశీయ సరఫరాను పెంచారు.ఈ తగ్గింపు కేవలం కమర్షియల్ వినియోగానికి మాత్రమే వర్తిస్తుంది. గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 40,000 టన్నుల కంటే ఎక్కువగా నిలబెట్టేలా చర్యలు కొనసాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.ప్రధాన నగరాల్లో తాజా కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి:* ఢిల్లీ: రూ.2,930* హైదరాబాద్: రూ.3,178* విజయవాడ: రూ.3,115ధర తగ్గింపు నేపథ్యంలో హోటల్, రెస్టారెంట్ రంగాలకు కొంత ఊరట లభించినప్పటికీ, గత నెలల పెంపుల ప్రభావం ఇంకా కొనసాగుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘ఆ దారి’ నుంచే భారత్లోకి..
సాక్షి, హైదరాబాద్: ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని రెండు రాష్ట్రాల్లో ఉన్న 53 కిలోమీటర్ల ప్రాంతం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చే వారికి కేరాఫ్ అడ్రస్గా మారింది. అసోంలో ఉన్న 25 కిమీ, పశ్చిమ బెంగాల్లోని 28 కిమీ ప్రాంతాల్లోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న బంగ్లాదేశీయులు సరిహద్దులు దాటుతున్నారు. కోల్కతా నుంచి నకిలీ గుర్తింపుకార్డులు పొంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి బెంగాల్ వాసులుగా స్థిరపడుతున్నారు. ఇలా వచ్చిన వారిలో మహిళలు, యువతులు వ్యవస్థీకృత వ్యభిచారం, పురుషులు..యువకులు దినసరి కూలీలుగా స్థిరపడుతున్నారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఇటీవల పట్టుకున్న ఐదుగురు బంగ్లాదేశీయుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రెండు రాష్ట్రాల నుంచే ఈజీ...బంగ్లాదేశ్ సరిహద్దు సుమారు 4,096 కిమీ పొడవు ఉంది. ఇది పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. అయితే పశ్చిమ బెంగాల్, అసోంల్లో ఉన్న 53 కిలోమీటర్లు మాత్రమే అక్రమంగా సరిహద్దులు దాటడానికి అనుకూలంగా ఉంది. అక్రమంగా భారత్లోకి ప్రవేశించాలని భావించే వాళ్లు బంగ్లాదేశ్లోని జషోర్ జిల్లాకు చేరుకుంటున్నారు. ఈ సరిహద్దు సుమారు 102 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఇందులో శార్షా ఉపజిల్లాలోని బెనపోల్ రెండు దేశాల మధ్య ప్రయాణికులు, సరుకుల రవాణాకు అత్యంత కీలకమైన ప్రాంతం. అయితే పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాలు, మాల్దా జిల్లాల్లోని 28 కిమీ...అసోంలోని ధుబ్రి జిల్లాలోని బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతంలో ఉన్న మరో 25 కి.మీ ప్రాంతమే అక్రమంగా ప్రవేశానికి అనుకూలంగా ఉంటోంది.పడవలు, పంటపొలాల మీదుగా... ఈ రెండు ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఉన్న గేడే, కృష్ణగంజ్, తేహట్ట, ముర్షిదాబాద్ జిల్లాలోని పద్మా నది పరీవాహక ప్రాంతాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని సుందర్బన్స్ నదీ మార్గాలు, కూచ్బెహార్ జిల్లాలోని ఉత్తర సరిహద్దు ప్రాంతాలు అక్రమ వలసలకు ఉపకరిస్తున్నాయి. అలాగే అసోంలోని కరీమ్గంజ్ జిల్లాలో ఉన్న కుషియారా నది పరీవాహక ప్రాంతాలు, మాంకాచర్ జిల్లాలోని నదీ మార్గాలు, కాచర్ జిల్లాలోని కొన్ని సరిహద్దు గ్రామాల పరిసరాలు కూడా వారికి ఉపకరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, నదులు, గ్రామాలు సరిహద్దుకు ఆనుకుని ఉండడంతో పాటు కంచె, సరైన గస్తీ లేకపోవడం అనుకూలంగా మారాయి. నదులను చిన్న పడవల ద్వారా దాటడం, రాత్రి వేళల్లో వ్యవసాయ భూముల ద్వారా ప్రవేశించి భారత్లోకి వచ్చేస్తున్నారు. హౌరా కేంద్రంగా... ఇలా అక్రమంగా వలసవచ్చే వారికి సహకరించడానికి కోల్కతాలోని హౌరాలో కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి. ఈ గ్యాంగ్స్ ఆ బంగ్లాదేశీయుల్ని బెంగాల్ వాసులుగా మార్చేస్తూ నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి ఇస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అక్కడే విద్యనభ్యసించినట్లు బోనఫైడ్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నాయి. ఇలా భారతీయులుగా మారిపోతున్న ఈ బంగ్లాదేశీలను దేశంలోని వివిధ నగరాలకు తరలించడానికి దళారులూ కోల్కతాలో సిద్ధంగా ఉంటున్నారు. వీళ్లు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ సాయంతో యువతుల్ని వ్యభిచారం వైపు, యువకుల్ని కూలీ పనుల వైపు మళ్లిస్తున్నారు. -
గెలుపు బాట పడతారా!
మూడు రోజుల క్రితం బెల్ఫాస్ట్లో వరుసగా రెండు ఓటముల పరాభవం... ఆ తర్వాత మూడున్నర గంటల ప్రయాణం తర్వాత మారిన దేశం, మారిన వేదిక, మారిన ప్రత్యర్థి... ఇక్కడైనా భారత జట్టు రాత మారుతుందా... గత సిరీస్లోని ప్రత్యర్థితో పోలిస్తే మరింత బలమైన జట్టు ఎదురుగా ఉండగా టీమిండియా గెలుపు బాట పడుతుందా అనేదే ప్రశ్న... సొంతగడ్డపై సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లండ్ను నిలువరించి భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో ఎలాంటి ఫలితం రాబడుతుందనేది ఆసక్తికరం.చెస్టర్ లీ స్ట్రీట్: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టి20 మ్యాచ్ల సిరీస్కు ఈరోజు తెర లేవనుంది. నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్ల తలపడనున్నాయి. ఐర్లాండ్ చేతిలో 0–2తో సిరీస్ ఓడిన భారత్ ఇక్కడైనా సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ సహా పలువురు కీలక ఆటగాళ్లు సోమవారం కివీస్తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత తక్కువ వ్యవధిలో టి20 సమరానికి సిద్ధమయ్యారు. సొంతగడ్డపై ఆడుతున్న ప్రత్యరి్థతో పోలిస్తే భారత్పై తీవ్ర ఒత్తిడి ఉంది. దాదాపు ఐర్లాండ్ తరహాలోనే ఇక్కడి రివర్సైడ్ గ్రౌండ్ పిచ్ ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు సమానంగా అనుకూలిస్తుంది. శ్రేయస్ అయ్యర్కు కీలకంఐర్లాండ్ చేతిలో ఓడిన తర్వాత పెద్ద సంఖ్యలో అభిమానులు, విశ్లేషకుల నుంచి ఒకే ప్రశ్న ఎదురైంది. వైభవ్ సూర్యవంశీని ఆడించే ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో అని అంతా అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం జట్టు పరిస్థితి చూస్తే వైభవ్తో మాత్రమే పరిష్కారం లభించేలా లేదు. రెండు మ్యాచ్లలోనూ విఫలమైన సామ్సన్, ఇషాన్ కిషన్లలో ఒకరిని పక్కన పెట్టి ముందుగా వైభవ్ను ఆడిస్తారా అనేది చర్చనీయాంశం. ఒకవేళ అతను బరిలోకి దిగినా... ఇతర బ్యాటర్లు కూడా రాణించాల్సి ఉంది. గత మ్యాచ్లో తొలి బంతికే అవుటైన అభిషేక్ శర్మతో పాటు తిలక్ వర్మ కూడా ధాటిని ప్రదర్శించాలి. శివమ్ దూబే చాలా కాలంగా బ్యాటింగ్లో ప్రభావం చూపించడం లేదు. గత టి20లో ఆడిన సూర్యాంశ్కు మరో అవకాశం ఇస్తారా చూడాలి. అయితే వరుణ్ చక్రవర్తి రాకతో స్పిన్ బలం కాస్త పెరిగింది. పేసర్ ప్రిన్స్ యాదవ్ను తప్పించి వరుణ్ను ఆడించడం దాదాపు ఖాయం. అన్నింటికి మించి ఈ సిరీస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు కీలకం కానుంది. రెండేళ్ల తర్వాత టి20 టీమ్లోకి అదీ సారథిగా అవకాశం దక్కించుకున్న అతను అటు బ్యాటర్గా, ఇటు నాయకుడిగా కూడా విఫలమయ్యాడు. మున్ముందు తీవ్ర విమర్శల నుంచి తప్పించుకోవాలంటే ఇంగ్లండ్లో అతను చాలా ప్రభావం చూపించాల్సి ఉంటుంది. బట్లర్పై దృష్టి... టి20 ప్రపంచకప్కు ముందు భారత్తో తలపడిన టి20 సిరీస్లో ఇంగ్లండ్ 1–4తో చిత్తుగా ఓడింది. ఇప్పుడు దానికి సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ భావిస్తోంది. ఈ సిరీస్లో, ఆ తర్వాత వరల్డ్కప్లోనూ విఫలమైనా... బట్లర్ తన స్థానం నిలబెట్టుకున్నాడు. అతని కెరీర్ భవిష్యత్తుకు సంబంధించి ఇది కీలక సిరీస్ కానుంది. టెస్టు మ్యాచ్ తర్వాత ఎలాంటి సాధన లేకుండా నేరుగా బరిలోకి దిగేందుకు సిద్ధమైన కెప్టెన్ ఎలా ఆడతాడనేది చూడాలి. పేసర్ ఆర్చర్కు కూడా ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి లభించింది. అయితే విధ్వంసక బ్యాటర్లు సాల్ట్, జాక్స్, బెతెల్ చెలరేగితే భారత్కు కష్టాలు తప్పవు. ఆల్రౌండర్ స్యామ్ కరన్ కీలకం కాగా... ప్రధాన స్పిన్నర్గా ఆదిల్ రషీద్పై జట్టు ఆధారపడుతోంది.80 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మొత్తం టి20 మ్యాచ్లు. 18 మ్యాచ్ల్లో భారత్... 12 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలుపొందాయి. ఇంగ్లండ్లో ఈ రెండు జట్లు 9 టి20 మ్యాచ్ల్లో తలపడ్డాయి. భారత్ 4 మ్యాచ్ల్లో, ఇంగ్లండ్ 5 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. -
అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్కు ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు యూఎస్ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో పుట్టే ప్రతి బిడ్డకు లభించే సహజ సిద్ధమైన ‘బర్త్రైట్ సిటిజన్షిప్’ (పుట్టుకతో వచ్చే పౌరసత్వం) హక్కును రద్దు చేస్తూ ట్రంప్ గతంలో జారీ చేసిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పు అమెరికాలో స్థిరపడిన లక్షలాది మంది భారతీయులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు,ప్రవాస భారతీయ కుటుంబాలకు ఊరటనిచ్చింది.అమెరికా భూభాగంపై జన్మించే పిల్లలకు రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుందని, దీనిని మార్చే అధికారం అధ్యక్షుడి ఉత్తర్వులకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అక్రమ వలసలను అడ్డుకునే పేరుతో, తాత్కాలిక వీసాలపై (హెచ్1బీ వీసా) ఉన్న విదేశీయుల పిల్లలకు కూడా పౌరసత్వం రద్దు చేయాలన్న ట్రంప్ యత్నాలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది.భారతీయులకు ఎందుకు బిగ్ రిలీఫ్?అమెరికాలో గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఒకవేళ ట్రంప్ తెచ్చిన ఆర్డర్ అమలులోకి వచ్చి ఉంటే.. అమెరికాలో పుట్టే భారతీయుల పిల్లలకు పౌరసత్వం లభించేది కాదు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో భారతీయ దంపతులకు అమెరికాలో పుట్టే పిల్లల పౌరసత్వానికి ఎలాంటి ఢోకా లేదని తేలిపోయింది. -
పాక్ వెన్నులో వణుకు పుట్టించే ప్రకటన చేసిన పీవోకే ప్రజలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పాక్లో భాగం కాదని, అంతేగాక తాము భారత్తో సంబంధాలు పెంచుకుంటామని పీవోకేలో నిరసనకారులు హెచ్చరించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని రావలాకోట్ ప్రాంత ప్రజలు వేల సంఖ్యలో నిరసన తెలుపుతున్నారు. పాకిస్థాన్ పాలనపై చాలా కాలంగా ఉన్న అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆగ్రహం కారణంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమానికి పౌర హక్కుల కార్యకర్త సర్దార్ అమన్ ఖాన్ సహా స్థానిక నేతలు నాయకత్వం వహిస్తున్నారు. రావలాకోట్లో వేలాది మంది నిరసనకారులు మంగళవారం 22వ రోజూ ఆందోళన కొనసాగించారు.ఈద్గాహ్ మైదానంలో జరిగిన నిరసనలో పలువురు నాయకులు మాట్లాడారు. పీవోకేను ఇకపై పాకిస్థాన్ అధీన ప్రాంతంగా పరిగణించకూడదని పేర్కొన్నారు. భారత్తో మరింత బలమైన సంబంధాలు ఏర్పరచుకునే దిశగా అడుగులు వేస్తామని పాక్ సర్కారుని హెచ్చరించారు.పాలనపై చాలా కాలంగా ఉన్న అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ అణచివేత, పాలనా నిర్లక్ష్యంపై ఈ ఉద్యమం ప్రారంభమైంది. నిరసనల సమాచారం బయటకు వెళ్లకుండా, ప్రజల్లో అవగాహన పెరగకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అధికారులు జూన్ 5 నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పాకిస్థాన్ అధికారులు 2 వారాల పాటు ఆహార సరఫరా, ఇతర అత్యవసర వస్తువుల రాకపోకలను అడ్డుకోవడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది.అమన్ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాకిస్థాన్ పరిపాలనలో ఉన్న కశ్మీర్ పాకిస్థాన్లో భాగం కాదని, తమకు పాకిస్థాన్ అవసరం కంటే, పాక్కే ఈ ప్రాంత అవసరం ఎక్కువని వ్యాఖ్యానించారు. ఆహారం, ఇతర అత్యవసర వస్తువులపై ఆంక్షలు కొనసాగితే ఈ ప్రాంత ప్రజలు సాయం కోసం భారత్ వైపు చూడవచ్చని అన్నారు. అలా జరిగితే ప్రాంత రాజకీయ పరిస్థితులు మారిపోతాయని, పాకిస్థాన్పై ఒత్తిడి పెరుగుతుందని అమన్ ఖాన్ చెప్పారు.ఒక వీడియోలో.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఈ ప్రాంతం పాకిస్థాన్లో భాగం కాదని ప్రకటించారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ను తిరస్కరిస్తున్నామని, నియంతృత్వాన్ని సహించబోమని చెప్పారు. ఈ నిరసనలు పాక్ ఆక్రమిత కశ్మీర్కే పరిమితం కాలేదు. విదేశాల్లో నివసిస్తున్న మద్దతుదారులు కూడా పలు దేశాల్లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు.*RAWALAKOT ROARS:* "PoJK Is Not Part of Pakistan" Thousands defy Islamabad. Sit-in at LoC since 9 June. Aman Khan: "If Pakistan blocks food, PoK's borders could open. Islamabad will beg PoK to stay." @CMShehbaz oppression has consequences. @UN @POTUS @narendramodi… pic.twitter.com/GhI0XWjwDk— 🇮🇳Bhartiyavibhooti🇮🇳 (@Bhartiyavibhoti) June 30, 2026 -
మోదీ సరిగా నిద్రపోరు.. ఆయన నా టైపే!
భారత్–అమెరికా సంబంధాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత అనుబంధం ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఆ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF) లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ట్రంప్-మోదీ స్నేహంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం మియామిలో జరిగిన యూఎఫ్సీ ఈవెంట్ సందర్భంగా ట్రంప్తో కలిసి బ్యాక్స్టేజ్లో ఉన్నప్పుడు.. ఒక్కసారిగా "ప్రధాని మోదీకి ఫోన్ చేద్దాం" అని ట్రంప్ చెప్పారన్నారు. అయితే.. అప్పటికే భారత్లో ఉదయం 6 గంటలు అవుతుందని.. బాగా వేకువజామున అని తాను చెప్పగా, ట్రంప్ వెంటనే..‘‘ఆయన(మోదీ) ఈపాటికే లేచి ఉంటారు. ఆయన నాలాగే. నిద్ర తక్కువే (He's like me). సరిగా నిద్రపోరు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చినట్లు గోర్ వివరించారు. అయితే ఆ రోజు కాల్ చేయకపోయినా.. మరుసటి రోజు ఇద్దరూ మాట్లాడుకున్నారని తెలిపారు. అయితే ఈ సంఘటనలో ప్రధాన విషయం ఫోన్ కాల్ కాదని.. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహబంధమేనని గోర్ వ్యాఖ్యానించారు."ఎవరైనా నిజమైన స్నేహితులైతే ప్రతి విషయం ముందుగానే షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ట్రంప్ నిజంగానే ప్రధాని మోదీని తన స్నేహితుడిగా భావిస్తారు" అని ఆయన అన్నారు.భారత్తో బంధానికి ట్రంప్ ప్రాధాన్యంభారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ట్రంప్ ఉన్నారని సెర్గియో గోర్ స్పష్టం చేశారు. ఇటీవల వాషింగ్టన్లో ట్రంప్తో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన సందర్భంగా కూడా ఆయన భారత్ గురించి ఎంతో అభిమానంతో మాట్లాడారని చెప్పారు. ట్రంప్కు తన గత భారత పర్యటన ఇప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని, భారత్పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని గోర్ తెలిపారు. రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా ట్రంప్ భారత్ను సందర్శిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది ట్రంప్ భారత్లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే.మొదటి టర్మ్లోనే బలపడిన స్నేహంట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలోనే మోదీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమం, భారత్లో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' సభలు ఆ ఇద్దరి స్నేహానికి ప్రతీకగా నిలిచాయి. అప్పటి నుంచి రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి కీలక రంగాల్లో రెండు దేశాల సహకారం మరింత బలపడిందని అధికారులు చెబుతున్నారు.భవిష్యత్తుపై ఆశలువచ్చే రెండేళ్లు భారత్-అమెరికా సంబంధాలకు అత్యంత కీలకమని సెర్గియో గోర్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతిక రంగాల్లో మరింత స్పష్టమైన ఫలితాలు సాధించడంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాయని చెప్పారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల పాటు ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు. -
ఇరాన్ యుద్ధంతో.. భారత్ పై యుద్ధం ఎఫెక్ట్
-
'ఆ చేతులు నరికేస్తాం'.. భారత్పై పాక్ ప్రేలాపనలు
భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం వివాదం మరింత ముదురుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఒప్పందాన్ని అమలులో నిలిపివేసిన భారత్పై పాకిస్థాన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘పాక్కు రావాల్సిన నీటిని అడ్డుకునే చేతులను నరికేస్తాం’’ అంటూ ఆ దేశ మంత్రి ఒకరు హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. సింధు జలాల ఒప్పందం(Indus Water Treaty)పై పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి భారత్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇస్లామాబాద్లో ఆ దేశ సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్, పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ సోమవారం సంయుక్త పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో.. భారత్ తమ దేశానికి రావాల్సిన నీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు."పొరుగు దేశ ప్రధాని తన చేతిలో ఉన్న కుళాయిని మూసేస్తానంటున్నారు. పాకిస్థాన్కు ఒక్క చుక్క నీళ్లు కూడా రానివ్వనని చెబుతున్నారు. మా వాటా నీటిపై ఎవరైనా చేయి వేస్తే.. ఆ చేతులను నరికేస్తాం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే సింధు జలాల ఒప్పందం ప్రకారం తమకు దక్కాల్సిన నీటి హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని స్పష్టం చేశారు.ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే: పాక్సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్ మాట్లాడుతూ.. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగానే అమల్లో ఉందన్నారు. ఒక దేశం ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం, సవరించడం లేదా నిలిపివేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం పాకిస్థాన్కు నీటిపై ఉన్న హక్కులు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా న్యాయ నిపుణులు, జలవనరుల నిపుణులతో ఇస్లామాబాద్లో అంతర్జాతీయ సదస్సు కూడా నిర్వహిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. భారత్ నిర్ణయానికి అంతర్జాతీయ మద్దతు లభించలేదని కూడా పాక్ అంటోంది.🚨 Water Gone. Threats On."Touch Our Water, We'll Cut Off Your Hand": Pakistan Minister Musadik Malik.Arre bhai, koi inko batao... pichhle 1.5 saal se paani hi band haiVideo: ARY news pic.twitter.com/Kc1d2JxCN4— OsintTV 📺 (@OsintTV) June 29, 2026పహల్గామ్ తర్వాత.. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చెనాబ్ నదుల జలాల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని చెబుతున్న భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా ముగింపు పలికే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే భారత్వ వాదనను పాకిస్థాన్ ఖండించింది.యుద్ధ హెచ్చరికలు కూడా..సింధు జలాల వివాదంపై ఇప్పటికే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. నీటి భద్రత తమ జాతీయ భద్రతలో భాగమని, దానికి ముప్పు ఏర్పడితే భారత్పై యుద్ధానికి కూడా వెనుకాడబోమని వ్యాఖ్యానించారు. తాజా ప్రకటనలతో పాకిస్థాన్ మరోసారి అదే వైఖరిని కొనసాగించింది.భారత్ ఏమంటోంది?అయితే భారత్ మాత్రం పాక్ ప్రేలాపనలు పట్టించుకోవడం లేదు. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత ప్రతినిధి అనుపమా సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంలో భాగంగా ఉపయోగించే దేశం సహకార ఒప్పందాల ప్రయోజనాలు కోరడం తార్కికం కాదన్నారు. 1960లో కుదిరిన ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అతీతంగా శాశ్వత హక్కుగా పరిగణించలేమని ఆమె స్పష్టం చేశారు. గత ఆరు దశాబ్దాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, అందుకే సింధు జలాల ఒప్పందాన్ని కూడా ప్రస్తుత వాస్తవాలకు అనుగుణంగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అలాగే జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించిన భారత్, అంతర్జాతీయ వేదికలను ఉపయోగించి పాకిస్థాన్ ఉగ్రవాదం, అంతర్గత సమస్యల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.మరోసారి మాటల యుద్ధంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక ఉద్రిక్తతలు పెరిగిన వేళ.. ఇప్పుడు సింధు జలాల ఒప్పందం కూడా మరో ప్రధాన వివాదంగా మారింది. ఒకవైపు పాకిస్థాన్ యుద్ధ హెచ్చరికలు, మరోవైపు ఉగ్రవాదం కొనసాగినంత కాలం సహకారం ఉండదన్న భారత్ వైఖరితో.. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమవుతోంది. పరిస్థితి ఎలా మారుతుందన్నది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. -
జూన్.. అసాధారణం
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అసాధారణ వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది జూన్ నెల ప్రజలను అల్లాడించింది. ఈ నెలలో వాతావరణం సాధారణానికి భిన్నంగా, ఆందోళనకరంగానే కనిపించింది. దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 28 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 149.8 మి.మీ. కాగా, కేవలం 85.2 మి.మీ. మాత్రమే నమోదైంది. సుమారు 43 శాతం లోటు ఏర్పడింది.భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడటం గత 125 ఏళ్లలో ఇది ఐదోసారి. జూన్లో 100 మి.మీ. కంటే తక్కువగా వర్షపాతం నమోదుకావడమనేది గతంలో 1905, 1926, 2009, 2014 సంవత్సరాలలో మాత్రమే జరిగింది. నైరుతి రుతుపవనాలు కేరళను కొంచెం ఆలస్యంగా జూన్ 4న తాకినప్పటికీ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా వాటి విస్తరణ పూర్తిగా మందగించింది. భారీ లోటు వర్షపాతం...ప్రాంతాల వారీగా చూస్తే, మధ్య భారతదేశంలో అత్యధికంగా 56 శాతం లోటు ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో 43 శాతం, దక్షిణాదిలో 31 శాతం, వాయవ్య రాష్ట్రాల్లో 29 శాతం లోటు నమోదైంది. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం, 1901 సంవత్సరం తర్వాత ఈ జూన్ మూడవ అత్యంత పొడి నెలగా నిలిచింది. ఇంతటి తీవ్ర వర్షపాత లోటు ఏర్పడటం 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే నమోదైంది.ఎల్నినో ప్రభావం కొంతమేర ఉన్నప్పటికీ... హిందూ మహాసముద్ర డైపోల్ తటస్థంగా ఉండటం, భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ఇచ్చే మేఘాల వ్యవస్థ భారత్కు అనుకూలమైన దిశలో లేకపోవడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం, వాయవ్య భారతం నుంచి వీచిన వేడిగాలులు క్లౌడ్ ఫార్మేషన్ను అడ్డుకోవడం తదితర వాతావరణ పరిస్థితులు ఏకమవడంతో రుతుపవనాలు స్తంభించిపోయాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 315 జిల్లాలు ప్రభావితందేశంలో మొత్తం 724 జిల్లాల్లో ఏకంగా 315 జిల్లాలు తక్కువ వర్షపాతం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిలో 25 శాతం కంటే తక్కువ నీటి పారుదల సౌకర్యం ఉన్న 111 జిల్లాలను ‘అత్యంత అప్రమత్తత’ జిల్లాలుగా కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఆ జిల్లాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాలకు చెందిన జిల్లాలు ఉన్నాయి. వాటి కోసం ‘డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కాంటింజెన్సీ ప్లాన్స్’ సిద్ధం చేశారు. అక్కడ తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు వేయడం, విత్తనాల మార్పిడి వంటి వ్యూహాలను అమలుచేయనున్నారు. -
గత 146 ఏళ్లలో భారత్లో అత్యంత దయనీయ స్థితి!
భారతదేశ వ్యాప్తంగా జూన్ నెలలో వర్షపాతం సాధారణం కంటే 42 శాతం తక్కువగా నమోదైంది. గత 146 ఏళ్లలో అత్యంత పొడి వాతావరణాన్ని జూన్ నెల ఎదుర్కోవడం గమనార్హం. గత దశాబ్దన్నర కాలంలో వేసవి రుతు పవనాలకు ఇది అత్యంత బలహీనమైన ఆరంభం. దీని ఫలితంగా దేశంలోని 76 శాతం ప్రాంతాల్లో వర్షపాతం ‘లోటు’, లేదా ‘తీవ్ర లోటు’గా ఉంది. జూలై కూడా సాధారణం కంటే పొడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాగునీరు, తాగునీటి కోసం పర్యవేక్షించే దేశంలోని 166 ప్రధాన జలాశయాలు జూన్ 25 నాటికి మొత్తం నిల్వ సామర్థ్యంలో 26 శాతాన్ని కలిగి ఉన్నాయి. నీటి మట్టాలు ఇందిరా సాగర్లో 14 శాతానికి, నాగార్జున సాగర్లో 5 శాతానికి, తెహ్రీలో 2 శాతానికి పడిపోయాయి. పసిఫిక్లో పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల(ఎల్నినో అనే పరిస్థితి) కారణంగా ఆ నెలలో రుతుపవన వర్షపాతం మళ్లీ పుంజుకున్నప్పటికీ జూలై నెలలో చాలావరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఉత్తర ఆఫ్రికా నుండి వేడి గాలిని రప్పించే స్థిరమైన అధిక పీడన వ్యవస్థ కారణంగా ఏర్పడిన వడగాడ్పులు మానవ ప్రేరిత వాతావరణ మార్పుల వల్ల మరింత తీవ్రమయ్యాయని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అనే బహుళ దేశాల పరిశోధక బృందం శుక్రవారం తెలిపింది. ఐరోపా వేసవి వాతావరణంపై ఎల్ నినో ప్రభావం పరిమితంగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత రుతుపవనాలపై ఇది ప్రధాన ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
సెషెల్స్తో మరింత బంధం
కేవలం 115 చిన్న చిన్న దీవుల సమాహారం. అందులో నివసించటానికి పనికొచ్చేవి నాలుగంటే నాలుగే. జనాభా చూస్తే లక్షా 30 వేలు. దేశ భూభాగం కేవలం 455 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇంత చిన్న దేశం సెషెల్స్లో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులు పర్యటించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో అత్యంత కీలకస్థానంలో ఉన్న ఈ ద్వీపకల్పం ఆఫ్రికా తూర్పు తీరానికి సమీపంలో, హిందూమహా సముద్రంలోని అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాలకు సమీపంలో ఉంది. ఇది ఆసియా–ఆఫ్రికా సముద్ర మార్గాల కూడలి కనుక ఆఫ్రికా, యూరప్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే నౌక లన్నీ ఈ ప్రాంతంనుంచే పోవాలి. ఆ నౌకలు నిత్యం ముడిచమురు, సహజవాయు నిక్షేపాలు, ఆహారపదార్థాలు, ముడి సరుకులు మోసుకుపోతుంటాయి. ఆ దేశాధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ ఈ ఏడాది మొదట్లో మన దేశం వచ్చారు. అటు తర్వాత మన దేశం అక్కడికి 250 టన్నుల ఆహార పదార్థాలు, భవన నిర్మాణాలకు అవసరమయ్యే సిమెంట్, ఇతరమైనవి పంపింది. దానికి కొనసాగింపుగా మోదీ జరిపిన ప్రస్తుత పర్యటనలో ఇరు దేశాలమధ్యా 19 అంశాల్లో అంగీకారం కుదిరింది. తమవంటి ద్వీపకల్ప దేశాల ఆకాంక్షలను ప్రపంచ వేదికలపై ఎలుగెత్తిచాటుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న భారత్పై ఆ దేశంలో ఆదరాభిమానాలున్నాయి. 1986లో అప్పటి దేశాధ్యక్షుడైన ఫ్రాన్స్ ఆల్బర్ట్ రెనే సోవియెట్ యూనియన్ పర్యటనకెళ్లినప్పుడు సెషెల్స్లో తిరుగుబాటుకు కుట్ర పన్నిన వైనంపై ముందస్తు సమా చారం అందుకున్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ హుటాహుటీన నావికా దళాన్ని పంపి దాన్ని అణిచేశారు. సెషెల్స్ నిడివి చిన్నదైనా సాగరజలాల్లో దాని ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఎస్జెడ్) ఏకంగా 13.7 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే భూభాగంకన్నా దాని సముద్ర వ్యాప్తి దాదాపు 3,000 రెట్లు అధికం. హిందూ మహాసముద్రంలో చైనా క్రమేపీ తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవటానికి ముత్యాల తీగ (స్ట్రింగ్ ఆఫ్ పెరెల్స్) పేరిట పాగా వేయాలని చూస్తోంది. ఆఫ్రికా తీరమైన జిబూటిలో ఇప్పటికే సైనిక స్థావరం ఏర్పాటులో బిజీగా ఉంది. కనుక ఈ ప్రాంతంలో తన పట్టు నిలుపుకొనాలంటే సెషెల్స్తో భారత్కు బలమైన బంధం ఉండితీరాలి. కోస్తా రాడార్ నెట్ వర్క్ పేరిట మన దేశం ఏర్పాటుచేసిన వ్యవస్థ ఆ ప్రాంతంలో ప్రయాణించే ప్రతి నౌక కదలికనూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అక్కడ సముద్ర దొంగల బెడద కూడా ఎక్కువే. దాంతోపాటు మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చేపలవేట ఉంటాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనటానికి రాడార్ నెట్ వర్క్ ఎంతగానో తోడ్పడుతున్నది. దీంతోపాటు మన దేశం డోర్నియర్ నిఘా విమానాలనూ, గస్తీ నౌకలనూ బహుమతిగా ఇచ్చింది. వాటిపై సెషెల్స్ రక్షణ సిబ్బందికి శిక్షణనిచ్చింది. 2020లో ఆ దేశ సుప్రీంకోర్టు భవనాన్ని ఉచితంగా నిర్మించి ఇచ్చింది.ప్రసిద్ధ నావికుడు వాస్కోడిగామా 1502లో తొలిసారి ఈ ద్వీపకల్పాన్ని సందర్శించి నప్పుడు ఇక్కడ మానవ సంచారం లేదని చెబుతారు. అటుతర్వాత 1756లో ఫ్రాన్స్ దీన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థికమంత్రి జీన్ మోరో సెషెల్స్ పేరిట ఈ ద్వీపకల్పానికి సెషెల్స్గా నామకరణం చేశారు. 1770లో ఇక్కడ వ్యవసాయ పనులకు ఫ్రాన్స్ ఆఫ్రికానుంచి భారీయెత్తున కార్మికులను తరలించింది. అప్పుడు మన దేశం నుంచి కూడా వెళ్లారు. నెపోలియన్ యుద్ధాల్లో ఒకదానిలో ఫ్రాన్స్ ఓడిపోవటంతో 1814లో ఇది బ్రిటన్ అధీనంలోకి వచ్చింది. చివరకు 1976లో దీనికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రస్తుత సెషెల్స్ జనాభాలో 12 శాతంమంది మన దేశంనుంచి వలసవెళ్లిన గుజరాత్, తమిళనాడులకు చెందినవారే. హిందూ మహాసముద్ర ప్రాంత ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. అవకాశం దొరికితే కాలూనడానికి చైనాతోపాటు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రాంతం శాంతియుత మండలంగా ఉండాలని మన దేశం మొదటినుంచీ కోరుకుంటోంది. ఇరు దేశాల సంబంధాలూ భద్రతకే పరిమితం కాకుండా పర్యావరణ పునరు ద్ధరణ, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన వనరులు, డిజిటల్ రంగ సదుపాయాలు వగైరాలకు సైతం విస్తరించాయి. ఇరు దేశాల బాంధవ్యం మున్ముందు మరింతగా ఎదుగు తుందని మోదీ పర్యటన నిరూపించింది. -
ఇక్కడ ఒక్క రోజు గడిస్తే.. బయట 2 వారాలు అవుతుందా?!
భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లోకి వెళ్లడానికి టైమ్ మిషన్ను ఉపయోగించడం సినిమాల్లో చూశాం..! ఒక గ్రహంపై ఒక్క రోజు గడిపితే.. బయటి ప్రపంచానికి కొన్ని సంవత్సరాలవుతుందని ‘ఇంటర్స్టెల్లార్’ లాంటి సినిమాల్లో చూసి ఆశ్చర్యపోయాం..! అవన్నీ కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలే అనుకున్నాం..! అయితే.. మన భూమి మీద కూడా నిజంగానే కాలం చాలా వేగంగా పరుగెత్తే వింత ప్రాంతాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? మనం ఇంతకు ముందు వీడియోలో.. బృందావనంలోని 'నిధివన్'లో ఇప్పటికీ ద్వాపరయుగం కొనసాగుతోందని భక్తులు విశ్వసిస్తారని చెప్పుకున్నాం.అదేవిధంగా.. పవిత్ర కైలాస శిఖరంపై కాలం ఊహించని వేగంతో పరుగెడుతుందంటే మీరు నమ్ముతారా?అక్కడ కేవలం ఒక్కరోజు గడిపితే.. బయటి ప్రపంచానికి రెండు వారాలతో సమానమవుతుందని, అక్కడకు వెళ్లినవారి జుట్టు, గోళ్లు విపరీతమైన వేగంతో పెరుగుతాయని చెబుతుంటారు! సైన్స్కు కూడా అంతుచిక్కని, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా సాగే ఆ కైలాస పర్వత కాల గమనం వెనుక ఉన్న రహస్యాలేంటో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా పేరున్న ఎవరెస్టును ఇప్పటి వరకు కొన్ని వేల మంది అధిరోహించారు. కానీ, దానికంటే తక్కువ ఎత్తు ఉన్న కైలాస శిఖరాన్ని మాత్రం ఇప్పటి వరకు ఒక్క పర్వతారోహకుడు కూడా అధిరోహించలేకపోయాడు. ఎందుకంటే.. కైలాస శిఖరం పరమశివుడికి నివాస స్థానం. ఆ కైలాస శిఖరం దగ్గరకు వెళ్తే.. వయసు వేగంగా పెరిగిపోతుంది. సైన్స్ సైతం అంగీకరించిన నిగూఢ అంతరిక్ష రహస్యం వెనక మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. గతంలో దీనిపై జరిగిన చరిత్రాత్మక పరిశోధనల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కైలాస పర్వతానికి సమీపంగా వెళ్లేవారు వింత అనుభవాలకు గురవుతారు. అక్కడ కాలం వేగంగా కదలడం.. గోళ్లు, జుట్టు విపరీతంగా పెరిగిపోవడం వంటి పరిణామాలను గుర్తిస్తారు. అంటే.. బయటి ప్రపంచంలో రెండు వారాల్లో జరిగే మార్పులు.. ఇక్కడ ఒక్కరోజులో చోటుచేసుకోవడం గమనార్హం..!కైలాస శిఖరం వద్ద కాల గమన వింతపై గత కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. 1926వ సంవత్సరంలో.. బ్రిటిష్ పర్వతారోహకుడు హ్యూ రూట్లేజ్ కైలాస పర్వతాన్ని పరిశోధించి, దీని చుట్టూ ఏదో అదృశ్య శక్తి ఉందని, దీనిని అధిరోహించడం అసాధ్యమని తన డైరీలో రాసుకున్నారు. 1999వ సంవత్సరంలో రష్యాకు చెందిన ప్రఖ్యాత కంటి సర్జన్, సైంటిస్ట్ డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషేవ్ నేతృత్వంలోని జియాలజిస్టులు, ఫిజిసిస్టుల బృందం కైలాస పర్వతంపై ఒక సంచలన పరిశోధన చేసింది. వారి నివేదిక ప్రకారం.. కైలాస పర్వతం అనేది ఒక సహజమైన కొండ కాదు. అది మానవాతీత శక్తులు లేదా ప్రాచీన సాంకేతికతతో నిర్మితమైన ఒక భారీ 'రాతి పిరమిడ్' అని తేలింది. ఈ పర్వతం చుట్టూ వందలాది చిన్న చిన్న పిరమిడ్లు కలిసి ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. 2015-16 కాలంలో.. ఆధునిక క్వాంటమ్ ఫిజిక్స్ పరిశోధకులు ఇక్కడి ఎనర్జీ గ్రిడ్లను మ్యాప్ చేశారు. పిరమిడ్ ఆకారంతోపాటు.. తీవ్రమైన కాస్మిక్ ఎనర్జీ రేడియేషన్ వల్ల అక్కడ 'టైమ్ డైలేషన్' జరుగుతోందని, అందుకే అక్కడ సమయం వేగంగా ముందుకు సాగుతుందని సైన్స్ పరంగా నిర్ధారించారు.ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీన్ని పిరమిడ్ ఎఫెక్ట్ లేదా మాగ్నెటిక్ ఫోర్స్ అంటుంటే.. మన పురాణాలు మాత్రం దీన్ని విశ్వానికి కేంద్ర బిందువు అయిన 'యాక్సిస్ ముండి' అని వేల ఏళ్ల క్రితమే చెప్పాయి. ఉత్తర ధ్రువానికి, దక్షిణ ధ్రువానికి సరిగ్గా.. మధ్యలో.. భూమికి, ఆకాశానికి వారధిలా ఈ కైలాస పర్వతం ఉంది. ఇక్కడి నుంచే విశ్వ శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ భూమి పైకి వస్తుందని చెబుతారు. పురాణాల ప్రకారం.. సిద్ధ పురుషులు, కిన్నెరులు నేటికీ ఇక్కడ సూక్ష్మ రూపంలో సంచరిస్తూ ఉంటారు. వారు ఉన్నతమైన లోకాలకు ప్రయాణించడానికి వీలుగా ఇక్కడ కాలం వేగాన్ని మార్చినట్లు తెలుస్తోంది.చూశారు కదా? సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా.. స్పేస్ రీసెర్చ్లు నెక్స్ట్ లెవల్లో జరుగుతున్నా.. కైలాస పర్వతం చుట్టూ ఉన్న కాల ప్రవాహ రహస్యాన్ని మాత్రం పూర్తిగా డీకోడ్ చేయలేకపోయారు మన శాస్త్రవేత్తలు. అక్కడ గడియారాలు తప్పు చూపిస్తాయి, దిక్సూచి అంటే.. కంపాస్ పనిచేయదు. రష్యా శాస్త్రవేత్తల నివేదికలు సైతం అంగీకరించిన ఈ కాల గమన వింత.. పరమశివుడి అనంత శక్తికి ఒక సజీవ సాక్ష్యం. ప్రకృతి, పరమాత్మ దాచిన ఈ కైలాస కోడ్ ఎప్పటికీ ఒక పవిత్ర మిస్టరీనే! దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్సవ్వకుండా ఉండేందుకు మా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.. -
బంగ్లాతో చైనా ఒప్పందాలు.. భారత్ ఆందోళన ఏంటి? చైనా ఏమంది?
