breaking news
USA
-
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
-
వలసదారుడే ప్రథమ పౌరుడు
న్యూయార్క్: జొహ్రాన్ క్వామె మమ్దాని 1991 అక్టోబర్ 18న ఉగాండా రాజధాని కంపాలాలో జన్మించారు. గుజరాతీ ముస్లిం ప్రొఫెసర్ మహమూద్ మమ్దాని, బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్ ఆయన తల్లిదండ్రులు. జొహ్రాన్ మమ్దానికి ఐదేళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం ఉగాండా నుంచి దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్కు వలస వెళ్లింది. ఆయన కేప్టౌన్లో సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. ఏడేళ్ల వయసున్నప్పుడు కుటుంబంతో కలిసి అమెరికాకు చేరుకున్నారు. మమ్దాని కుటుంబం న్యూయార్క్లో స్థిరపడింది. బాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్ నుంచి ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2014లో బౌడిన్ కాలేజీ నుంచి ఆఫ్రికన్ స్టడీస్లో బ్యాచిలర్ డిగ్రీ స్వీకరించారు. అనంతరం హౌజింగ్ కౌన్సిలర్గా పనిచేశారు. న్యూయార్క్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. డెమొ క్రటిక్ పార్టీ ప్రచారకర్తగా సేవలందించారు. 2020లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2022, 2024లోనూ గెలిచారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో 2024 అక్టోబర్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కుమోపై పైచేయి సాధించారు. మమ్దాని 2025 ఫిబ్రవరిలో సిరియన్ ముస్లిం రమా సవాఫ్ దువాజీని వివాహం చేసుకున్నారు. ఆమె యానిమేటర్గా, ఇల్రస్టేటర్గా పని చేస్తున్నారు. -
గ్రోక్తో పేటీఎం జట్టు
న్యూఢిల్లీ: అమెరికన్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ గ్రోక్తో దేశీ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. తమ ప్లాట్ఫాంపై లావాదేవీల ప్రాసెసింగ్, రిస్క్ అసెస్మెంట్, మోసాలను గుర్తించడంలాంటి అంశాల్లో పనితీరును మెరుగుపర్చుకునేందుకు గ్రోక్క్లౌడ్ సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. దేశీయంగా అత్యంత అధునాతనమైన, ఏఐ ఆధారిత పేమెంట్, ఆర్థిక సేవల ప్లాట్ఫాంగా ఎదిగేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని పేటీఎం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. -
‘షట్డౌన్’ తెచ్చిన ఆహార సంక్షోభం
ప్రస్తుతం అమెరికాలో ఆహార సంక్షోభం తలెత్తింది. ఈ మాట వినడానికే వింతగా ఉన్నా... వాస్తవం! అక్కడ ప్రస్తుతం ‘షట్డౌన్’ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షట్డౌన్ ప్రభావం అనేక రంగాలపై పడింది. తాజాగా వివిధ రాష్ట్రాలలో ఆహార సంక్షోభా నికి దారి తీసింది. ప్రధానంగా వాణిజ్య రాజధాని అయిన న్యూయా ర్క్పై పడింది. ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆహార సాయం నిలిచిపోయింది. దీంతో ఆ రాష్ట్రం ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. ఫెడరల్ ప్రభుత్వ షట్డౌన్ అమెరికాలోని కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లి మెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్ స్టాంప్స్’ ప్రయోజనాలు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అమెరికాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు నాలుగున్నర కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేద వారే! ఇదిలా ఉంటే, నిధుల కొరత కారణంగా నవంబరు నెల ప్రయోజనా లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిలిపివేయాలని ఇటీవల రాష్ట్ర ఏజెన్సీ లను అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కాగా ఆహార సంక్షో భాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు లేదని గవర్నర్ కేథీ హోచుల్ ఆరోపించారు. చట్టబద్ధంగా ఆమోదించిన ఎమర్జెన్సీ ఫండ్ను విడుదల చేయడానికి ట్రంప్ సర్కార్ నిరాకరిస్తోందని కేథీ ఘాటు ఆరోపణలు చేశారు. ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అమెరికాలోని అనేక రాష్ట్రాలు సొంతంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ జాబితాలో లూసియానా, వెర్మంట్, న్యూ మెక్సికో ముందు వరుసలో ఉన్నాయి.ఇదీ చదవండి : మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనఅమెరికా ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రతి ఏడాది తప్పనిసరిగా ఒక బడ్జెట్ను లేదా తాత్కాలిక ఖర్చులను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే అక్టోబరు ఒకటో తేదీలోగా కాంగ్రెస్ ఈ బడ్జెట్ను ఆమోదించాల్సిఉంటుంది. అలా జరగకపోతే, ప్రభుత్వంలో అత్యవసరం కాని సేవలు తాత్కా లికంగా నిలిచిపోతాయి. దీనినే ‘ప్రభుత్వ షట్డౌన్’ అంటారు. వాస్తవానికి ప్రభుత్వ సొమ్ము వృ«థా కాకుండా చూడాలనే సదుద్దేశంతో షట్డౌన్ చట్టాన్ని తొలి రోజుల్లో తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా చూడాలనే నియమాన్ని అన్ని రాజకీయ పార్టీలూ పక్కన పెట్టి... తమ విధానపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి బడ్జెట్ ఆమోదాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే సామాన్య అమెరికన్లు మధ్యలో నలిగి పోవడం గమనార్హం.– ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ -
మేయర్గా మమ్దానీ: తల్లి తొలి స్పందన
ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్ (Mira Nair) తన కుమారుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన నేపథ్యంలో తొలిసారి స్పందించారు. తన కుమారుడి సంచలనాత్మక విజయంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆమె సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సందడి చేస్తోంది.కుమారుడు జోహ్రాన్ మమ్దానీ విజయంపై మీరా నాయర్, బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ ఇన్స్టా పోస్ట్ను షేర్ చేశారు. హార్ట్, బాణసంచా ఎమోజీలతో "జోహ్రాన్ యు బ్యూటీ" అనే శీర్షికతో ఆమె స్టోరీని రీ పోస్ట్ చేశారు. అమెరికాలో, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి కీలకమైన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దానీ విజయంపై జోయా అక్తర్ ప్రశంసలు కురిపించారు."జోహ్రాన్ మమ్దానీ 34 ఏళ్ల వయసులో అధికారికంగా NYC మేయర్ రేసులో గెలిచారు" అంటూ కొనియాడారు. కాగా ఉగాండాలో జన్మించిన మమ్దానీ, ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ , మీరా నాయర్ దంపతుల కుమారుడు.జోహ్రాన్కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్టౌన్కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో క్వీన్స్ 36వ జిల్లాకు ప్రతినిధిగా న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తాజాగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తద్వారా న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టించాడు. -
రిపబ్లికన్ల ఓటమి.. ట్రంప్ వింత సమాధానం
వాషింగ్టన్: అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని షాకిచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓటర్లు ఝలక్ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై తాజాగా ట్రంప్ స్పందించారు.అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా స్పందిస్తూ.. ఎన్నికల బ్యాలెట్ పేపర్లో ట్రంప్ ఫొటో లేదు. అమెరికాలో షట్డౌన్ ఉంది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోవడానికి ఇవే రెండు ముఖ్య కారణాలు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Nov 04, 2025, 10:05 PM ET )“TRUMP WASN’T ON THE BALLOT, AND SHUTDOWN, WERE THE TWO REASONS THAT REPUBLICANS LOST ELECTIONS TONIGHT,” according to Pollsters. pic.twitter.com/l3sMRCplPk— Fan Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) November 5, 2025 గవర్నర్, మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్ పార్టీ ఓటమివర్జీనియా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ఓటమివర్జీనియా గవర్నర్గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్వర్జీనియా తొలి మహిళా గవర్నర్గా అబిగైల్ స్నాన్బర్గర్ రికార్డుసిన్సినాటి మేయర్గా డెమోక్రాట్ అభ్యర్థి అఫ్తాబ్ పురేవాల్ గెలుపుఅట్లాంటా మేయర్గా డెమోక్రాట్ అభ్యర్థి ఆండ్రీ డికెన్స్ తిరిగి ఎన్నికపిట్స్బర్గ్ మేయర్ రేసులో డెమోక్రాట్ అభ్యర్థి కోరీ ఓకానర్ విజయం రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ..వర్జీనియాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. రిపబ్లికన్ పార్టీ సీయర్స్ ఓటమి పాలవ్వగా.. డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్నాన్బర్గర్ గవర్నర్గా ఎన్నికయ్యారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్ కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. అబిగైల్ 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో మొదటి మహిళా గవర్నర్ గా అబిగైల్ చరిత్ర సృష్టించారు.జేడీవాన్స్ తమ్ముడికీ తప్పని ఓటమి..మరోవైపు సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి తమ్ముడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీబౌమన్ కూడా ఓడిపోయారు. ఈయనపై డెమొక్రాట్ అఫ్తాబ్ పురేవాల్ గెలుపొందారు. పురేవాల్ రెండవ సారి మేయర్ గా ఎన్నికయ్యారు. తొలిసారి 2021లో మేయర్గా ఎన్నికయ్యారు. మే నెలలో జరిగిన ఆల్ పార్టీ మున్సిపల్ ప్రైమరీలో ఆయన 80% కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు. -
Virginia: నూతన ఎల్జీ గజాలా హష్మీ.. మన హైదరాబాదీ!
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) రేసులో విజయం సాధించారు. ఆమె రిపబ్లికన్ జాన్ రీడ్ను ఓడించారు. హష్మీ.. వర్జీనియా సెనేట్లో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ. అలాగే మొదటి దక్షిణాసియా అమెరికన్గా గుర్తింపు పొందారు. గజాలా హష్మీ 15వ సెనేటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె రిపబ్లికన్ ఆధీనంలో ఉన్న రాష్ట్ర సెనేట్ స్థానంపై ఆధిపత్యం సంపాదించి, వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.హష్మీ సొంత వెబ్సైట్లో.. ‘ఇతరుల జీవితాలను మెరుగు పరిచే దిశగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని’ పేర్కొన్నారు. ఆమె గృహనిర్మాణం, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ న్యాయం తదితర సమస్యలపై దృష్టి సారించారు. 1964లో హైదరాబాద్లో జియా హష్మీ, తన్వీర్ హష్మీ దంపతులకు జన్మించిన గజాలా తన బాల్యాన్ని మలక్పేటలోని తన తాత ఇంట్లో గడిపారు. హష్మీ తన నాలుగేళ్ల వయస్సులో తన తల్లి, అన్నయ్యతో కలిసి భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ వారంతా జార్జియాలో తండ్రితో పాటు ఉన్నారు.గజాలా తండ్రి ప్రొఫెసర్ జియా హష్మి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి. అక్కడ అతను ఎంఏ, ఎల్ఎల్బీ చేశారు. తరువాత సౌత్ కరోలినా విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ సంబంధాలలో పీహెచ్డీ పూర్తి చేశారు. అనంతరం బోధనా వృత్తిని స్వీకరించారు. అతను స్వయంగా స్థాపించిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ డైరెక్టర్గా పదవీ విరమణ చేశాడు. హష్మి తల్లి తన్వీర్ హష్మి హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ, బీఈడీ చేశారు.హష్మి తన విద్యాభ్యాసం సమయంలో పలు స్కాలర్షిప్లు, ఫెలోషిప్లను అందుకున్నారు. జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుండి బీఏ, అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి అమెరికన్ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. 1991లో హష్మి, ఆమె భర్త అజార్ రఫీక్తో పాటు రిచ్మండ్ ప్రాంతానికి తరలి వెళ్లారు. ఈ దంపతులకు యాస్మిన్, నూర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ చెస్టర్ఫీల్డ్ వర్జీనియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. హష్మీ దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రొఫెసర్ గా పనిచేశారు. మొదట రిచ్మండ్ విశ్వవిద్యాలయంలో, తరువాత రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో పనిచేశారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థాపక డైరెక్టర్ గానూ హష్మీ పనిచేశారు. -
ట్రంప్కు భారీ షాక్.. మమ్దానీ గెలుపు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ(34) విజయం సాధించారు. ఎన్నికల్లో ముందు నుంచి మెరుగైన ఆధిక్యంలో కొనసాగిన మమ్దానీ ఘన విజయం అందుకున్నారు. మమ్దానీ విజయం నేపథ్యంలో ఆయనకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 49.6 శాతం ఓట్లు(6,77,615) పోల్ అయ్యాయి. ప్రత్యర్థి క్యూమోకు 41.6 శాతం ఓట్లు(5,68,488) వచ్చాయి. దీంతో, దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. కాగా, ఒక ఉన్నత కుటుంబం నుంచి స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య సోషలిస్ట్ అయిన మమ్దానీ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించాడు. ఏడేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. 2018లో సహజ పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక.. ఎన్నికల సందర్భంగా మంగళవారం ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చారు. నగర ఎన్నికల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు రెండు మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు వేశారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటు వేయడం ఇదే మొదటిసారి. కాగా, అక్టోబర్ 24, 28 మధ్య నిర్వహించిన మారిస్ట్ పోల్లో మమ్దానీ.. క్యూమో కంటే 16 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. రిపబ్లిక్న్ కర్టిస్ సైవా అనే సంస్థ కూడా అతనికి 16 శాతం ఆధిక్యాన్ని అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. వామపక్ష నేత అయిన జోహ్రన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విరుచుకుపడ్డారు. ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. మమ్దానీ వంద శాతం కమ్యూనిస్టు పిచ్చొడని ట్రంప్ దుయ్యబట్టడం తెలిసిందే. అయినప్పటికీ మమ్దానీ విజయం సాధించడం విశేషం. BREAKING: Democratic Socialist Zohran Mamdani wins the New York City mayoral election, Decision Desk HQ projects pic.twitter.com/iphko44pmF— Republicans against Trump (@RpsAgainstTrump) November 5, 2025మమ్దానీ హామీ..జోహ్రాన్ మమ్దానీ సామాజిక కార్యకర్త. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య రమా దువాజీ(rama duwaji). ఓ డేటింగ్ యాప్తో పరిచయమై.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఎన్నికల సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో దూసుకెళ్లారు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.‘గుజరాత్’పై మమ్దానీ వీడియో వైరల్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన 2002లో గుజరాత్లో జరిగిన ఘర్షణలపై మమ్దానీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడ ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని, చాలామందిని హత్య చేశారని మమ్దానీ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులా మోదీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ మండిపడ్డాడు. మమ్దానీ వ్యాఖ్యలపై పలువురు భారతీయులతో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..
వాషింగ్టన్: అమెరికా (USA)లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కెంటకీ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో కార్గో విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అమెరికాలోని లూయిస్విల్లేలో టేకాఫ్ సమయంలో యూపీఎస్ కార్గో విమానం కుప్పకూలింది. యూపీఎస్ ఫ్లైట్ నంబర్ 2976 విమానం హోనులులుకు మంగళవారం సాయంత్రం (అమెరికా కాలమానం) 5.15కు బయల్దేరగా ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధ్రువీకరించింది. ప్రమాదం కారణంగా ముగ్గురు మరణించినట్టు వెల్లడించింది. Please pray for my hometown of Louisville, KentuckyA plane crashed near the airport there pic.twitter.com/q2QaNOmfFH— Tim Jones (@TimothyJones92) November 4, 2025ఇక, విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కుప్పకూలిపోయింది. విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. కాగా, ఈ విమానం మెక్డోనెల్ డగ్లస్ ఎండీ-11 రకానికి చెందినది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. WATCH: UPS plane (UPS2976) crashes after takeoff from Louisville Muhammad Ali International Airport.Video validated by the Network pic.twitter.com/h9FtsLRumc— Faytuks Network (@FaytuksNetwork) November 4, 2025 -
అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావుకి అరుదైన గౌరవం
ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావు కావేటిని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. అంతర్జాతీయ న్యాయ సేవల్లో విశేష కృషి చేసినందుకు గాను డా. శ్రీనివాస్ రావు కావేటికి ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ ఇంటర్నేషనల్ కౌన్సెల్ లీడర్షిప్ ఇన్ ది యూఎస్ ఆఫ్ 2025’ అవార్డు దక్కింది. ‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ డా. శ్రీనివాస్ రావు కావేటికి ఈ అవార్డును అందించింది.‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ అందించిన ఈ గౌరవం, భారతీయ చట్టాలను అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలతో సమన్వయం చేయడంలో డా. కావేటి చేసిన అసాధారణ కృషికి దక్కిన గుర్తింపు అని చెప్పవచ్చు. అంతర్జాతీయ న్యాయ సేవలలో కావేటి లా సంస్థ ఎంతో పేరొందింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా అడుగుపెట్టిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు ఆ తర్వాత ఆస్ట్రేలియా, యూకే, అమెరికా వంటి దేశాలలో సొలిసిటర్గా, నోటరీ పబ్లిక్గా సేవలందించారు.ఆయన స్థాపించిన కావేటి లా ఫర్మ్.. అమెరికా, భారతదేశం, యూకే, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో సేవలందిస్తోంది. కార్పొరేట్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, బిజినెస్ ఇమ్మిగ్రేషన్ వంటి కీలక రంగాలలో సరిహద్దులు దాటి క్లయింట్లకు సేవలను అందిస్తోంది. ఒకే గొడుగు కింద స్థానిక, అంతర్జాతీయ న్యాయ సేవలను అందించడం ఈ సంస్థ ప్రత్యేకత. నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు న్యాయ విద్యతో పాటు ఎంబీఏ, జర్నలిజంలో మాస్టర్స్ పట్టాలను కూడా పొందారు. న్యాయ విద్యార్థులకు, చార్టర్డ్ అకౌంటెన్సీ అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తూ గ్లోబల్ ఎడ్యుకేటర్గా కూడా ఆయన గుర్తింపు పొందారు.(చదవండి: ఘనంగా 'ఆటా' 19 మహాసభలు కిక్ ఆఫ్ వేడుడ -
భారత ట్రక్కు డ్రైవర్ కేసులో మరో మలుపు
న్యూయార్క్: ఇటీవల కాలిఫోర్నియాలో ముగ్గురు మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన ట్రక్కు డ్రైవర్ కేసు మరో మలుపు తిరిగింది. అతను మద్యం మత్తులో వాహనం నడపడం లేదని, అది నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదమని విచారణలో తేలిందని యూఎస్ అధికారులు మీడియాకు తెలిపారు. ప్రాథమిక నివేదికలో సదరు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పేర్కొన్నారు. యుబా సిటీకి చెందిన 21 ఏళ్ల జషన్ప్రీత్ సింగ్ను అక్టోబర్ 21న మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడనే అనుమానంతో అమెరికా పోలీసులు అరెస్టు చేసి, అతనిపై హత్యా నేరం మోపారు. నాడు కాలిఫోర్నియాలోని ఒంటారియోలో డ్రైవర్ జషన్ప్రీత్ సింగ్ కారణంగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ జషన్ప్రీత్ సింగ్కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని రక్తంలో మత్తు కలిగించే పదార్థాలు ఏవీ లేవని నిర్ధారణ అయ్యింది. అయితే వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతో జరిగిన హత్యగా దీనిని గుర్తిస్తున్నట్లు శాన్ బెర్నార్డినో కౌంటీ అటార్నీ కార్యాలయం మీడియాకు తెలిపింది.డాష్క్యామ్ ఫుటేజ్లో నాడు సింగ్ రద్దీగా ఉన్న ట్రాఫిక్లో అధిక వేగంతో ట్రక్కును నడిపినట్లు తేలింది. ఇది ముగ్గురు ప్రాణాలను బలిగొన్న దారుణమైన విషాదం. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. నిందితుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుంటే ఈ ప్రమాదం జరిగేది కాదని శాన్ బెర్నార్డినో కౌంటీ జిల్లా న్యాయవాది జాసన్ ఆండర్సన్ పేర్కొన్నారు. సింగ్కు ఇప్పుడే బెయిల్ ఇవ్వలేమని, నేరం తీవ్రత, ప్రమాదం తీరు ఆధారంగా బెయిల్ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా అక్రమ వలసదారుడైన సింగ్ 2022లో యూఎస్ దక్షిణ సరిహద్దును దాటాడు. అతని ఇమ్మిగ్రేషన్ విచారణ పెండింగ్లో ఉందని గత నెలలో ‘ఫాక్స్ న్యూస్’ పేర్కొంది. ఇది కూడా చదవండి: మళ్లీ భారత్ను టార్గెట్ చేసిన ట్రంప్ -
ఆమె నిజమైన దేశభక్తురాలు: కాష్ పటేల్
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్, భారతీయ మూలాలున్న కశ్యప్(కాష్) పటేల్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తన ప్రేయసితో కలిసి ఎఫ్బీఐకి చెందిన జెట్లో ప్రయాణించడంపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో రాజకీయ ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు.కశ్యప్ పటేల్(45) తన గర్ల్ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్(26)తో కలిసి ఎఫ్బీఐకి చెందిన జెట్ విమానంలో అక్టోబర్ 25వ తేదీన పెన్సిల్వేనియాకు ప్రయాణించారు. అక్కడ ఓ రెజ్లింగ్ ఈవెంట్లో ఆమె గాన ప్రదర్శన ఇచ్చారు. ఈ విమాన ప్రయాణానికి అయిన ఖర్చు 60 మిలియన్ డాలర్లపైనే. దీంతో దుమారం రేగింది. ఈ ఘటనపై ఎఫ్బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ ఓ పాడ్కాస్ట్లో మండిపడ్డారు. దేశం షట్డౌన్ ఉన్న టైంలో.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో.. ఎఫ్బీఐ డైరెక్టర్ ఇలా సంస్థ నిధుల్ని దుర్వినియోగం చేయడం ఏంటి? అని నిలదీశారు. దీంతో కాష్ పటేల్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఎఫ్బీఐకి చెందిన విమానంలో ప్రయాణించారని, పైగా అందుకు అయ్యే ఖర్చులు ఆయనే భరిస్తారని, వ్యక్తిగత ప్రయాణాల్లో విమానం వినియోగం పరిమితంగానే అదీ విధానాలకు అనుగుణంగా ఉంటుందని ఎఫ్బీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మరోవైపు.. ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తనపై వచ్చిన విమర్శలకు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలు అసత్యమైనవని, రాజకీయంగా ప్రేరితమైనవని అన్నారు. నన్ను విమర్శించండి, కానీ నా వ్యక్తిగత జీవితం మీద దాడి చేయడం దారుణం. అలెక్సిస్ నిజమైన దేశభక్తురాలు, నా జీవిత భాగస్వామి. ఆమెపై వచ్చిన ఆరోపణలు అతి నీచమైనవి. ఆమె దేశానికి చేసిన సేవలు చాలా మందికి పదే పదే జీవితాల్లో సాధ్యం కాదు. రాజకీయ వర్గాల్లో మాకు మద్దతు ఆశించాం. కానీ, వాళ్ల మౌనం వల్ల విమర్శలు పెరిగిపోతున్నాయి. నా కుటుంబం మీద ప్రేమే నా బలానికి మూలం. ఎఫ్బీఐను పునర్నిర్మించడమే మా లక్ష్యం అని అన్నారాయన. ఎఫ్బీఐ అధికార ప్రతినిధి బెన్ విలియమ్సన్.. కాష్ పటేల్ విమాన ప్రయాణంపై జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. అవన్నీ అర్థం లేని కథనాలని కొట్టిపారేశారు. మరోవైపు.. తన విమాన ప్రయాణ వివరాలు లీక్ కావడంపై కాష్ పటేల్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎఫ్బీఐ సీనియర్ ఉద్యోగి స్టీవెన్ పాల్మర్ (విమాన విభాగం అధిపతి) రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.న్యాయనిపుణుడైన కాష్ పటేల్, అమెరికన్ సింగర్ అయిన అలెక్సిస్ విల్కిన్స్లు 2023 జనవరి నుంచి డేటింగ్లో ఉన్నారు. ఇద్దరి మధ్య వయసు తేడా 19 ఏళ్లు. అలెక్సిస్ విల్కిన్స్పై గతంలో ఇస్రాయెల్ గూఢచారి అనే ప్రచారం జరిగింది. ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలపై ప్రభావం చూపేందుకు ఆమె ప్రయత్నించిందన్నది ఆ ప్రచార సారాంశం. ఈ ఆరోపణలు చేసిన కైల్ సెరాఫిన్పై అలెక్సిస్ 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేశారు. -
యుద్ధంలోకి అమెరికా?.. వణికిపోతున్న ప్రపంచం
చరిత్ర మళ్లీ తన రక్తపు పుటలను తిరగేస్తోంది. మరో యుద్ధం మన కళ్ల ముందు పుడుతోంది. ఈసారి ఇది చిన్న దేశాల మధ్య కాదు.. ఏకంగా అమెరికా యుద్ధరంగంలోకి అడుగుపెడుతోందన్న వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. వెనిజులా తీరప్రాంతాల్లో సముద్రం మంటల్లో కరిగిపోతున్న వేళ.. అమెరికా నౌకాదళం పేల్చిన బుల్లెట్లు ఆకాశాన్ని ఎర్రగా మార్చేశాయి. ఇది మాదకద్రవ్యాల నౌక అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. వెనిజులా మాత్రం ఇది తమ ప్రజల నౌక అని గట్టిగా చెబుతోంది. ఆ అగ్నిజ్వాలల మధ్య మానవ శరీరాలు ముక్కలై పోయాయి. ఇటు వెనిజులా డిక్టెటర్ నికోలాస్ మడూరో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాస్కో, బీజింగ్, టెహ్రాన్కి రహస్య పత్రాలు పంపించారు. ఆయుధాలు, క్షిపణులు పంపాలని రష్యా, చైనా, ఇరాన్ దేశాలను కోరారు. వెనిజులా కోసం రష్యా ఇప్పటికే రాడార్లను సిద్ధం చేస్తోందని సమాచారం.. ఇటు చైనా తన సాంకేతికతను పరిశీలిస్తుంటే.. అటు ఇరాన్ తన డ్రోన్లను గాల్లోకి ఎగరేస్తోంది. మరోవైపు ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఓ భారీ స్టేట్మెంట్ వదిలారు. మడూరో తన చివరి రోజులు లెక్కబెట్టుకుంటున్నారని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.యుద్ధ క్షేత్రంలా కరేబియన్ సముద్రంఇటు కరేబియన్ సముద్రం యుద్ధ క్షేత్రంలా మారిన సమయంలో.. అమెరికా నౌకలు వరుసగా కదులుతున్నాయి. ఆకాశంలో ఫైటర్ జెట్లు తిప్పుకుంటున్నాయి. ఈ మొత్తం పరిణామాలను ప్రపంచం ఊపిరిబిగపట్టి చూస్తోంది. ఒకవైపు అమెరికా శక్తి.. మరోవైపు రష్యా, చైనా, ఇరాన్ మిత్రబలగాలు...! ఏ క్షణానైనా మొదటి క్షిపణి ప్రయాణించే అవకాశం ఉంది. ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు అంచనా ప్రపంచాన్ని మళ్లీ అగ్నిగుండంలోకి నెట్టేసే ఛాన్స్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మరోసారి యుద్ధపు నీడలోకి జారిపోతోంది. దశాబ్దాల క్రితమే..నిజానికి అమెరికా-వెనిజులా మధ్య ఘర్షణ ఈరోజు పుట్టిన గొడవ కాదు. దశాబ్దాల క్రితమే ఈ మంటలు మొదలయ్యాయి. 1999లో హ్యుగో చావెజ్ అధికారంలోకి వచ్చారు. ఆయన అమెరికా ఆధిపత్యాన్ని బహిరంగంగా సవాలు చేశారు. వెనిజులా ఆయిల్ సంపదను ప్రజల కోసం ఉపయోగిస్తానని ప్రకటించడం.. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆ నాడు కుదిపేసింది. అప్పటి నుంచే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. చావెజ్ తర్వాత మడూరో బాధ్యతలు స్వీకరించగానే అమెరికా ఆంక్షల వర్షం కురిపించింది. ఇక 2019లో మడూరోను అధ్యక్షుడిగా అంగీకరించకుండా జువాన్ను వెనుజులా ప్రెసిడెంట్గా అమెరికా గుర్తించింది. అమెరికా ఆంక్షలతో ఒకప్పుడు బలంగా నిలిచిన దేశం.. ఆ తర్వాత ఆకలితో విలవిల్లాడే స్థితికి చేరింది. ఆయిల్ నిల్వలు ఉన్నా వాటిని అమ్మే దేశాలు లేకుండాపోయాయి. కరెన్సీ విలువ నేలమట్టమైన సమయంలో... దేశం ఆర్థికంగా కూలిపోయింది. అయితే మడూరో వెనక్కి తగ్గకుండా.. రష్యా, చైనా, ఇరాన్ వైపు తిరిగారు.సరిహద్దు సముద్రంలో పేలుళ్లుఇక 2025లో అమెరికా వెనిజులా మధ్య సరిహద్దు సముద్రంలో పేలుళ్లు మొదలయ్యాయి. అమెరికా సైన్యం వెనిజులా నౌకలపై అనేకసార్లు దాడుల చేసింది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో వెనుజులా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత మడూరో ప్రజల ముందు వచ్చి అమెరికాను నేరుగా హెచ్చరించారు. అదే సమయంలో రష్యా, చైనా, ఇరాన్ నాయకులతో అత్యవసర చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయి. వెనిజులాకు క్షిపణి వ్యవస్థలు అందించడానికి పుతిన్ సర్కార్ అంగీకరించింది. రాడార్ నెట్వర్క్ విస్తరణకు చైనా సహకరిస్తానని చెప్పగా.. ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీని అందిస్తానని ప్రకటించింది. ఈ చర్యలతో అమెరికా మరింత కఠినంగా మారింది. ఈ మూడు దేశాల చర్యలను నార్కో టెరరిజంగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అమెరికా నౌకాదళం.. కరేబియన్ సముద్రంలో తన సైనిక బలగాలను రెండింతలు పెంచింది. రహస్య గూఢచార వాహనాలు వెనిజులా గగనతలంలో ఇప్పటికే తిరుగుతున్నాయని సమాచారం.అమెరికా ఆధిపత్యానికి సవాలుఇక రష్యా, చైనా, ఇరాన్ ఈ ఘటనను అమెరికా ఆధిపత్యానికి సవాలుగా చూస్తున్నాయి. వెనిజులా తమకు వ్యూహాత్మక కేంద్రంగా మారుతుందని భావిస్తున్నాయి. రష్యా ఇప్పటికే నౌకాశ్రయ ఒప్పందం సిద్ధం చేసుకుంది. చైనా.. వెనిజులా ఆయిల్ బాకీలకు బదులుగా మిలిటరీ సదుపాయాలు కోరుతోంది. ఇరాన్.. వెనిజులాలోని గగనతల కేంద్రాలను డ్రోన్ నియంత్రణ స్థావరాలుగా మార్చే పనిలో ఉంది. ఇటు ఈ మొత్తం వ్యవహారంలో లాటిన్ అమెరికా అంతా ఆందోళనలో నిండిపోయింది. బ్రెజిల్, కొలంబియా, పెరూ దేశాలు భయంతో మౌనంగా ఉండిపోయాయి. ఇటు యూరప్తో పాటు యునైటెడ్ నేషన్స్ ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ..ట్రంప్ గారు వెనక్కి తగ్గేలా కనిపించడంలేదండి. ఇలా చూస్తే.. ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త యుద్ధం అంచున నిలబడి ఉందనే చెప్పవచ్చు. ఒకవైపు అమెరికా ఆధిపత్యం, మరోవైపు రష్యా-చైనా-ఇరాన్ కూటమి. ఎవరు వెనక్కి తగ్గినా అది ఓటమే అవుతుంది.. ఎవరు ముందుకు కదిలినా అది యుద్ధానికి ప్రారంభమవుతుంది..! మరి చూడాలి ఏ క్షణాన ఏం జరుగుతుందోననే టెన్షన్ మాత్రం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: రోజుకు 15 మందిని చంపేస్తున్న అతివేగం -
‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్’..అమెరికాలో భారత యువతి
వాషింగ్టన్: అమెరికాలో మరో భారత యువతి దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికింది. పైగా తాను దొంగతనం చేయలేదని బుకాయించింది. తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లించడం మరిచిపోయానంటూ ప్రాధేయపడింది. కావాలంటే ఇప్పుడు తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లిస్తా. నన్ను వదిలేయండి’ అంటూ చేతులు జోడించి అక్కడి పోలీసుల్ని వేడుకుంది. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్కు చెందిన ఓ యువతి టూరిస్ట్ వీసాతో అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సమయంలో అమెరికాకు చెందిన ఓ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఓ షాప్లో తనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం, అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా.. సదరు షాపు యజమాని ..తన షాపులో ఓ యువతి దొంగతనం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు వీడియోలో.. ఆ యువతి ఎలా శిక్ష విధించకుండా వదిలేయమని కోరింది. తాను షాపులు వస్తువుల్ని కొనుగోలు చేశానే తప్పా.. దొంగతనం చేయలేదని, కొనుగోలు చేసిన వస్తువులకు ఇప్పుడే డబ్బులు చెల్లిస్తానని చెప్పడం ఆవీడియోలో చూడొచ్చు. కాగా, ఆ యువతి వివరాలు, ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. 👉ఇదీ చదవండి: చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?కొద్దిరోజుల క్రితం కొద్దిరోజుల క్రితం మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ అని కోరినప్పటికీ పోలీసులు ఆమెను కటకటాల వెనక్కు పంపారు. -
తొలిసారి అమెరికాకు సిరియా అధ్యక్షుడు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా మధ్య భేటీ ముహూర్తం ఖరారైంది. నవంబర్ 10వ తేదీన డొనాల్డ్ ట్రంప్ను సిరియా తాత్కాలిక అధ్యక్షుడు ఆల్ షరా వాషింగ్టన్లో కలవనున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. సిరియా అధ్యక్షుడు అధికారికంగా అమెరికా రాజధాని వాషింగ్టన్కు రావడం ఇదే తొలిసారి. అంతకుముందు ఎప్పుడూ సిరియా అధ్యక్షుడికి అమెరికా నుంచి అధికారిక ఆహ్వానం అందలేదు. దీనికి కారణం వారి మధ్య ఉన్న శత్రుత్వమే. ఇరుదేశాల మధ్య గతంలో అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీనిలో భాగంగానే తమ శత్రు దేశమైన సిరియాకు ఆహ్వానం పంపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అమెరికా-సిరియాల సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉండేవి. సిరియాలోని అంతర్గత యుద్ధం, ఉగ్రవాద సంస్థల ప్రాబల్యం, మానవ హక్కుల ఉల్లంఘనలకు సిరియా పాల్పడుతోందని అమెరికా విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే ఆ దేశంపై కఠినపై ఆంక్షలు విధించింది అమెరికా. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో సిరియాను తమ దారికి తెచ్చుకోవాలనే యోచనలో ఉన్నారు ట్రంప్. అందులో భాగంగానే సిరియా అధ్యక్ష పదవిలో ఉన్న అల్ షరాకు ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ భేటీపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ప్రధానంగా ఇజ్రాయిల్, ఇరాన్, రష్యా వంటి తదితర దేశాలు ఈ భేటీని నిశితంగా గమనించే అవకాశం ఉంది. 25 ఏళ్లలో తొలిసారి..ఈ ఏడాది మే నెలలో సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా భేటీ అయ్యారు. ఇది 25 ఏళ్లలో అమెరికా, సిరియాల మధ్య జరిగిన మొదటి సమావేశం. ఈ సమావేశం తరువాత సిరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. -
దేశానికో చంద్రుడు!
ఇప్పటికీ ఎవరైనా కొత్తగా అమెరికా వెళ్లొస్తే అక్కడి నుండి చాక్లెట్స్ తెస్తారు. ఇక్కడ నలుగురికీ పంచుతారు. అమెరికా వెళ్లొచ్చిన వారికి, అమెరికా చాక్లెట్లు కానుకగా అందుకున్న వారికి.. ఇద్దరికీ అదొక ‘తీపి’ జ్ఞాపకం. అదే విధంగా యాభై ఐదేళ్ల క్రితం ‘నాసా’ తొలిసారి ‘చంద్ర శిలల్ని’ భూమి మీదకు తెచ్చినప్పుడు ఆనాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ప్రపంచ దేశాలకు తలా ఒక శిలా ఖండాన్ని ‘దేశానికో చంద్రుడి’లా గుడ్విల్ గిఫ్టు పంపారు. మనకూ ఒక చాక్లెట్... అదే, మనకూ ఒక రాయి (ఆ తర్వాత ఇంకో రాయి కూడా) బహుమతిగా లభించింది. రాయితో పాటుగా నిక్సన్.. ‘మానవ ప్రయత్నాలలోని ఐక్యతకు చిహ్నం’ అని ఒక సందేశాన్ని కూడా జత చేశారు. నాడు ఆ ఘనత సాధించిన ‘నాసా’.. ఇప్పుడు మరో ప్రయత్నానికి సమాయత్తం అవుతోంది. చంద్రుడి పైన చంద్ర శిలల్ని తవ్వేందుకు ఒక జేసీబీని తయారు చేస్తోంది. ఈ సందర్భంగా ‘చంద్ర శిల’ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. చంద్ర శిలలపై శాస్త్ర పరిశోధనలు‘నాసా’కు చెందిన అపోలో మిషన్ వ్యోమగాములు చంద్రుని పైకి వెళ్లినప్పుడు అక్కడి నుండి భూమి మీదకు అద్భుతమైన ‘జ్ఞాపకాలను’ మోసుకొచ్చారు. అవే.. చంద్ర శిలలు!విజయవంతం అయిన 6 అపోలో యాత్రల నుంచి 12 మంది వ్యోమగాములు దాదాపు 382 కిలోల బరువున్న 2,196 శిలా శకలాలను సేకరించారు.చంద్ర శిలలు కేవలం విజయ చిహ్నాలు మాత్రమే కాదు. వీటిపై భూమి మీద శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో కొన్నింటిని సందర్శకుల కోసం మ్యూజియంలలో ప్రదర్శనకు ఉంచారు. మరికొన్ని ప్రపంచ దేశాలకు బహుమతులుగా వెళ్లాయి. నాసా చేపట్టిన మొత్తం అపోలో యాత్రల సంఖ్య 17. ఈ యాత్రలను నాసా 1969–1972 మధ్యకాలంలో నిర్వహించింది. వీటిల్లో మొత్తం 11 మానవ సహిత యాత్రలు కాగా, వాటిలో ఆరు యాత్రలు చంద్రుని పైకి వ్యోమగాములను విజయవంతంగా దింపాయి. అవి అపోలో 11, 12, 14, 15, 16, 17. ఈ ఈరు యాత్రల వ్యోమగాములు తెచ్చినవే ఈ చంద్రశిలలు. ఏయే దేశాలలో ఉన్నాయి?చంద్రుడి పైకి వ్యోమగాముల మొదటి ల్యాండింగ్ 1969 జూలైలో ‘అపోలో 11’ ద్వారా విజయవంతమైంది. అందులోనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఉన్నారు. ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ భూమిపైకి తెచ్చిన చంద్ర శిలలతో పాటు చంద్రుడి పైకి 1972లో ‘అపోలో 17’ ద్వారా జరిగిన వ్యోమగాముల చివరి ల్యాండింగ్ వరకు అసంఖ్యాకంగా శిలలు భూమికి చేరాయి. ఆ శిలల్లోని 50,000 శిలా శకలాలను ప్రపంచంలోని 15 దేశాలలోని 500 ప్రయోగశాలలకు నాసా పంపించింది. నిజానికి, వ్యోమగామలు తెచ్చిన చంద్రశిలల్లో ఇంకా 80 శాతం అలాగే, ఎవరూ కదలించకుండా ఉన్నాయి. ఈ 80 శాతంలో 15 శాతం చంద్రశిలల్ని ‘నాసా’, హ్యూస్టన్లోని తన ప్రధాన స్థావరానికి దూరంగా, న్యూ మెక్సికోలో ఒక దుర్భేద్యమైన భాండాగారంలో భద్రపరచింది. మానవులే స్వయంగా తెచ్చినవి·చంద్రుడి నుండి భూమి మీదకు కేవలం రాళ్లు మాత్రమే రాలేదు. మట్టి, ధూళిని కూడా వ్యోమగాములు తీసుకొచ్చారు. వీటిల్లో అపోలో చంద్ర శిలలు ఎందుకు ఇంత ప్రత్యేకమైనవి అంటే, మానవులు వాటిని తమ స్వహస్తాలతో చంద్రుడి పైనుంచి సేకరించుకుని వచ్చినవి కావటం. సోవియట్ యూనియన్ కూడా కొన్ని రాళ్ల నమూనాలను సేకరించింది. కానీ, అవి.. చంద్రుడి పైకి సోవియట్ యూనియన్ పంపిన మానవ రహిత అంతరిక్ష నౌకలోని రోబో మిషన్లు కిందికి తీసుకు వచ్చినవి. అలాగే, కొన్ని చంద్రశిలలు వాటంతటవే ఉల్కపాతంలా భూమిపై పడినవి. అయితే అవి చంద్రుడి లోని ఏ నిర్దిష్ట ప్రదేశం నుండి పడ్డాయో గుర్తించటం కష్టం. ఆ కారణంగా కొన్ని రకాల పరిశోధనలకు ఆ రాళ్లు తక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. ప్రపంచదేశాలకు నిక్సన్ గిఫ్ట్1969లో అపోలో 11 చంద్రయానం ద్వారా తొలిసారి వ్యోమగాములు భూమి పైకి తెచ్చిన చంద్రశిలల నమూనాలను అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్... అమెరికా సంయుక్త రాష్ట్రాలకు, 135 దేశాలకు బహుమతిగా పంపించారు. అయితే ఆ దేశాలలో సోవియట్ యూనియన్ లేదు!తిరిగి 1972లో, అపోలో 17 ద్వారా వచ్చిన చంద్ర శిలల్ని నిక్సన్ మళ్లీ అన్ని దేశాలకూ కానుకగా పంపించారు. ఈసారి సోవియట్కు ఆ అపురూపమైన బహుమతి పంపించారు. కాగా, ఇలా రెండుసార్లు నిక్సన్ పంపిన శిలా బహుమతులను ఆయా దేశాలు ఏం చేశాయో తెలీదు! కొన్ని దేశాలు ప్రదర్శనకు ఉంచాయి. కొన్ని దేశాలు పోగొట్టుకున్నాయి. కొన్ని చోరీ అవగా, మరికొన్ని దేశాలు స్టోర్ రూమ్లో పడేసినట్లు తెలుస్తోంది. భారతదేశానికి కూడా నిక్సన్ ఒక చంద్రశిలను కానుకగా పంపారు. 1973లో ఆ కానుక ఇండియా చేరింది. నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆ చంద్రశిలను న్యూఢిల్లీలోని పార్లమెంటు మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేయించారు. అంతకు ముందరి అపోలో 11 గుడ్ విల్ ‘రాక్’ను కూడా అమెరికా ఇండియాకు బహుకరించింది. అదిప్పుడు రాష్ట్రపతి భవన్ మ్యూజియంలో ఉంది. వివిధ దేశాలకు నిక్సన్ పంపిన ఈ చంద్రశిలా కానుకలతో పాటు, ‘మానవ ప్రయత్నాలలో ఐక్యతకు చిహ్నం’ అనే సందేశం కూడా జతపరిచి ఉంది.కొన్ని శిలలైతే ఎక్కడివక్కడే!అపోలో వ్యోమగాములు భూమి పైకి తెచ్చిన చంద్రశిలల్లో కొన్నింటిని నేటికీ కదల్చనేలేదు. అవి ఇప్పటికీ చంద్రునిపై ఉన్నట్లుగానే ఉండిపోయాయి!ర్యాన్ జీగ్లర్ వంటి శాస్త్రవేత్తలు ఈ విలువైన చంద్రశిలల్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. వాటిపై సరైన విధంగా పరిశోధనలు జరుగుతున్నాయా లేదా అని తరచు నిర్ధారించుకుంటూ ఉంటారు. అపోలో వ్యోమగాముల తీసుకొచ్చిన రాళ్లలో కొన్ని 400 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని 200 కోట్ల సంవత్సరాల నాటివి. ఈ రాళ్లను భూవాతావరణం, సూక్ష్మక్రిములు, కాలుష్యం నుండి సంరక్షించటానికి నత్రజని నింపిన గదులలో భద్రపరచారు. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం..! హైలెట్గా వెనక్కి ప్రవహించే నది..) -
స్కూల్ ప్రాజెక్ట్లో క్యూట్ సైంటిస్ట్!
ఐదో తరగతి విద్యార్థుల సైన్స్ ప్రాజెక్ట్లలో ఎక్కువగా రంగురంగుల పేపర్లు, కార్డ్బోర్డ్, గ్లూ, పెద్దగా రాసిన టైటిల్ కార్డ్స్తో వోల్కేనో మోడల్ లేదా సోలోర్ సిస్టమ్ మోడల్ చేస్తారు. కాని, అమెరికాలోని మిడ్టౌన్ పట్టణంలో చదువుతున్న 12 ఏళ్ల ఎనియోలా షోకుబ్ని చేసిన సైన్స్ ప్రాజెక్ట్ అందరినీ ఆశ్చర్యపరచింది. తన ప్రాజెక్ట్ కోసం ఆమె ఎంచుకున్నది జీవితానికి ఉపయోగపడే, సూపర్ ఇన్నోవేటివ్ ఐడియా. లాక్డౌన్ సమయంలో పాఠశాలల వాయు భద్రతను మెరుగుపరచడం కోసం, టీచర్ ఇచ్చిన సూచనలతో అందరికీ స్వచ్ఛమైన గాలి అందేలా చేయాలనుకుంది. అందుకోసం, ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ రూపొందించింది. కేవలం అరవై డాలర్ల ఖర్చుతో, ఒక చిన్న బాక్స్, ఫ్యాన్, ఫిల్టర్లు, డక్ట్ టేప్, కార్ట్బోర్డ్లతో ఎయిర్ ప్యూరిఫైర్ నమూనా తయారుచేసి, కమర్షియల్ ప్యూరిఫైర్స్కు అత్యంత చౌకైన ప్రత్యామ్నాయం చూపింది. ఈ ఎయిర్ ఫిల్టర్ను యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ సైంటిస్టులు పరీక్షించారు. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి. గాలిలో ఉన్న వైరస్లను తొంభై తొమ్మిది శాతం కంటే ఎక్కువ తొలగించే సామర్థ్యం దీనికి ఉందని తేల్చి, డిజైన్ను సర్టిఫై చేశారు. అందుకే, ఈ చిన్నారి ఐడియా, ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్గా మారింది. కనెక్టికట్ ప్రభుత్వం 11.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.101 కోట్లు) నిధిని మంజూరు చేసి, ఈ ఫిల్టర్లను అన్ని పబ్లిక్ స్కూళ్లలోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా, త్వరలోనే ప్రతి తరగతి గది పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గాలి పొందనుంది. (చదవండి: వాసా ప్రీవియా ఉంటే సాధారణ ప్రసవం అవ్వడం కష్టమా..?) -
చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?
