breaking news
USA
-
ఇక వాళ్ళకే H1B వీసా.. ఎప్పటి నుంచి అమలంటే?
-
ఉషపై వ్యాఖ్యలు.. జేడీ వాన్స్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత సంతతికి చెందిన తన సతీమణి ఉషా వాన్స్ను తిట్టేవారిపై జేడీ వాన్స్.. అసహనం వ్యక్తం చేశారు. ఉషను జాతిపరంగా కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు వాన్స్ కౌంటరిచ్చారు. ఇటీవల తన పాడ్కాస్ట్లో ఉషను జాతిపరంగా కించపరిచేలా.. ఉపాధ్యక్షుడిని జాతి ద్రోహిగా పేర్కొంటూ నిక్ విమర్శలు చేశారు. దీనిపై వాన్స్ స్పందించారు. ఈ సందర్బంగ వాన్స్ మాట్లాడుతూ.. ‘నేను ఒకటే స్పష్టం చేయదలుచుకున్నా. నా భార్యపై విమర్శల దాడి చేసేవారు.. జెన్ సాకీగానీ, నిక్ ఫ్యూయెంటెస్గానీ.. వారు ఎవరైనాగానీ అశుద్ధం తినొచ్చు. అమెరికా ఉపాధ్యక్షుడిగా అది నా అధికారిక విధానం. ప్రజలను జాతిపరంగా, సంస్కృతిపరంగా జడ్జ్ చేసేవారిపట్ల నా వైఖరి ఇలాగే ఉంటుంది. వారు యూదులైనా, శ్వేతజాతీయులైనా అంతే. మనం అలా వ్యవహరించకూడదు’ అని స్పష్టం చేశారు.ఉద్యోగాలకు క్రైస్తవంతో లింకుపై విమర్శలు ఇక, అంతకుముందు.. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు, ఉపాధికి, మతానికి ముడిపెడుతూ మరోసారి నోటికి పని చెప్పారు. అమెరికా తాలూకు నిజమైన క్రైస్తవ గుర్తింపు కేవలం వ్యక్తిగత విశ్వాసాలకే పరిమితమైనది కాదు. ఈ దేశ ఉపాధికి, ముఖ్యంగా హెచ్–1బీ వీసాలకు కూడా సంబంధించినది. అమెరికా కంపెనీలు మూడో ప్రపంచ దేశాల నుంచి కారుచౌకగా ఉద్యోగులను దేశంలోకి గుమ్మరించడం సరికాదు. వ్యక్తి కుటుంబం ఎంత ముఖ్యమో, దేశ క్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తోందో పూర్తి అవగాహన కలిగివుండటం కూడా అంతే ముఖ్యం. అది మన కనీస బాధ్యత అంటూ సోమవారం వ్యాఖ్యలు చేశారు.‘ఇక్కడి ఉద్యోగాలను దేశీయులకు కట్టబెడుతున్న కంపెనీలకు జరిమానాలు విధిస్తున్నాం. ఎందుకంటే సొంత దేశంలో మంచి ఉద్యోగం చేయాలనే ఎవరికైనా ఉంటుంది. అమెరికన్ల ఆ కలలకు ఈ కంపెనీల తీరు తూట్లు పొడుస్తోంది అని వాన్స్ ఆరోపించారు. హెచ్–1బీ వీసాలకు పరిమితులు విధించేందుకు అదే కారణం. అమెరికా ఎన్నటికీ క్రైస్తవ దేశమే. ఆ విశ్వాసమే మనకు దిక్సూచి’ అన్నారు. వాన్స్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పలువురు అమెరికన్లు వారిని స్వాగతిస్తుండగా, చాలామంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు. -
గ్రీన్కార్డులపై గూగుల్ గుడ్న్యూస్
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసాతో గూగుల్ సంస్థలో పని చేస్తున్నవారికి శుభవార్త. వారి గ్రీన్కార్డు కలలకు త్వరలోనే మోక్షం లభించనుంది. తమ ఉద్యోగుల గ్రీన్కార్డు స్పాన్సర్షిప్ ప్రక్రియను వచ్చే ఏడాది వేగవంతం చేయబోతున్నట్లు గూగుల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత ఉద్యోగులకు సమాచారం చేరవేసింది.అమెరికాలో వేలాది మంది విదేశీయులు తాత్కాలిక వీసాలతో గూగుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కంపెనీ స్పాన్సర్షిప్తో శాశ్వత నివాసిత హోదా(గ్రీన్కార్డు) పొందాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. నిజానికి వారికి గత రెండేళ్లుగా గ్రీన్కార్డు జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అర్హులైన ఉద్యోగులకు గ్రీన్కార్డులు లభించడానికి వీలుగా ప్రోగ్రామ్ ఎల్రక్టానిక్ రివ్యూ మేనేజ్మెంట్(పెర్మ్) దరఖాస్తులు స్వీకరించడంతోపాటు వాటికి ప్రభుత్వం నుంచి త్వరగా ఆమోదం లభించేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గూగుల్ యాజమాన్యం తెలియజేసింది. ఉద్యోగ ఆధారిత గ్రీన్కార్డు పొందడంలో పెర్మ్ అనేది కీలకమైన ప్రక్రియ.అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు ఈ ప్రక్రియను విస్తృతంగా వాడుకుంటాయి. టెంపరరీ వర్క్ వీసాలపై పని చేస్తున్న తమ ఉద్యోగులకు పరి్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ వచ్చేలా సహకరిస్తాయి. పెర్మ్కు అర్హులైన వారికి వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గ్రీన్కార్డు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై గూగుల్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతర్గతంగా సమాచారం మాత్రం ఇచి్చంది.విదేశీ ప్రయాణాలు ఇప్పుడే వద్దు.. ఉద్యోగులకు అమెరికా టెక్ కంపెనీల సూచన అమెరికాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు వర్క్ వీసాలపై పని చేస్తున్న తమ ఉద్యోగులకు కీలక సూచన జారీ చేశాయి. విదేశీలకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే వాయిదా వేసుకోవాలని తెలియజేశాయి. అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పుడే వద్దని పేర్కొన్నాయి. విదేశాల్లోని అమెరికా ఎంబీసీలు, కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ చాలా ఆలస్యమవుతోంది. నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఏడాది కాలం పడుతోందని చెబుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లిరావడం కష్టమన్న ఉద్దేశంతోనే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని టెక్ కంపెనీలు సూచించాయి. ఈ మేరకు కొన్ని రోజులుగా తమ ఉద్యోగులకు సమాచారం అందిస్తున్నాయి. -
హెచ్–1బీ లాటరీకి చెల్లుచీటీ
న్యూయార్క్/వాషింగ్టన్: హెచ్–1బీ వీసాలపై కొంతకాలంగా కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కారు వాటి కట్టడి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాదారుల ఎంపికకు పాటిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం మంగళవారం ప్రకటించింది. ఇకపై అత్యధిక నైపుణ్యం, వేతనం ఉన్న వారికే ఆ వీసాల జారీలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టంచేసింది. దీంతో నైపుణ్యం తక్కువగా ఉన్న విదేశీఉద్యోగుల రాక తగ్గిపోయి ఆ ఉద్యోగాలు అమెరికన్లకు దక్కే అవకాశముంది. హెచ్–1బీ వీసాల జారీని ఇకపై యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్విసెస్(యూఎస్సీఐఎస్) ద్వారా చేపట్టనుంది. ‘‘ఇప్పటిదాకా కొనసాగిన కంప్యూటరైజ్డ్ హెచ్–1బీ వీసా లాటరీ వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైంది.దీనిని కంపెనీలు ఎంతగానో దుర్వినియోగం చేశాయి. విదేశీ ఉద్యోగులను కారుచవగ్గా తీసుకొచ్చి అమెరికాలో పని చేయించుకున్నాయి. ఫలితంగా ఐటీ తదితర ఉద్యోగాల్లో అమెరికన్లకు చాలా అన్యాయం జరిగింది. ఇకపై దీన్ని సరిదిద్దుతాం. ఇకపై నాలుగు రకాలుగా వేతనాలను వర్గీకరించి దానికనుగుణంగా హెచ్–1బీలను జారీచేస్తాం. ఎంట్రీ లెవల్ అభ్యర్థులు(1), అర్హత సాధించిన అభ్యర్థులు(2), అనుభవం ఉన్న అభ్యర్థులు(3), అత్యధిక నైపుణ్యమున్న అభ్యర్థులు(4)గా దరఖాస్తులను విభజించి ఆ మేరకే హెచ్–1బీ వీసాలను జారీచేయాలని ప్రతిపాదించాం. ఈ ప్రతిపాదనలను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ)కి సమీక్ష కోసం పంపించాం. అక్కడ ఆమోదం పొందాక ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురిస్తాం.ఆ తర్వాత 30 రోజులకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి’’ అని యూఎస్సీఐఎస్ అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ స్పష్టం చేశారు. హెచ్–1బీ వీసా విధానాన్ని సమూలంగా సంస్కరించాలన్న ట్రంప్ ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే అన్ని స్థాయిల్లో అర్హులకు వీసాలు లభించేలా చూసే ప్రయత్నం జరుగుతుందంటూ ఆయన ముక్తాయించారు. కొత్త విధానం వచ్చే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అమెరికాలో ఉన్నతోద్యోగాలు చేయాలన్న విద్యాధిక భారత యువత, ముఖ్యంగా ఐటీ జీవుల కలలపై ఈ నిర్ణయం మరిన్ని నీళ్లు చల్లింది. -
అతి పెద్దది, అత్యాధునికం అద్భుతాల యుద్ధ నౌక
వాషింగ్టన్: ప్రస్తుత యుద్ధ నౌకలన్నింటికంటే అతి పెద్దది. వేగంలో సాటి లేనిది. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు అణు క్షిపణులను, అత్యాధునిక హై పవర్డ్ లేజర్ క్షిపణులతో శత్రు దురి్నరీక్ష్యం. అటువంటి కనీవినీ ఎరగని యుద్ధ నౌకను ఒకదాన్ని అమెరికా తయారు చేయబోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఈ మేరకు స్వయంగా ప్రకటించారు. ‘కొత్త నౌకను నేనే డిజైన్ చేస్తా. ఎందుకంటే సహజంగా నేను మంచి సౌందర్యారాధకుణ్ణి‘ అని చెప్పుకున్నారు. దానికి ముద్దుగా బ్యాటిల్ షిప్ అని పేరు కూడా వెల్లడించారు. సాగర తలంలో అమెరికా రక్షణ కోసం తాను కలలుగంటున్న గోల్డెన్ ఫ్లీట్ ప్రాజెక్టులో ఇది కీలక భాగం కానుందని ఆయన తెలిపారు.ఇప్పటిదాక నిర్మితమైన అన్ని యుద్ధ నౌకల కంటే కూడా ఇది కనీసం 100 రెట్లు శక్తిశాలిగా ఉండనుందంటూ ఊరించారు. గోల్డెన్ ఫ్లీట్లోని నౌకలన్నీ అంతే శక్తిమంతంగా ఉంటాయని కూడా ట్రంప్ భవిష్యద్దర్శనం చేశారు. తన ముద్దుల బ్యాటిల్ షిప్కు యూఎస్ఎస్ డిఫైంట్గా నామకరణం చేస్తామని తెలిపారు. అయితే ట్రంప్ చెప్పినట్టుగా నౌకలపై అణు క్షిపణులను మోహరించడం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి విరుద్ధం అవుతుంది. కనుక ఇది ఎంతమేరకు ఆచరణసాధ్యం అన్నదానిపై ఎన్నో సందేహాలున్నాయి. అధ్యక్షునిగా తొలి టర్మ్లో కూడా నేవీని ఆధునీకరించేందుకు ట్రంప్ ఎన్నో పథకాలు ప్రకటించినా అవి చాలావరకు కాగితాలకే పరిమితమయ్యాయి. కష్టాల్లో యూఎస్ నేవీ అమెరికా నావికా దళం కొద్ది రోజులుగా కష్టాల్లో కొనసాగుతోంది. అంచనాలు దాటి మరీ అదుపు తప్పుతున్న వ్యయం కారణంగా చిన్న తరహా యుద్ధ నౌకల తయారీ ప్రాజెక్టును ఇటీవలే అటకెక్కించాల్సి వచ్చింది. ఫోర్డ్ శ్రేణికి చెందిన విమానవాహక నౌకల తయారీ ఆలోచన కూడా చివరి నిమిషంలో వెనక్కు తీసుకుంది. కొత్త నౌకల్లో ట్రంప్ గొప్పగా చెప్పుకున్న పలు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల ఏర్పాటులో కూడా విఫలమే అయింది. వంద కోట్ల డాలర్లతో ఏళ్ల తరబడి చేపట్టిన నౌకలపై రైల్ గన్ టెక్నాలజీ ప్రాజెక్టుకు కూడా 2021లో నేవీ మంగళం పాడింది. ఈ ఈనేపథ్యంలో నేవీ స్థైర్యాన్ని పెంచేందుకే ట్రంప్ సరికొత్త బ్యాటిల్ షిప్ ఆర్ చేసినట్టు భావిస్తున్నారు. అన్నీ అబ్బురాలే ట్రంప్ ఊరిస్తున్న సరికొత్త అత్యాధునిక యుద్ధ నౌకలో అన్నీ అబ్బురాలేనని గోల్డెన్ ఫ్లీట్ పేరిట అమెరికా నేవీ రూపొందించిన కొత్త వెబ్ సైట్ చెబుతోంది. ‘ఇదో గైడెడ్ మిస్సైల్ యుద్ధనౌక కానుంది. తక్కువ సిబ్బంది, ఎక్కువ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలు. శత్రు దుర్భేద్యంగా నిర్మాణం. ఇదే దీని మంత్రం. దీనిలో ప్రాథమిక స్థాయి ఆయుధాలే క్షిపణులు కానున్నా యి‘ అని అందులో రాసుకొచ్చారు. అయితే, దీని తయారీ బహుశా 2030 నాటికి మొదలు కావచ్చని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని నేవీ అధికారి ఒకరు చెప్పడం విశేషం! -
‘బాబ్బాబు.. టన్నుల్లో బంగారం ఇస్తాం.. ఆ దీవిని మాకిచ్చేయండి!’
వాషింగ్టన్:ప్రపంచంలోనే అతిపెద్ద దీవి గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కన్నేశారు. అపారమైన ఖనిజ సంపద, ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం కారణంగా ఆయన తాజాగా ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ అమెరికా దౌత్య ప్రయత్నాలను పునరుద్ధరించారు.గ్రీన్లాండ్లోని లిథియం, రాగి వంటి ఖనిజ సంపదను సొంతం చేసుకోవాలన్న అమెరికా ప్రయత్నాలు ఎప్పట్నుంచో సాగుతున్నాయి. 55–57 వేల మంది జనాభా ఉన్న ఈ దీవి, ఖనిజ సంపదతో పాటు భౌగోళికంగా కూడా కీలకంగా మారింది. 2016లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ గ్రీన్లాండ్ను అమెరికాలో కలపాలని ప్రయత్నాలు చేశారు. ‘గ్రీన్లాండ్ను మాకు ఇచ్చేయండి, 800 కోట్లు విలువ చేసే బంగారం ఇస్తాం’ అని ప్రతిపాదనలు పెట్టినా డెన్మార్క్ తిరస్కరించింది.అక్కడి ప్రజలు తమ ప్రాంతాన్ని అమెరికాలో కలపాలని కోరుకుంటున్నారని, డెన్మార్క్ వైఖరి వారికి నచ్చడం లేదని పలు మార్లు మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ గ్రీన్లాండ్పై దృష్టి సారించారు. ప్రత్యేక ప్రతినిధి నియామకం ద్వారా వాణిజ్య, భద్రతా, వ్యూహాత్మక అంశాలను బలపరచాలని సంకేతం ఇచ్చారు.గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ, డెన్మార్క్తో అనుబంధం కొనసాగుతోంది. దీనిపై డెన్మార్క్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం ‘ఖనిజ సంపద కోసం కాదు, అమెరికా జాతీయ భద్రత కోసం ఈ నిర్ణయం’ అని స్పష్టం చేశారు. ఈ నియామకం అమెరికా ఆర్కిటిక్ వ్యూహానికి కొత్త దిశను చూపిస్తోంది. -
హెచ్-1బీ వీసాల జారీ.. కీలక మార్పులు చేసిన అమెరికా
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాల జారీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్-1బీ కోసం ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) రద్దు చేసింది. బదులుగా వెయిటేజ్ సిస్టమ్ను ప్రవేశ పెట్టింది. తద్వారా ఉన్నత ఉద్యోగాలు,అధిక శ్రేణి వేతన దారులు, ఉన్నత నైపుణ్యం ఉన్న విదేశీయులకు మాత్రమే హెచ్-1బీ వీసా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27,2026 నుంచి ఈ కొత్త హెచ్-1బీ వీసా విధానం అమల్లోకి రానుంది. వీసా పరిమితి యథాతథంఅమెరికా ప్రభుత్వం ప్రకటించిన తాజా మార్పుల ప్రకారం..ప్రతి సంవత్సరం 65,000 హెచ్‑1బీ వీసాలు, అమెరికాలో ఉన్నత డిగ్రీ పొందిన వారికి అదనంగా 20,000 వీసాలు యథాతథంగా కొనసాగన్నాయి. అయితే, ఈ కొత్త విధానం అమెరికన్ కార్మికులను రక్షించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, భారతీయ ఐటీ రంగానికి తీవ్ర సవాళ్లు విసరనుంది. పెద్ద కంపెనీలు లాభపడతాయి, కానీ స్టార్టప్లు, తక్కువ వేతన ఆఫర్లు ఇచ్చే సంస్థలు వెనుకబడే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హెచ్-1బీ వీసాల జారీకి కీలక మార్పులుహెచ్-1బీ వీసాల జారీకి అమెరికా కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం విదేశీ సాంకేతిక నిపుణులందరికీ సమాన అవకాశాలిచ్చే లాటరీ పద్దతిని పూర్తిగా మార్చింది. మొత్తం 85వేల హెచ్-1బీ వీసాల జారీకి నాలుగు నాలుగు కేటగిరీల్లో లాటరీ తీసే పద్దతి ఉండేది.ఇందులో అత్యధిక వేతనం కలిగినవారికి లెవల్ 4 కేటగిరిగా పరిగణింపు. వేతనాన్ని బట్టి లెవల్-1,లెవల్-2, లెవల్-3 కేటగిరి ఉండగా.. లెవల్-4 అర్హత సాధించిన వారికి ఈ ఏడాదిలో నాలుగు సార్లు లాటరీకి అవకాశం. లెవల్-3 అర్హత సాధించిన వారికి మూడుసార్లు, లెవల్-2 అర్హత సాధించిన వారికి 2 సార్లు లాటరీకి ఛాన్స్, ఎంట్రీలెవల్ ఉద్యోగులకు ఒక్కసారి మాత్రమే లాటరీకి ఛాన్స్. ఇచ్చేది.తాజాగా, ఆ లాటరీ సిస్టంను తొలగించింది. బదులుగా వెయిటేజీ సిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. వాటి ఆధారంగా హెచ్-1బీ వీసాల జారీ ఉంటుంది. -
వెనిజులా ముడిచమురుపై డేగకన్ను
అమెరికా చరిత్రలో అతిపెద్ద మిలిటరీ ఖర్చు బిల్లును 2026 సంవత్సరానికి గానూ 90,100 కోట్ల డాలర్లతో ప్రతినిధుల సభ ఆమో దించింది. లాటిన్ అమెరికాలో సరికొత్త యుద్ధానికి ట్రంప్ సిద్ధమవుతున్న తరుణంలో, ఈ వ్యయ బిల్లు ఆమోదం కోసం డెమోక్రాట్లు కూడా రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడం గమనార్హం. ఇప్పటికే జూలైలో కేటాయించిన 15,600 కోట్ల డాలర్ల అనుబంధ సైనిక వ్యయ నిధులతో కలిపితే, 2026లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రోత్సహించడానికి అమెరికా మొత్తం లక్షా 5,700 కోట్ల డాలర్లను వెచ్చించనుంది. ‘ఆపరేషన్ దక్షిణ గోళం’ పేరిట కరేబి యన్ ప్రాంతానికి ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్లు, యుద్ధనౌకలను తరలించడం... 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత అతిపెద్ద సైనిక మోహరింపుగా పరిగణించవచ్చు. శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను అణచివేసే ఇఎ18జి వార్జెట్లు ఇప్పటికే ప్యూర్టోరికో చేరు కున్నాయి.అమెరికా చూపు ఇప్పుడు వెనిజులాలోని అపారమైన ముడి చమురు నిల్వలపై పడింది. ప్రపంచంలోనే అత్యధికంగా 20 శాతం ముడిచమురు నిల్వలు (సుమారు 30,000 కోట్ల బారెల్స్) ఈ చిన్న దక్షిణ అమెరికా దేశంలోనే ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. గతంలో అధ్యక్షుడు ఛావెజ్ చమురు పరిశ్రమలను జాతీయం చేసి, 2005లో భూసంస్కరణల ద్వారా సామాన్య రైతాంగాన్ని భూస్వాముల నుండి విముక్తి చేశారు. అదే ఏడాది 13 లాటిన్ అమెరికా దేశాలు కలిసి వాణిజ్య సమాఖ్యగా ఏర్పడి స్వల్ప ధరలకే ముడిచమురును అమ్ముకోవాలని ఒప్పందం చేసుకున్నాయి. 2008లో బ్యాంకులను జాతీయం చేయడం, రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అమెరికా ఆయిల్ కంపెనీల ఆధిపత్యాన్ని వెనిజులా తగ్గించింది. ఇవన్నీ అమెరికాకు మింగుడుపడని అంశా లుగా మారాయి.ప్రస్తుతం ‘మాదక ద్రవ్యాల ఉగ్రవాదం’ ముసుగులో మదూరో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వాషింగ్టన్ కుయుక్తులు పన్నుతోంది. ‘కార్టెల్ ఆఫ్ సన్స్’ అనే సంస్థతో వెనిజులా నాయకత్వానికి సంబంధాలు ఉన్నాయని అమెరికా ఆరోపిస్తుండగా, అధ్యక్షుడు మదూరో, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ వాదనలను తిరస్క రిస్తున్నారు. వెనిజులా ప్రజలకు మద్దతుగా నిలుస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ బహిరంగంగా ప్రకటించారు.యుద్ధ తంత్రాన్ని అమెరికా మరింత క్రూరంగా మార్చి, నేరుగా భూభాగంలోకి సైన్యాన్ని పంపకుండా క్షిపణులు, డ్రోన్ల సహాయంతో దాడులు చేసే వ్యూహంలో ఉంది. ఇటీవల డ్రోన్ల దాడిలో కొందరు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడం దీనికి నిదర్శనం. ఆయుధ కంపెనీలకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా అమెరికా ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తోంది.గత నాలుగేళ్లలో ఉక్రెయిన్కు 17,000 కోట్ల విలువైన ఆయుధాలను, ఇజ్రాయెల్కు భారీగా ఆయుధ సామగ్రిని సరఫరా చేస్తూ అమెరికా తన యుద్ధ దాహాన్ని ప్రదర్శిస్తోంది. పశ్చిమా సియాలో చమురు ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్ను అంగరక్షకుడిగా వాడుకున్నట్లే, ఇప్పుడు దక్షిణ అమెరికాలోని వెనిజులాలో తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. 1946 నుండి ఇప్పటివరకు ఇజ్రాయెల్కు సుమారు 35,000 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించిన అమెరికా, ఇప్పుడు సహజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా వెనిజులాపై దాడికి సిద్ధమవు తోంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ సాగుతున్న ఈ యుద్ధ క్రీడలో వెనిజులా ఇప్పుడు బలిపీఠంపై ఉంది.– జమిందార్ బుడ్డిగఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
ట్రంపరితనం.. 30 దేశాల్లో రాయబారుల తొలగింపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 30 దేశాల్లోని రాయబారుల్ని, ఇతర సీనియర్ స్థాయి అధికారుల్ని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బదులుగా వారి స్థానంలో వేరే వారిని నియమించనున్నారు. తొలగించిన రాయబారులు, ఇతర రాయబార కార్యాలయం సీనియర్ స్థాయి సిబ్బందిని వేరే విభాగాల్లో విధులు అప్పగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విదేశాల్లో అమెరికన్ పౌరులను రక్షించడం, విదేశీ వ్యవహారాలపై అధ్యక్షుడికి సలహా ఇవ్వడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి విభాగాల కిందకు వచ్చే స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకారం.. ఇది సాధారణ సిబ్బంది మార్పులలో భాగమేనని చెబుతున్నప్పటికీ.. ట్రంప్ ప్రభుత్వం దీన్ని అమెరికన్ ఫస్ట్ విధానంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా ప్రయోజనాలను కాపాడేలా లక్ష్యంతో కొత్త రాయబారులను నియమించాలన్న ఉద్దేశమేని తెలిపింది.ప్రభావిత దేశాలుఆఫ్రికా: అత్యధికంగా ప్రభావితమైన ఖండం. బురుండి, కామెరూన్, కేప్ వెర్డే, గాబోన్, ఐవరీ కోస్ట్, మడగాస్కర్, మారిషస్, నైజర్, నైజీరియా, రువాండా, సెనెగల్, సోమాలియా, ఉగాండా ఇలా మొత్తం 13 దేశాల్లో రాయబారులు తొలగింపుకు గురయ్యారు. ఆసియా: ఫిజీ, లావోస్, మార్షల్ దీవులు, పాపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, వియత్నాం -ఆరుదేశాలు యూరప్: ఆర్మేనియా, మాసిడోనియా, మోంటెనెగ్రో, స్లోవేకియా -నాలుగు దేశాలు మధ్యప్రాచ్యం: అల్జీరియా, ఈజిప్ట్ – 2 దేశాలు.ఇతర దేశాలు: నేపాల్, శ్రీలంక, గ్వాటెమాలా, సురినామ్లు ఉన్నారు. ఈ రాయబారులందరూ జో బైడెన్ పాలనలో నియమితులయ్యారు. అయితే, తాజాగా తొలగింపుల నేపథ్యంలో ట్రంప్.. వీరిందని తొలగించే లక్ష్యంగా బుధవారం అధికారికంగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో పేర్కొన్న దేశాల్లో నిరాయబారుల వెనక్కి రావాలని ప్రకటించారు. సాధారణంగా రాయబారులు 3–4 సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు. అయితే, వారు అధ్యక్షుడి ఇష్టప్రకారం పనిచేస్తారు. తొలగింపుకు గురైన వారు తమ ఫారిన్ సర్వీస్ ఉద్యోగాలను కోల్పోవడం లేదు. అమెరికాకు తిరిగి వచ్చి ఇతర విభాగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.ఈ నిర్ణయం వల్ల అమెరికా విదేశాంగ విధానంలో పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆసియా, యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల్లో అమెరికా సంబంధాలు కొత్త రూపం దాల్చే అవకాశం ఉంది. బైడెన్ పాలనలో ఏర్పడిన కొన్ని ఒప్పందాలు మారే అవకాశం ఉంది. -
అమెరికాలో నల్లగొండ యువకుడు మృతి
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లికి చెందిన పవన్ కుమార్ రెడ్డి అమెరికాలో మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం పవన్ కుమార్ రెడ్డి అమెరికా వెళ్లాడు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. అంతలోనే పవన్ కుమార్ రెడ్డి ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
అబ్బే.. అది ట్రంప్ బ్యాచ్ పనేం కాదట!
అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగిన వేళ.. ఎప్స్టీన్ సె* కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్లో మాయమైన ట్రంప్ ఫొటో తిరిగి ప్రత్యక్షం అయ్యింది. ఫోటోను తొలగించడంలో ట్రంప్ బ్యాచ్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే.. అందులో నిజం లేదని, తాత్కాలికంగా రివ్యూ కోసమే వాటిని తొలగించినట్లు అమెరికా న్యాయశాఖ తాజాగా ఒక స్పష్టత ఇచ్చింది.జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన ఫొటోను, కీలక పత్రాలను డెమొక్రట్లతో కూడిన హౌజ్ఓవర్ కమిటీ సమక్షంలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ బయటపెట్టింది. ఇందులో ఎప్స్టీన్కు సంబంధించిన వేల ఫొటోలు, కీలక సమాచారంతో కూడిన లక్షల ప్రతాలు ఉన్నాయి. అయితే.. అందులో నుంచి కొన్ని ఫొటోలు, డాక్యుమెంట్లు కనిపించకుండా పోవడంతో డెమొక్రటిక్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రత్యేకించి ట్రంప్ తన భార్య మెలానియా.. ఎప్స్టీన్, అతని సహయకురాలు గిస్లేన్ మాక్స్వెల్తో దిగిన ఫొటో, అలాగే ట్రంప్ కొందరు అమ్మాయిలతో దిగిన ఫొటోలు మాయమయ్యాయి.ఈ చర్యను ట్రంప్ను రక్షించేందుకు చేసిన ప్రయత్నమని డెమొక్రాట్లు ఆరోపించారు. మరోవైపు.. హౌస్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీస్ ఈ వ్యవహారంపై పూర్తి విచారణ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో.. ట్రంప్ ఫోటోను అమెరికా న్యాయ శాఖ మళ్లీ పునఃప్రచురించింది.అయితే.. ఆ ఫొటో తొలగింపు వెనుక ఎవరి ప్రమేయం లేదని న్యాయశాఖ స్పష్టత ఇచ్చింది. ఎవరి వ్యక్తిగత ప్రయోజనం కోసమే వాటిని తొలగించలేదు. ఆ ఫొటోల్లో ఎప్స్టీన్ బాధితులు ఎవరైనా ఉన్నారా? అని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు రివ్యూకు పంపారు. సమీక్ష అనంతరం అందులో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఎలాంటి మార్పులు లేకుండానే తిరిగి ప్రచురించాం. ఇది బాధితుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశమే అని ఎక్స్ ఖాతాలో జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక పోస్ట్ చేసింది.ప్రముఖ ఇన్వెస్టర్గా గుర్తింపు పొందిన జెఫ్ ఎప్స్టీన్కు ట్రంప్, బిల్గేట్స్, బిల్ క్లింటన్, మైకేల్ జాక్సన్.. పలువురు సినీ ప్రముఖలతోనూ మంచి సంబంధాలు ఉండేవి. అయితే.. అందులో కొందరి లైంగిక ఆనందం కోసం జెఫ్రీ ఎప్స్టీన్ అమ్మాయిలను సరఫరా చేసేవాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మీటూ ఉద్యమ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యాక.. సంచలనాలు వెలుగు చూడొచ్చని అంతా భావించారు. ఈ క్రమంలో.. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్పటి నుంచి ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం అమెరికాలో హాట్ టాపిక్గా మారింది.ట్రంప్ హయాంలో ఎప్స్టీన్ ఫైల్స్ విషయాలు బయటకు వస్తాయని అంతా భావించారు. అయితే అలా జరగకపోవడంతో ట్రంప్ తీరుపైనే డెమొక్రట్లు, ట్రంప్ వ్యతిరేకులు అనుమానాలు వ్యక్తం చేయసాగారు. అయితే ఎప్స్టీన్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టత ఇస్తూ వస్తున్నారు. అటు డెమొక్రట్లతో పాటు ఇటు రిపబ్లికన్ల నుంచి ఎదురైన ఒత్తిళ్ల నడుమ చివరకు ఫైల్స్ బయటకు వచ్చాయి. ఇందులో ఎప్స్టీన్కు సంబంధించిన ఫోటోలు, ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్టులు, కాల్ లాగ్స్, కోర్టు పత్రాలు ఉన్నాయి. అయితే, బాధితులను ఎఫ్బీఐ చేసిన ఇంటర్వ్యూలు, అభియోగాలపై అంతర్గత న్యాయశాఖ నివేదికలు లేవంటూ డెమొక్రటిక్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే.. లక్షల పేజీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని.. బాధితుల గోప్యతను కాపాడేందుకు సమీక్ష ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని.. ఇందులో 200 మందికి పైగా న్యాయవాదులు పాల్గొంటున్నారని న్యాయశాఖ అంటోంది. సమీక్ష ముగిశాక.. అందులో వివరాలను యధాతథంగానే ప్రచురిస్తామని స్పష్టత ఇస్తోంది. -
అంధకారంలో శాన్ఫ్రాన్సిస్కో
వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో భారీ విద్యుత్ అంతరాయం చోటుచేసుకుంది. డిసెంబర్ 20న జరిగిన ఈ ఘటనలో 1,30,000 ఇళ్లకు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలోని రిచ్మండ్, ప్రెసిడియో, గోల్డెన్ గేట్ పార్క్ పరిసరాల్లో అంధకారం నెలకొంది. ఈ విద్యుత్ అంతరాయం PG&E కంపెనీ వినియోగదారులలో మూడో వంతు మందిని ప్రభావితం చేసింది.రెస్టారెంట్లు, షాపులు మూతపడ్డాయి. వీధి దీపాలు, క్రిస్మస్ అలంకరణలు ఆరిపోయాయి. దీంతో తాము కరెంట్ కోతతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు,ఫొటోల్ని షేర్ చేస్తున్నారు.నగరవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. బస్టాండ్,రైల్వేస్టేష్టన్లు కార్యకాలపాలు ఆగిపోయాయి.ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అత్యవసర ప్రయాణాలు తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు8వ స్ట్రీట్ సమీపంలో ఉన్న పీజీ అండ్ ఈ సబ్ స్టేషన్లో మంటలు చెలరేగడంతో కొంత భాగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అగ్నిమాపక శాఖ తెలిపింది.సాయంత్రం 4గంటలకు సమస్యల్ని నివారించినట్లు విద్యుత్శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, విద్యుత్ పూర్తిగా ఎప్పుడు పునరుద్ధరిస్తామోనన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. -
తులసి గబ్బార్డ్ వివాదాస్పద వ్యాఖ్యలు
వాషింగ్టన్: తులసి గబ్బార్డ్.. ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేని పేరు. ట్రంప్ ప్రభుత్వంలో నేషనల్ ఇంటెలిజెన్స్ అధిపతిగా కొనసాగుతున్న ఆమె వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. తాజాగా,‘ఇస్లామిక్ సిద్ధాంతం అమెరికా ప్రజాస్వామ్యానికి విరుద్ధం’అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. AmFest 2025 పేరుతో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఇటీవల పలు దేశాల్లో జరిగిన ఉగ్రదాడులపై ఘాటుగా స్పందించారు. ఇస్లామిక్ సిద్ధాంతం అమెరికా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అందుకే చట్టపరమైన, రాజకీయ వ్యవస్థల ద్వారా ఇస్లామిక్ సూత్రాలను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆమె ఈ సందర్భంగా.. న్యూ జెర్సీ నగరాన్ని మొదటి ముస్లిం నగరంగా పేర్కొన్నారు. అక్కడ ఇస్లామిక్ సిద్ధాంతాలను చట్టాల ద్వారా,లేదంటే బలవంతంగా అమలు చేస్తున్నారు. ఇది కేవలం భవిష్యత్తులో జరుగుతుందని అనుకుంటే పొరబడినట్లే. ఇప్పటికే అమెరికా సరిహద్దులలో జరుగుతోంది. హ్యూస్టన్ వంటి నగరాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇస్లామిజం అనేది వ్యక్తిగత స్వేచ్ఛను తిరస్కరించే రాజకీయ సిద్ధాంతం.ఇస్లామిజం ఉన్నచోట వ్యక్తిగత స్వేచ్ఛ లేదా స్వాతంత్ర్యం ఉండదు. ఇది అమెరికా స్వేచ్ఛా వ్యవస్థకు పూర్తిగా విరుద్ధం. అమెరికా వ్యవస్థ దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ అనే నమ్మకంపై ఆధారపడి ఉందని, ఇస్లామిక్ సిద్ధాంతాలు ఈ మూల సూత్రాన్ని విస్మరిస్తాయని పునరుద్ఘాటించారు. అయితే,ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ, మతపరమైన వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యల్ని స్వాగతించారు. -
ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ డాటా గాయబ్
అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ కలకలం కొనసాగుతోంది. డెడ్లైన్ గడువు దగ్గర పడుతుండడంతో కీచకుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధం ఉన్న ఫొటోలను, కీలక పత్రాలను బయట పెడుతున్నారు. ఈ క్రమంలో.. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని ఫైల్స్ మాయం కావడం సంచలనంగా మారింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్కు సంబంధిం తాజాగా.. 24 గంటల్లోనే కనీసం 16 ఫైళ్లు అదృశ్యమయ్యాయి. అందులో ఒక ఫోటోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎప్స్టీన్లతో పాటు ట్రంప్ భార్య మెలానియా, ఎప్స్టీన్ క్రైమ్ పార్ట్నర్ గిస్లేన్ మ్యాక్స్వెల్ ఉన్నట్లు తెలుస్తోంది. మాయమైన ఫైల్స్లో ట్రంప్కు సంబంధించిన కీలక సమాచారం ఉందనేది హౌజ్ ఓవర్సైట్ కమిటీలోని డెమొక్రట్ల ప్రధాన ఆరోపణ. మరోవైపు.. ఆ ఫైల్స్ను ఎందుకు తొలగించాల్సి వచ్చిందనేదానిపై అధ్యక్ష భవనం వైట్హౌజ్ ఇప్పటిదాకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పొరపాటున జరిగిందా?.. ఏదైనా కారణంతో చేశారా? అనేదానిపై ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే విడుదలైన ఆ డాక్యుమెంట్లలో.. బాధితులను దర్యాప్తు ఏజెన్సీ ఎఫ్బీఐ చేసిన ఇంటర్వ్యూలు, అంతర్గత మెమోలు వంటి కీలక పత్రాలు కనిపించకపోవడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి.. కొంత కాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఎప్స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే రెండు దీవుల్లో(ప్రైవేట్ ఐల్యాండ్)లో.. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి(ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు). ఎప్స్టీన్ ఫైల్స్లో.. మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అయితే.. అలా జరగలేదు. ఎప్స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే.. ఒకప్పుడు అతనితో స్నేహం ఉండేదని, అరెస్ట్ తర్వాత అతన్నొక మానవ మృగంగా భావించి దూరం పెట్టానని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఆ ఫైల్స్ను పారదర్శకంగా రిలీజ్ చేయించేందుకు తాను సిద్ధమని అంటూనే.. జాప్యం చేస్తూ వచ్చారాయన. ఈ క్రమంలో.. సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తుండటంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. వాటిని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ కూడా బిల్లును ఆమోదించడంతో ఇటీవలే దానిపై సంతకం పెట్టారు. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాల్సి ఉంది.లేటెస్ట్ రిలీజ్లో.. మొత్తం 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, 3,500 ఫైల్స్, భారీగా ఫోటోలను ఇప్పటిదాకా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది. ఇందులో.. ఆయుర్వేదం, అందులో పేర్కొన్న పలు మసాజ్ పద్ధతుల గురించిన ప్రస్తావన ఉండటం విశేషం. అలాగే.. ట్రంప్ సహా పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్న ఫోజులు, ఆయన ఐల్యాండ్లో సేదతీరిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఐల్యాండ్స్లోని విలాసాలు.. అలాగే కొన్ని నగ్న ఫొటోలు కూడా అందులో ఉన్నాయి. డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు సంబంధించి మాత్రం చాలా ఫొటోలు ఉండటం విశేషం. వాటిలో ఆయన హాట్ టబ్లో, పూల్లో పలువురు మహిళలతో సేదదీరుతూ కనిపిస్తున్నారు. ఆయనేగాక పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నాటి పలువురు హాలీవుడ్ హీరోలు ఎప్ స్టీన్ పార్టీలకు హాజరైన ఫొటోలు కూడా విడుదలైన ఫైల్స్లో ఉన్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఫొటోల్లో.. ఫైల్స్లో డొనాల్డ్ ట్రంప్కు ఇబ్బంది కలిగించే అంశాలేవీ పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతరకరంగా లేని కొన్ని ఫొటోలు మాత్రమే ఉన్నాయి. -
ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం.. ఉలిక్కిపడ్డ అమెరికా,ఇజ్రాయెల్
జెరుసలేం: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఇరాన్ తన బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోందన్న ఆందోళనలతో అమెరికా, ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వచ్చేవారం (డిసెంబర్29) కీలక సమావేశానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరనున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి.ఇరాన్ గత కొన్నేళ్లుగా తన బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్పై దృష్టిసారించింది. ఇటీవల 10,000 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త మిసైల్ను ఆవిష్కరించింది. ఇది అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరగలదని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఈ పరిణామంపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందిస్తూ, ఇరాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట తీర్పారబట్టే ప్రయత్నాలు చేస్తోంది.ఇజ్రాయెల్ ఆందోళనఇరాన్ మిసైల్ శ్రేణి ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకునే స్థాయికి చేరుకుందని, ఇది మధ్యప్రాచ్య భద్రతకు తీవ్రమైన ముప్పు అని నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అమెరికా తక్షణ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ట్రంప్ ఇరాన్పై కఠిన వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో, నెతన్యాహు ఈ సమావేశాన్ని ఒక అవకాశంగా చూస్తున్నారు. ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్పై యూరోపియన్ యూనియన్ సహా అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం మరింత కఠిన చర్యలు అవసరమని పట్టుబడుతోంది.భవిష్యత్ ప్రభావంఈ సమావేశం ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు రెండు దేశాలు కలిసి వ్యూహాత్మక చర్యలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ భవిష్యత్తులో మధ్యప్రాచ్య శాంతి, భద్రతకు కీలక సవాలు అవుతుందని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో నెతన్యాహు–ట్రంప్ సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకోనుంది. -
అధికబరువుతో బాధపడేవారికి గుడ్ న్యూస్
అధిక బరువు ఊబకాయంతో నానాబాధలు పడుతున్నవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బరువు తగ్గడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడే ఒక కొత్త గట్ బాక్టీరియాను పరిశోధకులు కనుగొన్నారు. ఈ స్పెషల్ బాక్టీరియాను అమెరికాలోని ఉటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకలపై చేసిన అధ్యయనాలలో, టురిసిబాక్టర్ అని పిలువబడే ఒక నిర్దిష్ట రకం గట్ బాక్టీరియా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని, బరువు పెరగడాన్ని తగ్గిస్తుందని ఉటా విశ్వవిద్యాలయం బృందం కనుగొంది. ప్రస్తుతం మార్కెట్లో బరువు తగ్గించే ఇంజెక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజసిద్ధంగా ఈ సమస్యను అధిగమించేందుకు ఈ పరిశోధన మార్గం సుగమం చేయగలదని భావిస్తున్నారు.ట్యూరిసిబాక్టర్ (Turicibacter) అనే పేగు బాక్టీరియా బరువు పెరుగుదలను నియంత్రించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్టు గుర్తించారు. ఊబకాయం ఉన్నవారిలో టురిసిబాక్టర్ తక్కువగా ఉంటుంది. ఇది మానవులలో కూడా ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుంది. గట్ బాక్టీరియాను సర్దుబాటు చేయడం ద్వారా బరువును నియంత్రించడానికి కొత్త మార్గాల అన్వేషణకు ఈ ఫలితాలు దారితీయవచ్చని సెల్ మెటబాలిజం జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో పరిశోధకులు జూన్ రౌండ్, కేంద్ర క్లాగ్ తెలిపారు. రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిని, హైఫ్యాట్ డైట్లోని సెరామైడ్ స్థాయిలను రాడ్ ఆకారంలోని టురిసిబాక్టర్ సింగిల్ హ్యాండెడ్గా తగ్గిస్తుందని కను గొన్నామన్నారు. అయితే టురిసిబాక్టర్ ప్రభావాలు ప్రత్యేకంగా ఉండే అవకాశం లేదు; విభిన్నమైన గట్ బాక్టీరియా బహుశా జీవక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అలాగే జంతు నమూనాల ఆధారంగా ఈ ఫలితాలు ప్రజలకు వర్తించకపోవచ్చని కూడా చెప్పారు.అధిక కొవ్వు ఆహారంతో సెరామైడ్ స్థాయిలు పెరుగుతాయి. అధిక స్థాయి సిరామైడ్లు టైప్ 2 డయాబెటిస్ మరియు గుండె జబ్బులతో సహా అనేక జీవక్రియ రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటాయి. కానీ టురిసిబాక్టర్ ఉత్పత్తి చేసే కొవ్వులు అధిక కొవ్వు ఆహారం మీద ఎలుకలకు కూడా సిరామైడ్ స్థాయిలను తక్కువగా ఉంచుతాయి. ట్యూరిసిబాక్టర్ చిన్న ప్రేగు ద్వారా గ్రహించబడే కొవ్వు అణువులను ఉత్పత్తి చేయడం ద్వారా జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఎలుకలలో బరువు తగ్గడాన్ని గమనించినప్పటికీ, ఇది మానవులలో ఎంతవరకు సాధ్యపడుతుందని అనేది చూడాలన్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహించేందుకు, అధిక బరువు పెరగకుండా నిరోధించే చికిత్సలను అభివృద్ధి చేయడానికి టురిసిబాక్టర్, ఈ ప్రభావాన్ని చూపే లిపిడ్ను గుర్తించడం భవిష్యత్తులో ఇది తొలి ఫ్యాక్టర్ కాగాలదని పరిశోధకులు తెలిపారు. అలాగే వ్యక్తిగత సూక్ష్మజీవులను మరింత పరిశోధించడం ద్వారా, భవిష్యత్తులో సూక్ష్మ జీవులను ఔషధంగా తయారు చేయగలమనీ, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో వివిధ కీటకాల కన్సార్టియంను సృష్టించడానికి సురక్షితమైన బ్యాక్టీరియాను గుర్తించే అవకాశం ఉందని అని వర్సిటీ పరిశోధకుడు క్లాగ్ అన్నారు.గట్ మైక్రోబయోమ్లోని తేడాలు - గట్లోని బ్యాక్టీరియా, శిలీంధ్రాలు - ఊబకాయం మరియు బరువు పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయి, మైక్రోబయోమ్ను మార్చడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపడే అవకాశాన్ని పెంచుతుంది. కానీ వ్యక్తి ప్రేగులో వందలాది విభిన్న సూక్ష్మజీవుల జాతులు ఉంటాయి, ఏ జాతి సహాయపడుతుందో చెప్పడం కష్టతరం. అయితే ఈ ఫలితాలు మానవులకి కూడా వర్తిస్తే, ట్యూరిసిబాక్టర్-ఉత్పన్న సమ్మేళనాలు జీవక్రియ ఆరోగ్యం, ఆరోగ్యకరమైన బరువును ప్రోత్సహించడానికి ప్రభావవంతమైన చికిత్సా విధానాలుగా ఉంటాయనడంలో సందేహం లేదు. -
సిరియా అల్లకల్లోలం.. అమెరికా ప్రతీకార దాడులు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, సిరియా మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. సిరియాలోని (Syria) ఉగ్రస్థావరాలపై అమెరికా (US Strikes on Syria) దళాలు విరుచుకుపడుతున్నాయి. అమెరికన్లపై ఉగ్రదాడికి ప్రతిగా సిరియాలోని ఉగ్రమూకలను టార్గెట్ చేసి అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. కాగా, ఈ నెల 13న సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్రూప్కు చెందిన ఉగ్రవాది దాడిలో ముగ్గురు అమెరికన్లు మరణించగా, మరో ముగ్గురు సర్వీస్ సభ్యులు గాయపడిన విషయం తెలిసిందే. దీనికీ ప్రతిగా సిరియాలోని ఉగ్రమూకలపై అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. ఈ మేరకు తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ప్రకటించారు. ఈ సందర్బంగా సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులను ఏరివేయడానికి ‘ఆపరేషన్ హాక్ఐ స్ట్రైక్’ను (Operation Hawkeye Strike) ప్రారంభించామని తెలిపారు. ఉగ్రమూకల అరాచకాలకు ధీటుగా జవాబిచ్చామన్నారు.- The U.S. Armed Forces launched Operation Hawkeye Strike, a large-scale retaliatory operation targeting dozens of Islamic State (ISIS) and ISIS-affiliated military sites across northern and central Syria.The strikes were conducted in direct respo...pic.twitter.com/dcxWpkV28p— Ashley Williams (@ashley_wil38239) December 20, 2025ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో ఈ దాడులు ఐసిస్ బలమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాద సమూహాన్ని లక్ష్యంగా చేసుకునే అమెరికా ప్రయత్నానికి పూర్తిగా మద్దతు ఇస్తున్న సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అమెరికన్లపై దాడి చేసే దుర్మార్గులైన ఉగ్రవాదులందరికీ ఈ దాడి ఓ హెచ్చరిక. మీరు ఏ విధంగా అమెరికాపై దాడి చేసినా లేదా బెదిరించినా గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా మీరు దెబ్బతినవలసి వస్తుంది వార్నింగ్ ఇచ్చారు.CENTCOM releases footage from Operation Hawkeye Strike , a massive retaliatory assault on ISIS in Syria.Over 100 precision munitions used by U.S. & Jordanian forces to destroy 70+ ISIS targets across northern & central Syria. pic.twitter.com/xsC15zkqOe— TRIDENT (@TridentxIN) December 20, 2025మరోవైపు, పీట్ హెగ్సెత్ స్పందిస్తూ.. సిరియాలోని ఐసిస్ ఫైటర్లు, ఆయుధాగారాలు, మౌళికవసతులను నాశనం చేసేందుకు అమెరికా దళాలు ఆపరేషన్ హాక్ఐ స్ట్రైక్ ప్రారంభించాయని తెలిపారు. అయితే, ఇది యుద్ధానికి ప్రారంభం కాదు. ప్రతీకారం మాత్రమే అని చెప్పుకొచ్చారు. గత శనివారం (డిసెంబర్ 13న) పాల్మైరాలో అమెరికా దళాలపై జరిపిన దాడికి ప్రతిగా దీనిని చేపట్టామన్నారు. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికా ప్రజలను రక్షించడానికి ఎప్పుడూ వెనకడుగు వేయం అని చెప్పారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా అమెరికా మిమ్మల్ని వేటాడి, కనిపెట్టి నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. U.S. forces deliver decisive retaliation against ISIS in Syria following the attack that claimed the lives of two American soldiers. Operation Hawkeye Strike is underway, A-10 Warthogs, Apache helicopters, and other assets launching into the night to dismantle ISIS targets.… pic.twitter.com/ouxNAl6cfp— Freyja (@FreyjaTarte) December 20, 2025 -
అసత్యాలు... అర్ధ సత్యాలు
సొంత శిబిరంలో విభేదాలూ, అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థ, కానరాని ఉపాధి కల్పన, మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల తిరస్కరణ వగైరాలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ఊపిరాడనీయటం లేదని వైట్హౌస్ వేదికగా ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగం తేటతెల్లం చేసింది. పాత సంవత్సరానికి వీడ్కోలుగా, అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా ఆయన చేసిన ఈ ప్రసంగం ఒకపక్క స్వోత్కర్షలతో, మరోపక్క సంజాయిషీలతో నిండిపోయింది. అసత్యాలు, అర్ధ సత్యాలు సరేసరి. తరచు వైట్హౌస్ వేదికగా జరిగే మీడియా సమావేశాల్లో ఆయన చేసే వ్యాఖ్యలకూ, ఈ ప్రసంగానికీ కాస్తయినా తేడా లేదు. స్వీయ వైఫల్యాలను నిష్క్రమించిన అధ్యక్షుడు జో బైడెన్ ఖాతాకు మళ్లించి... జరగని యుద్ధాలనూ, జరిగినా తన ప్రమేయం లేకుండా ముగిసిన యుద్ధాలనూ, ఆపినా మళ్లీ మొదలైన యుద్ధాలనూ సైతం తన విజయంగా ప్రకటించుకున్నారు. అందులో భారత్–పాక్ సంఘర్షణ ఒకటి. వలసదారులను దేశం విడిచి వెళ్లేలా చేసి అలా ఆదా చేసిన సొమ్మంతా అమెరికన్ పన్ను చెల్లింపుదారులకు ఉచితంగా వైద్యం, విద్య రూపంలో అందిస్తున్నామని ట్రంప్ చెప్పుకొన్నారు. ఇళ్ల అద్దెలు తగ్గాయనీ, ఉద్యోగాలు వచ్చిపడ్డాయనీ, పెట్టుబడులు రప్పించాననీ ప్రకటించుకున్నారు.నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి వలసదారుల తోడ్పాటు ఎంతో ఉంది. దేశంలో అగ్ర సంస్థలుగా పేరొందిన వాటిలో 46 శాతం... అంటే 230 కంపెనీలు వలసదారులూ, వారి పిల్లలూ స్థాపించినవే. ఈ ఏడాది న్యూ అమెరికన్ ఫార్చ్యూన్–500లో చేరిన పది కంపెనీల్లో సగం వలసదారులవే. 2023 గణాంకాల ప్రకారమైతే ఆ ఏడాది వలసదారులు సృష్టించిన సంపద లక్షా 70 వేల కోట్ల డాలర్లు. వారు పన్ను రూపంలో చెల్లించిన మొత్తం 65,200 కోట్ల డాలర్లు. వాస్తవాలు ఇవి కాగా, చట్టవిరుద్ధంగా వచ్చినవారితోపాటు అమెరికా పౌరసత్వం పొందినవారిని సైతం ట్రంప్ ప్రభుత్వం రాచి రంపాన పెడుతోంది. వారిలో అనవసర భయాందోళనలను సృష్టిస్తూ, ప్రజల్లో అనైక్యత తీసుకురావటానికి అబద్ధాలను ప్రచారంలో పెడుతోంది. ఆయన వచ్చాక వలస వ్యవహారాల న్యాయమూర్తులుగా వున్న 100 మందిని తొలగించారు. టానియా నెమెర్ అనే మహిళా న్యాయమూర్తిని ఒక కేసు విచారిస్తుండగానే కారణం చెప్పకుండా బెంచ్ నుంచి, ఆ తర్వాత సర్వీసు నుంచి తొలగించారు. ప్రస్తుత వైఫల్యాలకు కారణం గతంలోని అస్తవ్యస్తతే కారణమని చెప్పడం ఇటీవల అన్ని దేశాల్లోనూ పాలకులకు అలవాటైన విద్య. ట్రంప్ సైతం ఆ పాటే పాడారు. నిజానికి జో బైడెన్ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. వలసదారులను తరిమేయటం ద్వారా దాన్ని మరింత గొప్పగా మారుస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో ట్రంప్ పదే పదే చెప్పారు. కానీ జరిగిందంతా వేరు. ఇష్టానుసారం ప్రపంచ దేశాలపై సుంకాలు పెంచటం వల్ల దేశీయ వినియోగదారులు సగటున 16.8 శాతం అదనంగా పన్నులు చెల్లించాల్సి వస్తున్నదనీ, 1935 నుంచి చూస్తే ఇదే అత్యధికమనీ యేల్ బడ్జెట్ ల్యాబ్ అంచనా వేసింది. దిగుమతైన సరుకులపై ప్రభుత్వం విధించే అదనపు సుంకాలను అంతిమంగా భరించేది అమెరికా వినియోగదారులే. ట్రంప్ అనుకూల ఫాక్స్ న్యూస్ సర్వేలో 72 శాతం మంది గడ్డు ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటు న్నామని చెప్పగా, 58 శాతం మంది ఆయన అనుచిత విషయాలపై శ్రద్ధ పెడుతున్నారని అన్నారు. ఇక అక్టోబర్, నవంబర్ నెలల్లో 41,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగిత 4.6 శాతానికి ఎగబాకింది. 2021 తర్వాత ఈ స్థాయికి పోవటం ఇదే ప్రథమం. గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయటానికి ప్రయత్నిస్తూ మాదక ద్రవ్యాలపై పోరాడుతున్నానని చెప్పుకోవటం ట్రంప్కే చెల్లింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తశుద్ధితో చర్చించి, వాటి పరిష్కారానికి తాను అనుసరిస్తున్న విధానాలేమిటో చెప్పి భవిష్యత్తు బాగుంటుందని చెప్పివుంటే కనీసం కొందరైనా నమ్మేవారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఒప్పుకొంటే, దానికి జవసత్వా లిచ్చేందుకు ఆయన ఏదో ఒకటి చేస్తారన్న ఆశయినా మిగిలేది. దానికి బదులు అంతా సవ్యంగా ఉందని చెప్పడం వల్ల ట్రంప్పై కొద్దో గొప్పో ఉన్న విశ్వాసం కూడా దెబ్బతింది. ఆయన రేటింగ్ పడిపోవటంలో ఆశ్చర్యమేముంది? -
Green Card: ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్గా ప్రసిద్ధి చెందిన గ్రీన్కార్డ్ లాటరీను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. అదే సమయంలో ఎంఐటీ ప్రొఫెసర్ హత్యకు గురయ్యారు. ఈ దుర్ఘటనకు కారణం పోర్చుగీస్ జాతీయుడు క్లాడియో నేవెస్ వాలెంటే (48)నని అమెరికా పోలీసులు గుర్తించారు. వాలెంటే అమెరికాలోకి ప్రవేశించేందుకు గ్రీన్ కార్డ్ లాటరీని అస్త్రంగా ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ క్రమంలో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వ్యక్తులు అమెరికాలో అడుపెట్టేందుకు అనర్హులు. అందుకే, అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు USCIS గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపివేస్తోంది’ అని తెలిపారు. గ్రీన్కార్డ్ కేటాయింపులు ఇలాప్రతి సంవత్సరం 50వేల గ్రీన్కార్డులను అమెరికాలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న దేశాల అభ్యర్థులకు కేటాయిస్తారు. వీటిలో ఎక్కువగా ఆఫ్రికా దేశాల అభ్యర్థులు ఉంటారు. 2025 లాటరీకి దాదాపు 2 కోట్ల మంది దరఖాస్తు చేశారు. వారిలో కుటుంబ సభ్యులను కలుపుకొని 1,31,000 మందిని ఎంపిక చేశారు. పోర్చుగీస్ పౌరులకు కేవలం 38 స్లాట్లు మాత్రమే లభించాయి. ఈ ప్రోగ్రామ్ను అమెరికా కాంగ్రెస్ సృష్టించింది. కాబట్టి దీని నిలిపివేతపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా, ట్రంప్ చాలా కాలంగా ఈ లాటరీకి వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల ఘటనతో గ్రీన్కార్డ్ లాటరీ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ ప్రకటించారు.ఇదిలా ఉండగా..ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా వలస విధానాలపై చర్చకు దారితీశాయి. భద్రతా కారణాల వల్ల తీసుకున్న ఈ చర్య.. అమెరికాలో స్థిరపడాలనుకున్న విదేశీయులపై ప్రతికూల ప్రభావం పడనుంది.The Brown University shooter, Claudio Manuel Neves Valente entered the United States through the diversity lottery immigrant visa program (DV1) in 2017 and was granted a green card. This heinous individual should never have been allowed in our country. In 2017, President Trump…— Secretary Kristi Noem (@Sec_Noem) December 19, 2025 -
బరిలోకి అమెరికా.. చైనా వ్యూహం ఏంటి?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగియక ముందే.. చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం కలవరపెడుతోంది. ఇది చివరికి చైనా–అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ ద్వీపం పూర్తిగా తనదేనని ముందు నుంచీ చెబుతూ వస్తున్న చైనా ఈ మధ్య దూకుడు పెంచింది. దాన్ని తనలో కలిపేసుకునేందుకు అవసరమైతే బలప్రయోగానికీ వెనకాడేది లేదని హెచ్చరికలు చేస్తోంది.మరోవైపు.. తైవాన్కు రక్షణగా అగ్రరాజ్యం అమెరికా నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా తైవాన్కు 1,110 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించింది. ఈ భారీ ఆయుధ విక్రయ ప్యాకేజీలో భాగంగా ఆ దేశానికి మధ్య శ్రేణి క్షిపణులు, శతఘ్నులు, డ్రోన్లను అందించనుంది. ఒకవైపు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగిస్తుండగా మరోవైపు అమెరికా ప్రభుత్వం ఆయుధ విక్రయంపై ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ విక్రయానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ట్రంప్ ప్రభుత్వ ఈ ప్రకటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామం తమకు, అమెరికాకు మధ్య కుదిరిన దౌత్య ఒప్పందాలకు విఘాతం కలిగిస్తుందని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఇది చైనా సార్వభౌమాధికారానికి, భద్రతకు, ప్రాంతీయ సమగ్రతకు భంగం కలిగించి ప్రాంతీయ సుస్థిరతను భగ్నం చేస్తుందని పేర్కొంది.ఏమిటీ వివాదం?చైనా, తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దాంతో నాటి దేశ పాలకుడు, మావో ప్రత్యర్థి చియాంగ్కై షేక్ దేశం విడిచి తైవాన్లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచీ తైవాన్ దాదాపుగా స్వతంత్రంగానే కొనసాగుతూ వస్తోంది. దాదాపు 2.3 కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తూ వస్తోంది. దాన్ని చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైనా నిత్యం ఒత్తిడి తెస్తుంటుంది. తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతిచ్చినందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశమైన లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుంది! కేవలం 16 దేశాలు మాత్రమే తైవాన్తో అధికారికంగా దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఒక స్పష్టతంటూ లేదనే చెప్పాలి.BREAKING; CHINA warns the United States to "immediately stop" arming TAIWAN.China strongly condemned the United States for approving a massive $11.1 billion arms sale package to Taiwan, with officials urging the US to "immediately stop" arming the island.Chinese Foreign… pic.twitter.com/bDstNkNDJk— Global Surveillance (@Globalsurv) December 19, 2025అమెరికాకు సంబంధమేంటి?చైనాలో విప్లవం నేపథ్యంలో 1970ల దాకా 30 ఏళ్ల పాటు తైవాన్ ప్రభుత్వాన్నే చైనా మొత్తానికీ ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. కానీ 1979లో చైనాతో అమెరికాకు దౌత్య తదితర సంబంధాలు ఏర్పాటయ్యాయి. దాంతో తైవాన్తో దౌత్య తదితర బంధాలకు, రక్షణ ఒప్పందాలకు అమెరికా అధికారికంగా స్వస్తి పలికింది. కానీ అనధికారంగా మాత్రం తైవాన్తో సంబంధాలను విస్తృతంగా కొనసాగిస్తూనే వస్తోంది. చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా ఆత్మరక్షణ కోసం తైవాన్కు ఆయుధ విక్రయాలను కూడా కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి గుండా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది. అందుకోసం చైనా, తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలన్నది అమెరికా వాదన.చైనా దాడికి దిగేనా?తైవాన్ను విలీనం చేసుకునేందుకు బలప్రయోగానికి వెనకాడేది లేదని చైనా పదేపదే చెబుతూనే ఉంది. 2049కల్లా ‘అత్యంత శక్తిమంతమైన చైనా’ కలను నిజం చేసేందుకు తైవాన్ విలీనం తప్పనిసరని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రకటించారు కూడా. చైనా ఫైటర్ జెట్లు, బాంబర్లు, నిఘా విమానాలు నిత్యం తైవాన్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇవన్నీ త్వరలోనే సైనిక ఘర్షణకు దారి తీసే అవకాశం లేకపోదని విశ్లేషకులు చెబుతున్నారు.యుద్ధ సవాళ్లు.. ఒకవేళ చైనా, తైవాన్, అమెరికా మధ్య యుద్ధం జరిగితే.. దీని ప్రభావం ఆసియాపై మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. తైవాన్ ప్రపంచంలోనే అత్యధికంగా సెమీకండక్టర్ ఉత్పత్తి చేసే దేశం. Taiwan Semiconductor Manufacturing Company (TSMC) ప్రపంచంలో అత్యంత ఆధునిక చిప్ తయారీదారుగా ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం జరిగితే టెక్నాలజీ రంగం దెబ్బతింటుంది. ఏఐ, స్మార్ట్ఫోన్ల తయారీ, రక్షణ రంగంపై ముఖ్యంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే, తైవాన్ సమస్యపై యుద్ధం జరిగితే అది కేవలం ద్వైపాక్షికంగా కాకుండా జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలను కూడా ప్రభావితం చేస్తుంది. తైవాన్ ఆర్థిక వ్యవస్థలో 60% కంటే ఎక్కువ భాగం ఎగుమతులపై ఆధారపడి ఉంది. తైవాన్కు అమెరికా, చైనా ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. మొత్తం మీద.. తైవాన్ భవిష్యత్తు కేవలం ఆసియా భద్రతకే కాదు, ప్రపంచ టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకంగా ఉంది. -
తెగిన నరాలకు అతుకు వేస్తున్నారు!
లక్ష కిలోమీటర్లు.. మనిషి శరీరంలోని చిన్నా పెద్దా నరాల పొడవు ఇది!. ప్రమాదం కొద్దో లేక ఇంకో కారణంతోనో ఈ నరాలు తెగాయి అనుకోండి. అతుకుపెట్టడం చాలా కష్టం. ఒకవేళ పెట్టినా అవి మునుపటిలా పూర్తిస్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. నరాలు సరిగ్గా అతుక్కోకపోతే స్పర్శజ్ఞానం పోవచ్చు. లేదంటే విపరీతమైన నొప్పి బాధపెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో పక్షవాతం లాంటి విపరీత సమస్య కూడా ఎదురు కావచ్చు. అయితే.. ఇకపై ఈ సమస్యలు చాలావరకూ లేకుండా పోతాయి. ఎందుకంటారా? అమెరికాలోని ఓ కంపెనీ తెగిన నాడులను సరిగ్గా అతుకుపెట్టేందుకు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది మరి!. తెగిన నరాలను వైద్యులు ఇప్పటివరకూ కుట్లు వేయడం ద్వారా మాత్రమే జత చేస్తున్నారు. చాలా సూక్ష్మమైన నరాల విషయానికి వచ్చినప్పుడు మైక్రోస్కోపుల్లో చూసుకుంటూ కుట్లు వేస్తూంటారు. ఫలితంగా నాడుల్లో సమస్యలు కొనసాగే ప్రమాదం ఉంటుంది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు టిసియం అనే సంస్థ ‘కోఆప్టియమ్ కనెక్ట్’ పేరుతో ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కొత్త టెక్నాలజీలో కుట్లు వేయడం అన్నది ఉండనే ఉండదు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన ఒక చిన్న గొట్టం లాంటిది తయారు చేస్తారు. రెండుపక్కల తెగిన నరాలను జొప్పించి దగ్గరకు తీసుకొస్తారు. ఆ తరువాత గొట్టానికి రెండు చివర్లలో ప్రత్యేకమైన బయో ప్లాస్టిక్ జిగురులాంటిది వేసి సీల్ చేస్తారు. అంతే.. తెగిన నరాల భాగాలు రెండూ ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. సహజసిద్ధంగా కలిసిపోతాయి. కొంత సమయం తరువాత గొట్టం, బయో ప్లాస్టిక్ కూడా నిరపాయకరంగా శరీరంలోకి కలిసిపోతాయి. వాస్తవానికి ఈ టెక్నాలజీని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంతో కాలం క్రితమే అభివృద్ధి చేసింది. జెఫ్రీ కార్ప్ అండ్ బాబ్ లాంగర్స్ ల్యాబ్లో దీనిపై ప్రయోగాలూ జరిగాయి. విజయవంతమయ్యాయి కూడా. ఈ శస్త్రచికిత్స జరిగిన తరువాత నాడుల పనితీరు పూర్వ స్థితికి చేరుకోవడమే కాకుండా.. కనీసం ఏడాది పాటు ఎలాంటి నొప్పి కూడా కనిపించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ చికిత్స కేవలం నాడులకు మాత్రమే పరిమతం కాకపోవడం. శరీరం లోపలి భాగాలు బయటకు వచ్చే హెర్నియాతోపాటు గుండె కణజాలం అభివృద్ధి వరకూ వేర్వేరు చోట్ల వాడుకునే అవకాశం ఉంది. టిసియం సంస్థ అభివృద్ధి చేసిన ఈ కొత్త టెక్నాలజీకి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. గుండె, హెర్నియా తదితర విషయాలకు సంబంధించిన టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని కంపెనీ చెబుతోంది.:: గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఘోర విమాన ప్రమాదం, నాస్కార్ మాజీ డ్రైవర్తో సహా ఏడుగురు దుర్మరణం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నార్త్ కరోలినాలోని స్టేట్స్విల్ రీజనల్ ఎయిర్పోర్ట్లో గురువారం ఉదయం 10:15 గంటలకు సెస్నా C550 విమానం కూలిపోయిందని అధికారులు నిర్ధారించారు. ప్రమాదంలో మరణించిన ఏడుగురిలో ప్రముఖ నాస్కార్ మాజీ డ్రైవర్, అతని కుటుంబం ఉన్నారని కార్-రేసింగ్ సంస్థ తెలిపింది. ఫ్లోరిడాకు బయలుదేరిన సెస్నా సి550 బిజినెస్ జెట్ టేకాఫ్ టేకాఫ్ అయిన 26 నిమిషాల తర్వాత విమానం తిరిగి రావడానికి ప్రయత్నించింది కానీ కూలిపోయింది. దీంతో NASCAR ఛాంపియన్ గ్రెగ్ బిఫిల్ తన భార్య, పిల్లలతో కలిసి విమాన ప్రమాదంలో మరణించాడు. మరో ముగ్గురు కూడా మరణించారు. వారిలో మరో తండ్రి కుమారుడు ఉన్నారు. వచ్చే వారం తన 56వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా బిఫిల్ ఆకస్మిక మరణం అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.విమానం కూలిపోవడానికి ముందు పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి జెఫ్ కోలీ తెలిపారు. బిఫిల్ కుటుంబ సభ్యులంతా ఒకేసారి మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిచర్డ్ హడ్సన్ పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి. ఎవరీ గ్రెగ్ బిఫిల్ రేసింగ్తో మక్కువతో కరియర్లో ఎంతో రాణించి, NASCAR హాల్ ఆఫ్ ఫేమ్కు నామినేట్ అయ్యే స్థాయికి ఎదిగిన వ్యక్తి బిఫిల్ అని రేషింగ్ అభిమానులు చెబుతున్నారు. నాస్కార్ చరిత్రలోని ప్రముఖ రేసర్లలో 75 మందిలో ఒకరిగా గుర్తింపు పొందిన బిఫిల్, తన ప్రతిభతో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నాడు. 1998లో NASCAR క్రాఫ్ట్స్మ్యాన్ ట్రక్ సిరీస్లో రూకీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. 2000లో అదే సిరీస్లో ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్నాడు.రేసింగ్ పట్ల ఆయనకున్న మక్కువ, సమగ్రత, అభిమానులు, తోటి పోటీదారుల పట్ల ఆయనకున్న నిబద్ధత క్రీడపై శాశ్వత ప్రభావాన్ని చూపాయంటూ కార్-రేసింగ్ సంస్థ బిఫిల్కు నివాళులర్పించింది. రేసింగ్తోపాటు, గత సంవత్సరం హెలీన్ హరికేన్ తర్వాత నార్త్ కరోలినాలో బిఫిల్ తన వ్యక్తిగత హెలికాప్టర్ను ఉపయోగించి చిక్కుకుపోయిన నివాసితులను రక్షించి, వారికి సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ❗️⚠️🇺🇸 - A Cessna C550 business jet crashed while attempting to land at Statesville Regional Airport in Statesville, North Carolina, on the morning of December 18, 2025, resulting in multiple fatalities.The aircraft, registered under tail number N257BW and owned by GB Aviation… pic.twitter.com/fb8qxZmrkm— 🔥🗞The Informant (@theinformant_x) December 18, 2025 Oh no!! Horrible breaking news!!Greg Biffle, a NASCAR champion has gone down in a plane crash with his wife and children. Three others perished as well. One was a man and his son.Just 26 mins after takeoff the plane tried to return but crashed. pic.twitter.com/4c2ieDpQaB— Jennifer 🟥🔴🧙♀️🦉🐈⬛ 🦖 (@babybeginner) December 19, 2025 -
అమెరికా విమాన ప్రమాదంలో ప్రముఖ కార్ రేసర్ మృతి..
-
తైవాన్కు రూ.లక్ష కోట్ల ఆయుధాలు
వాషింగ్టన్/బీజింగ్: చైనాతో టారిఫ్ల యుద్ధం ఓ వైపు కొనసాగిస్తూనే, మరో వైపు తైవాన్కు భారీగా అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్దమైంది. ఏకంగా రూ.1 లక్షా 188 కోట్లు(11.1 బిలియన్ డాలర్లు) విలువైన క్షిపణులు, హోవిట్జర్లు, డ్రోన్లు తదితర అత్యాధునిక ఆయుధాలను విక్రయించనున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్..విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలను గానీ, చైనా, తైవాన్ల గురించి గానీ ప్రస్తావించలేదు. ట్రంప్ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఆమోదం తెలిపిన పక్షంలో.. తైవాన్కు అమెరికా అందించే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీగా నిలవనుంది. తైవాన్ రక్షణ శాఖతో కుదిరిన 8 ఒప్పందాల్లో 82 హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ వ్యవస్థలు(హైమార్స్), 420 ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్(అట్కామ్స్), 60 సెల్ఫ్ ప్రొపెల్డ్ హొవిట్జర్ వ్యవస్థలు, డ్రోన్లు, మిస్సైళ్లు ఉన్నాయి. ఎప్పటికైనా తైవాన్ తమ దేశంలో కలిసిపోవాల్సిందేనంటున్న చైనా.. ఇటీవల ఆ దిశగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, అమెరికా–చైనాల మధ్య సంబంధాలు ఇప్పటికే ఉప్పూనిప్పుగా సంబంధాలు కొనసాగుతున్న వేళ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై డ్రాగన్ దేశం తీవ్రంగా స్పందించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒకే చైనా విధానానికి అమెరికా తూట్లు పొడిచిందని, తమ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడింది. -
భారతీయులకు పెరిగిన హెచ్–1బీ కష్టాలు
వాషింగ్టన్: తెంపరి ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికాకు వెళ్లాలనుకున్న భారతీయుల హెచ్–1బీ వీసా కష్టాలు మరింత పెరిగాయి. అమెరికా వ్యతిరేక, పాలస్తానా అనుకూల వ్యాఖ్యలు, వీడియోలు, పోస్ట్లు చేసే విదేశీయులను తమ గడ్డమీద అడుగుపెట్టకుండా, హెచ్–1బీ, హెచ్4 వీసాలు రాకుండా అడ్డుకునేందుకు ట్రంప్ సర్కార్ గత వారం ఆయా వీసా దరఖాస్తుదారుల సోషల్మీడియా ఖాతాల ముమ్మర పరిశీలన మొదలెట్టడం తెల్సిందే. అన్ని ఖాతాల పరిశీలనకు సుదీర్ఘకాలం పట్టేనున్న నేపథ్యంలో అప్పటిదాకా హెచ్–1బీ వీసాల ఇంటర్వ్యూలను 2026 అక్టోబర్దాకా వాయిదావేస్తున్నట్లు చాలా మంది అభ్యర్థులకు సందేశాలు అందాయి. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం సంపాదించి వీసా కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిపుణులైన భారతీయులకు ఈ నిర్ణయం అశనిపాతమైంది. అక్టోబర్కైనా తమ వీసా ఇంటర్వ్యూలకు మోక్షం లభిస్తుందో లేదంటే 2027 జనవరికి మరోసారి వాయిదాపడతాయా? అనే సందిగ్దావస్థ భయాందోళనలు భారతీయులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జరగాల్సిన ఇంటర్వ్యూలను గతంలోనే 2026 ఫిబ్రవరి, మార్చికి రీషెడ్యూల్ చేయడం తెల్సిందే. జనవరి, ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు ఖరారైన వేరే దరఖాస్తుదారులు వాటిని రద్దుచేసుకుంటే వాళ్ల స్థానంలో తమకు అవకాశం లభిస్తుందేమోనన్న ఆశ ఈ అక్టోబర్కు రీషెడ్యూల్ అయిన దరఖాస్తు దారుల్లో కన్పిస్తోంది. -
పర్యాటకులు అమెరికాలో ఎప్పటిదాకా ఉండొచ్చు?
