కీవ్: డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్పై అమెరికా విధిస్తున్న అధిక సుంకాలు తగ్గించారు. దానికి ప్రతీగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం నిలిపివేసిందన్నారు. అయితే భారత్ దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గియో లవ్రోవ్ తొలిసారిగా ట్రంప్ వైఖరిపై స్పందించారు.
ఇటీవలే ట్రంప్ తిరిగి భారత్కు స్నేహహస్తం అందిస్తున్నారు. ఇంతకాలం భారత్ను తన అంగబలం ఆర్థికబలంతో గుప్పిట్లో పెట్టుకుందామనుకున్న ట్రంప్ అది కుదరదనే తెలిసాక తిరిగి రాజీ బాట పట్టారు. భారత్ ఎగుమతులపై అమెరికా పెంచిన అధిక పన్నులను తగ్గిస్తున్నామని ప్రకటించారు. భారత్ సైతం దీనికి సానూకూలంగా స్పందించి ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ సమయంలో ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిందని అన్నారు. అయితే ఈ స్టేట్మెంట్పై భారత్ స్పందించలేదు. తాజా రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ వ్రోవ్ ఈ అంశంపై స్పందించారు.
సెర్గీయో లవ్రోవ్ మాట్లాడుతూ" ఉక్రెయిన్ సమస్య పరిష్కరించాలని వారు మాకు చెబుతున్నారు. మేము అమెరికా ప్రతిపాదనను అంగీకరించాము. అమెరికా స్థానం మాకు ముఖ్యమైనది. అయితే వారేమో కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. సముద్ర చట్టాలపై ఉన్న UN కన్వెన్షన్ను ఉల్లంఘిస్తూ బహిరంగ సముద్రంలో ట్యాంకర్లపై యుద్ధం జరుపుతున్నారు. భారత్, ఇతర భాగస్వాములు చౌకైన రష్యన్ ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా నిషేధం విధిస్తున్నారు. అధిక ధరలకు US, LNG సహజ వాయువు కొనుగోలు చేయమని వారిని బలవంతం చేస్తున్నారు ” అని సెర్గీ లవ్రోవ్ అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఆర్థికంగా అధిపత్యం సాధించేందుకు ప్రపంచ దేశాలపై పన్నుల ఆంక్షలతో విరుచుకపడుతున్నారని తెలిపారు. అయితే భారత్, చైనా, కెనడా వంటి దేశాలతో సహాకారం అందిస్తూనే మనం ఈ అమెరికా అడ్డంకులను ఎదుర్కోవాలని సెర్గియో లవ్రోవ్ పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారని అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని సెర్గియో లవ్రోవ్ అన్నారు. అధిక ధరలకు చమురు కొనుగోలు చేస్తే ప్రజలపై భారం పడుతుంది కనుక దేశప్రజల ప్రయోజనాలే ఆ దేశానికి ప్రథమంగా ఉండాలని రష్యా విదేశాంగశాఖ మంత్రి తెలిపారు.