చైనా, బంగ్లాదేశ్ ఇటీవల 13 ఒప్పందాలపై సంతకాలు చేసుకున్న విషయం తెలిసిందే. తీస్తా సహా తదితర నదుల నిర్వహణలో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందాలు జరిగాయి. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో దీని గురించి చైనా స్పందించింది. తీస్తా నది నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టు (టీఆర్సీఎంఆర్పీ) విషయంలో బంగ్లాదేశ్కు తమ మద్దతు ఉంటుందని చైనా మరోసారి స్పష్టం చేసింది. బంగ్లాదేశ్తో చేసుకున్న తమ ఒప్పందం ఏ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నది కాదని చైనా తెలిపింది.బీజింగ్లో మీడియాతో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ.. "చైనా-బంగ్లాదేశ్ సహకారం ఏ మూడో దేశాన్నీ లక్ష్యంగా చేసుకోదు. చైనా-బంగ్లాదేశ్ సహకారంలో ఏ మూడో దేశం జోక్యం ఉండకూడదు" అని చెప్పారు.ఈశాన్య ప్రాంతానికి సమీపంలో నదితీస్తా నది పరివాహక ప్రాంతం భారత్ ఈశాన్య ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంది. ఇదే భారత్ ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం. తీస్తా నదికి సమీపంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్, అంటే చికెన్ నెక్ ప్రాంతం ఉండటమే భారత్ ఆందోళనకు ప్రధాన కారణం.ఆ ప్రాంతంలో, ముఖ్యంగా చైనా ఉనికి పెరగడం, భారత్ భద్రతా ఆందోళనలను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశ ఈశాన్య ప్రాంతాన్ని మిగతా భారతదేశంతో కలిపే ఈ కారిడార్ విషయంతో సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.ఆ నదీ ప్రాజెక్టు బంగ్లాదేశ్ ప్రజల జీవనోపాధికి ఉపయోగపడే ప్రాజెక్టు అని చైనా పేర్కొంటోంది. "తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధర ప్రాజెక్టు అనేది బంగ్లాదేశ్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రజల జీవనోపాధి ప్రాజెక్టు. దీనికి సాధ్యమైనంత సాయం అందించడానికి చైనా సిద్ధంగా ఉంది" అని జియాకున్ చెప్పారు."అభివృద్ధి వ్యూహాల్లో బంగ్లాదేశ్తో మరింత సమన్వయం సాధించడానికి, ఆర్థికం, వాణిజ్యం, జల సంరక్షణ, ప్రజల జీవనోపాధి వంటి రంగాల్లో పరస్పర చర్చలు, సహకారాన్ని మరింత పెంచడానికి చైనా సిద్ధంగా ఉంది" అని ఆయన అన్నారు.ఈ ప్రాజెక్టుపై ఇరు దేశాల నిపుణులు తొలిసారిగా సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహిస్తారని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రహ్మాన్ తెలిపారు. "ఇందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. సాధ్యాసాధ్యాలపై జరిపే అధ్యయనం అనుకూలంగా ఉంటే ఈ ప్రాజెక్టుకు సాధ్యమైనంత మద్దతు ఇస్తామని చైనా తెలిపింది" అని మంత్రి అన్నారు.బంగ్లాదేశ్లోని నదుల నిర్వహణలో సహకారాన్ని పెంచుకోవడానికి బంగ్లాదేశ్, చైనా ఒప్పందాలు చేసుకున్నాయి. తీస్తా ప్రణాళికపై వచ్చే ప్రకటనలను భారత్ నిశితంగా గమనించనుంది.ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ వాటర్ డెవలప్మెంట్ బోర్డు (బీడబ్ల్యూఢీబీ), చైనా ప్రభుత్వ అధీన సంస్థ పవర్ చైనా అవగాహన ఒప్పందం గడువును పొడిగిస్తూ సంతకాలు చేశాయి. దీనితో తీస్తా ప్రాజెక్టు ముందుకు సాగింది. -
ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఆలీ ఖమేనీ అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వివరాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. బిహార్ గవర్నర్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఆలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ దాడి అనంతరం సైతం భీకరమైన యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ఖమేనీ అంత్యక్రియలకు అనుకూల సమయం లభించలేదు. దీంతో ఇంతకాలం పాటు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఎట్టకేలకు జూలై 4 నుంచి అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మసూజ్ ఫెజెష్కియన్ ఈ కార్యక్రమాలకు హాజరుకావాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అధికారికంగా ఆహ్వానం అందించారు. అయితే, అదే సమయంలో ప్రధానమంత్రి ముందే ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల పర్యటనలో ఉండటం వల్ల ఆయన ఈ కార్యక్రమాల్లో స్వయం పాల్గొనలేకపోతున్నారని కేంద్రం తెలిపింది. దీంతో సుప్రీం లీడర్ అంత్యక్రియలకు భారత్ తరఫున బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర సహాయ మంత్రి శ్రీ పబిత్రా మార్గరీటాలు హాజరు కానున్నట్లు పేర్కొంది.ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్జూలై 4న టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్లో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. దీనితో అంత్యక్రియల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతాయి. టెహ్రాన్, కోమ్ నగరాల్లో బహిరంగ ఊరేగింపులు నిర్వహిస్తారు. అలాగే ఇరాక్ లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేపడతారు. జూలై 9 న ఖమేనీ సొంత ఊరైన మషహాద్లోని ప్రసిద్ధ 'ఇమామ్ రెజా' పుణ్యక్షేత్రంలో జూలై 9న అంతిమ కార్యక్రమం జరగనుంది. -
కరాచీ దాడిపై పాక్కు భారత్ గట్టి కౌంటర్
న్యూఢిల్లీ: పాక్లోని కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయ ఏజెంట్ల హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులవైపు వేలు చూపించడం మానేసి, తమ సొంత భూభాగంలో పెరుగుతున్న ఉగ్రవాద నెట్వర్క్లను అణచివేయడంపై దృష్టి పెట్టాలని ఢిల్లీ గట్టిగా హితవు పలికింది. మరోవైపు, ఈ దాడికి నిరసనగా పాకిస్తాన్ సైన్యం తూర్పు అఫ్గానిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి వేళ ఆకస్మిక వైమానిక దాడులకు తెగబడటంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పీక్కు చేరాయి.కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో ‘ఇండియన్ ప్రాక్సీ’ ప్రమేయం ఉందంటూ పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. కరాచీలోని పారామిలిటరీ బలగాల కేంద్రమే లక్ష్యంగా పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని ఒక ఉగ్రవాది వేగంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. అనంతరం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు గాయపడ్డారు. ఇది కూడా చదవండి: హిజ్బుల్లా భారీ ఆయుధ సొరంగాన్ని పేల్చివేసిన ఇజ్రాయెల్ -
హిందూ మహాసముద్రం అవకాశాల సంద్రం
విక్టోరియా: భాగస్వామ్యం అనేది దేశ పరిమాణంపై కాకుండా పరస్పర గౌరవం, విశ్వాసంపై ఆధారపడి ఉండాలని భారత ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఆర్థిక శ్రేయస్సుతో పాటు సముద్ర భద్రత కూడిన సుసంపన్న హిందూ మహాసముద్రాన్ని భారతదేశం ఆకాంక్షిస్తోందని అన్నారు. భారత్, సీషెల్స్ దేశాల రక్షణ, భద్రతలు ఒకదానికొకటి విడదీయరానివని స్పష్టంచేశారు. హిందూ మహాసముద్రాన్ని అవకాశాల సముద్రంగా మార్చడమే తమ ధ్యేయమని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆదివారం సీషెల్స్లోని విక్టోరియా నగరంలో సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో సమావేశమయ్యారు. ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. హెర్మినీతో భేటీ అనంతరం మోదీ మాట్లాడారు. హిందూ మహాసముద్రం మన ఉమ్మడి ఇల్లు అని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సముద్ర భద్రత, సుస్థిరత, శ్రేయస్సు మన ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. భారతదేశపు మహాసాగర్ (ప్రాంతాలవ్యాప్తంగా భద్రత, వృద్ధి కోసం పరస్పర మరియు సంపూర్ణ పురోగతి) దార్శనికతకు ఇదే మూలమని తెలిపారు. వృద్ధి కోసం నూతన అవకాశాల అన్వేషణ భారత్, సీషెల్స్ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంపై చర్చించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. పరిశ్రమలు, అనుసంధానం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు సహా ఇతర రంగాల్లో వృద్ధి కోసం రెండు దేశాలు నూతన అవకాశాలను అన్వేషిస్తాయని చెప్పారు. వాతావరణ మార్పులపై పోరాడుదాం తర్వాత సీషెల్స్ నేషనల్ అసెంబ్లీలో మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలు.. ముఖ్యంగా ద్వీప దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ఇప్పటికే తీరప్రాంతాలు, సముద్ర జీవావరణ వ్యవస్థలు, వాతావరణ సరళి, సమాజాలపై కనిపిస్తున్నాయని చెప్పారు. ఆయన ఆదివారం సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించారు. వాతావరణ మార్పులకు అతి తక్కువగా కారణమైవారు దాని పర్యవసానాల అత్యధిక భారాన్ని మోయకూడదని స్పష్టంచేశారు. వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరింత సమ్మిళిత ప్రపంచం, సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించే అంతర్జాతీయ సంస్థల పట్ల భారత్, సీషెల్స్ ఒకే దృక్పథాన్ని పంచుకుంటున్నాయని గుర్తుచేశారు. గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి నిబద్ధతను చాటుతున్నాయని పేర్కొన్నారు.19 కీలక అంశాలపై నిర్ణయం రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య వంటి పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భారత్, సీషెల్స్ తీర్మానించుకున్నాయి. భారత ప్రధాని మోదీ, సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ మధ్య ఆదివారం జరిగిన చర్చల్లో 19 అంశాలపై నిర్ణయానికి వచ్చారు. ఇందులో నేరస్తుల అప్పగింత ఒప్పందం, బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడంలో సహకార ఒప్పందం, సీషెల్స్లో యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఒప్పందం, ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సమగ్ర రుణ ఒప్పందం, నూతన సీషెల్స్ జాతీయ ఆసుపత్రికి సహకార ఒప్పందం ఉన్నాయి. సీషెల్స్కు ఒక వేగవంతమైన గస్తీ నౌకను బహుమతిగా ఇవ్వడం, రక్షణ దళానికి 10 యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ తరగతి పడవలను అప్పగించడం, తీర రక్షక దళం బలోపేతానికి సహకరించడం, గ్లాస్ కాక్పిట్తో ఒక డోర్నియర్ విమానాన్ని ఉన్నతీకరించడం వంటి అంశాలను ఇరు పక్షాలు ప్రకటించాయి. దౌత్య శిక్షణ కోసం సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సరీ్వస్, సీషెల్స్ విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. మోదీకి సీషెల్స్ గౌరవ పురస్కారం ప్రదానం ప్రధాని మోదీకి సీషెల్స్ ప్రభుత్వం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’అనే గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ ఆయనను ఈ పురస్కారంతో సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల మోదీ చూపుతున్న నిబద్ధత, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషికి ఈ గౌరవాన్ని అందించారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లతో పోరాడుతున్న దేశాలకు, పర్యావరణ పరిరక్షణను భవిష్యత్ తరాల పట్ల తమ బాధ్యతగా భావిస్తున్న దేశాలకు అవార్డ్ను అంకితం చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. -
ఐర్లాండ్ చేతిలో ఓటమి.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్ ..అసలు కారణం ఇదే
-
రాజకీయ సన్యాసం అనుకుంటే.. దేశ ప్రధాని అయ్యారు!
తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో 1991 మే 21న జరిగిన బాంబు పేలుడులో రాజీవ్ గాంధీ మరణించడం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ సమయంలో రాజకీయ సన్యాసం తీసుకుని, ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోయేందుకు సామాన్లు కూడా సర్దుకున్న పివి నరసింహారావు జీవితం ఒక ఊహించని మలుపు తిరిగింది. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య ఆయన భారతదేశపు 9వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేడు (జూన్ 28) పీవీ 105వ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..శంకర్ దయాల్ శర్మ తిరస్కరణ.. పివి వైపు మొగ్గురాజీవ్ గాంధీ అంత్యక్రియల అనంతరం తదుపరి ప్రధాని ఎవరనే దానిపై సోనియా గాంధీ చర్చలు జరిపారు. పీఎన్ హక్సర్ సలహా మేరకు తొలుత అప్పటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు ఈ పదవిని ప్రతిపాదించారు. అయితే, తన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ఈ బాధ్యతను నిరాకరించారు. ఆ తర్వాత హక్సర్తో పాటు రాజీవ్ గాంధీ మిత్రుడు సతీష్ శర్మ కూడా పివి నరసింహారావు పేరును సూచించారు. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంది.సంక్షోభంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్10వ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 244 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రధాని రేసులో శరద్ పవార్ పేరు కూడా వినిపించినప్పటికీ, చివరికి ఆయన వెనక్కి తగ్గారు. మధ్యప్రదేశ్ దిగ్గజ నేత అర్జున్ సింగ్ ప్రతిపాదనతో పివి నరసింహారావును పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. 1991 జూన్ 21న ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన క్యాబినెట్లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, శరద్ పవార్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నంద్యాల ఉపఎన్నికలో పీవీ ఘనవిజయం సాధించారు.17 భాషల కోవిడుదు పీవీపీవీ నరసింహారావు కేవలం రాజకీయ నాయకుడే కాదు, బహుభాషా కోవిదుడు. ఆయనకు తెలుగు, హిందీలతో పాటు అరబిక్, పర్షియన్, స్పానిష్, ఫ్రెంచ్ వంటి దాదాపు 17 భాషలపై అసాధారణ పట్టు ఉండేది. విదేశీ పర్యటనల్లో ఇతర దేశాల నాయకులతో మాట్లాడేటప్పుడు ఆయనకు ఎలాంటి అనువాదకుల (ట్రాన్స్లేటర్స్) అవసరం పడేది కాదు. సాహిత్య రంగంలో కూడా ఆయనకు అమితమైన అభిరుచి ఉంది. -
భారత్కు చైనా షాక్.. బంగ్లాతో బిగ్ డీల్!
ఢాకా: బంగ్లాదేశ్–చైనా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇరు దేశాల తాజా సంయుక్త ప్రకటనలో మోంగ్లా పోర్ట్ ఆధునీకరణ, అభివృద్ధి ప్రాజెక్టుల్లో చైనా భాగస్వామ్యం మరింత పెరగనున్నట్లు వెల్లడైంది. ఈ పరిణామం దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.బంగ్లాదేశ్–చైనా ప్రకటన ప్రకారం, మోంగ్లా పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపు, వాణిజ్య సౌకర్యాల విస్తరణలో చైనా సహకారం కొనసాగనుంది. అయితే, ఇది బంగాళాఖాతం ప్రాంతంలో చైనా ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే ఒప్పందంలో భాగంగానే తీస్టా నది సమగ్ర నిర్వహణ ప్రాజెక్ట్లో కూడా చైనా సహకారం అంశం చోటు చేసుకోవడం భారత్లో వ్యూహాత్మక ఆందోళనలకు కారణమైంది. ఈ ప్రాజెక్ట్ ప్రాంతం భారత్లోని సిలిగురి కారిడార్కు సమీపంలో ఉండటంతో భద్రతా పరంగా సున్నితమైనదిగా పరిగణించబడుతోంది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బంగ్లాదేశ్ చైనా భాగస్వామ్యాన్ని ప్రధానంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ కోణంలో చూస్తున్నప్పటికీ, దీని ద్వారా బంగాళాఖాతం ప్రాంతంలో శక్తి సమతుల్యతలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. భారత్ ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పటికీ, అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అయితే సముద్ర వాణిజ్య మార్గాలు, ప్రాంతీయ భద్రత, మరియు ఈశాన్య భారత వ్యూహాత్మక పరిస్థితులపై దీర్ఘకాల ప్రభావం ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిణామం తక్షణ రాజకీయ మార్పు కంటే దక్షిణాసియాలో చైనా ప్రభావ విస్తరణకు మరో సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.మోంగ్లా పోర్ట్ ప్రాజెక్ట్ ప్రాధాన్యం?మోంగ్లా పోర్ట్ బంగ్లాదేశ్లో రెండో అతిపెద్ద సముద్ర వాణిజ్య కేంద్రం. ఈ పోర్ట్ అభివృద్ధి ద్వారా బంగ్లాదేశ్కు దిగుమతి, ఎగుమతి సామర్థ్యం పెరుగుతుంది. కంటైనర్ హ్యాండ్లింగ్ వేగం మెరుగవుతుంది. బంగాళాఖాతం వాణిజ్య మార్గాల్లో రవాణా సామర్థ్యం పెరుగుతుంది. అలాగే, చైనా కంపెనీల భాగస్వామ్యం పెరగడం వల్ల ఈ ప్రాజెక్ట్లో పెట్టుబడులు, సాంకేతిక సహకారం పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే దీని ద్వారా చైనా సముద్ర వాణిజ్య నెట్వర్క్లో తన స్థానం బలపడే అవకాశం ఉంది.చైనా ఎందుకు ఆసక్తి చూపుతోంది?ఈ ఒప్పందం చైనాకు మూడు ప్రధాన ప్రయోజనాలు కల్పించవచ్చు:1. బంగాళాఖాతం ప్రభావంబంగాళాఖాతం ప్రాంతంలో చైనా ఆర్థిక–లాజిస్టిక్ ఉనికి పెరుగుతుందిసముద్ర వాణిజ్య మార్గాలపై ప్రభావం పెరగవచ్చు2. ప్రాంతీయ కనెక్టివిటీ నెట్వర్క్బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) భాగంగా పోర్ట్ అభివృద్ధిదక్షిణాసియాలో రవాణా–వాణిజ్య హబ్లపై ప్రభావం3. దీర్ఘకాల వ్యూహాత్మక స్థానంఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై నియంత్రణ పెంపు -
ముడి చమురుకు బై బై.. భారత్లోకి జపాన్ మిథేన్ పవర్
న్యూఢిల్లీ: క్లీన్ మొబిలిటీ (స్వచ్ఛమైన రవాణా) రంగంలో భారత్, జపాన్ దేశాలు ఒక భారీ విప్లవానికి తెరలేపాయి. పెరుగుతున్న ఇంధన అవసరాలను తీరుస్తూనే, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేలా సుమారు 1,000 మిథేన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇరు దేశాలు ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తున్నాయి. జపాన్ ప్రధాని సనాయే తకైచి మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఈ కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.1,000 మిథేన్ ప్లాంట్లు – సరికొత్త రవాణా విప్లవంఈ ప్రతిపాదిత భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో మిథేన్ ఉత్పత్తి కేంద్రాలను భారీగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ప్లాంట్ల సంఖ్యను దాదాపు 1,000కి పెంచనున్నారు. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే బయోగాస్ను (మిథేన్) సీఎన్జీ వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది దేశంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాకుండా, ముడి చమురు దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.రంగంలోకి సుజుకి – గ్లోబల్ సౌత్ అసిస్టెన్స్భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో అగ్రగామిగా ఉన్న జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం ‘సుజుకి మోటార్’ ఈ ప్రాజెక్టులో అత్యంత కీలక పాత్ర పోషించనుంది. జపాన్ ప్రభుత్వానికి చెందిన ‘గ్లోబల్ సౌత్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ మద్దతుతో సుజుకి ఇప్పటికే భారత్లో బయోగాస్ ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించింది. ప్రస్తుతం భారతదేశంలో కొత్త ప్యాసింజర్ వాహనాల విక్రయాలలో సీఎన్జీ వాహనాల వాటా 20 శాతానికి పైగా ఉండటంతో, ఈ కొత్త ఇంధన లభ్యత సీఎన్జీ వాహనాల వినియోగాన్ని మరింత పెంచనుంది.మోదీ-తకైచి సదస్సు – వ్యూహాత్మక బంధంగత ఏడాది అక్టోబరులో బాధ్యతలు చేపట్టిన తర్వాత జపాన్ ప్రధాని సనాయే తకైచి భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సాంప్రదాయ దౌత్య సంబంధాలలో భాగంగా జరగనున్న ఈ భేటీలో ఆర్థిక భద్రత, స్వచ్ఛమైన ఇంధనం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో భారత్తో సంబంధాలు తమకు ఎంతో కీలకమని జపాన్ భావిస్తోంది.ఇది కూడా చదవండి: చేతిరాత బాగోలేదని నవ్వితే.. పప్పులో కాలేసినట్లే! -
సెషెల్స్ భద్రతకు భరోసా
విక్టోరియా: ద్వీప దేశమైన సెషెల్స్ సముద్ర భద్రతా సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారత్ సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన శనివారం సెషెల్స్ దేశానికి చేరుకున్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’నిఘా నౌకను సీషెల్స్ కోస్ట్గార్డుకు లాంఛనంగా అందజేశారు. రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో భారత్–సెషెల్స్ మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. భారత్లో తయారైన నిఘా నౌకను సెషెల్స్కు అందజేయడం ఇరుదేశాల మధ్య సంబంధాల్లోమరో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోందని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అలాగే ఆరు అంబులెన్స్లు, పది యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ బోట్లను కూడా సెషెల్స్కు అందజేశారు. అంతకుముందు భారత్ నుంచి సెషెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మోదీకి దేశాధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ ఘన స్వాగతం పలికారు. మోదీకి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. కళాకారులు నాట్య ప్రదర్శనలతో మోదీని స్వాగతించారు. మోదీ కోసం సెషెల్స్లోని భారతీయులు తరలివచ్చారు. వారితో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. భారతదేశం పట్ల వారికున్న ప్రగాఢమైన అభిమానం, సెషెల్స్ పురోగతికి వారు అందిస్తున్న నిరంతర సహకారం నిజంగా ప్రశంసనీయమని పేర్కొ న్నారు. భారతీయ ప్రవాసులు చాలాకాలంగా మన రెండు దేశాల మధ్య ఒక శక్తివంతమైన వారధిగా పనిచేస్తూ, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తూ, మన ఉమ్మడి ప్రయాణాన్ని సుసంపన్నం చేస్తున్నారని కొనియాడారు. ఈ పర్యటనలో భాగంగా ప్యాట్రిక్ హెర్మినీతో మోదీ సమావేశం కాబోతున్నారు. ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ చర్చిస్తారు. సెషెల్స్ నేషనల్ డే స్వర్ణోత్సవాలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. హిందూ మహాసముద్రంలో సెషెల్స్ ఒక విలువైన సముద్ర భాగస్వామి, సన్నిహిత మిత్రదేశమని మోదీ వివరించారు. రెండు దేశాల ప్రజలకు లబ్ధి చేకూరేలా సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కూర్మ రాజును సందర్శించిన మోదీ ప్రధాని మోదీ శనివారం అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో కలిసి సెషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్లోని భారీ తాబేళ్ల ఆవరణను సందర్శించారు. ఇక్కడ అల్డాబ్రా వృద్ధ తాబేలుకు ఆహారం తినిపించారు. సీషెల్స్కు చెందిన అల్దాబ్రా భారీ తాబేళ్లు భూమిపై అత్యంత పెద్దవి, అత్యధిక కాలం జీవించే జీవజాతుల్లో ఒకటి. వీటిలో కొన్ని తాబేళ్లు రెండు శతాబ్దాలకు పైగా చరిత్రకు సాక్షిగా నిలిచాయి. ‘‘అల్డాబ్రా తాబేళ్లకు భారత్, సీషెల్స్ మధ్యనున్న ప్రత్యేక స్నేహంతో అనుబంధం ఉంది. 2014లో రెండు తాబేళ్లను కోల్కతాలోని అలీపూర్ జంతు పదర్శన శాలకు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత కొన్నేళ్లకు సెషెల్స్ మరికొన్ని తాబేళ్లను హైదరాబాద్ జూకు బహుమతిగా అందించింది’’అని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల రెండు దేశాలకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను చాటిచెబుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సెషెల్స్కు మాత్రమే ప్రత్యేకమైన ‘కోకో డి మెర్’అనే మొక్కను మోదీ నాటారు. కోకో డి మెర్కు సీషెల్స్లో విస్తృతమైన గౌరవం ఉందని, అది ఆ దేశ జాతీయ చిహ్నంపై కూడా ఉంటుందని మోదీ వివరించారు. అత్యంత పెద్ద విత్తనాలు, అత్యంత బరువైన పండ్లను ఉత్పత్తి చేయడంలో ఈ జాతి ప్రసిద్ధి చెందిందని తెలిపారు. -
భారత కంపెనీలకు ఉపశమనం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఘర్షణల కారణంగా భారత కంపెనీల లాభాదాయకత ముందు అంచనా వేసిన స్థాయిలో ప్రభావితం కాకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. యూఎస్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగడంతోపాటు, ఇంధన సరఫరాలు సాధారణ స్థితికి రావడంపైనే ఈ ప్రభావం ఆధారపడి ఉంటుందని తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభంతో 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీల నిర్వహణ మార్జిన్లు 100 బేసిస్ పాయింట్లు (ఒక శాతం) తగ్గిపోవచ్చని తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఘర్షణలు ఎక్కువ కాలం పాటు కొనసాగొచ్చని, హర్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకోకపోవచ్చన్న అంచనా ఆధారంగా.. కంపెనీల లాభదాయకత 200 బేసిస్ పాయింట్లు తగ్గిపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ లోగడ పేర్కొనడం గమనార్హం. అమెరికా–ఇరాన్ మధ్య ఈ నెలలో కుదిరిన అవగాహన ఒప్పందంతో హర్మూజ్ జలసంధి తెరుచుకోవడం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా దిగొచ్చాయి. బ్రెంట్ బ్యారెల్ 73 డాలర్ల స్థాయికి పడిపోయింది. యుద్ధ సమయంలో ఒక దశలో 121 డాలర్ల వరకు వెళ్లడం చూశాం. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటూ, గ్యాస్ సరఫరా సాధారణ స్థాయికి చేరుకునేందుకు చాలా కాలమే పట్టొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కార్పొరేట్ ఇండియా సరఫరా వైవిధ్యంపై దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు సగటున 80–85 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. కొన్ని రంగాలపై ఎక్కువ ప్రభావం.. పశ్చిమాసియా ఘర్షణలతో 22 రంగాల కంపెనీల లాభదాయకతపై ఎక్కువ ఒత్తిడి పడొచ్చని క్రిసిల్ లోగడ అంచనా వేయగా.. ఇప్పుడు పది రంగాలపైనే ఈ ప్రభావం చెప్పకోతగ్గ స్థాయిలో ఉంటుందని తెలిపింది. అంతేకానీ, భారీగా ఆదాయం, లాభాలు తగ్గడం ఉండదని స్పష్టం చేసింది. ఎయిర్లైన్స్ (విమానయాన సంస్థలు), సిరామిక్స్, పాలిస్టర్ టెక్స్టైల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్యాకేజింగ్, వజ్రాల పాలిíÙంగ్ కంపెనీలపై ఎక్కువగా ఒత్తిళ్లు ఉండొచ్చంటూ.. వీటికి ధరల నిర్ణయంలో వెసులుబాటు లేకపోవడం, సరఫరా సమస్యలు, అధిక ముడి సరకుల వ్యయాలు, బలహీన లాభదాయకత, అధిక మూలధన అసవసరాలు, బలహీన బ్యాలన్స్ షీట్లను కారణాలుగా పేర్కొంది. దీంతో ఈ కంపెనీల క్రెడిట్ రేటింగ్ ప్రతికూలంగా మారే రిస్క్ లేకపోలేదని తెలిపింది. ముడి చమురు ధరలు దిగిరావడం, గ్యాస్ సరఫరాలు మెరుగుపడడం చాలా రంగాలకు ఉపశమనాన్నిస్తుందని అంచనా వేసింది. దీనికితోడు ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై నిధులు ఖర్చు చేస్తుండడం, దేశీ వినియోగ డిమాండ్ ఆదాయ వృద్ధికి అనుకూలిస్తాయని తెలిపింది. అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) 5.0 కింద రూ.2.55 లక్షల కోట్ల అదనపు రుణ సాయం, ఎయిర్లైన్స్కు ప్రత్యేకంగా రూ.5,000 కోట్లు అన్నవి నిధుల అవసరాలను తీరుస్తాయని అభిప్రాయపడింది. లాభాల్లోకి చమురు కంపెనీలు ఇంధన ధరలు తగ్గడంతో ఆయిల్ మార్కెటింగ్, ఎరువుల కంపెనీలు ఎక్కువగా ప్రయోజనం పొందుతాయని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు మార్చి నుంచి మే మధ్య రూ.40,000–45,000 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నాయని, ధరలు దిగిరావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవి నిర్వహణ లాభంలోకి తిరిగి అడుగు పెడతాయని తన నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా రెండు రిస్్కలు పొంచి ఉన్నట్టు తెలిపింది. యూఎస్–ఇరాన్ ఒప్పందం ముందుకు వెళ్లకుండా, ఘర్షణలు తిరిగి మొదలు కావడం ఒకటి కాగా.. ఎల్నినో కారణంగా వర్షాలు బలహీనపడితే గ్రామీణ వినియోగం సన్నగిల్లుతుందని అంచనా వేసింది. -
తండ్రి రూపంలో యముడు.. పిల్లలపై పాశవికం
త్రిపురలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు మైనర్ పిల్లలపై కర్రతో దాడి చేసి చంపాడు. ఈ ఘటన మారుమూల ధలాయ్ జిల్లాలోని గండచెర్రా పరిధిలో ఉన్న ఉల్తాచ్ఛారా ఏడీసీ గ్రామంలో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితుడు లాల్చువానామా బ్రూ మద్యం మత్తులో ఇంటికి వచ్చి ముందు తన భార్య రామ్టారు బ్రూపై దాడి చేశాడు. ఆమె తమ పిల్లల్లో ఒకరిని తీసుకుని ఇంటి నుంచి తప్పించుకుంది. అయితే, మరో ఇద్దరు పిల్లలు (4 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె) ఇంట్లోనే ఉన్నారు. నిందితుడు కర్రతో ఆ ఇద్దరు చిన్నారులపై దాడి చేసినట్టు సమాచారం. ఆ దాడిలో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గండచెర్రా సబ్-డివిజనల్ ఆసుపత్రి మార్చురీలో పోస్ట్మార్టం కోసం ఉంచారు. -
అక్కడ లేదు ఇక్కడ రాదు
సాక్షి, హైదరాబాద్: ఒరాకిల్, సిస్కో, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. వీరిలో భారతీయులూ ఉన్నారు. పరాయి గడ్డ మీద దిగ్గజ కంపెనీల్లో పనిచేసి ఉపాధి కోల్పోయిన వీరు భారత్లో తిరిగి ఉద్యోగాలు పొందడానికి కష్టపడుతున్నారు. మంచి అనుభవం, అంతర్జా తీయ ప్రాజెక్ట్ ఎక్స్పోజర్, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్నా కూడా చాలామంది తిరిగి వచ్చిన వెంటనే స్థిరమైన ఉద్యోగం పొందలేకపోతు న్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన, 280 బిలియన్ డాలర్ల ఔట్సోర్సింగ్ పరిశ్రమలో మునుపెన్నడూ లేని మందగమనాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.అక్కడేమో ఏడాదికి రూ. కోటిప్రత్యేక స్టాఫింగ్ సంస్థ ఎక్స్ఫెనో గణాంకాల ప్రకారం 2026లో ఇప్పటివరకు సుమారు 7,300 మంది అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చారు. ఈ సంఖ్య 2025లో 15,100, అంతక్రితం సంవత్సరంలో 9,700గా ఉందని అంచనా. అంటే రెండున్నరేళ్లలో 32 వేల మందికిపైగా ఇంటిబాట పట్టారు. ఇప్పటికే దేశీయ జాబ్ మార్కెట్లో అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. యూఎస్లో వీరు అధిక వేతనాలను అందుకున్నారు. రూ. కోటికిపైగా వార్షిక వేతనం అందుకున్నవాళ్లే అత్యధికం. ఇక్కడా అదే స్థాయి వేతనాలను వీరు ఆశిస్తున్నారు. దీంతో భారత్కు తిరిగివచ్చిన టెకీలకు ఉద్యోగాలు దొరకడం లేదు. కంపెనీలు నియామకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో జూన్లో ఇది 28 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో అవకాశాలున్నా.. అధిక ప్యాకేజీ డిమాండ్ చేస్తుండటంతో వీరి నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. అమెరికాలో పనిచేసిన అనుభవంతో తిరిగి వచ్చే అభ్యర్థులు అక్కడి స్థాయికి దగ్గరగా జీతం కోరుతున్నారు. కానీ మన దేశంలోని సంస్థలు, ముఖ్యంగా స్టార్టప్స్, మధ్యస్థాయి కంపెనీలు అంతటి ప్యాకేజీలను ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడం సమస్యను పెంచుతోంది. ఒకవైపు అమెరికా నుంచి తిరిగివస్తున్న నిపుణులు.. మరోవైపు స్థానికంగా కొత్తగా ఉద్యోగాలు వెతుకుతున్న యువ టెకీలు.. ఈ రెండు వర్గాలకు సరిపడే వేగంతో నియామకాలు జరగడం లేదు.ఉద్యోగ సంక్షోభంఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 204 టెక్ కంపెనీలు 1,21,516 మంది నిపుణులను తొలగించాయి. వీటిలో ఒక్క అమెరికాకు చెందిన మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలలో లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్నారు. వీరిలో ఎంతమంది హెచ్–1బీ వంటి నైపుణ్యం కలిగిన కార్మిక వీసాలపై ఉన్నారనేది స్పష్టత లేదు. నియామకాల్లో ఏఐ భారీ మార్పును సృష్టిస్తున్న సమయంలోనే ఈ ఉద్యోగ సంక్షోభం ఏర్పడింది. తిరిగి రావాలనుకునే హెచ్–1బీ కార్మికులకు సహాయపడే ఎక్స్హెచ్1బీ ప్లాట్ఫామ్లో ఐదు నెలల్లో 500–600 మంది సైన్ అప్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తిరిగి వచ్చిన వారికి ఉద్యోగం కనుగొనడం మునుపటి కంటే చాలా కష్టంగా మారిందని స్టాఫింగ్ కంపెనీలు చెబుతున్నాయి. ‘చాలామంది అధిక వేతన శ్రేణిలో వస్తారు. ఇక్కడి వారితో సమానమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారు. కాబట్టి ఉద్యోగం పొందడానికి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిందే’ అని టీమ్లీజ్ తెలిపింది.ఫ్రాక్షనల్ సీఎక్స్ఓలకు...కొన్ని జీసీసీలు, స్టార్టప్స్ అనుభవజ్ఞులైన టాలెంట్ను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డేటా, క్లౌడ్, ఏఐ, సైబర్సెక్యూరిటీ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి అవకాశాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. అయితే అవి ఎక్కువగా సీనియర్ ప్రొఫెషనల్స్కే పరిమితం అవుతున్నాయి. అందుకే అమెరికా నుంచి వచ్చిన అనేకమంది టెకీలు కంపెనీలకు ‘ఓవర్ క్వాలిఫైడ్’గా కనిపిస్తున్నారు. అయితే నిర్దిష్ట రంగంలో ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేసిన వారికి జీసీసీల నుండి డిమాండ్ ఉంటోంది. ప్రాడక్ట్ కంపెనీల్లో పనిచేసిన అమెరికా రిటర్నీలకు ప్రాధాన్యత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్లు, జీసీసీలలో హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్ విభాగాలలో తక్షణమే లీడర్షిప్ రోల్స్లో ఉద్యోగులు అవసరమైనందున ఫ్రాక్షనల్ సీఎక్స్ఓలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. 2020 నుంచి పోలిస్తే ఫ్రాక్షనల్ సీఎక్స్ఓ రోల్స్ మూడు రెట్లు పెరిగాయని ‘టీమ్లీజ్’ చెబుతోంది. అదేస్థాయి నైపుణ్యం కోసం ఒకరిని పూర్తి సమయం నియమించుకోవడంతో పోలిస్తే ఇలాంటి రోల్స్తో కంపెనీలు సాధారణంగా 40–60 శాతం ఆదా చేస్తున్నాయి. పైగా ఈ రోల్స్ను చేపట్టడానికి సిద్ధంగా ఉన్న అనుభవజ్ఞులైన నిపుణుల కొరత ఉందని పరిశ్రమ చెబుతోంది. -
ఏడాది గడువు ఉంటేనే...
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి భారత్కు దిగుమతి అయ్యే ఔషధాలపై నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న దిగుమతి నిబంధనలను సరళీకృతం చేస్తూ, దేశంలోకి వచ్చే సమయంలో కనీసం ఒక సంవత్సరం షెల్ఫ్ లైఫ్ (ఎక్స్పైరీ గడువు) మిగిలి ఉంటే దిగుమతికి అనుమతి ఇచ్చేలా కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈనెల 22న ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో డ్రగ్స్ రూల్స్–1945లోని రూల్ 31ను సవరించి, దిగుమతి అయ్యే ఔషధాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ’మొత్తం షెల్ఫ్ లైఫ్లో 60 శాతం మిగిలి ఉండాలి’ అనే నిబంధనను సవరించింది. దీని స్థానంలో దేశంలోకి దిగుమతి చేసే సమయంలో కనీసం 12 నెలల గడువు ఉంటే సరిపోతుందనే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రజలు, ఔషధ పరిశ్రమలు, వైద్య నిపుణుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన అనంతరం తుది నిబంధనలు అమల్లోకి రానున్నాయి. భారత్కు దిగుమతి అయ్యే అనేక ప్రత్యేక ఔషధాలు, అరుదైన వ్యాధుల మందులు, బయోలాజికల్ ఉత్పత్తులు విదేశాల్లోనే తయారవుతాయి. ప్రస్తుతం వాటి దిగుమతిపై అమల్లో ఉన్న నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని ఔషధ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తయారీ, రవాణా, కస్టమ్స్ క్లియరెన్స్, నిల్వ వంటి ప్రక్రియల్లో సమయం ఎక్కువ పట్టడంతో కొన్నిసార్లు ఔషధాల వినియోగ గడువు గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో ఆస్పత్రులు, దిగుమతిదారులు నష్టపోవడంతోపాటు కొన్ని మందులు వృథా అవుతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మార్పులు ప్రతిపాదించింది. రోగులకు ఎలా ఉపయోగం అంటే...ఈ మార్పు అమల్లోకి వస్తే విదేశాల నుంచి వచ్చే ప్రాణాధార ఔషధాల సరఫరా మరింత సులభమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు, కేన్సర్, జన్యుపరమైన వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, అధునాతన బయోలాజికల్ ఔషధాలు, ఇమ్యూనోథెరపీ మందులు, ప్రత్యేక టీకాల సరఫరా వేగవంతం కావొచ్చు. దీంతో రోగులకు ఔషధాల లభ్యత మెరుగుపడటంతోపాటు కొరత పరిస్థితులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా ఔషధాల తయారీ నుంచి వినియోగదారుల చేతికి చేరే వరకు అనేక దశలు ఉంటాయి. ముఖ్యంగా దిగుమతి ఔషధాల విషయంలో సముద్ర, విమాన రవాణా, కస్టమ్స్ తనిఖీలు, నాణ్యత పరీక్షలు వంటి కారణాలతో సమయం ఎక్కువ పడుతుంది. ఫలితంగా ఎక్స్పైరీ గడువు తక్కువగా మిగిలిన మందులను మార్కెట్లోకి విడుదల చేయడం కష్టమవుతోంది. కొత్త నిబంధనల వల్ల ఈ సమస్య కొంతవరకు పరిష్కారమై, ఔషధాల వృథా తగ్గుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఔషధాల నాణ్యత, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కొత్త నిబంధనలతో దిగుమతిదారులపై భారం తగ్గడంతోపాటు రోగులకు అవసరమైన మందులు మరింత వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఔషధ రంగ నిపుణులు భావిస్తున్నారు. -
బ్యాటింగ్లో సత్తా చాటేనా!
బెల్ఫాస్ట్: టి20 ప్రపంచ చాంపియన్లుగా బరిలోకి దిగిన భారత జట్టుకు గత మ్యాచ్లో అనూహ్య ఓటమి ఎదురైంది. బలహీన జట్లలో ఒకటైన ఐర్లాండ్ సమష్టి ప్రదర్శనతో టీమిండియాపై తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ పరాజయం చాలా అరుదైనదిగా చూపిస్తూ ఓటమిని ఒక్క మ్యాచ్కే పరిమితం చేయాల్సిన బాధ్యత భారత్పై ఉంది. ఇందు కోసం టీమిండియా ఏం చేస్తుందనేది ఆసక్తికరం. అతి బలమైన బ్యాటింగ్ లైనప్లో ఒక్క అభిషేక్ శర్మ మినహా మిగతావారంతా విఫలమయ్యారు. సామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్వర్మ అంచనాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంది. ఐపీఎల్లో సారథిగా చెలరేగిన శ్రేయస్ భారత కెప్టెన్ గా తొలి మ్యాచ్ను ఓటమితో మొదలు పెట్టాడు. ఇప్పుడు తాను బ్యాటింగ్లో సత్తా చాటడంతో పాటు నాయకుడిగా కూడా జట్టును గెలిపించాల్సిన బాధ్యత ఉంది. గత మ్యాచ్లో ఓడినా ఇప్పటికిప్పుడు తుది జట్టులో అనూహ్య మార్పులు చేసే అవకాశం తక్కువ. కాబట్టి ఈ సారి కూడా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడం కష్టమే. పిచ్ను బట్టి చూస్తే స్పిన్ ఆల్రౌండర్ సుందర్కంటే పేస్ ఆల్రౌండర్ సూర్యాంశ్ షెడ్గేను ఆడించే అవకాశం కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో చెత్త ప్రదర్శనతో ప్రసి«ద్ను పక్కన పెడితే ప్రిన్స్కు చాన్స్ లభిస్తుంది. మరో వైపు తొలి మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహంతో ఐర్లాండ్ జోరు మీదుంది. మరోసారి గత ప్రదర్శనను జట్టు పునరావృతం చేస్తుందా అనేది ఆసక్తికరం. -
భారత్లో ఓపెన్ఏఐకి కొత్త బాస్.. ఎవరీ ప్రభ్జీత్ సింగ్?
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఓపెన్ఏఐ.. భారత్లో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా 'ప్రభ్జీత్ సింగ్'ను నియమించింది.ప్రభ్జీత్ సింగ్ ఈ ఏడాది సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత్లో AI వినియోగాన్ని మరింత విస్తరించడంతో పాటు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు కృత్రిమ మేధస్సు ప్రయోజనాలను పొందేలా భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంపై ఆయన దృష్టి సారించనున్నారు.ప్రభ్జీత్ సింగ్కు టెక్నాలజీ రంగంలో విశేష అనుభవం ఉంది. గత 11 సంవత్సరాలుగా ఉబెర్లో పనిచేసిన ఆయన, చివరి ఆరేళ్లు ఆ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్కు భారతదేశం - దక్షిణాసియా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రైడ్-హెయిలింగ్ మార్కెట్లలో ఒకటైన భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంకలలో కంపెనీ మొబిలిటీ వ్యాపారానికి ఆయన నాయకత్వం వహించి, దాని విస్తరణకు మార్గనిర్దేశం చేశారు.ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన సింగ్, మెకిన్సీ & కంపెనీలో అసోసియేట్ పార్టనర్గా పనిచేసి, అంతకుముందు ఉబర్లో చేరారు. కార్పొరేట్ నాయకత్వానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను, 2022లో ఐఐఎం అహ్మదాబాద్ వారి యంగ్ అలూమ్ని అచీవర్స్ అవార్డుతో ఆయనను సత్కరించారు. -
ఫిఫా ప్రపంచకప్ నుంచి నాడు భారత్ తప్పుకొందని తెలుసా?