వాషింగ్టన్: ఫలానా తేదీ వరకు అమెరికాలో పర్యటించవచ్చు అంటూ స్వయంగా అమెరికా ప్రభుత్వమే టూరిస్ట్ వీసాను జారీచేసినాసరే ఆ తేదీకంటే ముందే చాలా సందర్భాల్లో స్వదేశానికి వెనుతిరగాల్సి ఉంటుందని ట్రంప్ సర్కార్ కొత్త మెలిక పెట్టింది. వాస్తవానికి ఈ విషయం వీసా సంబంధ నిబంధన పత్రంలో ఉంటుందని తన వితండవాదాన్ని సమర్థించుకునే ప్రయత్నంచేసింది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ అంతర్జాతీయ పర్యాటకులకు ముఖ్య గమనిక. అమెరికాలో ఎన్ని రోజుల వరకు పర్యటించవచ్చు అనేది మీకు జారీచేసిన టూరిస్ట్ వీసా మీద పేర్కొన్న గడువు తేదీ నిర్ణయించబోదు. గడువును అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నిర్ణయిస్తారు. మీరు అమెరికాలో అడుగుపెట్టగానే మీతో ఆయన ఒక ఐ–94 దరఖాస్తును నింపిస్తారు. అందులో మీ చట్టబద్ధ పర్యాటకానికి చివరి తేదీ రాసి ఉంటుంది. ఆ తేదీ ఏంటో తెలుసుకోవాలంటే https:// i94.cbp.dhs.gov/ home వెబ్సైట్ను సందర్శించి అందులో మీ టూరిస్ట్ వీసా సంబంధిత వివరాలను సరిచూసుకోండి. ఐ–94 దరఖాస్తులో ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ అని ఒక తేదీ రాసి ఉంటుంది. అదే మీ చట్టబద్ధ పర్యటనకు ఆఖరి గడువు తేదీ. టూరిస్ట్వీసా గడువు తేదీ, ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ తేదీలు ఒకేలా ఉండాలనే నియమం ఏమీలేదు. సాధారణంగా టూరిస్ట్వీసా గడువు కంటే ముందుగానే ‘అడ్మిట్ అన్టిల్ డే’ ముగుస్తుంది’’ అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. -
చిక్కుల్లో ఆసిమ్ మునీర్.. పాక్-అమెరికా స్నేహానికి చెల్లు
అమెరికా-పాకిస్థాన్..! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ ఈ రెండు దేశాల మైత్రి పైనే..! ముందెన్నడూ లేనివిధంగా అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడిని వైట్హౌస్కు ఆహ్వానించడం మొదలు.. పాకిస్థాన్పై అమెరికా వరాల జల్లులు కురిపించడం వరకు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం..! ఇప్పటికే రెండు సార్లు అమెరికాకు వెళ్లి.. ట్రంప్తో భేటీ అయిన పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వైట్హౌస్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. అమెరికా-పాక్ బంధం త్వరలో విడిపోనుందా? ఇరుదేశాల మధ్య తల్లాక్ తప్పదా? అంటే.. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు. అందుకు గాజానే కారణమంటున్నారు. పాకిస్థాన్కు గాజాకు సంబంధమేంటి? అమెరికాతో తల్లాక్ వరకు వెళ్లేంతలా అందులో ఏముంది?నోబెల్ శాంతి బహుమతి కోసం ఉవ్విళ్లూరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశాల మధ్య యుద్ధాలను ఆపేందుకు తహతహలాడుతున్న విషయం తెలిసిందే..! ఈ క్రమంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరును ఆపేసి.. గాజాలో శాంతిని నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా.. గాజాలో ఇస్లామిక్ దేశాల సైన్యాలతో అక్కడ శాంతి దళాలను నెలకొల్పాలని భావించారు. దానికి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని నామకరణం చేశారు. సరిగ్గా ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అణ్వాయుధ దేశమైన పాకిస్థాన్ మద్దతు ట్రంప్కి అవసరమైంది. పైగా.. ట్రంప్కు నోబెల్ అవార్డు ఇవ్వాల్సిందేనని తొలుత ప్రతిపాదించింది కూడా పాకిస్థానే..! అంతే.. ట్రంప్ కూడా పాకిస్థాన్ సాయంతోనే గాజాలో శాంతిని స్థాపించాలని నిశ్చయించారు.ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికే కారణమా?ాజాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను సిద్ధం చేశారు. దానికి ఐక్య రాజ్య సమితి నుంచి కూడా ఆమోదం తెచ్చుకున్నారు. అందులో ఆరో పాయింట్ అత్యంత కీలకమైనది. అదేంటంటే.. గాజా నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి. అందుకు అనుగుణంగానే హమాస్ ఆయుధాలను వీడాలి. ఆ తర్వాత ఇరువైపులా యుద్ధం ముగుస్తుంది. అయితే.. మరోమారు కవ్వింపు చర్యలు లేకుండా ఉండేందుకు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలి. అయితే.. ఇక్కడే ట్రంప్ ఓ రాజకీయ చతురతను, చాణక్య నీతిని ప్రదర్శించారు. ఆఫ్ఘానిస్థాన్, సిరియాలలో అనుభవాలను బేరీజు వేసుకున్నారు. మిలిటెంట్లు, ఉగ్రవాదులు స్టెబిలైజేషన్ ఫోర్స్ను టార్గెట్గా చేసుకునే ఉదంతాలను విశ్లేషించారు. దీంతో.. నాటో దళాలు లేదా అమెరికా బలగాలను గాజాలో దింపకుండా.. ఆ బాధ్యతను ఇస్లామిక్ దేశాలకు అప్పగించాలని తీర్మానించారు. అంటే.. గాజా శాంతికోసం తీవ్రంగా కృషి చేస్తున్న తుర్కియే, జోర్దాన్, ఈజిప్టుతోపాటు.. గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్ ఆ బాధ్యతను తీసుకోవాలనేది ట్రంప్ ఆకాంక్ష..! ఈ దళాలు గాజాతోపాటు.. పాలస్తీనాలోని పోలీసు దళాలకు శిక్షణ ఇవ్వాలి. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య ఒప్పందం జరగాలి. అది జరిగినప్పుడే ఇంతకాలం యుద్ధ నేరాలకు పాల్పడ్డ హమాస్ సభ్యులకు క్షమాభిక్ష ఉంటుంది. గాజాను వీడాలనుకునే హమాస్ సభ్యులు ఈజిప్ట్, జోర్దాన్, ఖతార్, ఇరాన్ వంటి దేశాలకు వలస వెళ్లేందుకు అమెరికా సహకరిస్తుంది. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతే.. ఆసిమ్ మునీర్ను వైట్హౌస్కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.చిక్కుల్లో ఆసిమ్ మునీర్..!ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ పాలిట అశనిపాతంగా మారుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ని బద్ధశత్రువుగా భావిస్తాయి. ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల పథకం ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉంటుంది. పైగా.. ట్రంప్ ఇజ్రాయెల్కు ఆప్తమిత్రుడనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికే ఈ 20 సూత్రాల పథకంపై ఈజిప్ట్, ఖతార్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్లో కూడా ఆసిమ్ మునీర్పై వ్యతిరేకతకు అంకురార్పణ జరగడానికి ఇదే కారణమవుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్తో త్వరలో జరగనున్న భేటీలో మునీర్ బేషరతుగా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా మునీర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారనుంది. ఒకవేళ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో పాకిస్థాన్ సైన్యం ఉండదని మునీర్ చెబితే.. ట్రంప్కు నిస్సందేహంగా కోపం వస్తుంది. ఒకవేళ ట్రంప్ నిర్ణయానికి మునీర్ తలూపినా.. పాకిస్థాన్లో వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పటికే పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ ధార్ దీనిపై ఓ ప్రకటన చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పడానికి పాకిస్థాన్ బలగాలను అక్కడ మోహరించినా.. హమాస్ను ఆయుధాలు వీడమని చెప్పడం, నిరాయుధీకరణకు సహకరించడం తమ బాధ్యత కాదని తేల్చిచెప్పారు..!ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే.. జెన్-జీ ఉద్యమాలు ఇప్పుడు ప్రభుత్వాల పాలిట ముప్పుగా మారుతున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్లో అధికార మార్పిడి ఇందుకు ఉదాహరణ..! బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వాన్ని కూల్చి, యూనస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది విద్యార్థి ఉద్యమమే. నేపాల్లో కూడా యువత ఉద్యమించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు మునీర్ గనక ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే.. పాకిస్థాన్లోనూ నిరసనలు మొదలవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మునీర్ ఇటీవలి కాలంలో ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, తుర్కియే, జోర్దాన్, ఈజిప్ట్, ఖతార్ దేశాల రాజకీయ, సైన్య అధికారులతో సమావేశమయ్యారు. ఆ సమావేశాల సందర్భంగా గాజా శాంతి గురించి మాట్లాడారు. దీనికి ప్రతిగా ఇప్పటికే పాకిస్థాన్లో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. ఒకవేళ ట్రంప్ నిర్ణయాన్ని మునీర్ అమలు చేస్తే.. పాక్లో ఆందోళనలు పేట్రేగిపోతాయని దక్షిణ-మద్య ఆసియా వ్యవహారాల నిపుణుడు మైఖేల్ కుగెల్మాన్ స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదనను మునీర్ సున్నితంగా తిరస్కరించినా.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో.. మునీర్ రిస్క్లో పడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో సైన్యాన్ని మోహరించాలని చూస్తే..!పాకిస్థాన్లో పాలస్తీనాకు మద్దతిచ్చే పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి. గాజాలో సైన్యాన్ని మోహరించాలని మునీర్ నిర్ణయిస్తే.. పాకిస్థాన్లో అస్థిరత పెరిగే ముప్పు ఉంది. పాకిస్థాన్లో కరడుగట్టిన ఇస్లామిక్ ఎన్జీవోలు, సంస్థలు ఎన్నో ఉన్నాయి. పైగా.. ఉగ్రవాద సంస్థలన్నీ హార్డ్కోర్ ఇస్లామిక్ మైండ్ సెట్ ఉన్నవే..! ఈ సంస్థలు మూకుమ్మడిగా జెన్-జీ స్థాయిలో ఉద్యమించే అవకాశాలు లేకపోలేదు. దీన్ని గమనించే పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ ఓ ప్రకటన చేస్తూ.. హమాస్ నిరాయుధీకరణ తమ బాధ్యత కాదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయిన మునీర్.. ట్రంప్ను విభేదిస్తే.. పెద్దన్న ఆగ్రహానికి గురవ్వక తప్పదు. ట్రంప్ నిర్ణయాన్ని ఆమోదిస్తే.. దేశంలో అస్థిరత ఏర్పడి మునీర్ పదవికే గండం తప్పదు. ఏది ఏమైనా.. త్వరలో అమెరికా-పాక్ మధ్య తల్లాక్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. - హెచ్.కమలాపతిరావుఇదీ చదవండి:చైనా-పాకిస్థాన్కు మధ్య చెడింది ఇక్కడే..! -
ప్రేమ, ఆప్యాయతలకు కేరాఫ్ 'ఆహారమే'..! అదెలాగంటే..
ఆహారం మన ప్రాణాలకు దివ్వౌషధమే కాదు..ప్రజందర్నీ ఒక చోటకు చేరుస్తుంది. భోజనం చేసే ప్రదేశమే(హోటల్ లేదా రెస్టారెంట్) మనకు కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. అక్కడే మనకు తోడు, స్నేహం, ప్రేమ వంటివి దొరుకుతాయి కూడా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన నానుడిలా ఆహారం..అన్నింటిని చెంతకు చేరుస్తుంది అనొచ్చు. ఒక్కోసారి ఆ భోజనశాలే మన ప్రాణాలకు రక్షగా కూడా మారుతుంది. అదెలాగో ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ చకచక చదివి తెలుసుకోండి మరి..అమెరికాలో జరిగి అరుదైన సందర్భం. 78 ఏళ్ల చార్లీ హిక్స్ ఫ్లోరిడాలోని పెన్సకోలాలోని ష్రిమ్ప్ బాస్కెట్ అనే రెస్టారెంట్లో రోజుకు రెండుసార్లు భోజనం చేసేవాడు. పదేళ్లుగా ఈ రెస్టారెంట్లోనే భోజనం చేస్తున్నాడు. ఆ రెస్టారెంట్ స్టాఫ్కి కూడా అతడు బాగా అలవాటైపోయాడు. వాళ్లంతా అతడి రాకకై తలుపులు తెరిచే ఉంచేవారు. అలాంటిది కొన్నిరోజుల నుంచి అనూహ్యంగా రెస్టారెంట్ రాలేకపోతాడు. ఇంతలా సడెన్గా ఆయన రాకపోవడానికి కారణం ఏంటని ఆ రెస్టారెంట్లోని 45 ఏళ్ల చెఫ్ డోనెల్ స్టాల్వర్త్ ఆరా తీశారు. దశాబ్దకాలంగా అతనికి సర్వీస్ అందిస్తున్న ఆ చెఫ్ వృద్ధుడి గురించి ఆరా తీసి ఫోన్చేసి మరి కనుక్కోగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో వాళ్లు అతని ఆర్డర్ని అతని ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు. అతడి డోర్ వద్ద పదేపదేఆహార డెలివరీ చేసినా..అతడు బయటకువచ్చితీసుకోవడం లేదని తెలుస్తుంది. దాంతో టెన్షన్తో ఆ చెఫ్ డోనెల్ స్టాల్వర్త్ అతని డోర్ వద్ద నిలబడి చాలాసేపు కొట్టినా..ఎలాంటి రెస్పాన్స్ రాదు. దాంతో అతనిలో ఆందోళన పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక అలానే డోర్ కొడుతూనే ఉండగా చిన్నగా లోగొంతుతో కూడిన కేక వినిపిస్తుంది. ఏదోలా డోర్ పగలు కొట్టి వెళ్లగా వృద్ధుడు చార్లీ హిక్స్ నేలపై పడి ఉండటం చూసి షాక్ తింటాడు చెఫ్ డోనెల్. అతని పక్కటెముకలు విరిగి, డీహైడ్రేషన్కి గురై ఉంటాడు. వెంటనే అతడిని చెఫ్ డోనెల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి.. అక్కడికే ఆహారం డెలివరీ అయ్యేలా కేర్ తీసుకుంటారు. ఆశ్చర్యకరంగా ఆ వృద్ధుడు చార్లీ వారి ప్రేమ, అప్యాయతలకు త్వరితగతిన కోలుకుని డిశ్చార్జ్ అవుతాడు. అంతేగాదు అతన్ని 24 గంటలూ పర్యవేక్షించడం కోసం రెస్టారెంట్ పక్క అపార్ట్మెంట్లోకే షిఫ్ట్ అయ్యేలా చేస్తారు సదరు రెస్టారెంట్ నిర్వాహకులు. నిజానికి ఇది ఆహారంతో ముడిపడిన బంధం అని ఆనందంగా చెబుతున్నాడు చార్లీ.అయితే చెఫ్ డోనెల్ మాత్రం అతడే తన తాత, మావయ్యా అన్నీనూ అని ఆనందంగా చెబుతాడు. ప్రస్తుతం అతడి భోజనం దినచర్య ఆ రెస్టారెంట్లో యథావిధిగా సాగుతుంది. తనకు వడ్డించేది కూడా చెఫ్ డోనెల్. చెప్పాలంటే వ్యాపారానికి మించిన స్నేహం..ఆహారం కలిపిన బంధం కదూ..!. అందుకే "తినే అన్నంపై కోపగించుకోవడం, తినడం మానేయడం, వృధా చేయడం వంటివి అస్సలు చేయొద్దు సుమీ"..!.(చదవండి: తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..! అతడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటంటే.) -
క్యాబ్లో మహిళ నిద్రలోకి : భారత సంతతి డ్రైవర్ ఘాతుకం
అమెరికాలో భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన క్యాబ్లో గాఢంగా నిద్రపోయి, స్పృహ కోల్పోయిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. నిందితుడిని కాలిఫోర్నియాలోని బేకర్స్ఫీల్డ్ నివాసి భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ సిమ్రంజిత్ సింగ్ సెఖోన్ (35)గా గుర్తించారు. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు.వెంచురా కౌంటీ షెరీఫ్ కార్యాలయం సమాచారం ప్రకారం నవంబర్ 27 తెల్లవారు జామున 1:00 గంటలకు క్యాబ్ బుక్ చేసుకుంది యువతి. క్యాబ్ రైడ్ సమయంలో దిగాల్సిన చోటు వచ్చినా కూడా గమనించలేనంతగా ఆమె నిద్రలోకి జారిపోయింది. దీనికి తోడు మద్యం సేవించి ఉండటంతో అదే అదునుగా భావించిన సెఖోన్ ఆమెను థౌజండ్ ఓక్స్ బార్ నుండి కామరిల్లోలోని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన ఈ ఏడాది నవంబరులో మొదలైంది. ఈ సందర్బంగా సెఖోన్ బాధితుల సంఖ్య ఇంకా ఉండి ఉండవచ్చని డిటెక్టివ్లు అనుమానిస్తున్నారు.బెయిల్ కోసం రూ. 4.52 కోట్లుసెఖోన్ను డిసెంబర్ 15న అరెస్టు చేసి, అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిపై అత్యాచారం చేసినందుకు ప్రీ-ట్రయల్ డిటెన్షన్ ఫెసిలిటీలో కేసు నమోదు చేశారు. బెయిల్ రుసుము రూ. 4.52 కోట్లు (5లక్షల డాలర్లు) గా నిర్ణయించారు. తదుపరి విచారణ డిసెంబర్ 29న జరగాల్సి ఉంది. అయితే ఈ ఆరోపణలను సెఖోన్ ఖండించారు. అయితే నిందితుడు ఏ రైడ్ షేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, డ్రైవర్ స్థితి తదితర వివరాలను పోలీసులు వెల్లడించలేదు.ఇదీ చదవండి: రూ. 2400 కోట్ల వివాదం, 87 ఏళ్ల వయసులో నాలుగో భార్యతో బిడ్డకాగా భారతీయ సంతతికి చెందిన డ్రైవర్లు అమెరికా, కెనడాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు, మాదకద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేయడంలాంటి అనేక ఆరోపణల మధ్య తాజా వార్త మరింత కలకలం రేపుతోంది. -
డెమొక్రట్ల పైచేయి.. ట్రంప్ ఉత్తర్వులు నిలిపివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై డెమొక్రట్లు మరోసారి పైచేయి సాధించారు. డిటెన్షన్ సెంటర్ల విషయంలో ఆయన జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెడుతూ వాషింగ్టన్ డీసీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గత ఆరు నెలలుగా ఈ విషయంలో డెమొక్రట్లు న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా చట్ట సభ్యులు ఎవరైనా సరే గతంలో డిటెన్షన్ సెంటర్లకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి సందర్శించే వీలుండేది. అయితే ట్రంప్(Trump) రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఆ సందర్శనలపై ఆంక్షలు విధించారు. ‘‘వారం ముందుగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు(ICE) సెంటర్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫీల్డ్ ఆఫీసులు అనుమతి ఇస్తేనే సందర్శించొచ్చు. లేకుంటే లేదు’’ అనే ఉత్తర్వులు తీసుకొచ్చారు. అయితే.. ఈ ఉత్తర్వులపై హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్లోని డెమొక్రట్లు కోర్టును ఆశ్రయించారు. ట్రంప్ 2.0లో ఎంతటి కఠిన వైఖరి అవలంభిస్తున్నది చూస్తున్నదే. మరీ ముఖ్యంగా వలసవాదుల విషయంలో ఆయన ధోరణి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అదే సమయంలో.. డిటెన్షన్ సెంటర్లలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని డెమొక్రట్లు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. సరైన వసతులు ఉండడం లేదని.. అక్కడి వాళ్లను దారుణంగా చూస్తున్నారని.. ఈ తరుణంలో అలాంటివేవీ బయట పడకుండా ఉండేందుకే ట్రంప్ ఈ ఉత్తర్వులు తెచ్చారన్నది డెమొక్రట్ల వాదన. అయితే.. ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఆ వాదనను ఖండించింది. చట్ట సభ్యుల భద్రత కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో.. డెమొక్రట్ల వాదనలతో ఏకీభవించిన ఫెడరల్ జడ్జి జియా కాబ్ ట్రంప్ ఉత్తర్వులను ఫెడరల్ చట్టాలకు విరుద్ధమని ప్రకటిస్తూ.. వాటిని పక్కన పెడుతూ తీర్పు ఇచ్చారు. జియా కాబ్ గత అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో నియమించబడ్డారు. ఇదిలా ఉంటే.. అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లను ఆకస్మికంగా సందర్శించే హక్కు కల్పించే ఫెడరల్ చట్టాన్ని తెచ్చింది ట్రంపే కావడం గమనార్హం. ట్రంప్ మొదటి దఫా అధ్యక్ష పదవీ కాలంలో ఈ చట్టం ఆమోదించబడింది. ఇదిలా ఉంటే.. న్యూజెర్సీ డెమొక్రటిక్ ప్రతినిధి లమోనికా మెకైవర్ ఈ ఏడాది మే నెలలో న్యూయార్క్లోని ఓ డిటెన్షన్ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు. అయితే ఆ సమయంలో డిసెన్షన్ సెంటర్లో పెద్ద గొడవే జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఆమెపై కేసు కూడా నమోదు చేసింది. అయితే ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆమె మండిపడ్డారు. ఈ ఘటన జరిగిన నెలలోపే ట్రంప్ చట్ట సభ్యుల ఆకస్మిక సందర్శనలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ చదవండి: ఇక పూర్తిస్థాయి యుద్ధమేనా ట్రంప్? -
అమెరికాలోకి రాకుండా మరో 20 దేశాలపై నిషేధం
వాషింగ్టన్: అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేదించిన దేశాల జాబితాను ట్రంప్ యంత్రాంగం మరింత విస్తరించింది. మరో 20 దేశాలను తాజాగా అందులోకి చేర్చింది. అమెరికా జాతీయ భద్రత, ప్రజల భద్రత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సంబంధిత ఉత్తర్వులపై అధ్యక్షుడు మంగళవారం సంతకం చేశారు. బుర్కినా ఫాసో, మాలీ, నైగర్, దక్షిణ సుడాన్, సిరియాపై పూర్తి ఆంక్షలు, అమెరికాలోకి ప్రవేశంపై నిషేధం విధించారు. మరో 15 దేశాలైన అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోటె డి ఐవోయిర్, డొమినికా, గాబన్, ద గాంబియా, మలావీ, మార్షియానా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే పాక్షిక నిషేధ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘ఈ దేశాలకు అమెరికా చట్టంపై గౌరవం లేదు. తన పౌరుల గురించిన సమగ్ర సమాచారం పొందుపరచడంలో అమెరికా నిఘా, భద్రతా, ఇమ్మిగ్రేషన్ విభాగాలకు అందించడంలో తరచూ విఫలమవుతున్నాయి‘ అని తెలిపారు. పాలస్తీనా అథారిటీ తాలూకు పత్రాలున్న వారి ప్రవేశాన్ని నిషేధించారు. వెస్ట్ బ్యాంక్, గాజాల్లో పలు ఉగ్ర మూకలు చురుగ్గా పనిచేస్తున్నాయి. అమెరికా పౌరులను పొట్టన పెట్టుకున్నాయి. అందుకే ఈ చర్య’ అని వైట్ హౌస్ పేర్కొంది. వాటిపై కొనసాగింపు అఫ్గానిస్తాన్, బర్మా సహా 12 దేశాలపై ఇటీవలే అమెరికా నిషేధం విధించడం తెలిసిందే. అది ఇకముందు కూడా కొనసాగనుంది. గత నెలలో ఒక అఫ్గాన్ దేశస్తుడు వాషింగ్టన్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బందిని కాల్చి చంపడం తెలిసిందే. ఆ నేపథ్యంలో అఫ్గాన్తో పాటు ఇలా పలు మూడో ప్రపంచ దేశాలపై అమెరికా కఠిన నిషేధాలు విధిస్తూ వస్తోంది. -
అమెరికాకు విశ్వసనీయ భాగస్వామిగా ఏపీ కొనసాగుతుంది-చంద్రబాబు
-
39 దేశాలపై.. ట్రంప్ ట్రావెల్ బ్యాన్
-
ట్రంప్ ఖాతాలోకి మరికొన్ని దేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం మరో ఏడు దేశాలపై నిషేధం విధించే ఉత్తర్వులపై ఆయన సంతకాలు(Trump Travel Ban) చేశారు. దీంతో.. మొత్తం 39 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించినట్లయ్యింది.ట్రంప్ తాజా సంతకంతో అమెరికాలో ప్రవేశానికి నిషేధం ఉన్న దేశాల సంఖ్యను 19 నుంచి 39కి పెరిగింది(US Travel Ban). వలస విధానాలను మరింత కఠినతరం చేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారని ఈ సందర్భంగా వైట్హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందుకు దేశ భద్రతనే కారణమని చెబుతోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మొన్నీమధ్యే కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక నేషనల్ గార్డ్ సభ్యులు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు అఫ్గనిస్థాన్ నుంచి వలస వచ్చిన రహ్మానుల్లా లకన్వాల్గా నిర్ధారించారు. దీంతో.. వలసవాదులపై ట్రంప్ భగ్గుమన్నారు. తాజాగా.. పూర్తి నిషేధం విధించిన దేశాలు లావోస్, సియెర్రా లియోన్, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, సౌత్ సూడాన్, సిరియా ఉన్నాయి. అలాగే.. తాత్కాలిక నిషేధం (భాగస్వామ్య పరిమితులు) విధించిన దేశాలు.. అంగోలా, ఆంటిగ్వా & బార్బుడా, బెనిన్, కోట్ దివ్వార్, డొమినికా, గాబోన్, గాంబియా, మలావి, మౌరిటేనియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వేలు.పలు దేశాలపై నిషేధం మాత్రమే కాదు.. పాలస్తీనా వలసల మీద కూడా ట్రంప్ కొరడా ఝుళిపించారు. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు కలిగిన వారికి కూడా ఈ పరిమితులు వర్తించనున్నాయి. అదే సమయంలో.. తుర్కమేనిస్తాన్(మధ్య ఆసియా) పౌరులపై ఉన్న నాన్-ఇమిగ్రెంట్ వీసా నిషేధాన్ని ఎత్తివేసినా, ప్రవేశాన్ని మాత్రం నిలిపివేశారు.మినహాయింపు వీళ్లకే.. శాశ్వత నివాసితులతో పాటు ఇప్పటికే వీసా కలిగిన వాళ్లకు.. అలాగే కొన్ని ప్రత్యేక వీసా వర్గాలకు.. అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమైన వాళ్లకు మినహాయింపు దక్కనుంది.ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే వలస విధానాలను కఠినతరం చేస్తోంది. అలాగే ఆశ్రయం (అసైలం) విషయంలోనూ ఆంక్షలను అమలు చేస్తోంది. అదే సమయంలో బైడెన్ కాలంలో ఇచ్చిన వీసాలను సమీక్షించడంతో పాటు గ్రీన్ కార్డ్ హోల్డర్ల పునఃపరిశీలన వంటి చర్యలు చేపడుతోంది.ట్రంప్ పూర్తి నిషేధం విధించిన దేశాలు (Full Ban):1. ఆఫ్ఘానిస్తాన్2. బర్మా (మయన్మార్)3. చాద్4. రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో5. ఈక్వటోరియల్ గినియా6. ఎరిట్రియా7. హైటి8. ఇరాన్9. లిబియా10. సోమాలియా11. సూడాన్12. యెమెన్13. బురుండి14. క్యూబా15. లావోస్16. సియెర్రా లియోన్17. టోగో18. తుర్కమేనిస్తాన్19. వెనిజులా20. బుర్కినా ఫాసో21. మాలి22. నైజర్23. సౌత్ సూడాన్24. సిరియాభాగస్వామ్య పరిమితులు ఉన్న దేశాలు (Partial Restrictions):25. అంగోలా26. ఆంటిగ్వా & బార్బుడా27. బెనిన్28. కోట్ దివ్వార్29. డొమినికా30. గాబోన్31. గాంబియా32. మలావి33. మౌరిటేనియా34. నైజీరియా35. సెనెగల్36. టాంజానియా37. టోంగా38. జాంబియా39. జింబాబ్వేభాగస్వామ్య ప్రయాణ నిషేధం (Partial Travel Ban) అంటే.. ఒక దేశానికి చెందిన ప్రజలందరిపై పూర్తి నిషేధం కాకుండా, కొన్ని వర్గాలపై మాత్రమే పరిమితులు విధించడం. ఉదాహరణకు, పర్యాటక వీసాలు లేదంటే విద్యార్థి వీసాలు నిలిపివేయొచ్చు. కానీ వ్యాపార వీసాలు, అధికారిక వీసాలు అనుమతించొచ్చు. అలాగే సమాచారం పంచుకోవడంలో లోపాలు, భద్రతా తనిఖీలలో లోపాలు ఉన్న దేశాలపై ఈ విధమైన పరిమితులు అమలు చేస్తారు. భద్రతా కారణాల వల్ల కొన్ని వర్గాల వ్యక్తులు (ఉదా: ప్రభుత్వ అధికారులు, సైనికులు, లేదంటే నిర్దిష్ట వయసు ఉన్నవాళ్లను అమెరికాలో ప్రవేశించకుండా ఆపవచ్చు. -
బీబీసీపై ట్రంప్ పరువు నష్టం దావా
వాషింగ్టన్: అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా వేశారు. 2021లో కేపిటల్ హిల్ దాడి సమయంలో తన ప్రసంగాన్ని దురుద్దేశంతో తప్పుగా, రెచ్చగొట్టేవిధంగా బీబీసీ ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు. అందుకుగాను సంస్థ 10 బిలియన్ డాలర్లు (రూ.90వేల కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ జోక్యం చేసుకోవడానికి, ప్రభావితం చేయడానికి ప్రయతి్నంచిందన్నారు. ఈ మేరకు 33 పేజీలతో మయామి ఫెడరల్ కోర్టులో దావాను వేశారు.2021 జనవరి 6న తేదీన అధ్యక్ష ఎన్నికల ఫలితాల సమయంలో కేపిటల్ హిల్పై దాడికి ముందు తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ గంటపాటు మాట్లాడారు. ఈ సందర్భంగా ‘కేపిటల్ హిల్కు వెళ్తున్నాం. నేనూ మీతోపాటు వస్తున్నాం. మనం పోరాడదాం’అన్నట్టుగా ఉన్న ప్రసంగాన్ని బీబీసీ ‘పనోరమ’డాక్యుమెంటరీగా ప్రసారం చేసింది. అయితే రెండు వేర్వేరు భాగాలను ఎడిట్ చేసి, కలిపి ప్రసారం చేశారని ట్రంప్ ఆరోపించారు. తాను మాట్లాడని విషయాలను మాట్లాడినట్లుగా ప్రసారం చేసినందుకు బీబీసీపై దావా వేస్తున్నట్లు చెప్పారు. -
గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్న భారత సంతతి మహిళ అరెస్ట్
అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలో భారత సంతతికి చెందిన 60 ఏళ్ల మహిళకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలో 30 ఏళ్లుగా నివసిస్తున్నమహిళను గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి రౌండ్లో అరెస్ట్ చేయడం కలకలం రేపింది. బబ్లీజీత్ కౌర్ అలియాస్ బబ్లీ అనే మహిళ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్మెంట్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు తన తల్లిని అదుపులోకి తీసుకున్నారని ఆమె కుమార్తె జోతి మీడియాకు తెలిపారు. 1994 నుండి అమెరికాలో నివసిస్తున్న బబుల్జిత్ "బబ్లీ" కౌర్, పెండింగ్లో ఉన్న ఆమె గ్రీన్ కార్డ్ దరఖాస్తు కోసం బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్మెంట్ సమయంలో ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 1న తన తల్లి యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయం డెస్క్ వద్ద ఉన్నప్పుడు, పలువురు ఫెడరల్ ఏజెంట్లు భవనంలోకి ప్రవేశించారని జ్యోతి చెప్పింది. ఆ తర్వాత ఫెడరల్ ఏజెంట్లు వెళ్లిన గదిలోకి కౌర్ను పిలిచి, ఆమెను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారని ఆమె తెలిపింది. కౌర్కు తన న్యాయవాదితో ఫోన్లో మాట్లాడే అవకాశం కల్పించినప్పటికీ, ఆమెను నిర్బంధంలోనే ఉంచారని ఆమె కుమార్తె చెప్పింది. కొన్ని గంటల పాటు కౌర్ను ఎక్కడికి తీసుకెళ్లారో కుటుంబ సభ్యులైన తమకు తెలపకుండానే, రాత్రికి రాత్రే అడెలాంటోకు బదిలీ చేశారని ఆరోపించారు. మరోవైపు అమెరికా పౌరురాలైన ఆమె మరో కుమార్తె, గ్రీన్ కార్డ్ ఉన్న ఆమె భర్త నుండి ఆమోదించబడిన గ్రీన్ కార్డ్ హోదాలో ఉన్నారని లాంగ్ బీచ్ వాచ్డాగ్ తన కథనంలో వివరించింది.ఎవరీ బబ్లీ కౌర్ కౌర్ కుటుంబం USకి వలస వచ్చిన తర్వాత, మొదట లగున బీచ్లో స్థిరపడ్డారు, తర్వాత లాంగ్ బీచ్కు వెళ్లారు. తరువాత ఉద్యోగ బాధతలరీత్యా బెల్మాంట్ షోర్ ప్రాంతానికి మారారు. కౌర్కు ముగ్గురు పిల్లలున్నారు. 34 ఏళ్ల జోతి, DACA (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్) కింద USలో చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు ,ఆమె అన్నయ్య, సోదరి, ఇద్దరూ అమెరికా పౌరులుగా ఉన్నారు.రెండు దశాబ్దాలకు పైగా, కౌర్ , ఆమె భర్త బెల్మాంట్ షోర్లోని 2వ వీధిలో నటరాజ్ క్యూసిన్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ అనే తినుబండారాల ఔట్లెట్ను నిర్వహిస్తున్నారు. లాంగ్ బీచ్ కమ్యూనిటీలో మంచి ఆదరణను కూడా పొందింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఫార్మసీ చైన్ దాని మిగిలిన స్థానాలను మూసివేసేంs వరకు ఆమె బెల్మాంట్ షోర్ రైట్ ఎయిడ్లో దాదాపు 25 సంవత్సరాలు పనిచేసింది. ఇటీవల, ఆమె రాయల్ ఇండియన్ కర్రీ హౌస్లో రెస్టారెంట్ పనిలోకి రావడానికి తిరిగి సిద్ధమవుతోంది.బబ్లీ కౌర్ను విడుదల చేయాలని పిలుపులాంగ్ బీచ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా, కౌర్ విడుదల కోసం పిలుపునిచ్చారు. ఆమె కుటుంబం ఆమె కేసు కొనసాగుతున్నందున కౌర్ను బాండ్పై విడుదల చేయడానికి అనుమతించే అదనపు చట్టపరమైన దాఖలును సిద్ధం చేస్తున్నందున, ఈ విషయంపై అతను ఫెడరల్ అధికారులతో సంప్రదింపులు జరుపు తున్నట్లు ఆయన సిబ్బంది తెలిపారు. -
వయసులో ఫిట్..పరుగులో హిట్..!