చేతివాటం అని కొంత మంది ఏదో చులకనగా తేలికపాటి పదాలతో అంటూ ఉంటారు గానీ.. నిజానికి ‘హస్తలాఘవం’ అని గౌరవప్రదంగా అంటే ఆ విద్యలో ఉన్న కళాకౌశలానికి తగిన గుర్తింపు దక్కినట్టు అవుతుంది. అవును మరి.. ‘పిక్ పాకెట్’ లేదా ‘జేబు కత్తిరించుట’ అని చవకబారు భాషలో అనేసినంత మాత్రాన ఆ విద్యలో ఉన్న గొప్పదనం మరుగున పడిపోతుందా?. రెండు వైపులా పదును ఉండి.. పట్టుకున్న చేతినికూడా గాయపరచగల బ్లేడు వంటి చిన్న ఆయుధాన్ని, చాలా ఒడుపుగా రెండువేళ్ల మధ్యలో ఇరికించి పట్టుకుని.. ఎంతో టేలెంట్తో.. రోడ్డు మీద కనిపించిన వారి జేబును డబ్బులు లేదా మనీ పర్సు ఉన్నంత మేర మాత్రమే కత్తిరించడం ఆ విద్యలో మాస్టర్ డిగ్రీ అని చెప్పాల్సిందే. ఆ మాటకొస్తే జేబులు కత్తిరించడం మాత్రమేనా ఏమిటి? దుకాణాల్లో యజమానికి తెలియకుండా సరుకులు కొట్టేయడాలు, సూపర్ మార్కెట్లలో సీసీ కెమెరాల కనుగప్పి సరుకుల్ని మాయచేయడాలూ లాంటి వ్యవహారాలు అనేకం మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని చీప్గా చోరీలు అనకూడదు.. ‘కళాకౌశల ప్రదర్శన’ అని అనాలి. అందుకే మనం పొదుగుతున్న పిట్టకు తెలియకుండా గూట్లో గుడ్డును కొట్టేసే మహామహుల్ని గురించి కథలు తయారుచేసుకుని చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి చౌర్యం అనేది ఒక ఆర్టు.. చతుష్షష్ఠి కళలలో ఎన్నదగిన ఆర్టు. ఆ పనిచేసేవాళ్లు సదరు ఆర్టుని పెర్ఫార్మ్ చేస్తున్న కళాకారులు! మనకు అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. ఎవరో ఇద్దరు ఆడవాళ్లు బంగారం దుకాణానికి వస్తారు. మంచిగా మాటలు చెబుతూ నగల బేరం ప్రారంభిస్తారు. కొత్త కొత్త డిజైన్లు చూపించమని షాప్ కుర్రాడిని పురమాయిస్తారు. అతను వెనుదిరిగి మరో డిజైన్ అందుకుని చూపించేలోగా, ఆ బల్ల మీద ఉన్న వాటిని ఎంతో ఒడుపుగా తమ దుస్తుల మధ్యలోకి చేరవేస్తారు. కొన్ని క్షణాల వ్యవధిలో వీసమెత్తు తేడా రాకుండా ఎంతో పకడ్బందీగా ఈ కళను ప్రదర్శించాలంటే చాలా చాలా టేలెంట్ ఉండాలి. కానీ మనమేమో దానిని దొంగతనం అంటాం. నాలుగు తగిలించి పంపిస్తాం లేదా పోలీసులకు పట్టిస్తాం. Gujaratis are giving India a bad name internationally. Look at this Gujarati woman who stole 3 jeans, 7 tops, and 5 pairs of underwear from a shop in US. She was later caught with all the items, and her phone wallpaper had an image of Modi.pic.twitter.com/InTIuIzdxt— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) September 7, 2025తమ కళకు, టేలెంట్కు ఇక్కడ స్వదేశంలో అనుకున్న రీతిలో గౌరవం దక్కడం లేదని బాధపడుతున్నవారు ఏం చేయాలి, సాధారణంగా ఏం చేస్తుంటారు?. ఫరెగ్జాంపుల్ ఇంజినీరింగ్, మెడిసిన్ చదివిన వాళ్లు తమ ప్రతిభ మరింతగా రాణించాలంటే.. తమ విద్యతో మరింతగా ఆర్జించాలంటే అమెరికాకు వెళుతున్నారు కదా?. అదేమాదిరిగా మనం చోరకళాకారులు కూడా అమెరికాకు వెళుతున్నారు. అక్కడ తమ హస్తలాఘవాన్ని, కళాప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు. కానీ తమాషా ఏంటంటే.. వారి ఆర్టుకు అమెరికాలో కూడా గౌరవం దక్కడం లేదు. డిపార్టుమెంటల్ స్టోర్సులో, సూపర్ మార్కెట్లలో ఏదో తమకు తోచిన రీతిలో చేతివాటం ప్రదర్శిస్తే.. పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టేస్తున్నారు. మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ ఇదే పాట ఆమె కూడా పాడింది గానీ.. పోలీసులు కరుణించలేదు. ఆ పప్పులన్నీ ఉడకవని తేల్చేసి కటకటాల వెనక్కు పంపారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఇలాగే చోర కళాప్రదర్శనచేసి దొరికిపోయారు. అమెరికాలో ఈ కళను ‘షాప్ లిఫ్టింగ్’ అని వ్యవహరిస్తారట. అనగా.. స్టోర్సులో వస్తువులు పుచ్చుకుని డబ్బులివ్వకుండా జారుకునే విద్యకు అక్కడి పేరు అది! చదువుకోవడానికి అమెరికా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు న్యూజెర్సీలో ఇదే షాప్ లిఫ్టింగ్ కళను పెర్ఫార్మ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ వీడియో గత ఏడాదంతా మహా వైరల్ అయింది. చూడబోతే మన దేశంలో మాదిరిగానే అమెరికాలో కూడా కళకు సరైన గౌరవం లేదని అనిపిస్తోంది కదా!.గౌరవం లేకపోతే పాయె.. కానీ, ఈ సమస్య అక్కడితో ఆగడం లేదు. భారతదేశానికి చెందిన ఇలాంటి చోరకళాకారులు అడపాదడపా దొరికిపోతుండడం.. అమెరికాకు వెళ్లదలచుకునే వారి వీసాల ప్రక్రియ మీద కూడా ప్రభావం చూపిస్తోందట. చిన్న చిన్న చేతివాటానికి సంబంధించిన కేసులు ఉన్నా సరే.. అలాంటి వారు అమెరికాలో అడుగుపెట్టకుండా వీసాలు నిరాకరించాలని.. భారత్ లోని యూఎస్ ఎంబసీ ఆలోచిస్తున్నదట. వారి జైలుకు పోవడం సరే.. వారి దెబ్బకు మామూలు వాళ్లు కూడా అమెరికాకు వెళ్లాలంటే.. మనల్ని అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. ఇంటి దొంగలు ఇంట్లోనే ఉంటే కొంచెం పరువు దక్కుతుంది బజారున పడి దొంగతనాలు చేస్తే పరువు కూడా బజారుకెక్కుతుంది. చోరకళ అందరికీ అబ్బే విద్య కాదని వారు వాదించవచ్చు గానీ. ఈ అమాయక సమాజం దానిని నేరంగా పరిగణిస్తున్నప్పుడు.. వారు ప్రదర్శించకుండా మౌనంగా ఉండడమే మంచిది. ఏమంటారు?. -ఎం.రాజేశ్వరి👉ఇదీ చదవండి: ‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్’ -
నెల రోజుల్లో రూ. 62 వేల కోట్లు ఆవిరి
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ షట్డౌన్తో అగ్రరాజ్యంలో గత నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 62,100 కోట్లు) సంపద ఆవిరైపోయింది. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీవో) అంచనాల ప్రకారం ఈ గణాంకాలు అక్టోబర్ 1న షట్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నాలుగు వారాలకు సంబంధించినవి. కాగా ఇదే తీరు కొనసాగితే ఆరు వారాలకు 11 బిలియన్ డాలర్లు, ఎనిమిది వారాలకు 14 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం ఏర్పడవచ్చని సీబీవో అంచనా వేసింది. పది లక్షల మంది పైగా ఉద్యోగులకు జీతభత్యాలు లేకపోవడం వల్ల షట్డౌన్ సమయంలో వస్తువులు, సరీ్వసుల కొనుగోళ్లు పడిపోతాయని పేర్కొంది.షట్డౌన్ ఎత్తివేత అనంతరం స్థూల దేశీయోత్పత్తి నెమ్మదిగా తిరిగి కోలుకున్నా, నష్టపోయిన సంపద మాత్రం ఇక రికవర్ కాదని పేర్కొంది. కీలకమైన బిల్లులకు సంబంధించి అధికార, విపక్ష చట్టసభ సభ్యుల మధ్య రాజీ కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతబడింది. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. 1976 నుంచి దాదాపు 10 సార్లు షట్డౌన్ పరిస్థితి ఎదురైంది. 2018 డిసెంబర్ 22 నుంచి 2019 జనవరి 25 వరకు 35 రోజుల పాటు సాగిన షట్డౌన్ అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనది. అప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. ప్రభుత్వం మూతబడినప్పుడు, నిధులు లేకపోవడం వల్ల, కొన్ని ముఖ్యమైన విభాగాలు తప్ప, కీలకం కాని ఫెడరల్ సర్వీసులన్నీ నిలిచిపోతాయి. -
‘భారతీయులే కీలకం.. హెచ్-1బీ వీసాపై మరో ట్విస్ట్’
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ(H-1B) వీసాలపై ఫీజు పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీసాలపై ప్రకటనను పునఃపరిశీలించాలని అమెరికా చట్టసభ సభ్యుల బృందం.. తాజాగా ట్రంప్ను కోరడం విశేషం. ఫీజు పెంపుల అంశం అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండగా.. ఏఐ(AI) సాంకేతిక నాయకత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా చట్టసభ సభ్యుల బృందం ప్రతినిధులు జిమ్మీ పనెట్టా, అమీ బెరా, సలుద్ కార్బజల్, జూలీ జాన్సన్ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లేఖ రాశారు. ఈ లేఖలో హెచ్1-బీ వీసాల ఫీజుల పెంపు గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. లేఖలో..‘హెచ్-1బీ గ్రహీతల్లో అత్యధిక వాటాను భారతీయులు కలిగి ఉన్నారు. వారిలో ఎక్కువ మంది సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు(AI)లో అమెరికా నాయకత్వానికి కేంద్రంగా ఉన్నారు. వీసాల విషయం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు కూడా ఎంతో కీలకం. ఇలాంటి వీసా విధానం ఇండో-పసిఫిక్లో అమెరికాకు అత్యంత సన్నిహిత ప్రజాస్వామ్య మిత్రదేశాలలో ఒకటైన భారత్తో సంబంధాలను దెబ్బతీస్తుంది. వీసాల అమలు వల్ల కీలకమైన ప్రజాస్వామ్య భాగస్వామితో వ్యూహాత్మకంగా అమెరికా భాగస్వామ్యం బలపడుతుంది.మరోవైపు.. ఏఐ, అధునాతన సాంకేతికతలలో చైనా దూకుడుగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో మనం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడాన్ని కొనసాగించాలి. హెచ్-1బీ వీసాల అమలు అంటే కేవలం ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయడం కాదు. ఇది 21వ శతాబ్దంలో ప్రపంచ శక్తిని నిర్వచించే పరిశ్రమలలో అమెరికా నాయకత్వాన్ని చూపించడం. వీసాల ఫీజు పెంపు పెద్ద కంపెనీలకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ.. నైపుణ్యంపై ఆధారపడే స్టార్టప్లు, పరిశోధన సంస్థలను గుదిబండగా మారుతుంది’ అని హెచ్చరించారు. లేబర్ డిపార్ట్మెంట్ వీడియో..ఇదిలా ఉండగా.. హెచ్-1బీ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమిస్తున్నారని అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఆరోపించింది. హెచ్-1బీ వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ యువత తమ అమెరికన్ డ్రీమ్స్ కోల్పోతున్నారని, పరిస్థితిని సరిచేసి ఆ కలను తిరిగి అమెరికా ప్రజలకు ఇవ్వాలని సంకల్పించామని పేర్కొంది. దీనికి సంబంధించి తాజాగా వీడియో విడుదల చేసింది.ఈ వీడియోలో చూపించిన గణాంకాల ప్రకారం, హెచ్-1బీ వీసాలలో 72 శాతం భారతీయులకే జారీ అవుతున్నాయని వెల్లడించింది. వీసా కింద అమెరికాలో పనిచేస్తున్న నైపుణ్య కార్మికుల్లో అధికశాతం భారత్ నుంచే వెళ్తున్నారని తెలిపింది. వీసా వ్యవస్థలో ఎలాంటి అవకతవకలు ఉన్నాయా అని గుర్తించేందుకు ప్రాజెక్ట్ ఫైర్వాల్ పేరిట ఆడిట్ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమిస్తూ, స్థానిక అమెరికన్లకు నష్టం కలిగించే కంపెనీలను గుర్తించడమని పేర్కొంది. -
ఇదెక్కడి న్యాయం?.. ట్రంప్పై విరుచుకుపడ్డ కమలా హారిస్
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెతతారు. అధ్యక్ష భవనం వైట్హౌజ్లో భారీ వ్యయంతో బాల్రూమ్ నిర్మించాలన్న ప్రణాళికను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పిల్లల ప్రాణాలకు సంబంధించిన విషయాన్ని పట్టించుకోని ఈ చర్యను అసహ్యకరమైందిగా పేర్కొంటూ ట్రంప్పై విరుచుకుపడ్డారు. జాన్ స్టీవర్ట్ నిర్వహించిన ది విక్లీ షో (The Weekly Show) పోడ్కాస్ట్లో పాల్గొన్న హారిస్ ఈ అంశంపై మాట్లాడుతూ ఊగిపోయారు. ‘‘ఆ మనిషి తన ధనిక మిత్రుల కోసమే బాల్రూమ్ నిర్మిలించాలనుకుంటున్నారు. ప్రభుత్వం షట్డౌన్ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయమేనా ఇది?. అసలు ఆ మనిషి ప్రజల గురించి పట్టించుకోరా? సిగ్గుందా??.. .. అమెరికాలో పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆహార సహాయం(SNAP) నిలిచిపోయే పరిస్థితిలో ఉంది. ఆకలితో మరణాలు సంభవించే పరిస్థితి నెలకొంది. మరి ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి?.. వాళ్ల గురించి ఆ మనిషి కనీసం ఆలోచించరా? అంటూ ఆగ్రహంతో కమలా హారిస్ ఊగిపోయారు(మధ్యలో కోపంతో ఆమె F*** పదం ఉపయోగించారు). వ్యవస్థను కదిలించడం వేరు, దాన్ని నాశనం చేయడం వేరు. ప్రజలు ఆకలితో బాధపడుతున్న సమయంలో ఈ విధమైన ప్రాజెక్టులు అసహ్యకరమైనవి అని అభిప్రాయపడ్డారు. చిన్నపిల్లలు ఆకలితో బాధపడుతున్న సమయంలో స్నాప్(SNAP) బెనిఫిట్స్ ముగియబోతున్నాయి. కానీ అధ్యక్షుడు బాల్రూమ్ నిర్మాణం గురించి ఆలోచిస్తున్నారు. ఇది అమానవీయం అని కమలా హారిస్ తేల్చేశారు. SNAP అంటే Supplemental Nutrition Assistance Program. ఇది అమెరికా ప్రభుత్వం నిర్వహించే ఆహార సహాయ కార్యక్రమం, దీని ద్వారా అర్హత కలిగిన పేద కుటుంబాలకు ఫుడ్ స్టాంప్స్ లేదంటే EBT కార్డుల ద్వారా నెలకు కొన్ని డాలర్లు అందిస్తారు. ఈ డబ్బుతో వారు ఆహార పదార్థాలు కొనుగోలు చేయగలుగుతారు.ఇదిలా ఉంటే.. వైట్హౌజ్లోని ఈస్ట్ వింగ్లోని భాగాన్ని కూల్చేసి అత్యాధునికంగా బాల్రూమ్ను నిర్మించే ప్రయత్నంలో ట్రంప్ ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని అంచనా. అయితే.. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తిగా ప్రైవేట్ విరాళాలతోనే కట్టబతున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య హెల్త్ ఇన్సురెన్స్ సబ్సిడీ, ఫారిన్ఎయిడ్.. ఇతరత్రా ఫెడరల్ బడ్జెట్ విషయంలో మనీ బిల్లులపై సెనేట్లో ఏకాభిప్రాయం(13 సార్లు ఓటింగ్ జరిగినా) కుదరలేదు.దీంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే.. జీతం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయాల్సిన పరిస్థితి అన్నమాట. దీంతో SNAP ఫుడ్ బెనిఫిట్స్, మిలిటరీ పే, ఇతర సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేటితో షట్డౌన్ 31వ రోజుకి చేరుకుంది. పోలిమార్కెట్ బెట్టింగ్ అంచనాల ప్రకారం, నవంబర్ 16 తర్వాతే షట్డౌన్ ముగిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. -
ఉష మతం మారదు: జేడీ వాన్స్
మత విశ్వాసాల విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన భార్య ఉషా వాన్స్ హిందూ మతంలో పెరిగినప్పటికీ.. క్రైస్తవ మతం స్వీకరించాలని తనకు ఆశగా ఉందంటూ ఆయన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించడం తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మరోసారి స్పందించారు. ఆయన క్రిస్టియన్ కాదని.. ఆమెకు మతం మారే ఉద్దేశం ఏమాత్రం లేదని అన్నారాయన. తాను చేసింది అసహ్యమైన వ్యాఖ్య అంటూ కొందరు నన్ను విమర్శించారు. నేను ప్రజల మనిషిని. వాళ్లు వేసే ప్రశ్న నుంచి తప్పించుకోలేను. అయినా మరోసారి స్పష్టత ఇస్తున్నా. ఆమెకు(ఉష) మతం మారే ఉద్దేశం లేదు. అయినా మతపరమైన విషయాలనేవీ వ్యక్తిగతం. కుటుంబం, స్నేహితులతో చర్చించాల్సిన అంశం అది. క్రిస్టియన్లు తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటారు. ఇది సాధారణమైన విషయం. నా వ్యాఖ్యలు కూడా అలాంటి సాధారణ ఆకాంక్షే అని ఎక్స్ పోస్ట్లో వివరించారాయన. తనపై వస్తున్న విమర్శలను అసహ్యకరమైనవిగా అభివర్ణించిన ఆయన.. క్రిస్టియన్ మతంపై ద్వేషంతోనే వాళ్లు అలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నా భార్యను నేను ప్రేమగా చూస్తా. అలాగే ఆమె మతాన్ని కూడా గౌరవిస్తా. నేను ఆమె మతాన్ని తక్కువ చేసినట్లు మాట్లాడినట్లుగా భావించి విమర్శలు చేయడం సరికాదు అని అన్నారాయన. What a disgusting comment, and it's hardly been the only one along these lines. First off, the question was from a person seemingly to my left, about my interfaith marriage. I'm a public figure, and people are curious, and I wasn't going to avoid the question.Second, my… https://t.co/JOzN7WAg3A— JD Vance (@JDVance) October 31, 2025యూనివర్సిటీ ఆఫ్ మిసిసిప్పీలో జరిగిన ఓ ఈవెంట్లో జేడీ వాన్స్ ప్రసంగిస్తుండగా.. భారత మూలాలున్న ఓ యువతి ఆయనపై ప్రశ్నలు గుప్పించింది. వలసలు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అవలంభిస్తున్న కఠిన వైఖరిపై నిలదీస్తూనే.. మరోపక్క మతం గురించి ఒక ప్రశ్న సంధించారు. దానికి వాన్స్ స్పందిస్తూ.. తన భార్య ఉషా, హిందూ మతంలో పెరిగినవారిగా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాలనే ఆశ తనకు ఉందని చెప్పారు. ఆమె చాలా ఆదివారాలు తనతో పాటు చర్చికి వస్తుందని, తాను అనుభవించిన ఆధ్యాత్మిక అనుభూతిని ఆమె కూడా అనుభవిస్తే బాగుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. అంతే.. ఆయన్ని తిట్టిపోస్తూ నెటిజన్లు మండిపడ్డారు. ఉషా వాన్స్ నేపథ్యం.. జేడీ వాన్స్ సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరి వాన్స్. ఈమె తెలుగు మూలాలున్న వ్యక్తి. ఉష తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి (Usha Chilukuri Vance) పుట్టిపెరిగారు. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. యేల్ లా స్కూల్లోనే ఉషా, జె.డి.వాన్స్ (JD Vance) తొలిసారి కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం. వీళ్లకు ముగ్గురు సంతానం. ఆమె న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్కు మేనేజింగ్ ఎడిటర్గా, యేల్ లా జర్నల్కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద విధులు నిర్వర్తించారు. 2015 నుంచి ఆమె న్యాయ సంబంధిత సంస్థలు ముంగర్, టోల్స్, ఓస్లాన్లో కార్పొరేట్ లిటిగేటర్గా పనిచేస్తున్నారు. విశేషం ఏంటంటే.. అమెరికాలో ఉష లెఫ్ట్-వింగ్, లిబరల్ గ్రూప్స్తో కలిసి పనిచేశారు. 2014లో ఆమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకున్నారు. అయితే.. రిపబ్లికన్ అయిన భర్త జేడీ వాన్స్ విజయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. ఆ మధ్య ఈ కుటుంబం భారత పర్యటనలోనూ సందడి చేశారు. -
టెక్స్టైల్స్, రత్నాభరణాల ఎగుమతుల్లో వైవిధ్యం
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్, రత్నాభరణాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అమెరికా కాకుండా ఇతర మార్కెట్లకు మెరుగుపడినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది. యూఏఈ, వియత్నాం, బెల్జియం, సౌదీ అరేబియాకు ఈ రంగాల నుంచి ఎగుమతులు పెరిగాయి. ఆసియా, యూరప్, పశి్చమాసియా దేశాల్లో డిమాండ్ భారత ఎగుమతులకు కలిసొస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెపె్టంబర్ మధ్య సముద్ర ఉత్పత్తుల (రొయ్యలు, చేపలు తదితర) ఎగుమతులు 15.6 శాతం పెరిగి 4.83 బిలియన్ డాలర్లకు చేరాయి. 1.44 బిలియన్ డాలర్లతో అమెరికా భారత సముద్ర ఉత్పత్తులకు ఈ కాలంలో అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఈ కాలంలో వియత్నాంకు 100 శాతం, బెల్జియంకు 73 శాతం, థాయిలాండ్కు 54 శాతం చొప్పున క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎగుమతులు పెరిగాయి. చైనాకు 10 శాతం, మలేసియాకు 64 శాతం, జపాన్కు 11 శాతం వరకు ఎగుమతులు అధికంగా నమోదయ్యాయి. ఇలా ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడం వల్ల అమెరికా తదిర కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని వాణిజ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆగస్ట్ నుంచి భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్లు అమలు చేస్తుండడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాలకు ఎగుమతులు విస్తృతం కావడం వల్ల టారిఫ్ల ప్రభావాన్ని అధిగమించే వెసులుబాటు లభిస్తుంది. టెక్స్టైల్స్ ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి ఈ ఏడాది జనవరి నుంచి సెపె్టంబర్ కాలంలో టెక్స్టైల్స్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 1.23 శాతం పెరిగి 28 బిలియన్ డాలర్లకు చేరాయి. యూఏఈకి ఎగుమతులు అత్యధికంగా 8.6 శాతం పెరిగి 136.5 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. నెదర్లాండ్స్కు 12 శాతం, పోలండ్కు 24 శాతం, స్పెయిన్కు 9 శాతం, ఈజిప్్టకు 25 శాతం చొప్పున టెక్స్టైల్స్ ఎగుమతులు అధికంగా నమోదయ్యాయి. ఇక రత్నాభరణాల ఎగుమతులు సైతం 1.24 శాతం పెరిగి 22.73 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. యూఈకి 38 శాతం అధికంగా 1.93 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. దక్షిణ కొరియాకు 134 శాతం, సౌదీ అరేబియాకు 68 శాతం, కెనడాకు 41 శాతం చొప్పున రత్నాభరణాల ఎగుమతులు పెరిగినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది. -
మ్యూజియంలో దొంగలు పడ్డారు
ఓక్లాండ్ (కాలిఫోర్నీయా): అమెరికాలో చారిత్రక ప్రాధాన్యమున్న దాదాపు 1000 వస్తువులను దుండగులు అపహరించారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ మ్యూజియం నుంచి ఈ నెల 15న ఈ వస్తువులను అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన వస్తువులు కాలిఫోర్నీయా చరిత్రకు సాక్ష్యాలుగా భద్రపర్చబడ్డవి అని పేర్కొన్నారు. ఈ చోరీపై దర్యాప్తు జరుగుతోందని మ్యూజియం డైరెక్టర్ లోరీ ఫోగర్టీ తెలిపారు. దొంగలు ఆ వస్తువులను ఎక్కడైనా విక్రయించటానికి ప్రయతి్నస్తే తమకు సమాచారం అందించాలని పురాతన వస్తువులను విక్రయించే మార్కెట్లు, దుకాణాదారులకు విజ్ఞప్తి చేశారు. ‘వారు కొల్లగొట్టింది మ్యూజియాన్ని మాత్రమే కాదు. ప్రజల సంపదను కొల్లగొట్టారు. మన సమాజాన్ని కొల్లగొట్టారు. వాటిని తిరిగి తెచ్చేందుకు ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నాం’అని లోరీ గురువారం ఆశాభావం వ్యక్తంచేశారు. చోరీకి గురైన వస్తువుల్లో మెటల్ వర్క్ ఆభరణాలు, అమెరికా మూలవాసులు ఉపయోగించిన బుట్టలు, గతంలో కాలిఫోర్నీయా వాసులు నిత్యజీవితంలో వినియోగించిన వస్తువులు, అథ్లెటిక్స్ ట్రోఫీలు తదిర విలువైన వస్తువులు ఉన్నాయి. ‘దుండగులు భవనంలోకి ప్రవేశించి కనిపించిన వస్తువునల్లా తీసుకొని వచ్చిన దారినే వెళ్లినట్లు కనిపిస్తోంది’అని లోరీ తెలిపారు. చోరీకి గురైనవాటిలో ప్రముఖ లోహవస్తువుల కళాకారుడు ఫ్లోరెన్స్ రెస్నికోఫ్ రూపొందించిన అందమైన ఆభరణాలతోపాటు నగిషీలు చెక్కిన వాల్రస్ (సముద్ర జంతువు) దంతాలు ఉన్నాయి. చాలా వస్తువులు కాలిఫోర్నీయా 20వ శతాబ్దపు చరిత్రను తెలియజేసేవేనని లోరీ తెలిపారు. వాటిని ఇప్పటికే అమ్మేసి ఉంటారు చోరీ జరిగి ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయినందున దొంగలు వాటిని ఎక్కడో ఓ చోట అమ్మేసి ఉంటారని లాస్ఏంజెల్స్ పో లీస్ విభాగంలో కెపె్టన్గా పనిచేసి రిటైరైన జాన్ రోమెరో అభిప్రాయపడ్డారు. దర్యాప్తు అధికారులు వాటికోసం వస్తువుల రీసేట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లైన ఈబే, క్రెయిగ్స్లిస్ట్తోపాటు చారిత్రక ప్రాధాన్యమున్న వస్తువులను సేకరించే దుకాణాల్లో వెదకాలని సూచించారు. ‘దోపిడీ చేసినవారు వాటిని అమ్మేసి వెంటనే డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు. వాటి విలువ తెలిసినవారు కాదు’అని పేర్కొన్నారు. -
కలల్ని అమ్ముకున్నారు.. ఇప్పుడు స్థానం లేదంటారా?
అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్కు ఊహించని పరిణామం ఎదురైంది. వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భారతీయ మూలాలున్న ఓ యువతి వాన్స్ ముఖం మీదే ఎండగట్టింది. అంతేకాదు.. ఆయన వ్యక్తిగత జీవితంపైనా ఆమె వేసిన ఓ ప్రశ్నతో ఆయన ఇబ్బందిపడినట్లు కనిపించారు. అమెరికాలోని మిసిసిప్పీ విశ్వవిద్యాలయంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ Turning Point USA అనే ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వాన్స్ ప్రసంగిస్తూ.. అమెరికాలో కఠినమైన వీసా పరిశీలన విధానానికి (strict vetting process) మద్దతు ప్రకటించారు. అమెరికాలోకి చట్టబద్ధంగా వచ్చే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో.. భారతీయ సంతతికి చెందిన ఓ యువతి మైక్ అందుకుంది. ఆయన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ‘‘మీరు ఇంతకాలం అమెరికా కలల్ని మాకు అమ్మారు, మా యవ్వనాన్ని, సంపదను ఖర్చు పెట్టించారు. అలాంటిది ఇప్పుడేమో ఎక్కువ మంది వస్తున్నారు.. వాళ్లను వెనక్కి పంపాలి అంటారా?.. మాకు ఇక్కడ స్థానం లేదంటారా?. మేము చట్టబద్ధంగా వచ్చాం, మీ నిబంధనలు పాటించాం. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి చెందనివాళ్లమంటారా?’’ అని వాన్స్ను నిలదీశారు. ఆ సమయంలో.. A brave young woman asks JD Vance: “When you talk about too many immigrants here, when did you guys decide that number? Why did you sell us a dream? You gave us the path and now tell us we don't belong here? Why do you have to be Christian to be American?” pic.twitter.com/mQ3CTAnN58— The Tennessee Holler (@TheTNHoller) October 30, 2025కొందరు చప్పట్లు చరుస్తూ ఆమెను అభినందించడం గమనార్హం. అయితే వాళ్లను వారిస్తూ ఆమె ఈ ప్రశ్నతో గొడవ చేయాలన్నది తన ఉద్దేశం కాదంటూ స్పష్టం చేశారు. దానికి వాన్స్ సమాధానం ఇవ్వలేదు. బదులుగా.. అత్యధిక ఇమ్మిగ్రేషన్ అమెరికా సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని.. కొంతమంది అక్రమ వలసదారులు దేశానికి మేలు చేశారని.. అంతమాత్రాన అందువల్ల లక్షల మందిని అనుమతించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు. ఆ వెంటనే.. ఆ యువతి.. అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్ కావాల్సిందేనా? అని అడిగింది. దానికి వాన్స్ స్పందిస్తూ తాను మత బోధనను విశ్వసిస్తానని.. తన భార్య కూడా భవిష్యత్తులో అదే విశ్వాసాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే, ఆమెకు స్వేచ్ఛ ఉందని, అది తనకు సమస్య కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. వాన్స్ వైఖరిపై ఇండో అమెరికన్లు మండిపడుతున్నారు. హిందూ భార్యను కలిగి ఉండి, మతపరమైన మార్పును ఆశించడం ద్వంద్వ వైఖరేనంటూ పలువురు వ్యాఖ్యానించారు. వాన్స్ వివాహం వేద హిందూ సంప్రదాయంలో జరిగినదని కూడా కొందరు గుర్తు చేశారు. వాన్స్ను ప్రశ్నించిన ఆమె ఎవరన్నదానిపై ఇంకా స్పష్ట త రావాల్సి ఉంది.When JD Vance had hit his lowest, it was his “Hindu” wife and her Hindu upbringing that had helped him navigate through the tough times. Today in a position of power, her religion has become a liability. What a fall. What an epic fall for the man. pic.twitter.com/Zvz7bFQ0hZ— Monica Verma (@TrulyMonica) October 30, 2025 -
వలసదారులకు మరో పిడుగులాంటి వార్త
-
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి. -
అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు
ఒకే తల్లికి పుట్టిన పిల్లలకు ఒకే విధమైన సమస్య రావడం చూస్తుంటాం. అలా కాకుండా..ఆఖరి పిల్లవాడిలో చూసిన రుగ్మత పెద్దపిల్లల్లో ఒకరి తర్వాత ఒకరూ బారినపడితే..అదొక మెడికల్ మిస్టరీలా ఉంటుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఆవిష్కృతమైంది. వైద్యులు సైతం ఇదెలా సాధ్యం అని విస్తుపోతున్నారు.అసలేం జరిగిందంటే..అమెరికాలోని వెస్ట్ వర్జినియాకు చెందిన ఒక కుటుంబంలో నలుగురు కుమార్తెలు ఒకరు తర్వాత ఒకరు ఒకే విధమైన మెదడు సంబంధిత రుగ్మత బారినపడ్డారు. తొలుత చిన్న కుమార్తెకు 18 నెలల వయసు ఉండగా ఈ సమస్యను గుర్తించారు. అదీగా తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేర్చుకోవడం ఆలస్యం కావడంతో..ఆ చిన్నారి విషయంలోనే ఆందోళ చెందేవారు. ఇప్పుడూ పెద్దవాళ్లైన ముగ్గురు పిల్లలు అదే రుగ్మత బారినపడ్డారని తెలిసి తల్లడిల్లిపోయారు. ఏంటా వ్యాధి అంటే..మెదడుకి సంబంధించిన చియారీ వైకల్యం. వైద్యానికి సవాలు విసిరేలా నలుగురు ఒకేసారి ఈ వ్యాధిని ఎదుర్కొవడం అంతుచిక్కని మిస్టరీలా అనిపించింది వైద్యులకు. చియారీ వైకల్యం అంటే..పుర్రె వెనుకభాగం మెదడు కణజాలం వెన్నెముకలోకి ప్రవేశించే పరిస్థితి. ఫలితంగా ఇది మెదడుపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో తలనొప్పి, మైకము, మెడ నొప్పి, బ్యాలెన్సింగ్కి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. సింపుల్గా చెప్పాలంటే మెదడు యొక్క దిగువ భాగం పుర్రె దాటి విస్తరించి, పుర్రె వెన్నుపాముతో కలిసే ద్వారం పొడుచుకు వచ్చే పరిస్థితి. ఇది సాధారణంగా పుట్టుకకు ముందు అభివృద్ధి చెందుతుందని వైద్యులు. ఈ సమస్యల ప్రతి 2,000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందనేది ఖచ్చితమైన కారణం తెలియదు. అయితే పెద్దవాళ్లైన ముగ్గురు ఆడపిల్లలు అమేలియా, ఆబ్రే, అడాలీలకి పీడియాట్రిక్ న్యూరో సర్జన్ శస్త్ర చికిత్స చేసి సమస్య నుంచి మెరుగయ్యేలా చేశారు. ఇక్కడ వైద్యులు ఈ పరిస్థితికి..మెదడుతో కుదించి ముడిపడి ఉన్న వెన్నుపాములను కోసి సెరెబ్రోస్పానియల్ ద్రవ ప్రవాహాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా శస్త్రచికిత్స చేస్తారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఈ సమస్య నుంచి విజయవంతంగా బయటపడ్డారు. కానీ ఇలా ఈ చియారీ వైకల్యం బారిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఒకేసారిపడటం అనేది అత్యంత అసాధారణం, అరుదుగా పేర్కొన్నారు వైద్యులు. ఈ సమస్య సుమారు 10% వరకు వంశపారంపర్యంగా వస్తున్నట్లు భావిస్తున్నప్పటికీ..జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తుందనేది మరికొందరు నిపుణులు వాదన. చివరగా.. ఈ సమస్యకు గనుక సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవయవాల బలహీనత, శ్వాస సమస్యలు, పార్శ్వగూని, తలనొప్పి, నరాల నొప్పికి దారితీసి పక్షవాతానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: రోబోటిక్తో..స్ట్రోక్ శరవేగంగా రికవరీ) -
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా. -
చైనాకు ట్రంప్ గుడ్న్యూస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. చైనాపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గురువారం దక్షిణ కొరియా బుసాన్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. జిన్పింగ్తో భేటీ అద్భుతంగా జరిగిందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం.. 2018 దాకా చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 0-5 శాతంగా ఉండేవి. అయితే 2021లో అది 20 శాతానికి చేరింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టి టారిఫ్ వార్ మొదలుపెట్టాక చైనా విషయంలోనూ పెంపు ఉండొచ్చని అంతా భావించారు. అందుకు తగ్గట్లే అది 57 శాతానికి చేరింది. అయితే ఆ పెంపు 155 శాతం దాకా ఉంటుందని.. నవంబర్ 1వ తేదీ నుంచి అమలు అవుతుందని ఆయన హెచ్చరించారు కూడా. ఈలోపు..పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా గురువారం ఈ ఇరు దేశాధినేతలు రెండు గంటలపాటు సమావేశం కాగా, చర్చలు ఫలవంతం అయ్యాయి. తాజా తగ్గింపుతో సుంకాలు 47 శాతానికి చేరాయి. ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక అద్భుతమైన ఆరంభం అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. టారిఫ్ తగ్గింపుతో పాటు సోయాబీన్ కొనుగోళ్ల పునరుద్ధరణ, అలాగే.. రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి ఇంతకు మించి ఏం చెప్పలేనన్న ఆయన.. ముఖ్యమైన అంశాలకు సంబంధించి వివరాలను కాసేపట్లో విడుదల చేస్తామని మీడియాకు తెలిపారు. -
మాది గొప్ప సంబంధం.. మళ్లీ కలవడం ఆనందంగా ఉంది
వాణిజ్య ఉద్రిక్తతల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ముఖాముఖి మాట్లాడుకున్నారు. దక్షిణ కొరియా బుసాన్లో గురువారం ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా ఈ ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత.. కరచలనం చేసుకుంటూ నవ్వుకుంటూ ఇద్దరూ మీడియా ముందు ఫోజులిచ్చారు. ఆపై ఇరు దేశాల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ జరిపారు.‘‘మా మధ్య మంచి పరిచయం ఉంది. మాది గొప్ప సంబంధం. మళ్లీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగానే కుదిరే అవకాశం ఉంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మీరు తిరిగి అధ్యక్షుడయ్యాక మూడుసార్లు ఫోన్లో మాట్లాడాం, చైనా-అమెరికా ఆర్థిక సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. అమెరికాను గొప్ప దేశంగా మార్చే దృష్టితో చైనా అభివృద్ధి సాగుతోంది అని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. ఇరు దేశాల సంబంధాలు స్నేహపూర్వకంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అదే సమయంలో.. BREAKING 🚨 China’s President stuns the world THANKING President Trump for promoting PEACE "Mr President you care a lot about world peace. You are very enthusiastic about settling regional hotspot issues”I AM IN TOTAL SHOCK 🔥 pic.twitter.com/yEkzCdigUf— MAGA Voice (@MAGAVoice) October 30, 2025చైనా-అమెరికా.. రెండు ప్రపంచ శక్తులు. అవి ఎప్పుడూ ఒకే అభిప్రాయంలో ఉండకపోవడం సహజం. పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం కూడా సహజమే. కానీ వాటిని ద్వైపాక్షిక సంబంధాల చర్చల ద్వారా అధిగమించి ముందుకు ఎలా సాగుతామనేదే ముఖ్యం అని జిన్పింగ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. మరోవైపు.. గాజా కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రపై జిన్పింగ్ ప్రశంస గుప్పించారు. ప్రపంచ శాంతికి ఈ ఒప్పందం మీరు చేసిన గొప్ప కృషి అని అన్నారాయన. ఇలాంటి శాంతి చర్చలకు చైనా మద్దతు తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. అంతకు ముందు.. JUST IN: 🇺🇸🇨🇳 President Trump officially meets with Chinese President Xi Jinping to discuss trade deal. pic.twitter.com/lIB0O68Wo7— Watcher.Guru (@WatcherGuru) October 30, 2025తమ భేటీ విజయవంతం అవుతుందనే ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నాకు ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన(జిన్పింగ్) చాలా కఠినమైన చర్చాకర్త. అది ఏమాత్రం మంచిది కాదు’’ అంటూ అక్కడ నవ్వులు పూయించారు. ఇదిలా ఉంటే.. 2018లో ప్రారంభమైన ట్రంప్-చైనా వాణిజ్య యుద్ధం 2025లో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసింది. ట్రంప్ సుంకాల బెదిరింపులు.. చైనా కూడా తన "రేర్ ఎర్త్ మినరల్స్" ఎగుమతులపై నియంత్రణలను విధించడంతో పరిస్థితి క్షీణించసాగింది. ఈ తరుణంలో.. తాజా భేటీ చైనా–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు దారితీసే అవకాశం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలతోపాటు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చిస్తారని, ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో జరుగుతున్న భేటీ సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. అయితే ట్రంప్-జిన్పింగ్ల భేటీ కంటే ముందే ట్రేడ్ డీల్కు సంబంధించిన ఒప్పందం ఖరారైనట్లు సంకేతాలు అందుతున్నాయి. దీని ప్రకారం.. అమెరికా సుంకాలను నిలిపివేయడం, అలాగే.. చైనా కూడా తన "రేర్ ఎర్త్ మినరల్స్" నియంత్రణలను ఒక సంవత్సరం పాటు వాయిదా వేయడం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
ఎఫ్డీఐల్లో అమెరికా, సింగపూర్ టాప్
ముంబై: గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో భారత్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్డీఐ) మూడో వంతు వాటాతో అమెరికా, సింగపూర్ అగ్రస్థానంలో నిల్చాయి. మొత్తం రూ. 68,75,931 కోట్ల ఎఫ్డీఐలు రాగా అమెరికా వాటా 20 శాతంగా, సింగపూర్ది 14.3 శాతంగా ఉంది. మారిషస్ (13.3 శాతం), బ్రిటన్ (11.2 శాతం), నెదర్లాండ్స్ (9 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఫారిన్ లయబిలిటీస్, అసెట్స్ (ఎఫ్ఎల్ఏ)పై రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన వార్షిక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 45,702 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో 41,517 సంస్థలు తమ బ్యాలెన్స్ షీట్స్లో ప్రస్తావించాయి. ఇందులో నాలుగింట మూడొంతుల సంస్థలు విదేశీ కంపెనీల అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. మార్కెట్ వేల్యూ ప్రకారం మొత్తం ఎఫ్డీఐ ఈక్విటీ పెట్టుబడుల్లో తయారీ రంగం అత్యధిక వాటా దక్కించుకోగా, సర్వీసుల రంగం రెండో స్థానంలో నిల్చింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డీఐల పరిమాణం రూ. 61,88,243 కోట్లుగా నమోదైంది. మరోవైపు, తాజాగా గత ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో చేసిన ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం రూ. 11,66,790 కోట్లుగా నమోదైంది. ఇందులో సింగపూర్ వాటా 22.2 శాతంగా, అమెరికా వాటా 15.4 శాతంగా ఉంది. బ్రిటన్ (12.8 శాతం), నెదర్లాండ్స్ (9.6 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
మూడోసారి అవకాశం లేదట!
గ్వాంగ్జు (దక్షిణకొరియా): అమెరికా అధ్యక్ష పదవికి మూడోసారి కూడా పోటీపడాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలను సొంత పార్టీ నేతలే అసాధ్యమని తేల్చేయటంతో ఆయన తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. మూడోసారి పోటీకి అవకాశం లేకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. జపాన్ పర్యటన ముగించుకుని బుధవారం దక్షిణకొరియాకు వెళ్తూ తన ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా కాంగ్రెస్లోని దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్, రిపబ్లికన్ నేత మైక్ జాన్సన్ మంగళవారం వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. ట్రంప్ మూడోసారి పోటీ చేయటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. 22వ రాజ్యాంగ సవరణ ఏ అమెరికన్ పౌరుడు కూడా మూడోసారి అధ్యక్షుడు కావటాన్ని అనుమతించదని స్పష్టంచేశారు. ఒకవేళ ఆ రాజ్యాంగ సవరణను మళ్లీ సవరించి మూడోసారి అధ్యక్ష పదవికి అర్హత లభించేలా చట్టం చేయాలన్నా.. అది పదేళ్ల సుదీర్ఘ ప్రక్రియ అని పేర్కొన్నారు. మైక్ జాన్సన్ ప్రకటన గురించి మీడియా ప్రస్తావించగా ట్రంప్ నిర్వేదంగా మాట్లాడారు. ‘నేను చదివినదాన్ని బట్టి బహుషా నేను కొనసాగటానికి (మూడోసారి అధ్యక్షుడిగా) అనుమతి ఉండదట. ఇది చాలా దురదృష్టకరం. చూద్దాం ఏం జరుగుతుందో’ అని అన్నారు. కష్టమే కాదు.. అసాధ్యం మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగటానికి ఎవరికీ సాధ్యం కాదని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ స్పష్టంచేశారు. ‘నాకు తెలిసి అందుకు మార్గమే లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలో ఉన్న అడ్డంకులపై ఆయన (ట్రంప్)తో నేను చర్చించాను. ఈ విషయంలో ఇక వివాదాన్ని రాజేయలేం. ఆయనకు ఇంకా నాలుగేళ్ల సమయం (అధ్యక్షుడిగా) ఉంది’అని పేర్కొన్నారు. అయితే, తనకు మూడోసారి అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోయినా తన రిపబ్లికన్ పారీ్టలో ఆ పదవికి అర్హత ఉన్న అనేకమంది నేతలు ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో వంటివారు అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చని తెలిపారు. వచ్చేసారి ఉపాధ్యక్షుడిగా పోటీచేసి, తిరిగి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? అని అడగ్గా.. ‘అలా చేయటానికి అవకాశం ఉంది. కానీ నేను చేయను’ అని బదులిచ్చారు. -
మోదీతో అంత ఈజీ కాదు: ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒస్పేసుకున్నారా?, త్వరలో భారత్తో వాణిజ్య చర్చలకు సిద్ధమవుతున్న ట్రంప్.. మోదీపై ప్రశంసలకు కారణం ఏమిటి?, భారత్తో స్నేహ హస్తాన్ని కాదనుకుంటే తమకే ముప్పు తప్పదని ట్రంప్ గ్రహించారా?, వీటికి మరింత బలం చేకూరుస్తూ దక్షిణకొరియా వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.‘నాకు మోదీతో మంచి రిలేషన్ ఉంది. ఆయన చూడటానికి చాలా సౌమ్యంగా కనిపిస్తారు. తండ్రిలా కనిపిస్తారు. కానీ ఆయనతో అంత ఈజీ కాదు. మోదీ అంటే నరకం కంటే కఠినం. ఆయనొక ‘కిల్లర్’’ అంటూ కొనియాడారు. ఇక్కడ కిల్లర్ అనే కాస్త వివాదాస్పదంగా కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా వెనుకడుగేసి నైజం మోదీలో లేదనేది ట్రంప్ చెప్పకనే చెప్పేశారు. దక్షిణ కొరియాలోని గ్యోంగ్జులో జరిగిన ఆసియన్-పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ (APEC) సీఈఓల సమ్మిట్లోట్రంప్ మాట్లాడుతూ.. మోదీని ఆకాశానికెత్తేశారు. భారత–అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరిగే అవకాశముందని చెప్పారు ట్రంప్.- పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో మోదీతో జరిగిన సంభాషణను సైతం వివరించారు ట్రంప్. ఆ సమయంలో మోదీ తనతో మాట్లాడిన శైలిని సైతం ట్రంప్ అనుకరించారు. -
అమెరికాలో పెరుగుదల Vs భారత్లో తగ్గుదల
ఒకవైపు అమెరికన్ టెక్ నిపుణుల వేతనాల వృద్ధి పండుగ వాతావరణాన్ని తలపిస్తుంటే, మరోవైపు భారతీయ టెక్ ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ సాంకేతిక రంగంలో ఈ విచిత్రమైన వైరుధ్యం ఏర్పడడానికి కారణాలను కొన్ని సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఒకే పరిశ్రమలో, ఒకే రకమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు రెండు భిన్నమైన వేతన ధోరణులను ఎందుకు ఎదుర్కొంటున్నారో తెలియజేస్తూ పేరోల్ అండ్ కంప్లయన్స్ ప్లాట్ఫామ్ డీల్ (Deel), ఈక్విటీ మేనేజ్మెంట్ సంస్థ కార్టా (Carta) సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ఈ విశ్లేషణకు దారితీసిన ప్రధాన కారణాలను, ముఖ్యంగా అమెరికాలో వేతనాలు పెరగడానికి, భారత్లో వేతన పరిహారం తగ్గడానికి గల అంశాలను పరిశీలిద్దాం.భారత్లో వేతన పరిహారం తగ్గుదలకు కారణాలుభారతీయ టెక్ నిపుణుల వేతనాలు 2025లో భారీగా తగ్గాయి. ఇంజినీరింగ్, డేటా సంబంధిత ఉద్యోగుల సగటు పరిహారం 40% తగ్గి 22,000 డాలర్లకు(సుమారు రూ.19.5 లక్షలు) చేరుకుంది. ప్రొడక్షన్, డిజైన్ నిపుణుల సగటు వేతనం కూడా 23,000కు పడిపోయింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు కింది విధంగా ఉన్నాయి.వేతన పెంపులో ఒత్తిడిభారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సంప్రదాయ వేతన పెరుగుదల ఆశించినంత ఉండడంలేదు. కంపెనీలు ప్రస్తుతం ఈక్విటీ-హెవీ పరిహార నమూనాల (Equity-heavy compensation models) వైపు మొగ్గు చూపుతున్నాయి. టెక్ పరిశ్రమలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల మొత్తం పరిహారాన్ని పెంచడానికి ఈక్విటీ-ఆధారిత వేతనం (Equity-based pay) ఒక సాధనంగా మారుతోంది. కొన్ని కంపెనీల్లో టాప్ ఎగ్జిక్యూటివ్ల స్థూల వేతనం తగ్గినా ఈక్విటీ గ్రాంట్లు పెరగడం దీనికి సంకేతం.అధిక టాలెంట్ సప్లైభారతదేశంలో టెక్ గ్రాడ్యుయేట్లు, నైపుణ్యం కలిగిన ఇంజినీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. డిమాండ్ను మించి సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు వేతనాలపై సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా తక్కువ వేతనాలతో నాణ్యమైన టాలెంట్ను పొందడానికి భారత్ వంటి మార్కెట్లపై దృష్టి పెడుతున్నాయి.అమెరికాలో వేతనాల పెంపునకు కారణాలుభారత్లో వేతనాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ యూఎస్ టెక్ ఉద్యోగుల సగటు జీతాలు 1,22,000 డాలర్ల నుంచి 1,50,000కు పెరిగాయి. ప్రొడక్షన్, డిజైన్ నిపుణుల సగటు వేతనం 1,38,000 వద్ద ఉంది. ఈ పెరుగుదలకు దారితీసిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.అధిక డిమాండ్యూఎస్ మార్కెట్లో అత్యాధునిక సాంకేతిక రంగాల్లో(AI, మెషిన్ లెర్నింగ్ వంటివి) అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ ఉంది. సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత కారణంగా కంపెనీలు అధిక జీతాలను, ఆకర్షణీయమైన పరిహారాన్ని చెల్లించడానికి సిద్ధపడుతున్నాయి.ఈక్విటీ-ఆధారిత పరిహారంనివేదిక ప్రకారం, ఈక్విటీ ఆధారిత వేతనం ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షిస్తోంది. యూఎస్లోని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యంలో వాటాను (ఈక్విటీ) పెద్ద మొత్తంలో అందిస్తున్నాయి. దీని వల్ల మొత్తం పరిహారం (జీతం + ఈక్విటీ) గణనీయంగా పెరుగుతోంది.ద్రవ్యోల్బణం, జీవన వ్యయంఅమెరికాలో అధిక జీవన వ్యయం, ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు తమ ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి వేతనాలను పెంచడం అనివార్యమవుతోంది.ఇదీ చదవండి: తీర ప్రాంత వాణిజ్యం, స్టాక్ మార్కెట్పై ప్రభావం ఎంతంటే.. -
అడ్డంగా బుక్కైన మమ్దానీ!
న్యూయార్క్ మేయర్ (New York Mayor) పదవి పోటీల్లో ప్రధాన అభ్యర్థిగా ఉన్న భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ(Zohran Mamdani) చిక్కుల్లో పడ్డారు. 9/11 దాడుల తర్వాతి పరిస్థితులతో ఇక్కడి ముస్లింలు భయం భయంగా గడిపారని, ఆ రోజులు వాళ్లకు ఎన్నో పాఠాలు నేర్పాయంటూ మాట్లాడారాయన. ఈ క్రమంలో ఆయన చెప్పిన విషయం ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్కు గురవుతోంది. సెప్టెంబర్ 11 తర్వాత న్యూయార్క్లో పరిస్థితులు బాగా మారిపోయాయి. ఆ దాడుల తర్వాత ఇక్కడి ముస్లింలు భయంతో మరియు అవమానంతో జీవించాల్సి వచ్చింది. ఎంతలా అంటే.. నా మేనత్త సబ్వేలలో(అండర్గ్రౌండ్ మెట్రో) ప్రయాణించడమే మానేశారు. బహిరంగంగా హిజాబ్తో ఉండడం సురక్షితం కాదనే ఆమె ఆ పని చేశారు. కేవలం ఆమెకు మాత్రమే కాదు.. ఈ పరిస్థితులు ఎంతో మంది ముస్లింలకు ఆనాడు పాఠాలు నేర్పించాయి అని భావోద్వేగంగా మమ్దానీ మాట్లాడారు. అయితే.. మమ్దానీ ప్రసంగంపై నెట్టింట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. కొందరు మమ్దానీ వంశవృక్షాన్ని తవ్వి మూలాలను బయటకు తీశారు. మమ్దానీకి ఉంది ఒకే ఒక మేనత్త అని, ఆమె పేరు మసమ మమ్దానీ అని, ఆమె టాంజానియాలో జీవిస్తోందని, 2001 ఉగ్రదాడుల సమయంలోనూ ఆమె అక్కడే ఉందని పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ఫొటోను సైతం రిలీజ్ చేసి.. కట్టుకథ అల్లాడంటూ జోహ్రాన్ మమ్దానీపై మండిపడుతున్నారు. తీవ్ర విమర్శల వేళ జోహ్రాన్ మమ్దానీ మరోసారి స్పందించారు. ఆమె తన తండ్రి తరఫు చుట్టమని(సోదరి), చాలా ఏళ్ల కిందటే మరణించారని.. ఆ అనుభవం ఎదురైంది ఆమెకేనని వివరణ ఇచ్చాడు. అయితే.. మమ్దానీ వ్యాఖ్యలపై నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు. ఈసారి 9/11 బాధితుల కుటుంబాలు రంగంలోకి దిగాయి. మమ్దానీ వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయంటూ తిట్టిపోస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పందిస్తూ.. ట్విన్ టవర్స్ దాడుల బాధితురాలు జోహ్రాన్ మేనత్త కూడా అంటూ ఎద్దేవా చేశారు. రిపబ్లికన్ నేత ఆండ్రూ కుఓమో ఓ అడుగు ముందుకేసి మమ్దానీ జిహాద్ మద్దతుదారుడని, అందుకే 9/11 రోజున సంబురాలు చేసుకుంటాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇదీ చదవండి: మూన్లైటింగ్.. డాలర్లలకు కక్కుర్తిపడితే కష్టమే! -
మనది స్వర్ణయుగ బంధం
టోక్యో: చైనాతో వాణిజ్య యుద్ధ భయాల వేళ.. ఆ దేశానికి చారిత్రక శత్రువు అయిన జపాన్కు మరింత దగ్గరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. సోమవారం నుంచి జపాన్లో రెండురోజుల పర్యటనలో ఉన్న ఆయన జపాన్ తొలి మహిళా ప్రధాని సనాయి తకాయిచితో అనేక అంశాలపై చర్చలు జరిపారు. మంగళవారం రోజంతా ఈ ఇద్దరు నేతలు వివిధ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. ట్రంప్ను ప్రసన్నం చేసుకొనేందుకు తకాయిచి ప్రయత్నించగా, జపాన్ నుంచి బలవంతంగానైనా పెట్టుబడులు రాబట్టేందుకు ట్రంప్ ప్రయత్నించారు.పనిలో పనిగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ను నామినేట్ చేసేందుకు తకాయిచిని ఒప్పించారు. తకాయిచితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా జపాన్కు ట్రంప్ పలు హామీ ఇచ్చారు. ‘జపాన్కు సాయం చేసేందుకు నేను చేయాల్సిందంతా చేస్తాను. మన ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడు చాలా బలమైన స్థాయిలో ఉన్నాయి’అని పేర్కొన్నారు. లంచ్ మీటింగ్లో భాగంగా ఇరువురు నేతలు అంతర్జాతీయ పరిణామాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించారు. రెండు దేశాల మధ్య కీలకమైన ఖనిజా లపై వాణిజ్య సంబంధాల్లో ప్రస్తుతం స్వర్ణ యుగం నడుస్తోందని ఇద్దరు నేతలు వ్యాఖ్యానించారు. అమెరికాలో జపాన్ భారీ పెట్టుబడులుట్రంప్ తన సహజ ధోరణిలో జపాన్కు వరాలు ప్రకటిస్తూనే నిందలు కూడా మోపారు. జపాన్ అసలు అమెరికా వాహనాలను కొనటం లేదని ఆరోపించారు. అమెరికాలో 550 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు లంచ్ మీటింగ్లో ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికాకు చెందిన 150 ఫోర్డ్ ట్రక్కులకు కొనుగోలు చేస్తామని తకాయిచి ప్రకటించారు.అనంతరం టోక్యో సమీపంలోని అమెరికా సైనిక స్థావరం వద్ద ఉన్న అమెరికా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్పై కూడా ట్రంప్, తకాయిచి సమావేశమయ్యారు. మరోవైపు అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా, జపాన్ కంపెనీల సీఈవోలకు ట్రంప్ విందు ఇచ్చారు. జపాన్ కంపెనీల సీఈవోలతో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ విందు సమావేశం నిర్వహించి భారీగా పెట్టుబడులు రాబట్టారు. వెస్టింగ్హౌస్, జీఈ వెర్నోవా సంస్థలు అమెరికాలో అణు విద్యుత్ ప్రాజెక్టుల్లో 100 బిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ట్రంప్కు శుభవార్తనోబెల్ శాంతి పురస్కారం కోసం తహతహలా డుతున్న ట్రంప్కు జపాన్ ప్రధాని శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ను నామినేట్ చేస్తామని తకాయిచి హామీ ఇచ్చినట్లు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ లీవిట్ తెలిపారు. ఈ ఏడాది పాకిస్తాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు, వ్యక్తులు ట్రంప్ను నామినేట్ చేసినా నోబెల్ కమిటీ ఆయనకు శాంతిపురస్కారం ఇవ్వలేదు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య సమావేశంలో పాల్గొనేందుకు ట్రంప్ బుధవారం దక్షిణకొరియాకు బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో చర్చలు జరుపనున్నారు. -
ఇంతకంటే గొప్పగా ‘ప్రతీకారం’ తీర్చుకోవచ్చా?
ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ (D Gukesh)పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఆటలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ చాంపియన్వే’’ అంటూ కొనియాడుతున్నారు. పద్దెమినిదేళ్ల వయసులోనే ఇంత పరిణతి సాధించిన గుకేశ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాలోని సెయింట్ లూసియాలో జరుగుతున్న క్లచ్ చెస్ చాంపియన్స్ షోడౌన్-2025 ఈవెంట్లో గుకేశ్.. అమెరికన్ గ్రాండ్మాస్టర్ హికారు నకమురా (Hikaru Nakamura)ను ఓడించాడు. ఆది నుంచే ఆత్మవిశ్వాసంతో పావులు కదిపిన ఈ చెన్నై చిన్నోడు 1.5- 0.5 తేడాతో నకమురాను ఓడించాడు.గుకేశ్ ‘కింగ్’ను ప్రేక్షకుల వైపు విసిరిన నకమురాఈ క్రమంలో గెలుపొందిన తర్వాత గుకేశ్ హుందాగా ప్రవర్తించిన తీరే అతడిపై ప్రశంసలకు కారణం. కాగా అక్టోబరు 6న ఆర్లింగ్టన్లో జరిగిన చెక్మేట్ ఈవెంట్ ఓపెనింగ్ లెగ్లోనూ గుకేశ్- నకమురా ముఖాముఖి తలపడ్డారు. ఈ గేమ్లో నకమురా గుకేశ్ను 5-0తో వైట్వాష్ చేశాడు.దీంతో భారత్పై అమెరికా విజయం ఖరారు కాగా.. నకమురా.. గుకేశ్ ‘కింగ్’ను ప్రేక్షకుల వైపు విసిరి సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే, గుకేశ్ మాత్రం సహనం కోల్పోకుండా.. సంయమనం పాటిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయాడు.ఇంతకంటే గొప్పగా ‘ప్రతీకారం’ తీర్చుకోవచ్చా?ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. అయితే, ఈసారి గుకేశ్ విజేతగా నిలిచాడు. అయినాసరే అప్పుడు 37 ఏళ్ల నకమురా చేసినట్లుగా ఓవరాక్షన్ చేయలేదు. నకమురా షేక్హ్యాండ్ ఇవ్వగా హుందాగా స్వీకరించిన గుకేశ్.. తర్వాత తనదైన శైలిలో పావులను బోర్డుపై అమరుస్తూ ఉండిపోయాడు. Revenge Is A Dish Best Served Cold 🥶 pic.twitter.com/icCvA1JA4u— Desidudewithsign (@Nikhilsingh21_) October 28, 2025 ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ.. నెటిజన్లు గుకేశ్ను ప్రశంసిస్తున్నారు. ‘‘ప్రతీకారం కంటే.. ఇలా చిన్న చిరునవ్వుతోనే ప్రత్యర్థిని మరింత గొప్పగా దెబ్బకొట్టవచ్చు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.చిన్న వయసులోనే చదరంగ రారాజుగాకాగా గతేడాది డిసెంబరులో గుకేశ్ ప్రపంచ చెస్ చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. సింగపూర్ సిటీ వేదికగా జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో చైనా గ్రాండ్మాస్టర్, డిఫెండింగ్ చాంపియన్ డాంగ్ లిరెన్ను ఓడించడం ద్వారా గుకేశ్ విజేతగా నిలిచాడు. పద్దెమినిదేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చాంపియన్గా నిలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నిలిచాడు. ఈ క్రమంలో దాదాపు రూ. 11.45 కోట్ల ప్రైజ్మనీని గుకేశ్ అందుకున్నాడు.చదవండి: PKL 2025: తెలుగు టైటాన్స్కు చావో రేవో మ్యాచ్.. ఓడితే పరిస్థితి ఏంటి? -
రాజ్యాంగ విరుద్ధమైనా.. ‘మళ్లీ నేనే!?’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(79) తన మనసులోని మాట బయటపెట్టారా?. ముచ్చటగా మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటున్నారా?. జపాన్ పర్యటనకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యల ఆంతర్యం అదేనంటూ చర్చ నడుస్తోంది ఇప్పుడు.వైట్హౌజ్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ తాజాగా ట్రంప్ మూడో దఫా పోటీపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. జపాన్ పర్యటనకు బయల్దేరే ముందు విమానం(Air Force One) వద్ద మీడియా ఆయన్ని ఆ వ్యాఖ్యలపై ప్రశ్నించింది. దానికి ట్రంప్ స్పందిస్తూ.. ‘‘మూడోసారి పోటీ చేయడం నాకు ఇష్టమే. నా వద్ద అత్యుత్తమ నెంబర్లు ఉన్నాయి’’ అంటూ బదులిచ్చారు. అయితే.. ఆ వెంటనే ‘‘ఇంకా ఆ విషయంపై నిజంగా ఆలోచించలేదు’’ అని అన్నారు. ట్రంప్ తన తరువాత రిపబ్లికన్ పార్టీని నడిపే నాయకులుగా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్లను ప్రస్తావించారు. మా వద్ద గొప్ప నాయకులు ఉన్నారు అంటూ రుబియో వైపు చూపిస్తూ.. ‘వాళ్లలో ఒకరు ఇక్కడే ఉన్నారు’ అని చమత్కరించారు. అలాగే.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను ప్రశంసిస్తూ.. అవును, జేడీ అద్భుతంగా ఉన్నాడు. ఉపాధ్యక్షుడు గొప్పవాడు. వీళ్లిద్దరిని ఎదుర్కొనే వారు ఉండరేమో అని ట్రంప్ అన్నారు.అమెరికాకు అధ్యక్ష ఎన్నికలు 2028 సంవత్సరంలో జరగనున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఒక వ్యక్తి అధ్యక్ష పదవికి రెండుసార్లు మాత్రమే ఎన్నిక కావచ్చు. మూడోసారి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే స్టీవ్ బానన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ట్రంప్ 2028లో మూడోసారి అధ్యక్షుడిగా అవుతారు. దీనికి ఒక ప్రణాళిక ఉంది. కఠినమైన అడ్డంకే ఉన్నా.. దాన్ని అధిగమించే మార్గాలు ఉన్నాయి. 2016, 2024లో ట్రంప్ సాధించారు. వచ్చేసారి కూడా సాధించగలరు అని అన్నారు. గతంలో ఫ్రాక్లిన్ డి రూజ్వెల్ట్ అమెరికాకు నాలుగు పర్యాయాలు అధ్యక్షుడిగా పని చేశారు. అయితే.. 1951లో రాజ్యాంగానికి 22వ సవరణ (22nd Amendment) ద్వారా రాటిఫై చేశారు. ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే, అమెరికా రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే, అత్యధిక రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇది రాజకీయంగా చాలా కష్టమైన ప్రక్రియ. ఇది ప్రస్తుతం సాధ్యపడే అవకాశాలు లేవు. స్టీవ్ బానన్, ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీసేలా ఉన్నా.. న్యాయపరంగా అవి అమలులోకి రావడం అసాధ్యం. ఇదిలా ఉండగా.. ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ మలేషియా నుంచి జపాన్ చేరుకున్నారు. సోషల్ ట్రూత్లో ఈ మేరకు.. మలేషియా అద్భుతమైన దేశం. ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలు, రేర్ ఎర్త్ డీల్స్ సంతకం చేశాం. ముఖ్యంగా థాయ్లాండ్ మరియు కంబోడియా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. యుద్ధం లేదు! కోట్లాది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఇది చేయడం గౌరవంగా ఉంది. ఇప్పుడు జపాన్కు బయల్దేరా అని పోస్ట్ చేశారు. -
మరో 50 మంది భారతీయులు వెనక్కి
అంబాలా/కురుక్షేత్ర: ఏజెంట్లకు 30–40 లక్షల రూపాయలు ముట్టజెప్పి చిట్టడడవులు, నదులు దాటుకుంటూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించి అక్రమ మార్గం(డంకీ రూట్)లో అమెరికాలోకి చొరబడిన పలువురు భారతీయులను అమెరికా ప్రభుత్వం బహిష్కరించి తిరిగి స్వదేశానికి పంపేసింది. దాదాపు 50 మంది భారతీయ అక్రమ వలసదారులతో అమెరికా వాయుసేనకు చెందిన సీ–17 విమానం శనివారం అర్ధరాత్రి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు భారత్కు చేరుకుంది. తిరిగొచ్చిన వారిలో హరియాణా రాష్ట్రంలోని ఖైథాల్, కర్నాల్, కురుక్షేత్ర, అంబాలా, యమునానగర్, జింద్, పానిపట్ జిల్లాలకు చెందిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. తిరిగొచి్చన వారిలో ఎక్కువ మంది 25 నుంచి 40 ఏళ్ల వయసు వాళ్లే ఉన్నారు. విదేశంలోనైనా సంపాదించి భారత్లోని తమ కుటుంబసభ్యులకు మెరుగైన జీవితం అందివ్వాలన్న తమ అమెరికా కల కలగానే మారిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘అమెరికా వెళ్లేందుకు రూ.35 లక్షలు ఖర్చు చేశా. ఆ డబ్బంతా భారత్లో వ్యవసాయం చేసి సంపాదించా. ఎలాగోలా ఫ్లోరిడా సమీపంలోని జాక్సన్విల్లేలో పనిలో కుదిరా. వంట నేర్చుకున్నా. కానీ ట్రంప్ ప్రభుత్వం నన్ను అరెస్ట్చేసి వెనక్కి పంపేసింది. నా కుటుంబ బంగారు భవిష్యత్తు నాశనమైంది. నా డబ్బంతా వృథా అయింది. విమానంలో చేతులకు బేడీలు, కాళ్లకు ఇనుప గొలుసులు కట్టేశారు. 24 గంటలపాటు అలాగే తీసుకొచ్చారు. దీంతో నా కాళ్లు ఇలా పూర్తిగా ఉబ్బిపోయాయి ’’అని 45 ఏళ్ల అక్రమ వలసదారుడు హర్జీందర్ సింగ్ వాపోయారు. ‘‘కెనడాలో ఉండేవాడిని. తర్వాత రెండేళ్ల క్రితం వర్క్ పరి్మట్తో అమెరికాకు వెళ్లా. అక్కడ ఒక దుకాణంలో పనిచేస్తుంటే అరెస్ట్చేసి భారత్కు పంపేశారు’’అని కల్సీ గ్రామవాసి హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఎకరం పొలం అమ్మి, సోదరుడు, బంధువుల దగ్గర అప్పు చేసి మొత్తం రూ.57 లక్షలు ఏజెంట్కు ఇచ్చా. డంకీ రూట్లో అమెరికా వెళ్లా. కానీ అక్కడ దొరికిపోయా.14 నెలలపాటు బంధించి ఇప్పుడు భారత్కు పంపేశారు’’అని నరేశ్ కుమార్ చెప్పారు. గతంలో హరియాణా, పంజాబ్, గుజరాత్లకు చెందిన పలువురు అక్రమ వలసదారులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్చేసి భారత్కు సాగనంపడం తెల్సిందే. -
నీతులు చెప్పేవాళ్లే పాటించట్లేదు
కౌలాలంపూర్: అందరికీ నీతులు చెప్పే అమెరికా మాత్రం వాటిని పాటించట్లేదని భారత విదేశాంగ మంత్రి అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌలాలంపూర్లో సోమవారం 20వ ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా అమెరికా వైఖరిని జైశంకర్ పరోక్షంగా తూర్పారబట్టారు. ఇంధన వాణిజ్యంతోపాటు ఇతర మార్కెట్లకు విస్తరించకుండా అమెరికా అడ్డుతగులుతోందని జైశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారీ ఎత్తున రష్యన్ చమురును కొంటున్నందుకే భారత్పై అదనంగా 25 శాతం టారిఫ్ గుదిబండ పడేశామని ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన అంశాన్ని జైశంకర్ పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ భారత్ అంతర్జాతీ యంగా సరకు రవాణా గొలుసులను పెంచుకోవడానికి, కొత్త మార్కెట్లకు విస్తరించడానికి ప్రయత్నిస్తుంటే కొత్త అవరోధాలు ఎదురవుతు న్నాయి. సాంకేతికత ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్న ఈ తరుణంలో ముడి చమురు వంటి సహజవనరులకు డిమాండ్ పెరుగు తోంది. ఈ సమయంలో ఇంధన వాణిజ్యానికి ఆటంకాలను సృష్టిస్తున్నారు. వాణిజ్య ప్రయోజనా లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. కొన్ని కఠిన నిబంధనలు, ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా రుద్దుతున్నారు. నీతులు చెప్ప కొన్ని దేశాలే వాటిని పాటించట్లేవు. ఎంతగా అడ్డుకున్నా మార్పు అనేది ఆగదు. సర్దుబాట్లు జరుగుతుంటాయి’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రితో భేటీభారత దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం అధిక సుంకాల భారం విధించిన నేపథ్యంలో భారత అనుకూల పరస్పర వాణిజ్య ఒప్పందాన్ని సాధించే లక్ష్యంతో జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చలు జరిపారు. ఇందుకు ఆగ్నేయాసియా కూటమి(ఆసియాన్) శిఖరాగ్ర సదస్సు వేదికైంది. ద్వైపాక్షిక భేటీలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ‘‘ ఉదయం కౌలాలంపూర్లో మార్కో రూబియోను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ద్వైపాక్షిక సంబందాలుసహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు ఫలప్రదంగా సాగాయి’’ అని తర్వాత తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో జైశంకర్ ఒక పోస్ట్పెట్టారు. వాణిజ్య ఒప్పందంపై ఇరువురు నేతలు ప్రత్యేకంగా చర్చించారు. -
ప్రధాని మోదీపై హత్యకు కుట్ర?.. పుతిన్ రక్షించాడా?
భారత ప్రధాని నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ భారీ హత్య కుట్రను భారత, రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా అడ్డుకున్నాయని ఓ సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికాకు చెందిన ఓ స్పెషల్ ఫోర్సెస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించిన అత్యంత కీలక సమాచారంతో ఈ కుట్రను ఛేదించినట్లు తెలుస్తోంది.మలయాళ మీడియా సంస్థ 'మాతృభూమి', రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) మౌత్ పీస్ ఆర్గనైజర్ కథనాల ప్రకారం, ఆగస్టు 31వ తేదీ రాత్రి ఢాకాలోని ఓ విలాసవంతమైన హోటల్లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ అర్వెల్ జాక్సన్ మృతదేహం లభ్యమైంది. బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చానని అధికారికంగా చెప్పినప్పటికీ, అతని ప్రొఫైల్ నిఘా వర్గాలలో అనుమానాలు రేకెత్తించింది. అంతర్జాతీయంగా రహస్య ఆపరేషన్లలో అనుభవమున్న అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం రావడం అసాధారణం. అదే సమయంలో భారత నాయకత్వంపై దాడికి సంబంధించి నిఘా వర్గాలకు కొన్ని సంకేతాలు అందాయి. దీంతో జాక్సన్ పర్యటన వెనుక మరో ఉద్దేశం ఉందని భావించారు.Modi’s life was under threat during SCO summit.An american operative was in Bangladesh for the job.Putin invited him to travel in his car.That was the moment 😲Assassin@tion was planned on China's land to blame China. The Russian spy agency saved him. pic.twitter.com/u9TD7pjnZj— Defense Scope🔭 (@DefeScope) October 22, 2025పుతిన్ రక్షించాడా?ఇదే సమయంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమావేశం ముగిశాక రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీని తన అత్యంత భద్రత కలిగిన 'ఆరస్ లిమోసిన్' కారులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇద్దరూ సుమారు 45 నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు. ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ చొరబడలేవు. సంభాషణలను రికార్డ్ చేయడం గానీ, ట్రాక్ చేయడం గానీ అసాధ్యం. మోదీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారని సమాచారం.25th October 2025. CIA Links Surface After Putin Shielded Modi During SCO Meet.According to Defence News, President Putin saved Indian Prime Minister Modi, from possible assassination attempt at hands of Western Intelligence Agencies. Speculations revolve around direct… pic.twitter.com/yCaigh7heN— Sense and Sensibility (@UNIT_Diplomat) October 25, 2025భారత నిఘా సంస్థ 'రా' (RAW), రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ 'ఎస్విఆర్' (SVR) కొద్దిరోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్లను పసిగట్టాయి. పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఆగస్టు 30 రాత్రికే ముప్పును గుర్తించి, నిందితుల కదలికలపై నిఘా పెట్టి కుట్రను అమలు కాకముందే నిర్వీర్యం చేశాయి. ఆ మరుసటి రోజే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.మోదీ వ్యాఖ్యల అర్థమేంటి?చైనా పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి వచ్చిన తర్వాత, ప్రధాని మోదీ ‘సమీకాన్ ఇండియా’ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతున్న సభికులను ఉద్దేశించి, “నేను చైనాకు వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా? లేక తిరిగొచ్చినందుకా?” అని నవ్వుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని ఆ కథనం గుర్తుచేసింది. తాను ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డాననే విషయాన్ని ప్రధాని పరోక్షంగా ఆ వ్యాఖ్యల ద్వారా చెప్పారని కథనం విశ్లేషించింది. ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో, పలు డిజిటల్ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి."Mai gaya tha isliye Tali baja rahe ho YA Laut aaya hu isliye Tali baja rahe ho?"REPORTEDLY, it was planned to turn SCO Summit into Tashkent Summit, but President Putin saved PM Modi Ji from meeting Lal Bahadur Shastri Ji's fate.Ps- China didn't have any hand in it. Same old… pic.twitter.com/3sYLogtyi1— BhikuMhatre (@MumbaichaDon) October 11, 2025ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం, ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉండటం వంటివి అమెరికాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చడంలో అమెరికాకు చరిత్ర ఉందని, ఈ నేపథ్యంలోనే ఈ కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
స్వేచ్ఛా వాణిజ్యం బలోపేతం
ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనిశి్చత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్లో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. కౌలాలంపూర్/న్యూఢిల్లీ: ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్ నగరంలో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ శాంతిభద్రతలకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందని, దీనిని ఎదుర్కొనేందుకు అందరం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ అన్నారు. ఆసియాన్–ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్(ఏఐటీఐజీఏ)ను వీలైనంత త్వరగా సమీక్షించాలని మోదీ అభిలషించారు. మోదీ ప్రసంగ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఏఐటీఐజీఏ ఒప్పందం 15 ఏళ్ల క్రితం అమల్లోకి వచి్చంది. ఇప్పుడు భారత్–ఆసియాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమైతే ఇరు దేశాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. ప్రాంతీయ సహకారం సైతం ఇనుమడిస్తుంది’’అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా ఆసియాన్, భారత్ల ఆర్థిక ప్రగతికి బాటలువేసే కీలకమైన సుస్థిర పర్యాటకంపై ఇరువర్గాలు ఒక ప్రకటన విడుదలచేశాయి. ‘‘ఇండో–పసిఫిక్లో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్) కూటమికి భారత్ గట్టి మద్దతుదారుగా నిలుస్తోంది. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం(2026–2030) అమలు కోసం ఆసియాన్–భారత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్కు మద్దతు పలుకుతున్నాం. త్వరలో రెండో ఆసియాన్–భారత్ రక్షణ మంత్రుల సమావేశం, రెండో ఆసియాన్–భారత్ నౌకావిన్యాసాలు జరుపుదాం’’అని మోదీ అన్నారు. నాలుగో వంతు మనమే ‘‘విశ్వమానవాళిలో నాలుగో వంతు జనాభాకు భారత్, ఆసియాన్ దేశాలే ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. జనాభాను మాత్రమే కాదు మనం అత్యంత చరిత్రాత్మకమైన ఒప్పందాలు, విలువల బంధాలతో పెనవేసుకుపోయా. గ్లోబల్ సౌత్లో మనం కలిసి ముందడుగువేస్తున్నాం. కేవలం వాణిజ్య భాగస్వాములం కాదు సాంస్కృతిక సహచరులం. భారత్ అవలంభిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ అనేది పునాదిరాయి. ఆసియాన్ లక్ష్యాలకు, ఇండో–పసిఫిక్ విషయంలో ఆసియాన్ వైఖరికి భారత్ ఎల్లవేళలా పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతోంది. ఒడిదుడుకుల కాలంలోనూ భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది సుస్థిరాభివృద్ధిని కొనసాగించింది. ఈ బలమైన బంధమే యావత్ ప్రపంచ సుస్థిరాభివృద్ధి, ప్రగతికి కొత్త అంకురార్పణ చేస్తోంది. భారత్, ఆసియాన్ రెండూ విద్య, పర్యాటకం, శాస్త్రసాంకేతిక, ఆరోగ్య, శుద్ధ ఇంధనం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో మరింత బలమైన పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయి. ఇకమీదట సైతం సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకునేందుకు కలిసి పనిచేస్తాం. భారత, ఆసియాన్ ప్రజల మధ్య సత్సంబంధాలను పెంచుతాం. ఇందుకోసం భుజం భుజం కలిపి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఆసియాన్ పవర్ గ్రిడ్ కార్యక్రమం కోసం 400 నిపుణులకు పునరుత్పాదక ఇంధన రంగంలో శిక్షణనిప్పిస్తాం ’’అని మోదీ అన్నారు. సవాళ్లు ఎదురవుతున్నా.. అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నా డిజిటల్ సమ్మిళిత వృద్ధి, ఆహార భద్రత, సరకు రవాణా గొలుసు వంటి అంశాల్లో ఆసియాన్ దేశాలు సమష్టిగా పోరాడుతూ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఇతివృత్తమైన ‘సమ్మిళిత సుస్థిరత’భావనను శిఖరాగ్రాలపై నిలిపాయి. ఆసియాన్ దేశాల ప్రాధాన్యతలను మద్దతు పలుకుతూనే ఆసియాన్ దేశాలను ఇలాగే సమష్టిగా కలిపి ఉంచేందుకు భారత్ కృషిచేస్తుంది. ఆపత్కాలంలో ఆసియాన్ దేశాలను ఆదుకునేందుకు భారత్ సదా ఆపన్నహస్తం అందించింది. మనవతా సాయం, విపత్తు సాయం, సముద్రయాన భద్రత, సాగరసంబంధ వాణిజ్యాభివృద్ధికి భారత్ అండగా నిలబడుతుంది. 2026 ఏడాదిని ‘ఆసియాన్–భారత్ సముద్ర సహకార సంవత్సరం’గా ప్రకటిస్తున్నాం’’అని మోదీ చెప్పారు. -
నీటికి బదులు బీర్!
ఒక్క రోజంతా నీరు తాగకుండా ఉంటే శరీరం మొత్తం డీహైడ్రేషన్ అయి, ఏ పని చేయలేం. కాని, అమెరికాకు చెందిన లోరీ మాత్రం ఎన్నో ఏళ్లుగా నీరే తాగడం లేదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! జిమ్లో రెండుసార్లు ఎక్కువ శ్రమ చేసి ఆసుపత్రిలో చేరినా, ఆమె నిర్ణయం ఏమాత్రం మారలేదు. సాదాసీదా నీటి కంటే కాఫీ, బీర్, రుచికరమైన పానీయాలే తనకు ఇష్టమని చెప్పేసి, లోరీ నీటిని పూర్తిగా మానేసింది. డాక్టర్లు దీన్ని ఒక మానసిక సమస్యగా చెప్తున్నారు. అందుకే ఆమె తనకంటూ ఓ ప్రత్యేకమైన హైడ్రేషన్ పద్ధతిని ఫిక్స్ చేసుకుంది. ఉదయం కాఫీతో మొదలు, మధ్యాహ్నం మరో కాఫీతో పాటు సాఫ్ట్ డ్రింక్స్, సాయంత్రం జిమ్ తర్వాత బీర్, రాత్రికి రెండు పుల్ల ఐస్క్రీమ్స్.. ఇదే ఆమె స్టయిల్. వీటన్నింటికీ రోజుకి దాదాపు నూటయాభై డాలర్లు, అంటే పదమూడు వేల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. మంచినీరు తాగితే ఇంత ఖర్చు అవసరం లేదని తెలిసినా, ‘ఇవి నాకు నీటికి మించిన రుచితో హైడ్రేషన్ ఇస్తున్నాయి’ అని ఆమె సమర్థించుకుంటోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెలిసి కొందరు షాక్ అయ్యారు, కొందరు నవ్వుకున్నారు. కానీ లోరీ మాత్రం తన ప్రత్యేక హైడ్రేషన్ స్టయిల్కి కట్టుబడి, తనదైన రీతిలో ఆనందంగా జీవిస్తోంది. View this post on Instagram A post shared by 60 Second Docs (@60secdocs) (చదవండి: బియ్యపు గింజంత కంప్యూటర్!) -
పల్లీ..
సాక్షి, సాగుబడి: ఆహార పదార్థాలన్నీ అందరికీ సరిపడాలన్న నియమం ఏమీ లేదు. అలర్జీకి కారణమయ్యే అవకాశం ఉన్న వేరుశనగల్లాంటి ఆహార పదార్థాలను పసిపిల్లలకు ఎంత వయసులో అలవాటు చెయ్యటం ప్రారంభించాలి? ఈ ప్రశ్నకు సమాధానం దేశాన్ని బట్టి మారిపోతుందంటున్నారు వైద్య నిపుణులు. విదేశాల్లోని పిల్లలతో పోలి్చతే మన పిల్లలకు ఇమ్యునిటీ ఎక్కువేనని, వారికి వచి్చన అలర్జీలన్నీ మనకు రావాలనేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో 3.3 కోట్ల మందికి ఆహార సంబంధమైన అలర్జీలున్నాయని అంచనా.అక్కడి పిల్లలకు వేరుశనగలు (పల్లీలు), గుడ్లు, సోయాచిక్కుళ్లు తింటే అలర్జీ వస్తాయనే అభిప్రాయం ఉండేది. అందుకే మూడేళ్లు నిండే వరకు పిల్లలకు పల్లీలు పెట్టొద్దని అమెరికా ప్రభుత్వం గతంలో అనేక దశాబ్దాల పాటు అక్కడి తల్లిదండ్రులు, వైద్యులకు చెప్పింది. అయితే, ఆ తర్వాత కాలంలో జరిగిన వైద్య పరిశోధనల ఫలితాలను బట్టి 4–6 నెలల వయసులోనే శిశువులకు వేరుశనగలు తినిపించటం మొదలు పెట్టాలని సూచించింది. దీని వల్ల అలర్జీ బెడద చాలా వరకు తగ్గిందని తాజా అధ్యయనం చెబుతోంది. మన పరిస్థితి ఏమిటి? మన దేశంలో 6 నెలలు నిండిన పసి పిల్లలకు ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు కొద్ది మోతాదులో తినిపించవచ్చని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కు చెందిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఆహార మార్గదర్శకాల్లో సూచించింది. లండన్ అధ్యయనంతో మార్పు 2015లో లండన్లోని కింగ్స్ కాలేజీకి చెందిన డాక్టర్ జిడియోన్ లాక్ జరిపిన లెర్నింగ్ ఎర్లీ అబౌట్ పీనట్ ఎలర్జీ (ఎల్ఈఏపీ) అధ్యయనం వేరుశనగల అలర్జీపై అమెరికాకున్న పూర్వపు అవగాహనను పూర్తిగా మార్చేసింది. పుట్టిన కొద్ది నెలలకే శిశువులకు వేరుశనగలను తినిపించటం అలవాటు చేస్తే మున్ముందు జీవితంలో ఫుడ్ అలర్జీల ముప్పు 80% వరకు తగ్గిపోయిందని ఈ అధ్యయనం తేలి్చంది. ఈ పిల్లలు కౌమార దశ వరకూ 70% మందికి ఫుడ్ అలర్జీల బెడద లేదని కూడా తేలింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ఫలితాల ఆధారంగా 2015లో అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 4–6 నెలల మధ్య వయసులో శిశువులకు వేరుశనగ గింజలను తినిపించటం అలవాటు చెయ్యవచ్చని స్పష్టం చేసింది. నాలుగు నెలల నుంచే పెట్టొచ్చు.. గత దశాబ్ద కాలంగా 4–6 నెలల శిశువులకు వేరుశనగలు అలవాటు చెయ్యటం వల్ల మంచి ఫలితాలే వస్తున్నాయని తాజా అధ్యయనం తేలి్చంది. ఫిలడెల్ఫియా పిల్లల ఆస్పత్రిలో అలర్జీ నిపుణుడు, పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ హిల్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన వివరాలు ఇటీవల మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 2015లో సవరించిన మార్గదర్శకాల వల్ల సుమారు 60 వేల మంది పిల్లలు వేరుశనగల అలర్జీ నుంచి తప్పించుకున్నారని వెల్లడైంది. ఇది చాలా గొప్ప సంగతి కదూ అన్నారు డా. డేవిడ్ హిల్. డజన్ల కొద్దీ పిల్లల వైద్యుల వద్ద నుంచి 2015కు ముందు, ఆ తర్వాత పిల్లలకు అందించిన అలర్జీ చికిత్సల వివరాలను సేకరించి ఆయన విశ్లేíÙంచారు. మూడేళ్ల లోపు పిల్లల్లో వేరుశనగల అలర్జీ కేసులు 2015 తర్వాత 27%, 2017 తర్వాత 40% తగ్గిపోయాయని నిర్ధారించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ 2021లో మార్గదర్శకాలను మరోసారి సవరించి ఎటువంటి ముందస్తు పరీక్షలు చెయ్యకుండానే 4 నుంచి 6 నెలల శిశువులకు వేరుశనగ గింజలు, గుడ్లు, సోయాచిక్కుళ్లు వంటి అలర్జీ వచ్చే అవకాశం ఉన్న ఆహారాలను అలవాటు చెయ్యమని సూచించింది. అయితే, ఏడు నెలలకన్నా ముందు శిశువులకు వేరుశనగలు తినిపిస్తున్న తల్లిదండ్రులు ఇప్పటికీ కేవలం 17% మాత్రమేనని ఒక సర్వే చెబుతోంది.వేరుశనగతో అలర్జీ ఎందుకొస్తుంది?వేరుశనగ గింజల్లోని ప్రొటీన్లు హాని చేస్తాయేమోనని పిల్లల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ తప్పుగా అర్ధంచేసుకొని రక్షణాత్మకంగా ప్రత్యేక రసాయనాలను విడుదల చేయటం ద్వారా ఈ గింజలు తినగానే అలర్జీ రియాక్షన్ వస్తోందని పరిశోధకులు గుర్తించారు. శరీరంపై దద్దుర్లు రావటం, శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ఫుడ్ అలర్జీ అతి తీవ్ర రూపం దాల్చి ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు. మన పిల్లల్లో ఇమ్యునిటీ ఎక్కువ వాతావరణం, జీవనశైలిలో అమెరికాకు మనకు వ్యత్యాసం ఉంది. వారితో పోలి్చతే మన పిల్లలకు రోగనిరోధక శక్తి ఎక్కువ. కాబట్టి వారికి వచ్చే కొన్ని అలర్జీలు మన పిల్లలకు అంతగా రావు. శిశువుకు 6 నెలల వరకు విధిగా తల్లిపాలు ఇవ్వాలని, ఆరు నెలల తర్వాతే ధాన్యాలు, పప్పులు వంటి ఆహార పదార్థాలను మెత్తగా వండి కొద్దికొద్దిగా తినిపించటం ప్రారంభించాలని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సూచిస్తోంది. సాధారణంగా మన దగ్గర మరీ చిన్న పిల్లలకు వేరుశనగలు పెట్టరు. బిడ్డకు సంవత్సరం నిండే వరకు తల్లి పాలు ఇవ్వటం కొనసాగిస్తూనే అనుబంధ ఆహారం అలవాటు చెయ్యటం మంచిది. పసిపిల్లలకు జలుబుల్లాంటివి వచి్చనా యాంటీబయాటిక్స్ వాడకుండా ఉంటే వాటికవే తగ్గుతాయి. ఇమ్యునిటీ కూడా పెరుగుతుంది. – డాక్టర్ వి.ఆర్. లోహిత్ కుమార్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, అమీర్పేట. -
పటిష్టంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ముంబై: అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలబడినట్టు ఆర్బీఐ అక్టోబర్ బులెటిన్ తెలిపింది. ‘‘అమెరికాలో వాణిజ్య, ఆర్థిక పరమైన అనిశ్చితులు పెరిగాయి. అయినప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కుదురుగా ఉంది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తలెత్తడం, అమెరికా ప్రభుత్వం షట్డౌన్ కొనసాగుతుండడంతో అక్టోబర్లో పెట్టుబడిదా రుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపించింది. పట్టణ డిమాండ్ కోలుకుంటున్నట్టు, గ్రామీణ వినియోగం బలంగా ఉన్నట్టు ముఖ్యమైన సూచికలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ భా రత ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్త ప్రతికూలతలకు దూరంగా ఉండలేదు. కానీ, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి చేరడం, బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, తగినంత విదేశీ మారక నిల్వలు, విశ్వసనీయమైన ద్రవ్య, పరపతి కార్యాచరణతో భారత్ గట్టిగా నిలబడగలిగింది’’అని ఆర్బీఐ తన బులెటిన్లో పేర్కొంది. సంస్కరణల మద్దతు అక్టోబర్ 1 నాటి మానిటరీ పాలసీ కమిటీ తీర్మానం ప్రకారం వృద్ధి అవకాశాలు బలంగానే ఉన్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. దేశీ చోద కాలు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. దేశీయంగా చేపడుతున్న సంస్కరణలను ప్రస్తావించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ రేట్ల తగ్గింపునకు అవకాశాలున్నట్టు పేర్కొంది. డాలర్తో రూపాయి విలువ ఇటీవల క్షీణించినట్టు పే ర్కొంటూ.. వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు స్థిరంగా బయ టకు వెళుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు వరుసగా మూడో నెల సెపె్టంబర్లో ప్రతికూలంగా నమోదైనట్టు తెలిపింది. ఈ బులెటిన్లోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, అధికారికమైనవి కావని ఆర్బీఐ పేర్కొంది. -
మనోళ్ల దీపావళి ఎఫెక్ట్: వెల్లువెత్తిన ఫిర్యాదులు
భారత్తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్ ఉదాహరణంగా నిలిచింది!.న్యూయార్క్ నగరం క్వీన్స్ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్ స్ట్రీట్లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్వర్క్స్ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. Your #Diwali celebration? My house is gone!What a sad incident, disappointing beyond words.Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV— M9 USA🇺🇸 (@M9USA_) October 24, 2025UPDATE: We have received video from the homeowner showing the damage caused by the illegal and irresponsible Diwali fireworks.In addition, a vehicle and the garage were completely burned and damaged. https://t.co/vOh5Oa58o3 pic.twitter.com/436GvhB9KD— YEGWAVE (@yegwave) October 24, 2025న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్ అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. Look at the aftermath of these Diwali celebrations.It’s chaos. Litter everywhere. Police holding people back. Indians hanging out of cars speeding by.And these people have the audacity to compare Christmas parades to this.I’m fed up.pic.twitter.com/2gX57IcKW3— Anti-Taxxer (@mapleblooded) October 23, 2025దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. Indians were celebrating Diwali in US. Their police and fire department came to join the celebration and played Holi. pic.twitter.com/nLLlnFlh8p— Joy (@Joydas) October 23, 2025అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని సమాచారం.Indians have been living a respectful life in USA, UK, Canada and other Countries for over a century. What has really changed with the current expats creating such a ruckus, nuisance, civic garbage, displaying absolute lack of civic sense, cultural bankruptcy, this Diwali❓… pic.twitter.com/dGzt3SrtIs— Raju Parulekar (@rajuparulekar) October 24, 2025 -
రష్యా చమురు.. ఏకాకిగా భారత్?
అంతర్జాతీయ వాణిజ్యంలో సమానత్వం అవసరమని, ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్న దేశాలకు వేర్వేరు నిబంధనలు వర్తింపజేయడం అన్యాయమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. రష్యా చమురు విషయంలో భారత్పైనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తుండడం గురించి ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో భారత్ ఏకాకిగా మారిందంటూ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక్ష చర్చల్లో భాగంగా జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన బెర్లిన్లో జరిగిన ఓ కార్యక్రమాంలో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు పేపర్లో చూశాను. ముడి చమురు కొనుగోలు విషయంలో ఆంక్షల నుంచి మిహాయించాలని జర్మనీ కోరినట్టు అందులో ఉంది. యూకే ఇప్పటికే అమెరికా నుంచి చమురు కొనుగోలు పరంగా మినహాయింపు పొందింది. అలాంటప్పుడు భారత్నే ఎందుకు లక్ష్యం చేసుకుంటున్నారు?.. అని మంత్రి అన్నారాయన. ఇదిలా ఉంటే.. రష్యా చమురు కంపెనీలైన రోజ్నెఫ్ట్, ల్యూక్ ఆయిల్తో ఎవరూ వ్యాపార లావాదేవీలు నిర్వహించరాదంటూ ఈ నెల 22న అమెరికా ఆంక్షలు ప్రకటించింది. అయితే ఈ తరహా సుంకాలు అనుచితం, అన్యాయం, అసమంజసమని భారత్ తరఫున గోయల్ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాతో భారత్ జరిపే చమురు వాణిజ్యం వల్లే నిధులు సమకూరుతున్నాయని.. తక్షణమే ఆ కొనుగోళ్లను ఆపేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పెనాల్టీ టారిఫ్లు విధించిన ఆయన.. ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ వచ్చారు. అయినప్పటికీ భారత్ మాత్రం జాతి ప్రయోజనాలు తప్పించి.. మరే ఇతర కోణంలోనూ నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టం చేసింది. అయితే.. మోదీ తనకు మంచి మిత్రుడని, రష్యా కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చారని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారత్ ఈ ప్రకటనను ఖండించింది. ఆ వెంటనే ఆయన స్వరం మారింది. వైట్హౌజ్ దీపావళి వేడుకల్లో మాట్లాడుతూ.. భారీగా కొనుగోళ్లను జరపబోదంటూ మరో ప్రకటన చేసేశారు. అదే సమయంలో.. ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కూడా ఓ కొలిక్కి రాబోతోందని తెలిపారు. రష్యా నుంచి ముడి చమురును నిలిపివేయాలంటూ అమెరికా ఒత్తిళ్లు తీసుకువస్తున్న వేళ.. మంత్రి పీయూష్ గోయల్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. -
కరీబియన్ జలాల్లో అమెరికా మళ్లీ దాడి
వాషింగ్టన్: కరీబియన్ సముద్ర జలాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ బోటుపై చేపట్టిన వైమానిక దాడిలో ఆరుగురు చనిపోయారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శుక్రవారం తెలిపారు. వీరంతా వెనిజులా జైలు నుంచి నడుస్తున్న ట్రెన్ డె అరాగ్వా గ్యాంగ్కు చెందిన వారేనన్నారు. ఈ ప్రాంతంలోని నార్కో– టెర్రరిస్ట్ డ్రగ్స్ రవాణాదారులను అల్ఖైదా ఉగ్రవాదులుగానే భావిస్తామన్నారు. వారిని వెంటాడి వేటాడి చంపుతామని హెగ్సెత్ హెచ్చరించారు. తాజా ఘటనతో సెపె్టంబర్ నుంచి ఆ ప్రాంతంలో అమెరికా చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 43కు చేరుకుంది. ఇలా ఉండగా, దక్షిణ అమెరికా ప్రాంతంలోకి విమాన వాహక నౌకను పంపిస్తున్నట్లు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. గురువారం అమెరికా సైనిక సూపర్సోనిక్ హెవీ బాంబర్లు రెండు వెనిజులా తీరం వెంబడి చక్కర్లు కొట్టాయి. కరీబియన్ సముద్రం, వెనిజులా తీర వెంబడి అమెరికా బలగాల అసాధారణ మోహరింపులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో నార్కో టెర్రరిజమ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను గద్దె దించే లక్ష్యంతోనే ఇవన్నీ చోటుచేసుకుంటున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. డ్రగ్స్ రవాణా ఒక కారణం మాత్రమే కాగా, ఆయా దేశాలను బెదిరించి దారికి తెచ్చుకోవడమే అమెరికా అసలు లక్ష్యమని పరిశీలకులు అంటున్నారు. -
జీవుల కోసం ‘సూపర్ ఎర్త్’
వాషింగ్టన్: గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నాయా? మనం ఉంటున్న భూగోళంపై కాకుండా ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉందా? ఈ ప్రశ్నలకు ఇప్పటిదాకా కచి్చతమైన సమాధానం లేదు. అయితే, జీవులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం కలిగిన ఒక కొత్త గ్రహాన్ని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ పరిశోధకులు గుర్తించారు. అంతర్జాతీయ పరిశోధకుల బృందం కూడా ఇందులో పాలుపంచుకుంది. భూమి నుంచి దాదాపు 18 కాంతి సంవత్సరాల దూరంలోని ఈ గ్రహానికి ‘జీజే 251సీ’ అని పేరుపెట్టారు. అంతేకాకుండా దీన్ని ‘సూపర్ ఎర్త్’గా పరిగణిస్తున్నారు. ఇది మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహం. మనం నివసిస్తున్న భూగ్రహం కంటే నాలుగురెట్లు పెద్దది కావడం విశేషం. అక్కడ అధికంగా రాళ్లు రప్పలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే అది ‘రాకీ ప్లానెట్’ అని చెప్పుకోవచ్చు. ఈ సూపర్ ఎర్త్ను గుర్తించడం ఈ ఏడాది ఖగోళ పరిశోధనల్లో అతిపెద్ద మలుపుగా చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలను అ్రస్టానామికల్ జర్నల్లో ప్రచురించారు. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తున్నట్లుగానే జీజే251సీ గ్రహం గోల్డిలాక్స్ జోన్లో తన నక్షత్రం చుట్టూ ఒక కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ గ్రహం ఉపరితలంపై ద్రవ రూపంలో నీరు ఉండేందుకు అనుకూల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. జీవుల ఆవాసం కోసం అనుకూలమైన ఇలాంటి గ్రహం కోసమే చాలాకాలంగా అన్వేíÙస్తున్నామని పెన్సిల్వేనియా వర్సిటీ సైంటిస్టులు చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఈ పరిశోధన కొనసాగుతుండడం విశేషం. ఇందుకోసం అత్యాధునిక టెలిస్కోప్లు, పరికరాలు ఉపయోగిస్తున్నారు. సూపర్ ఎర్త్పై వాతావరణాన్ని క్షుణ్నంగా పరిశోధించేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఆక్సిజన్ లేదా మీథేన్ వంటి వాయువులు ఉండొచ్చని భావిస్తున్నారు. మరో గ్రహంపై లేదా మన సౌర వ్యవస్థ బయట జీవం ఉనికి ఉన్నట్లు నిర్ధారణ అయితే అది చరిత్ర గతినే మార్చేస్తుందనడంలో సందేహం లేదు. -
సూర్యుడిలో భారీ పేలుడు
వాషింగ్టన్: సూర్యుడిలో మన కంటికి కనిపించని అవతలి వైపు భారీ పేలుడు సంభవించడంతో శక్తివంతమైన తరంగాలు(షాక్వేవ్స్) మన సౌర వ్యవస్థలోకి వెలువడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నెల 21వ తేదీన ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్(సీఎంఈ) ఢీకొట్టడంతో శుక్ర గ్రహం(వీనస్)లో స్వల్పభాగం దెబ్బతిన్నట్లు కనిపెట్టారు. సౌర ఉద్గారం తదుపరి లక్ష్యం ఏమిటి? మన భూగోళమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. సెకన్కు దాదాపు 2,474 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి నుంచి షాక్వేవ్స్ వెలువడినట్లు అమెరికా వైమానిక దళం వెల్లడించింది. ఇది అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ అని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. 1972, 2017లో ఈ తరహా ఉద్గారాలు సూర్యగోళం నుంచి సౌరవ్యవస్థలోకి వెలువడ్డాయి. అప్పట్లో విద్యుత్ గ్రిడ్లకు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఉద్గారాలను సౌర తుఫాన్లు అని కూడా అంటారు. భూమికి ఉన్నట్లుగా శుక్ర గ్రహానికి రక్షణ అయస్కాంత క్షేత్రం లేదు. అందుకే సూర్యుడి ఉద్గారాల వల్ల ప్రభావితమైనట్లు చెబుతున్నారు. షాక్వేవ్స్ పయనిస్తున్న ప్రాథమిక మార్గంలోనే శుక్రగ్రహం ఉంది. అయితే, ఈ తరంగాలు మరింత విస్తరించి, భూమిని తాకే అవకాశం లేకపోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, ఈ తరంగాల వల్ల భూమికి నష్టమేమీ ఉండదని నేషనల్ ఓషియానిక్, అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్(ఎన్ఓఏఏ) నిపుణులు స్పష్టంచేశారు. సూర్యుడి అవతలి వైపు నుంచి వెలువడే తరంగాలు భూమిని ప్రభావితం చేయబోవని, మనకు ఎలాంటి ముప్పు ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ను వాతావరణ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. -
భారత్ పక్కలో చైనా మిసైల్ బల్లెం
న్యూఢిల్లీ: కయ్యాలమారి చైనా ఒకవైపు భారత్కు స్నేహ హస్తం అందిస్తున్నట్టు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. టిబెట్లోని పాంగాంగ్ సరస్సు తూర్పు ఒడ్డున, వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే అత్యాధునిక గగన రక్షణ వ్యవస్థ బేస్ను నిర్మిస్తోంది. సకల వసతులతోపాటు భారీ ఆయుధాలు, క్షిపణులు మోహరించేలా దీని నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తోంది. ఈ బేస్ను మొదట అమెరికాకు చెందిన ఆల్సోర్స్ అనాలిసిస్ అనే సంస్థ గుర్తించింది. శాటిలైట్ చిత్రాల ద్వారా బేస్ను కనిపెట్టింది. 2020లో భారత్–చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన గస్తీ పాయింట్కు ఈ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గార్ కౌంటీలో ఉన్న ఈ కేంద్రం భారత్లో ఇటీవల ఆధునీకరించిన న్యోమా ఎయిర్ఫీల్డ్కు సరిగ్గా ఎదురుగా ఉంటుంది. భారీ క్షిపణులకు కేంద్రంగా.. ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే ఈ కాంప్లెక్స్లో భారీ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యార్లు, వాహనాలు నిలిపి ఉంచే షెడ్లు, ఆయుధ నిల్వ గోదాములు, రాడార్ సిస్టంలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షిపణి లాంచింగ్ వాహనాలను రహస్యంగా దాచి ఉంచేందుకు భారీ బంకర్ వంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు ముందుకు వెనుకకు జరుపగల పైకప్పును అమర్చినట్లు నిపుణులు గుర్తించారు. అంటే ఆ భవనంలో దాగి ఉన్న వాహనం నుంచి క్షిపణిని ప్రయోగించాలనుకుంటే వెంటనే భవనం పైకప్పు పక్కకు జరుగుతుంది. క్షిపణి ప్రయోగం పూర్తికాగానే మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. శత్రువు నిఘాకు దొరక్కుండా తమ క్షిపణి వ్యవస్థలను దాచేందుకు ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఒక్కో బంకర్ రెండు వాహనాలను నిలిపి ఉంచగల భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ బంకర్ భవనాల్లో చైనా దీర్ఘశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ (భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల క్షిపణి) హెచ్క్యూ–9 క్షిపణి వ్యవస్థలను మోహరించనున్నట్లు ఇంటెలిజెన్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ ఈ కాంప్లెక్స్ను బహిర్గతం చేసిన తర్వాత అమెరికాకే చెందిన గగనగల ఇంటెలిజెన్స్ కంపెనీ వంటార్కు చెందిన ఓపెన్సోర్స్ ఇంటెలిజెన్స్ టీం (ఓఎస్ఐఎన్టీ) మరింత కచ్చితమైన చిత్రాలను సేకరించింది. సెపె్టంబర్ 29న తీసిన శాటిలైట్ చిత్రాల్లో కొన్ని బంకర్ భవనాల పైకప్పులు క్షిపణి ప్రయోగానికి అనువుగా తెరిచి ఉండగా, కొన్నింటికి మూసి ఉండటం కనిపించింది. ‘ఈ రకమైన భవనాలు చైనా క్షిపణి వ్యవస్థలకు అన్ని రకాలుగా రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శత్రువుల ఎదురుదాడి నుంచి తన క్షిపణి వ్యవస్థలను రక్షిస్తాయి. మామూలు సమయంలో అక్కడ మిసైల్ లాంచర్స్ ఉన్నట్లు గుర్తించటం కూడా కష్టమే’అని ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ పేర్కొంది. చైనా గతంలో ఇలాంటి భవనాలనే దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల్లో నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా చేపట్టిన ఈ నిర్మాణాలను గత జూలైలోనే డామియెన్ సైమన్ అనే జియోస్పేషియల్ పరిశోధకుడు గుర్తించాడు. కానీ, అప్పుడు అక్కడ ఏం నిర్మిస్తున్నారన్నది తెలియలేదు. -
ఎంఎస్ఎంఈ రుణాలకు టారిఫ్ల దెబ్బ
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రుణాల పోర్ట్ఫోలియోలో మొండిబాకీల (ఎన్పీఏ) పరిమాణం ఈ ఆరి్థక సంవత్సరం ఆఖరు నాటికి ఒక మోస్తరుగా పెరగనుంది. గత ఆరి్థక ఆఖరులో 3.59 శాతంగా ఉండగా, ఈసారి 3.7–3.9 శాతానికి పెరిగే అవకాశం ఉంది. భారత ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించడం ఇందుకు కారణం కానుంది. క్రిసిల్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టెక్స్టైల్స్, గార్మెంట్స్..కార్పెట్స్, రత్నాభరణాలు, రొయ్యలు తదితర ఎగుమతుల ఆధారిత ఎంఎస్ఎంఈలపై టారిఫ్ల ప్రభావం ఉంటుందని సంస్థ డైరెక్టర్ శుభ శ్రీ నారాయణన్ తెలిపారు. ఆరి్థక వృద్ధికి ఊతమిచ్చేందుకు చిన్న వ్యాపారాలకు మరింతగా రుణాలివ్వాలంటూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దీనివల్ల రిసు్కలు కూడా ఉంటాయని గుర్తించాలని నివేదిక సూచించింది. గతంలో కూడా ఎంఎస్ఎంఈలు వేగంగా వృద్ధి చెందినప్పుడు, కొన్నాళ్ల తర్వాత ఎన్పీఏలు భారీగా పెరిగాయని పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎంఎస్ఎంఈల రుణాలు సుమారు 17 శాతంగా, కార్పొరేట్ రుణాలు 38 శాతంగా ఉంటాయి. రిటైల్ లోన్లకు సంబంధించి అన్సెక్యూర్డ్ విభాగంలోనూ రుణ నాణ్యతపై ఓ కన్నేసి ఉంచాల్సి వస్తుందని తెలిపింది. -
రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు..
న్యూఢిల్లీ: రష్యా చమురు దిగ్గజాలపై అమెరికా ఆంక్షల ప్రభావం రిలయన్స్ ఇండస్ట్రీస్పై భారీగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా భారత్కు చౌకగా క్రూడ్ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, శాంతి చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా లేరంటూ తాజాగా రష్యాకు చెందిన రాస్నెఫ్ట్, లూక్ ఆయిల్పై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల కొరఢా ఝులిపించారు.దీంతో ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగుమతి చేసుకుంటున్న రష్యా డిస్కౌంట్ క్రూడ్కు అడ్డుకట్ట పడొచ్చనేది సంబంధిత వర్గాల సమాచారం. గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కాంప్లెక్స్ నిర్వహిస్తోంది. భారత్కు రష్యా రోజుకు 1.7–1.8 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఎగుమతి చేస్తుండగా.. ఇందులో దాదాపు సగం వాటా రిలయన్స్దే కావడం గమనార్హం. జామ్నగర్ రిఫైనరీలో ఉత్పత్తి చేస్తున్న పెట్రోలియం ప్రొడక్టుల్లో అత్యధికంగా యూరప్, అమెరికాకు మార్కెట్ ధరతో విక్రయిస్తున్న రిలయన్స్... దీని ద్వారా భారీగా మార్జిన్లను ఆర్జిస్తోంది. అయితే, అమెరికా తాజా ఆంక్షలతో అమెరికన్ లేదా విదేశీ సంస్థలేవీ రష్యా సంస్థలతో వాణిజ్య లావాదేవీలు జరపకూడదు. ఉల్లంఘిస్తే, సివిల్ లేదా క్రిమినల్ జరిమానాలకు గురికావాల్సి వస్తుంది. అమెరికాతో పటిష్టమైన వ్యాపార సంబంధాలు ఉన్న నేపథ్యంలో రష్యా క్రూడ్ దిగుమతులను రిలయన్స్ గణనీయంగా తగ్గించుకోవడం లేదా పూర్తిగా నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 35 బిలియన్ డాలర్లు.. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా రిలయన్స్ దాదాపు 35 బిలియన్ డాలర్ల విలువైన రష్యన్ క్రూడ్ను డిస్కౌంట్ ధరకు దిగుమతి చేసుకున్నట్లు అంచనా. ఉక్రెయిన్ వార్కు ముందు, అంటే 2021లో రిలయన్స్ రష్యా నుంచి కొనుగోలు చేసిన క్రూడ్ విలువ కేవలం 85 మిలియన్ డాలర్లు మాత్రమే కావడం విశేషం. 25 ఏళ్ల పాటు రోజుకు 5 లక్షల బ్యారెల్స్ వరకు ముడి చమురు దిగుమతి చేసుకునేలా (ఏడాదికి 25 మిలియన్ టన్నులు) రాస్నెఫ్ట్తో 2024లో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా రాస్నెఫ్ట్, లూక్ఆయిల్పై విధించిన ఆంక్షలతో నవంబర్ 21 లోపు ఆయా కంపెనీలతో రిలయన్స్ లావాదేవీలను నిలిపేయాల్సి ఉంటుంది. కాగా, ఈ పరిణామాలపై రిలయన్స్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోపక్క, తాజా ఆంక్షలతో నయారా ఎనర్జీకి కూడా మరిన్ని చిక్కులు ఎదురుకానున్నాయి. ఈ కంపెనీలో రాస్నెఫ్ట్కు 49.12 శాతం వాటా ఉంది. ఇది పూర్తిగా రష్యా క్రూడ్ దిగుమతులపైనే ఆధారపడి రిఫైనరీ, రిటైల్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. జూలైలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) విధించిన ఆంక్షలతో ఇప్పటికే నయారా ఇబ్బందుల్లో చిక్కుకుంది.ప్రభుత్వ రిఫైనరీలకు నో ప్రాబ్లమ్! అమెరికా ఆంక్షల ప్రభావం ప్రభుత్వ రంగ రిఫైనింగ్ సంస్థలపై (ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇతరత్రా) ఉండకపోవచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, ప్రభుత్వ రిఫైనరీలు రాస్నెఫ్ట్, లూక్ఆయిల్ నుంచి నేరుగా క్రూడ్ దిగుమతి చేసుకోవడం లేదు. మధ్యవర్తి ట్రేడర్లు, ప్రధానంగా యూరోపియన్ ట్రేడర్ల (వారిపై ఆంక్షలు లేవు) నుంచి ముడి చమరు కొనుగోలు చేస్తుండటం వల్ల, ప్రస్తుతానికి దిగుమతులు యథాతథంగా కొనసాగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, నేరుగా రాస్నెఫ్ట్ ప్రమేయం లేకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందనేది వారి అభిప్రాయం. రష్యా చమురు దిగుమతులను భారత్ ఆపేస్తుందని, మోదీ ఈ మేరకు హామీనిచ్చారంటూ ట్రంప్ పదేపదే వ్యాఖ్యానిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇప్పటిదాకా అలాంటి ప్రకటనేదీ చేయలేదు. పైగా, రష్యా క్రూడ్ దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్పై 25 శాతం అదనపు టారిఫ్లను కూడా ట్రంప్ విధించడం తెలిసిందే. 2022లో ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత రష్యా క్రూడ్ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశంగా అవతరించిన నేపథ్యంలో తాజా ఆంక్షలను భారత్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
‘మేమేం చేయాలో..నువ్వు చెప్పడం ఏంటి?’
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఏం చేయాలో ట్రంప్ చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను శశి థరూర్ ఖండించారు. ట్రంప్ అసత్యమైన, ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. భారత్ ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, అది అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుగుతోందని స్పష్టం చేశారు.భారత్ తన జాతీయ ప్రయోజనాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనవసరమని థరూర్ అన్నారు. ఇది భారత స్వతంత్రతను, విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు.విదేశాంగ వ్యవహారాల్లో అనుభవం కలిగిన నేతగా, శశి థరూర్ మాట్లాడుతూ ..భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే దేశం. ఇతర దేశాల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. కానీ భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనైతికం’అని అన్నారు. -
ట్రంప్ టారిఫ్ లకు భారత్ చెక్
-
చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా డీల్
స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలు రక్షణ, అంతరిక్ష రంగంలో కీలక ఉపకరణాల దాకా అన్నింటి తయారీకి అత్యావశ్యకమైన ఖనిజాల సరఫరాపై చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. విదేశాలకు తమ అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయాలంటే కఠిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని చైనా మొండికేయడం తెల్సిందే.దీంతో చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా, ఆస్ట్రేలియా రూ.75,000 కోట్ల విలువైన చరిత్రాత్మకమైన ‘అరుదైన ఖనిజాల ఒప్పందం’కుదుర్చుకున్నాయి. అధ్యక్షభవనంలో డొనాల్డ్ ట్రంప్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు.‘‘గత కొన్ని నెలలుగా చర్చలు జరిపి ఎట్టకేలకు నేడు ఒప్పందం కుదుర్చుకున్నాం. మరో ఏడాదిలోగా మా రెండు దేశా లు భారీ ఎత్తున అరుదైన ఖనిజ నిల్వలను సాధించనున్నాయి. ఈ నిల్వలతో మేమేం చేస్తామో మీకు కూడా తెలీదు’’అని వ్యాఖ్యానించారు.తొలి ఆరు నెలల్లో ఇరు దేశాలు చెరో 3 బిలియన్ డాలర్ల మేర ఖనిజాల తవ్వకాల ప్రాజెక్ట్ల్లో పెట్టుబడులు పెడతాయి. ఉపగ్రహాలు, ఎంఆర్ఐ యంత్రాలు, గైడెన్స్ వ్యవస్థలు, లేజర్లు, జెట్ ఇంజిన్లదాకా అన్నింటి తయారీలోనూ అరుదైన భూ మూలకాలనే ఉపయోగిస్తారు. -
శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..