ప్రపంచకప్ ఫుట్బాల్ సీజన్ వచ్చినప్పుడల్లా భారత ఫుట్బాల్ అభిమానుల హృదయాల్లో ఒక ప్రశ్న కచ్చితంగా మెదులుతుంది. అసలు ప్రపంచకప్ వేదికపై భారత్ ఎప్పుడు అడుగుపెడుతుంది? అనే ప్రశ్న అభిమానులను తొలిచివేస్తుంది. కానీ, 76 ఏళ్ల క్రితమే, భారత జట్టు ప్రపంచకప్ ఆడటానికి అర్హత సాధించినా.. చేజేతులా ఆ అవకాశాన్ని వదిలేసుకుందన్న చేదు నిజం ఎంతమందికి తెలుసు?1950 బ్రెజిల్ ప్రపంచకప్లో భారత్ ఆడకపోవడానికి 'బూట్లు లేకపోవడమే' కారణమనే ప్రచారం ఇప్పటికీ ఉన్న విషయం మీకు తెలుసా?? అది నిజమేనా? లేక దాని వెనుక అంతకంటే పెద్ద కథేమైనా ఉందా? భారత క్రీడా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.భారత్ నాడు సువర్ణావకాశంఅది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతి కాలం. 1950 జూన్ 24 నుంచి జూలై 23 వరకు బ్రెజిల్లో నాలుగో ఫుట్బాల్ ప్రపంచకప్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఆ సమయంలో ఆసియా గ్రూప్లో ఉన్న బర్మా.. అదే ఇప్పుడు మయన్మార్, ఫిలిప్పీన్స్ జట్లు టోర్నీ నుంచి తప్పుకోవడంతో.. భారత్కు నేరుగా ప్రపంచకప్ ఆడే సువర్ణావకాశం లభించింది. ఏకంగా స్వీడన్, ఇటలీ, పరాగ్వేలతో కలిసి గ్రూప్-3లో భారత్ స్థానం సంపాదించింది.బ్రెజిల్ ఆఫర్ఒకవేళ భారత్ బరిలోకి దిగి ఉంటే, జూన్ 28న పరాగ్వేతో తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉండేది. ఆతిథ్య దేశమైన బ్రెజిల్ సైతం ‘గాంధీ దేశం’ నుంచి వస్తున్న భారత జట్టు కోసం ఎంతో ఆశగా ఎదురుచూసింది. అవసరమైతే భారత ఆటగాళ్ల ప్రయాణ ఖర్చులు తామే భరిస్తామని కూడా బ్రెజిల్ ఆఫర్ చేసింది. కానీ, చివరి నిమిషంలో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ తీసుకున్న ఒక నిర్ణయం.. భారత ఫుట్బాల్ భవిష్యత్తును మార్చేసింది.1948 లండన్ ఒలింపిక్స్లో బూట్లు లేకుండా ఆడిన భారత జట్టు, బలమైన ఫ్రాన్స్కు ముచ్చెమటలు పట్టించింది. కేవలం 1-2 తో ఓడిపోయినా, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ జట్టులో శైలన్ మన్నా, అహ్మద్ ఖాన్, ఎస్. మేవలాల్, థామస్ మత్తాయి వర్గీస్ వంటి హేమాహేమీలు ఉన్నారు. సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఆ జట్టుకు కోచ్గా వ్యవహరించారు.అసలు కారణాలు వేరేఅయితే.. భారత ఆటగాళ్లకు బూట్లు లేవనే కారణంతోనే ప్రపంచకప్ ఆడలేదనేది పూర్తి నిజం కాదని.. అప్పటికే హైదరాబాద్, మైసూర్ ఆటగాళ్లు బూట్లతో ఆడటం అలవాటు చేసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు 1953 నుంచే ఫిఫా బూట్లతో ఆడాలన్న నిబంధనను కఠినతరం చేసింది. కాబట్టి టోర్నీ నుంచి భారత్ తప్పుకోవడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.ఒలింపిక్స్కే ఎక్కువ ప్రాధాన్యతఅవును, నాటి భారత ఫుట్బాల్ ఫెడరేషన్ అప్పట్లో ప్రపంచకప్ కంటే ఒలింపిక్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచకప్లో ఆడితే ఆటగాళ్లు ప్రొఫెషనల్స్గా మారిపోతారని, దానివల్ల ఒలింపిక్స్లో ఆడే అర్హత కోల్పోతామని భయపడ్డారు. దానికి తోడు, సుదీర్ఘమైన ఓడ ప్రయాణం, ఆర్థిక భారం, జట్టు ఎంపికలో విభేదాలు భారత్ను వెనక్కి లాగాయి.వీటన్నింటికీ మించి, అప్పట్లో భారత్లో కేవలం 70 నిమిషాల మ్యాచ్లు మాత్రమే ఆడేవారు. అంతర్జాతీయంగా 90 నిమిషాల పాటు ఆడే సత్తా, ఫిట్నెస్ తమకు ఉందా? లేదా? అనే అనుమానాలు కూడా ఫెడరేషన్ను పీడించాయి. దీంతో 1951లో ఢిల్లీలో జరగబోయే ఆసియా క్రీడలపై దృష్టి పెట్టాలనే నెపంతో ప్రపంచకప్ నుంచి భారత్ తప్పుకొంది. ఇప్పటికీ మూల్యం చెల్లిస్తూనే ఉందిచివరి నిమిషంలో భారత్ తప్పుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఫిఫా, ఆ తర్వాత 1954 ప్రపంచకప్ ఆడేందుకు భారత్ దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించింది. ఆ తర్వాత భారత్ 1951, 1962 ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాలు సాధించి.. ఫుట్బాల్లో సువర్ణ యుగాన్ని చూసినప్పటికీ.. ప్రపంచకప్ వేదికపై ఆడే అవకాశాన్ని మాత్రం ఇప్పటివరకు దక్కించుకోలేకపోయింది. నాటి ఫెడరేషన్ చేసిన ఆ ఒక్క చారిత్రక తప్పిదానికి.. భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తూనే ఉంది.నాటి నిర్ణయం సరైనదా? కాదా? అనేది పక్కన పెడితే.. ఆ రోజు గనుక భారత్ బ్రెజిల్ విమానం ఎక్కి ఉంటే, ఈరోజు ప్రపంచ ఫుట్బాల్ పటంలో భారత స్థానం వేరేలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా, ఆనాటి తప్పులను అధిగమించి, త్వరలోనే మన దేశం మెగా టోర్నీలో అడుగుపెట్టాలని ఆశిద్దాం.చదవండి: ‘నేను 13 సిక్సర్లు బాదుతాను.. మిగతాది మీరు చూసుకోండి’ -
వచ్చే ఏడాది భారత్కు ట్రంప్
వాషింగ్టన్: భారత్, అమెరికా బంధంలో మరో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్నట్లు యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం అత్యంత అద్భుతమైనదని కొనియాడిన రూబియో.. ఇరు దేశాల దౌత్య సంబంధాలు ‘ఫెంటాస్టిక్’ అంటూ అభివర్ణించారు. వాషింగ్టన్ డీసీలో ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన, ఈ మెగా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తాను ఈ ఏడాది చివరికల్లా భారత్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు.ఫైనల్ స్టేజ్లో ట్రేడ్ డీల్ట్రంప్ పర్యటన కేవలం ఒక విజిట్ మాత్రమే కాదు, దీని వెనుక భారీ వాణిజ్య వ్యూహం దాగి ఉంది. గత 16 నెలల్లో మొదటిసారిగా ఫ్రాన్స్లోని ఎవియాన్లో జరిగిన జీ7 (G7) సమ్మిట్ వేదికగా మోదీ, ట్రంప్ ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని రూబియో పేర్కొన్నారు. ‘మేం ట్రేడ్ డీల్ను పూర్తి చేసేందుకు కేవలం అంగుళాల దూరంలో ఉన్నాం, ఇది చాలా సానుకూల పరిణామం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం పూర్తయితే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో పెను మార్పులు రానున్నాయి.మోదీపై రూబియో ప్రశంసలుఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మార్కో రూబియో ఆకాశానికెత్తారు. తాను మోదీకి పెద్ద ‘ఫ్యాన్’ అని చెబుతూ, అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్టను మోదీ సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. ‘మోదీ భారతదేశాన్ని ఒక గ్లోబల్ పవర్గా (ప్రపంచ శక్తిగా) మార్చారు’ అని రూబియో వ్యాఖ్యానించారు. అలాగే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత కీలకమైన ‘క్వాడ్’ (Quad) కూటమి తదుపరి సమావేశం కోసం ఇరు దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఎనర్జీ సెక్టార్లో మెగా పార్ట్నర్షిప్ఇక ఇంధన రంగం పరంగా భారత్ ప్రాధాన్యతను అమెరికా ప్రత్యేకంగా గుర్తించింది. ఇంధన సరఫరాను మరింత పెంచేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని రూబియో తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత భారీ క్రూడ్ ఆయిల్ (Heavy Crude)ను శుద్ధి చేసే అరుదైన సాంకేతిక సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల్లో భారతదేశం ఒకటని ఆయన ప్రశంసించారు. ఒకవేళ వచ్చే ఏడాది ట్రంప్ భారత్కు వస్తే, 2020 ఫిబ్రవరి తర్వాత ఆయనకు ఇదే మొదటి భారత పర్యటన అవుతుంది. అలాగే రెండోసారి వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి విజిట్ కానుంది. -
‘ట్రంప్ కన్నా పుతిన్ బెటర్’.. తేల్చేసిన భారతీయులు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యవహారాలను చక్కదిద్దడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పైనే భారతీయులు ఎక్కువ నమ్మకం ఉంచారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన తాజా గ్లోబల్ సర్వేలో వెల్లడయ్యింది. ఫిబ్రవరి 8 నుండి మే 13, 2026 మధ్య కాలంలో 36 దేశాల్లోని 42,151 మందిపై నిర్వహించిన ఈ అంతర్జాతీయ పోల్లో, ట్రంప్ నాయకత్వంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా అంతకుముందుతో పోలిస్తే భారతదేశంలో ట్రంప్ పట్ల నమ్మకం గణనీయంగా తగ్గడం గమనార్హం.రష్యా వైపే భారత్ మొగ్గు.. పుతిన్కు జైఈ సర్వే నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలరని 51 శాతం మంది భారతీయులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరైన నిర్ణయాలు తీసుకోగలరని కేవలం 39 శాతం మంది భారతీయులు మాత్రమే నమ్మారు. గత ఏడాది సర్వేలో ట్రంప్కు భారతదేశంలో 51 శాతం మద్దతు ఉండగా, ఈసారి అది భారీగా పడిపోవడం అమెరికా విదేశాంగ విధానాలకు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.ట్రంప్ విధానాలపై భారతీయుల తీవ్ర అసంతృప్తిభారతదేశంలో ట్రంప్ గ్రాఫ్ పడిపోవడానికి ఆయన తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలే కారణమని సర్వే స్పష్టం చేసింది. అంతర్జాతీయ సుంకాలు, వెనిజువెలా, ఇరాన్ సంక్షోభాల విషయంలో ట్రంప్ తీరును మెజారిటీ భారతీయులు తప్పుపట్టారు. అలాగే అమెరికా అమలు చేస్తున్న కఠినమైన వలస విధానాలను కేవలం 32 శాతం మందే సమర్థించారు. అంతర్జాతీయ సహాయక సంస్థ అయిన ‘యూఎస్ఏఐడి’ని మూసివేయడం, గాజా స్ట్రిప్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలను డొనాల్డ్ ట్రంప్ డీల్ చేసిన విధానంపై కూడా భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.ప్రపంచవ్యాప్తంగా ట్రంప్కు నిరాశే..భారత్లోనే కాకుండా ప్రపంచంలోని 16 దేశాల్లో ట్రంప్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. సర్వేలో పాల్గొన్న మొత్తం దేశాల్లో 76 శాతం మంది ట్రంప్ నాయకత్వంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని తేల్చి చెప్పారు. కేవలం 23 శాతం మంది మాత్రమే ఆయనను సమర్థించారు. జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాలతో పాటు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లోనూ ట్రంప్కు అతి తక్కువ రేటింగ్స్ వచ్చాయి. అయితే, ఇజ్రాయెల్లో మాత్రం అత్యధికంగా 66 శాతం మంది ట్రంప్ నిర్ణయాలను సమర్థించడం విశేషం.ఇది కూడా చదవండి: ట్రంప్ మరో హెచ్చరిక.. ఇక డిజిటల్ ట్యాక్స్ వంతు! -
బడులు, పిల్లలపై దాడులు చేస్తే వదలొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: సాయుధ ఘర్షణలు, యుద్ధాల సమయంలో పాఠశాలలు, అమాయకులైన చిన్నారులపై దాడులకు ఒడిగట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ కుండబద్దలు కొట్టింది. దాడులకు పాల్పడిన వారి బాధ్యతను కచ్చితంగా తేల్చాలని, జవాబుదారీతనం లేకుండా పిల్లలకు కల్పించే రక్షణ అసంపూర్ణమేనని స్పష్టం చేసింది. మండలిలో ‘పిల్లలు–సాయుధ ఘర్షణలు’అంశంపై జరిగిన బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పాల్గొన్నారు. చిన్నారులపై జరుగుతున్న దాడులపై ఆయనతీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువుకునే హక్కును కాపాడటానికి భారత్ నిబద్ధతతో ఉందని ఆయన ఉద్ఘాటించారు. కఠినంగా శిక్షించాల్సిందే.. సంక్షోభ సమయాల్లో కూడా పిల్లల విద్యకు ఆటంకం కలగరాదని ఈ సందర్భంగా హరీశ్ పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ప్రాంతాల్లో పిల్లల విద్యా హక్కును పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ఆయన సభ్య దేశాలకు వివరించారు. ఎవరైతే శిక్ష పడదన్న ధీమాతో బడులు, పసిపిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారో వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారిని శిక్షించినప్పుడే భవిష్యత్తులో ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేశారు. ఒక దేశ భవిష్యత్తును కాపాడాలంటే ముందుగా ఆ దేశ పసిపిల్లల చదువును కాపాడటం ఎంతో కీలకమని భారత్ తరఫున ఆయన గట్టిగా వాదించారు. ఆందోళన కలిగించే గణాంకాలు.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ విడుదల చేసిన తాజా నివేదికలోని గణాంకాలను పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఒక్క ఏడాది వ్యవధిలోనే పాఠశాలలపై దాడులు ఏకంగా 44 శాతం మేర పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 47.3 కోట్ల మంది పిల్లలు (ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు) ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు, లేదా అక్కడి నుంచి ప్రాణభయంతో వలస వెళుతున్నారు. వీరిలో 8.5 కోట్ల మందికి పైగా పిల్లలు కనీస విద్యకు కూడా నోచుకోవడం లేదు. ఈ నివేదిక ప్రకారం ఏకంగా 38,558 తీవ్రమైన ఉల్లంఘనలు జరగ్గా, వీటివల్ల 24,174 మంది చిన్నారులు (15,493 బాలురు, 7,990 బాలికలు) ప్రత్యక్షంగా బాధితులయ్యారు. పదే పదే ఉల్లంఘనలకు గురైన పిల్లల సంఖ్య సైతం 3,137 నుంచి 3,176కి పెరిగింది. ఈ గణాంకాలు మానవాళి సమిష్టి వైఫల్యానికి నిదర్శనమని భారత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. -
ఐర్లాండ్ దెబ్బ కొట్టింది
బెల్ఫాస్ట్: టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన తర్వాత ఆడిన తొలి పోరులో భారత్కు గట్టి షాక్ తగిలింది. గతంలో ఎనిమిది సార్లు భారత్తో తలపడి అన్నింట్లో ఓడిన ఐర్లాండ్ ఈసారి పదునైన ఆటతో దెబ్బ కొట్టింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో విఫలమైన టీమిండియా అనూహ్యంగా తలవంచింది. శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టకర్ (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్లు), గారెత్ డెలానీ (32 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరు ఐదో వికెట్కు 44 బంతుల్లో 64 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 49; 7 ఫోర్లు, 2 సిక్స్లు), శివమ్ దూబే (14 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్లు) మాత్రమే దూకుడుగా ఆడగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 రేపు ఇదే మైదానంలో జరుగుతుంది. కీలక భాగస్వామ్యం... హర్షిత్, అర్ష్ దీప్ పదునైన బౌలింగ్తో ఐర్లాండ్ 6 ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోయింది. డెయిర్ (0), హ్యారీ టెక్టర్ (0), టిమ్ టెక్టర్ (17) వెనుదిరగ్గా, పవర్ప్లేలో జట్టు 36 పరుగులే చేసింది. దూబే తొలి బంతికే బెన్ కాలిట్జ్ (15)ను అవుట్ చేయడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో టకర్, డెలానీ కలిసి ఐర్లాండ్ను ఆదుకున్నారు. 9 పరుగుల వద్ద డెలానీ ఇచ్చిన సులువైన క్యాచ్ను అభిషేక్ వదిలేశాడు. అక్షర్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన టకర్ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రసిధ్ ఓవర్లో డెలానీ వరుసగా 4, 6, 6, 6 బాదగా మొత్తం 27 పరుగులు వచ్చాయి. చివరి 4 ఓవర్లలో ఐర్లాండ్ 45 పరుగులు చేసింది. అభిషేక్ మినహా... ఛేదనలో ఒకవైపు అభిషేక్ చెలరేగినా... మరోవైపు సామ్సన్ (5), ఇషాన్ కిషన్ (1) విఫలమయ్యారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తొలి టి20 మ్యాచ్ ఆడిన శ్రేయస్ అయ్యర్ (3) ప్రభావం చూపకపోగా, తిలక్ వర్మ (19) కూడా నిలవలేదు. కొద్దిగా పోరాడిన దూబే అవుటయ్యే సమయానికి భారత్ 4 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సి ఉంది. అయితే తర్వాతి 17 బంతుల్లో జట్టు మరో 13 పరుగులు మాత్రమే చేసిన జట్టు చివరి 3 వికెట్లు కోల్పోయింది.వైభవ్కు చోటు లేదు! భారత అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన క్షణం శుక్రవారం రాలేదు. తుది జట్టులో వైభవ్ సూర్యవంశీని టీమ్ మేనేజ్మెంట్ ఎంపిక చేయలేదు. వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన టాప్–3నే కొనసాగించడంతో వైభవ్కు అరంగేట్రం చేసే అవకాశం లేకుండా పోయింది.తొలి బంతికే ‘జై’... అంతర్జాతీయ క్రికెట్లో తాను వేసిన తొలి బంతికే సామ్సన్ను బౌల్డ్ చేసి ఐర్లాండ్ లెఫ్టార్మ్ పేసర్ జై ముంద్రా సంచలనం సృష్టించాడు. 29 ఏళ్ల ముంద్రా భారత్కు చెందినవాడే. రాజస్తాన్లోని టోంక్లో పుట్టిన అతను ఐదేళ్ల క్రితం ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఐర్లాండ్కు వెళ్లాడు. భారత్లో క్రికెట్తో గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత మరో దేశంలో కొనసాగించిన ఆటగాడు కాదు అతను. డబ్లిన్లో అడుగు పెట్టిన తర్వాతే ఆటపై ఆసక్తితో ప్రతిష్టాత్మక లీన్స్టర్ క్లబ్ లెఫ్టార్మ్ స్పిన్నర్గా ముంద్రా చేరాడు. ఆ తర్వాత అతను పేస్ బౌలింగ్ వైపు మళ్లాడు. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేయక ముందు ముంద్రా దేశవాళీ క్రికెట్లో 1 ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 6 వన్డేలు, 5 టి20లు ఆడాడు. బాబ్జీ నరసింహారావు, రమణ్ లాంబా, సిమి సింగ్, రాబిన్ వాటర్స్ తరహాలో భారత్లో పుట్టి ఐర్లాండ్కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ల జాబితాలో అతను చేరాడు. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: టిమ్ టెక్టర్ (సి) అయ్యర్ (బి) రాణా 17; అడెయిర్ (సి) సామ్సన్ (బి) రాణా 12; హ్యారీ టెక్టర్ (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 0; టకర్ (సి) తిలక్ (బి) రాణా 50; కాలిట్జ్ (సి) ప్రసిధ్ (బి) రాణా 15; డెలానీ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 49; డాక్రెల్ (సి) అర్ష్ దీప్ (బి) అక్షర్ 19; మెక్కార్తీ (సి) తిలక్ (బి) అక్షర్ 7; హంఫ్రీస్ (రనౌట్) 2; ముంద్రా (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–20, 2–25, 3–30, 4–51, 5–115, 6–164, 7–178, 8–178, 9–182. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–28–2, హర్షిత్ రాణా 4–0–24–3, ప్రసిధ్ 4–0–57–0, శివమ్ దూబే 3–0–18–1, అక్షర్ 4–0–33–2, సుందర్ 1–0–19–0. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) కాలిట్జ్ (బి) మెక్కార్తీ 50; సామ్సన్ (బి) ముంద్రా 5; ఇషాన్ కిషన్ (సి) టకర్ (బి) హోలార్డ్ 1; అయ్యర్ (సి) డాక్రెల్ (బి) హోలార్డ్ 3; తిలక్ (సి) అడెయిర్ (బి) హంఫ్రీస్ 19; సుందర్ (సి) కాలిట్జ్ (బి) హోలార్డ్ 9; దూబే (సి అండ్ బి) ముంద్రా 25; అక్షర్ (సి) టిమ్ టెక్టర్ (బి) డెలానీ 15; రాణా (సి) కాలిట్జ్ (బి) హంఫ్రీస్ 8; అర్ష్ దీప్ (సి) టిమ్ టెక్టర్ (బి) హంఫ్రీస్ 2; ప్రసిధ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 148. వికెట్ల పతనం: 1–16, 2–45, 3–60, 4–80, 5–90, 6–100, 7–135, 8–137, 9–147, 10–148. బౌలింగ్: హంఫ్రీస్ 3.5–0–38–3, జై ముంద్రా 4–0–25–2, మెక్కార్తీ 3–0–29–1, హోలార్డ్ 4–0–28–3, హ్యారీ టెక్టర్ 3–0–22–0, డెలానీ 1–0–3–1. -
సవాళ్లు ఉన్నా సందర్భోచితమే!
ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐ.ఎం.ఇ.సి.– ఐమెక్) పథకం ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో చర్చనీయాంశమైంది. భారత విధాన రూపకర్తలకు ఐమెక్ను ముందుకు తీసుకు వెళ్లటం పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ యుద్ధం ఒక వైపు ఐమెక్ పథకం బలహీనతలను బహిర్గతం చేస్తూనే దాని అవసరాన్నీ నొక్కి చెప్పింది. 2023 ఢిల్లీ జీ–20 సదస్సులో భారత్ ప్రతిపాదించిన ఐమెక్ ప్రతిపాదనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ, యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ యూనియన్లు అంగీకరించాయి. భారత్ను మధ్యప్రాచ్యం – ఇజ్రాయెల్ గుండా యూరప్తో అనుసంధానానికి ఉద్దేశించిన ఈ 4,800 కి.మీ. రవాణా కారిడార్ ఆసియా, పర్షియన్ గల్ఫ్, ఐరోపాల ఆర్థిక వ్యవస్థలను సమీకృతం చేస్తుంది. ఆసియా ఖండపు వినిమయ మార్కెట్లను, గల్ఫ్ చమురు– గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలను ఐరోపా పారిశ్రామిక ప్రాంతాలలో సముద్ర, భూతల మార్గాల ద్వారా అనుసంధానించే విశిష్టమైన పథకం ఐమెక్. ఈ మూడు ప్రాంతాల అనుసంధానంలో ప్రస్తుతం మూడు చిక్కుముడి ప్రాంతాలు (చోక్ పాయింట్లు) ఉన్నాయి. అవి హార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్ జలసంధులు. ఈ మూడు జలసంధులను పక్కన పెట్టే సురక్షితమైన రవాణా మార్గమే ఐమెక్.విస్తృత వాణిజ్యానికి కీలకంఐమెక్ రవాణా కారిడార్లో తూర్పుభాగం భారత పశ్చిమ తీరాన్ని పర్షియన్ సింధుశాఖలో కలిపే సముద్ర మార్గం. భారత్లోని ముంబై–ముంద్ర–కాండ్లా రేవు పట్టణాలను యూఏఈకి చెందిన జెబెల్ అలీ, ఫుజేరా, సౌదీకి చెందిన డమ్మామ్, జెడ్డాలతో కలుపు తుంది. ఐమెక్ ఉత్తర కారిడార్ పర్షియా సింధుశాఖను ఐరోపాతో రైలు మార్గాల ద్వారా కలుపుతుంది. యూఏఈ, సౌదీ, జోర్డాన్లను రైలు మార్గాల ద్వారా ఇజ్రాయెల్లోని హైఫా రేవు పట్టణానికి కలుపుతారు. హైఫా నుండి ఎర్ర సముద్రం గుండా గ్రీస్లోని పిరేస్, ఫ్రాన్స్లోని మార్సెల్లి, ఇటలీలోని మెస్సీనాలకు కలుపుతూ ఐరోపాకు సరకుల రవాణా జరుగుతుంది. ఐమెక్లో భాగంగా హరిత ఇంధనాలైన హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తి, విద్యుత్ గ్రిడ్ల అనుసంధానం కూడా జరుగుతుంది. సముద్ర, భూతల మార్గాల ద్వారా అత్యాధునిక ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల నిర్మాణం, విస్తృత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఐమెక్ పూర్తి స్థాయిలో అమలు జరిగితే భారత్– ఐరోపాల మధ్య రవాణా కాలం 40 శాతం, రవాణా వ్యయం 30 శాతం తగ్గిపోతాయి. రవాణా అనిశ్చితి కూడా తొలగిపోతుంది. భారత్–ఐరోపా యూనియన్ల మధ్య 2026 జనవరిలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన 40–65 శాతం వాణిజ్యం పెరుగు తుందని అంచనా. భారత్–యూఏఈ, సౌదీ, ఖతర్, ఒమన్ల మధ్య వాణిజ్యానికీ కూడా ఐమెక్ కీలకం.వ్యూహాత్మకంగానూ ముఖ్యమే!ఆసియా–పర్షియన్ సింధుశాఖ ప్రాంతంలో చైనాను నిలువరించటానికి ఐమెక్ ఉపయోగపడుతుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ద్వారా ఆసియా–గల్ఫ్ ప్రాంతంలో చైనా బలపడుతున్నది. ఒక రకంగా ఐమెక్ను బీఆర్ఐకు పోటీగా చెప్పు కోవచ్చు. వ్యూహాత్మక అంశాల దృష్ట్యా యూఎస్ఏ ఐమెక్కు మద్దతు పలికింది. ఇజ్రాయెల్ను ఇతర గల్ఫ్ దేశాలతో సంఘటితం చేయా లనేది అమెరికా లక్ష్యం. అబ్రహాం ఒప్పందం ద్వారా యూఏఈ, ఖతర్, ఒమన్లను ఇజ్రాయెల్కు కొంతవరకు దగ్గరకు తేగలిగింది. ప్రస్తుతం భూతల మార్గం ద్వారా భారత్ నుండి ఐరోపా వెళ్లాలంటే పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ల గుండా ప్రయాణించాలి. ఒక రకంగా భారత్–ఐరోపా భూతల రవాణాపై పాకిస్తాన్కు వీటో ఉన్నది. ఐమెక్ ద్వారా పాక్ వీటోను తొలగించినట్లవుతుంది. చైనా–పాక్–ఎకనమిక్ కారిడార్ (సిపెక్)లో భాగంగా పాకిస్తాన్లో పెద్ద మొత్తంలో రోడ్డు, రైలు మార్గాలను, రేవు పట్టణాలను చైనా అభివృద్ధి చేస్తున్నది. పాకిస్తాన్ గుండా అరేబియా సముద్రంలోనికి చైనా ప్రవేశిస్తున్నది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి ఐమెక్ తోడ్పడుతుంది. సూయజ్, బాబెల్ మాండెబ్లను పక్కకు పెట్టడం వలన భారత్–ఐరోపా వాణిజ్యంలో అస్థిరత, అనిశ్చితి తొలగి పోతాయి. పాకిస్తాన్కు వంత పాడుతున్న టర్కీకి కూడా ఐమెక్ ద్వారా చెక్ పెట్టినట్లవుతుంది. ఐమెక్ ద్వారా ఐరోపాకు శక్తి భద్రత ఏర్పడటంతో పాటు భారత్తో వాణిజ్యం విస్తృతమవుతుంది. గల్ఫ్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను వైవిధ్యీకరించటానికి ఐమెక్ ఉపయో గపడుతుంది. ఐమెక్కు కేంద్రకంగా ఉన్న ఇజ్రాయెల్కు ప్రాంతీయ స్థిరత్వం, భద్రత ఏర్పడతాయి.ప్రతికూలతలు బహిర్గతంసంక్షుభిత ప్రాంతాలైన సూయజ్, బాబెల్ మాండెబ్లకు దూరంగా ప్రతిపాదించబడిన ‘ఐమెక్ ప్రశాంత కారిడార్’యుద్ధంలో చిక్కుకున్నది. ఫుజెరా, జెబెల్ అలీ రేవు పట్టణాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఖతర్ గ్యాస్ క్షేత్రాలు కూడా దాడులకు గురయ్యాయి. ఐమెక్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయటం మూడు కీలక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అవి 1. సౌదీ–ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ. 2. జెబెల్ అలీ, ఫుజెరా (ఎమిరేట్స్) రేవు పట్టణాల భద్రత. 3. పెట్టుబడులు. ఇరాన్ యుద్ధం ఈ మూడు అంశాల ప్రతికూలతలను బహిర్గతం చేసింది. అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికి మొదటినుండీ సౌదీ రాజు విముఖత చూపుతున్నాడు. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం వలన నౌకల బీమా ఛార్జీలు అమాంతం పెరిగాయి. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ మదుపరులు ముందుకు రావటం కష్టం. అయితే, హార్మూజ్ దిగ్బంధనం, అంతకు ముందు బాబెల్ మాండెబ్ను హౌతీలు మూసివేస్తామని బెదిరించడం ఒక రకంగా ఈ ఇరుకైన సముద్ర మార్గాలకు ప్రత్యామ్నా యంగా రవాణా వ్యవస్థల అభివృద్ధి ఆవశ్యకతను గుర్తు చేసింది. 2023లో ఐమెక్ ఒప్పందం సమయంలో కంటే 2026లో దాని ఆవశ్యకత మరింత పెరిగిందనే చెప్పాలి. హార్మూజ్ ద్వారా రవాణాకు భవిష్యత్తులో కూడా అమెరికాతో సహా ఎవరూ భరోసా ఇవ్వలేరు. గల్ఫ్ ప్రాంత భూతల మార్గాల ద్వారా ఆసియాను ఐరోపాతో అనుసంధానించటమే శ్రేష్ఠమైన ప్రత్యామ్నాయం. శాంతియుత జియో పొలిటికల్ వాతావరణంలో ప్రతిపాదించ బడిన ఐమెక్ పథకాన్ని అశాంతి, ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణపు అనిశ్చిత వాస్తవాల నేపథ్యంలో సవరించాల్సిన అవసరం గోచరి స్తున్నది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధికి సమీపంలోని ఎమిరే ట్స్కు చెందిన ఫుజేరాకు బదులుగా ఒమన్కు చెందిన సలాలా, దుఖమ్, సోహర్ రేవు పట్టణాలను భారత్ పశ్చిమ తీరంతో అనుసంధానించాలి. ఈ పథకాన్ని రవాణా, ఎనర్జీ, డిజిటల్ కారిడార్లుగా విభజించి వేటికవే అమలు పరచటం వాంఛనీయం. ఇబ్బందులు, అడ్డంకులతో కూడిన రవాణా కారిడార్ నిర్మాణాన్ని రెండవ దశలో చేపట్టవచ్చు. మొదటి దశలో ఎనర్జీ, డిజిటల్ కారిడార్లను అమలు పరిచి సైద్ధాంతికంగా పథకం అమలు సాధ్యాన్ని నిరూపించవచ్చు. ఇంతవరకు వివిధ దేశాలు ప్రత్యేక ఒప్పందాల ద్వారా పథకాన్ని అమలు పరుస్తున్నాయి. కానీ ఒక కేంద్రీయ సెక్రటేరియట్ను ఏర్పాటు చేసి సభ్య దేశాల మధ్య సమన్వయం సాధించాలి. ఇజ్రా యెల్తో ముడిపడిన క్లిష్టమైన అంశాలను పక్కకుపెట్టి భారత్–గల్ఫ్ అనుసంధానంపై దృష్టి పెట్టాలి. భారత్ వ్యూహాత్మక, ఆర్థిక, శక్తి భద్రతలకు ఐమెక్ పథకం అమలు అత్యంత ఆవశ్యకం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
తొలిసారి భారత్కు జపాన్ ప్రధాని
ఢిల్లీ: జపాన్ ప్రధాని సనాయే తకాయిచి వచ్చే నెల(జులై) 1 నుంచి 3 వరకు భారత్ పర్యటనకు రానున్నారు. 16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆమె పాల్గొననున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి, మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరగనున్నాయి.అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అభిప్రాయాలను కూడా రెండు దేశాల నాయకులు పంచుకోనున్నారు. జపాన్ ప్రధాని హోదాలో సనాయే తకాయిచి భారత్కు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యోలో జరిగిన 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.ఆ పర్యటన అనంతరం ఇప్పుడు తకాయిచి భారత పర్యటన చేపట్టడం, భారత్-జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న ప్రధాన అజెండాగా ఈ భేటీ సాగనుంది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం వంటి అంశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం. -
గోశాలలు కాసుల కురిపిస్తాయా?
బెంగళూరు: భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మరో కొత్త విప్లవానికి గోశాలలు కేంద్రబిందువుగా మారగలవా? ఒకప్పుడు అమూల్ సహకార మోడల్ దేశంలోని కోట్లాది పాల రైతుల జీవితాలను మార్చినట్లే.. ఇప్పుడు గోశాలలను ఆధారంగా చేసుకుని కొత్త సహకార ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చనే ప్రతిపాదన ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.భారతదేశంలో ప్రస్తుతం సుమారు 7,676 నమోదిత గోశాలలు ఉండగా, అనధికారిక ఆశ్రయాలు, పింజరపోల్స్ కలిపితే వాటి సంఖ్య 15 వేల వరకు ఉండొచ్చని అంచనా. అయితే వీటిలో చాలా గోశాలలు పెరుగుతున్న పశుగ్రాస ఖర్చులు, వైద్య సంరక్షణ వ్యయాలు, మార్కెట్ సౌకర్యాల కొరత, నాణ్యత నియంత్రణలో లోపాలు, విభిన్నంగా పనిచేయడం వంటి కారణాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా చాలా వరకు విరాళాలపైనే ఆధారపడి కొనసాగుతున్నాయి.ఈ పరిస్థితిని మార్చేందుకు 'నేషనల్ గోశాల కోఆపరేటివ్ మోడల్' అనే కొత్త ఆలోచనను నిపుణులు ముందుకు తెస్తున్నారు. ఇందులో ప్రతి గోశాల విడివిడిగా పనిచేసే కేంద్రంగా కాకుండా, దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద సహకార వ్యవస్థలో భాగంగా పనిచేస్తుంది. గోశాలలు కేవలం పశు సంరక్షణ కేంద్రాలుగా కాకుండా, దేశీయ ఆవు ఆధారిత ఉత్పత్తుల తయారీ, సేకరణ కేంద్రాలుగా మారే అవకాశం ఉందని సూచిస్తున్నారు.ఈ ప్రతిపాదన ప్రకారం ప్రాంతీయ స్థాయిలో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నాణ్యత నియంత్రణ, లాజిస్టిక్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చు. వెటర్నరీ కళాశాలలు ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నిరోధక చర్యలు, శాస్త్రీయ సహకారం అందించవచ్చు. అలాగే ఈ-కామర్స్ వేదికల ద్వారా గోశాలల్లో తయారయ్యే ఉత్పత్తులను నేరుగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు.ఈ మోడల్లో కేవలం పాల ఉత్పత్తులకే పరిమితం కాకుండా గోమయం(పేడ), గోమూత్రం ఆధారిత ఉత్పత్తులు, సేంద్రియ ఎరువులు, బయోఫర్టిలైజర్లు, సహజ వ్యవసాయ ఉత్పత్తులు, వెల్నెస్ ఉత్పత్తులు వంటి రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పాలు ఇవ్వని ఆవులను ఆర్థిక భారంగా భావిస్తున్న పరిస్థితిని మార్చి, వాటినీ గ్రామీణ సర్క్యులర్ ఎకానమీలో భాగంగా మార్చవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ ప్రతిపాదనను జాతీయ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్డీఆర్ఐ)కు చెందిన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ ఆదర్శ గౌడ ముందుకు తెచ్చారు. గోశాలలను ఒక సమగ్ర సహకార వ్యవస్థలో అనుసంధానం చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొత్త అవకాశాలు సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.గోశాలలను ఒక సమగ్ర సహకార వ్యవస్థలో అనుసంధానం చేయగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పశు సంక్షేమం, సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ ఆదాయ వనరులు కూడా బలోపేతమవుతాయి. గోశాలలను వాణిజ్యీకరించడం లక్ష్యం కాదని, వాటిని ఆర్థికంగా స్వావలంబన చేయడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.మొత్తానికి, అమూల్ మాదిరిగా గోశాలల చుట్టూ కూడా ఒక సమగ్ర సహకార వ్యవస్థను నిర్మించగలిగితే.. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.:::డాక్టర్ ఆదర్శ గౌడ -
ఇండియాకు నందుస్ వరల్డ్ కపుల్
-
బంగ్లాదేశ్కు భారత్ గుడ్న్యూస్
ఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రెండేళ్లుగా నిలిపివేసిన టూరిస్ట్ వీసాల జారీని భారత్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 28 (ఆదివారం) నుంచి బంగ్లాదేశ్ పౌరుల నుంచి పర్యాటక వీసా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఢాకాలోని భారత హై కమిషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ మెరుగుపడుతున్నాయనే సంకేతంగా భావిస్తున్నారు.ఢాకాలోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (IVAC) భారత హై కమిషనర్ దినేశ్ త్రివేది సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రారంభ దశలో ఢాకా, రాజ్షాహీ, చిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నా నగరాల్లోని ఐదు వీసా కేంద్రాల ద్వారా టూరిస్ట్ వీసా దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరిన్ని కేంద్రాలకు విస్తరిస్తామని వెల్లడించారు. కాగా, దినేశ్ త్రివేది ఇటీవలే బంగ్లాదేశ్లో భారత హై కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్కు తన అధికార పత్రాలను సమర్పించిన కొద్ది గంటలకే ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని ఆయన తెలిపారు.ఎందుకు నిలిపివేశారు?2024లో బంగ్లాదేశ్లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ విద్యార్థి ఉద్యమాలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో భారత దౌత్య కార్యాలయాలు, వీసా కేంద్రాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవడంతో భారత్ సాధారణ టూరిస్ట్ వీసాల జారీని నిలిపివేసింది. అయితే వైద్య చికిత్స, అత్యవసర కుటుంబ అవసరాలు, విద్య, వ్యాపార అవసరాలకు సంబంధించిన పరిమిత వీసా సేవలు మాత్రం కొనసాగించబడుతున్నాయి.ఇదిలా ఉండగా, భారత్.. బంగ్లాదేశ్ పౌరులకు అత్యధికంగా వీసాలు జారీ చేసే దేశాల్లో ఒకటి. కరోనా తర్వాత కూడా వీసా సేవలు పునరుద్ధరించబడినప్పటికీ 2024 రాజకీయ అశాంతి కారణంగా టూరిస్ట్ వీసాలపై పరిమితులు కొనసాగాయి. తాజాగా ఈ నిర్ణయం కేవలం వీసా సేవల పునఃప్రారంభం మాత్రమే కాదు. భారత్, బంగ్లాదేశ్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయనే సంకేతంగా కూడా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. పర్యాటకం, వాణిజ్యం, వైద్య సేవలు, విద్య, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ నిర్ణయం దోహదపడే అవకాశం ఉంది.అలాగే ఇరు దేశాల మధ్య పెండింగ్లో ఉన్న వాణిజ్య, భద్రత, సరిహద్దు నిర్వహణ అంశాలపై కూడా సహకారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, బంగ్లాదేశ్ పౌరులకు మళ్లీ టూరిస్ట్ వీసాలు జారీ చేయాలన్న భారత్ నిర్ణయం, ఇరు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే పరిణామంగా భావిస్తున్నారు. -
అమెజాన్ పెట్టుబడుల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్లో దీర్ఘకాలిక విస్తరణ వ్యూహంలో భాగంగా టెక్ దిగ్గజం అమెజాన్ కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ సదుపాయాలను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం తాజాగా 13 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.23 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనితో 2026–30 మధ్య కాలంలో భారత్లో అమెజాన్ పెట్టుబడులు 48 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం కంపెనీ సీఈవో ఆండీ జస్సీ ఈ విషయాలు వెల్లడించారు. వ్యాపార వృద్ధికి సంబంధించి భారత్ తమకు కీలక మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఆయన చెప్పారు. దేశీయంగా ఈ–కామర్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) విభాగాలవ్యాప్తంగా కస్టమర్ల నుంచి డిమాండ్ పటిష్టంగా ఉంటోందని జస్సీ వివరించారు. డిజిటల్ వినియోగం, క్లౌడ్–ఏఐ సర్వీసులకు డిమాండ్ పెరుగుతుండటంతో భారత్లో పలు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అమెజాన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘భారత్లో అమెజాన్ రికార్డు స్థాయిలో 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్వాగతిస్తున్నాను. యువతకు దీనితో కొత్త అవకాశాలు లభిస్తాయి‘ అని ఎక్స్లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ‘వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ సాకారంపై ప్రధాని మోదీ విజన్ మాకు స్ఫూర్తిదాయకం. భారత వృద్ధి గాథలో మేము దీర్ఘకాలిక భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని జస్సీ పేర్కొన్నారు. 20 ఏళ్లలో 88 బిలియన్ డాలర్లు.. తాజా ఇన్వెస్ట్మెంట్స్ కూడా కలిపి 2010–2030 మధ్య కాలంలో భారత్లో 88 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టినట్లవుతుందని అమెజాన్ తెలిపింది. ఈ ఏడాది కొత్తగా 20 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 100 లాస్ట్–మైల్ డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ప్రధానంగా టియర్ 3, టియర్ 4 నగరాల్లో ఇవి రానున్నట్లు తెలిపింది. అలాగే, తమ ఈ–కామర్స్, క్విక్ కామర్స్ నెట్వర్క్కి దన్నుగా ఉంటున్న వేల మంది డెలివరీ ఏజెంట్ల సంక్షేమం కోసం ’సమ్మాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అమెజాన్ తెలిపింది. భారత్లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటైజ్ చేసినట్లు, 20 బిలియన్ డాలర్లకు పైగా ఈ–కామర్స్ ఎగుమతులు, 28 లక్షల ఉద్యోగాలకు తోడ్పాటు అందించినట్లు అమెజాన్ వివరించింది. అలాగే కోటి మంది భారతీయులకు క్లౌడ్ నైపుణ్యాల్లో శిక్షణ కల్పించినట్లు పేర్కొంది. నిమిషాల్లో డెలివరీ సేవల నెట్వర్క్ను భారీగా విస్తరించే దిశగా 300 పైగా నగరాల్లో అమెజాన్ నౌ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది.హైదరాబాద్, ముంబై డేటా సెంటర్ల విస్తరణ.. తాజా పెట్టుబడులతో హైదరాబాద్, ముంబైలోని ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంకుర సంస్థలు, ఎంటర్ప్రైజ్లు .. ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు, భారీగా కార్యకలాపాలను విస్తరించేందుకు, అంతర్జాతీయంగా కస్టమర్లకు సేవలందించేందుకు ఉపయోగపడే ఏఐ చిప్లు, మేనేజ్డ్ ఏఐ సర్వీసులు, సురక్షితమైన క్లౌడ్ టెక్నాలజీలు, డెవలపర్ టూల్స్ను మరింత అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. 2030 నాటికి 38 లక్షల కొలువుల కల్పనకు, 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులకు ఈ పెట్టుబడులు తోడ్పడనున్నట్లు తెలిపింది. 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు, నలభై లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలు అందుబాటులోకి రాగలవని వివరించింది. నేషనల్ హెల్త్ అథారిటీ, గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్, అపోలో టైర్స్, డెల్హివెరీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫిజిక్స్వాలా మొదలైనవి తమ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
ఐబీ చీఫ్గా మహేశ్ దీక్షిత్
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ను దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తదుపరి డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ ప్రస్తుత ఐబీ డైరెక్టర్ తపన్ కుమార్ డేకా స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. మహేశ్ దీక్షిత్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.మంత్రివర్గ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదించిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేక డైరెక్టర్గా పనిచేస్తున్న దీక్షిత్కు ఈ అత్యున్నత పదవి చేపట్టేందుకు సర్వీసు పొడిగింపు ఇచ్చారు. గూఢచారి సమాచార సేకరణ, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, జాతీయ భద్రత నిర్వహణ రంగాల్లో దీక్షిత్కు దశాబ్దాల అనుభవం ఉంది.ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన పలు అత్యంత సున్నితమైన గూఢచారి కార్యకలాపాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన అధికారిగా భద్రతా వర్గాల్లో ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన సర్వీసులో అత్యంత ముఖ్యమైన దానిలో ఒకటి.. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు ముందు జరిగిన పరిణామాల్లో ఆయన పాత్ర.ఈ పరిణామాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వర్గాల ప్రకారం.. ఆ నిర్ణయం వల్ల తలెత్తే భద్రతా ప్రభావాలను అంచనా వేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మార్పు దశలో శాంతిభద్రతలు కొనసాగేందుకు వ్యూహాల రూపకల్పనలో కూడా సహకరించారు. జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఆ ప్రాంతంలో కీలక గూఢచారి బాధ్యతలు దీక్షిత్కు అప్పగించారు.రాజకీయంగా అత్యంత సున్నితమైన దశలో ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ఆయన సహకరించారని అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాద శక్తుల వల్ల ఎదురైన భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.భద్రతా అంశాలపై పూర్తి అవగాహన జమ్మూకశ్మీర్లో కీలక గూఢచారి బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో, 2023లో శ్రీనగర్ విజయవంతంగా జీ20 పర్యాటక బృంద సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడాన్ని, ఆ ప్రాంత భద్రతా పరిస్థితులు మెరుగుపడుతున్నాయనే సంకేతంగా పరిగణించారు.అదే సమయంలో పలు విదేశీ దౌత్య బృందాలు కశ్మీర్ను సందర్శించాయి. దీంతో ఆ ప్రాంతంతో అంతర్జాతీయ సంబంధాలు మరింత పెరుగుతున్నట్లు సంకేతాలు కనిపించాయి. ఈ పరిణామాలపై అవగాహన ఉన్న అధికారులు తెలిపిన ప్రకారం.. పరిస్థితులపై కచ్చితమైన అంచనాలు అందించడంలో దీక్షిత్ ముఖ్య పాత్ర పోషించారు. దీంతో దౌత్య సంబంధాల విస్తరణకు, మారుతున్న పరిస్థితులపై విశ్వాసం పెరగడానికి సహకారం అందింది.జమ్మూకశ్మీర్, లడఖ్కే పరిమితం కాకుండా, భారత్ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచార కార్యక్రమాలను ఎదుర్కొనే చర్యల్లో కూడా దీక్షిత్ కీలకంగా వ్యవహరించారు. దేశీయ, విదేశీ వర్గాల నుంచి వచ్చే దుష్ప్రచారాలను ఎదుర్కోవడంలో ఆయన అనుభవం, ప్రస్తుతం డిజిటల్ రంగంలో పెరుగుతున్న జాతీయ భద్రతా సవాళ్ల దృష్ట్యా ఎంతో కీలకమని గూఢచారి, భద్రతా నిపుణులు భావిస్తున్నారు.ఉగ్రవాదం, మతోన్మాద ప్రభావం, సైబర్ ముప్పులు, సరిహద్దు దాటి జరిగే దుష్ప్రచార కార్యక్రమాలు వంటి మారుతున్న భద్రతా సవాళ్లను భారత్ ఎదుర్కొంటున్న సమయంలో ఈ నియామకం జరిగింది. కొత్త ఐబీ చీఫ్గా, అంతర్గత భద్రత బలోపేతం చేసే గూఢచారి కార్యకలాపాలను పర్యవేక్షించడమే కాకుండా, వివిధ భద్రతా సంస్థలు, గూఢచారి సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత పెంచే బాధ్యతలను దీక్షిత్ నిర్వహించనున్నారు. -
విమానాన్ని ముక్కలు చేసిన బాంబు.. అసలు కథ బయటకు..
కెనడా నుంచి లండన్ మీదుగా 1985 జూన్ 23న భారత్కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఐర్లాండ్ తీరానికి సమీపంలో గగనతలంలో పేలిపోయింది. ఆ విమానంలో ఉన్న 329 మంది అంతా మరణించారు. ఆ ఘటనను భారత్ ఎన్నటకీ మర్చిపోలేదు. 1985లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 పేలుడు వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదులే ఉన్నారని భారత్ మొదటి నుంచీ చెబుతోంది. కానీ, కెనడా ప్రభుత్వం లేదా దాని గూఢచారి సంస్థలు ఇంతకాలం బహిరంగంగా "ఖలిస్తానీలే బాంబు పెట్టారు" అని స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు తొలిసారిగా కెనడా ప్రధాన గూఢచారి సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) తొలిసారిగా అధికారికంగా ఆ విషయాన్ని చెప్పింది. "కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులు విమానంలో బాంబు పెట్టారు. ఆ పేలుడుతో 329 మంది మరణించారు" అని పేర్కొంది. ఇన్నేళ్లుగా భారత్ చేస్తున్న ఆరోపణను కెనడా ఇప్పుడు అధికారికంగా అంగీకరించినట్లయింది. ఖలిస్తానీ తీవ్రవాదులు కెనడా నేలపై పనిచేస్తున్నారన్న భారత వాదనకు బలం చేకూరింది. కెనడా గతంలో ఖలిస్తానీ అంశంపై తీసుకున్న వైఖరిలో మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.సీఎస్ఐఎస్ ఏమని చెప్పింది? ఈ విషాదాన్ని స్మరించుకుంటూ బుధవారం ఫేస్బుక్లో చేసిన పోస్టులో.. సీఎస్ఐఎస్ నేరుగా వేర్పాటువాద ఉద్యమాన్నే ఈ దాడికి బాధ్యులుగా పేర్కొంది. “కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులు 1985 జూన్ 23న అమర్చిన బాంబు విమానాన్ని ధ్వంసం చేసింది. అందులో ఉన్న వారంతా మరణించారు. వారిలో ఎక్కువ మంది కెనడియన్లు. ఇది ఇప్పటికీ కెనడా చరిత్రలో అత్యంత ప్రాణాంతక ఉగ్రదాడి” అని సీఎస్ఐఎస్ తెలిపింది.టొరొంటో నుంచి ముంబైకి వెళ్తున్న బోయింగ్ 747 విమానం ‘ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 ఎంపెరర్ కనిష్క’పై జరిగిన ఈ బాంబు దాడి కెనడా చరిత్రలోనే అత్యంత ఘోర ఉగ్రదాడిగా నిలిచింది. 2001 సెప్టెంబర్ 11 దాడుల వరకు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక విమాన ఉగ్రదాడిగా నిలిచింది.నిషేధిత ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖాల్సా సభ్యులు సామాన్ల విభాగంలో అమర్చిన బాంబు పేలడంతో అట్లాంటిక్ మహాసముద్రం పైనే విమానం ముక్కలైంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. 2005లో ఈ విషాద ఘటన వార్షిక దినమైన జూన్ 23ను ఉగ్రవాద బాధితుల జాతీయ స్మరణ దినంగా కెనడా ప్రకటించింది.ఖలిస్తానీ ఉద్యమాన్నే ఈ దాడికి బాధ్యులుగా సీఎస్ఐఎస్ స్పష్టంగా పేర్కొనడం, కొద్ది నెలల క్రితం విడుదల చేసిన వార్షిక నివేదిక తర్వాత చోటుచేసుకోవడం గమనార్హం. ఆ నివేదికలో ఖలిస్తానీ తీవ్రవాదులను జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొన్న విషయం తెలిసిందే.కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు కెనడా భూభాగాన్ని వినియోగించి హింసాత్మక తీవ్రవాద కార్యాచరణను ప్రోత్సహిస్తున్నాయి, అలాగే హింసాత్మక కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తూ సమన్వయం చేస్తున్నాయని సీఎస్ఐఎస్ హెచ్చరించింది.భారత్కు కీలకం కెనడాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులే ఆ విమానానికి పేలుడు పదార్థాన్ని అమర్చారని సీఎస్ఐఎస్ స్పష్టంగా చేసిన ప్రకటన భారత్కు ఎంతో కీలకం. ఇరు దేశాల మధ్య ఖలిస్తానీ అంశంపై కొనసాగుతున్న దౌత్య వివాదంలో ఇది భారత్కు కీలక విజయంగా భావిస్తున్నారు.భారత్ ఎన్నో ఏళ్లుగా ఖలిస్తానీ కార్యకలాపాలపై ఆందోళనలు వ్యక్తం చేసినా, కెనడా వాటిని పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. భారత్లో ఆ ఉద్యమం క్షీణించిన తర్వాత కూడా కెనడా వాటికి ఆశ్రయం కల్పించిందని భారత్ చెబుతూ వచ్చింది.మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పాలన సహా వరుస కెనడియన్ ప్రభుత్వాలు ఈ అంశంపై భారత్తో వివాదానికి దిగాయి. ట్రూడో ప్రభుత్వం అయితే కెనడియన్ పౌరులపై హింసాత్మక సరిహద్దు దాటి భారత్ అణచివేత కార్యక్రమాన్ని నిర్వహించిందని కూడా ఆరోపించింది. అయితే చాలా కాలంగా తమ భూభాగంలో పనిచేస్తున్న ఖలిస్తానీ నెట్వర్క్ల వల్ల ఏర్పడిన ముప్పును కెనడియన్ సంస్థలు ఇప్పుడు గుర్తించడం ప్రారంభించడంతో, భారత్ చెబుతున్న వాదనకు బలం చేకూరినట్లు కనిపిస్తోంది. -
మోదీని కలిసిన అమెజాన్ సీఈఓ: కీలక ప్రకటన!
ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ఒకటి. అందుకే.. దిగ్గజ సంస్థలు భారత మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కూడా అదే బాటలో మరో అడుగేసింది.అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తన భారత పర్యటన సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా.. 2030 నాటికి భారతదేశంలో ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం అదనంగా 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అమెజాన్ 2025 డిసెంబర్లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది.కొత్త పెట్టుబడులను ప్రకటించిన నేపథ్యంలో ఆండీ జాస్సీ మాట్లాడుతూ.. "మేము దశాబ్దానికి పైగా కాలంగా భారతదేశంలో పనిచేస్తున్నాం. ఈ కామర్స్, క్లౌడ్, ఏఐ రంగాల్లో అద్భుతమైన వృద్ధిని చూశాం. అందుకే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరింత పెట్టుబడి పెడుతున్నాం" అని చెప్పారు.అమెజాన్ లక్ష్యం.. కేవలం వ్యాపారం పెంచుకోవడం మాత్రమే కాదు. భారతదేశంలో చిన్న వ్యాపారాలను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకురావడం, ఉద్యోగాలను సృష్టించడం, ఎగుమతులను పెంచడం, ఏఐ సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కూడా.అమెజాన్ పెట్టుబడులతో 2030 నాటికి భారతదేశంలో.. 38 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు లభించనున్నాయి. 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులకు సహకారం, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలు ఏఐ ప్రయోజనాలు పొందనున్నారు. పైగా 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలను అందించనుంది.ఇదీ చదవండి: భారీగా తగ్గిన మస్క్ సంపద: కారణం ఇదే!అమెజాన్ కంపెనీ తన పెట్టుబడిలో భారీ మొత్తాన్ని ఏఐ, క్లౌడ్ రంగానికే కేటాయించనుంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్, ముంబైలలో ఉన్న ఏడబ్ల్యుఎస్ డేటా సెంటర్లను మరింత విస్తరించనుంది. దీని వల్ల భారతీయ కంపెనీలు తమ డేటాను దేశంలోనే భద్రంగా నిల్వ చేసుకోవడంతో పాటు అత్యాధునిక ఏఐ టెక్నాలజీలను ఉపయోగించుకోగలుగుతాయి.ఇప్పటికే అనేక భారతీయ సంస్థలు ఏడబ్ల్యుఎస్ సేవలను ఉపయోగిస్తున్నాయి. ఇందులో బ్యాంకులు, స్టార్టప్లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అమెజాన్ తాజా ప్రకటన.. భారత ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ అవకాశాలకు, సాంకేతిక అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. ఇది ''డిజిటల్ ఇండియా'' లక్ష్యాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే మరో కీలక అడుగుగా చెప్పవచ్చు.Really enjoyed my meeting with Prime Minister @narendramodi about what’s ahead for Amazon in India.We’ve been serving customers, sellers, developers, startups, and enterprises in India for more than a decade and just getting started. Shared that we’re investing $48 billion… pic.twitter.com/CSiwPTiEBh— Andy Jassy (@ajassy) June 25, 2026 -
భారత్లో వివాదం.. మరి ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటి?
పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదంటూ కేంద్రం చేసిన తాజా వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పాస్పోర్ట్ కోసం పోలీసు వెరిఫికేషన్ నుంచి పలు స్థాయిల పరిశీలన జరిగితే.. అదే పత్రాన్ని పౌరసత్వానికి ఆధారంగా ఎందుకు గుర్తించరనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వివాదం మధ్య మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? పాస్పోర్ట్ను అక్కడ పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తారా? లేదంటే భారత్లాగే అభ్యంతరాలు ఉన్నాయా? పరిశీలిస్తే.. పాస్పోర్ట్ అనగానే చాలా మందికి అది ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిరూపించే అత్యంత బలమైన పత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఏ దేశమైనా తన పౌరులకే పాస్పోర్ట్లు జారీ చేస్తుంది. అయితే చట్టపరంగా అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండదు. పాస్పోర్ట్కు ఇచ్చే చట్టబద్ధ హోదా దేశానికో విధంగా ఉంటుంది.అమెరికాలో.. ప్రపంచంలో పాస్పోర్ట్ను పౌరసత్వానికి అత్యంత బలమైన ఆధారంగా గుర్తించే దేశాల్లో అమెరికా ముందుంటుంది. అక్కడ చెల్లుబాటు అయ్యే అమెరికన్ పాస్పోర్ట్ ఉంటే.. అది పౌరసత్వ ధ్రువీకరణ పత్రంతో సమానంగా పరిగణిస్తారు. ప్రభుత్వ సంస్థలు, కోర్టులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా సాధారణంగా అమెరికన్ పాస్పోర్ట్ను పౌరసత్వానికి ప్రత్యక్ష ఆధారంగా అంగీకరిస్తారు. అమెరికాలో జనన ధ్రువీకరణ పత్రం (Birth Certificate), Certificate of Citizenship, US Passport.. ఈ మూడు ప్రధాన పౌరసత్వ ఆధారాలుగా పరిగణిస్తారు. వీటిలో పాస్పోర్ట్కే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోనూ..అమెరికా తరహాలోనే బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కామన్ లా దేశాల్లో కూడా పాస్పోర్ట్కు భారీ చట్టబద్ధ ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి ఆ దేశ పాస్పోర్ట్ను కలిగి ఉంటే.. సాధారణ పరిస్థితుల్లో అతడు ఆ దేశ పౌరుడేనని అధికారులు భావిస్తారు. అయితే అవసరమైతే పౌరసత్వ రికార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు, నేచురలైజేషన్ సర్టిఫికెట్లు వంటి అదనపు ఆధారాలను పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది.యూరప్లో పరిస్థితి ఎలా ఉందంటే.. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాల్లో పాస్పోర్ట్ బలమైన పౌరసత్వ ఆధారంగా పరిగణించబడుతుంది. అయితే అక్కడ చాలా దేశాల్లో జాతీయ గుర్తింపు కార్డులు (National ID Cards) కూడా ఉంటాయి. అందువల్ల పౌరసత్వ నిర్ధారణలో పాస్పోర్ట్తో పాటు జాతీయ గుర్తింపు వ్యవస్థ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. యూరోపియన్ యూనియన్లోని అనేక దేశాల్లో పౌరులు దేశీయ ప్రయాణాలు, ప్రభుత్వ సేవల కోసం పాస్పోర్ట్ కంటే జాతీయ గుర్తింపు కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తారు.మరి భారత్లాంటి దేశాలు ఉన్నాయా?అవును.. భారత్ మాత్రమే కాదు కొన్ని దేశాల్లో పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన అది పౌరసత్వానికి శాశ్వత, అంతిమ రుజువు కాదని భావిస్తారు. ఉదాహరణకు కెనడాలో పాస్పోర్ట్కు అధిక ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. సిటిజన్షిప్ సర్టిఫికెట్(Citizenship Certificate) అనే ప్రత్యేక పత్రాన్ని పౌరసత్వానికి మరింత బలమైన ఆధారంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్తో పాటు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి రావొచ్చు.అలాగే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జాతీయ పౌరసత్వ రిజిస్టర్లు, ప్రత్యేక సిటిజన్ కార్డులు, ప్రభుత్వ రికార్డులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది.అసలు ఎన్ని దేశాలు పాస్పోర్ట్ను పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తున్నాయి?. ఇదే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ఒకే విధమైన అధికారిక జాబితా లేదు. అయితే సాధారణంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ భాగం పాస్పోర్ట్ను పౌరసత్వానికి బలమైన, ప్రాథమిక ఆధారంగా అంగీకరిస్తాయి. మరోవైపు కొన్ని దేశాలు మాత్రం అదనపు పౌరసత్వ ధ్రువీకరణ వ్యవస్థలను కూడా కొనసాగిస్తున్నాయి. అంటే ప్రపంచంలోని 190కి పైగా దేశాల్లో పాస్పోర్ట్కు ఉన్న చట్టబద్ధ హోదా ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది.భారత్లో వివాదం ఎందుకంటే.. భారత్లో ప్రస్తుతం ప్రతి పౌరుడికి ఇచ్చే ఒకే ఒక్క "యూనివర్సల్ సిటిజన్షిప్ డాక్యుమెంట్" లేదు. ఆధార్ గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తుంది. ఓటరు కార్డు ఓటు హక్కును సూచిస్తుంది. పాన్ కార్డు పన్ను అవసరాల కోసం. పాస్పోర్ట్ ప్రయాణ పత్రం మాత్రమే. దీంతో పౌరసత్వాన్ని నిరూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క పత్రం కాకుండా.. జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల రికార్డులు, విద్యా ధ్రువపత్రాలు, ప్రభుత్వ రికార్డులు వంటి అనేక ఆధారాలను అధికారులు పరిశీలించాల్సి వస్తోంది.చర్చ ఎటు దారితీస్తోంది?పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువా? కాదా? అనే ప్రశ్న కంటే.. భారత్లో ప్రత్యేక పౌరసత్వ గుర్తింపు వ్యవస్థ అవసరమా? అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో పాస్పోర్ట్ ఒక్కటే సరిపోతుండగా.. భారత్లో మాత్రం పౌరసత్వ నిర్ధారణకు బహుళ పత్రాల అవసరం కొనసాగుతోంది. అందుకే కేంద్రం చేసిన తాజా వ్యాఖ్యతో మొదలైన ఈ చర్చ.. ఇప్పుడు భారత పౌరసత్వ వ్యవస్థ భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారుతోంది. -
‘వైభవ్ కోసం ఎదురు చూస్తున్నారు’
బెల్ఫాస్టట్: భారత్, ఇంగ్లండ్ మధ్య రేపు తొలి టి20 మ్యాచ్ సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ (స్టోర్మోంట్)లో జరగనుంది. ఈ మైదానం సామర్థ్యం దాదాపు 7 వేలు మాత్రమే! అయితే సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో తాత్కాలిక ఏర్పాట్లతోనైనా సీట్ల సంఖ్యను పెంచాలని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. వైభవ్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తే అది కొత్త చరిత్ర అవుతుందని భారత్–ఐర్లాండ్ మాజీ క్రికెటర్ ఎంవీ నరసింహారావు (బాబ్జీ) అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో వైభవ్ గురించే చర్చ సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘బెల్ఫాస్ట్లో వైభవ్ మేనియా మొదలైంది. అతను తొలి మ్యాచ్ బరిలోకి దిగితే కొత్త రికార్డు సృష్టిస్తాడు. ఇంతటి ఆసక్తిని మేం ఊహించలేదు. గత కొద్ది రోజులుగా మ్యాచ్ గురించి చాలా మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. యూరోప్లోని పారిస్ తదితర ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చాలా మంది మ్యాచ్ను చూడాలని భావిస్తున్నారు. వారికి తగిన ఏర్పాట్లు చేయడం నిర్వాహకుల బాధ్యత. అయితే మ్యాచ్ జరిగే స్టేడియం సామర్థ్యం 7 వేలు మాత్రమే. చాలా మంది టికెట్ల కోసం ఎగబడుతున్నారు. కాబట్టి ఏదో రకంగా అదనపు సీట్లు ఏర్పాటు చేయాల్సిందే’ అని నరసింహారావు అన్నారు. వైభవ్ ఆటపై ప్రశంసలు కురిపించిన ఆయన... ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ‘వైభవ్ అద్భుతమైన బ్యాటర్. ఐపీఎల్లో అతను ప్రదర్శనను చూశాను. కాస్త నెమ్మదిగా ఉండే ఐర్లాండ్ పిచ్లపై కూడా అతను ప్రభావం చూపించగలడు. అయితే బంతి బాగా స్వింగ్ అయ్యే ఇంగ్లండ్లో అతనికి అసలు సవాల్ ఎదురవుతుంది. అతని కొన్ని షాట్లు చూస్తే గ్యారీ సోబర్స్ను కూడా గుర్తుకు తెస్తున్నాడు. ఇంత చిన్న వయసులో అన్ని రకాల షాట్లు ఆడగలుగుతున్నాడు. ఆ ప్రతిభ దేవుడు ఇచ్చిన బహుమతి. సచిన్ టెండూల్కర్ తరహాలోనే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణాలతో పాటు తీవ్ర సాధన, ఫిట్నెస్, క్రమశిక్షణను కొనసాగించాలనేది నా సలహా’ అని నరసింహారావు సూచించారు. మైదానంలో గంట మోగించనున్న ‘బాబ్జీ’... సన్నిహితుల ద్వారా ‘బాబ్జీ’గా గుర్తింపు పొందిన హైదరాబాద్ క్రికెటర్ ఎంవీ నరసింహారావు 1978–79లో భారత్ తరఫున 4 టెస్టులు ఆడారు. అయితే ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆయనకు మంచి రికార్డు ఉంది. 108 మ్యాచ్లలో 9 సెంచరీలు సహా 4845 పరుగులు చేసిన బాబ్జీ...లెగ్స్పిన్నర్గా 245 వికెట్లు కూడా పడగొట్టారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1986–87 సీజన్లో హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. బాబ్జీ కెప్టెన్సీలోనే జట్టు ఈ ఘనత సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్ మళ్లీ రంజీ టైటిల్ గెలవలేకపోయింది. హైదరాబాద్లో తొలి క్రికెట్ కోచింగ్ అకాడమీ (సెయింట్ జాన్స్) పెట్టి వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్లాంటి స్టార్ క్రికెటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. అనంతరం ఐర్లాండ్కు వెళ్లి అక్కడే స్థిరపడిన నరసింహారావు ఆ దేశం తరఫున కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. అక్కడే కోచ్గా పలువురు ఐర్లాండ్ క్రికెటర్లు ఇయాన్ మోర్గాన్, కెవిన్ ఓబ్రైన్, పోర్టర్ఫీల్డ్, బల్బర్నీలను తీర్చిదిద్దడంలో బాబ్జీ కీలక పాత్ర పోషించారు. ఈ సేవలకుగాను ఐర్లాండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎంబీఈ పురస్కారంతో సత్కరించింది. ఈ నెల 28న భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్కు ముందు మైదానంలో ఏర్పాటు చేసిన గంట (రాయ్ టారెన్స్ బెల్)ను బాబ్జీ మోగించనున్నారు. ఇరు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. -
పాక్లోకి భారత్ విమానం.. హెచ్చరికలతో తప్పిన ప్రమాదం
అమృత్సర్: ఢిల్లీ నుంచి అమృతసర్కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యతో పెద్ద ప్రమాదంలో పడింది. సాంకేతిక సమస్యతో పొరపాటున పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అనంతరం పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హెచ్చరికలతో అప్రమత్తమైన పైలట్లు, వెంటనే విమానాన్ని సరిదిద్ది తిరిగి భారత గగనతలంలోకి మరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అసలేం జరిగింది?జూన్ 22 రాత్రి రాత్రి 9:18 ప్రాంతంలో ఢిల్లీ నుంచి అమృత్సర్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-479) బయిలుదేరింది. అయితే సాంకేతిక సమస్యలతో పొరపాటున పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. దీంతో పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు, వెంటనే విమానాన్ని సరిదిద్ది తిరిగి భారత గగనతలంలోకి ప్రవేశపెట్టారు. దీంతో విమానం యూ-టర్న్ తీసుకుని సురక్షితంగా భారత్లోకి ప్రవేశించింది.అయితే విమానం అమృత్సర్ చేరుకునే సమయానికి ఎయిర్పోర్ట్లో విమానాల రద్దీ ఎక్కువగా ఉండటంతో, అధికారులు దానిని తిరిగి ఢిల్లీకి మళ్లించారు.అనంతరం ఢిల్లీలో తనిఖీల అనంతరం తిరిగి బయలుదేరి, జూన్ 23 తెల్లవారుజామున 2:20 గంటలకు విమానం అమృత్సర్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.పాకిస్థాన్ ల్యాండ్లోకి ఎందుకు వెళ్లకూడదు?భారతదేశానికి చెందిన ఏ విమానమూ పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లకూడదు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు ఎయిర్ స్పేస్ బ్యాన్ విధించుకున్నాయి. ఒక దేశ విమానాలు మరో దేశంలో ఎట్టిపరిస్థితుల్లో గగన స్థలంలో సంచరించకూడదు. ఈ గడువను నెలనెల పొడిగింపు చేస్తూ వస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ నిషేధం జూలై 24, 2026 వరకు అమల్లో ఉంటుంది. -
మొహర్రం సెలవుపై క్లారిటీ.. ఇక ‘లాంగ్ వీకెండ్’..
న్యూఢిల్లీ: మొహర్రం సెలవు తేదీపై నెలకొన్న సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది! ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 1448 హిజ్రీ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. అయితే, చంద్రుని దర్శనాన్ని అనుసరించి గల్ఫ్ దేశాలకు, భారతదేశానికి మధ్య ఈసారి ఒక రోజు తేడా వచ్చింది. గల్ఫ్ దేశాలలో జూన్ 16న మొహర్రం ప్రారంభం కాగా, భారతదేశంలో జూన్ 17న నెలవంక కనిపించింది. దీంతో అత్యంత పవిత్రమైన ‘ఆషూరా’ దినాన్ని భారత్లో ఎప్పుడు నిర్వహిస్తారు? ఆ రోజు ప్రభుత్వ సెలవు ఉంటుందా లేదా అనే సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.తేదీ మారడానికి అసలు కారణం ఇదేమొహర్రం నెలలో 10వ రోజైన ‘ఆషూరా’ అత్యంత ముఖ్యమైన ఘట్టం. స్థానిక చంద్ర దర్శనం ఆధారంగా ఈ ఏడాది సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలలో జూన్ 25, గురువారం నాడు ఆషూరాను జరుపుకుంటున్నారు. కానీ, భారతదేశంలో చంద్రుడు ఒక రోజు ఆలస్యంగా కనిపించడంతో ఇక్కడి ముస్లింలు జూన్ 26, శుక్రవారం నాడు ఈ పవిత్ర దినాన్ని పాటించనున్నారు. ఈ తేడా కారణంగానే సెలవు తేదీలలో మార్పు వచ్చింది.ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. లాంగ్ వీకెండ్భారత ప్రభుత్వం జూన్ 26 (శుక్రవారం)న మొహర్రం సందర్భంగా గెజిటెడ్ పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఈ రోజున దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, అలాగే బీఎస్ఈ , ఎన్ఎస్ఈ వంటి స్టాక్ ఎక్స్ఛేంజీలు మూతపడనున్నాయి. శుక్రవారం సెలవు రావడంతో, ఆ తర్వాత వచ్చే శని, ఆదివారాలతో కలిపి ఉద్యోగులు, విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ దొరకడం విశేషం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, త్రిపుర, మిజోరంలలో శుక్రవారం మొహర్రం సెలవు ప్రకటించారు. అయితే గోవా, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాలు తమ అధికారిక క్యాలెండర్లో మొహర్రంను ప్రభుత్వ సెలవు దినంగా చేర్చలేదు.మొహర్రం ప్రాముఖ్యతఇస్లాంలో అత్యంత పవిత్రమైన నాలుగు నెలల్లో మొహర్రం ఒకటి. సున్నీ ముస్లింలు ఈ రోజున ప్రవక్త మూసాను ఈజిప్ట్ రాజు ఫారో నుండి దేవుడు రక్షించినందుకు గుర్తుగా ‘ఆషూరా’ నాడు (9, 10వ రోజుల్లో) ఉపవాసాలు ఉంటారు. మరోవైపు, షియా ముస్లింలు దీనిని శోకదినంగా పాటిస్తారు. క్రీస్తుశకం 680లో కర్బలా యుద్ధంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తూ.. నల్లటి వస్త్రాలు ధరించి, మొదటి 10 రోజుల పాటు భారీ ఊరేగింపులు, సంతాప దినాలు నిర్వహిస్తారు.ఇది కూడా చదవండి: సిఏ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ చూసుకోండిలా.. -
ఇంగ్లాండ్ భారీ స్కెచ్.. వైభవ్ కు పోటీగా 16 ఏళ్లు కుర్రాడు
-
సూపర్ ఎల్నినో వెనుక బంగారు రహస్యం!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న "సూపర్ ఎల్నినో" పేరు వినగానే కరువు, వరదలు, పంటనష్టం, ఆహార సంక్షోభమే గుర్తుకొస్తాయి. కానీ ఈ వాతావరణ దృగ్విషయం అందరికీ శాపమేనా? ఆశ్చర్యకరంగా, కొన్ని దేశాలకు మాత్రం సూపర్ ఎల్నినో బంగారు అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఎక్కడో పంటలు ఎండిపోతుంటే.. మరెక్కడో రికార్డు దిగుబడులు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత పెరుగుతుంటే.. మరికొన్ని దేశాల్లో ఆనకట్టలు నిండిపోతాయి. ప్రకృతి సృష్టించే ఈ అసమాన సమీకరణంలో విజేతలు ఎవరు? ఓటమిపాలయ్యే దేశాలు ఏవి?.ప్రపంచ వాతావరణ వ్యవస్థలో అత్యంత ప్రభావశీలమైన ఘటనల్లో ఎల్నినో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కినప్పుడు ఎల్నినో ఏర్పడుతుంది. ఈ వేడిమి మరింత తీవ్రరూపం దాల్చినప్పుడు దానిని "సూపర్ ఎల్నినో"గా పిలుస్తారు. 1982-83, 1997-98, 2015-16లో నమోదైన సూపర్ ఎల్నినోలు ప్రపంచవ్యాప్తంగా వందల బిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. సూపర్ ఎల్నినో ప్రభావం కేవలం వర్షాలకే పరిమితం కాదు. మనం ఉదయం తాగే కాఫీ నుంచి సాయంత్రం తినే చాక్లెట్ వరకు, రైతు పొలం నుంచి ప్రపంచ స్టాక్ మార్కెట్ల వరకు దీని ప్రభావం కనిపిస్తుంది. అందుకే వాతావరణ నిపుణులు సూపర్ ఎల్నినోను ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే అదృశ్య శక్తి’గా అభివర్ణిస్తుంటారు.అయితే ప్రకృతి ఇక్కడే తన విచిత్రాన్ని చూపిస్తుంది. ఒకే వాతావరణ పరిణామం కొన్ని దేశాలకు విపత్తుగా మారితే, మరికొన్ని దేశాలకు అది వరంలా మారుతుంది. ముఖ్యంగా అర్జెంటీనా, ఉరుగ్వే, పెరుగ్వే వంటి వ్యవసాయాధారిత దేశాలు ఎల్నినో సంవత్సరాల్లో అధిక వర్షపాతం కారణంగా భారీ పంట దిగుబడులను నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. సోయాబీన్, మొక్కజొన్న, గోధుమల ఉత్పత్తి పెరగడంతో ఈ దేశాల ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచ మార్కెట్లలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు వీటికి మరింత డిమాండ్ పెరిగి అదనపు ఆదాయం సమకూరుతుంది.ఇక అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి ప్రాంతాలకు కూడా ఎల్నినో కొన్నిసార్లు ఊరటనిస్తుంది. సాధారణంగా కరువుతో ఇబ్బందులు పడే ప్రాంతాల్లో వర్షపాతం పెరిగి జలాశయాలు నిండుతాయి. భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి. వ్యవసాయ రంగానికి నీటి లభ్యత మెరుగుపడుతుంది. హైడ్రోపవర్ ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఎల్నినో ప్రపంచ వాణిజ్య సమీకరణాలనే మార్చేస్తుంది. ఒక దేశంలో పంటలు విఫలమైతే, మరో దేశం ఆ కొరతను భర్తీ చేస్తూ భారీ ఎగుమతుల ద్వారా లాభపడుతుంది. 1997-98 సూపర్ ఎల్నినో సమయంలో కొన్ని దక్షిణ అమెరికా దేశాల వ్యవసాయ ఎగుమతులు గణనీయంగా పెరిగినట్లు ఆర్థిక అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే ఈ లాభాల వెనుక కూడా ప్రమాదాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక దేశంలో పంటలు బాగా పండినా, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గిపోతే అంతర్జాతీయ మార్కెట్లలో ధరల అస్థిరత ఏర్పడుతుంది. సరఫరా గొలుసులు దెబ్బతినడం, ఆహార ధరలు పెరగడం వంటి పరిణామాలు చివరికి లాభపడిన దేశాలపైనా ప్రభావం చూపుతాయి. మరోవైపు భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు సూపర్ ఎల్నినో ప్రభావంతో కరువు, వర్షాభావం, పంట నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారత్లో రుతుపవనాలపై ఎల్నినో ప్రభావం పడితే వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో ఆహార ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.వాతావరణ మార్పుల కారణంగా ఎల్నినో ప్రభావాలు మరింత తీవ్రంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు దశాబ్దాలకు ఒకసారి కనిపించే తీవ్ర ఎల్నినో పరిస్థితులు ఇప్పుడు మరింత తరచుగా సంభవించే అవకాశముందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. దీని అర్థం ప్రపంచం భవిష్యత్తులో మరిన్ని వాతావరణ షాక్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్న మాట.చివరగా.. సూపర్ ఎల్నినో అనేది కేవలం సముద్రంలో ఉష్ణోగ్రత పెరగడం కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే అదృశ్య శక్తి. ఎక్కడో రైతు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తుంటే, మరో దేశంలో అదే వర్షాలు బంగారు పంటలుగా మారతాయి. ఎక్కడో ఆనకట్టలు ఎండిపోతుంటే, మరెక్కడో నీరు పొంగిపొర్లుతుంది. అందుకే శాస్త్రవేత్తలు ఎల్నినోను ప్రకృతి నిర్వహించే ప్రపంచ స్థాయి లాటరీగా అభివర్ణిస్తారు. కానీ ఈ లాటరీలో కొందరు గెలిచినా, చివరికి చెల్లించాల్సిన మూల్యం మాత్రం మొత్తం ప్రపంచానిదే. -
అమెరికా–ఇరాన్ డీల్ను స్వాగతిస్తున్నాం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి కోసం అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన డీల్ను భారత్ స్వాగతిస్తోందని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ అన్నారు. హార్మూజ్ను తిరిగి తెరవడం ద్వారా ప్రపంచ ఇంధన భద్రతతోపాటు ఇతర కీలక వస్తువులు, ఎరువుల సరఫరాలో సుస్థిరత నెలకొంటుందని చెప్పారు. బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏల రెండు రోజుల సదస్సును మంగళవారం ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, రష్యా ఎన్ఎస్ఏ సెర్గీ షోయిగూ, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ ఘదిర్ నెజామిపౌర్, బ్రిక్స్ దేశాల ఇతర భద్రతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అజిత్ దోవల్.. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక ఒత్తిళ్ల వంటి సవాళ్లను పరిష్కరించడంలో కూటమి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని భారత్ స్వాగతిస్తోందన్నారు. ఒప్పందం విజయవంతం అవుతుందని, ఇంధన భద్రతకు దోహదపడుతుందని ఆశిస్తున్నామన్నారు.హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం స్వాగతించదగిన పరిణామమన్నారు. ఇది సప్లయ్ చైన్లో అడ్డంకులను తొలగించడమే కాకుండా ఎరువులు, రసాయనాలు తదితరాల కొరతను కూడా తీరుస్తుందని ధోవల్ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం వివిధ రకాలైన సమస్యలను అనేక దేశాలు నేడు ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ వివాదాలను పరిష్కరించడానికి లేదా తగ్గించడానికి అవసరమైన వ్యవస్థాగతమైన యంత్రాంగాలు కూడా అంతగా అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. అత్యంత ప్రత్యేక కూటమి బ్రిక్స్ బహుళధ్రువ ప్రపంచం క్రమంగా క్షీణీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో బ్రిక్స్ కూటమి ప్రధానంగా వ్యవహరించాల్సి ఉందని ధోవల్ అభిప్రాయపడ్డారు. బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో, ఎదుగుతున్న ఆర్థిక శక్తుల ఒక అనధికారిక కూటమిగా బ్రిక్స్ రూపుదిద్దుకుందన్నారు. ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, గ్లోబల్ సౌత్ స్వరాన్ని మరింత బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. శాంతి, ప్రగతి, అభివృద్ధి, పరస్పర సహకారాన్ని విశ్వసించే దేశాల అత్యంత ప్రత్యేక కూటమే బ్రిక్స్ అని ఆయన అభివర్ణించారు. ఇరాన్ అధికారి పోస్టర్ ఇరాన్ పక్షాన హాజరైన నెజామిపౌర్ ఈ భేటీలో అమెరికా జరిపిన వైమానికదాడిలో చనిపోయిన చిన్నారుల పోస్టర్ను ప్రదర్శించడం కలకలం రేపింది. మినాబ్లోని పాఠశాలపై జరిగిన దాడిలో వందలాదిగా చిన్నారులు బలయ్యారు. ఈ పాశవిక దాడులను యూఏఈ గడ్డపై నుంచే అమెరికా ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. అమెరికా, దాని మిత్ర దేశాలు చేస్తున్న దురాక్రమణకు, హార్మూజ్ సంక్షోభానికి యావత్తు ప్రపంచం సాక్ష్యంగా నిలిచిందని చెప్పారు. ఈ దాడులను ఖండించడానికి బదులుగా, యూఏఈ ఈ దురాక్రమణలో పాలుపంచుకుందని, ఇరాన్లో పౌరు వసతులు, స్కూళ్లు, ఆస్పత్రులపై దాడులకు వేదికగా మారిందని ఆయన ఆరోపణలు చేశారు.భద్రతా సహకారంలో కీలకం: ప్రధాని మోదీ మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఉగ్రవాదం, సైబర్ భద్రత నుంచి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వరకు ఎదురవుతున్న ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడం, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడంలో బ్రిక్స్ కూటమి అత్యంత కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్ అధ్యక్ష పదవిలో ఉన్న భారత్.. ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వడానికి తన వంతు సహకారాన్ని అందిస్తుందని మోదీ ఎక్స్లో చెప్పారు. బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏలు, సీనియర్ అధికారులు తనను కలుసుకోవడం ఆనందంగా ఉన్నారు. -
హార్మూజ్ను దాటి భారత్ వైపు...
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన డీల్తో భారత జెండా కలిగిన 11 నౌకలు హార్మూజ్ను దాటేశాయని విదేశాంగ శాఖ మంగళవారం తెలిపింది. భారతీయ జెండా కలిగిన 10 నౌకలు ఇప్పటికీ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే ఉన్నాయి. తాజాగా, వాటికి మరో రెండు జతయ్యాయి’అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్జైశ్వాల్ మీడియాకు తెలిపారు.అమెరికా, ఇరాన్ డీల్ కుదిరిన తర్వాత 11 నౌకలు హార్మూజ్ను దాటేశాయన్నారు. వీటిలో 2.85 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు కలిగిన మూడు ట్యాంకర్లు ఉన్నాయని వివరించారు. వీటితోపాటు విదేశీ జెండాలు కలిగిన ఒక ఎల్పీజీ నౌక, మరో ముడిచమురు ట్యాంకర్ కూడా ఉన్నాయి. ఇవికాకుండా, ఎరువులతో వస్తున్న ఆరు విదేశీ నౌకలున్నాయన్నారు. మిగతా నౌకలు కూడా త్వరలోనే హార్మూజ్ను దాటే అవకాశాలున్నాయని జైశ్వాల్ పేర్కొన్నారు. -
టీమిండియా జెర్సీ అందుకోగానే బుడ్జోడు ఏం అన్నాడంటే
-
జోరు కొనసాగించాలని...
లండన్: ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టును... ఒలింపిక్ చాంపియన్ నెదర్లాండ్స్ జట్టును ఓడించిన ఉత్సాహంలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు తన కీలక పోరుకు సిద్ధమైంది. ప్రొ లీగ్ 2025–2026 సీజన్లో భాగంగా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తోనూ భారత్ రెండు మ్యాచ్లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్ జరగనుండగా... రెండో మ్యాచ్ను శుక్రవారం నిర్వహిస్తారు. 2024లో చైనా వేదికగా జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో చివరిసారి భారత్, పాక్ ముఖాముఖిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత్ 2–1తో గెలిచింది. ప్రస్తుత యూరోప్ అంచె ప్రొ లీగ్లో భారత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న జట్లను ఓడించి జోరు మీదుంది. జుగ్రాజ్ సింగ్, మన్దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిషేక్ తమకు లభించిన అవకాశాలను గోల్స్గా మలుస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టు ఆడిన 12 మ్యాచ్ల్లో ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ హాకీలో పాకిస్తాన్పై భారత్దే పైచేయిగా ఉంది. గత పదేళ్లలో ఈ రెండు జట్ల మధ్య 17 మ్యాచ్లు జరగ్గా... 15 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. మరో రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రొ లీగ్లోనూ పాక్పై తమ విజయపరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రస్తుత ప్రొ లీగ్ సీజన్లో భారత్ 10 పాయింట్లతో 8వ స్థానంలో... పాకిస్తాన్ జట్టు పాయింట్ల ఖాతా తెరవకుండానే చివరిదైన 9వ స్థానంలో ఉన్నాయి. ప్రొ లీగ్లో మొత్తం తొమ్మిది జట్లు 16 మ్యాచ్ల చొప్పున ఆడతాయి. ఇప్పటికి అన్ని జట్లు 12 మ్యాచ్ల చొప్పున పూర్తి చేసుకున్నాయి. ఈనెల 28తో సీజన్ ముగియనుండగా... 34 పాయింట్లతో బెల్జియం అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
భారత్తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్
వాషింగ్టన్: భారత్కు విక్రయిస్తున్న అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అత్యంత తేలికైన శతఘ్నుల్లో ఉపయోగించే ఉపకరణాలు, వాటి సర్వీసింగ్కు సంబంధించిన 482.2 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4,561కోట్ల) విలువైన ఒప్పందాన్ని అమెరికా లాంఛనంగా నోటిఫై చేసింది. లాంఛనంగా నోటిఫై చేసిన ఈ వివరాలను విదేశీ సైనిక కొనుగోళ్ల ప్రాజెక్టులను చూసుకునే అమెరికా భద్రతా సహకార ఏజెన్సీ(డీఎస్సీఏ) జూన్ 17వ తేదీన తన ఫెడరల్ రిజిస్టర్లో పొందుపరిచింది. అంతకుముందే మే 18వ తేదీన అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 హవిట్జర్ల సర్వీసింగ్ సేవల అమ్మకంపై అమెరికా కాంగ్రెస్కు ఆ దేశ విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చింది. పర్వతమయ సరిహద్దుల్లో శత్రుసేనల పీచమణిచేందుకు భారత్ విదేశీ సైనిక కొనుగోళ్ల మార్గంలో అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్లు, శతఘ్నులను కొనుగోలుచేయడం తెల్సిందే. ఇవిగాక ఏహెచ్–64ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లనూ భారత్ ప్రస్తుతం వినియోగిస్తోంది. ఈరకం ప్రపంచంలోనే అత్యుత్తమమైన యుద్ధహెలికాప్టర్లలో ఒకటి. ఇది అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయడంతోపాటు యుద్ధక్షేత్రాల్లో సైన్యానికి సైనిక, ఆయుధ సరఫరాలో ఎంతగానో సాయపడుతుంది. తాజాగా నోటిఫై అయిన ఒప్పందం ప్రకారం ఎం777ఏ2 శతఘ్నుల సేవల ఒప్పందాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలని భారత్ భావిస్తోంది. ఒప్పందంలో భాగంగా ఆయుధాల విడిభాగాల అందజేత, మరమ్మత్తు, పాడైనవి మార్చేసి కొత్తవి బిగించడం, వాటిని ఉపయోగించే సిబ్బందికి శిక్షణ, ఇతర సాంకేతిక తోడ్పాటును భారత దళాలకు అమెరికా అందించనుంది. శతఘ్నులకు సంబంధించి 230 మిలియన్ డాలర్లు, అపాచీ హెలికాప్టర్లకు సంబంధించి 198.2 మిలియన్ డాలర్లు మొత్తంగా 482.2 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. వాస్తవానికి అపాచీ సపోర్ట్ సర్వీసుల ప్రధాన కాంట్రాక్ట్ బోయింగ్ కంపెనీ, లాక్హీడ్ మార్టీన్లతో భారత్ గతంలో కుదుర్చుకుంది. శతఘ్నులకు సంబంధించి బ్రిటన్లోని కంబ్రియాలోని బీఏఈ సిస్టమ్స్తో భారత్ ప్రధాన సర్వీస్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఇప్పుడు కొత్తగా సహాయక సేవల అమ్మకం ఒప్పందాన్ని అమెరికాతో భారత్ కుదుర్చుకుంది. అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచే ఉద్దేశంతోనే సేవల అమ్మకాన్ని ముందుకొచ్చామని అమెరికా రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఎప్పటికప్పుడు రిపేర్లు, కొత్త విడిభాగాల బిగింపుతో ఆయుధాల సన్నద్ధత పెరిగి రక్షణ భాగస్వామ్య దేశమైన భారత్లో భద్రత మరింత పటిష్టమవుతుంది. ఇది ఇండోపసిఫిక్, దక్షిణాసియా ప్రాంతంలో సుస్థిరత, శాంతి, ఆర్థికాభివృద్ధికి బాటలుపరుస్తుంది’’అని అమెరికా పేర్కొంది. -
నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్.. ఏం జరుగుతోంది?
దేశ రాజకీయాల్లో మరోసారి ఫిరాయింపుల రాజకీయాలు వేగం పుంజుకున్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు అనర్హత నుంచి తప్పించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార బలం పెంచుకోవడానికి జరుగుతున్న ఈ రాజకీయ వ్యూహాలు ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తరచూ జరిగే పార్టీ మార్పులు రాజకీయ పార్టీలపైనే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపై కూడా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో పెరుగుతున్న ఫిరాయింపులు, వాటి వెనుక ఉన్న కారణాలు, చట్టపరమైన అంశాలు మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి.దేశ రాజకీయాల్లో మరోసారి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం క్షీణిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేనలో అధికారికంగా చేరారు. 2022లో శివసేనను చీల్చి, భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిండే.. ఇప్పుడు మరోసారి ఫిరాయింపులను ప్రోత్సహించారు. "ఆపరేషన్ టైగర్" పేరుతో సాగిన ఈ ప్రక్రియలో ఒక్కో ఎంపీకి రూ.50 కోట్లు చెల్లిస్తున్నారని, అందులో రూ.15 కోట్లు ముందుగానే ఇచ్చారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఆరోపణలు చేస్తోంది.పార్టీ ఎంపీల్లో మూడింట రెండొంతుల మంది మారుతుండడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత తప్పించుకుంటారని విశ్లేషకులు వాదిస్తున్నారు. అయితే, ఎంపీల బృందం మరో పార్టీలో చేరాలంటే, ముందు వారి అసలు పార్టీ కూడా అదే తరహా విలీనాన్ని అధికారికంగా ఆమోదించాలనే నిబంధన ఉందన్న వాదన కూడా ఉంది.వరసగా ఫిరాయింపులుఈ ఫిరాయింపులకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా పార్టీ మార్పులు జరిగాయి. ఏప్రిల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు భారతీయ జనతా పార్టీలో చేరారు. మేలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, లోక్సభలో ఆ పార్టీకి చెందిన 28 మంది ఎంపీల్లో 20 మంది త్రిపుర కేంద్రంగా ఉన్న, పెద్దగా గుర్తింపు లేని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు.వ్యంగ్యంగా చెప్పాలంటే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా లేని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుల్లో కొందరికి ఈ ప్రముఖ ఫిరాయింపు విషయం కూడా తెలియలేదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఫిరాయింపుల నుంచి సురక్షితంగా కనిపించడం లేదు. సమాజ్వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)లో కూడా ఇలాంటి పరిణామాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు పార్టీలకు లోక్సభలో వరుసగా 37 మంది, 8 మంది ఎంపీలు ఉన్నారు.ఈ రాజకీయ పరిణామాల వెనుక అతిపెద్ద లబ్ధిదారుగా బీజేపీ నిలుస్తోంది. పార్లమెంట్లో మద్దతు పెంచుకునే ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ రాజకీయ అవకాశవాదం, ఫిరాయింపులను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఇప్పుడు అది ‘‘ప్రభావం కోల్పోయిన నిబంధన’’గా మారింది. -
భారత్కు సొంత ‘డీప్సీక్’ ఉండాలి
న్యూఢిల్లీ: కొత్త తరం టెక్నాలజీపై పట్టు సాధించాలన్నా, అంతర్జాతీయంగా పోటీపడాలన్న భారత్ తనకంటూ సొంతంగా ’డీప్సీక్’లాంటి ఏఐ మోడల్ని తయారు చేసుకుని తీరాలని బ్రోకరేజ్ దిగ్గజం బెర్న్స్టైన్ ఒక నివేదికలో స్పష్టం చేసింది. అలా జరగని పక్షంలో అమెరికా లేదా చైనాకు చెందిన ఏఐ మోడల్స్పై ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇలా మరో దేశంపై ఆధారపడటం వల్ల రిస్క్ లు తప్పవని హెచ్చరించింది. లేటెస్ట్ ఏఐ మోడల్స్ అందరికీ అందకుండా అమెరికా ఇటీవల ఆంక్షలు విధించడమనేది గ్లోబల్గా ఏఐ రేసులో కీలక మలుపని అభివర్ణించింది. అధునాతన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని (ఎల్ఎల్ఎం) దేశాలు.. వ్యాపారపరమైన లాభాలు తెచ్చిపెట్టే సాఫ్ట్వేర్గా కాకుండా వ్యూహాత్మక అసెట్స్గా పరిగణిస్తుండటాన్ని ఇది సూచిస్తోందని కూడా నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో భారత్ విదేశీ ఏఐ మోడల్స్పై ఆధారపడుతూ, కేవలం అప్లికేషన్ డెవలప్మెంట్పైనే దృష్టి పెట్టే పక్షంలో భవిష్యత్ తరపు టెక్నాలజీపై నియంత్రణ కోల్పోయే ముప్పు తలెత్తుతుందని బెర్న్స్టైన్ పేర్కొంది. ‘వేరే వాళ్ల దగ్గరనుంచి అప్పుగా తీసుకున్న మోడల్స్ ఆధారంగా భారత్ తన ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దుకోలేదు. విదేశీ ఎల్ఎల్ఎంల ఆధారంగా అప్లికేషన్లను తయారు చేసేటువంటి ప్రస్తుత వ్యూహం వల్ల భౌగోళిక రాజకీయపరమైన రిస్క్ లను ఎదుర్కొనాల్సి వస్తుంది‘ అని స్పష్టం చేసింది. ఏఐ.. కొత్త తరం ఫైటర్ జెట్.. కృత్రిమ మేధ మోడల్స్ని మిలిటరీ అసెట్స్గా బెర్న్స్టైన్ అభివర్ణించింది. సెమీకండక్టర్ పరికరాలు, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ) నుంచి వినూత్న ఏఐ మోడల్స్ వరకు అధునాతన సాంకేతికతలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ‘ఏఐ అనేది కొత్త తరం ఫైటర్ జెట్‘లాంటిదని పేర్కొంది. ఫౌండేషనల్ మోడల్స్ని వివిధ దేశాలు కేవలం సాఫ్ట్వేర్ ఉత్పత్తులుగా కాకుండా వ్యూహాత్మక వనరులుగా పరిగణిస్తున్నాయని వివరించింది. దేశ భద్రత, ఇతర దేశాలపై ఆర్థికంగా పైచేయి సాధించే కోణంలో వాటిని కాపాడుకోవడంపై దృష్టి పెడుతున్నాయని నివేదిక తెలిపింది. -
సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!