ఆయన ఆలోచనలు, ఆశయం పరుగుపెడతాయి.. విజయాన్ని దక్కించుకోవాలన్న సంకల్పం పరుగుకు ముందుంటుంది. అందుకే ఆయన ముందు మారథాన్లు చిన్నబోతున్నాయి. 74 ఏళ్ల వయసులోనూ మారథాన్లు, అల్ట్రా మారథాన్లు పూర్తి చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. నూకలవారిపాలెం నుంచి వచ్చిన అతని ప్రస్థానం ఇప్పుడు బోస్టన్ మారథాన్ వరకూ పరుగుతీసింది. ఆయనే హైదరాబాద్కు చెందిన సీనియర్ రన్నర్ నాగభూషణరావు చలమలశెట్టి..కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నూకలవారిపాలేనికి చెందిన నాగభూషణరావు ప్రస్తుతం నగరంలోని మల్లాపూర్లోని కేఎల్ రెడ్డి నగర్లో నివసిస్తున్నారు. వయసు పెరుగుతోందని వెనక్కి తగ్గకుండా.. ఆరోగ్యమే జీవితానికి అసలైన బలం అన్న సందేశాన్ని తన పరుగుతో నిరూపిస్తున్నారు. పరుగుల ప్రపంచంలోకి ఆయన ఐదేళ్ల క్రితం అడుగుపెట్టారు. అమెరికాలోని చికాగోలో అతని కుమారుడు మారథాన్ పూర్తి చేశారు. అదే స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభంలో 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వంటి చిన్న దూరాలతో మొదలుపెట్టి క్రమంగా స్టామినాను పెంచుకున్నారు. ఆ క్రమశిక్షణే దేశంలోని ప్రముఖ మారథాన్లలో నిలబెట్టేలా చేసింది.ఇది ఆయన రికార్డు..ముంబయి, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాల మారథాన్లతో పాటు లోనావాల నైట్ అల్ట్రా మారథాన్, 65 కిలోమీటర్ల సతారా అల్ట్రా మారథాన్ వంటి కఠిన పోటీలను ఆయన అవలీలగా పూర్తి చేశారు. ఇటీవల లద్దాఖ్ మారథాన్ సైతం పూర్తి చేయడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మారథాన్ను విజయవంతంగా ముగించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ఇప్పటివరకు 21 ఫుల్ మారథాన్లలో పాల్గొని 17 విజయాలను నమోదు చేశారు.వచ్చే ఏడాది బోస్టన్ మారథాన్కు..ఈ ఏడాది జులైలో నిర్వహించిన ఢిల్లీ మారథాన్ను ఆయన 4 గంటల 12 నిమిషాల 55 సెకన్ల సమయంలో ముగించారు. దీంతో ఆయన వచ్చే ఏడాది అమెరికాలోని బోస్టన్లో జరగనున్న 130వ బోస్టన్ మారథాన్కు అర్హత సాధించారు. భారత్ తరుపున పాల్గోనున్న ఆయన, హైదరాబాద్కు గర్వకారణంగా నిలవనున్నారు. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: పర్యావరణ హిత మష్రూమ్ ఫర్నీచర్..! జస్ట్ 180 రోజుల్లోనే..) -
ఎగుమతుల జోరు
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం నవంబర్లో బలమైన పనితీరు చూపించింది. అమెరికా టారిఫ్ల నడుమ సానుకూల వృద్ధి నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబర్లో 38.13 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు జరిగాయి. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, కెమికల్స్, రత్నాభరణాలు వృద్ధికి తోడ్పడ్డాయి. దిగుమతులు 1.88 శాతం తగ్గి 62.66 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రధానంగా బంగారం, ముడిచమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. దీంతో వాణిజ్య లోటు 24.53 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఐదు నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. అక్టోబర్ నెలకు వాణిజ్య లోటు 41.68 బిలియన్ డాలర్లతో పోల్చి చూసినా నవంబర్లో గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 2.62 శాతం పెరిగి 292.07 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు సైతం ఇదే కాలంలో 5.59 శాతం అధికమై 515.21 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 223.14 బిలియన్ డాలర్లుగా ఉంది. → నవంబర్లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 11.65 శాతం పెరిగి 3.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → టీ, కాఫీ, ఐరన్ ఓర్, జీడిపప్పు, డెయిరీ, హస్తకళాకృతులు, సముద్ర ఉత్పత్తులు, తోలు ఉత్పత్తుల ఎగుమతులు సైతం సానుకూలంగా నమోదయ్యాయి. → బియ్యం, నూనె గింజలు, కార్పెట్, ప్లాస్టిక్స్ ఎగుమతులు క్షీణించాయి. → సేవల ఎగుమతులు నవంబర్లో 35.86 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2024 నవంబర్లో వీటి ఎగుమతులు 32.11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సేవల ఎగుమతులు 270 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 248.56 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎగుమతులకు ప్రోత్సాహకం.. రూ. 25,060 కోట్లతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్కు సంబంధించి సవివర మార్గదర్శకాలను ఖరారు చేస్తున్నట్టు వాణిజ్య శాఖ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ తెలిపారు. కొన్నింటిని ఈ వారంలోనే అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. అమెరికా 50 శాతం టారిఫ్ల కారణంగా ఏర్పడిన ప్రభావం నుంచి ఎగుమతిదారులకు కొంత మేరకు ఉపశమనం లభిస్తుందన్నారు. అమెరికా టారిఫ్లు విధించినప్పటికీ.. 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు భారత ఎగుమతులకు యూఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్నట్టు ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్’ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ తెలిపారు.యూఎస్కు 22 శాతం అధికంనవంబర్లో అమెరికాకు ఎగుమతులు బలపడ్డాయి. వరుసగా రెండు నెలల పాటు (సెప్టెంబర్, అక్టోబర్) క్షీణత తర్వాత.. నవంబర్లో 22.61 శాతం మేర అధికంగా 6.98 బిలియన్ డాలర్ల ఎగుమతులు యూస్ మార్కెట్కు వెళ్లాయి. భారత్పై 50 శాతం టారిఫ్లను ఆగస్ట్ నుంచి యూఎస్ అమలు చేస్తుండడం తెలిసిందే. అమెరికా నుంచి నవంబర్లో భారత్కు దిగుమతులు 38 శాతం పెరిగి 5.25 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అమెరికాకు ఎగుమతులు 11.38 శాతం పెరిగి 59 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 13.49 శాతం పెరిగి 35.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి
శంకర నేత్రాలయ దృష్టి సేవా కార్యక్రమాల కోసం నిధులు సమీకరించేందుకు 2025 నవంబర్ 22న బోటెల్ నగరంలోని ఎంపైర్ బ్యాంక్వెట్ హాల్లో నిర్వహించిన ఫండ్రైజింగ్ కార్యక్రమం సంగీత విభావరి ఘనంగా, అత్యంత విజయవంతంగా జరిగింది.కార్యక్రమం చిన్నారులు మిత్రా, మీనాక్షి, విష్ణు, జస్మితా ఆలపించిన పవిత్ర గణేశ వందనాలతో ఆరంభమైంది. కార్యక్రమం నిరంతరాయంగా సాగాలని వినాయకుడిని ప్రార్థించిన ఈ చిన్నారుల గాన ప్రదర్శన సభలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. కార్యక్రమాన్ని సుందరంగా, శ్రద్ధగా ముందుకు తీసుకెళ్లిన ఎంసీలు వర అక్కెల్ల, సృజనా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ గాయకులు సుమంగళి, అంజనా సోమ్య, పార్థు, మల్లికార్జున అందించిన సంగీత ప్రదర్శనలు కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.స్థానిక కమ్యూనిటీ సభ్యులు, కమ్యూనిటీ సంస్థలు, నాయకులు, వాలంటీర్లు మరియు మిత్రుల సమిష్టి సహకారంతో ఈ సంగీత విభావరి విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బోటెల్ సిటీ డిప్యూటీ మేయర్ రామి గారు, అలాగే కొత్తగా ఎన్నికైన సిటీ కౌన్సిల్ సభ్యుడు అంగులూరి తమ భార్యతో కలిసి హాజరై, శంకర నేత్రాలయ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తమ మద్దతును తెలియజేశారు.2023 ‘Adopt a Village’ స్పాన్సర్లుగా శ్భాస్కర్ గంగిపాముల, శ్రీ రామ్ కొట్టీ;2024 స్పాన్సర్లుగా Quadrant Technologies (వంశీ రెడ్డి , శ్రీ రామ్ పాలూరి, భాస్కర్ జీ ), విక్రమ్ గార్లపాటి, వర అక్కెల్ల గారు, రాహుల్ & అనీలా, నంద కిషోర్ గజుల ;అలాగే 2025 స్పాన్సర్లుగా అశోక్ గల్లా, రాజేశ్ గుడవల్లి, అశోక్ పసుపులేటి, వినోద్ నాగుల, కృష్ణ ఉంగర్ల, శ్వేత సానగపు, రాజేశ్ అర్జా Seattle Boys Club — తదితరాలు ముందుకు వచ్చి ఈ మహత్తర సేవా కార్యక్రమానికి అందించిన మద్దతుకు శంకర నేత్రాలయ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.డెకరేషన్ టీమ్ – Seattle Decors and Events కార్యక్రమాన్ని అద్భుతంగా అలంకరించగా, ప్రతి క్షణాన్ని అందంగా బంధించిన హ్యాష్ట్యాగ్ ఫోటోగ్రఫీ, అలాగే రుచికరమైన భోజనం అందించిన Aroma Bothell, Biryani Bistro, Curry Point ఫుడ్ వెండర్ల సేవలు సభలోని వారి నుంచి విశేష ప్రశంసలు అందుకున్నాయి.SNUSA జాతీయ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందూర్తి నాయకత్వం, మార్గదర్శకత్వం, SNUSA బృందంలోని మూర్తి రేకపల్లి, డా. రెడ్డి ఊరిమిండి, వంశి ఏరువారం, శ్యామ్ అప్పలీ, రత్నకుమార్ కవుటూరు, త్యాగరాజన్ గారి కీలక మద్దతు, అలాగే స్థానిక చాప్టర్కు సకాలంలో అందిన సహకారం ఈ కార్యక్రమం ఘనవిజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.శంకర నేత్రాలయ బోర్డ్ ట్రస్టీలు సోమ జగదీశ్ కుటుంబం, వినోద్ కుటుంబంతో ముందుండి కీలక పాత్ర పోషించగా, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి దొడ్డ మార్గదర్శకత్వంలో చాప్టర్ లీడర్లు, వాలంటీర్లు సమిష్టిగా శ్రమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో దృష్టి సేవలు అందించే శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు ఈ ఫండ్రైజింగ్ సంగీత విభావరి విలువైన మద్దతును అందించింది.(చదవండి: ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ సాహిత్య సదస్సు!) -
నేటి నుంచి H1B, H4 వీసా దారుల సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలిన
-
స్టార్ దర్శకుడు, భార్య అనుమానాస్పద మృతి!
హాలీవుడ్ ప్రముఖ డైరక్టర్ రాబ్ రైనర్, ఆయన సతీమణి మిచెల్ దారుణ హత్యకు గురయ్యారు. లాస్ ఏంజిల్స్లోని తమ నివాసంలో వారిద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. రక్తపుమడుగులో ఉన్న వారిద్దరిని చూసి అభిమానులు చలించిపోయారు. శరీరాలపై అనేక కత్తిపోట్లు కనిపించడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడింది వారి కుమారుడు నిక్ రైడర్ అని అమెరికా వార్తా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగించే వాడినని నిక్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన తండ్రి దర్శకత్వంలో నిక్ ఒక సినిమాలో కూడా నటించి ప్రశంసలు పొందాడు. అయితే, తన తల్లిదండ్రులనే హత్య చేశాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అతని నుంచి ఎలాంటి రెస్సాన్స్ రాలేదు. రాబ్ రైనర్ గత ఐదు దశాబ్దాలకు పైగా హాలీవుడ్లో ఉన్నారు. ఆయన నటనకు రెండు ఎమ్మీ అవార్డులు కూడా లభించాయి. వెన్ హ్యారీ మెట్ సాలీ , స్టాండ్ బై మీ, ది ప్రిన్సెస్ బ్రైడ్, తదితర సినిమాలకు దర్శకత్వం వహించి పేరు తెచ్చుకున్నారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
ప్రొవిడెన్స్: అమెరికాలో మళ్లీ తుపాకీ గర్జించింది. రోడ్ ఐలాండ్స్లోని ప్రొవిడెన్స్ పట్టణంలోని బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడు కాలేజ్కు వచ్చి పరీక్షలు రాస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దాంతో ఇద్దరు మరణించారు. 9 మంది గాయపడ్డారు. వెంటనే దుండగుడు పరారయ్యాడు. అతను 30ల్లో ఉంటాడని, నలుపు దుస్తులు ధరించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఎప్పుడు, ఎక్కడ అతడు దొరికాడన్న విషయం పోలీసులు వెల్లడించలేదు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల శబ్దం వినగానే విద్యార్థులంతా హడలిపోయారు. రూమ్లో, బాత్రూమ్లలో, డెస్క్ కింద, జిమ్లో, ఎక్కడ వీలైతే అక్కడే గంటల తరబడి దాక్కున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. దాంతో వారాంతంలో అత్యంత సందడిగా ఉండే పట్టణ వీధులన్నీ దుండగుడు బయటే తిరుగుతున్నాడన్న భయంతో నిర్మానుష్యంగా మారిపోయాయి. సెక్యూరిటీ చెకింగ్లను దాటుకుంటూ అతను కాలేజీలోకి హంతకుడు ఎలా రాగలిగాడు? ఫేస్ రికగి్నషన్ లాక్ రక్షణ ఉన్న క్లాస్ రూమ్ లోనికి ఎలా దూరాడు అన్నది ప్రశ్నగా మారింది. మృతులకు అమెరికా ట్రంప్ నివాళులు అర్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దుండగుడు హ్యాండ్ గన్ వాడినట్టు భావిస్తున్నారు. -
అమెరికాలో మరోసారి కాల్పులు.. 8 మంది..!
-
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలోని రోడ్ ఐలాండ్లో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో విద్యార్థులు తుది పరీక్షలు రాస్తున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నల్లటి దుస్తులు ధరించిన ఒక ఆగంతకుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. నిందితుని జాడ ఇంకా తెలియరాలేదు. పోలీసు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. There is currently heavy Providence Police and Fire presence on Hope Street near Brown University. Please exercise caution and avoid this area until further notice.— Providence Police (@ProvidenceRIPD) December 13, 2025We are actively monitoring the shooting at @BrownUniversity. Our teams at @RIStatePolice and @RhodeIslandEMA are working closely with local law enforcement. Please stay clear of the area and monitor official channels for updates. Praying for our community.— Governor Dan McKee (@GovDanMcKee) December 13, 2025బారస్ అండ్ హోలీ భవనంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇది ఏడు అంతస్తుల భవనం. ఇందులో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విభాగం ఉన్నాయి. కాల్పులు జరిగిన సమయంలో ఇంజనీరింగ్ డిజైన్ పరీక్ష జరుగుతోంది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ పోలీస్ టిమోతీ ఓ'హారా ప్రకారం.. నిందితుడు ముదురు రంగు దుస్తులు ధరించాడు. దాడి జరిగిన ఇంజనీరింగ్ భవనం నుండి అతను బయటకు వెళ్లడం చివరిసారిగా కనిపించింది. ఈ సందర్భంగా మేయర్ బ్రెట్ స్మైలీ మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ‘షెల్టర్-ఇన్-ప్లేస్’ అమలులో ఉందని ప్రకటించారు. క్యాంపస్ సమీపంలో నివసించే ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, పరిస్థితి సద్దుమణిగే వరకు బయలకు రాకూడదని కోరారు.గాయపడిన ఎనిమిది మంది పరిస్థితి నిలకడగా ఉందని మేయర్ స్మైలీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన విద్యార్థులలో తీవ్ర భయాందోళనను సృష్టించింది. ఒక విద్యార్థి తన వసతి గృహంలో ప్రాజెక్ట్పై పని చేస్తుండగా సైరన్లు, సందేశం విని తన భయపడ్డానని తెలిపారు. మరో ల్యాబ్లోని విద్యార్థులు హెచ్చరిక అందగానే డెస్క్ల కింద దాక్కుని, లైట్లు ఆపివేశామన్నారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ ప్రస్తుతం మనం బాధితుల కోసం ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేమని అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్'లో, ఎఫ్బిఐ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారని తెలిపారు. అయితే, నిందితుడు అదుపులో ఉన్నాడని మొదట చెప్పినప్పటికీ, తరువాత అతను పోలీసుల అదుపులో లేడని స్పష్టం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఎక్స్లో ఒక పోస్ట్ చేస్తూ, ఈ వార్తను తాను విన్నానని ఎఫ్బిఐ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నదని, బాధితుల కోసం ప్రార్థిస్తున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ‘షాక్ అయ్యాను’.. మెస్సీ కార్యక్రమంపై మమతా క్షమాపణలు -
రష్యా భూభాగంపై జిత్తులమారి చైనా కన్ను!
పొరుగు దేశాల భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపించే జిత్తుల మారి చైనా ఇప్పుడు రష్యాపై కన్నేసింది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చి.. మ్యాపులు విడుదల చేసే డ్రాగన్ దేశం ఇప్పుడు రష్యా-చైనా సరిహద్దుల్లోని ఓ ద్వీపం తమదేనని వాదిస్తోంది. దీనిపై రష్యా నిఘా వర్గాలు ఇది నిజమేనంటూ నివేదికలు అందజేశాయి. అసలు ఆ ద్వీపం కథేంటి? శతాబ్దన్నర క్రితం చైనా ఆ ద్వీపాన్ని కోల్పోవడానికి కారణాలేంటి? దీనిపై సాక్షి డిజిటల్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ కథనం ఇది..రష్యాలోని సైబీరియా ప్రాంతంలో.. ఉస్సూరీ-అమూర్ నదుల సంగమం వద్ద అతిపెద్ద ద్వీపం ఉంది. దీన్ని బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్గా పిలుస్తారు. 150 ఏళ్లుగా ఇది రష్యాలో అంతర్భాగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ ద్వీపంపై చైనా కన్నేసింది. ఈ ద్వీపాన్ని ఆక్రమించాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇటీవల రష్యా నిఘా సంస్థ ఎఫ్ఎస్బీ 8 పేజీల నివేదికను అందజేసింది. ఆ నివేదికలో చైనాను శత్రువుగా పేర్కొంది. అమెరికా మ్యాగజైన్ ‘న్యూస్ వీక్’.. అదేవిధంగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక దీనిపై కథనాలను ప్రచురించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2023లో చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మ్యాపుల్లో ఈ ఐల్యాండ్ పూర్తిగా చైనాదేనని పేర్కొనడమే కాకుండా.. ఆ దీవి పేరును మార్చివేసింది. అంతేకాదు.. రష్యాలోని తూర్పు నగరం వ్లాడివోస్టోక్ కూడా తమ భూభాగమేనని చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ మ్యాప్ స్పష్టం చేస్తోంది.బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ ఒకప్పుడు చైనాలో భాగమే..! కానీ, 150 ఏళ్ల క్రితం.. అంటే.. 19వ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం బలహీనపడింది. ఆ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైంది. భద్రత దృష్ట్యా ఈ దీవిని రష్యాకు అప్పగించింది. రష్యాకు కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ఈ దీవి అప్పట్లో అవసరంగా మారింది. 1958లో జరిగిన ఒప్పందం ప్రకారం అమూర్ నదికి ఉత్తరాన ఉన్న విశాలమైన ప్రాంతాన్ని రష్యాకు అప్పటించింది. 1860లో మరో యుద్ధంలో చైనా ఓడిపోవడం.. పాశ్చాత్య దేశాలకు రష్యా సహకరిస్తుందనే భయంతో ‘పెకింగ్ ఒప్పందం’ చేసుకుంది. ఈ రెండు ఒప్పందాల ప్రకారం ఈ దీవితోపాటు.. సువిశాలమైన భూభాగం రష్యా సొంతమైంది. ఆ వెంటనే రష్యా ఇక్కడ వ్లాదివోస్తోక్ నగరాన్ని నిర్మించింది.ఐదు దశాబ్దాల క్రితం నుంచి చైనా సంస్కరణల బాటలో దూసుకుపోతున్నది. రెండు దశాబ్దాలుగా ఆర్థికంగా బలోపేతమవుతుండడంతో.. క్రమంగా ఈ ప్రాంతాలపై వివాదాలు రాజుకున్నాయి. రష్యా-చైనా మధ్య 4,200 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సరిహద్దు ఉంది. 60వ దశకంలో కూడా ఈ సరిహద్దు వెంబడి ఇరుదేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. 1990-2000 మధ్యకాలంలో ఈ వివాదం మరింత ముదిరింది. దాంతో.. పలు ఒప్పందాలు కుదిరాయి. అయినా డ్రాగన్ తన కవ్వింపు చర్యలకు ఫుల్స్టాప్ పెట్టకపోవడంతో 2008లో రష్యా కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్లో కొంత భాగం చైనాకు చెందుతుంది.ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఈ యుద్ధంతో రష్యా ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో చిక్కకుపోయింది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో అతలాకుతలమమయ్యింది. దీంతో డ్రాగన్ మరోమారు కుయుక్తులకు తెరతీసింది. ఓ వైపు రష్యాను మిత్రదేశంగా పేర్కొంటునే.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను కాదని రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించింది. మరోవైపు బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ని హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఒకవేళ చైనా తన చర్యలను మరింత ముమ్మరం చేస్తే.. రష్యా దానిని ఎదుర్కోగలదా? ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైతే.. అది ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -హెచ్.కమలాపతి రావు -
పాకిస్థాన్కు.. అమెరికా మరో వరం
జీ7 దేశాలను కాదని.. భారత్ సహా ఐదు దేశాలతో కోర్-5 దేశాల కూటమి ఏర్పాటుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు పాకిస్థాన్పై వరాల జల్లులను కంటిన్యూ చేస్తున్నారు. వాణిజ్యం, అప్పులు, ఇతరత్రా సహాయసహకారాలు అందించడంలో ఇప్పటికే పాకిస్థాన్కు అగ్రతాంబూలం ఇస్తున్న ట్రంప్ సర్కారు.. తాజాగా పాక్ యుద్ధ విమానాలు – ఎఫ్16 అప్గ్రేడేషన్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏకంగా 686 మిలియన్ డాలర్లు.. అంటే.. సుమారు 5,800 కోట్ల రూపాయలను వెచ్చించనుంది.పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే..! ఆ తర్వాత పాక్ ప్రతిస్పందనకు ధీటుగా బదులిచ్చేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. అయితే.. భారత్తో పోలిస్తే.. పాకిస్థాన్ వద్ద అధునాతన యుద్ధ విమానాలున్నాయి. అమెరికా సరఫరా చేసిన ఎఫ్16, చైనా అందజేసిన జే10సీ వంటి యుద్ధ విమానాలు పాకిస్థాన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. అయినా.. భారత్ తన సంప్రదాయ మిరాజ్, మిగ్ విమానాలతో పాకిస్థాన్ పీచమణిచింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిమ్ మునీర్ ఆ సమయంలో బంకర్లలో తలదాచుకోవడంతో.. అధునాతన యుద్ధ విమానాలున్నా పాకిస్థాన్ ఏమీ చేయలేకపోయింది.నిజానికి ఆపరేషన్ సిందూర్లో భారత్కు చెందిన రాఫెల్ను కూల్చేశామని పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసింది. అదే సమయంలో పాకిస్థాన్కు చెందిన అమెరికా తయారీ ఎఫ్-16లు భారత్ దాడిలో ధ్వంసమైనట్లు నివేదికలు వచ్చాయి. ఇది ఒక విధంగా అమెరికాకు తీవ్ర అవమానం. దీంతో అగ్రరాజ్యం పాకిస్థాన్కు ఇచ్చిన యుద్ధ విమానాలను మరింత సమర్థంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ 5,800 కోట్ల రూపాయలతో పాకిస్థాన్ వద్ద ఉన్న ఎఫ్16 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను అమెరికా పార్లమెంట్కు పంపింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ చేసిన ప్రతిపాదన ఇప్పుడు అమెరికా పార్లమెంట్ ముందు ఉంది. దీనిపై కాంగ్రెస్ ఆమోదం లేదా తిరస్కరణకు 30 రోజుల సమయం ఉంది. ఆ వెంటనే అమెరికా తన మిత్రదేశమైన పాక్కు లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ను జారీ చేస్తుంది. ఆ వెంటనే పాకిస్థాన్లోని ఎఫ్16 యుద్ధ విమానాల అప్గ్రేడ్ ప్రక్రియ మొదలవుతుంది. 686 మిలియన్ డాలర్ల ప్రతిపాదనలో వేర్వేరు కేటగిరీల వారీగా ఆ ఏజెన్సీ వివరాలను కాంగ్రెస్కు అందజేసింది. దాని ప్రకారం 37 మిలియన్ డాలర్లను ఎఫ్16లో ఉపయోగించే కీలక పరికరాలకు వెచ్చిస్తారు. మిగతా 649 మిలియన్ డాలర్లను హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అభివృద్ధి, లాజిస్టిక్స్కు కేటాయిస్తారు.సరే.. పాకిస్థాన్కు అమెరికా చేసే ఈ సాయంతో భారత్కు నష్టమేంటి? అనుకుంటున్నారా? దీని ప్రభావం మనదేశంపై తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే.. ఎఫ్16లో అత్యంత కీలకమైన అప్గ్రేడేషన్స్పై అమెరికా దృష్టి సారించింది. ముఖ్యంగా 92 లింక్-16 టాక్టికల్ డేటా లింక్ సిస్టమ్ని పాకిస్థాన్కు అందజేయనుంది. ఈ సాంకేతికత అమెరికాతోపాటు.. నాటో దేశాల వద్ద మాత్రమే ఉంది. అంటే.. క్లిష్టపరిస్థితుల్లో అమెరికా, నాటో దేశాల మధ్య జామ్-ప్రూఫ్ కమ్యూనికేషన్కు ఉపయోగపడే ఈ టెక్నాలజీ ఇప్పుడు పాకిస్థాన్కు అందుతుంది. దీంతోపాటు.. కొత్త ఏవియానిక్స్, క్ట్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, మిషన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్, విడిభాగాలను అమెరికా అందజేస్తుంది. ఇక ఎఫ్16పై పైలట్లకు సమర్థమైన ట్రైనింగ్ ఇచ్చేలా సిమ్యులేటర్లను అందజేయనుంది. అయితే.. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ నుంచి భారత్కు మరింత ముప్పు పెరిగే ప్రమాదాలున్నాయి. అయితే.. శత్రువు కదలికలను నిశితంగా పరిశీలించే భారత ప్రభుత్వం .. ముప్పును ఎదుర్కోవడంలో చాణక్య నీతిని ప్రదర్శిస్తుందని ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచదేశాలు గుర్తించాయి. ఇప్పుడు ఎఫ్16ల అప్గ్రేడేషన్ ముప్పును కూడా భారత్ సమర్థంగా ఎదుర్కొంటుందని ఆశిద్దాం..!-హెచ్.కమలాపతి రావు -
భారత్తో ట్రంప్ దాగుడు మూతలు..?
ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలను చూస్తే.. భారత్తో అమెరికా దూరం పెరిగిపోయిందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణం. ఏ విషయాన్ని తెగేసి చెప్పకుండా భారత్-పాక్ల యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకున్న ట్రంప్.. మద్దతు విషయానికొచ్చేసరికి పాక్కే ప్రయారిటీ ఇచ్చారు. ఆ దేశ ఆర్మీ ఛీఫ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్లను అమెరికాకు ఆహ్వానించడమే కాకుండా వారితో రాసుకుపూసుకుని తిరిగారు. ఇక్కడ ట్రంప్ ద్వంద్వ వైఖరి బయటపడింది. భారత్పై ఆంక్షలే లక్ష్యంగా..అదే సమయంలో భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించి అక్కసు తీర్చుకున్నారు. దీనిపై అమెరికాలో ఉన్న నిపణులు సైతం ట్రంప్ను హెచ్చరించారు కూడా. భారత్పై అత్యధిక సుంకాలు విధిస్తే ఆ దేశంలో ఎన్నో దశాబ్దాల నుంచి సాగుతున్న మిత్రత్వం చెడిపోతుందని కూడా వివరించారు. దానివల్ల అమెరికాక ఒరిగేదేమీ లేకపోయినా మనమే దెబ్బతింటామని కూడా చెప్పారు. కేవలం భారత్కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని ఒక్క ఒక్క తలంపుతో 50శాతం సుంకాలను విధించారు ట్రంప్.ఇదిలా ఉంచితే, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించారు. రష్యా చమురును కొనడం ఆపాలనే భారత్ను చాలాసార్లే హెచ్చరించారు. అయితే దాన్న భారత్ పూర్తి సీరియస్గా తీసుకోగా పోగా రష్యా నుంచి చమురు కొనడాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల రష్యా అధ్యక్షడు పుతిన్.. భారత్కు వచ్చిన నేపథ్యంలో కూడా చమురు సరఫరాపై ఒక్క ముక్కలో తేల్చి పారేశారు. తాము భారత్కు సరఫరా చేస్తామని కచ్చితంగా చెప్పేశారు. మరొకవైపు చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఇలా వరుస పరిణామాలు ట్రంప్కు అసహనం తెప్పిస్తున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా వేరే దేశాలకు భారత్ దగ్గరవ్వడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. మెక్సికో సుంకాల వెనుక ట్రంప్ హస్తం?గత రెండు రోజుల క్రితం భారత దిగుమతులపై మెక్సికో 50 శాతం సుంకాన్ని విధించింది. దీనికి ఏవో కారణాలు చెప్పుకొచ్చింది. తమ దేశంతో పూర్తిస్థాయి వాణిజ్య సంబంధాలు లేని దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తున్నామంటూ స్పష్టం చేసింది. ఈ జాబితాలో భారత్తో పాటు చైనా కూడా చేరింది. మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) లేని దేశాలన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయని చెప్పింది. అయితే వీటి వెనుక ఉన్నది ట్రంప్ అని పలు ఆరోఫలణలు వచ్చాయి.. వస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఇప్పటికే మెక్సికో సుంకాలపై స్పందించారు. ఇది ట్రంప్ చర్య కావొచ్చనే అనమానం వ్యక్తం చేశారు. దీన్ని పూర్తిగా కాదనలేం. అమెరికాకు అత్యంత మిత్ర దేశాల్లో మెక్సికో ఒకటి. మెక్సికోను పదే పదే పొగడ్తలతో ముంచెత్తం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది.ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య ఒప్పందాలున్నాయి. గతంలో పలు సందర్భాల్లో మెక్సికో అధ్యక్షరాలు క్లాడియా షీన్బామ్ను అత్యంత సాహసిగా, గొప్ప నాయకురాలిగా అభివర్ణించారు ట్రంప్. ఇక మెక్సికోకు కూడా అమెరికాపై అంతే ప్రేమ ఉంది. ఈ కారణంగానే ట్రంప్ దాగుడు మూతలకు తెరలేపి భారత్కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని చూశారనేది నిపుణుల అంచనా. ఇది ట్రేడ్ డైవర్షన్కు అడ్డుకట్టా.. ట్రంప్ అడ్డుకట్టా..?భారత్, చైనాలపై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాలు మెక్సికోకు దిగుమతి చేసే వస్తువులను నేరుగా అమెరికాకు పంపకుండా మెక్సికో ద్వారా మళ్లించి ఆ తర్వాత అమెరికాకు పంపే అవకాశం ఉంది. దీన్ని ట్రేడ్ డైవర్షన్ అంటారు.దీనికి అడ్డుకట్టవేయాలనే తలంపుతో మెక్సికో చేసినా, ఇందులో ట్రంప్ హస్తం ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారత్పై అమెరికా విధించిన సుంకాలపై అక్కడ ఎంపీల నుంచే ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ట్రంప్ ఇలా చేసే ఉంటారనేది మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. ఇదీ చదవండి:భారత్పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావంట్రంప్ భారీ సుంకాల రద్దు.. ? యూఎస్ కాంగ్రెస్లో తీర్మానం! -
ట్రంప్ భారీ సుంకాల రద్దు?.. యూఎస్ కాంగ్రెస్లో తీర్మానం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతపై విధించిన అదనపు సుంకాలు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తన జాతీయ అత్యవసర అధికారాన్ని ఉపయోగించి, భారతదేశం నుండి వచ్చే దిగుమతులపై 50 శాతం అదనపు సుంకాన్ని విధించారు. తాజాగా వీటిని రద్దు చేయాలంటూ ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ప్రతినిధులు డెబోరా రాస్, మార్క్ వీసీ, భారతీయ-అమెరికన్ రాజా కృష్ణమూర్తి నేతృత్వంలో ఈ తీర్మానం వెలువడింది. ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధం అని, ఇది అమెరికన్ కార్మికులు, వినియోగదారులతో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు హానికరం అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానం కేవలం వాణిజ్యపరమైన సమస్యను మాత్రమే కాకుండా, అధ్యక్షుడు తన అత్యవసర అధికారాలను ఏకపక్షంగా వినియోగించడాన్ని ఎత్తిచూపింది.ఈ సుంకాల ప్రభావం గురించి కాంగ్రెస్ మహిళా సభ్యురాలు డెబోరా రాస్ మాట్లాడుతూ నార్త్ కరోలినా ఆర్థిక వ్యవస్థ భారతదేశం వాణిజ్యం, పెట్టుబడులతో ముడిపడి ఉందని, భారతీయ అమెరికన్ సమాజం ఇక్కడ వేళ్లూనుకుందని అన్నారు. భారతీయ కంపెనీలు ఇక్కడ బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి, వేలాది ఉద్యోగాలు సృష్టించాయని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యుడు మార్క్ వీసీ తన ప్రసంగంలో భారతదేశాన్ని .. ముఖ్యమైన సాంస్కృతిక, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణించారు. ఈ చట్టవిరుద్ధమైన పన్నులు అమెరికన్ పౌరులపై భారం మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ సుంకాలు వ్యతిరేకమైనవని, అమెరికన్ కార్మికులకు హాని కలిగిస్తాయని, వినియోగదారులకు ఖర్చులను పెంచుతాయని అన్నారు. ఈ సుంకాలను రద్దు చేయడం ద్వారా యూఎస్-భారతదేశం మధ్య ఉన్న కీలకమైన ఆర్థిక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయవచ్చని, తద్వారా మన ఉమ్మడి ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొన్నారు. ఈ తీర్మానం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నంగా తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ గత ఆగస్టులో భారత్పై రెండు విడతలుగా 25 శాతం చొప్పున సుంకాలను విధించారు. భారతదేశం రష్యన్ చమురు కొనుగోలు చేస్తూ, మాస్కో యుద్ధ ప్రయోజనానికి ఆజ్యం పోస్తున్నదని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద సుంకాలను పెంచారు.ఇది కూడా చదవండి: ఆకాశానికి రంగులు అద్దిన ఉల్కలు! -
ఏఐని బెస్ట్గా వాడుతున్న దేశం ఏదో తెలుసా?
ఒకప్పుడు కంటికి కనిపించే మరయంత్రాలు.. ఇప్పుడు కానరాకుండానే అద్భుతాలు చేస్తున్నాయి. నిమిషాల్లో.. కాదు చిటికేసేలోపే పనులన్నీ చక్కబెట్టేస్తున్నాయి. ఆఖరికి.. మనం తీసుకునే నిర్ణయాలనూ ప్రభావితం చేసేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) అనేది ఇప్పుడు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తి కూడా. ఆరోగ్యం నుంచి విద్య వరకు.. బ్యాంకింగ్ నుంచి వినోదం దాకా.. ప్రతీ రంగంలోనూ ఏఐ తన ముద్రను వేసేసుకుంది. క్రితంతో పోలిస్తే 2025లో వాడకం బాగా పెరిగింది. ఏఐ అభివృద్ధి, పరిశోధన, మోడల్ డెవలప్మెంట్లో ప్రపంచంలోకెల్లా అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. సిలికాన్ వ్యాలీ, ఎంఐటీ, స్టాన్ఫోర్డ్ వంటి పరిశోధనా కేంద్రాలు కొత్త మోడళ్లను రూపొందిస్తూ.. ఏఐ ఆవిష్కరణల్లో అగ్రరాజ్యాన్ని ముందంజలో ఉంచాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా.. 87% కంపెనీలు ఏఐని తమ వ్యాపార ప్రణాళికల్లో ప్రధాన ప్రాధాన్యంగా గుర్తించాయి. మొత్తంగా 76% సంస్థలు కనీసం ఒక విభాగంలో ఏఐని వాడుతున్నాయివాస్తవ వినియోగం విషయంలో మాత్రం అత్యధిక జనాభా ఉన్న చైనా (58%), భారతదేశం (57%) ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నాయి. చైనాలో ఆరోగ్యం, తయారీ, ప్రభుత్వ సేవల్లో AI విస్తృతంగా అమలవుతోంది. భారతదేశంలో బ్యాంకింగ్, ఈ-కామర్స్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ రెండు దేశాలు పెద్ద జనాభా, విస్తృత మార్కెట్ కారణంగా AIని ప్రాక్టికల్గా ఉపయోగించడంలో ముందున్నాయి. అదే సమయంలో.. ఎంటర్టైన్మెంట్ విభాగంలో చూస్తే చైనా కంటే మన దేశమే ముందంజలో ఉంది. అయితే.. ఏఐని సమర్థవంతంగా వినియోగిస్తున్న దేశాలు ఏంటో తెలుసా?.. ఏఐ వినియోగంలో చిన్న దేశాలు వెనుకబడలేదు. యూరప్లోని చిన్న కంట్రీ అయిన ఎస్టోనియా ప్రపంచంలోనే ఏఐని అతి సమర్థవంతంగా వినియోగించుకుంటున్న దేశంగా గుర్తింపు దక్కించుకుంది. డిజిటల్ పాలసీలతో పాటు ఈ-పౌరసత్వం, డిజిటల్ ఐటీ వంటి ప్రాజెక్టుల కోసం పూర్తిగా ఏఐనే ఉపయోగించుకుంటోందా దేశం. ఈ లిస్ట్లో తర్వాత సింగపూర్ ఉంది. అక్కడి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, పబ్లిక్ సర్వీసుల్లోనూ AIని అత్యుత్తమంగా ఉపయోగిస్తున్నారు. స్పష్టమైన పాలసీలు, సమర్థవంతమైన అమలుతోనే ఇది సాధ్యమైందని సింగపూర్ ఈ మధ్యే గొప్పగా ప్రకటించుకుంది కూడా. ఇక.. మన దేశంలో ఏఐని విచ్చలవిడిగా వాడుతోంది చూస్తున్నదే!. అయితే యూరప్లో మాత్రం ఏఐ తరహా కంటెంట్ వాడకంపై ఆంక్షలు ఉన్నాయి. ఈయూ AI Act ద్వారా ఎథికల్ AI వినియోగానికి(ఎలా పడితే అలా వాడడానికి వీల్లేకుండా..) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలు ఏఐని తక్కువేం వాడడం లేదు. ఏఐ కంప్యూటింగ్ పవర్లో భారీగా పెట్టుబడులు పెడుతూ.. భవిష్యత్తులో గ్లోబల్ AI హబ్లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దక్షిణ కొరియాలో ప్రభుత్వం ఉద్యోగులకు AI అక్షరాస్యతలో భాగంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.మొత్తంగా.. ప్రపంచ ఏఐ దృశ్యం ఇప్పుడు పెద్ద దేశాల ఆధిపత్యంతో పాటు చిన్న దేశాల సమర్థవంతమైన వినియోగం అనే ద్వంద్వ రూపంలో ఉందని చెప్పొచ్చు. -
ట్రంప్.. క్లింటన్.. బానన్.. బిల్గేట్స్.. ఎప్స్టీన్ ఫైల్స్లో మరో బాంబు!