వయసు సాహసోపేతమైన పోటీల్లో పాల్గొనేందుకు అడ్డంకి కాదని చాలామంది వృద్ధులు నిరూపించారు. అలా కాకుండా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని ప్రారంభించి..సెంచరీ వయసు వరకు అదే ఫిట్నెస్తో ఉండటం అంటే మాటలు కాదు కదా.!. కానీ ఈ శతాధిక వృద్ధుడు ఇప్పటికీ అదే ఫిట్నెస్తో ఉండటమే కాదు..వందేళ్ల వయసులో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు యువకుడిగా ఉండగా ఆర్మీలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో తన వంతు పాత్రను పోషించి అజేయమైన ధైర్య సాహాసాలు కనబర్చాడు. పైగా ఈ వయసులో కూడా హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తూ.. ఫిట్నెస్ టిప్స్ కూడా చెబుతున్నారు. చెప్పాలంటే తరతరాలకు ఆయనొక స్ఫూర్తి..ఆయనే అమెరికాకు చెందిన అత్యంత వృద్ధ బాడీబిల్డర్ ఆండీ బోస్టింటో. ఆయన బాడీబిల్డింగ్లో ప్రపంచ ఛాంపియన్ కూడా. అంతేగాదు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాడీబిల్డింగ్ ఔత్సాహికులకు అంతర్జాతీయ రోల్ మోడల్. ఇటీవలే వందేళ్ల వయసులో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని అరుదైన ఘనతను సృష్టించాడు. ఈ వయసులో కాలు కదిపేందుకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఆయన బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. అంతేగాదు ఈ ఏడాది ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ స్టాఫ్ సార్జెంట్ రెండో ప్రపంచ యుద్ధంలో 101వ రెజిమెంట్గా అసామాన్య పరాక్రమాన్ని చూపించినందుకు గానూ ఆండీని కాంస్య నక్షత్రంతో గౌరవించింది.బాల్యం మొదలైంది అలా..ప్రపంచ ప్రఖ్యాత బాడీబిల్డర్గా పేరుగాంచిన ఆండీ ప్రస్థానం న్యూయార్క్ నగరం నుంచి మొదలైంది. 1925 జనవరి 11న ఇటాలియన్ కుటుంబంలో జన్మించిన అతను తల్లి, సోదరడుతో కలిసి పెరిగాడు. క్రిస్మెస్ చెట్టు బహుమతులిస్తుందని అమాయకంగా నమ్మిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ..తన ఆశను ఒమ్ము చేయకుండా విశాల హృదయంతో పొరుగింటివారు తనకందించిన బహుమతులను మర్చిపోనంటాడు. అదే తనకు దాతృత్వం విలువను నేర్పించిందని చెబుతుంటాడు. ఇక ఆండీకి చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ పట్ల మక్కువ ఎక్కువ. 12 ఏళ్లకే అందులో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. 16 ఏళ్లకు బాడీబిల్డింగ్ మ్యాగ్జైన్ల కోసం ఫోటోలు తీయబడ్డాడు కూడా. ఆ తర్వాత ఆర్మీలో చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేసి..తిరస్కరణకు గురయ్యాడు. చివరికి పట్టుదలతో తనకిష్టమైన రంగంలో చేరి అక్కడి అధికారులచే ప్రశంసలందుకున్నాడు. అయితే తనకిష్టమైన బాడీబిల్డింగ్ని మాత్రం వదులుకోలేదాయన. అలా 1977లో సీనియర్ మిస్టర్ అమెరికా టైటిల్ను అందుకున్నాడు. ఆ తర్వాత తన భార్య ఫ్రాన్సిస్తో కలిసి నేషనల్ జిమ్ అసోసియేషన్ను స్థాపించాడు. అక్కడ హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తుంటాడు ఆండీ. ఆండి యువతరానికి ఇచ్చే సలహా..దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ఫిట్నెస్ ఔత్సాహికులను తన అనుభవాన్ని షేర్ చేయడమే గాక సలహాలు సూచనలు షేర్ చేసుకుంటుంటారు. అందులో కొన్ని..శారీరక శిక్షణలాంటిది మానసికంగా సిద్ధంకావడం. ఇది మన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించేలా చేయడమే కాదు మన సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. అవసరం అనుకుంటే సర్దబాటుని కూడా స్వీకరించండిఇక్కడ ఆండీ రెండు ప్రపంచయుద్ధం కాలికి గాయం, స్ట్రోక్ వంటి పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయితే ఆండీ తన పరిమితులపై ఫోకస్ పెట్టకుండా కేవలం శిక్షణపైనే దృష్టి పెట్టి తన సామార్థ్యానికి అనుగుణంగా మార్చుకుంటానని చెబుతున్నాడు. అన్నింట్లకంటే అప్లికబుల్ లేదా పాటించటం అనేది అత్యంత కీలకం. ఇంట్లో లేదా జిమ్లో అయినా.. సరైన టెక్నీక్స్ పాటించాలి. అప్పుడే సత్ఫలితాలు అందుకోగలరని చెబుతున్నారు ఆండీ బోస్టింటో. (చదవండి: weight loss journey: 15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..) -
ఈ మనిషికే అంత సామర్థ్యం ఉంటే.. ఖమేనీ చురకలు
కొంత గ్యాప్ తర్వాత ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు ఎక్కుపెట్టారు. అగ్రరాజ్యంలో నడుస్తున్న నో కింగ్స్ నిరసనలను(No Kings Protest) ఉద్దేశించి తన ఎక్స్ ఖాతాలో ఓ సెటైరిక్ పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఇరాన్ అణుకేంద్రాలను నాశనం చేశానని ట్రంప్ కలలు కంటున్నారని ఖమేనీ అంటున్నారు.ట్రంప్ నియంతృత్వ ధోరణి, ఆ దేశంలో పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా అమెరికాలో No Kings నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఖమేనీ ఏమన్నారంటే.. ‘‘అమెరికాలో ఈ మనిషికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో 70 లక్షల మందికిపైగా నినాదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేంత సామర్థ్యమే ఉన్నప్పుడు.. అక్కడి ప్రజల ఆందోళనలు మాన్పించి ఇళ్లకు పంపొచ్చు కదా’’ అని అన్నారు.According to the reports, seven million people are chanting slogans against this individual in different states across America. If you’re that capable, calm them down, send them back to their residences, and don't interfere in the affairs of other countries! pic.twitter.com/zAkusSWdQf— Khamenei.ir (@khamenei_ir) October 21, 2025ట్రంప్ పాలన ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని, ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, నగరాల్లో బలగాల మోహరింపు, పలు పథకాలకు ప్రభుత్వ నిధులను కత్తిరించడం లాంటి చర్యలను ఖండిస్తూ నో కింగ్స్ నిరసనలు జరిగాయి. అక్టోబర్ 18వ తేదీన అమెరికా 50 రాష్ట్రాల్లో.. 2,700 ఈవెంట్లలో లక్షల మంది పాల్గొన్నారు. అయితే దీనిని అమెరికా వ్యతిరేక ర్యాలీగా రిపబ్లికన్ పార్టీ అభివర్ణించింది. అంతేకాదు.. నిరసనకారులపై కోపం ప్రదర్శిస్తూ ఓ ఏఐతో కూడిన డీప్ఫేక్ వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.ఇక.. ఇరాన్తో చర్చల పునరుద్ధరణకు ట్రంప్ చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించానని ఖమేనీ చెబుతున్నారు. ‘‘ట్రంప్ తనను తాను డీల్మేకర్ అని చెప్పుకుంటారు. కానీ, బలవంతంగానో, బెదిరింపులతోనో జరిగేది అసలు ఒప్పందమే కాదు. అది దౌర్జన్యం కిందకు వస్తుంది. అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరించా’’అని ఖమేనీ అన్నారు.ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేశామని ట్రంప్ చేసుకుంటున్న ప్రచారంపై ఖమేనీ స్పందిస్తూ..‘‘ మంచిది.. అలాగే కలలు కనమనండి’’అంటూ వ్యాఖ్యానించారాయన.ఇరాన్ అణు కార్యక్రమాలతో తమ దేశానికి ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఇజ్రాయెల్ ఇరాన్పై ఈ ఏడాది జూన్లో దాడులకు దిగింది. ఆ వెంటనే అణు ఒప్పందం వంకతో అమెరికా బలగాలు కూడా ఇజ్రాయెల్కు తోడయ్యాయి. 12 రోజులపాటు ఇరువైపుల నుంచి దాడులు, ప్రతిదాడులతో భారీ నష్టమే వాటిల్లింది. చివరకు.. ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విమరణ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి అమెరికాతో నేరుగా అణు చర్చలు ఉండబోవంటూ ఖమేనీ చెబుతూ వస్తున్నారు. ఇదీ చదవండి: అధ్యక్ష భవనం నుంచి ఇరుకు జైలు గదికి! -
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం
ప్రపంచ శాంతికి, మానవతా విలువల పరిరక్షణకు కృషిచేస్తున్న గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం దక్కింది. సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరం ఈ నెల 19వ తేదీని “శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం”గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించేందుకు, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని, వివిధ మతాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించటం, సమాజాభివృద్ధికి కృషి చేయటం వంటి విషయాలలో గురుదేవుల చేసిన సేవకుగానూ ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడుతున్న మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, శాంతిదూత అయిన శ్రీశ్రీ రవిశంకర్ ఒత్తిడి లేని, హింస లేని సమాజం నెలకొల్పాలనే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో 8కోట్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసిందని సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్, వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ పేర్కొన్నారు. రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్మూలన శిబిరాలు, యువ నాయకత్వ శిబిరాలు, సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు అక్కడి ప్రజలలో మానసిక దృఢత్వం, సౌభ్రాతృత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడటమేగాక శాంతియుత వాతావరణం, మహిళా సాధికారికతను పెంపొందించాయన్నారు. చివరగా ఇక అంతకు ముందురోజైన అక్టోబర్ 18వ తేదీన వాంకోవర్ నగరం సైతం గురుదేవుల్ని ఇదే విధంగా సత్కరించి, అక్టోబర్ 18వ తేదీని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దినం గా ప్రకటించటం గమనార్హం.(చదవండి: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు) -
అమెరికా నుంచి శుభవార్త!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘టారిఫ్ వార్’లో మెత్తబడనున్నారా?. వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిన తరుణంలో త్వరలో భారత్కు గుడ్న్యూస్ అందించబోతున్నారా?. ఇప్పటికి అమలవుతున్న 50 శాతం సుంకాలను గణనీయంగా తగ్గించబోతున్నారా?.. భారత్ చెందిన ఓ వార్తా సంస్థ కథనం అవుననే అంటోంది.అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ తాజాగా దీపావళి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని మోదీతోనూ ఈ అంశంపైనే మాట్లాడానని అన్నారాయన. ఇటు ట్రంప్ ఫోన్కాల్ను ధృవీకరించిన మోదీ.. ఏ అంశాలపై మాట్లాడరనేది మాత్రం చెప్పలేదు. ఈలోపు.. జాతీయ ఆంగ్ల పత్రి మింట్ ప్రచురించిన కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ట్రేడ్డీల్కు భారత్-అమెరికా చేరువయ్యాయని, ఇందులో భాగంగానే భారత్పై అమెరికా విధించిన సుంకాల్లో భారీగా తగ్గుదల ఉండబోతోందని ఆ కథనంలో ఉంది. అదే సమయంలో రష్యా చమురు కొనుగోళ్లపైనా ఈ ఒప్పందం ప్రభావం చూపించబోతోందని పేర్కొంది. క్రమక్రమంగా తగ్గించే అవకాశం ఉందని ప్రస్తావించింది.అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం శక్తి(ఎనర్జీ), వ్యవసాయ రంగాలపై ఆధారపడి ఉండబోతోంది. ఈ తగ్గింపుతో సుంకాలు 50 శాతం నుంచి 15-16 శాతానికి చేరుకుంటాయి. భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు పరిమాణాన్ని క్రమంగా తగ్గించే అవకాశం ఉంది. ఈ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు ముగ్గురికి మాత్రమే తెలుసు అని మింట్ కథనం పేర్కొంది.అమెరికా నుంచి దిగుమతి అయ్యే జన్యుపరంగా మార్పులు చేయని మొక్కజొన్న, సోయా ఆహార పదార్థాలపై పన్నులు తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, అలాగే అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఈ ఒప్పందాన్ని తరచుగా సమీక్షించే విధానాన్ని కూడా చేర్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఈ నెలలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాసింది. ఈ కథనంపై మరో ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్.. ఇటు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖను, అటు వైట్హౌజ్ను సంప్రదించింది. అయితే.. ఇరువర్గాలు దీనిపై స్పందించలేదు.47వ ఏషియన్ శిఖరాగ్ర సమావేశం 2025 అక్టోబర్ 26 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్ నగరంలో జరుగనుంది. ఈ సమావేశానికి ఆసియాన్ దేశాల నాయకులతో పాటు అమెరికా, కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, సైప్రస్, ఫిన్లాండ్ దేశాల నాయకులు కూడా హాజరుకానున్నారు. ప్రాంతీయ సహకారానికి, ద్వైపాక్షిక ఒప్పందాలకు కీలక వేదికగా ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి ఓ పేరుంది.అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాల టైమ్లైన్2023 జూన్: భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా వ్యవసాయం, టెక్నాలజీ, ఇంధన రంగాలపై ఇరు దేశాలు దృష్టి సారించాయి.2023 ఆగస్టు: అమెరికా భారత దిగుమతుల పన్నులపై సమీక్ష ప్రారంభించింది. దీంతో చర్చలు కొంతకాలం నిలిచిపోయాయి.2024 ఫిబ్రవరి: వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతుల పరిమితులు, పన్నుల తగ్గింపు అంశాలపై చర్చలు కొనసాగాయి.2024 జూన్: భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు(MSMEs), రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది.2024 డిసెంబర్: పన్నుల సమీక్ష విధానం ప్రతిపాదించబడింది. మొక్కజొన్న, సోయా వంటి ఉత్పత్తుల దిగుమతులపై దృష్టి సారించాయి.2025 సెప్టెంబర్ 16: ఆగిపోయిన వాణిజ్య చర్చలు.. ట్రంప్ సుంకాల ప్రభావంతో తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధులు భారత్కు చర్చల కోసం వచ్చారు.2025 అక్టోబర్ 13–20: చర్చలు తుది దశకు చేరాయి. ట్రంప్-మోదీలు ఈ చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు.2025 అక్టోబర్ 22: వాణిజ్య ఒప్పందం తుది రూపు దిద్దుకుంటోంది. మింట్ నివేదిక ప్రకారం.. అమెరికా 50% టారిఫ్ను 15–16%కి తగ్గించేందుకు సిద్ధంగా ఉంది. ఇది ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది -
వైట్హౌజ్ దీపావళి సెలబ్రేషన్స్లో ట్రంప్.. వైరల్ అవుతున్న ఫొటోలు
-
దీపావళి వేడుకల్లో ట్రంప్.. మోదీపై ప్రశంసలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (స్థానిక సమయం) వైట్ హౌస్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు, భారతీయ అమెరికన్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. అలాగే, దీపావళి గురించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.దీపావళి వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘భారతదేశ ప్రజలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈరోజు భారత ప్రధానమంత్రి మోదీతో మాట్లాడాను. మా మధ్య గొప్ప సంభాషణ జరిగింది. మేము ప్రపంచ వాణిజ్యం గురించి మాట్లాడుకున్నాం. ఆయనకు దానిపై చాలా ఆసక్తి ఉంది. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి.. గొప్ప స్నేహితుడు. చాలా ఏళ్లుగా మోదీతో నాకు స్నేహం ఉంది. అలాగే, పాకిస్తాన్తో యుద్ధాలు వద్దు అని మేము కొంతకాలం క్రితం మాట్లాడాం. దాంట్లో వాణిజ్యం కూడా ఉందనేది వాస్తవం. ప్రస్తుతం పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం లేదు. అది చాలా మంచి విషయం’ అని చెప్పుకొచ్చారు.BREAKING 🚨 President Trump just lit the diyas in celebration of Diwali. The Peace President 🙏 pic.twitter.com/kpDLTMRIkf— MAGA Voice (@MAGAVoice) October 21, 2025ఇదే సమయంలో దీపావళి పండుగ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్..‘చీకటిపై కాంతి విజయంలో విశ్వాసానికి చిహ్నంగా మనం దీపాన్ని వెలిగిస్తాము. ఇది అజ్ఞానంపై జ్ఞానం మరియు చెడుపై మంచి. దీపావళి సందర్భంగా ఆనందించేవారు శత్రువులను ఓడించడం, అడ్డంకులు తొలగించడం.. బందీలను విడిపించడం గురించి పురాతన కథలను గుర్తుచేసుకుంటారు. దీపం నుంచి వచ్చే జ్వాల ప్రతి ఒక్కరికీ జ్ఞాన మార్గాన్ని వెతకడం, శ్రద్ధతో పనిచేయడం, అనేక ఆశీర్వాదాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పడం గుర్తు చేస్తుంది’ అని తెలిపారు.⚡ US President Trump lights a diya in the Oval Office to celebrate Diwali. pic.twitter.com/yFfSgDiEse— OSINT Updates (@OsintUpdates) October 22, 2025వైట్హౌస్లో జరిగిన వేడుకల్లో ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, ODNI డైరెక్టర్ తులసి గబ్బర్డ్, వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సహా ట్రంప్ పరిపాలన నుండి అనేక మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ భారతీయ-అమెరికన్ వ్యాపార నాయకుల ప్రతినిధి బృందం కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.NOW — POTUS Hosts A Diwali Celebration In The Oval Office 🪔"In the spirit of Diwali, we should acknowledge all the administration is doing to boost technology innovation leading to economic growth...Mr. President, I'd like to thank you." - Business Leader pic.twitter.com/oYJcaSxmr1— Townhall.com (@townhallcom) October 21, 2025 -
అమెరికాలోనే చదివిన వారికి లక్ష డాలర్ల ఫీజులేదు
న్యూయార్క్: హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులందరిపై ఏకంగా ఒకేసారి లక్ష డాలర్ల ఫీజు గుదిబండ పడేసిన ట్రంప్ సర్కార్ హఠాత్తుగా ఒక వర్గం వారికి మాత్రం భారీ లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటూ విద్యనభ్యసిస్తూ హెచ్–1బీ కోసం దరఖాస్తుచేసుకున్న విద్యార్థులు ఈ అధిక వీసా ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం అమెరికా సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) విభాగం ఒక నోటిఫికేషన్ జారీచేసింది.ఇప్పటికే అమెరికాలోని పలు రంగాల సంస్థల్లో పనులు చేస్తున్న విదేశీయులు చేసే దరఖాస్తులకు సైతం లక్ష డాలర్ల మినహాయింపు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, అక్కడి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయులకు భారీ లబ్ధిచేకూరనుంది. విదేశాల్లోని వ్యక్తులు చేసే హెచ్–1బీ వీసా దరఖాస్తులకు మాత్రం లక్ష డాలర్ల ఫీజు ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.అమెరికాలో విద్యనభ్యసిస్తూ ఎఫ్–1వీసా ఉండి దానికి హెచ్–1బీ వీసాగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. సెపె్టంబర్ 21వ తేదీ మొదలవగానే అర్ధరాత్రి 12.01 నిమిషాల తర్వాత వచ్చే ప్రతి విదేశీ హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులు తప్పకుండా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏఏ వర్గాల వారికి ఈ అధిక ఫీజు మినహాయింపు ఉంటుందనే దానిపై సోమవారం యూఎస్సీఐఎస్ ఈ ప్రకటనలో స్పష్టతనిచ్చింది.. హాయిగా వెళ్లిరావొచ్చు ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉన్న విదేశీయులు అత్యవసర పనుల నిమిత్తం స్వదేశం లేదా విదేశాలకు వెళితే మళ్లీ తిరిగొచ్చేటప్పుడు వీసా నిబంధనలు ప్రతిబంధకంగా మారుతాయన్న భయంతో చాలా మంది ఎక్కడికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే ఉండిపోతున్నారు. ఇలాంటి భయాలు అక్కర్లేదని హాయిగా అమెరికా నుంచి విదేశాలకు వెళ్లిరావొచ్చని ప్రభుత్వం స్పష్టంచేసింది. ‘‘హెచ్–1బీ వీసా పొడిగింపు, హెచ్–1బీ వీసాగా మార్పు, నివాస స్థితి పొడిగింపు వంటి దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నందున ఈలోపు అంతర్జాతీయ విమానప్రయాణం చేస్తే తమ వీసా స్టేటస్కు ముప్పు వస్తుందనే భయం ఎవరికీ అక్కర్లేదు’’అని గ్రీన్ అండ్ స్పైగల్ న్యాయసేవల సంస్థ ఉన్నతాధికారి డ్యాన్ బెర్జర్ చెప్పారు. చిన్న మెలిక పెట్టిన ప్రభుత్వంఅయితే, ఇప్పటికే అమెరికాలో ఉంటూ చదువుకుంటున్న లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్న విదేశీయులు చేసే ‘హెచ్–1బీ వీసాగా మార్పు’,‘నివాస స్థితి పొడిగింపు’,‘స్టేటస్ మార్పు’వంటి అభ్యర్థనలకు వాళ్లు అనర్హులు అని తేలితే వాళ్ల నుంచి కూడా లక్ష డాలర్ల ఫీజు వసూలుచేస్తామని యూఎస్సీఐఎస్ వ్యాఖ్యానించింది. ఈ లెక్కన ఏ దరఖాస్తునైనా ఉద్దేశపూర్వకంగా అనర్హమైనదిగా ప్రకటించి లక్ష డాలర్ల రుసుం కట్టాల్సిందేనని ఇమిగ్రేషన్ విభాగం ప్రకటిస్తే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.కొత్తగా విదేశాల నుంచి చేసే దరఖాస్తులకే లక్ష డాలర్ల ఫీజు ఉంటుంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉండి, దాని రెన్యూవల్ దరఖాస్తు ఆమోదం/పెండింగ్ స్థితిలో ఉండగా స్వదేశం వెళ్లిపోయిన విదేశీయులు మళ్లీ అమెరికాలోకి విమానంలో వచ్చినా వాళ్లకు సైతం ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు మొదట అమెరికాలోనే చదువుకోవాలనేదే ట్రంప్ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టమవుతోంది.గత కొన్నాళ్లుగా హెచ్–1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. భారతీయులు అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, వీరికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంలోనే లక్ష డాలర్ల ఫీజు ట్రంప్ తీసుకొచ్చారని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా 65,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తోంది. ఇవిగాక అమెరికాలోనే మాస్టర్స్, అంతకుమించిన ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అర్హతల మేరకు మరో 20,000 హెచ్–1బీ వీసాలను అందజేస్తోంది. -
H1b Visa: విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. కొత్త H-1B వీసా దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్(USCIS) పేర్కొంది. హెచ్1బీ ఫీజు పెంపుపై స్పష్టత ఇచ్చే క్రమంలో పలు వివరాలను వెల్లడించింది.హెచ్-1బీ ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుంచి దరఖాస్తు చేసుకొన్నవారికే వర్తిస్తుందని పేర్కొంటూ అమెరికాలో చదువుకొంటున్న విద్యార్థులకు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ తీపి కబురు చెప్పింది. అలాగే.. ఫీజు పెంపు ప్రకటన వెలువడే సమయానికి అమెరికాలోనే ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది.ఇదిలా ఉంటే.. 2025 సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ప్రెసిడెన్షియల్ ప్రోక్లమేషన్’ విడుదల చేశారు. దీని ప్రకారం, కొత్త H-1B వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధించబడుతుంది. ఈ ఫీజు 2025 సెప్టెంబర్ 21 నుంచి కొత్త H-1B వీసా పిటిషన్లకు వర్తించడం అమలైంది. అయితే.. USCIS అక్టోబర్ 20న ఫీజు అమలులో పారదర్శకత, మినహాయింపు విధానం, అర్హత ప్రమాణాలు గురించి వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను తెలియజేసింది.మరోవైపు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా మాట్లాడుతూ.. F-1 (విద్యార్థి వీసా), L-1 (ఇంటర్కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా) లబ్ధిదారులు ఈ భారీ ఫీజు నుంచి విముక్తి పొందారని తెలిపారు. ఇది విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపశమనం కలిగించే నిర్ణయమని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మార్పులు అమెరికాలో ఉన్న ఉద్యోగదారులకు, అలాగే విద్యార్థులకు.. ఇమ్మిగ్రేషన్ ఖర్చులను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో నుంచే H-1Bకి మారుతారు. కాబట్టి. ఈ భారీ ఫీజు వాళ్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. -
దిగిరాకపోతే 155 శాతం సుంకాలు: ట్రంప్
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం కొనసాగుతోంది. రష్యా చమురును కొనడం ఆపకపోతే భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుందని ఇండియాకు ఆయన హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా చైనాపైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చైనాకు అమెరికాపై అపార గౌరవం ఉందని.. అందుకే ఎక్కువ టారిఫ్లు చెల్లిస్తోందని వెటకారంగా మాట్లాడారాయన. ఈ క్రమంలో.. భారీ సుంకాల మోత తప్పదంటూ హెచ్చరికల జారీ చేశారు. తాజాగా అమెరికా ఆస్ట్రేలియాతో 8.5 బిలియన్ డాలర్ల ‘అరుదైన ఖనిజాల’ ఒప్పందం(Rare Minerals Agreement) చేసుకుంది. సోమవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ వైట్హౌజ్లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ మీడియాతో మాట్లాడుతున్న టైంలో.. ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనా-అమెరికా ఈ ఇరు దేశాలు అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని, అలా జరగని పక్షంలో చైనా 155 శాతం సుంకాలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. చైనాతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదరనుందని భావిస్తున్నా. ఈ ఒప్పందం రెండు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా మంచిదై ఉంటుంది. చైనా అమెరికా పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తోందని.. ప్రస్తుతం 55% టారిఫ్ల రూపంలో భారీగా డబ్బు చెల్లిస్తోందని పేర్కొన్నారు. నవంబర్ 1న ఒప్పందం కుదరకపోతే టారిఫ్లు 155%కి పెరిగే అవకాశం ఉంది అని హెచ్చరించారు(Trump Warn China).అక్టోబర్ 31వ తేదీ నుంచి దక్షిణ కొరియా వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సమావేశం జరగనుంది. అయితే.. దీనికంటే ముందే అక్టోబర్ 29, 30 తేదీలలో ట్రంప్ అక్కడ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కానున్నారు. తనకు చైనా అధ్యక్షుడికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనన ట్రంప్.. ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.చైనా ప్రపంచంలో అరుదైన ఖనిజాల (Rare Earth Materials) ప్రధాన సరఫరాదారు. వీటి సాయంతోనే స్మార్ట్ఫోన్లు, యుద్ధ విమానాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాల తయారు అవుతుంటాయి. అయితే.. చైనా ఈ ఎగుమతులపై నియంత్రణలు పెంచింది. దీంతో అమెరికా సహా ఇతర దేశాలకు ఈ ఖనిజాలు అందుబాటులో ఉండటం కష్టతరమయ్యే చాన్స్ ఉంది. అందుకే ట్రంప్ చైనాతో మంచి వాణిజ్య ఒప్పందం కుదిరితే, ఇలాంటి సమస్యలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.ఇదీ చదవండి: అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన నెతన్యాహు! -
ట్రంప్ పై దాడికి మరో కుట్ర.. ?
-
‘భారత్కు భారీ సుంకాల మోతే..’ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!
రష్యా-భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చమురు కొనుగోలును భారత్ తక్షణమే ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారాయన. ఈ క్రమంలో మోదీకి తనకు మధ్య ఫోన్ సంభాషణేదీ జరగలేదన్న భారత విదేశాంగ శాఖ ప్రకటనపైనా ఆయన స్పందించారు. ఆదివారం రాత్రి కొందరు రిపోర్టర్ల నుంచి ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. దానికి స్పందిస్తూ.. ‘‘ఆయన(మోదీ) రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని నాతో స్పష్టంగా చెప్పారు. అయినా కూడా కొనుగోళ్లు జరుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే భారీ సుంకాలను ఆ దేశం ఎదుర్కొనక తప్పదు’’ అని ట్రంప్ హెచ్చరించారు(Trump On India Russia Oil Trade). ఆ సమయంలో.. ‘‘ప్రధాని మోదీ మీకు మధ్య ఇటీవలి ఫోన్ సంభాషణ జరిగిందన్న తమకు తెలియదని భారత ప్రభుత్వం చెబుతోంది కదా’’ అని ఓ రిపోర్టర్ ట్రంప్ వద్ద ప్రస్తావించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘వాళ్లు అలా చెప్పాలనుకుంటే కచ్చితంగా భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. కానీ, వాళ్లు అలా చేయాలనుకోరని నేను అనుకుంటున్నా’(Trump Warn India) అని బదులిచ్చారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేసిందని, రాబోయే రోజుల్లో పూర్తిగా ఆపేస్తుందని, ఈ మేరకు తన స్నేహితుడు, భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ లభించిందని ట్రంప్ గత బుధవారం తన ఓవెల్ ఆఫీస్లో స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఇద్దరు నేతల మధ్య అలాంటి ఫోన్ సంభాషణేది జరగలేదన్న భారత విదేశాంగ శాఖ.. ఎవరి ఒత్తిళ్లు తమపై పని చేయబోవని, దేశ ప్రజల ప్రయోజనాల మేరకే ఎలాంటి నిర్ణయం అయినా ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఆ మరుసటిరోజు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ సమయంలో మాట్లాడుతూ.. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయబోదని, ఢిల్లీ వర్గాల నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చిందని, ఉక్రెయిన్ యుద్ధంలో ఇది కీలక అడుగు అని, ఈ ప్రభావంతో రష్యా ఆర్థిక స్థితిపై ప్రభావం పడి యుద్ధం ఆగిపోతుందని అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్తో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తోందని.. పైగా రష్యాతో చమురు వాణిజ్యం జరుపుతూ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తోందంటూ ట్రంప్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో సుంకాల యుద్ధానికి దిగారు. భారత్పై జులై 31వ తేదీన 25 శాతం అదనపు సుంకాన్ని(ప్రతీకార సుంకాన్ని) విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఆ వెంటనే రష్యా చమురు కొనుగోలు నేపథ్యంతో ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం సుంకాన్ని పెనాల్టీగా విధించారు. అలా.. ఆగష్టు 27వ తేదీ నుంచి భారత్పై అమెరికా వివధించిన 50 శాతం టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. ఈ సుంకాలను భారత్ అన్యాయంగా పేర్కొంటూనే.. మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ట్రంప్ తాజా హెచ్చరికలపై భారత్ ఎలా స్పందిస్తుంది.. ఈ ప్రభావం ట్రేడ్ డీల్పై పడుతుందా? అనేది చూడాలి(Trump Massive Tariff Warn To India).ఇదీ చదవండి: ట్రంప్ది ముమ్మాటికీ నిరంకుశ పాలనే! -
హమాస్ మరో డేంజర్ ప్లాన్.. అమెరికా సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్: గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ (Hamas) ప్రణాళికలు రచిస్తోందని కలకలం రేపింది. హమాస్ దాడుల ప్రణాళిక గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా (USA) విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో, రంగంలోకి దిగిన అమెరికా.. హమాస్కు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.ఇజ్రాయెల్-హమాస్ మధ్య సుదీర్ఘ యద్ధం జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్- హమాస్ (Israel- Hamas)ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బందీలను సైతం హమాస్ విడుదల చేసింది. అయితే, గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్బంగా అమెరికా (USA) విదేశాంగ శాఖ అలర్ట్ అయ్యింది. పాలస్తీనా పౌరులపై హమాస్ దాడి ప్రణాళిక.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని అమెరికా పేర్కొంది.తమ మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో సాధించిన గణనీయమైన పురోగతిని ఇది దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్ ఈ దాడులకు పాల్పడితే.. గాజా ప్రజలను రక్షించడానికి, కాల్పుల విరమణ సమగ్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమకు అందిన ఈ సమాచారాన్ని ఈజిప్టు, ఖతార్, తుర్కియేతో సహా శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న దేశాలకు తెలియజేసినట్లు యూఎస్ తెలిపింది. దీంతో, మరోసారి గాజాలో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
భారతదేశ ప్రతిభకు అమెరికా సంస్థల "సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు"
"అర్చన ఫైన్ ఆర్ట్స్, అమెరికా", "శ్రీ శారద సత్యనారాయణ ట్రస్ట్ – హ్యూస్టన్, అమెరికా" సంస్థలు సంయుక్తంగా 2025 దీపావళి పండుగను మరింత దేదీప్యమానం చేస్తూ, తెలుగు సాహిత్యంలో తమదైన ముద్రను వేసిన మహనీయులకు 'సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు' ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. ఈ నిర్వాహక సంస్థల వ్యవస్థాపకులు 'నాట్యభారతి' కోసూరి ఉమాభారతి మరియు ప్రమీల సూర్యదేవర సంయుక్తంగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది.సంగీత, సాహిత్య, నాటక రంగాలలో బహుముఖ ప్రజ్ఞా ధురీణులు రామాయణం ప్రసాద రావు; కథా చైతన్య స్రవంతిగా తన కథల ద్వారా మనుషుల్లో చైతన్యాన్ని నింపిన డి.కామేశ్వరి; కథలు, కవితలు, చిత్రాలతో సృజనాత్మక లోకానికి మరింత అందంగా సొబగులద్దిన మన్నెం శారద, దూరదర్శన్ వ్యాఖ్యాతగా అందరి హృదయాలలో నిలిచిన ఓలేటి పార్వతీశం.. తమ సంస్థల తరఫున ఈ సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు కోసూరి ఉమాభారతి, ప్రమీల సూర్యదేవర పత్రికా ప్రకటనలో తెలియజేశారు.అకాడెమీ తరఫున హైదరాబాదులో జ్యోతి వలబోజు నేతృత్వంలో రచయిత్రుల బృందం పురస్కార గ్రహీతల స్వగృహాలలోనే వారిని గౌరవప్రదంగా సత్కరించి పురస్కారాలని అందజేశారు. సాహిత్య కళారంగాలలో పలువురు ప్రముఖులు ఈ పురస్కార ప్రదానంపై తమ హర్షం వ్యక్తం చేస్తూ పురస్కార గ్రహీతలను నిర్వాహకులను అభినందించారు. -
రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది: ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని, ఈ మేరకు తన స్నేహితుడు, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పడం తెలిసిందే. అయితే భారత్ ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఈ దరిమిలా ట్రంప్ మరోసారి అదే వ్యాఖ్య చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ రష్యా చమురు కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యల చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో వైట్హౌజ్లో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలును అతిత్వరలోనే భారత్ నిలిపివేయబోతోందని అన్నారాయన. తద్వారా మాస్కోపై ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలనే ఒత్తిడి పెరగబోతోందని ట్రంప్ తాజాగా చెప్పారు. ఇండియా రష్యా నుంచి 38 శాతం చమురు కొనుగోలు చేసేది. అయితే ఇక నుంచి ఆ పని చేయబోదు. ఆ దేశం ఇప్పటికే కొనుగోళ్లను తగ్గించేసింది. దాదాపుగా ఆపేసేదాకా వచ్చింది అని ట్రంప్ అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తనకు రష్యా చమురు కొనుగోలు నిలిపివేతపై స్పష్టమైన హామీ ఇచ్చారని, తమ మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీంతో.. ఇక్కడి ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ట్రంప్కు మోదీ భయపడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు కూడా. అయితే.. భారత్ తమ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు.. ట్రంప్-మోదీల మధ్య అటువంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్వయంగా వెల్లడించారు కూడా. ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తోంది ఏంటంటే.. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును బహిరంగ మార్కెట్లో తిరిగి విక్రయించి లాభాలు పొందుతోంది అని. ఇది రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తోందని. అలా ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే.. ట్రంప్ భారత్పై 25% ప్రతీకార సుంకం(అంతకు ముందు విధించిన దాంతో కలిపి మొత్తంగా 50 శాతం) విధించినట్లు ప్రకటించారు కూడా. అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్న వేళ ట్రంప్ మరోసారి భారత్ రష్యా చమురును ఆపేయబోతోందన్న వ్యాఖ్య చేయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.ఇదీ చదవండి: ట్రంప్ అయోమయావస్థ! -
హెచ్1బీ ఫీజు పెంపుపై పిటిషన్
వాషింగ్టన్: విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించిన హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్ల (దాదాపు రూ.88 లక్షలు)కు పెంచటాన్ని సవాల్ చేస్తూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కొలంబియాలోని ఒక జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్) చేసిన చట్టంలో ఏకపక్షంగా మార్పులు చేసే అధికారం దేశాధ్యక్షుడికి లేదని గురువారం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వంతోపాటు హోమ్లాండ్ సెక్యూరిటీ, మంత్రులు క్రిష్టీ ఎల్ నోయెమ్, మార్కో రుబియోలను ప్రతివాదులుగా చేర్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పూర్తిగా అన్యాయం, తప్పుదోవ పట్టించే విధానం అని ఆరోపించింది. ఫీజు పెంపు వల్ల నైపుణ్యగల విదేశీ నిపుణులు అమెరికాలోకి రాలేరని, అప్పుడు దేశంలో పరిశోధనలు, పోటీతత్వం దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేసింది. ట్రంప్ నిర్ణయం అమెరికా ప్రత్యర్థి దేశాలకు మేలు చేసేదిగా ఉందని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ బ్రాడ్లీ విమర్శించారు. పార్లమెంటు అధికారాలను కాలరాసి, అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం చెల్లదని స్పష్టంచేశారు. 3,600 ఉన్న హెచ్1బీ వీసా ఫీజును అధ్యక్షుడు ట్రంప్ గత నెల 19న ఒకేసారి లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం భారతీయ వృత్తినిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏటా దాదాపు 85,000 హెచ్1బీ వీసాలు జారీచేస్తుండగా, అందులో దాదాపు 70 శాతం భారతీయులే దక్కించుకుంటున్నారు. -
7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్తో సెంచరీ కొట్టేశా!
వందేళ్లు ఆరోగ్యంగా బతికిన ఓ పెద్దాయన నా దీర్ఘాయువుకు కారణాలివే అంటూ ఏడు చిట్కాలను పంచుకున్నాడు. అమెరికాకు చెందిన శతాధిక వృద్ధుడు సి లిబర్మాన్, జీవిత అనుభవాలు, ఆచరణ, ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.అక్టోబర్ 13న ది వాషింగ్టన్ పోస్ట్ వ్యాసంలో 101 ఏళ్లు ఆరోగ్యంగా జీవించిన సి లిబర్మాన్ తన దీర్ఘాయుష్షు రహస్యాలు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచాయి. ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ సందర్బంలో ముఖ్యంగా నాజీ జర్మనీపై శత్రువుల కాల్పుల నుండి బయటపడటం, తీవ్రమైన మాంద్యం పరిస్థితులు తదితర విషయాలను షేర్ చేశాడు. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా కష్టాలు తప్పలేదు. గుండెపోటు, కోమాలోకి వెళ్లి బయటపడటం లాంటి అద్భుతమైన జీవిత అనుభవాలు ఉన్నాయి.. ఆయన దీర్ఘాయువుకు కారణమైన ఏడు చిట్కాలుసంబంధాలపై దృష్టి (Focus on relationships): బంధాలు అనుబంధాలపై దృష్టిపెట్టడం ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని తెలిపారు. 76 వైవాహిక జీవితంలో ఎంతో సన్నిహితంగా ఉండే భార్య డోరతీ(97), అద్భుతమైన ఇద్దరు పిల్లలు, మరెంతో ప్రేమగా ఉండే మనవరాళ్లు తన జీవితాన్ని ప్రభావితం చేశారన్నారు. View this post on Instagram A post shared by The Washington Post (@washingtonpost)సిగరెట్ తాగవద్దు (Don't Smoke) : ధూమపానం చేయకపోవడమే ప్రదానమైంది. తన చిన్నతనంలో తన స్నేహితులు దాదాపు అందరూ ధూమపానం చేసినా తాను మాత్రం దాని జోలికి పోలేదని తెలిపారు. పెళ్లికాకముందు తన భార్య అప్పుడప్పుడు ధూమపానం చేసేదనీ , మెల్లిగా దాన్ని తాను మానిపించగలిగానని చెప్పారు.వ్యాయామం, ఆహారం (Exercise and eat healthy): ఎల్లప్పుడూ ఆరోగ్యంగా తినడానికి ప్రయత్నించాలని సూచించారు. అల్పాహారంగా పండ్లు, ఆహారంలో ఎక్కువగా చేపలు ఉంటాయి. దీంతో పాటు 14 సంవత్సరాల క్రితం ఫ్లోరిడాకు వెళ్లినప్పటినుంచి బీచ్లో నడవడం, స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం లాంటివి ఉన్నాయని చెప్పారు.సానుకూల దృక్పథం (positive attitude): ఎన్ని కష్టాలొచ్చినా, ఎప్పుడూ నిరాశ చెందలేదు. కష్టాల్లో జీవిస్తూనే పరిస్థితులు మెరుగు పడతాయనే సానుకూల వైఖరి మంచి ఫలితాలనిస్తుందని చెప్పుకొచ్చారు.తగిన వైద్య సంరక్షణ (appropriate medical care) : ఆరోగ్య పరిస్థితులకనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఈ విషయంలో శాస్త్రీయ పురోగతి, ఆధునిక వైద్యం అద్భుతాలు నాకు చాలా లాభించాయి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, వైద్య సలహాలు తీసుకోవాలన్నారు. నచ్చిన పని, మీనింగ్పుల్గా చేయడం (Do work you find meaningful): ప్రైవేట్ యాజమాన్యంలోని పత్రిక ఆస్బరీ పార్క్ సండే ప్రెస్కు ఎడిటర్గా పనిచేశా. 40 ఏళ్లకు పైగా జర్నలిస్ట్గా చాలెంజింగ్ అండ్ రివార్డింగ్ జాబ్ అది చాలా ఇష్టం చేశా. ఇప్పటికీ బిజీగా ఉండటానికి రాస్తాను.కొంచెం అదృష్టం (Be a little lucky): నిజంగా భార్యతో చాలా అందమైన జీవితాన్ని గడిపాను. ఆమె కొన్ని జ్ఞాపకశక్తి సమస్య ఉన్నా, రాత్రి నిద్రపోయే ముందు నన్ను ముద్దు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. మనల్ని ప్రేమించే, మన గురించి కేర్ తీసుకునే మనిషితో జీవించడం దీర్ఘాయువుకు చాలా తోడ్పడతుంది అంటారాయన. -
‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’
న్యూఢిల్లీ: భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసినట్లు, ఇక రష్యా చమురు కొనుగోలు చేయమని ట్రంప్కు మోదీ హామీ ఇచ్చినట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని భారత కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయంలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ రూమర్లేనని, అందులో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. ‘నిన్న అసలు మోదీ-ట్రంప్ల మధ్య ఎటువంటి సంభాషణ జరగేలేదు. మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడలేదు. రష్యా చమురు నిలిపివేస్తామని ట్రంప్కు మోదీ హామీనూ ఇవ్వలేదు. వారి మధ్య ఎటువంటి టెలిఫోన్ సంభాషణ జరగనేలేదు. ఇదంతా అవాస్తవం’ అని విదేశాంగ మంత్రత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఇదీ విషయం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ.. @రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పా’. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తున్న సమయంలో భారత ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.ఇదీ చదవండి: మోదీ గొప్పోడే.. : ట్రంప్ చిత్రమైన వ్యాఖ్యలు -
'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..
తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’ మూవీలో ఎలాగైతే మనుషులు ప్రవర్తిస్తారో అలా బిహేవ్ చేస్తారట ఈ జిలాజిన్ డ్రగ్ తీసుకుంటే. దీన్ని కొందరు మత్తు పదార్థలతో కలపి తీసుకుంటారట. దాంతో మనుషులు అచ్చం జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తారట. ఒక్కోసారి మోతాదు ఎక్కువైతే శరీరం కుళ్లిపోయి..ప్రాణాలు కూడా కోల్పోతారట. ఇంతకీ అసలేంటి డ్రగ్..?. అసలు దేని కోసం దీన్ని తయారు చేశారు?, ఏవిధంగా మత్తుపదార్థంగా వినియోగిస్తున్నారు అంటే..ప్రస్తుతం యూఎస్లో ఈ డ్రగ్ సంబంధిత మరణాలు అధికంగా ఉన్నాయి. అక్కడ ఫెంటానిల్ అనే మత్తు మందుని యువకులు సేవిస్తుంటారట. దానిలో 'జోంబీ' అనే జిలాజిన్ డ్రగ్ కలిపి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది శరీరంపై పలు దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణాంతకమైనది కూడా. నిజానికి ఇది జంతువులను సులభంగా అదుపులోకి తెచ్చే మత్తుమందు. దీన్ని పశువైద్య మందుగా ఉపయోగిస్తారు. అలాంటి డ్రగ్ని అక్రమ మాదకద్రవ్యాల్లో కలిపేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఫెంటానిల్ అనే మత్తు మందులో కలపడం వల్ల దాని దుష్ఫ్రభావం మరింత తీవ్రతరం అవుతుందట. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన మరణాలు అధికమవ్వడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ప్రస్తుతం దీనికి సంబంధించిన బాధితులను యూఎస్ ఫిలడెల్ఫియాలోని చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రుల్లో వారానికి ఒకసారి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు వైద్యులు.జిలాజిన్ అంటే ఏమిటి?జిలాజిన్ అనేది శక్తివంతమైన α-2 అడ్రినెర్జిక్ అగోనిస్ట్. దీనిని మొదట 1962లో బేయర్ అనే శాస్త్రవేత్త రక్తపోటు ఔషధంగా సంశ్లేషణ చేశారు. అయితే దీని తీవ్రమైన దుష్ప్రభావాల కారణంగా పశువైద్య కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. తరువాత ఇది 2000ల ప్రారంభంలో ప్యూర్టో రికోలో వీధి ఔషధంగా దుర్వినియోగం అవడం ప్రారంభించి..రాను రాను వ్యసనంగా మారింది. ఈ మందుని ఇంజెక్ట్ చేయగానే..కండరాలు సడలించి, నొప్పిని తగ్గించి వ్యక్తులను ఒక విధమైన మత్తులో జోగేలా చేస్తుందట. సింపుల్గా చెప్పాలంటే నోర్పైన్ ఫ్రైన్ విడుదలను తగ్గించి..ట్రాన్స్ లాంటి స్థితిని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా జోంబీ లాంటి ప్రభావం ఏర్పడుతుంది. అదేనండి జాంబీ రెడ్డి మూవీలో విధంగా మనుషులు మారిపోతారని మాట. Welcome to Michigan 🥴🥴🥴🥴😂 pic.twitter.com/CfE1vE2fiM— 0HOUR (@0HOUR1__) September 6, 2025 ప్రమాదకరమైన ప్రభావాలు..ఈ డ్రగ్ నెమ్మదిగా హృదయ స్పందన రేటు పడిపోయేలా చేస్తుందట. తర్వాత తక్కువ రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటిగి కలిగిస్తుంది. రక్తనాళాలను సంకోచించేలా చేసి తీవ్రమైన చర్మగాయాలకు దారితీస్తుందట. దీన్ని ఎక్కడ ఇంజెక్ట్ చేశామో ఆ ప్రాంతంలో రక్తసరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందట. తద్వారా కణజాలం చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఇది అచ్చం మాంసం తినే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను పోలి ఉంటుందట. కొన్ని సందర్భాలలో కణజాల నెక్రోసిస్ కారణంగా అవయవాలు స్వయంచాలకంగా విచ్ఛిన్నమవడం, ఎముకలు బహిర్గతం అవ్వడం జరుగుతుందట. ఈ డ్రగ్ సంబంధిత గాయాలనేవి.. మోతాదు వినియోగం, వ్యక్తి స్థితిని బట్టి మారుతుంటుందట దాని ప్రభావం. ఆ డ్రగ్ ఇంజెక్ట్ అయిన ప్రాంతంలో నరాలకు కోలుకోలేనంత నష్టం ఏర్పుడతుంది కాబట్టి యథాస్థితి రావడం అసాధ్యమని చెబుతున్నారు నిపుణులు. కానీ ఈ వ్యసనం బారినుంచి బయటపడేలా చేసి, సాధారణ జీవితాన్ని అనుభవించేలా మాత్రం చికిత్స అందించగలమని నిపుణులు చెబుతున్నారు. అలా బయటపడి పూర్తి స్థాయిలో కోలుకున్నవాళ్లుకూడా ఉన్నారని చెబుతున్నారు.📍For informational purposes:These chilling scenes are coming out of Philadelphia, USA, linked to the widespread use of a drug called Xylazine.It’s so potent that it’s been described as a drug that “zombifies” humans 😳Could this be the beginning of an apocalypse? pic.twitter.com/r8Uiq2rYCz— ADTed✨ (@Eduo_Prince) September 6, 2025 (చదవండి: తెర వెనుక డాక్టర్ అనస్థీషియా..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..) -
చికాగోలో వైస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అమెరికాలోని చికాగోలో ఘనంగా జరిగింది. వైఎస్ జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు.. అంబటి రాంబాబు కి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరమ యరసాని, శరత్ యెట్టపు, నరసింహ రెడ్డి, కేకే రెడ్డి, KSN రెడ్డి, కందుల రాంభూపాల్ రెడ్డి, ఆర్వీ రెడ్డి , వెంకట్ రెడ్డి లింగారెడ్డి, హరినాథ్ పొట్టేటి , వినీల్ తోట తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన గురించి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఇక ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన వైస్సార్సీపీ అభిమానులు, సానుభూతిపరులు.. వైఎస్ జగన్ పై, అంబటి రాంబాబు పై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. చికాగోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రవాసుల ప్రేమ చూస్తుంటే తనకు ముచ్చటేస్తుందన్నారు. దూర ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చినవారు వైఎస్ ఫ్యామిలీపై చూపిస్తున్న ప్రేమ మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయ్యిందన్నారు. ఈ ఏడాదిన్నర పాలనలోనే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకతను.. తన రాజకీయ జీవితంలోనే చూడలేదన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. పెద్ద పెద్ద ప్రకటనలు చేసి.. డప్పు కొట్టుకునే కార్యక్రమాలు చేశారు. సూపర్ సిక్స్ చేసేశాం అంటున్నారు. సూపర్ సిక్స్ లో ఏం అమలు చేశారో అర్దం కావటంలేదన్నారు అంబటి. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగనే అన్నారు. అమ్మ ఒడి పథకాన్ని దేశం మొత్తంలో మొదటగా ప్రవేశ పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. కానీ చంద్రబాబు ఆ పథకాలను కాపీ చేసి మేమే వీటిని సృష్టించాం అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు అంబటి ఎంతో ఒపికగా సమాధనం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: AI వినియోగంపై హెచ్చరిక.. యూకేలో గరికపాటి ప్రవచనాలు) -
‘ఆ సుంకాల ప్రభావం ఊహించినంత తీవ్రమేమీ కాదు’
ప్రపంచ వృద్ధి మందగమనానికి "అనిశ్చితి, రక్షణవాదం" వంటి హెడ్విండ్స్ (ప్రతికూల ప్రభావాలు) కారణమని అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) పేర్కొంది. అయినప్పటికీ, వాణిజ్య సుంకాల వల్ల వచ్చే ప్రభావం "మొదట భావించిన దానికంటే తక్కువగా ఉందని" సంస్థ విశ్లేషించింది."ప్రధాన విధాన మార్పులు ఉన్నప్పటికీ, ప్రపంచ వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. సుంకాల పెరుగుదల ప్రభావం ఊహించిన దానికంటే తక్కువగా ఉండటం వెనుక, కొత్త వాణిజ్య ఒప్పందాలు, బహుళ మినహాయింపులు, సరఫరా గొలుసులను పునఃఆయోజనం చేయడంలో ప్రైవేట్ రంగం చురుకుదనం ముఖ్య పాత్ర పోషించాయి" అని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పియరీ-ఒలివర్ గౌరించాస్ పేర్కొన్నారు.భారత జీడీపీ అంచనాలు పెంచిన ఐఎంఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా అంచనా ప్రకటించింది. గత అంచనా అయిన 6.4 శాతాన్ని ఎగువకు పెంచింది. 2026–27 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 0.20 శాతం తగ్గిస్తూ 6.2 శాతంగా ఉండొచ్చని తెలిపింది.అమెరికా టారిఫ్ల ప్రభావాలకు మించి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) బలమైన వృద్ధి నమోదు కావడాన్ని తమ అంచనాల పెంపునకు కారణంగా పేర్కొంది. జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందడం గమనార్హం.ప్రపంచ వృద్ధి 2024లో నమోదైన 3.3 శాతం నుంచి 2025లో 3.2 శాతానికి, 2026లో 3.1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వర్ధమాన, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధి సైతం 2024లో నమోదైన 4.3 శాతం నుంచి 2025లో 4.2 శాతానికి, 2026లో 4 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది. -
తమిళ సినిమాకు తెలుగులో క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్స్లో ఊహించని రికార్డ్!