రెనాల్ట్ ఇండియా తన సరికొత్త డస్టర్ ఎస్యూవీ ఎగుమతులను అధికారికంగా ప్రారంభించింది. తొలి విడతలో 750 డస్టర్ వాహనాలను చెన్నై ప్లాంట్ నుంచి సౌత్ ఆఫ్రికాకు పంపించింది. రాబోయే నెలల్లో మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఈ మోడల్ను ఎగుమతి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.కొత్త డస్టర్ భారతదేశంలో తొలిసారిగా రెనాల్ట్ గ్రూప్ మాడ్యులర్ ప్లాట్ఫామ్పై నిర్మితమైంది. ఈ ప్లాట్ఫామ్ వివిధ రకాల పవర్ట్రెయిన్ టెక్నాలజీలకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా.. అన్ని వేరియంట్లు, పవర్ట్రెయిన్లలో 5-స్టార్ భారత్ NCAP భద్రతా రేటింగ్ను పొందడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడే సామర్థ్యాన్ని నిరూపించింది.2030 నాటికి భారత్ నుంచి సంవత్సరానికి 2 బిలియన్ యూరోల ఎగుమతులను సాధించాలనే లక్ష్యంతో రెనాల్ట్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త డస్టర్ ఎగుమతుల ప్రారంభం భారత ఆటోమొబైల్ పరిశ్రమకు కూడా ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది. -
జయహో...భారత్.. శ్రీలంకపై ఘన విజయం
-
భారత్తో యుద్ధానికైనా రెడీ.. పాక్ మంత్రి సంచలన ప్రకటన
భారత్–పాకిస్తాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య కొత్త రాజకీయ, దౌత్య ఉద్రిక్తతలకు దారితీశాయి. సింధూ జలాల విషయంలో పాకిస్తాన్ హక్కులను దెబ్బతీసే ఏ చర్యనైనా తమ దేశం సహించదని, అవసరమైతే భారత్తో యుద్ధానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఇటీవల భారత్ చేపడుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టులు, నదీ జలాల నిర్వహణ చర్యలపై స్పందించిన ఖవాజా ఆసిఫ్.. పాకిస్తాన్కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే లేదా అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే అది కేవలం జలాల సమస్య కాకుండా జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, కోట్లాది ప్రజల జీవనాధారం సింధూ నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో నీటి హక్కులను కాపాడుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగిస్తామని చెప్పారు. అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి కూడా తమ దేశం వెనుకాడదని ఆయన వ్యాఖ్యానించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.ఇండస్ ఒప్పందం ఏమిటి?1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఇండస్ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధూ నదీ వ్యవస్థలోని ఆరు ప్రధాన నదులను రెండు దేశాల మధ్య విభజించారు. రవి, బియాస్, సట్లెజ్ నదుల జలాలపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా, ఇండస్, జీలం, చీనాబ్ నదుల జలాలను ప్రధానంగా పాకిస్తాన్ వినియోగించుకునేలా ఒప్పందం రూపొందించబడింది. అయితే పశ్చిమ నదులపై కూడా విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం కొన్ని పరిమిత హక్కులు భారత్కు కల్పించబడ్డాయి. గత ఆరు దశాబ్దాలుగా అనేక యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు ఎదురైనా ఈ ఒప్పందం కొనసాగుతుండటం విశేషం.ఎందుకు మళ్లీ వివాదం?గత కొంతకాలంగా జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలో పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా చీనాబ్, జీలం నదులపై నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇవి ఇండస్ ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది. భారత్ మాత్రం ఈ ప్రాజెక్టులన్నీ ఒప్పంద పరిధిలోనే ఉన్నాయని, నీటి ప్రవాహాన్ని మళ్లించడం లేదా అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా, దేశానికి లభించిన హక్కులను పూర్తిగా వినియోగించుకోవడం తమ బాధ్యత అని చెబుతోంది.మారిన పరిస్థితులు..ఇటీవలి కాలంలో భారత్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఇండస్ ఒప్పందంపై భారత్లో కూడా చర్చలు పెరిగాయి. "రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవు" అంటూ గతంలో భారత నాయకత్వం చేసిన వ్యాఖ్యలు మళ్లీ ప్రస్తావనకు వచ్చాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదం కొనసాగితే ఇండస్ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష అవసరమని భారత రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమైంది. -
గల్ఫ్లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత
హైదరాబాద్: గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల ఓటు హక్కుల పరిరక్షణపై మంత్రి పొన్నం ప్రభాకర్తో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ప్రతినిధులు ఆదివారం చర్చించారు. తెలంగాణ రాష్ట్ర 'గల్ఫ్ కాంగ్రెస్' ప్రతినిధి సుతారి సత్యనారాయణ పటేల్, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఆదివారం హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం వేళ.. విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై పొన్నం ప్రభాకర్ తో వారు చర్చించారు.ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటరు నమోదును కొనసాగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆన్లైన్ జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ ప్రతిపాదనలను మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్వీకరించినట్లు వారు తెలిపారు. అలాగే తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు, గల్ఫ్ కార్మికులతో ప్రత్యక్షంగా మమేకమయ్యేందుకు గల్ఫ్ దేశాల్లో పర్యటించాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. స్వయంగా గల్ఫ్ దేశాల్లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర ఎంతో కీలకమని, వారి సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. -
భారత్ - ఈయూ ఒప్పందం: పీయూష్ గోయల్ కీలక ప్రకటన!
భారత్ - 27 దేశాల యూరోపియన్ యూనియన్ మధ్య కుదరబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థికాభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా మారనుంది. ఈ ఒప్పందంపై 2026 డిసెంబర్ నాటికి సంతకం చేసే అవకాశం ఉందని, ఆ తరువాత 2027 ఫిబ్రవరి - మార్చి నెలలలో అమలులోకి రానున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.ఈ ఒప్పందాన్ని 'అన్ని ఒప్పందాలకు మాతృక' (Mother of All Deals) లాంటిదని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలవనుంది. భారత్ - ఈయూ కలిసి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో సుమారు 25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా.. ప్రపంచ అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు మూడవ వంతు వాటా ఈ రెండు భాగస్వామ్యాలదే.ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత, భారతదేశం నుంచి ఈయూ దేశాలకు ఎగుమతి చేసే సుమారు 93 శాతం వస్తువులకు సుంకం లేకుండా మార్కెట్ ప్రవేశం లభిస్తుంది. దీని వలన భారతీయ వస్త్రాలు, ఔషధాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి అనేక రంగాలకు భారీ అవకాశాలు ఏర్పడతాయి.మరోవైపు, ఈయూ దేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు, వైన్ వంటి వస్తువులపై సుంకాలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల భారత వినియోగదారులు ఈ ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. అయితే దేశీయ పరిశ్రమలపై ప్రభావం పడకుండా తగిన రక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి భారతదేశంపై ఉందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో అనేక దేశాలు ఇండియాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికాతో కూడా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. అలాగే కెనడా కూడా భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: జాబ్ కోసం పోతే.. షాకింగ్ అనుభవం! -
సూర్యవంశీ విధ్వసం.. 11బంతుల్లో హాఫ్ సెంచరీ
-
భారత్పై విషం చిమ్మిన పాక్
ఢిల్లీ: భారతలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. జర్దారీ వ్యాఖ్యలు అత్యంత ద్వేషంతో రాజకీయ దురుద్దేశంతో కూడినవని విదేశాంగ శాఖ కొట్టిపడేసింది. భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడే హక్కు ఇస్లామాబాద్కు ఎంతమాత్రం లేదని మరోసారి స్పష్టం చేసింది.ఇటీవల పాకిస్థాన్ అధ్యక్షుడు భారత్పై విషం చిమ్మారు. ఎక్స్ వేదికగా భారత్ను విమర్శిస్తూ "భారతదేశంలోని వారణాసిలో ఉన్న 1000 ఏళ్ల నాటి 'మసీదు గంజ్ షహీదా'తో సహా చారిత్రక ముస్లిం మతపరమైన కట్టడాల కూల్చివేతలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలి, ఇలాంటి చర్యలు కొనసాగితే, అవి భారతదేశ విచ్ఛిన్నానికి నిరంతర అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది" అని ఎక్స్ వేదికగా విమర్శించారు. తాజాగా దీనికి భారత్ తీవ్రస్థాయిలో బదులిచ్చింది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయమై మాట్లాడుతూ... "పాకిస్థాన్ అధ్యక్షుడు చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను భారతదేశం ఖచ్చితంగా తిరస్కరిస్తోంది. భారతదేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి అతనికి ఎలాంటి హక్కు లేదు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పాకిస్థాన్ స్వంత మానవ హక్కుల రికార్డును గమనిస్తే, ఆ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు మరీ హాస్యాస్పదంగా అనిపిస్తాయి. వివిధ మతాలకు చెందిన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించడంలో పాకిస్థాన్కు ఉన్న సుదీర్ఘమైన, దురదృష్టకరమైన చరిత్ర ప్రపంచమంతటికీ తెలిసిందే" అని స్పష్టం చేశారు.అయితే పాకిస్థాన్లో హిందువులపై జరిగే దాడులు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయమై అక్కడి స్వచ్ఛంద సంస్థలు, ఇతర అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థలు కూడా ఆ దేశంలో మతపరమైన హింసపై నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై అక్కడ నిరంతరం దాడులు జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. రాజకీయ ప్రేరేపిత దాడిజర్దారీ వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, ఆ దేశంలో కొనసాగుతున్న మతోన్మాదం, ద్వేషపూరిత విధానాల నుంచే ఇవి పుట్టుకొచ్చాయని జైస్వాల్ ముగించారు. "ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే, పాకిస్థాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు కేవలం ఆ దేశ జాతీయ విధానాలైన మతోన్మాదం, ద్వేషం ఆధారంగా చేసిన ఒక ఉద్దేశపూర్వక రాజకీయ దాడిగా మాత్రమే పరిగణించవచ్చు" అని ఆయన అన్నారు.వారణాసిలోని చారిత్రాత్మక 'మస్జిద్ గంజ్ షహీదా'తో పాటు భారతదేశంలోని ఇతర ముస్లిం ప్రార్థనా స్థలాల కూల్చివేతకు ముప్పు ఉందంటూ జర్దారీ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) లో చేసిన పోస్ట్కు సమాధానంగా భారత్ ఈ ఘాటు స్పందన ఇచ్చింది. భారతదేశ అంతర్గత విషయాల్లో ఇస్లామాబాద్ జోక్యం చేసుకోకూడదని న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. -
సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ @ రూ.3.70 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో సౌందర్య ఉత్పత్తుల వినియోగం విస్తృతమవుతోంది. ఈ మార్కెట్ ఏటేటా మరింత బలపడుతుండడంతో అంతర్జాతీయ కంపెనీలు సైతం భారత్కు ప్రయాణం కడుతున్నాయి. 2030 నాటికి 45 శాతం వృద్ధితో 39 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3.70 లక్షల కోట్లు) ఈ మార్కెట్ చేరుకుంటుందని ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ నివేదిక అంచనా వేసింది.సౌందర్య ఉత్పత్తుల విషయమై వినియోగదారుల వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు పేర్కొంది. గతంలో ప్రత్యేక సందర్భాల్లోనే సౌందర్య ఉత్పత్తులను వినియోగించే ధోరణి కాస్తా.. ఇప్పుడు సౌందర్య రక్షణకు నిత్యావసరంగా, ఆత్మ విశ్వాసం, గుర్తింపునకు చిహ్నంగా మారిపోయినట్టు తెలిపింది. ఈ మేరకు ‘ఫ్లిప్కార్ట్ గ్లామ్అప్ యాన్యువల్ బ్యూటీ ట్రెండ్స్ నివేదిక, 2026’ విడుదలైంది. ప్రస్తుతం భారత సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ 27 బిలియన్ డాలర్లుగా ఉంది. -
2030 కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్
సాక్షి, హైదరాబాద్: బ్రహ్మోస్.. ఆపరేషన్ సిందూర్లో లక్ష్యాన్ని ఛేదించి శత్రువుకు నిద్రలేని రాత్రులు చూపించిన.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ మిస్సైల్. భారత్–రష్యా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. దీనిని భూమి, సముద్రం, జలాంతర్గామి, యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించి ప్రయోగిస్తే.. ఇది స్వయంచాలకంగా టార్గెట్ను ధ్వంసం చేస్తుంది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా చాలా తక్కువ ఎత్తులో దూసుకుపోవడం దీని ప్రత్యేకత. ఇలాంటి క్షిపణుల తయారీలో హైదరాబాద్ సైతం కీలకంగా వ్యవహరిస్తోందని బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈవో, ఎండీ జైతీర్థ్ ఆర్. జోషి తెలిపారు. ఎన్డీఈ–2026 సదస్సు వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటైన సమావేశంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... నూరు శాతం దేశీయంగా.. బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి అవసరమైన 85 శాతం విడిభాగాలను దేశీయంగా సమకూర్చుకుంటున్నాం. కొన్ని ఎలక్ట్రానిక్ విడిభాగాల విషయంలో వెనుకబడ్డాం. సెమీకండక్టర్ పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం. నూరు శాతం తయారీ దేశీయంగా సాధ్యమే. 2030 కంటే ముందే ఈ కల సాకారం అవుతుంది. కాన్సెప్ట్ రెడీ అయితే మూడేళ్లలోనే సరికొత్త బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేయగల సత్తా మనకు ఉంది. ఈ మేరకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పూర్తిస్థాయి సామర్థ్యం సొంతం చేసుకుంది. ప్రస్తుతం సంస్థ వద్ద 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.56 వేల కోట్లు) విలువైన ఆర్డర్ బుక్ ఉంది. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్కు సరఫరా చేస్తున్నాం. వియత్నాంకు అతి త్వరలోనే అందించనున్నాం. ఈ క్షిపణుల కోసం పశ్చిమ, తూర్పు ప్రాంతంలోని చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. రష్యా సైతం అడుగుతోంది. 10 రోజుల్లో ఒక క్షిపణిని తయారు చేయగలం. 20 శాతం హైదరాబాద్ నుంచే.. బ్రహ్మోస్ ఇండస్ట్రి కన్సార్షియంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 200కుపైగా చిన్న, మధ్యతరహా కంపెనీలున్నాయి. బ్రహ్మోస్ క్షిపణుల తయారీలో వాడే విడిభాగాలను ఈ కన్సార్షియంలో ఉన్న కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. మిసైళ్ల అసెంబ్లింగ్లోనూ ఇవి పాలుపంచుకుంటున్నాయి. కన్సార్షియంలోని 20 శాతం కంపెనీలు హైదరాబాద్ నుంచే ఉంటాయి. భాగస్వామ్య కంపెనీలకు సాంకేతిక బదిలీ, నిపుణులకు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్, నాగ్పూర్, పిలానీ, లక్నో వద్ద సంస్థకు తయారీ కేంద్రాలున్నాయి. 4 యూనిట్లలో మూడవ షిఫ్ట్ మొదలుపెట్టబోతున్నాం. బ్రహ్మోస్ ప్రాజెక్టులో డిజైన్, డెవలప్మెంట్, తయారీలో హైదరాబాద్ అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. తెలంగాణలో సర్వే పూర్తి.. కొత్త ప్లాంటుకు 400–500 ఎకరాలు అవసరం. ఏపీ ప్రభుత్వం చూపించిన స్థలం అనువైనది కాదు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వద్ద సర్వే పూర్తి చేశాం. ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే. ప్లాంటు ఏర్పాటు ముఖ్యం కాదు. అందుకు అవసరమైన ఎకో సిస్టమ్ ప్రధానం. వాస్తవానికి ఈ రంగంలో దేశవ్యాప్తంగా మానవ వనరుల కొరత చాలా ఉంది. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఐఎస్ఎన్టీ) వచ్చే నవంబర్లో నాన్ డిస్ట్రక్టివ్ ఇవాల్యుయేషన్ (ఎన్డీఈ)–2026, ఏరోఎన్డీటీ–2026 సదస్సులను నిర్వహిస్తోంది. 15–17 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమాలకు హైటెక్స్ వేదిక. దేశ, విదేశాల నుంచి రక్షణ, వైమానిక, ఇంధన, తయారీ రంగాలకు చెందిన 2వేల మంది నిపుణులు పాలుపంచుకోనున్నారు. -
కేంద్రం కీలక ప్రకటన.. 16 రకాల మందులు బ్యాన్!
ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 16 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, విక్రయం, పంపిణీపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. ఈ మందులకు సరైన వైద్యపరమైన ఆధారాలు లేకపోవడంతో పాటు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల కంటే.. ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణుల కమిటీ తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులు అంటే.. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధ పదార్థాలను ఒకే మాత్ర లేదా ఔషధ రూపంలో నిర్దిష్ట నిష్పత్తిలో కలిపి తయారు చేసేవి. కొన్ని సందర్భాల్లో ఇవి రోగులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంటుంది.ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వివిధ ఔషధ కలయికలను సమీక్షించి, వైద్యపరంగా సమర్థించలేని, చికిత్సాపరంగా ప్రయోజనం లేని లేదా హానికరంగా మారే అవకాశమున్న మందులను గుర్తించింది.కంపెనీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26A కింద నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో గుర్తించిన 16 రకాల ఎఫ్డీసీ మందుల తయారీ, విక్రయం, పంపిణీ, సరఫరాను దేశవ్యాప్తంగా వెంటనే బ్యాన్ చేసింది.కేంద్రం నిషేదించిన మందుల జాబితాలో యాంటీబయాటిక్ మిశ్రమాలు, నొప్పి నివారణ ఫార్ములేషన్లు, యాంటిస్పాస్మోడిక్ మందులు, కొన్ని చర్మ సంబంధిత తయారీలు ఉన్నాయి.ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ విత్ ఇథోహెప్టాజైన్; డైసైక్లోమైన్, పారాసెటమాల్ అండ్ క్లిడినియం బ్రోమైడ్; డైసైక్లోమైన్, పారాసెటమాల్, క్లిడినియం బ్రోమైడ్ అండ్ క్లోర్డియాజెపాక్సైడ్; గ్లిక్లాజైడ్ అండ్ క్రోమియం పికోలినేట్; అండ్ పారాసెటమాల్ అండ్ లిగ్నోకైన్ వంటి కాంబినేషన్లు నిషేధానికి గురయ్యాయి.అమోక్సిసిలిన్ విత్ సెరాటియోపెప్టిడేస్, అమోక్సిసిలిన్ విత్ సెరాటియోపెప్టిడేస్ అండ్ లాక్టోబాసిల్లస్ స్పోరోజెనెస్, అమోక్సిసిలిన్ విత్ క్లోక్సాసిలిన్, లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్ అండ్ సెరాటియోపెప్టిడేస్, సెఫాడ్రాక్సిల్తో ప్రోబెనెసిడ్, అండ్ సెఫ్యూరాక్సిమ్ విత్ సెరాటియోపెప్టిడేస్ వంటి యాంటీబయాటిక్స్ను కూడా నిషేధించారు. వీటికి తగిన చికిత్సా ప్రయోజనం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు.చర్మ సంరక్షణ ఉత్పత్తుల విభాగంలో.. అలోవేరా లేదా అలోవేరా ఎక్స్ట్రాక్, విటమిన్ ఈ, జోజోబా ఆయిల్, ఆరంజ్ ఆయిల్, వీట్ జెర్మ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, అల్లంటోయిన్, డి-పాంథెనాల్ వంటివి ఉన్నాయి.సురక్షితమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడానికి కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఇలాంటి ఎఫ్డీసీ మందులను ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు, నియంత్రణ సంస్థలు, అమలు విభాగాలు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. అలాగే తయారీదారులు, దిగుమతిదారులు, పంపిణీదారులు, ఇతర సంబంధిత సంస్థలు చట్టానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. -
ఎల్ నినోను బ్లేమ్ చేయొద్దు.. అసలు కారణాలు వేరే!
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదలికలు అనూహ్యంగా నిలిచిపోవడంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాలు ముందుకు సాగాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఈ సమయానికే దేశమంతటా రుతుపవనాల విస్తరణ వేగంగా జరగాలి. కానీ ఈసారి ఆ సహజ గమనంలో అంతరాయం ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితికి ఎల్ నినోనే ప్రధాన కారణమని అంతా భావిస్తున్నారు. అయితే లోతైన అధ్యయనాలు కొనసాగుతున్న కొద్దీ, శాస్త్రవేత్తలు ఈ మార్పు వెనుక ఒకే కారణం కాకుండా.. ఇంకా చాలా ఉన్నాయని చెబుతున్నారు..పసిఫిక్ సముద్రంలో చోటుచేసుకుంటున్న వాతావరణ అస్థిరతలు, భారత మహాసముద్రంలో తేమ ప్రవాహాల్లో మార్పులు, అలాగే ఖండాల మధ్య గాలుల సమతుల్యతలో వచ్చిన వ్యత్యాసాలు కలిసి ఈ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రుతుపవనాలు ముందుకు సాగడానికి అవసరమైన తక్కువ పీడన వ్యవస్థలు ఈసారి సమయానికి ఏర్పడకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తిస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన తక్కువ పీడన కేంద్రాలు లేకపోవడం వల్ల వర్ష మేఘాలు లోపలికి చొచ్చుకుపోవడం తగ్గిపోయింది.ఇక ఉత్తర భారతంపై తరచూ ప్రభావం చూపే పశ్చిమ దిశ వాతావరణ వ్యవస్థలు ఈసారి అసాధారణంగా క్రియాశీలంగా మారాయి. ఇవి పొడి గాలులను దక్షిణ దిశకు తీసుకువచ్చి, తేమను తగ్గించడంతో మేఘాల ఏర్పాటుకు అనుకూలం కాని పరిస్థితిని సృష్టించాయి. ఫలితంగా రుతుపవనాలు ముందుకు సాగాల్సిన దారి మధ్యలోనే బలహీనపడినట్టు కనిపిస్తోంది. సాధారణంగా ఒక వ్యవస్థ బలహీనపడితే మరొక వ్యవస్థ దాన్ని పూరిస్తుంది. కానీ ఈసారి అన్ని సహజ చక్రాలు ఒకేసారి అనుకూలంగా లేకపోవడం వల్ల సమతుల్యత దెబ్బతింది.అలాగే భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ప్రభావితం చేసే సహజ చక్రం కూడా ఈ సమయంలో అనుకూలంగా లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. దీని వల్ల వర్ష మేఘాల సమూహాలు బలపడకుండా విడిపోయి, నిర్దిష్ట ప్రాంతాల్లో కేంద్రీకృతం కావడం తగ్గింది. దీంతో విస్తృత స్థాయిలో వర్షాలు కురవాల్సిన అవకాశం తగ్గిపోయింది.కాబట్టి ఎల్ నినో ప్రభావం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ.. అది ఒక్కటే ఈ స్థాయి విఘటనకు కారణం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కేవలం మొత్తం వాతావరణ సమీకరణంలో ఒక భాగం మాత్రమేనని, కానీ అసలు సమస్య అనేక వ్యవస్థల సమకాలీన అసమతుల్యతతో ముడిపడి ఉందని చెబుతున్నారు. అంటే రుతుపవనాల కదలికను ఎల్ నినో అనే ఒకే కారణంతో వివరించడం ఇప్పుడు సాధ్యం కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ చివరి వారంలో పరిస్థితులు కొంత మారే అవకాశం ఉంది. సముద్ర ఉపరితల గాలులు తిరిగి బలపడడం, భూమధ్యరేఖ నుంచి వచ్చే తేమ ప్రవాహం పెరగడం, పై స్థాయిలో గాలుల దిశ అనుకూలంగా మారడం వంటి అంశాలు కలిసి రుతుపవనాలకు మళ్లీ ఊపునివ్వవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది ఎంత వేగంగా జరుగుతుందన్నదే కీలకంగా మారింది.మొత్తానికి ఈసారి రుతుపవనాల నిలకడ వెనుక ఒకే కారణం కాకుండా అనేక వాతావరణ వ్యవస్థల సంక్లిష్ట పరస్పర ప్రభావం ఉందని స్పష్టమవుతోంది. సహజ వాతావరణ చక్రాల్లో చిన్న మార్పు కూడా దేశవ్యాప్తంగా వర్షాలపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఈ పరిస్థితి మరోసారి గుర్తు చేస్తోంది. రైతుల ఆశలు వర్షాలపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఈ వాతావరణ సమతుల్యత ఎంత త్వరగా తిరిగి వస్తుందన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. -
ప్రపంచ స్టీల్ డిమాండ్ను శాసించేది భారత్
న్యూఢిల్లీ: భారత్లో స్టీల్ వినియోగం రానున్న దశాబ్దాల్లో భారీగా పెరగనుందని ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తెలిపారు. దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ మౌలిక వసతుల విస్తరణ, వేగవంతమైన పట్టణీకరణ, గృహ నిర్మాణ రంగ వృద్ధి, హరిత ఇంధన ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులు స్టీల్కు బలమైన డిమాండ్ను సృష్టిస్తాయని పేర్కొన్నారు. తద్వారా ప్రపంచ స్టీల్ డిమాండ్ పెరుగుదలకు భారత్ కీలక మార్కెట్గా, ప్రధాన వృద్ధి ఇంజిన్గా అవతరించనుందని అభిప్రాయపడ్డారు. న్యూయార్క్లో జరిగిన ‘గ్లోబల్ స్టీల్ డైనమిక్స్ ఫోరమ్ 2026’ సదస్సులో వీడియో సందేశం ద్వారా మిట్టల్ మాట్లాడారు.ఇకపై భారత్ వంతు.. వచ్చే జూలై 31 నాటికి ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లక్ష్మీ మిట్టల్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘చైనా అసాధారణ వృద్ధికి గడిచిన 20 ఏళ్లు సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పుడు భారత్ వంతు వచి్చంది. దేశంలో భారీ ఎత్తున మౌలిక వసతుల విస్తరణ, పట్టణ గృహ నిర్మాణ రంగంలో వృద్ధి, ఇంధన పరివర్తనకు అవసరమైన ప్రాజెక్టుల కల్పన తదితర అంశాలు ఉక్కు రంగంలో భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి’’ అని మిట్టల్ పేర్కొన్నారు. విలీనంతో సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నాం 2006లో మిట్టల్ స్టీల్, ఆర్సెలర్ సంస్థల విలీనంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థగా ఆర్సెలర్మిట్టల్ ఆవిర్భవించిందని లక్ష్మీ మిట్టల్ తెలిపారు. ఈ విలీనం సంస్థకు పరిమాణం (స్కేల్), వ్యాపార వైవిధ్యం, స్థిరత్వం, వ్యూహాత్మక విస్తరణ పరంగా గణనీయ బలాన్ని చేకూర్చిందన్నారు. ‘‘20 ఏళ్ల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఈ విలీనం మరింత బలమైన సంస్థను నిర్మించిందనే నమ్మకం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, కోవిడ్–19 మహమ్మారి వంటి ఊహించని ‘బ్లాక్ స్వాన్’ పరిణామాల ప్రభావాలు ఇప్పటికీ కనిపిస్తున్నప్పటికీ, ఈ సవాళ్లను విలీన సంస్థగా మరింత సమర్థంగా ఎదుర్కోగలిగాం. భారీ వ్యాపార పరిమాణం, విభిన్న మార్కెట్లలో ఉనికి, సంక్షోభాలను తట్టుకునే సామర్థ్యం మాకు బలంగా నిలిచాయి’’ అని మిట్టల్ వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో మారుతున్న రంగం.. రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం స్టీల్ పరిశ్రమ పూర్తిగా గ్లోబలైజ్ అయిందని, సాంకేతికత, డేటా ఆధారితంగా రూపాంతరం చెందిందని మిట్టల్ అభిప్రాయపడ్డారు. ఉక్కు మార్కెట్లను రూపొందించడంలో ఆయా దేశాల ’స్థానిక పారిశ్రామిక విధానాలు’ కూడా ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తుచేశారు. పర్యావరణ, నియంత్రణ సంస్థల ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో డిమాండ్, కార్బన్ ఉద్గారాల తగ్గింపు కోసం జరుగుతున్న పెట్టుబడుల వల్ల స్టీల్ రంగానికి దీర్ఘకాలంలో తిరుగుండదన్నారు. ‘‘స్టీల్ పరిశ్రమలో 50 ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా నేను ఉండాలనుకునే రంగం ఇదే. భవిష్యత్తులోనూ అనూహ్య సవాళ్లు ఎదురైనా, ఈ రంగం దీర్ఘకాలిక ఫండమెంటల్స్ మాత్రం బలంగానే ఉన్నాయి’’ అని మిట్టల్ అన్నారు. -
ఫిఫా క్రేజ్: చూస్తే కిక్ రాదు.. అసలు మజా అందులోనే!
భారత్లో ఫుట్బాల్ క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. ఫిఫా వరల్డ్కప్ నేపథ్యంలో.. ఐపీఎల్ తరహా సందడి వాతావరణం కనిపిస్తోంది. హోటళ్లు, పబ్లు, స్పోర్ట్స్ బార్లు అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి. మెస్సీ, రొనాల్డో, ఎంబాప్పే, యమాల్ వంటి స్టార్ ఆటగాళ్ల అభిమానులు తెరపైకి వచ్చేశారు. అయితే మ్యాచ్ జరిగేటప్పుడు కామెంటేటర్లు తరచూ వాడే పదాలకు చాలామందికి అర్థం మాత్రం తెలియదు. క్రికెట్ను కామెంటరీతో ఏలాగైతే ఆస్వాదిస్తామో.. ఫుట్బాల్ను మరింత ఆస్వాదించాలంటే ముందుగా ఆ ఆటలో వాడే కొన్ని పదాలను అర్థం చేసుకోవాల్సిందే.గోల్ (Goal).. ఫుట్బాల్లో అత్యంత ముఖ్యమైన పదం ఇదే. బంతి పూర్తిగా గోల్పోస్టుల మధ్య, క్రాస్బార్ కిందుగా గోల్లైన్ను దాటితే గోల్గా పరిగణిస్తారు. ఎక్కువ గోల్స్ చేసిన జట్టు విజేతగా నిలుస్తుంది.ఆఫ్సైడ్ (Offside).. ఫుట్బాల్లో అత్యంత క్లిష్టమైన నిబంధనగా దీన్ని భావిస్తారు. ఆటగాడు బంతి అందుకునే సమయంలో ప్రత్యర్థి జట్టు చివరి డిఫెండర్ కంటే ముందుంటే, అలాగే ఆటలో ప్రభావం చూపితే ఆఫ్సైడ్గా ప్రకటిస్తారు. గోల్ చేసినా అది చెల్లదు. చాలా వివాదాలు, వీఏఆర్ సమీక్షలు ఎక్కువగా ఈ నిబంధన చుట్టూనే తిరుగుతుంటాయి.పెనాల్టీ (Penalty).. పెనాల్టీ బాక్స్లో డిఫెండర్ ఫౌల్ చేస్తే రిఫరీ పెనాల్టీ ఇస్తాడు. అప్పుడు బంతిని పెనాల్టీ స్పాట్పై ఉంచి ఒక ఆటగాడు నేరుగా గోల్పై షాట్ కొట్టే అవకాశం పొందుతాడు. ఫుట్బాల్లో గోల్ చేసే అత్యుత్తమ అవకాశాల్లో ఇది ఒకటి.ఫ్రీ కిక్ (Free Kick).. ఫౌల్ జరిగినప్పుడు ప్రత్యర్థి జట్టుకు లభించే అవకాశం. డైరెక్ట్ ఫ్రీ కిక్.. నేరుగా గోల్ కొట్టవచ్చు. ఇన్డైరెక్ట్ ఫ్రీ కిక్.. మరో ఆటగాడు బంతిని తాకిన తర్వాత మాత్రమే గోల్ చెల్లుతుంది.హ్యాట్రిక్ (Hat-trick).. ఒకే మ్యాచ్లో ఒక ఆటగాడు మూడు గోల్స్ చేస్తే దానిని హ్యాట్రిక్ అంటారు. మెస్సీ, రొనాల్డో, హ్యారీ కేన్, ఎర్లింగ్ హాలాండ్ వంటి స్టార్లు అనేక హ్యాట్రిక్లు సాధించారు అని తరచూ వింటుటాం కదా!.క్లీన్ షీట్ (Clean Sheet).. గోల్కీపర్ లేదా జట్టు ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా మ్యాచ్ను ముగిస్తే దాన్ని క్లీన్ షీట్ అంటారు. డిఫెండర్లు, గోల్కీపర్లకు ఇది ప్రతిష్టాత్మక గణాంకం.వీఏఆర్ (Video Assistant Referee).. ఫుట్బాల్ మ్యాచ్కి రివ్యూలాంటిది. మైదానంలో రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని వీడియోల ద్వారా పరిశీలించే వ్యవస్థ. ఇందులో.. గోల్ చెల్లుతుందా?, పెనాల్టీ సరైందా?.. రెడ్ కార్డ్ ఇవ్వాలా? ఈ తరహా కీలక నిర్ణయాల్లో వీఏఆర్ ఉపయోగిస్తారు.యెల్లో కార్డ్ – రెడ్ కార్డ్.. యెల్లో కార్డ్.. ఆటగాడికి హెచ్చరికగా ఇస్తారు. రెడ్ కార్డ్.. ఆటగాడిని వెంటనే మైదానం నుంచి పంపిస్తారు. ఆ జట్టు మిగతా మ్యాచ్ను ఒక ఆటగాడు తక్కువతో ఆడాల్సి ఉంటుంది.ఎక్స్ట్రా టైమ్ (Extra Time).. నాకౌట్ మ్యాచ్ల్లో నిర్ణీత 90 నిమిషాల తర్వాత స్కోరు సమంగా ఉంటే అదనంగా 30 నిమిషాలు ఆడిస్తారు.పెనాల్టీ షూటౌట్ (Penalty Shootout).. ఎక్స్ట్రా టైమ్ తర్వాత కూడా ఫలితం తేలకపోతే రెండు జట్లు పెనాల్టీల ద్వారా విజేతను నిర్ణయిస్తాయి. వరల్డ్కప్లలో ఎన్నో చారిత్రక మ్యాచ్లు ఇలాగే ముగిశాయి.కార్నర్ కిక్ (Corner Kick).. ప్రత్యర్థి ఆటగాడు బంతిని తన గోల్లైన్ దాటి బయటకు పంపితే దాడి చేస్తున్న జట్టుకు కార్నర్ లభిస్తుంది. ఇవి తరచూ గోల్స్కు దారితీస్తుంటాయి.థ్రో-ఇన్ (Throw-in).. బంతి సైడ్లైన్ దాటి బయటకు వెళ్తే చేతులతో మైదానంలోకి విసిరే విధానాన్ని థ్రో-ఇన్ అంటారు.ఎక్స్జీ(xG) అంటే.. Expected Goals (xG) అనే ఆధునిక గణాంకం ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది.ఒక షాట్ గోల్గా మారే అవకాశాన్ని శాతం రూపంలో కొలుస్తుంది. జట్టు ఎలా ఆడిందో అంచనా వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.డర్బీ (Derby).. ఒకే నగరం లేదా ప్రాంతానికి చెందిన రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ను డర్బీ అంటారు. ఉదాహరణకు.. రియల్ మాడ్రిడ్-అట్లెటికో మాడ్రిడ్, అలాగే.. ఏసీ మిలాన్ వర్సెస్ ఇంటర్ మిలాన్ ఇలాగన్నమాట.ట్రెబుల్ (Treble).. ఒకే సీజన్లో లీగ్, దేశీయ కప్, ఖండాంతర టోర్నీ గెలిస్తే ట్రెబుల్ అంటారు. ఇది ఫుట్బాల్లో అత్యంత అరుదైన ఘనతల్లో ఒకటి.ఫుట్బాల్ కేవలం 22 మంది ఆటగాళ్లు బంతి వెంట పరుగెత్తే ఆట కాదు. దానికి సొంత భాష, సొంత వ్యూహాలు, సొంత పదజాలం ఉన్నాయి. "ఆఫ్సైడ్" ఎందుకు ఇచ్చారు? "వీఏఆర్" ఎందుకు జోక్యం చేసుకుంది? "క్లీన్ షీట్" అంటే ఏమిటి? వంటి విషయాలు అర్థమైతే మ్యాచ్ చూడటంలోనే కాదు.. చర్చల్లో పాల్గొనడంలోనూ మజా పెరుగుతుంది. ప్రపంచ ఫుట్బాల్ను ప్రేమించే భారతీయులు పెరుగుతున్న ఈ సమయంలో.. ఆ ఆటకు సంబంధించిన భాషను నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. -
‘హాలీవుడ్లో కూడా..’.. మోదీపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వేదికపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ది యాక్సియోస్ షో' ఇంటర్వ్యూలో తాను ఎంతగానో అభిమానించే ఇద్దరు ప్రపంచ నాయకుల పేర్లను అడుగుగా, ఆయన ఏమాత్రం తడుముకోకుండా మోదీ, జిన్పింగ్ పేర్లను వెల్లడించారు. ఈ ఇద్దరు నేతల రాజకీయ వ్యూహాలు, వారికున్న అంతర్జాతీయ పలుకుబడిని ట్రంప్ కొనియాడారు. హాలీవుడ్ సినిమాలు తీసినా వీరిలాంటి వ్యక్తులు దొరకరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.హాలీవుడ్ సినిమాల్లో కూడా దొరకరుప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల నాయకత్వ పటిమపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పీఎం మోదీ అద్భుతమైన నాయకుడు. ప్రెసిడెంట్ షీ కూడా అంతే గొప్ప లీడర్. వీరంతా క్లాసిక్ లీడర్స్. ఒకవేళ వీరిద్దరి జీవితాలపై హాలీవుడ్లో సినిమా తీయాలనుకున్నా, వీరిలాంటి పాత్రలు పోషించే వ్యక్తులు అక్కడ కూడా దొరకరు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోదీ చాలా తెలివైన వారని, అనవసరమైన యుద్ధాలకు దూరంగా ఉంటూ 150 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. భారత్తో ప్రస్తుతం అమెరికా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్సంబంధాలతో వ్యాపారం చేస్తోందని ఆయన అన్నారు.స్థిరమైన నాయకత్వం.. 12 ఏళ్ల పాలనభారతదేశంలో గతంలో ఉన్న రాజకీయ అనిశ్చితిని, ప్రస్తుత స్థిరత్వాన్ని ట్రంప్ పోల్చి చూశారు. ‘నేను నా జీవితకాలంలో భారతదేశాన్ని గమనిస్తూనే ఉన్నాను. అక్కడ గతంలో ప్రభుత్వాలు నిరంతరం మారుతూనే ఉండేవి. ఎవరో ఒకరు రావడం, ఆరు నెలలు లేదా ఏడాదిలోనే మారిపోవడం జరిగేది. కానీ, ప్రధాని మోదీ వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. ఆయన గత 12 ఏళ్లకు పైగా అత్యంత స్థిరంగా దేశాన్ని పాలిస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటూనే ఆయన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు’ అని ట్రంప్ పేర్కొన్నారు.దేవదూతలా కనిపిస్తారు కానీ చాలా కఠినంఇటీవల ఫ్రాన్స్లో జరిగిన జీ7 (G7) సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన భేటీని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. మోదీ చర్చలు జరిపే విధానంపై ప్రశంసలు కురిపిస్తూ.. ‘మోదీ చాలా సీరియస్గా చర్చలు జరుపుతారు. ఆయనను చూస్తే చాలా ప్రశాంతంగా, ఒక దేవదూతలా కనిపిస్తారు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో, దేశ ప్రయోజనాల విషయంలో ఆయన అంతకంటే కఠినంగా వ్యవహరిస్తారు. చూడ్డానికి చాలా సౌమ్యంగా ఉంటారు. అందుకే ఆయన వ్యూహాలు ప్రత్యర్థులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి’ అని ట్రంప్ అభివర్ణించారు.ఇది కూడా చదవండి: తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర? -
అమెరికాలో విద్వేషానికి చోటు లేదు
వాషింగ్టన్: అమెరికాలో భారత్కు వ్యతిరేకంగా విద్వేష ఘటనలు పెరగటంపై భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. వివక్ష, పక్షపాతాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. మతం, జాతీయతతో సంబంధం లేకుండా, ఏ వర్గంపై అయినా జరిగే ద్వేషపూరిత చర్యలను సమిష్టిగా వ్యతిరేకించాలని ఎక్స్ వేదికగా నొక్కి చెప్పారు. టెక్సాస్లోని ఫ్రిస్కోలో ఇటీవల జరిగిన ఒక సంఘటనను ఆయన ప్రస్తావించారు. ‘శ్వేతజాతి ఆధిపత్యవాదులుగా గుర్తించబడిన ఒక బృందం సిటీ హాల్ బయట భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ భారత జాతీయ జెండాను చించివేశారు. హిందువులైనా, ముస్లింలైనా, యూదులైనా.. ఎవరిపట్ల అయినా పక్షపాతం, వివక్షలకు వ్యతిరేకంగా మనం భుజం భుజం కలిపి నిలబడాలి. మతం, జాతీయతతో సంబంధం లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలి’అని పిలుపునిచ్చారు. విద్వేషానికి వ్యతిరేకంగా సెనేట్లో తీర్మానంఈ విషయంపై కృష్ణమూర్తి గతంలో కాంగ్రెస్లో కూడా తన గళం వినిపించారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై దాడి చేస్తూ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన ఒక విద్వేషపూరిత పోస్ట్ను ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ప్రచారం చేయడాన్ని కృష్ణమూర్తి ఖండించారు. భారతీయ అమెరికన్లు, చైనీస్ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ డెమొక్రటిక్ సభ్యులతో కలిసి సెనేట్లో ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.‘భారత్, చైనా గురించి అవమానకరమైన భాషను ఉపయోగించడం, వలసదారుల విధేయతను ప్రశ్నించడం, భారతీయ అమెరికన్లను, చైనీస్ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని హానికరమైన మూసధోరణులను ప్రచారం చేయడం సరికాదు’ అని తీర్మానంలో పేర్కొన్నారు. ‘ది సావేజ్ నేషన్’రేడియో కార్యక్రమంలో ‘ఇక్కడ జన్మింంచిన ఒక శిశువు తక్షణమే పౌరురాలు అవుతుంది. ఆ తర్వాత వారు చైనా, భారత్ లేదా ఈ భూమ్మీద ఉన్న మరేదైనా నరక కూపం నుంచి మొత్తం కుటుంబాన్ని తీసుకువస్తారు’ అంటూ వ్యాఖ్యాత మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని తీర్మానం ఖండించింది. ఈ భాష హానికరమైన మూస ధోరణులను బలపరుస్తుందని, వలస సమాజాల పట్ల విద్వేషాన్ని పెంచుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
క్లీన్స్వీప్పై భారత్ దృష్టి
చెన్నై: సొంతగడ్డపై అఫ్గానిస్తాన్ను ఏకైక టెస్టులో చిత్తుగా ఓడించిన భారత జట్టు ఆపై వరుసగా రెండు వన్డేల్లో కూడా ప్రత్యర్థిపై చెలరేగింది. ఇప్పటికే వన్డే సిరీస్ సొంతం చేసుకున్న టీమ్ మరో మ్యాచ్నూ గెలిచి క్లీన్స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్తో చివరిదైన మూడో వన్డేకు నేడు చెపాక్ మైదానం సిద్ధమైంది. సగం ఓవర్లే సాగిన తొలి మ్యాచ్లో, పూర్తి మ్యాచ్ జరిగిన గత మ్యాచ్లో కూడా టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం కొనసాగింది. గత మ్యాచ్లో గిల్, ఇషాన్ల శతకాలతో జట్టు 400కు పైగా స్కోరు నమోదు చేసింది. రాహుల్, శ్రేయస్ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించాల్సి ఉంది. రెండో వన్డేలో విఫలమైనా... జైస్వాల్కు మరో అవకాశం దక్కనుంది. లక్నో వన్డేలో ధాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించిన రోహిత్ దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఇక్కడ కూడా అతను తన జోరు కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. బౌలింగ్లో కూడా భారత్కు ఎలాంటి సమస్యా లేదు. ఈ సిరీస్తో అరంగేట్రం చేసిన కొత్త ఆటగాళ్లు గుర్నూర్, ప్రిన్స్, హర్ష్ దూబే తమకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వాడుకున్నారు. అర్ష్ దీప్ ఫర్వాలేదనిపించగా, కుల్దీప్ మాత్రం గత వన్డేలో ప్రభావం చూపలేదు. గాయంతో రెండో వన్డేకు దూరమైన నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం ఖాయమైంది. మరో వైపు అఫ్గానిస్తాన్ పరిస్థితి మాత్రం పేలవంగా కనిపిస్తోంది. గుర్బాజ్ రెండు మ్యాచ్లలో చెలరేగినా జట్టుకు కావాల్సిన ఫలితం దక్కకపోగా, టాప్ స్పిన్నర్ రషీద్ కూడా భారత్ను నిలువరించలేకపోయాడు. చెన్నై పిచ్పై అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు సమాన అవకాశాలు ఉన్నాయి. -
భారత్-పాక్ సరిహద్దుల్లో అరుదైన ‘షేక్హ్యాండ్’
శ్రీనగర్: ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం.. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో.. జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ (LoC) వద్ద అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. భారత సైన్యం అదుపులో ఉన్న పాకిస్థాన్ పౌరుడు అసద్ ఖాన్ను స్వదేశానికి అప్పగించే సందర్భంగా ఇరు దేశాల సైన్యాధికారులు పరస్పరం కరచాలనం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. మానవతా విలువలకు కట్టుబడి ఉన్న భారత సైన్యం.. అసద్ ఖాన్ను గౌరవంగా చూసుకుంది. అనంతరం పాకిస్థాన్ సైన్యానికి అప్పగించింది. దీంతో పాక్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా తీత్వాల్ సెక్టార్ పరిధిలోని సిమారి ప్రాంతంలో గత వారం నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అసద్ ఖాన్ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆయన పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా (కేపీకే) ప్రాంతానికి చెందినవాడని సైన్యం వెల్లడించింది. అయితే, అతడిని విడుదల చేయాలని పాకిస్థాన్లోని పలువురు నెటిజన్లు భారత సైన్యాన్ని కోరారు.కొంతకాలం పాటు నిర్బంధంలో ఉంచిన అధికారులు.. అసద్ ప్రవర్తనపై ఎటువంటి అనుమానం రాకపోవడంతో తిరిగి స్వదేశానికి పంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో అసద్ ఖాన్ను సరిహద్దు క్రాసింగ్ పాయింట్ దగ్గర పాకిస్థాన్ సైన్యానికి అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా తీసిన చిత్రాలను భారత సైన్యం తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేసింది. వాటిలో భారత సైన్యానికి చెందిన మేజర్ హోదా అధికారి, పాకిస్థాన్ సైన్యాధికారితో కరచాలనం చేస్తున్న దృశ్యం కనిపించింది.Repatriation of Pak NationalA Pakistani national, Asad Khan, a resident of Khyber Pakhtunkhwa (KPK), who was apprehended in Simari village, Kupwara, on 12 June 2026 after crossing the Line of Control, was repatriated to Pakistan on 18 June 2026.During his stay in India, Asad… pic.twitter.com/4MUKLUylZh— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) June 19, 2026ఈ సందర్భంగా భారత సైన్యం విడుదల చేసిన ప్రకటనలో, “ఖైబర్ పఖ్తూన్ఖ్వా నివాసి అసద్ ఖాన్ జూన్ 12న నియంత్రణ రేఖ దాటి సిమారి గ్రామం వద్ద పట్టుబడ్డాడు. జూన్ 18న అతడిని పాకిస్థాన్కు తిరిగి పంపించాం. భారత్లో ఉన్నంత కాలం అతడిని గౌరవంగా.. మానవతా దృక్పథంతో చూసుకున్నాం. సైన్యం నైతిక విలువలకు నిదర్శనం” అని పేర్కొంది. -
యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!
