breaking news
India
-
ట్రంప్ టారిఫ్ల కొట్టివేత అంశం: భారత్ స్పందన
న్యూఢిల్లీ: అధ్యక్ష హోదాలో డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో భారత్ స్పందించింది. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత ట్రంప్ ప్రెస్కాన్ఫరెన్స్లో మాట్లాడిన పరిణామాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికా సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును మేము గమనించాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయంపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమెరికా ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించింది. ఈ పరిణామాలన్నింటినీ వాటి ప్రభావాలను అర్థం చేసుకోవడానికి మేము అధ్యయనం చేస్తున్నాము. దానిని భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. అవసరమైన ప్రతిస్పందనను వాణిజ్య మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇస్తాయి’అని తెలిపారు.కాగా, పలు దేశాలపై విధించిన సుంకాల అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ల్రంప్ విధించిన సుంకాలను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అమెరికా అధ్యక్షుడికి కానీ, వైట్హౌస్కు కానీ సుంకాలు విధించే అధికారం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. వాణిజ్య పరమైన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధకారం కేవలం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉందని పేర్కొంది. దాంతో డొనాల్డ్ ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇవీ చదవండిట్రంప్ టారిఫ్లు కొట్టివేత.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిజంగా ఇది సిగ్గు చేటు.. సుప్రీం కోర్టు తీర్పుపై ట్రంప్ ఫైర్ -
మోదీ స్నేహ హస్తం.. బంగ్లాదేశ్ స్పందన
ఢాకా: బంగ్లాదేశ్ లో తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులైనా గడవక ముందే భారత్- బంగ్లా సంబంధాల్లో కీలక పురోగతి ఏర్పడింది. ఇరు దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది డిసెంబర్ లో నిలిపివేసిన వీసా సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.భారత్, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు గత రెండేళ్లుగా తీవ్రంగా క్షీణించిన సంగతి తెలిసిందే. షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిన నాటి నుంచి బంగ్లాదేశ్ భారత్ పై తీవ్ర అక్కసు వెల్లగక్కింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. అంతేకాకుంగా ఆ దేశంలోనే మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. దీంతో గతేడాది డిసెంబర్ లో భారత్ అదే విధంగా బంగ్లా పరస్పరం వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఇటీవలే అక్కడ ఎన్నికలు జరిగి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారం చేపట్టడం.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తారిఖ్ రెహ్మాన్ అభినందనలు చెప్పి భారత్ రావాల్సిందిగా కోరడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంత చల్లారినట్లయింది.అయితే బంగ్లాదేశ్ సైతం భారత్ తో స్నేహం హస్తం కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారతీయులకు నిలిపివేసిన వీసా సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. నిన్న శుక్రవారం ఆ దేశ హైమిషనరేట్ కార్యాలయం భారత్ కు వీసాల నిలిపివేతను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటక, మెడికల్, బిజినెస్, వర్క్ లతో పాటు ఇతరాత్ర వీసాలకు సంబంధించి విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. దీంతో భారత్ తో తిరిగి సత్సంబంధాలు నెలకొల్పడానికి తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలుస్తోంది.అయితే ఇదివరకే ఈ అంశంలో భారత్ సానుకూలంగా స్పందించింది. సిల్హెట్లోని భారత సీనియర్ కాన్సులెట్ అధికారి అనిరుద్ధ దాస్ మాట్లాడుతూ.. ‘భారత్ త్వరలోనే అన్ని వీసా సేవలను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం మెడికల్, డబుల్-ఎంట్రీ వీసాలు ఇస్తున్నారు. త్వరలో ట్రావెల్ వీసాలు సహా అన్నింటిని తిరిగి ప్రారంభించనున్నారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక బంధంతో నడుస్తాయి. రెండు దేశాల ప్రజలే ఈ స్థిరమైన, సానుకూల సంబంధాల ప్రధాన భాగస్వాములు’ అని అన్నారు. దీనిపై బంగ్లాదేశ్ సైతం పాజిటివ్ గా స్పందించడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇజ్రాయెల్తో ప్రధాని మోదీ బిగ్ డీల్?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ముఖచిత్రంపై భారత్, ఇజ్రాయెల్ దేశాల మైత్రి మరో చరిత్రాత్మక ఘట్టానికి చేరుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 25 నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, లాంగ్ రేంజ్ స్టాండ్-ఆఫ్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్ల ఉమ్మడి అభివృద్ధిపై ఈ పర్యటనలో కీలక చర్చలు జరగనున్నాయి.ఈ పర్యటనలో భద్రతా సహకారంపై ఇరు దేశాలు అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోనున్నప్పటికీ, తక్షణమే ఎటువంటి రక్షణ కొనుగోలు ఒప్పందాలు జరగవని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య రక్షణ సహకారం అనేది నిరంతర ప్రక్రియ. రాబోయే ఏళ్లలో సుమారు 10 బిలియన్ డాలర్ల మేర ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ తన అత్యంత రహస్యమైన, అత్యాధునిక రక్షణ సాంకేతికతలను భారత్తో పంచుకోవడానికి అంగీకరించడం గమనార్హం. గత నవంబర్లో రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ ఇజ్రాయెల్ పర్యటనలో కుదిరిన ప్రాథమిక ఒప్పందాలే ఈ విస్తృత సహకారానికి పునాదిగా నిలిచాయి.ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'మిషన్ సుదర్శన్'లో భాగంగా శత్రువుల సుదూర శ్రేణి క్షిపణుల నుండి దేశాన్ని రక్షించేందుకు ఇజ్రాయెల్తో కలిసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోంది. బాలిస్టిక్ క్షిపణి రక్షణలో ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. లాంగ్ రేంజ్ ‘ఆరో’, మీడియం రేంజ్ ‘డేవిడ్స్ స్లింగ్’ షార్ట్ రేంజ్ ‘ఐరన్ డోమ్’ వ్యవస్థలు అత్యంత ప్రభావవంతమైనవి. గత ఏడాది జూన్లో ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ 98 శాతం విజయవంతంగా అడ్డుకోవడమే ఈ సామర్థ్యానికి నిదర్శనం. రక్షణ రంగంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం, స్వచ్ఛమైన తాగునీరు మరియు క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాలలో కూడా ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్.. ఆలయాలకు భద్రత పెంపు -
వాణిజ్య ఒప్పందంపై త్వరలో సంతకాలు: గోర్
న్యూఢిల్లీ: భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై అతి త్వరలో సంతకాలు జరుగుతాయని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అవి బహుశా ఈ వారమే జరగవచ్చని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల నడుమ మధ్యంతర ఒప్పందం కుదరడం నిజంగా గొప్ప విషయమన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ ఇప్పటికే తమకు స్పష్టమైన హామీ ఇచి్చందని ఆయన చెప్పారు. వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసేలా భారత్తో అమెరికా చురుగ్గా చర్చలు జరుపుతోందని సంకేతాలిచ్చారు. అయితే చమురు సంబంధిత అంశాలపై ప్రస్తుతం ఇంతకంటే లోతుగా చెప్పదలచుకోలేదన్నారు. శుక్రవారం గోర్ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘ఒక్క భారత్ అనే కాదు, రష్యా నుంచి ఏ దేశమూ చమురు కొనుగోలు చేయొద్దన్నదే అమెరికా స్పష్టమైన వైఖరి. ఈ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టతతో ఉన్నారు. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలతో శాంతి చర్చలకు పూర్తిస్థాయిలో మంగళం పాడాలని ఆయన నిర్ణయించుకున్నారు’’అని తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అతి త్వరలో భారత్లో పర్యటించనున్నట్టు గోర్ చెప్పారు. రష్యా చమురు కొనుగోళ్లపై గోర్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్తో ప్రస్తావించగా, దీనిపై గతంలో విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. చమురు విషయంలో నిత్యం ఒకటికి మించిన దిగుమతి మార్గాలను భారత్ అందుబాటులో ఉంచుకుంటుందని గత వారం మిస్రీ స్పష్టం చేయడం తెలిసిందే. ఈ విషయంలో జాతీయ ప్రయోజనాలకే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన చెప్పారు. ఒప్పందంపై 23 నుంచి చర్చలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం తాలూకు చట్టపరమైన అంశాల ఖరారుకు భారత్, అమెరికా ఉన్నతాధికారుల బృందం సోమవారం చర్చలు జరపనుంది. ఇవి అమెరికాలో మూడు రోజుల పాటు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత బృందానికి కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ సారథ్యం వహిస్తున్నారు. చర్చలు పూర్తయి అంతా కొలిక్కి వచ్చిన అనంతరం ఒప్పందంపై మార్చిలో సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు. -
హిందూ మహాసముద్ర సారథిగా భారత్
సాక్షి, విశాఖపట్నం: సముద్ర భద్రత, శాంతి స్థాపనలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నంలో జరుగుతున్న 9వ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం (అయాన్స్) చీఫ్ ఆఫ్ నేవల్స్ కాంక్లేవ్లో భారత నౌకాదళం హిందూ మహాసముద్ర సారథిగా బాధ్యతలు స్వీకరించింది. హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాల మధ్య సమన్వయం, సముద్ర భద్రతే లక్ష్యంగా విశాఖపట్నంలో అయాన్స్ కాంక్లేవ్ని శుక్రవారం భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్యానికి హిందూ మహాసముద్ర ప్రాంతం వెన్నెముక వంటిదని చెప్పారు. ఇక్కడ శాంతిని కాపాడటం అన్ని దేశాల సామూహిక బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా సముద్రపు దొంగల బెడద, ప్రకృతి వైపరీత్యాలు, అక్రమ రవాణా వంటి ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సమాచార మార్పిడి చాలా కీలకమని సూచించారు. సురక్షితమైన, సుస్థిరమైన హిందూ మహాసముద్రం దిశగా భారత్ ఎప్పుడూ ముందుంటుందని, పొరుగు దేశాలకు భద్రత భాగస్వామిగా తనవంతు సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. ఈ కాంక్లేవ్ ద్వారా సభ్యదేశాల మధ్య పరస్పర నమ్మకాన్ని పెంచుకోవడంతో పాటు, సముద్రతీర రక్షణలో సరికొత్త సాంకేతికతను పంచుకోవాలని పిలుపునిచ్చారు. సదస్సులో భాగంగా అయాన్స్ చైర్మన్ బాధ్యతల్ని భారత్కు అప్పగిస్తూ తీర్మానం చేశారు. ఈ విషయాన్ని భారత నౌకాదళ డిప్యూటీ చీఫ్ వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి అధికారికంగా ప్రకటించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, భద్రత కోసం భారత్ మరింత క్రియాశీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. అయాన్స్ అధ్యక్షుడిగా భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ త్రిపాఠీ రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.వివిధ దేశాల నేవీ చీఫ్లతో చర్చలురెండు సెషన్లలో జరిగిన సదస్సులో కీలక అంశాలపై ఆయా దేశాల నేవీ చీఫ్లు చర్చలు జరిపారు. ముఖ్యంగా సముద్ర గస్తీ, మానవతా దృక్పథంతో చేపట్టే సహాయక చర్యలు, సముద్ర పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఒప్పందాలపై చర్చించారు. నెదర్లాండ్స్ రాయల్ నేవీ డిప్యూటీ కమాండర్ రోబ్ డీవిట్ మాట్లాడుతూ హిందూ మహాసముద్ర ప్రాంతం యూరప్ ఆర్థికవ్యవస్థకు ఎంతో కీలకమన్నారు. సముద్రపు దొంగల బెడద తగ్గుముఖం పట్టినప్పటికీ, కొత్త ప్రాంతాల్లో తలెత్తుతున్న సవాళ్లు ఆందోళన కలిగిస్తున్నాయని, అన్ని దేశాల నౌకాదళాలు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారానే వీటిని అరికట్టగలమని చెప్పారు. ఈ కాంక్లేవ్లో మొత్తం 25 సభ్యదేశాలు, 9 పరిశీలక దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పాక్స్ సిలికాలోకి భారత్
న్యూఢిల్లీ: అమెరికా ఏర్పాటు చేసిన వ్యూహాత్మక పాక్స్సిలికా కూటమిలో భారత్ శుక్రవారం సభ్యదేశంగా చేరింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సు ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి జాకబ్ హెల్బర్గ్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పాల్గొన్నారు. అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ వినియోగానికి సంబంధించి విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ఈ కూటమి ముఖ్యోద్దేశం. భారత్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. మోదీ సర్కారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని హెల్బర్గ్ అభినందించారు. ‘‘అరుదైన ఖనిజ సరఫరా వ్యవస్థలపై ప్రస్తుతం కొందరి గుత్తాధిపత్యమే సాగుతోంది. ఇది ఆర్థిక ఒత్తిళ్లతో పాటు కొన్నిసార్లు బెదిరింపులకు కూడా దారి తీస్తోంది’’అంటూ చైనా తీరును ఉద్దేశించి ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘మా సన్నిహిత మిత్ర దేశాలు నిత్యం ఇలాంటి బ్లాక్మెయిలింగ్ల బారిన పడుతుంటే మేం చూస్తూ ఉండిపోవాల్సి వస్తోంది. అవి ప్రగతి కోసం తమ సార్వ¿ౌమత్వాన్ని కూడా పణంగా పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ దుస్థితిని నివారించడంలో సిలికా కూటమిది కీలక పాత్ర కానుంది. ఎందుకంటే ఆర్థిక భద్రతే దేశ భద్రత’’అని అభిప్రాయపడ్డారు. కూటమి మరింత బలోపేతం: గోర్ 21వ శతాబ్దపు ఆర్థిక, సాంకేతిక ప్రపంచ క్రమాన్ని పాక్స్సిలికా కూటమి పునర్ నిర్వచిస్తుందని గోర్ జోస్యం చెప్పారు. భారత్ చేరికతో ఈ కీలక కూటమి మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘‘కూటమిలో భారత్ చేరిక కేవలం లాంఛనప్రాయం కాదు. అది అత్యంత ఆవశ్యకమైన చర్య. అరుదైన ఖనిజాలు, ఏఐ రంగాల్లో ప్రత్యర్థులను సవాలు చేయగల అపారమైన నైపుణ్యం భారత్ సొంతం. కనుక టెక్నాలజీ రంగంలో భారత్, అమెరికా పరస్పర సహకారం అత్యంత కీలకం. రానున్న కొన్నేళ్లలో ఏఐ ఇన్నొవేషన్ తదితరాల్లో ఇది కీలక పాత్ర పోషించగలదు’’అని ఆయన చెప్పారు. ‘‘ప్రత్యర్థులు నియమాలకు కట్టుబడతారని ఆశించడం అత్యాశే అవుతుంది. శాంతి సాధన బలం, శక్తి సామర్థ్యాలతోనే సాధ్యం. ఈ విషయం భారత్కూ బాగా తెలుసు’’అని గోర్ పేర్కొన్నారు. ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మొదలుకుని పాక్స్సిలికా దాకా భారత్, అమెరికా పరస్పర సహకారానికి ఆకాశమే హద్దు. నేను రాయబారిగా ఉండే మూడేళ్ల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేస్తా’’అని తెలిపారు. పలు అడ్డంకులను అధిగమించి, అపోహలను తొలగించుకుని మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. కీలక నిర్ణయం: వైష్ణవ్ పాక్స్సిలికా కూటమిలో చేరికను భారత్ తీసుకున్న కీలక నిర్ణయంగా కేంద్ర మంత్రి వైష్ణవ్ అభివరి్ణంచారు. ఏఐ, అరుదైన ఖనిజాల రంగంలో సురక్షిత భవితకు ఇది బాటలు పరుస్తుందని అభిప్రాయపడ్డారు. సెమీ కండక్టర్ రంగంలో భారత్ శక్తి సామర్థ్యాలను నానాటికీ మరింతగా పెంచుకుంటోందని గుర్తు చేశారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతన నానోమీటర్ చిప్స్ను భారత యువ ఇంజనీర్లే రూపొందిస్తున్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు ప్రస్తుతం కనీసం 10 లక్షల మంది వృత్తి నిపుణులు అవసరం. భారత్కు అతి పెద్ద అవకాశమిది’’అని పేర్కొన్నారు. ఏమిటీ పాక్స్సిలికా? ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, కంప్యూటర్ చిప్స్ మొదలుకుని స్వచ్ఛ ఇంధనం, ఏరో స్పేస్, ఆటోమోటివ్, రక్షణ రంగాల్లో అరుదైన ఖనిజాల పాత్ర అత్యంత కీలకమన్నది తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా వాటి నిల్వలు ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అపారంగా ఉన్నాయి. దాంతో ఆ ఖనిజాల ఉత్పత్తి, ఎగుమతులపై కొన్నేళ్లుగా ఆ దేశ గుత్తాధిపత్యమే సాగుతోంది. అరుదైన ఖనిజాల వెలికితీతలో చైనా ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఇప్పటిదాకా కనీసం 2.7 లక్షల టన్నుల ఖనిజాలను వెలికితీసినట్టు అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 57 వేల టన్నుల అరుదైన ఖనిజాలను దిగుమతి చేసుకుంటే అందులో చైనా వాటాయే ఏకంగా 97 శాతం! ఏఐ ఆధారిత ప్రపంచంలో కీలకమైన ఈ అరుదైన ఖనిజాల తవ్వకం, వెలికితీత, అభివృద్ధి, సరఫరాలపై అదుపు సాధించేవారిదే పై చేయిగా నిలవనుంది. దాంతో ఈ విషయంలో చైనా పెత్తనానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా గత డిసెంబర్లో పాక్స్సిలికా కూటమిని అమెరికా ఏర్పాటు చేసింది. పాక్స్ అంటే శాంతి, సుస్థిరత, ప్రగతికి సూచిక. సిలికాన్కు సిలికా ముడి ఖనిజమన్నది తెలిసిందే. అరుదైన ఖనిజాలకు సంబంధించి సభ్యదేశాలన్నీ ఆధారపడదగ్గ సరఫరా వ్యవస్థను నిర్మించుకోవడమే దీని లక్ష్యం. ఆ ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, సరఫరా, సాఫ్ట్వేర్ అప్లికేషన్లలో వాటి వినియోగం... ఇలా అన్ని దశల్లోనూ కూటమి దేశాలు సమన్వయంతో పని చేయాలన్నది ఉద్దేశం. ఆ్రస్టేలియా, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, యూఏఈ, సింగపూర్, ఖతార్ ఇందులో సభ్యులుగా చేరాయి. భారత్లో ఏకంగా 85.2 లక్షల టన్నుల అరుదైన ఖనిజ నిక్షేపాలున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో పాక్స్సిలికా కూటమిలో చేరేలా భారత్ను ఒప్పించేందుకు అమెరికా ముమ్మరంగా ప్రయతి్నస్తూ వచ్చింది. గోర్ భారత రాయబారిగా వచ్చిన క్షణం నుంచే ఈ ప్రయత్నాలకు పదును పెట్టారు. తొలి రోజు బాధ్యతలు స్వీకరించినప్పుడే భారత్ను ఆయన కూటమిలోకి ఆహ్వానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అటు ఆల్బీ... ఇటు మోర్నీ...
అహ్మదాబాద్: టి20 వరల్డ్ కప్లో డిఫెండింగ్ చాంపియన్, గత రన్నరప్ మధ్య రేపు జరిగే ‘సూపర్ ఎయిట్స్’ మ్యాచ్పై అందరి దృష్టీ నిలిచింది. తమ ఆధిక్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుండగా, ప్రతీకారం తీర్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. ఇరు జట్లు తమ గ్రూప్లలో అన్ని మ్యాచ్లూ గెలిచి టాపర్లుగా ముందంజ వేశాయి. అయితే మైదానం లోపలే కాకుండా బౌండరీ బయట కూడా ఒక ‘పోరు’ ఆసక్తిని రేపుతోంది. ఇరు జట్ల సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న సొంత అన్నదమ్ములు ఆల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్ ప్రత్యర్థులుగా తమ వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు.రేపు మ్యాచ్ జరిగే సమయంలో వేర్వేరు డగౌట్లలో వీరు కనిపించనున్నారు. మోర్నీ గత కొంతకాలంగా భారత బౌలింగ్ కోచ్గా పని చేస్తుండగా, ఈ టోర్నీ కోసమే ఆల్బీని ‘ప్రత్యేక సలహాదారుడు’గా దక్షిణాఫ్రికా తీసుకుంది. శుక్రవారం ఇరు జట్ల ప్రాక్టీస్ సందర్భంగా ఆల్బీ, మోర్నీ గ్రౌండ్లోకి వచ్చినా ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదు! ‘ఇప్పటి పరిస్థితుల్లో మా గురించి కాదు. మా అమ్మ గురించే అసలు ఆలోచన. ఆమెనే మా ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలా అని ఎక్కువగా ఆందోళన చెందుతోంది’ అని ఆల్బీ వెల్లడించాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్గా గుర్తింపు పొందిన ఆల్బీ దక్షిణాఫ్రికా తరఫున 58 వన్డేలు, 50 టి20 మ్యాచ్లు ఆడగా... స్ట్రయిక్ పేస్ బౌలర్గా గుర్తింపు పొందిన మోర్నీ 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టి20ల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు ఈ వరల్డ్ కప్లో ఇంగ్లండ్ తరఫున స్యామ్ కరన్ బరిలోకి దిగగా... అతని సోదరుడు బెన్ కరన్ జింబాబ్వే జట్టులో ఉన్నాడు. -
దేశపు తొలి మ్యూజికల్ రోడ్...వచ్చేసింది
వాహనాల్లో వెళుతూ ఆడియోలో పాటలు వినడం కొత్త కాదు. కానీ ఒక రోడ్ మీదకు వెళ్లగానే టైర్లు రహదారిని తాకగానే సంగీతం వినిపించడం ఎక్కడైనా కనీ విన్నామా? దేశపు తొలి మ్యూజికల్ రోడ్ మీదుగా వెళితే ఆ అనుభవం మన స్వంతమవుతుంది. ముంబై కోస్టల్ రోడ్ దీనికి తొలి అడ్రెస్గా నిలిచింది. దక్షిణ దిశగా ఉన్న కోస్టల్ రోడ్ 500 మీటర్ల పొడవు అధికారికంగా భారత దేశపు మొట్టమొదటి సంగీత రహదారి అనే ఘనతను దక్కించుకుంది. ఈ రోడ్ మీదుగా వాహనదారులు నిర్ణీత వేగంతో డ్రైవ్ చేస్తున్నప్పుడు సూపర్ హిట్ బాలీవుడ్ పాట జై హోను ఉప్పొంగే దేశభక్తితో పాటు వినవచ్చు.ఈ ప్రత్యేకమైన ఇన్ స్టాలేషన్స్ ను ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు, ఇది పట్టణ మౌలిక సదుపాయాలు, సాంకేతికత సాంస్కృతిక వ్యక్తీకరణల అరుదైన కలయికను సూచిస్తుంది. ఈ సంగీత విస్తరణ ప్రియదర్శిని పార్క్ అమర్స న్స్ గార్డెన్ మధ్య, నారిమన్ పాయింట్ నుంచి వర్లి కి ఉత్తరం వైపు, క్యారేజ్వేలో, వాహనాలు కోస్టల్ రోడ్ సొరంగం నుంచి నిష్క్రమించే చోటుకు దగ్గరలో ఉంది.హంగేరియన్ రోడ్ టెక్నాలజీ నుంచి ప్రేరణ పొందిన ఈ ప్రాజెక్ట్... రోడ్డు ఉపరితలంపై ఖచ్చితమైన ఇంజనీరింగ్ గ్రూవ్లను ఉపయోగిస్తుంది. వీటిని రంబుల్ స్ట్రిప్స్ అని కూడా పిలుస్తారు. వాహనాలు ఈ గ్రూవ్ల మీదుగా గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో ప్రయాణించినప్పుడు, టైర్ల ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలు సంగీత ప్రకంపనలను సృష్టిస్తాయి, ప్రస్తుతం ఇవి స్లమ్డాగ్ మిలియనీర్ చిత్రం లోని గుల్జార్ సాహిత్యంతో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన జై హో పాటను వీనుల విందుగా వినిపిస్తున్నాయి.వాహనాల లోపల కూడా ఈ ట్యూన్ స్పష్టంగా వినిపిస్తూ వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనూహ్యమైన శ్రవణ అనుభవాన్ని అందిస్తుందని అధికారులు అంటున్నారు. భద్రతను నిర్ధారించడానికి, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సొరంగం లోపల సహా మ్యూజికల్ స్ట్రెచ్ ముందు 500 మీటర్లు, 100 మీటర్లు 60 మీటర్ల వద్ద ముందస్తు హెచ్చరిక సైన్ బోర్డులను ఏర్పాటు చేసింది, దీని వలన డ్రైవర్లు ఆకస్మిక బ్రేకింగ్ లేకుండా క్రమంగా వేగాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.మన దేశంలో ఫస్ట్.. ప్రపంచంలో ఫిఫ్త్...ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ కాగా ప్రపంచవ్యాప్తంగా ఐదవది. మ్యూజికల్ లేదా మెలోడీ రోడ్ వరుసలో మొదటిది 2007లో జపాన్ లో ప్రారంభించారు. అప్పటి నుంచి హంగేరీ, దక్షిణ కొరియా యుఎఇ వంటి దేశాలలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇది ‘వాహనదారులకు సంతోషకరమైన అనుభవం‘ అని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలకు మించి ప్రయాణికుల అనుభవాన్ని ఎలా మెరుగుపరచవచ్చో ఈ ప్రాజెక్ట్ ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇతర రహదారులపై కూడా వీటిని చూడవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు -
‘ప్యాక్స్ సిలికా’లోకి భారత్.. ఇక ఏఐలో మనదే హవా..
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ల సరఫరాను పటిష్టం చేసే లక్ష్యంతో అమెరికా నేతృత్వంలో ఏర్పడిన ‘ప్యాక్స్ సిలికా’ (Pax Silica) కూటమిలో భారత్ చేరనుంది. 2025 డిసెంబర్లో ప్రారంభమైన ఈ కూటమిలో భారత్ అధికారికంగా భాగస్వామి కావడంతో అంతర్జాతీయ సాంకేతిక రంగంలో దేశ ప్రతిష్ట మరింత పెరగనుంది. మిత్రదేశాల మధ్య చిప్స్, ఏఐ సరఫరా వ్యవస్థను సురక్షితం చేయడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశ్యం.ఈ భాగస్వామ్యం ద్వారా సెమీకండక్టర్ల తయారీ, కీలక ఖనిజాల లభ్యత, ఏఐ పరిశోధనల్లో భారత్కు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీ రంగంలో బలంగా ఉన్న భారత్, ప్యాక్స్ సిలికాలో చేరడంతో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదిగేందుకు మార్గం సుగమం కానుంది. సుస్థిరమైన సరఫరా గొలుసు (Supply Chain) ద్వారా భవిష్యత్తు అవసరాలకు తగిన చిప్ తయారీ సామర్థ్యాన్ని భారత్ పెంచుకోనుంది. గతంలో సుంకాల విషయంలో భారత్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఈ ఒప్పందంతో తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించే దిశగా ఢిల్లీ, వాషింగ్టన్ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. సాంకేతికత, రక్షణ, స్వచ్ఛ ఇంధన రంగాల్లో కలిసి పనిచేయడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ప్యాక్స్ సిలికా కూటమిలో అమెరికా, భారత్తో పాటు ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూకే, యూఏఈ, ఇజ్రాయెల్, సింగపూర్ వంటి దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ కూటమిలో చేరడం వల్ల గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ విషయంలో భారత్ కీలక నిర్ణయాధికారిగా మారనుంది. మారుతున్న ప్రపంచ పరిణామాల దృష్ట్యా, సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిలో భారత్ ఇకపై ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేయనుంది.ఇది కూడా చదవండి: రూ. 20 కోట్ల లాటరీ దక్కింది.. టిక్కెట్ పోయింది! -
క్రిటికల్ మినరల్స్ రంగంలో గ్లోబల్ హబ్గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తు అవసరా లకు అత్యంత కీలకమైన ‘క్రిటికల్ మినరల్స్’ సవాళ్లను భారత్ అద్భుత అవకాశంగా మలుచుకుంటోందని కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన రెండో ఎడిషన్ క్రిటికల్ మినరల్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగాలకు లిథియం, కోబాల్ట్ లాంటి ఖనిజాలు అత్యవసరమని, అయితే ప్రస్తుతం మనం 95 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నామని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చి దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ మోడ్’లో పనిచేస్తోందని, ఇందులో భాగంగానే ‘నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్’ను తీసుకొచ్చామని వెల్లడించారు. దేశీయంగా ముడిఖనిజాల అన్వేషణ, ఉత్పత్తిని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రేర్ ఎర్త్ కారిడార్లను అభివృద్ధి చేయను న్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకోసం రూ.7,280 కోట్లతో పీఎల్ఐ స్కీమ్ను అమలు చేయడంతో పాటు, 24 రకాల క్రిటికల్ మినరల్స్పై దిగుమతి సుంకాన్ని కూడా మినహాయించినట్లు గుర్తుచేశారు. విదేశాలపై ఆధారపడటం తగ్గించేందుకు ఇప్పటికే అర్జెంటీనాలో లిథియం గనిని దక్కించుకున్నామని, త్వరలో అక్కడ పనులు ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. -
ఏఐకి మానవ్ విజన్!
న్యూఢిల్లీ: ‘‘మానవాళి చరిత్రలో అతి గొప్ప పరివర్తనశీల అధ్యాయానికి ఏఐ నాంది పలికింది. అందులో భారత్ కేవలం ఒక భాగస్వామిగా మిగిలిపోలేదు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతోంది’’అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కృత్రిమ మేధ వినియోగంలో మానవాళి ఇప్పుడు కీలక కూడలి వద్ద నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ ప్రస్థానాన్ని నేడు మనం ఏ దిశగా తీసుకెళ్తామన్నది మన రేపటిని, అంటే మానవాళి భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. కృత్రిమ మేధ (ఏఐ) వెల్లువలో అంతిమంగా మనిషి కేవలం ముడిసరుకుగా మిగిలిపోయే పరిస్థితి తలెత్తరాదు. జీపీఎస్ వంటి నావిగేషన్ టూల్స్ మనం ఏయే దారుల్లో వెళ్లొచ్చో సూచిస్తాయి. వాటిలో ఏ దారిని ఎంచుకోవాలన్న నిర్ణయం మాత్రం మనమే తీసుకుంటాం. అలాగే ఏఐ వాడకానికి ఆకాశమే హద్దు కావాలి. కానీ దాని నియంత్రణ మాత్రం నిత్యం మన చేతుల్లోనే ఉండాలి. అది జరగాలంటే ఏఐ వాడకాన్ని ప్రజాస్వామీకరించాలి. మనిషే ప్రధాన కేంద్రంగా దాని వినియోగం ఉండేలా సమగ్ర విధానాలు రూపొందించుకోవాలి’’అని పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సును మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాషియో లులా డసిల్వాతో పాటు పలువురు దేశాధినేతలు, పలు దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ ప్రధాని ప్రారం¿ోపన్యాసం చేశారు. ఏఐని అపారమైన శక్తి సామర్థ్యాలతో కూడిన పెన్నిధిగా ఆయన అభివరి్ణంచారు. ‘‘ఏఐ వాడకం ఆశించిన దిశగా సాగకుండా దారి మళ్లితే లక్ష్యసాధనకు బదులు వినాశనానికే దారితీస్తుంది. సజావుగా వాడినప్పుడు మాత్రమే మానవాళి ఎదుర్కొంటున్న పెను సమస్యలకు పరిష్కారాలు చూపి ప్రగతికి బాటలు పరుస్తుంది. అలా జరగాలంటే టెక్నాలజీ మనపై పెత్తనం చేయకూడదు. మనమే టెక్నాలజీని నియంత్రించాలి. అందుకోసం అన్ని రంగాల్లోనూ నానాటికీ కీలకంగా మారుతున్న అత్యాధునిక ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వాడుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ సమగ్ర విధానాలను రూపొందించుకోవడం చాలా ముఖ్యం’’అని సూచించారు. ఇందుకోసం ‘మానవ్’విజన్ను ఆవిష్కరిస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. అంటే ‘నైతిక వ్యవస్థలు (మోరల్, ఎథికల్ సిస్టమ్స్–ఎం), జవాబుదారీతనంతో కూడిన పాలన (అకౌంటబుల్ గవర్నెన్స్–ఏ), దేశాల సార్వ¿ౌమత్వం (నేషనల్ సావర్నిటీ–(ఎన్), అందుబాటులో, సమ్మిళిత (యాక్సిసబుల్, ఇంక్లూజివ్–ఏ), ఆమోదయోగ్య, చట్టబద్ధ (వాలీడ్ అండ్ లెజిటిమేట్–వీ)’అని వివరించారు. ఈ విలువలు ఏఐ సమర్థ వాడకానికి దేశాలన్నింటికీ దారి చూపుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. సార్వత్రిక సంక్షేమం, అందరికీ ఆనందమే ఏఐ వినియోగం విషయంలో భారత్ నిర్దేశించుకున్న ప్రమాణమని పేర్కొన్నారు. కనుకనే దాన్ని సదస్సు ఇతివృత్తంగా ఎంపిక చేసినట్టు వివరించారు. ‘‘ఏఐ అన్నివిధాలుగా అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. అప్పు డు మాత్రమే అది సర్వ మానవాళికీ మేలు చేస్తుంది. ఇది నా నిశి్చతాభిప్రాయం’’అని స్పష్టం చేశారు. భారత్ సిద్ధం ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకునేందుకు భారత్ ఏ మాత్రమూ వెనకాడటం లేదని మోదీ చెప్పారు. పైగా ఈ టెక్నాలజీని ఒక గొప్ప సంపదగా, బంగారు భవిష్యత్తుకు నమూనాగా పరిగణిస్తోందని దేశాధినేతలతో పాటు సభికులందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఏఐ రంగంలో సూపర్ పవర్గా నిలిచేందుకు అవసరమైన నైపుణ్యం, వనరులు, విధాన స్పష్టత తదితరాలన్నీ భారత్ సొంతమని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత సదస్సులోనే మూడు భారత కంపెనీలు తమ సరికొత్త ఏఐ మోడళ్లను, యాప్లను ఆవిష్కరించాయి. భారత యువతలో దాగున్న ప్రతిభకు ఇదే నిదర్శనం’’అని వివరించారు. ‘‘ఏఐ మన వ్యవస్థలన్నింటినీ మరింత తెలివైనవిగా, సమర్థంగా, ప్రభావవంతంగా మారుస్తుంది. యువత, వృత్తి నిపుణులు మరింత సృజనాత్మక బాధ్యతలు చేపట్టేందుకు అపారమైన అవకాశాలను అందుబాటులోకి తెస్తుంది. ఇన్నొవేషన్లకు, పారిశ్రామికతకు, కొత్త పరిశ్రమల స్థాపనకు ఒక గొప్ప అవకాశంగా ఏఐ నిలుస్తోంది. ఏఐ టూల్స్ను అతి గోప్యంగా అభివృద్ధి చేయాలని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఏఐ సాంకేతికతను అందరితోనూ పూర్తిస్థాయిలో పంచుకోవాలన్నది మా విధానం. అప్పుడే కోట్లాది మంది యువతీ యువకులు మరింతగా ఎదుగుతారు. తద్వారా సార్వత్రిక ప్రగతి, ప్రపంచ శ్రేయస్సు సాధ్యమన్నది మా విశ్వాసం’’అని మోదీ వివరించారు. ‘‘మన భావి తరాలకు ఎటువంటి ఏఐ నమూనాను అందిస్తమన్నది చాలా ముఖ్యం. అది సాధికారత, సమ్మిళిత భావనతో కూడుకుని ఉండేలా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపైనా ఉంది’’అంటూ పిలుపునిచ్చారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పర్మెలిన్, శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, భూటాన్ ప్రధాని షెరింగ్ గోబ్గే, మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రాంగులామ్, క్రొయేషియా ప్రధాని ఆంద్రెజ్ ప్లెంకోవిక్, సెర్బియా అధ్యక్షుడు అలెక్జాండర్ వుకిక్, సీషెల్స్ ప్రధాని సెబాస్టియన్ పిళ్లై, ఎస్టోనియా అధ్యక్షుడు అలర్ కరిస్, ఫిన్లండ్ ప్రధాని పెటెరీ ఓర్పో తదితర దేశాధినేతలు ఏఐ సదస్సులో పాల్గొన్నారు.ఏఐ.. మేలిమలుపు ‘‘మానవ చరిత్రలో పలు కీలక మైలురాళ్లున్నాయి. శతాబ్దాల పాటు అవి మన చరిత్రను తీర్చిదిద్దాయి. మన నాగరికతలను, అభివృద్ధి వేగాన్ని నిర్దేశించాయి. ఏఐ కూడా అలాంటి కీలక మార్పే’’అని మోదీ అన్నారు. ‘‘ప్రపంచ జనాభాలో ఆరో వంతుకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువత ఇక్కడే ఉంది. టెక్నాలజీపరంగా అతి పెద్ద టాలెంట్ పూల్కు భారత్ నిలయం. కనుక ఏఐ ఇంపాక్ట్ సదస్సు భారత్లో జరుగుతుండటం చాలా సముచితంగా ఉంది’’అని మోదీ అన్నారు.సైగల భాషలో ప్రత్యక్ష తర్జుమా! న్యూఢిల్లీ: ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సులో ఆసక్తికరమైన దృశ్యం అందరినీ ఆకర్షించింది. గురువారం సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఏఐ ఆధారిత సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటేషన్ పరిజ్ఞానం సాయంతో 11 భాషల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. అంతేగాక ప్రసంగాన్ని సైగల భాషలోకి కూడా అనువదించి వేదికపై ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుపై ప్రదర్శించడం విశేషం. -
బంగ్లాలో యూనస్ ఔట్.. భారత్ కీలక నిర్ణయం!
ఢాకా: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య మళ్లీ సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా వీసా సేవలు త్వరలోనే పునరుద్దరించే అవకాశం ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ వీసాల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం.భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు గత రెండేళ్లలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2024 జూలై–ఆగస్టు ఉద్యమాల తర్వాత షేక్ హసీనా పదవి నుంచి తప్పుకోవడం, ఆమె భారత్కు వెళ్లిపోవడం, ఆ తర్వాత మధ్యంతర ప్రభుత్వంలో భారత్ వ్యతిరేక శక్తులు బలపడటం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో ఆగస్టు 2024 బంగ్లాదేశ్లో అశాంతి కారణంగా భారత్ తొలిసారి అన్ని వీసా సేవలను నిలిపివేసింది. అలాగే, డిసెంబర్ 2025లో ఉస్మాన్ హాది మరణం తర్వాత జరిగిన భారత్ వ్యతిరేక నిరసనల కారణంగా ఢాకా, చిట్టగాంగ్, ఖుల్నా, రాజ్షాహి వీసా కేంద్రాలు మూసివేయబడ్డాయి. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ కూడా తన కాన్సులేట్లలో వీసా సేవలను నిలిపివేసింది.అయితే, ప్రస్తుతం యూనస్ ప్రభుత్వం దిగిపోవడం.. తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం కొలువుదీరడంతో వీసాల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా సిల్హెట్లోని భారత సీనియర్ కాన్సులర్ అధికారి అనిరుద్ధ దాస్ స్పందిస్తూ.. ‘భారత్ త్వరలోనే అన్ని వీసా సేవలను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం మెడికల్, డబుల్-ఎంట్రీ వీసాలు ఇస్తున్నారు. త్వరలో ట్రావెల్ వీసాలు సహా అన్నింటిని తిరిగి ప్రారంభించనున్నారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక బంధంతో నడుస్తాయి. రెండు దేశాల ప్రజలే ఈ స్థిరమైన, సానుకూల సంబంధాల ప్రధాన భాగస్వాములు’ అని పేర్కొన్నారు.కాగా, ఈ పరిణామం వీసా విధానాలకే పరిమితం కాదు. ఇది రెండు దేశాల మధ్య నమ్మకాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నం. సాధారణ ప్రజలకు వైద్య, వ్యాపార, సాంస్కృతిక ప్రయాణాలు సులభం అవుతాయి. ఇదిలా ఉండగా.. షేక్ హసీనా (2009–2024) కాలంలో భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగైన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. -
ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ విజన్ (MANAV Vision) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులను శాసించకూడదు, మానవులే ఏఐను శాసించే స్థాయికి ఎదగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ యుగంలో మానవులు ఏఐను సాధనంగా మార్చుకోవాలని అన్నారు. సాంకేతికత మానవాళి అభివృద్ధికి దోహదపడాలి. దానికి తగినవిధంగా మానవుడు ఎదగాలని పేర్కొన్నారు.MANAV అంటే మనిషి అని ఆయన వివరించారు. సాంకేతికత ఎంత వేగంగా ఎదిగినా, అది మానవ విలువలు, నైతికత & సమాజ శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి అని అన్నారు.MANAV అంటే?M - Moral and Ethical Systems (నైతిక వ్యవస్థలు): ఏఐ వ్యవస్థలు నైతిక మార్గదర్శకాలపై ఆధారపడాలి. అవి మానవ హక్కులను గౌరవించాలి, వివక్షను పెంచకూడదు, సమాజంలో న్యాయం, సమానత్వాన్ని కాపాడాలి. సాంకేతికతకు విలువలు తోడై ఉండాలి.A - Accountable Governance (జవాబుదారిత్వ పాలన): ఏఐ పారదర్శక నియమాలను కలిగి ఉండాలి. ఎవరు ఏ విధంగా ఏఐను ఉపయోగిస్తున్నారు అనే విషయంపై స్పష్టమైన పర్యవేక్షణ అవసరం. తప్పులు జరిగితే బాధ్యత ఎవరికి? అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి.N - National Sovereignty (జాతీయ స్వావలంబన): ఎవరి డేటా వారి హక్కు. అంటే.. డేటా ఎవరిదైతే, ఆ వ్యక్తికే దాని మీద హక్కు ఉండాలి. దేశాల డేటా భద్రత, డిజిటల్ స్వతంత్రత ముఖ్యం.A - Accessible and Inclusive Systems (అందరికీ అందుబాటు): ఏఐ కొన్ని కంపెనీలకే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడాలి. అది అవకాశాలను పెంచాలి కానీ ఏకాధిపత్యాన్ని సృష్టించకూడదు.V - Valid and Legitimate (చట్టబద్ధత & ధృవీకరణ): ఏఐ వ్యవస్థలు చట్టబద్ధంగా ఉండాలి. అవి విశ్వసనీయంగా, ధృవీకరించదగినవిగా ఉండాలి. సమాజానికి హానికరం కాకుండా నియంత్రణలో ఉండాలి.The M.A.N.A.V. vision for AI. pic.twitter.com/NVmxQ8bXq6— PMO India (@PMOIndia) February 19, 2026మానవ్ విజన్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ ఏఐ అవసరాలకు మార్గదర్శకంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పిల్లల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. AI వేదికలు పిల్లలకు సురక్షితంగా ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో సోషల్ మీడియా సంస్థలపై పిల్లలపై ప్రభావం గురించి కేసులు నడుస్తున్న సందర్భంలో, AI వినియోగంలో జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు. ఏఐ అనేది ఒక పరివర్తన శక్తి. దీనిని దిశానిర్దేశం లేకుండా వదిలేస్తే.. అవరోధాలు ఏర్పడతాయని అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత? -
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
-
ఎఫ్టీఏతో సువర్ణాధ్యాయం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్, ఫిన్లాండ్ ప్రధాని పెటెరీ ఓర్పోతోపాటు సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్ వుకిక్, ఎస్తోనియా అధ్యక్షుడు అలార్ కరీస్, కజకిస్తాన్ ప్రధానమంత్రి ఒల్జాస్ బెక్తెనోవ్, క్రొయేషియా ప్రధానమంత్రి అండ్రెజ్ ప్లెంకోవిక్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్–యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)తో భారత్–ఈయూ సంబంధాల్లో సువర్ణ అధ్యాయం ప్రారంభమైందని, దీంతో ఇరుపక్షాల సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా ఈ భేటీలు జరిగాయి. ఆయా దేశాల అధినేతలతో సమావేశం అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. స్పెయిన్ అధ్యక్షుడు సాంచెజ్తో ఫలవంతమైన సమావేశం జరిగినట్లు వెల్లడించారు. భారత్–స్పెయిన్ మధ్య ద్వైపాక్షిక అంశాలతోపాటు స్నేహ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, అంతరిక్షం, పర్యాటకం, రక్షణ, టెక్నాలజీ తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నామని ఉద్ఘాటించారు. 2026వ సంవత్సరం భారత్–స్పెయిన్ భాగస్వామ్యానికి సాంస్కృతిక, పర్యాటక, కృత్రిమ మేధ(ఏఐ) సంవత్సరమని వివరించారు. ఇరుదేశాల ప్రజల మధ్య బంధం మరింత బలపడడం తథ్యమని చెప్పారు. స్పెయిన్ యూనివర్సిటీల నుంచి ప్రతినిధి బృందం భారత్కు రావడం సంతోషంగా ఉందన్నారు. భారత్–ఈయూ ఎఫ్టీఏ వల్ల స్పెయిన్తో ఆర్థిక భాగస్వామ్యంపై సానుకూల ప్రభావం కచ్చితంగా ఉంటుందని స్పష్టంచేశారు. ఇరుదేశాల ప్రజలకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్, ఈయూ మధ్య జనవరి 27న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా ఇరుపక్షాలు అభివరి్ణస్తున్నాయి. భారత్తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని స్పెయిన్ అధ్యక్షుడు సాంచెజ్ స్పష్టంచేశారు. ఇంపాక్ట్ ఏఐ సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. -
యువహో.. ప్రీమియంకు జయహో
సాక్షి, స్పెషల్ డెస్క్ : వాహనాల విషయంలో కస్టమర్ల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. సులభ వాయిదాల్లో చెల్లించే అవకాశాలు విస్తృతం అయ్యాయి. ఆకట్టుకునే మోడళ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. పైగా వినియోగదారులకు ఖర్చు చేయదగ్గ ఆదాయాలు పెరుగుతున్నాయి. ఇంకేముంది.. నచ్చిందే తడవుగా యువ కస్టమర్లు ప్రీమియం బైక్స్తో దూసుకుపోతున్నారు. భారతీయ ద్విచక్ర వాహన విపణి క్రమంగా అధిక ఇంజన్ సామర్థ్యం కలిగిన ప్రీమియం బైక్స్ వైపు మళ్లుతోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి కాలంలో రూ.80,000 ప్రారంభ ధర కలిగిన 125 సీసీ, అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల మోడళ్ల వాటా మొత్తం మోటార్ సైకిల్స్ మార్కెట్లో 26% చేరుకుంది. 2019–20లో ఇది 22.1% నమోదైంది. గత సెప్టెంబర్లో జీఎస్టీ సవరణతో ధరలు తగ్గడం కూడా ఈ వృద్ధికి దోహదపడింది. ప్రీమియమైజేషన్ వైపు.. భారత్లో 125 సీసీ, అంతకంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్స్ వాటా ఈ స్థాయికి చేరుకోవడం ఆరేళ్లలో ఇదే అత్యధికం. 2024–25లో మొత్తం మోటార్సైకిళ్ల విక్రయాలలో ఈ సెగ్మెంట్ 24.4% వాటాను కలిగి ఉంది. జీఎస్టీ హేతుబద్దీకరణ తర్వాత మోటార్సైకిల్స్ విభాగం బలమైన రికవరీని చూసిందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 125 సీసీ వరకు ఉన్న ఎంట్రీ–లెవల్ మోడల్స్ 73% వాటాతో మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ డిమాండ్ క్రమంగా 150–350 సీసీ శ్రేణి వైపు మళ్లుతోంది. ఏటా వృద్ధి చూస్తుంటే వినియోగదార్లకు ఇవి అందుబాటులో లభించడం, మారుతున్న ప్రీమియమైజేషన్ ధోరణిని ప్రతిబింబిస్తోంది. టాప్లో రాయల్ ఎన్ఫీల్డ్.. తయారీ కంపెనీల్లో రాయల్ ఎన్ఫీల్డ్, టీవీఎస్ మోటార్ ఈ ప్రీమియమైజేషన్ ధోరణి ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందిన సంస్థలుగా అవతరించాయి. రాయల్ ఎన్ఫీల్డ్ 125 సీసీ+ సెగ్మెంట్లో తన మార్కెట్ వాటాను 2019–20లో 27% నుంచి 2025–26 మొదటి తొమ్మిది నెలల్లో 32%కి పెంచుకుంది. జెఫరీస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఇదే కాలంలో టీవీఎస్ మోటార్ వాటా 15% నుంచి19%కి చేరింది. బజాజ్ ఆటో వాటా 32% నుంచి 22%కి తగ్గడం వల్ల ఈ రెండు సంస్థలు లాభపడ్డాయి. -
ఇండియాకు ఎప్పుడు వస్తానో చెప్పలేను: విజయ్ మాల్యా
ముంబై: భారత్కు కచ్చితంగా ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేనని పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బాంబే హైకోర్టుకు తెలియజేశారు. స్వదేశానికి రావడా నికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం రద్దు చేసిన తన పాస్పోర్టును పునరుద్ధరించుకోవడంలో ఇబ్బందులు ఉన్నట్లు వెల్లడించారు.యునైటెడ్ కింగ్డమ్(యూకే) ను విడిచిపెట్టి వెళ్లిపోకుండా చట్టపరంగా నిషేధించారని, ఇంగ్లండ్, వేల్స్ కోర్టులు ఆదేశాలిచ్చాయని గుర్తుచేశారు. ఈ మేరకు విజయ్ మాల్యా స్టేట్మెంట్ను ఆయన తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ బాంబే హైకోర్టు నివేదించారు. విజయ్ మాల్యా 2016 నుంచి యూకేలోనే ఉంటున్నారు. తనను ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి’గా గుర్తిస్తూ ఇచ్చిన ఉత్తర్వును, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ విజయ్ మాల్యా గతంలో బాంబే హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. భారత్కు కచ్చితంగా ఎప్పటిలోగా తిరిగి వస్తారో చెప్పాలని విజయ్ మాల్యాను ఆదేశించింది. స్వదేశానికి వచ్చి విచారణను ఎదుర్కొనే ఉద్దేశం ఉందా? లేదా? అని నిలదీసింది. లేకపోతే ఆయన పిటిషన్లను తిరస్కరిస్తామని తేల్చిచెప్పింది. దీనిపై విజయ్ మాల్యా తాజాగా స్పందించారు. స్వదేశానికి ఎప్పుడు వస్తానో చెప్పలేనన్నారు. భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు రుణంగా తీసుకొని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు విజయ్ మాల్యాపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. -
పదునెక్కిన బంధం
అంతర్జాతీయంగా అవాంతరాలు ఎదురైన ప్రతి సందర్భంలోనూ మనకు అండగా నిలబడిన ఫ్రాన్స్తో మన అనుబంధం మరింత బలపడింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారత పర్యటన సందర్భంగా రక్షణ, ఆరోగ్యం, అత్యంతా ధునాతన సాంకేతికత, సంప్రదాయేతర ఇంధన వనరులు, అరుదైన ఖనిజాలు సహా పలు అంశాల్లో ఇరు దేశాలకూ లబ్ధి చేకూర్చే 21 ఒప్పందాలపై మంగళవారం సంతకాలు కావటంతోపాటు ఇప్పుడున్న ద్వైపాక్షిక బంధాన్ని ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యానికి విస్తరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, మెక్రాన్లు నిర్ణయించటం చరిత్రాత్మకం. పరస్పర గౌరవం, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉంటే దేశాల మధ్య స్నేహం చిగురించటం, విస్తరించటం కష్టమేమీ కాదు. కానీ చుట్టూ గడ్డు పరిస్థితులున్నా, అనిశ్చితి ఆవరించినా కూడా ఆ బంధం మరింత దృఢపడటం గొప్ప విషయం. మోదీ అన్నట్టు ఇరు దేశాల మధ్యా దశాబ్దాలుగా ఉన్న ‘సరిహద్దులు లేని’ చెలిమి వల్లనే ఇదంతా సాధ్యమైంది. 1988లో పోఖ్రాన్లో అప్పటి వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అణుపరీక్ష నిర్వహించినప్పుడు ఏం జరిగిందో అందరికీ గుర్తుంది. అప్పటికే తమ అమ్ములపొదిలో వందల సంఖ్యలో అణుబాంబులు పెట్టుకున్న అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాలన్నీ మనపై విరుచుకుపడ్డాయి. సుద్దులు చెప్పేందుకు సిద్ధమ య్యాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సు ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. అప్పుడు భారత్ను గట్టిగా సమర్థించి, ఆంక్షలు విధించే తీర్మానాన్ని ‘వీటో’ చేస్తామని ఫ్రాన్స్ హెచ్చరించటంతో అది కాస్తా సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా అణు రియాక్టర్ల సాంకేతికత మొదలు అధునాతన ఆయుధాలు అందించటం వరకూ ఆ దేశం మనకెంతో తోడ్పాటునందించింది. ప్రపంచ దేశాలను బతిమాలి, ఒత్తిడి తెచ్చి మూడు దశాబ్దాల క్రితం తానే తీసు కొచ్చిన ప్రపంచీకరణ విధానాలకు హఠాత్తుగా తిలోదకాలిచ్చిన అమెరికా... ఇప్పుడు ఒంటెత్తు పోకడలతో, బెదిరింపులతో, దబాయింపులతో అందరినీ పాదాక్రాంతం చేసుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ దౌత్య సంప్రదాయాలకూ, మర్యాదలకూ ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెల్లుచీటీ ఇచ్చారు. ఈ కల్లోల స్థితిలో భారత్–ఫ్రాన్స్ల మధ్య ఇప్పుడు కుదిరిన ఒప్పందాలు ఏదోమేర సుస్థిరత ఏర్పడటానికి దోహద పడతాయి. వర్తమాన ప్రపంచ పరిణామాలపై ఇరు దేశాల వైఖరులూ ఒకటే. అన్ని దేశాలూ నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పుడే అందరూ సమానంగా అభివృద్ధి సాధించగల మెరుగైన ప్రపంచం ఏర్పడుతుందని రెండు దేశాలూ విశ్వసిస్తాయి. ఇలాంటి సారూప్యతల కారణంగానే ప్రగాఢమైన సాన్నిహిత్యం సాధ్యమైంది. మన రక్షణ కొనుగోళ్లలో రష్యా తర్వాత ఫ్రాన్స్దే రెండో స్థానం. ఆ రంగంలో మనం స్వావలంబన సాధించాలనీ, విదేశాలపై ఆధారపడటం తగ్గాలనీ అందరూ కోరుకుంటున్నదే. కానీ ఈలోగా మన భద్రతకూ, రక్షణకూ విశ్వసించదగ్గ భాగస్వాములు ఎంతో అవసరం. రష్యాతోపాటు ఫ్రాన్స్ దాన్ని నెరవేర్చగలుగుతోంది. మన వైమానిక దళానికీ, నావికాదళానికీ మరిన్ని రఫేల్ యుద్ధ విమానాల కోసం మనం ఒప్పందం కుదుర్చుకోగా, వాటిలో కొన్నిటిని ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. అలాగే ఎవరెస్టు శిఖరం కన్నా ఎత్తులో ఎగిరే ఎయిర్బస్ హెచ్ 125 హెలికాప్టర్ల తయారీ సైతం మొదలైంది. వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తామని మోదీ ప్రకటించారు. ప్రపంచం తూర్పు, పడమరలుగా... ఉత్తర, దక్షిణాలుగా విడివడి ఉంది. మనం పాశ్చాత్య దేశాలుగా పిలుచుకునే వాటిలో సైతం భిన్న ధోరణులు కనబడుతున్నాయి. ఇలాంటి ప్రపంచంలో పరస్పర సహకారం, గౌరవం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఏ రెండు పక్షాల మధ్యనైనా అవగాహన కష్టం కాదని ఇప్పుడు ఫ్రాన్స్తో కుదిరిన ఒప్పందాలైనా, ఇంత క్రితం బ్రిటన్, ఈయూలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలైనా రుజువు చేశాయి. ఎప్పటికీ ఏకధ్రువ ప్రపంచమే కొనసాగాలనీ, తమ ఆధిపత్యమే శాశ్వతంగా వర్ధిల్లాలనీ, అన్యులెవరూ ఎదగరాదనీ భావిస్తున్న అమెరికా... బహుళ ధ్రువ ప్రపంచం తన కళ్లముందే నిర్మాణమవుతున్న వైనాన్ని ఇకనైనా గ్రహించటం మంచిది. -
నౌకాదళం 'అల'రింతకు సిద్ధం
నింగీనేలా నివ్వెరబోయేలా నీలిసంద్రం యుద్ధనౌకలను మోహరించిందా.. పోటెక్కిన అలలు సమరోత్సాహంతో ఎగసి పడుతున్నాయా.. కెరటాల హోరు స్నేహ శంఖారావం పూరిస్తోందా.. అన్నట్టు అద్భుత విన్యాసాల వీక్షణకు విశాఖ తీరం ముస్తాబైంది. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలను చాటేలా.. మిత్రదేశాల సమన్వయంతో జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), మిలాన్– 2026, ఐయాన్స్ కాన్క్లేవ్లకు తూర్పు తీరం వేదికవుతోంది. బుధ, గురువారాల్లో అద్భుత విన్యాసాలతో భారత నౌకాదళం తన సైనిక పరాక్రమ విశ్వ రూప ప్రదర్శనకు సర్వసన్నద్ధమైంది.విశాఖ సిటీ: ‘సౌభ్రాతృత్వం, సహకారం, సమన్వయం‘ అనే నినాదంతో ఐఎఫ్ఆర్, మిలాన్, విన్యాసాలు జరగనున్నాయి. ఈ విన్యాసాల కోసం 72 దేశాల నుంచి నాలుగు వేల మందికి పైగా నావికాదళ అధికారులు, విదేశీ ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. ఒకేసారి మూడు ప్రధాన వేడుకలు దేశ స్వాతంత్య్ర చరిత్రలో ఒకేసారి మూడు ప్రధాన నౌకాదళ కార్యక్రమాలను (ఐఎఫ్ఆర్, మిలాన్, ఐయాన్స్) నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ‘మహాసాగర్’ దార్శనికతలో భాగంగా.. సముద్ర భద్రత, పరస్పర సహకారాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. దశాబ్దం తర్వాత నగరంలో ఈ ఫ్లీట్ రివ్యూను ‘యునైటెడ్ త్రూ ఓషన్స్’ (సముద్రాల ద్వారా ఏకమవుదాం) అనే ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నారు. బుధవారం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), 19న మిలాన్–2026 విన్యాసాలతో పాటు 20న ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం(ఐయాన్స్) సదస్సుకు విశాఖ తీరం ఆతిథ్యమిస్తోంది. నేడు విన్యాసాలు తిలకించనున్న రాష్ట్రపతి ఇండియన్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)కు ముఖ్య అతిథిగా భారత సర్వసైన్యాధ్యక్షురాలు, దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు. ఆమె మంగళవారం సాయంత్రమే విశాఖకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. 9 గంటలకు రాష్ట్రపతి నేవల్ డాక్ యార్డ్కు చేరుకుంటారు. అనంతరం ఆమె సుమేధ అనే యుద్ధనౌకపై (ప్రెసిడెన్షియల్ యాచ్) ప్రయాణిస్తూ.. సముద్రంలో లంగరు వేసిన 71 యుద్ధ నౌకలను వీక్షిస్తారు. ఇందులో 52 భారతీయ నౌకలు, 19 విదేశీ యుద్ధనౌకలు ఉన్నాయి. ప్రతి నౌకలోని సైనికులు తమ దేశ సంప్రదాయ పద్ధతిలో రాష్ట్రపతికి వందనం సమరి్పస్తారు. 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తాయి. సముద్రం మధ్యలో మార్కోస్ కమాండోలు శత్రువులను ఎలా ఎదుర్కొంటారో ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. నౌకాదళ విమానాల ‘ఫ్లై పాస్ట్’, సముద్ర గర్భంలో జలాంతర్గాముల విన్యాసాలనూ నౌకాదళ సైనికులు ప్రదర్శిస్తారు. ప్రత్యేక ఆకర్షణగా సిటీ పరేడ్ విశాఖ తీరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టేలా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ గురువారం జరగనుంది. ఈ మెగా ఈవెంట్.. సముద్ర భద్రత, ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ప్రతీకగా నిలవనుంది. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆర్కే బీచ్ వద్ద సాగరతీరం వెంబడి ఈ పరేడ్ జరుగుతుంది. ఈ భారీ ప్రదర్శనను ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో 45 విదేశీ నౌకాదళ మార్చింగ్ బృందాలు, 8 అంతర్జాతీయ నావికాదళ బ్యాండ్లు ప్రతిభను చాటనున్నాయి. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన, కోస్ట్ గార్డ్ బృందాలతో పాటు విదేశీ సైనిక బృందాలు కవాతు నిర్వహిస్తాయి. ఈ పరేడ్లో భారత నౌకాదళానికి చెందిన ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో ‘ఎయిర్ పవర్ డెమాన్్రస్టేషన్’ మొదలవుతుంది. అలాగే భారతదేశ సంస్కృతిని తెలిపే జానపద కళారూపాలు, వివిధ రాష్ట్రాల శకటాలు, విదేశాల సంస్కృతులను ప్రతిబింబించే ప్రదర్శనలు ఉంటాయి. ఇందులో ఎన్సీసీ, సీ క్యాడెట్ కార్ప్స్, నేవీ చి్రల్డన్ స్కూల్ విద్యార్థులు పాల్గొననున్నారు. పరేడ్ చివరలో సముద్రంలో లంగరు వేసిన యుద్ధనౌకల ‘సెరిమోనియల్ ఇల్యూమినేషన్’ (దీపకాంతులతో అలంకరణ), లేజర్ లైట్ షో, బాణసంచా, డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రెండు దశల్లో మిలాన్ మిలాన్–2026 విన్యాసాలు విశాఖలోని తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఈ విన్యాసాలను ప్రారంభిస్తారు. ఇవి 19 నుంచి 20 వరకు హార్బర్ ఫేజ్, 21 నుంచి 25 వరకు సీ ఫేజ్లో జరగనున్నాయి. హార్బర్ ఫేజ్లో సాంస్కృతిక కార్యక్రమాలు, అంతర్జాతీయ సముద్ర సెమినార్లు, ద్వైపాక్షిక చర్చలు, మిలాన్ విలేజ్ ప్రదర్శనలు ఉంటాయి. సీ ఫేజ్లో భాగంగా సముద్ర గర్భంలో అసలైన యుద్ధ విన్యాసాలు జరుగుతాయి. ఇందులో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు, క్లిష్టమైన నౌకా విన్యాసాలు నిర్వహిస్తారు. 20న ఐయాన్స్ కాన్క్లేవ్ హిందూ మహాసముద్ర నౌకాదళ సింపోజియం (ఐయాన్స్) ఈ నెల 20న హోటల్ నోవొటెల్లో జరగనుంది. ఈ సదస్సులో 42 దేశాల నౌకాదళాధిపతులు పాల్గొని సముద్ర భద్రత, విపత్తు నిర్వహణపై చర్చిస్తారు. ఈ సందర్భంగా భారత్ 2025–27 కాలానికి గానూ ’ఐయాన్స్’ అధ్యక్ష పదవిని థాయిలాండ్ నుంచి స్వీకరించనుంది. 72 దేశాల నుంచి 71 యుద్ధ నౌకలు ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల్లో మొత్తం 72 దేశాలు పాల్గొంటున్నాయి. 71 యుద్ధ నౌకలు (19 విదేశీ నౌకలతో కలిపి), 50కిపైగా విమానాలు ఈ ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి. అమెరికా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా, యూకే, ఫిలిప్పీన్స్, యూఏఈ వంటి ప్రధాన దేశాలు తమ శక్తివంతమైన నౌకలను పంపాయి.ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధాన ఆకర్షణఐఎఫ్ఆర్, మిలాన్ ద్వారా భారత్ తన స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు సిద్ధమైంది. ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ నిలవనుంది. దీంతో పాటు ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా జతకట్టడం విశేషం. రెండు విమాన వాహక నౌకలు ఒకేసారి కవాతు నిర్వహించడం భారత రక్షణ రంగ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. ఇవి కాకుండా విధ్వంసక నౌకలు, అత్యాధునిక జలాంతర్గాములు, విశాఖపట్నం క్లాస్ డి్రస్టాయర్లు, నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లు కూడా సముద్ర గర్భంలో భారత్ పటిష్టతను చాటనున్నాయి. మిగ్–29కె, పి–8ఐ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో కలిపి 50కి పైగా ఎయిర్క్రాఫ్ట్లు గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించనున్నాయి.రాష్ట్రపతికి ఘన స్వాగతం గోపాలపట్నం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విశాఖలో నిర్వహించనున్న ఫ్లీట్ రివ్యూను ప్రారంభించేందుకు ఆమె నగరానికి విచ్చేశారు. విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తదితరులు రాష్ట్రపతికి ఆతీ్మయంగా స్వాగతం పలికారు. -
ద్వైపాక్షిక బంధం... గ్లోబల్ స్థాయికి!