డ్రాగన్ మూవీతో తెలుగు ఆడియన్స్లోనూ క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ ఏడాదిలో రిలీజైన చిత్రం కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అదే ఊపులో మరో రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా వస్తోన్న లేటేస్ట్ సినిమా డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో కీర్తీశ్వరన్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ మూవీ రిలీజ్కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచి టికెట్ బుకింగ్లు ఓపెన్ కావడంతో ఓవర్సీస్లో హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. తమిళ సినిమాకు తెలుగు ఆడియన్స్ ఎక్కువగా టికెట్స్ బుక్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు తమిళ వర్షన్కు 27 వేల డాలర్లు రాగా.. తెలుగు వర్షన్కు 32 వేల డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఈ సినిమా విడుదలకు ముందే కలెక్షన్స్ జోరు చూస్తుంటే సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలైన లవ్ టుడే (2022), డ్రాగన్ (2025) తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్నాయి. లవ్ టుడే తెలుగు వెర్షన్ రూ.11.81 కోట్ల నికర కలెక్షన్లు సాధించింది. ఓవరాల్గా ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.66.57 కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో డ్రాగన్ చిత్రానికి రూ.18.68 కోట్లు రాగా.. ఇండియాలో రూ.101.34 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా.. ఇప్పటికే డ్యూడ్ భారతదేశంలో రూ.17.26 లక్షలు ముందస్తు బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, శరత్ కుమార్, హృదు హరూన్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. -
నేటి నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు మళ్లీ షురూ
అమెరికాకు అంతర్జాతీయ పోస్టల్ సర్వీసులను ఇండియా పోస్ట్ అక్టోబర్ 15 నుంచి (నేడు) పునప్రారంభిస్తున్నట్లు పోస్టల్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) మార్గదర్శకాల ప్రకారం భారత్ నుంచి వెళ్లే షిప్మెంట్స్ కన్సైన్మెంట్ విలువలో 50 శాతం కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుందని పేర్కొంది.పోస్టల్ ఐటమ్లపై ప్రోడక్టును బట్టి సుంకాలు విధించడంలాంటివి ఉండదని వివరించింది. దీనితో చిన్న వ్యాపారులు, ఈ–కామర్స్ ఎగుమతిదార్లు మొదలైన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని పోస్టల్ శాఖ తెలిపింది. జులై 30, 2025న యూఎస్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేసింది. దాని ప్రకారం.. 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు సుంకం రహిత మినహాయింపులను ఉపసంహరించుకుంది. 100 డాలర్ల లోపు బహుమతులు మినహా దాదాపు అన్ని షిప్మెంట్లపై తప్పనిసరి కస్టమ్స్ సుంకాలు విధించారు. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ద్వారా అధికారం పొందిన రవాణా క్యారియర్లు, అర్హత కలిగిన పార్టీల కోసం కొత్త నియమాలను ప్రవేశపెట్టారు. దాంతో ఇండియా పోస్ట్ ఆగస్టు 25, 2025 నుంచి యూఎస్కు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.ఇదీ చదవండి: ఓ మై గోల్డ్! -
చైనాను అడ్డుకోవడానికి భారత్ మద్దతు కావాలి: స్కాట్ బెసెంట్
వాషింగ్టన్: అమెరికా, చైనా(China) మధ్య టారిఫ్ల కారణంగా ట్రేడ్ వార్ కొనసాగుతోంది. అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్(Scott Bessent) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చైనాను టార్గెట్ చేసి.. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆరోపణలు గుప్పించారు.అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అమెరికా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తోంది. ఇదే సమయంలో చైనా ప్రపంచంలో వార్ ఎకానమీకి ఫైనాన్స్ చేస్తోందని ఆరోపించారు. అరుదైన ఖనిజాల(rare Metals) ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ సామగ్రి తయారీలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా ఈ వనరులలో దాదాపు 70% సరఫరాను నియంత్రిస్తుండటంతో, అమెరికా దీనిని వ్యూహాత్మక ముప్పుగా చూస్తోంది. ఇక, అక్టోబర్ 9 నుంచి అరుదైన ఖనిజాల ఎగుమతులకు అనుమతులు తప్పనిసరి చేస్తూ చైనా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.NEW:🇺🇲🇮🇳 US Treasury Secretary Scott Bessent now expects to receive support from India in the case of China's rare earth materials, despite the fact that a few weeks ago Trump imposed tariffs on them and blackmailed India to stop buying oil from Russia. pic.twitter.com/S0ol7tWiR8— Megatron (@Megatron_ron) October 14, 2025అయితే.. ఆయన మాటల్లో స్పష్టంగా చైనాపై వ్యతిరేక ధోరణి కనిపించింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, సాంకేతిక పరమైన పోటీ, దక్షిణ చైనా సముద్రం వివాదం వంటి అంశాలు ఇప్పటికే ఉద్రిక్తతలను పెంచాయి. ఇప్పుడు అరుదైన ఖనిజాల విషయం కూడా ఆ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అమెరికా ఈ వనరుల సరఫరాను చైనా నుండి స్వతంత్రంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. భారత్ ఈ రంగంలో విస్తారమైన వనరులు కలిగి ఉండటంతో, అమెరికా వ్యూహాత్మకంగా భారత్ వైపు మొగ్గు చూపుతోంది.మరోవైపు, అమెరికా ఇటీవల భారత్పై కొన్ని ఉత్పత్తులపై టారిఫ్లు విధించడం, వాణిజ్య పరమైన అడ్డంకులు సృష్టించడం విమర్శలకు దారితీసింది. టారిఫ్లతో భారత్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే, చైనాపై పోరులో మద్దతు కోరడం విరుద్ధ ధోరణిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినప్పటికీ, ఖనిజాల రంగంలో భారత్ భాగస్వామ్యం అమెరికాకు వ్యూహాత్మకంగా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. -
చైనాకు గూఢచర్యం?? .. భారత సంతతి అధికారి అరెస్ట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆష్లీ జె టెలిస్(Ashley Tellis) అరెస్ట్ అయ్యారు. అమెరికా రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకుని అక్కడి అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో.. చైనాకు గూఢచర్యం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు జరుగుతుండడం గమనార్హం. Who Is Ashley Tellis.. ఆష్లీ జె టెలిస్ ముంబైలో జన్మించారు. బాంబే వర్సిటీ పరిధిలోని సెయింట్ జెవియర్స్ కాలేజీలో బీఏ, ఎంఏ చదివారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పీహెచ్డీ పూర్తి చేశారు. అక్కడే అమెరికాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో పని చేసి.. విదేశీ విధాన నిపుణుడిగా ఎదిగారు. ముఖ్యంగా.. అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ అడ్వైజర్గా పనిచేస్తూ.. అమెరికా-భారత్ అణు ఒప్పందంలో కీలక పాత్ర(US-India Civil Nuclear Agreement) పోషించారు. అంతేకాదు విదేశీ విధాన పరిశోధకుడిగా ఇరు దేశాల సంబంధాలపైనా ఆయన ఎన్నో రచనలు చేశారు. ప్రస్తుతం ఆయన కార్నెగీ ఎండౌమెంట్లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. అయితే..జాతీయ రక్షణ సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను ఆయన అనుమతి లేకుండా తన వెంట తీసుకెళ్లారనే అభియోగం నమోదైంది. 18 యూఎస్సీ సెక్షన్ 793(ఈ) ప్రకారం.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం.. రహస్య ప్రాంతంలో టెలిస్ను విచారణ జరుపుతున్నారు. తూర్పు వర్జినీయా అటార్నీ ఆఫీస్ కార్యాలయం ఆయన అరెస్ట్, విచారణను ధృవీకరించింది.ఫెడరల్ అధికారులు ఏమన్నారంటే.. 64 ఏళ్ల వయసున్న టెలిస్.. దేశభద్రతకు సంబంధించిన గోప్యమైన పత్రాలను తన వెంట తీసుకెళ్లడం చట్ట ప్రకారం తీవ్ర నేరమే. తన సహ ఉద్యోగినిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్లు తనకివ్వమని ఆయన కోరారు. యూఎస్ ఎయిర్ఫోర్స్లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేశారు. అలాగే.. చైనా అధికారులతోనూ ఆయన సమావేశమైనట్లూ ఆధారాలు ఉన్నాయి. 2022తో పాటు 2023 ఏప్రిల్ 11న బీజింగ్ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నారు. ఈ మధ్యే చైనా అధికారులు ఆయనకు ఓ కాస్ట్లీ బ్యాగును కూడా గిఫ్ట్గా అందించారు అని అన్నారు. అయితే చైనా అధికారులతో భేటీ .. అకడమిక్కు సంబంధించినదని ఆయన అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి.. గూఢచర్యం ఆరోపణలు ఇప్పటికైతే నిర్ధారణ కాలేదు. అలాంటి అభియోగాన్ని నమోదు చేయలేదు. అయితే కీలక పత్రాలకు సంబంధించిన నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష, $250,000(మన కరెన్సీలో రూ. 2 కోట్ల 21 లక్షల) జరిమానా విధించవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు దక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏఐ గురించి గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు -
ఛీ.. ఈ చెత్త ఏంటి? అసహ్యమేస్తోంది.. ఎందుకిలా చేశారు?: ట్రంప్ ఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంతోషం వచ్చినా.. కోపం వచ్చినా అస్సలు ఆగరు. తాజాగా టైమ్ మ్యాగజైన్ ఆయన్ని పొడుగుతూ ఓ కథనం ఇచ్చింది. అయినా కూడా ట్రంప్కు బాగా కోపం వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. టైమ్ మ్యాగజైన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా సోషల్ ట్రూత్లో ఓ పోస్ట్ పెట్టారు(Trump Angry On Time Magazine). కవర్ పేజీపై తన ఫొటోలో జుట్టు సరిగా కనిపించకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఇంతకీ ఆయన ఆ పోస్టులో ఏమన్నారంటే.. నా గురించి వచ్చిన కథనం కొంతవరకు బాగానే ఉంది. కానీ కవర్పై ఉన్న ఫోటో మాత్రం చరిత్రలోనే చెత్త ఫోటో. వాళ్లు నా జుట్టును కనిపించకుండా చేశారు. నా జుట్టును తలపై చిన్న తలపాగా.. ఏదో తేలియాడుతున్నట్లుగా చూపించారు. ఇది చాలా విచిత్రంగా అనిపించింది. నాకు ఎప్పుడూ కింది యాంగిల్ నుంచి తీసే ఫోటోలు నచ్చవు. ఇది మాత్రం చాలా చాలా చెత్త ఫొటో. అందుకే దీన్ని తప్పక విమర్శించాలి. అసలు వాళ్లు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?’’ అంటూ ట్రంప్ మేనేజ్మెంట్పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే టైమ్ మ్యాగజైన్ను ట్రంప్ కోపడ్డడం ఇదే తొలిసారేం కాదు. ఫిబ్రవరిలో.. డోజ్ చీఫ్గా ఉన్న ఎలాన్ మస్క్ ఓవల్ ఆఫీస్లో రెజల్యూట్ డెస్క్ మీద కూర్చున్నట్లు ఓ ఫొటోను ప్రచురించింది. ట్రంప్ ఆ ఫొటోపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తుంది అనుకోలేదు అంటూ వెటకారం ప్రదర్శించారు. అదే సమయంలో.. అయితే మస్క్ పని తీరును ఆ సమయంలో ఆయన ప్రశంసించారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు ట్రంప్ మీద టైమ్ మాగజైన్ His Triumph అనే శీర్షికతో కవర్ పేజీ ఇచ్చింది. గాజా శాంతి ఒప్పందంలో ఆయన చేసిన కృషికిగానూ ఈ కథనం ప్రచురించింది. ఈ ఒప్పందంతోనే 20 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేయగా.. ఇజ్రాయెల్ సుమారు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను, 360 మంది పాలస్తీనీయుల మృతదేహాలను విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ ఏడాదిలోనే తాను పలు యుద్ధాలను ఆపానంటూ ట్రంప్ నోబోల్ శాంతి బహుమతి డిమాండ్ చేయగా.. రూల్స్ అడ్డురావడంతో ఆయన కల నెరవేరలేదు!. దీంతో వచ్చే ఏడాదైనా దక్కవచ్చనే ఆశ పెట్టుకున్నారాయన.ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇదీ.. ఇంత భజనా? -
'కాంతార'కు అక్కడ భారీ నష్టాలే.. కారణం ఇదే
కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ చిత్రం కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. సోమవారం కూడా సుమారు రూ. 20 కోట్లకు పైగానే రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.675 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో బాహుబలి-1 ఫైనల్ కలెక్షన్స్ మార్క్ను కాంతార దాటేసింది. అయితే, కాంతారా చాప్టర్ 1 అమెరికాలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ గణనీయమైన నష్టాలను చవిచూసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు, ఈ చిత్రం దాదాపు రూ. 4 మిలియన్ల డాలర్స్ (రూ. 36 కోట్లు) వసూలు చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా తాజాగా మేకర్స్ షేర్ చేశారు. ఈ కలెక్షన్స్ నంబర్ పర్వాలేదనిపించినప్పటికీ బ్రేక్-ఈవెన్ మార్కుకు చాలా దూరంలో ఉంది. ఈ సినిమాను చాలా ఎక్కువ ధరకు అమెరికాలో కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేయడానికి దాదాపు రూ. 8 మిలియన్ల డాలర్స్ అవసరం అవుతుంది. ఆ మార్క్ను కాంతార అందుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీంతో అమెరికాలో కాంతార నష్టాలు మిగల్చడం తప్పదని సమాచారం.అయితే, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ బెల్ట్లో మాత్రం భారీ లాభాల దిశగా కాంతార దూసుకుపోతుంది. దీపావళి సందర్భంగా ఈ వారంలో మరో నాలుగు ప్రధాన సినిమాలు విడుదల కానున్నడంతో కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా మరింత తగ్గే ఛాన్స్ ఉంది. ఏదేమైనా మరో మూడు రోజులు మాత్రమే కాంతార సందడి కనిపించనుంది. ఈ ఏడాదిలో ఛావా సినిమా రూ. 800 కోట్ల కలెక్షన్స్తో టాప్ వన్లో ఉంది. ఇప్పుడు కాంతార కూడా ఆ మార్క్ను అందుకోవాలని చూస్తుంది. 2022లో విడుదలైన కాంతార చిత్రానికి ప్రీక్వెల్గా కాంతార చాప్టర్ 1 నిర్మించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
చీకటి ‘వేదం’!
43 ఏళ్ల చీకటి తర్వాత వెలుగు.. కానీ అంతలోనే కారుచీకట్లు! నిర్దోషిగా విడుదలైన ఆ అమాయకుడికి ఆ ఆనందం మిగల్లేదు. వేదనల ‘వేదం’ విషాదానికి అంతేలేదు. ఇది న్యాయమా? మానవత్వమా? అంటే సమాధానాలే లేవు. కళ్ల ముందు రెండు తరాలు గడిచిపోయాయి. కానీ ఆయన మాత్రం ఏం మారలేదు. చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకు పైగా (43 ఏళ్లు) జైలు గోడల మధ్య నలిగిపోయిన సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం (64), ఎట్టకేలకు న్యాయం గెలిచి, నిర్దోషిగా విడుదలయ్యాడు. జీవితం, స్వేచ్ఛ, కుటుంబం.. ఈ బంధాల రుచి మళ్లీ చూడబోతున్నానని ఆశపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు లేదు. అమెరికా చట్టం అతన్ని మళ్లీ బందీగా మార్చింది.అప్పుడు తప్పుడు శిక్ష.. ఇప్పుడు దేశ బహిష్కరణ ముప్పు చేయని హత్య కేసులో నాలుగు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత, సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం ఎంతో కాలంగా ఎదురుచూసిన స్వేచ్ఛకు బదులుగా, కొత్త కష్టాలు ఎదురయ్యాయి. పెద్దగా పరిచయం లేని భారతదేశ బహిష్కరణ ముప్పు అతనికి ఏర్పడింది. తనపై ఉన్న హత్య కేసు శిక్షను రద్దు చేయడంతో, అక్టోబర్ 3న పెన్సిల్వేనియాలోని హంటింగ్డన్ స్టేట్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్ నుండి విడుదలైన 64 ఏళ్ల సుబు వేదంను, వెంటనే అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అదుపులోకి తీసుకుంది. చేయని హత్యకు చెరసాలలో మగ్గి.. కేవలం తొమ్మిది నెలల వయసులో భారతదేశం నుండి అమెరికాకు వచి్చన వేదం, శాశ్వత ఆమెరికా నివాసి. కానీ 1980లో పెన్సిల్వేనియాలో జరిగిన 19 ఏళ్ల థామస్ కిన్సర్ కాలి్చవేత కేసులో.. దాదాపు మొత్తం వయోజన జీవితాన్ని జైలులోనే గడిపాడు. స్టేట్ కాలేజ్ సమీపంలోని సింక్హోల్లో కిన్సర్ మృతదేహం లభించింది, అతనితో చివరిగా కనిపించిన వ్యక్తి వేదం (కిన్సర్ మాజీ హైసూ్కల్ సహ విద్యారి్థ) అని పోలీసులు ఆరోపించారు. వేదం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అతన్ని 1983, 1988లలో రెండుసార్లు దోషిగా నిర్ధారించారు. పెరోల్ కూడా లేకుండా జీవిత ఖైదు విధించారు. శిక్ష రద్దు, ఎఫ్బీఐ నివేదిక ఆగస్ట్ 2025లో, ఒక సెంటర్ కౌంటీ న్యాయమూర్తి అతని శిక్షను రద్దు చేస్తూ, ప్రాసిక్యూటర్లు చట్టవిరుద్ధంగా ఒక ఎఫ్బీఐ నివేదికను డిఫెన్స్ న్యాయవాదుల నుండి దాచిపెట్టారని తీర్పు చెప్పారు. ఈ తీర్పు తరువాత, సెంటర్ కౌంటీ జిల్లా అటార్నీ బెర్నీ కాంటోర్నా అన్ని అభియోగాలను అధికారికంగా కొట్టివేశారు. ‘కాలం గడిచిపోవడం, కీలక సాక్షుల నష్టం, వేదం దశాబ్దాల జైలు శిక్షను కారణాలుగా’ పేర్కొన్నట్లు ‘ది ఫిలడెలి్ఫయా ఎంక్వైరర్’ వెల్లడించింది. సుదీర్ఘ అన్యాయం ‘వేదం.. పెన్సిల్వేనియా చరిత్రలో సుదీర్ఘకాలం అన్యాయంగా శిక్షకు గురైన వ్యక్తిగా, అమెరికాలో అత్యధిక కాలం శిక్ష అనుభవించిన వారిలో ఒకరిగా నిలబెట్టింది. ‘వేదం.. తన జీవితంలో అత్యంత విలువైన నాలుగు దశాబ్దాల కాలాన్ని తప్పుడు శిక్ష వల్ల కోల్పోయాడు. ఇప్పుడాయన వయసు 64. ఈ దేశంలోనే ఆయన సోదరి, మేనకోడళ్లు, మనవరాళ్లు.. కుటుంబ బంధాలు అన్నీ ఉన్నాయి. ఏ బంధుత్వం, ఏ పరిచయం లేని దేశానికి, తను ఏమాత్రం తెలియని భారత్కు పంపాలని నిర్ణయించడం ఏం న్యాయం?’.. అని ఆయన న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. చీకటిలోనూ అక్షర దీపం సుబు తన జైలు జీవితాన్ని దుఃఖంతో ముగించలేదు. ఆయన తన చుట్టూ ఉన్న చీకటిలో జ్ఞాన దీపాలను వెలిగించారు. జైలులో ఖైదీల కోసం అక్షరాస్యత తరగతులు, డిప్లొమా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు డిగ్రీలు, 4.0 జీపీఏతో ఎంబీఏ కూడా పూర్తి చేసి, 150 ఏళ్ల జైలు చరిత్రలోనే అరుదైన ఖైదీగా నిలిచారు. మా పోరాటం మానవత్వం కోసమే.. సుబు మేనకోడలు జోయ్ మిల్లర్ వేదం మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి. ‘43 ఏళ్ల పాటు జైలులో బంధించి వేదం జీవితాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు, ఆయనను ప్రేమించే వారందరికీ దూరంగా, ఏమీ తెలియని ప్రపంచానికి పంపడం అనేది, ఆ అన్యాయాన్ని మరింత పెంచడమే. వేదం తల్లిదండ్రులు ఆయన్ని చూసేందుకు ఏళ్ల తరబడి జైలుకు వచ్చి కన్నుమూశారు. దయచేసి, మా కుటుంబాన్ని ఇకనైనా కలవనివ్వండి. ఈ పోరాటం చట్టం గురించి కాదు... మానవత్వం కోసం’.. అని కన్నీటిపర్యంతమయ్యారు. తప్పుడు శిక్ష పడిన ఒక వ్యక్తి స్వేచ్ఛ కోసం, కుటుంబంతో కలవడం కోసం చేస్తున్న ఈ ఆఖరి పోరాటానికి న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. -
అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్రెడ్డి పిటిషన్
విజయవాడ లీగల్: ఐక్యరాజ్య సమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి తరఫున చంద్రగిరి విష్ణువర్ధన్ సోమవారం ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని అభ్యర్ధించారు. ఈ నెల 20 నుంచి వచ్చేనెల 5 వరకు న్యూయార్క్లో నిర్వహించే సమావేశాలకు వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మిథున్రెడ్డికి ఆహా్వనం అందింది. ఇప్పటికే ఈనెల 27 నుంచి 31వరకు అమెరికా పర్యటన నిమిత్తం మిథున్రెడ్డి పాస్పోర్టును అప్పగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అయితే ఈనెల 20నుంచి వచ్చేనెల 5వరకు అమెరికా వెళ్లి వచ్చేందుకు అనుమతించాలని మిథున్రెడ్డి తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్ను ఆదేశిస్తూ, న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదావేశారు. విచారణకు సహకరిస్తున్నా రిమాండ్ పొడిగింపు మద్యం అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డి, చాణక్య, శ్రీధర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్కృష్ణ రిమాండ్ సోమవారం ముగిసింది. దీంతో పోలీసులు వారందరినీ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరితోపాటు బెయిల్పై ఉన్న మిథున్రెడ్డి, పైలా దిలీప్, ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి కూడా ఏసీబీ న్యాయస్థానంలో హాజరయ్యారు. నిందితుల తరఫున పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో రిమాండ్ ముగుస్తున్న ప్రతీసారి ఏవిధమైన మార్పులు లేకుండా ఒకేవిధమైన రిమాండ్ పొడిగింపు నోటీసును న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు.ఇప్పటివరకు ఈ కేసులో సిట్ 35 రూపాయలు కూడా స్వా«దీనం చేసుకోలేదన్నారు. నిందితులందరిపై చార్జిషీటు దాఖలుచేసినా 200 రోజుల నుంచి వారందరినీ జైలులోనే ఉంచారన్నారు. వారిని విడుదల చేయాల్సిందిగా న్యాయమూర్తిని అభ్యర్ధించారు. దీనిపై ప్రాసిక్యూషన్ వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు నిందితులకు ఈ నెల 16 వరకు రిమాండ్ను పొడిగించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెన్నుపూస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన మంతెన సత్యనారాయణరాజు వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది వాణి ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సెల్ఫోన్ తెరిచేందుకు అనుమతి మద్యం అక్రమ కేసులో రిమాండ్లో ఉన్న చెరుకూరి వెంకటేష్ నాయుడు వద్ద సీజ్ చేసిన సెల్ఫోన్లో మరిన్ని ఆధారాలున్నాయని పేర్కొంటూ సెల్ఫోన్ను తెరిచేందుకు బయోమెట్రిక్కు అనుమతించాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం దీనికి అనుమతిస్తూ సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్న కాలంలో నిధుల అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై రిమాండ్లో ఉన్న ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్ను ఏసీబీ న్యాయస్థానం తిరస్కరించింది. -
ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు
న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లోని సెంట్రల్ పార్క్, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, వనాలకు పేరొందింది. ఇక్కడే ఉన్న సెంట్రల్ పార్క్ జూ బెథెస్డా టెర్రస్ వంటి ప్రత్యేక ఆకర్షణలకు కూడా ఇది చిరునామా. అయితే ఇప్పుడు అది మరికొన్ని వైవిధ్యభరిత రుచులకు కూడా చిరునామాగా మారింది. ముఖ్యంగా భారతీయ రుచుల కోసం వెతుకుతున్న ఆహార ప్రియులకు అది తప్పనిసరి సందర్శనీయ స్థలంగా కూడా అవతరించింది. ఈ పార్క్ మధ్యలో తాజాగా తయారుచేసిన వడ పావ్ల సువాసన నాసికకు సోకుతుంటే ఆ ఉద్యానవనం మీదుగా వెళ్లే ఇండియన్ రుచుల అభిమానులు ఆగగలరా? ఇంతకీ ఈ పార్క్లో మన వంటల మార్క్ ఎలా సాధ్యపడింది?ఈ ప్రశ్నకు సమాధానం న్యూయార్క్లో నివసిస్తున్న భారతీయ జంట షౌనక్ శివానీలు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వారి ప్రత్యేకమైన ’వడ పావ్ ప్రాజెక్ట్’ ఆలోచన దీని వెనుక ఉంది కాబట్టి. మహారాష్ట్రలోనే పుట్టి పెరిగిన వారికి వడా పావ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆ వంటకం దొరకని ప్రదేశంలో సదరు మహారాష్ట్రీయుల్ని ఉంచడం అంటే వారి జిహ్వకు ఎంత లోటో కూడా చెప్పనక్కర్లేదు. అదే విధంగా ఈ జంట కూడా న్యూయార్క్కు వెళ్లాక తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్, భారతీయ సంప్రదాయ వంటకాల్లో పేరొందిన వడ పావ్ను మిస్ అయ్యారు. మసాలాతో వేయించిన బంగాళాదుంప ముద్దని మృదువైన బన్ లోపల ఉంచి, టాంగీ, స్పైసీ చట్నీలతో చవులూరింపచేసే ఈ వంటకం మిస్ అవడం కన్నా బాధ ఏముంటుంది? అంటూ వాపోయారా దంపతులు.‘ఈ నగరంలో దోసెలు, పానీపురి, కతి రోల్స్( విభిన్న రకాల వెరైటీలను రొట్టెల్లో చుట్టి అందించేవి) అందించే స్టాల్స్ చాలా ఉన్నప్పటికీ, ఇప్పటికీ వడ పావ్ మాత్రం ఇక్కడకి రాలేదు‘ అని శివాని తన అభిమాన వంటకం లేకపోవడం గురించి పంచుకున్నారు. దాంతో ‘మేం పటేల్ బ్రదర్స్(అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు పేరొందిన స్టోర్)కు ట్రిప్లు వేశాం, మా రెసిపీతో ప్రయోగాలు చేశాం, చట్నీలను తయారు చేసాం ఓ ఫైన్ మార్నింగ్ నుంచి సెంట్రల్ పార్క్లో వడ పావ్ పిక్నిక్లను నెలవారిగా నిర్వహించడం ప్రారంభించాం‘ అంటూ వీరు చెబుతున్నారు.వీరి ప్రాజెక్టుకు అక్కడి భారతీయుల నుంచే కాక స్థానికుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ‘మేం ఇప్పటికే వందలాది మందికి పైగా వడ్డించాం అందరి ప్రేమ అభిప్రాయాలకు చాలా కృతజ్ఞతలు. ఇకపై మా నెలవారీ కార్యక్రమాలను మరింత ఉత్సాహఃగా కొనసాగించాలని ఆశిస్తున్నాం‘ అని వారు అంటున్నారు. వీరి రుచుల పిక్నిక్ ఆన్ లైన్ లో కూడా అనేకమందిని ఆకర్షించింది, నెటిజన్లు ఎందరో ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ‘అద్భుతం అని ఒకరంటే..‘‘ మాకు కూడా చికాగోలో ఒకటి అవసరం’’ అని మరొకరు, ‘ఓరి దేవుడా, ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. ఇప్పటికి నిజమవడం చూసి చాలా సంతోషంగా ఉంది’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ఈ నగరానికి ఖచ్చితంగా వడ పావ్ అవసరం. ఇక్కడ మిలియన్ బేకరీలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోని ఏ బ్రెడ్ ముంబై పావ్తో సరిపోలదు‘ అంటూ ఒక వడ పావ్ ప్రేమికుడు సగర్వంగా ఆన్లైన్లో తన అభిప్రాయం పంచుకున్నారు. ఒక భోజన ప్రియుడు మరింత ముందుకెళ్లి ‘అమెరికాలో ప్రతి మూలలో తాజా వడా పావ్, దబేలి, భేల్పురి చాట్ అవసరం’’ అంటూ తేల్చేశాడు. View this post on Instagram A post shared by The Vada Pav Project (@thevadapavproject) (చదవండి: Success Story: అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్..!) -
మన ఎగుమతిదార్లకు మంచి చాన్స్..
న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధంతో భారతీయ ఎగుమతిదార్లు లబ్ధి పొందేందుకు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనితో అగ్రరాజ్యానికి ఎగుమతులను మరింతగా పెంచుకోవడానికి చాన్స్ లభించవచ్చని పేర్కొన్నారు. 2024–25లో అమెరికాకు భారత్ సుమారు 86 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. చైనాపై భారీ టారిఫ్ల వల్ల అమెరికన్ కొనుగోలుదారులు భారత్వైపు మొగ్గు చూపవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఈ వాణిజ్య యుద్ధం ద్వారా మనం లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. నవంబర్ 1 నుంచి చైనా ఉత్పత్తులపై అదనంగా 100 శాతం టారిఫ్లు విధించనున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో చైనా దిగుమతులపై మొత్తం సుంకాలు 130 శాతానికి చేరతాయి. అమెరికా డిఫెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటికి కీలమైన రేర్ ఎర్త్ ఎగుమతులపై అక్టోబర్ 9న చైనా తాజాగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ విధంగా స్పందించింది. ప్రస్తుతం చైనాపై అమెరికా 30 శాతం సుంకాలు విధిస్తుండగా, భారత్పై అంతకన్నా ఎక్కువగా 50 శాతం వేస్తోంది. దీనితో మన ఉత్పత్తుల కన్నా చైనా ఉత్పత్తులే చౌకగా లభించే పరిస్థితి నెలకొంది. అయితే, చైనాపై 100 శాతం అదనపు సుంకాలు విధించడం వల్ల అమెరికన్ మార్కెట్లో చైనా ఉత్పత్తుల ధరలు, మిగతా దేశాలతో పోటీపడలేనంతగా పెరిగిపోతాయని ఓ ఎగుమతిదారు తెలిపారు. దీంతో సుంకాలు తక్కువగా ఉన్న దేశాల వైపు అమెరికన్ కొనుగోలుదారులు మొగ్గు చూపుతారని బొమ్మల ఎగుమతిదారు మను గుప్తా తెలిపారు. ఇప్పటికే టార్గెట్లాంటి రిటైల్ దిగ్గజాలు కొత్త ఉత్పత్తుల కోసం తమను సంప్రదించినట్లు వివరించారు. ఈవీల రేట్లకు రెక్కలు.. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), విండ్ టర్బైన్లు, సెమీకండక్టర్ల విడిభాగాల రేట్లకు రెక్కలొచి్చనట్లు మేథావుల సంఘం జీటీఆర్ఐ తెలిపింది. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, పాదరక్షలు, వైట్ గూడ్స్, సోలార్ ప్యానెళ్ల కోసం అమెరికా ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతోందని పేర్కొంది. వరుసగా నాలుగో ఏడాది 2024–25లో కూడా భారత్కి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలి్చంది. ఇరు దేశాల మధ్య 131.84 బిలియన్ డాలర్ల (86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు) ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతంగా, దిగుమతుల్లో 6.22 శాతంగా ఉంటోంది. ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నాయి. -
ఉక్రెయిన్ చేతికి టోమాహాక్ క్షిపణి.. అమెరికాకు.. రష్యా వార్నింగ్!
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్కు అమెరికా టోమాహాక్ క్షిపణులు పంపే యోచనపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం అన్ని వైపుల నుండి తీవ్ర రూపం దాల్చడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని రష్యా హెచ్చరించింది.అయితే, డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కు టోమాహాక్ క్షిపణులు ఇవ్వడంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్షిపణులను పంపే ముందు, యుద్ధ తీవ్రత పెరగకుండా చూసుకుంటానని తెలిపారు. ఉక్రెయిన్ వాటిని ఎలా ఉపయోగించబోతుందో ముందుగా తెలుసుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. ఈ అంశంపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.‘టోమాహాక్ల అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది’అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యన్ ప్రభుత్వ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్ని వైపుల నుండి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే వాస్తవం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో అత్యంత ఘోరమైన ఉక్రెయిన్ యుద్ధం. 1962లో జరిగిన క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత, ఇప్పుడు రష్యా–పశ్చిమ దేశాల మధ్య జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం అత్యంత తీవ్రమైన ఘర్షణగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా.. పశ్చిమ దేశాలతో తీవ్రమైన రాజకీయ, దౌత్య వివాదంలో ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి రష్యా కామెంట్స్పై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల మాట్లాడుతూ, టోమాహాక్ క్షిపణులను అమెరికా సైనికుల ప్రత్యక్ష సహకారం లేకుండా ఉపయోగించడం అసాధ్యం అని అన్నారు. అందువల్ల, ఈ క్షిపణుల సరఫరా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే దశకు తీసుకెళ్తుందని హెచ్చరించారు.టోమాహాక్ క్షిపణిటోమాహాక్ క్షిపణి 2,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అంటే ఉక్రెయిన్ నుంచి వీటిని ప్రయోగిస్తే అవి మాస్కో, యూరోపియన్ రష్యాలోని చాలా ప్రాంతాలను సులభంగా చేరుకోగలవు. టోమాహాక్ అనేది అమెరికా నేవీ ఐకానిక్ సబ్సెనిక్ కూయిజ్ క్షిపణి. దీనిని 1970ల నుంచి అభివృద్ధి చేశారు. దీనిని ఓడలు, జలాంతర్గాములు, ల్యాండ్ లాంచర్ల నుంచి ఈజీగా ప్రయోగించవచ్చు. ఇది 1,000 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా కచ్చితంగా చేదించగలదు. వీటిలో బ్లాక్ ఐవీ (TACTOM) వెర్షన్ అత్యంత అధునాతనమైనది. ఈ సూపర్ వెపన్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని విమానం నుంచి ప్రయోగించినప్పుడు ఒకసారి నిర్దేశించిన లక్ష్యాలను కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడీ క్షిపణులను అమెరికా.. ఉక్రెయిన్కు ఇస్తుంటే రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
ఎడారిలోన పంట పండెనెంత సందడి!
ఎండలతో ఎర్రగా మారిన ఎడారి నేల ఇప్పుడు పచ్చని పంటలతో మెరిసిపోతోంది. కేవలం చిన్న చిన్న రాళ్ల గుట్టలు, మట్టీ మాయల సహాయంతోనే పరిశోధకులు ఎడారిని పచ్చని పరుపులా మార్చడం పెద్ద పనేం కాదని అంటున్నారు. ఆనకట్టలు కావు.. ఆదుకునే మంత్రాలు!ఎర్రబడిన ఎడారుల్లో కొత్త ఆశ మొలకెత్తింది. ఆ ఆశ పేరే లారా నార్మన్. అమెరికాకు చెందిన ఈ శాస్త్రవేత్త, ఇరవై ఏళ్లుగా ఎడారిలో నీటి జాడల కోసం వెతికేస్తూ చివరకు ఒక రహస్యాన్ని కనుగొన్నారు. ఆ రహస్యం పెద్ద యంత్రం కాదు, క్లిష్టమైన శాస్త్రం కాదు. ప్రకృతి ఇచ్చిన సులభ మంత్రం. పెద్ద పెద్ద రాళ్లు, చెట్లు, కట్టెలు వంటివన్నీ కలిసి నిడ్స్ అనే సహజ అడ్డాలుగా మారతాయి. ఈ అడ్డాలు నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపకుండా, నెమ్మదిగా మార్చి, నేలను తడిగా ఉంచుతాయని లారా గుర్తించింది. ఈ పద్ధతిని అనుసరించి ఆమె అరిజోనా, న్యూ మెక్సికో ప్రాంతాల్లో చిన్న చెక్ డ్యామ్లు, రాళ్ల గుట్టలు ఏర్పాటు చేసింది. మొదట ఇది కేవలం మట్టిని ఆపినట్టే అనిపించింది. కాని, కొద్ది రోజుల్లోనే ఎండిన నేల తడిగా మారింది. తడిబీడులు పుట్టాయి. పచ్చని చెట్లు మొలిచాయి. పక్షులు తిరిగి వచ్చి కూశాయి. ఇలా ఎడారి గుండెకు మళ్లీ జీవం చేరింది. మాయా మట్టీ!ఎడారి ఇసుకల్లో ఒక్కసారిగా పచ్చని పంటలు పండాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? కాని, ఇది నిజమే! యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నలభై రోజుల్లోనే ఇసుకమయమైన భూమి కాస్త పచ్చటి తోటగా మారిపోయింది. అంతేగాక, అక్కడి ఎండల్లో తియ్యటి పుచ్చకాయల పంట కూడా పండింది. ఈ అద్భుతానికి కారణం ‘నానోక్లే’. మట్టి, నీరు, స్థానిక ఇసుకల మిశ్రమంతో తయారైన ఈ ద్రవం ఎడారికి ప్రాణం పోసే రహస్య మంత్రంలా పనిచేస్తుంది. ఇసుకపై దీన్ని పిచికారీ చేస్తే, ప్రతి ఇసుక రేణువుకు మట్టి కవచం ఏర్పడుతుంది. ఆ కవచం నీటిని పట్టి ఉంచుతుంది. ఫలితంగా ఎండిన నేల తడిగా మారి, వేర్ల దగ్గర పచ్చని జీవం మొలుస్తుంది. ఇలా కొద్ది గంటల్లోనే ఎడారి పచ్చదనంతో మెరిసిపోతుంది. అంతేకాదు, నీటి వినియోగం సగానికి తగ్గిపోవడం, పంటలు వేగంగా పెరగడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ మధ్యనే అబూధాబీలో చేసిన ప్రయోగాల్లో పుచ్చకాయలతో పాటు జుక్కినీ, మిల్లెట్ కూడా పండించగలిగారు. కరోనా సమయంలో వచ్చిన ఆ పంటలు స్థానిక కుటుంబాల కడుపులు నింపాయి. ఇప్పటికీ ఈ ప్రక్రియకు ఖర్చు కొంత ఎక్కువే కాని, భవిష్యత్తులో ఈ సాంకేతికత చౌకగా మారితే ఎడారులన్నీ పచ్చటి పొలాలుగా మారిపోతాయి! (చదవండి: పిట్ట మైల్డ్.. వేట వైల్డ్) -
అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిసిసిప్పీ రాష్ట్రంలోని ఓ పాఠశాల సమీపంలో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 12మందికిపైగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి మిస్సిస్సిప్పి రాష్ట్రం లేలాండ్ నగరంలో అర్ధరాత్రి ఫుట్బాల్ ఆట ముగిసిన తర్వాత 18ఏళ్ల బాలుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారని బీబీసీ నివేదించింది. శుక్రవారం రాత్రి రద్దీగా ఉండే సమయంలో లేలాండ్ ప్రధాన వీధిలో కాల్పులు జరిగాయని నగర మేయర్ మేయర్ జాన్ లీ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు ముందు ఓ స్కూల్ సమీపంలో పాఠశాలల పూర్వ విద్యార్థులను స్వాగతించే వార్షిక అమెరికన్ సంప్రదాయ ఫుట్బాల్, ఇతర కమ్యూనిటీ ఈవెంట్లు జరిగాయి. ఈ ఈవెంట్లో నిందితుడు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పులతో వేడుక విషాదంగా ముగిసింది. అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నాయని, నిందితుల్ని గుర్తించేందు ప్రత్యక్షసాక్షులు ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కాల్పులు జరిపింది 18 ఏళ్ల యువకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. -
స్కామ్ కాల్ అనుకుని...కట్ చేస్తే రూ.9 కోట్ల జాక్పాట్
ఒక ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. తనకు వచ్చిన ఫోన్ కాల్, ఏ స్పామ్ కాలో, స్కామ్ కాలో అనుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క క్షణంలో మెటా లాటరీ మిస్ అయ్యిపోయేదే. ఆ తరువాత అసలు విషయం తెలిసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. విషయం ఏమీ అర్థం కాలేదు. అసలు సంగతి తెలియాలంటే.. ఈ కథనాన్ని చదవాల్సిందే.మిచిగాన్లోని వెస్ట్ల్యాండ్కు చెందిన 65 ఏళ్ల మహిళ వాలెరీ విలియమ్స్ తనకు లాటీరలో అదృష్టం వరిస్తుందేమో ఆశ ఉన్నా.. కచ్చితంగా తనకు కోట్ల రూపాయల అదృష్టం వరించబోతోందని మాత్రం అస్సలు ఊహించలేదు. అందుకే ఫోన్ కాల్ రూపంలో వెతుక్కుంటూ వచ్చిన లక్ను స్కామ్ అనుకుంది. నిజానికి ఆ ఫోన్ కాల్ వాస్తవానికి జీవితాన్ని మార్చే వార్త అని తెలుసుకుని షాక్ అయ్యింది. మిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ గివ్అవేలో తనను పోటీదారుగా ఎంపిక చేశారని తెలుసుకుని షాక్ అయింది విలియమ్స్. కట్ చేస్తే విలియమ్స్ మిలియన్ డాలర్ల (రూ.8.8 కోట్లు బహుమతిని గెలుచుకుంది. ఇన్నేళ్లుగా రాని అదృష్టం ఇంకేమి వస్తుంది అనుకుంది. కానీ అనూహ్య విజయం అవాస్తవంగా అనిపిస్తోందంటూ సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!సెప్టెంబర్ 19న డెట్రాయిట్లోని కొమెరికా పార్క్లో బహుమతి చక్రం తిప్పడానికి ఆహ్వానించారని ఈ స్పిన్ ఆమెకు ఈ బహుమతిని సంపాదించిపెట్టింది.కొమెరికా పార్క్లో భారీ జనసమూహం మధ్య ఎలక్ట్రిక్ ఫ్యామిలీ గివ్అవే విజేత వాలెరీ విలియమ్స్కు అభినందనలు అని లాటరీ కమిషనర్ సుజన్నా ష్క్రెలి అనౌన్స్ చేసేదాకా నమ్మలేదని..ఇప్పటికీ షాక్లో ఉన్నాను అని తెలిపింది విలియమ్స్. గెల్చుకున్న డబ్బును ఏం చేయాలనే పెద్ద ప్లాన్లు ఏవీ ప్రస్తుతానికి లేక పోయినా, భర్తతో కలిసి హాలిడే ట్రిప్కు వెళతానని, మిగతాది పొదుపు చేసుకుంటానని తెలిపింది. మిచిగాన్ లాటరీ యాప్ ద్వారా తాను గెలవని టిక్కెట్లను స్కాన్ చేయడం ద్వారా తాను రెండవ అవకాశం బహుమతిగా పొందుతున్నానని ఆమె గ్రహించలేదని మిచిగాన్ లాటరీ అధికారులు చెప్పారు. చాలా మంది విజేతలు రెండో అవకాశాన్ని పట్టించుకోరనీ, కానీ తమ ఖాతాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, అధికారిక నోటిఫికేషన్ల కోసం అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేశారు. -
ఆ దగ్గు మందు మా దగ్గరకు రాలేదు: అమెరికా స్పష్టం
వాషింగ్టన్: భారతదేశంలో పలువురు చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ అమెరికాకు రాలేదని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) ధృవీకరించింది. భారత్లో ఒక దగ్గు మందు కారణంగా పలువురు చిన్నారులు మరణించినట్లు వస్తున్న ఆరోపణల గురించి తమకు తెలిసిందని అమెరికా పేర్కొంది. ఈ ఉత్పత్తులు భారతదేశం నుండి మరే ఇతర దేశానికి ఎగుమతి కాలేదని ఎఫ్డీఏ పేర్కొంది. విషపూరిత మందులు అమెరికాలో ప్రవేశించకుండా చూసే విషయంలో తాము అప్రమత్తంగా ఉన్నామని ఎఫ్డీఏ పేర్కొంది. అలాగే అమెరికా మార్కెట్ చేస్తున్న మందులు సురక్షితంగా, అత్యున్నత నాణ్యతతో ఉండేలా నిర్ధారించుకోవాలని తయారీదారులను ఎఫ్డీఏ కోరింది. భారతదేశంలో విక్రయిస్తున్న కొన్ని రకాల దగ్గు, జలుబు మందులలో విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ ఉందనే వార్తల నివేదికల గురించి తమకు తెలిసిందని యూఎస్ ఎఫ్డీఏ తెలిపింది.మధ్యప్రదేశ్లోని చింద్వారాలో 14 మంది చిన్నారుల మరణానికి కారణమైన దగ్గు మందులపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఈ తరహా దగ్గు మందుల నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం, దేశంలో ఔషధ ఉత్పత్తుల భద్రత, నాణ్యతను నిర్ధారించడంపై చర్చించారు. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో 14 మంది చిన్నారులు కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత మూత్రపిండాల వైఫల్యం కారణంగా మరణించారు. ఔషధ నమూనాలలో 48.6 శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉందని, ఇది అత్యంత విషపూరిత పదార్థమని అధికారులు తెలిపారు.ఈ ఘటన దరిమిలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది.కోల్డ్రిఫ్ సిరప్కు తమిళనాడులో సంబంధిత ల్యాబ్లో పరీక్షలు నిర్వహించగా, దానిలో డైథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం ఉందని, దీనిని తీసుకున్నప్పుడు తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం సంభవిస్తుందని, చివరికి మరణానికి కారణమవుతుందని నిపుణులు తెలిపారు. రాజస్థాన్లోని భరత్పూర్, సికార్లలో డెక్స్ట్రోమెథోర్ఫాన్ హెచ్బీఆర్ సిరప్ కారణంగా చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారని తెలియడంతో జైపూర్లోని కేసన్ ఫార్మా సరఫరా చేసిన 19 రకాల మందులను నిలిపివేసినట్లు రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్సర్ తెలిపారు. మధ్యప్రదేశ్లో దగ్గు మందు కారణంగా చిన్నారుల మరణాల దరిమిలా తమిళనాడు ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ స్టోర్లు, హోల్సేల్ డ్రగ్ డీలర్లపై దాడులు చేపట్టింది. -
అమెరికాలో భారీ పేలుడు.. ఏకంగా 19 మంది మృతి
-
అమెరికా బాంబుల ఫ్యాక్టరీలో పేలుడు
మెక్ఈవెన్ (యూఎస్): అమెరికాలోని టెన్సెసీ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం (స్థానిక కాలమా నం ప్రకారం) మందుగుండు తయారుచేసే ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు (దాదాపు 19 మంది) మర ణించినట్లు, చాలామంది గల్లంతైనట్లు తెలిసింది. అయితే, మరణాల సంఖ్యపై అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. హిక్మాన్ కౌంటీలోని అక్యురేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్ అనే సంస్థ కర్మాగారంలో ఉదయం 7.45 గంటల సమయంలో పేలుడు సంభవించింది. వెంటనే అక్కడికి వెళ్లిన సహాయ సిబ్బంది ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా మళ్లీ పేలుళ్లు సంభవించాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టలేక పోయారు. ‘పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పలువురు ఉన్నట్లు తెలిసింది. కానీ ఎంతమంది ఉన్నారనేది తెలియదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ పనిచేసేవారి కుటుంబాలను సంప్రదిస్తున్నాం’అని హంప్ష్రేస్ కౌంటీ షెరిఫ్ క్రిస్ డేవిస్ తెలిపారు. -
నోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ!
వాషింగ్టన్: నోబెల్ కమిటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించిందని ఆరోపించారు.వెనిజులా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే, నార్వే నోబెల్ కమిటీ అవార్డు ప్రకటనపై వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది .ఈ అవార్డును డొనాల్డ్ ట్రంప్ తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఈ అవార్డుల ప్రధానంతో నిరూపించింది’ అని వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కానీ, అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందాలు చేసుకోవడం, యుద్ధాలను ముగించడం, ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తుంటారు. ఆయన గొప్ప మానవతావాది. అలాంటి వారు తమ సంకల్ప శక్తితో పర్వతాలను కదిలించగలరు’ అని పేర్కొన్నారు. -
బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్కి దక్కని నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి భారీ షాక్ తగిలింది. ట్రంప్కు 2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) దక్కలేదు. బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వెనుజులా ప్రతిపక్షనేత మరియా కొరీనా మచాడోకు (María Corina Machado) నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ క్రమంలో 2025 నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ మిస్ కావడం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రపంచ శాంతికి కృషి చేసిన మహానుభావులు నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటుంటే, మరోవైపు కొన్ని వివాదాస్పద వ్యక్తులు కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను పరశీలిస్తే..👉ఇదీ చదవండి : మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారంయాసిర్ అరాఫత్ (1994): ఇజ్రాయెల్-పాలస్తీన్ మధ్య ఒప్పందానికి కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ ఆయనపై తీవ్రవాద కార్యకలాపాల ఆరోపణలు ఉండటం వల్ల విమర్శలు ఎదురయ్యాయి.బరాక్ ఒబామా (2009): అధ్యక్ష పదవిలోకి వచ్చిన ఏడాదిలోనే శాంతి ప్రయత్నాలకు బహుమతి రావడం అనేక ప్రశ్నలు రేకెత్తించింది. ట్రంప్ సైతం తాజాగా ఒబామా ఏం చేశారని అధ్యక్ష పదవి చేపట్టిన 8 నెలలకే నోబెల్ ఇచ్చారని, పైగా ఆయన అమెరికాను నాశనం చేశారని మండిపడ్డారు కూడా.ఆంగ్ సాన్ సూకీ (1991): మయన్మార్ ప్రజాస్వామ్య పోరాటానికి గుర్తింపుగా బహుమతి పొందారు. కానీ 2017లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన హింసను నిరసించకపోవడం వల్ల ఆమెపై విమర్శలు వచ్చాయి.హెన్రీ కిస్సింజర్ (1973): వియత్నాం యుద్ధం ముగింపుకు కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ యుద్ధంలో అమెరికా పాత్రపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.అబి అహ్మద్ (2019): ఈథియోపియాలో శాంతి ఒప్పందానికి కృషి చేసినందుకు బహుమతి పొందారు. కానీ తరువాత దేశంలో అంతర్గత హింస పెరగడం వల్ల ఆయనపై విమర్శలు వచ్చాయి.వంగారి మాథై (2004): పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆమె, HIV బాధితులపై చేసిన వ్యాఖ్యల వల్ల వివాదంలోకి వచ్చారు.గాంధీకి నోబెల్ ఎందుకు రాలేదంటే.. మహాత్మా గాంధీ.. శాంతి, అహింసకు ప్రతిరూపం. ఆయన నోబెల్ శాంతి బహుమతికి పలు మార్లు నామినేట్ అయ్యారు. 1948లో ఆయన హత్యకు గురైన టైంలో నోబెల్ కమిటీ.. ఈ గౌరవానికి అర్హులే లేరు అంటూ ఓ ప్రకటన విడుదల చేయడం వివాదాస్పదమైంది. రాజకీయ కారణాలు, బ్రిటిష్ ప్రభావం, అంతర్జాతీయ పరిస్థితులు ,ఇవన్నీ బహుమతి రాకపోవడానికి కారణాలుగా భావించబడ్డాయి. అయితే.. నోబెల్ కమిటీ 2006లో “గాంధీకి బహుమతి ఇవ్వకపోవడం మా పెద్ద తప్పు” అని అంగీకరించింది. ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉంటే గనుక.. పై జాబితాలో చేరి ఉండేదే. కానీ, ప్చ్.. ఆయన కల నెరవేరలేదు. -
H1B వీసా నిబంధనల్లో మరో షాకిచ్చిన ట్రంప
-
‘శాంతిదూత’ ట్రంప్.. నోబెల్ కల నెరవేరేనా?