ప్రపంచాన్ని కుదిపేస్తున్న హైఫ్రొఫైల్ సెక్స్ స్కాండల్ ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రట్స్ నేతృత్వంలోని హౌజ్ ఓవర్సైట్ కమిటీ మరికొన్ని ఫొటోలను తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో రాజకీయ, వ్యాపార ప్రముఖులకు సంబంధించిన మొత్తం 19 ఫొటోలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ ఆప్తుడు స్టీవ్ బానన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ ట్రెజరీ సెక్రటరీ ల్యారీ సమర్స్, బిల్ గేట్స్, ప్రముఖ ఫిల్మ్మేకర్ వూడీ అలెన్, ప్రిన్స్ ఆండ్రూ.. ఇలా పలువురు జెఫ్రీ ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్నట్లు అందులో ఉంది. ఇందులో.. డొనాల్డ్ ట్రంప్ కొంత మంది అమ్మాయిలతో(వాళ్ల మఖాల బ్లర్ చేసి ఉన్నాయి) కలిసి దిగిన ఫొటో బ్లాక్ అండ్ వైట్లో ఉంది. మరొక ఫొటోలో ఎప్స్టీన్తో కలిసి ట్రంప్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇంకొక ఫొటోలో ఒక అమ్మాయితో(ముఖం కనిపించకుండా చేశారు) కలిసి ఫొటోకు ఫోజు ఇచ్చారాయన. ఇంకొక ఫొటోలో ట్రంప్ పేరిట కండోమ్ ఉండడం గమనార్హం. వీటితో పాటు క్లింటన్ ఎప్స్టీన్తో దిగిన ఫొటోలు, ఎప్స్టీన్ ఎస్టేట్లో బిల్గేట్స్ సహా పలువురు ప్రముఖులు సందడి చేసిన ఫొటోలు ఉన్నాయి.ట్రంప్.. ఎప్స్టీన్ ఒకప్పుడు మంచి స్నేహితులే. అయితే లైంగిక దాడి కేసులో ఎప్స్టీన్ అరెస్ట్(2004) తర్వాత ఆ బంధానికి ఎండ్కార్డ్ పడింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఇదే విషయాన్ని ఆయన చెబుతూ వస్తుంటారు. బానన్తో ఎప్స్టీన్ సెల్ఫీ.. పక్కన ఐల్యాండ్లోని ఓ గోడ మీద ఫొటోలో బిల్గేట్స్తాజాగా రిలీజ్ అయిన ఫొటోలు.. పలు ఈవెంట్లలో, పిచ్చాపాటి సంభాషణల్లో దిగిన ఫొటోలే ఉన్నాయి. అంతేగానీ.. అందులో ఉన్నవాళ్లంతా ఎప్స్టీన్ పాపాల్లో భాగం అయినట్లు మాత్రం ఎక్కడా లేదని చెబుతూ ఈ ఫొటోలను రిపబ్లికన్లు తేలికగా తీసుకుంటున్నారు. మరోవైపు ట్రంప్ కూడా ఆ ఫొటోలు అంతగా చర్చించుకోవాల్సిన విషయమేమీ కాదని అన్నారు. ‘‘నేను వాటిని చూడలేదు. కానీ అందరికీ ఈ వ్యక్తి(బానోన్ను ఉద్దేశిస్తూ..) తెలుసు. అతను పామ్ బీచ్లో ఎక్కడైనా కనిపించేవాడు. అతనితో వందలాది మంది ఫోటోలు ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు’’ అంటూ బదులిచ్చారు. 🇺🇸⚡️Reporter: There were new Epstein photos released today showing..What was your reaction?Trump: I haven't seen them, but everybody knew this man (Bannon). He was all over Palm Beach. There are 100s and 100s of people that have photos with him. I know nothing about it. pic.twitter.com/KKWGtyr4Q2— Osint World (@OsiOsint1) December 12, 2025కామ పిశాచి.. ఎప్స్టీన్!అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి.. కొంత కాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఎప్స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే రెండు దీవుల్లో(ప్రైవేట్ ఐల్యాండ్)లో.. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి(ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు). ఎప్స్టీన్ ఫైల్స్లో.. మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే..ఎఫ్బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ ఏడాది జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని.. సన్నిహితంగా ఉన్న ప్రమఖలపైనా నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే..ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ట్రంప్ ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపించాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ సెక్స్ స్కాండల్ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు కూడా).. ట్రంప్ను కూడా ఎఫ్బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో.. ఇది డెమోక్రాట్ల మోసం అంటూ తొలి నుంచి ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్.. చివరకు నవంబర్ 30వ తేదీన అధ్యక్ష హోదాలో ఫైల్స్ విడుదలకు ఓ సంతకం చేశారు. ఆ సమయంలో ఇక దాచడానికి ఏమీ లేదు.. విడుదలకు పూర్తి మద్దతు ఇస్తున్నా అని ఆయన ప్రకటించడం గమనార్హం. దాని ప్రకారం.. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 30 రోజుల్లో అన్ని ఫైళ్లను హౌజ్ ఓవర్సైట్ కమిటీకి అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎప్స్టీన్ ప్రైవేట్ ల్యాండ్స్కు సంబంధించి.. అందులో ఉన్న 150 ఫొటోలను, డాక్యుమెంట్లను కమిటీ బయటపెట్టింది. 20,000 పేజీల డాక్యుమెంట్లలో ఎప్స్టీన్కు ప్రముఖ రాజకీయ, మీడియా, హాలీవుడ్, విదేశీ నాయకులతో ఈ-మెయిల్ సంభాషణలు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ల ద్వారానే ప్రిన్స్ ఆండ్రూ పేరు ప్రముఖంగా బయటపడింది. మాజీ ట్రెజరీ కార్యదర్శి లారీ సమర్స్తో ఎప్స్టీన్ చేసిన ఈ-మెయిల్లు, అలాగే ట్రంప్ మాజీ సలహాదారు బానన్కు సహాయం చేయాలనే ఆఫర్లు బయటపడ్డాయి.అంతేకాదు ఐల్యాండ్లోని విలాసవంతమైన వసతుల ఫొటోలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మరోపక్క.. గిస్లేన్ మాక్స్వెల్ కేసుకు సంబంధించిన గ్రాండ్ జ్యూరీ మెటీరియల్స్ కూడా విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాలి, కాబట్టి మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
కోర్–5 సూపర్ క్లబ్
వరల్డ్ ఆర్డర్. ఒక్క వాక్యంలో చెప్పాలంటే బలం, సామర్థ్యం ఆధారంగా వరుస క్రమంలో దేశాల అమరిక. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలే శాసించే ఈ వరల్డ్ ఆర్డర్ త్వరలో పెను మార్పులను చవిచూడనుందా? ఇప్పటిదాకా అత్యంత బలోపేతమైన కూటమిగా ఉన్న జీ7 వైభవం గతించనుందా? దాన్ని తోసిరాజనేలా అతి శక్తిమంతమైన సరికొత్త కూటమి ఒకటి శరవేగంగా పురుడు పోసుకుంటోందా? అన్ని రంగాల్లోనూ నిర్నిరోధంగా దూసుకుపోతున్న నయా భారత్ ది అందులో అతి కీలక పాత్ర కానుందా? అంటే, అవుననే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ముఖ్యంగా కొద్దిరోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు, చేతలు, చాప కింద నీరులా ఆయన చకచకా సాగిస్తున్న ప్రయత్నాలు ఇందుకు ప్రబల సంకేతాలేనని చెబుతున్నారు. కోర్–5 పేరిట కొత్త కూటమికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత డిజిటల్ వార్తా పత్రిక పొలిటికో రాసి కథనం అంతర్జాతీయంగా పెను సంచలనమే సృష్టిస్తోంది. అమెరికా, భారత్, మరో రెండు ఆసియా దిగ్గజాలైన చైనా, జపాన్ తో పాటు ఆశ్చర్యకరంగా రష్యా కూడా ఇందులో భాగస్వామి కానుందని పొలిటికో కథనం సారాంశం. అమెరికాకు సంబంధించిన రక్షణ, జాతీయ భద్రతా వ్యవహారాలను అత్యంత కచి్చతత్వంతో నివేదించే డిఫెన్స్ వన్ సైట్ ను ఉటంకిస్తూ అది ఈ మేరకు పేర్కొంది. ఈ కోర్ గ్రూప్నకు ముద్దుగా ’సీ5 సూపర్ క్లబ్’ గా నామకరణం కూడా చేసింది! నిజంగా గనుక అదే జరిగితే చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి ఇదే అవుతుందని అంతర్జాతీయ నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలో ప్రచురించకుండా రహస్యంగా ఉంచిన భాగంలో సీ5 గురించి వివరంగా ఉన్నట్టు వాషింగ్టన్, వైట్ హౌస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి! ట్రంప్ తీసుకువస్తున్న సరికొత్త సీ 5 ప్రతిపాదనలపై భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, జపాన్ ప్రధాని తకాయిచీ స్పందనలేమిటో తెలియాల్సి ఉంది. యూరప్ దేశాలకు చెక్? జీ7 కూటమిలో అమెరికా, కెనడా , జపాన్ ను మినహాయిస్తే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ రూపంలో నాలుగు యూరప్ దేశాలే ఉన్నాయి. పలు అంశాల్లో వాటి దూకుడు పట్ల ట్రంప్ కొద్దికాలం గుర్రుగా ఉన్నారు. చీటికిమాటికి అన్ని విషయాల్లోనూ తమ మాటే నెగ్గాలనే ఒంటెత్తు పోకడతో అవి శిరోభారంగా మారాయని భావిస్తున్నారు. వాటికి చెక్ పెట్టేందుకే ఈ కొత్త కూటమికి ఆయన తెర తీస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికా విదేశాంగ విధానంలోనే ఇది పెను మార్పు కానుంది! అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టిన గత 80 ఏళ్లలో నిత్యం యూరప్ ను తన అతి సన్నిహిత భాగస్వామిగానే పరిగణిస్తూ రావడం తెలిసిందే.ట్రంప్ సంకేతాలు సీ 5 గ్రూప్ గురించి నిజానికి ట్రంప్ కొంతకాలంగా స్పష్టమైన సంకేతాలే ఇస్తూ వస్తున్నారు. గత జూన్ లో జరిగిన జీ7 శిఖరాగ్రాన్నే ఇందుకు ఆయన వేదికగా మలచుకోవడం విశేషం. జీ7 కూటమిలో రష్యా కొనసాగి ఉండాల్సిందని, ఆ మాటకొస్తే చైనాకూ ఎన్నడో చోటు దక్కాల్సిందని ఆయన కుండబద్ధ్దలు కొట్టారు. తొలుత జీ8గా ఉన్న ఈ కూటమి కాస్తా, 2014లో క్రిమియాను ఆక్రమించిన కారణంగా రష్యాకు ఉద్వాసన పలకడంతో జీ7గా మారింది. ‘నిజానికి అతి పెద్ద తప్పిదమది. అలా చేయకుంటే నేడు ఇంత భారీ యుద్ధమే జరుగుతుండేది కాదు‘ అని ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఉదేశించి జీ7 వేదికగానే ట్రంప్ కుండబద్ధ్దలు కొట్టారు. సి5 మరీ సత్యదూరం ఏమీ కాకపోవచ్చని బైడెన్ హయాంలో అమెరికా జాతీయ భద్రతా మండలిలో కీలకపాత్ర పోషించిన టోరీ తౌసిగ్ చెప్పడం విశేషం. ‘ట్రంప్ కు సిద్ధాంతాలపై పెద్దగా నమ్మకం లేదు. తన ఆలోచనలకు, వ్యూహాలకు, ప్రణాళికలకు ఏది పనికొస్తే అదే అప్పటికి ఆయన సిద్ధాంతం! ఆ లెక్కన కొంతకాలంగా తనకు శిరోభారంగానే గాక అమెరికాకు ఆర్థికంగానూ, ఇతరత్రా కూడా భారంగానే పరిణమిస్తున్న యూరప్ దేశాలను వదిలించుకునేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు.అప్పుడే ఎజెండా రెడీ? అవుననే అంటోంది పొలిటికో. జీ7 మాదిరిగా తర చూ భేటీ కావాలని, అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించాలని ట్రంప్ భావిస్తున్నట్టు అది వివరించింది. అంతేకాదు, పశ్చిమాసియా భద్రతే సీ5 తొలి ఎజెండా అని కూడా డిఫెన్స్ వన్ ను ఉటంకిస్తూ చెప్పేసింది! ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య ఉప్పూ నిప్పుగా ఉన్న సంబంధాలను సరిదిద్దడం సీ5 ’తొలి అసైన్ మెంట్’ అని చెప్పుకొచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత టూరిస్ట్లకు షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్: వీసాల విషయంలో అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో పర్యాటక వీసాలపై కొత్తగా హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా అమెరికాలో ప్రసవించి... తమ పిల్లలకు పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకుంటే వీసాలు తిరస్కరించనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.కాగా, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో వలసదారులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పర్యటక వీసా (Visa) జారీ విషయంలోనూ ట్రంప్ సర్కార్ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా అమెరికా గడ్డపై బిడ్డకు జన్మనిచ్చి, తద్వారా జన్మతః పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో పర్యాటక వీసా దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది.ఈ నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా..‘పుట్టబోయే చిన్నారులకు అమెరికా పౌరసత్వం పొందడం పర్యాటకుల ప్రధాన ఉద్దేశంగా తాము భావిస్తే.. అటువంటి వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తాం. ఇటువంటి వాటిని అనుమతించం’ అని పేర్కొంది. మరోవైపు తమ దేశంలోకి వచ్చే పర్యాటకుల్లో కొందరు దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా హిస్టరీని అందించడాన్ని తప్పనిసరి చేసే యోచనలో ట్రంప్ సర్కార్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో, H-1B వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాల సమీక్షను కూడా విస్తరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.అంతేకాకుండగా.. అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి ఒక ప్రకటనలో, విదేశాంగ శాఖ ఇప్పటికే F, M, J వంటి విద్యార్థి, సందర్శకుల వీసా వర్గాలకు సోషల్ మీడియా ఖాతాల తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సమీక్ష H-1B, H-4 దరఖాస్తుదారులకు కూడా డిసెంబర్ 15 నుంచి వర్తిస్తుంది. ట్రంప్ యంత్రాంగం ఇటీవల H-1B, H-4 దరఖాస్తుదారులందరికీ సోషల్ మీడియా స్క్రీనింగ్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఇది వేలాది మంది హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, ప్రతి కేసును క్షుణ్ణంగా భద్రతా సమీక్ష చేస్తామని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. -
టాటా ప్లాంట్లలో ఇంటెల్ చిప్ల తయారీ
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇంటెల్ భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సెమీకండక్టర్లు (చిప్లు) తయారీ, అసెంబ్లింగ్ కోసం టాటా గ్రూప్తో చేతులు కలిపింది. ఈ విషయాన్ని టాటా గ్రూప్ ప్రకటించింది. ‘‘స్థానిక మార్కెట్ల కోసం ఇంటెల్ ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్ను త్వరలో ప్రారంభం కానున్న టాటా ఎల్రక్టానిక్స్ ఫ్యాబ్, అండ్ ఓఎస్ఏటీ కేంద్రాల్లో నిర్వహించేందుకు, అత్యాధునిక ప్యాకేజింగ్పై సహకారాన్ని కూడా ఇంటెల్–టాటా పరిశీలించనున్నాయి’’అని టాటాగ్రూప్ తన ప్రకటనలో పేర్కొంది. అలాగే, కన్జ్యూమర్, ఎంటర్ప్రైజ్ మార్కెట్ కోసం ఉద్దేశించిన ఏఐ పీసీ పరిష్కారాల విస్తరణకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు తెలిపింది. టాటా గ్రూప్ రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడులతో గుజరాత్లోని దొలెరాలో చిప్ తయారీ యూనిట్ను, అలాగే అసోంలో ప్యాకేజింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుండడం తెలిసిందే. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంప్యూటర్ మార్కెట్, కృత్రిమ మేధ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్న భారత మార్కెట్లో వేగంగా విస్తరించేందుకు టాటా గ్రూప్తో భాగస్వామ్యం వీలు కల్పిస్తుందని భావిస్తున్నట్టు ఇంటెల్ కార్పొరేషన్ సీఈవో లిప్ బు టన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఇంటెల్తో ఒప్పందం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మా ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తాయి. ఇరు సంస్థలూ కలసి సెమీకండక్టర్లు, సిస్టమ్ సొల్యూషన్లను అందించడం ద్వారా.. భారీగా విస్తరించనున్న ఏఐ మార్కెట్లో గణనీయమైన వాటాను సొంతం చేసుకోగలవు’’అని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. -
వీసా రహిత ప్రయాణికులకు.. సోషల్ మీడియా స్క్రీనింగ్
వాషింగ్టన్: విదేశీయులకు ప్రవేశ ని బంధనలను అగ్ర రాజ్యం అమెరికా నానాటికీ కఠినతరం చేస్తోంది. మూడో ఓరియన్ దేశాల వారికి శాశ్వతం తలుపులు మూసేస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించే వెసులుబాటున్న దేశాలకు చెందిన ప్రయాణికుల కూడా పలు నిబంధనలను వర్తింపజేయాలని అమెరికా అంతర్గత భద్రత (హోమ్ లాండ్ సెక్యూరిటీ) విభాగం తాజాగా నిర్ణయించింది. ప్రవేశానికి అనుమతించే ముందు వారి సోషల్ మీడియా హిస్టరీ, ఇ మెయిల్ ఖాతాలు, కుటుంబ సమగ్ర చరిత్ర తదితరాలను లోతుగా పరిశీలించనుంది. బుధవారం ఫెడరల్ రిజిస్టర్ లో ప్రచురించిన నోటీసులో ఈ మేరకు స్పష్టంగా పేర్కొన్నారు. వారి తాలూకు ఐదేళ్ల సోషల్ మీడియా సమాచారాన్ని వడపోయాలని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ప్రతిపాదించినట్టు అందులో పొందుపరిచారు. అంతేగాక ఐదేళ్లలో వారు వాడిన ఫోన్ నంబర్లు తదితరాలను కూడా ఇకపై విధిగా వెల్లడించాల్సి ఉంటుంది. దాదాపు 40 దేశాలకు అమెరికాలోకి వీసారహిత ప్రవేశం అందుబాటులో ఉంది. అక్కడి పౌరులు అగ్ర రాజ్యానికి వెళ్లాలంటే ఎల్రక్టానిక్ సిస్టం ఫర్ ట్రావెల్ అథరైజేషన్లో ఆన్ లైన్లో వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది. ఆ పద్ధతిని ఇకపై మార్చనున్నారు. అభంతరాల స్వీకరణ, వారి అనంతరం 60 రోజుల్లో ఈ నిబంధనలన్నీ అమల్లోకి రానున్నాయి. దీనివల్ల అమెరికాకు పర్యాటకపరంగా నష్ట ఉండబోదని మీడియా ప్రశ్నలకు బదులు ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాకు వీసారహిత ప్రవేశ వెసులుబాటున్న 40 దేశాల్లో అత్యధికం యూరప్, ఆసియా దేశాలే. -
ప్రొ హాకీ లీగ్ విజేతలకు ఒలింపిక్ బెర్త్
న్యూఢిల్లీ: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పాల్గొనే హాకీ జట్లను ఎంపిక చేసే ప్రక్రియను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) గురువారం వెల్లడించింది. విశ్వక్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో 12 జట్ల చొప్పున పోటీ పడనుండగా... ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా పాల్గొననుంది. ఇక మిగిలిన 11 జట్లను ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్, ఐదు కాంటినెంటల్ చాంపియన్షిప్ల ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ‘ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ 2025–26, 2026–27 సీజన్లలో విజేతగా నిలిచిన జట్లు విశ్వక్రీడలకు ఎంపికవుతాయి. ఒకవేళ రెండు సీజన్లలో ఒకే జట్టు విజేతగా నిలిస్తే... రెండో సీజన్లో రన్నరప్గా నిలిచిన జట్టు ఒలింపిక్స్కు అర్హత సాధిస్తుంది. కాంటినెంటల్ చాంపియన్షిప్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు కూడా విశ్వక్రీడలకు అర్హత పొందుతాయి. ఒకవేళ కాంటినెంటల్ చాంపియన్షిప్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు అప్పటికే ప్రొ లీగ్ ప్రదర్శన ఆధారంగా ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంటే... తదుపరి స్థానంలో ఉన్న జట్టుకు ఆ అవకాశం దక్కుతుంది’ అని ఎఫ్ఐహెచ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 2028 ఆరంభంలో ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లను సైతం నిర్వహించనున్నారు. ఇందులో పురుషుల, మహిళల విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొననున్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు కూడా ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంటాయి. -
500 సార్లు అప్లై చేసినా రాని ఉద్యోగం!: చివరికి ఏం చేసిందంటే?
చదువు పూర్తయిన తరువాత.. ఎవరైనా ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిందే. జాబ్ కోసం చాలా కంపెనీలకు అప్లై చేసుకుంటారు. ఇంటర్వ్యూలకు సైతం హాజరవుతారు. ఎవరైనా 500 కంటే ఎక్కువ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటారా?, వినడానికి బహుశా ఇది కొంచెం కొత్తగా అనిపించినా.. ఇది నిజం. ఇక కథనంలోకి వెళ్తే..చికాగోకు చెందిన ఒక మహిళ ఉర్బానా ఛాంపెయిన్లోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన కొద్దికాలానికే ఉద్యోగాల కోసం అప్లై చేయడం మొదలుపెట్టింది. ఆలా దాదాపు రెండేళ్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంది.దాదాపు 800 రోజులు.. ఆమె 500 కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంది. కానీ రెస్పాన్స్ మాత్రం అంతంత మాత్రమే వచ్చాయి. ఉద్యోగాలను వెతుక్కునే సమయంలో.. ఆమె తన భర్త ఆదాయంపై ఆధారపడింది. 2025 జులైలో నిరాశ చెంది.. ప్లీజ్ హైర్ మీ అనే ఫొటోలతో పాటు.. వ్యక్తిగత వివరాలను కలిగి ఉన్న ఒక 'గ్రాఫిక్ ఫోటో'ను ఫేస్బుక్లోని ఒక పెద్ద చికాగో కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ అతి తక్కువ కాలంలోనే వైరల్ కావడంతో.. చాలామంది జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు.వచ్చిన జాబ్ ఆఫర్లతో ఒక ఫోటోగ్రఫీ స్టూడియో యజమాని కూడా ఉన్నారు, ఆమె కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రశంసించారు. ఆమెను పార్ట్-టైమ్ స్టూడియో మేనేజర్గా నియమించారు. ఈ ఉద్యోగం తన డిగ్రీకి సంబంధించినది కానప్పటికీ, ఆమె సంతృప్తి చెందిందని & సహాయక పని వాతావరణాన్ని విలువైనదిగా చెబుతుంది.ఇదీ చదవండి: వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.. -
యూఎస్, యూకే కస్టమర్లే టార్గెట్ : రూ. 14 కోట్లకు ముంచేశారు
బెంగళూరు పోలీసులు ఒక అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్ను ఛేదించారు. మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ సిబ్బందిగా నటిస్తూ వైట్ఫీల్డ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నటిస్తూ వందలాది విదేశీయులను మోసం చేస్తున్నారనే ఆరోపణలతో 21 మంది అనుమానితులను అరెస్టు చేశారు.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం 21 మంది సిబ్బందిని స్థానిక కోర్టు ముందు హాజరుపరిచి పోలీసు కస్టడీకి తరలించారు. సైబర్ కమాండ్ స్పెషల్ సెల్ మరియు వైట్ఫీల్డ్ సైబర్ క్రైమ్ విభాగం నుండి వచ్చిన అధికారులు నవంబర్ 14 - 15 తేదీలలో మస్క్ కమ్యూనికేషన్స్పై దాడి చేశారు. డెల్టా భవనం, సిగ్మా సాఫ్ట్ టెక్ పార్క్లోని ఆరవ అంతస్తులోని సంస్థ కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్లు , ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు కింగ్పిన్లు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అమెరికా, యూకేలలో 2022 నుండి ఈ దందా కొనసాగిస్తున్నారని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.ఆగస్టు నుండి ఈ ముఠా అమెరికా, యూకేలలో కనీసం 150 మంది బాధితులను లక్ష్యంగా చేసుకుని, ఒక్కొక్కరిని బిట్కాయిన్ ATMలలో దాదాపు పదివేల డాలర్లు (సుమారు రూ. 13.5 కోట్లు) డిపాజిట్ చేయమని బలవంతం చేసినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బాధిత కస్టమర్ల బ్యాంక్ వివరాలను సేకరించే ప్రక్రియలో ఉన్నామని ఒక సీనియర్ IPS అధికారి తెలిపారు. నిందితులు మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ సిబ్బంది అని చెప్పి 'ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) ఉల్లంఘనలను' ఉల్లంఘించారంటూ బాధితులను భయపెట్టారు. ఈ నెపంతో, వారు నకిలీ భద్రతా పరిష్కారాలు , సమ్మతి విధానాల కోసం పెద్ద మొత్తాలను వసూలు చేశారు. ఇదీ చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులుమస్క్ కమ్యూనికేషన్స్ ఆగస్టులో నెలకు రూ.5 లక్షలకు 4,500 చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా వినియోగదారులను లక్ష్యంగా ని హానికరమైన ఫేస్బుక్ ప్రకటనలిచ్చారు.ఇవి ఇతర చట్టబద్ధమైన భద్రతా హెచ్చరికలు లేదా సేవా లింక్లాగానే ఉంటాయి. కనిపించకుండా ఎంబెడెడ్ కోడ్ ఉంటుంది. ఒక వినియోగదారు ప్రకటనపై క్లిక్ చేయగానే మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ నుండి వచ్చినట్లు మెసేజ్ పాప్ అప్ అవుతుంది. నకిలీ హెల్ప్లైన్ నంబర్కూడా డిస్ప్లే అవుతుందని దర్యాప్తు అధికారులు వివరించారు.బాధితులు ఆ నంబర్కు కాల్ చేసినప్పుడు, వారి కంప్యూటర్ హ్యాక్ చేసి, IP చిరునామా,బ్యాంకింగ్ డేటా చోరీ చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత వారు బిట్కాయిన్ ATMల ద్వారా బాధితులను భారీ మొత్తాలు చెల్లించమని బలవంతం చేశారు.ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలుమస్క్ కమ్యూనికేషన్స్ 83 మంది ఉద్యోగలున్నారు. వారిలో 21 మంది సాంకేతిక సిబ్బంది ఈ స్కామ్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. వారికి నెలకు రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు జీతాలు చెల్లించారు. ఇదిలా ఉండగా, అహ్మదాబాద్కు చెందిన రవి చౌహాన్ అనే వ్యక్తి సుమారు 85 మంది సిబ్బందిని నియమించగా, అతన్ని గత నెలలో అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య 22కి చేరింది. -
టారిఫ్ పిడుగు.. న్యూఇయర్ రోజు భారత్కు భారీ షాక్!
న్యూఢిల్లీ: న్యూ ఇయర్లో కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? లేదంటే ఇతర వాహనాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే తస్మాత్ జాగ్రత్త. త్వరలో ఆటోమొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు భారత్పై మెక్సికో విధించే 50 శాతం సుంకమే కారణమని జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.న్యూఇయర్ జనవరి1,2026 నుంచి మెక్సికో నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం వసూలు చేయనుంది. ఇప్పటికే భారత్ దిగుమతులపై అమెరికా 50శాతం అంతకంటే ఎక్కువగా సుంకాలు విధించింది. తాజాగా,మెక్సికో సైతం భారత్ దిగుమతులపై భారీ ఎత్తున టారిఫ్ వసూలు చేసేందుకు సిద్ధం కాగా.. అందుకు ఆదేశ సెనేట్ సైతం ఆమోదం తెలిపింది. మెక్సికో భారత్, చైనాతో పాటు ఇతర ఆసియా దేశాల నుంచి సుంకాలను వసూలు చేయనుంది.ఫలితంగా మెక్సికో నుంచి భారత్ భారీ స్థాయిలో దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 50శాతం సుంకాల్ని చెల్లించాల్సి వస్తుంది. వాటిలో ప్రధాన ఉత్పత్తులు వాహనాలు, వాహనాల విడిభాగాలు, టెక్స్టైల్స్, ప్లాస్టిక్, స్టీల్ ఉంది. అలా చెల్లించే పరిస్థితి వస్తే దేశీయంగా సంబంధిత వస్తువుల ఉత్పత్తుల అమాంతం పెరిగే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ దేశీయంగా తయారీ రంగానికి ఊతం ఇచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అమెరికాతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తాజాగా, భారత్ దిగుమతులపై సుంకం విధించే దిశగా చర్యలు తీసుకున్నారు. భారత్పై ప్రతికూల ప్రభావంభారత్పై 50శాతం వరకు సుంకాలను విధించాలన్న మెక్సికో చర్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మెక్సికన్ ఎగుమతులకు భారత్ తొమ్మిదవ స్థానంలో ఉంది. ప్రస్తుతం, భారత్.. మెక్సికోతో అధిక మొత్తంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 2024లో భారత్ నుంచి మెక్సికోకు ఎగుమతులు దాదాపు 8.9 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 2.8 బిలియన్లుగా ఉంది.గతేడాది భారత్.. మెక్సికో నుంచి వాహనాలు, వాటి తయారీలో వినియోగించే ఆటో విడిభాగాలు,ఇతర ప్రయాణీకుల వాహనాలు. ఇప్పుడు, మెక్సికో ఈ వస్తువులపై భారీ సుంకాలు విధించడంతో.. వచ్చే ఏడాది దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశ ఉందని ఆర్థిక నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రూ. 9.1 కోట్లు ఉంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ మీదే! ఎలా అప్లయ్ చేయాలి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తున్న "ట్రంప్ గోల్డ్ కార్డ్" (Trump Gold Card) పథకానికి సంబంధించిన అధికారిక అమ్మకాలను ప్రారంభించారు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు, అమెరికన్ కంపెనీలు నిపుణులైన వారికి ఎంపిక చేసుకు నేందుకు వీలుగా ఈ కార్డుని తీసుకొచ్చారు. గోల్డ్ కార్డ్కు భారీ ఖరీదు ఈ 'ట్రంప్ గోల్డ్ కార్డ్' పథకం ప్రధానంగా డబ్బు చెల్లించే వారికి వేగవంతమైన వసతి మార్గాన్ని అందిస్తుంది. అలాగే అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి ఒక మార్గంగా ట్రంప్ భావిస్తున్నారు. అదే సమయంలో ఫెడరల్ ఖజానాకు ఆదాయాన్ని తెచ్చి పెడుతుందని అంచనా. అయితే ఈ గోల్డ్ కార్డ్ కోసం వ్యక్తి ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.9.1 కోట్లు), ప్రతీ ఉద్యోగి కోసం సంస్థ 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. దీనికి త్వరలో ఉన్నతస్థాయి ‘ప్లాటినం కార్డ్’ హామీ ఇవ్వబడుతుందని ప్రకటించారువైట్హౌస్లోని వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. ఈ కొత్త వెబ్సైట్ ద్వారా గ్రీన్ కార్డు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నిమిషాల్లోనే జరుగుతుందన్నారు. 1990లో విదేశీ పెట్టుబడుల నిమిత్తం తీసుకొచ్చిన EB-5 విధానంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ చెప్పారు. వీటిని అరికట్టాలనే ఉద్దేశంతోనే గోల్డ్ కార్డును ప్రకటించారు. ప్రాథమికంగా, ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే, కానీ దానికంటే చాలా మెరుగైనది, చాలా శక్తివంతమైనది, చాలా బలమైన మార్గం." అని ట్రంప్ చెప్పారు. భారతదేశం, చైనా వంటి దేశాల విద్యార్థులు అగ్రశ్రేణి అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకుని పట్టభద్రులైన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి రావడం సిగ్గు చేటని ట్రంప్ వ్యాఖ్యానించారు. .ఎలా దరఖాస్తు చేయాలిదరఖాస్తులను trumpcard.gov ద్వారా దాఖలు చేయాలి.గోల్డ్ కార్డ్, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ లేదా ప్లాటినం వెయిట్లిస్ట్ను ఎంచుకోవాలివ్యక్తిగత వివరాలను నమోదు చేయాలిmyUSCIS.gov ఖాతాను క్రియేట్ చేసి 15వేల డాలర్ల (నాన్ రిఫండబుల్) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలివ్యక్తిగతం దరఖాస్తు చేసుకుంటోంటే ఒక మిలియన్ డాలర్లు, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ కోసం 2 మిలియన్లు డాలర్లు చెల్లించాలి. దీనికనుగుణంగా ఆప్షన్ ఎంచుకోవాలి. వెరిఫికేషన్ తరువాత మొత్తం రుసుము చెల్లించాలి.క్రెడిట్ కార్డ్, ACH డెబిట్ (USలో మాత్రమే) లేదా అంతర్జాతీయ వైర్ బదిలీ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?చట్టబద్ధమైన శాశ్వత నివాసానికి అర్హులు అయి ఉండాలియునైటెడ్ స్టేట్స్కు అనుమతి ఉండాలివీసా నంబర్ అందుబాటులో ఉండాలిగోల్డ్ కార్డ్ హోల్డర్లు US శాశ్వత నివాసితుల వలె పన్ను విధించబడతారు.ఆమోదం పొందడానికి ఎంత సమయం పడుతుంది?ప్రాసెసింగ్ రుసుము చెల్లించిన తర్వాత, నేపథ్య తనిఖీ , పరిశీలన సాధారణంగా కొన్ని వారాలు పడుతుంది. దరఖాస్తుదారులు వీసా ఇంటర్వ్యూను పూర్తి చేయాలి , డాక్యుమెంట్ అభ్యర్థనలకు వెంటనే స్పందించాలి.గోల్డ్ కార్డ్ రద్దు అయ్యే అవకాశం ఉందా? ఇతర అమెరికా వీసా మాదిరిగానే, జాతీయ భద్రతా సమస్యలు లేదా తీవ్రమైన నేరారోపణల మీద వీటిని రద్దు చేసే అవకాశం ఉంది.కాగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల వీసాలు సర్వసాధారణం, యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీతో సహా డజన్ల కొద్దీ దేశాలు సంపన్న వ్యక్తులకు "గోల్డెన్ వీసాల" వెర్షన్లను అందిస్తున్నాయి. -
రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనలు.. జెలెన్ స్కీ కొత్త ప్లాన్
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రతిపాదనల విషయంలో అధ్యక్షుడు జెలెన్ స్కీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన కొత్త శాంతి ప్రతిపాదనలను అమెరికాకు అందించేందుకు సిద్దంగా ఉన్నట్టు జెలెన్ స్కీ తాజాగా వెల్లడించారు. రెండు దేశాల మధ్య 20 పాయింట్ల ప్రణాళికకు చివరి మెరుగులు దిద్దుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగించే దిశగా 20 పాయింట్ల ప్రణాళికకు చివరి మెరుగులు దిద్దుతున్నామని, త్వరలోనే అమెరికాకు అందజేస్తామని తెలిపారు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్ పునర్నిర్మాణం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విస్తృత ప్రణాళికపై ఇరు దేశాలు చర్చిస్తాయని అన్నారు. అయితే, గురువారం జరగనున్న 30 దేశాల నాయకుల వీడియో సమావేశానికి ముందు జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మరోవైపు.. ఉక్రెయిన్లో అధ్యక్ష ఎన్నికల విషయమై జెలెన్ స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. అధ్యక్ష ఎన్నికలు జరగకుండా.. ఎన్నికలను ఆపేందుకు జెలెన్ స్కీ యుద్ధాన్ని సాకుగా వాడుకుంటున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై జెలెన్ స్కీ స్పందిస్తూ.. మిత్ర దేశాలు తమ భద్రతకు హామీ ఇస్తే, రానున్న 60-90 రోజుల్లో ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో మార్షల్ లా అమల్లో ఉందని తెలిపారు. రష్యా దాడులు కొనసాగుతుండగా, ఎన్నికలు ఎలా నిర్వహిస్తాం? సైనికులు ఎలా ఓటు వేస్తారు? ఆక్రమిత ప్రాంతాల్లో ప్రజలు ఎలా పాల్గొంటారు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలని ప్రశ్నించారు. రష్యా సుమారు 20 శాతం భూభాగాన్ని ఇప్పటికీ ఆక్రమించి ఉండటంతో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్గా ఉందని స్ఫష్టం చేశారు.The 20 points for ending the war form a fundamental document. We are actively working on the key steps – they must be doable. From this fundamental document, we are developing at least two additional ones. The first is on security – regarding security guarantees with the United… pic.twitter.com/uQVG4myA6Z— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 10, 2025 -
వెనిజులాపై అమెరికా యుద్ధోన్మాదం
వెనుకబడిన, బలహీనమైన చిన్న దేశా లను, ఆ దేశాల ప్రభుత్వాలను ఆయుధ బలంతో తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం, తన మాట వినని ప్రభుత్వాలు కూలిపోయేలా చేయడం, అది సాధ్యం కాకపోతే యుద్ధం ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తరు వాత ఆ దేశాల సహజ వనరులను తరలించుకుపోవడం అమెరికా అనుసరిస్తున్న విధానంగా ఉంది.నేడు వెనిజులాపై దాని యుద్ధ సన్నాహాలు ఆ విధానంలో భాగమే. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై దాడి చేయడానికి అమె రికా అధ్యక్షుడు ట్రంప్ కరేబియన్ దీవులకు 8 వార్షిప్లతో పాటు అతిపెద్ద విమాన వాహక నౌకను, 10 వేల మంది సైనికులనుపంపాడు. ఇది ఇలా ఉండగా 2025 సెప్టెంబర్ 2 నాడు వెనిజులా నుంచి పోతున్న పడవలపై అమెరికా దాడి చేసి 11 మంది ప్రాణాలు తీసింది. ఈ దాడికి కారణం పడవల్లో వెనిజులా మాదక ద్రవ్యాలను రవాణా చేయడమే అంటున్నది.వెనిజులాపై అమెరికా వ్యతిరేకత చాలా కాలంగా కొనసాగు తున్నది. ఆ దేశ భూగర్భంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం వంటివి అపారంగా ఉన్నాయి. తన బహుళ జాతి సంస్థల ద్వారా వాటిని తరలించుకు పోతున్న అమెరికాకు, 1999లో వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికైన హ్యూగో చావేజ్ అడ్డు కట్ట వేశాడు. ప్రభుత్వ సంస్థలను జాతీయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల ముఠా చావేజ్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రయత్నాలకు మద్దతిచ్చింది.ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. బొలీ వియా దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక సమూహాలకు ఒక అమెరికా రాయబారి సహకరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ దేశానికి మద్దతుగా 2008లో అమెరికా రాయబారిని వెనిజులా దేశం నుంచి బహిష్కరించింది. చావేజ్ మరణం తర్వాత వరుసగా మూడు సార్లు నికోలస్ మదురో అధ్యక్షుడయాడు. తమ దేశ పెట్టుబడిదారులకు చెందిన వెనిజులాలోని సంస్థలనూ, గను లనూ ఆ దేశం జాతీయం చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని అమెరికా కోర్టులు తీర్పులు వెల్లడించాయి. సార్వభౌమాధికారం గల ఒక దేశానికి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. వెనిజులా అలాంటి దేశం కాబట్టి చమురు పరిశ్రమలను, ఖనిజాల గనులను జాతీయం చేసింది. ఆ దేశ నిర్ణయాలపై అమెరికా కోర్టులు తీర్పులు ఎలా ఇస్తాయి? వెని జులా నుంచి ఎవరూ చమురు కొనవద్దని అమెరికా ఆంక్షలు (2023) విధించి ఆర్థికంగా దాన్ని దెబ్బతీస్తోంది.అలాగే వెనిజులాపై యుద్ధానికి సిద్ధమై ఆ దేశ గగన స్థలాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. అధ్యక్షుడు నికోలస్ మదురో దేశం విడిచిపెట్టి పోవాలని, అతని మంత్రి వర్గ ముఖ్య సహచరులను కాపాడుకోమని ట్రంప్ బెదిరించినట్లు ‘హెరాల్డ్’ పత్రిక పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వ ప్రకటనను వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది ఏకపక్ష చర్య అని పేర్కొంది. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపి వేసిన స్పెయిన్, పోర్చుగల్, కొలంబియా, చిలీ, బ్రెజిల్, తుర్కియే దేశాలపై వెనిజులా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ దేశాలకు సంబంధించిన విమాన సంస్థలపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.సార్వభౌమాధికారం గల ఒక దేశ గగన స్థలాన్ని మరొక దేశం మూసి వేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ ఒడంబడికలకు విరు ద్ధమైనది. ఒక స్వతంత్ర దేశమైన వెనిజులా అధ్యక్షుణ్ణి పట్టి అప్పగించమని అమెరికా కోరడం, నికోలస్ మదురో సమాచారం ఇస్తే ఏకంగా 5 కోట్ల డాలర్ల బహుమతి ప్రకటించడం దాని హంతక మనస్తత్వానికి నిదర్శనం. – బొల్లిముంత సాంబశివరావురైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
ప్రెస్ సెక్రటరీ సౌందర్యంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి తన నోటికి పని చెప్పారు.పెన్సిల్వేనియాలో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, అకస్మాత్తుగా వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అందాన్ని పొగడటం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సూపర్స్టార్ కరోలిన్ కూడా ఈ మీటింగ్కు వచ్చిందంటూ ఆమె వ్యక్తిగత సౌందర్యాన్ని, అందాన్ని ఆకాశానికెత్తేశారు. తన పరిపాలన ఆర్థిక విజయాలపై ప్రసంగాన్ని పక్కన పెట్టి మరీ అందమైన ముఖం, గన్నులాంటి పెదవులు చీప్ కామెంట్స్ చేయడం విస్తుగొల్పింది.79 ఏళ్ల ట్రంప్ తనకంటే దాదాపు 50 ఏళ్లు చిన్నదైన 28 ఏళ్ల కరోలిన్ శారీరక సౌందర్యంపై వ్యాఖ్యలు చేశారు. ఆమె పెదవుల్ని ఏకంగా మెషీన్గన్తో పోల్చేశారు. ఆమె గొప్పది కాదా? కరోలిన్ గొప్పదా?" అని ఆయన ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులను అడిగారు. 28 ఏళ్ల ఎంత అందంగా ఉందో అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. తెలుసా, ఆమె టెలివిజన్లో, ఫాక్స్ వంటి టీవీ స్క్రీన్ పై ఆధిపత్యాన్ని చెలాయిస్తుందనీ, చిన్న మెషీన్గన్లాంటి పెదవులు, అందంతో కట్టి పడేస్తుందన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ వింతైన శబ్దాలను చేయడం సభికులను ఆశ్చర్యపరిచింది. కరోలిన్ నిర్భయంగా వాదిస్తుందని, ఎందుకంటే మన విధానాలను ఆమె సూటిగా చెప్పేస్తుందన్నారు. ఆగస్టులో న్యూస్మ్యాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కరోలిన్ బ్యూటీపై దాదాపు ఇలాంటి కమెంట్స్ చేశారు.కాగా డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నసమయంగా అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా 2019 నుంచి 2021 వరకు లివియట్ పనిచేశారు. న్యూహ్యాంప్షైర్కు చెందిన ఆమె రియల్ ఎస్టేట్ డెవలపర్ నికోలస్ రిక్కోను( 60) ను పెళ్లాడింది. ఎన్నికల్లో ఓడిన ఆమె మళ్లీ జనవరిలో వైట్హౌజ్లో ప్రెస్ కార్యదర్శిగా చేరింది.చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఆమె. ట్రంప్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన ఐదో వ్యక్తి, రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టాక తొలి వ్యక్తి ఆమె.ట్రంపు.. కంపు..మరోవైపు ఆమె నైపుణ్యం, శక్తి సామర్థ్యాలపై కాకుండా, కేవలం అందంపై, ముఖ్యంగా పెదవులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు నెటిజన్లు. మహిళలపై ఇలాంటి సెక్సిస్ట్ కామెంట్లు చేయడం ట్రంప్నకు కొత్తేమీ కాదనీ, తన కంపు నోరును మరోసారి బయటపెట్టుకున్నాడని మండిపడుతున్నారు. -
డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం
తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట.. అంటూ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో ఘనంగా నిలబెడుతున్న 'తెలంగాణ అమెరికా తెలుగు సంఘం' (TTA) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో “సేవాడేస్ 2025” కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఈ TTA సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 14న గచ్చిబౌలిలో “10K రన్”తో డ్రగ్స్పై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. డిసెంబర్ 25న TTA 10వ వార్షికోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీఏ నాయకులు 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రకటించి, కార్యక్రమాల వివరాలు తెలిపారు.TTA ఏటా నిర్వహించే ఈ సేవాడేస్లో భాగంగా ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు.. వంటి 40కి పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. TTA సేవాడేస్లో భాగంగా సేవ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, నల్లగొండ, యాదాద్రితో పాటు మరిన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను TTA నాయకత్వ బృందం రూపొందించింది. TTA ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఏసీ-చైర్ విజయపాల్ రెడ్డి, ఏసీ కో చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ల,సేవాడేస్ సలహాదారు డా. ద్వారకానాథ్ రెడ్డి, TTA కన్వెన్షన్ 2026 చైర్ ప్రవీణ్ చింతా, 10వ వార్షికోత్సవ చైర్ DLN రెడ్డి, జాయింట్ ట్రెజరర్ స్వాతి చెన్నూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ - ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి దూదిపాల, EX BOD రమా కుమారి వనమా, అంతర్జాతీయ VP నర్సింహ పెరుక, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, 10వ వార్షికోత్సవ వేడుక కల్చరల్ చైర్ డా. వాణి గడ్డం.. అమెరికా నుంచి TTA నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.TTA 10వ వార్షికోత్సవం2025 డిసెంబర్ 25న TTA తన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతోంది. గడిచిన దశాబ్ద కాలంలో TTA చేసిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ, తెలంగాణతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఈ వేడుకలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. పదేళ్లుగా తెలంగాణతో తమ బంధం మరింత బలపడుతోందని టీటీఏ నాయకులు తెలిపారు.“10K రన్”తో డ్రగ్స్పై అవగాహనటీటీఏ సేవాడేస్ 2025లో భాగంగా డిసెంబర్ 14న గచ్చిబౌలిలో Say No To Drugs సందేశంతో “10K రన్” నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది సేవాడేస్ ప్రధాన థీమ్ “Say No To Drugs” అని టీటీఏ నాయకులు తెలిపారు. ఈ రన్లో విద్యార్థులు, యువత, స్పోర్ట్స్ కమ్యూనిటీ, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఫిట్నెస్ను ప్రోత్సహించడంతో పాటు డ్రగ్స్ అవగాహన కోసం సమాజానికి బలమైన సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు కీలకమని TTA నాయకత్వం తెలిపింది. 2014లో అమెరికాలో స్థాపించిన TTA సంస్థ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో వేలాది మందికి సేవలు అందిస్తూ అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలంగాణ సంఘాలలో ఒకటిగా నిలిచింది. (చదవండి: యూకేలో ప్రోస్టేట్ కాన్సర్పై అవగాహన) -
ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. భారత్పై సుంకాలకు రెడీ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్ను దెబ్బతీసేలాంటి నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ రైతుల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు ట్రంప్ సర్కారు భారత బియ్యం, కెనడియన్ ఎరువులతో సహా వ్యవసాయ దిగుమతులపై కొత్త సుంకాలను విధించే దిశగా యోచిస్తున్నది. సబ్సిడీ పొందిన విదేశీ బియ్యం దిగుమతులు అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని, దేశీయ ధరలను దిగజారుస్తున్నాయని అమెరికన్ రైతులు వైట్ హౌస్ రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ ఎదుట ఆరోపించారు. రైతుల వినతిని పరిగణలోకి తీసుకున్న ట్రంప్ ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ట్రంప్ అమెరికన్ రైతుల కోసం $12 బిలియన్ల (₹1,08,156 కోట్లు) బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు నేరుగా ట్రంప్తో మాట్లాడారు. భారతదేశం లాంటి దేశాలు తమ బియ్యాన్ని యూఎస్ మార్కెట్లలోకి తక్కువ ధరలకు డంపింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. ఇది తమకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ట్రంప్ స్పందిస్తూ తమ దేశ మార్కెట్లలోకి అన్యాయంగా వస్తువులను డంపింగ్ చేస్తూ, పలు దేశాలు తమను మోసం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.లూసియానాలోని కెన్నెడీ రైస్ మిల్ సీఈఓ మెరిల్ కెన్నెడీ, డంపింగ్కు ప్రధాన కారకులుగా భారతదేశం, థాయిలాండ్, చైనాలను చూపించారు. చైనా బియ్యం అమెరికా ప్రధాన భూభాగానికి బదులుగా ప్యూర్టో రికో(టెరిటరీ)లోకి తరలిపోతున్నదని తెలిపారు. ఇది తమకు ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. అమెరికా రైతులకు అన్యాయమైన పోటీనిస్తున్న దేశాల పేర్లను రాయమని ట్రంప్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ను ఆదేశించారు. భారతదేశం తన బియ్యం పరిశ్రమను చట్టవిరుద్ధమైన సబ్సిడీలతో ఎలా ప్రోత్సహిస్తుందో కెన్నెడీ వివరించడానికి ప్రయత్నించగా, ట్రంప్ అడ్డుకుంటూ తనకు దేశాల పేర్లు చెప్పాలని కోరారు.ట్రెజరీ కార్యదర్శి బెస్సెంట్ భారతదేశం, థాయిలాండ్ చైనాలను ఎత్తిచూపారు. వెంటనే ట్రంప్ ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వాణిజ్య ఒప్పందాల కోసం కెనడా, భారతదేశం రెండూ అమెరికాతో సంబంధాలను స్థిరీకరించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా డిప్యూటీ యూఎస్టీఆర్ రిక్ స్విట్జర్ నేతృత్వంలోని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయ సీనియర్ ప్రతినిధి బృందం త్వరలో భారతదేశంతో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించనుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కూడా చదవండి: అవినీతి చీకట్లో.. దేశాల ఆర్థిక పతనం -
ఎక్కడ చమురు కొనాలనేది భారత్ ఇష్టం
మాస్కో: అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇతర దేశాలకు ముడిచమరును విక్రయించుకునేందుకు అవరోధాలను ఎదుర్కొంటున్న రష్యా.. భారత్ను చమురుకొనుగోళ్ల విషయంలో ఆకర్షిస్తోందన్న ఆరోపణలపై రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సోమవారం మాస్కోలో మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్ ఎల్లప్పుడూ సార్వభౌమ దేశమే. విదేశీ వాణిజ్య విధానాలు, నచ్చిన దేశం నుంచి చమురు వనరుల కొనుగోలు కార్యకలాపాల్లో భారత్ పూర్తిగా స్వీయనిర్ణయాలనే తీసుకుంటుంది. అందులో రష్యా వంటి మిత్రదేశాల పాత్ర ఉండబోదు. భారత్ తనకు లాభదాయకమైన చోటే ఇంధన కొనుగోళ్లు కొనసాగిస్తుంది. ఆ స్వేచ్ఛ భారత్ ఎప్పుడూ ఉంటుంది’’అని పెస్కోవ్ అన్నారు. మీ వద్ద చమురు కొనుగోళ్లను పూర్తిగా తగ్గించుకోవాలంటూ భారత్పై అమెరికా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లుచేస్తున్న నేపథ్యంలో భారతవైఖరి మారిందా? అన్న ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిచ్చారు. ‘‘భారత్ అనేది తన ఆర్థిక ప్రయోజనాలకే మొదట్నుంచీ పెద్దపీట వేస్తోంది. ఇకమీదట సైతం భారత్లోని మా చమురుభాగస్వాములు అదే బాటలో పయనిస్తారని భావిస్తున్నాం’’అని అన్నారు. వద్దని వారించినా రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడిచమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 50 శాతం దిగుమతి సుంకాల భారం పడేసిన విషయం విదితమే. 2022లో మొదలైన ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి అత్యధిక స్థాయిలో క్రూడ్ఆయిల్ను కొంటున్న దేశాల్లో భారత్ సైతం ఒకటిగా నిలిచిన విషయం తెల్సిందే. అయితే ఇటీవలకాలంలో పశ్చిమదేశాల ఒత్తిడితో రష్యా నుంచి కొనుగోళ్లలో తగ్గుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మీడియాలో ఇప్పటికే కథనలు వెలువడ్డాయి. ‘‘మాకు అమెరికా ఆంక్షలను సమర్థవంతంగా ఎదుర్కొన్న చరిత్ర ఉంది. మా నుంచే భారత్ కొనుగోళ్లు చేయాలనుకుంటే ఆంక్షల ఛత్రం నుంచి ఒడుపుగా తప్పించుకుంటూనే భారత్కు ఆయిల్ సరఫరాచేసే నైపుణ్యాలు మాకు ఉన్నాయి’’అని క్రెమ్లిన్ ఆర్థిక సలహాదారు మాక్సిమ్ ఒరెష్కిన్ ‘ఛానల్1’ఇంటర్వ్యూలో చెప్పారు. -
అంగారకునిపైనా... ఒక గంగ!
అవును. నిజమే. ఇప్పుడు పూర్తిగా పొడిబారి కనిపిస్తున్న అంగారక గ్రహం ఒకప్పుడు జల కళతో మురిసిపోయేదట. దానిమీద కూడా గంగ వంటి జీవ నదులు పొంగి పారేవట. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 అతి పెద్ద నదీ వ్యవస్థలతో ఆ గ్రహం కళకళలాడిపోయేదట. ఇందుకు సంబంధించి పక్కా రుజువులు తాజాగా వెలుగు చూడటం విశేషం...!అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ బృందం అంగారకునిపై ఒకప్పుడు కొనసాగిన నదీ వ్యవస్థలను మ్యాపింగ్ చేసింది. అక్కడి నీటిపారుదల వ్యవస్థలపై తొలిసారిగా జరిగిన ఈ సమగ్ర పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కనీసం 16 భారీ నదీ వ్యవస్థలు ఒకనాడు గురు గ్రహంపై విలసిల్లినట్టు తేలింది. ప్రాంతాలన్నిటా ఒకప్పుడు జీవం ఉనికి ఉండేదనేందుకు ఇది ఒక ప్రబల తార్కాణమని అధ్యయన బృందం చెబుతోంది.జల కళ ఇలా... గురు గ్రహంపై జలావిర్భావం గురించి పలు ఆసక్తికర అంశాలు పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. కొన్ని వందల కోట్ల ఏళ్ల కిందట అంతూ పొంతూ లేని రీతిలో కురిసిన వర్ష ధారల ధాటికి అక్కడ లోయలు, భారీ నదీ వ్యవస్థలు పుట్టుకొచ్చాయట. అవి ప్రస్తుతం భూమిపై తిరుగులేని జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా విలసిల్లుతున్న అమెజాన్ వంటి నదీ వ్యవస్థలకు ఏ మాత్రమూ తీసిపోవని అధ్యయన బృందం అంటోంది. ఆ లెక్కన ఒకనాడు గురు గ్రహమూ చక్కని జల కళతో విలసిల్లే ఉంటుందని చెబుతోంది. అంతేకాదు, ఆ భారీ జల రాశి ఏకంగా మహా సముద్రాలుగా కూడా రూపు దాలి్చందట! ‘గురు గ్రహంపై నదులు ఉండేవన్నది చాలాకాలంగా మనకు తెలిసిన సంగతే. అయితే బతికి సంబంధించి ఇంత స్పష్టతతో కూడిన వివరాలు వెలుగులోకి రావడం మాత్రం ఇదే తొలిసారి‘ అని అధ్యయన బృంద సారథి తిమోతీ ఎ.గౌడ్జ్ హర్షం వెలిబుచ్చారు. నదులు, లోయలు, అగాథాలు, పర్వతాలు తదితరాల చిహా్నలతో కూడిన 19 వ్యవస్థలను పరిశోధకులు గుర్తించారు. వీటిలో 16 ఏకంగా లక్ష చదరపు కిలోమీటర్లకు మించిన విస్తీర్ణంతో కూడుకుని ఉండటం విశేషం. ‘‘అయితే భూమిపై ఉన్న జల వ్యవస్థలతో పోలిస్తే ఇవి మరీ పెద్దవే కావు. ఉదాహరణగా చెప్పాలంటే ఒక్క అమెజాన్ నదీ వ్యవస్థ విస్తీర్ణమే ఏకంగా 62 లక్షల చదరపు కి.మి. ఉంటుంది’’అని తిమోతీ వివరించారు.అమూల్య వివరాలు సమీప భవిష్యత్తులో అంగారక యాత్రలకు నాసా తదితర అంతరిక్ష సంస్థలు సిద్ధమవుతుండటం తెలిసిందే. అందుకు ఈ అరుణ గ్రహం మీద ఏ ప్రాంతాలను ఎంచుకోవాలో తేల్చుకునేందుకు ఈ పరిశోధన చక్కని వీలు కలి్పస్తుందని సైంటిస్టులు ఉంటున్నారు. అంతేగాక అక్కడ ఏయే ప్రాంతాలు ఆవాసయోగ్యమో కూడా కచి్చతమైన అంచనాకు వచ్చేందుకు తోడ్పడుతుందని హర్షం వెలిబుచ్చుతున్నారు. పరిశోధన పూర్తి వివరాలు పీఎన్ఏఎస్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జేడీవాన్స్కు యూజర్ చురక.. నెట్టింట రచ్చ
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఒక అమెరికన్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. అమెరికా పాత వలస విధానం ఆ దేశ ఆశలను హరిస్తుందని అమెరికన్ల అవకాశాలను వలస కార్మికులు కొట్టేస్తున్నారని వాన్స్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన ఓ అమెరికన్ నీభార్య పిల్లలు కూడా అమెరికన్లు కాదు వారు కూడా అమెరికన్ల అవకాశాలు దొచుకెళ్తున్నారు అని కౌంటరిచ్చారు. పాటు మరికొందరూ ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస కార్మికులపై గుర్రుగా ఉన్నారు. విదేశీ కార్మికులు అమెరికన్ల అవకాశాలను లాగేస్తున్నారని వారిని దేశంలోకి రాకుండా నియంత్రించాలనడంతో పాటు ఇమిగ్రేషన్ పాలసీ కఠినతరం చేశారు. అంతేకాకుండా విదేశీయులకు వ్యతిరేకంగా పలు రకాల చర్యలు చేపట్టారు. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షుడు సైతం అదే జాబితాలో చేరారు. అమెరికన్ల అవకాశాలను విదేశీయులు దొచుకెళుతున్నారంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు."అమెరికా పాత మైగ్రేషన్ విధానం అమెరికా కలలను దొంగిలించింది. దానివల్ల దేశస్థులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. అమెరికన్లు నుంచి వారు ఉద్యోగాలు దొంగిలించి వారు ధనవంతులయ్యారు" అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్టుకు కౌంటర్ గా చాలా మంది రీపోస్టులు చేశారు. "మీ కుటుంబం విదేశీయులు కాదా అది వలస కుటుంబం కాదా" అని ఒకరు అన్నారు. "మీ భార్య,పిల్లలు కూడా అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారు" అని మరో యూజర్ పోస్ట్ చేశారు. "మీఅత్తమామలు ద్వేషిస్తున్నావు" అని ఒక యూజర్ వ్యంగ్యంగా రీపోస్ట్ చేశారు. ఇలా అమెరికా ఉపాధ్యక్షుడు సోషల్ మీడియాలో ట్రోలయ్యారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 2014లో భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కాగా వారి కుమారుడికి వివేక్ అని నామకరణం చేశారు. ఉషా వాన్స్ వృత్తి రీత్యా లాయర్. -
ఫెడ్పై మార్కెట్ దృష్టి
ప్రధానంగా విదేశీ గణాంకాల ఆధారంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు కదలనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. ఇది సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ 9న పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. 10న చైర్మన్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఒపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) మానిటరీ పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. ఫెడ్ ఫండ్స్(వడ్డీ) రేట్లను 0.25 శాతంమేర తగ్గించవచ్చని అధికశాతంమంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత పాలసీ సమావేశంలోనూ వడ్డీ రేటులో పావు శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతంగా అమలవుతున్నాయి. కాగా.. ముందు రోజు అంటే 9న యూఎస్ ఉపాధి గణాంకాలు విడుదలకానున్నాయి. 11న సెపె్టంబర్ నెలకు వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. ఆగస్ట్లో వాణిజ్య లోటు 59.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. జూలైలో 78 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నవంబర్ నెలకు చైనా వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్లో చైనా 90 బిలియన్ డాలర్లకుపైగా వాణిజ్య మిగులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 10న గత నెలకు చైనా ద్రవ్యోల్బణ వివరాలు తెలియనున్నాయి. ఆర్బీఐ ఎఫెక్ట్ దేశీయంగా ఆర్బీఐ గత వారం వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. అంతేకాకుండా రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీయనుంది. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లు వారాంతాన ఊపందుకున్నాయి. అయితే డాలరుతో మారకంలో రూపాయి 90కు బలహీనపడటం గమనించదగ్గ అంశం. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి దన్నుగా ఆర్బీఐ 5 బిలియన్ డాలర్ల రుపీ డాలర్ స్వాప్నకు తెరతీయనుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలు జీఎస్టీ సంస్కరణలకు జత కలసి సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఇండెక్స్, ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మార్కెట్లలో ట్రెండ్ను ప్రభావితం చేసే అవకాశముంది. ఇవి గ్లోబల్ ఇన్వెస్టర్లను రిస్కు పెట్టుబడులైన ఈక్విటీల నుంచి పసిడి తదితర రక్షణాత్మక సాధనాలవైపు మళ్లించవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రిటైల్ ధరలు.. నవంబర్ నెలకు వినియోగ ధరల(సీపీఐ) గణాంకాలు శుక్రవారం(12న) విడుదలకానున్నాయి. అక్టోబర్లో సీపీఐ 0.25 శాతానికి నీరసించింది. దీంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు వీలు కలిగిన విషయం విదితమే. కాగా.. వరుసగా 9వ నెలలోనూ ఆర్బీఐ లక్ష్యం 4 శాతానికంటే దిగువనే రిటైల్ ధరలు నమోదవుతుండటం గమనార్హం! ఎఫ్పీఐల అమ్మకాల స్పీడ్ తొలి వారంలో రూ. 11,820 కోట్లు ఔట్ దేశీ స్టాక్స్లో ఇటీవల విక్రయాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల మొదటి వారంలోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నగదు విభాగంలో నికరంగా రూ. 11,820 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. దీంతో ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లయింది! గత నెలలోనూ రూ. 3,765 కోట్ల విలువైన స్టాక్స్ను నికరంగా విక్రయించిన ఎఫ్పీఐలు అక్టోబర్లో మాత్రం రూ. 14,610 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెపె్టంబర్లో రూ. 23,885 కోట్లు, ఆగస్ట్లో రూ. 34,990 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం!బుల్లిష్గా..గత వారం ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు ఫ్లాట్గా ముగిశాయి. రూపాయి పతనంతో ఐటీ కౌంటర్లు బలపడ్డాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం మార్కెట్లు పుంజుకోవడానికే అధిక చాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. → ఎన్ఎస్ఈ నిఫ్టీ 26,300–26,350 పాయింట్లకు పెరిగే వీలుంది. ఈ స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే స్వల్ప కాలంలో 26,850–26,900 వరకూ పురోగమించే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 26,000, తదుపరి 25,850 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. ఆపై మరోసారి 25,700 వద్ద మద్దతు కనిపించవచ్చు. ఇంతకంటే దిగువకు చేరితే మరింత నీరసించేందుకు ఆస్కారం ఉంటుంది. → బీఎస్ఈ సెన్సెక్స్ 86,350 వరకూ బలపడవచ్చు. ఈస్థాయిని దాటితే 87,500–88,000 పాయింట్లవరకూ పుంజుకునే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 84,800 వద్ద, తదుపరి 84,450 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఆపై మరింత నీరసిస్తే 83,600–83,300 పాయింట్లవరకూ క్షీణించే వీలుంది. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
అమెరికా అగ్నిప్రమాద ఘటనలో మరో తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న అల్బనీ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థి ఉడుముల సహజారెడ్డి (24) మృతిచెందగా ఆ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన అన్వేష్ సారపెల్లి అనే తెలుగు విద్యార్థి సైతం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం శనివారం సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించింది. మృతుని కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని.. ఈ విషయంలో వీలైనంత సాయం చేస్తున్నామని తెలిపింది.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులు సహజారెడ్డి, అన్వేష్తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు అల్బనీలోని క్వెయిల్ స్ట్రీట్లో ఉన్న ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నెల 4న వారి ఇంటికి ప్రమాదవశాత్తూ మంటలు అంటుకోగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే సహజారెడ్డి 90 శాతం కాలిన గాయాలకు గురవగా అన్వేష్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలీసులు వారిని అల్బనీ మెడికల్ కేర్ సెంటర్ ఆస్పత్రికి... అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వెస్ట్చెస్టర్ మెడికల్ బర్న్ సెంటర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సహజారెడ్డి శుక్రవారం మృతి చెందగా అన్వేష్ శనివారం మరణించాడు. -
రావోయి మా ఇంటికీ... టీ ఉన్నది... గరం గరం ఫుడ్ ఉన్నది!