ముంబై: భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో నూతన శకానికి తెర లేచింది. అంతర్జాతీయంగా తీవ్ర అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. వాటిని ‘ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యూహత్మక భాగస్వామ్యం’గా తీర్చిదిద్దుకోవాలని నిశ్చయించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ నడుమ జరిగిన చర్చల్లో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. రక్షణ, వర్తకం మొదలుకుని అరుదైన ఖనిజాల దాకా అన్ని రంగాల్లోనూ పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని నేతలు నిర్ణయించారు.ఈ దిశగా రక్షణ, అత్యంత అధునాతన టెక్నాలజీ, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఆరోగ్యం తదితరాలకు సంబంధించి ఇరు దేశాల నడుమ 21 కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్, ఫ్రెంచి రక్షణరంగ దిగ్గజం సఫ్రాన్ సంయుక్తంగా భారత్లో హమ్మర్ క్షిపణుల తయారీ, భారత, ఇరుదేశాల సైన్యంలో పరస్పరం అధికారుల నియామకం తదితరాలు వీటిలో ఉన్నాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచి్చన మాక్రాన్తో మంగళవారం సాయంత్రం మోదీ ముంబైలో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ లోతుగా చర్చించారు. భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని తీర్మానించారు. అనంతరం మోదీ, మాక్రాన్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కీలక భాగస్వామ్యం: మోదీ ప్రపంచం ప్రస్తుతం అత్యంత అస్థిర దశ గుండా సాగుతోందని మోదీ అభిప్రాయపడ్డారు.ఈ పరిస్థితుల్లో స్థిరత్వ స్థాపనలో భారత్, ఫ్రాన్స్ భాగస్వామ్యం కీలకపాత్ర పోషించగలదని విశ్వాసం వెలిబుచ్చారు. ఫ్రాన్స్ నైపుణ్యం, భారత వనరులు ఒక్కతాటిపైకి వస్తే అద్భుతాలు జరుగుతాయన్నారు. ఇరుదేశాలదీ ఎలాంటి హద్దులూ లేని ఆదర్శ భాగస్వామ్యం. ఇరు దేశాల మధ్య మొదటినుంచీ ప్రత్యేక సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి’’అని చెప్పారు.భారత్కు అత్యంత పురాతన వ్యూహాత్మక భాగస్వాముల్లో ఫ్రాన్స్ ఒకటని ఆయన గుర్తు చేశారు. ‘‘మాక్రాన్తో తాజా భేటీ ద్వారా ఈ బంధాన్ని ఎన్నడూ లేనంతగా ముందుకు తీసుకెళ్లాం. ఇరు దేశాలు పరస్పర విశ్వాసం, ఉమ్మడి విజన్తో కలసి సాగనున్నాయి. ఇది కేవలం వ్యూహాత్మక బంధం మాత్రమే కాదు. ప్రపంచ ప్రగతికి బాటలు పరిచే కీలక బంధం’’అని ప్రకటించారు. ఉగ్రవాదం కూడా మాక్రాన్తో చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచి్చనట్టు ప్రధాని తెలిపారు. దాన్ని అన్ని రూపాల్లోనూ తుదముట్టించేందుకు ఇరు దేశాలూ కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు. సంస్కరణలతోనే సమాధానం ఉక్రెయిన్, పశి్చమాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర చోట్ల యుద్ధ మేఘాలు ఇంకా తొలగలేదని మోదీ గుర్తు చేశారు. ‘‘ఈ కల్లోల పరిస్థితుల నుంచి గట్టెక్కించగలిగేది ప్రజాస్వామిక విలువలే అన్నదే భారత్, ఫ్రాన్స్ వైఖరి. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలను సమూలంగా సంస్కరించినప్పుడే ఈ అంతర్జాతీయ సవాళ్లకు సజావైన పరిష్కారాలు లభిస్తాయి ఆ ప్రయత్నాలకు భారత్, ఫ్రాన్స్ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాయి. ఎందుకంటే రెండు దేశాలూ బహుళ ధ్రువ ప్రపంచాన్నే కోరుతున్నాయి’’అని వివరించారు.యూరోపియన్ యూనియన్తో భారత్ ఇటీవలే తన చరిత్రలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని మోదీ గుర్తు చేశారు. అది భారత్, ఫ్రాన్స్ సంబంధాలకు కూడా ఎంతగానో ఊపునిచ్చే పరిణామమేనని ఆయన చెప్పారు. ‘‘ఇరు దేశాల ప్రజలు, కంపెనీలు ఇకపై రెండు పన్నులు కట్టాల్సిన దురవస్థ తప్పింది. పరస్పర వర్తకం, పెట్టుబడులు తదితరాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలకు ఈ ఒప్పందాలు సరికొత్త రోడ్మ్యాప్గా నిలిచాయి’’అన్నారు. హెలికాప్టర్ నిర్మాణ కేంద్రం ప్రారంభం కర్నాటకలోని వెమగల్లో ఎయిర్బస్ హెచ్125 హెలికాప్టర్ల నిర్మాణ కేంద్రాన్ని ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వర్చువల్గా ప్రారంభించారు. ఇరుదేశాల మధ్య పరస్పరం నెలకొన్న లోతైన విశ్వాసానికి ఈ ప్లాంట్ ప్రారంభమే తాజా నిదర్శనమని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ‘‘మౌంట్ ఎవరెస్టును మించిన ఎత్తుల్లో ఎగరగల సామర్థ్యమున్న ఏకైక హెలికాప్టర్ను ఇరుదేశాలూ కలిసి భారత్లో సంయుక్తంగా తయారు చేయనుండటం నిజంగా గర్వకారణం. వాటిని ప్రపంచమంతటికీ ఎగుమతి చేయనున్నాం’’అని ప్రకటించారు. ఈ హెలికాప్టర్ల తయారీ ప్లాంటు ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్, భారత్కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ జాయింట్ వెంచర్భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి: మాక్రాన్ఫ్రాన్స్కు భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి అని మాక్రాన్ పేర్కొన్నారు. రఫేల్యుద్ధ విమానాలు మొదలుకుని జలాంతర్గాముల దాకా రక్షణ రంగంలో ఇరు దేశాల నడుమ పరస్పర సహకారం నానాటికీ పెంపొందుతోందని హర్షం వెలిబుచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో కూడా భారత్, ఫ్రాన్స్ పరస్పరం మరింతగా సహకరించుకుంటాయని ప్రకటించారు. భారత్లో తనకు లభించిన అపూర్వ స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. మాక్రాన్కు భారత్లో ఇది నాలుగో అధికారిక పర్యటన.ఇన్నొవేషన్ల సారథి భారత్: మాక్రాన్ ‘‘గ్లోబల్ ఇన్నొవేషన్లో భారత్ కేవలం భాగస్వామి కాదు. సిలికాన్ వ్యాలీ మొదలుకుని టెక్నాలజీ, సంస్కృతి దాకా అన్ని రంగాల్లోనూ సారథి స్థానంలో రాణిస్తోంది’’ అంటూ మాక్రాన్ ప్రశంసించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోదీతో కలిసి ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నొవేషన్’ను ఆయన ఆవిష్కరించారు. ఇరుదేశాల భాగస్వామ్యాన్ని ప్రజల భాగస్వామ్యంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని నేతలు వివరించారు. ఇందులో భాగంగా పరిశ్రమలు, స్టార్టప్లు, చిన్న–మధ్య తరహా పరిశ్రమలు, విద్యార్థులు, రక్షణ రంగంలో పరిశోధనలు, స్వచ్ఛ ఇంధనం, అంతరిక్షం, నూతన టెక్నాలజీలు తదితర రంగాల్లో పరిశోధనలకు మరింత ఊపు లభిస్తుందని మోదీ అన్నారు. ఇన్నొవేషన్ ఇయర్లో భాగంగా ఆరోగ్యం, డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇండో–ఫ్రెంచ్ ఏఐ సెంటర్లను స్థాపించనున్నారు. ఫ్రాన్స్లో భారత్ త్వరలో స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది.మెరీన్ డ్రైవ్లో మాక్రాన్ జాగింగ్!ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మా క్రాన్ మంగళవారం ఉదయం బాంబేలోని మెరీన్ డ్రైవ్లో జాగింగ్ చేశారు. నీలిరంగు టీ షర్టు, నలుపు షార్ట్స్, రన్నింగ్ షూస్ ధరించిన ఆయన జాగింగ్ చేస్తున్న వారితో కలిసి పోటాపోటీగా పరుగు తీశారు. భద్రతా సిబ్బంది మారువేషాల్లో కాస్త వెనకగా ఆయనను అనుసరించారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మాక్రాన్ను గుర్తు పట్టిన పలువురు ఆయన్ను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించారు. అవన్నీ వైరల్గా మారాయి. మాక్రాన్ విదేశీ పర్యటనల్లో కూడా జాగింగ్ కొనసాగిస్తుంటారు.బాలీవుడ్ తారలతో మాక్రాన్ దంపతుల భేటీఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనలో తారల తళుకులు చోటుచేసుకున్నాయి. పలువురు బాలీవుడ్ తారలతో మాక్రాన్, బ్రిగెటీ దంపతులు మంగళవారం భేటీ అయ్యారు. సినీ పరిశ్రమపరంగా భారత్, ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై వారితో రెండు గంటలకు పైగా చర్చించారు. తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో జోయా అక్తర్, షబానా అజ్మీ, మనోజ్ బాజ్పాయ్, అనిల్ కపూర్, కబీర్ ఖాన్, రిచా ఛద్దా తదితరులు పాల్గొన్నారు. 2008లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న స్లమ్డాగ్ మిలియనీర్ చిత్రమంటే తనకెంతో ఇష్టమని బ్రిగెటీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
పాక్కు భారత్ భారీ షాక్.. ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్!
సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు మరో గట్టి షాక్ ఇచ్చేందుకు భారత్ సిద్దమైంది. రావి నది నుండి పాక్కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా అడ్డుకోవాలని భారత్ నిర్ణయించింది. రావి నదిపై నిర్మిస్తున్న షాపుర్ కండి బ్యారేజీ పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చి 31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.దీంతో ఏప్రిల్ 1 నుండి ఈ బ్యారేజీ ద్వారా పాక్కు వెళ్లే మిగులు జలాలను నిలిపివేయనున్నారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలగా సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల రావి నదిలోని అదనపు నీరు పాక్కు ప్రవహిస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఆ నీటిని ఇకపై పాక్ వెళ్లనివ్వకుండా భారత్ తన సొంత అవసరాల కోసం ఉపయోగించుకోనుంది. ఇదే విషయంపై జమ్మూ కాశ్మీర్ మంత్రి జావేద్ అహ్మద్ రానా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కతువా, సాంబ వంటి కరువు ప్రాంతాలకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. "పాకిస్తాన్కు వెళ్లే అదనపు నీటిని కచ్చితంగా ఆపేయాల్సిందే. ఇకపై అక్కడకు ఒక్క చుక్క నీరు కూడా పోదు"అని జావేద్ పేర్కొన్నారు. కాగా 1960లో జరిగిన సింధూ జలాల ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉన్నాయి. ఇప్పుడు తమ పూర్తి హక్కులను వినియోగించుకునేందుకు భారత్ సిద్దమైంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం, నీటి కొరతతో ఉన్న దాయాది దేశంకు ఇది గట్టి ఎదురు దెబ్బే. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన పాక్ పంజాబ్ ప్రావిన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. -
ఏఐ సమ్మిట్పై సైబర్ నేరగాళ్ల కన్ను!
న్యూఢిల్లీ: భారత్ నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పన్నాగం పన్నారనే నిఘా వర్గాల సమాచారంలో సెక్యూరిటీ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఫిబ్రవరి 20 వ తేదీ వరకూ జరిగే ఈ సదస్సును సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారనే వార్తల నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ అధికారులు హై అలర్ట్ అయ్యారు. ప్రధానంగా డీఫేక్ టెక్నాలజీ ఆధారంగా సోషల్ మీడియాను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేసుకుని ఈ పన్నాగం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం.ప్రభుత్వాధికారులు చెబుతున్నట్లుగా, ప్రపంచ నాయకులపై తప్పుడు లేదా ఫేక్ ప్రకటనలను వ్యాప్తి చేయడానికి డీప్ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడానికి పథక రచన చేశారనే వార్తలు ప్రధాన సవాల్గా మారింది. అలాగే, హ్యాకర్లు ప్రభుత్వ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని భద్రతా లోపాలను కనుగొని వైరస్లను ప్రవేశపెట్టే మాల్వేర్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రతినిధుల అధికారిక సోషల్ మీడియా ఖాతాల సెషన్ టోకెన్లు దొంగిలించే అవకాశం ఉంది. నకిలీ వై-ఫై హాట్స్పాట్ల ద్వారా సమాచారం లీక్ చేసే ప్రమాదం ఉంది. ప్రధాన డిజిటల్ ప్లాట్ఫారమ్లను స్థంభింపజేయడానికి DDoS దాడులు జరగవచ్చు. కీలక మౌలిక వసతులను దెబ్బతీయడానికి రాన్సమ్వేర్ దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం(ఫిబ్రవరి 16వ తేదీ) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సదస్సుపై తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి పలు ఆన్లైన్ ఫ్లాట్ఫారమ్లు క్షుణ్ణంగా పర్యవేక్షణలో నిమగ్నమయయాయి. -
వీడిన ఉత్కంఠ.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు బిల్గేట్స్
ఢిల్లీ: భారత్ నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ హాజరుకాకపోవడంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో బిల్గేట్స్ హాజరుకానున్నట్లు గేట్స్ ఫౌండేషన్ అధికార ప్రతినిధులు వెల్లడించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఢిల్లీలో ‘భారత్ మండపం’లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను నిర్వహిస్తుంది. అయితే, ఈ సమ్మిట్ అధికారిక వెబ్సైట్ అతిథుల లిస్టులో బిల్గేట్స్ పేరు లేదు. కేంద్రం సైతం ఆయన్ను ఆహ్వానించే విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అందుకు దుమారం రేపుతున్న ఎప్స్టిన్ ఫైల్స్లో బిల్గేట్స్ పేరు ఉండడమే కారణమని తేలింది. దీంతో సమ్మిట్ వెబ్సైట్లో గేట్స్ పేరు లేకపోవడం వల్ల ఆయనకు ఆహ్వానం రద్దయిందంటూ పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో సైతం వార్తలు చక్కెర్లు కొట్టాయి. ఈ క్రమంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘బిల్ గేట్స్ ఫిబ్రవరి 19న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొని తన ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు’ అని వెల్లడించారు.ఎప్స్టిన్ ఫైల్స్లో బిల్గేట్స్ పేరు.. తాజాగా అమెరికాలో బయటపడిన ఎప్స్టిన్ ఫైల్స్ వివాదం నేపథ్యంలో బిల్గేట్స్ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్స్టిన్ ఫైల్స్లో బిల్ గేట్స్కు రష్యా మహిళలతో అక్రమ సంబంధాలు ఉండేవని, ఈ కారణంగా సుఖవ్యాధులకు గురైన ఆయన.. తన భార్యకు అవి సంక్రమించకుండా వ్యాక్సిన్లు కూడా ఇచ్చేవారని బయటపడింది. ఈ వివాదం కారణంగానే తాను బిల్ గేట్స్కు విడాకులు ఇచ్చినట్లు.. ఎప్స్టిన్ ఫైల్స్లో బిల్గేట్స్ పేరు వెలుగులోకి వచ్చిన వేళ ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ వెల్లడించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా బిల్గేట్స్పై విమర్శలు వెల్లువెత్తాయి. -
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో సెన్సేషన్గా అందాల ‘ఐరా’
క్రికెట్ మ్యాచ్లు జరుగుతుఉన్నపుడు కేవలం ఓవర్లు పరుగులు, బాల్స్, వికెట్స్, విజయాలు, రికార్డులు మరికొంతమంది కూడా విశేషంగా మారిపోతుంటారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా అవతరిస్తారు. ఇటీవల భారతదేశం , అమెరికా మధ్య జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాయ్లో ఇలాంటి విశేషమే చోటు చేసుకుంది. ఒక అందాల ముందు గుమ్మ ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయింది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ 3వేల 3.77 లక్షలకు పెరిగిందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.ICC పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తళుక్కున మెరిసింది ఐరా రావత్ (Aira Rawat). ఆ క్షణం ఆన్లైన్లో సంచలనం సృష్టించింది. ఇండియా vs USA మ్యాచ్ సందర్భంగా కెమెరా ప్యాన్ అవుతూన్న సందర్భంలో ఒక యువతి వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతే నిమిషాల్లోనే, ఇంటర్నెట్ ఆమె ఫోటోలు, వీడియోలతో నిండిపోయింది. మ్యాచ్ రోజున ఆమె నీలం రంగు టీ-షర్టు, తెల్లటి షార్ట్ స్కర్ట్ ధరించి స్టేడియంలో సందడి చేసింది. ఉత్కంఠగా జరుగుతున్న మ్యాచ్ మధ్యలు ఆమె హావభావాలు మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. టీమిండియా పట్ల అమె అభిమానానికి,ఆమె క్రికెట్ వైబ్స్కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆసక్తికరంగా, తోటి క్రికెట్ ప్రేమికులతో కలిసి గ్రూప్ సెల్ఫీ తీసుకుంటున్న రావత్ ఫోటోలు కూడా వైరల్గా మారాయి.ఇదీ చదవండి: తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్ ఎవరీ ఐరాఇరా రావత్ నిజమైన వ్యక్తినా లేక AI-జనరేటెడ్ ఐడెంటిటీనా అన్న ఊహాగానాలకు భారీగా వ్యాపించాయి. ఐరాకు క్రికెట్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టమట. ఇన్స్టాగ్రామ్ పేజీలో, క్రికెట్ స్టేడియంలో పోజులిచ్చిన కొన్ని ఫోటోలను చూడవచ్చు. ప్రత్యక్ష మ్యాచ్లను చూడటానికి రావత్ తరచుగా స్టేడియాలలో వాలిపోతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లకు ఆమె వీరాభిమాని. నిజానికి, ఒకసారి విరాట్ కోహ్లీని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని కూడా చెప్పింది రావత్. విరాట్ అనుష్క శర్మను వివాహం చేసుకున్నప్పుడు రావత్ వయసు దాదాపు 18 సంవత్సరాలు. అంతేనా ఐరా రావత్ మంచి ఫ్యాషన్ ఐకాన్ కూడా. అందుకే తన బయోలో తనని తాను ఫ్యాషన్ డ్రీమర్ అని పేర్కొంది. ఫ్యాషన్ , స్టైలింగ్ పట్ల ఆసక్తి ఎక్కువటఇరా రావత్ గురించి నిజం ఏమిటంటే..ఇరా రావత్ నిజమైన వ్యక్తినా లేక AI-జనరేటెడ్ ఐడెంటిటీనా అనే దానిపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ విడుదల కాలేదు. అయితే, కొన్ని AI డిటెక్షన్ టూల్స్ , డిజిటల్ విశ్లేషకులు ఆమె వైరల్ చిత్రాలను "అనుమానాస్పదంగా" ఫ్లాగ్ చేయడంతో ఇవి ఏఐమాయాజాలమే అనే ఊహాగానాలకు మరింత పెరిగాయి. AI-జనరేటెడ్ కంటెంట్ వాస్తవికంగా మారుతున్న నేటి డిజిటల్ యుగంలో, అసలైన, వర్చువల్ ఐడెంటిటీల మధ్య రేఖను గుర్తించడం చాలా కష్టతరంగామారింది. అందుకే గుడ్డిగా నమ్మకుండా వినియోగదారులు ఇలాంటి ప్రొఫైల్స్ను ఫాలో అయ్యేముందు ప్రామాణికతను ధృవీకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.(కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్) View this post on Instagram A post shared by Aira Rawat (@aira_rawat_) -
ధూమపాన ప్రియులకు భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల సిగరెట్లపై జీఎస్టీని 28 నుంచి 40 శాతానికి పెంచడంతో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీని విధించడంతో సిగరెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఫిబ్ర వరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రావాల్సి ఉండగా, ఇంకా మార్కెట్లో ఆ మేరకు సవరించిన గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ)లతో స్టాకు రాలేదు. దీంతో డిమాండ్కు సరిపడా సరఫరా లేక మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడింది. కేంద్రం జీఎస్టీ, సుంకం పెంచిందనే సాకుతో డీలర్లు పాత స్టాకునే 50 శాతం వరకు ధరలు పెంచి రిటైల్ వర్తకులకు సరఫరా చేస్తున్నారు. దీంతో రిటైల్ మా ర్కెట్లో ఎంఆర్పీ కంటే 60–70 శాతం అధిక ధరలతో సిగరెట్లను విక్రయిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే సిగరెట్ల ధరలను మూడు పర్యాయాలు పెంచేయడం గమనార్హం. కృత్రిమ కొరత తీరకపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రిటైల్ వర్తకులు పేర్కొంటున్నారు. సిగరెట్ల ఉత్పత్తిదారుల నుంచి సరఫరా లేదని పేర్కొంటూ డీలర్లు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిగరెట్ల విక్రయాల రంగంలో 80 శాతం మార్కెట్ షేర్తో ఐటీసీ లిమిటెడ్ కంపెనీ ఆధిపత్యం కొనసాగిస్తుండగా, గాడ్ఫ్రె ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, వీఎస్టీ, గోల్డెన్ టొబాకో, ఎన్టీసీ ఇండస్ట్రీస్, ఇలైట్కాన్ కంపెనీలు మిగిలిన షేర్ను కలిగి ఉన్నాయి. కొత్త ఎంఆర్పీ ధరలతో ఈ కంపెనీలు స్టాకు సరఫరా ప్రారంభిస్తే సిగరెట్ల ధరల్లో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ధరల విషయంలో డీలర్ల ఇష్టారాజ్యం కొనసాగనుంది. కాగా, నిబంధనల ప్రకారం ఎంఆర్పీ ధరలకి మించి రిటైల్ మార్కెట్లో విక్రయాలు జరపరాదు. నెల రోజులకు పైగా సిగరెట్లను ఎంఆర్పీ ధరల కంటే 50–60 శాతం అధిక ధరలతో విక్రయిస్తున్నా తూనికలు, కొలతల శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పెరిగిన ఎంఆర్పీ ధరలతో కొత్త స్టాకు మార్కెట్లోకి వచ్చాకే ఆ మేరకు ధరలను పెంచాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. కింగ్ సైజ్ బాదుడు... సిగరెట్ల సైజును బట్టి ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్రం ఎక్సైజ్ సుంకాల చట్టానికి సవరణ జరిపింది. 40 శాతం జీఎస్టీకి తోడు ఎక్సైజ్ సుంకం తోడు కావడంతో సైజు పెరిగిన కొద్దీ సిగరెట్ల ధరలు మరింత పెరిగిపోయాయి. 76ఎంఎం సిగరెట్ల ప్యాక్పై రూ.50–55 వరకు ధరలను పెంచేశారు. ఇక 84 ఎంఎం పొడవు కలిగి ఉండే కింగ్ సైజ్ 10 సిగరెట్ల ప్యాక్పై రూ.70 వరకు ధర పెరిగిపోయింది. 97 ఎంఎం స్లిమ్ సైజు సిగరెట్ల ధరలూ రూ.50–60 వరకు పెరిగాయి. -
‘7 సిస్టర్స్’పై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ పదవి నుండి తప్పుకుంటున్న తరుణంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన వీడ్కోలు ప్రసంగంలో ఆయన భారత్లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్లతో కలిపి ప్రస్తావించడం గమనార్హం. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో యూనస్ వ్యాఖ్యలు మరింత విదాస్పదంగా మారాయి.భారత అంతర్భాగమైన ఈ రాష్ట్రాలను సార్వభౌమాధికారం గల దేశాలతో పోలుస్తూ, సరిహద్దుల రేఖలను చెరిపివేసే ప్రయత్నం చేశారని విశ్లేషకులు యూనస్పై మండిపడుతున్నారు. తన 18 నెలల పాలనా కాలంలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానం ఏ దేశానికీ లొంగి ఉండలేదన్నారు. దేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా సాగిందని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సముద్ర తీరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానానికి ఒక బహిరంగ ద్వారమని యూనస్ అభివర్ణించారు.నేపాల్, భూటాన్, భారత ఈశాన్య రాష్ట్రాలతో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందని యూనస్ పేర్కొన్నారు. భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా కేవలం ‘సెవెన్ సిస్టర్స్’ అని సంబోధించడం ద్వారా భారత్ పట్ల తనకున్న వ్యూహాత్మక వైఖరిని ఆయన ప్రదర్శించారు. ఇది నూతన ప్రభుత్వ హయాంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాల పునరుద్ధరణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 2024లో బాధ్యతలు చేపట్టిన యూనస్ యంత్రాంగం ఇప్పుడు తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)కి అధికారాన్ని అప్పగిస్తోంది. ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో 297 సీట్లకు గాను 209 స్థానాలను గెలుచుకున్న బీఎన్పీ నేడు (మంగళవారం)ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.తన హయాంలో చైనా, జపాన్, అమెరికా, ఐరోపా దేశాలతో సంబంధాలను బలోపేతం చేశామని యూనస్ తెలిపారు. ముఖ్యంగా చైనా సహాయంతో తీస్తా నది ప్రాజెక్టు, నీల్ఫామరి ఆస్పత్రి ప్రాజెక్టులలో పురోగతి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే సుమారు 130 కొత్త చట్టాలను రూపొందించామని, సైనిక ఆధునీకరణ ద్వారా ఏ రకమైన దురాక్రమణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యామని ఆయన వివరించారు.మరోవైపు యూనస్ పాలనలో భారత్తో సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. బంగ్లాదేశ్లో హిందువులతో సహా మైనారిటీలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతల వైఫల్యంపై భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక సంబంధాలపై కూడా ప్రభావం చూపాయి. దేశీయంగా కూడా మైనారిటీల రక్షణ, ప్రజాస్వామ్య పరివర్తన విషయంలో యూనస్ ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కొంది. ఇది కూడా చదవండి: అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ -
అమెరికా ఎఫెక్ట్?.. ఇరాన్ చమురు నౌకలు సీజ్?
ఇటీవల ఇండియన్ నేవీ అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను సీజ్ చేసింది. అయితే తాజాగా వాటికి సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. ఆ నౌకలు ఇరాన్కు చెందినవని తెలుస్తోంది. అమెరికా వీటిని గతంలోనే నిషేదించిందని తెలుస్తోంది.ఫిబ్రవరి 6న ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను సీజ్ చేసినట్లు ఇండియన్ నేవీ అధికారులు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ నౌకల పేర్లు స్టెల్లర్ రూబీ, అస్ఫల్ట్ స్టార్, అల్ జాఫ్జియాగా తెలిపారు. అనంతరం కొద్దిసేపటికి ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అయితే తాజాగా ఆ నిషేదిత నౌకలకు ఇరాన్కు సంబంధించినవిగా మీడియా కథనాలు ప్రచురితమవుతున్నాయి.వాషింగ్టన్ డీసీకి చెందిన పరిశోధనా సంస్థ ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ (FDD) ప్రకారం, “ ఈ మూడు ఇరాన్ నౌకలను అమెరికా గతంలో నిషేధించింది. ఈ నౌకలు యూఏఈకి చెందిన భారతీయ పౌరుడు జుగ్వీందర్ సింగ్ బ్రార్ 30-ట్యాంకర్ల నౌకాదళానికి చెందినవి. వీటిని సీజ్ చేసిన సమయంలో స్టెల్లార్ రూబీ నౌకపై ఇరాన్ జెండా ఎగురుతుంది“ ఎఫ్డీడీ పేర్కొంది. అల్ జాఫ్జియా నౌక 2025లో ఇరాన్ నుండి జిబౌటికి ఇంధన చమురును రవాణా చేసింది. ఆస్ఫాల్ట్ స్టార్ ఎక్కువగా చైనా చుట్టూ ప్రయాణాలపై నడిచిందని డేటాలో పేర్కొంది.అయితే ఇరాన్ ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది. నేషనల్ ఆయిల్ కంపెనీ చర్యలను ఊటంకిస్తూ సీజ్ అయిన నౌకలకు ఆ కంపెనీతో సంబంధం లేదని తెలిపింది. అయితే గతంలో ఈ నౌకలు స్వాధీనం చేసుకున్న తర్వాత భారత నేవికా దళం భద్రతను మరింతగా పెంచింది.అయితే ప్రస్తుతం అమెరికా భారత్ మధ్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ఇటీవల భారత్పై విధించిన అధిక పన్నులను తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధానితో ఫోన్లోనూ చర్చించారు. దీనికి మోదీ సైతం ధన్యవాదాలు తెలిపారు. -
ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఎక్స్పో!
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూసిన ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ సదస్సు ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని భారత మండపంలో సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పలు కంపెనీలు, స్టార్టప్లు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన కలియదిరిగారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తదితరులతో మాటలు కలిపారు. వారి పరిశోధనలు తదితరాలను గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ దాకా జరిగే ఈ ఐదు రోజుల సదస్సులో 600కు పైగా భారీ స్థాయి స్టార్టప్లు పాలుపంచుకోనున్నాయి. వాటితో పాటు 13 దేశాలకు చెందిన ఏఐ పెవీలియన్లు తమ ప్రత్యేకతను చాటేందుకు సిద్ధమయ్యాయి. గ్లోబల్ సౌత్లో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వాతో పాటు 20 మందికి పైగా దేశాధినేతలు, 60కి పైగా దేశాల నుంచి మంత్రులు పాల్గొంటున్నారు. అంతేగాక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో పాటు పలు ఏఐ దిగ్గజ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు కూడా హాజరై ఈ రంగంలో విస్తరణకు అమలు చేయదలచిన ప్రణాళికలు తదితరాలను ఆహూతులతో పంచుకోనున్నారు. 19వ తేదీన సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అదే తేదీన మాక్రాన్ కూడా సదస్సులో పాల్గొంటున్నారు. భారత్కే గాక ప్రపంచమంతటికీ పలు రంగాలకు సంబంధించిన కీలక సవాళ్లకు ఈ సదస్సు సమర్థమైన పరిష్కారాలు చూపగలదని ప్రధాని విశ్వాసం వెలిబుచ్చారు. ఇన్నొవేటర్లు, పరిశోధకులు, టెక్ ఔత్సాహికుల నడుమ గడపడం ఎనలేని ఆనందాన్ని ఇచి్చనట్టు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ‘‘ఇండియా ఏఐ ఎక్స్పోను ప్రారంభించా. ఇంతటి కీలకమైన సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తుండటం హర్షణీయం’’అన్నారు. ‘గ్లోబల్ ఏఐ గవర్నెన్స్’కు ఈ సదస్సు స్పష్టమైన రోడ్మ్యాప్ను అందజేస్తుందని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. అంతకుముందు వేదిక వద్ద జియో ఏఐ ఎకో సిస్టమ్స్ స్టాల్ను ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు. తొలి రోజు విస్తృత చర్చలు ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోకు కేంద్రం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది. భారత్ మండపంలో 10 వేదికల్లో 70 వేల చదరపు మీటర్లకు పైగా విస్తరించిన ప్రాంతంలో స్టాళ్లు, స్టార్టప్లు, ఏఐ వేదికలు కనువిందు చేస్తున్నాయి. సోమవారం ఉదయానికే భారీ సంఖ్యలో తరలివచి్చన పలు ప్రఖ్యాత ఏఐ సంస్థల సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు తదితరులతో వేదికతో పాటు పరిసరాల్లోని హాల్లన్నీ నిండిపోయాయి. వారంతా బృందాలుగా ఏర్పడి పలు రంగాల్లో ఏఐ ప్రభావం, దాని మంచిచెడులను గురించి చర్చోపచర్చల్లో మునిగితేలారు. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రపంచ స్థాయి దిగ్గజ ఏఐ సంస్థలు, స్టార్టప్లు, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, పలు దేశాలకు చెందిన ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి పరస్పరం అనుభవాలు, అభిప్రాయాలను పంచుకోనున్నాయి. ఏఐ దెబ్బకు పలు రంగాల్లో భారీగా కొనసాగుతున్న కొలువుల కోత మొదలుకుని బాలల భద్రత దాకా భిన్నమైన అంశాలు, సమస్యలపై చర్చలు, పరిష్కార మార్గాల అన్వేషణకు సదస్సు వేదిక కానుంది. 13కు పైగా దేశాలు ఇప్పటికే మండపంలో ప్రత్యేక పెవీలియన్లు ఏర్పాటు చేశాయి. ఆ్రస్టేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్టోనియా, తజకిస్తాన్ వంటివి వీటిలో ఉన్నాయి. 300కు పైగా క్యూరేటెడ్ ఎగ్జిబిషన్ పెవీలియన్లు ఆకట్టుకోనున్నాయి. ‘పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్’ థీమ్తో కూడిన లైవ్ డెమాన్్రస్టేషన్లు కంపెనీల ఏఐ ప్రణాళికలను కళ్లకు కట్టనున్నాయి. రెండున్నర లక్షల మందికి పైగా ఏఐ సదస్సును సందర్శిస్తారని భావిస్తున్నారు. -
రూ.215 లక్షల కోట్లకు రిటైల్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశ రిటైల్ మార్కెట్ వేగవంతమైన వృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. 2025 నాటికి భారత రిటైల్ మార్కెట్ రూ.90–95 లక్షల కోట్ల పరిమాణంతో ఉండగా, 2035 నాటికి అంటే వచ్చే పదేళ్లలో రూ.210–215 లక్షల కోట్ల స్థాయికి విస్తరిస్తుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) అంచనా వేసింది. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మించి భారత్ మంచి పనితీరు చూపిస్తుండడంతోపాటు, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకోనున్నట్టు గుర్తు చేసింది. భారత రిటైల్ రంగం తదుపరి వృద్ధి దశలోకి ప్రవేశించిందంటూ.. స్పష్టత, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, ఏఐ ఆధారిత పరివర్తనపై దృష్టి సారించిన సంస్థలను విజయం వరిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను బీసీజీ, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. వినియోగదారులతో అనుబంధం, నిర్వహణ నమూనాలు, నైపుణ్యాల విషయంలో నిర్మాణాత్మక మార్పులను స్వీకరించే సంస్థలు రూ.200 లక్షల కోట్ల రిటైల్ మార్కెట్లో గణనీయమైన విలువను సొంతం చేసుకుంటాయని ఈ నివేదిక తెలిపింది. కస్టమర్లకు ప్రత్యేకమైన విలువను అందించడం, స్థిరమైన లాభదాయకతను కొనసాగించేందుకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఎంతో కీలకమని పేర్కొంది. వినియోగదారుల నిర్ణయాలను, ముఖ్యంగా ఏఐ ప్రభావితం చేస్తుండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. టెక్నాలజీ పాత్ర కీలకం.. ‘‘భారత రిటైల్ ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. వచ్చే దశాబ్ద కాలంలో రూ.200 లక్షల కోట్లకు విస్తరించనుంది. ఆఫ్లైన్, ఆన్లైన్ రిటైల్ సంస్థల నగదు ప్రవాహాలు స్పష్టమైన పురోగతిని చూపిస్తున్నాయి. విస్తరణలో ఏఐ వంటి టెక్నాలజీల విస్తృత వినియోగం, అత్యుత్తమ నిర్వహణ, ప్రత్యేకమైన విలువను అందించే సంస్థలే విజేతలుగా నిలుస్తాయి’’అని బీసీజీ ఎండీ అభీక్సింఘి తెలిపారు. ఏజెంటింక్ కామర్స్ అన్నది ప్రయోగాత్మక దశ నుంచి ఆచరణ దశకు వచ్చేసిందని.. పరిశోధన, కొనుగోలు నిర్ణయాలను జెన్ఏఐ ప్రభావితం చేస్తోందని ఈ నివేదిక తెలిపింది. అమెరికాలో ఇప్పటికే 42 శాతం మంది వినియోగదారులు జెన్ఏఐని వినియోగిస్తున్నట్టు పేర్కొంది. ‘‘వినియోగదారులు ఉత్పత్తిని గుర్తించడం, పరిశీలించడం, కొనుగోలు చేయడాన్ని అంతర్జాతీయంగా ఏజెంటిక్ కామర్స్ ప్రభావితం చేస్తోంది. భారత్లో డిజిటల్ వినియోగం బలంగా ఉంది. కనుక పట్టణ ప్రాంతాల్లో ఏఐ ఆధారిత షాపింగ్, ముఖ్యంగా జెన్ జెడ్లో వేగవంతం అవుతుంది’’అని బీసీజీ ఎండీ, పార్ట్నర్ భారత్ మిమానీ తెలిపారు. ఉత్పత్తులు, సరఫరా చైన్, మార్కెటింగ్, సేవలు ఇలా అన్నింటా ఏఐ వినియోగంతో 40–60 శాతం అధిక ప్రయోజనాలను రిటైలర్లు పొందగలరని ఈ నివేదిక తెలిపింది. ‘‘డిమాండ్ బలంగా ఉంది. వినియోగదారులు వివేకంతో వ్యవహరిస్తున్నారు. రిటైలర్లు ఆవిష్కరణలకు ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ పరివర్తనను ఒక ప్రాజెక్టుగా కాకుండా క్రమశిక్షణగా పరిగణించే సంస్థలు, అన్ని ఫార్మాట్లలో స్థిరమైన సేవలు అందించేవి వచ్చే దశాబ్దంలో విజేతలుగా నిలుస్తాయి’’ అని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో కుమార్ రాజగోపాలన్ అభిప్రాయపడ్డారు. -
వడివడిగా ఏఐ దిశగా...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సృష్టించిన అనిశ్చితి సకల రంగాలనూ ఆవరించిన వేళ కృత్రిమ మేధ (ఏఐ) శిఖరాగ్ర సదస్సు సోమవారం దేశ రాజధాని నగరంలో ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో భారత్ ‘బాధ్యతాయుత ఏఐ’ అనే భావన నుంచి కోట్లాదిమంది వినియోగదారులు నేరుగా, భద్రంగా వాడుకునే పూర్తిస్థాయి ఏఐ వినియోగంలోకి తెచ్చే స్థాయికి ఎదిగింది. భారత్–విస్తార్ పేరిట 24 గంటలూ అన్ని ప్రాంతాల రైతులకూ వారి భాషల్లోనే సాగు రంగ సమస్యలపై సమాధానాలిచ్చే ఏఐ ‘డిజిటల్ సాగు నిపుణుడు’ రాబోతున్నాడు. ఇంకా ఆరోగ్య రంగంతో పాటు ఆరు కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అక్కరకొచ్చే ఏఐ మోడళ్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ సదస్సు ద్వారా దేశ ఏఐ రంగంలో 20,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా, బ్లాక్స్టోన్ తదితర సంస్థలు 12,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ట్రంప్ సృష్టించిన అనిశ్చితి సంగతలా ఉంచి, ఏఐ రంగంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న సమస్యలు సైతం పెట్టుబడుల విషయంలో ఊగిసలాటకు తావిస్తున్నాయి. భవిష్యత్తు ఏఐదే అనే భరోసా ఉన్నమాట నిజమే అయినా... హఠాత్తుగా ఊహించని రీతిలో దూసుకొస్తున్న సరికొత్త ఆవిష్కరణలు అప్పటికే నిలదొక్కుకున్న సంస్థల్ని అయోమయంలో పడేస్తున్నాయి. భారీ పెట్టుబడులతో తీసుకొస్తున్న ఆవిష్కరణలు కాస్తా, అంతకన్నా చవగ్గా తయారవుతుంటే... వినియోగదారులు అటువైపు పరుగులు పెడుతుంటే ఆ సంస్థలకు దిక్కుతోచటం లేదు. 1,300 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి శ్రమించి చాట్ జీపీటీ మోడల్ను తీసుకొచ్చిన సామ్ ఆల్ట్మాన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ఏఐ... నిరుడు జనవరిలో డీప్సీక్ ఉరుములేని పిడుగులా వచ్చిపడేసరికి బెంబేలెత్తిపోయింది. దాంతోపాటు దిగ్గజ సంస్థలు అనేకం నిరాశలోకి జారుకున్నాయి. కానీ ఆ వెంటనే డీప్సీక్పై భారీ స్థాయి సైబర్ దాడి జరగటం, పైగా అది చైనా నియంత్ర ణలకు లోబడి ఉంటుందని తెలియడం పర్యవసానంగా అనేక దేశాలు పలు నియంత్రణలు విధించాయి. దాంతో డీప్సీక్ దూకుడుకు కాస్త కళ్లెం పడింది. ఇటీవల ఆంత్రోపిక్ సృష్టించిన ప్రకంపనలు సామాన్యమైనవి కాదు. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు దాని ధాటికి విలవిల్లాడాయి. అది తీసుకొచ్చిన క్లాడ్ 3.5 సానెట్, క్లాడ్ 3 ఓపస్ మోడళ్లు చాట్ జీపీటీని తలదన్నేలా ఉండటమే అందుకు కారణం. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకుని, అందులో నాయకత్వ పాత్ర పోషించాలని మన దేశం నిశ్చయించుకుంది. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు రెండు దశాబ్దాలపాటు పన్ను మినహాయింపునిస్తామని ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ప్రకటించటం అందులో భాగమే. కనుకనే భిన్న దిగ్గజ సంస్థలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కొస్తున్నాయి. ఏఐ రంగంలో 90 శాతం పేటెంట్లు అమెరికా, యూరప్, చైనాలవే. 2024లో అమెరికా నుంచి వచ్చిన ఏఐ మోడళ్లు 40 కాగా, 15తో చైనా రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న యూరప్ ఖాతాలో మూడే ఉన్నాయి. దాన్నిబట్టి మనం మరెంతగా ఎదగాలో అర్థం చేసుకోవచ్చు. పరిశోధన, అభివృద్ధికి భారీ కేటాయింపులు చేస్తేనే అందులో మన కంటూ మెరుగైన స్థానం దక్కుతుంది. మన జీడీపీలో ఇందుకోసం కేటాయిస్తున్నది అక్షరాలా 0.7 శాతం మాత్రమే. అమెరికా 3.5 శాతం,చైనా 2.7 శాతం వెచ్చిస్తున్నాయి. ట్రంప్ వ్యవహార శైలి వల్ల అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయత దెబ్బతింది. అది హఠాత్తుగా సహాయ నిరాకరణ చేస్తే సర్వం స్తంభించిపోయే స్థితి ఏర్పడుతుందని తెలిసిరావటం వల్ల చాలా దేశాలు సార్వభౌ మత్వాన్ని కాపాడుకునే స్థాయి ఏఐ కావాలని కోరుకుంటున్నాయి. మనం మెరుగైన వ్యూహంతో, అందుకు తగిన ఆచరణతో ముందుకెళ్తే ఏఐ రంగంలో నాయకత్వ స్థాయికి ఎదగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పరిణామాలు చెబుతున్నాయి. ఏఐ నుంచి అచ్చం మనిషిలా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో గలిగిన ఏజీఐ (కృత్రిమ సాధారణ మేధ) స్థాయికి సాంకేతికత చేరుకోబోతున్న ఈ దశలో ఢిల్లీ శిఖరాగ్ర సదస్సు తీసుకోబోయే నిర్ణయాలు భారత్ను ఈ రంగంలో అగ్రగామిగా నిలబెట్టగలవని ఆశించాలి. -
ఇజ్రాయెల్కు మోదీ.. షెడ్యూల్ ఫిక్స్..!
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. ఆయన పర్యటన వివరాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ స్వయంగా వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.ఇజ్రాయెల్ ప్రధాని ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. "భారత ప్రధాని వచ్చేవారం ఇజ్రాయెల్ పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం అద్భుతమైన సంబంధాలున్నాయి. ఇప్పుడు మరిన్ని అంశాలపై చర్చించబోతున్నాం. మనందరికి తెలుసు ఇండియా చిన్న దేశం కాదు. 140 కోట్ల జనాభా ఉన్న దేశం. చాలా శక్తివంతమైనది. చాలా పాపులరైంది" అని అన్నారు.ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో రెండు దేశాల సిద్ధాంతం ప్రతిపాదిస్తూనే టెల్ అవీవ్తో సత్సంబంధాలు కొనసాగిస్తుందని తెలిపారు. అయితే దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.. "నా మిత్రుడు ప్రధాని నెతన్యూహుతో ఇదివరకే ఫోన్లో సంభాషించాను. ఇజ్రాయెల్-ఇండియా వ్యూహాత్మక సంబంధాలపై చర్చించాము. రెండుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం దిశగా చర్చలు జరుపుతున్నాము. అదేవిధంగా టెర్రరిజాన్ని మాత్రం ఎట్టిపరిస్థితిలో సహించేది లేదు. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధించేందుకు భారత్ తన పూర్తి సహాకారాన్ని అందిస్తుంది." అని మోదీ అన్నారు. భారత ప్రధాని ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని భారత్లో పర్యటించాల్సి ఉండగా పలు కారణాలతో ఆయన పర్యటన రద్దైంది. -
పాక్ నిఘా'హనీ-ట్రాప్' ముప్పు : పోలీసులకు కేంద్రం హెచ్చరిక
భారతీయ పోలీసులపై పాకిస్తాన్ హనీ ట్రాప్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తోంది. పాక్ నిఘా వర్గాలు సోషల్ మీడియా వేదికగా భారత పోలీసులను లక్ష్యంగా చేసుకుని 'హనీ-ట్రాప్' (అందమైన యువతుల ఫోటోలతో బురిడీ కొట్టించడం)కు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) పోలీసు సిబ్బందికి తాజాగా కొన్ని హెచ్చరికలను జారీ చేసింది.పాకిస్తాన్ నిఘా సంస్థల "హనీ-ట్రాపింగ్" ప్రయత్నాలు పెరుగుతున్నట్టు గమనించిన, MHA ఈ ముప్పును ఎదుర్కోవడానికి, సోషల్ మీడియా సురక్షిత వినియోగంపై మంత్రిత్వ శాఖ వివరణాత్మక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) విడుదల చేసింది.ఈ మార్గదర్శకాలను గత ఏడాది నవంబరు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్మెంట్ జారీ చేసింది. పోలీసు అధికారులతో స్నేహం చేసి, సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా సేకరించడానికి Facebook, X, Instagram, WhatsApp, Telegram, LinkedIn వంటి ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను వాడుకుంటాయి.ముఖ్యమైన మార్గదర్శకాలు (SOP):సోషల్ మీడియా ప్రొఫైల్స్లో తాము పోలీసు అధికారులమని బహిర్గతం చేయకూడదు.అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. అనామకుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించ వద్దు. ముఖ్యంగా యువతుల ఫోటోలతో ఆకర్షించే ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.ఆన్లైన్ పోస్ట్లు కేవలం మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారికి మాత్రమే కనిపించేలా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవాలి.ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో (WhatsApp, Telegram, etc.) అధికారిక పత్రాలను లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకోకూడదు.ఉద్యోగాలు, ఉచిత పర్యటనలు లేదా ప్రభుత్వ ఆఫర్ల పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దు. ధృవీకరించని యాప్లను డౌన్లోడ్ చేయడం, తెలియని లింక్స్ క్లిక్ చేయడం, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో పత్రాలను పంచుకోవడం చేయకూడదు.ఇదీ చదవండి: అవును వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు : ఫ్యాన్స్కు వాలెంటైన్స్ డే సర్ప్రైజ్ఒకవేళ హనీ-ట్రాప్కు గురైతే ఏం చేయాలి?ఒకవేళ హనీ-ట్రాప్కు గురైతే ఏం చేయాలనేదానిపై కూడా సూచనలు అందించింది. ఒకవేళ ఎవరైనా అధికారి హనీ ట్రాప్ ఉచ్చులో పడినట్లు అనుమానం వస్తే, తక్షణమే సదరు అధికారికి చెందిన డిజిటల్ పరికరాలను (ఫోన్లు, ల్యాప్టాప్స్) వెంటనే స్వాధీనం చేసుకోవాలి.ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి. స్టేట్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ ఈ నిబంధనల అమలును పర్యవేక్షిస్తుంది. దృఢమైన పాస్వర్డ్లు, రెండు-కారకాల ప్రామాణీకరణ, పరిమిత యాప్ అనుమతులు, సాధారణ గోప్యతా తనిఖీల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. సోషల్ మీడియాలో చేసే పోస్ట్లకు ఆయా పోలీసు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రహస్య సమాచారాన్ని లీక్ చేస్తే క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్ -
భారత్ కు మహాశివరాత్రి.. పాక్ కు కాళరాత్రి...