2025 ఏడాదికిగానూ నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025)ప్రకటనపై యావత్ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఈ రేసులో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా గాజా సంక్షోభానికి ముగింపు పడేలా.. ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కి తీరుతుందేమోనన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ అర్హత దక్కే అవకాశాలపై ఓ లుక్కేద్దాం.. తాను శాంతి దూతనని, ఏడు యుద్ధాలను ఆపానని, ఎనిమిదవ యుద్ధం ముగింపు దశలో(గాజా) ఉందని ట్రంప్ చెప్పుకుంటున్నారు. తద్వారా జాతుల మధ్య స్నేహాన్ని పెంపొందించటం, అణు నిరాయుధీకరణకు కృషి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం.. లాంటి కృషి చేసినందుకు నోబెల్ శాంతి బహుమతికి అన్నివిధాలా అర్హుడినని అంటున్నారాయన(Trump Nobel Peace Prize). మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం ఇప్పటికే ఆయన్ని ‘పీస్ ప్రెసిడెంట్’గా ప్రకటించుకుంది. ఇదిలా ఉంటే.. 2025కిగానూ ఇజ్రాయెల్–అరబ్ దేశాల మధ్య ఒప్పందం ఆధారంగా ట్రంప్కు నోబెల్ ఇవ్వాలనే ప్రతిపాదనతో యూఎస్ చట్టసభ్యురాలు క్లౌడియా టెన్నీ నామినేషన్ సమర్పించారు. దీనికి ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్, కంబోడియా మద్దతు ప్రకటించాయి కూడా. ఇస్తారా? ఇవ్వరా?నోబెల్ శాంతి బహుమతి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతుల్లో ఒకటి. దీనికి ఎవరు.. ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్కి బహుమతి వచ్చే అవకాశాలు తక్కువ. నోబెల్ కమిటీ సాధారణంగా దీర్ఘకాలిక శాంతి ప్రయత్నాలు, అంతర్జాతీయ సహకారం, నిరుపేదల సంక్షేమం వంటి అంశాలను ప్రాధాన్యతగా చూస్తుంది. అంతేకాని తాత్కాలిక ఒప్పందాలు, రాజకీయ ప్రచారాలు కాదు. వీటికి తోడు ట్రంప్ చర్యలు, అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగడం, ప్రజాస్వామ్య విలువలపై ప్రభావం చూపడం.. ఇవన్నీ నోబెల్ ఆశయాలకు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.అయితే ట్రంప్ ప్రధానంగా చెబుతున్న గాజా ఒప్పందం తాజాగా కుదరగా.. నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ గడువు ఫిబ్రవరి 1వ తేదీతోనే ముగియడం గమనించదగ్గ విషయం. పైగా ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి మద్దతును ప్రకటించిన వాళ్లంతా కూడా ఈ మధ్యకాలంలోనే ఆ ప్రకటనలు చేయడం మరో విశేషం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ట్రంప్ బహిరంగంగా బహుమతిని కోరడం, నోబెల్ కమిటీపై విమర్శలు చేయడం వంటి చర్యలు బహుమతి అవకాశాలను తగ్గించాయి. అల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు విరుద్ధంగా కమిటీ పనిచేస్తోందని.. ఒబామా ఏమి చేశాడో తెలియకుండానే బహుమతి ఇచ్చారని ట్రంప్ విమర్శించారు. అలాగే.. ఏదో ఒక కారణం చూపుతూ తనకు నోబెల్ ఇవ్వొద్దని చూస్తున్నారని కూడా అన్నారాయన. ఒకవేళ.. ఒత్తిళ్లకు, బెదిరింపులకు తలొగ్గి ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే.. దాని విలువపై ప్రశ్నలు రేకెత్తే అవకాశం లేకపోలేదు. గాజా యుద్ధంలో తాత్కాలిక ఒప్పందం ఆధారంగా బహుమతి ఇవ్వడాన్ని ‘శాంతి కృషి’కి అవమానంగా నిపుణులు భావించే అవకాశం లేకపోలేదు. నార్వే.. అందుకు సిద్ధమా?..తనకు నచ్చకున్నా.. కోపం వచ్చినా.. ట్రంప్ ఎంతకైనా తెగిస్తారన్నది గత 9 నెలలకాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో నోబెల్ శాంతి బహుమతి ప్రకటన నేపథ్యంలో.. నార్వే అప్రమత్తమైంది. నోబెల్ బహుమతి తనకే రావాలంటూ నార్వే ఆర్థిక మంత్రి జెన్స్ స్టోల్టెన్బర్గ్క్కి ట్రంప్ ఇంతకు ముందే ఫోన్ చేశారు. అయితే.. నోబెల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హార్ప్వికిన్ మాత్రం తాము ఒత్తిళ్లకు తలొగ్గమని, పీస్ ప్రైజ్ సెలక్షన్ కమిటీ పూర్తిగా స్వతంత్రంగా పని చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు.. ఈ నిర్ణయం అమెరికాతో తమ దేశ సంబంధాలపై ప్రభావం చూపించొచ్చనే ఆందోళన అక్కడి రాజకీయవర్గాల్లో ఉంది. ‘‘ట్రంప్ ఎలా స్పందిస్తారో తెలియదు.. సిద్ధంగా ఉండాలి’’ అని నార్వే సోషలిస్ట్ పార్టీ నేత క్రిస్టీ బెర్గ్స్టో అంటున్నారు.శాంతి బహుమతి కోసం నోబెల్ కమిటీ 338 నామినేషన్లు (244 వ్యక్తులు, 94 సంస్థలు) స్వీకరించింది, రేసులో.. పాకిస్తాన్(ఇమ్రాన్ ఖాన్), ఎలాన్ మస్క్(అమెరికా), పోప్ ఫ్రాన్సిస్ (ఇటలీ.. మరణాంతరం), అన్వర్ ఇబ్రహీం(మలేషియా)తో పాటు సూడాన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(సూడాన్), అలాగే.. కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్(CPJ), ఉమెన్స్ ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్ (WILPF) లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రముఖంగా నిలిచాయి.2025 నోబెల్ శాంతి బహుమతి భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 10న(శుక్రవారం.. ఇవాళే) మధ్యాహ్నం 2:30 గంటలకు (IST) ప్రకటించబడుతుంది. ఈ ప్రకటనను నార్వేలోని ఒస్లో నగరంలో నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నర్ ఫ్రైడ్నెస్ ప్రకటిస్తారు. నోబెల్ ప్రైజ్ అధికారిక YouTube ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. -
H1B Visa: కారు మబ్బులు.. కాంతి రేఖలు
మొదట సుంకాల మోత... ఆ తర్వాత కొత్త హెచ్1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు వ్యవహారం.. ఆపైన బ్రాండెడ్ ఔషధాలపై 100 శాతం సుంకాలు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలితో భారత్-అమెరికా సంబంధాల్లో తెలియని గందరగోళం నెలకొంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మొన్న అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ప్రభావమూ మన వీసాలపై పడనుంది.ఇప్పుడేం జరిగింది?హెచ్1బీ వీసాల ఫీజును ఒకేసారి దాదాపు 60 రెట్లు పెంచుతూ, లక్ష డాలర్లు చేస్తున్నట్టు సెప్టెంబర్ 19న ట్రంప్ సంతకం చేశారు. గందరగోళం రేగడంతో, కొత్త దరఖాస్తులకే ఈ హెచ్చు ఫీజు వర్తిస్తుందనీ, ఇప్పటికే వీసా ఉన్నవారికీ, రెన్యువల్ కోరుతున్న వారికీ అది వర్తించదనీ వాషింగ్టన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతలో అక్టోబర్ 1 నాటి షట్డౌన్ నిర్ణయంతో మరో చిక్కు వచ్చి పడింది.షట్డౌన్ కథేమిటి?ఏటా అక్టోబర్ 1 నుంచి మరుసటి సెప్టెంబర్ 30 వరకు అమెరికా ప్రభుత్వపు ఆర్థిక సంవత్సరం. ఆ కాలవ్యవధికి అన్ని శాఖల వ్యయపరిమితిని నిర్ణ యిస్తూ మన బడ్జెట్ తరహాలో నిధుల కేటాయింపు చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించగా, దేశాధ్యక్షుడు సంతకం చేయాలి. ఈ ఫండింగ్ బిల్ సమయానికి ఆమోదం పొందకపోతే, ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్ళిపోతుంది. అంటే, అత్యవసరం కాని సర్వీసులు స్తంభిస్తాయి. దీనితో కొత్త దరఖాస్తులు, బదిలీలు, గ్రీన్కార్డ్ ప్రక్రియలు ఆగిపోయాయి.ఎంత కష్టం? ఎవరికి నష్టం?నిజానికి, అమెరికన్ పౌరులు కానివారు ఆ దేశంలో ప్రత్యేక ఉద్యోగాలు సంపాదించడానికి హెచ్1బీ వీసాలు ఒక మార్గం. ఏటా గరిష్ఠంగా 65 వేల వీసాలే ఇవ్వాలి. అమెరికాకు చెందిన ఉన్నత విద్యాసంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీ, లేదా డాక్టరేట్ చేసిన విదేశీ వృత్తి నిపుణులకై అదనంగా మరో 20 వేల వీసాలు ఇవ్వవచ్చు. నిరుడు 80 వేల మందికి పైగా భారతీయులు హెచ్1బీలకు దరఖాస్తులు పెట్టారు. గత ఆర్థిక సంవత్సరం ఆమోదం పొందిన మొత్తం హెచ్1బీలలో 71 శాతం మన భారతీయులవే. పెంచిన తాజా వీసా ఫీజు ఆ దేశంలో భారీ టెక్ సంస్థలకే నష్టం. అవన్నీ విదేశీ ఉద్యోగులపై ఆధారపడి ఉన్నాయి.తెరుచుకున్న కొత్త తలుపులుఇప్పుడు ట్రంప్ ఫీజు పెంపుతో భారతీయ వృత్తి నిపుణుల్లో లక్ష మందిపై ప్రభావం పడుతుందని అంచనా. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాల్లోని వారు ఎక్కువ నష్టపోతారు. ఈ పరిస్థితుల్లో చైనా, జర్మనీల నుంచి బ్రిటన్ దాకా వివిధ దేశాలు భారత్లోని ప్రతిభావంతుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక వీసా విధానాల్ని అందిస్తామంటున్నాయి. చైనా ఇప్పటికే అక్టోబర్ 1 నుంచి కొత్త ‘కె’ వీసాను అమలులోకి తెచ్చింది. స్పాన్సర్ అవసరం లేకపోవడం ‘కె’ వీసా ఆకర్షణ.మరోపక్క విదేశీ ఉద్యోగులను తీసుకొనేందుకు త్వరలోనే కొన్ని ప్రతిపాదనల్ని చేయనున్నట్టు కెనడా ప్రధాని ఇటీవలే ప్రకటించారు. అమెరికాకు ప్రత్యామ్నాయం తమ ఆర్థిక వ్యవస్థే అంటూ, ఐటీ, సైన్స్, టెక్ రంగాలలో భారతీయులకు పుష్కలంగా అవకా శాలున్నాయని జర్మనీ చెబుతోంది. పైగా, జర్మనీలో పెరుగుతున్న వయోవృద్ధుల రీత్యా కనీసం 2040 వరకు ఏటా దాదాపు 2.88 లక్షల మంది ఇమ్మిగ్రెంట్స్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరం. ఇవన్నీ అమెరికన్ వీసాల సంక్షోభ వేళ భారతీయులకు అందివచ్చిన సరికొత్త అవకాశాలు.రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది? వీసా ఫీజుపై ఇవే నిబంధనలు కొనసాగితే, అమెరికన్ ఐటీ సంస్థలు ఒక్కొక్కరికి లక్ష డాలర్లు పెట్టి కొత్త ఉద్యోగుల్ని తీసుకువెళ్ళడం కష్టమే. కాకపోతే, మరో మార్గం ఉంది. భారతీయుల ప్రతిభను ఉపయోగించుకోవడానికి అవి ఇక్కడే ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్’ (జీసీసీలు) నెలకొల్పవచ్చు. ఇప్పటికే మన దేశంలో 1,600 జీసీసీలు పెట్టాయి. మరిన్ని జీసీసీ లొస్తే, వీసా షరతుల ప్రభావం ఉండదు. ఈ 2025 నాటికి భారత్లోని జీసీసీలు 20 లక్షల మందికి పైగా నిపుణులకు ఉపాధినిస్తున్నాయి. ఏమైనా, సాక్షాత్తూ అమెరికాయే వలస జీవులతో నిర్మితమైన దేశం. ఆ సంగతి ట్రంప్ మర్చిపోతేనే కష్టం. -
సుంకాలు, నిబంధనలు ఆందోళనకరం
సాక్షి, హైదరాబాద్: అమెరికా ప్రభుత్వం తీసుకొనే నిర్ణయా లు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. భార తీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచడం, హెచ్– 1బీ వీసాలపై కఠిన నిబంధనలు విధించడంపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు అస్థిరతకు, అపార్థానికి దారితీస్తాయన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థికా భివృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్నారు.అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం తెలంగాణ పర్యటనలో భాగంగా గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశమైంది. అమెరికాలోని హడ్సన్ ఇన్స్టిట్యూట్కు చెందిన 16 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉండగా వారిలో మేధావులు, బిజినెస్ లీడర్లు ఉన్నారు. ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర అభి వృద్ధి విషయంలో ఉత్తమ విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తోందన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని.. 2034 నాటి కి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిది ద్దుతూ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. న్యూయార్క్, టోక్యోకి పోటీగా హైదరాబాద్ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరా బాద్ అందరినీ ఆకర్షిస్తోందని.. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీపడు తోందన్నారు. హైదరాబాద్లో గేమ్–ఛేంజర్ ప్రాజెక్టులుగా భారత్ ఫ్యూచర్ సిటీతోపాటు రీజనల్ రింగ్రోడ్, రీజనల్ రింగ్ రైల్, మాన్యుఫాక్చరింగ్ జోన్లు, మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ – చైన్నై, హైదరాబాద్–బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు. 500 ఫార్చ్యూన్ కంపెనీలు రావాలి30 వేల ఎకరాల్లో హైదరాబాద్లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వా మ్యాన్ని ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయని.. మొత్తం 500 కంపెనీలూ పెట్టుబడులకు ముందుకొచ్చి ఫ్యూచర్ సిటీలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ‘చైనా+1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని.. అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి. సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
కాలిఫోర్నియా రాష్ట్ర సెలవుగా దీపావళి
న్యూయార్క్: అమెరికాలో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ మంగళవారం అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా ప్రవేశపెట్టిన బిల్లుపై సంతకం చేసి, దీపావళిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించారు. అక్టోబర్ 2024లో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన పెన్సిల్వేనియా మొదటి రాష్ట్రంగా నిలవగా, ఈ సంవత్సరం కనెక్టికట్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. న్యూయార్క్ నగరంలో పబ్లిక్ పాఠశాలలకు దీపావళిని సెలవుగా ప్రకటించారు. ‘భారతీయ అమెరికన్లు మరింత సాంస్కృతిక సమ్మిళితం, గుర్తింపు దిశగా సాగుతున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ఈ గుర్తింపు దీపావళి జీవకళనే కాదు, యునైటెడ్ స్టేట్స్లో భారతీయ అమెరికన్ల శాశ్వత ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తుంది’.. ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు, చైర్మన్ ఎంఆర్ రంగస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిల్లు సహ రూపకర్త అయిన అసెంబ్లీ సభ్యురాలు డాక్టర్ దర్శనా పటేల్ను అభినందించారు. -
వద్దు పొమ్మంటే ఎవరికి నష్టం..
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేయడం లేదా ఉన్న ఉద్యోగులను తిరిగి పంపించే నిర్ణయాలు స్వల్పకాలికంగా అమెరికన్ ఉద్యోగులకు మేలు చేస్తాయనే వాదనలున్నాయి. కానీ, దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచంలో ఆ దేశ పోటీతత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వలస వచ్చిన నిపుణులు (Immigrant professionals) అమెరికా ఆవిష్కరణకు మూల స్తంభాలుగా ఉన్నారు. పేటెంట్లు (Patents), సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (STEM) రంగాల్లో గ్రాడ్యుయేట్లు, వెంచర్ క్యాపిటల్-ఫండ్ పొందిన సంస్థల్లో కీలక స్థానాల్లో విదేశీ నిపుణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.వారంతా విరమించుకుంటే అమెరికన్ కంపెనీల్లో నైపుణ్యాల కొరత (Talent Crunch) ఏర్పడుతుంది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఆవిష్కరణ రేటు తగ్గి, ఉత్పాదకత దెబ్బతింటుంది. కొన్ని అంచనాల ప్రకారం, కఠినమైన వలస విధానాలు దీర్ఘకాలంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి (GDP)ని గణీనయంగా తగ్గించవచ్చు.శ్రామిక శక్తి పెరుగుదలపై ప్రతికూలతఅమెరికన్ స్థానిక జనాభా వయసు పెరుగుతున్న నేపథ్యంలో గత 20 ఏళ్లుగా శ్రామిక శక్తి వృద్ధికి (Labor Force Growth) వలసదారులు ప్రధాన చోదక శక్తిగా ఉన్నారు. 2000 నుంచి 2022 మధ్య 25-54 ఏళ్ల వయసున్న శ్రామికుల్లో దాదాపు మూడు వంతుల పెరుగుదలకు విదేశీయులే కారణం. కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు శ్రామిక శక్తి వృద్ధిని తగ్గిస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది.పోటీ దేశాలకు లాభంఅమెరికాలో ఉద్యోగం కోల్పోయిన లేదా ప్రవేశం దొరకని అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు (Highly Skilled Professionals) వేరే మార్గాలను అన్వేషిస్తారు. ఈ సమయంలో కెనడా, జర్మనీ వంటి దేశాలు వీరికి స్వాగతం పలుకుతున్నాయి. అమెరికా కోల్పోయిన ఈ మేధాసంపత్తి (Talent) ఇతర దేశాలకు బదిలీ అవుతుంది. తద్వారా ఆ దేశాల ఆవిష్కరణ, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. అమెరికాను కాదని ఇతర దేశాలకు వెళ్లే వలసదారులు అక్కడ వ్యాపారాలను స్థాపిస్తారు. వినియోగాన్ని పెంచుతారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
నోబెల్ వరించిన విషయం తెలియకుండానే..
కొన్ని సమయాల్లో ఊహకందని విధంగా అంతర్జాతీయ స్థాయి రేంజ్లో బహుమతి వరించినా..అది ఆ వ్యక్తికి తెలియకపోతే.. ఔను..! ఆ వ్యక్తి తెలుసుకునే పరిస్థితుల్లో లేకపోతే..అదృష్టం వచ్చి ఒళ్లో వాలినా..తెలుసుకోలేకపోవడం అంటే..అంతకుమించిన దురదృష్టం మరొకటి ఉండదేమో కదూ. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ శాస్త్రవేత్త. చివరికి అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. పైగా తనకు ఈ బహుమతి వస్తుందని అస్సలు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ శాస్త్రవేత్తే అమెరికాకు చెందని ఇమ్యునాలజిస్ట్ ఫ్రెడ్ రామ్స్డెల్. అతను డిజిటల్ డిటాక్స్ కోసం తన భార్యతో కలిసి అడవిలో సేద తీరుతున్నాడు. అలా అక్కడి పరిసరాలతో మమేకమవుతుండగా భార్య ఒక్కసారిగా పట్టరాని ఆనందంతో ఎగిరిగంతేసింది. అది చూసి రామ్స్డెల్ అడివిలో ఉండే ఎలుగుబంటులను చూసి భయపడింది కాబోలు అనుకున్నాడు. తర్వాత ఆమె అసలు విషయం చెప్పడంతో పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అస్సలు ఇది ఊహించలేదంటూ రామ్స్డెల్ సంబరపడ్డట్లు నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్ థామస్ పెర్లమాన్ పేర్కొన్నారు. అమెరికాలోని మోంటాన పర్వత శ్రేణుల్లో ఎంజాయ్ చేస్తున్నా ఆ జంట ఈ విషయం తెలిసిన వెంటనే హోటల్కు చేరుకుని నేరుగా న్యూయార్క్ టైమ్స్తో కాసేపు ముచ్చటించారు. తాను కచ్చితంగా నోబెల్ బహుమతి గెలుచుకుంటానని అస్సలు అనుకోలేదని, అస్సలు తాను పరిశోధన చేసిన విషయాన్నే మర్చిపోయానంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు రామ్స్డెల్. ఇక రామ్స్ డెల్కి రోగ నిరోధక వ్యవస్థ పనితీరుపై చేసిన ఆవిష్కరణలకు గానూ ఈ నోబెల్ బహుమతి వరించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతిని రామ్స్డెల్ సీటెల్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన మేరీ బ్రంకో, జపాన్లోని ఒసాకా విశ్వవిద్యాలయానికి చెందిన షిమోన్ సకాగుచిలతో పంచుకున్నారు. అంటే ఈముగ్గురికి 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ (భారత కరెన్సీ ప్రకారం..సుమారు రూ 11కోట్లు పైనే) నగదు లభిస్తుంది. కాగా రామ్స్డెల్ రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషించే టీ కణాలకు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ ఈ ప్రతిష్టాత్మకమైన బహుమతిని పొందారు. ఇక్కడ టీ కణాలు అనేవి ఎముక మజ్జలో ఉత్పత్తి అయ్యే తెల్ల రక్త కణాలు. ఇది శరీరంపై దాడి చేసే సూక్ష్మ జీవులను గుర్తించడానికి, లేదా కేన్సర్ కణాలను చంపడానికి సహాయపడతాయట. వాటిని తరుచుగా సెక్యూరిటీ గార్డ్లుగా వ్యవహరిస్తారు పరిశోధకులు. ఇక నోబెల్ కమిటీ సెక్రటరీ పెర్లమాన్ మిగతా ఇద్దరు పరిశోధకులు టచ్లో ఉన్నారని, కానీ ఈ 65 ఏళ్ల రామ్స్డెల్ని సంప్రదించలేకపోయానని చెప్పుకొచ్చారు. ఆయన తన ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో ఉంచడంతో సంప్రదించడం కష్టమైందని, అందువల్ల ఆయన భార్యకు సమాచారం అందించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇలా నోబెల్బహుమతి గెలుచుకున్న విజేతలను సంప్రదించడంలో ప్రతిసారి తమకు చాలా నిరాశ ఎదురవ్వుతోందని కమిటీ వాపోయింది. గతంలో సంగీతకారుడు బాబ్ డిలన్ విషయంలో రోజుల తరబడి సమయం పట్టిందని, మరొకరు ఈ బహుతిని గెలుచుకున్న రోజుల వ్యవధిలో మరణించారని నోబెల్ కమిటీ వెల్లడించింది.డిజిటల్ డిటాక్స్ అంటే..డిజిటల్ పరికరాల (స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు వంటివి) అన్నింటికి ఉద్దేశపూర్వకంగా విరామం ఇచ్చి..తోటి వ్యక్తులతో, పరిసరాలతో కనెక్ట్ అవ్వడాన్ని డిజిటల్ డిటాక్స్ అంటారు. ఇది ఒత్తిడిని, నిద్ర సమస్యలను దూరం చేయడమే గాక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. (చదవండి: సమోసాలు అమ్మి..పిల్లలను డాక్టర్లుగా చేసిన తండ్రి..! ఏడు సార్లు ఫెయిలైనా..) -
పెర్ఫ్యూమ్ తెచ్చిన తంటా....తీవ్ర ఆందోళనలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ
ఒక చిన్న పొరపాటుతో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఇబ్బందులు పాలయ్యాడు. అమెరికాలోని బెంటన్లో తన అమెరికన్ భార్యతో నివసిస్తున్న కపిల్ రఘును పెర్ఫ్యూమ్ బాటిల్ కారణంగా అర్కాన్సాస్లో అరెస్ట్ చేశారు. వీసాను రద్దు చేశారు. దీంతో అతని దేశ బహిష్కరణ తప్పదేమో అనే ఆందోళనలో కుటుంబం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.ఫుడ్ డెలివరీ డ్రైవర్గా పనిచేసే రఘు అనే 32 ఏళ్ల వ్యక్తిని మే 3న బెంటన్ పోలీసులు చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా చేసిన తనిఖీల్లో దొరికిన పెర్ఫ్యూమ్ బాటిల్ పెద్ద దుమారాన్నే రేపింది. రఘు కారు సెంటర్ కన్సోల్లో "ఓపియం" (నల్లమందు) అని రాసి ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్ను కనుగొన్నారు. అందులో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు అనుమానించారు. అది కేవలం పెర్ఫ్యూమ్ అని రఘు పదే పదే వివరణ ఇచ్చినా, పోలీసులు విశ్వసించలేదు. చివరికి రఘుని అరెస్టు చేశారు. అప్పటినుంచి అతనికి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. చట్టపరమైన, ఇమ్మిగ్రేషన్ సంక్షోభానికి దారితీసింది. వీసాను రద్దు చేయడంతో మరింత ఆందోళన నెలకొంది.చదవండి: నో అన్న రెండేళ్లకే గూగుల్ ఇండియా కీలక బాధ్యతలు, ఎవరీ రాగిణీ?మరోవైపు అర్కాన్సాస్ స్టేట్ క్రైమ్ ల్యాబ్ తదుపరి పరీక్షలో ఆ పదార్థం హానికరం కాదని , మాదకద్రవ్యాలు లేవని నిర్ధారించారు. అయినప్పటికీ, రఘు ఇప్పటికే మూడు రోజులు సెలైన్ కౌంటీ జైలులో గడిపాడు.మే 20న జిల్లా కోర్టు మాదకద్రవ్యాల కేసును కొట్టివేసిన తర్వాత ,ఈలోపు రఘు వీసా గడువు ముగిసిందంటూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, లూసియానాలోని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తరలించి, 30 రోజుల పాటు నిర్బంధించారని రఘు న్యాయవాది మైక్ లాక్స్ వెల్లడించారు.దీనిపై బాధితుడు రఘు తీవ్ర ఆందోళన వ్యక్తంచే శారు. తన భార్య యాష్లీ మేస్, మొత్తం భారాన్ని మోస్తోందని, కోర్టు ఖర్చులు, భరించడం కష్టం మారిందని వాపోయారు. ఈ జంటకు ఈ ఏప్రిల్లో వివాహం అయింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయానికి రాసిన లేఖలో, రఘు తన వీసాను తిరిగి పొందాలని విజ్ఞప్తి చేశాడు. కపిల్ రఘు విడుదల అయినప్పటికీ, @బహిష్కరణ' (deportation) స్టేటస్లో ఉంటాడని, మరింత ముఖ్యంగా, ఇది అతను పని చేయకుండా ,డబ్బు సంపాదించకుండా నిరోధిస్తుందని ఇది మరింత ఆందోళన కరమని న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే తన భర్తను నిర్దోషిగా బయటకొచ్చే క్రమలో అయ్యే ఖర్చుల కోసం భార్య ఆన్లైన్లో విరాళాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
Nobel Prize 2025: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్హోమ్: 2025 ఏడాదికిగాను నోబెల్ పురస్కారాల్లో భాగంగా భౌతిక శాస్త్రంలో చేసిన విశేష కృషికి ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టిన్, మైఖేల్ హెచ్ డెవొరెట్లకు నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. క్వాంటమ్ మెకానిక్స్ పరిశోధనలకు గాను వీరు ఈ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలకు ఎంపికయ్యారు.వీరి పరిశోధన ఏమిటి?"మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, విద్యుత్ సర్క్యూట్లో శక్తి పరిమాణీకరణ" అనే అంశంపై చేసిన విప్లవాత్మక ప్రయోగాలకు ఈ పురస్కారాలు లభించాయి. ఈ పరిశోధనల ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్ను చేతిలో పట్టుకునేంత చిన్న చిప్లో చూపించగలిగారు. విద్యుత్ సర్క్యూట్లో క్వాంటమ్ టన్నెలింగ్, శక్తి స్థాయిల పరిమాణీకరణను స్పష్టంగా నిరూపించారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సెన్సార్లు, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు తెరలేపింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల్లో జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టిన్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కాగా, హెచ్ డెవొరెట్ ఫ్రాన్స్కు చెందిన శాస్త్రవేత్త. క్వాంటమ్ మెకానిక్స్ ఆవశ్యకత..గ్రహాలు, నక్షత్రాలు తదితరాలతో కూడిన విశాల విశ్వాన్ని సాధారణ భౌతికశాస్త్రంతో వివరించవచ్చు కానీ... ప్రొటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్తలో కూడిన అణు ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు క్వాంటమ్ మెకానిక్స్ అవసరం అవుతుంది. ఎనర్జీ క్వాంటిజేషన్, టన్నెలింగ్లు అట్లాంటి అణుస్థాయి కార్యకలాపాలు. శక్తి ఒక ప్రవాహం మాదిరిగా కాకుండా స్థాయుల్లో ఉంటుందని ఎనర్జీ క్వాంటిజేషన్ చెబుతుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణను పరిశీలిద్దాం.. ఇంట్లోని బల్బు వెలుగును క్రమేపీ తగ్గించేందుకు డిమ్మర్ను ఉపయోగిస్తూంటారు కదా.. అచ్చం అలాగే శక్తిని కూడా నెమ్మదిగా హెచ్చుతగ్గులకు గురవుతుందన్నమాట. దీన్నే ఎనర్జీ క్వాంటిజేషన్ అంటారు. అయితే అణుస్థాయిలో ఇలా ఉండదు. శక్తి అనేది మెట్లు ఎక్కినట్లు దశలు, దశలుగా ఉంటుంది. ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతలు ఈ ఎనర్జీ క్వాంటిజేషన్ను కూడా అరచేతిలో పట్టేంత, పూర్తిగా నియంత్రితమైన వ్యవస్థల్లోనూ చూపగలిగారు.క్వాంటమ్ స్థాయి ప్రవర్తన అన్నది అణుస్థాయికి మాత్రమే పరిమితం కాదని నిరూపించడం ఈ ఆవిష్కరణ విశేషం. ఈ ఆవిష్కరణ ఆధారంగా అత్యధిక వేగంతో పనిచేయగల క్వాంటమ్ కంప్యూటర్లకు కీలకమైన క్యూబిట్లను తయారు చేసే వీలేర్పడింది. గూగూల్, ఐబీఎంలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సూపర్ కండక్టింగ్ క్యూబిట్లు ఈ ఆవిష్కరణ ఆధారంగా తయారయ్యాయి. కంప్యూటింగ్ అంటే లెక్కలు వేసేందుకు ఈ క్యూబిట్లలో ఎనర్జీ క్వాంటిజేషన్, టన్నెలింగ్ వంటివి ఆధారమవుతాయి.అంతేకాదు.. ఈ ఆవిష్కరణ సాయంతో అత్యంత సున్నితమైన క్వాంటమ్ సెన్సర్ల తయారీ వీలవుతుంది. ఎమ్మారై, అల్ట్రాసౌండ్ వంటి వైద్య పరీక్షలు మరింత వివరంగా స్పష్టంగా చేసే వీలేర్పడుతుంది. తద్వారా వ్యాధులను చాలా తొందరగా గుర్తించవచ్చు. నావిగేషన్, జియలాజికల్ సర్వేల్లోనూ ఈ సెన్సర్లను ఉపయోగించవచ్చు. స్పేస్ టెలిస్కోపులు, గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్లలో క్వాంటమ్ సెన్సర్ల వాడకం ద్వారా విశ్వం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. హ్యాకింగ్ వంటి సమస్యల్లేకుండా అత్యంత సురక్షితంగా సమాచారాన్ని పంపేందుకు అవసరమైన క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని అభివృద్ధి చేయవచ్చుఇదిలా ఉంచితే, నిన్న(సోమవారం, అక్టోబర్6) వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు ప్రకటించగా, ఈరోజు(మంగళవారం, అక్టోబర్(7) భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలును ప్రకటించారు. రేపు(బుధవారం, అక్టోబర్ 8) రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు ప్రకటించనున్నారు. ఆపై వరుసగా సాహిత్యం, శాంతి, ఆర్థికశాస్త్రాల్లో నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 10న, అల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా స్వీడన్లోని స్టాక్హోమ్, నార్వేలోని ఒస్లో నగరాల వేదికగా ఈ బహుమతులు అందజేస్తారు.ఇదీ చదవండి: వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ -
పాక్తో బలపడిన బంధం.. అమెరికాకు తొలి భూ ఖనిజాల ఎగుమతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్- అమెరికాల మధ్య బంధం బలపడుతోంది. తాజాగా పాకిస్తాన్- యునైటెడ్ స్టేట్స్లు అరుదైన భూ ఖనిజాల ఎగుమతి కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసే దిశగా ముందడుగు వేశాయని, దీంతో ఇరు దేశాల ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం నూతన దశలోకి ప్రవేశిస్తున్నదని వార్తా పత్రిక ‘డాన్’ పేర్కొంది. గత సెప్టెంబర్లో పాకిస్తాన్తో భూ ఖనిజాల ఎగుమతి కోసం అమెరికా ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది.ఈ స్ట్రాటజిక్ మెటల్స్ (యూఎస్ఎస్ఎం) ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ తొలిసారిగా ఖనిజ నమూనాలను అమెరికాకు పంపింది. పాకిస్తాన్లో ఖనిజ ప్రాసెసింగ్, అభివృద్ధి సౌకర్యాల ఏర్పాటుకు అమెరికన్ సంస్థ దాదాపు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధికి ఖనిజరంగం కీలకంగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ అరుదైన భూ ఖనిజాల రవాణాతో పాకిస్తాన్ మరో ముందడుగు వేసిందని వాషింగ్టన్ వర్గాలు పేర్కొన్నాయి.ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్డబ్యూఓ) సమన్వయంతో దేశీయంగా తయారైన ఈ ఖనిజంలో యాంటిమోనీ, రాగి సాంద్రత, నియోడైమియం, ప్రాసోడైమియం వంటి అరుదైన భూమి మూలకాలన్నాయి. యూఎస్ఎస్ఎం ఒక ప్రకటనలో ఈ రవాణాను పాకిస్తాన్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక మైలురాయిగా అభివర్ణించింది. ఈ ఒప్పందం అన్వేషణ, ప్రాసెసింగ్ మొదలుకొని పాకిస్తాన్ లోపల శుద్ధి కర్మాగారాల స్థాపన వరకు అభివృద్ధి చెందనుంది. ఈ రంగంలో ఇరు దేశాల సహకారం కోసం ఒక రోడ్మ్యాప్కు రూపకల్పన చేయనున్నారు. ఈ సందర్భంగా యూఎస్ఎస్ఎం సీఈఓ స్టేసీ డబ్ల్యూ హాస్టీ మాట్లాడుతూ ఈ మొదటి డెలివరీ.. యూఎస్ఎస్ఎం, పాకిస్తాన్ల ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ మధ్య సహకారానికి సంబంధించిన నూతన అధ్యాయాన్ని తెరుస్తుందన్నారు.‘డాన్’ పేర్కొన్న వివరాల ప్రకారం ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ప్రపంచంలోని కీలక ఖనిజాల మార్కెట్పై పట్టు సాధించగలదు. ఆర్థిక పరిపుష్టిని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇదిలావుండగా పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఈ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పీటీఐ సమాచార కార్యదర్శి షేక్ వక్కాస్ అక్రమ్ దీనిపై స్పందిస్తూ పాక్ ప్రభుత్వం వాషింగ్టన్తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లుందని, ఒప్పందపు పూర్తి వివరాలను బహిరంగంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఒప్పందాలు దేశంలో ఇప్పటికే ఉన్న అస్థిర పరిస్థితిని మరింత రెచ్చగొడతాయని అక్రమ్ ఆరోపించారు. -
మరోసారి టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబ్(Trump Another Tariff) పేల్చారు. ఈసారి మధ్యస్థ, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ ట్రక్కులపై పెంచిన ఈ సుంకాలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. నవంబర్ 1వ తేదీ నుంచి మధ్యస్థ, భారీ వాణిజ్య ట్రక్కులపై అమెరికా 25% సుంకాలు వసూలు చేయనుంది. అమెరికాలో వాహనాల ఉత్పత్తిని ప్రొత్సహించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే.. అమెరికా-ఆధారిత భాగస్వామ్య దేశాలు, జాయింట్ వెంచర్లు ఈ టారిఫ్ నుంచి మినహాయింపు పొందే అవకాశం లేకపోలేదు. ఇక.. చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై ఈ లేటెస్ట్ టారిఫ్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ టారిఫ్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ విడి భాగాలు, ఉపకరణాలు (components) దిగుమతులపై కూడా టారిఫ్లు ఉంటే, ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్-ఆధారిత వ్యాపారాలపై ప్రభావం ఉండొచ్చు. భారత్ నుంచి అమెరికాకు ఈ తరహా ట్రక్కుల (Medium/Heavy-duty Trucks) దిగుమతులు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అంతగా ప్రభావం పడకపోవచ్చు. అయితే.. ఇక్కడి కంపెనీలు అమెరికా మార్కెట్లో ప్రవేశించాలనుకుంటే మాత్రం టారిఫ్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: నెల తిరగకముందే రాజీనామా చేసిన ప్రధాని! -
పసిడి హైజంప్!
న్యూఢిల్లీ: బంగారం ధర మరో రికార్డు గరిష్టానికి చేరింది. ఒక్క రోజే 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,700 ఎగిసి, ఢిల్లీ మార్కెట్లో సోమవారం రూ.1,23,300 సరికొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. వెండి సైతం కిలోకి రూ.7,400 పెరిగి మరో నూతన జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,57,400కు చేరింది. ముఖ్యంగా డాలర్తో రూపాయి బలహీనపడడం బంగారం ధరలకు ఆజ్యం పోసినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘బంగారం ధరలు సోమవారం నూతన ఆల్టైమ్ గరిష్టానికి చేరాయి. రికార్డు స్థాయి ధరల్లోనూ ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. బలమైన సానుకూల ధోరణితో బులియన్ ధరలు మరింత పెరుగుతాయన్నది వారి అంచనా. అమెరికా ప్రభుత్వం ఎక్కువ రోజుల పాటు షట్డౌన్ కావడం ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందన్న ఆందోళనలు సైతం తాజా డిమాండ్కు తోడయ్యాయి’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్కు 85 డాలర్లు ఎగసి 3,994 డాలర్లకు కొత్త రికార్డును తాకింది. వెండి ఔన్స్కు 1% పెరిగి 48.75 డాలర్ల స్థాయిని తాకింది. ‘యూఎస్ ప్రభుత్వం షట్డౌన్ ఆరో రోజుకు చేరుకుంది. దీంతో బంగారం సరికొత్త గరిష్టాలను చేరింది’ అని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కేనత్ చైన్వాలా తెలిపారు. నాన్ స్టాప్ ర్యాలీ...ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఇప్పటి వరకు ఆగకుండా ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. 2024 డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.78,950 వద్ద ఉంది. అక్కడి నుంచి చూస్తే నికరంగా రూ.44,350 పెరిగింది. వెండి ధర సైతం ఈ ఏడాది ఇప్పటి వరకు 75 శాతం ర్యాలీ (కిలోకి నికరంగా రూ.67,700) చేసింది. గత డిసెంబర్ చివరికి కిలో ధర రూ.89,700 వద్ద ఉండడం గమనార్హం. ‘‘2025సంవత్సరం ఎన్నో అనిశ్చితులకు కేంద్రంగా ఉంది. మొదట రాజకీయ ఉద్రిక్తతలు, ఆ తర్వాత సుంకాల పరమైన అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, రేట్ల కోతపై అస్పష్టత, ఇప్పుడు యూఎస్ ప్రభుత్వం షట్డౌన్. వీటన్నింటితో సురక్షిత సాధనమైన బులియన్ ధరలు ఈ ఏడాది దూసుకెళ్లాయి. డాలర్ బలహీనత, సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుండడం, గోల్డ్ ఈటీఎఫ్లకు పెరుగుతున్న డిమాండ్, హెడ్జింగ్ సాధనంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం డిమాండ్ పెరగడం ధరల ర్యాలీకి కారణం. -
వివాదాస్పదంగా మారిన యూనైటెడ్ స్టేట్స్ మింట్ నిర్ణయం
-
ట్రంప్ నాణెంపై వివాదం
వాషింగ్టన్: ప్రపంచంలో నేడు అగ్రరాజ్యంగా గౌరవం అందుకున్న అమెరికాకు 1776 జూలై 4న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం లభించింది. స్వతంత్ర అమెరికాకు వచ్చే ఏడాది నాటికి 250 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వేడుకలకు అమెరికా ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మారక నాణేన్ని ముద్రించి విడుదల చేయాలని యునైటెడ్ స్టేట్స్ మింట్(టంకశాల) నిర్ణయించింది. ఒక డాలర్ విలువ కలిగిన ఈ నాణెంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని ముద్రిస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే, చాలామంది ఈ విషయం నమ్మలేదు. ట్రంప్తో కూడిన నమూనా నాణెం చిత్రాన్ని యూఎస్ ట్రెజరీ విడుదల చేయడంతో అనుమానాలకు తెరపడింది. ట్రంప్ ముఖం కలిగిన ఒక డాలర్ కాయిన్ రావడం అనేది ఫేక్ న్యూస్ కాదని, ముమ్మాటికీ నిజమని ట్రెజరర్ బ్రాండన్ బీచ్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నమూనా నాణెం సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారింది. అమెరికా స్వతంత్ర దేశంగా మారి 250 ఏళ్లు పూర్తికానుండడం ప్రాధాన్యత కలిగిన సందర్భమని, అందుకే తమ అధ్యక్షుడి చిత్రంతో కూడిన స్మారక నాణేన్ని విడుదల చేయబోతున్నామని స్పష్టంచేశారు. దీనిపై త్వరలో మరిన్ని వివరాలు పంచుకుంటానని పేర్కొన్నారు. నాణెంపై ట్రంప్ పోరాట పటిమ కొత్త నాణెంపై అమెరికాలో చర్చ మొదలైంది. నమూనా నాణెంపై ఒక వైపు ట్రంప్ ముఖం కనిపిస్తోంది. పైభాగంలో లిబర్టీ (స్వేచ్ఛ) అనే పదం ముద్రించారు. కిందిభా గంలో ఇన్ గాడ్ వుయ్ ట్రస్ట్(మనం నమ్మే దేవుడి సాక్షిగా) అనే పదాలు కనిపిస్తున్నా యి. మధ్యలో 1776, 2026 సంవత్సరాలను ముద్రించారు. ఇక రెండోవైపు ట్రంప్ పిడికిలి బిగించిన చిత్రం ఉంది. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. తాను పోరాటం ఆపబోనని పిడికిలి బిగించి నినదించారు. ఈ సందర్భాన్ని గుర్తుచేస్తూ నాణెంపై ఫైట్, ఫైట్, ఫైట్ అనే పదాలకు స్థానం కల్పించారు. అంతేకాకుండా ట్రంప్ వెనుకభాగంలో రెపరెపలాడుతున్న అమెరికా జాతీయ జెండా కనిపిస్తోంది. కాయిన్ రీడిజైన్ చట్టానికి ఆమోదం సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ నాణెన్ని ముద్రిస్తారా? లేక మార్పులేమైనా చేస్తారా? అనేది ఇంకా తెలియరాలేదు. సోషల్ మీడియా చిత్రాన్ని ట్రంప్ అభిమానులు రూపొందించి ఉంటారని తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం చూస్తే ప్రస్తుతం పదవిలో ఉన్న అధ్యక్షుడు లేదా జీవించి ఉన్న మాజీ అధ్యక్షుడి చిత్రాన్ని నాణెంపై ముద్రించడానికి వీల్లేదు. మరణించాక రెండేళ్ల తర్వాత మాత్రమే ముద్రించవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ చిత్రంతో ప్రత్యేక కాయిన్ తీసుకురావాలని మింట్ నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా కాంగ్రెస్ ఇటీవల కాయిన్ రీడిజైన్ యాక్ట్ను ఆమోదించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఒక డాలర్ నాణెన్ని ముద్రించడానికి ట్రెజరీకి అనుమతి మంజూరు చేసింది. 2026 జనవరి 1 నుంచి ఏడాది కాలంపాటు ఒక డాలర్ నాణెలను ముద్రించవచ్చని పేర్కొంది. అయితే, వీటిపై జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తుల తల గానీ, భుజం గానీ, భుజం పైభాగం నుంచి జట్టు వరకు గానీ ఉండడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అయితే, చట్టాన్ని ఉల్లంఘించని విధంగా ట్రంప్ చిత్రంతో కొత్త కాయిన్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తుది డిజైన్ను ట్రెజరీ ఇంకా ఆమోదించలేదని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పదవిలో ఉండగానే అమెరికా నాణెంపై చోటు దక్కించుకున్న ఏకైక అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్. 1926లో ఆయన చిత్రంతో కాయిన్ ముద్రించారు. -
అమెరికాకు.. స్టెమ్ భారతీయులే!
హెచ్ –1బీ వీసా దరఖాస్తుకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలంటూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ విద్యార్థులందరినీ షాక్కి గురిచేసింది. దాన్నుంచి తేరుకోకముందే.. అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్లో ఇటీవల మరో బిల్లును ప్రవేశపెట్టింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను పూర్తిగా ఎత్తేయడమే దీని ఉద్దేశం. ఇదే నిజమైతే.. ఔత్సాహిక భారతీయ విద్యార్థుల పాలిట ఇది మరో శరాఘాతం కానుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ( స్టెమ్) విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.గ్రాడ్యుయేషన్స్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత బిల్లును కాంగ్రెస్లో ప్రవేశపెట్టింది కూడా. ఇది ఇప్పుడు అక్కడి విదేశీ విద్యార్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఎఫ్ –1 వీసాపై అమెరికాలో ఉండే విదేశీ విద్యార్థులు తమ చదువు / విభాగానికి సంబంధించిన రంగంలోని కంపెనీల్లో పనిచేయవచ్చు.తమ కోర్సులో భాగంగానూ, డిగ్రీ పూర్తి చేశాక కూడా ఓపీటీ కింద ఆయా కంపెనీల్లో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యార్థులకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. ఇప్పుడు ఓపీటీనే ఎత్తేస్తే.. డిగ్రీ పూర్తయ్యాక వెంటనే అక్కడ ఉద్యోగం వస్తే ఫర్వాలేదు, లేదంటే తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఇలా 2024లో ‘ఓపీటీ’ వర్క్ పర్మిట్లు పొందిన విదేశీ విద్యార్థుల సంఖ్య 1,94,554 కాగా, కొత్తగా స్టెమ్ – ఓపీటీ అనుమతులు పొందినవారి సంఖ్య 95,384.అనుభవం.. అవకాశాలు!చాలామంది భారతీయులు ప్రత్యేకించి స్టెమ్ విభాగాల్లోని వారు.. హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేముందు ప్రాక్టికల్ అనుభవం కోసం ఓపీటీని ఉపయోగించుకునేవారు. ఇకమీదట ఆ అవకాశం ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓపీటీ అనేది కాలేజీ చదువు పూర్తిచేసే విద్యార్థులకు ఉద్యోగార్జనలో ఒక వారధిగా ఉపయోగపడింది. అమెరికాలో ఓపీటీ చేస్తున్న మొత్తం విద్యార్థుల్లో భారతీయలు 2006–07లో 22.12 శాతం కాగా, 2023–24 నాటికి ఇది 40.18 శాతానికి పెరిగింది.‘స్టెమ్’ మీద దెబ్బఅమెరికా ప్రభుత్వ నిర్ణయం.. ఆ దేశ ‘స్టెమ్’ శ్రామికశక్తికి వెన్నెముక లాంటి భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 2024లో హెచ్ –1బీ వీసా పొందిన వారిలో 70 శాతం మంది భారతీయులే. అమెరికా అవసరాలకు సరిపడా వృత్తి ఉద్యోగ నిపుణులు అక్కడ లేరు. విదేశాల నుంచి ప్రధానంగా భారతీయ స్టెమ్ నిపుణులు అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. అమెరికాలోని స్టెమ్ కార్మికులు / ఉద్యోగుల్లో విదేశీయుల శాతం రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. 2000లో 16.4 శాతం నుంచి 2019 నాటికి 23.1 శాతానికి పెరిగింది. 2019 నాటికి అమెరికాలోని స్టెమ్ ఉద్యోగుల్లో అత్యధికంగా 28.9 శాతం భారతీయులే. ప్రతి నలుగురిలో ముగ్గురు..: 2023–24లో అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. ఇందులో కూడా ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులు స్టెమ్ కోర్సులు చదువుతున్నవారే. స్టెమ్ కోర్సుల్లోనూ మనవాళ్లే అధికం కావడం విశేషం. -
అరేబియా తీరంలో అమెరికా ఓడరేవు!
ఇస్లామాబాద్: అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరాటపడుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో స్నేహానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అరేబియా సముద్రం తీరంలో పాక్ భూభాగంలో భారీ ఓడరేవు(పోర్టు) నిర్మించి, నిర్వహించాలని తాజాగా ట్రంప్కు విజ్ఞప్తి చేసింది. బలూచిస్తాన్లో గ్వాదర్ జిల్లాలోని పాస్నీ పట్టణంలో ఈ పోర్టు నిర్మించాలని కోరింది. ఇరాన్ భూభాగంలో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు సమీపంలోనే పాస్నీ టౌన్ ఉండడం గమనార్హం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సలహాదారులు ఇటీవల అమెరికా సీనియర్ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది. పాస్నీలో ఓడరేవు కోసం ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ పట్టణం ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. వ్యూహాత్మకంగా కీలకమైనది. ఇప్పటికే రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారం పాస్నీ పోర్టులో అమెరికా ప్రభుత్వం ఒక టర్మినల్ నిర్మించి, నిర్వహించనుంది. పాకిస్తాన్లోని అరుదైన ఖనిజాలను ఇక్కడి నుంచే అమెరికాకు చేరవేస్తారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ గత నెలలో వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. పాకిస్తాన్లో మైనింగ్, ఇంధన రంగాల్లో పెట్టుబడులకు పెట్టాలని ఈ సందర్భంగా అమెరికా కంపెనీలను ఆహ్వానించారు. పాకిస్తాన్లో ఉన్న విలువైన ఖనిజ సంపద గురించి ట్రంప్కు అసిమ్ మునీర్ ప్రత్యేకంగా వివరించారు. చెక్క పెట్టెలో తీసుకొచ్చిన కొన్ని నమూనాలు కూడా చూపించారు. రక్షణ, సాంకేతిక అవసరాల కోసం పాకిస్తాన్తో కలిసి ఖనిజాలను గుర్తించి, వెలికితీయడం కోసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి అమెరికా మెటల్స్ కంపెనీ ముందుకొచ్చింది. పాస్నీలోని పోర్టు నిర్మాణం కోసం అమెరికాను పాక్ సర్కార్ కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. పాస్నీ పోర్టు నుంచి ఖనిజ సంపద ఉన్న పశ్చిమ ప్రావిన్స్ల దాకా రైలు మార్గాన్ని అమెరికా నిధులతో నిర్మించాలన్నదే పాక్ ఉద్దేశం. ఈ ప్రాంతం ఇరాన్కు, దక్షిణాసియాకు దగ్గరగా ఉండడం కలిసొచ్చే అంశం. ఇక్కడ పాగా వస్తే అరేబియా సముద్రంతోపాటు మధ్య ఆసియాలో అమెరికా ప్రాబల్యం విస్తరిస్తుంది. అమెరికాకు వాణిజ్య అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే, సైనిక అవసరాల కోసం ఈ పోర్టును ఉపయోగించుకోవడానికి వీల్లేదు. గ్వాదర్లో చైనా ఇప్పటికే ఒక పోర్టును పాక్ సాయంతో నిర్వహిస్తోంది. గ్వాదర్కు 100 కిలోమీటర్ల దూరంలో పాస్నీ ఉంది. ఇక్కడ ఓడ రేవు నిర్మించాలంటూ చైనా ప్రత్యర్థి దేశమైన అమెరికాను పాక్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు 300 కిలోమీటర్ల దూరంలో అమెరికా పోర్టు రానుంది. ఈ ఓడరేవు భారత్కు కీలకం. పాకిస్తాన్తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియాకు నౌకలు రాకపోకలు సాగించవచ్చు. చాబహర్ కోసం 2024లో భారత్, ఇరాన్లు ఒప్పందంపై సంతకాలు చేశాయి. -
Gaza Issue: డొనాల్డ్ ట్రంప్పై ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ: గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి కోసం 20 సూత్రాల ప్రణాళికకు హమాస్ ఒప్పుకోవడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారన్నారు. ‘గాజా వివాదాన్ని అంతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను మేము స్వాగతిస్తున్నాము. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు, అలాగే విస్తృత పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతలు ఏర్పడటానికి , ఇది ఆ దేశాల అభివృద్ధికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తుంది’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవకు సంబంధిత వారందరూ కలిసి వస్తారని, ఏళ్ల తరబడి సాగుబడి సాగుతున్న సంఘర్షణను అంతం చేయడానికి, శాంతిని స్థాపించే ఈ ప్రయత్నానికి మద్దతు ఇస్తారని మేము ఆశిస్తున్నాము’ అని మోదీ తన పోస్ట్లో పేర్కొన్నారు. We welcome President Donald J. Trump’s announcement of a comprehensive plan to end the Gaza conflict. It provides a viable pathway to long term and sustainable peace, security and development for the Palestinian and Israeli people, as also for the larger West Asian region. We…— Narendra Modi (@narendramodi) September 30, 2025 కాగా, గాజాలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన గడువులోగా ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు. హమాస్కు ఆదివారం వరకూ గడువు ఇవ్వగా, వారు ముందుగానే ఒప్పుకోవడం గమనార్హం.ట్రంప్ ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు -
అమెరికా-పాక్లు! నాకు నువ్వు.. నీకు నేను!
ప్రస్తుతం అమెరికా-పాకిస్తాన్ల మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత వీరి స్నేహ బంధం బలపడుతూ వచ్చింది. ప్రపంచ దేశాలపై విపరీతమైన సుంకాలు విధిస్తూ అమితానందాన్ని పొందుతున్న ట్రంప్.. పాకిస్తాన్ విషయంలో ఆచితూచి అడుగలు వేస్తున్నారు. భారత్తో ఉన్న బంధాన్ని కాలరాసుకున్న ట్రంప్.. ఇక చేసేది లేక పాక్తో మాత్రం జబ్బలు రాసుకుంటూ తిరుగుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ను అమెరికా పర్యటనలకు పలుమార్లు పిలవడమే ఇందుకు ఉదాహరణ. గత నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం.. డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరు భేటీలో ఏం జరిగిందనేది బయటకు చెప్పకపోయినా.. భారత్ గురించి కచ్చితంగా వీరి మధ్య ప్రస్తావన వచ్చే ఉంటుందనే విషయాన్ని ఊహించుకోవచ్చు. అయితే కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ను పొగడ్తలతో ముంచెత్తారు ట్రంప్. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశ నాయకులు చేస్తున్న కృషి అమోఘం అంటూ కొనియాడారు. అయితే దీనిపై పాకిస్తాన్ తాజాగా స్పందించింది. ఇందులో తాము చేసేంది కాస్తే అయినా ట్రంప్ గాజాలో శాంతి కోసం చేస్తున్న కృషి వెలకట్టలేదని అంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రశంసించారు. గాజాలో శాంతి కోసం తమకు 20 పాయింట్లతో కూడిన ముసాయిదాను తమకు ట్రంప్ పంపారని, ఇందులో కొన్ని సరిచేసి పంపామన్నారు దార్.‘ట్రంప్ బహిరంగంగా ప్రకటించిన ఈ 20 అంశాలు మావి కావని నేను స్పష్టం చేశాను. ఇవి మావి కావు. మాకు సంబంధమున్న ముసాయిదాలో, కొన్ని మార్పులు చేసామని మాత్రమే నేను చెబుతున్నాను. ఈ క్రెడిట్ అంతా ట్రంప్దే’ అంటూ కొనియాడారు దార్.అయితే ఇరు దేశాల మైత్రి నెటిజన్లు కాస్త వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘నాక నువ్వు-నీకు నేను అన్నట్లుగా ఉంది మీ పరిస్థితి.అంటూ పలువురు స్పందించగా, ‘తాను మునిగి, మిగతా వారిని కూడా ముంచుతున్న ట్రంప్తో పాక్ మైత్రి బాగుంది బ్రదర్’ అంటూ మరొకరు కౌంటరిచ్చారు. -
కత్తి ఇవ్వలేదని.. డైరెక్టర్ని ఉద్యోగం నుంచి ఊడబీకిన ట్రంప్!