‘అతిథి దేవోభవ’ అనే మాటకు కేరాఫ్ అడ్రస్ మన దేశం. ఈ మాటను మరోసారి నిజం చేసే వీడియో ఒకటి వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో రెండు మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతోంది. అమెరికన్ వ్లోగర్ మాల్వీనా హిమాలయ ప్రాంలోని మారుమూల గ్రామానికి వెళ్లింది. ఎవరూ పరిచయం లేక΄ోయినా, ఏ ఇంటికి వెళ్లినా ఆమెకు గొప్ప ఆతిథ్యం దొరికింది. తమకు వచ్చిన ఇంగ్లీష్లోనే... ‘ప్లీజ్ డ్రింక్ టీ’ అన్నారు. ‘ప్లీజ్ టేక్ ఫుడ్’ అన్నారు. వీడియోలో... మాల్వీనా ఒక వృద్ధురాలిని పలకరిస్తుంది. ఆ మాటా ఈ మాటా మాట్లాడిన తరువాత మాల్వీనా బయలు దేరేముందు ‘భోజనం చేసి వెళ్లు’ అని పట్టుబడుతూ ఆ బామ్మ ఒకటికి రెండుసార్లు అడగడం నెటిజనులను కదిలించింది. ‘భోజనం వద్దు టీ చాలు’ అని అడిగింది మాల్వీనా. ఆప్యాయత, అనురాగాల రుచుల ఆ టీ ఎన్ని కోట్లు పెడితే మాత్రం వస్తుంది? ఏమంటారు మాల్వీనా! View this post on Instagram A post shared by Malvina (@malvinaisland)(చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..!) -
ఉరుము లేని పిడుగు
1941 డిసెంబర్ 7న జపాన్ సైన్యం హవాయిలోని పెర్ల్ హార్బర్లో ఉన్న అమెరికా నౌకా స్థావరం పైన ఆకస్మికంగా దాడి జరిపింది. అసలు ఏ మాత్రం ఊహించని ఆ పరిణామంతో అమెరికా, రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. డిసెంబర్ 8న, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ జపాన్ పై యుద్ధ ప్రకటన కోసం చట్ట సభ ‘కాంగ్రెస్’ ఆమోదం కోరారు. కాంగ్రెస్ వెంటనే సమ్మతించింది. అందుకు ప్రతిచర్యగా డిసెంబర్ 11న, జపాన్ తో పొత్తు ఉన్న జర్మనీ, ఇటలీ అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. ఆ విధంగా అమెరికా పూర్తిస్థాయిలో రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించవలసి వచ్చింది.స్నేహితులు శత్రువులయ్యారు!నిజానికి అమెరికా, జపాన్ ఒక జట్టులో ఉండి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. పెర్ల్ హార్బర్పై దాడి కారణంగా రెండో ప్రపంచ యుద్ధంలో రెండూ పరస్పరం శత్రు దేశాలు అయ్యాయి. అసలెందుకు జపాన్ పెర్ల్ హార్బర్ నౌకా స్థావరంపై దాడి చేయవలసి వచ్చింది? ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో సైనిక విస్తరణను నిలిపివేయాలని జపాన్ పై అమెరికా ఒత్తిడి తెస్తుండటమే అందుకు కారణం. పుస్తకం ఇచ్చిన ప్రేరణ!పెర్ల్ హార్బర్పై దాడి చేయాలన్న ఆలోచన మొదట వచ్చింది.. జపాన్ అడ్మిరల్ ‘ఇసోరోకు యమమోటో’కు. ఆ దాడికి పథక రచన చేసింది కెప్టెన్ మినోరు గెండా. యమమోటోకు ఆ ఆలోచన రావటానికి రెండు విషయాలు ప్రేరణనిచ్చాయి. ఒకటి : కాలజ్ఞాన గ్రంథం. రెండోది, అప్పటికి ఏడాది క్రితమే జరిగిన ఒక దాడి. యమమోటోకు ప్రేరణ కలిగించిన ఆ గ్రంథం పేరు ‘ది గ్రేట్ పసిఫిక్ వార్’. దానిని 1925లో బ్రిటిష్ నౌకాదళ అధికారి హెక్టర్ బైవాటర్ రాశారు. అందులోని కథాంశం, అమెరికా– జపాన్ల మధ్య ఘర్షణలు జరగడం. జపనీయులు యుఎస్ నౌకాదళాన్ని నాశనం చేయడంతో ఆ గ్రంథం ప్రారంభమై గువామ్ (పశ్చిమ పసిఫిక్ ప్రాంతం), ఫిలిప్పీన్స్ లపై జపాన్ దాడి చేయడం వరకు కొనసాగుతుంది. అలాగే, 1940 నవంబర్ 11న ఇటలీలోని టొరంటో నౌకాశ్రయంలో ఇటాలియన్ నౌకాదళంపై బ్రిటన్ రాయల్ వైమానిక దళం విజయవంతంగా దాడి చేయటం కూడా యమమోటోకు స్ఫూర్తిని ఇచ్చింది. దాడికి ఒక రోజు ముందు1941 డిసెంబర్ 6న పెర్ల్ హార్బర్లో ఓడల కదలికలు, మోహరింపు స్థానాల గురించి జపాన్ వివరాలు రాబడుతున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని ఒక క్రిప్టాలజిస్ట్ తన ఉన్నతాధికారి అయిన మహిళా ఆఫీసర్కు చేరవేసి, తను డిసెంబర్ 8 సోమవారం వచ్చి కలుస్తానని చెప్పారు. ఆ మర్నాడు డిసెంబర్ 7 ఆదివారం... హవాయిలోని ఓహులో ద్వీపంలో ఒక రాడార్ ఆపరేటర్ తన కంప్యూటర్ స్క్రీన్పై... ద్వీపం మీదుగా వెళుతున్న పెద్ద విమానాల సమూహాన్ని చూశాడు. వెంటనే అతను ఆ విషయాన్ని తన ఉన్నతాధికారికి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆ అధికారి, ఆ విమానాలు ఆరోజు అక్కడికి రావాల్సిన యు.ఎస్. బి–17 బాంబర్ యుద్ధ విమానాలు అయి ఉండవచ్చని, వాటి గురించి ఆందోళ చెందాల్సిన పని లేదనీ చెప్పాడు. గంట 15 నిముషాల్లోనే!ఆ తర్వాత కొద్ది సేపటికే ఉదయం 7:55 గంటలకు పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి ప్రారంభమైంది. ఆ మొత్తం దాడి కేవలం ఒక గంట 15 నిముషాల్లోనే పూర్తయింది. దానికి ముందు కెప్టెన్ మిట్సువో ఫుచిడా.. ఓహూలో ద్వీప గగన తలంలోకి రాగానే, ‘అమెరికా దిక్కుతోచని విధంగా మా చేతికి చిక్కింది’ అని చెప్పటానికి ‘టోరా, టోరా, టోరా’ అనే కోడ్ సందేశాన్ని జపాన్ నౌకాదళానికి పంపారు. నిజానికి 1907 నాటి హేగ్ సమావేశంలోని మొదటి నిబంధన ప్రకారం, దాడి ప్రారంభించే ముందు ఏ దేశమైనా ముందుగా యుద్ధ ప్రకటన చేయాలి. అయితే జపాన్ ఆ విషయాన్ని ముందస్తుగా వాషింగ్టన్లోని అమెరికా అధికారులకు తెలియబరచటానికి ముందే దాడి మొదలైపోయింది. దాంతో జపాన్ పెర్ల్ హార్బర్పై దొంగదాడి చేసినట్లయింది. విమానాల నుంచి విధ్వంసంపెర్ల్ హార్బర్పై జపాన్ దాడిలో నాలుగు వాహక నౌకల నుండి పైకి లేచిన 353 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వాటిలో 40 టార్పెడో విమానాలు, 103 లెవల్ బాంబర్లు, 131 డైవ్–బాంబర్లు, 79 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇంకా... రెండు భారీ క్రూజర్లు, 35 జలాంతర్గాములు, రెండు లైట్ క్రూజర్లు, తొమ్మిది ఆయిలర్లు, రెండు యుద్ధనౌకలు, 11 డిస్ట్రాయర్లు ఉన్నాయి. ఆ దాడిలో 68 మంది అమెరికన్ పౌరులు సహా 2,403 మంది అమెరికా సైనికులు మరణించారు. 8 యుద్ధనౌకలు సహా 19 యూఎస్ నేవీ నౌకలు ధ్వంసం అయ్యాయి. యూఎస్ పసిఫిక్ నౌకాదళానికి చెందిన మూడు విమాన వాహక నౌకలు దాడికి ముందే సముద్రంలోకి వెళ్లి ఉండటంతో జపాన్ సైన్యం వాటిని గుర్తించలేకపోయింది. డోరీ మిల్లర్ అసమాన శౌర్యంజపాన్ దాడిలో ‘యు.ఎస్.ఎస్. (యునైటెడ్ స్టేట్స్ షిప్) అరిజోనా యుద్ధనౌక’ సిబ్బంది సహా పాటుగా పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. పెర్ల్ హార్బర్ దాడిలో చనిపోయిన వారిలో సగం మంది అరిజోనా షిప్లోని వారే. మునిగిపోయిన యుద్ధనౌక పైన అమెరికా జెండా ఎగురుతూ ఉంది. ఆనాటి దాడిలో మరణించిన అమెరికన్ అమర వీరులకు స్మారక చిహ్నంగా ఆ జెండా నిలిచిపోయింది. యు.ఎస్.ఎస్. వెస్ట్ వర్జీనియా నౌక స్టీవార్డ్ డోరీ మిల్లర్, పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి జరుపుతున్న సమయంలో కనబరచిన అసమాన ధైర్య సాహసాలు, విధి నిర్వహణ పట్ల ఆయన అంకిత భావం అమెరికాకు చిరస్మరణీయమైనవి. మొదట అతడు ప్రాణాంతకంగా గాయపడిన కెప్టెన్కు సహాయం అందించాడు. తరువాత మెషిన్గన్ తో రెండు జపాన్ విమానాలను ధ్వంసం చేశాడు. నిజానికి మెషిన్ గన్ని ఆపరేట్ చేయటం డోలీ మిల్లర్కు అదే మొదటిసారి. దాడి సమయంలో అతడు చూపిన తెగువకు, సమయస్ఫూర్తికి, సేవకు గుర్తింపుగా అమెరికా అత్యున్నత పురస్కారం ‘నేవీ క్రాస్’ లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆ నేవీ క్రాస్ను పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ డోరీ మిల్లర్. జపాన్పై ప్రతీకార దాడులుపెర్ల్ హార్బర్ దాడిలో అమెరికా ప్రతిఘటనతో జపాన్ 29 విమానాలను, 5 చిన్న జలాంతర్గాములను కోల్పోయింది. ఒక జపాన్ సైనికుడు ఖైదీగా పట్టుబడ్డాడు. 129 మంది జపాన్ సైనికులు మరణించారు. పెర్ల్ హార్బర్పై దాడిలో పాల్గొన్న అన్ని జపాన్ నౌకలలో, ఉషియో అనే ఒక్క నౌక మాత్రమే చెక్కు చెదరకుండా బయటపడింది. దీనిని యోకోసుకా నౌకా స్థావరం వద్ద అమెరికా స్వాధీనం చేసుకుంది. కూటమి ధాటికి ఓటమిమొత్తానికి అమెరికా కోలుకుంది. అది కూడా జపాన్ ఊహించిన దాని కంటే త్వరగా! కేవలం ఆరు నెలల తర్వాత, 1942 జూన్ ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోని మిడ్వే ప్రాంతంలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకాదళం... యమమోటో నావికాదళానికి చెందిన నాలుగు జపాన్ విమాన వాహక నౌకలను ధ్వంసం చేసింది. ఈ మిడ్వే విజయం తర్వాత, 1945 సెప్టెంబరులో మూడో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, ఒక నెల ముందు ఆగస్టులో అమెరికా, బ్రిటన్, చైనా, రష్యాల కూటమి ధాటికి జపాన్ సామ్రాజ్యం ఓటమి పాలైంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
బుధునికి ఓ ‘తోక’
బుధుడు. సౌర వ్యవస్థలో అత్యంత బుల్లి గ్రహం. అంతేగాక సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం కూడా. అయితే అది క్రమంగా చెదిరిపోతోందా? కొద్దికాలానికి గ్రహ లక్షణాలను కోల్పోయేలా ఉందా? ఆ అవకాశం లేకపోలేదు అన్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే బుధ గ్రహం ఉన్నట్టుండి తోకచుక్క లక్షణాలు ప్రదర్శిస్తోంది. అవును! దానికి ఏకంగా 2.4 కోట్ల కిలోమీటర్ల పొడవున సాగిన తోక ఇప్పుడు సైంటిస్టు లోకాన్ని అబ్బురపరుస్తోంది. సోడియం వాయువులతో కూడిన అది దూరదూరాల దాకా తన వెలుగులను విరజిమ్ముతోంది. అమెరికాలోని వర్జీనియకు చెందిన స్టీవెన్ బెలావియా అనే సైంటిస్టు ఈ తోక తాలూకు ఫోటోను తొలిసారిగా తీసి ప్రపంచానికి చూపాడు. అది జరిగింది కూడా బుధవారమే (డిసెంబర్ 3న) కావడం.మరో విశేషం.సూర్యునితో సాన్నిహిత్యం వల్లే...బుధ గ్రహానికి ఇలా ఒక తోక పుట్టుకు రావచ్చని అప్పుడెప్పుడో 1980లోనే సైంటిస్టులు అత్యంత కచితత్వంతో కూడిన అంచనా వేయడం విశేషం. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండటమే తోక పుట్టుకకు కారణమని సైంటిస్టులు వివరిస్తున్నారు. బుధుని తాలూకు అత్యంత పలుచనైన వాతావరణంపై సూర్యుని రేడియో ధార్మికత నురగ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఫలితంగా బుధాణువులు దాన్నుంచి విడివడుతూ తీవ్ర వేగంతో. అంతరిక్షంకేసి దూసుకు పోతుంటాయి. కొన్నేళ్లుగా ఇవి అతి పొడవున తోక ఆకృతి దాలుస్తున్నాయి. ఈ తోక ఉనికి నిజానికి 2001లోనే నిర్ధారణ అయింది. కాకుంటే దాన్ని చూడటం మాత్రం నేటిదాకా సాధ్యపడలేదు.అత్యంత ప్రకాశవంతంగా...ప్రస్తుతం బుధుడు పరిహేళి క్రమంలో ఉన్నాడు. ఈ దశలో ప్రతి గ్రహమూ తన పరిభ్రమణ క్రమంలో సూర్యునికి అతి సమీపానికి వెళ్తుంది. దాంతో ఈ 2.4 కోట్ల కి.మీ. పొడవైన తోకచుక్క అతి స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తోందిప్పుడు. దాని ప్రకాశంలో మార్పుచేర్పులను నాసా మెసెంజర్ ఉపగ్రహ కొన్నేళ్లుగా స్పష్టంగా గమనిస్తూ వస్తోంది. అంతేగాక దానికి సంబంధించిన కీలక వివరాలను కూడా అందించింది. డిసెంబర్ 9న ఈ తోక మరింత ప్రకాశవంతంగా కనిపించనుందని సైంటిస్టులు తెలిపారు. ఎంతగా అంటే, ప్రస్తుతం కనిపిస్తున్న దానికంటే ఏకంగా పదింతల వెలుగుతో మెరిసిపోనుందట! సైంటిస్టులు సిద్ధంఆ సమయంలో, అంటే డిసెంబర్ 9న బుధునిపై, దాని తోకపై ఇంకొన్ని పరిశోధనలు చేసి, మరిన్ని కీలక వివరాలు, విశేషాలు వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు ఇప్పటి నుంచే అన్ని పరికరాలతో సిద్ధమవుతున్నారు! ఎందుకంటే గ్రహానికి, తోక చుక్కకు ఉన్న మౌలిక భేదాలనే బుధుని తాలూకు ఈ పొడవాటి తోక సవాలు చేస్తోంది. బహుశా బుధుడు ముక్కలు చుక్కలుగా విడిపోయి ఒక పెద్ద తోక చక్కగా మారే ఆస్కారం కూడా లేకపోలేదన్నది కొందరి సైంటిస్టుల జోస్యం. అదేంతవరకూ ఫలిస్తుందో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా అగ్ని ప్రమాదంలో తెలుగు విద్యార్థులు మృతి
-
ట్రంప్కే ‘ఫిఫా’ తొలి శాంతి బహుమతి ఎందుకంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నట్లే.. శాంతి బహుమతి వరించింది. నోబెల్ కాదు.. ఫిఫా శాంతి బహుమతి రూపంలో. ఈ ఏడాదే ప్రారంభమైన తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని శాంతిదూత ట్రంప్కు ప్రకటిస్తున్నట్లు ఫిఫా పేర్కొంది. అవార్డు అందుకుంటూ ట్రంప్ కూడా ఖుషీ అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అయితే, ఈ శాంతి బహుమతి ట్రంప్నకు ఇవ్వడంతో పొలిటికల్ టర్న్ తీసుకుంది.ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్-2026 (FIFA World Cup 2026) పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్నకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ట్రంప్.. బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని గియాని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారని తెలిపారు. ఇందుకు గాను ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్నకు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.కాంగో-రువాండా ఘర్షణలు ఏంటి? కాంగో-రువాండా ఘర్షణలు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) తూర్పు ప్రాంతంలో దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఇది ఖనిజ సంపద, 1994 రువాండా మారణహోమం, రువాండా మద్దతుగల M23 తిరుగుబాటుదారుల కార్యకలాపాలతో ముడిపడి ఉంది. DRC తూర్పు ప్రాంతంలో కోబాల్ట్, బంగారం వంటి విలువైన ఖనిజాలు ఉండటం, వాటిపై నియంత్రణ కోసం కాంగో-రువాండా మధ్య పోరాటం కొనసాగుతోంది. 1994 రువాండా మారణహోమం తర్వాత హుటు, టుట్సీ జాతుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. DRCలోకి శరణార్థులు తరలి వెళ్లడం ఎక్కువైంది. ఈ క్రమంలో రువాండా మద్దతుతో ఉన్న M23 వంటి సాయుధ సమూహాలు, DRC ప్రభుత్వంతో పోరాడటం ప్రారంభమైంది. దీంతో, రెండు వర్గాల మధ్య పొరుగు దేశాల జోక్యం, ఆయుధాల సరఫరా, ప్రాంతీయ ప్రయోజనాలు తెరపైకి వచ్చాయి. అంతర్గత పోరు, దాడుల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాది మంది మరణించారు. లైంగిక హింస వంటివి విపరీతంగా పెరిగాయి. ముఖ్యమైన ఖనిజాలపై నియంత్రణ లేకపోవడంతో దోపిడీ జరిగింది.ఇటీవలి పరిణామాలు (2022-2025):శాంతి చర్చలు: కెన్యా, అంగోలా ద్వారా చర్చలు విఫలం కాగా, 2024లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.US-ఖతార్ ఒప్పందం: జూన్ 2025లో అమెరికా(డొనాల్డ్ ట్రంప్), ఖతార్ మధ్యవర్తిత్వంతో ఒక చారిత్రక శాంతి ఒప్పందంపై సంతకం జరిగింది. ఇందులో సైనిక కార్యకలాపాలను నిలిపివేయడం, శరణార్థులను పునరావాసం కల్పించడం వంటివి ఉన్నాయి.M23తో ఒప్పందం: నవంబర్ 2025లో M23 తిరుగుబాటుదారులు, DRC ప్రభుత్వం దోహాలో ఒక ఒప్పందంపై సంతకం చేసి, శాంతికి ఒక రోడ్మ్యాప్ను రూపొందించారు. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందాలు కుదిరినప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు DRCలో పోరాటాలు ఉద్రికత్తలకు దారి తీశాయి. M23.. గోమా వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.M23 గ్రూప్..2012లో M23 గ్రూప్ ఏర్పడింది.ఇది కాంగోలోని టుట్సీ వర్గానికి చెందిన మాజీ CNDP తిరుగుబాటు దళాల నుండి విడిపోయిన గ్రూప్.2009లో కాంగో ప్రభుత్వం CNDPతో ఒక శాంతి ఒప్పందం (March 23 Agreement) కుదుర్చుకుంది.ఆ ఒప్పందంలోని నిబంధనలు అమలు కాలేదని ఆరోపిస్తూ, తిరుగుబాటు దళాలు “March 23 Movement (M23)” పేరుతో కొత్త గ్రూప్ను ఏర్పాటు చేశాయి.2012–2013 తిరుగుబాటుM23 తూర్పు కాంగోలో వేగంగా ఎదిగిందిగోమా నగరాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. ఇది పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీసింది.అంతర్జాతీయ ఒత్తిడి, ఐక్యరాజ్యసమితి దళాల జోక్యంతో 2013లో M23 ఓడిపోయింది.నాయకులు రువాండా, ఉగాండా వంటి దేశాలకు పారిపోయారు.2021 తర్వాత మళ్లీ పునరుద్ధరణ2021 చివరలో M23 మళ్లీ చురుకుగా మారింది.2022–2025 మధ్య ఈ గ్రూప్ తూర్పు కాంగోలో పెద్ద ఎత్తున దాడులు చేసింది.కాంగో ప్రభుత్వం రువాండా ఈ గ్రూప్కు మద్దతు ఇస్తోంది అని ఆరోపిస్తోంది.రువాండా మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది.2025లో కూడా M23 గోమా, కిట్షంగా, బుకావు వంటి ప్రాంతాల్లో యుద్ధం కొనసాగిస్తోంది.M23 గ్రూప్ లక్ష్యాలుటుట్సీ వర్గాల రక్షణకాంగో ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి2009 ఒప్పందం అమలు చేయించుకోవడంతూర్పు కాంగోలో తమ ప్రభావాన్ని పెంచుకోవడం.ట్రంప్ ఏమన్నాడంటే.. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పడమే నా లక్ష్యం. అవార్డులతో సంబంధం లేకుండా నా పని నేను చేస్తున్నాను. నా దౌత్యంతో యుద్ధాలను ఆపాను.. లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను. కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ. కాంగో-రువాండా మధ్య హింసతో 10 మిలియన్ల మంది చనిపోయారు. మరో 10 మిలియన్ల మంది చావు అంచుల్లో ఉన్నారు. ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాను. ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని సైతం నేనే ఆపాను. నా చర్యలతో ఎన్నో దేశాల మధ్య యద్ధాలు ఆగిపోయాయి. ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిశాయి. ఇది నాకు ఎంతో గర్వకారణం. ఈ అవార్డు పొందడం జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఇదొకటి’ అని వ్యాఖ్యలు చేశారు.#FIFAWorldCup 🇺🇸 Trump just won the FIRST-EVER FIFA Peace Prize!Golden globe for the man bringing REAL peace. Nobel said no… FIFA said HELL YES! America leads, the world heals 🔥🏆Who’s with President Peace?! Drop a 🇺🇸#MAGA pic.twitter.com/j1K98OaTra— TRUTH🕊️ (@HonestHalo) December 5, 2025ఈ ఏడాదే ప్రారంభం.. ప్రపంచ ఫుట్బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే శాంతి బహుమతిని ఇవ్వడం ప్రారంభించింది. తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్టు నవంబర్ 5న ప్రకటించింది. ఈ క్రమంలో శాంతి బహుమతి.. ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని పేర్కొంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసే వారికి ఈ బహుమతిని అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అంతేకాకుండా ఈ బహుమతి ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచదని, 500 కోట్ల మంది ఫుట్బాల్ అభిమానుల తరఫున అందజేసేదిగా గియాని అభివర్ణించారు. ఫిఫాకు ఇదొక గుర్తింపు అని చెప్పారు. విమర్శల వర్షం.. ట్రంప్నకు ఫిఫా బాడీ శాంతి ప్రకటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హ్యూమన్ రైట్ వాట్ సంస్థ ఫిఫాపై బహిరంగాంగానే విమర్శలు గుప్పించింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు, జూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫిఫా కౌన్సిల్లోనూ ఇది వార్తగా నిలిచినట్లు తెలిపింది. ఇక, ట్రంప్.. కాంగో-రువాండా మధ్య శాంతి నెలకొల్పినట్టు చెబుతున్నప్పటికీ అక్కడ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేమీ లేకపోవడం గమనార్హం. మరోవైపు.. యుద్ధాలను ఆపుతున్నట్టు ట్రంప్ చెప్పినా.. భారత్-పాక్ మధ్య ఆయన ప్రమేయమే లేదని ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడం ట్రంప్ ఇప్పటికీ విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిఫా శాంతి బహుమతిని (FIFA Peace Award) ట్రంప్కు ఇవ్వడంపై విమర్శలు పెరిగాయి. అసలు ట్రంప్కు అంత సీన్ ఉందా? అని పలువురు విశ్లేషకులు, నెటిజన్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. -
అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
30 దేశాలపై .. అమెరికా నిషేధం..!
-
30 దేశాల పౌరులపై నిషేధానికి అమెరికా సన్నాహాలు
అమెరికా తమ దేశంలోకి అడుగు పెట్టకుండా మరికొన్ని దేశాల పౌరులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా పౌరుల భద్రత పేరుతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. అమెరికా తమ పౌరుల భద్రత పేరుతో పలు దేశాలను, ఆ దేశాలకు చెందిన పౌరులను నిషేధించాలని నిర్ణయించింది. తాజాగా ఫాక్స్ న్యూస్ ప్రోగ్రామ్ ‘ది ఇంగ్రహం యాంగిల్’లో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే అమెరికా 19 దేశాలకు చెందిన పౌరులపై ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. అంటే.. ఈ దేశాలకు చెందిన పౌరులకు అన్నిరకాల ఇమ్మిగ్రేషన్లను నిలిపివేయనుంది. అదేవిధంగా పౌరసత్వం, గ్రీన్కార్డు దరఖాస్తులకు సైతం ఆయా దేశాల పౌరులను అనర్హులుగా ప్రకటించింది. అదేవిధంగా ఆయా దేశాలకు తమ పౌరులు వెళ్లకూడదంటూ ట్రంప్ ట్రావెల్ అలెర్ట్ జారీ చేశారు. ఇప్పటికే నిషేధం అమలవుతున్న దేశాలు ఏవి? గత నెల వైట్హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్స్పై ఆఫ్ఘన్ శరణార్థి కాల్పులు జరిపిన ఉదంతం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఆఫ్ఘనిస్థాన్తోపాటు.. కాంగో, క్యూబా, ఇరాన్, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్, తుర్కెమెనిస్థాన్, వెనిజులా, యెమన్తోపాటు.. మొత్తం 19 దేశాలపై నిషేధం విధించారు. తాజాగా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ చెప్పిన దాని ప్రకారం ఈ జాబితాలో మరో 11 దేశాలు చేరనున్నట్లు స్పష్టమవుతోంది. ట్రంప్ నిర్ణయాన్ని రివర్స్ మైగ్రేషన్ అనవచ్చా?అవును ఇది కచ్చితంగా రివర్స్ మైగ్రేషనే. ట్రంప్ నిషేధం విధించిన దేశాలకు చెందిన వారిని అమెరికా నుంచి డీపోర్ట్ చేస్తారు. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ తాజాగా ఫాక్స్ న్యూస్తో మాట్లాడినప్పుడు.. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా పౌరుల భద్రత పెరుగుతుందని, తమ దేశంలో నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఆ మేరకు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం భారీ కసరత్తే చేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయంలో సమస్యాత్మక జనాబా తగ్గుతుందని, అంతకు మించితే సామాజిక సమస్యలు ఏమీ ఉండవని అభిప్రాయపడ్డారు. మరో 11 లేదా అంతకంటే ఎక్కువ దేశాలపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ జాబితాలో ఏయే దేశాలున్నాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. -
వారానికి ఆరు గంటల పని : సంవత్సరానికి రూ. 4 కోట్లు
హాస్పిటల్లో నర్సుగా పనిచేసే మహిళకు ఆ జీవితం తృప్తినివ్వలేదు. సొంత బిజినెస్ చేయాలనే కోరిక కలిగింది. ఆ ఆలోచనే పట్టుదలగా మారింది. అదే ఆమె జీవితంలో కీలక మలుపునకు దారి తీసింది. ఇపుడు ఏడాది ఏకంగా రూ.4 కోట్లు ఆర్జిస్తోంది. 13 ఏళ్ల పాటు నర్సుగా సేవలందించిన ఆమె మొదలు పెట్టిన బిజినెస్ ఏంటి? ఆమెవిజయ రహస్యం ఏంటి తెలుసుకుందామా?పట్టుదల ఉండాలే గానీ..అమెరికాలోని అరిజోనాకు చెందిన 38 ఏళ్ల కామి (మారు పేరు) ఒక హాస్పిటల్లో బోన్మారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో నర్సుగా పనిచేసింది. జీవితం రొటీన్గా, మార్పు కావాలని అని అనిపించింది. ఈ పని నుంచి బైటపడాలంటే ఉద్యోగం మానేసే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని చాలా తీవ్రంగా ఆలోచించింది. పెట్టుబడి కోసం ఇల్లు అమ్మాలని భావించింది. వ్యాపారానికి రెండు మూడు వెంచర్లను పరిశీలించింది. చివరికి కొంతమంది స్నేహితులు,బంధువు సలహా మేరకు లాండ్రోమాట్ వ్యాపారాన్ని ఎన్నుకుంది. విదేశాల్లో లాండ్రోమాట్ అనేది కస్టమర్లు తమకు తాముగా బట్టలు ఉతుక్కునే స్వీయ-సేవ లాండ్రీ.నర్స్గా పనిచేయడం చాలా ఇష్టం, కానీ "బెడ్సైడ్ నర్సింగ్ నిజంగా కష్టం" అని పేర్కొంది. లాండ్రోమాట్ కొనుగోలుకు నిధుల కోసం 2020లో తన ఇంటిని విక్రయించింది. మిగిలిన మొత్తం, వాషింగ్ మెషీన్ల లాంటి పరికరాల కొనుగోలు కోసం లోన్లు తీసుకుంది. అలా ఉద్యోగం చేస్తూనే వ్యాపారాన్ని మొదలు పెట్టి అది లాభదాయకంగా మారడంతో నర్సింగ్ను విడిచిపెట్టింది. వ్యాపారం కాస్త పుంజుకోగానే, ఆ ప్లేస్ను పురుద్ధరించి, లాండ్రికి సంబంధించిన బట్టల పికప్, డెలివరీతో సహా సేవలను విస్తరించింది. తద్వారా అప్పులు తీరుస్తోంది.2020 నుండి 2023 వరకు అటు ఉద్యోగం, ఇటు వ్యాపారం రెండింటినీ మేనేజ్ చేస్తూ పూర్తిగా నిబద్ధురాలై పనిచేసింది. ఆకర్షణీయమైన ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం లాండ్రోమాట్పైనే దృష్టిపెడుతూ స్థిరమైన కస్టమర్లు,సిబ్బందితో దిన దినాభివృద్ధి చెందుతోంది. లాండ్రోమాట్ గత సంవత్సరం (2024లో) దాదాపు రూ. 4.2 కోట్లు ఆర్జించింది. పక్కనే ఉన్న సెలూన్ నుండి దాదాపు రూ. 24.96 లక్షల అద్దె కూడా సంపాదించింది. అంతేకాదు వారానికి ఐదు నుండి ఆరు గంటలు మాత్రమే వ్యాపారం మీద దృష్టిపెడుతుంది. వ్యవస్థాపక ప్రయాణం గురించి సోషల్ మీడియా కంటెంట్ షేర్ చేయడం ద్వారా అదనంగా 10 గంటలు గడుపుతుంది. సోషల్ మీడియా ద్వారా మరో రూ.18.30 లక్షలు సంపాదిస్తోంది. తన వ్యాపార వృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు పోతోంది. రెండో లాండ్రోమాట్ సెంటర్ పెట్టడంతోపాటు, రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా పక్కాగా ఉన్నాయంటోంది కామి. View this post on Instagram A post shared by Cami | Laundromat Girl (@laundromatgirlofficial) పరిమిత వ్యాపార అనుభవం ఉన్నప్పటికీ, ఆమె పాడ్కాస్ట్లు, పుస్తకాలు, పరిశ్రమ ఈవెంట్ల ద్వారాతన నైపణ్యాన్ని మెరుగు పర్చుకుంది. వారాంతాలు, తనకిష్టమైన ప్రయాణాలుకోసం సమయాన్ని కేటాయించే సౌలభ్యాన్ని అందిస్తోంది లాండ్రోమాట్. -
రెండున్నర నెలల భారత్ పర్యటనలో గమనించింది ఇదే..!
అమెరికా భారత్ మధ్య సాంస్కృతిపరంగా, సామాజికంగా చాలా వ్యత్యాసం ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యేకంగా ఎంతలా ఆ వ్యత్సాసం ఉంటుదనేది తెలియదు. అయితే ఇటీవల భారత్లో గడిపి వెళ్లిన ఇద్దరు పిల్లలు తల్లి ఆ విభిన్నతను క్షుణ్ణంగా గమనించి మరీ నెట్టింట షేర్ చేసుకుంది. అవేంటో తెలిస్తే మాత్రం ఇంత తేడా ఉందా ఇరు దేశాల మధ్య అనిపిస్తుంది. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. రెండున్నర నెలల పర్యటన కోసం కుటుంబంతో సహా భారత పర్యటన వచ్చిన ఇద్దరు పిల్లల తల్లి అన్నా హాకెన్సన్ ఇన్స్టాగ్రామ్లో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హైలెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. తనకు రెండు దేశాలు ఎంత భిన్నంగా ఉంటుందో తెలుసుగానీ, వాస్తవికంగా అదెలా అనేది స్పష్టంగా తెలియదని చెప్పుకొచ్చింది. కానీ ఈపర్యటనలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానంటూ ఆ ఇరుదేశాల వ్యత్యాస జాబితా గురించి వివరించింది. ఆమె గమనించి తొమ్మది తేడాలు ఏంటంటే..హాంకింగ్: అమెరికాలో హాంకింగ్ అంటే వేరే అర్థం వస్తుంది, కానీ భారతదేశంలో, హాంకింగ్ అంటే, "హాయ్, నేను ఇక్కడ ఉన్నాను, చూడండి, ధన్యవాదాలు". అని అర్థం. మాటిమాటికి గట్టిగా అరుస్తు మాట్లాడతారని అర్థం.ఆహారం: అమెరికాలో, కారం అంటే తేలికపాటి వేడి అని అర్థం. కానీ భారతదేశంలో, కారం అంటే కొన్ని జీర్ణ సమస్యలను కలిగిస్తుంది, ముఖ్యంగా విదేశీయులకు.ప్రజలు: యూఎస్ఏ మనం ఉన్నట్లు ఎవ్వరూ గుర్తించరు, పైగా గమనించనట్లు నటిస్తారు. అదే భారత్లో అవతలి వాళ్లు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనే కుతుహలం ఎక్కువ.చెత్త: USAలో చెత్త డబ్బాల్లో చెత్త ఉంటే భారతదేశం దీని గురించి స్పష్టంగా చెప్పలేము. అది ప్రాంతం బట్టి మారిపోతుంటుంది.కార్లు: యూఎస్లో ట్రాఫిక్ చట్టాలను పాటిస్తారు. కానీ భారతదేశంలో బయట నుంచి వచ్చేవారికి అర్థంకానీ గందరగోళంగా కనిపిస్తుంది.వాతావరణం: అమెరికా - శీతాకాలం, వసంతకాలం, వేసవి, చాలా ప్రదేశాలలో శరదృతువు; భారతదేశం: వేడి అది కూడా ఆశ్చర్యకరమైన రేంజ్లో అదనపు వేడి ఉంటుంది.మతం: అమెరికా - ఎక్కువగా కాథలిక్ చర్చిలు, నిశ్శబ్ద సమావేశాలు; భారతదేశం: ప్రతిచోటా దేవాలయాలు, నగరాలను ఆక్రమించే పండుగలు.స్థోమత: యూఎస్లో ప్రతీది ఖరీదైనది, కానీ భారత్లో పర్లేదు, నిర్వహించగలం.కుటుంబం: అమెరికా - ఒకే కుటుంబ జీవనం; భారతదేశం - ఒకే చోట బహుళ తరాలు చూడొచ్చు. ఈ పోస్ట్ని చూసిన నెటిజన్లు.."మా దేశానికి అపరిచిత వ్యక్తే అయినా..మీరు చాలా క్షుణ్ణంగా వ్యత్యాసాలను గమనించారు . చాలా గ్రేట్." అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Anna Haakenson | Adventure Family Travel (@wanderlust.haaks) (చదవండి: ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్కు..!) -
ఎడారిలో కూలిన అమెరికా యుద్ధ విమానం
ట్రోనా (యూఎస్): అమెరికా వైమానికి దళానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం కాలిఫోర్నియా ఎడారిలో కూలిపోయింది. పైలట్ ముందుచూపుతో విమానం కుప్పకూలడానికి ముందే పారాచూట్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. యుద్ధ విన్యాసాల ప్రదర్శన స్క్వాడ్రన్ (థండర్బడ్స్)కు చెందిన యుద్ధ విమానం దక్షిణ కాలిఫోరనియాలోని ట్రోనా ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయిందనీ సైన్యం తెలిపింది. కానీ.. పైలట్ స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. బుధవారం ఉదయం 10:45 గంటల ప్రాంతంలో శిక్షణలో ఉండగా ఎఫ్–16ఇ ఫైటర్ ఫాల్కన్ కూలిపోయిందని తెలిపింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఎయిర్ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నేవీకి చెందిన థండర్బడ్స్, బ్లూ ఏంజిల్స్ స్క్వాడ్రన్లోని ఫైటర్ జñ ట్స్ యుద్ధ విన్యాసాలకు ప్రసిద్ధి. అతి సమీపంగా ఎగరడంలో శిక్షణ పొందినవి. దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న విమానాలు పదుల సంఖ్యలో ప్రమాదాలకు గురయ్యాయి. -
డాలర్కు 12 లక్షల రియాల్స్
టెహ్రాన్: ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పతనమైంది. ఒక్క అమెరికన్ డాలర్తో మారకం విలువ ఏకంగా 12 లక్షల రియాల్స్కు పడిపోయింది. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందనటానికి ఇదే నిదర్శనం. దేశంలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. మాంసం, బియ్యం, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామా న్యుల రోజువారీ జీవనం సైతం గగనంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమం లక్ష్యంగా జూన్లో ఇజ్రాయెల్ దాడులకు దిగడం, ఇరాన్ ప్రతిదాడుల అనంతరం అమెరికా రంగంలోకి దిగడం తెల్సిందే. మళ్లీ ఇజ్రాయెల్తో యుద్ధం రావచ్చన్న భయాందోళనలు ఇరాన్ వాసులను వెంటాడుతున్నాయి. -
విజయానికి వైఫల్యమే ఇంధనం
అమెరికా రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతకాలు, ‘ఫీఫా’ వరల్డ్ కప్ సాధించడంలో అబీ వోమ్బాక్ కీలక పాత్ర వహించారు. 2015లో మహిళల ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రిటైరయ్యారు. న్యూయార్క్లోని బర్నార్డ్ మహిళా కళాశాల పట్టభద్రులను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం.. విద్యార్థినులారా! దీన్ని అథ్లెట్లు బాగా అర్థం చేసుకోగలరు. వైఫల్యానికి సిగ్గు పడనవసరం లేదు. అదొక శక్తినిచ్చే సాధనం. ఆవిరి యంత్రానికి అవసరమైన బొగ్గు లాంటిది. నేను జాతీయ యువ జట్టులో ఉన్నపుడు ‘నా హీరో’ మియా హ్యామ్తో కలసి ఆడాలని కలలు కనేదాన్ని. ఒకసారి జాతీయ జట్టు లాకర్ రూమును చూసే అవకాశం లభించింది. అపుడు నన్ను ఆకట్టుకున్నది ఆమె చేసిన ప్రాక్టీసును పట్టి చూపే ఆమె షూల కింది భాగానికి అతుక్కున్న గడ్డి పరకలు కావు. లాకర్ల పైనున్న వారి పేర్లు, వేలాడుతున్న నంబర్లు కూడా కాదు. అది ఎవరో తలుపు పక్కన టేపుతో అతికించిన పోస్టరు. మైదానంలోకి వెళ్ళే ప్రతి క్రీడాకారిణి దృష్టినీ ఆకర్షించే విధంగా దాన్ని అమర్చారు. అది వారి కడపటి ఘన విజయాన్ని చూపే చిత్రమని మీరు అనుకోవచ్చు. లేదా పోడియంపై నిలుచుని స్వర్ణ పతకాలు స్వీకరించినదని అనుకోవచ్చు. కానీ అది వారి చిరకాల ప్రత్యర్థి నార్వే జాతీయ జట్టు 1995 ప్రపంచ కప్లో అమెరికాను ఓడించిన తర్వాత చేసుకున్న సంబరాన్ని చూపే పోస్టరు. ఆనాడే గ్రహించాను: మైదానంలోనైనా, జీవితంలోనైనా విఫలమైనపుడు అది రేకెత్తించిన భావాలను, వైఫల్యం నేర్పిన పాఠాలను నా శక్తిగా మలచుకుంటూ ముందుకు సాగిపోవాలని! విజయంలో వైఫల్యం పాత్రవిద్యార్థినులారా! బాగా గుర్తు పెట్టుకోండి. ఒకసారి విఫల మైనందుకు తదుపరి అవకాశాలను చేజార్చుకోకండి. మనల్ని పక్కన పెట్టినంత మాత్రాన పరువు పోయినట్లు కాదు. మనం అత్యధిక సంఖ్యలో గోల్స్ చేసినవాళ్ళం అనుకుందాం. ఇంచుమించు ప్రతి కేటగిరీలోనూ జాతీయ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాం అనుకుందాం. కానీ, ఒకానొక సందర్భంలో, ప్రపంచకప్ లాంటి పెద్ద పోటీలో మనకు ఆడే అవకాశం ఇవ్వకపోవచ్చు. అది మనల్ని బాధిస్తుంది. అంతటితో మన పని అయిపోలేదని గుర్తుంచుకోవాలి. జీవితం మిమ్మల్ని ఒక్కోసారి పక్కన కూర్చోబెడితే కూర్చోండి. కానీ, అక్కడ నుంచి నేతృత్వం వహించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు. కడచిన ప్రపంచ కప్ గెలవడానికి ‘బెంచి నుంచి’ నేనిచ్చిన మద్దతు, చాంపియన్ షిప్ గెలవడానికి అవసరమైన విశ్వాసాన్ని ఇచ్చాయని జట్టులో తోటి సభ్యులు నాతో అన్నారు.బెంచి మీద ఉన్నపుడు మీరు వారితో కెప్టెన్గా వ్యవహరించకపోతే, మైదానంలో తమ నాయకురాలిగా అంగీకరించరు. ప్రతిచోటా నాయకురాలిగా ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నా, అక్కడే అగ్ర భాగాన నిలవండి. తొంభై నిమిషాలపాటు సాగే ప్రతి ఫుట్ బాల్ మ్యాచ్లోనూ అద్భుతమైన క్షణాలు కొన్ని ఉంటాయి. బంతి కీపర్ను దాటి నెట్ను తాకితే గోల్ కొట్టినట్లు! గోల్ కొడితే అన్నీ సక్రమంగా కుదిరినట్లు లెక్క. బంతి ఒకరి నుంచి ఒకరికి సక్రమంగా పాస్ అవ్వాలి. దాన్ని తన్నుకుంటూ గుర్రంలా పరుగెత్తాలి. ప్రతి క్రీడాకారిణీ సరైన సమ యానికి సరైన చోట ఉండాలి. పడిన ఆ ఒక్క గోల్ వెనుక జట్టులో ప్రతి సభ్యు రాలు, కోచ్, చేసిన ప్రతి ప్రాక్టీసు, ప్రతి పరుగు, ప్రతి సందేహం, చివరకు ప్రతి వైఫల్య ప్రభావం కూడా ఉందని మరచి పోకూడదు. అందరికోసం అందరం!ప్రతి మహిళా చాంపియన్గా అవతరించే విధంగా మనం ఒకరి కొకరం తోడ్పడాలి. అది మనకు కష్టమే కావచ్చు. జట్టులో చోటు కోసం మనం మరో మహిళతోనే పోటీపడవలసి వస్తుంది. అలా తలపడటం సృష్ట్యాది నుంచీ ఉంది. కొరతను మన లోపల, మన మధ్యన సృష్టించారు. ఈ కొరతకు మనం బాధ్యులం కాము. కానీ, అది మన సమస్య. కొరత ఉన్న చోటల్లా మహిళలకు అవకాశాలు పుష్కలంగా సృష్టించగలిగిన శక్తి మన చేతుల్లోనే ఉంది. ప్రపంచంలోకి అడుగిడబోతున్న మీరు ఒకరి గొంతును ఒకరు బిగ్గరగా విని పించండి. నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో మహిళలకు, ముఖ్యంగా అన్ని వర్ణాల మహిళలకు, బడుగు వర్గాల నుంచి వచ్చినవారికి స్థానం కోసం డిమాండ్ చేయండి.అమెరికాలో ఒక శ్వేతజాతి పురుషుడు చేసే పనికి ఒక డాలర్ దక్కుతున్నప్పుడు, దానితో పోల్చితే మహిళకు దక్కేది 80 సెంట్లే! అదే నల్లజాతి మహిళకైతే 63 సెంట్లే!! ఇక లాటిన్ అమెరికన్లకు వచ్చేది కేవలం 54 సెంట్లు. ఈ అంతరం గురించి ప్రశ్నించాలి. చరిత్రలో ఈ క్షణం మన నాయకత్వాన్ని కోరుకుంటోంది. అవకాశాన్ని ఇవ్వాలని అడగండి. జాబ్ కోసం డిమాండ్ చేయండి. పక్కనున్న అబ్బాయి కిస్తున్న పారితోషికంతో సమానమైన పారితోషికం కోసం పట్టుబట్టండి. పదో న్నతి, మైక్రోఫోన్లను అడగండి. నేను గడించుకున్న గౌరవాన్ని నాకివ్వమని డిమాండ్ చేయండి. వ్యక్తిత్వమే మనం!చివరగా, సాకర్ నుంచి నిష్క్రమించిన తర్వాత, నేను నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన పాఠాన్ని మీకు చెప్పదలచు కున్నాను. రిటైరైనపుడు, నన్ను స్పాన్సర్ చేస్తూ వచ్చిన గేటరేడ్ ఒక వాణిజ్య ప్రకటనకు ప్లాన్ చేసి, నన్ను ఆశ్చర్యపరచింది. ‘నన్ను మరచిపోండి’ అన్నదే దాని సారాంశం. నేను నా జీవి తాన్ని ఏ క్రీడకు అంకితం చేశానో, నా వారసత్వం ఆ క్రీడ భవిష్యత్ విజయాలకు పూచీ నివ్వాలని కోరుకుంటున్నానని వారికి తెలుసు. నన్నే తలచుకుంటూ కూర్చోకుండా ఉంటేనే, నా వెనుక వచ్చిన క్రీడాకారిణులు రికార్డులను బద్దలు కొడతారు. చాంపియన్ షిప్లు గెలుస్తారు. క్రీడను కొత్త శిఖరాలకు తీసుకువెళతారు. ఆ కమర్షియల్ షూటింగ్లో పాల్గొన్నప్పుడు నా కళ్ళు చెమర్చాయి. రిటైరైన తర్వాత, కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాను. గ్లెనాన్ను పెళ్ళి చేసుకున్నాను. ముగ్గురు పిల్లలకు తల్లినయ్యాను. వ్యాపారసంస్థకు యజమానినయ్యాను. ఉద్యమకారిణిగా మారాను. నా పదేళ్ళ కూతురు ఉన్న జట్టుకు కోచింగ్ ఇచ్చి, వారిని విజేతలుగా తయారు చేశాను. కానీ, నేను ఇప్పటికీ అబీ వోమ్బాక్నే! చేపట్టిన పనిలో 100 శాతం అంకిత భావాన్ని కనబరుస్తాను. తదుపరి తరానికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ప్రతి రోజూ పోరాడతాను. సాకర్ నన్ను తీర్చిదిద్దలేదు. నేను సాకర్కు నా వ్యక్తిత్వాన్ని అద్దాను. మనం చేసే పని మనల్ని ఎన్నడూ నిర్వచించదు. మన వ్యక్తిత్వమే మనల్ని ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీకు ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండండి, కానీ మీరు అర్హమైనదాన్ని కచ్చితంగా డిమాండ్ చేయండి. -
వెనిజులాపై ట్రంప్ పంజా
మొన్నటివరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం తెగ తాపత్రయపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యుద్ధవీరుడి అవతారమెత్తారు. మాదకద్రవ్యాల అడ్డాగా మారి అమెరికా వినాశనానికి కంకణం కట్టుకున్నదని ఆరోపిస్తూ దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై కత్తులు నూరుతున్నారు. అక్కడ ‘కార్టెల్ ఆఫ్ సన్స్’ అనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఉన్నదని ప్రకటించి, దాన్ని నిషేధించారు. అదంతా అబద్ధమని వెనిజులా చెబుతోంది. మొన్న ఆగస్టు నుంచి కరీబియన్ దీవులకు 10,000 మంది సైనికులనూ, అతి పెద్ద విమాన వాహక నౌకనూ, క్షిపణులు వగైరా ఆయుధ సామగ్రినీ తరలించిన అమెరికా ఆ మరుసటి నెల 2న వెనిజులా నుంచి పోతున్న పడవలపై దాడి చేసి 11 మందిని హతమార్చింది. ఇవి మాదకద్రవ్యాలు తరలిస్తున్నాయని ఆరోపించింది. ఆ సాకుతోనే 22 దాడుల్లో 83 మంది ప్రాణాలు తీసింది. ఇందులో ఏ ఉదంతానికీ అమెరికా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. ఈమధ్య వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు ట్రంప్ ఫోన్ చేసి అధికారం వదిలిపెట్టి దేశం వదిలి పారిపోవాలని హెచ్చరించారు. వెనిజులా గగనతలాన్ని మూసివేసినట్టు ప్రకటించారు. తాజాగా బయటపడిన వీడియో ట్రంప్ ప్రభుత్వ హంతక మనస్తత్వాన్ని తెలియ జేస్తోంది. దాడిలో పడవలోని 9 మంది ప్రయాణికులు చనిపోగా, ఇద్దరు బతికి బయట పడ్డారు. వెనువెంటనే మళ్లీ దాడిచేసి ఆ ఇద్దర్నీ కూడా చంపేశారు. మొదట్లో ఆ దాడి గురించి అతిశయోక్తులు చెప్పిన ట్రంప్, వీడియో బయటపడగానే స్వరం మార్చారు. పడవలోని వారందరినీ చంపేయమని రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించటం వల్లే ఇలా చేశామని సైనికాధికారులు చెబుతుండగా, అలా చెప్పలేదని హెగ్సెత్ అంటున్నారు. అది తప్పేనన్నట్టు ట్రంప్ సంజాయిషీ ఇస్తున్నారు. ఈ ఉదంతంపై రిపబ్లికన్లలోనే విభేదాలు బయల్దేరాయి. ప్రతినిధుల సభ అనుమతి లేకుండా దండయాత్రకు అసలు ఎలా దిగుతారంటూ డెమోక్రాట్లు, రిపబ్లికన్లు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు మొదలుకాబోతోంది.సంక్షోభాన్ని సృష్టించటం, ఒక సార్వభౌమాధికార దేశం ప్రమాదకరంగా పరిణమించిందని ఆరోపించటం, ఆ సాకుతో దురాక్రమణకు ప్రయత్నించటం అమెరికాకు అలవాటు. వేరే దేశం గగనతలాన్ని మూసేసినట్టు చెప్పటం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం. సమస్యలుంటే, సాక్ష్యాధారాలుంటే దౌత్యపరంగా పరిష్కరించు కోవటానికి ప్రయత్నించాలి. నిజానికి వెనిజులాపై అమెరికా కడుపుమంట ఈనాటిది కాదు. అక్కడి భూగర్భంలో చమురు, సహజవాయు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం వగైరాలున్నాయి. బహుళజాతి సంస్థల ద్వారా వాటిని కైంకర్యం చేస్తూ వచ్చిన అమెరి కాకు 1999లో తొలిసారి హ్యూగో చావెజ్ రూపంలో ఆటంకం ఎదురైంది. ఆయన అధికారంలోకొచ్చిన వెంటనే దాన్నంతటినీ ఆపేశారు. అప్పటినుంచి ఏదో వంకన వెనిజులాను హస్తగతం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. చావెజ్ అనారోగ్యంతో మరణించాక 2013లో అధికారంలోకొచ్చిన మదురోను ఇబ్బందిపెట్టని రోజంటూ లేదు. క్రితంసారి ఏలుబడిలో ట్రంప్, వెనిజులా నుంచి పారిపోయివచ్చిన జువాన్ గైదోను దేశాధ్యక్షుడిగా ప్రకటించి భంగపడ్డారు. అక్కడ జరిగిన ఎన్నికలు అప్రజాస్వామికమంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ గైదో ఏమయ్యాడో తెలియదు. ఈసారి మాదక ద్రవ్యాల సాకుతో కత్తిగట్టారు. ట్రంప్కు మాదకద్రవ్యాలు అరికట్టే ఉద్దేశం ఉందా? ఉంటే కొకైన్ తరలింపు కేసులో నిరుడు అమెరికా కోర్టు 45 ఏళ్ల శిక్ష విధించిన హోండురస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండోకు క్షమాభిక్ష పెడతామని గతవారం ట్రంప్ ఎలా చెప్పగలిగారు? వెనిజులాపై సైనిక చర్యకు 70 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకమని సీబీఎస్ సర్వే వెల్లడించింది. సైనిక జోక్యం పేరిట ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ గుల్లయిందని, వాటి జోలికి పోవద్దని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారు. నిజానికి అలాంటి హామీతోనే ట్రంప్ అధికారంలోకొచ్చారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదల చేస్తానంటూనే మరో యుద్ధానికి అంకురార్పణ చేస్తున్న ట్రంప్ పోకడ ప్రమాదకరం. అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచానికే ఇది పెను ముప్పు. దీన్ని తక్షణం కట్టిపెట్టాలి. -
ట్రంప్ ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేయడం సాధారణంగా మారిపోయింది. ఆయన మునుపటిలా లేరని.. ఎనర్జీ లెవల్ దారుణంగా పడిపోయిందని.. బహుశా వయోభారమే అందుకు కారణమై ఉండొచ్చని తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇది సాధారణంగానే ఆయనకు కోపం తెప్పించింది.ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలను వైట్హౌజ్ కొట్టిపారేసింది. తాజాగా ఆయన తీయించుకున్న ఎమ్మారై స్కాన్తో ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మీడియా ముందుకు వచ్చారు. సాధారణంగా ఆయన వయసు ఉన్నవాళ్లకు ఇమేజింగ్ పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అలా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి ఆందోళనకరమైన అంశాలు కనిపించలేవు. ఆయన గుండె సాధారణంగానే ఉంది. రక్తనాళాల్లో ఎలాంటి బ్లాకులు లేవు. రక్తప్రవాహానికి ఆటంకం.. గుండె, ప్రధాన రక్తనాళాల్లో ఎలాంటి అసాధారణతలు కనిపించలేదు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు’’ అని మీడియా కథనాలను ఖండించారామె. మరోవైపు న్యూయార్క్ టైమ్స్ కథనం మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.🇺🇸 WHITE HOUSE: TRUMP’S MRI SHOWS “EXCELLENT OVERALL HEALTH”The White House released Trump’s MRI today, confirming everything came back normal. His physician, Capt. Sean Barbarella of the U.S. Navy, said the MRI showed no heart or abdominal issues, with “all major organs… pic.twitter.com/FWHpfHMSoQ— Mario Nawfal (@MarioNawfal) December 2, 2025‘‘ఇప్పటిదాకా నా జీవితంలో ఏనాడూ ఇంతలా కష్టపడలేదు. అంతగా పని చేస్తూ.. పర్ఫెక్ట్గా ఫలితాలు రాబట్టగలుగుతున్నా. శారీరకంగా, మానసికంగా నేను ఫిట్గా ఉన్నా. నా స్టామినా విషయంలో సందేహమే అక్కర్లేదు’’ అని మొన్నీమధ్యే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ను తిట్టిపోసిన ఆయన.. ఆ కథనం వెనుక రాజకీయాల ప్రభావం ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే.. ఎప్పటిలాగే దానిని అమెరికన్ల శత్రువుగా అభివర్ణించారు. అలాగే ఆ కథనం రాసిన కేటీ రోగర్స్కు నానాశాపనార్థాలు పెట్టారు.28 ఏళ్ల కరోలైన్ లెవిట్ అమెరికా చరిత్రలో అత్యంత యువ ప్రెస్ సెక్రటరీ ఘనత దక్కించుకుంది. 2022లో న్యూ హాంప్షైర్ 1వ కాంగ్రెస్ జిల్లా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక ఆమెకు వైట్హౌజ్లో బాధ్యతలు అప్పగించారు. అందగత్తె మాత్రమే కాదు.. తెలివైంది కూడా అంటూ ఆయన తరచూ ఆమెపై ప్రశంసలు గుప్పిస్తుంటారు. ఈ ఏడాదిలోనే ఆమె వివాహం జరిగింది కూడా. -
హైడ్రోపోనిక్స్ ద్రావణాల్లో పీహెచ్ 5 ఉంటే సేఫ్!