-
పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా పతనమైన బంగారం ధర
-
అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు
ఉన్నత చదువులు చదువు కుంటే భవిష్యత్తు బావుంటుంది అని అందరం అనుకునే మాట. చదువును మించిన సంపద లేదని చిన్నప్పటినుంచీ మన తల్లిదండ్రులు,గురువులు నేర్పిన పాఠం. అయితే సామాజిక వాస్తవాలను, విద్యారంగంలోని లోపాలను ఎత్తి చూపడానికి ఖడ్గం సినిమాలో చెప్పినట్టు చదువుకున్నవారు గుమస్తాలుగా, చదువురానివారు వ్యాపారవేత్తలుగా మారి పోతున్నారనే మాట చలామణీలో ఉంది. అచ్చం ఇలాగే డిగ్రీలొద్దు..బొగ్రీలొద్దు అంటూ ప్రముఖ ఇన్వెస్టర్ అభిప్రాయం నెట్టింట సందడి చేస్తోంది. భారతీయ విద్యా వ్యవస్థ,ప్రమాణాలపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ (Marcellus Investment Managers) వ్యవస్థాపకుడు, సీఐఓ సౌరభ్ ముఖర్జియా ఇటీవల ఒక పాడ్కాస్ట్లో క్లాస్ 12 (ఇంటర్మీడియట్) తర్వాత చదువు ఆపేయండి పెద్దగా ఫలితంలేదు అన్నట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ మధ్యతరగతి కాలేజ్ చదువుల విషయంలో తప్పు చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల్లోకి ప్రవేశిస్తున్న యువతకు భారతదేశ విద్యావ్యవస్థ ఎలాంటి విలువను జోడించడం లేదని విమర్శించారు. అంతేకాదు దేశంలో అత్యధికంగా సంపాదించేవారు డిగ్రీలు పూర్తి చేసినోళ్లు.. కేవలం 12వ తరగతి చదివి చదువు ఆపేసిన వారే అంటూ సెటైర్లు వేశారు. భారతదేశంలోని కంపెనీలు/యజమానులు కాలేజ్ డిగ్రీ వల్ల విద్యార్థులకు ఎలాంటి అదనపు నైపుణ్యాలు రావడం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారని ముఖర్జియా పేర్కొన్నారు.బట్టీ పట్టే (రట్నా మారో) విధానంభారతదేశ విద్యా విధానం ఇప్పటికీ కేవలం బట్టీ చదువులు, రుద్దుడుపైనే ఆధారపడుతోందని ముఖర్జియా అన్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, బట్టీ పట్టడం, పోయి ఎగ్జామ్లో రాయడం తప్పే పిల్లలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రిక్ వాహనాలు (EV), బయోటెక్, క్లీన్ టెక్ , అధునాతన సైన్స్ వంటి సరికొత్త సాంకేతిక ప్రపంచానికి సిద్ధం కాలేకపోతున్నారన్నారు.అసలు ఏఐ విషయాన్ని పక్కన పెడితే, మన డేటాలోనే ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పట్టభద్రుల నిరుద్యోగిత గణాంకాలు దీని తీవ్రతను తెలియజేస్తోందని వాదించారు. కాలేజీల నుండి బయటకు వస్తున్న ప్రతి 100 మంది గ్రాడ్యుయేట్లలో కేవలం ముగ్గురు మాత్రమే వారు పాసైన సంవత్సరంలో ఉద్యోగం పొందుతున్నారని చెప్పారు.డిగ్రీలున్నవారే నిరుద్యోగులుగా!గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు దాదాపు 30-40 శాతం వరకు ఉందని, అదే చదువురాని వారిలో (illiterate) ఇది కేవలం 3శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు.యూనివర్సిటీ వ్యవస్థ అనేది నైపుణ్యాలు పెంచేదిశగా కాకుండా బండ చదువులు ప్రక్రియగా మారిందని విమర్శించారు. ఇది స్కూలు రోజులనుండే మొదలవుతోందని, ప్రాథమిక స్థాయినుంచే బట్టీ పట్టడమనే అలవాటుతో వారి మెదళ్లు మొద్దుబారిపోతున్నాయని విశ్లేషించారు. ఫలితంగా భారత్ అధునాతన రంగాలలో సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇబ్బంది పడుతోందని అన్నారు. ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేకపోతున్నామంటూ ( నా తో హమ్ AI మే హై, నా EV మే, నా బయోటెక్ మే, నా క్లీన్ టెక్ మే) అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా తాను రాసిన పుస్తకం 'బ్రేక్పాయింట్' (Breakpoint) ను ప్రస్తావిస్తూ... భారతదేశంలో అత్యధికంగా సంపాదించే కొందరు వ్యక్తులు 12వ తరగతి ముగించి చదువు ఆపేసిన వారేనని కంపెనీల యజమానుల ధోరణిని బట్టి అర్థమవుతోందని ముఖర్జియా చెప్పారు. దీనికి ముంబై లేబర్ మార్కెట్ను ఆయన ఒక ఉదాహరణగా తీసుకున్నారు, ఏసీ ఆఫీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించే ఒక గ్రాడ్యుయేట్ కంటే, కన్స్ట్రక్షన్ సైట్ (నిర్మాణ రంగం)లో పనిచేసే వ్యక్తి ఎక్కువ సంపాదించవచ్చు.ఒక నిర్మాణ కార్మికుడు డిగ్రీ చదివిన వ్యక్తి కంటే రెండు రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు, ఒక జేసీబీ ఆపరేటర్ అంతకంటే ఎక్కువ సంపాదించగలడని ఆయన ఉదాహరించారు.ఇది కేవలం విద్యావ్యవస్థకు సంబంధించిన సమస్య మాత్రమే కాదనీ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినది కూడా అభిప్రాయపడ్డారు. భారతదేశం ఆధునిక ప్రపంచంతో పోటీ పడాలంటే, మన విద్యా విధానం బట్టీ పద్ధతుల నుండి బయటపడి, యువతకు "ఎలా ఆలోచించాలి" అనేది నేర్పించాల్సి ఉంటుందని సూచించారు. ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ -
భారత్ ఏఐ కలను వెంటాడుతున్న కొత్త విలన్!
కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రపంచ శక్తిగా ఎదగాలని భారత్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. వేల కోట్ల పెట్టుబడులతో కొత్త డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఏఐ కంప్యూటింగ్ హబ్లు ఏర్పాటవుతున్నాయి. అయితే ఈ డిజిటల్ కలలకు ఇప్పుడు ఊహించని సవాల్ ఎదురు కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిర్మించబోతున్న డేటా సెంటర్లపై నిర్వహించిన తాజా అధ్యయనం భారత్కు హెచ్చరికలు జారీ చేసింది. అది విద్యుత్ కొరతో.. నీటి కొరతో కాదంట.. ఏఐ విప్లవం ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్బాట్లు, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు.. ఇవన్నీ నడవాలంటే భారీ డేటా సెంటర్లు అవసరం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ కూడా ఈ పోటీలో ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. డేటా లోకలైజేషన్ విధానాలు, పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, ఏఐ అవసరాలు దేశాన్ని ప్రపంచ డేటా సెంటర్ హబ్గా మార్చే దిశగా నడిపిస్తున్నాయి. కానీ, వాతావరణ మార్పుల ప్రభావం దేశంలోని డేటా సెంటర్ల పనితీరును తీవ్రంగా దెబ్బతీయొచ్చని ఓ నివేదిక చెబుతోంది. భారత్లో వేగవంతమైన ఏఐ విస్తరణకు ప్రకృతి నుంచి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. తాజాగా విడుదలైన ‘‘2026 Global Analysis of Planned Data Centres for Physical Climate Risk and Resilience’’ నివేదిక ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించింది. వాతావరణ ప్రమాదాలపై పరిశోధనలు చేసే ఎక్స్డీఐ (Cross Dependency Initiative - XDI) సంస్థ ఈ అధ్యయనాన్ని చేపట్టింది.ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న లేదా ప్రణాళికలో ఉన్న 2,595 డేటా సెంటర్లను పరిశీలించిన ఈ అధ్యయనం ఒక కీలక విషయాన్ని గుర్తించింది. ఇప్పటివరకు డేటా సెంటర్ల గురించి చర్చలు ప్రధానంగా విద్యుత్ వినియోగం, నీటి అవసరాల చుట్టూనే తిరిగాయి. కానీ భవిష్యత్తులో అసలు ముప్పు నేరుగా వాతావరణ మార్పుల వల్ల రావచ్చని ఈ నివేదిక చెబుతోంది.భారత్ పరిస్థితి ఏంటి?.. ఈ విశ్లేషణ ప్రకారం వాతావరణ సంబంధిత ప్రమాదాల తీవ్రతలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో ఉంది. ముఖ్యంగా దేశంలోని కీలక టెక్నాలజీ కేంద్రాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు.. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా డేటా సెంటర్ల కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం ఉన్న టాప్-30 ప్రాంతాల్లో చోటు దక్కించుకున్నాయి.ఇది సాధారణ హెచ్చరిక కాదు. ఎందుకంటే భారత్లో ప్రస్తుతం డేటా సెంటర్ పెట్టుబడుల పోటీ ఎక్కువగా ఈ రాష్ట్రాల చుట్టూనే తిరుగుతోంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ఇప్పటికే ప్రధాన డేటా హబ్లుగా ఎదుగుతున్నాయి. ఇక్కడే భవిష్యత్తు ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది.వేడి ఎందుకు అంత ప్రమాదకరం?వరదలు వస్తే భవనాలు దెబ్బతింటాయి. తుఫాన్లు వస్తే మౌలిక సదుపాయాలు నాశనం అవుతాయి. కానీ తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం అంత స్పష్టంగా కనిపించదు. అయినప్పటికీ అది మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. డేటా సెంటర్లలో వేల సంఖ్యలో సర్వర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. ఇవి సహజంగానే భారీగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందుకే వాటిని చల్లబరచడానికి అధునాతన కూలింగ్ వ్యవస్థలు అవసరం. బయట ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కూలింగ్ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి.అంతేకాదు..విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందిపరికరాల సామర్థ్యం తగ్గుతుందిసర్వర్ వైఫల్యాల ప్రమాదం పెరుగుతుందిసేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుందినిర్వహణ ఖర్చులు పెరుగుతాయిఅంటే డేటా సెంటర్ భవనం సురక్షితంగానే ఉన్నా.. తీవ్ర వేడి కారణంగా దాని పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది.అసలు ముప్పు భవనం బయటే ఉందా?ఈ నివేదికలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. డేటా సెంటర్ ఎంత బలంగా నిర్మించినా అది ఒంటరిగా పనిచేయదు. దానికి విద్యుత్ సరఫరా, నీటి వనరులు, టెలికాం నెట్వర్క్లు, రవాణా వ్యవస్థలు, సరఫరా గొలుసులు అవసరం. ఒకవేళ తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ గ్రిడ్లు విఫలమైతే? నీటి సరఫరా నిలిచిపోతే? రవాణా వ్యవస్థలు స్తంభిస్తే? డేటా సెంటర్ నేరుగా దెబ్బతినకపోయినా దాని కార్యకలాపాలు ఆగిపోవచ్చు.యూరప్లో నిర్వహించిన మరో అధ్యయనాన్ని ఉదహరిస్తూ ఎక్స్డీఐ ఒక కీలక విషయాన్ని పేర్కొంది. నేరుగా భవనానికి జరిగే నష్టం కంటే ఇలాంటి పరోక్ష మౌలిక సదుపాయాల వైఫల్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టం పది రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనా.ప్రపంచానికి కూడా ఇదే సమస్యఈ ముప్పు కేవలం భారత్కే పరిమితం కాదు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా ప్రాంతాలు మొత్తం అధిక ప్రమాద జోన్లుగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం దక్షిణాసియాలో ప్రణాళికలో ఉన్న డేటా సెంటర్లలో సుమారు 12 శాతం ఇప్పటికే అధిక ప్రమాద కేటగిరీలో ఉన్నాయి. అధిక కార్బన్ ఉద్గారాలు కొనసాగితే శతాబ్దం చివరినాటికి ఈ ప్రమాదం మూడింతలకు పైగా పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. భారత్తో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేషియా, స్పెయిన్ వంటి దేశాల్లో కూడా తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా కార్యకలాపాలకు అంతరాయం కలిగే ప్రమాదం అధికంగా ఉందని పేర్కొంది.బీమా ఖర్చులు కూడా..డేటా సెంటర్లపై పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ బీమా సంస్థలు కూడా వాతావరణ ప్రమాదాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత రీఇన్సూరెన్స్ సంస్థ Swiss Re అంచనా ప్రకారం ప్రస్తుతం సుమారు 10.6 బిలియన్ డాలర్లు ఉన్న డేటా సెంటర్ బీమా మార్కెట్ 2030 నాటికి 24.2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో వాతావరణ ప్రమాదాలు పెరిగితే బీమా ప్రీమియంలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది కొత్త ప్రాజెక్టుల వ్యయాలను మరింత పెంచుతుంది.మరి పరిష్కారం మాటేంటి?..అయితే ఇది అనివార్యమైన సంక్షోభం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్న డేటా సెంటర్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.సరైన ప్రాంతాల ఎంపికఅధునాతన కూలింగ్ టెక్నాలజీలువాతావరణ నిరోధక డిజైన్లుబలమైన విద్యుత్ బ్యాకప్ వ్యవస్థలునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడంపునరుత్పాదక ఇంధనాల వినియోగం.. ఇలాంటి చర్యలు భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించగలవని పేర్కొంటున్నారు.ఏఐ యుగంలో డేటా సెంటర్లు కొత్త కాలపు ఫ్యాక్టరీలుగా మారుతున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఇవే వెన్నెముక. భారత్ ప్రపంచ ఏఐ శక్తిగా ఎదగాలంటే కేవలం పెట్టుబడులు ఆకర్షించడం సరిపోదు. ఆ మౌలిక సదుపాయాలు రాబోయే దశాబ్దాల్లో పెరుగుతున్న వేడి, తీవ్రమవుతున్న వాతావరణ మార్పులను కూడా తట్టుకునేలా ఉండాలి. లేకపోతే నేటి డిజిటల్ కలలు.. రేపటి క్లైమేట్ రిస్క్ల ముందు నిలబడలేకపోవచ్చు. ఇదే తాజా నివేదిక ఇస్తున్న అసలు హెచ్చరిక. -
బంగాళాఖాతంలోకి పాక్ జలాంతర్గాములు!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ విమోచన యుద్ధం వేళ పాకిస్తాన్ నావికాదళాన్ని భారత్ దారుణంగా దెబ్బతీశాక బంగాళాఖాతం జలాల వైపు కన్నెత్తిచూడని పాకిస్తాన్ 55 సంవత్సరాల తర్వాత మళ్లీ బంగాళాఖాతం వైపు దృష్టిసారించింది. చైనా తయారీ హంగోర్ శ్రేణి జలాంతర్గామిని బంగాళాఖాతంలో నిఘా కోసం మొహరించాలని పాక్ యోచిస్తోంది. పీఎన్ఎస్ హంగోర్ జలాంతర్గామి ఇటీవలే కరాచీకి చేరుకుంది. అంతకుముందు చైనా నుంచి వస్తూ అంతర్జాతీయ సముద్రజలాల గుండా పయనిస్తూ ఈ జలాంతర్గామి శ్రీలంక సమీపంగా వచ్చింది.ఈ జలాంతర్గామికి ఎస్కార్ట్గా వస్తున్న నౌకల కాన్వాయ్(ఫ్లోటిల్లా)కు కమాండర్ ఒమర్ ఫరూఖ్ కొలంబో పోర్ట్లో మాట్లాడారు. ‘‘అధునాతన హంగోర్ తరగతి జలాంతర్గామితో పాక్ ఇకపై సముద్రతలంలోనూ తన సత్తా చాటనుంది. బంగాళాఖాతంలో మా కార్యకలాపాలకు ఇది ఎంతో దోహదపడుతుంది. ఇది ఆట తీరును మార్చేసే గేమ్ ఛేంజర్. ఈ రకం ఎనిమిది జలాంతర్గాములను సమకూర్చుకోబోతున్నాం’’అని ఆయన వెల్లడించారు. అరేబియా సముద్రం దాటి బంగాళాఖాతం దాకా తమ నిఘా కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్నట్లు కమాండర్ చెప్పడంతో పాక్ కుయుక్తి బహిర్గతమైంది. బంగాళాఖాతం ఎందుకంత కీలకం? భారత్–పాకిస్తాన్ యుద్ధం వేళ డయ్యూ పరిధిలో భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రీని పాక్కు చెందిన పీఎన్ఎస్ హంగోర్ జలాంతర్గామి మూడు టార్పెడోలతో దాడిచేసి ముంచేసింది. అయినాసరే యుద్ధంపై దీని ప్రభావం ఏమాత్రం పడలేదు. భీకరంగా దాడిచేసిన భారత్ పాక్ పీచమణిచింది. అప్పట్నుంచి బంగాళాఖాతంలో పాక్ జలాంతర్గాముల సంచారమే లేదు. తాజాగా బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం కూలడం, పాక్ అనుకూల ప్రభుత్వం కొలువుతీరడంతో దశాబ్దాల తర్వాత బంగాళాఖాతంపై పాక్ కన్నుపడింది. భౌగోళికంగా బంగాళాఖాతంపై భారత పట్టు అధికం.అండమాన్ నికోబార్ దీవులు ఉండటంతో అక్కడి నుంచి సముద్రంలోపలికి 370 కిలోమీటర్లదాకా భారత ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఉంది. అక్కడిదాకా సముద్రజలాలపై సర్వాధికారం భారత్కే దఖలుపడుతోంది. ఉత్తర తీరం వైపే విశాఖపట్నంలో భారత నావికాదళ తూర్పు కమాండ్ ప్రధాన స్థావరం ఉంది. ఇదే బంగాళాఖాతం బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియాలకూ తీరప్రాంతంగా ఉంది.అదీకాకుండా బంగాళాఖాతం అనేది భారత వస్తూత్పత్తులు, ఇంధన వాణిజ్యానికి, నౌకల రాకపోకలకు కీలక మార్గంగా మారింది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో పాక్ అడుగుపెట్టడం భారత నావికా, నిఘా కార్యకలాపాలకు అవరోధంగా మారే ఆస్కారముంది. పాక్ తన తీర ప్రాంతానికి సుదూరంగా హిందూ మహాసముద్రంలో బంగాళాఖాతంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తే భారత్కు ఎప్పుడూ తలనొప్పేనని యుద్దరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. సముద్ర జలాల్లో హంగోర్ జలాంతర్గామి -
'సవాళ్ల నడుమ' సమర్థ దౌత్యం?
వేగంగా మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు, ట్రంప్ దూకుడు, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లలో ప్రతికూల వాతావరణం; చైనా, యూఎస్లతో బలపడుతున్న పాక్ మైత్రీబంధం... భారత దౌత్యనీతికి పెద్ద సవాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో జాతీయ, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను రక్షించుకుంటూ అంతర్జాతీయ శక్తిగా ఎదగటం భారత్కు అగ్నిపరీక్షే. గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే, భారత దౌత్యనీతిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అమెరికా, రష్యా ప్రాపకం కోసం అర్రులు చాచే దశ నుండి బయటకు వచ్చింది. జాతి ప్రయోజనాల దృష్ట్యా ‘వ్యూహాత్మక స్వతంత్రత’ వైపు అడుగులు వేసింది. అలీన విధానం, పంచశీల సూత్రాలు, మానవ హక్కులు వంటి విలువల బంధనాలను తెంచుకొని లావాదేవీలకు సంబంధించిన దౌత్యనీతిని అమలుపరుస్తున్నది. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా భారత్... ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఆర్థిక, వాణిజ్య, సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవటంపై దృష్టిని కేంద్రీకరించింది. యు.ఎస్., ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని బాహాటంగా ఎత్తి చూపింది. కుండబద్దలు కొడుతూ...ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేయటాన్ని ఐరోపా దేశాలు విమర్శించి నప్పుడు, భారత్ విదేశాంగ మంత్రి ‘‘ఐరోపా దేశాలు తమ సమ స్యల్ని ప్రపంచ సమస్యలు అనుకుంటాయి. కానీ అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల సమస్యలను ఐరోపా ఏనాడైనా పట్టించుకుందా?’’ అని నిలదీయటం భారత్ వైఖరిని సూచిస్తున్నది. రష్యా నుండి చమురు దిగుమతుల విష యంలో యూఎస్ ఆంక్షల గురించి భారత విదేశాంగ మంత్రి, ‘‘మనమెవరమూ ఈ పెద్దవాళ్ల ఆటను అర్థం చేసుకోలేనంత పిల్లలం కాము’’ అని యూఎస్ నిజస్వరూపాన్ని విమర్శించటం భారత దౌత్య ధృడత్వానికి సంకేతం. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నప్పుడూ ఆయన సమ క్షంలోనే ‘‘అమెరికాకు అమెరికన్ ప్రయోజనాల మాదిరిగా భారత్కు భారత ప్రయోజనాలు ముఖ్య’’మని కుండబద్ధలు కొట్టారు.భద్రతాపరంగా అత్యంత ప్రమాదకరమైన పాకిస్తాన్, చైనా లతో సంబంధాల విషయంలో సైతం భారత్ కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు మిన్నకుండే బుజ్జగింపు విధానం నుండి పూర్తిగా వైదొలగి ‘కన్నుకు కన్ను, కాలుకు కాలు’ సిద్ధాంతాన్ని అమలు పరుస్తున్నది. గల్వాన్ ఘర్షణల అనంతరం భారత్ పెద్ద మొత్తంలో లద్దాఖ్లో సైన్యాన్ని మోహరించి చైనాతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నట్లు సవాలు విసిరింది. సరిహద్దుల్లో కాలుదువ్వుతూ వాణిజ్యపరంగా స్నేహ సంబంధాలు కుదరదని చైనా పెట్టుబడులపై తీవ్ర ఆంక్షలు విధించింది. మాల్దీ వుల ప్రభుత్వపు భారత వ్యతిరేక ధోరణి నేపథ్యంలో భారత పర్యా టకులను లక్ష దీవులవైపు మళ్లిస్తూ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.విమర్శలకు వెరవని దృఢత్వంఅయితే భారత విదేశాంగ విధానం కొన్ని ప్రత్యేక సందర్భా లలో లొంగుబాటు ధోరణిని కనబరచిందన్న విమర్శ ఉంది. ముఖ్యంగా ట్రంప్ తెంపరితనం విషయంలో భారత్ మెతక వైఖరి అనుసరించిందని విశ్లేషకుల అభిప్రాయం. ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థను ఒక మృత ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించినా భారత్ స్పందించలేదనీ, ట్రంప్ ఆదేశాల మేరకు ఒక దశలో రష్యా నుండి చమురు కొనుగోళ్లు కూడా ఆపేసిందనీ మరొక విమర్శ. ఇజ్రాయెల్ ‘గాజా’పై బాంబుల వర్షం కురిపించి నేలమట్టం చేస్తున్నా భారత్ ఇజ్రాయె ల్ను సమర్థించి పాలస్తీనాకు వ్యతిరేకంగా వ్యవహరించిందనీ, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ విధానం పూర్తిగా రష్యాను సమర్థిస్తు న్నట్లుగా ఉందనీ కూడా రాజకీయ పరిశీలకుల వ్యాఖ్యానం. ఇదే దృష్టికోణంతో, భారత్ పొరుగుదేశాలు భారత్కు ప్రతికూలంగా మారిపోయాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకల విష యంలో మన దౌత్య నీతి విఫలమైందా అనే సందేహాలు తలెత్తాయి!ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవిని చేపట్టడంతో భారత్– అమెరికా సంబంధాలు మరింత పటిష్టమవుతాయని అందరూ ఆశించారు. కానీ ఆపరేషన్ సిందూర్ తరువాత ట్రంప్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. అయినప్పటికీ అమెరికా వాణిజ్య సుంకాల యుద్ధంలో భారత్ దృఢంగా నిలబడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో కూడా అమెరికా ఒత్తిడులను తట్టుకొని నిల బడింది. అదే సమయంలో భారత్–పాకిస్తాన్ల విషయంలో యూఎస్ మధ్యవర్తిత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది కూడా! హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి ఉగ్రవాద సంస్థల ఉగ్ర చర్యలను భారత్ ఏ రకంగానూ సమర్థించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇంకొక ముఖ్యమైన అంశం గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు. గల్ఫ్ దేశాలలో కోటి మందికి పైగా భారతీయులు ఉపాధి పొందు తున్నారు. యూఏఈ వంటి గల్ఫ్ దేశాలతో భారత్కు పటిష్టమైన వాణిజ్య సంబంధాలున్నాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచు కొని భారత్ కేవలం హార్మూజ్ జలసంధి నుండి భారత్కు చమురు, గ్యాస్ రవాణాకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. అదే సమయంలో ఇరాన్కు వ్యతిరేకంగా ఏ చర్యనూ తీసుకోలేదు. ఈ సందర్భంగా ఇరాన్ భారత్కు పూర్తిగా సహకరించటాన్ని గమనించాలి. ఉక్రెయిన్ యుద్ధంలో మనం కేవలం మన పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావటానికే ప్రాధాన్యతనిచ్చాం. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుండి చౌక ఇంధనాన్ని కొనుగోలు చేశాం. దౌత్యనీతికి నిదర్శనందక్షిణాసియాలో పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు కాస్త యినా క్షీణించాయన్నది వాస్తవం. సంబంధాలు బలహీనపడి నప్పుడు ఆయా దేశాలను నియంత్రించటానికి దౌత్యనీతిలో భాగంగా కీలకమైన వ్యవస్థలను ఏర్పాటు చేశామా లేదా అన్నదే ప్రశ్న. బంగ్లాదేశ్ విషయానికి వస్తే అక్కడ రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడకుండా ఆపలేం. కానీ మత ఛాందస శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న షేక్ హసీనా ప్రభుత్వాన్ని బలపరిచాం. ఛాందస శక్తు లది పైచేయి అయినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నియంత్రించ టానికి మన దగ్గర తురుపు ముక్కలున్నాయా? ఈ కోణంలో చూస్తే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విద్యుచ్ఛక్తి విషయంలో భారత్పై బంగ్లా దేశ్ ఆధారపడాల్సిందే. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ స్వతంత్రించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు. ఈ విద్యుచ్ఛక్తి సంబం ధాన్ని గత దశాబ్దంలో ఏర్పరచటం మన దౌత్యనీతి విజయం.అమెరికా సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫ్రాన్స్, ఇజ్రా యెల్, రష్యా, దక్షిణ కొరియాలతో సైనిక, వ్యూహాత్మక ఒప్పందా లను చేసుకుంది. ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యామ్నాయాలున్నా యని యూఎస్కు భారత్ స్పష్టం చేస్తున్నది. దౌత్యనీతి అంటే ఇదే. ఓపిక, వివేకం, సహనాలతో మాత్రమే దౌత్యం నడుస్తుంది. గురజాల శ్రీనివాసరావు వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
రాబోయేది ఆషామాషీ ఎల్ నినో కాదు!
ప్రపంచ వాతావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే ఎల్ నినో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈసారి ఇది సాధారణ ఎల్నినో కాదని, గతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన ఘటనల్లో ఒకటిగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం కొన్ని నెలలపాటు కొనసాగితే భారత్ సహా ప్రపంచానికి ‘ట్రిపుల్ షాక్’ తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, అసాధారణ వాతావరణ మార్పులు వరుసగా ఎదురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.తాజాగా విడుదలైన నార్త్ అమెరికన్ మల్టీ-మోడల్ ఎన్సెంబుల్ (NMME) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల అంచనాల ప్రకారం.. మధ్య, తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో సాధారణ స్థాయికంటే 2 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని నమూనాల్లో ఈ వ్యత్యాసం 5 డిగ్రీల సెల్సియస్ను కూడా దాటవచ్చని సూచిస్తున్నాయి.వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. పసిఫిక్లోని నినో-3.4 ప్రాంతంలో(మానిటరింగ్ జోన్) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 1.5 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటే దాన్ని ‘బలమైన ఎల్నినో’గా పరిగణిస్తారు. 2 డిగ్రీలకుపైగా పెరిగితే ‘సూపర్ ఎల్నినో’గా వర్గీకరిస్తారు. తాజా అంచనాల ప్రకారం 2026 చివరినాటికి ఈ స్థాయిని దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇది ఇంకా ప్రారంభ అంచనాల దశలోనే ఉన్నందున తుది ఫలితంగా పరిగణించలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే వివిధ వాతావరణ నమూనాలు ఎల్ నినో బలపడే సంకేతాలను చూపుతుండటంతో శాస్త్రవేత్తలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.ఎల్నినో ప్రభావం వల్ల భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా గాలుల ప్రసరణ విధానాలు మారిపోతాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు, సముద్ర ఉష్ణ తరంగాలు, పగడపు దిబ్బల నాశనం, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే భారత్కు ఇది మరింత ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది.చరిత్రను పరిశీలిస్తే బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడటం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం, వడగాల్పులు తీవ్రరూపం దాల్చడం వంటి పరిస్థితులు తరచుగా కనిపించాయి. దీంతో వ్యవసాయం, తాగునీటి వనరులు, ఆహార ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అస్తవ్యస్తత మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు పెరగవచ్చు. దక్షిణ అమెరికా పశ్చిమ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంది. ట్రిపుల్ షాక్.. ఎల్ నినో బలపడితే ఒకేసారి మూడు పెద్ద స్థాయిలో ప్రభావాలు రావచ్చని సూచన:రుతుపవనాలు బలహీనపడే అవకాశంవర్షాభావం / కరువు పరిస్థితులువడగాల్పులు పెరగడంకొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో భారీ వర్షాలు/వరదలుగ్లోబల్ టెంపరేచర్లు పెరగడంసముద్ర ఉష్ణతరంగాలుపగడపు దిబ్బల (coral reefs) నష్టంకార్చిచ్చులు పెరగడం (ఆస్ట్రేలియా/ఆగ్నేయాసియా)ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా భూమి అసాధారణ వేడిని ఎదుర్కొంటున్న వేళ.. దానికి ఎల్నినో ప్రభావం తోడైతే 2027 వరకూ ప్రపంచం మరింత తీవ్రమైన వాతావరణ అస్తవ్యస్తతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
భారత్కు పాక్ కొత్త సవాల్.. 1971 గాయం మానలేదా?
భారత్-పాకిస్తాన్ మధ్య 1971 యుద్ధంలో ఘోర పరాజయం తర్వాత దాదాపు ఐదు దశాబ్దాలుగా బంగాళాఖాతంలో పెద్దగా కనిపించని పాకిస్తాన్ నౌకాదళం.. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతంపై దృష్టి సారిస్తోంది. చైనా సాయంతో నిర్మించిన అత్యాధునిక హంగోర్-క్లాస్ జలాంతర్గాములను బంగాళాఖాతంలో మోహరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన సమాచారం దక్షిణాసియా వ్యూహాత్మక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం నౌకాదళ విస్తరణేనా? లేక 1971 తర్వాత కోల్పోయిన వ్యూహాత్మక ప్రభావాన్ని తిరిగి సాధించాలనే ప్రయత్నమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.1971లో ఏం జరిగింది?1971 యుద్ధం పాకిస్తాన్ చరిత్రలోనే అతిపెద్ద సైనిక, రాజకీయ పరాజయం. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా అవతరించింది. దీంతో పాక్కు బంగాళాఖాతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం పూర్తిగా దెబ్బతింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన అత్యంత కీలక జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ (PNS Ghazi) విశాఖపట్నం సమీపంలో మునిగిపోయింది. తూర్పు ప్రాంతంలో భారత నౌకాదళం సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో పాకిస్తాన్కు బంగాళాఖాతంలో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం దాదాపు లేకుండాపోయింది. అప్పటి నుంచి పాక్ నౌకాదళం ప్రధానంగా అరేబియా సముద్రం, కరాచీ, గ్వాదర్ ప్రాంతాలకే పరిమితమైంది.పాక్ ప్లానేంటి?పాకిస్తాన్ నౌకాదళం చైనా సహకారంతో కొనుగోలు చేస్తున్న 8 హంగోర్-క్లాస్ జలాంతర్గాములు దాని సముద్ర వ్యూహంలో పెద్ద మార్పునకు నాంది పలుకుతున్నాయి. మొదటి జలాంతర్గామి PNS హాంగోర్ ఇప్పటికే పాక్ నౌకాదళంలో చేరింది. మిగిలినవి 2028 నాటికి దశలవారీగా చేరనున్నాయి. పాక్ నౌకాదళ అధికారుల ప్రకారం.. ఈ కొత్త సామర్థ్యాలతో అరేబియా సముద్రానికి మాత్రమే కాకుండా తూర్పు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం వరకు తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఏర్పడుతోంది.హంగోర్ జలాంతర్గాముల ప్రత్యేకత?ఈ జలాంతర్గాములు చైనా Type-039B యూవాన్ క్లాస్ నమూనా ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ సామర్థ్యాల వల్ల పాక్ నౌకాదళానికి గతంతో పోలిస్తే గణనీయమైన వ్యూహాత్మక ప్రయోజనం లభించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.వీటి ప్రధాన ప్రత్యేకతలు:AIP (Air Independent Propulsion) టెక్నాలజీనీటి అడుగున ఎక్కువకాలం ప్రయాణించే సామర్థ్యంతక్కువ శబ్దంతో కదిలే స్టెల్త్ సిస్టమ్ఆధునిక సోనార్, సెన్సార్ వ్యవస్థలుటార్పెడోలు, యాంటీ-షిప్ క్షిపణుల సామర్థ్యంభవిష్యత్తులో బాబర్-3 క్రూయిజ్ క్షిపణుల వినియోగ అవకాశాలుచైనా పాత్ర ఎంత కీలకం?ఈ ప్రాజెక్టు వెనుక అసలు శక్తి చైనానే. హంగోర్ జలాంతర్గాముల ఒప్పందం విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు. నాలుగు జలాంతర్గాములు చైనాలో, మరో నాలుగు కరాచీలో నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఆయుధాల విక్రయం మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో చైనా-పాక్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా కూడా భావిస్తున్నారు. భారత్ చుట్టూ "స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్" వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా, గ్వాదర్ నుంచి బంగాళాఖాతం వరకు తన ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోందని భారత వ్యూహ నిపుణులు భావిస్తున్నారు.భారత్కు ఆందోళన అంశమేనా?సైనికంగా చూస్తే ప్రస్తుతం భారత నౌకాదళం పాకిస్తాన్ కంటే చాలా బలంగా ఉంది. విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు, స్కార్పీన్ క్లాస్ సబ్మెరైన్లు, దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థలు, తూర్పు నౌకాదళ కమాండ్ వంటి అంశాల్లో భారత్కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. అయితే, పాకిస్తాన్ జలాంతర్గాములు బంగాళాఖాతంలో కార్యకలాపాలు నిర్వహించడం వల్ల భారత నౌకాదళం తన తూర్పు తీర భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే భారత్ కూడా కొత్త జలాంతర్గాముల కొనుగోలు, దేశీయ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.బంగ్లాదేశ్ అంశం కూడా కీలకమేపాక్ బంగాళాఖాతంలో ఉనికిని పెంచాలంటే బంగ్లాదేశ్తో సంబంధాలు కీలకం కానున్నాయి. గత కొంతకాలంగా ఇస్లామాబాద్-ఢాకా సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే బంగాళాఖాతం ఇప్పటికీ భారత ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంగా పరిగణించబడుతుంది. అందువల్ల పాక్ ఉనికి పెరిగినా, అది ఎంత స్థాయిలో ప్రభావం చూపగలదన్నది ఇంకా ప్రశ్నగానే ఉంది. కాగా, వాస్తవానికి బంగాళాఖాతంలో పాక్ నిరంతర ఉనికి కొనసాగించడం అంత సులభం కాదు. భౌగోళిక పరిమితులు, లాజిస్టిక్స్, భారత నౌకాదళ ఆధిపత్యం వంటి అంశాలు ఇప్పటికీ ఇస్లామాబాద్కు పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి. -
సముద్రం కింద, పర్వతాల మధ్య..
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టులో సరికొత్త రికార్డు నమోదవుతోంది. భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గంలో అత్యాధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. దేశీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ 508 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టులో, పర్వతాల గుండా సాగే టన్నెల్స్ (సొరంగాలు) నిర్మాణంలో సరికొత్త ‘టన్నెల్ హుడ్స్’ సాంకేతికతను మొదటిసారిగా ఉపయోగిస్తున్నారు. బుల్లెట్ రైళ్లు గంటకు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు ఉత్పన్నమయ్యే తీవ్రమైన వాయు పీడనాన్ని నియంత్రించేందుకు ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.‘టన్నెల్ బూమ్’ అంటే ఏమిటి?బుల్లెట్ రైలు అత్యంత వేగంతో సొరంగంలోకి ప్రవేశించినప్పుడు, అది తన ముందున్న గాలిని ఒక సిలిండర్లో పిస్టన్లాగా తీవ్రంగా నెడుతుంది. దీనివల్ల సొరంగం లోపల గాలి ఒక్కసారిగా సంపీడనానికి గురై తీవ్రమైన ఒత్తిడి తరంగాలు ఏర్పడతాయి. ఈ పీడనాన్ని సరిగ్గా నియంత్రించకపోతే, రైలు సొరంగం దాటి అవతలి వైపునకు వచ్చేటప్పుడు ఒక పెద్ద బాంబు పేలినట్లుగా భయంకరమైన శబ్దం వస్తుంది. దీనినే సాంకేతిక భాషలో ‘టన్నెల్ బూమ్’ అంటారు. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాలు దద్దరిల్లడమే కాకుండా పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతుంది.సరికొత్త రక్షక కవచం: టన్నెల్ హుడ్స్ఈ టన్నెల్ బూమ్ ప్రభావాన్ని తిప్పికొట్టేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ టన్నెల్ హుడ్స్ టెక్నాలజీని డిజైన్ చేసింది. సొరంగానికి ఇరువైపులా (ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాల్లో) గుండ్రని స్థూపాకారంలో ఈ హుడ్స్ను నిర్మిస్తారు. ఇవి ఓపెన్ పర్యావరణానికి, లోపల ఉండే క్లోజ్డ్ సొరంగానికి మధ్య ఒక వంతెనలా పనిచేస్తాయి. వీటి ద్వారా గాలి చాలా నెమ్మదిగా లోపలికి, బయటికి వెళ్లే వీలుంటుంది. తద్వారా పీడనంలో వచ్చే మార్పులను అదుపు చేస్తూ రైలు ఏరోడైనమిక్ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.ప్రత్యేక కిటికీల ఏర్పాటుఈ టన్నెల్ హుడ్స్ నిర్మాణంలో అత్యంత కీలకమైనవి వాటికి అమర్చే ‘ప్రెజర్-రిలీఫ్ వెంట్స్’ లేదా కిటికీలు. రైలు ప్రయాణించేటప్పుడు పుట్టే వాయు పీడనాన్ని ఈ కిటికీలు క్రమంగా బయటకు విడుదల చేస్తాయి. ప్రతి సొరంగం పరిమాణాన్ని బట్టి ఈ కిటికీల సంఖ్య మారుతుంటుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న 7 సొరంగాలకు ఒక్కో వైపు 20 నుండి 26 కిటికీల వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ హుడ్స్ పొడవు 31 మీటర్ల నుండి 45 మీటర్ల వరకు ఉంటుంది. దీనివల్ల సొరంగాల అసలు పొడవు మరింత పెరుగుతుంది. ఉదాహరణకు, పాల్ఘర్లోని మౌంటైన్ టన్నెల్-6 (MT-6) అసలు పొడవు 390 మీటర్లు కాగా, ఇరువైపులా 32 మీటర్ల హుడ్స్ చేరడంతో దీని మొత్తం పొడవు 454 మీటర్లకు చేరింది.పర్వతాలను చీల్చుకుంటూ..ఈ ప్రాజెక్టులో మహారాష్ట్రలో 7 పర్వత సొరంగాలు, గుజరాత్లో 1 పర్వత సొరంగం ఉన్నాయి. గుజరాత్లోని వల్సాద్ వద్ద ఉన్న ఏకైక పర్వత సొరంగం ఎంట్రన్స్ హుడ్ నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరుకుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల గుండా ఈ మార్గం సాగుతుంది. ఇక్కడ వయాడక్ట్లకు (పైవంతెనలు) బదులుగా సొరంగాలు నిర్మించాల్సి రావడం ఇంజనీర్లకు పెద్ద సవాలుగా మారింది. ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్కడ భూమి పైన మట్టి పొర తక్కువగా ఉండటం వల్ల తవ్వకాలు చాలా కష్టంగా మారాయి. రోజుకు సగటున 0.5 మీటర్ల నుండి 1 మీటర్ మాత్రమే తవ్వకం సాధ్యమైంది.సొరంగాల తాజా పరిస్థితిమొత్తం 508 కిలోమీటర్ల బుల్లెట్ రైలు మార్గంలో సొరంగాలు 27.4 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఇందులో 21 కిలోమీటర్లు భూగర్భ సొరంగాలు కాగా, మిగిలిన 6.4 కిలోమీటర్లు పర్వత సొరంగాలు. జూన్ 2న, 417 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పు గల మౌంటైన్ టన్నెల్-7 (MT-7) తవ్వకాలు పూర్తయి బ్రేక్థ్రూ (సొరంగం రెండు చివరలు కలవడం) సాధించింది. ఇది ప్రాజెక్టులో విజయవంతమైన నాల్గవ సొరంగం.అండర్ సీ టన్నెల్.. డెడ్లైన్స్ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన 21 కిలోమీటర్ల భూగర్భ సొరంగంలో భాగంగా, ఘన్సోలి నుండి శిల్పటా మధ్య 4.88 కిలోమీటర్ల విభాగానికి సంబంధించిన తవ్వకాలు 2025 సెప్టెంబర్లోనే పూర్తయ్యాయి. మిగిలిన 16 కిలోమీటర్ల భాగాన్ని ముంబైలోని విక్రోలి, నవీ ముంబైలోని సావ్లీలలో అసెంబుల్ చేస్తున్న భారీ టన్నెల్ బోరింగ్ మిషన్ల (TBM) ద్వారా తవ్వనున్నారు. ఈ భూగర్భ మార్గంలోనే థానే క్రీక్ కింద నిర్మించే 7 కిలోమీటర్ల పొడవైన సముద్రగర్భ సొరంగం కూడా ఉంది. షెడ్యూల్ ప్రకారం, గుజరాత్లోని సూరత్-బిలిమోరా మధ్య 48 కిలోమీటర్ల మొదటి విభాగాన్ని ఆగస్టు 2027 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే, అహ్మదాబాద్ నుండి ముంబై వరకు ఉన్న పూర్తి ప్రాజెక్టును 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇది కూడా చదవండి: నాలుగు ఏఐ మోడల్స్ ఫెయిల్.. 10/10 స్కోర్ చేసిన మానవ మేథ! -
జూలై 15 నుంచి భారత్-బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అమలు
భారత్–బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. దీంతో పాటు సామాజిక భద్రతకు సంబంధించిన డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC) కూడా అదే రోజు అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ పరిణామాన్ని ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించింది.ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో 99 శాతం ట్యాక్స్ ఫ్రీ ప్రవేశం లభించనుంది. దీంతో వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, సముద్ర ఆహారాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి రంగాలకు విశేష ప్రయోజనం చేకూరనుంది.ఈ డీల్ కుదిరిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. బ్రిటన్తో వాణిజ్య సంబంధాల్లో ఇది చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు కొత్త అవకాశాలు కల్పించడమే కాకుండా ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనకు తోడ్పడుతుందని తెలిపారు.కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుశ్ గోయెల్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఉన్న సుంక అవరోధాలను ఈ ఒప్పందం తొలగిస్తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తులకు సమాన పోటీ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.2021లో ప్రారంభమైన ఎన్హాన్స్డ్ ట్రేడ్ పార్ట్నర్షిప్, ఇండియా–యూకే రోడ్మ్యాప్ 2030 ఆధారంగా ఈ ఒప్పందానికి పునాది పడింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యంతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి.మొత్తం 30 అధ్యాయాలతో రూపొందిన ఈ ఒప్పందంలో డిజిటల్ ట్రేడ్, టెలికమ్యూనికేషన్స్, ఆర్థిక సేవలు, మేధో సంపత్తి హక్కులు, ప్రభుత్వ కొనుగోళ్లు వంటి ఆధునిక అంశాలను కూడా చేర్చారు. అయితే పాల ఉత్పత్తులు, ధాన్యాలు, చిరుధాన్యాలు, వంట నూనెలు, ఆయిల్సీడ్స్, ఆపిల్స్ తదితర సున్నిత రంగాల ప్రయోజనాలను భారత్ రక్షించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. -
భారత మ్యాప్ వివాదం.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ (USINDOPACOM)ను మళ్లీ పాత పేరైన యూఎస్ పసిఫిక్ కమాండ్ (USPACOM)గా మార్చినట్లు ప్రకటించారు. ఎనిమిదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఈ మార్పు చేశారు.1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ యూఎస్ పసిఫిక్ కమాండ్గా ఏర్పాటు చేశారు. అయితే 2018లో అమెరికా అధ్యక్షుడు, అప్పటి రక్షణ మంత్రి జిమ్ మాటిస్లు యూఎస్ పసిఫిక్ కమాండ్ను కాస్తా యూఎస్ ఇండియా పసిపిక్ కమాండ్గా మార్చారు.ఎనిమిదేళ్ల తర్వాత పాత పేరు అయిన యూఎస్ పసిఫిక్ కమాండ్గా మార్పు చేశారు. సాంకేతిక, చారిత్రక వారసత్వాన్ని గౌరవించేందుకే మళ్లీ పాత పేరును తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అయితే పేరు మారుస్తూ అమెరికా రక్షణ శాఖ వెబ్సైట్లో యూఎస్ పసిఫిక్ కమాండ్ మ్యాప్ను ఏర్పాటు చేసింది. ఆమ్యాప్పై తీవ్ర దుమారం చెలరేగింది. ఆ మ్యాప్లో అమెరికా పీవోకేను పాక్ భూభాగంలో చూపించింది. దీంతో తప్పుడు మ్యాప్ను ప్రదర్శించడంపై భారతీయులు ట్రంప్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం అమెరికా-భారత్ సంబంధాలపై దౌత్య పరమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. -
ఇలాంటి యువనేతలు ఇక పనికిరారా? ఈ రాష్ట్రాల్లో ఇదే జరిగింది..