వాషింగ్టన్:అమెరికాలోని ప్రసిద్ధ ఐజెన్హవర్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ డైరెక్టర్ జాన్ హెన్రీను ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా పదవి నుంచి తొలగించింది. ఈ నిర్ణయానికి కారణం..బ్రిటన్ రాజు చార్లెస్కు ఓ విలువైన చారిత్రక కత్తిని బహుమతిగా ఇవ్వాలన్న ట్రంప్ ఆదేశాలను ఆయన తిరస్కరించడం. ఈ ఘటన అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన ఆ కత్తిని జాతీయ వారసత్వంగా భావించాల్సినదిగా జాన్ హెన్రీ అభిప్రాయపడ్డారు. ‘ఇది ప్రజల ఆస్తి. చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వస్తువు. దీన్ని బహుమతిగా ఇవ్వడం సరైనది కాదు’అంటూ ఆయన ట్రంప్ విజ్ఞప్తిని తిరస్కరించారు.అయితే, ట్రంప్ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు ఈ కత్తిని అమెరికా-బ్రిటన్ మధ్య స్నేహ బంధానికి ప్రతీకగా ఇవ్వాల్సిన బహుమతిగా పేర్కొన్నారు. కత్తి ఇవ్వండి, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని జాన్ హెన్రీకి హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నతాదికారులు ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. మ్యూజియంలో ఉన్న కత్తిని ట్రంప్కు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ట్రంప్ ఆదేశాల మేరకు ఆయన్ను పదవి నుంచి తొలగించారు. ఈ చర్యపై చరిత్రకారులు, మ్యూజియం నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చారిత్రక సంపదను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ వివాదంపై ఇప్పటివరకు ట్రంప్ లేదా బ్రిటన్ రాజు చార్లెస్ స్పందించలేదు. -
అమెరికాలోని ఒమాహా నగరంలో బతుకమ్మ వేడుకలు
తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఓమాహా నగరంలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ దేవాలయ సామాజిక భవనంలో జరిగిన ఈ వేడుకలకు తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అత్యంత వైభవంగా నిర్వహించడం ద్వారా తమ సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టడమే కాకుండా, తమ తల్లిదండ్రుల నేలతో గల అనుబంధాన్ని కొనసాగిస్తూ.. భవిష్యత్తు తరాలకు ఈ సంప్రదాయాలు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించారు. గత దశాబ్దానికి పైగా ఈ వేడుకలను అపర్ణ నేదునూరి, స్నిగ్ధ గంటా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు వెయ్యికి పైగా తెలుగు కుటుంబాలు, సంఘ సభ్యులు హాజరయ్యారు.ఈ ఉత్సవంలో సంప్రదాయకంగా అలంకరించిన రంగు రంగుల బతుకమ్మలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రతి బతుకమ్మను ప్రత్యేకంగా రూపొందించారు. సువాసనభరిత పూలతో అలంకరించారు. వీటిలో భక్తి, సృజనాత్మకత, తెలుగు వారసత్వం ప్రతిబింబించింది. రంగురంగులు, వినూత్నంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా విజేతగా నిలిచిన శ్రీదేవి నలం ఈసారి కూడా తన సృజనాత్మక అలంకరణతో మూడోసారి బహుమతి గెలుపొందారు. ఇది వేల మైళ్ళ దూరంలో ఉన్నా, తెలుగు సంప్రదాయాలను సజీవంగా నిలుపుకునే నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకలలో సంప్రదాయ తెలుగు వంటకాలు భోజన ప్రియుల నోరూరించాయి. పిల్లలు కూడా పండుగ వాతావరణంలో మునిగి తేలారు. నిజమైన తెలుగు సాంస్కృతిక అనుభవాన్ని ఆస్వాదించారు. -
భారత్తో వాణిజ్య సమతూకం!
మాస్కో: భారత్తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు అధినేత పుతిన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులను భారీగా పెంచుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని రష్యా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గిపోయి, వాణిజ్యంలో సమతూకం ఏర్పడేలా చర్యలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతులు పెంచాలని నిర్ణయించారు. గురువారం వాల్డాయ్ ప్లీనరీలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించబోతున్నానని, ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నానని వెల్లడించారు. ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సమతూకం కలిగిన, తెలివైన నాయకుడు అని కొనియాడారు. భారతదేశ ప్రయోజనాల కోసం మోదీ నిరంతరం శ్రమిస్తుంటారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందన్నారు. మోదీతో సమావేశమైనప్పుడు తాను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు సహకరించడం మానుకోవాలని అమెరికాను పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. #BREAKING: Russian President Putin at Valdai Club in Sochi on Trump Tariffs, says, “Indian people will look at what decisions are made by their political leadership. Indian people will never accept any humiliation. I know PM Modi, he will never take any steps of the kind.” pic.twitter.com/2GYqoVK1PO— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 2, 2025స్వప్రయోజనాలు దెబ్బతింటే భారత్ సహించదుభారతదేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా టారిఫ్లు విధించడాన్ని పుతిన్ తప్పుపట్టారు. దేశ స్వప్రయోజనాలు, ప్రాధాన్యతల కోణంలోనే భారతీయులు నిర్ణయాలు తీసుకుంటారని, వాటిని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారు సహించబోరని తేల్చిచెప్పారు. అమెరికా విధిస్తున్న టారిఫ్ల కారణంగా వాటిల్లుతున్న నష్టాన్ని రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్ భర్తీ చేసుకుంటోందని అన్నారు. అదేసమయంలో ఒక సార్వ¿ౌమ దేశంగా ప్రతిష్టను కాపాడుకుంటోందని ప్రశంసించారు. భారత్ నుంచి దిగుమతులు పెంచుకుంటామని, వ్యవసాయ ఉత్పత్తులతోపాటు ఔషధ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ అధికంగా కొనుగోలు చేస్తామని ఉద్ఘాటించారు. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. ఫైనాన్సింగ్, లాజిస్టిక్స్తోపాటు చెల్లింపుల్లో కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. భారత్, రష్యాలు ఏనాడూ ఘర్షణ పడలేదని, భవిష్యత్తులోనూ అలాంటిది తలెత్తే అవకాశమే లేదని పుతిన్ తేల్చిచెప్పారు. భారతీయ సినిమాలంటే ఇష్టం భారతీయ సినిమాలు వీక్షించడం తనకు ఎంతో ఇష్టమని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ సినిమాలకు రష్యాలో విశేషమైన ఆదరణ లభిస్తోందని చెప్పారు. భారతీయ సినిమాలను రోజంతా ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ చానల్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు దేశాల నడుమ రాజకీయ, దౌత్య సంబంధాలే కాకుండా సాంస్కృతిక, మానవీయ బంధాలు కూడా బలంగా ఉన్నాయని గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి అంటే రష్యన్లకు ఎంతో అభిమానం అని వ్యాఖ్యానించారు. చాలామంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుకుంటున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: పాక్ పరువు.. మళ్లీ పాయే! -
ఖతార్ భద్రత మా బాధ్యత.. ఉత్తర్వులపై ట్రంప్ సంతకం
దుబాయ్: ఖతార్ భద్రత తమ బాధ్యతని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖతార్ రక్షణకు అవసరమైతే సైనిక పరంగా సాయమందిస్తామని స్పష్టం చేస్తూ తాజాగా ఆయన ఓ ఉత్తర్వు జారీ చేశారు. సోమవారం దీనిపై సంతకం చేయగా బుధవారం వైట్ హౌస్ వెబ్సైట్లో కనిపించింది. అయితే, దీనిపై అమెరికా ఏ మేరకు కట్టుబడి ఉంటుందన్నది స్పష్టం కావాల్సి ఉంది.గాజాలో కాల్పుల విరమణపై చర్చలు జరిపేందుకు ఖతార్ ఉన్న హమాస్ నేతలపై ఇటీవల ఇజ్రాయెల్ అనూహ్యంగా దాడికి దిగడం తెల్సిందే. సోమవారం వైట్ హౌస్లో ట్రంప్తో చర్చలు జరిపిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆయన సమక్షంలోనే ఖతార్ నాయకత్వానికి క్షమాపణ చెప్పడం తెలిసిందే.🚨⚡️BREAKING AND UNUSUALPresident Trump officially signs an executive order that makes any attack on Qatar a threat to the security of the United States!The White House confirms: "The measures include diplomacy, economics, and even military."-: Something is happening here..… pic.twitter.com/lGEsILidhO— RussiaNews 🇷🇺 (@mog_russEN) October 1, 2025తాజాగా, ఖతార్కు మద్దతుగా ట్రంప్.. సన్నిహిత సహకారం, ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా ఖతార్ ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు, బయటి నుంచి జరిగే దాడుల నుంచి రక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆ ఉత్తర్వులో ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ కార్యాలయంలో ఉన్న ఆరుగురు చనిపోయారు. ఈ దాడి అనంతరం సౌదీ అరేబియా అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. -
ఆ పాస్పోర్ట్తో అమెరికాలో సమస్యలు!: కెనడా హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరిలో వైట్ హౌస్కు తిరిగి వచ్చిన తరువాత.. తన ప్రారంభ ప్రసంగంలో "పురుషుడు & స్త్రీ అనే రెండు లింగాలు మాత్రమే ఉన్నాయని" ప్రకటించినప్పటి నుంచి ట్రాన్స్జెండర్స్, బైనరీయేతర వ్యక్తులపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం తమ పాస్పోర్ట్లలో నాన్బైనరీ 'ఎక్స్' లింగ హోదాతో పాస్పోర్ట్లను కలిగి ఉన్న పౌరులకు హెచ్చరిక జారీ చేసింది.ఎక్స్ లింగ హోదాతో పాస్పోర్ట్లను కలిగిఉన్న వారు యునైటెడ్ స్టేట్స్కు వెళితే.. ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని కెనడా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్తో పాస్పోర్ట్లను జారీ చేసినప్పటికీ.. ఇది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.ఇదీ చదవండి: అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలుకెనడా 2019లో పాస్పోర్ట్లపై 'ఎక్స్' ఎంపికను ప్రవేశపెట్టింది. ఫెడరల్ డేటా ప్రకారం.. జనవరి నాటికి దాదాపు 3,600 మంది కెనడియన్లు దీనిని ఎంచుకున్నారు. కెనడా మాత్రమే కాకుండా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ దేశాలు కూడా ఎక్స్ జెండర్ పాస్పోర్ట్లను జరీ చేస్తోంది. కానీ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్తో పాస్పోర్ట్ల జారీని నిలిపివేసింది. కాగా ఈ విధానం అమలులోకి రాకుండా కోర్టు నిషేధం విధించింది. -
అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలు
సోషల్ మీడియాలో నెలల తరబడి తన ఉద్యోగ అన్వేషణ గురించి.. వివరించిన భారతీయ మహిళ 'అనన్య జోషి' తగిన ఉద్యోగం పొందలేకపోయింది. దీంతో అమెరికా (America) విడిచిపెట్టాల్సి వచ్చింది. సెప్టెంబర్ 29న ఆమె అమెరికా విడిచిపెట్టే సమయంలో కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి 2024లో బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన అనన్య జోషి.. F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా బయోటెక్ స్టార్టప్లో ఉద్యోగంలో చేరింది. అయితే కొన్ని రోజుల తరువాత ఆమె ఉద్యోగం కోల్పోయింది. అయితే స్టూడెంట్ వీసాతో చదువు పూర్తి చేసుకున్న తరువాత.. ఎఫ్-1 వీసా(F-1 Visa)తో ఉద్యోగంలో చేరింది. ఎఫ్-1 వీసా కలిగి ఉన్న వ్యక్తులు ఉద్యోగం కోల్పోయిన నెల రోజుల సమయంలో మరో ఉద్యోగాన్ని పొందాలి. లేకుంటే దేశం వీడి బయటకు వచేయాలి.ఇదీ చదవండి: బలవంతపు రాజీనామాలు!.. ఆందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుఉద్యోగం కోల్పోయిన అనన్య.. నెల రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసినప్పటికీ.. చివరికి నిరాశే మిగిలింది. చేసేదేమీ లేక అమెరికా విడిచిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి వచ్చే సమయంలో.. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రయాణంలో నేను చాలా కష్టతరమైన అడుగు వేసాను. ఐ లవ్ యూ అమెరికా అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Ananya 🐬 | Relatable Adult Life (@ananyastruggles) -
స్టాప్గ్యాప్ ఫండింగ్ బిల్లును తిరస్కరించిన డెమొక్రాట్లు
-
నాలుగు వారాల్లో జిన్పింగ్ను కలుస్తా: ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో నాలుగు వారాల్లోగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను(Xi Jinping) తాను కలుస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చైనాతో సోయాబీన్ అంశంపై చర్చించనున్నట్టు తెలిపారు. కాగా, ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో జిన్పింగ్తో భేటీపై ఆసక్తి నెలకొంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్లో తాజాగా స్పందిస్తూ..‘చైనా(China) చర్యల కారణంగా అమెరికాలో సోయాబీన్ రైతులు నష్టపోతున్నారు. జోబైడెన్ ప్రభుత్వంలో అమెరికా నుంచి సోయాబీన్ కొనుగోళ్లను చైనా ఆపేసింది. ఇప్పుడు కేవలం చర్చల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే జిన్పింగ్తో మాట్లాడాలని అనుకుంటున్నారు. మరో నాలుగు వారాల్లో నేను జిన్పింగ్ను కలిసి దీనిపై మాట్లాడతాను. నేను మా రైతులను ఎప్పటికీ నిరాశపరచను. అమెరికా రైతులకు అండగా ఉంటాను. మేము ఇప్పటికే సుంకాల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాం. ఆ డబ్బులో కొంత భాగం రైతులకు సహాయం చేయబోతున్నాం. రైతులను ఆదుకుంటాం’ అని చెప్పుకొచ్చారు. Trump announced he will have a meeting with Xi to beg China to start buying American soybeans again: pic.twitter.com/liZZ3cEkFU— Spencer Hakimian (@SpencerHakimian) October 1, 2025 మరోవైపు.. అక్టోబరు చివరివారంలో దక్షిణకొరియాలో ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (అపెక్) సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి పలు దేశాధినేతలు హాజరుకానున్నారు. ఆ సదస్సు అనుబంధంగా జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతానని ఇటీవల ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక, వచ్చే ఏడాది ఆరంభంలో చైనాలో పర్యటిస్తానని కూడా అమెరికా అధ్యక్షుడు ఆ మధ్య ప్రకటించారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ యంత్రాంగం మళ్ళీ టిక్ టాక్ విషయంలో ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి మంతనాలను జరుపుతోంది. తాజాగా ఓవల్ ఆఫీసులో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను అధ్యక్షుడు జిన్పింగ్తో మంచి సంభాషణ జరిపాను. ఆయన టిక్టాక్ ఒప్పందాన్ని ఆమోదించారు. ఒప్పందం కోసం మేము ఎదురుచూస్తున్నాం. దానిపై సంతకం చేయాలి. ఇది లాంఛనప్రాయంగా ఉండవచ్చు. టిక్టాక్ ఒప్పందం జరుగుతోంది. పెట్టుబడిదారులు సిద్ధమవుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
‘నాకు శాంతి నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను అవమానించినట్టే’
న్యూయార్క్: నోబెల్ శాంతి బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఏకంగా బెదిరింపులకే దిగారు. తనకు శాంతి నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను తీవ్రంగా అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఏడు సాయుధ ఘర్షణలను ఆపిన తనకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను సోమవారం ప్రతిపాదించిన ప్రణాళికపై మంగళవారం క్వాంటికోలో మిలిటరీ అధికారులతో ట్రంప్ మాట్లాడారు. ‘మనం సాధించాం. సమస్య పరిష్కారమైనట్టే అని భావిస్తున్నాను.. చూడాలి మరి. దీనిని హమాస్ అంగీకరించాల్సిందే (శాంతి ప్రణాళికను). లేదంటే వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని అరబ్దేశాలు, ముస్లిం దేశాలు ప్రణాళికను అంగీకరించాయి. ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. ఇది అద్భుతమైన విషయం. పరిస్థితి కొలిక్కి వచ్చింది. ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటి పని ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అయినా, నోబెల్ బహుమతి ఇస్తారా?.. ఇవ్వనే ఇవ్వరు. ఇలాంటి పని ఏదీ చేయని ఎవరో ఒకరికి ఇస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలపై పుస్తకం రాసి, యుద్ధాన్ని ఎలా ఆపాలి అని అందులో వివరించే ఎవరో ఒకరికి నోబెల్ ఇస్తారు. ఏం జరుగుతుందో చూడాలి. ఎవరో ఒక పుస్తక రచయితకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే మాత్రం అది అమెరికాకు తీవ్రమైన అవమానమే. ఇది నేను కచ్చితంగా చెప్పగలను. నాకు అది (నోబెల్) అవసరం లేదు. మన దేశం దానిని (నోబెల్) సాధించాలని కోరుకుంటున్నా. గాజా ఘర్షణకు ముగింపు పలికే ప్రణాళిక అమలవుతుందనే భావిస్తున్నా. ఇది నేను ఆశామాషీగా చెప్పటం లేదు. నాకు అన్నింటికంటే ఇలాంటి డీల్స్ గురించి బాగా తెలుసు. నా జీవితం మొత్తం ఇలాంటివాటితోనే గడిచింది. అందులో ఈ 8 (గాజా ఘర్షణతో కలిసి ట్రంప్ ఆపానని చెబుతున్న యుద్ధాలు) గొప్ప విషయాలు’అని ట్రంప్ పేర్కొన్నారు. -
గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ మరింత కఠినం
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న వేలాదిమంది భారతీయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రీన్ కార్డ్ పైనా ట్రంప్ ప్రభుత్వం దృష్టిపడింది. ఇటీవలే భారతీయులు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్1బీ వీసాపై కఠిన చర్యలను ప్రకటించడం తెల్సిందే. ఇప్పుడిక గ్రీన్కార్డు దరఖాస్తుదారుల ఇంటర్వ్యూ ప్రక్రియలో కఠినతరమైన నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇంటర్వ్యూల పరిధి మరింత విస్తృతం కానుంది. పరీక్ష కూడా కఠినంగా మారనుంది. దరఖాస్తుదారుల సత్ప్రవర్తనపై ఇమిగ్రేషన్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపడతారు. కొత్త విధానం ఈ నెల 20వ తేదీ నుంచే అమల్లోకి రానుండటం గమనార్హం. అమెరికా విలువలను పూర్తిగా స్వీకరించే వారు మాత్రమే పౌరులయ్యేలా చూడటమే ఈ మార్పుల లక్ష్యమని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) చెబుతోంది. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా హోమ్ల్యాండ్ డిఫెండర్స్ పేరుతో అధికారులను కూడా నియమిస్తోంది. అయితే, దరఖాస్తు దారులకు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి రెండంటే రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి. రెండో ప్రయత్నంలో విఫలమైతే వారికి పౌరస త్వాన్ని తిరస్కరిస్తారని తెలిపింది. అమెరికా లో ఒక వ్యక్తిని శాశ్వత నివాసి అని చూపే అధికారిక గుర్తింపు పత్రమే గ్రీన్ కార్డ్. హోల్డర్లను అధికారికంగా చట్టబద్ధమైన శాశ్వత నివాసులుగా పిలుస్తారు. ఈ విధానం సమగ్రతను స్థాపించడమే తాజా మార్పుల లక్ష్యమని యూఎస్సీఐఎస్ అంటున్నప్పటికీ, వలసదారుల ఉద్దేశాలను సందేహించే అవకాశం ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పౌరశాస్త్ర పరీక్ష. కొత్తగా ప్రవేశపెట్టే ఈ పరీక్షలో దరఖాస్తుదారులకు అమెరికా చరిత్ర, ప్రభుత్వంపై ఉన్న అవగాహనను అంచనా వేస్తారు. మొత్తం 128 ప్రశ్నల నుంచి దరఖాస్తుదారులు 20 ప్రశ్నలను ఎన్నుకుని 12 ప్రశ్నలకు సమాధానం సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో 10 ప్రశ్నల్లో ఆరింటికి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉండేది. ఈ పరీక్షతోపాటు అభ్యర్థుల సత్ప్రవర్తనను ఇమిగ్రేషన్ అధికారులు అంచనా వేయడం కూడా కఠినతరమైందే. కేవలం నేర రహిత ప్రవర్తన ఉంటే చాలదు. అమెరికా సమాజానికి సానుకూలంగా చేసిన మేలును కూడా చూస్తారు. ఇందులో, 1991 నుంచి వారి చుట్టుపక్కల వారిని సైతం విచారిస్తారు. దరఖాస్తుదారులు తెలిసిన సహ ఉద్యోగులు, సంబంధిత సంస్థల యజమానులు, ఇతరులను కూడా ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు చేసి, ప్రవర్తనను బేరీజు వేస్తారు. ఇందులోనూ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. దీని వల్ల భారతీయులపై ప్రత్యేకంగా వివక్ష చూపే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. అమెరికాలోని వలసదారుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. వేలాది మంది భారతీయులకు గ్రీన్కార్డు ఉంది. పెద్ద సంఖ్యలో భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఈ ‘పచ్చకార్డు’కోసం ఎదురు చూస్తున్నారు. 2024 గణాంకాల ప్రకారం అమెరికా పౌరుల్లో 6.1 శాతం, అంటే 49,700 మంది భారతీయులున్నారు. ఈ విషయంలో అమెరికాకు పొరుగునున్న మెక్సికో మొదటిస్థానంలో నిలిచింది. -
అమెరికాలో షట్డౌన్
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో మరో అలజడి మొదలైంది. కీలకమైన స్టాప్గ్యాప్ ఫండింగ్ బిల్లుకు సెనేట్లో ఆమోదం లభించలేదు. విపక్ష డెమొక్రటిక్ పార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. గడువు ముగిసినా బిల్లు నెగ్గకపోవడంతో ట్రంప్ ప్రభుత్వం దేశంలో షట్డౌన్ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. దీంతో అత్యవసరం కాని ప్రభుత్వ సేవలు, కార్యకలాపాలు నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. ‘బుధవారం తెల్లవారుజాము 00:01 గంటల’ను సూచించే టైమర్ చిత్రాన్ని ‘డెమొక్రటిక్ షట్డౌన్’ పేరిట వైట్హౌస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అమెరికాలో 1981 తర్వాత ఇది 15వ షట్డౌన్ కాగా, గత ఏడేళ్లలో ఇది రెండోసారి. చాలావరకు ఈ షట్డౌన్లు కేవలం కొన్ని రోజులపాటే కొనసాగాయి. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు 2018 డిసెంబర్లో షట్డౌన్ ప్రకటించారు. దేశ సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం భారీగా నిధులు ఖర్చు చేయడానికి సెనేట్ అంగీకరించలేదు. ఫలితంగా షట్డౌన్ అమల్లోకి వచ్చింది. 35 రోజులపాటు కొనసాగింది. ఆధునిక అమెరికా చరిత్రలో ఇదే అత్యధిక కాలం కొనసాగిన షట్డౌన్ కావడం గమనార్హం. 2013లో బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో 16 రోజులపాటు షట్డౌన్ కొనసాగింది. ఆరోగ్య ప్రయోజనాలపైనే ప్రతిష్టంభన ప్రభుత్వ పరిపాలనకుగాను స్వల్పకాలానికి (ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ దాకా) నిధులు విడుదల చేసేందుకు ఉద్దేశించినదే స్టాప్గ్యాప్ ఫండింగ్ బిల్లు. దీన్ని షార్ట్–టర్మ్ గవర్నమెంట్ స్పెండింగ్ బిల్లు అని కూడా అంటారు. త్వరలో గడువు తీరిపోనున్న ఆరోగ్య ప్రయోజనాలను పొడిగించాలని డెమొక్రాట్లు పట్టుబట్టగా, అధికార రిపబ్లికన్లు తిరస్కరించారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని, బిల్లులో చేర్చడానికి వీల్లేదని తేలి్చచెప్పారు. ఆరోగ్య ప్రయోజనాలను పొడిగిస్తే ప్రభుత్వ ఖజానాపై పెనుభారం పడుతుందని స్పష్టంచేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచించారు. దాంతో సెనేట్లో బిల్లుకు విపక్ష డెమొక్రాట్లు సుముఖత వ్యక్తంచేయలేదు. అమెరికా కాంగ్రెస్ ఉభయసభల్లో ట్రంప్ పారీ్టకి మెజార్టీ ఉన్నప్పటికీ.. సెనేట్లో మెజార్టీ లేకపోవడంతో స్టాప్గ్యాప్ ఫండింగ్ బిల్లు నెగ్గలేదు. షట్డౌన్ ముగించడంపై ఓటింగ్ విఫలం షట్డౌన్ను తక్షణమే ముగించడానికి బుధవారం సెనేట్లో ఓటింగ్ నిర్వహించారు. డెమొక్రాట్లు అంగీకరించకపోవడంతో ఓటింగ్ విఫలమైంది. ఆరోగ్య రంగానికి సబ్సిడీలు ఇవ్వాలని, అందుకు నిధులు కేటాయించాలన్న తమ డిమాండ్ పట్ల వారు వెనక్కి తగ్గలేదు. ఇదిలా ఉండగా, తాజా షట్డౌన్ ఎన్నిరోజులు కొనసాగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడేం జరగొచ్చు? → షట్డౌన్ విధించిన నేపథ్యంలో అత్యవసర సేవల్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే విధుల్లో కొనసాగుతారు. అయితే, షట్ డౌన్ ముగిసేదాకా వారికి వేతనాలు చెల్లించరు. → అత్యవసర సేవల్లో లేని సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తారు. 7.50 లక్షల మందిని తొలగించే అవకాశం ఉంది. వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిహారం రోజుకు 400 మిలియన్ డాలర్ల దాకా ఉండొచ్చని అంచనా. → ఎఫ్బీఐ, సీఐఏ అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ఎయిర్పోర్టు సిబ్బంది, హోంల్యాండ్సెక్యూరిటీ అధికారులు యథావిధిగా విధుల్లో కొనసాగుతారు. సైనిక దళాలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. → సోషల్ సెక్యూరిటీ చెల్లింపులకు ఆటంకాలు ఉండవు. ఆరోగ్య బీమాపై వైద్య సేవలు పొందవచ్చు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తాయి. → పోస్టల్ సర్వీసులు కొనసాగుతాయి. → తమ సిబ్బందిలో 90 శాతం మందిని తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు అమెరికా విద్యాశాఖ ప్రకటించింది. → మ్యూజియంలు, జంతు ప్రదర్శనశాలలు, జాతీయ ఉద్యానవనాలు మూతపడుతున్నాయి. -
అమెరికాలో కనిపించిన ఏలియన్ ?
-
ట్రంప్ పుణ్యమాని.. అమెరికాకు భారీ నష్టం తప్పదా?
వాషింగ్టన్: కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ను ఎదుర్కొంటోంది. మంగళవారం అర్ధరాత్రి దాకా కీలకమైన నిధుల బిల్లు విషయంలో సెనేట్లో హైడ్రామా నడిచింది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య ఎంతకీ పొంతన కుదరలేదు. దీంతో, అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలుకాగానే (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30కి) ఈ ప్రక్రియ ప్రారంభమైంది.అయితే, అమెరికాలో షట్డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు మూతపడింది. నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్డౌన్గా నిలిచింది. ఇక, ఈసారి షట్డౌన్ ఎన్ని రోజులు కొనసాగనుంది అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ షట్డౌన్ కారణంగా అమెరికా తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత షట్డౌన్ (2018–19) నష్టం..35 రోజుల పాటు కొనసాగిన ఈ షట్డౌన్ అమెరికా చరిత్రలోనే అత్యంత దీర్ఘమైనది. Congressional Budget Office (CBO) అంచనా ప్రకారం.. 11 బిలియన్ డాలర్ల మేరకు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక నష్టం వాటిల్లింది. ఇందులో 3 బిలియన్ డాలర్ల మేరకు జీడీపీ స్థిరంగా కోల్పోయింది. అంటే తిరిగి పొందలేని నష్టం ఇది. దీంతో.. 8,00,000 ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా సెలవులోకి వెళ్లారు.భారీ నష్టం తప్పదా?..ప్రస్తుత షట్డౌన్ (2025) నష్టం అంచనా ప్రకారం.. దాదాపు 1,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులు రేపటికి రాజీనామా చేయవచ్చని అంచనా ఉంది. దీంతో, 85% నష్టం వాటిల్లే అవకాశం ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. పాస్పోర్ట్, వీసా, పబ్లిక్ మీడియా, ఆరోగ్య బీమా సబ్సిడీలు వంటి సేవలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఫెడరల్ కాంట్రాక్టర్లు, చిన్న వ్యాపారాలు, పరిశోధన సంస్థలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవచ్చు. జీడీపీ, ఉద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణ సూచికలు వంటి కీలక డేటా సేకరణలు నిలిపివేయబడతాయి. దీని వల్ల మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. దీంతో, ఎంత మేరకు నష్టం వాటిల్లుతుందో అనే ఆందోళన అమెరికన్లలో నెలకొంది.గతంలో.. అమెరికా 1981 నుంచి ఇప్పటివరకు 15 సార్లు షట్డౌన్ను ఎదుర్కొంది(అన్నీ తక్కువ రోజుల వ్యవధిలోనే). 2018లో మాత్రం ట్రంప్ హయాంలో బోర్డర్ వాల్ డిమాండ్ కారణంగా 35 రోజుల షట్డౌన్ జరిగింది.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా అయితే ఇది ఎక్కువ రోజులు. ఇదిలా ఉండగా.. గత ఆరు సంవత్సరాల్లో ఫెడరల్ ప్రభుత్వం షట్డౌన్ కావడం ఇదే ప్రథమం.Folks — this is not a normal government shutdown.Let me explain the stakes and how we got here. pic.twitter.com/nVjXHbbghI— Robert Reich (@RBReich) October 1, 2025ఎందుకీ షట్డౌన్?ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ (House & Senate) ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం, రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు, కానీ డెమొక్రాట్లు ఆరోగ్య బీమా (Affordable Care Act) సబ్సిడీల పొడిగింపును కోరారు. రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరుగా చర్చించాలని అన్నారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. ఫలితంగా.. ప్రభుత్వం నిధుల్లేకుండా నిలిచిపోయింది.ఈ క్రమంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చారు. ‘‘షట్డౌన్ వస్తే, ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయి. వాళ్లు డెమొక్రాట్లు అవుతారు’’ అంటూ ఆయన హెచ్చరించారు(Trump on Shutdown). ఆ వెంటనే వైట్హౌస్ వర్గాలు ఫెడరల్ ఏజెన్సీలకు షట్డౌన్ ప్రణాళికలు అమలు చేయమని ఆదేశించాయి. సాధారణంగా నిధుల బిల్లు(Funding Bill) ఆమోదం పొందకపోతే.. ప్రభుత్వం వద్ద ఖర్చు చేయడానికి అధికారిక నిధులు ఉండవు. అప్పుడు షట్డౌన్ ఏర్పడుతుంది. షట్డౌన్ అనేది ప్రభుత్వ నిధుల కొరత వల్ల తాత్కాలికంగా సేవలు నిలిపివేయాల్సిన పరిస్థితి. ఇది ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. Trump said he wanted a shutdown so that he could destroy government programs and fire Democrats working for the federal government THREE TIMES TODAY ALONE! This is Donald Trump's shutdown. He wanted it. pic.twitter.com/TEJJLRQTiG— Home of the Brave (@OfTheBraveUSA) October 1, 2025 -
నిలిచిపోనున్న అమెరికా ఫెడరల్ సేవలు
-
ఆరేళ్ల తర్వాత.. అమెరికా ప్రభుత్వ షట్డౌన్
అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్(USA Shutdown) మొదలైంది. నిధుల బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో.. బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కి) ఫెడరల్ సేవలు నిలిచిపోయాయి. దీంతో.. 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు మొదలయ్యాయి. అర్ధరాత్రి దాకా కీలకమైన నిధుల బిల్లు(Funding Bill) విషయంలో సెనేట్లో హైడ్రామా నడిచింది. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల మధ్య ఎంతకీ పొంతన కుదరలేదు. దీంతో సెనేట్ తాత్కాలిక నిధుల బిల్లును తిరస్కరించగా.. షట్డౌన్ ఆందోళన నడుమ ఫెడరల్ సేవలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే.. గత ఆరుసంవత్సరాల్లో ఫెడరల్ ప్రభుత్వం షట్డౌన్ కావడం ఇదే. ఎందుకీ షట్డౌన్?ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ (House & Senate) ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం, రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు, కానీ డెమొక్రాట్లు ఆరోగ్య బీమా (Affordable Care Act) సబ్సిడీల పొడిగింపును కోరారు. రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరుగా చర్చించాలని అన్నారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. ఫలితంగా.. ప్రభుత్వం నిధుల్లేకుండా నిలిచిపోయింది.ఈ క్రమంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చారు. ‘‘షట్డౌన్ వస్తే, ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయి. వాళ్లు డెమొక్రాట్లు అవుతారు’’ అంటూ ఆయన హెచ్చరించారు(Trump on Shutdown). ఆ వెంటనే వైట్హౌస్ వర్గాలు ఫెడరల్ ఏజెన్సీలకు షట్డౌన్ ప్రణాళికలు అమలు చేయమని ఆదేశించాయి.సాధారణంగా నిధుల బిల్లు(Funding Bill) ఆమోదం పొందకపోతే.. ప్రభుత్వం వద్ద ఖర్చు చేయడానికి అధికారిక నిధులు ఉండవు. అప్పుడు షట్డౌన్ ఏర్పడుతుంది. షట్డౌన్ అనేది ప్రభుత్వ నిధుల కొరత వల్ల తాత్కాలికంగా సేవలు నిలిపివేయాల్సిన పరిస్థితి. ఇది ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. 📌షట్డౌన్ ఎందుకు జరుగుతుంది?రాజకీయ విభేదాలు వల్ల బడ్జెట్ బిల్లు ఆమోదం పొందకపోవడంపార్టీల మధ్య రాజీ లేకపోవడంప్రాధాన్యతలపై విభేదాలు.. ఉదాహరణకు ఆరోగ్య సంరక్షణ, పన్ను విధానాలు, వలస చట్టాలు🛑 షట్డౌన్ జరిగితే.. నాన్-ఎసెన్షియల్ (అత్యవసరంకాని) సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయిఫెడరల్ ఉద్యోగులుకి వేతనం లేకుండా సెలవు ఇవ్వబడుతుందిప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియంలు, జాతీయ పార్కులు మూసేస్తారువీసా ప్రాసెసింగ్, రుణాల మంజూరు, పరిశోధన కార్యక్రమాలు ఆలస్యమవుతాయి👨✈️ ఎవరిపై ప్రభావం ఉండదు?సైనికులు, సరిహద్దు అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వంటి అత్యవసర సేవల ఉద్యోగులు పని చేస్తారు. కానీ జీతాలు తర్వాతే చెల్లిస్తారుసోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి సేవలు కొనసాగుతాయి🕰️ గతంలో..అమెరికా 1981 నుంచి ఇప్పటివరకు 15 సార్లు షట్డౌన్ను ఎదుర్కొంది(అన్నీ తక్కువ రోజుల వ్యవధిలోనే)2018లో మాత్రం ట్రంప్ హయాంలో బోర్డర్ వాల్ డిమాండ్ కారణంగా 35 రోజుల షట్డౌన్ జరిగింది.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా అయితే ఇది ఎక్కువ రోజులుఇదీ చదవండి: ఓహో.. ట్రంప్తో మునీర్ అంత మాట అన్నాడా? -
అప్పట్లో మమ్మల్ని అమెరికాయే అడ్డుకుంది
న్యూఢిల్లీ: 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోకుండా యూపీఏ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. ముఖ్యంగా అమెరికా ప్రభావం, విదేశాంగ శాఖ విధానం వల్లే మిన్నకుండిపోవాల్సి వచ్చిందన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలని తనకు లోలోపల ఉన్నప్పటికీ ప్రభుత్వం సైనికపరమైన ప్రతిచర్యకు విముఖంగా ఉందని ఓ వార్తా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. దాదాపు 175 మంది ప్రాణాలను బలి తీసుకున్న కొద్ది రోజులకే హోం మంత్రిగా తాను బాధ్యతలు తీసుకున్నానన్నారు. యుద్ధానికి దిగవద్దంటూ ప్రపంచ దేశాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెచ్చారన్నారు. ‘అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ నేను బాధ్యతలు తీసుకున్న రెండు మూడు రోజుల్లోనే ఢిల్లీకి వచ్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్ని, నన్ను కూడా కలిశారు. ‘దయచేసి రియాక్షన్ తీసుకోకండి’అని ఆమె కోరారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని ఆమెకు చెప్పాను. పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా అనిపిస్తున్నా ఆ విషయం ఆమెకు తెలియపర్చలేదు. బదులు తీర్చుకునే విషయమై ప్రధానితోపాటు సంబంధిత వర్గాలతో సంప్రదించా’అని చిదంబరం వెల్లడించారు. అడ్డుకున్నది ఎవరు?కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. విదేశాల ఒత్తిళ్ల వల్లే ముంబై దాడుల విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిన విషయం అందరికీ తెల్సిందేనని పేర్కొంది. అయితే, పాక్పై ప్రతిచర్యలు తీసుకోకుండా అడ్డుకున్నది సోనియా గాంధీనా లేక ప్రధాని మన్మోహన్ సింగా అని ప్రశ్నించింది. -
భారత్ ఎగుమతులపై టారిఫ్ల ప్రభావం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ జూన్ త్రైమాసికంలో (క్యూ1) బలమైన వృద్ధి రేటు (7.8 శాతం)ను నమోదు చేసినప్పటికీ.. పూర్తి ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) మరోసారి తన అంచనాలను ప్రకటించింది. భారత్పై అమెరికా మోపిన 50 శాతం టారిఫ్లు వృద్ధి అవకాశాలకు విఘాతం కలిగిస్తాయని, ముఖ్యంగా ద్వితీయ ఆరు నెలలపై ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఏడీబీ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించిన అంచనాల్లో భారత జీడీపీ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ప్రకటించడం గమనార్హం. భారత్పై టారిఫ్లు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో జూలైలో వృద్ధి రేటు అంచనాను 6.5శాతానికి తగ్గించింది. ఇప్పుడు కూడా అదే అంచనాను కొనసాగించింది. ‘‘వినియోగం పెరగడం, ప్రభుత్వం అధికంగా వ్యయం చేయడంతో క్యూ1లో భారత్ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారత ఎగుమతులపై అమెరికా అదనంగా టారిఫ్లు విధించడం వృద్ధి రేటును తగ్గిస్తుంది. ముఖ్యంగా 2025–26 ద్వితీయార్ధం, 2026–27 వృద్ధిపై ఈ ప్రభావం ఉంటుంది. అదే సమయంలో స్థిరమైన దేశీ వినియోగం, సేవల ఎగుమతులు ఈ ప్రభావాన్ని తగ్గిస్తాయి’’అని ఏడీబీ తాజా నివేదిక వెల్లడించింది. ప్రభావం పరిమితమే.. జీడీపీలో ఎగుమతుల వాటా తక్కువగా ఉండడం, అదే సమయంలో ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడంతో వృద్ధి రేటుపై అమెరికా టారిఫ్ల కారణంగా పడే ప్రభావం పరిమితంగానే ఉంటుందని ఏడీబీ తెలిపింది. సేవల ఎగుమతులు బలంగా ఉన్నాయంటూ, వాటిపై టారిఫ్లు లేని విషయాన్ని గుర్తు చేసింది. పరపతి విధాన పరంగా దేశీ వినియోగానికి ఊతమివ్వడాన్ని సైతం ప్రస్తావించింది. ఇక ప్రభుత్వం అంచనా వేసిన 4.4 శాతం కంటే అధికంగా ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉండొచ్చని ఏడీబీ నివేదిక పేర్కొంది. జీఎస్టీ శ్లాబుల కుదింపు కారణంగా పన్ను ఆదాయం తగ్గనుందని, 2025–26 బడ్జెట్ అంచనాలు ప్రకటించే నాటికి ఈ ప్రతిపాదన లేకపోవడాన్ని గుర్తు చేసింది. అదే సమయంలో 2024–25 ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 4.7 శాతం కంటే తక్కువే ఉండొచ్చని అంచనా వేసింది. కరెంట్ ఖాతా లోటు మాత్రం జీడీపీలో 0.9 శాతానికి ఎగబాకొచ్చని తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 0.6 శాతంగా ఉంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) కరెంటు ఖాతా లోటు 1.1 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అంచనాలకు మించి ఆహార ధరలు వేగంగా తగ్గడాన్ని ప్రస్తావించింది. 2025–26 మొదటి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వ వ్యయాలు ఆదాయానికి మించి బలంగా ఉన్నట్టు, దీంతో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ద్రవ్యలోటు పెరిగినట్టు వివరించింది. -
పాక్పై ట్రంప్ మోజు!
మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వైభవం పునరావృతమవుతుందని బహుశా పాకిస్తాన్ ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ ఊహించివుండదు. ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను స్వల్ప వ్యవధిలో మూడుసార్లు వైట్హౌస్కు ఆహ్వానించి గౌరవించటం, నాలుగు రోజుల నాడు మునీర్తోపాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాదరంగా హత్తుకోవటం పాకిస్తాన్ దృష్టిలో చిన్న విషయాలేమీ కాదు. పైగా వారిద్దరికీ ట్రంప్ నుంచి దండిగా ప్రశంసలు దక్కాయి. ఒక పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ణి కలుసుకుని మాట్లాడటం 2019 తర్వాత ఇదే తొలిసారి. అలాగని పాకిస్తాన్ను ఎప్పుడూ పూర్తిగా దూరం పెట్టింది లేదు. ప్రపంచం నలుమూలలా గాలిస్తున్న ఉగ్రవాది బిన్ లాడెన్కు పాక్ ఆశ్రయమివ్వటం వంటి ఉదంతాలు అమెరికాకు ఆగ్రహం కలిగించినా, ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి పాక్ సహకారాన్ని అమెరికా మరువదల్చుకోలేదు. అదే సమయంలో మనం నొచ్చుకోకుండా ఉండేందుకు ఆ దేశాన్ని కాస్త దూరం పెట్టినట్టు కనబడేది. ట్రంప్ తొలిసారి అధికారంలో కొచ్చినప్పుడు పాకిస్తాన్ పేరు చెబితే భగ్గుమనే వారు. అనంతరం వచ్చిన జో బైడెన్ సైతం పాకిస్తాన్ను తగినంత దూరంలోనే పెట్టారు. కానీ రెండోసారి అధికారంలో కొచ్చాక ట్రంప్ వైఖరి మారింది. భారత్ తన ఆదేశాలను శిరసా వహించటం లేదన్న అక్కసుతోపాటు స్వప్రయోజనాలపై దృష్టి పడింది. అందుకే పాకిస్తాన్కు అతిగా ప్రాధాన్యమిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.గత కాలపు చెలిమికీ, వర్తమాన సాన్నిహిత్యానికీ చాలా తేడా ఉంది. అప్పట్లో మన దేశం సోవియెట్ యూనియన్కు సన్నిహితంగా ఉండటం, తన ఒత్తిళ్లకు లొంగకపోవటం తదితర కారణాలతో ఆసియాలో అమెరికాకు పాకిస్తానే దిక్కయ్యేది. ప్రస్తుత పరిస్థితి వేరు. ట్రంప్కు ఇప్పుడు దేశ ప్రయోజనాల కన్నా స్వీయ ప్రయోజనాలే ముఖ్యం. మాజీ అధ్యక్షుడు ఒబామా మాదిరే తనకూ నోబెల్ బహుమతి వచ్చితీరాలని ఆయన పట్టు దలగా ఉన్నారు. భారత్–పాక్ యుద్ధంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఏడు ఘర్షణలు ఆపాననీ, అందువల్ల శాంతి బహుమతికి తాను అర్హుడిననీ ఆయన తరచూ చెప్పుకుంటు న్నారు. మధ్యమధ్యన మాట మార్చినా భారత్–పాక్లు రెండూ చర్చించుకోబట్టే యుద్ధం ఆగిందని ట్రంప్ స్వయంగా మూడు నాలుగు దఫాలు అన్నారు. మునీర్ సైతం ఘర్షణలు నిలపాలన్నది ఇరు దేశాల నిర్ణయమని తెలిపారు. ఇప్పుడు ట్రంప్ అబద్ధానికి పాక్ వంత పాడుతోంది. ట్రంప్ కోరుకుంటున్నవి ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఖనిజాలు ప్రధాన మైనవి. పాక్ భూగర్భంలో అపార ఖనిజ సంపద ఉంది. బంగారం, రాగి, మాంగనీస్, క్రోమైట్ వగైరా 92 రకాల ఖనిజాలు అక్కడ లభ్యమవుతాయని చైనా ఖనిజాభివృద్ధి సంస్థ పరిశోధనలు తేల్చిచెప్పాయి. ఇవిగాక ఏఐ, ఎలక్ట్రిక్ కార్లు వగైరాల్లో ఉపయోగపడే కీలక ఖనిజాలున్నాయి. ఇందులో అధికభాగం ఉగ్రవాదుల హవా సాగుతున్న బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకే ఖనిజ సంపద ద్వారా పాక్కు సమకూరే ఆదాయం 2 శాతం మించటం లేదు. నిరుడు పాకిస్తాన్ 521 ఉగ్రదాడులు ఎదుర్కొంది. అక్కడ విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఖనిజశుద్ధి పరిశ్రమలు స్థాపిస్తామంటేనే గనులు అప్పజెబుతామని పాక్ ఆశ చూపుతున్నా ఉగ్ర వాదం, విద్యుత్ సంక్షోభం కారణాలుగా చూపి ఏ దేశమూ ముందుకు రావటం లేదు. ఇప్పుడు ఆ ఖనిజ సంపదపై ట్రంప్ కన్నుపడింది. ఇదిగాక ట్రంప్ కుటుంబ భాగస్వామ్యం ఉన్న లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ నడిపే క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు పాక్ అనుమతులిచ్చింది. ఆ దేశంపై మోజు పెరగటంలో వింతేముంది?పాకిస్తాన్లో ప్రజా ప్రభుత్వం ఉండగా, ట్రంప్ దాన్ని బేఖాతరు చేసి సైనిక దళాల చీఫ్కు ప్రాధాన్యమిచ్చి వ్యవహారాలు చక్కబెట్టుకోవటం ఆందోళనకరం. పాక్ సైన్యం అమెరికా ఒత్తిడి పర్యవసానంగా గత రెండు దశాబ్దాల నుంచి ప్రభుత్వంలో ప్రత్యక్ష జోక్యాన్ని తగ్గించుకుంది. తెరవెనక మంత్రాంగానికే పరిమితమైంది. కానీ ట్రంప్ పుణ్యమా అని మళ్లీ సైన్యం ప్రభావం పెరుగుతోంది. ఇది ఆ దేశానికి మాత్రమే కాదు... పొరుగునున్న మనకు కూడా ప్రమాదకరమైన పరిణామం. మన ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు. -
సినిమాలపై ట్రంప్ టారిఫ్.. టాలీవుడ్ హీరో నిఖిల్ రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సినిమాలపై వందశాతం సుంకం విధించడంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ట్రంప్ సుంకాలు అమలు చేయడం సాధ్యం కాదని ట్వీట్ చేశారు. బెర్మన్ సవరణ చట్టం ప్రకారం సినిమాలపై దిగుమతి సుంకాలను పూర్తిగా అడ్డుకుంటుందని నిఖిల్ రాసుకొచ్చారు. ఈనెల 29న ఇచ్చిన ట్రంప్ ఆదేశాలపై చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కొవాల్సిందేనని అన్నారు. అంతేకాకుండా సినిమాలపై వందశాతం సుంకం అమలు సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా.. టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ, ది ఇండియన్ హౌస్ చిత్రాల్లో నటిస్తున్నారు.విదేశీ సినిమాలపై ట్రంప్ టారిఫ్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు వందశాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంది. విదేశీ సినిమాలపై 100శాతం విధిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుండి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని పేర్కొన్నారు. No . Trump Tariffs on Films will Not be Implemented. Since The Berman Amendment (50 U.S.C. §1702(b)(3)) explicitly Stops presidential restrictions/Tariffs under IEEPA on imported informational materials like films, as confirmed by congressional records. Combined with First… https://t.co/0d7qvItrr2— Nikhil Siddhartha (@actor_Nikhil) September 30, 2025 -
కనీవినీ ఎరుగని రీతిలో ఎన్ఆర్ఐల బతుకమ్మ సంబరాలు
-
గాజా ఆక్రమణ ఉండదు
వాషింగ్టన్: గాజా సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించబోదని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధానికి త్వరగా తెరపడాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గాజాలో అస్థిరతకు చరమగీతం పాడేసి, శాంతిని నెలకొల్పే దిశగా నెతన్యాహుతో ఒప్పందానికి దరిదాపుల్లోకి వచ్చానని అన్నారు.ఈ ప్రణాళికకు అంగీకారం తెలియజేసినందుకు నెతన్యాహుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో శాంతి సాధన విషయంలో ఇదొక చరిత్రాత్మక దినం అని వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతికి అడుగు ముందుకు పడినట్లేనని ఉద్ఘాటించారు. తాను ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్తోపాటు ఇతర భాగస్వామ్యపక్షాలు సైతం ఆమోదిస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు.ఒకవేళ ఆమోదం లభిస్తే గాజాలో తక్షణమే యుద్ధానికి తెరపడుతుందని తేల్చిచెప్పారు. నెతన్యాహు మాట్లాడుతూ... గాజా విషయంలో దీర్ఘకాల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. అదే సమయంలో ప్రాంతీయ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించే విషయంలో నెతన్యాహుతో చర్చలు ఒక భాగమేనని ట్రంప్ పేర్కొన్నారు. ఖతార్ ప్రధానమంత్రికి నెతన్యాహు క్షమాపణ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్–థానీకి ఫోన్ చేసి క్షమాపణ కోరారు. ఇటీవల ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ఈ ఉదంతం ముస్లిం దేశాల్లో అలజడి సృష్టించింది. ఇజ్రాయెల్ తీరును ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో సమావేశమైన నెతన్యాహు అక్కడి నుంచే ఖతార్ ప్రధానికి ఫోన్చేశారు. దోహాపై దాడుల పట్ల విచారం వ్యక్తంచేశారు. క్షమాపణ కోరారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
అమెరికా వెళ్లాలంటే.. అప్పు పుట్టట్లేదు!
సాక్షి, హైదరాబాద్: విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లాలన్న ఆసక్తి విద్యార్థుల్లో క్రమంగా తగ్గుతోంది. తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులూ వెనుకాడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు అమెరికా అంటేనే నమ్మకం పోతోందని కన్సల్టెన్సీ సంస్థలూ అంటున్నాయి. ఇదిలాఉంటే, ఇప్పటికే అమెరికా వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నారు. ప్రైవేటు అప్పులు వారిని వెంటాడుతున్నాయి. ఇంకోవైపు అమెరికా నుంచి విద్యార్థులు డబ్బులు పంపాలని కోరడం మరింత ఆందోళన రేపుతోంది. పిల్లలు అమెరికా వెళ్లే వరకూ ఆనందంగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నాయి. హెచ్1–బీ వీసీకు లక్ష డాలర్లు చెల్లించాలన్న ట్రంప్ నిర్ణయం అనేక కుటుంబాల్లో కునుకులేకుండా చేస్తోంది. పెరుగుతున్న అప్పు ఒత్తిడి భారత్ నుంచి ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది అమెరికా వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేల మంది వెళ్లినట్టు అంచనా. ఇందులో ఎక్కువ మంది చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో బ్యాంకు లోన్లలతోపాటు, తేలికగా ప్రైవేటు అప్పులు పుట్టాయి. అమెరికా వెళ్లే విద్యార్థి పార్ట్ టైం ఉద్యోగం చేసి సంపాదిస్తాడనే నమ్మకం ఉండేది. దీంతో ప్రైవేటు వ్యక్తులూ అప్పులివ్వడానికి వెనుకాడలేదు. కొంతమంది తల్లిదండ్రులు రూ.2 నుంచి 5 వడ్డీకి కూడా అప్పులు తెచ్చారు. వడ్డీ రెండేళ్లలో అసలును మించి పోయిందని ఇప్పుడు వాపోతున్నారు. వచ్చే జీతంలో ఎక్కువ భాగం నెలనెలా వడ్డీ కట్టేవాళ్లూ ఉన్నారు. అమెరికాలో పార్ట్టైం ఉద్యోగాలు చేయొద్దంటూ ఆంక్షలు పెట్టడంతో, జీవనం కోసం విద్యార్థులు తల్లిదండ్రులను ఆశ్రయించారు. డబ్బులు పంపకపోతే అమెరికాలో ఉండటం కష్టమని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏడాదిగా కొత్త అప్పులు తీసుకురాక తప్పని పరిస్థితి. దీనికితోడు రూపాయి మారక విలువ తగ్గడంతో అమెరికాలో యూనివర్సిటీ ఫీజుల భారం ఎక్కువైంది. ఇవన్నీ తల్లిదండ్రులను మరింత అప్పుల్లోకి నెట్టాయి. హెచ్1–బీ వీసాకు ఆంక్షలు పెట్టడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 19 వేల మంది విద్యార్థులు ఎంఎస్ పూర్తి చేసుకుని, ఉద్యోగం లేని కారణంగా వెనక్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన అప్పుల వాళ్లు తామిచ్చిన మొత్తాన్ని ఇవ్వమని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారు. వడ్డీ ఇవ్వకున్నా అసలైనా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏమీ చేయలేని అమోమయంలోకి వెళ్తున్నారు. అమ్మో... అప్పా? కొత్తగా అమెరికా వెళ్లే విద్యార్థులకు అప్పులు ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావడం లేదు. స్థిరాస్తి కుదవపెడితే ఆలోచిస్తామని చెబుతున్నారు. బ్యాంకులు కూడా షూరిటీని అడుగుతున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. అమెరికా వెళ్లాలంటే ముందుగా జీవన వ్యయాన్ని బ్యాంకు నిల్వగా చూపించాలి. ఈ మొత్తాన్ని ఆరు నెలల ముందే బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వచ్చే జనవరి సెమిస్టర్ కోసం యూఎస్ వెళ్లే విద్యార్థులు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక్కో విద్యార్థి కనీసం రూ. 40 లక్షలు సమకూర్చుకుంటే తప్ప అమెరికా వెళ్లలేరు. కొంతమంది ఉద్యోగులు తమ పీఎఫ్ డ్రా చేస్తున్నారు. ఒత్తిడి పెరిగింది: మల్లెల హర్షవర్ధన్ (సిద్దిపేట) సాధారణ ఉద్యోగం చేసే నేను రూ.20 లక్షల ప్రైవేటు అప్పు చేసి ఎంఎస్ కోసం కొడుకును అమెరికా పంపాను. రెండేళ్లల్లో అప్పు రెట్టింపు అయింది. నెలనెలా అమెరికాలో అబ్బాయికి డబ్బులు పంపుతున్నాను. అప్పు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. స్థిరాస్తులు కూడా ఏమీ లేవు. భయమేస్తోంది. అప్పంటే భయమేస్తోంది : మారపంపు నవీన్, వడ్డీ వ్యాపారి, వరంగల్ అమెరికా వెళ్లే వారికి కొన్నేళ్లుగా అప్పులు ఇస్తున్నాను. పెద్దగా ష్యూరిటీ ఆశించలేదు. కానీ రెండేళ్లుగా ఇస్తున్న అప్పులు తిరిగి రావడం కష్టంగా ఉంది. కొంతమంది వద్ద స్థిరాస్తులు కూడా లేవు. గట్టిగా అడిగే పరిస్థితి లేదు. అందుకే అమెరికా వెళ్లే వారికి అప్పులు ఇవ్వడం మానేశాను. -
'పోరాటస్ఫూర్తి'ని కోల్పోవద్దు!