-
బ్రిటన్తో వాణిజ్య ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది జూలై 24న ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)పై సంతకం చేశాయి. 2030 నాటికి 56 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఇది అమల్లోకి వస్తే చాక్లెట్లు, బిస్కెట్లు, సౌందర్య సాధనాలు వంటి వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. అంతేకాదు స్కాచ్ విస్కీపై 150 శాతం ఉన్న సుంకం 75 శాతానికి తగ్గనుంది. 2035 నాటికి 40 శాతానికి తగ్గిస్తారు. ప్రస్తుతం 110శాతం ఉన్న సుంకాలను రానున్న ఐదేళ్లలో 10శాతానికి తగ్గించనున్నారు. ఇవన్నీ దశలవారీగా అమలు కానున్నాయి. ఇక భారత్కు చెందిన వ్రస్తాలు, పాదరక్షలు, రత్నాలు–నగలు, క్రీడా సామగ్రి, బొమ్మలు వంటి ఉత్పత్తులను యూకేకు ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులను కూడా పన్నుల సుంకాలు లేకుండా ఎగుమతి చేసే లభించనుంది. ఈ ఒప్పందంతో దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. యూకే పార్లమెంట్ ఆమోదం తర్వాతే... అయితే ఈ ఒప్పందం అమలు కావడానికి ముందు యూకే పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. ఇటీవల యూకే పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ ఈ ఒప్పందంపై చర్చించింది. ఈ సందర్భంగా వాణిజ్య శాఖ మంత్రి క్రిస్ బ్రయంట్ మాట్లాడారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక విజయమన్నారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ముందు రెండు సభల్లో చర్చలు, సమీక్షలు నిర్వహిస్తాయని తెలిపారు. -
నేటి నుంచే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు
న్యూఢిల్లీ: విద్యుత్ ఆవిష్కరణ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోనూ సమూల మార్పులకు కారణమవుతున్న కృత్రిమ మేధ సాంకేతికతపై కూలంకషమైన చర్చకు దేశ రాజధానిలోని భారత్ మండపం సిద్ధమైంది. సోమవారం నుంచి 20వ తేదీ దాకా ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాయంత్రం ఐదింటికి సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనేందుకు 45 దేశాలకు చెందిన మంత్రుల బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు అంతర్జాతీయ సంస్థల అధ్యక్షులు సైతం సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఐదు రోజుల్లో 700కుపైగా సెషన్స్ నిర్వహించనున్నారు. 20 దేశాల అధినేతలు సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నారు. మోదీ ఆహా్వనం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా తదితరులు రానున్నారు. సురక్షిత కృత్రిమ మేధ, ఏఐ నిర్వహణ, నైతిక విలువలతో కూడిన ఏఐ, డేటా భద్రత, ఏఐలో భారత్ స్వయంసమృద్ధి, దేశీయంగా వ్యూహాత్మక రంగాలకు కొత్త ఏఐ మోడళ్ల తయారీ వంటి అంశాలపై నిపుణులు, విధాన కర్తలు చర్చించనున్నారు. కీలక సంస్థ సీఈఓల ప్రసంగాలు దక్షిణార్థ గోళంలో జరుగుతున్న తొలి ఏఐ సదస్సు కావడంతో దీనిపై అందరి దృష్టీ నెలకొంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్, డీప్మైండ్ టెక్నాలజీస్ సీఈఓ డెమిస్ హస్సాబీస్, ఆంత్రోపిక్ సీఈఓ డేరియో ఆమోడెయి, మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ వంటి దిగ్గజాలు సైతం సదస్సులో ప్రసంగించనున్నారు. సదస్సుతోపాటు ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో–2026ను కూడా నిర్వహిస్తున్నారు. ఎక్స్పోను సందర్శించాక ప్రధాని మోదీ దిగ్గజ సంస్థల సీఈఓలతో భేటీ అయ్యే అవకాశముంది.భారత్లోని ఏఐ అంకుర సంస్థలు తమ నూతన ఆవిష్కరణలను సదస్సు వేదికగా ప్రకటించే ఆస్కారముంది. ప్రజారోగ్యం, వ్యవసాయం, ఆర్థిక, విద్య, కార్పొరేట్ రంగాల్లో రాబోతున్న మార్పులకు ఏఐ ఏవిధంగా ఇతోధికంగా దోహదపడుతుందో వక్తలు వివరించనున్నారు. 2025లో ఫ్రాన్స్లోని పారిస్లో, 2024లో దక్షిణకొరియాలోని సియోల్లో, 2023లో బ్రిటన్లోని బ్లెచ్లీ పార్క్లో ఏఐ సదస్సులు జరిగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద డిజటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థల్లో భారత్ ఒకటి కావడంతో ఈసారి ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ‘‘ఈ రంగంలో ఎంతటి మార్పులొచ్చినా మానవీయ, సమ్మిళిత కోణంలోనే అవి జరగాలనే సందేశం విని్పస్తున్నాం. ఏఐ వనరులు ప్రజాస్వామ్యయుతంగా అందరికీ అందుబాటులో ఉండాలి’’ కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ చెప్పారు. ఏఐ రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ఇక్కడి యువతలో ఏఐ పట్ల మక్కువ పెంచే ఉద్దేశంతో ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా మోదీ సర్కార్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. పలు దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఏఐ రంగ సంస్థలు, పరిశోధకులు, స్టార్టప్లు, విద్యార్థులు, పౌరులు ఇందులో పాల్గొననున్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యధిక యువకారి్మకశక్తి భారత్లోనే ఉంది. ఇక్కడ జనాభాలో 65 శాతం మంది వయసు 35 ఏళ్లలోపే. ఈ యువతరంలో ఏఐపై అనురక్తిని పెంచి ఏఐ బాటలు పయనించేలా చేస్తే ఈ రంగంలో భారత్ ఎన్నెన్నో అద్భుతాలు చేయగలదని, ఇక్కడ ఏఐ ఆధారిత పరిశ్రమలు పెరిగి, ఆవిష్కరణలు ఎక్కువై, డిజిటల్ సేవలు విస్తరించి, ఉపాధి అవకాశాలు భారీ స్థాయిలో పెరుగుతాయి’’ అని ఏఐరంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సదస్సులో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ కొత్త ఏఐ ఉత్పత్తులపై సదస్సు వేదికగా ప్రకటనలు చేయొచ్చని చెబుతున్నారు.భారతీయ ఏఐపైనే దృష్టి ఏఐ సదస్సులో ప్రధానంగా భారతీయ ఏఐపైనే అందరి దృష్టీ నెలకొననుంది. ఫౌండేషన్ మోడల్ పిల్లర్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీతో ఇప్పటికే 12 భారతీయ అంకురసంస్థలు భేటీ అయ్యాయి. ఇండియన్ లాంగ్వేజ్ ఫౌండేషన్ మోడల్, మల్టీ లింగ్వల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం), స్పీచ్–టు–టెక్ట్స్, టెక్ట్స్,్ట–టు–ఆడియో, టెక్ట్స్,–టు–వీడియో, ఇ–కామర్స్ కోసం జనరేటివ్ ఏఐతో త్రిమితీయ సమాచారం, మార్కెటింగ్, వ్యక్తిగత సమాచార సృష్టి, ఇంజనీరింగ్ సిములేషన్, మెటీరియల్ రీసెర్చ్, అధునాతన అనలైటిక్స్, ఆరోగ్యరంగంలో వ్యాధుల నిర్ధారణ, వైద్య పరిశోధన ఇలా పలు రంగాల్లో అంకుర సంస్థలు తమ కొత్త పరిశోధనలను ఇంపాక్ట్ ఎక్స్పో2026లో ప్రదర్శించే ఆస్కారముంది. 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎక్స్పోలో 600కుపైగా కీలక స్టార్టప్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఆ్రస్టేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఇస్తోనియా, తజకిస్తాన్, ఆఫ్రికా పెవీలియన్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. డేటా కేంద్రంగా మార్చండి‘‘ఇన్నాళ్లూ అప్లికేషన్లు, ప్లాట్ఫా మ్లు, డివైజ్ల రంగంలో అభివృద్ధి పైనే దృష్టిపెట్టాం. అంతకంటే ముఖ్యంగా మరో ప్రాథమిక రంగంలోనూ ఆధిపత్యం కనబర్చాల్సి ఉంది. అదే డేటా సెంటర్ల ఏర్పాటు. ఇకనైనా డిజిటల్ మౌలికవసతులు, కృత్రిమ మేధారంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చుకుందాం. ఈ మేరకు ప్రపంచ సమాచార స్టోరేజీకి భారత్ను కేంద్రంగా మార్చండి. దీంతో సాంకేతిక విప్లవంతో మరో సంస్కరణల తరంగాలను సృష్టించండి. ఈ రంగంలో పెట్టుబడులను పెంచేందుకే తాజా బడ్జెట్లో పన్ను రాయితీలను ప్రకటించాం. సదుపాయాల కల్పన ఖర్చులను తగ్గించాం. తద్వారా డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ను అంతర్జాతీయ ప్రధాన పోటీదారుగా మార్చండి’’ అని మోదీ అన్నారు.సరైన వేదిక భారత్: గుటెరస్ ‘‘అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ విజయపథంలో దూసుకుపోతోంది. ఇలాంటి భారత్ ఈ సదస్సుకు సరైన వేదిక. సూపర్పవర్ లాంటి రెండు శక్తివంతమైన దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఏఐ ఫలాలు దక్కొద్దు. యావత్ ప్రపంచదేశాలూ ఏఐ ప్రయోజనాలను పొందాలి. ఈ సదస్సును నిర్వహిస్తున్న భారత్కు అభినందనలు. ఏఐ స్వతహాగా వృద్ధిచెందితే అది అందరి ఉపయోగకరమే’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. -
బంగ్లాదేశ్కు లోక్సభ స్పీకర్.. రీజన్ అదే..!
బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణస్వీకార వేడుకకు భారత్ హాజరుకానుంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇండియా తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు విదేశాంగశాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ హాజరుకానున్నారు.ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా బీఎన్పీ చీఫ్ తారిఖ్ రహ్మాన్ బాధ్యతలు తీసుకోనున్నారు. మంగళవారం అక్కడి పార్లమెంటులోని సౌత్ప్లాజాలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్, మన దేశంలో సహా 13 దేశాలకు ఆహ్వానం పంపింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు భారత్ ప్రకటించింది.ఈ మేరకు భారత విదేశాంగశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో "బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి గౌరవనీయులైన లోక్సభ స్పీకర్ హాజరుకావడం రెండు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజేస్తుంది." అని తెలిపింది. అయితే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆ దేశంలో రెండు దశాబ్ధాల తర్వాత తిరిగి అధికారం సాధించింది. 297 స్థానాల్లో జరిగిన ఎన్నికలు జరుగగా 209 సీట్లు సాధించింది.అయితే బంగ్లాదేశ్లో ప్రస్తుతం హిందువులపై జరుగుతున్న దాడుల దృష్ట్యా భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల బీఎన్పీ నేత మాజీ ప్రధాని ఖలీదా జియా మరణించినప్పుడు సైతం భారత్ సంఘీభావం ప్రకటించింది. ఆమె అంతిమ యాత్రకు భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. అయితే బీఎన్పీ విజయం సాధించిన తర్వాత కూడా ప్రధాని మోదీ బీఎన్పీ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు. అందుకు ఆ పార్టీ సైతం ప్రధానికి ధన్యవాదాలు తెలిపింది.అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ దేశంలోని మైనార్టీలపై దాడులు చేసి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్తో సత్సంబంధాల దిశగా ప్రయత్నిస్తుంది. -
‘పాకిస్తాన్ మనకు శత్రువే.. అది క్రికెటైనా, ఇంకేదైనా..’
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అనేది మనకు శత్రు దేశమేనని, వారిని ఏ వేదికలోనైనా శత్రువుగానే చూడాలని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీ సుఖిందర్ సింగ్ రంధావా. పాకిస్తాన్తో టీ20 వరల్డ్కప్లో భారత్ పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది జై షా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటూ అభివర్ణించారు. ఇది భారత్-పాకిస్తాన్ల మ్యాచ్ కాదని, కేవలం జై షా-పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్ మాత్రమేనన్నారు. యావత్ భారతావని.. పాకిస్తాన్తో సంబంధాలను వద్దనుకుంటుంటే, వారితో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడతారంటూ ప్రశ్నించారు. ‘ పాకిస్తాన్ అనేది మనకు దాయాది దేశం. వారిని శత్రువులుగానే చూడాలి. వారితో ఎటువంటి సంబంధాలు ఉండొద్దు. సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు పాకిస్తాన్ దుశ్చర్యలు బాగా తెలుసని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది భారతావని కోరుకునే మ్యాచ్ మాత్రం కాదు. జై షా-పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ మాత్రమే. భారతీయులు ఎవరూ పాక్తో మ్యాచ్ను కోరుకోవడం లేదు. ఐసీసీ చీఫ్గా ఉన్న జై షా ప్రోద్బలంతోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత్కు రెండో నరేంద్ర మోదీగా పేర్కొంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షానే.. పాకిస్తాన్తో మ్యాచ్ జరగడానికి కారణమయ్యాడు’ అంటూ విమర్శించారు.#WATCH | Jaipur, Rajasthan: On India vs Pakistan #ICCT20WorldCup, Congress MP Sukhjinder Singh Randhawa says, "... Pakistan is the enemy of our country, and it should be treated like that only. We have no dealings with them. Those who are on the border know how Pakistan is… pic.twitter.com/3FlPP06UIX— ANI (@ANI) February 15, 2026 -
T20 World Cup: తొందర పడితే ప్రమాదమే అంత ఈజీ కాదు..
-
‘ఏఐ సాంకేతికత అందరిదీ’: ‘సమితి’ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యవహారాల్లో విస్తరిస్తున్న భారత్ ప్రభావంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రశంసలు కురిపించారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి కీలక అంశాలపై ప్రపంచ స్థాయి చర్చలు నిర్వహించడానికి భారత్ అత్యంత అనువైన దేశమని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృద్ధి పథంలో ఉందని, ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఏఐ సాంకేతికత మానవాళి అందరికీ ఉపయోగపడాలని ఆంటోనియో గుటెర్రెస్ ఆకాంక్షించారు.ఏఐ సాంకేతికత కేవలం ధనిక దేశాలకో లేదా రెండు అగ్రరాజ్యాలకే (అమెరికా, చైనా) పరిమితం కాకూడదని గుటెర్రెస్ పేర్కొన్నారు. ఈ శక్తివంతమైన సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందాలని, ముఖ్యంగా ‘గ్లోబల్ సౌత్’ దేశాలకు ఇందులో సమాన వాటా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఈ అధికారం ఉంటే అది ఆమోదయోగ్యం కాదని, అభివృద్ధి, ఆవిష్కరణలు, ప్రపంచ ప్రగతికి ఏఐ ఒక సార్వత్రిక సాధనంగా మారాలని ఆయన అన్నారు.ఫిబ్రవరి 16 నుండి 20 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ఈ సదస్సు, గ్లోబల్ సౌత్లో జరుగుతున్న మొట్టమొదటి భారీ ఏఐ సదస్సుగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ తదితర దిగ్గజాలు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో పాల్గొనేందుకు గుటెర్రెస్ స్వయంగా భారత్కు రానున్నారు.కాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పులు రావాలని, నేటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాలని ఆయన కోరారు. భారత ప్రాచీన నాగరికత, ప్రజాస్వామ్య విలువలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని కొనియాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీతో జరగబోయే భేటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.ఇది కూడా చదవండి: Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా.. -
రష్యా చమురు కొనుగోలుపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని అమెరికా చెప్పిన సంగతి తెలిసిందే.. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరుదేశాల నడుమ జరిగిన చర్చల్లో భారత్ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. అయితే, ఈ క్రమంలో చమురు కోనుగోలుపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవన్నారు. దేశ ప్రయోజనాలు, ధర, నష్టభయాలను పరిగణనలోకి కుంటామని ఈ విషయంలో భారత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు.జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొన్న జై శంకర్.. భారత్ తన ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ విధానాన్నే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇంధన సమస్యల ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి సంక్లిష్టంగా ఉందన్నారు. చమురుతో సహా అన్ని అంశాల్లోనూ భారత్ ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలే తీసుకుంటుందని అదే సదస్సు వేదికగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొనడం విశేషం.‘‘ప్రపంచ చమురు మార్కెట్లు అతి సంక్లిష్టమైనవి. కనుక చమురు కంపెనీలు చాలా అంశాలను మదింపు చేసిన మీదట తమ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతాయి’’ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగాక ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. అందుకు నిరసనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25 శాతం అదనపు టారిఫ్లు విధించారు.మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు పడ్డ నేపథ్యంలో వాటిని తాజాగా రద్దు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తానని భారత్ స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆ సందర్భంగా ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. రష్యా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతూ వచ్చింది. కొనుగోళ్లు నిలిపేస్తామంటూ భారత్ తమకు అధికారికంగా వర్తమానం ఇవ్వలేదని పలుమార్లు స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ విషయంలో మొదటినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
రష్యా చమురు కొనబోమని భారత్ హామీ: రూబియో
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని అమెరికా పునరుద్ఘాటించింది. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరుదేశాల నడుమ జరిగిన చర్చల్లో భారత్ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. శనివారం మ్యూనిక్లో సెక్యూరిటీ సదస్సు సందర్భంగా ఆయన ఈ మేరకు పేర్కొన్నట్టు రష్యా వార్తా సంస్థ టాస్ తెలిపింది. అయితే, చమురుతో సహా అన్ని అంశాల్లోనూ భారత్ ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలే తీసుకుంటుందని అదే సదస్సు వేదికగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొనడం విశేషం. ‘‘ప్రపంచ చమురు మార్కెట్లు అతి సంక్లిష్టమైనవి. కనుక చమురు కంపెనీలు చాలా అంశాలను మదింపు చేసిన మీదట తమ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతాయి’’ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగాక ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. అందుకు నిరసనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25 శాతం అదనపు టారిఫ్లు విధించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు పడ్డ నేపథ్యంలో వాటిని తాజాగా రద్దు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తానని భారత్ స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆ సందర్భంగా ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. రష్యా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతూ వచ్చింది. కొనుగోళ్లు నిలిపేస్తామంటూ భారత్ తమకు అధికారికంగా వర్తమానం ఇవ్వలేదని పలుమార్లు స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ విషయంలో మొదటినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
ఇండియా ఏఐ సదస్సు రేపటి నుంచే
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ సదస్సు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు సాగే ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, ముఖ్య నేతలతో పాటు దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులు పాల్గొంటున్నారు. సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 40 మందికి పైగా సీఈఓలతో భేటీ కానున్నారు. వీరిలో శామ్ ఆల్టమన్ (ఓపెన్ఏఐ), బిల్ గేట్స్, డేరియో అమొదెయ్ (ఆంత్రోపిక్) తదితరులున్నారు. భారత్లో పెట్టుబడి ప్రణాళికలను గురించి వీరంతా తమ ఆలోచనలను ప్రధానితో పంచుకోనున్నారు. ఈ సదస్సు సందర్భంగా పలు రంగాల్లో ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేరకు ఏఐ పెట్టుబడులకు ఒప్పందాలు కుదురతాయని అంచనా. వచ్చే నాలుగేళ్లలో భారత్లో ఏకంగా రూ.15 లక్షల కోట్ల మేరకు పెట్టుబడి ప్రణాళికలను మైక్రోసాఫ్ట్ గత డిసెంబర్లో ప్రకటించడం తెలిసిందే. ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ సామర్థ్య పెంపు, అత్యాధునిక డిజిటల్ నైపుణ్యాల్లో లక్షలాది మంది యువతకు శిక్షణ తదితరాలపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. గత ఏఐ సదస్సులు పారిస్, సియోల్ తదితర నగరాల్లో జరిగాయి. -
ఇక మలేసియాలోనూ యూపీఐ పేమెంట్స్
న్యూఢిల్లీ: ఇకపై భారత్, మలేసియా మధ్య క్యూఆర్ మర్చంట్ చెల్లింపులకు తెరలేవనుంది. ఇందుకు అనుగుణంగా ఎన్పీసీఐ అంతర్జాతీయ విభాగం ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్(ఎన్ఐపీఎల్) తాజాగా పేమెంట్స్ నెట్వర్క్ మలేసియా ఎస్డీఎన్ బీహెచ్డీ(పేనెట్)తో చేతులు కలిపింది. పేనెట్.. మలేసియావ్యాప్త పేమెంట్స్ నెట్వర్క్ సంస్థకావడంతో రెండు దేశాల మధ్య క్యూఆర్ ఆధారిత చెల్లింపులకు వీలు చిక్కనుంది. అయితే దశలవారీగా ఇందుకు తెరతీయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలి దశలో భాగంగా మలేసియా సందర్శించే దేశీ ప్రయాణికులు తమ యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు చేపట్టేందుకు వీలు కలి్పంచనున్నట్లు తెలియజేసింది. డూయిట్నౌ క్యూఆర్ అనుమతించే టచ్పాయింట్ల ద్వారా ఇందుకు వీలుంటుందని పేర్కొంది. పేనెట్ నిర్వహించే డూయిట్నౌ మలేసియాలో ప్రామాణిక క్యూఆర్గా తెలియజేసింది. తదుపరి దశలో మలేసియన్లు సైతం భారత్ సందర్శనలో డూయిట్నౌ యాప్స్ ద్వారా యూపీఐ క్యూఆర్ కోడ్ సేవలను వినియోగించుకోవచ్చని వివరించింది. -
అసలు సమరానికి సమయం
ఫిబ్రవరి 1...టి20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్... ఫిబ్రవరి 5...మాకు అవన్నీ తెలీదు...మా కొలంబో ఫ్లయిట్ బుక్ అయిపోయిందన్న సూర్యకుమార్... ఫిబ్రవరి 9...భారత్తో మ్యాచ్ ఆడేందుకు మేం సిద్ధమంటూ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రకటన... ఫిబ్రవరి 15...భారత్, పాక్ మధ్య కొలంబోలో మ్యాచ్కు రంగం సిద్ధం...ప్రపంచకప్లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మాట్లో అయినా కనిపించే ఆసక్తి, ఉత్సాహమే వేరు...1992 నుంచి అభిమానులు ఇది చూస్తూనే వచ్చారు...ఫలితం ఎలా ఉన్నా, ఏకపక్షంగా సాగినా ఈ మ్యాచ్కు ఉండే ఆకర్షణ ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై సాగే సుదీర్ఘ వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థితిలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ లేదంటే సహజంగానే పెద్ద చర్చే జరిగింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది...కొలంబో వెళ్లే ఫ్లయిట్ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటే హోటళ్లలో ఎంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమైనా ఖాళీ లేదనే సమాధానం వచ్చేస్తోంది. మైదానంలోనే ఉండి జట్టుకు మద్దతుగా నిలవాలనుకునే వేలాది మంది మాత్రమే కాదు...తమ ఇళ్లనుంచి కన్నార్పకుండా ప్రతీ బంతిని చూసే ఫ్యాన్స్ సంఖ్యకు లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మరో వరల్డ్ కప్ పోరుకు ఇరు జట్లు సై అంటున్నాయి. ఇటీవల ఆసియా కప్లో 3–0తో పాక్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఈ సారి ఎలాంటి ప్రదర్శనతో చెలరేగుతుందో చూడాలి. కొలంబో: టి20 వరల్డ్ కప్లో మరోసారి తాడోపేడో తేల్చుకునేందుకు భారత్, పాకిస్తాన్ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతీ టి20 వరల్డ్ కప్లో తలపడుతున్న ఇరు జట్లు ఈ సారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. ప్రేమదాస స్టేడియంలో నేడు (ఆదివారం) జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో పాకిస్తాన్ను భారత్ ఎదుర్కొంటుంది. రెండు జట్లూ తమ తొలి రెండు మ్యాచ్లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా...ఇటీవలి వరుస ఓటముల తర్వాత ఈ సారైనా గెలిచి బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. కుల్దీప్కు అవకాశం... భారత బ్యాటింగ్ లైనప్కు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, పాండ్యా, దూబే తమ దూకుడైన బ్యాటింగ్ను ఇప్పటికే ప్రదర్శించారు. రింకూ సింగ్కు తగిన అవకాశం రాకపోగా, తిలక్ వర్మ కూడా రెండు సార్లు 25 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా గత మ్యాచ్ తరహాలో భారీ స్కోరు ఖాయం. సుదీర్ఘ కాలం తర్వాత తన తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న సామ్సన్ మాత్రం విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ అనారోగ్యంనుంచి పూర్తిగా కోలుకుంటే సామ్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చేస్తాడు. అమెరికాపై డకౌట్ అయిన అభిషేక్ తన స్థాయికి తగినట్లు విజృంభిస్తే పాక్ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఒంటిచేత్తో అతను అందించే ఆరంభం భారత్ భారీ స్కోరుకు పునాది అవుతుంది. బౌలింగ్కు సంబంధించి తుది జట్టులో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఇక్కడి పిచ్ను బట్టి చూస్తే భారత్ మూడో రెగ్యులర్ స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది.ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లకు ‘మిస్టరీ’గానే ఉన్న వరుణ్ చక్రవర్తి, అక్షర్లతో పాటు కుల్దీప్ను కూడా ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అర్ష్ దీప్ స్థానంలో అతను ఆడతాడు. పాండ్యా, దూబే కూడా బౌలింగ్ భారం పంచుకుంటారు కాబట్టి రెగ్యులర్ పేసర్గా బుమ్రాకు మాత్రమే అవకాశం ఉంది. ఇటీవలి ఫామ్, బలాబలాలను చూస్తే పాక్కంటే టీమిండియా ఎంతో ముందుంది. బాబర్ ఆజమ్ రాణించేనా... అమెరికాపై భారీ విజయం సాధించిన పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. పాక్ ఇప్పటికే ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లు అబ్రార్, తారిఖ్లతో పాటు స్పిన్ ఆల్రౌండర్లు నవాజ్, షాదాబ్లతో ఆడుతోంది. అవసరమైతే అయూబ్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు. వీరిలో తారిఖ్ మినహా మిగతా బౌలర్లందరిపై భారత్ గతంలోనే తమ ప్రతాపం చూపించింది. కొత్త తరహా, చర్చనీయాంశమైన యాక్షన్తో ఆడే ఆఫ్స్పిన్నర్ తారిఖ్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది ఆసక్తికరం. భారత్ తమ సన్నాహకాల్లో దీనిపై కూడా దృష్టి పెట్టి ఉండవచ్చు. పేసర్ షాహిన్ అఫ్రిది చాలా కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సారి కూడా భారత బ్యాటర్లను నిలువరించడం అతనికి కష్టం కావచ్చు. లైనప్లో టాప్–4 మాత్రమే రెగ్యులర్ బ్యాటర్లు ఉన్నారు. అయూబ్, కెప్టెన్ ఆగా ఆసియా కప్లో భారత్పై వరుసగా విఫలమవగా, ఫర్హాన్ ఒక్కడే రాణించాడు. కెప్టెన్ అయిన తర్వాత సల్మాన్ ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తమ జట్టుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా స్టార్ బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్న బాబర్ ఆజమ్ ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. అతను తన సత్తాను ప్రదర్శించేందుకు ఇంతకంటే సమయం, వేదిక ఉండవని పాక్ అభిమానులు భావిస్తున్నారు. 13 భారత్, పాక్ మధ్య ఓవరాల్గా 16 మ్యాచ్లు జరగ్గా...13 గెలిచిన భారత్ 3 ఓడింది.7-1 టి20 ప్రపంచ కప్లో భారత్, పాక్ మధ్య 8 మ్యాచ్లు జరగ్గా... భారత్ 7 గెలిచి ఒకటే ఓడింది.పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. అయితే బౌలర్లూ ప్రభావం చూపించగలరు. మ్యాచ్కు ముందు రోజు మాత్రమే భారత్ ఇక్కడ సాధన చేసింది. పాక్ జట్టు కొలంబోలోనే ఉన్నా... తమ రెండు మ్యాచ్లను ఎస్ఎస్సీ మైదానంలో ఆడింది కాబట్టి తేడా ఉండకపోవచ్చు. అయితే మ్యాచ్ను వాన గండం వెంటాడుతోంది. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తుది జట్లు (అంచనా): భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, పాండ్యా, దూబే, రింకూ, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్ ), ఫర్హాన్, అయూబ్, బాబర్ ఆజమ్, షాదాబ్, ఉస్మాన్, నవాజ్, ఫహీమ్, షాహిన్ అఫ్రిది, తారిఖ్, అబ్రార్ టి20 ప్రపంచకప్లో నేడువెస్టిండీస్ X నేపాల్వేదిక: ముంబై; ఉదయం 11 గంటల నుంచిఅమెరికా X నమీబియావేదిక: చెన్నై; మధ్యాహ్నం 3 గంటల నుంచి -
తారిఖ్ రహ్మాన్ రాక.. భారత్కు బంగ్లా టెన్షన్!
తారిఖ్ రహ్మాన్.. బంగ్లా ప్రధాని కాబోతున్న నాయకుడు. ‘డార్క్ ప్రిన్స్’గా ఇంటాబయటా అప్రతిష్టపాలైన నేపథ్యం నుంచి ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకునే దాకా 60 ఏళ్ల రహ్మాన్ ప్రస్థానం బంగ్లాదేశ్ సరికొత్త రాజకీయానికి నాంది పలికింది. ఆయనపై లెక్కకు మించి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక కేసులో రహ్మాన్ అరెస్టయ్యారు. అమెరికా కూడా రహ్మాన్ను ‘డార్క్ ప్రిన్స్’గా అభివర్ణించింది. బెయిల్పై విడుదలైన అనంతరం వైద్యచికిత్స పేరుతో 2008లో లండన్ వెళ్లారు. నాటి నుంచీ కుటుంబంతో పాటు అక్కడే ప్రవాసంలో గడుపుతూ వచ్చారు. లండన్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించారు.గతేడాది డిసెంబరులో తల్లి ఖాలిదా జియా అనారోగ్యానికి గురి కావడంతో 17 ఏళ్ల తర్వాత మళ్లీ సొంతగడ్డపై అడుగుపెట్టారు. తల్లి మరణానంతరం పార్టీ పగ్గాలు అందుకున్నారు. నిరసనలు, హింసాత్మక ఘటనలతో అస్థిరంగా మారిన దేశంలో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా విస్తృత ప్రచారం చేపట్టారు. ‘బంగ్లా ఫస్ట్’ నినాదంతో యువతను ఆకర్షించారు. కట్ చేస్తే 2026 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మరి ఆయన గెలుపు భారత్కు లాభమేనా? రహ్మాన్ రాక మనకు ఏ మేరకు ఉపయోగపడనుంది?బంగ్లాదేశ్ ఎన్నికలను భారత్ ముందు నుంచీ నిశితంగా గమనించింది. ఇదే సమయంలో భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ‘రీసెట్’ కోరుకుంటున్నానని, అయితే, అది రెండు దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అలాగే, ఉగ్రవాదంపై భారత్ పోరుకు సహకరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తీస్థా నదీజలాల విషయంలో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. హిందూ మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు. భారత్, బంగ్లా సంబంధాలు మెరుగుపడే దిశగా ఇవన్నీ సానుకూల సంకేతాలేనని భావిస్తున్నారు. దీనికితోడు 2001–06 మధ్య బీఎన్పీతో అధికారాన్ని పంచుకున్న రాడికల్ పార్టీ జమాతే ఇస్లామీని ఈసారి రహ్మాన్ దూరం పెట్టారు. ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు. ఇది కూడా భారత్కు కలిసొచ్చే అంశమే. ఆయన పగ్గాలు చేపట్టాక ఇరుదేశాల నడుమ వాణిజ్యంతో పాటు అన్ని రంగాల్లోనూ సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇరు దేశాల వాణిజ్యం ఇలా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏటా 14 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. అయితే, ఇందులో దాదాపు 10 బిలియన్ డాలర్ల వరకు మనకు వాణిజ్య మిగులే ఉంటోంది. మన దేశం నుంచి బంగ్లాదేశ్ టీ, కాఫీ, ఆటో విడిభాగాలు, విద్యుత్, ఉక్కు, స్టీల్, ప్లాస్టిక్, పత్తి వంటివి దిగుమతి చేసుకుంటోంది. బంగ్లా పత్తి దిగుమతుల్లో 80శాతం మన దేశం నుంచే వెళ్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కాబట్టి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్తో రహ్మాన్ దౌత్య సంబంధాలు నెరిపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సరిహద్దు భద్రత.. అయితే, సరిహద్దు నియంత్రణ విషయంలో రహ్మాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై భారత్ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, పశ్చిమబెంగాల్, అస్సాంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల అంశమే ఎన్నికల్లో కీలకంగా మారింది. భారత్, బంగ్లాదేశ్ 4,100 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. 2024 జూన్ తర్వాత నుంచి దాదాపు 1000కి పైగా చొరబాటు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు చొరబాట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.తీస్తా నది జలాల సమస్య.. తీస్తా నది సిక్కిం నుంచి ఉద్భవించి పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. మొత్తం పొడవు సుమారు 414 కిలోమీటర్లు. ఉత్తర బంగ్లాదేశ్లో వ్యవసాయం, సాగు నీటి అవసరాలకు ఇది కీలకంగా ఉంది. అయితే, తీస్తా నదీ జలాలను భారత్ ఎక్కువగా వినియోగిస్తోందని బంగ్లా ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్కి తక్కువ వాటా రావడం వల్ల అక్కడి రైతులు, పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎక్కువ వాటా కోరుతోంది. కానీ, భారత్ (ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం) దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.ఒప్పందం ఇలా.. 2011లో తీస్తా జలాలపై ఒప్పందం కుదరబోతుందని భావించారు. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించింది. అప్పటి నుంచి ఒప్పందం నిలిచిపోయింది. 2025లో నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన సందర్బంగా ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. భారత్ టెక్నికల్ టీమ్ను పంపి నది నిర్వహణపై చర్చిస్తామని తెలిపింది. కానీ, తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చర్చలు జరగలేదు. మరోవైపు.. తాత్కాలిక యూనస్ ప్రభుత్వం ఇలా పద్మానదిపై ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో పద్మానది ప్రాజెక్ట్పై రెహ్మాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కీలకంగా మారనుంది.భారత్ ముందున్న సవాళ్లు.. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్లో అధికారంలోకి రావడం భారత్కి కొత్త అవకాశాలు, అలాగే కొన్ని సవాళ్లను తెస్తోంది. రెహ్మాన్ ప్రభుత్వం కనుక చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటే భారత్ మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. కాబట్టి కొత్త ప్రభుత్వంతో భారత్ వెంటనే ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించడం మంచిదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, భారత్ విషయంలో చైనా ఎప్పుడూ కయ్యానికి దిగే తరహాలోనే వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో బంగ్లా ప్రభుత్వంతో చైనా వ్యూహరచన చేస్తుందోననే టెన్షన్ కూడా భారత్కు ఉన్నట్టు సమాచారం. -
మన ముకేశ్ గురి బంగారం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ జూనియర్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన పిస్టల్ షూటర్ ముకేశ్ నేలవల్లి చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. చివరిరోజు శుక్రవారం గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ రెండు పతకాలు సాధించాడు. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం నెగ్గిన ముకేశ్... టీమ్ విభాగంలో సూరజ్ శర్మ (మధ్యప్రదేశ్), అభినవ్ దేశ్వాల్ (ఉత్తరాఖండ్)లతో కలిసి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్లో ముకేశ్ ఎనిమిది పతకాలు సాధించిన ముకేశ్ జాతీయ రికార్డు నెలకొల్పడం విశేషం. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత్ క్లీన్స్వీప్ చేసింది. సూరజ్ శర్మ 585 పాయింట్లతో స్వర్ణం, ముకేశ్ 582 పాయింట్లతో రజతం, అభినవ్ దేశ్వాల్ 573 పాయింట్లతో కాంస్యం నెగ్గారు. సూరజ్, ముకేశ్, అభినవ్లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో 1740 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ధవళిక ఖాతాలో 2 పతకాలు ఇదే టోర్నీ జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ధవళిక దేవి రెండు పతకాలు సాధించింది. వ్యక్తిగత విభాగంలో ధవళిక 614.1 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలిచింది. టీమ్ విభాగంలో ధవళిక, ప్రాచి, అనుష్కలతో కూడిన భారత జట్టు 1835.6 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించింది. గచి్చ»ౌలిలోని గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో గత మూడేళ్లుగా కోచ్ వినోద్ కనోజియా వద్ద ధవళిక శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో సీనియర్, జూనియర్ విభాగాల్లో కలిపి భారత షూటర్లు 39 స్వర్ణాలు, 18 రజతాలు, 19 కాంస్యాలతో 76 పతకాలు నెగ్గి ‘టాప్’లో నిలిచారు. -
డబ్బుఉందా? డెబిట్! లేదా? క్రెడిట్!
భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరో కీలక మలుపు తీసుకుంటోంది. అంతర్జాతీయ చెల్లింపుల దిగ్గజం వీసా త్వరలో భారత్లో ఒకే కార్డుతో అటు డెబిట్కి, ఇటు క్రెడిట్కి రెండు విధాలుగా ఉపయోగపడేలా ‘డెబిట్–కమ్–క్రెడిట్ కార్డు’ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త విధానం వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచడమే కాకుండా, దేశంలో క్రెడిట్ వినియోగాన్ని విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో పోలిస్తే ప్రస్తుతం భారత్లో యూపీఐ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, అది ప్రధానంగా బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నుంచి నేరుగా డబ్బు కట్ అయ్యే విధానమే. డెబిట్ కార్డులు కూడా ఖాతాలో డబ్బు ఉంటేనే పనిచేస్తాయి. మరోవైపు, క్రెడిట్ కార్డులు సౌకర్యవంతమే అయినా వాటి వినియోగం డిజిటల్ రూపంలో,యూపీఐ చెల్లింపుల విషయంలో ఇంకా పరిమితంగానే ఉంది. ఈ నేపథ్యంలో వీసా తీసుకొస్తున్న కొత్త కార్డు యూపీఐతో అందే సౌలభ్యం, డెబిట్ కార్డుతో చేయగల నియంత్రణ, క్రెడిట్ కార్డు ఫ్లెక్సిబిలిటీ ఈ మూడింటినీ కలిపిన ఉపయోగకరమైన సాధనంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. బ్యాంకులు, వినియోగదారులకు లాభాలు ఈ కొత్త విధానం ద్వారా బ్యాంకులు తమ రిస్క్ పాలసీలకు అనుగుణంగా క్రెడిట్ వినియోగాన్ని నియంత్రించగలుగుతాయి. వినియోగదారులకు మాత్రం ఒకటి కంటే ఎక్కువ కార్డులని ప్రతిచోటుకూ మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా స్థిర ఆదాయం ఉన్నా క్రెడిట్ కార్డు లేని మధ్యతరగతి వర్గానికి ఇది ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం నిపుణుల అంచనాల ప్రకారం, ఈ విధానం నగదు వినియోగాన్ని తగ్గించడంలో, టైర్–2, టైర్–3 నగరాల్లో కార్డు వినియోగాన్ని పెంచడంలో, ఫార్మల్ ఎకానమీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే, అతిగా క్రెడిట్ వినియోగం వల్ల వినియోగదారుడు అప్పుల ఊబిలో కూరుకునే ప్రమాదం కూడా ఉందని, అందుకే ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వీసా ప్రతిపాదిస్తున్న ఈ డెబిట్–కమ్–క్రెడిట్ కార్డు భారత్ చెల్లింపుల వ్యవస్థను మరింత స్మార్ట్గా, ఫ్లెక్సిబుల్గా మార్చే విధానంగా పరిగణించవచ్చు. ఇది వినియోగదారుల సౌకర్యం, బ్యాంకులకు భద్రత ఈ రెండింటికీ మధ్య సమతుల్యత తీసుకురావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. కార్డు కాదు కాంబోప్యాక్ వీసా అభివృద్ధి చేసిన ‘ఫ్లెక్సిబుల్ క్రెడెన్షియల్ (వీసా ఫ్లెక్స్) ’ టెక్నాలజీ ఆధారంగా ఈ కార్డు పనిచేస్తుంది. 16 అంకెల ఒకే కార్డు నంబర్ ద్వారా కస్టమర్ లావాదేవీ చేసే సమయంలో అది అవసరాన్ని బట్టి డెబిట్గా లేదా క్రెడిట్గా వాడుకోవచ్చు. చెల్లింపు ఎలా జరగాలన్నది కస్టమర్ కొనుగోలు చేసే విలువ మొత్తం, లేదా వినియోగదారు ముందుగా ఎంచుకున్న సెట్టింగ్స్ ఆధారంగా ఆటోమేటిక్గా నిర్ణయమవుతుంది.ఉదాహరణకు, రోజువారీ చిన్న ఖర్చులు డెబిట్గా, పెద్ద కొనుగోళ్లు క్రెడిట్లో జరిగేలా ఈ కార్డును సెట్ చేసుకోవచ్చు.భారత్ ఎందుకు కీలక మార్కెట్? భారత్లో క్రెడిట్ కార్డు వినియోగం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ. అదే సమయంలో నగదు లావాదేవీల వాటా చాలా పెద్దది. ఈ పరిస్థితిలో ఒకే కార్డు ద్వారా డెబిట్–క్రెడిట్ సౌకర్యం ఇవ్వడం వల్ల డిజిటల్ చెల్లింపులు మరింత విస్తరించవచ్చని వీసా భావిస్తోంది. సాక్షి, బిజినెస్డెస్క్ -
మాజీ ప్రధాని హసీనా మరణ శిక్షపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధికారంలోకి రానుండటంతో, భారత్లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యం చర్చనీయాంశంగా మారింది. 2024 జూలై నాటి విద్యార్థి ఉద్యమంపై ఉక్కుపాదం మోపినందుకు.. 2025 నవంబర్లో బంగ్లాదేశ్లోని ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో బీఎన్పీ ఇటీవలి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు హసీనాను బంగ్లాదేశ్కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం న్యూఢిల్లీలో ప్రవాస జీవితం గడుపుతున్న షేక్ హసీనా.. బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికలను ఒక ప్రహసనంగా అభివర్ణించారు. జనవరి 2026లో ఆమె ఢిల్లీ నుండి చేసిన ఒక ఒక ప్రసంగంలో.. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చి, బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. కాగా మానవత్వానికి వ్యతిరేకంగా హసీనా నేరాలకు పాల్పడినట్లు రుజువైనందున, ఆమెను ‘భారత్-బంగ్లాదేశ్ అప్పగింత ఒప్పందం’ కింద తిరిగి తమ దేశానికి పంపాలని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఇప్పటికే భారత్ను కోరింది.మరణశిక్ష పడిన వ్యక్తికి ఆశ్రయం కల్పించడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని బంగ్లాదేశ్ నేతలు అంటున్నారు. ఈ సున్నిత అంశంపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ 2025లో ఆయన మాట్లాడుతూ, హసీనా ‘కొన్ని విలక్షణమైన పరిస్థితులలో’ భారత్కు వచ్చారని, ఆమె భవిష్యత్తు గురించి తుది నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ తీర్పును భారత్ గమనించిందని చెబుతూనే, హసీనా అప్పగింత విషయంలో భారత్ ఆచి తూచి అడుగులు వేస్తున్నదన్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం -
ట్రంప్ "బోర్డ్ ఆఫ్ పీస్" మీటింగ్ ఆహ్వానం
గాజాలో శాంతి స్థాపనకోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే "బోర్డ్ ఆఫ్ పీస్"ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన తొలి సమావేశం ఈ నెల 19న నిర్వహించనున్నారు. అయితే ఆ మీటింగ్ కు హాజరుకానున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అయితే ఈ విషయంలో భారత్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.ఇటీవల పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా అసిఫ్ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యుఎస్ఏ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్థాన్ని టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుందని ఆరోపించారు. 1999 కార్గిల్ యుద్దం, 9/11 దాడుల తర్వాత ఆ దేశంతో జతకట్టడం తమ దేశానికి దీర్ఘకాలిక నష్టం కలిగించిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్లో ఉగ్రవాదం.... ప్రధానంగా అవినీతి, స్మగ్లింగ్, నెట్వర్క్ల ద్వారా పెరుగుతుందని అంగీకరించారు. దీంతో అమెరికాతో పాక్ డిస్టెన్స్ పెంచుతుందేమోనని అంతా భావించారు.అయితే తాజాగా పాకిస్తాన్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో పాల్గొననున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ ఆ సమావేశానికి హాజరుకానున్నట్లు ఆదేశ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా అదేరోజు ప్రధాని షెహబాజ్ వాషింగ్టన్లో జరిగే మరో సమావేశానికి వెళతారని పేర్కొంది. అయితే భారత్ సైతం ఈ వ్యవహారంపై స్పందించింది. బోర్డు ఆప్ పీస్ మిషన్లో పాల్గొనాలని ఆహ్వానం అందిందని ఆ అంశంపై ఆలోచనలు జరుపుతున్నామని భారత అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. ఇటీవల భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి మెరుగుపడిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధిక పన్నులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. భారత్ సైతం దానికి కృతజ్ఞత తెలిపింది. కాగా గత నెలలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో డొనాల్డ్ ట్రంప్ "బోర్డ్ ఆప్ పీస్" ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటి్ంచారు. ఇందులో ఇప్పటి వరకూ 26 దేశాలు చేరాయి. భారత్ ఇందులో చేరే అంశం ఇంకా ప్రకటించలేదు. -
నమీబియాను చిత్తు చేసిన భారత్
-
ఇషాన్, పాండ్యా చెలరేగగా...
బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్, చిన్న బౌండరీలు కాబట్టి భారత జట్టు ఈసారి ‘300’ కొడుతుందా అనే చర్చ మధ్య నమీబియాతో మ్యాచ్ మొదలైంది. ఆరంభంలో ఆట చూస్తే అది సాధ్యమే అని కూడా అనిపించింది. చివరకు వచ్చేసరికి ఇది జరగకపోయినా గత మ్యాచ్తో పోలిస్తే భారత బ్యాటింగ్ పదును పెరిగింది. అమెరికాతో ఆశించిన స్కోరుకంటే చాలా తక్కువగా నమోదు చేసిన టీమిండియా ఈసారి మాత్రం 200 దాటింది. ఆపై సమష్టి ప్రదర్శనతో బలహీన ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు తమ టి20 ప్రపంచకప్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ మెరుపులు, వరుణ్ చక్రవర్తి పొదుపైన బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శన జట్టును గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్తో జరిగే అసలు పోరుపైనే అందరి దృష్టీ నిలిచింది. న్యూఢిల్లీ: టి20 వరల్డ్కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ గ్రూప్ ‘ఎ’లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్స్లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించారు. నమీబియా కెప్టెన్, ఆఫ్స్పిన్నర్ గెరార్డ్ ఎరాస్మస్ (4/20) పొదుపైన బౌలింగ్ సహా 4 వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్ చివరి 11 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు చేజార్చుకుంది. అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. లౌరెన్ స్టీన్కాంప్ (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా...వరుణ్ చక్రవర్తి 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజు సామ్సన్కు అవకాశం దక్కగా... బుమ్రా తిరిగి రావడంతోసిరాజ్ను తప్పించాల్సి వచ్చింది. తమ తర్వాతి మ్యాచ్లో భారత్ ఈ నెల 15న కొలంబోలో పాకిస్తాన్తో తలపడుతుంది. ఇషాన్ 6, 6, 6, 6, 4... అభిషేక్ గైర్హాజరులో అదృష్టవశాత్తూ మ్యాచ్ అవకాశం దక్కించుకున్న సంజు సామ్సన్ (8 బంతుల్లో 22; 1 ఫోర్, 3 సిక్స్లు) సిక్స్తో స్కోరింగ్ మొదలు పెట్టినా అది ఎక్కువసేపు సాగలేదు. షికోంగో ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. మరో ఎండ్లో ఇషాన్ తన జోరును మొదలు పెట్టాడు. 8 బంతుల వ్యవధిలో 4 ఫోర్లు కొట్టిన అతను... స్మిట్ వేసిన ఓవర్లో సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. పవర్ప్లే ముగిసేసరికి 86 పరుగులు చేసిన భారత్... 6.5 ఓవర్లలోనే 100 పరుగులను అందుకుంది. టి20 వరల్డ్ కప్లో అతి తక్కువ బంతుల్లో (35 బంతుల్లో) వంద పరుగులు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇషాన్ అవుటైన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ (12), హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) కూడా తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే పాండ్యా, శివమ్ దూబే (16 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) భారీ భాగస్వామ్యంతో స్కోరు 200 దాటింది. వీరిద్దరు 39 బంతుల్లో 81 పరుగులు జత చేశారు. షికోంగో ఓవర్లో వరుసగా సిక్స్, 2 ఫోర్లు కొట్టిన హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. చివర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. టపటపా... ఛేదనలో దాదాపు సగం ఓవర్ల వరకు నమీబియా ప్రదర్శన మెరుగ్గానే ఉంది. పవర్ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. స్టీన్కాంప్తో పాటు ఫ్రైలింగ్ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), ఎరాస్మస్ (11 బంతుల్లో 18; 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. 9.1 ఓవర్లలో జట్టు 86/2 వద్ద నిలిచింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిది. భారత బౌలర్లు చెలరేగడంతో నమీబియా బ్యాటర్లు ఎవరూ నిలవలేకపోయారు. 8 పరుగుల వ్యవధిలో తర్వాతి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ కోలుకోలేకపోయింది. ఒకే స్కోరు వద్ద జట్టు చివరి 3 వికెట్లు పడ్డాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) షికోంగో (బి) ఎరాస్మస్ 61; సామ్సన్ (సి) స్టీన్కాంప్ (బి) షికోంగో 22; తిలక్ (సి) స్మిట్ (బి) ఎరాస్మస్ 25; సూర్యకుమార్ (స్టంప్డ్) గ్రీన్ (బి) స్కాల్ 12; పాండ్యా (సి) (సబ్) లీషర్ (బి) ఎరాస్మస్ 52; దూబే (రనౌట్) 23; రింకూ (సి) ఎరాస్మర్ (బి) స్మిట్ 1; అక్షర్ (బి) ఎరాస్మస్ 0; వరుణ్ (నాటౌట్) 1; అర్‡్షదీప్ (రనౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–25, 2–104, 3–120, 4–124, 5–205, 6–205, 7–206, 8–206, 9–209. బౌలింగ్: రూబెన్ 4–0–38–0, షికోంగో 3–0–41–1, స్మిట్ 4–0–50–1, హీన్గో 1–0–18–0, ఎరాస్మస్ 4–0–20–4, స్కాల్ 4–0–41–1. నమీబియా ఇన్నింగ్స్: స్టీన్కాంప్ (బి) వరుణ్ 29; ఫ్రైలింక్ (సి) దూబే (బి) అర్‡్షదీప్ 22; జాన్ నికోల్ (సి) అక్షర్ (బి) వరుణ్ 13; ఎరాస్మస్ (సి) తిలక్ (బి) అక్షర్ 18; స్మిట్ (బి) వరుణ్ 0; గ్రీన్ (హిట్వికెట్) (బి) దూబే 11; క్రూగర్ (సి) బుమ్రా (బి) అక్షర్ 5; రూబెన్ (బి) బుమ్రా 6; స్కాల్ (సి) అక్షర్ (బి) పాండ్యా 4; షికోంగో (ఎల్బీ) (బి) పాండ్యా 0; హీన్గో (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–86, 4–86, 5–88, 6–94, 7–111, 8–116, 9–116, 10–116. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 4–0–21 –2, అర్‡్షదీప్ సింగ్ 3–0–36–1, శివమ్ దూబే 2.2–0–11–1, జస్ప్రీత్ బుమ్రా 4–0–20–1, వరుణ్ చక్రవర్తి 2–0–7–3, అక్షర్ పటేల్ 3–1–20–2. టి20 ప్రపంచకప్లో నేడుఆ్రస్టేలియా x జింబాబ్వేవేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి కెనడా x యూఏఈవేదిక: న్యూఢిల్లీ; మ.గం. 3 నుంచి నెదర్లాండ్స్ x అమెరికావేదిక: చెన్నై; రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
మూడు పతకాలూ మనవే
న్యూఢిల్లీ: స్వదేశంలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్లో గురువారం సీనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ క్లీన్స్వీప్ చేసింది. వ్యక్తిగతవిభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు స్కోరును సాధించాడు. స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. భారత్కే చెందిన నీరజ్ కుమార్ 361.8 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... అఖిల్ షెరాన్ 343.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్లతో కూడిన భారత బృందం 1769 పాయింట్లతో టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్లు అడ్రియన్ కర్మాకర్ 353.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... మానవేంద్ర సింగ్ షెఖావత్ 338.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని నెగ్గారు. అడ్రియన్ కర్మాకర్, మానవేంద్ర సింగ్, ప్రిన్స్లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1741 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించింది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు భారత షూటర్లు 38 స్వర్ణాలు, 16 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి 70 పతకాలు సాధించారు. -
స్నేహిత్ శుభారంభం
చెన్నై: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్ కంటెండర్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 100వ ర్యాంకర్ స్నేహిత్ 9–11, 11–8, 8–11, 11–7, 11–6తో భారత్కే చెందిన దివ్యాంశ్ శ్రీవాస్తవపై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. భారత్కే చెందిన ఆకాశ్ పాల్, అంకుర్, హర్మీత్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. -
వివాహమా?.. ఇప్పుడే వద్దులే!
న్యూఢిల్లీ: వివాహం చేసుకోవడానికి యువత తొందరపడడం లేదు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి అంటున్నారు. కెరీర్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగంలో లేక వ్యాపారంలో నిలదొక్కుకున్నాక పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. భారత్లో సగటు వివాహ వయసు పదేళ్ల క్రితం 27 ఏళ్లు కాగా.. అది ఇప్పుడు 29 ఏళ్లకు చేరుకుంది. అంటే సగటున 29 ఏళ్లకు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి యువత ఆసక్తి చూపుతోంది. వివాహ పరిచయ వేదిక ‘జీవన్సాథీ’నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. వివాహాలపై 2016 నుంచి 2025 దాకా ప్రజల్లో మారిన ధోరణిని అధ్యయనం చేశారు. అలాగే ఈ ఏడాది 30 వేల మంది అభిప్రాయాలు సైతం సేకరించారు. ‘అతిపెద్ద మార్పు: జీవిత భాగస్వామి ఎంపిక, పెళ్లి విషయలో నిబంధనలు తిరగరాస్తున్న భారత్’ఒక నివేదికను జీవన్సాథీ తాజాగా విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. → పెళ్లంటే యువతలో అయిష్టత ఏమీ లేదు. ఒక ఇంటివారు కావాలనే కోరుకుంటున్నారు. కానీ, అందుకోసం తొందర పడడం లేదు. 29 ఏళ్లు వచ్చాక తోడు కోసం అన్వేషిస్తున్నారు. → ఈ మార్పు రావడం వెనుక ఆర్థిక కోణమే కీలకంగా కనిపిస్తోంది. ఉద్యోగంలో కుదురుకొని ఆర్థికంగా స్థిరపడితే జీవిత భాగస్వామితో ఆనందంగా గడపొచ్చన్నది యువత ఆలోచన. సాధారణంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాపురంలో కలతలు రేగుతుంటాయి. ఆ పరిస్థితి రావొద్దని నేటి యువత భావిస్తోంది. → పెళ్లిని వ్యక్తిగత ఎదుగుదలకు అవరోధంగా కొందరు భావిస్తున్నారు. అందుకే అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత పెళ్లి ఆలోచన తీసుకొస్తున్నారు. → జీవిత భాగస్వామి మృతిచెందడం లేదా తొలి వివాహం విఫలమైన సందర్భాల్లో మరో పెళ్లి కోసం ఆరాటపడుతున్నవారి సంఖ్య దేశంలో పెరుగుతోంది. → 2016లో 11 శాతం మంది రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు సాగించారు. ఇప్పుడు వారి సంఖ్య 16 శాతం పెరిగింది. → విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చాలామంది భావిస్తున్నారు. తొలిసారి పెళ్లికి సిద్ధమైనవారు కూడా అప్పటికే ఒకసారి విడాకులు తీసుకున్న వారిని వివాహమాడేందుకు ముందుకొస్తుండడం గమనార్హం. → సరైన జీవిత భాగస్వామి కోసం అన్వేషించే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. పెళ్లి విషయంలో వయసు, ఆదాయం వంటి వాటికి ప్రాధాన్యం లేదని, ‘రైట్ పర్సన్’కావాలని, అందుకోసం ఎన్నాళ్లయినా వేచి చూస్తామని అంటున్నారు. → కులం పట్టింపు తగ్గిపోతుండడం మరో శుభ పరిణామం. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కులం ముఖ్యం కాదని కొందరు చెబుతున్నారు. 2016తో పోలిస్తే ఇప్పుడు ఇలాంటివారి సంఖ్య మరింత పెరిగింది. గ్రామాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో ఈ ధోరణి అధికంగా ఉంది. → పెళ్లి అనేది వ్యక్తిగత వ్యవహారమని, భార్య/భర్తను తామే ఎంపిక చేసుకుంటామని యువత వాదిస్తోంది. వీరి సంఖ్య 2016లో 67 శాత ఉండగా, ప్రస్తుతం 77 శాతానికి చేరుకుంది. పెళ్లి కుదిర్చే పనిని తమ కుటుంబ సభ్యులకు అప్పగించే పరిస్థితి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. → భార్య తమ కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ యువకులు పెద్దగా ఇబ్బంది పడడం లేదు. ఎక్కువ సంపాదించే భార్య రావాలని 87 శాతం మంది కోరుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది. భర్త తమ కంటే తక్కువ సంపాదించినప్పటికీ తమకు అంగీకారమేనని 15 శాతం మంది యువతులు చెప్పారు. -
T20: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఆ ముగ్గురు ప్లేయర్లు ఔట్..!
-
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ నమీబియాతో భారత్
-
భారత్తో ఒప్పందం చరిత్రాత్మకం: ట్రంప్
వాషింగ్టన్: తాము భారతదేశంతో కుదుర్చుకున్న నూతన వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకమైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందం కారణంగా అమెరికా నుంచి బొగ్గు ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ ఇంధన ఉత్పత్తిదారుగా ఎదిగిందన్నారు. జపాన్, కొరియా తదితర దేశాలతో పాటు భారత్తో కుదిరిన ఈ తాజా ఒప్పందాలు అమెరికా ఇంధన ఎగుమతులను మరింత విస్తృతం చేస్తాయని ట్రంప్ అన్నారు. తమ దేశ బొగ్గు ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినదని ట్రంప్ పేర్కొన్నారు.గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన భారత్-అమెరికా వాణిజ్య చర్చలు దాదాపు ఏడాది కాలం పాటు సాగి, చివరకు ఒక కొలిక్కి వచ్చాయి. గత వారంలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో ఈ తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యాయి. 2025 ఆగస్టులో రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు చేస్తున్నారనే నెపంతో అమెరికా.. భారత్పై 50 శాతం సుంకాలను విధించడంతో చర్చలు స్తంభించాయి. అయితే, తాజా దౌత్యపరమైన ముందడుగుతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను చక్కదిద్దింది.ఈ నూతన ఒప్పందం ప్రకారం భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. గతంలో 50 శాతంగా ఉన్న సుంకాన్ని ఇప్పుడు 18 శాతానికి తగ్గించారు. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి, పోటీ మరింతగా పెరగనుంది. వాషింగ్టన్ విడుదల చేసిన 'ఫ్యాక్ట్ షీట్' ప్రకారం ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పరస్పర ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందాయి. ఇది భారత్ నుంచి అమెరికాకు జరిగే వాణిజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది.ఈ సుంకాల తగ్గింపు నిర్ణయంతో భారతదేశంలోని కీలక రంగాలకు భారీ లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్ ఎగుమతులు పెరగనున్నాయి. వీటితో పాటు గృహాలంకరణ వస్తువులు, హస్తకళాకృతులు, ఎంపిక చేసిన యంత్ర పరికరాల విభాగాల్లో భారతీయ ఎగుమతిదారులు అమెరికా మార్కెట్లో తమ పట్టును సాధించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: శాంతి మంత్రంతో బౌద్ధ సన్యాసుల సరికొత్త చరిత్ర -
స్వచ్ఛ విద్యుత్కి పెట్టుబడుల పవర్
న్యూఢిల్లీ: భారత్ సమ్మిళిత, సుస్థిర వృద్ధి సాధించడంలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషించనుంది. జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు, ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడనుంది. ఈ నేపథ్యంలో శిలాజ ఇంధనాలను వినియోగించని, పర్యావరణహితమైన స్వచ్ఛ విద్యుత్, తటస్థ స్థాయి ఉద్గార (నెట్ జీరో) లక్ష్యాల సాధనకు భారీ పెట్టుబడులు అవసరం కానున్నాయి. 2070 నాటికి రెన్యువబుల్స్, స్టోరేజ్, పంపిణీ మొదలైన విభాగాలకు సంబంధించి విద్యుత్ రంగానికి 14.23 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ ఒక నివేదికలో ఈ విషయాలు వివరించింది. దేశాభివృద్ధి, వాతావరణ లక్ష్యాలన్నీ కూడా విద్యుత్పైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. 2047 నాటికి నిర్దేశించుకున్న వికసిత భారత్ లక్ష్యాలకు సంబంధించి ప్రస్తుత విధానాలను కొనసాగిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, 2070 నాటికి నిర్దేశించుకున్న నెట్ జీరో లక్ష్యాల సాధనకు తోడ్పడే విధానాలను అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే కోణాల్లో నివేదిక రూపొందింది. దీని ప్రకారం .. → 2025 డిసెంబర్ నాటికి 258 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంతో ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రెన్యువబుల్ ఎనర్జీ మార్కెట్గా భారత్ నిలి్చంది. → తదుపరి దశ మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పట్టణీకరణ, కూలింగ్, డిజిటలీకరణ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, హరిత హైడ్రోజన్ మొదలైన వాటితో విద్యుత్కి డిమాండ్ భారీగా పెరగనుంది. వివిధ రకాల పునరుత్పాదక విద్యుత్ విభాగాల నుంచి పెరిగే డిమాండ్ని తట్టుకునే విధంగా వ్యవస్థ పటిష్టం కావాలి. → ఇందుకోసం నిల్వ సామర్థ్యాలను, పంపిణీ సామర్థ్యాలను పెంచుకోవాలి. గ్రిడ్ కార్యకలాపాలను ఆధునీకరించాలి. విశ్వసనీయమైన విధంగా, చౌకగా స్వచ్ఛ విద్యుత్ లభించేలా చూసేందుకు పంపిణీ అనేది ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చూడాలి. → దేశవ్యాప్తంగా విద్యుదీకరణ వేగవంతం కావడాన్ని బట్టి భారతదేశ విద్యుత్ పరివర్తన ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. → తలసరి విద్యుత్ వినియోగం 2025లో 1,400 కిలోవాట్అవర్ స్థాయి నుంచి 2070 నాటికి 7,000–10,000 కిలోవాట్అవర్కి పెరగనుంది. ఫ్రాన్స్, కొరియాలాంటి సంపన్న దేశాల స్థాయికి చేరనుంది. → ప్రస్తుత పాలసీలు ఇలాగే కొనసాగితే 2070 నాటికి మొత్తం స్థాపిత సామర్థ్యం తొమ్మిది రెట్లు పెరుగుతుంది. అదే తటస్థ ఉద్గారాల లక్ష్యాలకు అనుగుణమైన నెట్–జీరో విధానాలను అమలు చేస్తే 14 రెట్లు పెరుగుతుంది. → సోలార్ పీవీ సామర్థ్యం 5,500 గిగావాట్లకు చేరుతుంది. ప్రస్తుత పాలసీలను కొనసాగిస్తే ఇప్పుడు నామమాత్రంగా ఉన్న బ్యాటరీ స్టోరేజీ 1,400 గిగావాట్లకు చేరుతుంది. నెట్ జీరో విధానాలతో 3,000 గిగావాట్లకు చేరుతుంది. → దీర్ఘకాలికంగా విద్యుత్ పరివర్తనలో అణు విద్యుత్ వ్యూహాత్మక పాత్ర పోషించనుంది. 2025లో 8.8 గిగావాట్లుగా ఉన్న సామర్థ్యం 2070 నాటికి 300 గిగావాట్లకు పెరుగుతుంది. → ప్రస్తుత పాలసీల ప్రకారం 2070 నాటికి మొత్తం పెట్టుబడులు దాదాపు 8.79 లక్షల కోట్ల డాలర్లకు చేరనుండగా, నెట్ జీరో విధానాలతో 14.23 లక్షల కోట్ల డాలర్లకు చేరతాయి. -
‘గగన్యాన్’పై మున్ముందుకే..