భారత రాజకీయాల్లో వారసత్వం ఒక్కటే నాయకత్వాన్ని తెచ్చిపెట్టదని కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల ఆమోదం, పార్టీ శ్రేణుల విశ్వాసం, వ్యక్తిగత రాజకీయ సామర్థ్యమే అసలైన బలమని తాజా రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలపై పెరుగుతున్న ప్రశ్నలు, నాయకత్వ మార్పుల చుట్టూ నెలకొంటున్న విభేదాలు పార్టీలను కుదిపేస్తున్నాయి. కేవలం నాయకుడి కుటుంబ సభ్యుడు కావడం వల్ల యువనేతకు నాయకత్వం ఇవ్వకూడదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. భారతీయ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాల భవిష్యత్తుపై అక్కడి పరిణామాలే సాక్షాలుగా నిలుస్తున్నాయి.నమ్మకాన్ని స్వయంగా సంపాదించుకోవాలి.. ప్రాంతీయ పార్టీల వ్యవస్థాపక నాయకులు తమ కష్టంతో పార్టీని నిర్మిస్తారు. కానీ వారి వారసులు అదే స్థాయి పాపులారిటీని, ప్రజామోదాన్ని, ముఖ్యంగా పార్టీ శ్రేణుల నమ్మకాన్ని స్వయంగా సంపాదించుకోవాల్సి ఉంటుంది. కేవలం రాజకీయ కుటుంబ సంబంధాలు సరిపోవు.మమతా బెనర్జీ తర్వాత పార్టీ నాయకత్వం ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేతిలోకి వెళ్లాలని భావించడం పార్టీలోని వారికి నచ్చలేదని ఇప్పటికే స్పష్టమవుతోంది. "మమతా తర్వాత అభిషేకే వారసుడు" అనే భావనను పార్టీలోని కొందరు నేతలు అంగీకరించలేదు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ అసంతృప్తి బహిర్గతమైంది. ఇదే సమస్య గతంలో శివసేన, ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీల్లో కూడా కనిపించింది.యువ ఓటర్లు ఇప్పుడు కుటుంబ వారసత్వాన్ని మాత్రమే చూసి నాయకులను అంగీకరించడం లేదని, పనితీరు ఆధారంగా నాయకత్వాన్ని అంచనా వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో వేల సంఖ్యలో నమోదైన చిన్న రాజకీయ పార్టీలు తిరుగుబాటు నేతలకు ఆశ్రయం కల్పించే వేదికలుగా మారుతున్నాయి. టీఎంసీ తిరుగుబాటు నేతలు ఎన్సీపీఐ వైపు వెళ్లడం దీనికి ఉదాహరణ.వారసత్వం అనేది రాజకీయాల్లోకి రావడానికి ప్రవేశ ద్వారాన్ని తెరవవచ్చు. కానీ పార్టీని నిలబెట్టేది నాయకుడి వ్యక్తిగత సామర్థ్యం, పార్టీ కార్యకర్తల విశ్వాసం, సంస్థాగత బలం మాత్రమే. -
చినుకు రాలదు, చుక్క నీరుండదు.. జరగబోయేది ఇదే
-
సిరీస్ పై భారత్ గురి
-
‘‘భారతీయులూ బలయ్యారు’’.. ట్రంప్ ఎదుటే మోదీ ఆవేదన
పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదని, భారతీయులు కూడా దాని మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర వాణిజ్య మార్గాల భద్రతపై భారత్ తరఫున ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతల కారణంగా భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని జీ7 సదస్సు వేదికగా ప్రపంచ నేతల దృష్టికి తీసుకెళ్లారు.ఫ్రాన్స్లోని ఎవియన్లో జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “కొత్త భాగస్వామ్యాలు – అంతర్జాతీయ ఐక్యత పునర్నిర్మాణం” అంశంపై మాట్లాడిన మోదీ, పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు ముందుకు సాగడం స్వాగతార్హమని అన్నారు. అయితే ఆ ఘర్షణల వల్ల మిత్రదేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య రవాణా అంతరాయంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని పేర్కొన్నారు.“భారతీయ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశాలను అనుసంధానించే సముద్ర వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే నావికుల భద్రతను నిర్ధారించడం మనందరి బాధ్యత. సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.మోదీ వ్యాఖ్యల వెనుక కారణం ఇదేకొద్ది రోజుల క్రితం గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ప్రయాణిస్తున్న సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్పై అమెరికా బలగాలు దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. మొత్తం 28 మంది సిబ్బందిలో 24 మంది భారతీయులే ఉన్నారు. అమెరికా ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇరాన్ చమురును తరలిస్తున్నారనే అనుమానంతో ఆ నౌకపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా తెలిపింది.ఇది ఒక్కటే కాదు. మారివెక్స్, జల్వీర్ అనే మరో రెండు నౌకలపైనా అమెరికా సైన్యం చర్యలు చేపట్టింది. ఈ మూడు నౌకల్లోనూ భారతీయ సిబ్బంది ఉండటం భారత్ ఆందోళనకు కారణమైంది.అమెరికా చర్యలపై భారత్ తీవ్ర అభ్యంతరంఈ ఘటనలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్ను విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించి అధికారిక నిరసన (డిమార్ష్) అందజేసింది. భారతీయ నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ఇటువంటి దాడులు వెంటనే ఆగాలని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “సెట్టెబెల్లోపై దాడి జరిగిన వెంటనే అమెరికా ప్రభుత్వానికి బలమైన నిరసన తెలియజేశాం. భారతీయ నావికుల ప్రాణ భద్రతపై మా ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేశాం” అని వెల్లడించారు.ప్రపంచానికి భారత్ సందేశంజీ7 వేదికగా మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం భారతీయుల ప్రాణనష్టంపై ఆవేదన మాత్రమే కాదు. హర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరా, ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ సమక్షంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారతీయుల భద్రత విషయంలో రాజీ ఉండదనే సంకేతాన్ని కూడా మోదీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.17 నెలల తర్వాత.. ఫ్రాన్స్ వేదికగా జీ7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని మోదీ కరచాలనం చేశారు. ఈ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. గతేడాది ఫిబ్రవరి తర్వాత వీరిద్దరూ ప్రత్యక్షంగా పలకరించుకోవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యకాలంలో టారిఫ్ వార్, ఆపరేషన్ సిందూర్ పరిణామాల నడుమ.. కీలక సదస్సులోనూ ఈ ఇద్దరూ ఒక్కచోట కనిపించలేదు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగానూ ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఫోన్తో పాటు సోషల్ మీడియాలో ట్వీట్లతో సంభాషించుకున్నారు. జీ7 సదస్సులో భాగంగా.. బుధవారం ఇరు దేశాధినేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. -
ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ: భారతదేశంలో బలహీనమైన రుతుపవనాలకు కారణమయ్యే ఎల్ నినో ప్రభావం ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో ఎల్ నినో ముప్పు తీవ్రతను తగ్గించడానికి సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టాలని మంగళవారం ఆదేశించింది. ఎల్ నినో ప్రభావం సాపేక్షంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న రాష్ట్రాల్లోని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర విభాగాలతో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సూచించారు. ఖరీఫ్–2026 ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో ముందస్తు అత్యవసర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. వర్షపాతం లోటును దృష్టిలో పెట్టుకొని పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి 12 ఎల్ నినో ప్రభావిత రాష్ట్రాల్లోని 326 జిల్లాలకు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. -
సిరీస్పై భారత్ గురి
లక్నో: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య రెండో వన్డే మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఎకానా స్టేడియంలో నేడు జరిగే పోరులో ఇరు జట్ల తలపడనున్నాయి. వర్షం బారిన పడి సగం ఓవర్లకే గత మ్యాచ్ పరిమితం కాగా... ఈసారి పూర్తి స్థాయిలో ఆట జరిగే అవకాశం కనిపిస్తోంది. తొలి వన్డేలో 7 వికెట్లతో నెగ్గిన భారత్ ఇక్కడా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్లోనైనా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భారత్పై తొలి విజయాన్ని అందుకోవాలని అఫ్గాన్ ఆశిస్తోంది. అఫ్గాన్ తుది జట్టులో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చు. ధర్మశాల వన్డేలో సెంచరీతో చెలరేగిన గుర్బాజ్ మళ్లీ సత్తా చాటాలని అఫ్గాన్ టీమ్ ఆశిస్తోంది. అయితే 25 ఓవర్లే సాగిన తొలి మ్యాచ్లో కూడా బ్యాటర్లు నిలవలేకపోవడంతో జట్టు ఆలౌట్ అయింది. ఇప్పుడు పూర్తి స్థాయి వన్డేలో టీమ్ మరింత పట్టుదలగా ఆడాల్సి ఉంటుంది. బౌలింగ్లో మరోసారి టీమ్ రషీద్ ఖాన్, ఘజన్ఫర్లపై ఆధారపడుతోంది. ఆల్రౌండర్ అజ్మతుల్లా కీలకం కానున్నాడు. భారత జట్టుకు సంబంధించి ఒక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. పొడిగా ఉన్న పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే ఒక పేసర్ స్థానంలో స్పిన్నర్కు చాన్స్ ఉంది. కాబట్టి ప్రసిధ్ కృష్ణకు బదులుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీమ్లోకి రావచ్చు. స్థానిక యూపీ ఆటగాడే కావడం కూడా కుల్దీప్కు సానుకూలాంశం. అయితే మ్యాచ్ ఫలితంకంటే కూడా మరోసారి రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించే చర్చ జరగడం ఖాయం. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రతీ మ్యాచ్ రోహిత్కు కీలకమే. తొలి వన్డేలో అతను దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. ఈ మ్యాచ్లో అతను ఎన్ని పరుగులు చేస్తాడనేది ఆసక్తికరం. ఎకానా స్టేడియంలో చివరిసారిగా 2023 వన్డే వరల్డ్ కప్లో ఐదు మ్యాచ్లు జరిగాయి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు సమానంగా సహకరిస్తూ భారీ, స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఈ గ్రౌండ్లో భారత్ 2 వన్డేలు ఆడగా, అఫ్గానిస్తాన్ 4 వన్డేలు ఆడటం విశేషం. -
5జీ యూజర్లు @ 110 కోట్లు!
న్యూఢిల్లీ: వచ్చే ఆరేళ్లలో 2031 నాటికి భారత్లో 5జీ యూజర్ల సంఖ్య 110 కోట్లకు చేరనుంది. మొత్తం కనెక్షన్లలో 5జీ వాటా 81 శాతానికి చేరనుంది. స్వీడన్కి చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2025 ఆఖరు నాటికి దేశీయంగా 5జీ యూజర్ల సంఖ్య 43 కోట్లకు, మొత్తం మొబైల్ సబ్ స్క్రిప్షన్లలో వాటా 35 శాతానికి చేరిందని రిపోర్టు పేర్కొంది. మొబైల్ బ్రాడ్బ్యాండ్ మెరుగుపడటంతో 5జీ వినియోగం గణనీయంగా పెరుగుతోందని ఎరిక్సన్ ఇండియా ఎండీ నితిన్ బన్సల్ తెలిపారు. భారీ స్థాయిలో సమ్మిళితత్వం, గవర్నెన్స్, ఆవిష్కరణలకు పటిష్టమైన, సురక్షితమైన 5జీ మౌలిక సదుపాయాలు తోడ్పడుతున్నాయని, డిజిటల్ ఇండియాకి శక్తివంతమైన పునాది వేస్తున్నాయని వివరించారు. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు వైవిధ్యమైన సర్వీసులను కూడా ప్రవేశపెడుతున్నాయని నివేదిక పేర్కొంది. నేరుగా ఎయిర్టెల్ని ప్రస్తావించకుండా, పోస్ట్పెయిడ్ 5జీ కస్టమర్లకు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సందర్భాల్లోనూ మెరుగైన సేవలు అందేలా ఓ టెలికం కంపెనీ .. నెట్వర్క్ స్లైసింగ్ ఇటీవలే వైవిధ్యమైన కనెక్టివిటీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → డివైజ్లు చౌకగా లభిస్తుండటం, నెట్వర్క్ కవరేజీ విస్తృతంగా ఉండటం, ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) సేవలు అందుబాటులోకి వస్తుండటంతో 5జీ వినియోగం భారీగా పెరుగుతోంది. చాలా మటుకు సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించి డౌన్లింక్ కన్నా అప్లింక్ ట్రాఫిక్ వేగంగా పెరుగుతోంది. → ప్రతి స్మార్ట్ఫోన్పై మొబైల్ డేటా వినియోగం విషయంలో గ్లోబల్గా భారత్ అగ్రస్థానంలో ఉంటోంది. నెలవారీ యూసేజీ సగటున 37 జీబీగా ఉండగా, 2031 నాటికి 70 జీబీకి చేరనుంది. → 46 శాతం వాటాతో 4జీ ఇప్పటికీ ప్రధాన టెక్నాలజీగానే కొనసాగుతున్నప్పటికీ దాని వినియోగం క్రమంగా తగ్గుతోంది. 2025లో 57 కోట్లుగా ఉన్న యూజర్ల సంఖ్య 2031 నాటికి 16 కోట్లకు పడిపోనుంది. → అంతర్జాతీయంగా 5జీ మొబైల్ సబ్ స్క్రిప్షన్ల సంఖ్య 2026 తొలి త్రైమాసికంలో తొలిసారిగా మూడు వందల కోట్ల మార్కును దాటింది. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో గ్లోబల్గా 16.2 కోట్ల కొత్త 5జీ కనెక్షన్లు జత కావడంతో మొత్తం సబ్స్క్రిప్షన్ల సంఖ్య 310 కోట్లకు చేరింది. ఇది 2031 నాటికి రెట్టింపు కన్నా అధిక స్థాయికి (640 కోట్లు) చేరనుంది. → ఇప్పటివరకు 390 సర్వీస్ ప్రొవైడర్లు కమర్షియల్ 5జీ సర్వీసులు ప్రారంభించాయి. 90కి పైగా సంస్థలు 5జీ సేవలను స్టాండెలోన్ ప్రాతిపదికన ప్రవేశపెట్టాయి. → 2025 ఆఖరు నాటికి మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్లో 48 శాతం వాటా 5జీ నెట్వర్క్లదే ఉంది. 2031 ఆఖరు నాటికి ఇది 85 శాతానికి చేరొచ్చని అంచనా. → పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా, ఈశాన్య ఆసియా, గల్ఫ్ దేశాల్లో 5జీ సేవల వినియోగం 2031 నాటికి 90 శాతానికి చేరవచ్చు. → ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ)కి సంబంధించి వేగం ఆధారిత టారిఫ్ ప్లాన్ల ద్వారా వివిధ మార్కెట్ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలను టెల్కోలు కొనసాగిస్తాయి. → మొత్తం ఎఫ్డబ్ల్యూఏ సర్వీస్ ప్రొవైడర్లలో 5జీ ద్వారా సేవలందించే సంస్థల వాటా 71 శాతానికి చేరింది. 2025 జూన్లో ఇది 57 శాతంగా ఉంది. స్పీడ్ ఆధారిత టారిఫ్ ప్లాన్లను అందించే ఎఫ్డబ్ల్యూఏ సర్వీస్ ప్రొవైడర్ల సంఖ్య గతేడాది 51 శాతంగా ఉండగా ప్రస్తుతం 57 శాతానికి చేరింది. -
ఇండియా కూటమిలోకి ఓవైసీ ? యూపీలో కొత్త ట్విస్ట్
-
బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారుకు షాక్.. ఇచ్చి పడేసిన భారత్
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్కు దిల్లీ విమానాశ్రయంలో ఉహించని ఘటన ఎదురైంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను రెండు గంటలకు పైగా తనిఖీకోసం ఎదురు చూసేలా చేశారు. దీంతో ఆగ్రహం చెందిన రెహమాన్ ఢిల్లీ విమానాశ్రయంలో నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏం జరిగింది?ఐఓఆర్ఏ (ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్) సీనియర్ అధికారుల కమిటీ 28వ సమావేశంలో పాల్గొనేందుకు జహీద్ ఉర్ రెహమాన్ ఆదివారం (జూన్ 14, 2026) ఎయిర్ ఇండియా విమానంలో దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్ కథనాల ప్రకారం "మొదట ఇమిగ్రేషన్ అధికారులు ఎటువంటి కారణం చెప్పకుండా ఆయన్ను ఆపేశారు. కారణం అడిగినప్పుడు, అంతా బానే ఉందని, కొన్ని వివరాలు సరిచూస్తున్నామని చెప్పారు. వారి ప్రవర్తన, విచారించిన తీరు కనీస మర్యాద లేకుండా సాగింది. ఒక రాష్ట్ర మంత్రి హోదా ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకుండా, సాధారణ ప్రయాణికులతో పాటు సోఫాలో కూర్చోబెట్టారు. రెండు గంటల నిరీక్షణ తర్వాత క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు. కానీ, అప్పటికే నిరాశకు గురైన రెహమాన్ వెనక్కి వెళ్లడానికే మొగ్గు చూపారు." అని ఢాకా పేర్కొంది.అయితే ఈ అంశంపై దౌత్యపరమైన దుమారం చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలూర్ రెహమాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది "విచారకరం" అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై నిరసనగా ఢాకాలోని భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పవన్ బాథేను బంగ్లాదేశ్ ప్రభుత్వం సమన్లు జారీ చేసి వివరణ కోరినట్లు తెలుస్తోంది.భారత్ స్పందన ఏంటి?భారత అధికారులు మాత్రం ఈ చర్యను సమర్థించుకున్నారు. జహీద్ ఉర్ రెహమాన్కు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని, గత కొన్నేళ్లుగా భారత్కు వ్యతిరేకంగా, అలాగే బంగ్లాదేశ్ విషయంలో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారని అధికారులు గుర్తుచేశారు.జాహెద్ ఉర్ రెహమాన్ గతంలో పలుమార్లు భారత్ను కించపరుస్తూ వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఫాసిస్ట్ అని పిలవడంతో పాటు భారత్ హిందూ కార్డు వాడుతోందనే ఆరోపణలు చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలుమార్లు భారత్ను కించపరుస్తూ మాట్లాడారు. భారత్ బంగ్లాదేశ్ను అస్థిరపరచాలని చూస్తోందని, బంగ్లాదేశ్లోని తమ ప్రాజెక్టుల నుండి అదానీ గ్రూప్కు వచ్చే లాభాలు బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వెళ్తున్నాయని కూడా అతను ఆరోపించారు. ఈ చర్యలతో అతని పేరును గతంలోనే ఇమ్మిగ్రేషన్ వాచ్లిస్ట్లో చేర్చామని పేర్కొన్నారు. -
దేశంలో గిరిజన అభివృద్ధికి సవాళ్లు
గిరిజన అభివృద్ధి నిరంతర పురోగతితో సాగిన ప్రయాణం కాదు. ఇది పాలన విధానాలు, ఆలోచనా విధానాలు, రాజ్యాంగ హామీల మధ్య జరిగిన మార్పులతో రూపుదిద్దుకున్న క్లిష్టమైన ప్రయాణం. ఇందులో రక్షణ, సమగ్రత, స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ జోక్యం, సాంస్కృతిక గుర్తింపు, ఆర్థిక అభివృద్ధి మధ్య ఇప్పటికీ కొనసాగుతున్న సంఘ ర్షణే కనిపిస్తుంది. బయటకు అభివృద్ధి కనిపించినప్పటికీ, లోపల అనేక నిర్మాణాత్మక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో గిరిజన ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా పరిగణించి పాలన అమలు చేశారు. 1874లో ‘షెడ్యూల్డ్ జిల్లాలు’, 1919లో ‘వెనుకబడిన ప్రాంతాలు’, 1935లో ‘మినహాయించ బడిన’, ‘కొంతమేరకు మినహాయించబడిన ‘ ప్రాంతాలు అనే వర్గీక రణలు చేశారు. ఇవి గిరిజనులను రక్షించే లక్ష్యంతో ఉన్నప్పటికీ, వాస్తవానికి పరోక్ష దోపిడీకి మార్గాన్ని సుగమం చేశాయి.కేవలం అధ్యయనాంశమా?1924లో వచ్చిన ఏజెన్సీ రూల్స్ ద్వారా రెవెన్యూ అధికారులకు విస్తృత అధికారాలను ఇచ్చారు. పరిపాలన, న్యాయ అధికారాలు ఒకే వ్యక్తి చేతిలో ఉండేవి. ఈ విధానం ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలలో కొంతవరకు కనిపిస్తున్నది. రక్షణ పేరుతో గిరిజన ప్రాంతాలు వేరుపడిపోయాయి. దాంతో వ్యాపారులు, మధ్య వర్తులు, కాంట్రాక్టర్లు గిరిజనులను దోచుకున్నారు. గిరిజనులు భూములను కోల్పోయారు, అప్పుల్లో కూరుకుపోయారు. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు లేక అభివృద్ధికి దూరమయ్యారు.20వ శతాబ్దం ప్రారంభంలో తక్కర్ బాపా వంటి సంస్కరణ వాదులు ఈ విధానాన్ని వ్యతిరేకించారు. 1941లో మినహాయించ బడిన ప్రాంతాల కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన, గిరిజనులను కేవలం అధ్యయనానికి సంబంధించిన ప్రజలుగా కాకుండా, గౌర వంతో బాటు అభివృద్ధికి అర్హులైన పౌరులుగా చూడాలని చెప్పారు. ఆయన ఆలోచనలు ఆ తరువాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46లో ప్రతిబింబించాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి.స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగం గిరిజన ప్రాంతాలను ఐదో షెడ్యూల్, ఆరవ షెడ్యూల్ కింద ప్రత్యేక పరిపాలన క్రిందికి తీసుకు వచ్చింది. గిరిజనులను ప్రధాన సమాజంలో కలపాలా? లేక వేరుగా ఉంచాలా? అనే పెద్ద ప్రశ్న ముందుకొచ్చింది. కలపడం వల్ల వారి సంస్కృతి దెబ్బతింటుంది; వేరుగా ఉంచడం ప్రజాస్వామ్య సమా నత్వానికి విరుద్ధం. జవహర్లాల్ నెహ్రూ ‘పంచశీల సూత్రాల’ ద్వారా సమతుల్య మార్గాన్ని సూచించారు. గిరిజనుల స్వభావానికి అనుగుణంగా అభివృద్ధి జరగాలి; వారి భూమి, అడవి హక్కులు, సంప్రదాయ సంస్థలకు రక్షణ అవసరం అని చెప్పారు. అభివృద్ధిని కేవలం డబ్బు లేదా ఆర్థిక వృద్ధితో కాకుండా, మానవ గౌరవంతో బాటు సామర్థ్యాల పెరుగుదలతో కొలవాలని చెప్పారు. 1969లో శీలు ఆవో కమిటీ ప్రాంతాల వారీగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు అవసరమని సూచించింది. కానీ తరువాతి కాలంలో విధానాలు ఈ ఆదర్శాల నుండి దూరమయ్యాయి.ఐదవ పంచవర్ష ప్రణాళిక తరువాత ట్రైబల్ సబ్ ప్లాన్, ఐటీడీఏల వంటివి మొదలయ్యాయి. ఇవి కొంత సంక్షేమాన్ని అందించినప్పటికీ, గిరిజన ప్రాంతాలను మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద, అడవులు, నీటి వనరులు పెద్ద ప్రాజెక్టులు, గనులు, పరి శ్రమల కోసం ఉపయోగించారు. అభివృద్ధి పేరుతో అనేక మంది గిరిజనులు తమ భూములు, జీవనాధారాలను కోల్పోయారు. 1947 నుండి 2010 వరకు భారత్లో 6 నుండి 6.5 కోట్ల మంది గిరిజనులు అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల ప్రభావితమయ్యారని అధ్యయనాలు చెబుతున్నాయి. జనాభాలో కేవలం 8.6% మాత్రమే గిరిజనులు ఉన్నప్పటికీ, స్థానచలనం చెందిన వారిలో దాదాపు 40% వారే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ, అనేక షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 50% కంటే ఎక్కువ భూములు గిరిజ నేతరుల చేతుల్లో ఉన్నాయి. ఇది రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధం. ఐదో షెడ్యూల్, ఆర్టికల్ 46, పెసా చట్టం (1996) గిరిజన హక్కులు, గ్రామసభల స్వపరి పాలనకు బలమైన రక్షణ ఇస్తున్నాయి. కానీ గ్రామసభలు చాలా చోట్ల కేవలం పేరుకే ఉన్నాయి. భూములు కోల్పోవడం కొనసాగుతూనే ఉన్నది. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడం మాత్రమే కాదు. అది అసమానతలను తగ్గించాలి;సంస్కృతిని కాపాడాలి; ప్రజలను శక్తిమంతం చేయాలి.భాగస్వాములను చేసినప్పుడే...గిరిజన సమాజాలు ప్రకృతితో కలిసి జీవించే విధానాన్ని అనుసరిస్తాయి. భూమి, అడవులు వారికి కేవలం ఆర్థిక వనరులు మాత్రమే కాదు; అవి వారి సంస్కృతి, జీవన విధానాలకు గుర్తింపు. అందుకే భూములు కోల్పోవడం అంటే కేవలం ఆర్థిక నష్టమే కాదు, సాంస్కృతిక నష్టం కూడా. పెసా చట్టం గ్రామస్థాయి స్వపరి పాలనకు ముఖ్యమైన అడుగు. కానీ దాని అమలు అత్యంత బల హీనంగా ఉన్నది. అధికార యంత్రాంగమే ఇంకా కేంద్రీకృతంగా పనిచేస్తున్నది. నిజమైన స్వపరిపాలన కోసం ప్రభుత్వం గిరిజన సమాజాలపై నమ్మకం ఉంచాలి; అధికారాలను పంచుకోవాలి.భారతదేశ గిరిజన అభివృద్ధి ప్రయాణంలో పురోగతి ఉన్న ప్పటికీ, లోపాలు కూడా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. సంక్షేమ పథ కాలు మాత్రమే సరిపోవు; గిరిజనులకు స్వయం నిర్ణయాధికారం ఉండాలి; భూమి, అడవులపై నిజమైన హక్కులు ఇవ్వాలి; గ్రామ సభలను బలపరచాలి; అభివృద్ధి ప్రక్రియలో బాధ్యతాయుత వ్యవస్థలు ఉండాలి. గిరిజన ప్రాంతాలను కేవలం సహజ వనరుల నిల్వలుగా కాకుండా, ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం కలిగిన ప్రాంతాలుగా గౌరవించాలి. రాజ్యాంగ హామీలు నిజం కావాలంటే కేవలం చట్టాలు సరిపోవు. అభివృద్ధి విధానాలే రాజ్యాంగ విలువ లకు అనుగుణంగా మారాలి. అప్పుడే గిరిజన సమాజాలు నిజమైన భాగస్వాములుగా భారత ప్రజాస్వామ్యంలో స్థానం పొందుతాయి.పి. వేణుగోపాల్ రెడ్డివ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ వ్యవస్థాపకులు -
బద్రీనాథ్, కేదార్నాథ్ క్షేత్రాలను దర్శించుకున్న ముఖేష్ అంబానీ(ఫొటోలు)
-
ఇంత ఓపిక ఎలారా అయ్యా.. ఒకే కుటుంబంలో 200 మంది.. రోజుకు 90 కిలోల బియ్యం
-
ఈ ఆపిల్ తోటలు ఎక్కడ?
ఇండియాలో అత్యంత అందమైన ఆపిల్ తోటలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఇండియాలో ఆపిల్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలిచే ప్రదేశం హిమాచల్ ప్రదేశ్లోని కోట్గఢ్. అందమైన హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ఈ హిల్ టౌన్, మన దేశంలో కమర్షియల్ ఆపిల్ కల్టివేషన్ కి పుట్టినిల్లుగా ప్రసిద్ధి పొందింది.1916 సంవత్సరంలో అమెరికన్ మిషనరీ శామ్యూల్ ఇవాన్స్ స్టోక్స్ అమెరికా నుంచి హై క్వాలిటీ ఆపిల్ శాప్లింగ్లను కోట్గఢ్కి తీసుకుని వచ్చి నాటారు. ముఖ్యంగా రెడ్ డిలీషియస్ వెరైటీ ఇక్కడి క్లైమేట్కి చాలా బాగా అడాప్ట్ అయింది. అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ అంతటా ఆపిల్ కల్టివేషన్ వేగంగా అభివద్ధి చెందింది. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ ఇండియాలో అత్యధిక ఆపిల్స్ ్ర΄÷డ్యూస్ చేసే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.కోట్గఢ్ చుట్టూ పచ్చని ఆపిల్ తోటలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్లని వాతావరణం, తాజా గాలి టూరిస్టులను ఆకర్షిస్తాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు ఆపిల్ హార్వెస్టింగ్ సీజన్ ఉంటుంది. ఈ సమయంలో తోటలు అన్నీ కూడా ఎర్ర, ఆకుపచ్చ రంగు ఆపిల్స్తో నిండిపోయి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కొన్ని తోటల్లో ప్రయాణికులు ఆపిల్స్ను కోసుకుని తినే అవకాశం కూడా లభిస్తుంది. ఆపిల్ ఫార్మింగ్ అనేది ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారం. ఫ్రెష్ ఆపిల్స్తో పాటు ఆపిల్ జ్యూస్, జామ్, సైడర్, డ్రైడ్ ఆపిల్స్లాంటి ఉత్పత్తులు కూడా ఇక్కడి ఎకానమీకి బలాన్ని అందిస్తాయి. నేచర్ లవర్స్ కోసం కోట్గఢ్ ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. అందమైన మౌంటైన్ రోడ్స్, ప్రశాంతమైన గ్రామాలు, ఆపిల్ తోటలు, చల్లని వాతావరణం ఇవన్నీ కలిసి ఒక అందమైన, అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.ఆపిల్ తోటల్లో నడవాలి అనుకుంటే, ఫ్రెష్ ఆపిల్స్ డైరెక్ట్గా చెట్టు నుంచి కోసి తినాలి అనుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కోట్గఢ్ని తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రదేశాన్ని ఆపిల్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. -
లోకో భిన్నరుచి.. ఏఐతో గుదిగుచ్చి...
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు ఇడ్లీ–సాంబార్, ఫిల్టర్ కాఫీకి ఫేమస్.. హైదరాబాద్ పేరు చెప్పగానే నోరూరించే దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. ఇలా దేశంలోని వేర్వేరు ప్రాంతాల ప్రత్యేక రుచులు, వంటకాలు, విభిన్న తయారీ పద్ధతులకు డిజిటల్ రూపం ఇచ్చేందుకు భాగ్యనగరం వేదికగా కసరత్తు జరుగుతోంది. ఆయా వంటకాల్లోని పదార్థాల కల యిక, వంట విధానం సహా ప్రాంతానికో రుచి కలిగిన భారతీయ రుచులను సాంకేతికంగా గుర్తించేందుకు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పరిశోధన సాగుతోంది. ఇండియన్ ఫుడ్ మ్యాప్ తయారీ లక్ష్యంగా ప్రొఫెసర్ సీవీ జవహర్ సారథ్యంలో జరుగుతున్న ఈ అధ్యయనంలో కంప్యూటర్ విజన్, ఏఐ సాంకేతికతలను ఉపయోగించి భారతీయ ఆహార ప్రత్యేకతలను పరిశోధక బృందం విశ్లేషిస్తోంది.థాళీ... భళీ...ఈ ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు తొలుత భారతీయ థాళీ’పై అధ్యయనం ప్రారంభించారు. సాధారణంగా భారతీయ భోజనంలో అన్నం, పప్పు, కూరలు, రొట్టెలు, పెరుగు, పచ్చళ్లు వంటి అనేక పదార్థాలు కలిసిపోవడం వల్ల వాటి పోషక విలువలను గుర్తించడం ప్రస్తుత యాప్లకు కష్టమవుతోంది. పాశ్చాత్య దేశాల ఆహారాన్ని గుర్తించేందుకు తయారైన చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్లు భారతీయ వంటకాల వైవిధ్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదని పరిశోధకులు గుర్తించారు. దీనికి పరిష్కారంగా జీరో–షాట్ ఏఐ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత కొత్త వంటకాలను ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే గుర్తించి, విశ్లేషిస్తుంది.బిర్యానీపై స్పెషల్ స్టడీహైదరాబాదీ, అవధీ, అంబూర్, కోల్కతా వంటి బిర్యానీ రకాల్లో ఉపయోగించే మసాలాలు, వంట దశలు, పదార్థాల మార్పులను ఏఐ ప్రత్యేకంగా విశ్లేషిస్తోంది. ఈ ప్రాజెక్టు కేలరీలు లెక్కించే సాధనంగా మాత్రమే కాకుండా భారతీయ ఆహార సంస్కృతిని డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రయత్నంగా కూడా మారనుంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ ఓవర్హెడ్ కెమెరా సహాయంతో పనిచేస్తుండగా భవిష్యత్తులో మొబైల్ యాప్ రూపంలో అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ కెమెరాతో భోజనం ఫొటో తీస్తే అందులోని పదార్థాలు, వాటి పరిమాణం, పోషక విలువలను కూడా ఏఐ అంచనా వేస్తుందని బృందం చెబుతోంది.లాభాలివీ..⇒ ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగదారులు దేశ ఇంటరాక్టివ్ మ్యాప్ను అన్వేషిస్తూ వివిధ ప్రాంతాల సంప్రదాయ వంటకాలను తెలుసుకోగలరు. ⇒ ప్రతి వంటకం మూలాలు, పదార్థాలు, సాంస్కృతిక ప్రాధాన్యం, తయారీ విధానంతోపాటు వాటిని అందించే రెస్టారెంట్ల గురించి కూడా సమాచారం పొందగలరు. ⇒ కొత్త వంటకాలను తెలుసుకోవాలనుకునే ఆహార ప్రియులకు ఇది దోహదపడటంతోపాటు పర్యాటకులకు అసలైన స్థానిక ఆహార అనుభవాలను కనుగొనడంలో సహాయపడుతుంది. ⇒ భారతీయ ఆహార వారసత్వంపై ఆసక్తి ఉన్న పరిశోధకులు, విద్యార్థులు, సాంస్కృతిక సంస్థలకు ఇది ఉపయుక్తమైన వనరుగా ఉంటుంది.ఏఐ ఆధారిత పరిష్కారాలకు దోహదంసమాచార సేకరణ, వర్గీకరణ కోసం ఏఐ సాధనాలను వినియోగించి అనంతరం ధ్రువీకరణ, భౌగోళిక మ్యాపింగ్ కోసం ప్రత్యేక విధానాలను అభివృద్ధి చేశాం. దీంతో వినియోగదారులకు సులభంగా ఉపయోగపడే ఇంటరాక్టివ్ వేదికను రూపొందించగలిగాం. ఈ డేటా వల్ల రుచులు, పోషకాలు, వినూత్న పద్ధతులపై సాంకేతిక విశ్లేషణ సాధ్యమవుతుంది. దీని ద్వారా భారతీయ ఆహార రంగంలో ఏఐ ఆధారిత పరిష్కారాలు అభివృద్ధి చెందుతాయి. వంటకాల్లోని వైవిధ్యాలను, వంటకాల పరిణామ క్రమాన్ని కూడా చేర్చాలని భావిస్తున్నాం.– ప్రొఫెసర్ సీవీ జవహర్ -
ద్వైపాక్షిక వాణిజ్యం ఐదేళ్లలో రెట్టింపు
పారిస్: వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేసుకోవాలని భారత్, ఫ్రాన్స్ నిశ్చయించుకున్నాయి. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 16 మిలియన్ డాలర్లుగా ఉంది. కృత్రిమ మేధ(ఏఐ), స్టార్టప్లు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆరోగ్యం సహా కీలక రంగాలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నిర్ణయానికి వచ్చారు.ఆదివారం వారిద్దరూ ఫ్రాన్స్లోని నైస్ నగరంలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–ఫ్రాన్స్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు. ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరత, భద్రత, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాలపై చర్చించారు. కాన్పూర్లో ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో సంబంధాలను పటిష్టం చేసుకోవడంపై ఇరువురు మోదీ, మేక్రాన్ ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే సైన్స్, అంతరిక్షం, స్టార్టప్లు, ఫిన్టెక్, పౌర అణుశక్తి, మౌలిక సదుపాయాల రంగాలపైనా చర్చ జరిగింది. మొత్తం 13 అంశాలపై అంగీకారం కుదిరింది. ఆవిష్కరణల(ఇన్నోవేషన్) కోసం ఉమ్మడిగా రోడ్మ్యాప్ ఏర్పాటు చేసుకోవాలని, రాబోయే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఒక యంత్రాంగాన్ని నెలకొల్పాలని, ఉమ్మడి ఏఐ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.అలాగే హైస్పీడ్ రైల్వే రంగంలో సహకారం కోసం డిక్లరేషన్, వర్గీకృత డేటాను పరిరక్షించే భద్రతా ఒప్పందాన్ని కూడా ఇరుపక్షాలు ఖరారు చేశాయి. ఇండియాకు చెందిన యూపీఐ చెల్లింపుల సేవలను ఫ్రాన్స్కు సైతం విస్తరింపజేయనున్నారు. ఫ్రెంచ్ రక్షణ రంగ దిగ్గజం దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న భారతదేశ ప్రణాళిక కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది.మోదీ–మేక్రాన్ భేటీ అనంతరం.. ఏరోనాటిక్స్, అనుబంధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కాన్పూర్లో ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. భారతదేశంలో క్యాంపస్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఫ్రాన్స్ విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు. -
సవాళ్లకు పరిష్కారాల భారత్
పారిస్: భారత్ ఇకపై ప్రపంచ దేశాల పరిష్కారాలను వినియోగించుకునే దేశం మాత్రమే కాదని.. సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించే దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మానవ కేంద్రీకృత ఆవిష్కరణలు, సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. మోదీ ఆదివారం ఫ్రాన్స్లోని నైస్ సిటీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్తో కలిసి ‘భారత్ ఇన్నోవేట్స్’కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండియా, ఫ్రాన్స్ సహా వివిధ దేశాల స్టార్టప్ కంపెనీలు పాల్గొన్నాయి.నూతన ఆవిష్కరణలు, సమ్మిళితత్వం వేర్వేరు కాదని... అవి పరస్పర ఆధారితమని తాము నిరూపించిట్లు మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఏ ఆవిష్కరణ గొప్పతనమైనా కేవలం దాని విలువలో కాకుండా, మానవ జీవితాలపై అది చూపే ప్రభావంపై ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు.దశాబ్దం క్రితం వరకు ప్రపంచం భారతదేశాన్ని సాంకేతికతను స్వీకరించే దేశంగా చూసేదని, నేడు దేశం సాంకేతికతను అందించే దేశంగా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. అంతేకాకుండా తమ దేశం సృష్టించే ఆవిష్కరణలు, అందించే పరిష్కార మార్గాలు మానవాళికి ప్రయోజనం చేకూరుస్తాయని వెల్లడించారు. ‘భారత్ ఇన్నోవేట్స్’లక్ష్యం ఇదేనని అన్నారు. సమ్మిళిత, మానవ–కేంద్రీకృత సాంకేతికత, నూ తన ఆవిష్కరణల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. సాంకేతిక విప్లవంతో కొత్త అవకాశాలు అత్యాధునిక సాంకేతికత, అణు శక్తి, రక్షణ, ఆవిష్కరణలతో సహా పలు కీలక రంగాల్లో తన ప్రభుత్వం సంస్కరణలు చేపట్టినట్లు ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సంస్కరణల పరంపర ఇక్కడితో ఆగదని, ఇది కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు. ఇండియా నుంచి వెలువడే స్టార్టప్ల సంఖ్య అనేక రెట్లు పెరుగుతూనే ఉంటుందన్నారు. వివిధ దేశాల మధ్య సంఘర్షణలు, తీవ్రతరమవుతున్న వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని మోదీ గుర్తుచేశారు. అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ అవకాశాలు సైతం విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు.కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్ష సాంకేతికతలు, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ మానవాళి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని వెల్లడించారు. ఇవి మానవ నాగరికతలో తదుపరి అధ్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తాయని అన్నారు. ప్రతి సాంకేతిక విప్లవం మానవాళికి ఒక కొత్త అవకాశాన్ని కల్పిస్తుందని వివరించారు.ప్రపంచం కోసం, సుస్థిర భవిష్యత్తు కోసం భారత్ అనేక ఆవిష్కరణలు చేస్తోందని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణ అనేది దేశం డీఎన్ఏలోనే ఉందని స్పష్టంచేశారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక ప్రత్యేక భాగస్వామ్యం ఉందని వెల్లడించారు. ఇందులో అనుబంధం, దృఢ విశ్వాసం, ఆవిష్కరణ, స్ఫూర్తి, ఉమ్మడి దార్శనికత ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ పునాది ఆధారంగానే గత కొన్నేళ్లుగా ఉమ్మడిగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించామని మోదీ చెప్పారు. ఆవిష్కరణల దేశం భారత్: మేక్రాన్ కృత్రిమ మేధ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి కీలక రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య నిజమైన భాగస్వామ్యం ఉందని ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చెప్పారు. భారత్ ఒక ఆవిష్కరణల దేశమని ప్రశంసించారు. ‘భారత్ ఇన్నోవేట్స్’ప్రోగ్రామ్లో ఆయన మాట్లాడారు. ‘మేక్–ఇన్–ఇండియా’ను గౌరవిస్తున్నామని తెలిపారు. ఇందులో వివిధ రంగాల్లో ఫ్రాన్స్ ఇందులో భాగస్వామిగా ఉందని వివరించారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్ల రంగంతో సహా పౌర అణు ఇంధన రంగంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.‘భారత్ ఇన్నోవేట్స్’లో స్టార్టప్ల ఎగ్జిబిషన్ను మోదీ, మేక్రాన్ తిలకించారు. నూతన ఆవిష్కర్తలు, పరిశోధకులు, వ్యాపారవేత్తలు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, మెడ్టెక్, క్లీన్ ఎనర్జీ తదితర రంగాలకు చెందిన స్టార్టప్లు ఇందులో పాల్గొన్నాయి. గతంలో ఇండియాలోని జైపూర్లో జరిగిన ఆర్ట్ రెసిడెన్సీకి హాజరై, భారతీయ సంస్కృతి, కళల నుంచి స్ఫూర్తి పొందిన ఇద్దరు ఫ్రెంచ్ కళాకారులు తయారు చేసిన కళాకృతులను ‘భారత్ ఇన్నోవేట్స్’లో ప్రదర్శించగా మోదీ, మేక్రాన్ తిలకించారు. -
‘మా గోస వినండి .. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది’
గల్ఫ్ దేశాల్లో భారతీయ నౌకలనే టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని ఇరాన్లో వాణిజ్య నౌకలపై పనిచేస్తున్న భారత నౌకాదళ కార్మికులు వాపోతున్నారు. అమెరికా సైనిక దాడులలో తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల ఒమన్ తీరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృత్యువాత పడగా, ఆ భయానక వాతావరణం ఇంకా కొనసాగుతుందని పలువురు భారత నౌకాదళ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.భారతీయ నావికులను తీసుకువెళ్తున్న నౌకలపై పదేపదే దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. కొనసాగుతున్న దాడుల మధ్య తాము ఆ ప్రాంతంలో చిక్కుకుపోయామని, అసురక్షిత పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ఆపదలో ఉన్న భారతీయ నావికుల పరిస్థితిని వివరించారు. ‘ మేము ఇరాన్లో ఉన్నాము, ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై మాత్రమే దాడులు జరుగుతున్నాయి. మమ్మల్ని మాకు సంబంధంలేని యుద్ధంలోకి ఎందుకు లాగుతున్నారు? మేము సైనిక సిబ్బంది కాదు. మేము కాంట్రాక్టులపై పనిచేస్తున్న నావికులం. మేము చమురును తీసుకువస్తూ, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తున్నాం’ అని వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ సిబ్బందిలో ఒకరు మాట్లాడుతూ.. ‘ మేము సైనికులం కాదు. మేము కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి వస్తాం. అలాంటప్పుడు మాపై ఎందుకు దాడి చేస్తున్నారు? మా తప్పేంటి?" అని ప్రశ్నించారు. ఇటీవల దాడికి గురైన ఒక నౌకలో తాను గతంలో పనిచేశానని, ఆ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా ఆ నౌకాదళంలోని మరో కాంట్రాక్ట్ కార్మికుడు ప్రస్తావించాడు. We are in Iran. Only Indian ships are being attacked by the US . We are not military personnel . Why are you dragging us into your conflict ?Distress call from Indian seafarers in Iran .pic.twitter.com/yBI8BjvV4w— Surbhi (@SurrbhiM) June 14, 2026 -
ఈ ఎక్స్ప్రెస్ ఆగేదేలేదు: ఫ్రాన్స్లో మోదీ
పారిస్: ఫ్రాన్స్లో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. రెండు దేశాలు ఉమ్మడి విలువలు, ఉమ్మడి ప్రయోజనాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం భద్రత నుంచి స్థిరమైన అభివృద్ధి వరకు విస్తరించిందని ప్రధాని మోదీ అన్నారు. “ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్దే. ఈ ‘రిఫార్మ్ ఎక్స్ప్రెస్’ ఆగదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. స్టార్టప్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. భారత్తో కలిసి పనిచేయండి. ప్రపంచం కోసం సాంకేతికను అభివృద్ధి చేయండి. భారత్ వేగంగా, విస్తృత స్థాయిలో ఆవిష్కరణలు చేస్తోంది. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణలు చేస్తోంది. ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తోంది.సాంకేతికత, ఆవిష్కరణలు, విధానాలు అన్నీ మనుషుల అవసరాలు, సంక్షేమం, జీవన నాణ్యతను మెరుగుపరచడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నాం. ఆవిష్కరణ భారత్ డీఎన్ఏలో ఉంది. గత 12 ఏళ్లలో భారత్ బలమైన ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించింది.భారత్-ఫ్రాన్స్ మధ్య ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. ఇందులో నమ్మకం, ఆవిష్కరణ, స్ఫూర్తి, ఉమ్మడి దార్శనికత ఉన్నాయి. భారత్ యువ ఆవిష్కర్తలు మానవాళి మొత్తానికి ఉపయోగపడే వాటిని కనుగొంటున్నారు” అని ప్రధాని మోదీ చెప్పారు.భారత్పై మెక్రాన్ ప్రశంసల జల్లుఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత్ ఆవిష్కరణ వ్యవస్థను ప్రశంసించారు. భారత్ తమ దేశంలో నిర్వహించిన తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.“భారత్ ఆవిష్కరణలు చేస్తోందా లేదా అన్నది ప్రశ్న కాదు. భారత్తో కలిసి ఎవరు ఆవిష్కరణలు చేస్తారు అన్నదే అసలు ప్రశ్న” అని మాక్రాన్ అన్నారు. భారత్కు చెందిన ప్రముఖ స్టార్టప్లు, ఆవిష్కర్తలకు ఆతిథ్యం ఇవ్వడం ఫ్రాన్స్కు గర్వకారణమని చెప్పారు.భారత్ సాంకేతిక విజయాలను ప్రస్తావిస్తూ చంద్రయాన్ - 3 ల్యాండింగ్ విజయాన్ని ఉదాహరణగా చూపించారు. ఆ మిషన్ భారత్ ఆవిష్కరణ శక్తి, అమలు సామర్థ్యం, పారిశ్రామిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిందని అన్నారు. “పరిశోధన, ఆవిష్కరణ, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా ముందుకెళ్తోంది. ప్రపంచ ఆవిష్కరణ నాయక దేశంగా అవతరిస్తోంది” అని మాక్రాన్ చెప్పారు.కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పు వంటి కీలక రంగాల్లో భారత్-ఫ్రాన్స్ మధ్య నిజమైన భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర అణుశక్తి రంగంలో, ముఖ్యంగా చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్ల విషయంలో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. -
యుద్దంలో పాక్ ఓడిపోతే అదే చేయాలి
తిరువనంతరపురం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో చర్చలు జరపాలని RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గతంలో చేసిన వ్యాఖ్యలు సమర్ధిస్తున్నానని తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ ఇలా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ "మనం హిట్లర్ లాంటి వాళ్లం కాదు, అది మన స్వభావం కూడా కాదు. ఒకవేళ భవిష్యత్తులో జరిగే యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోతే.. అక్కడ ఉన్న ప్రజలను భారత్లో భాగం చేయడమో లేదా వారు ప్రశాంతంగా జీవించేలా చూడడమో చేయాలి. అందుకోసం వారితో చర్చలు జరిపే మార్గాలను (తలుపులను) ఎప్పుడూ తెరిచే ఉంచాలి" అని భగవత్ పేర్కొన్నారు. అన్యాయాన్ని, నియంతృత్వాన్ని అంతమొందించాలని అదే సమయంలో మంచిని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.పాకిస్తాన్లో మారుతున్న ఆలోచనలుదేశ విభజన జరగడం తప్పని భావించే ప్రజలు పాకిస్తాన్లో చాలా మంది ఉన్నారన్నారు. అక్కడ ఉన్న పలువురు జర్నలిస్టులు కూడా ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారని, 'రెండు దేశాల సిద్ధాంతం తప్పని, కలిసి ఉంటేనే బాగుండేదనే భావన అక్కడ అంతర్గతంగా బలంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏ దేశంతోనైనా విదేశీ సంబంధాల విషయంలో ఆర్ఎస్ఎస్కు విడిగా ఎలాంటి ప్రత్యేక విధానాలు ఉండవని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకే సంఘ్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ, అత్యంత అపార్థానికి గురైన సంస్థ కూడా ఇదేనని వ్యాఖ్యానించారు. యూనిఫామ్ వేసుకుని చేసే రూట్ మార్చ్లను చూసి కొందరు దీనిని పారామిలిటరీ సంస్థ అనుకుంటారని, వ్యాయామాలు చూసి వ్యాయామశాల అనుకుంటారని, కానీ బయట నుండి చూస్తే సంఘ్ అర్థం కాదని, దానిని లోపలికి వచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన కోరారు. -
మిత్రం దేశం ఇలా చేస్తుందా.? అమెరికాపై థరూర్ ఆగ్రహం
సాక్షి, ఢిల్లీ: ఇటీవల ఒమన్ తీరంలో అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు మృతిచెందిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఒమన్ దాడిలో భారతీయ నావికుల మృతిపై 'మిత్రదేశం' అమెరికా సంతాపం తెలపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో భారతీయ సిబ్బంది మరణించిన ఘటనపై అమెరికా స్పందించిన తీరు సరైంది కాదని విమర్శించారు.శశిథరూర్ మాట్లాడుతూ.."ఈ అధికారిక అమెరికా ప్రకటనను చదవడం చాలా షాకింగ్గా ఉంది. అమాయక భారతీయ ప్రాణాలు కోల్పోవడంపై ఇందులో ఎలాంటి విచారం లేదా సంతాపం లేదు. ఒక 'మిత్రదేశం', వ్యూహాత్మక భాగస్వామి ఇంత ఘోరమైన ఉదాసీనతను ఎలా ప్రదర్శిస్తుంది?" అని ఎక్స్ వేదికగా వాషింగ్టన్ని ప్రశ్నించారు.ఒకవేళ ఆ నౌక నిబంధనలను పాటించకుండా ఉన్నా.. ఆ వాణిజ్య నౌకపై దాడులు కాకుండా ఇతర మార్గాల ద్వారా ఎందుకు ఆపలేకపోయారని అడిగారు. సాధారణ సిబ్బంది ప్రాణాలను బలిగొనేలా క్షిపణులను ప్రయోగించకుండా, ఒక నౌక యొక్క ప్రొపల్షన్ (నడిచే వ్యవస్థ) లేదా స్టీరింగ్ను మాత్రమే నిలిపివేయడం సాధ్యం కాదా?" అని ఆయన ప్రశ్నించారు.ట్రంప్ వివరణ కాగా ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే వివరణ ఇచ్చారు. ఈ దాడులు జరిపింది. ఇరాన్ అని వాటిని ఎట్టిపరిస్థితుల్లో ఊపేక్షించేది లేదన్నారు.మార్కో రూబియోతో జైశంకర్ ఫోన్ఒమన్ గల్ఫ్లో అమెరికా జరిపిన సైనిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన అంశాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడారు. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా కేవలం మూడు రోజుల వ్యవధిలో అమెరికా మూడు సార్లు భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న నౌకలపై దాడి చేసింది. ఇందులో రెండు సార్లు భారతీయ నావికులను రక్షించగా ఒకసారి దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై న్యూఢిల్లీ ఇప్పటికే వాషింగ్టన్కు తన తీవ్ర అభ్యంతరాలను, ఆందోళనను తెలియజేసింది. -
అన్ని లక్షల కోట్లు ఉంటేనా..!!!