యూనివర్సిటీ నుంచి మీరు బయటకు అడుగుపెట్టబోతు న్నారు. జీవితంలో కొన్ని అవరోధాలు, వైఫల్యాలు, అసంతృప్తులు ఎదురవడం సహజం. వాటిని తట్టుకుంటూ ముందుకు సాగడంలో, విజయాన్ని అందుకోవడంలో మీకు సహాయపడగలిగినవి, నాకు తోచిన జీవిత పాఠాలు కొన్ని చెబుతాను.మీపై మీరు నమ్మకం ఉంచండిటెలివిజన్, టెలిఫోన్లు, కంప్యూటర్లు, ఐపాడ్లు లేని రోజుల్లో పెరిగి పెద్దవాడినవటం వల్ల నేనొక రకంగా అదృష్టవంతుడినే. నాతో నేను ఎక్కువ సమయం గడపగలిగే వాడిని. దేన్ని నేను నిజంగా ఇష్టపడుతున్నానో నిర్ణయించుకోగలిగే వాడిని. అలా ఆస్ట్రియాలోని మా కుగ్రామం నుంచి – బాడీబిల్డింగ్ ఛాంపియన్ అవడం ద్వారా అమెరికాలో కాలుమోపాలని అనుకున్నా. నేను ఆరాధించే ‘మిస్టర్ యూనివర్స్’... రెగ్ పార్క్’. ఆయనలా బాడీబిల్డింగ్ చాంపియన్ అనిపించుకోవడం, సినిమాల్లో ప్రవేశించడం, కోట్లాది డాలర్లు సంపాదించడం నా లక్ష్యం. మిగిలినవారు ఏమనుకుంటున్నా పట్టించుకోకుండా, నా మీద నమ్మకంతో నేను ఏర్పరచుకున్న లక్ష్యం అది. సూత్రాలను పక్కన పెట్టండి!మా ఆవిడ వేసుకొనే ఒక టీషర్ట్పై ‘నియమానుసారంగా నడ చుకొనే మహిళలు చరిత్రను సృష్టించటం అరుదు’ అని అర్థం వచ్చే ఇంగ్లీషు వాక్యం ఉంటుంది. స్త్రీ పురుషులందరికీ అది వర్తిస్తుంది. మరీ సూత్రానుసారంగా ఉంటే, మీ లక్ష్య సాధనకు ‘పిచ్చి పట్టినట్లుగా’ ప్రయత్నించలేరు. నాకు ఎక్కడైనా ఏదైనా లభించిందీ అంటే, అది ఈ సూత్రాలలో కొన్నింటిని పక్కన పెట్టినందువల్లనే సాధ్యమైంది. బాడీబిల్డింగ్కు శ్రమించినట్లుగానే, సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడ్డాను.అందుకోసం ఇంగ్లీషు క్లాసులకు వెళ్లాను. ఫలితం దక్కింది. మొదట టెలివిజన్లో, తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. విజయవంతమైన నటుడిని అయ్యాను. తర్వాత గవర్నర్ని కూడా అయ్యాను. వైఫల్యానికి భయపడకండి!నేను ఏది ప్రయత్నించినపుడైనా, విఫలమవడానికి కూడా సుముఖంగా ఉండేవాడిని. ‘రెడ్ సోంజా’, ‘హెర్క్యులిస్ ఇన్ న్యూయార్క్’, ‘లాస్ట్ యాక్షన్ హీరో’ వంటి నా సినిమాలు కొన్ని బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ‘టెర్మినేటర్’, ‘క్యానన్’, ట్రూ లైస్’, ‘ప్రిడేటర్’, ‘ట్విన్స్’ వంటి చిత్రాలు ఊహించనంత విజయం సాధించాయి. కనుక, మనం అన్నిసార్లూ సఫలం కాలేకపోవచ్చు. కానీ, నిర్ణయాలు తీసుకునేందుకు భయపడకూడదు. విఫలమవు తామనే భయంతో నిర్వీర్యం కాకూడదు. మీపై మీకు నమ్మకం ఉంది కనుక, ఏది చేస్తున్నారో అదే సరైన పని అనిపించుకుంటుందని భావిస్తున్నారు కనుక ధైర్యంగా ముందుకు సాగండి. మాటలకు ప్రభావితం కాకండి!మా అత్తగారు యూనస్ కెనడీ ష్రైవర్ 1968లో స్పెషల్ ఒలింపిక్స్కు శ్రీకారం చుట్టినపుడు చాలామంది ఆమెను నివారించే ప్రయత్నం చేశారు. అదెలా సాధ్యపడుతుంది అన్నారు. ‘‘కుదరని పని. సంస్థల నుంచి పోటీదారులను బయటకు తీసుకురావడం కష్టం. వారు జంపింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ క్రీడల్లో పాల్గొనేటట్లు మీరు చేయలేరు. ఒకవేళ పాల్గొన్నా, వారు గాయపడవచ్చు. ఒకరి నొకరు గాయపరచుకోవచ్చు. ఈతకొలనులో మునిగిపోతారు’’ అని నిరుత్సాహపరచారు. 40 ఏళ్ల తర్వాత, గొప్ప సంస్థలలో స్పెషల్ ఒలింపిక్స్ ఒకటిగా ఉంది. ఈరోజు మానసిక వైకల్యంతో బాధపడు తున్నవారికి 164 దేశాలలో అంకిత భావంతో పని చేస్తోంది. జనం మాటలకు ఆమె నీరుగారిపోయి తన ప్రయత్నం ఆపేసి ఉంటే, ఇది సాధ్యమయ్యేదా? అంతరాత్మ ‘‘నీకు సాధ్యమే’’ అని చెబుతుంటే ఇక ఎవరి మాటా వినకండి!శ్రమిస్తేనే విజేతలు కాగలరు!తగినంత కృషి చేయకుండానే విఫలం అవకూడదు. అంటే, ప్రయత్న లోపం ఉండకూడదన్నది నా ఉద్దేశం. గట్టిగా ప్రయత్నించిన తర్వాత విఫలమైనా ఫరవాలేదు. అంతేకానీ, కష్టపడి సాధన చేయకుండా, పోటీలో లేదా ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని నేను ఇష్ట పడను. లక్ష్య సాధనకు సర్వశక్తులూ ఒడ్డాలన్నదే నా అభిమతం. మధ్య మధ్యలో విరామం తీసుకోవడం కూడా ముఖ్యమే. కాదనను. కానీ, మనం సేదదీరుతున్న సమయంలో మరెవరో శ్రమించి పని చేస్తూ ఉంటారని గుర్తుంచుకోవాలి. వారూ విజేతలుగా నిలవొచ్చు. అంతమాత్రాన, ఏదో చేజారిపోయింది అని మనం అనుకోకూడదు. రోజుకు 6 గంటలు నిద్రిస్తే చాలు. మిగిలిన 18 గంటలూ పనిచేస్తూ ఉండాలి. సమయాన్ని సమర్థంగా నిర్వహించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలి. ఆకాంక్షలను నెరవేర్చుకు నేందుకు తగినంత సమయాన్ని కేటాయించుకోవాలి.చురుగ్గా చేజిక్కించుకోవాలిరెండు జేబుల్లోనూ చేతులు పెట్టుకుని నిచ్చెన ఎక్కగలం అని మాత్రం అనుకోకండి. కార్యాచరణకు దిగకుండా ‘విజయానికి సూత్రాల’ను నెమరువేయడం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. క్రియాశీలంగా వ్యవహరిస్తూ, అవకాశాలను చేజిక్కించు కోవాలి. కలలను సాకారం చేసుకునేందుకు సోమరితనం వదిలించుకుని, చురుకుగా పనిచేయాలి. ఇవన్నీ మీకు తెలియనివి ఏమీ కావు. శ్రద్ధాసక్తులతో చదువుకోకపోతే మీరీ రోజు ఇక్కడ కూర్చో గలిగేవారే కాదు. ఇక మీరు ఏ రంగంలో ఉన్నా సరే, సమాజానికి తిరిగి ఎంతో కొంత ఇవ్వడానికి సిద్ధపడాలి. అందుకు తగిన వ్యవధిని చిక్కించుకోవాలి. సమాజానికి, మీ రాష్ట్రానికి, లేదా మీ దేశానికి తిరిగి ఇవ్వడాన్ని ఒక నియమంగా పెట్టుకోవాలి. మా మామగారు సార్జంట్ ష్రైవర్ గొప్ప అమెరికన్. ఆయన పేదలకు న్యాయ సహాయం లాంటి పనులు నిర్వహించారు. ‘‘అదే పనిగా అద్దంలో మీ ముఖం మీరే చూసుకోకండి. కాసేపు అద్దాన్ని పక్కన పెట్టండి. అప్పుడే చేయూత అవసరమైన లక్షలాది మందిని మీరు మీ చుట్టుపక్కల చూడ గలుగు తారు’’ అని ఆయన ఒకసారి యేల్ పట్టభద్రుల స్నాతకోత్సవంలో చెప్పారు. ఇతరులకు సహాయపడడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదని మాత్రం నేను మీకు చెప్పగలను.ఎన్నింటిని దాటుకుని వచ్చాం!చివరగా ఇంకొక్క సంగతి చెబుతా! ఈ విశ్వవిద్యాలయాన్ని 1880లో నెలకొల్పారు. అప్పట్లో లాస్ ఏంజలెస్ చిన్న పొలిమేర పట్టణం. మీకన్నా ముందు 125 పట్టభద్రుల బృందాలు తయారై ఉంటాయి. వారు మంచి రోజులను, గడ్డు రోజులను, యుద్ధాలను, శాంతియుత పరిస్థితులను, ఆశలు రేకెత్తించిన కాలాన్ని, మహా అస్థి రమైన కాలాన్ని కూడా చూసి ఉంటారు. వాటన్నింటినీ దాటుకుని ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ యూనివర్సిటీ దృఢంగా నిలిచాయి. ఇపుడు మనం తిరిగి గడ్డు రోజులను, ప్రపంచంలో చాలా అస్థిరతను చూస్తున్నాం. ఒకటి మాత్రం ఖాయం. మనం వాటిని తట్టుకుని నిలబడగలం. మునుపటికన్నా పటిష్ఠంగా, సంపన్నమైనదిగా దేశం పునరుత్తేజం పొందుతుంది. ఆశావాదాన్నీ, పోరాట స్ఫూర్తినీ కోల్పో వద్దు. మీ అందరికీ అభినందనలు. ఆ కరుణామయుడి చల్లని చూపులు మీపై ప్రసరించాలి. -
ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలో తెలుగు సినిమాలకు బిగ్ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు వందశాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంది. విదేశీ సినిమాలపై 100శాతం విధిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుండి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని పేర్కొన్నారు. టాలీవుడ్ సినిమాలపై ఎఫెక్ట్అమెరికాలో 700–800 థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అలా విడుదలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్పతో పాటు ఇతర టాలీవుడ్ సినిమాలు అమెరికాలో కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. టాలీవుడ్ పరిశ్రమ లెక్కల ప్రకారం.. అంతర్జాతీయంగా టాలీవుడ్ సినిమాలకు మార్కెట్ ఉన్న దేశాల్లో అమెరికా తొలి రెండుమూడు స్థానాల్లో ఉంది. టారిఫ్ ప్రభావం ఎలా ఉంటుందంటేఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్పై భారీ ఎఫెక్ట్ పడనుందని అంచనా. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో విడుదలయ్యే ప్రతి తెలుగు సినిమాపై వంద శాతం అదనపు టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఒక సినిమా పంపిణీదారులు రూ.5 కోట్ల రూపాయల విలువైన హక్కులు కొనుగోలు చేస్తే..మరో రూ.5 కోట్లు టారిఫ్గా చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల సినిమా టికెట్ ధరలు రెట్టింపు కావచ్చు. ప్రేక్షకులపై భారం పడే అవకాశం ఉంది.పరిశ్రమలో ఆందోళనఇండియన్ సినిమాలపై అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల విదేశీ పంపిణీ ఒప్పందాలు, విడుదల వ్యూహాలు మారిపోవచ్చు. అమెరికాలో వసూళ్లు తగ్గిపోతే, నిర్మాతలు, పెట్టుబడిదారులు తమ వ్యూహాలను పునరాలోచించాల్సి ఉంటుంది. ట్రంప్ ఈ నిర్ణయాన్ని ‘అమెరికా సినిమా పరిశ్రమను రక్షించేందుకు’ తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఇది అంతర్జాతీయ సినిమా వ్యాపారాన్ని గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా.. రేపే..
అమెరికాలో లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం రాజీనామా చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)పాలనకు వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగంలో భారీగా ఉద్యోగుల తగ్గింపునకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగాల నుంచి తప్పుకొనే ఉద్యోగులకు ట్రంప్ సర్కారు స్వచ్ఛంద రాజీనామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ రాజీనామా కార్యక్రమంలో భాగంగా లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీనికి మంగళవారం తుది గడువు కావడంతో అంగీకరించిన వారందరూ ఆ రోజున రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయకపోతే పెద్ద ఎత్తున తొలగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఫెడరల్ ఏజెన్సీలను వైట్హౌస్ ఆదేశించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వ రంగంలో అత్యంత భారీ సంఖ్యలో నిష్క్రమణలు ఇవే కావడం గమనార్హం.కాగా చెప్పినట్లు రాజీనామా చేసిన ఉద్యోగులకు ఎనిమిది నెలలపాటు అడ్మినిస్ట్రేటివ్ లీవ్ ఇచ్చి ఆ ఎనిమిది నెలల కాలానికి వేతనాలు, ఇతర ప్రయోజాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందు కోసం ప్రభుత్వానికి 14.8 బిలియన్ డాలర్లు ఖర్చు కానుంది. అయితే ఉద్యోగుల తగ్గింపుతో దీర్ఘకాలికంగా ఏటా 28 బిలియన్ డాలర్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చైనా కోసం గాడిదలు పెంచుతున్న పాకిస్థాన్.. -
భారత్ను దారికి తీసుకురావాలి
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇండియా, బ్రెజిల్ను ఉద్దేశించి కీలక వ్యా ఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలను దారికి తీసుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాలని ఇండియా, బ్రెజిల్ దేశాలకు హితవు పలికా రు. అమెరికా ఉత్పత్తులకు మార్కెట్లు తెరవాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. బ్రెజిల్, ఇండియా, స్విట్లర్లాండ్, తైవాన్ వంటి దేశాల వ్యవహార శైలి తమకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని అన్నారు. అమెరికా పట్ల నిజంగా స్నేహ పూర్వకంగా ఉండాలనుకుంటే సరిగ్గా ప్రతిస్పందించాలని స్పష్టంచేశారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా పని చేస్తుండడం వల్లనే ఇండియా వంటి దేశాలతో తాము కఠినంగా ఉండాల్సి వస్తోందని లుట్నిక్ తేల్చిచెప్పారు. ‘‘మీ ఉత్పత్తులు అమెరికన్లకు విక్రయించుకోవాలని కోరుకుంటే మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లా డుకోండి. సంధి చేసుకోండి’’ అని సూ చించారు. ఇండియా సహా పలుదేశాల తో వాణిజ్య చర్చలు చురుగ్గా ముందు కు సాగడం లేదని తెలిపారు. ఆయా దేశాల మొండి పట్టుదల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆక్షేపించారు. వివాదాలను త్వరలో పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి కొనుగోళ్లు ఆపాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. భారత్ అందుకు అంగీకరించడం లేదు. తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో దురుద్దేశం ఏమీ లేదని చెబుతోంది. భారత్ వాదనను అమెరికా నమ్మడం లేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి మీరే నిధులు ఇస్తున్నారంటూ మండిపడుతోంది. మరోవైపు భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా కావడం గమనార్హం. 2024–25లో రెండు దేశాల మధ్య 131.84 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో 86.5 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను అమెరికాకు భారత్ ఎగుమతి చేసింది. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, ముగ్గురు దుర్మరణం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్ కరోలినాలో ఒక రెస్టారెంట్ వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. బోటులో వచ్చి జనంపై విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.North Carolina shooter opens FIRE from a boatGunfire tears into restaurant — reports of 7 victimsSuspect takes off by boat & remains at large https://t.co/Y5rvJl2PWS pic.twitter.com/B3rPl1BbS4— RT (@RT_com) September 28, 2025విల్మింగ్టన్కు సమీపంలోని సౌత్పోర్ట్ యాట్ బేసిన్ ప్రాంతంలో ఉన్న ‘అమెరికన్ ఫిష్ కంపెనీ’ అనే రెస్టారెంట్లో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్ సమీపంలో బోటులు వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా తుపాకీతో జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే బోటులో పరారయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పుల ఘటనను సిటీ మేనేజర్ నోవా సాల్డో ధ్రువీకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మృతుల వివరాలను, గాయపడిన పరిస్థితుల గురించి వివరాలను అధికారులు ఇంకా విడుదల చేయలేదు. స్థానికులు సంఘటనా ప్రాంతానికి దూరంగా ఉండాలని, సౌత్పోర్ట్ ప్రాంతానికి ఎవరూ రావొద్దని, ఇంటి లోపలే ఉండాలని మరియు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 911కు నివేదించాలని పోలిసులు కోరారు. బ్రున్స్విక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం, సౌత్పోర్ట్ పోలీస డిపార్ట్మెంట్కు సహాయం అందిస్తోంది. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశాయి.pic.twitter.com/0P055nihKy— TheBlaze (@theblaze) September 28, 2025 -
హెచ్-1బి వీసా రాని టెకీలకు కెనడా గాలం!
అమెరికాలో పనిచేస్తూ కొత్త ఫీజు, నిబంధనల కారణంగా హెచ్-1బి వీసా (H-1B Visa) పొందలేకపోయిన టెక్నాలజీ రంగ నిపుణలకు కెనడా దేశం గాలం వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త వీసా ఛార్జీలకు ముందు యూఎస్లో పనిచేసిన టెక్ ఉద్యోగులను తమ దేశానికి ఆకర్షించాలనుకుంటున్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ.తాజాగా లండన్లో విలేకరులతో మార్క్ కార్నీ మాట్లాడుతూ తమ ఆలోచనను బయటపెట్టారు. గతంలో హెచ్ -1బీ వీసాలు ఉన్న వారిని ఆకర్షించే అవకాశం స్పష్టంగా ఉందని కార్నీ వెల్లడించారు. అలాంటి వారిలో టెక్ రంగ ఉద్యోగులు చాలా మంది ఉన్నారని, వారంతా వేరే ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.కొత్త హెచ్ -1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ట్రంప్ గత వారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇంజనీరింగ్, ఇతర ఉద్యోగాల్లో ప్రపంచ ప్రతిభను తీసుకురావడానికి కొత్త హెచ్ -1బి ప్రోగ్రామ్పై ఆధారపడే కంపెనీలకు గందరగోళం, నిరాశను సృష్టించింది.కెనడా (Canada) ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ వ్యూహాన్ని సమీక్షిస్తున్నప్పుడు, ఈ రకమైన ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షించే అంశాన్ని గ్రహించడాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని, దానిపై "స్పష్టమైన సమర్పణ" ఉంటుందని కార్నీ చెప్పారు.హెచ్-1బి వీసాలు చేజారి, అమెరికాలో పని చేసేందుకు అవకాశాలు కోల్పోయినవారిని పలు ఇతర దేశాలు కూడా ఆకర్షిస్తున్నాయి. జర్మనీ, యూకే వంటి దేశాలు నైపుణ్యం కలిగిన కార్మికులకు ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా తమను తాము పేర్కొంటున్నాయి. -
ఆటో విడిభాగాలకు టారిఫ్ల దెబ్బ
న్యూఢిల్లీ: అధికస్థాయిలో యూఎస్ విధిస్తున్న టారిఫ్లు దేశీయంగా మొత్తం ఆటో విడిభాగాల తయారీని దెబ్బతీయనున్నట్లు రేటింగ్స్ సంస్థ ఇక్రా పేర్కొంది. ఇతర ఆసియా దేశాల ఎగుమతిదారులతో పోలిస్తే భారత్ నుంచి ఆటో విడిభాగాలను ఎగుమతి చేసే సంస్థలకు ఇది ప్రతికూలంగా పరిణమించనున్నట్లు తెలియజేసింది. ఇది భారత్, యూఎస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ప్రాధాన్యతను పట్టి చూపుతున్నట్లు పేర్కొంది. ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయంలో 30 శాతం ఎగుమతులనుంచే లభిస్తున్నట్లు తెలియజేసింది. దీనిలో ఒక్క యూఎస్ నుంచే 27 శాతం సమకూరుతున్నట్లు వివరించింది. వెరసి ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు దేశీయంగా మొత్తం ఆటో విడిభాగాల ఉత్పత్తిపై ప్రత్యక్షంగా 8 శాతం ప్రభావాన్ని చూపనున్నట్లు ఇక్రా తాజాగా అంచనా వేసింది. 15–30% టారిఫ్లను ఎదుర్కొంటున్న చైనా, జపాన్, వియత్నాం, ఇండొనేసియా తదితర ఆసియా దేశాలతో పోల్చితే భారత్ ఎగుమతిదారులకు ప్రతికూలమేనని తెలియజేసింది. -
రోజంతా చిన్న గదిలో బంధించారు
చండీగఢ్: అమెరికాలో దాదాపు 30 ఏళ్లుగా ఉంటూ.. ఏ ఒక్కరోజు కూడా ఏ తప్పూ చేయని తనను ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు అత్యంత దారుణంగా భారత్కు బలవంతంగా (డిపోర్ట్) పంపేశారని పంజాబ్కు చెందిన 73 ఏళ్ల హర్జిత్కౌర్ కన్నీటిపర్యంతమయ్యారు. కనీసం తన కుటుంబసభ్యులకు వీడ్కోలు కూడా చెప్పనివ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారన్న ఆరోపణలతో హర్జిత్కౌర్ను అరెస్టు చేసిన ఆ దేశ అధికారులు.. కొద్దిరోజుల క్రితం భారత్కు తిప్పి పంపారు. ఆమె శనివారం మొహాలీలోని తన సోదరి నివాసంలో మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు. అమెరికా అధికారులు తనతో అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఎందుకు అరెస్టు చేశారో కూడా చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కౌర్ స్వస్థలం పంజాబ్లోని తార్న్తరణ్ జిల్లా పంగోటా గ్రామం. భర్త చనిపోవటంతో ఆమె 1992లో ఇద్దరు కుమారులను తీసుకొని అమెరికా వెళ్లారు. కాలిఫోరి్నయాలోని ఈస్బేలో స్థిరపడ్డారు. శాశ్వత నివాసం కోసం ఆమె పెట్టుకున్న దరఖాస్తును 2012లో అమెరికా అధికారులు తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆమె స్థానిక ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) కార్యాలయానికి వెళ్లి హాజరు వేసుకుంటూనే ఉన్నారు. అలాగే ఈ నెల 8న ఐసీఈ కార్యాలయానికి వెళ్లిన ఆమెను రెండుగంటలపాటు కూర్చోబెట్టి.. అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. అధికారుల తీరుపై ఆమె కుటుంబసభ్యులు, స్థానిక సిక్కు ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవలే ఆమెను భారత్కు బలవంతంగా పంపేశారు. కూర్చునే అవకాశం కూడా ఇవ్వలేదు మోకాళ్ల సర్జరీ చేయించుకున్న తనను అమెరికా అధికారులు ఒక రాత్రంతా ఓ గదిలో బంధించి కనీసం కూర్చునే సౌకర్యం కూడా కల్పించలేదని హర్జిత్కౌర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ప్రతి ఆరు నెలలకు నేను ఐసీఈ ఆఫీస్కు వెళ్లి హాజరు వేయించుకునేదాన్ని ఈ నెల 8న అలాగే వెళ్లాను. కానీ, ఏ కారణం చెప్పకుండానే నన్ను అరెస్టు చేశారు. నా కుటుంబసభ్యులకు కనీసం వీడ్కోలు కూడా చెప్పే సమయం ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్లిపోయారు. నన్ను భారత్కు తామే తీసుకెళ్తామని నా కుటుంబసభ్యులు అధికారులకు తెలిపి, విమాన టికెట్లు చూపించినా వాళ్లు పట్టించుకోలేదు. నాకు అమెరికాలో వర్క్ పరి్మట్ ఉంది. ఐడీ, లైసెన్స్ అన్నీ ఉన్నాయి. అయినా అరెస్టు చేశారు’అని వాపోయారు. తనకు ఎదురైన పరిస్థితి ఎవరికీ ఎదురుకావద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఏం చెప్పనూ.. ! నా పరిస్థితి ఎవరికీ రాకూడదు. నన్ను అరెస్టు చేసిన తర్వాత అధికారులు నా ఫొటోలు తీసుకొని ఒక రాత్రంతా ఓ గదిలో ఉంచారు. అది చాలా చల్లని ప్రదేశం. నాకు కనీసం కూర్చునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. నా చేతులకు బేడీలు వేసి బంధించి శాన్ఫ్రాన్సిస్కో నుంచి బేకర్స్ఫీల్డ్కు తీసుకెళ్లారు. మందులు కూడా వేసుకోనివ్వలేదు. నా మొరను ఎవరూ పట్టించుకోలేదు. నేను పూర్తిగా శాకాహారిని. వాళ్లు నాకు గొడ్డుమాంసంతో కూడి భోజనం ఇచ్చారు. దీంతో నేను అది తినలేక చిప్స్, బిస్కట్లతోనే కడుపు నింపుకున్నాను’అని చెప్పారు. ఖైదీలకు వేసినట్లు నాకు ఓ యూనిఫాం వేసి పంపేశారు. నా మనవడు ‘ఈ డ్రస్లో నిన్ను చూడలేకపోతున్నా నానమ్మ’ అని బాధపడ్డాడు అని కౌర్ తెలిపారు. మళ్లీ అమెరికా వెళ్తా తాను మళ్లీ అమెరికా వెళ్లగలననే నమ్మకం ఉందని హర్జిత్ కౌర్ తెలిపారు. ‘భారత్లో నాకు ఉండటానికి ఏమీ లేదు. నా కుటుంబమంతా అమెరికాలోనే ఉంది. నా స్వగ్రామంలో నా ఇల్లు ఉందో కూలిపోయిందో కూడా తెలియదు. నేను మళ్లీ అమెరికా వెళ్లి నా కుటుంబాన్ని కలుస్తాననే నమ్మకం ఉంది’అని ఆశాభావం వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచి్చన తర్వాతే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. -
అమెరికా ఆంక్షలపై ద్వంద్వ వైఖరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మితిమీరిన టారిఫ్లతో చెలరేగిపోతున్నారు. గతంలో పెంచిన 25 సుంకాలకు అదనంగా ఇటీవలే భారత్పై మరోసారి భారీగా 25 శాతం సుంకాలు పెంచారు. అందుకు రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంటోందనే సాకు చెప్పారు. భవిష్యత్తులో ఈ దిగుమతులను తగ్గించుకుంటే సుంకాల నిలిపివేతపై ఆలోచిస్తామని ఉద్ఘాటించారు. అయితే రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులు, వాటి వ్యాపారంపై మాత్రం నోరు మెదపడంలేదు.ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే లక్ష్యంతో యూఎస్ అనేక ఆంక్షలను, వాణిజ్య పరిమితులను విధించింది. ఇందులో కొన్ని కీలకమైన రష్యా వస్తువులపై టారిఫ్లు పెంచినట్లు కూడా తెలిపింది. అయితే, రష్యా నుంచి ప్రస్తుతం అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల జాబితాను పరిశీలిస్తే ఈ టారిఫ్ల ఎఫెక్ట్ ఎంతమేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు రష్యా నుంచి చేసే వస్తువుల నుంచి లబ్ధి చేకూరుతుందనే భావిస్తే ట్రంప్ శత్రువునైనా ముద్దాడేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. కానీ, భారత్ మాత్రం తనకు చమురు తక్కువ ధరకు ఇచ్చే రష్యా నుంచి కొనుగోలు చేస్తే యూఎస్కు కంటగింపుగా ఉంది.అమెరికా కొన్ని ఆంక్షలు, వాణిజ్య నిషేధాలు ఉన్నప్పటికీ కీలకమైన వస్తువులు ఇంకా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇటీవల కొన్ని సర్వేల ప్రకారం.. అత్యధిక విలువ కలిగిన ఎగుమతుల్లో కొన్ని కింది విధంగా ఉన్నాయి.ఎరువులు (Fertilizers): అత్యంత ముఖ్యమైన దిగుమతుల్లో ఒకటి. వ్యవసాయ రంగంలో కీలకమైన భాస్వరం (Phosphorus), పొటాషియం (Potassium) ఆధారిత ఎరువులు ఇందులో ప్రధానం.విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు (Precious Stones, Metals, Coins): వజ్రాలు, విలువైన లోహాలు వంటివి ఇందులో ఉన్నాయి.కర్బనేతర రసాయనాలు (Inorganic Chemicals): వివిధ పరిశ్రమలకు అవసరమైన ముఖ్యమైన రసాయనాలను దిగుమతి చేసుకుంటోంది.యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు (Machinery, Nuclear Reactors, Boilers): న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన విడి భాగాలు ఇందులో ఉన్నాయి.ప్రాథమిక లోహాలు (Other Base Metals): పల్లాడియం, అల్యూమినియం వంటి లోహాలు.అమెరికా అవసరాలపై ప్రభావంఎరువుల కొరత, ధరల పెరుగుదలరష్యా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల్లో ఎరువులు అత్యంత ముఖ్యమైనవి. వీటిపై టారిఫ్లు లేదా ఆంక్షలు పెంచితే, అమెరికాలోని రైతులు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. ఎరువుల ధరలు పెరిగితే, ఆహార ధాన్యాల ఉత్పత్తి వ్యయం పెరిగి, అంతిమంగా అమెరికన్ వినియోగదారులకు ద్రవ్యోల్బణం (Inflation) రూపంలో భారం పడుతుంది. రష్యాను దెబ్బతీయడానికి విధించిన టారిఫ్లు, అమెరికా ప్రజల జేబులకే చిల్లు పెట్టే అవకాశం ఉంది. ఇది గ్రహించి యూఎస్ చాకచక్యంగా వ్యవహరిస్తోంది.కీలక లోహాలు, రసాయనాలుపల్లాడియం వంటి కొన్ని లోహాలు, రసాయనాలు రష్యా నుంచే ప్రధానంగా యూఎస్కు దిగుమతి అవుతున్నాయి. వీటిని ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఇతర కీలక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. సరఫరా గొలుసు (Supply Chain)లో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయాలు దొరికే వరకు ఈ దిగుమతులను నిలిపివేయడం లేదా టారిఫ్లు పెంచడం కష్టమైన పని.ఎంపిక చేసిన టారిఫ్లు..ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముందు అమెరికాకు రష్యా ప్రధానంగా ఎగుమతి చేసిన వస్తువుల్లో ముడిచమురు, గ్యాస్ వంటి ఎనర్జీ ఉత్పత్తులు ప్రధానంగా ఉండేది. యుద్ధం నేపథ్యంలో మొదట్లోనే వాటిపై సంపూర్ణ నిషేధం విధించారు. కానీ, అమెరికా పరిశ్రమలకు నిత్యావసరంగా ఉన్న ఎరువులు, న్యూక్లియర్ ఇంధనం (యురేనియం) వంటి వాటిపై మాత్రం టారిఫ్లు, ఆంక్షల అమలులో కొంతమేరకు సడలింపు ఇచ్చారనే చెప్పాలి. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినని వ్యవస్థల్లో మాత్రమే కఠిన ఆంక్షలు విధించారనే వాదనకు తావిస్తోంది.ఇతర దేశాలపై సెకండరీ టారిఫ్ల బెదిరింపులురష్యా నుంచి చమురు లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్న దేశాలపై ‘సెకండరీ టారిఫ్లు’ విధిస్తామని యూఎస్ బెదిరింపులకు పాల్పడుతోంది. ఇది అంతర్జాతీయంగా విమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలపై ఇటువంటి బెదిరింపులు వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో సంబంధం లేకుండా అమెరికన్ విదేశాంగ విధానాన్ని అడ్డంగా పెట్టుకుని అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే ప్రయత్నంగా కనిపిస్తోంది.చివరగా..రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నంలో భాగంగా టారిఫ్లను మరింత కఠినతరం చేస్తే అంతర్జాతీయ సరఫరా గొలుసులకు మరింత ఆటంకం ఏర్పడుతుందని యూఎస్ గుర్తెరుగాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరిగేందుకు దోహదం చేస్తుందని గ్రహించాలి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవడానికి టారిఫ్లపై కాకుండా, మరింత పటిష్టమైన, ప్రపంచ భాగస్వామ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
అదంతా పచ్చి అబద్ధం: ఎలాన్ మస్క్
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్తో డొనాల్డ్ ట్రంప్ను కొంతకాలం ఎలాన్ మస్క్(Elon Musk) ఇరుకునపెట్టడం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మస్క్.. ఒక్కసారిగా చల్లబడ్డారు. ఈ తరుణంలో మస్క్ పేరే ఎప్స్టీన్ ఫైల్స్లో కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్ను బయటపెట్టడం లేదంటూ ఈ ఏడాది జూన్లో మస్క్ సంచలన ఆరోపణలకు దిగారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ.. వరుసబెట్టి చేసిన ట్వీట్లన్నింటినీ డిలీట్ చేసుకుంటూ వచ్చారాయన. ఈ తరుణంలో.. అమెరికా హౌజ్ ఓవర్సైట్ కమిటీ విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ తాలుకా డాక్యుమెంట్లలో మస్క్ పేరు కనిపించింది.అందులో.. ఒక దగ్గర ఎలాన్ మస్క్ డిసెంబర్ 6న ఐల్యాండ్కు రావాలి అని ఉంది. దీంతో ఎప్స్టీన్కు చెందిన ప్రైవేట్ ద్వీపానికి మస్క్ వెళ్లారా? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. ఎలాన్ మస్క్ ఈ ఆరోపణను ఖండించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే.. మస్క్ ఎప్స్టీన్ ఫైల్స్పై ఇలా స్పందించడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఆయనకు, ఎప్స్టీన్కు మధ్య సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. తానెప్పుడు ఎప్స్టీన్ ఐల్యాండ్కు వెళ్లలేదని మస్క్ చెబుతూ వస్తున్నారు. మరోవైపు.. 8,544 పేజీల డాక్యుమెంట్లలో విమాన ప్రయాణాల వివరాలు, క్యాలెండర్లు, ఎప్స్టీన్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఉన్నాయి. కేవలం మస్క్ పేరు మాత్రమే కాదు.. అందులో ట్రంప్ సహా బిల్గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. అయితే పేర్లు ఉన్నంత మాత్రానా వాళ్లు ఎప్స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో భాగస్వాములు అయి ఉంటారనే నిర్ధారణ లేదని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చెబుతూ వస్తుండడం గమనార్హం.ఎవరీ ఎప్స్టీన్..అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్(Jeffrey Epstein)హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్.. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలపై ఎప్స్టీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే.. ఎఫ్బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని, ప్రాముఖ్యమైన వ్యక్తులపై నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే.. ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్ వివాహ వేడుకలోనూ ఎప్స్టీన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. ఈ సెక్స్ స్కాండల్ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు).. ట్రంప్ను కూడా ఎఫ్బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.ఆ విగ్రహం తొలగింపుఎప్స్టీన్ ఫైల్స్తో ట్రంప్ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వాషింగ్టన్లోని నేషనల్ మాల్ దగ్గర ట్రంప్- ఎప్స్టీన్ చేతులు కలిపి సరదాగా ఉన్న ఓ విగ్రహాన్ని సెప్టెంబర్ 23వ తేదీన ఏర్పాటు చేశారు. Best Friends Forever అనే క్యాప్షన్ అక్కడ ఉంచారు. ఇది జనాలను విపరీతంగా ఆకర్షించింది. అయితే.. నిబంధనల ఉల్లంఘన పేరిట ఆ మరుసటిరోజే అధికారులు దానిని అక్కడి నుంచి తొలగించారు. సీక్రెట్ షేక్హ్యాండ్ అనే సంస్థ ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
మన ఫార్మాపై ప్రభావం ఉండదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి వంద శాతం సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయంతో మన కంపెనీలపై తక్షణ ప్రభావం పడే అవకాశమేమీ ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ నిబంధన కేవలం పేటెంట్, బ్రాండెడ్ ఉత్పత్తులకే తప్ప జనరిక్ ఔషధాలకు కాదని వివరించాయి. చౌకైన, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ అంతర్జాతీయంగా ఔషధాల సరఫరా వ్యవస్థకి భారత్ మూలస్తంభంగా నిలుస్తోందని, 47 శాతం అమెరికా ఔషధ అవసరాలను తీరుస్తోందని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు. టారిఫ్ల ప్రభావం మన మీద ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ‘మనం చాలా మటుకు జనరిక్స్నే అందిస్తున్నందున పేటెంట్, బ్రాండెడ్ ఫార్మా దిగుమతులపై ప్రతిపాదిత 100 శాతం టారిఫ్లు భారత ఎగుమతులపై తక్షణ ప్రభావమేమీ చూపకపోవచ్చు. అంతేగాకుండా పలు బడా భారతీయ కంపెనీలు ఇప్పటికే అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తయారీ ప్లాంట్లు లేదా రీప్యాకేజింగ్ యూనిటను నిర్వహించడంతో పాటు ఇతర సంస్థల కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాయి‘ అని నమిత్ జోషి వివరించారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) కూడా మన ఫార్మాపై అమెరికా టారిఫ్ల తక్షణ ప్రభావమేమీ ఉండదని తెలిపింది. ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా తదితర 23 దేశీ దిగ్గజాలకు ఐపీఏలో సభ్యత్వం ఉంది. వీటికి ఔషధ ఎగుమతుల్లో దాదాపు 80 శాతం, దేశీ మార్కెట్లో సుమారు 64 శాతం వాటా ఉంది. కొత్త అవకాశాలపై ఇన్వెస్ట్ చేయాలి .. రాబోయే రోజుల్లో బల్క్ డ్రగ్స్, ఏపీఐలకు (యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్) సంబంధించిన వ్యయాలను మరింతగా తగ్గించుకుంటే ఇతర సరఫరాదారుల కన్నా భారత్ వైపే అమెరికా మరింతగా మొగ్గు చూపడానికి అవకాశం ఉందని జోషి చెప్పారు. అలాగే సంక్లిష్టమైన జనరిక్స్, పెప్టైడ్స్, బయోసిమిలర్స్ మొదలైన విభాగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. అమెరికాకు తమ ఎగుమతులు పెద్దగా లేనందున టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉండదని ఎమ్క్యూర్ ఫార్మా తెలిపింది. భారత ఫార్మా కంపెనీల జనరిక్ ఔషధాల సరఫరాతో 2022లో అమెరికా హెల్త్కేర్ వ్యవస్థకు 219 బిలియన్ డాలర్లు, 2013–2022 మధ్య కాలంలో 1.3 లక్షల కోట్ల డాలర్ల మేర ఆదా అయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వచ్చే అయిదేళ్లలో మరో 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అవుతుందనే అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఫార్మెక్సిల్ గణాంకాల ప్రకారం 2024–25లో అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 30.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనరిక్స్ మన బలం.. భారత్ బలం జనరిక్ ఔషధాలని, వీటికి టారిఫ్ల నుంచి మినహాయింపు ఉన్నందున భారత్పై ప్రభావం ఉండదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వీపీ దీపక్ జోత్వానీ తెలిపారు. అయితే, అమెరికా వెలుపల ఉంటూ, ఆ దేశానికి ఎగుమతి చేసే బ్రాండెడ్ డ్రగ్ కంపెనీలతో కొన్ని భారతీయ ఫార్మా సంస్థలకు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి సదరు కంపెనీలకు యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ)లాంటివి సరఫరా చేసే మన కంపెనీలపై పరోక్షంగా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అటు ప్రధానంగా జనరిక్స్నే ఎగుమతి చేస్తుంది కాబట్టి భారత్పై టారిఫ్ల ఎఫెక్ట్ ఉండదని, కాకపోతే ఈ పరిణామం, భవిష్యత్తులో దేశీయంగా ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి సవాళ్లు ఎదురు కావొచ్చని సూచిస్తోందని ఫౌండేషన్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ వ్యవస్థాపకుడు రాహుల్ అహ్లువాలియా చెప్పారు. ఈ నేపథ్యంలో మన కంపెనీలకు పెద్ద మార్కెట్లు అందుబాటులోకి వచ్చే దిశగా అమెరికా, యూరోపియన్ యూనియన్తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అటు అమెరికా వినియోగదారులపై టారిఫ్ల భారం మరీ ఎక్కువగా ఉండకుండా కొన్ని కేటగిరీలను మినహాయిస్తూ, తదుపరి చర్యలు ఉండొచ్చని అడ్వైజరీ సేవల సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ హెడ్ లూయీసీ లూ తెలిపారు. -
హెల్త్ కేర్ ఫ్రాడ్ : భారత సంతతి వైద్యుడికి 14 ఏళ్ల ఖైదు
అమెరికాలో హెల్త్కేర్ స్కామ్లో భారత సంతతి వైద్యుడికి శిక్షపడింది. హెల్త్ కేర్ ఫ్రాడ్ నియంత్రిత పదార్థాల చట్టవిరుద్ధ పంపిణీ నేరం భారత సంతతికి చెందిన వైద్యుడు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏడాది ప్రారంభంలో ఆరోగ్య సంరక్షణ మోసానికి నీల్ కె ఆనంద్ దోషిగా తేలాడు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పెన్సిల్వేనియాకు చెందిన వైద్యుడు 48 ఏళ్ల డా. ఆనంద్ 2 మిలియన్ల డాలర్లకు పైగా పరిహారాన్ని, 2 మిలియన్లపై జరిమానా పైగా జప్తు చెల్లించాలని ఆదేశించింది.బీమా చెల్లింపులను క్లెయిమ్స్ కోసం తన రోగులను గూడీ బ్యాగులను అంగీకరించమని బలవంతం చేసి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. డాక్టర్ ఆనంద్ మెడికేర్, యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (OPM), ఇండిపెండెన్స్ బ్లూ క్రాస్ (IBC) , ఆంథమ్ అందించిన ఆరోగ్య పథకాలకు తప్పుడు మరియు మోసపూరిత క్లెయిమ్లను సమర్పించడానికి కుట్ర పన్నాడు. వైద్యపరంగా అనవసరమైన ప్రిస్క్రిప్షన్ మందుల 'గూడీ బ్యాగులు' కోసం, వాటిని అతని యాజమాన్యంలోని ఇన్-హౌస్ ఫార్మసీలు రోగులకు పంపిణీ చేశాయి. ప్రిస్క్రిప్షన్లపై ముందే సంతకం చేయడం ద్వారా లైసెన్స్ కూడా లేని తన ఇంటర్న్లు మందులు సూచించడానికి అనుమతించాడు. ఆక్సికోడోన్ను పంపిణీ చేశాడు.ఓపియాయిడ్, నొప్పి నివారిణి అయిన ఆక్సికోడోన్ అమెరికాలో ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల్లో ఒకటి.ఇదీ చదవండి: బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తేఅలాగే ఆనంద్ ప్రిస్క్రిప్షన్లపై ముందస్తు సంతకం చేశాడు. లైసెన్స్ లేని మెడికల్ ఇంటర్న్లు డాక్టర్ ఆనంద్ ముందే సంతకం చేసిన ఖాళీ ఫారమ్లలో నియంత్రిత పదార్థాల కోసం ప్రిస్క్రిప్షన్లను పూరించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ పథకం కింద, డాక్టర్ అనేక మంది రోగులకు 20,850 ఆక్సికోడోన్ మాత్రలను ప్రిస్క్రైబ్ చేశాడు. మొత్తంగా, మెడికేర్, OPM, IBC,చ ఆంథమ్2.4 మిలియన్లకు పైగా మెడికల్ క్లెయిమ్లను చెల్లించాయి. జిల్లా న్యాయమూర్తి చాడ్ F కెన్నీ ప్రకారం, ఆనంద్ తన రోగుల అవసరాల కంటే దురాశ ,అక్రమ లాభాల ద్వారా ప్రేరేపించబడ్డాడు. రోగుల చిక్సత మీద దృష్టిపెట్టకుండా లాభాలకోసం చూసుకున్నారని కెన్నీ వ్యాఖ్యానించారు.ఏప్రిల్లో, డాక్టర్ ఆనంద్ ఆరోగ్య సంరక్షణ మోసం మరియు వైర్ మోసం, మూడు ఆరోగ్య సంరక్షణ మోసం, ఒక మనీలాండరింగ్, నాలుగు చట్టవిరుద్ధమైన ద్రవ్య లావాదేవీలు , నియంత్రిత పదార్థాలను పంపిణీ చేయడానికి కుట్ర పన్నినట్లు నిర్ధారించబడింది. భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అమెరికాన నేవీలో వైద్యుడిగా కూడా పనిచేశాడు. కాగా ఈ అన్ని ఆరోపణలను ఖండిస్తూ, డా. ఆనంద్, తని కుటుంబం 2001లో న్యూయార్క్లో జరిగిన 9/11 దాడుల బాధితులతో తాను ఎలా వ్యవహరించాడో వర్ణిస్తూ వివరణ ఇచ్చారు. రోగుల పట్ల ఆయనకున్నకరుణను నేరంగా పరిగణించడం అన్యాయమని డాక్టర్ కుటుంబం వాదించింది. -
సమస్యగా కాదు... సదావకాశంగా చూద్దాం!
హెచ్–1బీ వీసా రుసుమును పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా మనల్ని నిస్పృహకు గురి చేసినా... దీర్ఘ కాలంలో మేలు చేస్తుంది. నిజానికి మన ‘ఆత్మనిర్భర్’ నినాదానికీ, ‘అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడ’మనే ట్రంప్ పిలుపునకూ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. మరి దానిమీద మనం ఇంతగా స్పందించడం దేనికి? అమెరికా నిర్ణయం సుశిక్షితులైన, ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు అయిన భారతీయ వృత్తినిపుణుల సంఖ్యను ఆ దేశంలో తగ్గిస్తుంది. కొత్తగా కాలుమోపబోయే వారి సంఖ్య పరిమితమవుతుంది. అమెరికాకు వెళ్ళడాన్ని నిరుత్సాహపరుస్తుంది. కానీ, ఆ కోవకు చెందినవారికి అమెరికాలో కొరత ఉందన్నది కూడా వాస్తవం. అమెరికా కోణం నుంచి చూస్తే అది న్యాయబద్ధమైనదే. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు గైకొనే హక్కు ట్రంప్కు ఉంది. దానిపై మన స్పందన తార్కికమైనదిగా ఉండాలి.భారత నిపుణులను యూరప్ బలవంతంగా..భారతీయ పత్తి పరిశ్రమను 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు నాశనం చేశారు. నేతపనివారినీ, పత్తి పరిశ్రమలో పనిచేస్తున్న చాలా మందినీ బ్రిటన్కు తీసుకెళ్ళారు. మాంచెస్టర్ రాత్రికి రాత్రి పత్తి మార్కెట్ కేంద్రంగా అవతరించింది. భారతీయుల్లో చాలా మంది దాన్ని న్యాయవిరుద్ధమైన చర్యగానే పరిగణించారు. ఇంగ్లండ్ ఒక కిలో పత్తిని కూడా ఎన్నడూ పండించకపోయినా, యూరప్లోనే వస్త్ర పరిశ్రమకు చాలా ముఖ్యమైన కేంద్రంగా మాంచెస్టర్ రూపుదిద్దు కుంది. నిపుణులైన కార్మికులను భారత్ నుంచి బలవంతంగా తీసుకెళ్ళిన కారణంగానే అది సాధ్యమైంది. వాస్తవానికి, ట్రంప్ ఇపుడు దానికి విరుద్ధమైన పని చేస్తున్నారు. సాంకేతిక నిపుణులను లేదా నిపుణులైన సిబ్బందిని తమ దేశం నుంచి పంపించేయాలని చూస్తున్నారు. అమెరికాకు రాకుండా నివారిస్తున్నారు. కానీ, మనవారిని తీసుకెళ్ళడం వల్ల బ్రిటిష్ వారు బాగు పడినంతగా, మనవారిని పంపించేయడం వల్ల అమెరికా లబ్ధి పొందబోవడం లేదు.ప్రతిభావంతులను ఆకర్షించే వ్యవస్థ..ట్రంప్ నిర్ణయం ఆత్మనిర్భర్ భావనను మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళేందుకు పురికొల్పినదవుతుంది. ఇందుకు మన ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, నియంత్రణలపై దృష్టి పెట్టి కీలక రంగాల్లో సత్వర సంస్కరణలు తీసుకురావాలి. సర్వవిధాలా ప్రతిభావంతులను ఆకర్షించి, అండగా నిలిచి, నిలబెట్టుకుని ప్రోత్సహించే సరైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాలి. విశ్వవిద్యాలయాలను పటిష్ఠపరచాలి. హెచ్–1బీతో ట్రంప్ తాజా దాడి, ఐఐటీలు, ఐఐఎస్సీలు తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి తాజా గ్రాడ్యుయేట్లు తండోపతండాలుగా అమెరికాకు తరలిపోకుండా తగ్గించడానికి, ఇంకా చెప్పాలంటే ఆగిపోవడానికి కూడా తోడ్పడవచ్చు.కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం..అత్యంత ప్రతిభావంతులైన వృత్తినిపుణులను భారతదేశంలోనే అట్టిపెట్టుకునేందుకు, వారు భారతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేటట్లు చేసుకునేందుకు ఇది స్పష్టంగా నిజమైన అవకాశం కల్పిస్తోంది. విద్యార్థుల చదువు, శిక్షణలకు ప్రతి ఐఐటీ పైనా భారత్ రూ.1000 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. కానీ, వాటి నుంచి దేశం పూర్తి ఫలాలను నిజంగానే పొందడం లేదు. అమెరికా, యూరప్లకు చెందిన అనేక సంస్థల సీఈఓలుగా మన ఐఐటీ మెరికలు పని చేస్తూంటే వారి పేర్లు, పాత్రలను గొప్పగా చెప్పుకుంటూ గర్విస్తున్నాం. భారతీయుల ఆలోచనా శక్తి, వారసత్వం, ప్రజ్ఞాపాటవాలను ప్రపంచంలోని మిగిలిన దేశాలకు వినమ్రంగా, బలంగా, ఆత్మ విశ్వాసంతో చాటి చెప్పేందుకు, నిరూపించుకునేందుకు సమయం ఆసన్నమైంది.– ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డి, మాజీ వైస్ చాన్సలర్, యోగి వేమన యూనివర్సిటీ -
ట్రంప్ శాంతి దూత: షరీఫ్
న్యూయార్క్/ఇస్లామాబాద్: అమెరికా–పాకిస్తాన్ల మధ్య బంధం నానాటికీ బలపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు భారత్పై కన్నెర్ర చేస్తూ, మరోవైపు పాక్ పాలకులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజాగా వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పరస్పరం సహకారంతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించారు. గత ఆరేళ్లలో వైట్హౌస్లో అడుగుపెట్టిన మొట్టమొదటి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావడం గమనార్హం. ట్రంప్ను శాంతిదూతగా షరీఫ్ అభివరి్ణంచారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు నిలిపివేయడానికి ట్రంప్ నిజాయితీగా కృషి చేస్తున్నారని కొనియాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి ట్రంప్ సాహసోపేత, నిర్ణయాత్మక నాయకత్వమే కారణమని ఉద్ఘాటించారు. దక్షిణాసియాలో అతిపెద్ద యుద్ధం జరగకుండా ట్రంప్ నివారించారని పేర్కొన్నారు. ట్రంప్ నాయకత్వంలో అమెరికా–పాక్ సంబంధాలు రానున్న రోజుల్లో మరింత బలపడతాయని ఆశాభావం షెహబాజ్ షరీఫ్ వ్యక్తంచేశారు. వీలును బట్టి పాకిస్తాన్లో పర్యటించాలంటూ ట్రంప్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు పాక్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీ కంటే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఒక గొప్ప నాయకుడు వైట్హౌస్కు రాబోతున్నారని చెప్పారు. ఇది కూడా చదవండి: ‘ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి..’మారిన ట్రంప్ వైఖరి 2019 జూలైలో అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పర్యటించారు. వైట్హౌస్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ఇమ్రాన్ ఖాన్కు అతికష్టంమీద ట్రంప్ అపాయింట్మెంట్ దొరికింది. పాకిస్తాన్ అబద్ధాలు చెబుతోందని, అమెరికాకు దగా చేస్తూ సహాయం రూపంలో బిలియన్ల డాలర్ల నిధులు పొందుతోందని ట్రంప్ ఆ సమయంలో ఆరోపించారు. పాక్ భూభాగం ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన జో బైడెన్ కూడా పాకిస్తాన్ పట్ల వ్యతిరేకంగానే వ్యవహరించారు. పాక్ ప్రధానమంత్రులతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడేందుకు బైడెన్ ఇష్టపడలేదు. వారిని ఏనాడూ వైట్హౌస్కు ఆహ్వానించలేదు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారిపోయింది. పాక్ పట్ల పూర్తి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పట్ల ట్రంప్ అంతులేని అనురాగం ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. Just Now 🇵🇰🇺🇸🚨 Pakistan PM Shahbaz Sharif, Field Marshal Asif Munir with US President Donald Trump, and Secretary of State Marco Rubio at The White House.Photos 📷#America #MAGA #Pak #USA pic.twitter.com/VKOXTecLpx— Mayank (@mayankcdp) September 26, 2025