బెంగళూరు: మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్’లో ఎన్ని అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే భారత్ మున్ముందుకే దూసుకెళ్లాలని గ్రూప్ కెప్టెన్, భారత వ్యోమగా మి, అశోక చక్ర అవార్డు గ్రహీత శుభాంశు శుక్లా అన్నారు. చిరకాల ఆకాంక్ష నెరవేర్చుకోవాలని చెప్పారు. సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ ఉత్సాహంతో పనిచేస్తే అనుకున్నది సాధించడం తథ్యమని పేర్కొన్నారు. ఆయన బుధవారం బెంగళూరులో మీడియా సమావేశంలో మాట్లా డారు. మిషన్ గగన్యాన్ విజయవంతం అయి తే ఇలాంటి ఘనత సాధించిన దేశాల జాబితా లో భారత్ చేరుతుందని తెలిపారు. మనదేశ కీర్తిప్రతిష్టలు మరింత పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం మూడు దేశాలు మాత్రమే మానవసహిత అంతరిక్ష యాత్రల్లో విజయవంతం అయ్యాయని గుర్తుచేశారు. గగనయాన్ యాత్ర ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇదే మనదేశంలో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, మూడు రోజుల్లో క్షేమంగా వెనక్కి తీసుకురావాలన్నది గగన్యాన్ లక్ష్యం. 2027లో ఈ యాత్రను చేపట్టాలని నిర్ణయించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ అదే ఉత్సాహం శుభాంశు శుక్లా ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లొచ్చారు. గగన్యాన్ కోసం శుక్లాతోపాటు మరో ము గ్గురు వ్యోమగాములను ఇస్రో ఎంపిక చేసింది. గగన్యాన్ సాధారణమైన మిషన్ కాదని శుక్లా పేర్కొన్నారు. ఇది అత్యంత సంక్లిష్ట మైన, సవాళ్లతో కూడుకున్న కార్యక్రమమని వివరించారు. అయినప్పటికీ అధైర్యపడే ప్ర సక్తే లేదన్నారు. మొదటి రోజు ఎంత ఉత్సా హంతో ఉన్నామో ఇప్పటికీ అదే ఉత్సాహంతో పని చేస్తున్నామని స్పష్టంచేశారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, మళ్లీ భూమిపైకి తీసుకురావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ష్టాత్మకంగా భావిస్తున్నామని తెలిపారు. పెద్ద కార్యక్రమంలో కొన్ని అవరోధాలు, ఆలస్యా లు సహజమేనని వ్యాఖ్యానించారు. వాటిని ప్రతికూలతలుగా చూడొద్దని పేర్కొన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. అంతరిక్ష ప్రయోగాల్లో వేర్వేరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని శుక్లా తెలిపారు. ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం కలిసి పనిచేయడంలో తప్పులేద న్నారు. తాను ఐఎస్ఎస్కు వెళ్లిరావడానికి అమెరికా కూడా సహకరించిందని గుర్తుచేశా రు. మన దేశంలో అంతరిక్ష కేంద్ర ప్రభుత్వం చక్కటి సహకారం అందిస్తోందని వివరించారు. సైన్స్, అంతరిక్ష ప్రయోగాల్లో పెట్టుబ డులు నానాటికీ పెరుగుతుండడం శుభ పరిణామం అని చెప్పారు. గగన్యాన్ కోసం అందరూ ఓపిగ్గా ఎదురు చూడాలని యా త్రకు ఎంపికైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ పేర్కొన్నారు. ఏది జరగాలో అది కచ్చితంగా జరుగుతుందన్నారు. గగన్యాన్ యాత్ర విజయవంతమైతే ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ రికార్డు కెక్కుతుందని స్పష్టంచేశారు. -
క్రేజీ క్రేజీ.. మేడిన్ ఇండియా లగేజీ
ఇప్పుడు ట్రావెల్ అనేది అప్పుడప్పుడు మాత్రమే వేసే ట్రిప్పులకే పరిమితం కాకుండా, రెగ్యులర్ జీవన విధానంగా మారిపోయింది. దీంతో అత్యంత నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే లగేజీకి డిమాండ్ పెరుగుతోంది. డిజైన్, పనితీరు, నాణ్యతలో అంతర్జాతీయ బ్రాండ్లకు దీటుగా ఉండే దేశీ బ్రాండ్స్ ఉత్పత్తులను కొనేందుకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింబించడం, స్టయిల్కి పెద్దపీట వేయడం, ఉపయోగించడానికి సులభతరంగా ఉండటం తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా గ్లోబల్ లగేజీ, బ్యాగ్ తయారీ పరిశ్రమలో చైనా ఆధిపత్యం కొనసాగినప్పటికీ ప్రస్తుతం క్రమంగా భారత్లో తయారీవైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. మేడిన్ ఇండియా నినాదం, ఇన్వెస్టర్లలో ఆసక్తి, విస్తరణ ప్రణాళికలు మొదలైనవి ఇందుకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం 2028 నాటికి భారత లగేజ్ పరిశ్రమ రూ. 26,700 కోట్లకు చేరనుంది. 2023 నుంచి 2028 మధ్య ఏటా 12 శాతం వృద్ధి చెందనుంది. 60 శాతం మంది వినియోగదారులు దేశీ లేదా చిన్న బ్రాండ్స్ని కొనడానికి ఇష్టపడుతుండగా, 14 % మంది మరికాస్త ఎక్కువ చెల్లించి ప్రీమియం ఉత్పత్తులను కొనేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న సంస్థలు .. సూట్కేసులు, ట్రాలీలు, బ్యాక్ప్యాక్లు, బిజినెస్ బ్యాగ్లు మొదలైనవి విక్రయించే అప్పర్కేస్ ఇందులో సింహభాగం ఉత్పత్తులను ప్రధానంగా నాసిక్ (మహారాష్ట్ర), రుద్రపూర్ (ఉత్తరాఖండ్)లోని తమ ప్లాంట్లలోనే ఉత్పత్తి చేస్తోంది. ప్రముఖ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా దన్ను గల అప్పర్కేస్ ఉత్పత్తి సామర్థ్యం వచ్చే మూడేళ్ల వృద్ధికి సరిపడేంతగా నెలకు 1,00,000 యూనిట్ల స్థాయిలో ఉంది. భారత్లోనే తయారీ వైపు మళ్లుతున్న ప్రీమియం బ్రాండ్లలో యూమ్ అంకుర సంస్థ కూడా ఒకటి. మేడిన్ ఇండియాను తమ ప్రధాన బ్రాండ్ ఐడియాలజీగా పరిగణిస్తామని సంస్థ కో–¸ఫౌండర్ నైనా పరేఖ్ తెలిపారు. అందుకే తమ ఉత్పత్తుల తయారీని, ముఖ్యంగా అల్యూమినియం, హార్డ్ లగేజీ సోర్సింగ్, అసెంబ్లీని చైనా నుంచి భారత్కి మార్చుకుంటున్నామని వివరించారు. కఠినతరమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, ఆవిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేస్తూ, విదేశీ సరఫరా వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పరేఖ్ వివరించారు. వివిధ భాగస్వామ్యాల ద్వారా యూమీకి ఏటా 4,00,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. వచ్చే రెండేళ్లలో దీన్ని 7,00,000 యూనిట్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మరో కంపెనీ మిరాజియో ప్రస్తుతం తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, భారత్లో తయారు చేసేందుకు భాగస్వామ్యాలను కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకోసం పెద్ద సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించింది. మార్కెట్ వాటాపై కన్ను.. యూమీ ఇప్పటివరకు రూ. 35 కోట్ల వరకు పెట్టుబడులు సమీకరించింది. 2029 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 250 కోట్లకు పైగా వార్షికాదాయాన్ని, 2029–30 నాటికి ప్రీమియం లగేజ్ సెగ్మెంట్లో 8–10% వాటా ను లక్ష్యంగా పెట్టుకుంది. అటు అప్పర్కేస్ దాదాపు 2,000 రిటైలర్లు, మూడు ఎక్స్క్లూజివ్ స్టోర్స్, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా విక్రయాలు సాగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ వాటా 2–3 శాతంగా ఉండగా, వచ్చే ఏడేళ్ల వ్యవధిలో 10 శాతానికి పెంచుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ అనే సంస్థ వచ్చే రెండేళ్లలో బ్యాక్ప్యాక్ల తయారీ సామర్థ్యాన్ని సుమారు 20% పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది.సాక్షి, బిజినెస్డెస్క్ -
IND vs NAM: మరో కూనతో పోరు
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా రెండో మ్యాచ్కు సిద్ధమైంది. తొలి పోరులో అమెరికాపై విజయం సాధించిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు గురువారం నమీబియాతో తలపడనుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తదుపరి మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ తో ఆడనున్న టీమిండియా దానికి ముందు నమీబియాతో మ్యాచ్ను ప్రాక్టీస్గా వాడుకోవాలని భావిస్తోంది. బలాబలాలు, అనుభవం దృష్ట్యా ఇరుజట్లలో చాలా అంతరం ఉంది. తొలి మ్యాచ్లో అమెరికాపై స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన టీమిండియా... నమీబియాపై కలిసికట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. అస్వస్థత కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్లో బరిలోకి దిగలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పితో రెండు రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నాడు. బుధవారం డిశ్చార్జి అయి జట్టుతో కలిశాడు. అయితే నేటి పోరులో అతను ఆడే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ అభిషేక్ దూరమైతే సంజూ సామ్సన్కు అవకాశం లభించవచ్చు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకోగా... ప్రాక్టీస్ సందర్భంగా ఇషాన్ కిషన్ కాలికి గాయమైంది. ఇక తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన నమీబియా... ‘పోరాడితే పోయేదేమీ లేదు’ అన్న చందంగా రాణించాలని చూస్తోంది. ఢిల్లీ పిచ్ అటు బౌలింగ్కు, ఇటు బ్యాటింగ్కు సమానంగా సహకరించనుంది. మైదానం చిన్నది కావడంతో కుదురుకుంటే భారీ స్కోర్లు ఖాయమే! అభిషేక్పైనే అందరి దృష్టి గత రెండేళ్లుగా భారత జట్టు టి20 ఫార్మాట్లో నిలకడగా విజయాలు సాధించడంలో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కృషి ఎంతో ఉంది. ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి చూస్తుండగానే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల ఈ ‘బిగ్ హిట్టర్’ వరల్డ్కప్ తొలి మ్యాచ్లో ‘డకౌట్’ అయ్యాడు. ‘పవర్ ప్లే’ లోపే మ్యాచ్ను లాగేసుకునే సత్తా గల అభిషేక్... రెండో మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది కీలకం. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే రూపంలో బ్యాటర్లకు కొదవలేదు. గత మ్యాచ్లో సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు మంచి స్కోరు చేయగలిగింది. వరల్డ్కప్నకు ఒక్క రోజు ముందు పేస్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తొలి మ్యాచ్లో మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అమెరికాతో పోరులో ఆడని బుమ్రా తుది జట్టులోకి వస్తే ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరం. వాషింగ్టన్ సుందర్ కోలుకున్నా... ఇప్పడు అతడిని తుది జట్టులోకి ఎంపిక చేయడం కష్టమే. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ భారం మోయనున్నారు. పోటీనిచ్చేనా! అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా అనుభవం లేని నమీబియా... టీమిండియాపై సంచలన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. 2021 ప్రపంచకప్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఏకైక మ్యాచ్ జరగ్గా... టీమిండియా అలవోక విజయం సాధించింది. అదే జోరు కొనసాగిస్తూ ఈ మ్యాచ్తో ప్లేయర్లంతా ఫామ్లోకి రావాలని భారత మేనేజ్మెంట్ భావిస్తోంది. నెదర్లాండ్స్తో పోరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నమీబియాపై అంచనాలు లేకపోయినా... ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అని టీమిండియా యోచిస్తోంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నమీబియాపై ఫుల్ ప్రాక్టీస్ చేయాలని మనవాళ్లు చూస్తున్నారు. వరల్డ్కప్నకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత ‘ఎ’ జట్టు చేతిలోనూ నమీబియా పరాజయం పాలైంది. అలాంటిది బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్, హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ బౌలింగ్ను ఎదుర్కొని నమీబియా బ్యాటర్లు నిలవగలరా చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్/సామ్సన్, ఇషాన్, తిలక్, హార్దిక్, రింకూ, శివమ్ దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా/సిరాజ్, వరుణ్. నమీబియా: ఎరాస్మస్ (కెప్టెన్ ), స్టీన్ కాంప్, ఫ్రైలింక్, జాన్ నికోల్, జేజే స్మిత్, జెన్ గ్రీన్, లైచెర్, విలియమ్ మైబుర్గ్, రూబెన్, బెర్నార్డ్ స్కాట్జ్, బెన్ షికొంగో.టి20 ప్రపంచకప్లో నేడుశ్రీలంక X ఒమన్వేదిక: పల్లెకెలె; ఉ.గం. 11 నుంచి నేపాల్ X ఇటలీవేదిక: ముంబై; మ.గం. 3 నుంచిభారత్ X నమీబియావేదిక: న్యూఢిల్లీ; రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
ముకేశ్కు స్వర్ణం, కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నేలవల్లి రెండు పతకాలతో మెరిశాడు. బుధవారం జరిగిన జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ముకేశ్ కాంస్య పతకం సాధించాడు. ఏడుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ముకేశ్ 19 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన సూరజ్ శర్మ 23 పాయింట్లతో రజతం నెగ్గగా... ఇండోనేసియా షూటర్ ఫవాజ్ 29 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో ముకేశ్, సూరజ్, సాహిల్లతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ముకేశ్ బృందం 1729 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సీనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. అనీశ్ 23 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో అనీశ్, ఆదర్శ్ సింగ్, నీరజ్ కుమార్లతో కూడిన భారత బృందం 1708 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ టోరీ్నలో భారత షూటర్లు 35 స్వర్ణాలు, 15 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 64 పతకాలు గెలిచారు. -
‘తృణధాన్యాలు’ తొలగింపు
న్యూయార్క్: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో మన రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. భారత రైతాంగానికి నష్టం కలిగించే నిర్ణయాలు ఉండబోవని హామీ ఇస్తోంది. ఉభయతారకంగా ఉండే ఒప్పందానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంటోంది. ఇటీవల ఇరుదేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిపై అమెరికా ప్రభుత్వం సోమవారం ఫ్యాక్ట్షీట్ విడుదల చేసింది. అమెరికాకు సంబంధించిన ఏయే వస్తువులు, ఉత్పత్తులపై భారత్లో టారిఫ్లు రద్దు కావడం లేదా తగ్గించడం జరుగుతుందో వెల్లడించింది. అయితే, మరుసటి రోజే ఈ ఫ్యాక్ట్షీట్లో సవరణ చేసి, మంగళవారం మరోసారి విడుదల చేయడం గమనార్హం. సవరించిన జాబితాలో ‘కొన్ని రకాల తృణధాన్యాలు’అనే పదాన్ని ట్రంప్ సర్కార్ తొలగించింది. అంటే అమెరికా నుంచి భారత్కు ఎగుమతి చేసే తృణధాన్యాలపై సుంకాలు రద్దు చేయడం లేదా తగ్గించడం ఉండబోదని తేలి్చచెప్పింది. ఇలా ఫ్యాక్ట్షీట్ను సవరించడం వెనుక ఏం జరిగిందన్నది తెలియరాలేదు. తొలుత విడుదల చేసిన జాబితాలో మధ్యంతర ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు ప్రస్తావించారు. అమెరికా పారిశ్రామిక వస్తువులు, సరుకులు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తొలగించడానికి లేదా తగ్గించడానికి భారత్ అంగీకరించిందని పేర్కొన్నారు. ఇందులో మద్యం తయారీకి ఉపయోగించే ధాన్యాలు, ఎర్ర జొన్నలు, ట్రీ నట్స్, తాజా లేదా శుద్ధి చేసిన పండ్లు, కొన్ని రకాల తృణధాన్యాలు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్తోపాటు అదనపు ఉత్పత్తులు ఉన్నట్లు జాబితాలో పొందుపర్చారు. 500 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఇంధన, సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గుతోపాటు ఇతర ఉత్పత్తులను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయబోతోందని తెలియజేశారు. సవరించిన ఫ్యాక్ట్షీట్ను గమనిస్తే.. ఇందులో కొన్ని రకాల తృణధాన్యాలు అనే పదాన్ని తొలగించారు. అలాగే ‘అమెరికా వస్తువులు, ఉత్పత్తులు కొనడానికి భారత్ కట్టుబడి ఉంది’అనే వ్యాక్యంలో కట్టుబడి అనే పదాన్ని తొలగించారు. ‘కొనాలని భావిస్తోంది’అని చేర్చారు. నిజానికి గతవారం మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత భారత్, అమెరికాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ‘తృణధాన్యాలు’అనే ప్రస్తావన లేదు. అమెరికా ప్రభుత్వం తమ ఫ్యాక్ట్షీట్లో ఈ పదాన్ని చేర్చి, ఒక్కరోజులోనే తొలగించడం గమనార్హం. అమెరికా నుంచి తృణధాన్యాలను దిగుమతి చేసుకొంటే భారత రైతులు నష్టపోతారన్న వాదన వినిపిస్తోంది. ఇది కూడా చదవండి: ‘తొలగింపు నోటీసు’లో లోపాలు.. మరో అవకాశం ఇచ్చిన స్పీకర్ -
చమురు కొనకుండా భారత్ను అడ్డుకుంటోంది
మాస్కో: ప్రపంచ దేశాలపై ఆర్థికపరమైన ఆధిపత్యం సాధించేందుకు అమెరికా టారిఫ్లు, ఆంక్షలు, ప్రత్యక్ష నిషేధాల వంటి అనేక రకాల అక్రమ విధానాలను అమలు చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. అదేవిధంగా, భారత్ తదితర దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా అమెరికాయే అడ్డుకుంటోందన్నారు. రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించడం ద్వారా పోటీ లేకుండా చేయడం వంటి అక్రమ విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సోమవారం టీవీ బ్రిక్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లావ్రోవ్ అమెరికా వైఖరిని ఎండగట్టారు. భారత్, ఇతర బ్రిక్స్ సభ్య దేశాలు, కీలక వ్యూహాత్మక భాగస్వాములతో మాకున్న వాణిజ్యం, పెట్టుబడి సహకారం, సైనిక, సాంకేతిక సంబంధాలను నియంత్రించడానికి అమెరికా ప్రయతి్నస్తోందని ఆరోపించారు. గతంలో చలాయించిన ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇప్పటికీ పాశ్చాత్య దేశాలు ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక ప్రత్యర్థులను అణచివేసే చర్యలు మరింత బాహాటంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇంధన సరఫరా మార్గాలపై పెత్తనం గతేడాది రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య అలాస్కాలో జరిగిన చర్చలను లావ్రోవ్ ప్రస్తావించారు. ‘ఉక్రెయిన్ సమస్య పరిష్కారం తప్పనిసరని అమెరికా తెలిపింది. మేం కోరుకున్నదీ అదే. అందుకే ఆ దేశం అందజేసిన ప్రతిపాదనలకు వెనువెంటనే ఆమోదం తెలిపాం’అన్నారు. ‘అయితే, జరిగింది వేరుగా ఉంది. అలాస్కా చర్చల తర్వాత మాపై మరిన్ని ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ జలాల గుండా వెళ్లే మా ఆయిల్ ట్యాంకర్లపై దాడులు పెంచారు. మా చమురు కొనుగోలు చేసే భారత్, తదితర దేశాలపై ఒత్తిడులను తీవ్రతరం చేశారు. తక్కువ ధరకు మేం సరఫరా చేసే చమురు, గ్యాస్లను కాదని, అమెరికా నుంచి అత్యధిక ధరకు సహజవాయువును యూరప్ దేశాలు కొనుక్కుంటున్నాయి.ఆ విధంగా, అమెరికా తన ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించుకుంది’అని లావ్రోవ్ వివరించారు. నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్లు, ఉక్రెయిన్ గ్యాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, టర్క్ స్ట్రీమ్ పైప్లైన్ తదితర అన్ని ఖండాల్లోని ఇంధన సరఫరా మార్గాలను చెప్పుచేతల్లో పెట్టుకోవాలన్నదే అమెరికా లక్ష్యమని తెలిపారు. ‘ఆర్థికపరమైన ఆధిపత్యం కోసం అమెరికా ప్రభుత్వం ఆంక్షలు, టారిఫ్లు, ప్రత్యేక నిషేధాలు, కొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థలపై పరిమితులు సైతం విధిస్తోంది. వీటన్నిటినీ మనం గమనంలోకి తీసుకోవాలి’అని లావ్రోవ్ చెప్పారు.‘భారత్, ఇండోనేసియా, బ్రెజిల్ మాదిరిగా మేం కూడా అన్ని దేశాలతో సహకార భావనతో వ్యవహరిస్తున్నాం. ఆ మాటకొస్తే అమెరికాతోనూ సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నాం. అమెరికా మాత్రం అవరోధాలను సృష్టిస్తూనే ఉంది’అని విమర్శించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించినందునే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు గత వారం ట్రంప్ ప్రకటించడం తెల్సిందే. ఆయిల్ను రష్యా నుంచి కొంటున్నట్లు తెలిస్తే మళ్లీ టారిఫ్లను విధిస్తామని కూడా ఆయన హెచ్చరికలు చేశారు. -
భారత్లో అవినీతి తగ్గుముఖం!
న్యూఢిల్లీ: భారత్లో అవినీతి కొంత తగ్గుముఖం పట్టినట్లు అంతర్జాతీయ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ అయిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ మంగళవారం విడుదల చేసిన కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్(సీపీఐ)–2025 నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 182 దేశాల్లో అవినీతి నిర్మూలనపై అధ్యయనం చేయగా, భారత్కు 91వ స్థానం దక్కింది. గత ఏడాది 96వ స్థానంలో నిలిచిన భారత్ ఈ ఏడాది తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఆసియా పిసిఫిక్ దేశాల్లో అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు క్రమంగా పెరుగుతున్నాయని, వాటి ఫలితాలు సైతం కనిపిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది.అవినీతి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన వస్తోందని తెలియజేసింది. ప్రపంచంలో ప్రతిచోటా అవినీతి అనేది అతిపెద్ద జాడ్యంగా మారినట్లు ఆందోళన వ్యక్తంచేసింది. అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే తొలుత పాలకులు, రాజకీయ నేతలు చొరవ చూపాలని, వారు అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని సూచించింది. జవాబుదారీతనం లేని నాయకుల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని, అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు జరుగుతున్నాయని వెల్లడించింది. వారంతా వ్యవస్థల్లో సంస్కరణలు కోరుకుంటున్నారని తెలియజేసింది. వ్యవస్థల ప్రక్షాళనతో అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. ⇒ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 182 దేశాల్లో ప్రభుత్వ రంగంలో అవినీతిని అధ్యయనం చేసి ర్యాంకులు ఇచి్చంది. సున్నా నుంచి 100 దాకా స్కోర్ కేటాయించింది. సున్నా స్కోర్ అంటే అత్యంత అవినీతి దేశమని అర్థం. 100 దాకా స్కోర్ వస్తే అక్కడ అవినీతి ఆనవాళ్లు పెద్దగా లేనట్లే. ⇒ పలుదేశాల్లో అవినీతిని బహిర్గతం చేస్తున్న జర్నలిస్టులకు హెచ్చరికలు ఎదురవుతున్నాయి. దాడులు జరుగుతున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ⇒ అవినీతిపై పరిశోధన చేసి, ప్రజలకు తెలియజేస్తున్న జర్నలిస్టులకు హత్యకు గురవుతు న్నా, దాడులను ఎదుర్కొంటున్నా పాలకులు సరిగ్గా స్పందించడం లేదని కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ నివేదిక ఆక్షేపించింది. ⇒ 2012 నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 829 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అవినీతిని బయటపెట్టడమే వీరు చేసిన నేరం. ⇒ సీపీఐ స్కోర్ 50 కంటే తక్కువ ఉన్న దేశాలైన బ్రెజిల్, ఇండియా, మెక్సికో, పాకిస్తాన్, ఇరాక్లో ఎక్కువ మంది జర్నలిస్టులు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ స్కోర్ 35, ఇండియా స్కోర్ 39, మెక్సికో స్కోర్ 27, పాకిస్తాన్ స్కోర్ 28, ఇరాక్ స్కోర్ 28గా ఉంది. ⇒ 31 దేశాల్లో 2012 నుంచి అవినీతి గణనీయంగా తగ్గిపోయింది. మిగిలిన దేశాలు అవినీతిని నియంత్రించడంలో విఫలమయ్యాయి. కొన్ని దేశాల్లో అవినీతి అదేస్థాయిలో ఉండగా, మరికొన్ని దేశాల్లో కొంత పెరిగింది. ⇒ ప్రపంచ సగటు సీపీఐ స్కోర్ 42గా నమోదైంది. మూడింట రెండొంతుల దేశాల స్కోర్ 50 కంటే తక్కువే ఉన్నట్లు తేలింది. ⇒ అవినీతి వల్ల ప్రజలకు భారీగా నష్టం జరుగుతోంది. వారి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. మౌలిక వసతులు అందడం లే దు. యువత ఆశలు సాకారం కావడం లేదు. ⇒ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ రిపోర్టులో డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశం స్కోర్ 89. అవినీతి నిర్మూలనలో ఫిన్లాండ్, సింగపూర్ కంటే డెన్మార్క్ ముందంజలో ఉంది. చిట్టచివరి స్థానాల్లో దక్షిణ సూడాన్, సోమాలియా, వెనెజులా నిలిచాయి. ⇒ అగ్రదేశం అమెరికాకు 29వ ర్యాంకు, యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు 20వ ర్యాంకు లభించింది. ⇒ ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, యూకే, న్యూజిలాండ్లో అవినీతి నిర్మూలన ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదని నివేదిక పేర్కొంది. అవినీతిని అంతం చేయాలన్న సంకల్పం అక్కడి పాలకుల్లో కనిపించడం లేదని వెల్లడించింది. ⇒ అవినీతి పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ వర్గాల్లో పెచ్చరిల్లుతున్న అవినీతి సమాజానికి ముప్పుగా పరిణమిస్తోంది. పాలకులు అధికార దురి్వనియోగానికి పాల్పడుతూ జర్నలిస్టులను, ఎన్జీఓలను కట్టడి చేయాలని చూస్తున్నారు. పాలకుల్లో పారదర్శకత గానీ, జవాబుదారీతనం గానీ లోపిస్తున్నాయి. అంతిమంగా ఇది అవినీతికి బాటలు వేస్తున్నట్లు కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ నివేదిక తేలి్చచెప్పింది. -
ఆకృతికి రజతం... అంజుమ్కు కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్లు తమ జోరు ప్రదర్శిస్తున్నారు. పోటీల ఏడో రోజు సీనియర్ విభాగంలో భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. సీనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో ఆకృతి దహియా రజత పతకం నెగ్గగా... అంజుమ్ మౌద్గిల్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆకృతి 354.2 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. అంజుమ్ 340.4 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. కజకిస్తాన్ షూటర్ సోఫియా షుల్జెంకో 358.2 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొంది స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. టీమ్ విభాగంలో ఆకృతి, అంజుమ్, అషిలతో కూడిన భారత జట్టు 1756 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లోనూ భారత్కు రెండు పతకాలు లభించాయి. ప్రాచి గైక్వాడ్ (353.3 పాయింట్లు) బంగారు పతకాన్ని సాధించగా... అనుష్క ఠాకూర్ (341.1 పాయింట్లు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. టీమ్ విభాగంలో ప్రాచి, అను‡్ష్క, హేజెల్లతో కూడిన భారత జట్టు 1748 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. -
నయా రాకెట్
సాక్షి క్రీడా విభాగం : దక్షిణేశ్వర్ సురేశ్... గతేడాదే డేవిస్కప్లో అరంగేట్రం చేశాడు. తొలి ప్రయత్నంలోనే బోణీ కూడా కొట్టాడు. అయినా మనకెవరికీ తెలియదు. తాజాగా తెలిసింది. తెలియని వారు సైతం తెలుసుకుంటున్నారు. గూగుల్లో ఎవరీ దక్షిణేశ్వర్ అని సెర్చ్ చేస్తున్నారు. ఇంతలా నెటిజన్ల కంటపడుతున్న అతను ఏం చేశాడో చెప్పాల్సిన పనైతే లేదు. ఎందుకంటే అతనొక సంచలనం. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్–1లో నెదర్లాండ్స్ జట్టుతో భారత్ ఆడితే... తలపడింది... ఎదురుపడింది... ఎదుర్కొని గెలిపించింది మాత్రం దక్షిణేశ్వరే! ఇందులో ఏ మాత్రం అతిశయోక్తే లేదు. పోటీ... నైపుణ్యం నిండిన ప్రస్తుత కాలంలో దక్షిణేశ్వర్ ముమ్మాటికి ఓ నిశ్శబ్ద చాంపియన్. జూనియర్ సర్క్యూట్, ఏటీపీ చాలెంజర్... ఐటీఎఫ్ ... ఇలా ఎన్నో పేర్లతో టోర్నీలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అన్నింటా ఆడుతూనే ఉన్నా... ఏ టోర్నీలోనూ కంటబడని తమిళనాడు యువతార ఏకంగా చాంపియన్గా బయటపడటమే పెద్ద విశేషం. ఒకప్పుడు ఆట కోసం కిట్ బ్యాగులు మోసిన భుజాలే ఇప్పుడు డేవిస్ కప్లో భారత బాధ్యతల్ని మోస్తున్నాయి. ఎంతో క్రమశిక్షణతో కూడిన అతని శిక్షణ, పోటీలు, విజయాలు ఇవన్నీ కూడా గమనించిన వారికి ముచ్చటేయకుండా ఉండదు. పొద్దెక్కముందే ట్రెయినింగ్... మధ్యలో పోటీలు... పిడికిలి బిగిస్తే విజయాలు అన్నీ కూడా ఓ క్రమపద్దతిలో కష్టపడితేనే వచ్చాయి. ఓపికగా, ఒద్దికగా అన్నింటిని భరించిన దక్షిణేశ్వర్ ఈ క్రమంలో క్రీడా జర్నలిస్టుల ప్రాధాన్యంలోనూ లేడు. కానీ ఒక్కసారిగా సంచలన విజయాలతోనే అందరి కళ్లముందుకు వచ్చాడు. ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్ ప్రకారమైతే డేవిస్కప్లో భారత జట్టు తరఫున నంబర్వన్ సుమిత్ నగాల్ తర్వాత ఆర్యన్ షా, కరణ్ సింగ్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలి. అయితే భారత నాలుగో ర్యాంకర్గా ఉన్న దక్షిణేశ్వర్ ఆటతీరుపై నమ్మకంతో భారత జట్టు నాన్ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్పాల్ ఈ తమిళనాడు పొడగరికి ఏకంగా మూడు మ్యాచ్లు (సింగిల్స్, డబుల్స్, రివర్స్ సింగిల్స్) ఆడే అవకాశం ఇచ్చాడు. రోహిత్ రాజ్పాల్తోపాటు భారత టీమ్ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా అంచనాలకు మించి రాణించిన దక్షిణేశ్వర్కు భారత్కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. తొలినాళ్ల ప్రయాణమిది తమిళనాడులోని దిండిగుల్ పట్టణానికి చెందిన దక్షిణేశ్వర్ తండ్రి సురేశ్ ఎక్కా కూడా టెన్నిస్ ప్లేయరే! రాష్ట్రానికి, దేశానికి ఆడలేదు కానీ క్లబ్ లెవెల్ ఆటగాడు సురేశ్. బహుశా ఈ మూలాలే దక్షిణేశ్వర్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చాయేమో! చెన్నైలోని కోచ్ లక్ష్మణ్ చక్రవర్తి శిక్షణలో ఓనమాలు, తర్వాత మెలకువలు నేర్చుకొని రాటుదేలాడు. 2010 నుంచి 2016 వరకు తన ఉండే ఊరి నుంచి 16 కిలోమీటర్లు కిట్ బ్యాగులు మోసుకొని చెన్నై వెళ్లి చక్రవర్తి ఇచ్చే రోజువారీ శిక్షణ ముగించుకొని తిరిగి బస్సులో ఇంటికి చేరేవాడు. నిండా పదేళ్లు (9) లేకపోయినా సురపేట్ నుంచి మొగప్పాయిర్, అక్కడి నుంచి అన్నా నగర్, అటుపై లయోలా కాలేజ్ అతని టెన్నిస్ శిక్షణ సాగేదని కోచ్ చక్రవర్తి వివరించారు. ‘అదేంటో ఏమో దక్షిణేశ్వర్ బాల్యం నుంచే ఎవరితోనైనా సరే ఆడేందుకు ఇష్టపడేవాడు. కష్టపడేందుకు, నేర్చుకునే క్రమంలో ఆడిగేందుకు సిగ్గుపడడు. కానీ తన పనిమాత్రం నింపాదిగా, నిశ్శబ్దంగానే చేసుకునేవాడు. అతనిది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పెప్సీ, కోక్లాంటి కూల్డ్రింక్స్ తాగేవాడే కాదు. కఠినమైన క్రమశిక్షణతోనే మెలిగేవాడు. అవకాశాలేమో పరిమితంగా వస్తే, ఆర్థిక సమస్యలు అపరిమితంగా చుట్టిముట్టినా కూడా క్రమశిక్షణతోనే అధిగమించాడు. 2016లో ఫ్రాన్స్లో శిక్షణకు వెళ్లాడు. ఆ తర్వాతే అండర్–16 జాతీయ టోర్నీలో విజేతగా నిలిచాడు’ అని 65 ఏళ్ల కోచ్ లక్ష్మణ్ చక్రవర్తి తన శిష్యుడి ప్రయాణం చెబుతూ మురిసిపోయారు. ప్రస్తుతం అమెరికాలో... దక్షిణేశ్వర్ ఆటలో క్రమంగా రాటుదేలుతున్నా... చదువెందుకని ఏనాడు అనుకోలేదు. ఆటలో కష్టపడ్డట్లే ఉన్నత విద్య కోసం కూడా అంతే క్రమశిక్షణతో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని ‘వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ’లో కమ్యూనికేషన్స్ విద్యను అభ్యసిస్తున్న అతని చదువు ఈ ఏడాది మే నెలలో పూర్తవనుంది. ఆ తర్వాత పూర్తిగా టెన్నిస్పైనే దృష్టి సారించనున్నాడు. దీంతో మరిన్ని విజయాలతో 470వ ర్యాంకులో ఉన్న ఈ తమిళనాడు ప్లేయర్ నిలకడైన విజయాలు సాధిస్తే మరో ఏడాది తిరిగేసరికి టాప్–100 ర్యాంకింగ్స్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏడాది గడిచే సరికి...గతేడాది డేవిస్ కప్లో భారత్... స్విట్జర్లాండ్తో ఆడింది. 3–1తో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆడిన భారత డేవిస్ బృందంలో దక్షిణేశ్వర్ ఉన్నాడు. బరిలోకి దిగి సింగిల్స్లో గెలిచాడు. అలా భారత్ విజయంలో దక్షిణేశ్వర్ పాత్ర ఉంది. ఏడాది తిరిగేసరికి 22 ఏళ్ల క్రితం లియాండర్ పేస్ రికార్డునే సమం చేసిన ఘనత దక్షిణేశ్వర్ది! 2004లో జపాన్పై పేస్ 3 మ్యాచ్లాడి పేస్ గెలిపించాడు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత దక్షిణేశ్వర్ నెదర్లాండ్స్తో తొలి సింగిల్స్ ఆడి గెలిచాడు. రెండో రోజు డబుల్స్, రివర్స్ సింగిల్స్ వరుసగా ఆడి కూడా గెలిపించాడు. పేస్ తర్వాత... దక్షిణేశ్వర్ కంటే ముందు... సోమ్దేవ్, విష్ణువర్ధన్, సాకేత్ మైనేని, సుమిత్ నగాల్, యూకీ బాంబ్రీ, గుణేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెడుంజెళియన్ ఇలా ఎంతోమంది వచ్చారు. మెరుగైన ర్యాంకింగ్స్లో నిలిచారు. డేవిస్ కప్ ఆడారు. కానీ దక్షిణేశ్వర్ ర్యాంకింగ్స్లో వెనుకబడినా... భారత్ను ముందుండి గెలిపించే ప్రదర్శనైతే చేయలేదు. -
అమెరికా అడ్డుపడుతుంది: రష్యా
కీవ్: డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్పై అమెరికా విధిస్తున్న అధిక సుంకాలు తగ్గించారు. దానికి ప్రతీగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం నిలిపివేసిందన్నారు. అయితే భారత్ దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గియో లవ్రోవ్ తొలిసారిగా ట్రంప్ వైఖరిపై స్పందించారు.ఇటీవలే ట్రంప్ తిరిగి భారత్కు స్నేహహస్తం అందిస్తున్నారు. ఇంతకాలం భారత్ను తన అంగబలం ఆర్థికబలంతో గుప్పిట్లో పెట్టుకుందామనుకున్న ట్రంప్ అది కుదరదనే తెలిసాక తిరిగి రాజీ బాట పట్టారు. భారత్ ఎగుమతులపై అమెరికా పెంచిన అధిక పన్నులను తగ్గిస్తున్నామని ప్రకటించారు. భారత్ సైతం దీనికి సానూకూలంగా స్పందించి ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ సమయంలో ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిందని అన్నారు. అయితే ఈ స్టేట్మెంట్పై భారత్ స్పందించలేదు. తాజా రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ వ్రోవ్ ఈ అంశంపై స్పందించారు.సెర్గీయో లవ్రోవ్ మాట్లాడుతూ" ఉక్రెయిన్ సమస్య పరిష్కరించాలని వారు మాకు చెబుతున్నారు. మేము అమెరికా ప్రతిపాదనను అంగీకరించాము. అమెరికా స్థానం మాకు ముఖ్యమైనది. అయితే వారేమో కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. సముద్ర చట్టాలపై ఉన్న UN కన్వెన్షన్ను ఉల్లంఘిస్తూ బహిరంగ సముద్రంలో ట్యాంకర్లపై యుద్ధం జరుపుతున్నారు. భారత్, ఇతర భాగస్వాములు చౌకైన రష్యన్ ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా నిషేధం విధిస్తున్నారు. అధిక ధరలకు US, LNG సహజ వాయువు కొనుగోలు చేయమని వారిని బలవంతం చేస్తున్నారు ” అని సెర్గీ లవ్రోవ్ అన్నారు.డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఆర్థికంగా అధిపత్యం సాధించేందుకు ప్రపంచ దేశాలపై పన్నుల ఆంక్షలతో విరుచుకపడుతున్నారని తెలిపారు. అయితే భారత్, చైనా, కెనడా వంటి దేశాలతో సహాకారం అందిస్తూనే మనం ఈ అమెరికా అడ్డంకులను ఎదుర్కోవాలని సెర్గియో లవ్రోవ్ పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారని అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని సెర్గియో లవ్రోవ్ అన్నారు. అధిక ధరలకు చమురు కొనుగోలు చేస్తే ప్రజలపై భారం పడుతుంది కనుక దేశప్రజల ప్రయోజనాలే ఆ దేశానికి ప్రథమంగా ఉండాలని రష్యా విదేశాంగశాఖ మంత్రి తెలిపారు. -
పాక్ యూటర్న్.. భారత్ తో పోరుకు సిద్ధం
-
దాడులు కొనసాగితే హిందువులకు ప్రమాదమే?
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రక్కా ప్రణాళిక ప్రకారమే ఆ దేశంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి లేఖ రాశాయి.ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడి రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో ఆ దేశంలో మైనార్టీలపై ప్రత్యేకించి హిందువులపై పెద్దఎత్తున దాడులు చేసి చంపారు. దీనిపై భారత్ సైతం ఎన్ని సార్లు స్పందించిన పెద్దగా ఫలితం లేకపోయింది. అయితే ఇప్పుడు ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి."హిందూ అడ్వాన్సింగ్ ఉమన్ రైట్స్" అనే అంతర్జాతీయ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఈ దాడులకు నిరసనగా మద్దతు కూడగట్టింది. దాదాపు 15 దేశాలకు చెందిన 125 సంస్థల సహకారంతో ఐక్యరాజ్య సమితికి లేఖ రాసింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పక్కా ప్రణాళిక ప్రకారమే హిందువులపై దాడులు జరుగుతున్నాయని తక్షణమే వాటిని నివారించాల్సిన అవసరం ఉందని కోరింది. ఈ అంశంలో యూరోపియన్ యూనియన్ తో పాటు భారత్ ఇతర దేశాలు, సంస్థలు జోక్యం చేసుకోవాలని తెలిపింది.ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఆ దేశంలోని మైనార్టీలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. అయితే 2024లో షేక్ హాసీనా బంగ్లాదేశ్ను వదిలిన నాటి నుంచి ఆ దేశంలో మైనార్టీలపై విపరీతంగా దాడులు తీవ్రంగా జరుగుతన్నాయి. హత్యలు, ఆలయాలపై దాడి, ఆస్తుల ఆక్రమణ ఇలా ఎన్నో అఘాయిత్యాలతో ఆ దేశంలోని హిందువులు భయభ్రాంతులకు గురువుతున్నారు. అయితే బంగ్లాదేశ్లో రేపు ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. -
చిప్ రంగంలో స్వయం సమృద్ధి!
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ ప్రపంచంలో ’ఆత్మనిర్భర్ భారత్’నినాదానికి బలం చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్స్ రంగానికి వెన్నెముక లాంటి సెమీకండక్టర్ల (చిప్స్) తయారీలో దేశాన్ని అగ్ర స్థానానికి చేర్చేందుకు ’ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’(ఐఎస్ఎం 2.0)కు శ్రీకారం చుట్టింది. 2026–27 బడ్జెట్లో ఈ మిషన్ కోసం ప్రత్యేకంగా రూ.1,000 కోట్లు కేటాయించింది. పరిశోధన, శిక్షణ, పరికరాల తయారీపై దృష్టి సారిస్తూ, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దేశీయ టెక్నాలజీని అభివద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని కేంద్రం ప్రకటించింది.ఆ మూడు దేశాలదే పెత్తనంప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీలో తైవాన్, చైనా, కొరియా దేశాల ఆధిపత్యం నడుస్తోంది. కోవిడ్ సమయంలో చిప్స్ సరఫరా చైన్ దెబ్బతినడంతో మొబైల్స్ నుంచి కార్ల తయారీ వరకు అన్నీ స్తంభించిపోయాయి. ఈ చేదు అనుభవాల దష్ట్యా, సరఫరా గొలుసులో చైనాపై ఆధారపడకూడదని భారత్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ‘మేక్ ఇన్ ఇండియా –మేక్ ఫర్ ది వరల్డ్’లక్ష్యంతో అడుగులు వేస్తోంది.అప్పుడు ఐఎస్ఎం 1.0 సూపర్ హిట్..కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రారంభించిన తొలి దశ (ఐఎస్ఎం 1.0) విజయవంతమైంది. రూ.76 వేల కోట్ల ప్రోత్సాహకాలతో మొదలైన ఈ ప్రయాణంలో డిసెంబర్ 2025 నాటికి ఏకంగా రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడులతో 10 భారీ ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ఇప్పుడు ఐఎస్ఎం 2.0 ద్వారా కేవలం చిప్స్ అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా ముడి సరుకులు, పరికరాలు, డిజైనింగ్ కూడా భారత్లోనే జరిగేలా ప్రణాళిక రచించారు.2026–27 బడ్జెట్ లక్ష్యం ఇదే..సెమీకండక్టర్, డిస్ప్లే తయారీ ఎకోసిస్టమ్ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 8,000 కోట్ల భారీ ప్రణాళిక రూపొందించారు. రూ. 4,000 కోట్ల పెట్టుబడితో మరో కొత్త చిప్ తయారీ యూనిట్ ద్వారా 1,500 మందికి ఉపాధి కల్పించానున్నారు. రూ. 11,000 కోట్ల పెట్టుబడితో 9 కొత్త ఏటీఎంపీ/ఓశాట్ అసెంబ్లింగ్ యూనిట్ల ద్వారా 3,000 మందికి ఉపాధి ఇవ్వనున్నారు. అంతేగాక 30 డిజైన్ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు 10 కొత్త చిప్ ఐపీ కోర్లను అభివృద్ధి చేయనున్నారు. మన సొంత చిప్ ’ధ్రువ్–64’విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా సీ–డాక్ ఆధ్వర్యంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ’ధ్రువ్– 64’మైక్రోప్రాసెసర్ ఒక గేమ్ ఛేంజర్. 5జీ, ఆటోమొబైల్, రక్షణ రంగాల్లో దీని వినియోగం కీలకం కానుంది.2035 నాటికి టాప్ ప్లేస్లో..భారత సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి 100–110 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి. 2029 నాటికి దేశీయ అవసరాల్లో 70–75 శాతం చిప్స్ మన దగ్గరే తయారయ్యేలా చూడటం, 2035కల్లా ప్రపంచంలోని టాప్ సెమీకండక్టర్ దేశాల సరసన భారత్ నిలవడం ఈ మిషన్ అంతిమ లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. రాబోయే రోజుల్లో దేశీయంగా 3–నానోమీటర్, 2–నానోమీటర్ అత్యాధునిక చిప్స్ తయారీ ప్రణాళిక కార్యరూపం దాల్చుతుందని ధీమా వ్యక్తం చేసింది. -
సాహసోపేతమేగానీ...