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టండి... లక్ష కోట్లు అవుతుంది. జూన్ పదమూడున ఒక డాలర్ మారకం విలువ రూ. 95.1 అంటే.. లక్ష కోట్ల డాలర్లు 95,20,990,00,00,000 రూపాయలకు సమానం! కళ్లు చెదిరే అంకె ఇది. స్పేస్–ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తొలి ఐపీఓతో... దీనికంటే రెండు రెట్ల కంటే ఎక్కువే సంపాదించాడు. ఇంత డబ్బుతో భారత్లో ఎన్ని గొప్ప గొప్ప పనులు చేయవచ్చునంటే...రహదారులు... దేశంలోని జాతీయ రహదారుల విస్తరణకు ఉద్దేశించిన భారత్మాలా పరియోజనకు సుమారు పది లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఐపీఓ ద్వారా 2.1 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు 199 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయనుకుంటే.. దేశంలో ఉన్న జాతీయ రహదారులన్నింటినీ మళ్లీ తాజాగా నిర్మించడమే కాదు.. ఏకంగా ఆరేళ్లపాటు ఏటికేడాదీ తాజాగా కొత్త రోడ్లు వేస్తూనే ఉండవచ్చు. 2025 నాటి అంచనాల ప్రకారం దేశంలో సుమారు 145,000 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉన్నాయి. నాలుగు లేన్ల రహదారి కిలోమీటర్ మేర నిర్మించేందుకు దాదాపు రూ.20 కోట్లు అవుతుందని అంచనా. స్మార్ట్ సిటీలు... నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా వంద స్మార్ట్ సిటీల ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. స్పేస్–ఎక్స్ ఐపీఓ డబ్బులతో వీటిల్లో 65 నగరాలను అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లతో అభివృద్ధి చేయవచ్చు. ఐదు కోట్ల మందికి ‘న్యాయ్’... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ న్యాయ్. దేశంలోని మొత్తం ఐదు కోట్ల కుటుంబాలకు నెలకు ఆరువేల రూపాయల చొప్పున నగదు సాయం అందించాలన్నది దీని ఉద్దేశం. అంటే ఒక్కో కుటుంబానికి ఏటా రూ.72 వేలు, మొత్తం రూ.3.6 లక్షల కోట్లు ప్రభుత్వం వద్ద స్పేస్–ఎక్స్ ఐపీఓకు వచ్చినంత సొమ్ము ఉంటే... ఎలాంటి అవాంతరాలు లేకుండా 48 ఏళ్లపాటు పేద కుటుంబాలకు ‘న్యాయ్’అందించవచ్చు. వేల ఏళ్లు ‘ఆయుష్మాన్’... కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వరకూ ఉచిత ఆరోగ్య బీమా కలి్పస్తోంది. ఈ పథకాన్ని స్పేస్–ఎక్స్ సొమ్ముతో ఎంత కాలం నడపవచ్చో తెలుసా? 23,000 ఏళ్లు! ఫుల్ సబ్సిడీతో ఈవీలు... సౌర విద్యుత్తుతో పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఒక గిగావాట్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ లెక్కన రూ.199 లక్షల కోట్లతో 21,750 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఇది ప్రస్తుతం దేశ విద్యుదుత్పత్తి సామర్థ్యానికి ఇరవై రెట్లు ఎక్కువ. కోట్లాది విద్యుత్తు వాహనాలను ఫుల్ సబ్సిడీతో నడిపించవచ్చు. పెట్రోల్, డీజిళ్ల దిగుమతులు దాదాపు శూన్యం చేయవచ్చు. అందరికీ చింతలేని చదువు... స్పేస్ ఎక్స్ ఐపీఓతో వచ్చిన రూ.199 లక్షల కోట్లతో మస్క్ భారత్లో 70 ఏళ్లపాటు అందరికీ ఉచితంగా చదువులు చెప్పవచ్చు. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యకు సుమారు 2.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. ప్రపంచానికి అత్యుత్తమ ఇంజనీర్లను ఇచ్చే ఐఐటీలపై ఖర్చు పెట్టాలనుకుంటే జిల్లాకు ఒకటి చొప్పున ఏకంగా 17,400 ఐఐటీలు ఏర్పాటు చేసేందుకు తగిన సొమ్ము ఐపీఓ ద్వారా మస్క్ చెంతకు చేరింది. – సాక్షి, నేషనల్ డెస్క్రూ. 199 లక్షల కోట్లతో... ⇒ భూమి నుంచి చంద్రుడికి రెండుసార్లు 4 లేన్ హైవే నిర్మించవచ్చు. ⇒ దేశంలోని రోడ్లు (63 లక్షల కిలోమీటర్లని అంచనా) అత్యాధునిక హంగులతో కట్టేయవచ్చు. ⇒ స్వర్ణ చతుర్భుజి (ఢిల్లీ–ముంబై–చెన్నై– కోల్కతా) రహదారిని ఎకాఎకిన 300 సార్లు కట్టవచ్చు. ⇒ బోయింగ్ 737లు నాలుగు వేల కంటే ఎక్కువ కొనుక్కోవచ్చు. ఎయిరిండియా, ఇండిగో, స్పైస్జెట్ల వద్ద ఉన్న వాటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విమానాలు అన్నమాట. ⇒ ఐపీఎల్ టీమ్స్ అన్నింటినీ ఓ యాభై సార్లు కొనేయవచ్చు. ⇒ రోజుకో రూ.కోటి ఖర్చు పెడితే మొత్తం ఖాళీ అయ్యేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. -
బాలిస్టిక్ క్షిపణి అడ్డగింతలో సక్సెస్
న్యూఢిల్లీ: శత్రుసైన్యం ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సాంకేతికతను భారత్ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. దీంతో బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్(బీఎండీ) సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. దీంతో బీఎండీ సాంకేతికతను సాధించిన దేశాల జాబితాలో భారత్ చేరింది. భారతీయ యుద్ధనౌకల మీదకు దూసుకొచ్చే శత్రువుల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించే సాంకేతికతను పరీక్షించామని శనివారం భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులు, శత్రువుల నిఘా, పర్యవేక్షణ విమానాలను అడ్డుకునే సాంకేతికతను బీఎండీగా వ్యవహరిస్తారు. అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు మాత్రమే ఇన్నాళ్లూ ఈ సాంకేతికతను సాధించాయి.‘‘జూన్ 10, 11వ తేదీల్లో పలు దశల్లో బీఎండీ టెక్నాలజీని పరీక్షించాం. ముందే షెడ్యూల్చేసిన లక్ష్యాలను ఛేదించేందుకు దూసుకొచి్చన బాలిస్టిక్ క్షిపణులను ఈ టెక్నాలజీతో అడ్డుకున్నాం’’అని రక్షణ శాఖ తెలిపింది. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) దీనిని పరీక్షించింది. దీంతోపాటే నౌకలను నాశనంచేసే క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకునే మధ్యశ్రేణి క్షిపణి(ఎన్ఏఎస్ఎం–ఎంఆర్)ను తొలిసారిగా విజయవంతంగా పరీక్షించామని రక్షణ శాఖ వెల్లడించింది. భూ ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలోపు ఎత్తులో ఉన్నప్పుడు, 100 కి.మీ.ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న క్షిపణులనూ తమ బీఎండీ సాంకేతికత అడ్డుకుందని రక్షణ శాఖ తెలిపింది.ప్రయోగాలు, పరీక్షలను డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, రక్షణ బలగాల ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. పరీక్షలను విజయవంతం చేసినందుకు డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, రక్షణ దళాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ‘‘శత్రు క్షిపణుల నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునే ఇంటర్సెప్టార్లను విజయవంతంగా పరీక్షించాం. అధునాతన సాంకేతికతతో వీటిని డిజైన్చేసి అభివృద్ధిచేశారు’’అని రాజ్నాథ్ వెల్లడించారు. సంక్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధిచేసి ఆచరణలో పెట్టినందుకు డీఆర్డీవోను మంత్రి ప్రత్యేకంగా అభినందిస్తూ ‘ఎక్స్’లో పోస్ట్పెట్టారు. -
మన మహిళలు రెడీ
బర్మింగ్హామ్: మహిళల వన్డే వరల్డ్ కప్ చాంపియన్ భారత్ తొలి సారి టి20 ప్రపంచకప్ను కూడా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. టోర్నీలో నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ప్రస్తుత ఫామ్, ఓవరాల్గా ఆటగాళ్ల రికార్డులను బట్టి చూస్తే అన్ని రంగాల్లో పాక్కంటే పటిష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్కు ముందు ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లను వారి సొంతగడ్డపై ఓడించిన హర్మన్ప్రీత్ సేన... స్వదేశంలో శ్రీలంకను 5–0తో చిత్తు చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ల చేతుల్లో సిరీస్లు కోల్పోయినా... జట్టు కూర్పులో భాగంగా చేసిన పలు ప్రయోగాల్లో ఈ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇప్పటి వరకు టి20 ప్రపంచకప్లలో పాక్పై భారత్ 6–2తో ఆధిక్యంలో ఉండగా... ఓవరాల్గా టి20ల్లో కూడా భారత్ 13–3తో పైచేయి సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ దూకుడుగా ఆరంభిస్తే భారత్ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. మూడో స్థానంలో యస్తిక భాటియా, భారతి ఫుల్మలిలలో ఎవరికి అవకాశం లభిస్తుందనేది చూడాలి. మిడిలార్డర్లో జెమీమా, హర్మన్ తమ స్థాయికి తగ్గి ప్రదర్శన చేయాల్సి ఉంది. ఎప్పటిలాగే ఫినిషింగ్లో రిచా ఘోష్ మెరుపు బ్యాటింగ్ కనబర్చగల సమర్థురాలు. ప్రధాన పేసర్గా క్రాంతి గౌడ్ ఖాయం కాగా...అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్లలో ఒకరికే రెండో పేసర్గా చాన్స్ లభిస్తుంది. ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, నందిని శర్మ, దీప్తి శర్మలతో భారత్ ఆడటం ఖాయమైంది. మరో వైపు 2024 వరల్డ్ కప్లో భారత్ చేతిలో చిత్తయిన పాక్ జట్టు ఈ సారైనా పోటీనివ్వాలని భావిస్తోంది. జట్టు కెపె్టన్ ఫాతిమా సనా ఆల్రౌండ్ ప్రదర్శనపై జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా బంతి తగలడంతో సనా మోకాలికి గాయమైంది. అయితే ఇది ప్రమాదకరమైందని కాదని, ఆమె బరిలోకి దిగుతుందని పాక్ మేనేజ్మెట్ ప్రకటించింది. సీనియర్ ఓపెన్ మునీబా, గుల్ ఫెరోజా ఎలాంటి ఆటతీరు కనబరుస్తారనేది చూడాలి. పాక్ జట్టులో ఈ సారి కొత్త ప్లేయర్ ఇమాన్ ఫాతిమాపై అందరి దృష్టీ నిలిచింది. అండర్–19 స్థాయినుంచి వచ్చిన ఆమె టి20ల్లో 150కు పైగా స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేయగల సమర్థురాలు. ఫినిషర్గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఇమాన్పై పాక్ ఆశలు పెట్టుకుంది.డానీ వ్యాట్ సెంచరీమహిళల టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ శుభారంభం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్–2 మ్యాచ్లో ఇంగ్లండ్ 87 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 219 పరుగులు చేసింది. మహిళల టి20 ప్రపంచకప్ చరిత్రలో ఒక జట్టు అత్యధిక స్కోరు ఇదే. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ఓపెనర్ డానీ వ్యాట్ (62 బంతుల్లో 105 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగింది. అమీ జోన్స్ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సీవర్ బ్రంట్ (22 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరవడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షిక (39; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్ 4 వికెట్లు పడగొట్టింది.ఆ్రస్టేలియా అదరహో...మాంచెస్టర్: మహిళల టి20 ప్రపంచకప్లో అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్లో ఆసీస్ 65 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా ఫోబ్ లిచ్ఫీల్డ్ (24 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), ఎలైస్ పెరీ (36), వేర్హామ్ (32) మెరుపులతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 172 పరుగులు సాధించగా... దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్లో స్కాట్లాండ్ 40 పరుగులతో ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేయగా, ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. -
పవన శక్తితో పరిష్కారం
ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరుగుతోంది. విద్యుదుత్పాదన కోసం ఉపయోగించే పెట్రో ఇంధనాలు, బొగ్గు వంటి ఇంధనాలు భూతాపం పెరుగుదలకు కారణమవుతున్నాయి. పెట్రో ఇంధనాలతో నడిచే మోటారు వాహనాల వాడకం పెరుగుదల; రకరకాల అవసరాల కోసం అడవుల నరికివేత సహా అనేక కారణాలు భూతాపాన్ని అంతకంతకు పెంచుతున్నాయి.భూతాపాన్ని అరికట్టడానికి పునర్వినియోగ ఇంధనాలపై ప్రపంచం ఈ శతాబ్ది ప్రారంభం నుంచి దృష్టిసారించడం మొదలుపెట్టింది. పునర్వినియోగ ఇంధనాలలో పవన శక్తి కూడా గణనీయమైన పాత్ర పోషిస్తోంది. కర్బన ఉద్గారాలు లేకుండా విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో పవన శక్తి కీలకమైనది. పవన శక్తి ఉత్పాదన సామర్థ్యంలో మన భారతదేశం ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. పవన శక్తి ఉత్పాదన వివరాలను గణాంకాల్లో తెలుసుకుందాం...కొన్ని దేశాలు తమ మొత్తం విద్యుత్ అవసరాలను గణనీయంగా పవన విద్యుత్తు ద్వారానే తీర్చుకుంటున్నాయి. అలాంటి దేశాల వివరాలు గణాంకాల్లో...దేశాల వారీగా మొత్తం విద్యుత్తులో పవనశక్తి వాటా -
భారత్ తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
సాక్షి,ఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను నియమించింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ కాలం జూన్ 30 నుంచి ముగుస్తుంది. ఆరోజే ఆర్మీ చీఫ్గా ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరిస్తారించనున్నట్లు తెలుస్తోంది.ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా ఆయనకు 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు, ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ సేవలందిస్తున్నారు, ఖడక్ వాస్లాలోని ప్రతిష్టాత్మక 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ' (NDA) పూర్వ విద్యార్థి. ఆయన డిసెంబర్ 1986లో ఆయన భారత సైన్యంలో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత ఆర్మీకి సేవలందిస్తున్నారు. విస్త్రతశ్రేణి కమాండ్, స్టాఫ్,లాంటి పలు వ్యూహత్మక బాధ్యతలు నిర్వహించారు. గతంలో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ గతంలో సాయుధ రెజిమెంట్కు, సాయుధ బ్రిగేడ్ తిరుగుబాటు నిరోధక దళానికి కమాండర్గా పనిచేశారు. ప్రతిష్టాత్మక సుదర్శన్ చక్ర కార్ప్స్కు నాయకత్వం వహించారు. ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ జీవోసీగా పని చేశారు. కాగా ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 2024 లో బాధ్యతలు స్వీకరించారు. -
మార్కో రూబియోకు జైశంకర్ ఫోన్.. దాడిపై సీరియస్
న్యూఢిల్లీ: హర్ముజ్ జలసంధిలో ఇటీవల అమెరికా జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్స్పందించారు. ఈ విషయమై ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడినట్లు పేర్కొన్నారు.ఇటీవల హర్ముజ్ జలసంధిలో అమెరికా భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా తరచుగా దాడులకు తెగబడుతుంది. ఈ దాడులలో ముగ్గురు భారతీయులు మృతిచెందారు. అయినప్పటికీ మరోసారి దాడులకు తెగబడింది20 మంది భారతీయ నావికులతో వెళ్తున్న 'గినియా-బిస్సావు' పతాకం గల నౌకపై అమెరికా అటాక్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ భారత్లో అమెరికా అత్యున్నత దౌత్యవేత్త (ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్కు రెండు సార్లు సమన్లు జారీ చేసింది.ఇదిలా ఉండగా తాజాగా ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఎక్స్ ఖాతాలో "ఈ సాయంత్రం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడాను. గల్ఫ్లో అమెరికా నౌకాదళం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించడాన్ని భారతదేశం తీవ్రంగా నిరసిస్తున్నట్లు మరోసారి పునరుద్ఘాటించాను. వాణిజ్య నౌకలపై ఇటువంటి ప్రాణాంతక చర్యలు సమర్థనీయం కావు." అని మాట్లాడినట్లు తెలిపారు.కాగా ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది వరకే వివరణ ఇచ్చారు. ఒమన్ తీరం సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడి చేసింది తాము కాదని.. అది ముమ్మాటికీ ఇరాన్ ఘాతుకమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న( శుక్రవారం) తేల్చిచెప్పారు. హర్ముజ్ జలసంధి నుంచి బయలుదేరిన నౌకలపై ఇరాన్ సైన్యం డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్టుచేశారు. -
పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది నీరు చేరకుండా ఎన్డిఎ (NDA) ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన 'మేధావుల సమావేశం'లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి, సామరస్యాల భాష అర్థం కాని వారికి ఎలా సమాధానం చెప్పాలో తమ ప్రభుత్వానికి బాగా తెలుసని 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ప్రపంచానికి నిరూపించామని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి అండగా నిలిచే వారికి సింధు నదీ జలాలు అంద కుండా చేస్తామని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన రక్తం, నీరు కలిసి ప్రవహించవు అన్న హెచ్చరికను రక్షణ మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేస్తూ, బాధితుల పట్ల కరుణ చూపనివారికి తమ నుంచి నీటిని ఆశించకూడదని చెప్పామన్నారు. ఉగ్రవాదులకు అండగా నిలిచేవారికి, మానవాళికే ముప్పుగా ఉన్నవారికి ఈ జలాలు అందకుండా చేస్తామన్నారు.కాగా సింధు నదీ వ్యవస్థకు చెందిన నదుల జలాల వినియోగానికి సంబంధించి 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం (IWT) కుదిరింది. అయితే గత ఏడాది జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, అంతర్జాతీయ చట్టం ప్రకారం సార్వభౌమ దేశంగా తనకున్న హక్కులను వినియోగించుకుంటూ, సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ నమ్మదగిన, తిరుగులేని రీతిలో మద్దతు ఉపసంహరించుకునే వరకు భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది.అలాగే గత 12 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ, రక్షణ మంత్రి ఆర్టికల్ 370 రద్దు, దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడంలో పురోగతి, జీఎస్టీ (GST) అమలు, దేశవ్యాప్త విద్యుదీకరణ మరియు న్యాయ వ్యవస్థలో సంస్కరణలను ప్రస్తావించారు. ఒకప్పుడు ఉగ్రవాదానికి నిలయంగా ఉన్న కాశ్మీర్, ఇప్పుడు పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో దూసుకుపోతోందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.శ్రీనగర్లోని లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది, అక్కడ తొలిసారిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి, మొహర్రం ఊరేగింపులు ప్రశాంతంగా సాగుతున్నాయి, దశాబ్దాలుగా మూతపడి ఉన్న సినిమా హాళ్లు తిరిగి తెరుచుకుంటున్నాయని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. -
భారత్లో మళ్లీ ‘కుష్టు’ బీభత్సం.. 91 వేలు దాటిన కొత్త కేసులు!
న్యూఢిల్లీ: భారతదేశం 2005లోనే జాతీయ స్థాయిలో కుష్టు వ్యాధి (లెప్రసీ) నిర్మూలన లక్ష్యాన్ని సాధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కుష్టు వ్యాధి కేసుల్లో దాదాపు 50 శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతం కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ వ్యాధికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. వ్యాధి వ్యాప్తిని పూర్తిగా అరికట్టడానికి ఇప్పుడు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.ఐదు రాష్ట్రాల్లో హై-అలర్ట్.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆరాధన పట్నాయక్ ఛత్తీస్గఢ్లోని నవ రాయ్పూర్లో జరిగిన ప్రాంతీయ సమీక్షా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో 23, జార్ఖండ్లో 21, మహారాష్ట్ర ఒడిశాలలో 18 చొప్పున, అలాగే మధ్యప్రదేశ్లో 10 జిల్లాలు అధిక వ్యాప్తి రేటును కలిగి ఉన్నాయి. ప్రతి 10,000 మంది జనాభాకు ఒకరి కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రాల ఉప-జాతీయ స్థాయిలో ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని ఆమె పేర్కొన్నారు.గత ఏడాది 91 వేల కొత్త కేసులుఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 2025-26 కాలంలో దేశంలో ఏకంగా 91,783 కొత్త కుష్టు వ్యాధి కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశంలో వ్యాప్తి రేటు ప్రతి 10,000 మంది జనాభాకు 0.56 గా ఉంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త కేసుల్లో 4.18 శాతం మంది చిన్న పిల్లలు కాగా, 2.12 శాతం మంది రోగులు వ్యాధి నిర్ధారణ సమయానికే ‘గ్రేడ్-2’ వైకల్యంతో బాధపడుతున్నారు. వ్యాధి ముందస్తు గుర్తింపులో లోపాలు, ఆలస్యంగా చికిత్స అందడం వంటి సవాళ్లను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.అడ్డంకులను అధిగమించి.. ఈ మహమ్మారిని పూర్తిగా రూపుమాపేందుకు అంతర్-రాష్ట్ర సహకారం, ముందస్తు రోగ నిర్ధారణ, నిరంతర నిఘా అవసరమని అధికారులు తెలిపారు. కుష్టు వ్యాధి సోకిన వారితో పరిచయం ఉన్న ఆరోగ్యవంతులకు ఒకే మోతాదు ‘రిఫాంపిసిన్’ ఔషధాన్ని అందించడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు. మరోవైపు, నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీల్ వి. గిట్టే మాట్లాడుతూ.. వైకల్య నివారణలో భాగంగా ఇప్పటివరకు 1,591 పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు చేశామని, లక్షకు పైగా ప్రత్యేక మైక్రో సెల్యులార్ రబ్బర్ పాదరక్షలను పంపిణీ చేశామని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ వేట.. వెనిజువెలా డ్రగ్ లార్డ్ హతం -
రోహిత్పైనే దృష్టి
ధర్మశాల: వన్డే వరల్డ్ కప్ వచ్చే ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరగనుండగా... దానికి ముందు భారత జట్టు కనీసం 25 వన్డేలు ఆడనుంది. మెగా టోర్నీ కోసం జట్టును సిద్ధం చేసేందుకు, అందుబాటులో ఉన్న అన్ని రకాల ప్రత్యామ్నాయాలను పరీక్షించేందుకు మేనేజ్మెంట్కు ఇదే సరైన సమయం. ఈ నేపథ్యంలో ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపైనే అందరి దృష్టీ నిలిచింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు ధర్మశాలలో తొలి వన్డే జరగనుంది. ఇటీవల ఐపీఎల్లో ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొని కోలుకున్న రోహిత్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. గాయంతో ఇప్పటికే విరాట్ కోహ్లి సిరీస్ నుంచి తప్పుకోవడంతో రోహిత్ ఆట కీలకం కానుంది. 39 ఏళ్ల రోహిత్ అటు బ్యాటింగ్లో రాణించడంతో పాటు తన ఫిట్నెస్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ తమ ఆఖరి వన్డే సిరీస్లో న్యూజిలాండ్ చేతిలో ఓడగా, రోహిత్ అన్ని మ్యాచ్లలో విఫలమయ్యాడు. సత్తా చాటేందుకు నితీశ్ సిద్ధం... కెపె్టన్ శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ ఓపెనింగ్ చేయనుండగా... కోహ్లికి బదులుగా ఇషాన్ కిషన్ మూడో స్థానంలో దిగవచ్చు. ఆ తర్వాత శ్రేయస్, రాహుల్ స్థానాలు పదిలం కాగా, ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్, సుందర్ ఉంటారు. ఇక్కడి పిచ్ను బట్టి చూస్తే భారత్ ముగ్గురు పేసర్లతో ఆడనుంది. ప్రసిధ్, అర్ష్ దీప్లతో పాటు మూడో స్థానం కోసం కొత్త ఆటగాడు గుర్నూర్ సింగ్, ప్రిన్స్ యాదవ్ మధ్య పోటీ ఉంది. ఇద్దరిలో ఒకరు అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయం. ఆరో స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తన చోటును సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఐపీఎల్లో నిలకడగా రాణించిన నితీశ్ తన గత వన్డేలో అర్ధ సెంచరీ కూడా సాధించాడు. బౌలింగ్లో కూడా పేస్ పదును పెంచుకున్న అతను టి20లను దాటి ఈ ఫార్మాట్లో 10 ఓవర్లు ఎలా వేస్తాడనేది ఆసక్తికరం. హార్దిక్ పాండ్యా పదే పదే గాయాలతో జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో నితీశ్కు ఇది చాలా చక్కటి అవకాశం. 3–0తో ఆధిక్యం... మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు అనుభజ్ఞులైన ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇబ్రహీమ్, గుర్బాజ్, రహ్మత్ షా, హష్మతుల్లా ప్రధాన బ్యాటర్లు కాగా... ఆల్రౌండర్గా అజ్మతుల్లా ఒమర్జాయ్ గత రెండేళ్లలో చాలా బాగా ఆడుతున్నాడు. టెస్టు ఆడని రషీద్ ఖాన్ రాకతో స్పిన్ బలంగా మారగా, ఘజన్ఫర్ కూడా కీలకం కానున్నాడు. ఇరు జట్ల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్. గతంలో ప్రపంచకప్, ఆసియా కప్లలో కలిపి రెండు టీమ్లు 4 మ్యాచ్లలో తలపడగా... భారత్ 3 గెలిచింది. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. -
మరో పతకం రేసులో ధీరజ్
అంటాల్యా: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రెండో పతకం రేసులో నిలిచాడు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ధీరజ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ధీరజ్ 6–2 (29–29, 28–28, 29–30, 29–28, 29–28) సెట్లతో మాసిమిలానో మాండియా (ఇటలీ)పై గెలిచాడు. ఆదివారం జరిగే సెమీఫైనల్లో మోరిట్జ్ వీసెర్ (జర్మనీ)తో ధీరజ్ తలపడతాడు. సెమీఫైనల్లో ధీరజ్ ఓడిపోతే కాంస్యం కోసం పోటీపడతాడు. సెమీస్లో నెగ్గితే స్వర్ణ, రజత పతకాల రేసులో ఉంటాడు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ధీరజ్–కుంకుమ్ జోడీ ఫైనల్కు చేరింది. మరోవైపు పురుషుల, మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు వెన్నం జ్యోతి సురేఖ, తిరుమూరు గణేశ్ మణిరత్నం నిరాశపరిచారు. మూడో రౌండ్లో జ్యోతి సురేఖ 144–146తో టాంజా జెలెన్థిన్ (డెన్మార్క్), గణేశ్ 143–147తో నికో వీనెర్ (ఆ్రస్టియా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
ముగ్గురు భారతీయులు మృతి.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదన్నారు. నౌకలపై దాడి చేస్తుంది ఇరాన్ అని వాటిని అమెరికా అడ్డుకుంటుందన్నారు. హర్ముజ్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల హర్ముజ్లో భారతీయ నౌకలపై జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే.ఇటీవల తరచుగా హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా దాడులు జరిపింది. బుధవారం ఒమన్ సమీప ఎంటీ సెటెబె చమురురవాణా నౌకపై జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించారు. ఒకరోజు తర్వాత మరోసారి భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడి చేసింది. ఒమన్లోని షినాస్ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎంటీ జల్వీర్ నౌక పైనా అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావూ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధవిమానం నుంచి రెండు హెల్ఫైర్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించింది. గత నాలుగురోజుల్లో భారతీయన నౌకలపై దాడి చేయడం ఇది మూడోసారి.ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహించిన భారత విదేశాంగశాఖ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్డిఅఫైర్స్ జేసన్ను పిలిపించి భారత్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయనకు మూడురోజుల వ్యవధిలో రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందించారు. -
పెరిగిన భారత్ బంగారం నిల్వల విలువ
భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో (Forex Reserves) స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ గణనీయంగా పెరిగింది. ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జూన్ 5తో ముగిసిన వారంలో దేశ బంగారం నిల్వల విలువ 1.98 బిలియన్ డాలర్లు పెరిగి 114.58 బిలియన్ డాలర్లకు చేరుకుంది.అదే సమయంలో మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలు 711 మిలియన్ డాలర్లు తగ్గి 681.61 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఫారెక్స్ రిజర్వుల్లో అతిపెద్ద వాటా కలిగిన విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) 2.70 బిలియన్ డాలర్లు తగ్గి 543.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ఎఫ్సీఏలను అమెరికా డాలర్ విలువలో లెక్కిస్తారు. అయితే ఈ నిల్వల్లో యూరో, పౌండ్ స్టెర్లింగ్, జపాన్ యెన్ వంటి ఇతర ప్రధాన కరెన్సీలు కూడా ఉండటంతో, వాటి మారకపు విలువల్లో చోటుచేసుకునే మార్పులు ఎఫ్సీఏపై ప్రభావం చూపుతాయి.గత వారంలో భారత విదేశీ మారక నిల్వలు సుమారు 938 మిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. రూపాయి మారకపు విలువలో అధిక ఒడిదుడుకులు కనిపించినప్పుడు లేదా మార్కెట్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆర్బీఐ ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుంటూ నిల్వలను వినియోగిస్తుంది.ఇటీవల అమెరికా డాలర్ నిల్వలను బలోపేతం చేయడం, రూపాయి స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఎఫ్సీఎన్ఆర్-బీ (FCNR-B) డిపాజిట్ల హెడ్జింగ్ ఖర్చును భరించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.ప్రస్తుతం భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే 95 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన 97 స్థాయితో పోలిస్తే మెరుగైన స్థితిగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో రూపాయి మారకం విలువ 94.70 నుంచి 95.60 మధ్య కదలాడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: టాటా కారు కొనుగోలుదారులకు షాక్! -
బుడ్జోడికి షాక్ ఐర్లాండ్ సిరీస్ డౌటే
-
ఓ డాక్టరమ్మా… ఈ ఎముకల గూడు చెప్పిన పాఠం వింటావా?
పోయినోళ్లందరూ మంచోళ్లే... ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపి గురుతులు అన్నారో సినీకవి. బతికి ఉన్నప్పుడు దక్కని గౌరవం.. మనిషికి చనిపోయాకైనా దక్కుతుందని చెబుతుంటారు. కానీ, ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో ఆ నమ్మకాన్నే ప్రశ్నార్థకం చేసింది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్య వృత్తిలో ఉండి.. మృతదేహాలపై చేసిన ఓ డాక్టర్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. చివరకు తన మాటల తీవ్రత గ్రహించిన ఆమె క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో.. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటన మరణానంతరం కూడా మనిషికి దక్కాల్సిన గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.ఒక కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యురాలు సీజల్ పవార్.. మెడికల్ కాలేజీ రోజుల్లో శవాలపై నిర్వహించే శిక్షణ (అటాప్సీ/కాడేవర్ స్టడీ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ మృతదేహాల ప్రైవేట్ పార్ట్ల గురించి తాను, తన తోటి డాక్టర్లు జోకులు వేసుకునేవాళ్లమని ఆమె మాట్లాడారు. ఆ సమయంలో కమెడియన్ ప్రణీత్ మోర్తో సహా అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు. మాట్లాడింది అమ్మాయి కావడంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అయితే..Sejal pawar doctor by profession talking about how she and her friends make fun of dead bodies about their dick size and made several nasty comments about male reproductive organ pic.twitter.com/q7rfQoi6DJ— Aarohi (@hamlakroo) June 10, 2026మృతదేహాల శరీర భాగాలపై వల్గర్ కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. వైద్య విద్య కోసం తమ శరీరాలను దానం చేసే వారి పట్ల ఇది అవమానకరమని పలువురు అభిప్రాయపడ్డారు. సరిగ్గా.. ఇదే సమయంలో జర్మనీలో జరిగిన ఓ ఘటనను కొందరు ప్రస్తావించారు..ష్లైడ్ అనే చిన్న పట్టణంలో ఉన్న జోహానెస్-స్టుర్మియస్ జిమ్నాసియం స్కూల్ విద్యార్థులు.. కొన్ని దశాబ్దాలుగా తమకు అనాటమీ పాఠాలు అర్థం కావడంలో సహకరించిన అస్థిపంజరానికి అత్యంత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. అది భారత్కు చెందిన ఓ మహిళ అస్థిపంజరం కావడం.అప్పటిదాకా అదొక ప్రతీకాత్మక నమునా(ప్లాస్టిక్)గా భావించిన విద్యార్థులు.. అసలు విషయం అర్థమయ్యాక తెగ బాధపడిపోయారు. దశాబ్దాలుగా ప్రయోగశాలలో వేలాడుతున్న ఆ అస్థిపంజరం బ్రిటిష్ పాలనా కాలంలో యూరప్కు తరలించిన వేలాది భారతీయ మృతదేహాల్లో ఒకటిగా గుర్తించారు. ఆ మహిళ అస్థిపంజరానికి "నిరాన్" అని పేరు పెట్టారు. అక్కడితో వాళ్లు ఆగలేదు..ఆ మృతదేహం కేవలం బోధనా సామాగ్రి కాదని.. ఒకప్పుడు ప్రాణం ఉన్న మనిషే కదా అనుకున్నారు. స్కూల్ నిర్వాహకుల్ని ఒప్పించి గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సిబ్బంది సహకారంతో ఓ శవపేటికలో ఆ అస్తికలు ఉంచి గౌరవప్రదంగా సమాధి ఏర్పాటు చేశారు. 2022లో జరిగిందీ ఘటన.అయితే ఒకే సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఘటనలు.. "మరణించిన వారికి మనం ఎంత గౌరవం ఇస్తున్నాం?" అనే ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చాయి.అదొక చీకటి వ్యాపారంజర్మనీలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మరో చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేసింది. బ్రిటిష్ పాలనలో భారతదేశం నుంచి వేలాది అస్థిపంజరాలు, మృతదేహాలు యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి అయ్యాయి. పేదలు, అనాథలు, గుర్తింపు లేని వ్యక్తుల మృతదేహాలు ఎక్కువగా ఈ వ్యాపారంలో భాగమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వైద్య విద్య, పరిశోధనల పేరుతో సాగిన ఈ వ్యాపారం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొనసాగి, 1985లోనే పూర్తిగా నిషేధించబడింది.ఆ గౌరవం ఎక్కడ?..ఈ చర్చ మధ్య మరో విషాద ఘటనను కూడా చాలామంది గుర్తుచేస్తున్నారు. ఒడిశాలో తన సోదరి మరణాన్ని నిరూపించడానికి బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో.. ఓ వ్యక్తి సమాధి తవ్వి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన ఘటన దేశాన్ని కలచివేసింది. అలాగే.. ఆస్పత్రి మార్చురీల్లో నెలల తరబడి గుర్తింపు లేకుండా ఉండిపోయే మృతదేహాలు, అంబులెన్స్ లేక భుజాలపై మృతదేహాలను మోసుకెళ్లే పేద కుటుంబాలు, శరీరదానంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు.. ఈ ఘటనలు అన్నీ ఒకే ప్రశ్నను మిగులుస్తున్నాయి. మనం నిజంగా మరణించిన వారిని గౌరవిస్తున్నామా? లేక వారి గుర్తింపును, మానవత్వాన్ని కేవలం అవసరాలకు మాత్రమే పరిమితం చేస్తున్నామా?.. జీవించి ఉన్న సమాజం, మరణించినవారికి ఇచ్చే గౌరవంలోనే తన నాగరికతను ప్రతిబింబిస్తుంది. ఆ గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అక్కడ మానవత్వం కూడా మెల్లగా మాయమవుతుంది. -
కొంప ముంచిన వర్షం.. అఫ్గాన్ చేతిలో ఓటమి..