సహనం, ఓర్పు, సంయమనం, ప్రయామం, నిగ్రహం... ఎదుటివారు ఎంతగా రెచ్చ గొడుతున్నా మాట తూలకుండా ప్రశాంతంగా ఉండే స్థితిని చెప్పటానికి ఇలా బోలెడు పదాలున్నాయి. కనీసం ఆర్నెల్లుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిపోయినట్టేనని తరచు చెబుతూవచ్చారు. అందుకు మన దేశంనుంచి ఆశాజనకమైన స్పందన రానప్పుడల్లా రెచ్చిపోయి మాట్లాడారు. పాకిస్తాన్ పౌర, సైనిక అధినేతల్ని నెత్తినెక్కించుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జమ్మూ–కశ్మీర్ భౌగోళిక చిత్రపటాన్ని పాకిస్తాన్ సంబరపడేలా మార్చేశారు. ఎన్ని చేసినా మన ప్రభుత్వం మౌనంగా ఉండిపోవటం, లేదా ఆచితూచి మాట్లాడటం పనికొచ్చినట్టుంది. ఎట్టకేలకు మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి భారత–అమెరికాల మధ్య ఒక అవగాహన కుదిరిందని మొన్న శనివారం అధికారికంగా ఉమ్మడి ప్రకటన వెలువడింది. అందుకు సంబంధించిన ఒక అమరిక (ఫ్రేమ్వర్క్) కూడా రూపొందింది. అంతే... వెనువెంటనే 25 శాతం అదనపు సుంకాలు రద్దయ్యాయి. ఇకపై సుంకాలు 18 శాతానికి మాత్రమే పరిమితమవుతాయని అమెరికా ప్రకటించింది. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి అలముకున్న తరుణంలో మన దేశం ఈ మాదిరి ఒప్పందానికి సంసిద్ధం కావటం ఒక సాహసోపేతమైన చర్య. అయితే ‘ఇల్లలకగానే పండగ కాద’న్నట్టు ఈ ఒప్పందం వాస్తవ రూపం దాల్చేవరకూ ఒకింత ఉత్కంఠ, సంశయం తప్పవు. అటు తర్వాత కూడా దిన దిన గండం ఉండనే ఉంటుంది. అక్కడున్నది ట్రంప్ గనుకే ఈ సమస్య. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు గమనిస్తే ఇది తెలుస్తుంది. ‘భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనడం ఆపేసి, ఆ ఉత్పత్తులను అమెరికా నుంచే కొంటుందని ఆశిస్తున్నామ’ని అందులో ఉంది. భారత– రష్యా చమురు వాణిజ్యంపై తమ నిఘా ఉంటుందని కూడా అంటున్నది. ఈ విషయంలో మన దేశం అధికారికంగా ఏమీ చెప్పలేదు. ఉమ్మడి ప్రకటనలోనూ ఆ ప్రస్తావనలేదు. కానీ జాతీయ ఇంధన ప్రయోజనాలే మన గీటురాయి అని గతంలో మోదీ అన్నారు. మన వ్యవసాయ, పాడి రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రశ్నే లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ చెబుతున్నారు. అలాగే అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు సుంకాలు తగ్గించబోమంటున్నారు. అయితే ఉమ్మడి ప్రకటనలో అమెరికాకు సంబంధించిన అన్ని పారిశ్రామిక సరుకులు, విస్తృతశ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు లేదా రద్దు చేయటానికి భారత్ అంగీకరించిందని ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేనట్టయితే భారత్ వెనక్కి తగ్గిందని ట్రంప్ యాగీ చేయటంతోపాటు, అదనపు సుంకాలకు సాకుగా ఉపయోగించుకుంటారు.ప్రస్తుత భారత–అమెరికా వాణిజ్యం 13,000 కోట్ల డాలర్ల మేర ఉంది. ఇందులో అమెరికాకు మన ఎగుమతులు 8,500 కోట్ల డాలర్ల వరకూ ఉంటే, అమెరికా నుంచి దిగుమతులు 4,500 కోట్ల డాలర్ల వరకూ ఉన్నాయి. అంటే మనం 4,000 కోట్ల డాలర్ల వాణిజ్య మిగులులో ఉన్నాం. దీన్ని మార్చాలన్నదే ట్రంప్ తాపత్రయం. అందుకే వచ్చే అయిదేళ్లలో అమెరికా నుంచి 50,000 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులుండేలాఒప్పందం నిర్దేశిస్తోంది. ఇంధనం ఉత్పత్తులు, విమానాలు, విమాన విడిభాగాలు,సాంకేతిక ఉత్పత్తులు, అరుదైన లోహాల వంటివి ఉంటాయంటున్నారు. అంటే ఆ దేశంనుంచి ఏటా అదనంగా వందకోట్ల డాలర్ల అదనపు ఉత్పత్తులు వస్తాయి. అప్పుడు మన వాణిజ్య మిగులు ఆవిరై, లోటులో పడుతుంది. దీన్ని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు?కార్మికుల అవసరం ఎక్కువుండే మన ఉత్పత్తులకు ఒప్పందం వల్ల భారీ ప్రయోజనం కలిగే అవకాశమైతే ఉంటుంది. ఆ రకంగా దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగవు తాయి. ఇక జన్యుమార్పిడి ఆహారం అనారోగ్యహేతువని, ఆ విత్తనాల వల్ల దిగుబడి భారీగా వచ్చినా, అవి వాడిన పంటపొలాల్లో భవిష్యత్తులో దేశీయ విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉండదని గతంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ విషయంలో సందే హాలన్నీ నివృత్తి చేయాలి. అలాగే తుది ఒప్పందం సమయానికి అవసరమైన మార్పులు, చేర్పులకు ఇరుపక్షాలూ సిద్ధపడే షరతుపైనే ఏ ఒప్పందంపైనైనా సంతకం చేయాలి. -
లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం
-
ప్రగతి బాటలో కలిసి నడుద్దాం
కౌలాలంపూర్: ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, మలేషియా తీర్మానించుకున్నాయి. వాణిజ్యంలో అత్యధిక ప్రాధాన్య రంగాలతోపాటు పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, తయారీ, సెమీకండక్టర్ల రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని, ప్రగతి బాటలో కలిసి నడవాలని నిర్ణయించాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం భారత్, మలేషియా కట్టుబడి ఉన్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆయన ఆదివారం మలేషియా పరిపాలనా రాజధాని అయిన పుత్రజయలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్, మలేషియా మధ్య 11 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సెమీకండక్లర్ట రంగంలో ఫ్రేమ్వర్క్ ఒప్పందంతోపాటు కీలక రంగాల్లో సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. భేటీ అనంతరం మోదీ, అన్వర్ ఇబ్రహీం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని వారిద్దరూ తీవ్రంగా ఖండించారు. మానవాళికి శత్రువుగా మారిన ఉగ్రవాద భూతాన్ని సమాధి చేయడానికి ప్రపంచదేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు మోదీ బహిర్గతం చేశారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు గానీ, రాజీపడడం గానీ ఉండబోదని స్పష్టంచేశారు. భారత్–మలేషియా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని వివరించారు. ఇరుదేశాల ప్రజల మధ్య శతాబ్దాలుగా లోతైన, సౌహార్ధ సంబంధాలు ఉన్నట్లు గుర్తుచేశారు. వ్యూహాత్మక విశ్వాసంతో ఇరుదేశాల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు. ‘అంతర్జాతీయ’ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరి మలేషియాలో భారత కాన్సులేట్ జనరల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరాటం, నిఘా సమాచారం పంచుకోవడం, మారిటైమ్ సెక్యూరిటీ విషయంలో మలేషియాతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. రక్షణ బంధాన్ని సైతం విస్తృతపర్చుకుంటామని వివరించారు. కృత్రిమ మేధ(ఏఐ), డిజిటల్ టెక్నాలజీతోపాటు సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రతపై భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచానికి గ్రోత్ ఇంజన్గా ఎదుగుతోందని వెల్లడించారు. మలేషియా లాంటి మిత్రదేశాల అండతో ‘ఆసియాన్’ దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకుంటామని చెప్పారు. ఇండియా–ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షిస్తామని తెలిపారు. ఇండో–పసిఫిక్లో ఆసియాన్తో కలిసి అభివృద్ది, శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అన్వర్ ఇబ్రహీంతో అర్థవంతమైన చర్చ జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్, మలేషియా మధ్య స్నేహసంబంధాలు పెరుగుతుండడం ఇరుదేశాలకు మేలు చేస్తుందని వెల్లడించారు. సవాళ్లను అధిగమించాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టడం తప్పనిసరి అని తేల్చిచెప్పారు. భారత్–మలేషియా సంబంధాల విషయంలో అన్వర్ ఇబ్రహీం చక్కటి చొరవ చూపుతున్నారని కొనియాడారు. చరిత్రాత్మక నిర్ణయం: ఇబ్రహీం భారత్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని ఇబ్రహీం ప్రశంసించారు. భారత్తో భాగస్వామ్యం వల్ల తమకు ఎనలేని లబ్ధి చేకూరుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇరుదేశాల వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల్లో నిర్వహించుకోవాలన్నది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు.భారత సంతతి నేతలతో భేటీ మలేషియాలో భారత సంతతి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లను ప్రధాని మోదీ కలుసుకున్నారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. భారత్తో వారి భావోద్వేగ అనుబంధం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. భారత సంతతి వ్యక్తులు ప్రజా జీవితంలో సాధిస్తున్న విజయాలు గర్వకారణమని ఉద్ఘాటించారు. మలేషియాలో అభివృద్ధిలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. భారత్, మలేషియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని వివరించారు. భారత్ను అభివృద్ధి చేయడంలో మోదీ దార్శనికత, కార్యాచరణ స్ఫూర్తిదాయమని భారత సంతతి నేతలు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలతో: ప్రధాని నరేంద్ర మోదీ మలేషియాలో నలుగురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములయ్యేందుకు వారు చూపుతున్న ఆసక్తిని ప్రశంసించారు. ఇంధన రంగంలో పునరుత్పాదక, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎల్ఎన్జీ, పెట్రోకెమికల్స్లో భాగస్వామ్యంపై వారితో చర్చించారు. అలాగే భారత్, మలేషియాకు చెందిన పలు కంపెనీల సీఈఓలతోనూ మోదీ భేటీ అయ్యారు. అనంతరం రెండు రోజుల మలేషియా పర్యటన ముగించుకొని ఆదివారం స్వదేశం చేరుకున్నారు. -
శత్రు శాటిలైట్లపై నిఘా
భూతలం మీదకు దూసుకొచ్చే శత్రు క్షిపణులను మార్గమధ్యంలో, గాల్లో ధ్వంసంచేసే గగనతల రక్షణ వ్యవస్థలు భారత్కు ఉన్నాయి. అయితే మన సైనిక స్థావరాల జాడ కనిపెట్టేందుకు నింగిలో సంచరించే శత్రుదేశాల కృత్రిమ ఉపగ్రహాల జాడ పసిగట్టి అప్రమత్తం చేసే వ్యవస్థ గతంలో భారత్కు లేదు. తాజాగా ఆ శక్తిసామర్థ్యాల సముపార్జనలో భారత్ కీలక ముందడుగువేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఆరంభమైన అంకుర సంస్థ ఒకటి కొత్త తరహా పరిశోధనలు చేస్తూ ఈ అప్రమత్త వ్యవస్థ అందిపుచ్చుకుంటోంది. అంతరిక్షంలో ఒకరకంగా అతిపెద్ద ఉపగ్రహంగా పేరొందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) జాడను కనిపెట్టి ‘అజిస్టా స్పేస్’తన సత్తా చాటింది. కక్ష్య మార్చుకుని భారత గగనతలంపై చక్కర్లు కొడుతూ కీలక సమాచారాన్ని సేకరించే అనుమానాస్పద శత్రు ఉపగ్రహాల జాడను కనిపెట్టేందుకు ఈ కొత్త స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్(ఎస్ఎస్ఏ) పరిజ్ఞానం ఎంతగానో సాయపడుతుందని అజిస్టా స్పేస్ పేర్కొంది. గుర్తు తెలియని ఉపగ్రహాల జాడను గుర్తించడంతోపాటు వాటి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పర్యవేక్షణ పనులను పూర్తిచేసే పరిజ్ఞానాన్నే ఎస్ఎస్ఏగా పిలుస్తారు. తాజాగా భారత్ మీదుగా ఐఎస్ఎస్ పయనిస్తున్న సమయంలో దాని ఫొటోలను తమ ఏఎఫ్ఆర్ సెన్సార్ సాయంతో సేకరించామని అజిస్టా స్పేస్ ప్రకటించింది. భూమి ఫొటోలు తీయడానికి బదులు ఆకాశంలో నిర్దేశిత ప్రాంతం గుండా పయనించే, నిర్దేశిత ప్రాంతంపై నిఘా పెట్టే ఉపగ్రహాలను కనిపెట్టేందుకు నాన్–ఎర్త్ ఇమేజింగ్(ఎన్ఈఐ) పనుల కోసం ఈ అంకుర సంస్థ ఒక చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. దానిపై బిగించిన ఎలక్ట్రో–ఆప్టికల్ కెమెరా సాయంతో ఈ ఫొటోలను తీయగలిగింది. అత్యంత కచ్చితత్వంతో ఫొటోలు ఈనెల మూడో తేదీన రెండు వేర్వేరు సందర్భాల్లో ఐఎస్ఎస్ జాడను అత్యంత కచ్చితత్వంతో గుర్తించామని సంస్థ పేర్కొంది. ఈ మేరకు అప్పుడు తీసిన ఫొటోలను విడుదలచేసింది. 300 కిలోమీటర్లు, 245 కిలోమీటర్ల దూరాల నుంచి దాని ఫొటోలను తీసింది. దాని గమనానికి సంబంధించి మొత్తం 15 ఛాయాచిత్రాలను సేకరించింది. ఎదురుగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న సూర్యుని సూర్యకిరణాలు తీక్షంగా తగులుతున్నా, అత్యంత వేగంగా అంతరిక్ష కేంద్రం ప్రయాణిస్తున్నాసరే దాని పొజిషన్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తూ ఫొటోలు తీయడం విశేషం. ఫొటోల సేకరణలో తమ ట్రాకింగ్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసిందని కంపెనీ వెల్లడించింది. 2.2 మీటర్ల రెజల్యూషన్తో ఫొటోలు తీయడం గమనార్హం. అంటే ఒక్కో పిక్సెల్ను పరిగణనలోకి తీసుకుంటే ఫొటో తీసే సమయానికి అది కచ్చితంగా ఎంత దూరంలో ఉందనేది తేల్సిపోతుందని కంపెనీ పేర్కొంది. ఇంతటి కచ్చితత్వంతో ఫొటోలు తీసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవడం కీలక ముందుడుగుగా నిపుణులు పేర్కొన్నారు. ఇది భవిష్యత్తులో ఇతర అనుమానాస్పద ఖగోళ వస్తువులు, గ్రహశకలాలు, శత్రు శాటిలైట్ల స్థితిగతులను అంచనా వేసే శక్తిసామర్థ్యాల మెరుగుకు ప్రేరణగా నిలుస్తుందని ఖగోళ నిపుణులు చెప్పారు. శాటిలైట్ ట్రాకింగ్ అల్గారిథమ్ను మరింతగా మెరుగుపర్చుకుంటే అంతర్జాతీయ స్థాయి సామర్థ్యాలను సముపార్జించడం త్వరలోనే సాకారమవుతుందని వాళ్లు ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్లో తయారై, భారత్ నుంచి పర్యవేక్షణలో ఉన్న ఒక బుల్లి ఉపగ్రహం ఐఎస్ఎస్ ఫొటోను తీయడం ఇదే తొలిసారి అని అజిస్టా స్పేస్ ప్రకటించింది. ఇది భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మైలురాయిగా నిలిచిపోనుంది. భూకక్షల్లో వేలాదిగా కృత్రిమ ఉపగ్రహాలు పోగుబడుతుండటం, పాడైన, కాలంచెల్లిన ఉపగ్రహాలు ఢీకొని అంతరిక్ష చెత్త ఎక్కువవడం, వీటి మధ్య శత్రుదేశాల ఉపగ్రహాలు భారత్పై నిఘా పెట్టడం వంటి భిన్న పరిస్థితుల్లో ఆకాశంపై పెద్ద నిఘా కన్ను వేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్(ఎస్ఎస్ఏ) పరిజ్ఞానంలో అగ్రగామిగా మారడం తక్షణావసరంగా మారింది. అజిస్టా స్పేస్ సంస్థ ఎలక్ట్రో–ఆప్టికల్ పేలోడ్లతోపాటు శాటిలైట్ వ్యవస్థలు, ఇమేజ్–ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్లు, నిఘా, పర్యవేక్షణ ఉపగ్రహాలకు సంబంధించిన విడిభాగాలనూ తయారుచేస్తోంది. ఇవి పౌర, రక్షణ, వాతావరణ సంబంధ ఉపగ్రహాలకు అక్కరకొస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దక్షిణేశ్వర్ ధమాకా
బెంగళూరు: దేశం కోసం ఆడే సమయంలో భారత టెన్నిస్ ఆటగాళ్ల ర్యాంక్లను పట్టించుకోవద్దని మరోసారి నిరూపితమైంది. దక్షిణేశ్వర్ సురేశ్... ప్రపంచ సింగిల్స్లో 465వ ర్యాంక్... భారత్లో నాలుగో ర్యాంక్... ప్రపంచ డబుల్స్లో 457వ ర్యాంక్... అయినా సొంతగడ్డపై ఈ ఆజానుబాహుడు అద్భుత ఆటతీరు ప్రదర్శించాడు.నెదర్లాండ్స్ లాంటి పటిష్ట జట్టుతో జరిగిన వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్లో అన్నీతానై ఈ తమిళనాడు ప్లేయర్ భారత్కు 3–2తో సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. ఫలితంగా డేవిస్కప్ పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో టీమిండియా వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్కు అర్హత సాధించింది. 2004లో జపాన్ జట్టుపై లియాండర్ పేస్ తర్వాత భారత్ నుంచి ఒక ప్లేయర్ రెండు సింగిల్స్లో, ఒక డబుల్స్లో ఆడి గెలవడం ఇదే ప్రథమం. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 78 కేజీల బరువున్న దక్షిణేశ్వర్ ఆదివారం ముందుగా డబుల్స్ మ్యాచ్లో భారత డబుల్స్ నంబర్వన్, ప్రపంచ 20వ ర్యాంకర్ యూకీ బాంబ్రీతో జతకట్టి బరిలోకి దిగాడు. 3 గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో దక్షిణేశ్వర్–యూకీ ద్వయం 7–6 (7/0), 3–6, 7–6 (7/1)తో సాండెర్ అరెండ్స్–డేవిడ్ పెల్ జోడీని ఓడించింది. దాంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం రివర్స్ సింగిల్స్ తొలి మ్యాచ్లో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ 7–5, 1–6, 4–6తో ప్రపంచ 73వ ర్యాంకర్ జెస్పెర్ డి జాంగ్ చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్గా జరిగిన రివర్స్ సింగిల్స్ రెండో మ్యాచ్లో దక్షిణేశ్వర్ బరిలోకి దిగాడు. సాధికారిక ఆటతీరును ప్రదర్శించి 99 నిమిషాల్లో 6–4, 7–6 (7/4)తో ప్రపంచ 160వ ర్యాంకర్ గయ్ డెన్ ఉడెన్ను ఓడించి భారత్కు 3–2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. -
భారత్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్ క్రీడల్లో చోటు సంపాదించిన లాక్రోస్ క్రీడలో భారత్ తమ సత్తా చాటుకుంది. ఆసియా చాంపియన్షిప్లో అటు పురుషుల విభాగంలో, ఇటు మహిళల విభాగంలో విజేతగా నిలిచి ‘డబుల్ ధమాకా’ సృష్టించింది. సౌదీ అరేబియాలోని రియాద్ ఆసియా లాక్రోస్ టోర్నమెంట్కు ఆతిథ్యమిచ్చింది. తెలంగాణకు చెందిన అనుదీప్ రెడ్డి నాయకత్వంలో భారత పురుషుల జట్టు 9–2 స్కోరుతో ఇరాక్ జట్టును ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. అనుదీప్ రెడ్డి నాయకత్వ పటిమతో భారత జట్టు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. మరోవైపు భారత మహిళల జట్టు ఫైనల్లో 22–5తో పాకిస్తాన్పై గెలిచి బంగారు పతకాన్ని దక్కించుకుంది. -
ఏఐ రేసులో భారత్.. మూడేళ్లలో రూ.6 లక్షల కోట్లు!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ వేగంగా పెరుగుతున్న వేళ.. పెట్టుబడుల పరంగా భారత్ కూడా ఈ రేసులో ముందంజలోనే ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు (జీడీపీలో శాతంగా లెక్కించినప్పుడు) పెట్టిన 11 దేశాల జాబితాలో భారత్కు 8వ స్థానం దక్కింది. మరోపక్క.. ఏఐ మనదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి సుమారు రూ.50 లక్షల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.ఇటీవల దావోస్లో.. ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీతో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ శ్వేత పత్రం విడుదల చేసింది. దాని ప్రకారం.. 2010 నుంచి 2024 వరకు ఏఐలో పెట్టుబడుల పరంగా అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో.. భారత్లో ఏఐ పెట్టుబడులు జీడీపీలో 1.2 నుంచి 1.8 శాతం వరకు ఉన్నాయి. అమెరికాలో ఇది రికార్డు స్థాయిలో 3.4 నుంచి 5.1 శాతం, సింగపూర్లో 3.1 నుంచి 4.6 శాతం వరకు ఉంది.అమెరికా, చైనా దూకుడు2010–2024 మధ్య కాలంలో ఏఐ రంగంలో పెట్టుబడులు ఏడాదికి సగటున 33 శాతం చొప్పున పెరిగాయని శ్వేతపత్రం తెలిపింది. ఏఐ రంగం అత్యంత ఖరీదైనదనీ, భారీగా పెట్టుబడులు అవసరమైనప్పటికీ తక్షణ లాభాలపై స్పష్టత లేదని పేర్కొనడం విశేషం. కానీ, అమెరికా, చైనా ఈ రంగంలో భారీ పందాలు కాస్తున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకు పెట్టిన మొత్తం ఏఐ పెట్టుబడుల్లో 65 శాతం ఈ రెండు దేశాలదే కావడమే అందుకు నిదర్శనం.మూడేళ్లలో రూ. 6 లక్షల కోట్లుభారత్లో వచ్చే మూడేళ్లలో రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఏఐ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చనున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది. అలాగే ఏఐకి అవసరమైన అధునాతన చిప్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, హార్డ్వేర్ రంగంలో పెట్టుబడులు ఏటా 15 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.ఆర్థిక వ్యవస్థకూ ఊతంభారత్ ఆర్థిక వ్యవస్థకు ఏఐ భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా అంచనా వేసింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి రూ.50 లక్షల కోట్లకుపైగా అదనంగా వచ్చి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, తయారీ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరిగితే ఈ వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. 2050 నాటికి 160 కోట్ల జనాభాకు ఆహారం అందించాలంటే వ్యవసాయ ఉత్పత్తిని 70 శాతం వరకు పెంచాల్సి ఉంటుందని, దీనికి డిజిటల్ సాంకేతికతలు, ముఖ్యంగా ఏఐ అవసరమని పేర్కొంది. అలాగే విద్య, వైద్య రంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించనుందని వివరించింది. -
T20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం
-
కశ్మీర్పై పాక్ పన్నాగం.. జైషే ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ సమయంలో నాటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. భారత్పై ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో తాజాగా బయటకు వచ్చింది. మునీర్ భారత్పై ఎలాంటి వ్యతిరేకతను ప్రదర్శించాడో కశ్మీర్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాది చెప్పడం సంచలనంగా మారింది. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఫిబ్రవరి 5న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్లో ఉగ్రవాదుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జైష్ ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జైషే ఉగ్రవాది మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్కు ప్రతిగా పాక్ ప్రారంభించిన దాడుల్ని ఆసిమ్ మునీర్ ‘ఘజ్వా-ఎ-హింద్’గా అభివర్ణించాడని అన్నాడు. యుద్ధం మొదలైనప్పుడు, ఆయుధాలు బయటకు వచ్చాయి, యుద్ధ విమానాలు దాడి చేసుకున్నాయి. ట్యాంకులు ముఖాముఖిగా నిలబడ్డాయి. మన ఆర్మీ చీఫ్ దీనిని ఘజ్వా ఎ హింద్, అని, బున్యాన్ అల్ మర్సూస్ అని ప్రకటించాడు. ఉగ్రవాదుల గుర్తింపు జిహాద్ అని, ప్రభుత్వం తమతో ఉన్నా లేకపోయినా మన లక్ష్యం జిహాద్ అని, కాశ్మీర్ను విముక్తి చేస్తామని చెప్పాడు అంటూ వ్యాఖ్యలు చేశారు.అయితే, భారత్పై మతపరమైన యుద్ధం చేసి, ఇస్లామిక్ పాలన స్థాపించాలనే సిద్ధాంతాన్ని ‘ఘజ్వా ఎ హింద్’ సూచిస్తుంది. మరోవైపు.. జైషే ఉగ్రవాది ప్రకటనతో మరోసారి పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదుల సంబంధాలు బయటపడ్డాయి. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వారి మధ్య సంబంధాలు మాత్రం ఇలా బయటకు వస్తున్నాయి. ఈ సమావేశంలో కొత్తగా చేరిన మిలిటెంట్లు కూడా పాల్గొన్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు పాకిస్తాన్లోని బహిరంగ వేదికలను పదేపదే ఉపయోగించుకుని జిహాద్ను కీర్తిస్తున్నారు. భారత్లో ఘర్షణను మతపరమైన కోణంలో చిత్రీకరిస్తున్నారు. తరచుగా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు ఉన్న సమక్షంలోనే ఇది జరుగుతోంది.ఇక, గత సంవత్సరం ఏప్రిల్లో 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం దాడి తరువాత భారత్.. ఉగ్రవాదంపై కఠినమైన దాడిని ప్రారంభించింది. పాకిస్తాన్, ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత్ దాడుల్లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ ఎయిర్బేస్లపై దాడి చేసి దాయాదిని కోలుకోలేని దెబ్బకొట్టింది. అలాగే, పాకిస్తాన్పై భారత్ పలు ఆంక్షలు సైతం విధించింది. -
వినువీథిలో సారథులు
ప్రపంచంలోనే అధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశంగా భారత్ మారుతోంది. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనల సరళీకరణ మన దేశాన్ని మహిళా పైలట్ల హబ్గా మార్చాయి. విమానయాన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వేసిన అడుగులే భారత్ను నేడు ప్రపంచానికి ఆదర్శంగానిలబెట్టాయి.ఇటీవల పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం..→ 2021 నుంచి 2025 మధ్యకాలంలో మహిళా పైలట్ల సంఖ్య 90% మేర పెరిగింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, భారతీయ మహిళల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. → 2021లో మహిళలకు 243 లైసెన్సులు జారీ చేయగా, 2025 నాటికి ఆ సంఖ్య 461కి పెరిగింది. అంటే ఈ నాలుగేళ్లలో సుమారుగా 89.71% వృద్ధిని సూచిస్తోంది. → డిసెంబర్ 31, 2025 నాటికి భారతదేశంలో మొత్తం మహిళా పైలట్ల సంఖ్య 3,327.→ ప్రపంచవ్యాప్తంగా మహిళా పైలట్ల సగటు కేవలం 5% నుంచి 6% మాత్రమే ఉండగా, భారతదేశంలో ఇది 15% గా ఉంది. అంటే ప్రపంచ సగటు (5%) కంటే మూడు రెట్లు ఎక్కువ. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల కంటే కూడా భారత్ ఈ విషయంలో ఎంతో ముందుంది.→ ఒక్క ఏడాదిలోనే అంటే 2025 లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు 61 కొత్త శిక్షణ విమానాలను ప్రవేశపెట్టడం విమానయాన రంగంలో ఒక పెద్ద అడుగు. ప్రస్తుతం దేశంలో మొత్తం 385 శిక్షణ విమానాలు ఉన్నాయి.→ సాంకేతిక విభాగాల్లోనూ మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది. గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ విభాగాల్లో మహిళల వాటా 14% వరకు ఉంది.→ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో మహిళల సంఖ్య సుమారు 2.6% మాత్రమే ఉన్నప్పటికీ, ఇటీవల ఇండిగో వంటి సంస్థలు కేవలం మహిళలతో కూడిన మెయింటెనెన్స్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.→ 2025 నాటికి విమానయాన రంగంలో మహిళల వాటాను 25 శాతానికి పెంచాలని పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఏ) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మహిళలకు ప్రత్యేక హ్యూమన్ రిసోర్స్ పాలసీలు, ప్రసూతి సెలవులు, శిక్షణ తర్వాత తిరిగి విధుల్లో చేరేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని నిర్ణయించింది.అంతర్జాతీయంగానూ..చాలా మంది భారతీయ మహిళా పైలట్లు ఇప్పుడు అంతర్జాతీయ రూట్లలో కూడా విమానాలను నడుపుతున్నారు. దీనివల్ల రాబోయే కాలంలో విమానయాన రంగంలో మహిళలు మరింత ఎత్తుకు ఎదగనున్నారు. పలు ఎయిర్లైన్స్లో మహిళా పైలట్ల శాతం అలయన్స్ ఎయిర్... అత్యధికంగా 17.36% మంది మహిళా పైలట్లు ఉన్నారు.ఇండిగో... గరిష్ట సంఖ్యలో మహిళా పైలట్లను (సుమారు 791 మంది) కలిగి ఉన్న సంస్థ.స్పైస్జెట్... 16.39% మహిళాపైలట్లతో రెండోస్థానంలో ఉంది.ఎయిర్ ఇండియా... 15.62% మహిళా పైలట్లు ఉన్నారు. -
ఏఐ పెట్టుబడుల్లో భారత్ @ 8
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ వేగంగా పెరుగుతున్న వేళ.. పెట్టుబడుల పరంగా భారత్ కూడా ఈ రేసులో ముందంజలోనే ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు (జీడీపీలో శాతంగా లెక్కించినప్పుడు) పెట్టిన 11 దేశాల జాబితాలో భారత్కు 8వ స్థానం దక్కింది. మరోపక్క.. ఏఐ మనదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి సుమారు రూ.50 లక్షల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఇటీవల దావోస్లో.. ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీతో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ శ్వేత పత్రం విడుదల చేసింది. దాని ప్రకారం.. 2010 నుంచి 2024 వరకు ఏఐలో పెట్టుబడుల పరంగా అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో.. భారత్లో ఏఐ పెట్టుబడులు జీడీపీలో 1.2 నుంచి 1.8 శాతం వరకు ఉన్నాయి. అమెరికాలో ఇది రికార్డు స్థాయిలో 3.4 నుంచి 5.1 శాతం, సింగపూర్లో 3.1 నుంచి 4.6 శాతం వరకు ఉంది.అమెరికా, చైనా దూకుడు2010–2024 మధ్య కాలంలో ఏఐ రంగంలో పెట్టుబడులు ఏడాదికి సగటున 33 శాతం చొప్పున పెరిగాయని శ్వేతపత్రం తెలిపింది. ఏఐ రంగం అత్యంత ఖరీదైనదనీ, భారీగా పెట్టుబడులు అవసరమైనప్పటికీ తక్షణ లాభాలపై స్పష్టత లేదని పేర్కొనడం విశేషం. కానీ, అమెరికా, చైనా ఈ రంగంలో భారీ పందాలు కాస్తున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకు పెట్టిన మొత్తం ఏఐ పెట్టుబడుల్లో 65 శాతం ఈ రెండు దేశాలదే కావడమే అందుకు నిదర్శనం. మూడేళ్లలో రూ. 6 లక్షల కోట్లుభారత్లో వచ్చే మూడేళ్లలో రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఏఐ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చనున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది. అలాగే ఏఐకి అవసరమైన అధునాతన చిప్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, హార్డ్వేర్ రంగంలో పెట్టుబడులు ఏటా 15 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.ఆర్థిక వ్యవస్థకూ ఊతంభారత్ ఆర్థిక వ్యవస్థకు ఏఐ భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా అంచనా వేసింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి రూ.50 లక్షల కోట్లకుపైగా అదనంగా వచ్చి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, తయారీ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరిగితే ఈ వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. 2050 నాటికి 160 కోట్ల జనాభాకు ఆహారం అందించాలంటే వ్యవసాయ ఉత్పత్తిని 70 శాతం వరకు పెంచాల్సి ఉంటుందని, దీనికి డిజిటల్ సాంకేతికతలు, ముఖ్యంగా ఏఐ అవసరమని పేర్కొంది. అలాగే విద్య, వైద్య రంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించనుందని వివరించింది.ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటివరకు మొత్తంగా రూ.55 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘భారీ డేటా సెంటర్ల’ సంఖ్య 1,136 కాగా 2030 నాటికి ఇది 2,000 దాటొచ్చని అంచనా.ఆధారం: వరల్డ్ ఎకనమిక్ ఫోరం శ్వేతపత్రం -
‘గత్యంతరం లేక’ ఆడటం లేదు! ఐసీసీకి పీసీబీ వివరణ
దుబాయ్: టి20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ తిరస్కరించిన వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అంత సులువుగా వదిలిపెట్టేలా లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. భారత్తో మ్యాచ్ ఆడే అంశం తమ చేతుల్లో లేదని, తమ ప్రభుత్వ ఆదేశం ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో’ తప్పుకోవచ్చని ఐసీసీ నిబంధన (ఫోర్స్ మెజూ)ను వర్తింపజేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వివరణ ఇచ్చింది. అయితే ఐసీసీ దీనికి సరైన రీతిలో స్పందించింది. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలులాంటి అనూహ్య పరిణామాలు సంభవించినప్పుడే ఈ నిబంధనన వర్తిస్తుందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చిందని ఐసీసీ ప్రశ్నించింది. అసలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలు చూడటంలో కానీ, ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించడంలో గానీ పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా స్పష్టం చేయాలని ఐసీసీ కోరింది. అవి సరైన కారణాలు కాకపోతే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. దాంతో ఇరకాటంలో పడ్డ పీసీబీ కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 15న భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించే అవకాశాలూ కనిపిస్తున్నాయి! -
ప్రపంచ 88వ ర్యాంకర్పై దక్షిణేశ్వర్ విజయం
బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న డేవిస్ కప్ పురుషుల టీమ్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్లో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నెదర్లాండ్స్ జట్టుతో జరుగుతున్న ఈ పోరులో మొదటి రోజు భారత నంబర్వన్ సుమిత్ నగాల్ ఓటమి చవిచూడగా... భారత నాలుగో ర్యాంకర్ దక్షిణేశ్వర్ సురేశ్ సంచలన విజయం సాధించాడు. దాంతో తొలి రోజు ముగిశాక భారత్, నెదర్లాండ్స్ 1–1తో సమంగా నిలిచాయి. నేడు మూడు మ్యాచ్లు (డబుల్స్, రెండు సింగిల్స్) జరుగుతాయి. ప్రపంచ 162వ ర్యాంకర్ గయ్ డెన్ ఉడెన్తో జరిగిన తొలి మ్యాచ్లో ప్రపంచ 281వ ర్యాంకర్ సుమిత్ నగాల్ 0–6, 6–4, 3–6తో ఓడిపోయాడు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. ప్రపంచ 88వ ర్యాంకర్ జెస్పెర్ డి జాంగ్తో జరిగిన రెండో సింగిల్స్లో ప్రపంచ 465వ ర్యాంకర్ దక్షిణేశ్వర్ అద్భుత ఆటతీరుతో మెరిపించాడు. 88 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో దక్షిణేశ్వర్ 6–4, 7–5తో జెస్పెర్ను బోల్తా కొట్టించాడు. దక్షిణేశ్వర్ తొమ్మిది ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే డబుల్స్ మ్యాచ్లో సాండెర్ అరెండ్స్–డేవిడ్ పెల్ జోడీతో యూకీ బాంబ్రీ–శ్రీరామ్ బాలాజీ ద్వయం ఆడుతుంది. అనంతరం రెండు సింగిల్స్ మ్యాచ్ల్లో జెస్పెర్తో సుమిత్, ఉడెన్తో దక్షిణేశ్వర్ తలపడతారు. -
చైనా అరాచకం.. భారత సరిహద్దుల్లో రహస్య అణు పరీక్షలు
వాషింగ్టన్: భారత్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో చైనా రహస్యంగా జరిపిన అణు పరీక్షలపై అమెరికా సంచలన విషయాలను వెల్లడించింది. 2020లో భారత్, చైనాల మధ్య గాల్వాన్లో ఘర్షణలు చోటుచేసుకున్న అనంతరం.. చైనా రహస్యంగా అణు పరీక్షలను నిర్వహించినట్లు అమెరికా చెప్పింది. దీంతో, అమెరికా వెల్లడించిన వివరాలు తీవ్ర చర్చకు దారి తీశాయి.అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ థామస్ డినాన్నో శుక్రవారం జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా థామస్.. అణు పరీక్షల వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత వారం రోజుల వ్యవధిలో జిన్ఙియాంగ్ ప్రావిన్సుల్లోని లోప్ నూర్ సైట్లో చైనా అణు పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా భూమి కంపనాలను గుర్తించడం కష్టంగా ఉండేందుకు ‘‘డీకప్లింగ్’’ అనే టెక్నాలజీని చైనా ఉపయోగించినట్లు అమెరికన్ అధికారులు చెబుతున్నారు.కాగా, డీ కప్లింగ్ అంటే భూగర్భంలో అతిపెద్ద గుహలో పరీక్షలు నిర్వహించడం. దీని వల్ల ఏర్పడే భూకంప తరంగాలు గుహలోనే అబ్సార్వ్ అవుతాయి. అయితే, ప్రపంచం కళ్ల నుంచి తప్పించుకోవడానికి చైనా రహస్య అణు పరీక్షలు నిర్వహిస్తోందనే సమాచారం తమ వద్ద ఉందన్నారు. జూన్ 22, 2020న చైనా అలాంటి ఒక అణు పరీక్షను నిర్వహించిందని అమెరికా నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. గాల్వాన్ ఘర్షణల్లో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. ఈ క్రమంలో చైనాపై భారత్ జరిపిన దాడిలో 35-40 మంది చనిపోయినట్లు యూఎస్ నివేదికలు చెబుతున్నాయి. చైనా తన సైనికుల మరణాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే, గాల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత 2024లో ఈ ప్రతిష్టంభన ముగిసింది.చైనాపై ఎందుకు అనుమానం?చైనా తన అణ్వాయుధాలను పెంచుకోవడంపై అమెరికా ఆందోళన చెందుతోంది. బీజింగ్ వద్ద సుమారు 600 అణు వార్హెడ్లు ఉన్నాయని నమ్ముతున్నారు. గత సంవత్సరం, నవంబర్లో చైనా, పాకిస్తాన్ అణు పరీక్షలు చేసిన సమయంలో అమెరికా సైన్యాన్ని అణు ఆయుధాల పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ట్రంప్ ఆదేశించారు. మరోవైపు రష్యా కూడా అణు పరీక్షలు చేస్తోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు రష్యాతో భవిష్యత్తులో కుదిరే ఏ అణు ఒప్పందంలోనైనా చైనా కూడా భాగం కావాలని ట్రంప్ కోరుకుంటున్నారు. మరోవైపు.. అమెరికా, రష్యా మధ్య చివరి అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగిసిన తర్వాత ఈ ఆరోపణలు రావడం సంచలనంగా మారాయి. -
అందువల్లే భారత్ చాలా స్పెషల్..!
భారత్లో నివశించిన చాలామంది విదేశీయలు భారత్పై మనుసు పారేసుకుని ఇక్కడే ఉండిపోవడమే కాదు..తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుచున్నామని కూడా చెప్పారు చాలామంది. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి ఈ ఫ్రెంచ్ మహిళ కూడా చేరిపోయింది. భారత్ని ప్రత్యేకంగా చూపే విషయాలను వివరించి అందరి మనుసులు దోచుకుంది. మన దేశ గొప్ప తనాన్ని, ఔన్యత్యాన్ని రెండు మాటల్లో చాలా చక్కగా వివరించారామె. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..భారతదేశంలో నివసిస్తున్న ఓ ఫ్రెంచ్ మహిళ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే గాక అందర్నీ అమితంగా ఆకర్షించింది. తన స్వదేశమైన ఫ్రాన్సుతో భారత్ని పోలుస్తూ..ఆ విషయాల్లో ఫ్రాన్స్ కంటే భారత్ ముందు ఉందని అన్నారామె. అలాగే భారత్ని ప్రత్యేకంగా చూపించే అంశాలను సైతం ప్రస్తావించారామె. ఈ మూడు ఏంటంటే..బలమైన సమాజ భావం, దేశ సహజ సౌందర్యం, చేతితో తయారు చేసిన వస్త్రాలు. అంతేగాదు తన స్నేహితులు తరచుగా భారత్లోని సమాజ భావం గురించి చర్చిస్తారని, వాటి అంచనాల ఒత్తిడి అధికంగా ఉంటుందని వాళ్లంతా అంటుంటారని అన్నారామె. అయితే తాను దీన్ని పూర్తి చేసుకోలేనని, తాను అలా ఉండేలనని కూడా ఒప్పుకున్నారామె. అయితే ఇక్కడ ప్రజలు ఒకరినొకరు ఆదరించుకుంటూ.. సహాయసహకారాలు అందించుకోవడం చూస్తుంటే..చాలా సంతోషంగా అనిపిస్తుందని అందామె. ఇది కుందేళ్లకు ఆహారం ఇచ్చేదాంతో పోల్చారామె. అదే సమయంలో తన స్వదేశం ఫ్రాన్సుకి కూడా దాని స్వంత ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయన్నారామె. అలాగే భారత్లో ప్రతి వాతావరణాన్ని ఆస్వాదించొచ్చు. ఇక ఇక్కడ దుస్తులు ఎంతగానో ఆకట్టుకుంటాయని అంటోంది. ఎంబ్రాయిడరీ, పూసల పనిలో ఉన్న నైపుణ్యం తనను ఆశ్చర్యపరుస్తాయిని అన్నారామె. తనకు ఇక్కడ కుర్తీలు కూడా అద్బుతంగా కనిపిస్తాయిని, అవి ఫ్రాన్స్లో హైఫ్యాషన్గా పరిగణిస్తారని, ఖరీదు కూడా ఎక్కువేనని తెలిపింది. చివరగా పోస్ట్లో భారత్లో బలాలుగా భావించిన వాటిని గురించి కూడా హైలెట్ చేశారామె. నెటిజన్లను ఈ పోస్ట్ అమితంగా ఆకర్షించడమే గాక, మా దేశంలో ఈవిషయాలను ఇష్టపడటం చాలా బాగుంది అంటు పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Freldaway (@freldaway) (చదవండి: పూలమ్మే అమ్మాయి చెప్పిన గొప్ప జీవిత పాఠం..!) -
పాక్కు షాకిచ్చిన అమెరికా..!
దాయాది పాకిస్తాన్.. గత కొన్ని రోజులుగా అమెరికా అండ చూసుకుని తెగ వయ్యారాలు పోయింది. కొన్ని నెలలుగా భారత్-అమెరికాల మధ్య నెలకొన్న అనిశ్చిత కారణంగా పాకిస్తాన్ బిల్డప్లు మీద బిల్డప్లు ఇచ్చేసింది. ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్తో పాటు ప్రధాని షహబాజ్ షరీఫ్లకు ఒకటి రెండు సందర్భాల్లో అమెరికా ఆహ్వానం పలకడంతో వారి వేషాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తమతో అమెరికా బంధం శాశ్వతమైనది అన్నంతగా ఓవరాక్షన్ చేసింది పాకిస్తాన్. ఈ క్రమంలోనే అమెరికా చెప్పిన ప్రతీ విషయానికి ఊ కొట్టింది పాక్. అయితే పాకిస్తాన్ను మింగుడు పడని విషయం తాజాగా చోటు చేసుకుంది. ఒకటి భారత్తో అమెరికా డీల్ ఒకటైతే, మరొకటి జమ్మూ-కశ్మీర్ మొత్తం భాగం అనేది ఎప్పటికీ భారత్దే అని ప్రపంచానికి తెలిసేలా అమెరికా ట్వీట్ చేసింది. భారత్-అమెరికాల ట్రేడ్ డీల్ కుదిరిన గంటల వ్యవధిలోనే భారత్ మ్యాప్ను అమెరికా పోస్ట్ చేసింది. ఇందులో కశ్మీర్ను భారత్ మ్యాప్లోనే ఉంచి మరీ పోస్ట్ పెట్టింది. యూఎస్ అధికారిక ‘X ’ హ్యాండిల్లో భారత్ మ్యాప్ పోస్ట్ పెట్టింది. ఆ మ్యాప్లో జమ్మూ & కశ్మీర్, లడఖ్, అలాగే పీఓకే(POK) భారత్లో భాగంగా చూపబడింది. ఫలితంగా భారత్ యొక్క మ్యాప్ను అమెరికా అంగీకరిస్తుందనే సంకేతాలిచ్చింది. అదే సమయంలో పాకిస్తాన్ చేస్తున్న ‘కశ్మీర్పై హక్కు’ అనే వాదనను తిరస్కరిస్తోందని స్పష్టమైన సందేశం ఇచ్చింది. దాంతో పాకిస్తాన్ గట్టి షాక్ తగిలింది,. From tree nuts and dried distillers’ grains to red sorghum and fresh and processed fruit, the U.S.-India Agreement will provide new market access for American products. pic.twitter.com/mqpP10LJp1— United States Trade Representative (@USTradeRep) February 6, 2026 ఇవీ చదవండి:ఇది భారత్ వ్యూహాత్మక ముందడుగేనా?ట్రంప్ సుంకాలు: భారత్కు భారీ ఊరట -
ఇది భారత్ వ్యూహాత్మక ముందడుగేనా?
ఎట్టకేలకు భారత్ మరో ముందడుగు వేసింది. ఎప్పట్నంచో అమెరికాతో ఏర్పడిన సందిగ్థతకు ఓ ముగింపు ఇచ్చింది. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన అదనపు 25 శాతం సుంకాలను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం వెనుక భారత్ వ్యూహాత్మక ముందడుగు వేసింది. రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిన నేపథ్యంలో అమెరికా సుంకాల ఆంక్షలను తగ్గించింది. మరి ఇది రష్యాతో వాణిజ్య స్నేహంపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అనేది ఇప్పుటు హాట్ టాపిక్గా మారింది. రష్యాతో స్నేహంపై ప్రభావం ఎంత?రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి భారత్పై విధించిన ఆంక్షల నడుమే ట్రంప్ సుంకాలను తగ్గించారు. అయితే ఇది రష్యాతో సంబంధాలపై ఎంతవరకూ ప్రభావం చూపుతుందనే అనుమానం కూడా మరొకవైపు మొదలైంది. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలకు భారత్ కట్టుబడటంతో ఓ డైలమా ఏర్పడింది. ఇక రష్యాతో భారత్ సంబంధాలు చెడిపోయినట్లేనా అనే వాదన తెరపైకి వచ్చింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా చమురు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తుందని కూడా చెప్పకొచ్చారు. అయితే ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితుల్లో రష్యా చమురును చేయడం కష్టమేనా? అంటే అవుననక తప్పదు. అయితే కేవలం చమురు అంశమే భారత్-రష్యాల స్నేహంపై ప్రభావం చూపదని విశ్లేషకులు అంటున్నారు. రష్యాతో భారత్కు చాలా వాణిజ్య ఒప్పందాలున్నాయని, కేవలం చమురు అంశం పక్కకు వెళ్లిపోయినంత మాత్రాన ఈ ఇరు దేశాల సుదీర్ఘ స్నేహ బంధం ఎక్కడికి పోదని అంటున్నారు. భారత్కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుభారత్కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారు అనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. భారత్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో రష్యా ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంది. ఇప్పుడు భారత్పై అమెరికా ఆంక్షలు చమురుపై మాత్రమే. అంటే చమురును మాత్రమే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయదన్నమాట. భారత్కు ఫైటర్ జెట్లు, ట్యాంకులు, మిసైల్ సిస్టమ్స్ వంటి పరికరాల్లో రష్యా కీలక భాగస్వామి. భారత్ స్వదేశీ ఉత్పత్తి పెంచుతున్నప్పటికీ, రష్యా టెక్నాలజీపై ఆధారపడటం కొనసాగుతూనే ఉంది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులు వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం పెంపు దిశగా సాగుతున్నాయి. జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్కు రష్యా ఎరువు, లోహాలు సరఫరా కూడా చేస్తోంది. ఇలా అమెరికా, యూరప్ ఒత్తిళ్ల మధ్య భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటూ, రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాతో కుదిరిన డీల్ భారత్ వ్యూహాత్మక ముందడుగానే చెప్పుకోవచ్చనేది విశ్లేషకుల అంచనా. ఇది సమతుల్య వ్యూహమేనని వారు అంటున్నారు.పూర్తిగా ఆపిసినట్లేనా..?రష్యా నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చమురు కొనుగోలు చేయకూడదనేది అమెరికా ఆంక్షలు. అంటే సాంక్షన్డ్ ఎంటిటీస్( ఆంక్షలు ఉన్న సంస్థలు), నాన్ -సాంక్షన్డ్ ఎంటిటీస్(ఎటువంటి ఆంక్షలు లేని సంస్థలు) అనే వాదన కూడా ఇక్కడ తెరపైకి వచ్చింది. రష్యాలోని ఆంక్షలున్న సంస్థల నుంచి మాత్రమే చమురు కొనుగోల చేయకూడదా.. లేక ఎటువంంటి ఆంక్షలు లేని సంస్థల నుంచి కూడా చమురు కొనుగోలు చేయకూడదా అనేది ప్రస్తుతం కాస్త డైలమాలోనే ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నప్పుడు ఈ రెండింటి కింద కూడా చమురు కొనుగోలు చేయకూడదనే విషయం అర్థమవుతున్నా ఇక్కడ పూర్తిగా క్లారిటీ లేదు. ఇదిలా ఉంచితే, భారత్-రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలు చారిత్రాత్మకంగా బలంగా ఉన్నప్పటికీ, గత రెండు మూడేళ్లుగా ప్రాపంచిక పరిస్థితుల కారణంగా కొంత అనిశ్చితి ఏర్పడింది. అయితే 2025 చివర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించిన నేపథ్యంలో సంబంధాలు మళ్లీ చురుకుగా మారాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అమెరికా ఆంక్షలతో రష్యా చమురును భారత్ కొనుగోలు చేయకుండా ట్రంప్ చేసినప్పటికీ, రష్యాతో ఉన్న పలు వాణిజ్య సంబంధాలపై ఇది ఎటువంటి ప్రభావం చూపదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది భారత్ అమలు చేస్తున్న వ్యూహాత్మక ముందడుగుగానే చూడాలని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అమెరికాతో ఎంత వరకూ అవసరముందో అంతవరకూ, రష్యాతో ఏమి అవసరమో వాటిని మాత్రమే పటిష్టం చేసుకునేలా భారత్ సమతుల్య వాణిజ్యాన్ని కొనసాగించడానికి వేసిన ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.ఇదీ చదవండి:ట్రంప్ సుంకాలు.. భారత్కు భారీ ఊరట -
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన యంగిండియా
-
వైభవ్ విశ్వరూపం.. వరల్డ్ రికార్డులు బద్దలు
అండర్-19 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసిన యంగ్ ఇండియా.. రికార్డుస్దాయిలో ఆరోసారి వరల్డ్కప్ టైటిల్ను ముద్దాడింది. ఈ విజయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీది కీలక పాత్ర. తుది పోరులో వైభవ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 150 పరుగులు కేవలం ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే రావడం విశేషం. అతడి విధ్వంసం ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 412 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 311 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యవంశీ పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వరల్డ్ రికార్డులు బద్దలు👉అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(175) సాధించిన ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఉన్మక్త్ చంద్(111*) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో చంద్ను వైభవ్ అధిగమించాడు.👉అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి బ్యాటర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో 55 బంతుల్లోనే వైభవ్ సెంచరీ సాధించాడు.👉అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ బాదిన అతని పిన్న వయస్కుడు కూడా సూర్యవంశీనే కావడం విశేషం.👉అండర్-19 ప్రపంచకప్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు మైఖేల్ హిల్(12) పేరిట ఉండేది.👉అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా వైభవ్ (30) నిలిచాడు. -
న్యూస్టార్ట్ ముగింపు.. తీవ్ర ఒత్తిడిలో భారత్!
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల పోటీ మళ్లీ పెరగనుందా?. అమెరికా-రష్యా మధ్య న్యూస్టార్ట్ ఒప్పందం ముగియడం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే అదనుగా.. ఇటు పాక్-చైనాలు పరస్పర అణు సహకారంతో భారత్కు సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. అయితే.. ఇదంతా ఇండియా మంచికే అంటున్నారు నిపుణులు. అమెరికా–రష్యా మధ్య ఉన్న New START అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు 2026 ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసింది. ఒప్పందం పునరుద్ధరణ ప్రస్తావనే లేకపోవడంతో.. ఈ రెండు దేశాల మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేకుండా పోయాయి. ఇప్పుడు అమెరికా, రష్యా తమ అణు శక్తిని ఇష్టానుసారం పెంచుకునే అవకాశం పొందాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న అణు శక్తి దేశాలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది. అమెరికా–రష్యా పరిమితులు తొలగిపోవడంతో కొత్త ఆయుధ పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. పెద్ద శక్తులే ఆయుధాలను పెంచుకుంటే.. మనం ఎందుకు నియంత్రించుకోవాలి? అని ఇతర దేశాలు భావించొచ్చు. ఇదే అదనుగా.. తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయవచ్చు. అదే గనుక జరిగితే.. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించడానికి 1970లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ ఒప్పందం ఎన్పీటీ (Non-Proliferation Treaty) కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎన్పీటీ అంటే.. • కొత్త దేశాలు అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించడం.• ఇప్పటికే అణు శక్తి కలిగిన దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్) ఆయుధాలను తగ్గించడం.• అణు శక్తిని శాంతి ప్రయోజనాల కోసం (ఉదా: విద్యుత్ ఉత్పత్తి) ఉపయోగించడానికి సహకారం అందించడం.భారత్పై ప్రత్యక్ష ప్రభావంభారత్ ఇప్పటిదాకా క్రెడిబుల్ మినిమమ్ డిటర్రెన్స్ అనే అణు వ్యూహాన్ని పాటిస్తోంది. దీని ప్రకారం.. శత్రువు దాడి చేయకుండా నిరోధించడానికి, భారత్ వద్ద ఉన్న అణు శక్తి నమ్మదగినది (credible)గా ఉండాలి. అది శత్రువుకు నమ్మదగిన నిరోధక శక్తిగా (deterrent) పనిచేయాలి. అవసరానికి మించి పెద్ద అణు నిల్వలు కాకుండా.. తన భద్రతకు అవసరమైన కనీస అణు ఆయుధ శక్తిని మాత్రమే కలిగి ఉంటే చాలూ(Minimum). అలాగే.. భారత్ అణు ఆయుధాలను మొదటగా వాడకూడదు(No First Use-NFU). కానీ దాడి జరిగితే తప్పనిసరిగా ప్రతిదాడి చేయొచ్చు. శత్రువు మొదట దాడి చేసినా, భారత్ వద్ద ప్రతిదాడి చేసే సామర్థ్యం ఉండాలి( Second Strike Capability). 1999లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ‘‘డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్ట్రైన్’’లో సీడీఎం అనే సూత్రాన్ని ప్రకటించింది. ఆపై 2003లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఏర్పాటుతో ఎన్ఎఫ్యూలో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం.. బయోలాజికల్ లేదంటే కెమికల్ దాడి జరిగినా అణు ప్రతిదాడి చేసే అవకాశం కల్పించారు. మొత్తంగా భారత అణువిధానం.. అణ్వాయుధాలను రక్షణ కోసం మాత్రమే దాడి కోసం కాదు అని పాటిస్తూ వస్తోంది. అయితే.. భారమే అయినా..న్యూస్టార్ట్స్ గడువు ముగిసింది. అణ్వాయుధ పోటీలో భాగంగా చైనా తన అణు శక్తిని పెంచే అవకాశం లేకపోలేదు. అలాగే పాకిస్తాన్తో అణు సహకారం పెంచుకోవచ్చు కూడా. అణ్వాయుధ పోటీ వల్ల ఈ రెండు దేశాలు మరింత శక్తివంతమైన వ్యూహాలను అవలంబించే అవకాశం ఉంది. అదే జరిగితే.. భారత్ కూడా తన నిరోధక శక్తిని పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. భారత్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, సబ్మేరిన్ ఆధారిత అణు నిరోధక శక్తిను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అణు ఆయుధాల అభివృద్ధి, నిర్వహణ ఖర్చులు భారత్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచొచ్చు. అలాగే.. రక్షణ బడ్జెట్లో మరింత పెంపు అవసరం పడుతుంది. అంటే ఆర్థిక, భద్రతా, రాజనీతిక సవాళ్లు పెరుగుతాయన్నమాట. మరోవైపు.. అమెరికా–రష్యా పోటీ వల్ల కొత్త మల్టిలేటరల్ చర్చలు అవసరం అవుతాయి. జీ20, బ్రిక్స్ సదస్సులతో పాటు ఐక్యరాజ్య సమితి లాంటివి అందుకు వేదికలు అవుతాయి. ఇందులో భారత్కు కచ్చితంగా ప్రాధాన్యత లభించవచ్చు. ఎన్పీటీలో సభ్యత్వం లేని భారత్ ఇదే అదనుగా అంతర్జాతీయ వేదికలపై పారదర్శకత, నియంత్రణ చర్యలు కోరవచ్చు. ఇది భారత్కు గ్లోబల్ లీడర్షిప్ అవకాశాన్ని కలిగిస్తుంది. నో ఫస్ట్ యూజ్ విధానం కొనసాగిస్తున్న భారత్.. తన నైతిక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఏంటీ న్యూస్టార్ట్? న్యూస్టార్ట్ (New Strategic Arms Reduction Treaty) అనేది.. అమెరికా–రష్యా మధ్య 2010లో కుదిరిన అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం. పూర్తి పేరు: Treaty between the United States of America and the Russian Federation on Measures for the Further Reduction and Limitation of Strategic Offensive Arms. దీని ప్రధాన ఉద్దేశ్యం రెండు దేశాల వద్ద ఉన్న వ్యూహాత్మక అణు ఆయుధాలను పరిమితం చేసి, ప్రపంచ భద్రతను బలోపేతం చేయడం.కోల్డ్ వార్ తర్వాత అమెరికా, రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధ ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో 2010 ఏప్రిల్ 8న, ప్రాగ్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ సంతకం చేశారు. 2011 ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాత 2021లో 5 సంవత్సరాలు పొడిగించబడింది. ఇందులో భాగంగా.. అణు ఆయుధాల విషయంలో ప్రపంచంలో శక్తివంతమైన దేశాలైన అమెరికా, రష్యాలు పరిమితంగా ఉండాలి. ఒకదానికొకటి లెక్కలు చెప్పుకోవాలి. అలాగే అణు ఆయుధాల నియంత్రణ ద్వారా ఇతర దేశాలకు కూడా భద్రతా హామీ ఇవ్వాలి. కానీ, 2026 ఫిబ్రవరి 5న గడువు ముగిసింది. ఇప్పుడు అమెరికా–రష్యా మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేవు.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
అమెరికా, బంగ్లా మధ్య సీక్రెట్ డీల్.. భారత్ కారణమా?
భారత్ పొరుగు దేశంలో బంగ్లాదేశ్లో ఎన్నికల వేళ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై దాడుల కారణంగా భారత్, బంగ్లా మధ్య ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరోవైపు.. భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్.. యూనస్ ప్రభుత్వాన్ని టెన్షన్కు గురిచేస్తోంది. ఈ డీల్తో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ దేశంలో ప్రత్యేకంగా టెక్స్టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ రంగంపై ఈ ప్రభావం చూపించడమే ఇందుకు కారణం. ఇలాంటి తరుణంలో యూనస్ సర్కార్.. అమెరికాతో చేసుకున్న సీక్రెట్ డీల్ ఇప్పుడు బంగ్లాలో హాట్ టాపిక్గా మారింది.అయితే, ఎన్నికల ముందు, తమ పదవీకాలం ముగియబోతున్న సమయంలో యూనస్ సర్కార్ ట్రంప్తో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. బంగ్లాదేశ్లోని ప్రముఖ పత్రిక ‘ప్రథమ్ ఆలో’ ప్రకారం.. బంగ్లా, అమెరికా మధ్య ఒప్పందం గురించి బహిరంగంగా ఏ సమాచారం బయటకు రాలేదు. యూనస్ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాతో ఒక నాన్-డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేసింది. అందుకే ఈ ట్రేడ్ డీల్ ముసాయిదా ప్రజలకు తెలియడం లేదు. అంటే ప్రభావితమయ్యే పరిశ్రమలకు కూడా అసలు షరతులు ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ డీల్లో అసలు ఇందులో ఏముంది? ఎవరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నారు? అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. యూనస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకోలేదు. ఇది తాత్కాలిక ప్రభుత్వం. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ఇలాంటి కీలక ఒప్పందం చేసే నైతిక హక్కు ఉందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.కాగా, ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ కేవలం మూడు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 9న అమెరికా–బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్పై సంతకాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. యూనస్ ప్రభుత్వం ఇంత తొందరగా అమెరికాతో ఒప్పందం ఎందుకు చేయాలనుకుంటోంది? అనే ప్రశ్న ఎదురైంది. కాగా, 2025 ఏప్రిల్లో ట్రంప్ 100 దేశాలపై టారిఫ్ ప్రకటించినప్పుడు, బంగ్లాదేశ్పై 37 శాతం సుంకాలు విధించారు. అనంతరం, జూన్లో నాన్-డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేయడంతో చర్చలు రహస్యమయ్యాయి. జూలైలో టారిఫ్ 35 శాతానికి, ఆగస్టులో 20 శాతానికి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు బంగ్లాదేశ్ వాణిజ్య శాఖ చెబుతోంది.ఈ నేపథ్యంలో యూనస్ ప్రభుత్వం సీక్రెట్ ఒప్పందంపై టెక్స్టైల్, గార్మెంట్ తయారీదారులు, సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ప్రక్రియ సాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోందని గార్మెంట్ తయారీదారుల సంఘం నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ఒప్పందాలు చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 90 శాతానికి పైగా ఇదే రంగం ఆధారంగా ఉంది. ఇప్పటికే ట్రంప్ విధించిన భారీ టారిఫ్ల వల్ల వస్త్ర పరిశ్రమ నష్టపోయింది. ఇప్పుడు మరోసారి అమెరికాతో ఏవో షరతులతో ఒప్పందం జరిగితే, లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే ఈ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అమెరికా చేతిలో బంగ్లాదేశ్ జుట్టు అంటూ ఆ దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.మరోవైపు.. సీక్రెట్ ఒప్పందంపై బంగ్లాదేశ్ ప్రముఖ ఆర్థికవేత్త అనూ మహమ్మద్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు పోర్టులను లీజుకు ఇవ్వడం, ఆయుధాలు దిగుమతి చేయడం, అమెరికాతో తలవంచే ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ ఎందుకు ఇంత తొందరగా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ ఒప్పందాలు పారదర్శకంగా లేవని, అవాస్తవంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. విదేశీ లాబీలు యూనస్ ప్రభుత్వంలోకి ప్రవేశించి, ఎలాగైనా ఈ ఒప్పందాలు జరిగేలా చూస్తున్నాయని బాంబు పేల్చారు. అయితే, ఈ డీల్పై ఇటీవల వచ్చిన కొన్ని నివేదికలు ఈ అనుమానాలకు మరింత బలం ఇస్తున్నాయి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన పరిణామాల వెనుక ఇస్లామిక్ శక్తులతో పాటు అమెరికా ‘డీప్ స్టేట్’ మద్దతు ఉందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఆ తర్వాతే యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం చేయబోతుండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి.వివాదాస్పద అంశాలు..పారదర్శకత లోపం: ఒప్పందం వివరాలు ప్రజలకు, పార్లమెంట్కు తెలియజేయలేదు.అనుమానాలు : ఎన్నికల ముందు తాత్కాలిక ప్రభుత్వం దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఆర్థిక ప్రభావం: ఎగుమతిదారులు, ఆర్థిక నిపుణులు దీని వల్ల బంగ్లాదేశ్ దీర్ఘకాలికంగా అమెరికా వాణిజ్య విధానాలకు బంధించబడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వస్త్ర పరిశ్రమపై ప్రభావం..అమెరికా మార్కెట్ ఆధారపడటం: బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 90% వస్త్రాలు, అందులో ఎక్కువ భాగం అమెరికాకు వెళ్తుంది. కొత్త ఒప్పందం వల్ల 20% టారిఫ్ స్థిరపడింది. ఇది భారతదేశం (25%), వియత్నాం (21%), పాకిస్తాన్ (19%)తో పోలిస్తే పోటీ స్థాయిలో ఉంది.పోటీ సామర్థ్యం: టారిఫ్ తగ్గడం వల్ల అమెరికా మార్కెట్లో బంగ్లాదేశ్ వస్త్రాలు మరింత పోటీగా నిలుస్తాయి.ఉద్యోగ భద్రత: అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగవచ్చు.వేతన ఒత్తిడి: తక్కువ ధరల పోటీ కొనసాగించడానికి తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు కొనసాగవచ్చు.సామాజిక ప్రభావం: కార్మికుల హక్కులు, భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయ ఒత్తిడితో మెరుగుపడే అవకాశం ఉంది. కానీ తాత్కాలికంగా ఉత్పత్తి ఒత్తిడి పెరుగుతుంది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ అమెరికా మార్కెట్లో దీర్ఘకాలికంగా స్థిరపడే అవకాశం ఉంది. -
ఆరో టైటిల్ వేటలో...
హరారే: యువ భారత్ అండర్–19 ప్రపంచకప్ వేట ‘ఫైనల్’ మజిలీకి చేరింది. కుర్రాళ్ల ‘కప్’ కల ఈ ఒక్క విజయంతోనే నెరవేరుతుంది. అన్ని గెలవడం ఒక ఎత్తు అయితే... ఈ ఒక్కదాంతో ‘ప్రపంచ’ అందలం ఎక్కడం మరో ఎత్తు. ఆయుశ్ మాత్రే నేతృత్వంలోని భారత జట్టుకు ఈ మ్యాచ్ విలువేంటో బాగా తెలుసు. అందుకే ‘కప్’ చేతికందే తుది పోరును కూడా విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ రెండో ప్రపంచకప్ విజయం కోసం ఆరాటపడుతోంది. భారత్లాంటి దుర్బేధ్యమైన జట్టును ఓడించి ‘ప్రపంచా’న్ని గెలవడం కష్టమైనా... రెండున్నర దశాబ్దాల తర్వాత వచి్చన ఈ వరల్డ్కప్ చాన్స్ను ఎంతమాత్రం చేజార్చుకోవద్దని గట్టిగా కోరుకుంటుంది. పదో సారి ఫైనల్కు...అండర్–19 ప్రపంచకప్ 1988లో మొదలైంది. ఇప్పటివరకు 15 మెగా ఈవెంట్లు జరిగితే ఏ కుర్ర జట్టుకు సాధ్యం కానీ ఐదు టైటిళ్లను భారత జట్టే గెలిచింది. ఓవరాల్గా 16 (ప్రస్తుత కప్) ప్రపంచకప్ల్లో 10 సార్లు ఫైనల్ చేరిన ఘనచరిత్ర కూడా మనదే! వరుసగా యువ భారత్కిది ఆరో ఫైనల్. గత 2024 ఈవెంట్లోనూ ఫైనల్ చేరినా... ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. కానీ ఈ ఈవెంట్లో యువ క్రికెటర్ల ఆటతీరు... కనబరిచిన నిలకడ, సమష్టి ప్రదర్శన చూస్తే ఈసారి సరిపెట్టుకోదు... కప్ పట్టుకెళ్లడం ఖాయమని ఎవరైనా అంటారు. అంతలా భారత జైత్రయాత్ర సాగుతోంది. ఇంగ్లండ్ కథాకమామీషు... ఇంగ్లండ్ 1998లో జరిగిన రెండో ప్రపంచకప్లో తొలిసారి టైటిల్ గెలిచింది. ఐసీసీ అండర్–19 పుటల్లో తప్ప... ఇంగ్లండ్ క్రికెట్లో మరుగున పడిపోయిన విజయమది. తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు కప్ వేటలో పడిన ఇంగ్లండ్కు ఫైనల్లో మింగుడుపడని ప్రత్యర్థి, టైటిల్ ఫేవరెట్ భారత్ ఎదురవడమే ప్రధాన సమస్య. అయితే తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించిన ఇంగ్లండ్... ఆఖరి పోరులో అజేయమైన గత ఫైనలిస్టును ఓడిస్తే ఇంతకుమించిన పండగ మరొకటి ఉండదేమో! భారత్ ఇలా... ఇంగ్లండ్ అలా... గ్రూప్ ‘బి’లో లీగ్ దశను మొదలుపెట్టిన భారత్ ముందు బ్యాటింగ్ చేసినా... తర్వాత లక్ష్యాన్ని ఛేదించినా అన్ని విజయంతోనే ముగించింది. అమెరికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్లపై గెలిచి ‘సూపర్ సిక్స్’కు చేరింది. అక్కడ జింబాబ్వే, పాకిస్తాన్లను కంగుతినిపించి రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ను చిత్తు చేసి ఆఖరి పోరుకు అర్హత సాధించింది. సరిగ్గా భారత్లాగే గ్రూప్ ‘సి’లో పాకిస్తాన్, జింబాబ్వే, స్కాట్లాండ్లపై ఇంగ్లండ్ గెలిచి లీగ్ దశను విజయవంతంగా దాటింది. ‘సూపర్ సిక్స్’లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్లపై గెలిచి... తొలి సెమీఫైనల్లో నిరుటి విజేత ఆ్రస్టేలియాను ఇంటికి పంపి ఫైనల్ బరిలో నిలిచింది. జట్ల వివరాలు భారత్: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు, వేదాంత్ త్రివేది, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, దీపేశ్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, మొహమ్మద్ ఇనాన్, ఉధవ్ మోహన్, హర్వంశ్ పంగాలియా, కిషన్ సింగ్. ఇంగ్లండ్: థామస్ ర్యూ (కెప్టెన్), రాల్ఫీ అల్బెర్ట్, అలీ ఫారూఖ్, డెన్ డాకిన్స్, ఫాల్కోనెర్, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, ల్యూక్ హాండ్స్, ఇసాక్ మొహమ్మద్, మ్యానీ లమ్స్డెన్, బెన్ మాయెస్, జేమ్స్ మింటో, జోసెఫ్ మూర్స్, సెబాస్టియన్ మోర్గాన్. -
సురుచి–సామాట్ర్ జోడీకి రజతం
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్–సామ్రాట్ రాణా (భారత్) ద్వయం భారత్కు రజత పతకాన్ని అందించింది. 48 షాట్లతో కూడిన ఫైనల్లో సురుచి–సామ్రాట్ జోడీ 479.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. నగీనా సైద్కులోవా–ముఖమ్మద్ కమలోవ్ (ఉజ్బెకిస్తాన్) జంట 481.3 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. అంతకుముందు 10 జోడీల మధ్య 60 షాట్లతో నిర్వహించిన క్వాలిఫయింగ్లో సురుచి–సామ్రాట్ 583 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు రషి్మక సహగల్ (237.9 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... వన్షిక చౌధరీ (236.7 పాయింట్లు) రజత పతకాన్ని హస్తగతం చేసుకుంది. యూత్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు ప్రియాన్షి పూర్వ (234.8 పాయింట్లు) స్వర్ణం... చహెక్ కోహ్లా (233 పాయింట్లు) రజతం దక్కించుకున్నారు. టీమ్ విభాగాల్లో రష్మిక, వన్షిక, అగం గ్రెవాల్ జట్టు... ప్రియాన్షి, చహెక్, శిక్షా శరణ్ జట్టు పసిడి పతకాలు సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం భారత్ ఖాతాలో పది స్వర్ణాలున్నాయి. -
భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. కడుపు మంటలో పాకిస్థాన్
ఇస్లామాబాద్: అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ పాకిస్థాన్ పాలకుల పరిస్థితిని గందరగోళంలోకి నెట్టింది. పొగడ్తలతో, ఫోటోలకు ఫోజులిచ్చే ప్రయత్నాలు సరిపోవని ప్రజలు, మాజీ మంత్రులు,ఆర్థిక నిపుణులు గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఒత్తిడిలో పాక్ ప్రధాని షెహబాజ్ పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా ఉంటే, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాత్రం ‘నిస్సహాయ ప్రేమికుడు’ అనే అపవాదు మూటగట్టుకుంటున్నారనే చర్చ మొదలైంది. మరి ఈ ట్రేడ్ డీల్ పాకిస్థాన్ పాలకుల పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చిందా?ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో స్తబ్ధుగా ఉన్న సంబంధాలు తాజాగా భారత్-అమెరికాల మధ్య కీలక వాణిజ్య పరమైన ఒప్పందాలతో పరిస్థితులు మెరుగున పడ్డాయి. అదే సమయంలో పాకిస్తాన్లో ప్రజలు తమ నేతల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు భారత్ గ్లోబల్ వాణిజ్యంలో ముందడుగు వేస్తుంటే..పాక్ ప్రజలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారుట్రంప్ సేవలో అసిమ్ మునీర్ఈ సందర్భంగా తమ పాలకుల తీరును గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పలు దుమ్మెత్తి పోస్తున్నారు. అమెరికాకు మరింత దగ్గరై వాణిజ్యంతో పాటు ఇతర అంశాల్లో లబ్ధి పొందేందుకు పడరాని పాట్లు పడింది. గతేడాది ట్రంప్ను కీర్తిస్తూ పాక్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్ష భవనంలో ట్రంప్తో కలిసి విందులో పాల్గొన్నారు. పైగా, ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఆపినందుకు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ ప్రతిపాదనలు సైతం పంపించింది దాయాది దేశం.ఆర్ధిక ఇబ్బందులతో సతమతంఅయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం పాక్పై కొంచెం కూడా కనికరం చూపించలేదు. పాక్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై 19శాతం సుంకాల్ని విధించింది. ఆ సుంకాలను చెల్లిస్తూ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంది. భారత్ మాత్రం తన ఎగుమతులపై సుంకాలను 18 శాతానికి తగ్గించినా అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల ఒప్పందాల నుంచి తప్పుకుంది. తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది. తాజాగా, అమెరికాతో ట్రేడ్డీల్ కుదుర్చుకున్న భారత్పై పాక్ దేశస్థులు ప్రశంసలు కురిపిస్తూనే తమదేశాది నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. భారత్ను చూసి నేర్చుకోండి. ఫొటోలకు ఫోజులివ్వడం కాదని, దేశానికి లబ్ధి చేకూరే పనులు చేయాలని సూచిస్తున్నారు. ఇక దాయాది మాజీ మంత్రులు ఎక్స్ వేదికగా పాలకులపై సెటైర్లు వేస్తున్నారు. మాజీ పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) మంత్రి హమ్మాద్ అజ్హర్ ఇలా ట్వీట్ చేశారు. 21వ శతాబ్దంలో విదేశాంగ విధానం అనేది కేవలం చూపులు, వ్యక్తిగత సంబంధాల గురించి కాదు. అది ఆర్థిక శక్తిని వినియోగించడం, సుంకాల తగ్గింపు, దేశీయ మార్కెట్ను మరింత విస్తరించడం. భారత్ ఇటీవల యూరోపియన్ యూనియన్ (EU), అమెరికాతో చేసిన వాణిజ్య ఒప్పందాలు దీనికి నిదర్శనం. అతిగా పొగడ్తలు కురిపించడం, ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకు అర్రులు చాచడం వంటివి పనికి రావు’ అని పేర్కొన్నారు. ట్రంప్ను నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేయకపోయినా సుంకాల విషయంలో తాను ఏది కావాలనుకుందో భారత్ అది సాధించింది. ట్రంప్ పాకిస్థానికి ఇచ్చింది అదనంగా షూ పాలిష్ చేసుకునే అవకాశం తప్ప ఇంకేముంది?’ అని పాకిస్తాన్ ఆర్థికవేత్త జావేద్ హసన్ ఎద్దేవా చేశారు.మొత్తానికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్లో ఎవరికి ఎంత లాభం అనేది పక్కనపెడితే.. దౌత్య పరంగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు పాక్ పాలకులకు మాత్రం కంట్లో నలుసులా, గోటి చుట్టూ రోకటి పోటులా మారాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రపంచ ఆర్ధిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. -
india us trade deal: భారత్కు అమెరికా బంపరాఫర్
సాక్షి,ఢిల్లీ: భారత్-అమెరికా ట్రేడ్ డీల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అమెరికాతో జరిగిన ట్రేడ్ డీల్లో రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిఫలంగా అమెరికా.. భారత్కు విధించే ప్రతీకార పన్నును 18 శాతం తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నారు.అదే సమయంలో అమెరికా నుంచి భారత్ సైతం 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రకటనపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం స్పష్టత ఇచ్చారు. సీనియర్ అమెరికా అధికారులు వచ్చే వారం ఢిల్లీలో ఒప్పందంపై సంతకం చేయడానికి రానున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఫిబ్రవరి 3న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం తుది రూపం దాల్చింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా భారతీయ వస్తువులపై విధిస్తున్న సుంకాలను 50శాతం నుంచి 18శాతానికి తగ్గించింది. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, భారత ఎగుమతులకు కొత్త అవకాశాలు కలిగేందుకు దోహదం చేయనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కుర్రాళ్లు కుమ్మేశారు
-
భారత్కు ఆ స్వేచ్ఛ ఉంది..
మాస్కో: ముడి చమురు కొనుగోళ్లకు సంబంధించి ఏ సంస్థ నుంచి చమురును దిగుమతి చేసుకోవాలనే పూర్తిస్వేచ్ఛ భారత్కు ఉందని రష్యా ప్రకటించింది. ‘‘మేము సైతం అంతర్జాతీయ ఇంధన నిపుణుల బాటలోనే నడుస్తున్నాం. భారత్కు ఒక్క రష్యాయే కాదు ఎన్నో దేశాలు తమ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.ఎవరి నుంచి ఏం కొనాలనే స్వేచ్ఛ భారత్కు మొదట్నుంచీ ఉంది. ఇందులో కొత్తేమీ లేదు’’అని రష్యా అధ్యక్షభవనం అధికార ప్రతినిది దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి మోదీ సర్కార్ రష్యా నుంచి పూర్తిగా ముడిచమురు కొనుగోళ్లను ఆపేసిందన్న వార్తలపై మీ స్పందన ఏంటని మీడియా ప్రశ్నించగా పెస్కోవ్ పై విధంగా సమాధానం ఇచ్చారు. అయితే రష్యా హైడ్రోకార్బన్లను భారత్ కొనుగోలుచేయడం ఉభయతారకమని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా అన్నారు.భారత్పై 50 శాతం టారిఫ్లను ఏకంగా 18 శాతానికి తగ్గిస్తున్నట్టు సోమవారం ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీన్ని భారత్ సాధించిన ఘన విజయంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో తొలినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గకుండా, మాటల యుద్ధానికి బదులివ్వకుండా సంయమనం పాటిస్తూనే చివరికి మౌనంగానే ఆయన మెడలు వంచారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది చదవండి: ట్రంప్నే బెంబేలెత్తించింది.. భారత్ విజయ రహస్యం ఇదే!కాగా, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పారు. మన దేశ ఆహార, వ్యవసాయ రంగాలకు ఈ ఒప్పందంలో పూర్తి రక్షణలు ఉన్నట్లు తెలిపారు. ఆయన బుధవారం తొలుత లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. మన దేశ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని అన్నారు.అమెరికాతో ఒప్పందం వల్ల మనకు లాభం చేకూరుతుందని ప్రకటించారు. అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువులకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఎగుమతుల విషయంలో మన పోటీ సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని వివరించారు. ఈ ఒప్పందం హఠాత్తుగా కుదిరిందని కాదని, భారత్, అమెరికా మధ్య పలు దఫాల చర్చల తర్వాతే తుదిరూపు వచ్చిందని స్పష్టంచేశారు. ఇది సమతుల్య, పరస్పర ప్రయోజనాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందమని పేర్కొన్నారు. -
హైదరాబాద్లో యాపిల్ స్టోర్
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో తమ రిటైల్ స్టోర్స్ని విస్తరిస్తోంది. హైదరాబాద్లోనూ కొత్త స్టోర్ ప్రారంభించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ మొదలైన ఉద్యోగాలను తమ కెరియర్ పోర్టల్లో పోస్ట్ చేసింది. సాధారణంగా స్టోర్ని ప్రారంభించడానికి యాపిల్ సుమారు ఏడాది ముందు నుంచి రిక్రూట్మెంట్ చేపడుతుందని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ స్టోర్ 2027 తొలి నాళ్లలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2020లో భారత్లో ఆన్లైన్ స్టోర్ని ప్రారంభించిన యాపిల్ ఆ తర్వాత ముంబై, ఢిల్లీలో ఆఫ్లైన్ స్టోర్స్ని ఏర్పాటు చేసింది. -
ఒక్కటి కాదు.. వస్తున్నాయ్ 100 రిలయన్స్లు
ముంబై: దేశాభివృద్ధికి శాంతి భద్రతలు, స్థిరమైన నాయకత్వం కీలకమని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చెప్పారు. భారత్ నిలకడగా రెండంకెల స్థాయి వృద్ధిని సాధించడం సాధ్యమేనని స్పష్టం చేశారు. జియోబ్లాక్రాక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. పటిష్టమైన ఆర్థిక ప్రగతికి 15–20 ఏళ్ల పాటు శాంతి భద్రతలు, సామాజిక సామరస్యత అవసరమని తెలిపారు. సమాచారం, వినియోగం, వాణిజ్యంలాంటి అంశాల్లో పరివర్తనకు భారత్ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 100 కంపెనీలు కొత్తగా రిలయన్స్ స్థాయికి ఎదిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంబానీ చెప్పారు. ఏఐ గురించి ఆందోళన వద్దు: ఏఐ గురించి భయపడనక్కర్లేదని, పారిశ్రామిక విప్లవంతో కొంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడినా, మానవాళి ముందుకే సాగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. దేశీయంగా ప్రతి గ్రామంలోనూ 5జీ నెట్వర్క్ ఉందని, మిగతా ఏ దేశంతో పోలి్చనా మెరుగ్గా, చౌకగా 5జీ సేవలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. మార్కెట్తోనే సంపద సాధ్యం: ల్యారీ ఫింక్: రాబోయే రోజుల్లో పది సంవత్సరాలకు పైగా భారత్ ఏటా 8–10 శాతం వృద్ధి చెందుతుందని, ఇది భారత్ శకం అని గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం బ్లాక్రాక్ చైర్మన్ ల్యారీ ఫింక్ చెప్పారు. భారతీయులు డబ్బంతా బ్యాంక్ డిపాజిట్లలోనే ఉంచకుండా క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక ప్రయోజనం పొందవచ్చని ఆయన తెలిపారు. ఇందుకు అమెరికానే నిదర్శనమని ఫింక్ చెప్పారు. వచ్చే అయిదేళ్లలో దేశీయంగా మ్యుచువల్ ఫండ్స్ ఏయూఎం ప్రస్తుత రూ. 80 లక్షల కోట్ల నుంచి రెట్టింపు స్థాయికి పెరుగుతుందని జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ చైర్మన్ కేవీ కామత్ చెప్పారు. టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బ్యాంకులు తమను తాము సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుందన్నారు. -
జాగ్రత్త..చైనా అటాక్ చేయవచ్చు: అమెరికా
చైనా విషయంలో భారత్కు అమెరికా కీలక సూచన చేసింది. డ్రాగన్ కంట్రీతో ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండడం మంచిదని హెచ్చరించింది. చైనా, భారత్పై ఏ క్షణానైన దాడికి తెగబడవచ్చని అమెరికా మెరైన్ ఇంటిలిజెన్స్ మాజీ అధికారి భారత్కు హెచ్చరిక జారీ చేశారు.అరుణాచల్ విషయంలో డ్రాగన్ కంట్రీ తరచుగా భారత్పై కయ్యానికి కాలు దువ్వుతుంది. అయితే ప్రస్తుతం ఆ సమస్య అంత పెద్దగా లేదు. అయితే భవిష్యత్తులో చైనా, భారత్పై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ మెరైన్ ఇంటెలిజెన్స్ అధికారి గ్రాంట్ న్యుషామ్ భారత్ను హెచ్చరించారు.2049వరకూ చైనా తనను ప్రపంచంలోనే తనను సూపర్ పవర్గా స్థాపించుకోవాలనుకుంటుందని దానికి ప్రత్యేక లక్ష్యాలను నిర్ణయించుకుంటుందని తెలిపారు. తైవాన్తో సమస్య ఉన్న సమయంలోనే అకస్మాత్తగా మరో దేశంపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు. భారత్, దక్షిణకొరియా, జపాన్, ఫిలీప్పీన్స్ వంటి ప్రాంతాలపై అది దాడి చేయగలదని తెలిపారు. అందులోనూ భారత్ తొలిస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.దీనికోసం ఆయన చైనా, భారత్ మధ్య గతంలో జరిగిన గల్వాన్ లోయ వివాదాన్ని ప్రస్థావించారు. అయితే ప్రస్తుతం అమెరికా రాయబారిగా ఉన్న సెర్గియా గోర్ అధ్యక్షుడు ట్రంప్కు సన్నిహితుడని ఆయనతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరో మెట్టు ఎక్కుతాయని అన్నారు. కాగా ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధిస్తున్న అధిక పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఈ కప్లో మనమే ప్రమాదకరం
న్యూఢిల్లీ: ఐసీసీ మొదలుపెట్టిన తొలి టి20 ప్రపంచకప్నే చేజిక్కించుకున్న భారత కెప్టెన్ ధోని. తర్వాత మరో రెండు ఐసీసీ (వన్డే ప్రపంచకప్, చాంపియన్స్) ట్రోఫీలను అందించిన విజయవంతమైన సారథిగా ఘనతకెక్కిన ‘మిస్టర్ కూల్’ ఎమ్మెస్ ధోని శనివారం మొదలయ్యే టి20 ప్రపంచకప్ గురించి వ్యాఖ్యానించాడు. ఇంకా కొనసాగుతున్న 38 ఏళ్ల రోహిత్ శర్మ, 37 ఏళ్ల విరాట్ కోహ్లి కెరీర్పై స్పందన కోరితే ఘాటుగానే జవాబిచ్చాడు. ఎక్కడా తగ్గలేదు. అన్నింటికి తగిన సమాధానాలిచ్చాడు. మైదానంలో వికెట్ల వెనక చురుకైన వికెట్ కీపర్గా, తెలివైన కెప్టెన్ వ్యవహరించిన ధోని కామెంట్రీ మాత్రం కష్టమంటున్నాడు. స్పోర్ట్స్ బ్రాడ్కాస్టర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని ఇంకా ఏమన్నాడంటే... వయసు అడ్డంకి కాదు రోహిత్, కోహ్లి బాగానే ఆడుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడతారు. అయితే ఏంటి? ఎందుకు ఆడకూడదు? పెరిగిన వయసే అడ్డంకా? నా దృష్టిలో వయసు అసలు ప్రాతిపదికే కాదు. ప్రదర్శనే ప్రామాణికం. ఫిట్నెస్సే ప్రధానం. అలాంటప్పుడు వయసును పరిగణించాల్సినపనేంటి చెప్పండి. ఆ వయసులో ఉన్న వారందరూ ఒకటేనా... అందరిని ఒకేలా చూస్తామా? నా విషయమే చెబుతా... నేను 24 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాను. అప్పుడెవరూ మాట్లాడలేదు. పదేళ్లకు పైగానే భారత్కు ఆడాను. 20 ఏళ్లయినా ఇంకా (ఐపీఎల్) ఆడుతున్నాను. ఇప్పుడు ఎవరూ మాట్లాడరు. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గురించే ఎందుకు ఈ చర్చంతా! ఎంతకాలం ఆడాలనేది వాళ్లకే వదిలేయండి ఆ విషయాన్ని. ఫామ్, ప్రదర్శన బాగున్నంత కాలం ఆడతారు. ఇందులో తప్పేంటి. నొప్పి ఎవరికి?. ఆ అనుభవం ఒక్క సచిన్కే అనుభవమనేది ఆడుతుంటేనే వస్తుంది. ఒక్క సచిన్ తప్ప 20 ఏళ్లకే అనుభవజు్ఞలైన ఆటగాళ్లుండటం అరుదు. 16, 17 ఏళ్లకు అరంగేట్రం చేస్తేనో రాదు. క్రమంగా ఆడితేనే వస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొంటేనే అబ్బుతుంది. పరిస్థితులకు ఎదురొడ్డి నిలిస్తేనే అలవాటవుతుంది. అనుభవమంటే అదే. ఏదో 20, 25 మ్యాచ్లు ఆడినంత మాత్రాన అనుభవజు్ఞలైపోరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే సామర్థ్యం ఉంటుందో అనే అనుభవజ్ఞున్ని చేస్తుంది. భారత జట్టే ప్రమాదకారి సొంతగడ్డపై జరిగే టి20 ప్రపంచకప్లో మనకు ఎదురుపడే ప్రత్యర్థులకు మనతోనే ముప్పు. ఈ మెగా ఈవెంట్లో ప్రమాదకర జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. ఒక మేటి జట్టులో ఏమేమి ఉండాలో అవన్నీ మన బృందంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫార్మాట్నే పరిగణిస్తే మన టీమ్కు మంచి అనుభవం ఉంది. ఈ విశేషానుభవం మన జట్టుకు అదనపు బలంగా పనికొస్తుంది. ఎంతటి ఒత్తిడిలోనైనా ఆడగలిగే స్థయిర్యం అనుభవంతోనే వస్తుంది. అయితే నాకు జట్టుపై ఎలాంటి బెంగా లేదు కానీ మంచుతోనే ఏదైనా సమస్య ఉండొచ్చు. శీతాకాలం కాబట్టి ఇది బాగా ఇబ్బంది పెట్టొచ్చు. దీంతో టాస్ కీలకంగా మారుతుంది. కామెంట్రీ కష్టం... అందుకే దూరం మైదానంలో మైక్ పట్టుకొని మాట్లాడటం వేరు. టీవీల్లో మైక్ పట్టుకొని వ్యాఖ్యానించడం వేరు. అందుకే కామెంటరీ కష్టమనే అంటాను. మ్యాచ్ జరుగుతున్నప్పుడు దీన్ని వివరించే ప్రక్రియలో ఆడుతున్న ఆటగాళ్లను విమర్శించే వైనానికి మధ్యలో సన్నని గీత ఒకటి ఉంటుంది. దాన్ని చెరపలేం... అతిక్రమించలేం. వ్యాఖ్యాతగా మాట్లాడుతుంటే ఆ గీత ఒకటుంది అది తప్పని అనిపించదు. మ్యాచ్ వివరించేందుకు ఓ వైపు ఉండటానికే ఇష్టపడతారు. మ్యాచ్ సమయంలో తప్పని అనిపిస్తే వెంటనే దాన్ని బయటికి చెప్పాల్సి ఉంటుంది. సున్నితంగా విమర్శించగలితే నేర్పుండాలి. హుందాగా వ్యాఖ్యానించాలి. ఎవరినీ లక్ష్యపెట్టకుండా, నొప్పించకుండా వ్యాఖ్యానించగలిగే నైపుణ్యం కూడా ఉండాలి. నాకు ఇవేమీ లేవు. అందుకే కామెంట్రీకి దూరం. అంతెందుకు గణాంకాలు సైతం గుర్తుండాలి. నాకేమో నా గణాంకాలే తెలియవు. కొందరైతే ఇందులోనిష్ణాతులై ఉంటారు. వారైతేనే కామెంటేటర్ పాత్రకు న్యాయం చేస్తారు. నేనో మంచి స్పీకర్ను కాదు నాకు వినడం మీద ఉన్న శ్రద్ద మాట్లాడటం మీద ఉండదు. వాదించడం నా వల్ల కానేకాదు. అందుకే అనిపిస్తుంది... నేను మంచి స్పీకర్ను కాదు. ఎప్పటికీ కాలేను కూడా! నేను మాట్లాడేది చాలా తక్కువ. నాకు అనువైన, నా మాటలు అర్థం చేసుకోగలిగిన వారితోనే మాట్లాడతాను. అందరితోనూ మాట్లాడలేను. కానీ ఎవరు చెప్పినా వినే ఓపికైతే నాకు చాలానే ఉంది. ఎంత సేపయినా వింటాను. -
పెర్ల్ ఫెర్నాండెజ్ ‘హ్యాట్రిక్’
పొఖారా (నేపాల్): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–19 మహిళల చాంపియన్షిప్లో భారత అండర్–17 జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రౌండ్ రాబిన్ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 8–0 గోల్స్ తేడాతో భూటాన్ను చిత్తు చేసింది. ఈ ఏడాది చైనా వేదికగా ఏఎఫ్సీ అండర్–17 ఆసియా కప్ జరగనున్న నేపథ్యంలో... ఈ టోర్నీలో భారత్ అండర్–17 బాలికల జట్టును బరిలోకి దింపింది. భారత జట్టు తరఫున పెర్ల్ ఫెర్నాండెజ్ (16వ, 39వ, 41వనిమిషాల్లో) ‘హ్యాట్రిక్’ గోల్స్తో విజృంభించింది. ప్రీతిక బర్మన్ (25వ, 90 నిమిషాల్లో) రెండు గోల్స్తో సత్తా చాటగా... అలీషా లింగ్డో (6వ నిమిషంలో), అభిష్ట బాస్నెట్ (10వ నిమిషంలో),దివ్యాణి లిండా (17వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బుధవారమే జరిగిన మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ జట్టు 4–0 గోల్స్ తేడాతో ఆతిథ్య నేపాల్పై నెగ్గింది. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన బంగ్లాదేశ్ 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్ మూడు మ్యాచ్ల్లో 2 విజయాలు, ఒక పరాజయంతో 6 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఆట ఆరంభమైనప్పటి నుంచే మన అమ్మాయిలు వరుస దాడులు చేస్తూ విజృంభించారు. ఆరో నిమిషంలో అలీషా గోల్ కొట్టడంతో భారత్ ఖాతా తెరిచింది. పెర్ల్ ఫెర్నాండెజ్ ప్రథమార్థంలోనే మూడు గోల్స్ కొట్టడంతో మన అమ్మాయిలు పూర్తి ఆధిపత్యం కనబర్చారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 7–0తో నిలిచింది. రెండో అర్ధభాగంలో భారత్ తరఫున ఒక గోల్ నమోదు కాగా... భూటాన్ మ్యాచ్ మొత్తంలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. -
ఇషా సింగ్కు రెండు స్వర్ణ పతకాలు
ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్ప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. న్యూఢిల్లీలో బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో 21 ఏళ్ల ఇషా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, టీమ్ విభాగంలో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన వ్యక్తిగత ఫైనల్లో ఇషా సింగ్ 239.8 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. భారత్కే చెందిన సురుచి సింగ్ 197.7 పాయింట్లతో నాలుగో స్థానంలో, మను భాకర్ 135.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. టీమ్ విభాగంలో ఇషా, సురుచి, మను భాకర్లతో కూడిన భారత బృందం 1726 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్కు కాంస్యం, రజతం లభించాయి. వ్యక్తిగత విభాగంలో సామ్రాట్ రాణా 220.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలిచాడు.టీమ్ విభాగంలో సామ్రాట్ రాణా, శ్రవణ్ కుమార్, వరుణ్ తోమర్లతో కూడిన భారత బృందం 1732 పాయింట్లతో రజతం దక్కించుకుంది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో గావిన్ ఆంటోనీ స్వర్ణం నెగ్గాడు. టీమ్ విభాగంలో గావిన్ ఆంటోనీ, చిరాగ్ శర్మ, ముకేశ్ నేలవల్లి (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత బృందం 1735 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. -
ట్రంప్నే బెంబేలెత్తించింది.. భారత్ విజయ రహస్యం ఇదే!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే అక్కసుతో భారత్పై భారీగా సుంకాలు మోపిన అమెరికా.. ఉన్నఫళంగా ఎందుకు దిగివచ్చింది? ఏకపక్షంగా సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా భారత్తో డీల్ కుదిరిందని, ట్యాక్స్లను 18 శాతానికి తగ్గించామని ఎందుకు ప్రకటించారు?? బెదిరింపులతో లొంగదీసుకుందామని ట్రంప్ భావిస్తే.. ఏకు మేకై కూర్చుంటామంటూ పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం అమెరికా తల వంచిందా?ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛాయుత వాణిజ్యంపై భారత్ కుదుర్చుకున్న డీల్ ఇప్పుడు ట్రంప్ మెడలను వంచిందా? బంగారం ధరలు మొదలు.. పలు దేశాల షేర్ మార్కెట్లను మాటలతో శాసిస్తున్న ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి?? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే..! అహింసామార్గంలో.. శాంతియుతంగా ఎదుటివారి మెడలు వంచేలా చేయడం భారత్ నైజం..!! ఈ విషయంలో భారత్ వ్యూహాత్మక అడుగులు.. వాటి ఫలితాలను గురించి వివరంగా తెలుసుకోవాలంటే.. చదవాల్సిందే👉అది అనుకున్నంత ఈజీ కాకపోగా..ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దేశాన్ని ఓడించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు..! బాలిస్టిక్ మిసైల్స్.. యుద్ధ విమానాలతో విరుచుకుపడాల్సిన పని లేదు..! ఆంక్షల ఛట్రంలో ఆ దేశాన్ని బంధించి, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు రద్దయ్యేలా చేస్తే చాలు..! ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే దశలో ఆ దేశాలను దారికి తెచ్చుకోవచ్చు..! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే..! ఇదే మైండ్ గేమ్తో ఎన్నో దేశాలను దారికి తెచ్చుకున్నాడు. భారత్ను కూడా అదే గాడిన కట్టాలనుకున్నాడు. భారత్ ఆత్మగౌరవం ముందు ఓడిపోయాడు. అది అనుకున్నంత ఈజీ కాకపోగా.. అమెరికన్లకే ధరాఘాతంతో శాపంగా మారుతోంది. దీంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల మెట్లు దిగిరాక తప్పలేదు..!👉ఆ మౌనమే ట్రంప్ను బెంబేలెత్తించింది..భారత్ను దారికి తెచ్చుకోవాలనే తపనతో ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి భారత్ నుంచి ప్రకటనలు లేకున్నా.. తానే భారతీయుల తరఫున ప్రకటనలు చేసుకున్నారు. రష్యా చమురును భారత్ కొనబోదని.. అమెరికా నుంచే కొంటుందని ప్రకటించేసుకున్నారు. అలాంటి ప్రకటనలకు భారత్ తొందరపడి ఏమాత్రం స్పందించలేదు. ‘నో కామెంట్’ అంటూ దాటవేయలేదు. చేసిందల్లా.. మౌనంగా ఉండడమే..! ఆ మౌనమే ఇప్పుడు ట్రంప్ను బెంబేలెత్తించింది. వెనక్కి తగ్గేలా చేసింది. మౌనంగానే భారత్ విజయం సాధించింది.👉జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు..సాధారణంగా మౌనం అర్ధాంగీకారం అంటారు. కానీ, జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు. ఒక పాలసీని అమలు చేయడానికి ముందు.. దానికి సమ్మతిని ఇవ్వడానికి ముందు చేసే ఆలోచనలు, కసరత్తుకు నిదర్శనమే మౌనం అంటారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. 1988లో అమెరికన్ ఆలోచనాపరుడు నోమ్ చోమ్స్కీతోపాటు.. ఆర్థికవేత్త ఎడ్వర్డ్.ఎస్.హెర్మాన్ తమ పుస్తకం ‘ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ద మాస్ మీడియా’లో ఇదే అంశాన్ని నొక్కి వక్కాణించారు. ఆంక్షలు, లేదా యుద్ధాలకు ముందు.. నిరసనను వ్యక్తం చేయకుండా.. విధానాలను సాధారణీకరించేందుకు మౌనం దాల్చడం ఓ రాజనీతి అంటారు. అమెరికా సుంకాల విషయంలో భారత్ పాటించిన మౌనం దీనికి చక్కటి ఉదాహరణ..!👉కన్జూమర్ సైకాలజీ అంటే ఇదే..కొనుగోలుదారులు ఎవరైనా తమకు కావాల్సిన వస్తువు ఎక్కడ చౌకగా దొరుకుతుందో అక్కడే కొంటారు. అది కన్జూమర్ సైకాలజీ. ఈ బేసిక్ నాలెడ్జ్ని కూడా మరిచిపోయిన ట్రంప్ చమురు విషయలో భారత్పై ఒత్తడి తేవాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇక రాజనీతి విషయానికి వస్తే.. అగ్రదేశాలు అంతగా జియోపాలిటిక్స్ను వంటబట్టించుకోని రోజుల్లోనే మనదేశంలో ద్వాపరయుగంలో విదురనీతి.. ఆధునిక యుగంలో చాణక్యనీతి అమల్లో ఉన్నాయి. భారత్కు రష్యా ముందు నుంచి మిత్ర దేశం. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఆంక్షల ఛట్రంలో రష్యా కూరుకుపోయింది.👉భారత్ను దెబ్బతీయాలనుకున్నారు కానీ...ఈ క్రమంలో చౌకగా చమురు అమ్మేందుకు రష్యా సిద్ధమైనా.. అభివృద్ధి చెందుతున్న దేశాలేవీ కొనేందుకు ముందుకు రాలేదు. ఐరోపా దేశాలే రష్యా చమురు కొంటున్న తరుణంలో భారత్ కూడా రష్యాకు అతిపెద్ద వినియోగదారుగా మారింది. ఈ చర్య అటు రష్యాకు, ఇటు భారత్కు లబ్ధి చేకూర్చింది. దీన్ని జీర్ణించుకోలేని ట్రంప్.. సుంకాలతో భారత్ను దెబ్బతీయాలనుకున్నారు. భారత్ తన ప్లాన్-బీని అమలు చేసింది.👉ఊహించని పరిణామం..అంతే.. కొత్త వినియోగదారులను సొంతం చేసుకుంది. ఐరోపా సమాఖ్యతో 19ఏళ్లుగా కలగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకు ముందే.. చైనాకు దగ్గరైంది. ఉప్పు-నిప్పుగా ఉండే తాలిబాన్లను అక్కున చేర్చుకుంది. ఇరాన్తోనూ వాణిజ్య ఒప్పందాలకు సిద్ధమైంది. జీయోపాలిటిక్స్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఊహించని ఈ పరిణామం అమెరికా మార్కెట్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో.. ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేయాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.👉భారత్ స్వరం మార్చింది..దౌత్యం విషయంలో భారత వ్యూహాలు మునుపటిలా లేవు. గడిచిన దశాబ్దన్నర కాలంగా వ్యూహప్రతివ్యూహాలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంతా భగవతేచ్ఛ.. అని భావించే భారత్.. ఇప్పుడు స్వరం మార్చింది. ప్రేమిస్తే.. ప్రాణమిస్తాం.. వంచిస్తే.. కాలరాస్తాం.. ఎక్కడా తగ్గేదే లే.. అని చాటిచెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ఈ విషయం స్పష్టమైంది. ఏరంగంలోనైనా శత్రువు ఢీ-అంటే ఢీకొడతామని తేల్చిచెప్పింది.👉ఇంకా చెప్పాలంటే..ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే.. 2019లో ఆంక్షల పేరుతో ఇరాన్, వెనిజెవెలా, భారత్ నుంచి చమురు దిగుమతులను నిలివేశారు. ఆ సమయంలో ఐక్య రాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీతో రాయబారాలు నెరిపారు. అప్పటి నుంచే.. భారత్-అమెరికా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు భారత్ ఆత్మనిర్భరతతో ఉందనే విషయాన్ని అమెరికాకు చాటి చెప్పింది. అమెరికా సాధారణంగా తన దారికి తెచ్చుకోవాలనుకునే దేశాలపై ప్రయోగించే సామ, దాన, బేధ, దండోపాయాలకు తాము అతీతమని భారత్ నిరూపించింది. ట్రంప్ మాదిరిగా.. దావోస్లాంటి వేదికను బెదిరింపులకు వినియోగించుకోకుండా.. అసందర్భ ప్రేలాపనలకు పోకుండా.. మౌనం వహించింది. విజయం సాధించింది. -
బంగారం... భద్రతా? భారమా?
భారతీయ సామాజిక, ఆర్థిక వ్యవస్థల్లో బంగారం కేవలం విలు వైన లోహం మాత్రమే కాదు; అదొక సెంటిమెంట్, సామాజిక హోదా. ప్రస్తుతం మధ్యతరగతి మనఃస్థితికి, జాతీయ ఆర్థిక నిర్మా ణానికి మధ్య ఇది ఒక విరోధాభాసగా మారింది. ఒకవైపు బంగారం కొనాలనే సామాజిక అంచనాలు, మరోవైపు కొనలేని ఆర్థిక వాస్త వాల మధ్య సామాన్య కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. బంగారం ధరల పెరుగుదల ప్రభావం ప్రధానంగా ఆడపిల్లల తల్లిదండ్రులపై పడుతోంది. సమాజంలో వేళ్లూనుకున్న కట్నకాను కల సంస్కృతి, పరువు–ప్రతిష్ఠల పేరిట సాగే ఆడంబరాలు ఒక సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. కుమార్తె వివాహం కోసం జీవితకాలపు పొదుపును ఖర్చు చేయడమే కాకుండా, బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి చివరకు ‘అప్పుల చక్రం’లో చిక్కుకుంటున్నారు. సంపన్న వర్గాలకు బంగారం ఒక ‘హెడ్జింగ్’ సాధనం. మార్కెట్ అస్థిరత ఉన్న ప్పుడు అది భద్రమైన పెట్టుబడిగా మారి వారి సంపదను పెంచుతుంది. అయితే ఇదే క్రమంలో సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక కోణంలో చూస్తే, ప్రపంచంలోనే అగ్రగామి బంగారం దిగుమతి దేశంగా భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇది చెల్లింపుల సమతుల్యత లోటును పెంచి, రూపాయి విలువను బలహీనపరుస్తోంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు పెరిగి ద్రవ్యోల్బణం మళ్లీ తీవ్రమవుతుంది.కీలకమైన అంశం ఏమిటంటే, బంగారంపై పెట్టే అధిక పెట్టుబడి వల్ల దేశంలో ఉత్పాదక మూలధనం క్షీణిస్తోంది. పరిశ్రమలు, మౌలిక సదుపా యాలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడిగా వెళ్లాల్సిన నగదు బంగారంరూపంలో అచేతనంగా ఉండిపోతోంది. ఇది దేశ ఆర్థికవృద్ధి రేటును మందగింపజేస్తూ ‘అవుట్పుట్ గ్యాప్’ను సృష్టిస్తోంది. ప్రభుత్వం సావరీన్ గోల్డ్ బాండ్లు, జీఎస్టీ వంటి చర్యల ద్వారా భౌతిక బంగారం వైపు ప్రజలు వెళ్లకుండా చూస్తున్నా, సామాజిక దృక్పథం మారనంతవరకు ఆశించిన ఫలితం ఉండదు.బంగారాన్ని గౌరవానికి చిహ్నంగా కాకుండా, ఒక సాధారణ పెట్టుబడిగా మాత్రమే చూడాలి. ప్రజలు మ్యూచువల్ ఫండ్లు, పెన్షన్ పథకాల వంటి ప్రత్యా మ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. పాఠశాల స్థాయి నుంచే ఆర్థిక విద్యనుఅందించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలి. బంగారం ధరల పెరుగు దల కేవలం మార్కెట్ పరిణామం కాదు; అదొక వ్యవస్థాగత హెచ్చరిక. మానవ మూలధనం, ఆర్థిక అవగాహన, సామాజిక సంస్కరణలే నిజమైన సంపద అని గుర్తించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. – ఆత్మకూరి ప్రశాంత్ చారి ‘ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫ్యాకల్టీ -
భారత్ అమెరికా మధ్య 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ డీల్స్'
-
యువ భారత్ను ఆపతరమా!
హరారే: అండర్–19 ప్రపంచకప్లో అజేయంగా దూసుకెళ్తున్న యువ భారత్ ఇదే జోరుతో ఫైనల్ చేరాలని ఆశిస్తోంది. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో భారత జట్టు అఫ్గానిస్తాన్తో తలపడుతుంది. ఫామ్ పరంగా చూసినా, మొత్తం టీమ్ ప్రదర్శన చూసినా ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత్ను అడ్డుకోవడం అఫ్గాన్కు సాధ్యమయ్యే పనైతే కాదు. అండర్–19 ప్రపంచకప్ల చరిత్రలోనే ఐదు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిరూపించుకున్న యువ భారత్... 2000, 2008, 2012, 2018, 2022 సరసన ఈ ఏడాదిని కూడా చేర్చాలని ఆరాటపడుతోంది. మన కుర్రాళ్లు ఆడుతున్న తీరు, గెలుస్తున్న వైనం చూస్తుంటే ఇదేమంత కష్టం కానేకాదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించింది. ఇలాంటి దుర్బేధ్యమైన భారత సేనను ఎదుర్కోవాలంటే అఫ్గానిస్తాన్ పెద్ద కసరత్తే చేయాలి. ఇక గెలవాలంటే మాత్రం ఓ సంచలనం నమోదవ్వాలి. అయితే ప్రత్యేకించి ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్ కూడా బాగా ఆడింది. భారత కుర్రాళ్లు ఐదు గెలిస్తే... అఫ్గాన్ కేవలం ఒకటి ఓడి, నాలుగు విజయాలతో సత్తా చాటుకుంది. ఇలాంటి మేటి ప్రదర్శన కనబరిచిన అఫ్గాన్ను తక్కువ అంచనా వేయకూడదని ఆయుశ్ బృందానికి బాగా తెలుసు. ఆదమరుపు లేకుండా ఎప్పటిలాగే మరో మ్యాచ్ విజయం కోసం చెమటోడ్చాలని యువ బృందం పట్టుదలతో ఉంది. టీనేజ్ సంచలనం, ఓపెనింగ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సహా టాపార్డర్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నారు. ఆల్రౌండర్ విహాన్ మల్హోత్రా బ్యాట్తో, కెప్టెన్ ఆయుశ్ మాత్రే బంతితో ప్రత్యర్థి జట్ల పని పడుతున్నారు. వీరితో పాటు పేసర్లు హేనిల్ పటేల్, అంబరీశ్ నిప్పులు చెరుగుతుండటం బౌలింగ్ దళానికి వెన్నుదన్నుగా ఉంది. అఫ్గానిస్తాన్ కూడా మ్యాచ్మ్యాచ్కు రాటుదేలుతున్నప్పటికీ భారత్లాంటి ఆల్రౌండ్ సామర్థ్యమున్న జట్టును ఓడించాలంటే సర్వశక్తులు ఒడ్డినా సరిపోదేమో!ఆ్రస్టేలియాపై గెలిచి ఫైనల్లో ఇంగ్లండ్మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. కెప్టెన్ థామస్ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ ఒలివర్ పీక్ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో శుక్రవారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ తలపడుతుంది. -
Operation CyStrike: నకిలీ వీసా రాకెట్.. గుట్టురట్టు చేసిన సీబీఐ
కువైట్ నకిలీ ఈ-వీసాలను సృష్లించి.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నెట్వర్క్ను భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఛేదించింది. అంతర్జాతీయ సైబర్ నేరాల అదుపులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సై-స్ట్రైక్ (Operation CyStrike)తో ముఠా ఆటకట్టించారు. జనవరి 30న ఢిల్లీతో పాటు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కీలక సైబర్ నేరగాడిని అరెస్ట్ చేశారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్లు, నకిలీ వీసాలు, నకిలీ నియామక పత్రాలతో పాటు రూ. 60,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు కువైట్ అధికారిక ఈ-వీసా వెబ్సైట్లను పోలిన నకిలీ డిజిటల్ ప్లాట్ఫారమ్లను సృష్టించారు. తద్వారా నిరుద్యోగులను ఆకర్షించి.. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా కేవలం భారతీయులనే కాకుండా అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మరియు సింగపూర్ వంటి దేశాల్లోని వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంది. గుర్తింపు దొరక్కుండా ఉండేందుకు వీరు నకిలీ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అధికారులు eservicemoi-kw.com అనే వెబ్సైట్ను ప్రధాన నకిలీ పోర్టల్గా గుర్తించారు.కువైట్ వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని.. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఎలక్ట్రానిక్ వీసా దరఖాస్తుల కోసం www.indianvisaonline.gov.in మాత్రమే అధికారిక పోర్టల్ అని స్పష్టం చేసింది. అనధికారిక వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. -
గడ్డంలో ‘ఏడు’ గింజల రహస్యం.. ఇది చిన్నకథ కాదు..
పొద్దున్నే లేవగానే.. ఓ కప్పు కాఫీ తాగడం దాదాపుగా అందరి దినచర్యలో భాగమే..! భారత్లో కాఫీ బిజినెస్ టర్నోవర్ 5 బిలియన్ అమెరికా డాలర్ల వరకు ఉంటుందని అంచనా..! అయితే.. ఆ కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్నకు ఎవరైనా తమిళనాడులోని నీలగిరి తోటలు లేదా కేరళలోని కాఫీ ఎస్టేట్లు లేదా కర్ణాటకలోని చిక్కమగళూరు తోటల పేరు చెప్పేస్తారు..! ఇప్పటికి అది నిజమే అయినా.. నిజానికి కాఫీ పుట్టింది భారత్లో కాదు. డచ్, బ్రిటిష్ కాలంలో కాఫీ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ.. అసలు భారత్కు కాఫీ గింజలను తెచ్చిన ఓ సూఫీ సాధువు. ఆయన కూడా భారత్లో కాఫీ పరిశ్రమ బిలియన్ల డార్లకు చేరుతుందని అప్పట్లో ఊహించి ఉండరు. ఆ కథేంటో తెలుసుకోవాలని ఉందా?? అయితే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి..! భారత్లో కాఫీ కథ సూఫీ సాధువు అయిన బాబా బుడాన్తో మొదలవుతుంది. 1600లలో ఆయన హజ్ యాత్రకు వెళ్లారు. మక్కా నుంచి తిరిగి వస్తున్న సమయంలో యెమెన్లోని అల్-మక్కా నౌకాశ్రయంలో కాఫీ రుచి చూశారు. అంతే.. ఏడు కాఫీ గింజలను తన గడ్డంలో దాచి, తీసుకువచ్చారు. కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రాంతంలో నిత్యం చలి, తేమతో ఉండే చంద్రగిరి కొండల్లో వాటిని నాటారు. అంతే.. ఆ ఏడు బీజాలే ‘ఇంతింతై.. వటుడింతై..’ అన్నట్లుగా భారతదేశమంతటా విస్తరించాయి. అప్పటి నుంచి చంద్రగిరి కొండల్లోని బాబా బుడాన్ కాఫీ మొక్కలు నాటిన కొండకు ఆయన పేరే పెట్టారు. ఆ కొండను బాబా బుడాన్ గిరి అని పిలుస్తారు. దత్తాత్రేయ పీఠానికి సమీపంలో ఈ కొండ ఉంది. ఆనవాయితీ ప్రకారం ఇప్పటికీ ఇక్కడి కాఫీ రైతులు కొత్త పంట రాగానే.. బాబా బుడాన్ దర్గా వద్ద కాఫీ గింజలను సమర్పిస్తారు. అలా.. భారత్లో కాఫీకి జన్మస్థలంగా చిక్కమగళూరును పిలుస్తారు. సక్కరపట్నం రాజు రుక్మంగడ తన చిన్నకుమార్తెకు ఈ గిరులను బహుమతిగా ఇచ్చారు. చిన్న కూతురు అంటే.. కన్నడంలో చిక్క మగళు అని అర్థం. అందుకే.. ఈ ప్రాంతానికి చిక్కమగళూరు అని పేరు వచ్చింది. ‘కర్ణాటక కాఫీ ల్యాండ్కు స్వాగతం’ అనే స్వాగత తోరణం ఈ జిల్లా ప్రవేశానికి ముందు కనిపిస్తుంది.చిక్కమగళూరు పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఇక్కడి ముల్లయనగిరి అత్యంత ఎత్తులో ఉంటుంది. రోడ్ల వెంబడి సిల్వర్ ఓక్, రోజ్వుడ్, ప్లమ్, అత్తిచెట్లు కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లోని కాఫీ తోటల్లో అరేబికా, రోబస్టా వంటి రకాలను పండిస్తారు. ఫిల్టర్ కాఫీకి అరేబికా, ఇన్స్టంట్ కాఫీకి రోబస్టాను వాడుతారు. అరేబికా కంటే రోబస్టా కొంత చవక. రోబస్టాను లోయల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు. అరేబికా అలా కాదు.. ఏటవాలు ప్రాంతాల్లోనే సవ్యంగా పండుతుంది. వీటితోపాటు.. ఇండోనేషియా, ఫిలిప్పైన్స్లో కనిపించే లిబ్రికా, ఆగ్నేయాసియాలోని ఎక్సెల్సా వేరియంట్లు కూడా ఇక్కడ సాగవుతాయి. అసలు ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే వచ్చే కాఫీ పరిమళంతో.. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగాలని ఎవరికైనా జిహ్వచాపల్యం కలగకమానదనడంలో అతిశయోక్తిలేదు. ఘాట్ రోడ్లలో.. ఇరువైపులా కాఫీ షాపులుంటాయి. అలా చిక్కమగళూరులో 1600లలో ప్రవేశించిన కాఫీ.. క్రమంగా కర్ణాటకలోని ఇతర ప్రాంతాలు, తమిళనాడులోని నీలగిరి, కేరళలోని వయనాడ్కు వ్యాప్తి చెందాయి. దక్షిణ కర్ణాటకలోని కొడుగులో 1856లో ప్రవేశించిన కాఫీ.. ఇప్పుడు 11,331 హెక్టార్లలో సాగవుతోంది. బ్రిటిషర్ల కాలంలో మొత్తం 200 కాఫీతోటలు ఉండేవి. 1825లో కేరళలోని వయనాడ్లో కాఫీ పంటలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ముర్డోక్ బ్రౌన్ పండించిన కాఫీ రకాన్ని ‘అంజరకాండి బ్రౌన్’ అని పిలిచేవారు. 1843లో కాక్బర్న్ షెవ్రోలెట్ ఓ కాఫీ తోటను ప్రారంభించారు. 1860లలో ఆర్నాల్డ్ నెల్లియంపతిలో పర్డేహ్యారీ ఎస్టేట్ మొదలైంది. 1860 నాటికి దక్షిణ భారతదేశంలో కాఫీ సాగు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 1860లలో అరేబికా ప్రధాన సాగుగా ఉండేది. 1900 సంవత్సరం నుంచి ఆఫ్రికా నుంచి వచ్చిన రోబస్టా ఊపు ప్రారంభమైంది. ఆ తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్కు కూడా కాఫీతోటలు విస్తరించాయి. నిజానికి అరేబికా పంటకు కాండంతొలిచే పురుగు బెడద ఉండడంతో.. రైతులు అప్పట్లో రోబస్టా వైపు మొగ్గుచూపారు. అప్పట్లో బ్రిటిషనర్లు ఇక్కడ పండే కాఫీ గింజలను ఐరోపా దేశాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పటికీ దేశీయ అవసరాలను తీర్చడంతోపాటు.. కాఫీ గింజల ఎగుమతులు కొనసాగుతున్నాయి. భారతీయ కాఫీలో 70శాతం కర్ణాటకలోని కొడుగు, చిక్కమగళూరు, హసన్లలో ఉత్పత్తి అవుతుంది. ఏటా 2 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతుండగా.. అందులో సింహభాగం.. అంటే.. లక్షా ముప్ఫై వేల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతుంది. అలా మన దేశంలో కాఫీ బిజనెస్ 5 బిలియన్ డాలర్ల దాకా చేరుకుంది. కాఫీడే, స్టార్ బక్స్, మోచా, బారిస్టా, కోస్టా, థర్డ్ వేవ్ కాఫీ వంటి డిజైనర్ కాఫీ స్టూడియోలు సైతం లాభాలను గడించాయి. ఈ కథనం మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. -
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు
ఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్పై కేంద్రం ప్రకటన చేసింది. అమెరికాతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ట్రేడ్డీల్తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం.ఆక్వా,టెక్స్టైల్స్ ఎగుమితిలో మనకు ఇబ్బందులున్నాయి. వాణిజ్యం ఒప్పందం విషయాన్ని పార్లమెంట్లో చెప్పాలని చూశాం. ఈలోపే ట్రేడ్ డీల్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషం చిమ్మారు.వాణిజ్య ఒప్పందంతో ఏ వర్గానికి నష్టం జరగదు. బలహీనవర్గాల ప్రజలకు మేలు జరగడం రాహుల్కు ఇష్టం లేదు. ట్రేడ్ డీల్తో లక్షలమంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని స్పష్టం చేశారు. -
గ్రేట్ ట్రేడ్ డీల్.. అయినా ష్ గప్చుప్
అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ దాదాపుగా కుదిరినట్లే!. ఇరు దేశాల మధ్య ర్చలు ఓ కొలిక్కి వచ్చాయని.. తన మిత్రుడు మోదీతో ఫోన్లో సంప్రదింపులు జరిపానని.. అన్నింటికి ఆయన ఒప్పుకున్నారని.. అందుకే భారత్పై సుంకాలను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటు ఈ డీల్ను గ్రేట్గా అభివర్ణిస్తూ భారత ప్రజల తరఫున ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు కూడా. అయితే.. ఇక్కడే ఓ మెలిక ఉంది. భారత్ నుంచి ప్రస్తుతం అమెరికా 50 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇందులో 25 శాతం ప్రతీకార సుంకాలు కాగా.. మరో 25 శాతం పెనాలిటీ టారిఫ్ ఉంది. టారిఫ్లు 18 శాతానికి తగ్గిస్తున్నామని.. వీటిని సున్నాకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తామని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలో రష్యా నుంచి పూర్తిగా చమురు కొనుగోలును ఆపేందుకు భారత్ అంగీకరించిందని చెప్పారు. అయితే సుంకాల తగ్గింపుపై థ్యాంక్స్ మెసేజ్లో మోదీ ఈ అంశాన్ని ఏమాత్రం ప్రస్తావించలేదు. అలాగే అమెరికా ఉత్పత్తులను భారీ మొత్తంలో భారత్ కొనుగోలు చేస్తుందన్న ట్రంప్ స్టేట్మెంట్పైనా స్పందించలేదు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ ఇలా ప్రకటనలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇలా చార్లు ఆయన బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనతో ఆయా సందర్భాల్లో భారత ప్రభుత్వం బహిరంగంగా విబేధించింది. అలాంటిదేం ఉండబోదని.. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గమని.. జాతి ప్రయోజనాల మేరకు తమ నిర్ణయం ఉంటుందని ప్రకటించింది. అయితే ఈసారి మాత్రం ఇంక ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనిని వ్యూహాత్మక మౌనమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా, రష్యాలతో సంబంధాల నేపథ్యంలోనే ఇలా వ్యవహరిస్తుందని అంచనా వేస్తున్నారు. రష్యా ఆయిల్ కొనుగోలు ఆపివేతపై టారిఫ్ల తగ్గింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన ఇస్తుందో చూడాలి. అలాగే టారిఫ్లు 50 నుంచి 18కి తగ్గాయా? లేదంటే 25 శాతం నుంచే 18కి చేరాయా? అనేదానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అటు.. రష్యా సైతం ట్రంప్ తాజా ప్రకటనపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. గతంలో మాత్రం.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకంగా చూస్తూ, తమ చమురు మార్కెట్పై ప్రభావం ఉంటుందని సూచించింది. అలాగే భారత్ తమకు మిత్ర దేశమని.. ఇతర దేశాల ఒత్తిళ్లకు తలొగ్గే అవకాశమే ఉండబోదని ధీమా వ్యక్తం చేసింది. ఒకవేళ భారత్ రష్యా చమురు దిగుమతులను ఆపితే, రష్యా ఆసియా మార్కెట్లో తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా చమురు ఆగిందా?ట్రంప్ చెబుతున్నట్లు.. భారత్ రష్యా చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోలేదు. 2024లో రష్యా నుంచి భారత్ సుమారు 52.7 బిలియన్ డాలర్ల విలువైన చమురు దిగుమతి చేసింది. 2025 చివరలో ఈ తగ్గుదల కనిపించినా.. 2026 జనవరిలో కూడా మూడు కంపెనీలు (IOCL, BPCL, Nayara Energy) రష్యా చమురు కొనుగోలు కొనసాగించాయి. ఇక..ఒకప్పుడు రష్యా నుంచి భారత్ కేవలం 2 శాతం మాత్రమే చమురు దిగుమతి చేసుకునేది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా చమురు కొనుగోలు పెంచింది. ఎందుకంటే ఆ సమయంలో డిస్కౌంట్ ధరలు లభించాయి కాబట్టి. అలా.. 2024లో సుమారు US$52.7 బిలియన్ విలువైన చమురును దిగుమతి చేసుకుంది. 2025లో.. అమెరికా సుంకాల-ఆంక్షల బెదిరింపులు.. ట్రంప్ ఒత్తిడి, రష్యా నుంచి వచ్చే డిస్కౌంట్ తగ్గిపోవడం, మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరా పెరగడం.. తదితర కారణాలతో చమురు దిగుమతులు తగ్గినట్లు అనిపించాయి. డిసెంబర్ 2025లో భారత్ మొత్తం చమురు దిగుమతులు 21.6 మిలియన్ టన్నులకు చేరాయి, అయితే.. గత 9 నెలల్లో ఇదే అత్యధికం. ఇక.. జనవరి 2026లో రష్యా చమురు దిగుమతులు నవంబర్తో పోలిస్తే 35% తగ్గాయి. రిలయన్స్ వంటి పెద్ద ప్రైవేట్ కంపెనీలు రష్యా చమురు కొనుగోలు తగ్గించాయి, కానీ IOCL, BPCL, Nayara Energy మాత్రం కొనుగోలు కొనసాస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.సూటిగా మూడు పాయింట్లలో.. భారత్: ట్రంప్ సుంకాల తగ్గింపును స్వాగతించింది. కానీ రష్యా చమురు అంశంపై మౌనం పాటిస్తోందిఅమెరికా: భారత్ రష్యా చమురు ఆపివేస్తుందని ధృవీకరించిందిరష్యా: ఆసియా మార్కెట్ దెబ్బ తినే అవకాశంతో.. ట్రంప్ ప్రకటనను ఖండించే చాన్స్ -
‘సింధు’ వివాదం: ‘హేగ్’ఆదేశాలపై భారత్ ఆగ్రహం
హేగ్: సింధు జలాల ఒప్పందం (ఐడబ్యూటీ) విషయంలో హేగ్(నెదర్లాండ్స్)లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (CoA) జారీ చేసిన తాజా ఆదేశాలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. భారత్లోని జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన ‘పాండేజ్ లాగ్బుక్’లను సమర్పించాలని కోర్టు కోరగా, ఆ ఆదేశాలను పాటించే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది.అసలు ఈ మధ్యవర్తిత్వ కోర్టు ఏర్పాటునే భారత్ అక్రమమని, దానికి ఎటువంటి చట్టబద్ధత లేదని కొట్టిపారేసింది. ఈ అంశంపై ఫిబ్రవరి 2, 3 తేదీల్లో హేగ్లోని పీస్ ప్యాలెస్లో విచారణ జరుగుతున్నప్పటికీ, భారత్ మాత్రం వీటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. 2025 ఏప్రిల్ 23న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుత ప్రతిష్టంభన ఏర్పడింది. పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పౌరులను పొట్టనబెట్టుకున్న మర్నాడే భారత్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్కు నీటి సహకారం అందించడం సాధ్యం కాదని భారత్ తేల్చిచెప్పింది. ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టినందున, అంతర్జాతీయ వేదికలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమకు లేదని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడిన పాకిస్తాన్ వ్యవసాయ రంగం ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. పాక్లోని తర్బేలా, మంగ్లా వంటి కీలక జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలను వాడుకుంటోందని భారత్ ఆరోపించింది.భారత్ ఈ విచారణలో పాల్గొనకపోయినప్పటికీ, హేగ్ కోర్టు మాత్రం పాకిస్తాన్ విన్నపం మేరకు విచారణను కొనసాగిస్తోంది. ఒకవేళ భారత్ సమాచారం ఇవ్వకపోతే ప్రతికూల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. అయితే భూతలాన ఉన్న యథార్థ పరిస్థితులను విస్మరించి, ఒప్పందాలు సాగవని భారత్ గట్టిగా వాదిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు కేవలం నీటి పంపకాలకే పరిమితం కాకుండా, భారత్-పాక్ మధ్య ఒక వ్యూహాత్మక దౌత్య యుద్ధంగా మారింది. భారత భాగస్వామ్యం లేని విచారణ ఏకపక్షమే అవుతుందని, అది ఏ రకంగానూ ఒప్పందాన్ని శాసించలేదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘బడ్జెట్’తో బుద్ధి చెప్పిన భారత్.. తేరుకోని బంగ్లాదేశ్ -
భారత్లో మళ్లీ ఫార్ములావన్?
సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఢిల్లీలోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ‘రయ్... రయ్’ మోత మోగింది. రేస్ ప్రియుల ఫేవరెట్ ‘ఫార్ములావన్ గ్రాండ్ప్రి’ జరిగింది. 2011లో మొదలైన ఈ ఎఫ్1 రేసు మూడేళ్ల పాటు జరిగింది. 2013 రేసు అనంతరం మనకు ఈ ‘ఫార్ములా’ దూరమైంది! కారణాలు ఏవైనా మళ్లీ ప్రతిష్టాత్మక ఫార్ములావన్ ఆతిథ్య భాగ్యం భారత్కు దక్కలేదు. ఇప్పుడు పుష్కరకాలం తర్వాత ‘రయ్ రయ్’ మోత మోగించాలని కేంద్ర క్రీడాశాఖ చొరవ చూపిస్తోంది.గ్రేటర్ నోయిడాలోని బుద్ధ సర్క్యూట్ను ఇటీవలే క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సందర్శించారు. అంతేకాదు, సంబంధిత వర్గాలతోనూ చర్చించినట్లు క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. బుద్ధ సర్క్యూట్ యజమాని జేపీ గ్రూప్. ఈ కార్పొరేట్ సంస్థ దివాళా తీసింది. ఇప్పుడు సర్క్యూట్ బాధ్యతల్ని ‘యమునా ఎక్స్ప్రెస్వే ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ అథారిటీ’ చూస్తోంది.ఈ అథారిటీ వర్గాలతోనే క్రీడల మంత్రి భేటీ అయినట్లు తెలిసింది. అప్పుల్లో కూరుకుపోయిన జేపీ గ్రూప్ నుంచి బుద్ధ సర్క్యూట్ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ప్రాథమిక దశలో చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ యాజమాన్య బదిలీ ప్రక్రియ పూర్తయితే తిరిగి భారత్లో ‘ఫార్ములావన్’ రేసుకు చేపట్టాల్సిన కార్యాచరణ మొత్తం చకచకా జరిగిపోతుందని భావిస్తున్నారు.అయితే యాజమాన్య బదిలీ జరగకపోయినా... కనీసం రెండు, మూడేళ్లు ఈ ట్రాక్ బాధ్యతల్ని క్రీడా సమాఖ్యకు అప్పగించాలని మంత్రి మాండవీయ సంబంధిత వర్గాలను కోరినట్లు తెలిసింది. పన్ను, అధికారిక సమస్యల్ని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఫార్ములావన్ను తిరిగి భారత్ ట్రాక్లో నిర్వహించే ప్రణాళికతో క్రీడాశాఖ ఉంది. భారత మోటార్స్పోర్ట్స్ సమాఖ్య (ఎఫ్ఎంఎస్సీఐ) మాజీ అధ్యక్షుడు విక్కీ చందోక్ తాజా ప్రభుత్వ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. తిరిగి ఎఫ్1 భారత్కు తిరిగొస్తే అంతకుమించిన ఆనందం మరొటి ఉండదని అన్నారు. ఆయన కృషివల్లే 2011లో ఫార్ములావన్ జరిగింది. -
ఇజ్రాయెల్లో నినదించిన ప్రధాని మోదీ పిలుపు
జెరూసలేం: పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క) కార్యక్రమం ఇజ్రాయెల్లోనూ నినదించింది. ఇక్కడి మోషావ్ నెవాతిమ్ ప్రాంతంలో దాదాపు 300 మొక్కలను నాటి ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. యూదుల పర్యావరణ దినోత్సవమైన ‘తు బిష్వత్’ పండుగను పురస్కరించుకుని ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.భారత రాయబార కార్యాలయం, ‘కెరెన్ కైమెట్ లెయిజ్రాయెల్’, స్థానిక సంస్థల సహకారంతో ఈ ఈవెంట్ను నిర్వహించారు. వందలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం.. పర్యావరణంపై భారత్, ఇజ్రాయెల్ దేశాలకున్న నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్ పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ రామి రోజెన్, ఇజ్రాయెల్లో భారత రాయబారి జెపి సింగ్, బిన్నీ షిమోన్ ప్రాంతీయ మండలి అధిపతి నిర్ జమీర్ పాల్గొన్నారు. From Roots to Relationships 🌱Jointly celebrated the Jewish festival of ‘Tu Bishvat’ (New Year for Trees) and Indian Prime Minister Shri. Narendra Modi’s initiative of ‘Ek Ped Maa Ke Naam’ at Moshav Nevatim today.‘Ek Ped Maa ke Naam’ at Moshav Nevatim 🇮🇱 brought children &… pic.twitter.com/JI47t4hi71— India in Israel (@indemtel) February 2, 2026ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి, ప్రకృతి సంరక్షణలో భారత్-ఇజ్రాయెల్ దేశాలు ఒకే బాటలో పయనిస్తున్నాయని కొనియాడారు. కేవలం సాంకేతిక రంగంలోనే కాకుండా, భూగోళాన్ని రక్షించే బాధ్యతలో కూడా ఇరు దేశాలు భాగస్వాములు కావడం గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు. భారత రాయబారి జెపి సింగ్ మాట్లాడుతూ ‘తు బిష్వత్’, ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. ఈ రెండూ ప్రకృతితో సమాజాన్ని ఏకంచేసే గొప్ప సంప్రదాయాలు’ అని అన్నారు. నేడు నాటిన ఈ మొక్కలు రాబోయే తరాలకు భారత్-ఇజ్రాయెల్ స్నేహానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాతావరణ మార్పులు, పర్యావరణ రంగాలలో సహకారం అందుతోందని, ప్రకృతిని కాపాడుకోవడం అంటే జీవరాశిని కాపాడుకోవడమేనని ఇజ్రాయెల్ అధికారులు అన్నారు. కాగా ఈ కార్యక్రమం జరిగిన ‘మోషావ్ నెవాతిమ్’ ప్రాంతానికి ఒక ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఇది కేరళలోని కొచ్చిన్ నుండి వలస వెళ్లిన భారతీయ యూదులచే స్థాపితమయ్యింది. ఇక్కడ కొచ్చిన్ శైలిలో నిర్మించిన ప్రార్థనా మందిరం (సినగోగ్), భారతీయ యూదుల వారసత్వ కేంద్రం నేటికీ భారతీయ సంస్కృతిని చాటిచెబుతున్నాయి. ఇది కూడా చదవండి: ‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు -
‘బడ్జెట్’తో బుద్ధి చెప్పిన భారత్.. తేరుకోని బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్లో పొరుగు దేశం బంగ్లాదేశ్కు ఇచ్చే అభివృద్ధి సహాయాన్ని భారత్ భారీగా తగ్గించింది. గత ఏడాది బడ్జెట్లో బంగ్లాదేశ్కు రూ. 120 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని సగానికి అంటే రూ. 60 కోట్లకు కుదించింది. దీని వెనుకగల కారణం ఏమిటి? మిగిలిన పొరుగు దేశాల విషయంలో ఉదారత చూపిన భారత్ ‘బంగ్లా’ విషయంలో ఎందుకిలా చేసింది?భూటాన్కు అత్యధిక సాయంగత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య సఖ్యత కొరవడింది. ఢాకాలో చోటుచేసుకున్న రాజకీయ తిరుగుబాటు, ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం బడ్ఢెట్ కేటాయింపుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా పొరుగు దేశాలైన భూటాన్.. భారత్ నుంచి రూ.2,288 కోట్లతో అత్యధికంగా లబ్ధి పొందుతుండగా, నేపాల్కు రూ. 800 కోట్లు, మాల్దీవులు, మారిషస్లకు చెరో రూ. 550 కోట్లు కేటాయించారు.క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాలు2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుండి భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్తో సన్నిహితంగా ఉండటం గమనార్హం. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఇప్పటికే బంగ్లాదేశీయులకు టూరిస్ట్ వీసాలను పరిమితం చేయడమే కాకుండా, ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తమ దౌత్యవేత్తల కుటుంబాలను వెనక్కి పిలిపించింది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయి, ఆ దేశంతో సంబంధాలను బలపరుచుకోవడం భారత్కు తీవ్ర అసంతృప్తి కలిగించింది.క్రీడారంగానికీ పాకిన వైరంఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా క్రీడారంగానికి కూడా పాకాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుండి బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలగించడంతో మొదలైన వివాదం మరింత ముదిరింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో తమ గ్రూప్ మ్యాచ్లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో, బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుండి తప్పుకుంది. మరోవైపు, పాకిస్థాన్ జట్టు ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతించినప్పటికీ, ఆతిథ్య దేశమైన భారత్తో తలపడకూడదని ఆంక్షలు విధించింది. దీనివల్ల ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ డైలమాలో పడింది.తాలిబాన్ ప్రభుత్వానికి సహకారం పెంపుఒకవైపు బంగ్లాదేశ్కు నిధులు తగ్గించినా, మరోవైపు ఆఫ్ఘనిస్థాన్తో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తాలిబాన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరిపిన భారత్, ఆ దేశానికి ఇచ్చే సాయాన్ని రూ. 150 కోట్లకు పెంచింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ బడ్జెట్లో మొత్తం రూ. 22,118 కోట్లు కేటాయించారు. మైనారిటీల రక్షణ విషయంలో బంగ్లాదేశ్ను నిలదీస్తూనే, భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా తన ‘నైబర్హుడ్ ఫస్ట్’ విధానాన్ని భారత్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శ్రీలంకకు రూ. 400 కోట్లు, మయన్మార్కు రూ. 300 కోట్లు కేటాయించి , ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేసింది.ఇది కూడా చదవండి: ‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు -
ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం అవసరం
భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్పై విధించిన సుంకాలను తగ్గించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని అన్నారాయన. అమెరికా వాణిజ్య విషయంలో భారత్ తీరు సరిగా లేదంటూ.. గతేడాది ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని 18 శాతానికి తగ్గుతాయని ట్రంప్ తన సోషల్ ట్రూత్లో ప్రకటించారు. అయితే.. భారత ఉత్పత్తులపై అమెరికా మొత్తంగా 50 శాతం టారిఫ్లు వసూలు చేస్తోంది. ఇందులో రష్యాతో చమరు కొనుగోళ్ల నేపథ్యంతో విధించిన 25 శాతం సుంకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో.. రష్యాతో చమురు వాణిజ్యం పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని కూడా ట్రంప్ తన సోషల్ మీడియా సోషల్ ట్రూత్లో వెల్లడించారు. కానీ, ఆ సుంకాల పరిస్థితిపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు.మోదీ ఏమన్నారంటే..ట్రంప్ ఫోన్కాల్.. సోషల్ మీడియా పోస్ట్ పరిణామంపై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు. భారత వస్తువులపై అమెరికా ఇకపై 18 శాతం సుంకమే విధిస్తుందని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఇంత గొప్ప ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రెసిడెంట్ ట్రంప్కు ఎంతగానో కృతజ్ఞతలు. ప్రపంచ శాంతి, సుస్థిరత, ప్రగతికి ఆయన సారథ్యం ఎంతో కీలకం’’అంటూ కొనియాడారు. శాంతిసాధన దిశగా ఆయన ప్రయత్నాలకు భారత్ పూర్తిగా సహకరిస్తుంది.. .. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక, ప్రజాస్వామిక వ్యవస్థలు కలసికట్టుగా పని చేస్తే అంతిమంగా ప్రజలకు ఎనలేని మేలు కలుగుతుంది. ఇరు పక్షాలకూ లాభదాయంగా అపారమైన అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. భారత్, అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ట్రంప్తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా’’అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ట్రంప్ చెప్పిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రం మోదీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం! ఇక ట్రంప్ ఏమన్నారంటే.. ‘‘మోదీతో నా స్నేహం, ఆయనపై గౌరవం దృష్ట్యా, ఆయన విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చింది. అమెరికాపై టారిఫ్, టారిఫేతర అడ్డంకులన్నింటినీ సున్నాకు తగ్గించే దిశగా భారత్ చర్యలు చేపట్టనుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపేయనుంది. ఇకపై వెనెజువెలా, అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిణామం ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెర దించేందుకు దోహదపడుతుందని ట్రంప్ హర్షం వెలిబుచ్చారు. నేను, మోదీ మాటల మనుషులం కాదు. పక్కా చేతల వ్యక్తులం. కనుక భారత్, అమెరికా నడుమ ఇప్పటికే ఉన్న అద్భుత సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కానున్నాయి. మోదీని నా అత్యుత్తమ మిత్రుల్లో ఒకరు. వర్తకం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడంతో పాటు పలు అంశాలపై మోదీతో సుదీర్ఘంగా చర్చించా. ఇకపై అమెరికా వస్తువులను భారత్ మరింత భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తుందని మోదీ నాకు హామీ ఇచ్చారు(BUY AMERICAN). 500 బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే చమురు, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు తదితర ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు అని ట్రంప్ అన్నారు. అంతకు ముందు.. సోమవారం రాత్రి నుంచే ఈ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్.. ట్రంప్-మోదీ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అంటూ బ్రేకింగ్ న్యూస్లా ఒక్కో పరిణామాన్ని వివరించుకుంటూ పోయారు. అయితే.. రష్యా చమురు సంకాల పరిస్థితిపై మాత్రం అటు ట్రంప్, ఇటు మోదీ నుంచి క్లారిటీ రాలేదు. కానీ, గోర్ మాత్రం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘భారత్పై అమెరికా తుది టారిఫ్లు 18 శాతం మాత్రమే’అంటూ స్పష్టత ఇచ్చారు. అయితే.. రష్యా చమురు విషయంలో జాతి ప్రయోజనాల విషయంలో తగ్గేదే లే అని భారత్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ఒత్తిళ్లకు నిజంగానే తలొగ్గిందా? అనేదానిపై కేంద్రం నుంచి స్పష్టత రావ్సాల్సి ఉంది. -
ఇండియా, EU డీల్ .. కుప్పకూలనున్న పాక్ ఆర్థిక వ్యవస్థ?
ఇటీవల భారత్-ఈయూ మధ్య కీలక ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ అగ్రిమెంట్ పాకిస్థాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టెసే ప్రమాదముందని ఆ దేశ నాయకుడు అభిప్రాయపడ్డారు. ఇంతకాలం యూరప్-పాక్ మధ్య నడిచిన జీరో టారిఫ్ హానీమూన్ ఈ డీల్ వల్ల ముగిసిందన్నారు. దీని వల్ల ఆ దేశంలో తీవ్ర ఆర్థిక నష్టంతో పాటు దాదాపు కోటి ఉద్యోగాలు పోయే అవకాశం ఉందన్నారు.ఈయూ- భారత్ మధ్య జరిగిన ఒప్పందం పాకిస్థాన్ని పేదరికంలోకి నెట్టేసే అవకాశం ఉన్నట్లు ఆ దేశ నాయకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో పాక్పై పడే ప్రభావం అంచనా వేస్తున్నారు. దీనిపై ఆ దేశ మాజీ వాణిజ్య శాఖ మంత్రి స్పందించారు. "ఇంతకాలం ఈయూతో జరిగిన హానీమూన్ ఒప్పందం ముగిసింది. 10 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు చౌకవిద్యుత్, తక్కువ పన్నులు, సులభమైన రుణాలు అందించాలి అలా అయితే ఇతర దేశాలతో పోటీపడగలం" అని ఆయన అన్నారు.యూరోపియన్ యూనియన్లో ఇంతకాలం పాకిస్తాన్ హావా నడిచింది. ఆ దేశానికి చెందిన దాదాపు 65 శాతం వస్తువులు ఎటువంటి పన్నులు లేకుండా అక్కడికి ఎగుమతి చేయబడుతున్నాయి. ఇప్పుడు భారత్తో ఈయూ డీల్ నేపథ్యంలో ఆ ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. భారత్, ఈయూ ఈ ఏడాది జనవరి 27న వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. దాదాపు 200 కోట్ల మంది ప్రజలు ఈ ఒప్పందంలో భాగంగా ప్రభావితమవుతారు. ప్రపంచ జీడీపీలో ఈ ఈయూ-భారత్ మార్కెట్ విలువ దాదాపు 25 శాతం. ఈ ఒప్పందం రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను ఏకం చేస్తుంది. -
భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం!
న్యూఢిల్లీ: కొంతకాలంగా ఒడిదుడుకుల్లో పడ్డ భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందులో భాగంగా భారత్పై సుంకాల భారాన్ని తగ్గిస్తున్నట్టు కూడా వెల్లడించారు. గతేడాది తాను విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలు 18 శాతానికి తగ్గుతాయని ప్రకటించారు. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రస్తుతం 50 శాతం టారిఫ్లు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ట్రంప్ ఫోన్లో సంభాíÙంచారు. ఆ వెంటనే వాణిజ్య ఒప్పందం, సుంకాల తగ్గింపుపై ప్రకటన చేశారు.‘‘మోదీతో నా స్నేహం, ఆయనపై గౌరవం దృష్ట్యా, ఆయన విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. ఇది తక్షణం అమల్లోకి వచి్చంది’’అని ట్రంప్ వెల్లడించారు. తన సోషల్ మీడియా ట్రూత్సోషల్లో ఈ మేరకు పోస్టు పెట్టారు. అంతేకాదు, ‘‘అమెరికాపై టారిఫ్, టారిఫేతర అడ్డంకులన్నింటినీ సున్నాకు తగ్గించే దిశగా భారత్ చర్యలు చేపట్టనుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపేయనుంది. ఇకపై వెనెజువెలా, అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది’’అని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామం ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెర దించేందుకు దోహదపడుతుందని హర్షం వెలిబుచ్చారు. ‘‘నేను, మోదీ మాటల మనుషులం కాదు.పక్కా చేతల వ్యక్తులం. కనుక భారత్, అమెరికా నడుమ ఇప్పటికే ఉన్న అద్భుత సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కానున్నాయి’’అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. మోదీని తన అత్యుత్తమ మిత్రుల్లో ఒకరిగా అభివర్ణించారు! ‘‘వర్తకం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడంతో పాటు పలు అంశాలపై మోదీతో సుదీర్ఘంగా చర్చించా. ఇకపై అమెరికా వస్తువులను భారత్ మరింత భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తుందని మోదీ నాకు హామీ ఇచ్చారు. 500 బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే చమురు, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు తదితర ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు’’అని చెప్పుకొచ్చారు. తుది టారిఫ్ 18 శాతమే: గోర్ సోమవారం ట్రంప్, మోదీ ఇరువురూ ఫోన్లో సంభాషించుకున్నారని అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్ వెల్లడించిన కాసేపటికే వెంటవెంటనే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘‘ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడే ప్రధాని మోదీతో మాట్లాడారు. (ఏం జరగనుందో) వేచి చూడండి’’అంటూ గోర్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్పై అదనంగా విధించిన మరో 25 శాతం టారిఫ్ గురించి మాత్రం ట్రంప్ ప్రస్తావించలేదు. రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయని వ్యాఖ్యానించి సరిపెట్టారు.ఆ టారిఫ్ను తొలగిస్తున్నదీ లేనిదీ స్పష్టత ఇవ్వలేదు. అయితే గోర్ ఇండియా టుడే వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘భారత్పై అమెరికా తుది టారిఫ్లు 18 శాతం మాత్రమే’అంటూ స్పష్టత ఇచ్చారు. తద్వారా, రష్యా చమురు టారిఫ్ను తొలగించినట్టేనని అన్యాపదేశంగా చెప్పారు. ఇక అమెరికాపై టారిఫ్లను దశలవారీగా పూర్తిగా ఎత్తేసే విషయమై ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. ఒప్పందంపై మోదీ మౌనం ఈ పరిణామంపై మోదీ కూడా స్పందించారు. భారత వస్తువులపై అమెరికా ఇకపై 18 శాతం సుంకమే విధిస్తుందని చెప్పేందుకు ఎంతో సంతోíÙస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. ‘‘ఇంత గొప్ప ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రెసిడెంట్ ట్రంప్కు ఎంతగానో కృతజ్ఞతలు. ప్రపంచ శాంతి, సుస్థిరత, ప్రగతికి ఆయన సారథ్యం ఎంతో కీలకం’’అంటూ కొనియాడారు. శాంతిసాధన దిశగా ఆయన ప్రయత్నాలకు భారత్ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.‘‘ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరి్థక, ప్రజాస్వామిక వ్యవస్థలు కలసికట్టుగా పని చేస్తే అంతిమంగా ప్రజలకు ఎనలేని మేలు కలుగుతుంది. ఇరు పక్షాలకూ లాభదాయంగా అపారమైన అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. భారత్, అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ట్రంప్తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా’’అని పేర్కొన్నారు. అయితే ట్రంప్ చెప్పిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రం మోదీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం! -
దత్తపుత్రుడి తల్లిదండ్రుల కోసం డెన్మార్క్ దంపతుల అన్వేషణ
ఆదిలాబాద్ జిల్లా: డెన్మార్క్కు చెందిన దంపతులు తమ దత్తపుత్రుడి తల్లిదండ్రుల కోసం ఆదిలాబాద్ జిల్లాలో అన్వేషిస్తున్నారు. ఇంద్రవెల్లి మండలం దొడందా పంచాయతీ పరిధిలోని చిలటిగూడ, గట్టెపల్లి పంచాయతీ పరిధిలోని టెకిడిగూడ గ్రామాలను ఆదివారం సందర్శించారు. ఆడాప్టి రైట్స్ కౌన్సిల్ (ఏఆర్సీ) సంస్థ ప్రతినిధి, ముంబయికి చెందిన హైకోర్టు అడ్వొకేట్ అంజలి దత్తత తల్లిదండ్రులు చెప్పిన మాటలను హిందీలో అనువాదం చేసి ఆదివాసీలకు అర్థమయ్యేలా తెలిపారు.2016లో రెండు నెలల బాలుడిని గుర్తు తెలియని దంపతులు ఆదిలాబాద్ రిమ్స్లో వదిలేసి వెళ్లారని, ఆ బాలుడిని గుర్తించిన శిశు సంక్షేమ శాఖ అధికారులు శిశుగృహలో సంరక్షించినట్లు పేర్కొన్నారు. 2018లో డెన్మార్క్కు చెందిన లూయిస్–రాస్ముస్ దంపతులు చట్టబద్ధంగా ఆ చిన్నారిని దత్తత తీసుకుని అర్జున్గా నామకరణం చేసి సంరక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం బాలుడి వయస్సు పదేళ్లు. అయితే బాలుడి సొంత తల్లిదండ్రుల జాడ కోసం వారిని ప్రశ్నించడంతో ఆచూకీ కోసం ఆదిలాబాద్కు వచ్చినట్లు దత్తత తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో పలు గ్రామాల్లో పర్యటిస్తున్నామని వారు పేర్కొన్నారు. బాలుడికి పుట్టుకతో చేతివేళ్లు లేవని తెలిపారు. కన్నవారు గుర్తించి వస్తే వారి పరిస్థితి బట్టి ఆర్థికసాయం కూడా చేస్తామని పేర్కొన్నారు. అలాగే వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని సంస్థ నిర్వాహకురాలు అంజలి తెలిపారు. వారి వెంట సర్పంచ్ పవార్ చాంగోనా, సీడబ్ల్యూసీ సభ్యులు మీర్జా యాకుబ్బేగ్ తదితరులున్నారు. పెంచిన ప్రేమ డెన్మార్క్ది.. పేగు బంధం ఆదిలాబాద్ది! -
మీకు బాగా అలవాటుగా మారిపోయింది: భారత్
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో జరిగే ప్రతి హింసాత్మక ఘటన తర్వాత అసత్య ఆరోపణలు చేయడమే ఆ దేశానికి బాగా అలవాటుగా మారిపోయిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ధ్వజమెత్తారు. ఇటీవల పాకిస్తాన్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక భారత్ హస్తముందనే ఆరోపణలను జైశ్వాల్ ఖండించారు. పాకిస్తాన్ తరచూ ఇలాంటి ఆరోపణలు చేసి తన అంతర్గత వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు.పాకిస్తాన్కు అసత్య ఆరోపణలు చేయడం తప్పితే వేరే పని లేనట్లు ఉందని చురకలంటించారు. ముందు పాకిస్తాన్ అసత్య ప్రేలాపన వదిలి ఆ దేశ ప్రజల దీర్ఘ కాలిక ప్రయోజనాలపై దృష్టి పెడితే బాగుంటందన్నారు. పాకిస్తాన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమైనవి, ఆధారరహితమైనవి. ఇది పాకిస్తాన్ తరచూ ఉపయోగించే పద్ధతి – తన అంతర్గత వైఫల్యాల నుండి దృష్టి మళ్లించడమే. ప్రతి హింసాత్మక ఘటన తర్వాత అసంబద్ధమైన ఆరోపణలు చేయడం బదులు, పాకిస్తాన్ తన ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను తీర్చడంపై దృష్టి పెట్టాలి. అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనలు, అణచివేత, క్రూరత్వం అంతర్జాతీయంగా బాగా తెలిసిన విషయాలు.కాగా, పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా, వాటి బాధ్యతను భారత్పై మోపడానికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యాఖ్యలు, భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఆరోపణలను ఎదుర్కొనే విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బలోచిస్తాన్ ప్రాంతంలో తిరుగుబాటుదారుల దాడులు చేస్తున్నారు. తమకు స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్ ఏడాది కాలంగా బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు.. పాక్పై దాడికి తిగుతున్నారు. ఇది పాకిస్తాన్ అంతర్గత భద్రతా సమస్యలను మరింత స్పష్టంగా చూపిస్తోంది.బలోచిస్తాన్లో ఇటీవల జరిగిన దాడుల్లో కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోయారు దీని వెనుక భారత్ హస్తం ఉందని పాక్ ఆరోపించింది. ఈ దాడులకు భారత్ కారణమని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆరోపించారు. ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేశారు. బుధవారం(జనవరి 28వ తేదీన) డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని షోర్ కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ దయాల్ చనిపోయాడు. అయితే, పాక్ అధికారులు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా దాన్ని భారత్పై నెట్టే యత్నం చేసింది. దీన్ని భారత్ ఖండిస్తూ.. వారి దేశంలో సమస్యలను వేరే దేశంపై మోపడం పాక్కు బాగా అలవాటుగా మారిపోయిందని భారత్ స్ట్రాంగ్గా బదులిచ్చింది. -
దడపుట్టించిన భారత్.. పాకిస్తాన్ సంచలన ప్రకటన..
-
పాక్ పై భారత్ ఘన విజయం
-
బంగ్లాకు షాకిచ్చిన భారత్.. భారీగా నిధుల కోత
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి కేటాయించే నిధులను గణనీయంగా తగ్గించింది. అంతేకాకుంగా మాల్దీవులు, మయన్మార్లకు భారత్ అందించే సహాయంలో భారీగా కోతలు విధించింది.ప్రస్తుతం భారత్- బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ దేశంలో హిందువులపై దాడులు పెరిగాయి. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు హెచ్చరించినా దాడులు ఏ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో భారత్ ఆ దేశం పై ఆర్థిక కోత విధించింది. ప్రస్తుత బడ్జెట్లో రూ. 60 కోట్లు బంగ్లాకు కేటాయించింది. అదే గతేడాది ఈ ఇధి రూ.120 కోట్లుగా ఉంది. అదే విధంగా మాల్దీవులకు దాదాపు 8 శాతం సహాయం తగ్గించి రూ. 550 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా ఇరాన్లోని చాబహార్ పోర్టుకు ఈ ఏడాది ఎటువంటి నిధులు కేటాయించలేదు.అయితే భూటాన్కు అందిస్తున్న సహాయాన్ని భారత్ ఈ సారి మరికొంతగా పెంచింది. దాదాపు ఆరు శాతం నిధులు పెంచి మెుత్తం రూ. 2,289 కోట్లకు పెంచింది. నేపాల్కు ఎనిమిది శాతం పెరిగి రూ. 800 కోట్లు చేసింది. శ్రీలంకకు సహాయం ఒక వంతు పెరిగి రూ. 400 కోట్లకు చేరుకుంది. మెుత్తంగా ఇతర దేశాలకు భారత్ చేసే ఆర్థిక సహాయం 4 శాతం పెరిగి రూ. 5,686 కోట్లకు చేరింది. . అదే గ తేడాది ఈ మెుత్తం రూ.5,483 కోట్లుగా ఉంది. 2026-27 సంవత్సరానికి భారత విదేశాంగ శాఖ బడ్జెట్ రూ.22,119 కోట్లుగా అంచనా వేయబడింది. -
ట్రంప్ కోసమే మోదీ అలా చేశారు.. భారత్ రియాక్షన్ ఇదే
ఎప్స్టీన్ ఫైల్స్ ప్రస్తుతం అమెరికాలో ఈ వ్యవహారం ఎంత హాట్టాఫిక్గా మారిందో అంతా తెలిసిందే. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్క్లింటన్తో పాటు బిల్గ్రేడ్స్, మైకేల్ జాక్సన్ లాంటి ప్రముఖుల అంతరంగిక వ్యవహారాలు అందులో ఉన్నాయి. అయితే ఆ ఫైళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థావన ఉండడంతో భారత్ దానిపై వివరణ ఇచ్చింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ దీనిపై స్పందించారు.ఇటీవల అమెరికా న్యాయవిభాగం జెఫ్రీ ఎప్స్టీన్ దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. అయితే ఇందులో చాలా మంది ప్రముఖుల అంతరంగిక విషయాలకి సంబంధించిన సమాచారంపై ఆరోపణలున్నాయి. అయితే అందులో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ట్రంప్ సూచన మేరకే జరిగిందని ఉంది. ఎప్స్టీన్ మెయిల్స్లలో..2017లో ట్రంప్- మోడీ భేటీ జరిగింది. అప్పుడు ట్రంప్ మోదీని ఇజ్రాయెల్ పర్యటించాల్సిందిగా సూచించారు. దీంతో మోదీ ఆ ఏడాది ఇజ్రాయెల్ పర్యటన చేశారు. అని మెయిల్లో ఉంది.అంతేకాకుండా 2014లో ప్రస్తుత కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి.. ప్రధానిగా మోదీ ఎన్నికైన తర్వాత భారత్తో సంబంధాలు ఎందుకు మెరుగుపరుచుకుకోవాలో అని మెయిల్లో తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. " ఎప్స్టీన్ ఫైళ్లలో 2017లో భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించిన విషయం మినహా అంతకు మించి ఏది నిజం కాదు. మిగతా ప్రస్థావనలు అన్నీ ఒక నేరస్థుడు చెప్పిన అసత్య ప్రకటనలు" అని ఆయన అన్నారు. అవి పూర్తిగా అవాస్తవాలు అని తెలిపారు.అయితే రెండు రోజుల క్రితం అమెరికా న్యాయశాఖ విభాగం ఎప్స్టీన్కు సంబంధించి 30 వేల పత్రాలు, 2వేల వీడియోలు, విడుదల చేశారు. అందులో ఆ దేశ మాజీ అధ్యక్షులతో పాటు బిల్గ్రేట్స్, ఎలాన్ మస్క్కు సంబంధించిన కీలక సమాచారం ఉంది. -
భారత్తో డీల్ కుదిరింది: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకాం ఇరాన్ నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్.. ఇకపై వెనెజువెలా నుంచి చేసుకునేందుకు ముందుకొచ్చిందని పేర్కొన్నారు. ఆదివారం ఫ్లోరిడాకు వెళ్తున్న క్రమంలో.. ఎయిర్ఫోర్స్ వన్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘మేము ఇప్పటికే వెనెజువెలాతో ఒక డీల్ కుదుర్చుకున్నాం. ఇందులో భారత్ కూడా చేరనుంది. భారత్ ఇకపై వెనెజువెలా చమురును దిగుమతి చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాం’’ అని ట్రంప్ తెలిపారు. అలాగే వెనెజువెలా చమురు కోసం చైనా కూడా తమతో చర్చలు జరిపే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. దాన్ని మేము స్వాగతిస్తామన్నారు. దీనిపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు వెనెజువెలాలో పాలనపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఇప్పుడు తన అధీనంలోనే ఉందన్నారు. తాను కోరుకున్నట్లుగానే ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అక్కడి చమురు నిల్వలు పూర్తిగా అమెరికా చేతికి వచ్చే వరకు ఆమెనే తాత్కాలిక నాయకురాలిగా కొనసాగుతారని తెలిపారు.వెనెజువెలాపై సైనిక దాడి చేసి.. ఆ దేశ నేత నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. భారతదేశం ఒకప్పుడు వెనిజులా నుంచి లక్షల బ్యారెల్ల చమురు దిగుమతి చేసుకునేది. ఒనానొక టైం వచ్చేసరికి.. ఆ దేశం మొత్తం చమురు ఎగుమతుల్లో దాదాపు సగం వరకు భారతదేశం వాటా కలిగి ఉండేది. అయితే, 2010 చివర్లో.. అమెరికా వెనెజువెలాపై ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ క్రమంలో.. ద్వితియ శ్రేణి ఆంక్షలు(Secondary Sanctions) భయంతో భారత్కు చెందిన కంపెనీలు కొనుగోళ్లను తగ్గించాయి, ఫలితంగా వెనిజులా చమురు దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. అదే సమయంలో.. అమెరికా ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఇంతకాలం భారత్ ఇరాన్ నుంచి కాస్తకూస్తో చమురు దిగుమతులను చేసుకునేది. అయితే ఈమధ్యే భారత ప్రధాని మోదీ - వెనెజువెలా అధ్యక్షురాలు రోడ్రిగ్జ్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులతో సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు కూడా. -
‘నీట్’ కోసం ‘ఎన్ఆర్ఐ’లుగా మారి.. మరో బాగోతం
న్యూఢిల్లీ: దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు పలువురు విద్యార్థులు అక్రమ మార్గాలను అవలంబిస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా వైద్య విద్య పీజీ సీట్ల కేటాయింపును పర్యవేక్షించే మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఒక సంచలన జాబితాను విడుదల చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికి గాను మూడో విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందేందుకు ఏకంగా 811 మంది అభ్యర్థులు తమ జాతీయతను ‘భారతీయులు’ నుండి ‘ఎన్ఆర్ఐ’గా మార్చుకున్నారు.నీట్ పీజీలో తక్కువ మార్కులు వచ్చి, ఆర్థికంగా బలంగా ఉన్న విద్యార్థులు క్లినికల్ విభాగాల్లో సీట్లు దక్కించుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ కోటాలో ఫీజులు భారీగా ఉన్నప్పటికీ, పోటీ తక్కువగా ఉండటం, కట్-ఆఫ్ మార్కులు మేనేజ్మెంట్ కోటా కంటే తక్కువగా ఉండటం వీరికి కలిసి వస్తోంది. ఈ విధంగా ఎన్ఆర్ఐ కోటాకు అర్హత సాధించిన 811 మంది అభ్యర్థులను రెండు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గంలో నేరుగా ఎన్ఆర్ఐలు లేదా ఎన్ఆర్ఐల పిల్లలు ఉండగా, వీరి సంఖ్య కేవలం 113 మాత్రమే ఉంది.రెండో వర్గంలో ఏకంగా 698 మంది అభ్యర్థులు ఉండటం గమనార్హం. నిబంధనల సడలింపు వల్ల రక్తసంబంధీకులు కాకపోయినా, దూరపు బంధువులు స్పాన్సర్ చేసే అవకాశం ఉండటంతో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఈ అభ్యర్థుల స్కోర్లను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. మొదటి కేటగిరీలో అత్యల్ప స్కోరు 800 మార్కులకు గాను కేవలం 82 (10%) మాత్రమే కాగా, రెండో కేటగిరీలో ఇది మరీ దారుణంగా 28 (3.5%) మార్కులుగా ఉంది. మొదటి వర్గంలో 66శాతం మంది అభ్యర్థులు 1.5 లక్షల కంటే తక్కువ ర్యాంకు పొందినవారే కావడం గమనార్హం. అయినప్పటికీ, ఏడాదికి రూ. 45 లక్షల నుండి రూ. 95 లక్షల వరకు వెచ్చించగలిగే స్తోమత ఉండటంతో, వీరు అత్యంత డిమాండ్ ఉన్న మెడికల్ సీట్లను సులువుగా సొంతం చేసుకుంటున్నారు.కళాశాల స్థాయి, కోర్సును అనుసరించి ఈ ఫీజులు మారుతుంటాయి. సాధారణంగా ఎన్ఆర్ఐ సీట్లు ఖాళీగా మిగిలిపోతుంటాయి. అటువంటప్పుడు వాటిని మేనేజ్మెంట్ కోటాలోకి మార్చాల్సి ఉంటుంది. దీంతో ఫీజులు భారీగా తగ్గుతాయి. ఈ నేపధ్యంలో ప్రైవేట్ వైద్య కళాశాలలు ఈ ఆర్థిక నష్టాన్ని భరించలేవనే వాదనను కోర్టులు పరిగణనలోకి తీసుకున్నాయి. దీంతో ఎన్ఆర్ఐ నిర్వచనాన్ని విస్తృతం చేశారు. ఫలితంగా తల్లిదండ్రులు విదేశాల్లో లేకపోయినా, ఎన్ఆర్ఐ బంధువుల ఆధారంతో వైద్య విద్యార్థులు పీజీ సీట్లను దక్కించుకుంటున్నారు. ఇది కూడా చదవండి: తక్కువ వ్యయం.. లోటు లేని జీవితం -
తక్కువ వ్యయం.. లోటు లేని జీవితం
వచ్చిన ఆదాయంతో దేనికీ అంతగా ఇబ్బందులు పడకుండా, సుఖవంతమైన జీవితం గడపాలని ఎవరికి ఉండదు చెప్పండి.. సరిగ్గా ఇలాంటివారికి అనువైన నగరాలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. ఖర్చు తగ్గించుకుంటూనే.. నాణ్యమైన జీవితాన్ని గడపాలని ఆశించే వారికి ఇవి ఒక వరమని చెప్పుకోవచ్చు. సంస్కృతికి నిలయమైన జైపూర్ నుండి, ప్రకృతి ఒడిలో అలరారే డెహ్రాడూన్, ఉరుకుల పరుగుల కోల్కతా వరకు.. ఈ నగరాలు మీ జేబుకు చిల్లు పడకుండా సౌకర్యవంతమైన జీవనశైలిని అందిస్తాయి.ప్రశాంతతకు తిరువనంతపురం దేశంలో అత్యంత తక్కువ ఖర్చుతో జీవనం సాగించగల నగరాల్లో కేరళ రాజధాని తిరువనంతపురం అగ్రస్థానంలో ఉంది. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితాన్ని గడపాలనుకునే వారికి ఇది ఒక స్వర్గధామం అని చెబుతుంటారు. ఇక్కడ నివాస ఖర్చులు చాలా తక్కువగా ఉండటమే కాకుండా, ప్రముఖ ఐటీ హబ్గా ఈ ప్రాంతం ఎదగడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పశ్చిమ కనుమల మధ్య, అరేబియా సముద్ర తీరాన కొలువైన తిరువనంతపురం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ, తక్కువ ఖర్చుతో నాణ్యమైన జీవితాన్ని అందిస్తున్నదని ‘టైమ్స్ ట్రావెల్’ తన కథనంలో పేర్కొంది.తక్కువ అద్దెలు, మెరుగైన వసతుల కోసం..తమిళనాడులోని కోయంబత్తూర్ నగరం తక్కువ అద్దెలు, మెరుగైన వసతులకు పెట్టింది పేరుగా నిలిచింది. గృహ నిర్వహణ వ్యయం పరంగా దేశంలోనే అత్యంత చౌకైన నగరాల్లో ఒకటిగా కోయంబత్తూర్ గుర్తింపు పొందింది. ఇక్కడి వస్త్ర, ఇంజనీరింగ్ పరిశ్రమలు ఆర్థికంగా ఈ ప్రాంతానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా, భారీగా ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి.ఇదే కోవలో డెహ్రాడూన్ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంటుంది. తక్కువ విద్యుత్ ఛార్జీలు, స్వల్ప నీటి ఛార్జీలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి రవాణా వ్యవస్థ, ఆహార ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉండటం వల్ల ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ నగరంగా నిలుస్తోంది.పరిశుభ్రతలో టాప్ నగరంమధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం అసాధారణమైన పరిశుభ్రత, భద్రత, రుచికరమైన ఆహారాల లభ్యతకు పెట్టింది పేరు. దేశంలో నివసించడానికి అత్యంత పొదుపైన నగరంగా 2023లో ఇది నిలిచింది. ఇక్కడ రవాణా, గృహ వసతి చాలా తక్కువ ధరకే లభిస్తాయి.స్ట్రీట్ ఫుడ్ అంటే..సాంస్కృతిక రాజధాని కోల్కతా.. ఇక్కడ లభించే స్ట్రీట్ ఫుడ్ రుచితో పాటు చాలా చౌక ధరలకే లభ్యమవుతుంది. ఇదొక మెట్రో నగరమైనప్పటికీ, ఇక్కడ సామాన్యులు కూడా తక్కువ ఖర్చుతోనే మెరుగైన జీవన ప్రమాణాలను అందుకోవచ్చు.చండీగఢ్, జైపూర్, నాగ్పూర్..పదవీ విరమణ తర్వాత స్థిరపడాలనుకునే వారికి చండీగఢ్ ఒక అద్భుతమైన నగరమని చెబుతుంటారు. కాలుష్యం తక్కువగా ఉండటం, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, తక్కువ అద్దెలు మొదలైనవి చండీగఢ్ సొంతమని అంటారు.రాజస్థాన్ రాజధాని జైపూర్ సైతం వారసత్వ సంపదను కాపాడుకుంటూనే, సామాన్యులకు పొదుపుగా జీవించే మార్గాలను అందిస్తోంది. ఇక మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరం ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. తక్కువ రియల్ ఎస్టేట్ ధరలు, అంతర్జాతీయ విమానాశ్రయ కనెక్టివిటీ, అత్యుత్తమ వైద్య సదుపాయాలతో నాగ్పూర్ సామాన్యులు స్థిరపడేందుకు అనువైన నగరంగా మారింది.ఇది కూడా చదవండి: పాదచారుల ప్రాణాలకు గ్యారెంటీ ఏది? -
ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం సార్వజనీన విధానంగా మారాలని భారత్ పేర్కొంది. భారత్–అరబ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. ఇందులో అరబ్ లీగ్కు చెందిన 19 సభ్యదేశాల నుంచి మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రారంభం ప్రసంగం చేశారు. గాజా సంక్షోభానికి ముగింపు పలికే సమగ్ర శాంతి పథకం భద్రతా మండలి తీర్మానం 2803కు అనుగుణంగా ఉండటం మేలన్నారు. కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఇటువంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఉమ్మ డి ప్రయోజనాల కోసం శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును బలోపేతం చేసే శక్తులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని జై శంకర్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంతో ఎదురవుతున్న సవాళ్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన... దీనిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్త సమన్వయ ప్రయత్నాలు జరగాలని పిలుపునిచ్చారు. రెండు ప్రాంతాలకు ఉన్న అతిపెద్ద ఉమ్మడి ముప్పు అన్ని రూపాల్లోనూ ఉన్న ఉగ్రవాదమేనని ఆయన తెలిపారు. అంతర్జాతీయ సంబంధాలను, ప్రాథమిక దౌత్య సూత్రాలను ఉల్లంఘించే సీమాంతర ఉగ్రవాదం ఏమాత్రం ఆమోదయోగ్యం కానిదని స్పష్టం చేశారు. ఉగ్రవాద బాధిత దేశాలకు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని తెలిపారు. ఉగ్రవాదం పీడను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, జీరో టాలరెన్స్ విశ్వజనీన నియమావళిగా ఉండాలని జైశంకర్ అన్నారు.మోదీతో అరబ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీభారత్– అరబ్ లీగ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి వచ్చిన మంతుల్రు అంతకు ముందు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుస్థిర పశ్చిమాసియా కోసం మోదీ చేస్తున్న కృషిని వారి ప్రశంసించారు. ‘అరబ్ ప్రపంచం భారత్ యొక్క విస్తృత పొరుగులో ఒక భాగం. మన మధ్య లోతైన నాగరికత సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధాలు, చిరకాల సోదర బంధాలు ఉన్నాయి. అలాగే శాంతి, ప్రగతి, స్థిరత్వంపై మనకు ఉమ్మడి నిబద్ధత ఉంది’అని మోదీ వారితో పేర్కొన్నారు. -
భారత్పై మొబైల్ మాల్వేర్ దాడులు
ఇంటర్నెట్ వాడకం పెరిగే కొద్దీ మొబైల్ మాల్వేర్ దాడులు ప్రపంచవ్యాప్తంగా అధికం అవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కస్టమర్ల మొబైల్స్లోకి హానికరమైన సాఫ్ట్వేర్ (మాల్వేర్) ద్వారా చొరబడేందుకు కొత్త పంథాను అందిపుచ్చుకుంటున్నారు. మొబైల్ మాల్వేర్ దాడులకు గురైన దేశాల్లో మరోసారి భారత్ అగ్రశ్రేణి కేంద్రంగా అవతరించింది. డిజిటలైజేషన్ దిశగా దూసుకెళ్తున్న భారత మార్కెట్లో స్మార్ట్ఫోన్స్, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు, కీలకమైన మౌలిక సదుపాయాలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని అమెరికాకు చెందిన ఐటీ సెక్యూరిటీ సంస్థ జీస్కేలర్ చెబుతోంది. మొబైల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆపరేషనల్ టెక్నాలజీ విభాగాల్లో మాల్వేర్ దాడులపై కంపెనీ రూపొందించిన థ్రెట్ల్యాబ్జ్–2025 థ్రెట్ రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొబైల్ మాల్వేర్ దాడుల్లో 26 శాతం వాటాతో భారత్ మొదటిస్థానంలో ఉంది. – సాక్షి, స్పెషల్ డెస్క్లక్ష్యం ఆర్థిక లాభం..అంతర్జాతీయంగా సైబర్ నేరగాళ్లకు మన దేశం అతిపెద్ద లక్ష్యంగా మారింది. మొబైల్ యాప్స్, డిజిటల్ చెల్లింపులు, రోజువారీ జీవితంలో ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన పరికరాల వినియోగం పెరగడం వల్ల భారత్లో మొబైల్ మాల్వేర్ అటాక్స్ ఏడాదిలో 38 శాతం అధికమయ్యాయి. మొబైల్ మాల్వేర్ దాడుల ప్రధాన లక్ష్యం పాస్వర్డ్స్, బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించడం. తద్వారా ఆర్థిక లాభం పొందడం. అలాగే కంపెనీల సేవలకు అంతరాయం కలిగించి డబ్బు డిమాండ్ చేయడం. బ్యాంక్ ఖాతా నిలిచిపోతుందనో, పాయింట్స్ రిడీమ్, ఆధార్ అప్డేట్, తరచూ వాడుతున్న యాప్ అప్డేట్ పేరుతో మొబైల్ యూజర్లను సైబర్ నేరస్తులు వలలో వేసుకుంటున్నారు. యాప్ స్టోర్లలోకి మాల్వేర్..యాప్ స్టోర్లలోకి హానికరమైన యాప్స్ చొరబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. గూగుల్ ప్లే స్టోర్లో 239 హానికర ఆండ్రాయిడ్ యాప్స్ను జీస్కేలర్ పరిశోధకులు గుర్తించారు. ఈ యాప్స్ ఇప్పటికే 4.2 కోట్లకుపైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. ఈ యాప్స్లో చాలా వరకు ఉత్పాదకత మెరుగుపరిచే సాధనాలుగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఆండ్రాయిడ్ మాల్వేర్ కార్యకలాపాలు 2024తో పోలిస్తే గత సంవత్సరంలో 67 శాతం పెరిగాయి. స్పైవేర్, బ్యాంకింగ్ మాల్వేర్ కీలక ముప్పుగా పరిణమించాయి. ఐఓటీ డివైస్ల విషయానికివస్తే రూటర్స్ 75% దాడులకు గురయ్యాయి. మొబైల్ మాల్వేర్ బాధిత టాప్–10 దేశాల్లో భారత్, యూఎస్, కెనడా, మెక్సికో, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఇజ్రాయిల్, యూకే, యూఏఈ, ఇటలీ ఉన్నాయి. టాప్–4లో భారత్..భారత్లో రిటైల్, హోల్సేల్ వ్యాపారులు, సంస్థలను సైబర్ నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. మొత్తం మాల్వేర్ దాడుల్లో వీటి వాటా 38% ఉంది. హాస్పిటాలిటీ, రెస్టారెంట్స్ వాటా 31% ఉంది. తయారీ, ఇంధన సంబంధిత రంగాలను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. ఈ పరిశ్రమలు కనెక్టెడ్ వ్యవస్థలు, ఐఓటీ పరికరాలపై ఎక్కువగా ఆధారపడతాయి. అధిక నష్టాన్ని కలిగించాలని చూస్తున్న సైబర్ నేరగాళ్లకు ఇవి ఆకర్షణీయమైన లక్ష్యాలుగా మారాయి. మొత్తం ఐఓటీ మాల్వేర్ కార్యకలాపాల్లో 54% వాటాతో గ్లోబల్ హాట్స్పాట్గా అమెరికా నిలిచింది. 5 శాతం వాటాతో భారత్ నాల్గో స్థానంలో ఉంది. మొబైల్ చెల్లింపులపై..మన దేశంలో బ్యాక్డోర్, బోట్నెట్–స్టైల్ మాల్వేర్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 16 లక్షలపైచిలుకు ఆండ్రాయిడ్ టీవీ బాక్సుల్లోకి మాల్వేర్ చొచ్చుకుపోయిందని ఒకనివేదిక వెల్లడించింది. ఇందులో ప్రధాన బాధిత దేశంగా భారత్ ఉంది. చమురు, సహజవాయువు రంగంలో ఉద్యోగార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మాల్వేర్ దాడులు చేస్తున్నారని వివరించింది. అంతేగాక మొబైల్ చెల్లింపులపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని తెలిపింది. -
తాజ్ మహల్ డైమండ్ @ 74 కోట్లు...
17వ శతాబ్దంలో మొఘల్ రాణి నూర్జహాన్ వాడిన నగ అది. బ్రిటిష్ కాలంలో దేశం దాటిన ఆణిముత్యం 1972లో ఎలిజబెత్ టేలర్కు గిఫ్ట్ ఇచ్చిన రిచర్డ్ బర్టన్ ఇప్పుడు హాలీవుడ్ నటి మార్గోట్ రాబీ చేతిలో నూర్జహాన్ నగ హాలీవుడ్ నటి మార్గోట్ రాబీ తన చిత్రం వుథరింగ్ హైట్స్ ప్రమోషన్ లో బిజీబిజీగా గడిపారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె లాస్ ఏంజిల్స్లోని టీసీఎల్ చైనీస్ థియేటర్లో జరిగిన ప్రీమియమ్ షోలో తళుక్కున మెరిశారు. అందులో ఆమె ధరించిన 69.42 క్యారెట్ల నెక్లెస్ అందరినీ ఆకట్టుకుంది. 74 కోట్ల రూపాయల విలువైన ఆ నగ ఇప్పటిది కాదు. 17వ శతాబ్దం నాటిది. చెప్పాలంటే.. అది భారత్కు చెందిన అమూల్యమైన నగ. అప్పట్లో మొఘల్ రాణి నూర్జహాన్ వాడిన నగపై.. ప్రత్యేక కథనం..!జహంగీర్ ఇచ్చిన బహుమతి...17వ శతాబ్దం ఆరంభంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ అందాల భామ నూర్జహాన్ ను మనువాడిన విషయం తెలిసిందే..! 1611లో జరిగిన ఈ వివాహం సందర్భంగా ఆయన నూర్జహాన్ కు ఓ నెక్లెస్ను బహూకరించాడు. 69.42 క్యారెట్ల ఆ నగపై అప్పటి అధికారిక భాష పర్షియన్ లో ‘ప్రేమ ఎప్పటికీ శాశ్వతం’ అని చెక్కించారు. మొఘల్ సామ్రాజ్యంలో నూర్జహాన్ ను అందాల రాణి అని, ఫ్యాషన్ డిజైనర్ అని పిలిచేవారు. అంతేకాదు. మొఘల్ బేగంలు ఎవరూ పరదా దాటి బయటకు వచ్చేవారు కాదు. కానీ, జహంగీర్కు 20వ భార్య అయిన నూర్జహాన్ మాత్రం రాచరిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆమె పేరిట నాణేలు కూడా ముద్రితమయ్యాయి. ఆమె ఎన్నెన్నో ఫత్వాలను జారీ చేశారు. న్యాయనిర్ణయంలో.. కోర్టు హాలులో ఆమె జహంగీర్తో కలిసి కూర్చుని, తీర్పులిచ్చేవారు. జహంగీర్ మరణం తర్వాత.. ఆమె క్రమంగా పరిపాలనకు దూరమయ్యారు. 1645లో లాహోర్లో మరణించారు. ఆ తర్వాత ఆ నెక్లెస్ షాజహాన్ భార్య ముంతాజ్ బేగంకు వారసత్వంగా అందింది.నగకు నామకరణం...ముంతాజ్ మరణం తర్వాత.. షాజహాన్ ఆమె పేరిట తాజ్మహల్ను నిర్మించాడని మనకు తెలుసు. ముంతాజ్ మరణానంతరం ఈ నగకు ‘తాజ్ మహల్ డైమండ్’ అని నామకరణం చేశారు. అప్పటినుంచి ఈ నెక్లెస్ అదేపేరుతో కొనసాగుతోంది. బ్రిటిషర్ల కాలం లో కొహినూర్ వజ్రం, నెమలి సింహాసనం మాదిరిగానే.. ‘తాజ్ మహల్ డైమండ్’ నెక్లెస్ కూడా దోపిడీకి గురైంది. ఆ తర్వాత 20వ శతాబ్దం వరకు ఆ నెక్లెస్ ఎన్నెన్నో చేతులు మారి.. 1971లో ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కార్టియర్ చేతికి వెళ్లింది. కార్టియర్ దానికి మెరుగులు దిద్ది, కొన్ని చిన్నచిన్న వజ్రాలు, కెంపులను జోడించారు. విమానాశ్రయంలో అమ్మకానికి పెట్టారు.ఎలిజబెత్ టేలర్కు గిఫ్ట్గా...1972లో అప్పటి హాలీవుడ్ స్టార్ రిచర్డ్ బర్టన్ తన భార్య, నటి ఎలిజబెత్ టేలర్కు ఓ చక్కటి గిఫ్ట్ ఇవ్వాలని, అది ఎన్నటికీ గుర్తుండేలా.. చెరిగి పోని గుర్తుగా ఉండాలని భావించారు. ఆ సమయంలోనే.. విమానాశ్రయంలో కార్టియర్ ప్రదర్శనకు పెట్టిన నూర్జహాన్ నగపై ఎలిజబెత్ టేలర్కు మక్కువ కలిగింది. దాంతో రిచర్డ్... ఆమెకు తెలియకుండా ఆ నగను కొన్నారు. ఆ తర్వాత ఎలిజబెత్కు దాన్ని సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చారు. దాంతో ఎలిజబెత్ ఉబ్బితబ్బిబ్బై పోయింది. తన ఆభరణాల కలెక్షన్ లో ఈ నగను ఆమె అత్యంత ప్రముఖంగా చూసుకునేది. క్లియోపాత్రా సినిమా సెట్లో ఎలిజబెత్, రిచర్డ్ మధ్య ప్రేమ చిగురించగా..ఈ నగను ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఆమె భావించేది. ఎలిజబెత్ తనకు ఆస్కార్ వచ్చినప్పుడు.. ఆ పురస్కారాన్ని అందుకునే సమయంలోనూ ఈ నగను ధరించారు. 2011లో ఆమె మరణం తర్వాత.. ఎలిజబెత్ టేలర్ ఎయిడ్స్ ఫౌండేషన్ కోసం ఈ నగను 8.8 మిలియన్ డాలర్లకు.. అంటే రూ.74 కోట్లకు విక్రయించారు. ఆ తర్వాత ఈ నగ గురించి ఎవరికీ పెద్దగా సమాచారం తెలియదు. నూర్జహాన్ నెక్లెస్ను అంతా మరచి పోతున్న తరుణంలో.. ఈ నెలలో మార్గోట్ రాబీ ఆ నగతో తళుక్కున మెరిసి.. ఆభరణాల ప్రియులను, తన అభిమానులను ఆశ్చర్యపరిచారు.– హెచ్. కమలాపతి రావు, సాక్షి వెబ్ డెస్క్ -
భారత్ x పాకిస్తాన్
బులావాయో (జింబాబ్వే): అండర్–19 ప్రపంచకప్లో యువ భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. సెమీఫైనల్లో చోటు దక్కించుకునేందుకు ఆదివారం ‘సూపర్ సిక్స్’ గ్రూప్–2లో దాయాది పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో ఆడిన అన్నీ మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా కొనసాగుతున్న ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు... చిరకాల ప్రత్యర్థిపై కూడా అదే జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్కు చేరాలని భావిస్తోంది. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు... ఆరో సారి వరల్డ్కప్ చేజిక్కించుకునే దిశగా మరో ముందడుగు వేయాలని చూస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో అమెరికాపై ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్పై విజయాలు సాధించిన యువభారత్... సూపర్ సిక్స్ తొలి మ్యాచ్లో జింబాబ్వేపై గెలిచింది. ఇప్పుడు పాక్పై కూడా నెగ్గితే గ్రూప్–2 నుంచి నేరుగా సెమీఫైనల్కు చేరనుంది. ఓడినా భారత జట్టుకు అవకాశాలు ఉన్నాయి. గ్రూప్లో మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్... భారత జట్టుపై భారీ తేడాతో గెలిస్తే తప్ప సెమీస్ చేరడం కష్టమే. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, ఆయుశ్ మాత్రే, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందుతో భారత జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్లో అంబరీశ్, ఉధవ్ మోహన్, హెనిల్ పటేల్ కీలకం కానున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ సమీర్ మిన్హాస్ ఫుల్ఫామ్లో ఉన్నాడు. ఆసియాకప్ ఫైనల్లో భారత జట్టుపై భారీ సెంచరీతో మ్యాచ్ను లాగేసుకున్న అతడిని త్వరగా పెవిలియన్కు పంపాల్సిన అవసరముంది. -
అమెరికా, ఫ్రాన్స్లు కాదన్నాయి.. భారత్ మాత్రం సాధించింది!
విద్యుత్ వృథా, ఛార్జింగ్కు ఎక్కువ టైం.. బరువైన బ్యాటరీలు.. సిలికాన్ ఆధారిత ప్రాసెసర్లతో విద్యుత్ వాహనాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. అయితే.. ఇకపై ఈ సమస్యలేవీ ఎదురు కాకపోవచ్చు. గాలియం-నైట్రైడ్ టెక్నాలజీతో.. గంటల తరబడి ఛార్జింగ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, తేలికైన బ్యాటరీలతో ఎక్కువ దూరం రయ్మంటూ దూసుకెళ్లే అవకాశం కలగబోతుంది. ఇంతకీ ఈవీ రంగపు భవిష్యత్తును మార్చబోయే ఈ అరుదైన టెక్నాలజీ మనకు ఎలా సొంతం అయ్యిందో తెలుసా?.. టెక్నాలజీ రంగంలో భారత్ ఓ మహత్తర ఘట్టాన్ని నమోదు చేసింది. భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో)కు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ మీనా మిశ్రా పరిశోధనల పుణ్యమా అని ఇకపై దేశం రక్షణ రంగంలోనే కాదు... విద్యుత్తు వాహనాలు, 5జీ నెట్వర్క్ల విషయంలోనూ గణనీయమైన పురోగతిని నమోదు చేయనుంది. గాలియం-నైట్రైడ్ విషయంలో డాక్టర్ మీనా మిశ్రా సాధించిన విజయం దీనికి కారణం. ఇంతకీ ఏమా గాలియం-నైట్రైడ్? డీఆర్డీవో సైంటిస్ట్ సాధించిన విజయమేమిటి? దాంతో దేశానికి, సామాన్యుడికి వచ్చే లాభమేమిటి?మీకు సిలికాన్ గురించి తెలిసే ఉంటుంది. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లోని ప్రాసెసర్లు ఈ అర్ధ వాహకంతోనే తయారవుతాయి. దశాబ్దాలుగా మన టెక్నాలజీ పురోభివృద్ధికి కేంద్రం ఈ సిలికానే. అయితే ఈ పదార్థంతో అనేక సమస్యలూ ఉన్నాయి. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇప్పటివరకూ దీన్నే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్స్టు డాక్టర్ మీనా మిశ్రా. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. సిలికాన్తో వచ్చే సమస్యలను దాదాపుగా పరిష్కరించగల సరికొత్త అర్ధవాహకం గాలియం-నైట్రైడ్తో(Gallium Nitride GaN) ప్రాసెసర్ల తయారీకి మార్గం సుగగమైంది మరి. డీఆర్డీవో శాస్త్రవేత్తలు గాలియం-నైట్రైడ్ మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను విజయవంతంగా తయారు చేయగలిగారు. రక్షణ రంగానికి కీలకమైన రాడార్లు, క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాల్లో ఈ సర్క్యూట్లు కీలకం కానున్నాయి. భారతదేశం ఇటీవలి కాలంలో కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోనూ ఈ గాలియం-నైట్రైడ్ ఉంటుంది కానీ.. ఆ టెక్నాలజీని మనకిచ్చేందుకు ఫ్రాన్స్ నిరాకరించింది. గతంలోనూ ఇతర అగ్రరాజ్యాలు కూడా ఈ టెక్నాలజీని భారత్తో పంచుకునేందుకు నిరాకరించాయి. డాక్టర్ మీనా మిశ్రా పరిశోధనల ఫలితంగా ఇప్పుడు భారత్ గాలియం-నైట్రైడ్ టెక్నాలజీ కలిగిన ఏడవ దేశంగా ఎదిగింది. ఇప్పటివరకూ అమెరికా, ఫ్రాన్స్, రష్యా, దక్షిణ కొరియా, చైనా, జర్మనీల వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉండటం గమనార్హం.ఏమిటి దీని ప్రత్యేకతలు..ఒక్క ముక్కలో చెప్పాలంటే సిలికాన్తో పోలిస్తే గాలియం-నైట్రైడ్ ఎక్కువ వోల్టేజీలు, ఫ్రీక్వెన్సీ, ఉష్ణోగ్రతల్లోనూ సమర్థంగా పని చేయగలదు. విద్యుత్తు వాహనాల్లో బ్యాటరీల నుంచి విద్యుత్తును మోటారుకు.. మోటారు నుంచి బ్యాటరీలకు మార్చేందుకు ప్రస్తుతం సిలికాన్ను ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల విద్యుత్తు వృథా అవుతూంటుంది. గాలియం-నైట్రైడ్ ఆధారిత ప్రాసెసర్లతో ఈ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఒక అంచనా ప్రకారం సిలికాన్తో వచ్చే నష్టాలు 6 - 10 శాతం వరకూ ఉంటే.. గాలియం-నైట్రైడ్ ప్రాసెసర్లతో వచ్చే నష్టాలు 2 - 6 శాతం మాత్రమే. అంతేకాదు.. ఈ పదార్థంతో బ్యాటరీ ఛార్జింగ్ కూడా చాలా వేగంగా జరిగి పోతుంది. బ్యాటరీల బరువు తగ్గడమే కాకుండా.. ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకునే అవకాశం వస్తుంది. అంటే.. విద్యుత్తు వాహనాల మైలేజీ పెరగడం, గంటలు పడుతున్న బ్యాటరీ ఛార్జింగ్ సమయం తగ్గడం జరిగిపోతుందన్నమాట. అలాగే సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే డైరెక్ట్ కరెంట్ (డీసీ)ను... మనం వాడుకునే ఆల్టర్నేట్ కరెంట్ (ఏసీ)కి మార్చే క్రమంలో అయ్యే నష్టాన్ని సగానికి సగం తగ్గిస్తుంది. అంతేకాదు.. 5జీ నెట్వర్క్ల ద్వారా డేటా ట్రాన్స్ఫర్ వేగాన్ని పెంచేందుకు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే.. ‘‘డాక్టర్ మీనా మిశ్రా సాధించిన విజయం ద్వారా దేశం విదేశాల నిషేధాలను అధిగమించగలిగాము. దేశ భద్రత విషయంలో ఇదో మేలి మలుపు’’ అని వ్యాఖ్యానించారు.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ జర్నలిస్ట్. -
ముగ్గురు భారత అంపైర్లకు చోటు
దుబాయ్: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే టి20 ప్రపంచ కప్లో పని చేయనున్న అంపైర్లు, రిఫరీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 24 మంది అంపైర్లతో పాటు ఆరుగురు మ్యాచ్ రిఫరీలు ఈ జాబితాలో ఉన్నారు. భారత మాజీ పేసర్, సీనియర్లలో ఒకడైన జవగల్ శ్రీనాథ్ రిఫరీగా కొనసాగనుండగా...అతనితో పాటు డీన్ కోస్కర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మదుగలే, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్ రిఫరీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అంపైర్లలో భారత్ నుంచి నితిన్ మేనన్, అనంత పద్మనాభన్, జె.మదన్ గోపాల్లకు అవకాశం దక్కింది. ఐసీసీ ఎలీట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడైన నితిన్ మేనన్కు ఇది నాలుగో టి20 వరల్డ్ కప్ కానుంది. గతంలో అతను 2021, 2022, 2024లలో కూడా అంపైర్గా వ్యవహరించాడు. భారత్, న్యూజిలాండ్ సిరీస్లో భాగంగా నేడు జరిగే మ్యాచ్లో అంపైర్గా బాధ్యతలు నిర్వహించనున్న 42 ఏళ్ల మేనన్కు ఇది మూడు ఫార్మాట్లలో కలిపి 150 అంతర్జాతీయ (పురుషుల) మ్యాచ్ కానుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత అంపైర్గా అతను నిలవనున్నాడు. మదన్గోపాల్కు ఇది రెండో టి20 వరల్డ్ కప్ కాగా, పద్మనాభన్కు తొలిసారి ప్రపంచ కప్ చాన్స్ లభించింది. రోలండ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిసన్ గాఫ్నీ, ఆడ్రియన్ హోల్డ్స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటిల్బరో, వేన్ నైట్స్, డొనొవాన్ కాచ్, స్యామన్ నొగాస్కీ, అల్లావుద్దీన్ పలేకర్, అహ్సాన్ రజా, లెస్లీ రీఫర్, పాల్ రీఫెల్, లాంగ్టన్ రూసెర్, షర్ఫుద్దౌలా షాహిద్, గాజీ సొహెల్, రాడ్నీ టకర్, అలెక్స్ వార్స్, రవీంద్ర విమలసిరి, ఆసిఫ్ యాఖూబ్ కూడా అంపైర్లుగా టి20 వరల్డ్ కప్లో పని చేయనున్నారు. -
ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!
-
పాదచారుల ప్రాణాలకు గ్యారెంటీ ఏది?
దేశంలోని పలు నగరాల్లో నడక అనేది అంతకంతకూ ఒక సాహసకృత్యంగా మారిపోతోంది. కాలుష్యం, దుమ్ము ధూళి మధ్య పాదచారులు తమ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. రాజ్యాంగంలోని 21వ అధికరణం జీవించే హక్కును కల్పిస్తున్నప్పటికీ, సురక్షితంగా నడిచే హక్కు మాత్రం నేటికీ అందని ద్రాక్షగానే ఉంది. మన నగరాల్లో ఫుట్పాత్లు అస్తవ్యస్తంగా ఉండటమే కాకుండా, అనేక చోట్ల అవి అసలు ఉనికిలోనే లేవు. నావిగేషన్ యాప్లు నడక మార్గాలను సూచిస్తున్నప్పటికీ, అవి భద్రతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా బెంగళూరు లాంటి నగరాల్లో ఫుట్పాత్ల దుస్థితి పాదచారులను నిత్యం ప్రమాదపు అంచుల్లో నెట్టివేస్తోంది.మౌలిక సదుపాయాల కొరతదేశంలో పలు వ్యాధుల ముప్పు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, వ్యాయామం కోసం కనీసం 10 వేల అడుగులు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, మన నగరాల రూపకల్పన ఇందుకు ఏమాత్రం అనువుగా లేదు. లండన్, న్యూయార్క్ తదితర అంతర్జాతీయ నగరాల్లో పాదచారుల మౌలిక సదుపాయాలను ప్రాథమిక అవసరాలుగా గుర్తించారు. భారత్లో మాత్రం వీటిని విస్మరిస్తున్నారు. ముంబై లాంటి మెట్రో నగరాలు కూడా వాకబిలిటీ ఇండెక్స్లో అట్టడుగున ఉండటం గమనార్హం. కేవలం వాహనాల రాకపోకల ఆధారంగానే రోడ్ల ఇంజనీరింగ్ జరుగుతోందని, మనుషుల భద్రతను పట్టించుకోవడం లేదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు దాటాలంటే ప్రాణగండమే..మనదేశంలోని పలు నగరాల్లో రోడ్డు దాటుతూ, లేదా రోడ్డుపై నడుస్తూ మరణిస్తున్నవారి గణాంకాలు వింటే ఒళ్లు జలదరిస్తుంది. 2023లో భారత్లో సుమారు 1,72,890 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా, అందులో ఐదవ వంతు పాదచారులే ఉండటం ఆందోళనకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ క్షేత్రాల్లో జరిగే మరణాల కంటే భారతీయ రహదారులపై పాదచారుల మరణాలే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో 1.8 మీటర్లు, వాణిజ్య ప్రాంతాల్లో 2.5 మీటర్ల వెడల్పు గల ఫుట్పాత్లు ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. తెరిచి ఉంచిన మురుగు కాలువలు, నాణ్యత లేని ఫ్లాట్ ఫారాలు పాదచారుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి.పరిష్కార మార్గాలు.. భవిష్యత్తు సవాళ్లుపాదచారుల సమస్యను పరిష్కరించడానికి కొన్ని నగరాల్లో ప్రయోగాత్మక చర్యలు చేపట్టినప్పటికీ, అవి పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. బెంగళూరులోని 'టెండర్ ష్యూర్' వంటి ప్రాజెక్టులు కొంత ఆశాజనకంగా ఉన్నా, నిధుల కొరత, రాజకీయ సంకల్పం లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ఫుట్పాత్లను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించి, పాదచారులకు ప్రాధాన్యతనిచ్చే 15-మినిట్ సిటీ వంటి అంతర్జాతీయ నమూనాలను మనం అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఒక నగర నివాసికి అవసరమైన ప్రాథమిక అవసరాలన్నీ (ఆహారం, విద్య, వైద్యం, ఉద్యోగం, వినోదం) తమ ఇంటికి కేవలం 15 నిమిషాల నడక లేదా సైకిల్ ప్రయాణంతో చేరుకోగలిగేలా నగరాలు ఉండాలి.ఇది కూడా చదవండి: మైకుల్లో కాదు ‘మెటా’లో.. -
వందల ఏళ్ల క్రితం చోరీ.. తిరిగి భారత్కు విగ్రహాలు
అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఆ దేశ మ్యూజియంలో ఉన్న భారత్కు చెందిన పురాతన కాంస్య విగ్రహాలను తిరిగి స్వదేశానికి ఇవ్వడానికి అంగీకరించింది. ఆ విగ్రహాలు అక్రమంగా ఆ దేశానికి చేరుకున్నాయని ఒప్పుకుంది.వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ మ్యుజియం ఆఫ్ ఆసియన్ ఆర్ట్స్లో కీ.శ 990 నాటి శివనటరాజ విగ్రహాం,12వ శతాబ్ధపు నాటి సోమస్కంద, 16వ శతాబ్ధానికి చెందిన సుందరర్ అనే సాధువుకు చెంది విగ్రహాలు ఉన్నాయి. ఇవి తమిళనాడుకు చెందినవి అయితే ఈ విగ్రహాలు దొంగతనంగా ఆ మ్యూజియానికి చేరాయని భారత్ వాదించింది. తిరిగి వాటిని తమ దేశానికి అప్పగించాలని కోరింది.అయితే ఇంతకాలం తర్వాత అవి అక్రమంగా ఆ మ్యూజియానికి చేరినట్లు మ్యూజియం అధికారులు అంగీకరించారు. వాటిని తిరిగి భారత్కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో భారతీయ శిల్పసంపద తిరిగి దేశానికి వస్తుంది. -
ప్రపంచ కప్కు ముందు ఆఖరి పోరు
తిరువనంతపురం: టి20 ప్రపంచ కప్కు ముందు ఆడుతున్న ఆఖరి సిరీస్లో భారత్ ఇప్పటికే తమ అస్త్రశ్రస్తాలు అన్నింటినీ పరీక్షించుకుంది. న్యూజిలాండ్పై తొలి మూడు మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన కనబర్చిన జట్టు 3–0తో సిరీస్ను గెలుచుకుంది. విశాఖపట్నంలో జరిగిన గత మ్యాచ్లో అనూహ్యంగా ఓడినా...ఆందోళన చెందాల్సిన పరిస్థితేమీ లేదు. అయితే మెగా పోరుకు ముందు మిగిలిన ఒక మ్యాచ్లో మళ్లీ చెలరేగాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన ఐదో టి20కి రంగం సిద్ధమైంది. మరోవైపు సిరీస్ కోల్పోయిన తర్వాత గత మ్యాచ్లో రాణించిన క్లీన్స్వీప్ నుంచి తప్పించుకున్న కివీస్ కూడా విజయంతో ముగించాలని భావిస్తోంది. భారత్లోనే జరిగే వరల్డ్ కప్కు ముందు ఈ గెలుపు ఆ టీమ్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఖాయం. సిరీస్లో జట్టు ప్రదర్శనను బట్టి చూస్తే ఒక్క సంజు సామ్సన్ ఫామ్ విషయంలోనే మేనేజ్మెంట్ కొంత ఇబ్బంది పడుతోంది. తన సొంత మైదానంలో అశేష అభిమానుల మధ్య బరిలోకి దిగనున్న సామ్సన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడేందుకు ఇంతకంటే సరైన వేదిక, సమయం ఉండదు. తొలి టి20 ఆడుతూ గాయంతో తప్పుకున్న అక్షర్ పటేల్ తర్వాతి మ్యాచ్లకు దూరమయ్యాడు. అతను పూర్తిగా కోలుకుంటే ఆడతాడు. స్వల్ప గాయంతో వైజాగ్ మ్యాచ్ ఆడని ఇషాన్ కిషన్ కూడా ఫిట్గా ఉంటే మళ్లీ తుది జట్టులోకి రావచ్చు. మరోవైపు కివీస్ కూడా ఒక మార్పుతో ఆడే అవకాశం ఉంది. ఓపెనర్, వికెట్ కీపర్ ఫిన్ అలెన్ అందుబాటులో రావడంతో సీఫెర్ట్ను విశ్రాంతినిచ్చి అతడిని ఆడించే అవకాశం ఉంది. తిరువనంతపురంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. కాబట్టి భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఇక్కడా మంచు ప్రభావం ఉంది. గతంలో ఈ మైదానంలో 4 టి20లు ఆడిన భారత్ 3 గెలిచి, ఒక మ్యాచ్లో ఓడింది. చివరిసారిగా 2023 నవంబర్లో ఆ్రస్టేలియాతో జరిగిన పోరులో భారత్ 235 పరుగులు నమోదు చేసింది. -
పరిశ్రమలకు మేలు చేసే ఒప్పందం
భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సుదీర్ఘమైన, క్లిష్టమైన చర్చల అనంతరం ఒక కొలిక్కి వచ్చినది మాత్రమే కాదు; మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్న తీరుకు అది ప్రతీకగా నిలుస్తోంది. పైగా ఇచ్చిపుచ్చుకోవడంలో పరస్పర ప్రయోజనాలున్న రెండు పెద్ద ఆర్థిక వ్యవ స్థలను అది కలుపుతోంది. ఈ రెండింటి వాటా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో నాల్గవ వంతుగా ఉంది. భవిష్యత్తులో కూడా ఆర్థిక బంధం స్థిరంగా కొనసాగేందుకు అది పునాది వేసింది. ఇది తాత్కాలిక బేరసారాల ప్రయోజనాల చుట్టూ అల్లుకున్నది కాకపోవడం వల్లనే ‘అన్ని భాగస్వామ్యాలకు మాతృక’ లాంటిది అనే పేరు తెచ్చుకుంది. ఇది దీర్ఘకాలిక ఆశయంతో సమగ్రంగా రూపుదిద్దుకున్న ఒప్పందం. వస్తు వాణిజ్యం, సేవలతోపాటు ఇన్వెస్ట్ మెంట్, డిజిటల్ ట్రేడ్, సతత వికాసం, రాకపోకలు, సాంకేతిక పరి జ్ఞాన సహకారాన్ని కూడా జోడించుకోవడం వల్ల ఇదేదో కేవలంసుంకాలలో వెసులుబాటు కల్పించుకున్నదిగా కాక, రెండు పక్షాలకు ప్రయోజనదాయకమైన ఆర్థిక చట్రాన్ని రూపొందించుకోగలిగింది. భారతీయ పారిశ్రామిక రంగానికి ఇది చాలా అవసరం. ఎందుకంటే, పోటీ సామర్థ్యం ప్రస్తుతం మార్కెట్ల సౌలభ్యానికి మాత్రమే పరిమితమైనదిగా లేదు. దానికి ఒక స్థిరమైన, నమ్మకమైన, స్థితి స్థాపక సామర్థ్యమున్న వాతావరణం అవసరమవుతోంది.స్థిరమైన మార్కెట్ఐరోపా వంటి విస్తృత, నియమ–ఆధారిత మార్కెట్ వల్ల ఒక లాభం ఉంది. వివిధ సంస్థలు స్వల్పకాలిక లాభాలకు అతీతంగా, పెట్టుబడులు, ఎగుమతులు, ఉత్పాదక సామర్థ్యం, భాగస్వామ్యా లపై దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, పాదరక్షలు, ఎలక్ట్రికల్ యంత్ర పరికరాలు, రసాయనాలు, మోటారు వాహనాల విడి భాగాల వంటి ఎక్కువ మంది శ్రమ అవసరమైన రంగాలకు అది మరీ అవసరం. ఎక్కువ మందికి ఉపాధి కల్పించగల శక్తి కూడా ఆ రంగాలకు ఉంది. ఆయా రంగాలకు యూరోపియన్ మార్కెట్లు మునుపటికన్నా మెరుగ్గా అందుబాటులోకి వస్తే గణనీయమైన లాభం చేకూరుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలతో సహా భారతీయ సంస్థలకు మరో మహత్తర అవకాశం లభిస్తోంది. అవి కేవలం ధర విషయంలో పోటీపడటం కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా మరింత మన్నికైన, విలువ ఆధారిత వస్తువుల ఉత్పత్తికి, విక్రయానికి యూరోపియన్ సంస్థలతో భాగ స్వామ్యం కుదుర్చుకోవడం తేలికవుతుంది. కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడటం వల్ల రిస్కులుంటాయి. వాటిని తగ్గించుకునేందుకు, ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునేందుకు భారత్–యూరప్ కంపెనీలు రెండూ సప్లై చైన్లను చురుకుగా విస్తరించుకుంటున్నాయి. స్థాయి, సమరశీల సంస్కరణల అజెండా, మెరుగుపడిన పారిశ్రామిక మౌలిక వసతులతో యూరప్కుఇండియా నమ్మదగిన ఉత్పత్తి కేంద్రంగా, నవీకరణ భాగస్వామిగా ఆవిర్భవించగల స్థితిలో ఉంది. ఆ రకమైన మార్పునకు చాలా వరకు టెక్నాలజీ సహకారం పునాదిని అందిస్తుంది. కాలుష్య రహిత టెక్నాలజీలు, డిజిటల్ మౌలిక వసతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, అగ్రికల్చర్ టెక్నాలజీ, అడ్వాన్డ్స్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో బలమైన సహకారాన్ని పాదుకొల్పుకునేందుకు తగిన పరిస్థితులను ఈ ఒప్పందం సృష్టిస్తోంది. నవీకరణలో ఐరోపాకున్న బలం, భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టగల భారత్ సామర్థ్యం ఈ విషయంలో సహజసిద్ధమైన పరస్పర ప్రయోజనదాయకమైన అంశాలుగా పరిణ మిస్తాయి. అధునాతన టెక్నాలజీలను అనుసరించడంలోనేకాదు, వాటి సహ అభివృద్ధిలో, స్థానికీకరణలో, నియోగించడంలో పాలు పంచుకునే అవకాశం భారత్ పరిశ్రమలకు లభిస్తుంది. ఫలితంగా, హెచ్చు విలువ కలిగిన వస్తూత్పత్తి, టెక్నాలజీ సునిశిత రంగాల్లోకి భారత్ పయనం వేగవంతమవుతుంది.పరస్పర తోడ్పాటు సేవలు, మానవ మూలధనంపై ఈ ఒప్పందం చూపగల ప్రభావం కూడా తక్కువదేమీ కాదు. జనాభా వర్గాలలో భారత దేశానికి ఉన్న సానుకూలాంశం వ్యూహాత్మక ఆస్తిగా పరిణమిస్తుంది. ప్రపంచంలోని పెద్ద యువ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఇండియా, టెక్నాలజీ, ఇంజినీరింగ్, పరిశోధన, ఆరోగ్య రక్షణ, వ్యాపార సేవలు వంటి వివిధ విభాగాల్లోకి వృత్తినిపుణులను తీసుకురాగలదు. యూరప్లో వయసు మీదపడుతున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండ వచ్చు. కానీ, వాటి ఆర్థిక వ్యవస్థలు నవీకరణతో నడుస్తున్నాయి. వాటికి సేవలను, మొబిలిటీని అందుబాటులోకి తెచ్చేందుకు యూరప్తో సంబంధాలు నెరపడంలో భారత నిపుణులకున్న సామ ర్థ్యాన్ని ఈ ఒప్పందం మెరుగుపరుస్తుంది. భద్రత–రక్షణ రంగాల్లో కూడా ఉభయ పక్షాల ప్రయోజనాలు సమ్మిళితం కావడం ఈ ఒప్పందంలో మరో ముఖ>్యంశం. అధునా తన రక్షణ పరికరాలు, ద్వంద్వ వినియోగ టెక్నాలజీ ఆవరణ వ్యవస్థ లలో తోడ్పాటుకు భారతీయ పరిశ్రమలకు ఈ ఒప్పందం ద్వారాలు తెరుస్తోంది. క్రమేపీ సమస్యాత్మకంగా మారుతున్న ప్రపంచ వాతా వరణంలో బలహీనతలను తగ్గించుకుంటూ, దేశీయ పారిశ్రామిక సామర్థ్యాలను పటిష్టపరచుకునేందుకు కూడా వీలుంది. మరో రకంగా కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గణనీయమై నదే. సమ్మిళితం ద్వారా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారతదేశం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఈఒప్పందం ఎంతగానో అవసరమవుతుంది. దేశీయ ఉత్పాదక సామ ర్థ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా నిష్ఠగా ఈ ఒప్పందాన్ని అమలు జరిపితే, భారతదేశపు పారిశ్రామిక పథం రూపురేఖలు కొన్ని దశాబ్దాలపాటు కొత్త అంచులను తాకుతూ ముందుకు సాగుతాయి. ప్రపంచ వాణిజ్యంలో భారత పారిశ్రామిక రంగ స్థితి ఎక్కడో అంచుల లోకాక, కేంద్ర స్థానాన్ని సుస్థిరంగా ఆక్రమించుకోగలుగుతుంది. -వ్యాసకర్త భారతీయ పరిశ్రమల సంఘాల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)- చంద్రజిత్ బెనర్జీ -
ఈయూతో భారత్ దోస్తీ.. పాకిస్తాన్కు కొత్త టెన్షన్!
ఇస్లామాబాద్: భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం కారణంగా దాయాది దేశం పాకిస్తాన్కు కొత్త టెన్షన్ మొదలైంది. భారత్, ఈయూ ఒప్పందం పాకిస్తాన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆ దేశ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, యూరోపియన్ యూనియన్కు పాకిస్తాన్ భారీ మొత్తంలో ఎగుమతులు చేస్తోంది. ఈ క్రమంలో వాణిజ్యం విషయంలో 2014లో పాకిస్తాన్కు ఈయూ ‘జీఎస్పీ+’ హోదాను కూడా ఇచ్చింది. దీని కింద రాయితీ సుంకాల కారణంగా ఐరోపాకు పాకిస్తాన్ టెక్స్టైల్స్ ఎగుమతులు 108 శాతం పెరిగాయి. రెండు పక్షాల మధ్య వాణిజ్య విలువ 12 బిలియన్ యూరోలకు చేరువైంది. అయితే, ఈ హోదా గడువు వచ్చే ఏడాది డిసెంబరుతో ముగియనుంది. ఇలాంటి సమయంలో భారత్, ఈయూ మధ్య ఇటీవలే వాణిజ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కారణంగా తమ ఎగుమతులపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈయూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా తాహిర్ అంద్రాబీ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత్-ఈయూ ఒప్పందం గురించి మాకు తెలిసింది. అందులోని అంశాలను గమనిస్తున్నాం. ఇప్పటి వరకు ఈయూకి పాకిస్తాన్ భారీగా ఎగుమతులు చేస్తోంది. జీఎస్పీ+ స్కీం.. ఈయూతో ద్వైపాక్షిక సహకారానికి విజయవంతమైన నమూనాగా నిరూపితమైంది. ఈ ఒప్పందం ద్వారా పాక్ నుంచి ఈయూ దేశాలకు టెక్స్టైల్స్ ఎగుమతులు అక్కడి మార్కెట్ అవసరాలను సరసమైన ధరల్లోనే తీరుస్తున్నాయి. గత ఏడాది తమ మధ్య జరిగిన వ్యూహాత్మక చర్చల సందర్భంగా జీఎస్పీ+ అంశం చర్చకు వచ్చింది. ఈయూతో దీర్ఘకాలంగా ఉన్న స్నేహపూర్వక, పరస్పర ప్రయోజనకర సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు’ తెలిపారు.భారత్, ఈయూ డీల్.. ఇదిలా ఉండగా.. భారత్, ఈయూ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలిచే ఈ ఒప్పందాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈయూ నేతలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ఆంటోనియో కోస్టా సంయుక్తంగా ప్రకటించారు. దీంతోపాటు భద్రత, రక్షణ రంగంలో బంధం మరింత బలోపేతం, భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో అవకాశాలను కల్పించే ఒప్పందాలూ కుదిరాయి. ఎఫ్టీఏపై చర్చలతో ప్రారంభించి మొత్తం 13 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం కారణంగా ఐరోపా కార్లు, మద్యం భారత్లో చౌకగా లభించనున్నాయి. భారతీయ రైతులు, చిన్న పరిశ్రమలవారి ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లో విస్తృత అవకాశాలు లభించనున్నాయి. ప్రపంచ జీడీపీలో 25శాతానికి, వాణిజ్యంలో మూడో వంతుకు ఈ ఒప్పందం ప్రాతినిధ్యం వహించనుంది. ఎఫ్టీఏతో ఈయూ దేశాలకు భారత్ చేసే 99శాతానికిపైగా ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి. అలాగే ఈయూ భారత్కు చేసే 97శాతం ఎగుమతులపై సుంకాలు దిగివస్తాయి. భారత్ నుంచి ఎగుమతి చేసే టెక్స్టైల్, దుస్తులు, తోలు ఉత్పత్తులు, హస్త కళలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి. ఐరోపా దేశాల నుంచి వచ్చే మద్యం, ఆటోమొబైల్ ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు తదితరాలపై సుంకాలు తగ్గుతాయి. -
కమర్షియల్ విమానాలు మూడు రెట్లు వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూడో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్గా భారత్ వృద్ధి చెందే క్రమంలో దేశీయంగా 100 సీట్ల పైగా సామర్థ్యం ఉండే కమర్షియల్ విమానాల సంఖ్య వచ్చే దశాబ్ద కాలంలో మూడు రెట్లు పెరుగుతుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ అంచనా వేస్తోంది. దీని ప్రకారం ప్రస్తుతం 850గా ఉన్న సంఖ్య 2035 నాటికి 2,250కి పెరగనుంది. దేశీయంగా ఏవియేషన్ మార్కెట్ వృద్ధి చెందుతుండటం, అంతర్జాతీయ రూట్లలో కూడా కార్యకలాపాలను విస్తరించడంపై దేశీ విమానయాన సంస్థలు గణనీయంగా దృష్టి పెడుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎయిర్బస్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ జర్జెన్ వెస్టర్మెయర్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం భారత ఎయిర్లైన్స్ నుంచి 1,250 విమానాలకు ఆర్డర్ల బ్యాక్లాగ్ ఉందని వివరించారు. ఏటా సగటున 120–150 వరకు విమానాలను అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.వచ్చే పదేళ్లలో భారత్లో ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి వార్షికంగా 8.9 శాతంగా ఉండొచ్చని, విమానాశ్రయాల సంఖ్య మరో 50 మేర పెరగవచ్చని భావిస్తున్నట్లు వెస్టర్మెయర్ తెలిపారు. కమర్షియల్ విమానాల సంఖ్య పెరగడంతో పాటు వార్షికంగా సరుకు రవాణా సామర్థ్యం పెరిగేందుకు కూడా అవకాశం ఉందని ఆయన చెప్పారు. భారతీయ విమానయాన సంస్థలు సుమారు 1,700 విమానాలకు ఆర్డర్లివ్వగా, ఎయిర్బస్ దగ్గర 72% బ్యాక్లాగ్ ఉందని వెస్టర్మెయర్ తెలిపారు. 35 వేల మంది పైలట్లు కావాలి.. విమానాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో 2035 నాటికి 35,000 మంది పైగా పైలట్లు అవసరమవుతారని, అలాగే సాంకేతిక సిబ్బంది సంఖ్య కూడా మూడు రెట్లు పెరిగి 34,000 స్థాయిలో కావాల్సి ఉంటుందని వెస్టర్మెయర్ చెప్పారు. ప్రస్తుతం పైలట్ల సంఖ్య 12,000గా, సాంకేతిక సిబ్బంది సంఖ్య సుమారు 11,000గా ఉన్నట్లు ఆయన తెలిపారు. విమానాల సంఖ్య మూడు రెట్లు పెరిగే క్రమంలో భారత్ వేగంగా మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్ కార్యకలాపాలకి హబ్గా ఎదుగుతుందని వెస్టర్మెయర్ చెప్పారు.ఎయిర్ఫ్రేమ్లు, ఇంజిన్లు, విడిభాగాల మార్కెట్ 2035 నాటికి మూడు రెట్లు పెరిగి 9.5 బిలియన్ డాలర్లకు చేరగలదని పేర్కొన్నారు. ఇక ఫ్లయిట్, గ్రౌండ్, సాంకేతిక కార్యకలాపాల డిజిటలైజేషన్తో పాటు సైబర్ సెక్యూరిటీ మొదలైన వాటిపై భారతీయ ఎయిర్లైన్స్ 1 బిలియన్ డాలర్ల వరకు వెచ్చించే అవకాశం ఉందన్నారు.భారత్లో తొలిసారిగా రూపొందించి, అసెంబుల్ చేసిన ఎయిర్బస్ సీ–295 ట్విన్ ఇంజిన్ మీడియం మిలటరీ రవాణా విమానాన్ని 2026 మూడో త్రైమాసికంలో డెలివర్ చేయనున్నట్లు వెస్టర్మెయర్ వివరించారు. ఎయిర్బస్ హెచ్125 హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్స్ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి డెలివరీలు ప్రారంభం కాగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ నుంచి 1.5 బిలియన్ డాలర్ల మేర కొనుగోళ్లు చేస్తున్నామని పేర్కొన్నారు. -
పెద్దతరం చిన్నపోవద్దు!
70% భారతదేశంలో కుటుంబ సభ్యులు లేకుండా ఒంటరిగా ఉంటున్న వృద్ధుల సంఖ్య 80 నుండి 90 లక్షల వరకు వుంటుందని గణాంకాల అంచనా. వీరిలో 70 శాతం ఒంటరి వృద్ధులు మహిళలే. 2040 2040 నాటికి ఒంటరిగా నివసించే వృద్ధ దంపతులు, ఒంటరి వృద్ధుల సంఖ్య బాగా పెరగనుందని గణంకాలు చెబుతున్నాయి. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం వేగంగా వృద్ధాప్యంలోకి అడుగుపెడుతోంది.2050 నాటికి ప్రతి ఐదుగురు భారతీయులలో ఒకరు వృద్ధులుగా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ గణాంకాల కంటే భయంకరమైనది వారు ఎదుర్కొంటున్న భావోద్వేగ నిర్లక్ష్యం. పిల్లలే సర్వస్వమనుకొని,వారికోసమే తమ జీవితాన్ని గడిపిన వారికి నేడు ఒంటరితనం శాపంలా మారుతోంది. ఎంతలా అంటే జీవితంపై ఆసక్తి పోయేంతలా.మానసిక కేంద్రాలకు వెళ్లేంతలా, తమకు గౌరవం, విలాసాలు కాదు కావల్సింది... ఒక ప్రేమపూర్వకమైన చిన్న పలకరింపు మాత్రమే అని వేడుకునేంతలా...20462046 నాటికి వృద్ధాప్య సంరక్షణ కేంద్రాలు తప్పనిసరి అవసరంగా మారబోతున్నాయి.20%ప్రస్తుతం భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వారు దాదాపు 10 శాతం ఉండగా, 2040–46 నాటికి ఇది 20 శాతానికి చేరుకుంటుందని అంచనా. అంటే ప్రతి ఐదుగురిలో ఇద్దరు వృద్ధులు వుంటారు.70%సుమారుగా 75 శాతం మంది వృద్ధులు రోజూవారీ అవసరాల కోసం ఇతరులపై లేదా పిల్లలపై ఆధారపడుతున్నారు. 25 నుండి 50 శాతం వృద్ధ జంటలు పిల్లలు లేకుండా కేవలం ఇద్దరు మాత్రమే నివసిస్తున్నారు. 70శాతం మందికి ఎటువంటి పెన్షనూ లేదు. 10ఢిల్లీ ఎయిమ్స్లోని మానసిక వైద్య నిపుణుల ప్రకారం వృద్ధులలో 70 శాతం మంది నిద్రలేమి, ఒత్తిడి, మానసిక అనారోగ్యం, ఆందోళనతో బాధపడుతున్నారు. వృద్ధాప్యంలో చాలామంది తమ మనసులోని బాధను, ఒంటరి తనాన్ని మాటల్లో చెప్పలేరు. అందుకే అది ఇతర శారీరక సమస్యల రూపంలో బయటపడుతుంది. ఒంటరిగా ఉండే వృద్ధులలో డిప్రెషన్ వచ్చే అవకాశం కుటుంబంతో ఉండే వారికంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 70 శాతం అనే ఈ గణాంక సంఖ్య కేవలం ఒక అంకె కాదు, అది భారతదేశం ఎదుర్కోబోయే ఒక భారీ నిశ్శబ్ద మహమ్మారికి సంకేతం.1.4 భారత్లో డిమెన్షియా (మతి మరుపు) బాధితుల సంఖ్య ప్రతి 20 ఏండ్లకు రెట్టింపు అవుతుందని అంచనా. ప్రస్తుతం 2023–24 అంచనాల ప్రకారం సుమారు 88 లక్షల మంది 60 ఏళ్ల పైబడినవారు డిమెన్షియాతో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 1.4 కోట్లకు చేరుకుంటుందని అంచనా.40%ఐఎల్ఎస్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ లా అండ్ పాలసీ డైరెక్టర్, డాక్టర్ సౌమిత్ర పాఠరే ప్రకారం భారతదేశంలో వృద్ధుల ఆత్మహత్యలు 2019 లో 11,013 ఉండగా 2022 నాటికి ఆ సంఖ్య 15,339 కి పెరిగింది. అంటే ఆత్మహత్యల రేటు దాదాపుగా 40 శాతం పెరిగింది. భారతదేశంలో సగటున 42 మంది వృద్ధులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.14%ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 60ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం మంది ఏదో ఒక మానసిక రుగ్మతతో సతమతమవుతున్నారు.1,37,653 ది జర్నల్స్ ఆఫ్ జెరంటాలజీ సిరీస్ బి అనే పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం సామాజిక ఒంటరితనం వృద్ధులలో మానసిక సామర్థ్యం తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం 14 ఏళ్ల కాలంలో 1,37,653 మానసిక పరీక్షలను విశ్లేషించింది. -
హైదరాబాద్ వేదికగా అమెరికా-భారత్ TRUST కార్యక్రమం
హైదరాబాద్: అమెరికా- భారత్ కలిసి TRUST (Transforming the Relationship Utilizing Strategic Technology) కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాయి. హైదరాబాద్లో జరిగిన కీలక సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశ్రమ నాయకులు పాల్గొని కృత్రిమ మేధస్సు (AI) , సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశాన్ని అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్-వరల్డ్ ట్రేడ్ సెంటర్ (శంషాబాద్, విశాఖపట్నం) సంయుక్తంగా నిర్వహించాయి. ఇది 2025 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్- భారత ప్రధాని మోదీ ప్రారంభించిన TRUST కార్యక్రమాన్ని అమలు చేయడంలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, విద్యాసంస్థలు, ప్రైవేట్ రంగం కలిసి కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, ఇంధనం, అంతరిక్ష రంగం, దీర్ఘకాలిక భద్రతకు కీలకమైన రంగాల్లో భాగస్వామ్యాలను పెంపొందించనున్నారు.సరఫరా గొలుసును బలోపేతం చేయడంతో పాటు ఏఐ మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడం, ఆవిష్కరణ ఎకోసిస్టమ్లను పెంపొందించడం తదితర అంఃశాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉన్నాయి. దీని ద్వారా రెండు దేశాల సాంకేతిక సామర్థ్యాలు, ఆర్థిక పోటీ సామర్థ్యం మరింత బలపడనున్నాయి. -
ఈయూ, భారత్ ట్రేడ్పై అమెరికా ఓవరాక్షన్!
వాషింగ్టన్: భారత్, యురోపియన్ యూనియన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వేళ అగ్రరాజ్యం అమెరికా.. భారత్ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు కురిపిస్తోంది. తాజాగా అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్.. భారత్, ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు, ఈ ఒప్పందం యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం కంటే వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఈయూ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. భారత్తో వాణిజ్యం విషయంలో ఈయూ నిర్ణయం పట్ల నిరాశ చెందాను. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ఒప్పందాన్ని అన్ని ఒప్పందాలకు తల్లిగా ప్రశంసించారు. కానీ, వారు తమకు ఏది ఉత్తమమో అది చేయాలి. భారత్పై అమెరికా సుంకాలను విధించడాన్ని ఈయూ ఇష్టపడటం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25 శాతం సుంకాలను విధించాం. కానీ.. ఏం జరిగిందో చూశారా? యురోపియన్లు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అమెరికాలాగే భారత్పై అదనపు సుంకాలు విధించేందుకు ఈయూ విముఖత వ్యక్తం చేసిందన్నారు. సొంత వాణిజ్య ఒప్పందానికి ముందుకు వెళ్తున్నందునే.. వారు ఆ పని చేసేందుకు ఇష్టపడలేదన్నారు. ఐరోపా ఉక్రెయిన్ ప్రజల కంటే వాణిజ్య ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. రష్యన్ చమురు తొలుత భారత్కు వెళ్తోంది. అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. వాటిని ఐరోపావాసులు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారు’ అంటూ విమర్శలు గుప్పించారు.Bessent: "I find the Europeans very disappointing because the Europeans are on the frontline of the Ukraine-Russia war. India started buying sanctioned Russian oil and guess who was buying the refined products? The Europeans. So the Europeans have been funding the war against… pic.twitter.com/QSkcdYL7QL— Aaron Rupar (@atrupar) January 28, 2026అంతకుముందు కూడా బెసెంట్.. భారత్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు బెసెంట్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ‘రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుంది. అది భారీ విజయం. చమురు విషయంలో ఇప్పటికీ టారిఫ్లు అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని అనుకుంటున్నాను’ అని సుంకాల తొలగింపు గురించి పరోక్షంగా వెల్లడించారు. -
యూరప్ దేశాల్లో మన ఆయుష్ సేవలు
న్యూఢిల్లీ: చరిత్రాత్మక ఇండియా–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారతీయ ప్రాచీన సంప్రదాయ వైద్య సేవలు అందించేవారు విశేషంగా ప్రయోజనం పొందుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన ఆయుష్ వైద్యులు ఇకపై యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లోనూ వైద్య చికిత్సలు, సేవలు అందించవచ్చని తెలిపారు. వారికి అక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. మనదేశంలో ఆర్జించిన వైద్య అర్హతలతో యూరప్ దేశాల్లో పని చేయవచ్చని సూచించారు. ఆయుర్వేదం, యోగా వంటివి నేర్చుకున్న యువతకు చక్కటి ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. కేరళలోని ఆర్య వైద్యశాల చారిటబుల్ హాస్పిటల్ శత వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈయూతో కుదిరిన ఒప్పందాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ సంప్రదాయ వైద్య సేవలకు, వైద్యులకు మేలు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. యూరప్ దేశాల్లో వెల్నెస్ కేంద్రాలు ఈయూతో ఒప్పందంలో భాగంగా యూరప్ దేశాల్లో ఆయుష్ వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చని ప్రధానమంత్రి వివరించారు. మన సంప్రదాయ ఆయుర్వేద, ఆయుష్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. శతాబ్దాలపాటు ఆయుర్వేదంతో భారతీయులు ప్రయోజనం పొందారని గుర్తుచేశారు. కానీ, దురదృష్టవశాత్తూ నేడు ఆయుర్వేదం గురించి మన దేశంలోనే ప్రజలకు పూర్తిగా తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆయర్వేదం ప్రాముఖ్యతను దేశ విదేశాల్లో ప్రజలకు వివరించాల్సిన అవసరం వచి్చందని ఉద్ఘాటించారు. సాక్ష్యాల ఆధారిత పరిశోధనలు, పరిశోధన పత్రాల అందుబాటులో లేకపోవడం వల్లే ఆయుర్వేదం గురించి ప్రజలకు తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. 600కుపైగా ఔషధాల తయారీ సైన్స్, ప్రజల విశ్వాసం ఆధారంగా ఆయుర్వే ద విధానాలను పరీక్షిస్తే అవి బలోపేతం అవుతాయని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయర్వేదానికి ప్రాముఖ్యత లభించేలా ఆర్య వైద్యశాల కృషి చేస్తోందని ప్రశంసించారు. సీఎస్ఐఆర్, ఐఐటీ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తూ ఆయుర్వేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని తెలిపారు. దీనిపై ఎన్నో పరిశోధనలు చేస్తోందన్నారు. ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానాలను పరిరక్షించడంలో, మరింత అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉందని వివరించారు. ఆర్య వైద్యశాల వ్యవస్థాపకుడు వైద్య రత్నం పి.ఎస్.వారియర్ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా గుర్తుచేశారు. శతాబ్దాలుగా మానవళికి భారత్ అందిస్తున్న సేవలకు, సంప్రదాయ వైద్యానిక ఆర్య వైద్యశాల ఒక ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఆర్య వైద్యశాల 600కుపైగా ఔషధాలు తయారు చేస్తోందని, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆసుపత్రులను నిర్వహిస్తోందని వెల్లడించారు. విదేశాల నుంచి సైతం రోగులు వస్తుంటారని తెలిపారు. -
విమానయానరంగానికి కోపైలట్గా ఉండండి
సాక్షి, హైదరాబాద్: భారత విమానయాన రంగం గత దశాబ్ద కాలంలో చరిత్రాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఒకప్పుడు దేశంలో విమానయానం కొద్దిమందికే పరిమితం కాగా.. నేడు భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఎదిగిందని చెప్పారు. విమాన తయారీ, పైలట్ శిక్షణ, అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ, విమాన లీజింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని.. వీటిని పరిశ్రమల అధిపతులు, పెట్టుబడిదారులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తానికి భారత విమానయాన రంగానికి కోపైలట్గా ఉండాలని చెప్పారు. రాబోయే కాలంలో విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగి పెట్టుబడులకు విస్తృత అవకాశాలు దొరుకుతాయన్నారు. బుధవారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా–2026’ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. గత పదేళ్లలో దేశీయ విమానయాన రంగం అసాధారణ అభివృద్ధి సాధించిందని, ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయని వెల్లడించారు. ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ విమానయాన సంస్థలు 1,500కు పైగా కొత్త విమానాలను ఆర్డర్ చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల భాగస్వాములకు వింగ్స్ ఇండియా సదస్సు ఎంతో కీలకమన్నారు. రెండో దశ ‘ఉడాన్’ స్కీమ్’విమాన ప్రయాణాన్ని ప్రత్యేక హక్కుగా కాకుండా ప్రతి పౌరుడికి అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేశామని ప్రధాని మోదీ చెప్పారు. 2014లో దేశంలో కేవలం 70 విమానాశ్రయాలే ఉండగా, ప్రస్తుతం అవి 160కిపైగా చేరాయని, పదేళ్లలోనే రెట్టింపు కంటే ఎక్కువ విమానాశ్రయాలు నిర్మించినట్లు తెలిపారు. ప్రాంతీయ, ఎయిర్ కనెక్టివిటీ, స్లీ–ప్లేన్ ఆపరేషన్స్ కోసం రెండో దశ ‘ఉడాన్ స్కీమ్’ ఉంటుందన్నారు. ప్రతీ పౌరుడు సులభంగా విమానయానం చేసేందుకు వీలైన చర్యల్లో భాగంగా సరసమైన విమాన చార్జీల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు కోటిన్నర మంది ప్రయాణికులు, గతంలో లేని మార్గాల్లో కూడా ప్రయాణించారని తెలిపారు. 2047 నాటికి దేశంలో 400కు పైగా విమానాశ్రయాలు ఉండనున్నాయని, అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారత్ ముందుకెళ్తున్నందున విమాన అనుసంధాన విస్తరణ మరింత వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు. పర్యాటక రంగంపైనా దృష్టిదేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ, ఎక్కువ మంది విమాన ప్రయాణాన్ని ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోందని ప్రధాని మోదీ చెప్పారు. విమాన డిజైన్, తయారీ, మరమ్మతులు–నిర్వహణ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. భారత్ ఇప్పటికే విమాన భాగాల తయారీలో కీలక దేశంగా మారిందని, దేశీయంగానే సైనిక, రవాణా విమానాలను ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. పౌర విమానాల తయారీ దిశగానూ అడుగులు వేస్తున్నామని తెలిపారు. భౌగోళికంగా భారత్కు ఉన్న వ్యూహాత్మక స్థానం, విస్తృత దేశీయ అనుసంధాన వ్యవస్థ, భవిష్యత్తులో పెద్దఎత్తున విమాన సేవల విస్తరణ భారత్కు పెద్ద బలమని పేర్కొన్నారు. భారత్లో రూపొందించి తయారుచేసిన ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటీవోఎల్) విమానాలు త్వరలోనే దేశీయ విమానయాన రంగాన్ని మార్చబోతున్నాయని, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని చెప్పారు.గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీసస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్పై భారత్ గట్టిగా పని చేస్తోందని, భవిష్యత్తులో గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీ, ఎగుమతుల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. విమానయాన రంగంలో సంస్కరణల వల్ల భారత్ గ్లోబల్ సౌత్కు, ప్రపంచానికి మధ్య ప్రధాన విమాన ద్వారంగా మారుతోందని చెప్పారు. పెట్టుబడిదారులు, తయారీదారులకు ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. విమానయానంతో పాటు ఎయిర్ కార్గో రంగానికీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, కార్గో రవాణా వేగవంతం, సులభతరం చేయడానికి సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. భారత్ త్వరలో అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మారుతుందని, గిడ్డంగులు, ఫ్రైట్ ఫార్వర్డింగ్, ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్, ఈ–కామర్స్ రంగాల్లో అవకాశాలను పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
దక్షిణాసియాకు 3,300 కొత్త విమానాలు అవసరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే దాదాపు రెండు దశాబ్దాల్లో 2044 నాటికి దక్షిణాసియాలోని ఎయిర్లైన్స్కి సుమారు 3,300 కొత్త విమానాలు అవసరం కానున్నాయి. ఇందులో భారత్ వాటా దాదాపు 90 శాతం ఉండనుంది. అమెరికన్ విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ తమ కమర్షియల్ మార్కెట్ ఔట్లుక్ (సీఎంవో)లో ఈ మేరకు అంచనాలు వేసింది. బుధవారమిక్కడ ఏవియేషన్ సదస్సు వింగ్స్ 2026 కార్యక్రమం సందర్భంగా బోయింగ్ ఎండీ (కమర్షియల్ మార్కెటింగ్, యురేషియా, ఇండియన్ సబ్కాంటినెంట్) అశ్విన్ నాయుడు ఈ విషయాలు తెలిపారు. 3,300 విమానాల డిమాండ్కి సంబంధించి 2,875 చిన్న విమానాలు, 395 పెద్ద విమానాలు ఉండవచ్చని చెప్పారు. ప్రాంతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్లో విమానాల సంఖ్య వచ్చే 20 ఏళ్లలో నాలుగు రెట్లు పెరగనుందని నాయుడు తెలిపారు. ఇదే సమయంలో భారత్, దక్షిణాసియాలో ప్యాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ సగటున 7 శాతం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మధ్యతరగతి జనాభా, ఆర్థిక వృద్ధి, ఎయిర్పోర్టులు, కనెక్టివిటీ పెరుగుతుండటం ఇందుకు దోహదపడుతుందని వివరించారు. భారీగా సిబ్బంది .. వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రాంతీయంగా విమానయాన సంస్థలకు సుమారు 1,41,000 మంది సిబ్బంది అవసరమవుతారని నాయుడు తెలిపారు. ఇందులో 45,000 మంది పైలట్లు, 45,000 మంది టెక్నీషియన్లు, 51,000 మంది క్యాబిన్ సిబ్బంది ఉంటారని వివరించారు. దక్షిణాసియాలో మెయింటెనెన్స్, రిపేర్, డిజిటల్ సర్వీసులు, శిక్షణ మొదలైన ఏవియేషన్ సరీ్వసులపై 195 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైటెక్ తయారీ రంగం, ఈకామర్స్ తదితర రంగాల దన్నుతో ఎయిర్ కార్గో మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందనుందని, ఈ నేపథ్యంలో కొత్తవి, కన్వర్ట్ చేసిన ఫ్రైటర్ల సంఖ్య ప్రస్తుత స్థాయి నుంచి అయిదు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. -
IND Vs NZ: నాలుగోది చేజారె...
టి20 సిరీస్లో వరుసగా మూడు అద్భుత ప్రదర్శనల తర్వాత భారత జట్టు విశాఖ తీరంలో న్యూజిలాండ్ ముందు తలవంచింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి బంతికే అభిషేక్ శర్మ అవుట్తో మొదలైన ఇన్నింగ్స్ చివరకు ఓటమితో ముగిసింది. 15 బంతుల అర్ధ సెంచరీతో శివమ్ దూబే పోరాడినా... దురదృష్టవశాత్తూ అతని నిష్క్రమణతో ఓటమి ఖాయమైంది. సీఫెర్ట్, కాన్వే, సాంట్నర్ల మెరుగైన ప్రదర్శనతో ఎట్టకేలకు సిరీస్లో తొలి గెలుపుతో కివీస్కు కాస్త ఊరట దక్కింది. సాక్షి, విశాఖపట్నం: న్యూజిలాండ్తో టి20 సిరీస్లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. సిరీస్ గెలుచుకున్న తర్వాత బుధవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన నాలుగో మ్యాచ్లో కివీస్ 50 పరుగుల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ (36 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్స్లు), డెవాన్ కాన్వే (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్లు) తొలి వికెట్కు 50 బంతుల్లోనే 100 పరుగులు జోడించగా... చివర్లో డరైల్ మిచెల్ (18 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. శివమ్ దూబే (23 బంతుల్లో 65; 3 ఫోర్లు, 7 సిక్స్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రింకూ సింగ్ (39; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. సిరీస్లో భారత్ 3–1తో ఆధిక్యంలో ఉండగా, చివరి పోరు శనివారం తిరువనంతపురంలో జరుగుతుంది. ఓపెనర్ల దూకుడు... అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి కివీస్ ఇన్నింగ్స్ను జోరుగా మొదలు పెట్టిన సీఫెర్ట్... హర్షిత్ వేసిన తర్వాతి ఓవర్లో సిక్స్, ఫోర్ బాదాడు. అతడి మరుసటి ఓవర్లో కూడా ఓపెనర్లిద్దరు కలిసి 15 పరుగులు రాబట్టగా... రవి బిష్ణోయ్ తొలి ఓవర్లో కాన్వే 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 71 పరుగులకు చేరింది. 25 బంతుల్లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే శతక భాగస్వామ్యం తర్వాత కివీస్ 35 బంతుల వ్యవధిలో 37 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. గ్లెన్ ఫిలిప్స్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కొంత దూకుడుగా ఆడగా, చివరి 3 ఓవర్లలో 47 పరుగులు రాబట్టి న్యూజిలాండ్ మెరుగైన స్కోరును అందుకుంది. బుమ్రా వేసిన 19వ ఓవర్లో మిచెల్, హెన్రీ (6 నాటౌట్) కలిసి 2 ఫోర్లు, సిక్స్ సహా మొత్తం 19 పరుగులు సాధించారు. దూబే సిక్సర్ల జోరు... భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే వెనుదిరగ్గా... కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (8) కూడా విఫలమయ్యాడు. సామ్సన్ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా భారీ స్కోరు చేయడంలో మళ్లీ విఫలం కాగా, హార్దిక్ పాండ్యా (2) ప్రభావం చూపలేదు. వరుసగా రెండు సిక్సర్లతో తన స్కోరును మొదలు పెట్టిన రింకూ ఆ తర్వాతా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. రింకూ అవుటైన తర్వాత దూబే మెరుపు షాట్లతో జట్టు విజయంపై ఆశలు రేపాడు. తొలి బంతికే సిక్స్తో ఖాతా తెరిచిన దూబే... సోధి ఓవర్లో వరుసగా 2, 4, (వైడ్), 6, 4, 6, 6 బాదడంతో మొత్తం 29 పరుగులు లభించాయి. డఫీ వేసిన తర్వాతి ఓవర్లో కూడా అతను మరో 2 సిక్స్లు కొట్టి 15 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ అతను రనౌటయ్యాడు. 31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్షిత్ కొట్టిన షాట్ బౌలర్ హెన్రీ చేతికి తగిలి నాన్స్ట్రయికింగ్ ఎండ్లో స్టంప్స్కు తగిలింది. దాంతో దూబే అవుట్ కావడంతో పాటు భారత్ గెలుపు ఆశలు ముగిశాయి. 4 రెండేళ్ల క్రితం టి20 ప్రపంచకప్ సాధించిన తర్వాత భారత జట్టు 40 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడింది. కేవలం నాలుగుసార్లు మాత్రమే టీమిండియా ఆలౌటైంది. భారత్ను ఆలౌట్ చేసిన జట్లలో జింబాబ్వే, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి. 2 అంతర్జాతీయ టి20ల్లో ‘గోల్డెన్ డక్’గా వెనుదిరగడం అభిషేక్ శర్మకిది రెండోసారి. ఈ భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ (3 సార్లు) తొలి స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్, సంజు సామ్సన్, అభిషేక్ శర్మ (2 సార్లు చొప్పున) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు.3 అంతర్జాతీయ టి20ల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాటర్గా శివమ్ దూబే (15 బంతుల్లో) నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో), అభిషేక్ శర్మ (14 బంతుల్లో) ఉన్నారు.4 రింకూ సింగ్ ఈ మ్యాచ్లో ఫీల్డర్గా 4 క్యాచ్లు అందుకొని భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన అజింక్య రహానే రికార్డు (4)ను సమం చేశాడు.స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రింకూ (బి) కుల్దీప్ 44; సీఫెర్ట్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 62; రచిన్ (సి అండ్ బి) బుమ్రా 2; ఫిలిప్స్ (సి) రింకూ (బి) కుల్దీప్ 24; చాప్మన్ (సి) హర్షిత్ (బి) బిష్ణోయ్ 9; మిచెల్ (నాటౌట్) 39; సాంట్నర్ (రనౌట్) 11; ఫోక్స్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 13; హెన్రీ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–100, 2–103, 3–126, 4–137, 5–152, 6–163, 7–182. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–33–2, హర్షిత్ 4–0–54–0, బుమ్రా 4–0–38–1, రవి బిష్ణోయ్ 4–0–49–1, కుల్దీప్ యాదవ్ 4–0–39–2. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) కాన్వే (బి) హెన్రీ 0; సామ్సన్ (బి) సాంట్నర్ 24; సూర్యకుమార్ (సి అండ్ బి) డఫీ 8; రింకూ (ఎల్బీ) (బి) ఫోక్స్ 39; పాండ్యా (సి) ఫోక్స్ (బి) సాంట్నర్ 2; దూబే (రనౌట్) 65; హర్షిత్ (సి) రచిన్ (బి) సోధి 9; రవి బిష్ణోయ్ (నాటౌట్) 10; అర్ష్ దీప్ (సి) సాంట్నర్ (బి) సోధి 0; బుమ్రా (సి) సోధి (బి) సాంట్నర్ 4; కుల్దీప్ (సి) సీఫెర్ట్ (బి) డఫీ 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 165. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–55, 4–63, 5–82, 6–145, 7–157, 8–157, 9–162, 10–165. బౌలింగ్: హెన్రీ 3–0–24–1, డఫీ 3.4–0– 33–2, ఫోక్స్ 3–0–29–1, సోధి 4–0–46–2, సాంట్నర్ 4–0–26–3, ఫిలిప్స్ 1–0–7–0. -
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్