హైడ్రోపోనిక్ ఆహారోత్పత్తి కేంద్రాల్లో మోనోసైటోజీన్స్ బ్యాక్టీరియా వల్ల లిస్టెరియోసిస్ అనే వ్యాధి సోకుతున్నట్లు అమెరికాలో గుర్తించారు. ఏటా 1,600 కేసులు నమోదవుతున్నాయి. 260 మంది చనిపోతున్నారు కూడా. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు అత్యధికంగా దీని బారినపడుతున్నారు. అందువల్ల ఎల్. మోనోసైటోజీన్స్ ఆహార భద్రతకు, ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది.సాధారణ వ్యవసాయంలో మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్లు హైడ్రోపోనిక్ పద్ధతిలో సాగయ్యే పంటలకు సోకవు. అయితే, మట్టికి బదులు వాడే సబ్స్ట్రేట్లు, విత్తనాలు, నీరు, పోషక ద్రావణాల్లో ఎల్. మోనోసైటోజీన్స్ వంటి క్రిములు పెరుగుతాయి. అమెరికాలోని లూసియానా స్టేట్ యూనివర్సిటీ(ఎస్ఎస్యూ) ఎస్ఎస్యూ స్కూల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్ ప్రొఫెసర్, ఫుడ్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్ తాత్కాలిక సంచాలకులు డాక్టర్ అచ్యుత్ అధికారి నేతృత్వంలోని పరిశోధకుల బృందం పరిశోధనలు చేసింది. టమాటా, లెట్యూస్, స్ట్రాబెర్రీ పంటలను పెంచే పోషక ద్రావణాలలో ఎల్. మోనోసైటోజీన్ క్రిములు పెరుగుదల తీరుపై డాక్టర్ అచ్యుత్ బృందం చేసిన తాజా అధ్యయనంలో తేలిందేమంటే.. పోషక ద్రావణం ఉదజని సూచిక (పీహెచ్)లో మార్పులు ఈ క్రిముల పెరుగుదలకు, తగ్గుదలకు దోహదం చేస్తున్నాయి. పీహెచ్ 5 గల డిస్టిల్డ్ వాటర్లో ఎల్. మోనోసైటోజీన్ క్రిములు 72 గంటల్లో నశించాయి. లైట్యూస్, స్ట్రాబెర్రీ పంటకు వాడే ద్రావణాలలో పీహెచ్ 6 ఉన్న దశలో ఈ క్రిములు బాగా పెరిగాయి. అయితే, టమాటా పోషక ద్రావణం అన్ని పీహెచ్ స్థాయిల్లో ఎల్. మోనోసైటోజీన్ క్రిముల పెరుగుదల పరిమితంగా ఉంది. ఈ క్రిములను చంపటానికి రసాయనిక క్రిమిసంహారకాలను వాడితే, మేలు చేసే సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి. కాబట్టి రసాయన రహిత పద్ధతిపై పరిశోధకులు దృష్టి సారించారు. యూవీ–సీ కాంతి ఎల్. మోనోసైటోజీన్ క్రిములను గణనీయంగా తగ్గించినట్లు వెల్లడైంది. హైడ్రోపోనిక్ సాగు నానాటికీ విస్తరిస్తున్న నేపథ్యంలో డా. అచ్యుత్ పరిశోధనలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. -
భారతీయుల నుంచి అమెరికా ఎంతో లబ్ధి పొందింది: మస్క్
వాషింగ్టన్: ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా అత్యంత లబ్ధిపొందిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. జెరోధా సంస్థ సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ‘డబ్ల్యూటీఎఫ్’ పాడ్కాస్ట్లో మస్క్ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘అమెరికా వలస విధానాలను వ్యతిరేకించే కొన్ని శక్తులే హెచ్–1బీ వీసా కార్యక్రమం దురి్వనియోగమయిందనే వాదనను తెరమీదకు తీసుకొచ్చాయి. వాస్తవానికి ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా ఎంతో లబ్ధిపొందింది’’ అని అన్నారు. భారతీయుల ఉద్యోగాలను స్థానిక అమెరికన్లకు ఇవ్వాలని ట్రంప్ సర్కారు కంకణం కట్టుకుందా? అని ప్రశ్నించగా..‘‘అదెలా సాధ్యం? నిజానికి అత్యంత ప్రతిభావంతులకు అమెరికాలో ఎప్పట్నుంచో కొరత ఉంది. నా సొంత ఎక్స్, టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ఏఐ సంస్థల కోసం సైతం ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కోసం వెతుకుతున్నా. హెచ్–1బీని నిలిపేయాలనే గుంపులో నేను లేను’’ అని ఎలాన్ మస్క్ (Elon Musk) అన్నారు. నా కుమారుని పేరు శేఖర్ మస్క్ తన వ్యక్తిగత జీవిత వివరాలను కొన్నింటిని తొలిసారిగా బహిర్గతంచేశారు. ‘‘నాకూ శివోన్ జిలిస్కు పుట్టిన కుమారుల్లో ఒకరికి శేఖర్ అనే పదం కలిసొచ్చేలా పేరు పెట్టాం. భారతీయమూలాలున్న అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ (Subrahmanyan Chandrasekhar) పేరులోంచే శేఖర్ను తీసుకున్నాం. సహచరిణి శివోన్ సగం భారతీయురాలు. ఆమె తల్లి పంజాబీ. జివోన్ను చిన్నతనంలో ఉన్నప్పుడే వేరే కుటుంబం దత్తత తీసుకుంది. అలా శివోన్ కెనడాలో పెరిగింది’’ అని మస్క్ వెల్లడించారు. -
అంతిమంగా రష్యాకు మేలు...
రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని విరమించేందుకు 28 అంశాలతో కూడిన శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో యుద్ధం ఆగుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఉక్రెయిన్ ‘నాటో’ సభ్యత్వం స్వీకరించకూడదనేది. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో ‘నాటో’ స్థావరాలను స్థాపించి మాస్కో పొలిమేర్ల వరకూ అమెరికా మిలిటరీ క్షిపణుల్ని మోహరించే ప్రయత్నంలో భాగంగా ‘నాటో’లో సభ్యత్వానికి ఉక్రెయిన్ను ప్రోత్సహించాయి. దీంతో తన ఆత్మరక్షణ కోసం ఉక్రెయిన్పై యుద్ధానికి దిగింది రష్యా.ఉక్రెయిన్ తూర్పు భాగంలో 25 శాతం భూభాగాన్ని రష్యన్ సేనలు ఆక్రమించాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మిత్రులు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారు. ఉక్రెయిన్ ప్రధాన పట్టణాలను ఆక్రమించి రాజధాని కీవ్ దిశగా రష్యన్ సేనలు దూసుకెళుతున్నాయి. ‘మీరు శాంతియుతంగా లొంగకపోతే ఉక్రెయిన్ను నామరూపాలు లేకుండా చేస్తామ’ని రష్యా హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో యుద్ధాన్ని ప్రోత్సహించిన అమెరికాయే ఇప్పుడు ట్రంప్ రూపంలో శాంతి ప్రతిపాదనలు తెరపైకి తెచ్చి, ఉక్రెయిన్ ఓటమి నుంచి బయటపడే మార్గాల్ని అన్వేషిస్తోంది. 28 శాంతి ప్రతి పాదనల్లో ప్రధానంగా 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పాన్ని వాస్తవ రష్యన్ నియంత్రణ ప్రాంతంగా గుర్తించి... అమెరికా గుర్తింపుతో సహా అంతర్జాతీయ గుర్తింపును పొందేలా చూడాలి. యుద్ధంలో రష్యా వశపరచుకున్న డొనెట్స్క్ పొరుగున ఉన్న లుహాన్స్క్ ప్రాంతాలను రష్యాకు ఇవ్వాలి. రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాల కంటే ఎక్కువ ప్రాంతాన్ని ఉక్రెయిన్ ఇవ్వాలి. అక్కడ మిగిలి ఉన్న ఉక్రెయిన్ ట్రూపులను వెనుకకు పిలవాలి. ‘నాటో సభ్యత్వాన్ని కోరను’ అని ఉక్రెయిన్ చేయాలని చెబుతున్న ప్రతిజ్ఞను ఈ శాంతి ముసాయిదాలో చేర్చారు. ఇందుకోసం ఉక్రెయిన్ రాజ్యాంగాన్ని కూడా మార్చాలి. ప్రతిఫలంగా ఉక్రెయిన్ భద్రతా హామీలను పొందుతుంది. ఉక్రెయిన్లో విదేశీ మిలిటరీ స్థావరాలు కానీ, దూరపు శ్రేణి క్షిపణులను కానీ మోహరించ కూడదు. ఉక్రెయిన్ ఆర్మీని 6 లక్షలకు మించకుండా కుదించడం, ‘నాటో’ ఇకపై రష్యా వైపు విస్తరించదనీ, రష్యా ఇకపై పొరుగు దేశాలపై దాడి చేయకూడదనీ ఈ ముసాయిదాలో ఉన్నాయి. ఉక్రెయిన్ పారిశ్రామిక వాడలన్నీ రష్యా స్వాధీనంలో ఉన్నాయి. ఉక్రెయిన్ అణుశక్తిగా ఎన్నటికీ ఉండ కూడదు. యుద్ధ నష్టపరిహారం వంటివి ఇరువైపులా ఉండవు. రష్యాపై ఆంక్షలను ఎత్తివేసి, 2014లో తొలగించిన జీ8 దేశాల కూటమిలో సభ్యత్వం తిరిగి ఇస్తారు. ఉక్రెయిన్లో 100 రోజులలోగా అధ్యక్ష ఎన్నికలు జరగాలి. యూరోపియన్ యూనియన్ అధికారులు మాత్రం ఈ శాంతి ప్రణాళిక కోసం తమతో సంప్రదించలేదనీ, ఇది రష్యా అనుకూల ప్రణాళిక అనీ అంటున్నారు. 4 సంవత్సరాల క్రితం ఈ ప్రతిపా దనల్ని ఒప్పుకొని ఉంటే యుద్ధమే ఉండేది కాదు. ఇంత విధ్వంసమే జరిగేది కాదు. లక్షలాది మంది పశ్చిమ యూరప్కు వలసలు పోయేవారు కాదు. ఐతే బ్యాంకుల్లో స్తంభించిన 30,000 కోట్ల డాలర్ల రష్యా కరెన్సీ గురించి ఇంకా స్పష్టత రాలేదు. శాంతి ఒడంబడిక జరిగితే అంతిమ విజేతగా రష్యా నిలవనుంది. రష్యాను బలహీనపర్చి, రష్యాను విభజించి వలస దేశంగా మార్చి ఖనిజసంపదను దోచుకోవాలన్న అమెరికా, పశ్చిమ దేశాల ఆశలు అడియాసలుగా మిగిలిపోతాయి.పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ దిగజారుడులో ఉంది. పరిశ్రమలు సంక్షోభంలోకి వెళ్తూ ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సహాయానికి కూడా వెళ్లాలనే ఆలోచనలో యూకే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపటం ద్వారా అమెరికా, మిత్రదేశాలు తమ పరువును కాపాడుకొనే ప్రయత్నంలో ఉన్నాయనడం సముచితం.బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం’జాతీయ కార్యవర్గ సభ్యులు -
బర్త్ డే వేడుకల్లో కాల్పులు.. నలుగురు మృతి..
-
దాంపత్య బంధాన్ని దృఢం చేసే 'ఫోర్ లవ్స్' ఫార్ములా
అమెరికాలో తెలుగు వారి మేలుకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా దాంపత్య జీవితం దృఢం చేసుకునేలా వెబినార్ నిర్వహించింది. దాంపత్య జీవితాన్ని విజయవంతంగా నడిపించేందుకు, వివాహబంధాన్ని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన కీలక మార్గాలపై నాట్స్ కాన్సస్ చాప్టర్ నుంచి వెంకట్ మంత్రి, ప్రసాద్ ఇసుకపల్లి తాజాగా 'మ్యారేజ్ మెయింటెనెన్స్ కిట్' పేరుతో ఈ వెబినార్ నిర్వహించింది. వివాహ బంధాలపై 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిలేషన్షిప్ సైకాలజీ నిపుణుడు ఛార్లెస్ రివర్స్ ఈ వెబినార్లో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. వివాహ బంధం బలహీనపడటానికి ప్రధాన కారణాన్ని ఛార్లెస్ వెల్లడించారు. “జీవిత భాగస్వామి మీకు ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన మిత్రులైతే, మీరు ఇప్పుడు వారితో వ్యవహరిస్తున్న తీరులోనే వ్యవహరించగలుగుతారా? లేదా మార్చుకోవాల్సి వస్తుందా?" అనే కీలకమైన ప్రశ్నను దంపతులు తమకు తాము వేసుకోవాలని ఆయన సూచించారు. దాంపత్యంలో పురుషులు తమ భార్యల నుండి గౌరవాన్ని ఆశిస్తే, మహిళలు తమ భర్తల నుంచి ప్రేమ, శృంగారం, సంభాషణను కోరుకుంటారని తెలిపారు. ఈ అవసరాలను గుర్తించి తీర్చడమే వైవాహిక జీవిత నిర్వహణకు ముఖ్యమని ఛార్లెస్ రివర్స్ వివరించారు. అలాగే, వాదనలు పెరిగిపోయి గొడవలకు దారితీయడానికి ప్రధాన కారణం ఒకరి మాట ఒకరు వినకపోవడమే అని, స్నేహితుల్లా వ్యవహరించడం ద్వారా వీటిని నివారించవచ్చని ఛార్లెస్ తెలిపారు. దాంపత్యంలో పిల్లల కంటే, భార్యాభర్తల బంధానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే పిల్లలకు ప్రేమను పంచుకోవడంపై సరైన అవగాహన వస్తుందని ఆయన సలహా ఇచ్చారు. వివాహంలో అనేక సమస్యలకు మూలం, ప్రస్తుత దాంపత్యం కంటే, పరిష్కారం కాని బాల్య సమస్యలే అని వివరించారు. మనల్ని మనం మార్చుకోవడం ద్వారా మాత్రమే బంధాన్ని కాపాడుకోగలమని చార్లెస్ సూచించారు. ప్రతి కుటుంబానికి ఉపయోగపడే ఉత్తమ వెబినార్ నిర్వహించినందుకు సెయింట్ లూయిస్ చాప్టర్ సభ్యులను, నాట్స్ విభాగ నాయకులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: అమెరికా మోజుతో రూ.90 లక్షల ప్యాకేజీని కాలదన్నాడు! చివరికి..) -
అమెరికా కాల్పులు : ప్రియుడి భావోద్వేగం, ఎవరీ సారా?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్కు అతి సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. నేషనల్ గార్డ్స్పై జరిగిన కాల్పుల ఘటనలో నేషనల్ సైనికురాలు గార్డ్ సారా బెక్స్ట్రోమ్ ప్రాణాలొదిలింది. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం ప్రకటించారు. 20 ఏళ్లకే తనువు చాలించిన సారా బెక్స్ట్రోమ్ ఎవరు?ఈమె మరణం పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అత్యంత గౌరవనీయమైన, అద్భుతమైన యువతి అని ఆమె సేవలను కొనియాడారు. క్రైమ్ ఫైటింగ్ మిషన్లో భాగంగా వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ వాషింగ్టన్కు వందలాది మంది సైనికులను మోహరించింది. థాంక్స్ గివింగ్ సెలవుదినం సందర్భంగా బెక్స్ట్రోమ్ దేశ రాజధానిలో పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అటార్నీ జనరల్ పామ్ బోండి కాల్పుల మీడియతో చెప్పారు.సారా బెక్స్ట్రోమ్ ఎవరు?పశ్చిమ వర్జీనియాలోని సమ్మర్స్విల్లేకు చెందిన సారా బెక్స్ట్రోమ్ 2023 జూన్ 6 నేషనల్ గార్డ్స్లో ఉద్యోగిగా తన సేవను ప్రారంభించింది. వెస్ట్ వర్జీనియా ఆర్మీ నేషనల్ గార్డ్ 111వ ఇంజనీర్ బ్రిగేడ్లోని 863వ మిలిటరీ పోలీస్ కంపెనీకి ఎంపికైంది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం బెక్స్ట్రోమ్ మిలిటరీ పోలీసుల కోసం పనిచేసింది. FBIలో ఎదగాలనే డ్రీమ్తో నేషనల్ గార్డ్లో చేరింది. బోయ్ ఫ్రెండ్ భావోద్వేగంఎంతో ప్రేమగల దయార్ద్ర హృదయురాలు., సున్నితమైన మనసునున్న మనిషి బెక్స్ట్రోమ్ అంటూ ఆమె సహచరుడు ఆడమ్ కార్ గుర్తు చేసుకున్నాడు. ఆమెకు ప్రకృతి, రోడ్డు ప్రయాణాలన్నా, తన కుటుంబంతో సమయం గడపడం అన్నా చాలా ఇష్టపడేది. ముఖ్యంగా తనను ప్రేమించేవారి సంతోషం కోసం ఎక్కువ తపించేంది. ఆమె కుటుంబమే ఆమె ప్రపంచం. ఎవరికైనా ఏదైనా చేసేది.. ఉదయం తను పనికి వెళ్ళే ముందు భోజనం తయారు చేయడం దగ్గర్నించీ, తిరిగి వచ్చి తనని ప్రేమగా హగ్ చేసుకునేదాకా ఉత్సాహంగా వేచి ఉండేదని తలచుకుని కంటతడి పెట్టారు.మొదట్లో వాషింగ్టన్ వెళ్లడానికి ఆమె ఉత్సాహంగా లేకపోయినా, చివరికి బెక్స్ట్రోమ్ ఒప్పుకుంది. ఆ తరువాత మ్యూజియలను, స్మారక చిహ్నాలను దర్శిచుకోవడం లాంటి తనకెంతో ఇష్టమైన పనులు వెస్ట్ వర్జీనియాలో చేశానని సంతోషపడేదని కార్ చెప్పారు.భరించలేని విషాదం : తండ్రికుమార్తె అకాల మరణంపై సారా తండ్రి గ్యారీ బెక్స్ట్రోమ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బెక్స్ట్రోమ్ ఆమె మరణం తర్వాత హృదయ విదారకమైన నోట్ రాశారు. " ఇది భరించలేని విషాదం నా బిడ కీర్తిని పొందింది" అని గ్యారీ ఫేస్బుక్లో రాశారు.కాగా కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. వైట్ హౌస్ సమీపంలో ముష్కరుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు సైనికుల్లో సారా ఒకరు.కాల్పుల తర్వాత ఆమెకు అత్యవసరశస్త్రచికిత్స జరిగినా ఫలితం లేకపోయింది. అమెరికా వైమానిక దళానికి చెందిన మరో బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స తీసుకుంటున్నాడు. -
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కొత్త బ్యాచ్
మాస్కో: ముగ్గురు సభ్యులతో కూడిన అమెరికా–రష్యా వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తమ ప్రయాణం మొదలెట్టి విజయవంతంగా పూర్తిచేసింది. షెడ్యూల్లో భాగంగా ఐఎస్ఎస్కు గురువారం నాసా వ్యోమగామి క్రిస్ విలియమ్స్, రష్యా క్రూమేట్స్ సెర్గీ మికాయెవ్, సెర్గీ కుద్స్వెర్చ్కోవ్ చేరుకున్నారు. అంతకుముందు కజక్స్థాన్లోని బైకనూర్ ప్రయోగకేంద్రం నుంచి వ్యోమగాములతో కూడిన సోయూజ్ ఎంఎస్–28 వ్యోమనౌకను సోయూజ్ బూస్టర్ రాకెట్ స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 2.27 గంటలకు నింగిలోకి పంపించింది. ఐఎస్ఎస్లో ఈ ముగ్గురు ఎనిమిది నెలలపాటు గడపనున్నారు. -
వైట్హౌజ్ ఘటనలో పాక్ ప్రమేయం?!
వైట్హౌజ్ వద్ద కాల్పుల ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన అగ్రరాజ్యం.. నేరుగా అఫ్గనిస్థాన్ను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలకు దిగింది. అఫ్గన్ను ప్రమాదకరమైన నేలగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ఇమిగ్రేషన్ దరఖాస్తుల సస్పెండ్కు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)ను పురమాయించారు కూడా. ఈ క్రమంలో.. తాలిబాన్ ప్రభుత్వం తాజా పరిణామాలపై స్పందించింది.వైట్హౌజ్ సమీపంలో జరిగిన దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందా?. కాల్పులకు పాల్పడిన దుండగుడు రెహ్మనుల్లా లఖన్వాల్ను ఆ దేశమే బ్రెయిన్వాష్ చేసి పంపిందా?.. అయ్యి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తోంది అఫ్గనిస్తాన్. కాబూల్ ప్రపంచ దేశాలతో.. ముఖ్యంగా భారతదేశంతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూరస్తోందని చెబుతోంది. ఈ దాడి తమ దేశాన్ని బద్నాం చేసే కుట్ర అయ్యి ఉండొచ్చని.. అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిగితే అసలు విషయం బయటపడుతుందని అంటోంది. తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి సుహైల్ షాహీన్ భారత్కు చెందిన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఈ దాడి వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ప్రమేయం ఉందనిపిస్తోంది. మా దేశగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నంలో భాగమే ఈ దాడి అయ్యి ఉండొచ్చు కూడా. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగితే నిజం బయటపడుతుంది.... ఇది బయటి దేశాల గూఢచారి సంస్థలు(పాక్ ఐఎస్ఐను ఉద్దేశిస్తూ..) పని అయ్యి ఉండొచ్చు. అఫ్గాన్లను ఇతర దేశాల భద్రతా ముప్పుగా చూపించే ప్రయత్నమూ కావొచ్చు. ఇందులో ఏ కోణాన్ని మేం వదలిపెట్టబోం. ఎందుకంటే.. అయితే మా విధానం స్పష్టంగా ఉంది. మా పౌరులు ఎప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడరు. ఆఫ్గన్ నేలను, ఇక్కడి ప్రజల్ని ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించేందుకు మేం అంగీకరించబోం’’ అని అన్నారాయన. అఫ్గాన్ వలస ప్రక్రియను అమెరికా కఠినతరం చేయడంపై స్పందిస్తూ.. అమెరికా ప్రభుత్వం అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపించాలని.. ఆ తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలని అన్నారు.గురువారం వాషింగ్టన్లోని అధ్యక్ష భవనానికి అతి సమీపంలో జరిగిన ఈ కాల్పులతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. కాల్పుల సమయంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి అఫ్గాన్ జాతీయుడని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్రువీకరించారు. అతడి పేరు రెహ్మనుల్లా లఖన్వాల్ (Rahmanullah Lakanwal)గా పేర్కొన్నారు. 2021లో అఫ్గాన్లకు అందించిన స్పెషల్ వీసాపై అగ్రరాజ్యానికి వచ్చినట్లు తెలిపారు. నేషనల్ గార్డులకు తీవ్ర గాయాలయ్యాయని ఎఫ్ఐబీ చీఫ్ కాష్ పటేల్ ప్రకటించారు. కాల్పుల్లో నిందితుడికి కూడా గాయాలవడంతో.. అతడిని ఆస్పత్రికి తరలించామన్నారు. అతడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.వైట్హౌజ్ దాడి ఘటనపై ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇది ఒక దారుణమైన దాడి. విద్వేషపూరితమైన ఉగ్రవాద చర్య. ఇది మొత్తం దేశంపై జరిగిన దాడి. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దీన్ని మేం ఖండిస్తున్నాం. కాల్పుల అనంతరం అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఈ భూమి పైనే ప్రమాదకర ప్రాంతమైన అఫ్గానిస్థాన్ (Afghanistan)కు చెందినవాడని పేర్కొన్నారు. అతడు జో బైడెన్ (Joe Biden) పరిపాలన సమయంలో యూఎస్లోకి ప్రవేశించాడు. బైడెన్ పాలనలో అలా వచ్చినవాళ్లందరినీ విచారించాల్సిన అవసరం ఉంది. అలాంటి శరణార్థులు అమెరికన్ల మనుగడకే ప్రమాదకరం’’ అని అన్నారు. ఈ ఘటన తర్వాత వాషింగ్టన్లో మరో 500 మంది నేషనల్ గార్డ్ సిబ్బంది మోహరింపునకు ఆదేశించారు. అంతేకాదు.. ట్రంప్ ఆదేశాలతో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అఫ్గాన్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
అమెరికా మోజుతో 90 లక్షల ప్యాకేజీని కాలదన్ని..
విదేశాల్లో ఉన్నత చదువు అనేది చాలామంది విద్యార్థుల డ్రీమ్. అందుకోసం ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అయితే ఈ వ్యక్తి కూడా అలానే అనుకున్నాడు. కానీ అందుకోసం ఎంత పెద్ద డేరింగ్ స్టెప్ తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. పోనీ అంతలా సాహసం చేసినా.. మళ్లీ ఉద్యోగం సంపాదించడం కోసం ఎన్ని పాట్లు పడ్డాడో వింటే కన్నీళ్లు వచ్చేస్తాయి. అయితేనేం చివరికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలోను ఉద్యోగం కొట్టి..తనలా చెయ్యొద్దంటూ యువతకు సూచనలిస్తున్నాడు. అతడే అభిజయ్ అరోరా. భారత్కి చెందిన అభిజయ్ చక్కగా స్విట్జర్లాండ్లో ఏడాదికి రూ. 90 లక్షల వేతనం ఇచ్చే ఉద్యోగాన్ని చేస్తున్నాడు. అయినా ఏదో అసంతృప్తితో యూఎస్తో చదవాలనే డ్రీమ్తో అంత మంచి ఉద్యోగాన్ని వదులుకునేందుకు రెడీ అయ్యాడు. విదేశాల్లో చదువుకున్న అనుభవమే గొప్పదని భావించాడు. అందులోనూ తన మేజనర్ కూడా మరిన్ని అర్హతలు లేకపోతే ప్రమోషన్లు పొందలేవని చెప్పడంతో రెండో ఆలోచన లేకుండా చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. ఆ తర్వాత గానీ అసలు విషయం తెలిసి రాలేదు..అరోరాకి. చేతిలో ఒక్క ఉద్యోగం ఆఫర్ లేకుండా హార్వర్డ్లో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేస్తున్నాడు. ఆ తర్వాత మనోడి కష్టాలు అంత ఇంత కాదు. ఏకంగా 400కి పైగా ఉద్యోగాలు దరఖాస్తు చేసుకుంటే అన్ని రిజెక్ట్ అయిపోయాయి. ఒక్క కంపెనీ నుంచి కాల్ కూడా రాలేదు. తనకున్న జాబ్ నెట్వర్కింగ్ కూడా హెల్ప్ అవ్వలేదు. ఏ జాబ్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. చివరికి మొత్తం వ్యూహాన్ని మార్చాక గానీ అతడి పరిస్థితిలో మార్పు రాలేదు. అలా ఆరు నెలల తర్వాత గూగుల్ (యూట్యూబ్)లో ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ని సంపాదించాడు. అయితే తనలా ఇలా తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని అంటున్నాడు. అలాగే విదేశాల్లో ఉన్నత చదవులు చదవద్దని చెప్పే ఉద్దేశ్యం కూడా కాదని అంటున్నాడు. కేవలం మంచి ఉద్యోగాన్ని వదిలేసేమందు కష్టనష్టాలు బేరీజు వేసుకోవడం మంచిది. పైగా ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను కూడా ఎదుర్కొనేందుకు సిద్దపడిపోవాలని కోరాడు. ఇక్కడ ఒక్కటే మనపై మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ నిర్ణయం తప్పు కాదు. ఒక్కసారి నమ్మకం సడలితే మాత్రం అన్ని తప్పులుగా, కష్టాలుగా అనిపిస్తాయంటూ నెట్టింట తన స్టోరీని షేర్ చేసుకున్నాడు అరోరా. ఆ పోస్ట్ని చూసిన నెటిజన్లు ఎంబిఏ చేసే బదులు..అంతకుమించి వేతనం అందుకునే బెస్ట్ జాబ్ని వెతుక్కోవాల్సిందని కొందరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు భయ్యా ఇన్ని రిజెక్షన్లు ఎలా తట్టుకున్నావు, పైగా ఈ ఉద్యోగాన్ని సంపాదించడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించారో చెప్పరా ప్లీజ్ అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhijay Arora Vuyyuru | Study Abroad | Careers | AI (@abhijayarora_) (చదవండి: ఇంజనీర్ కమ్ డాక్టర్..! విజయవంతమైన స్టార్టప్ ఇంజనీర్ కానీ..) -
అమెరికా వైట్ హౌస్ సమీపంలో కాల్పులు
-
అమెరికా: వీడని తుపాకీ హింస..
అగరాజ్యం అమెరికా అన్ని రంగాల్లో అత్యంత వేగంగా దూసుకుపోతున్నప్పటికీ, తుపాకీ హింస (Gun Violence) ఆ దేశానికి మాయని మచ్చలా మారింది. తాజాగా వాషింగ్టన్ డీసీలోని ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇది అమెరికా పౌరుల భద్రతను ప్రశ్నిస్తోంది. అంతేకాదు... ప్రభుత్వానికి పలు సవాళ్లను కూడా విసురుతోంది. ఈ ఏడాది అమెరికాలో చోటుచేసుకున్న ప్రధాన కాల్పుల ఘటనలను గుర్తు చేసుకుంటే... ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచే న్యూయార్క్, ఇల్లినాయిస్లలో జరిగిన కాల్పులతో ప్రారంభమైన రక్తపాతం సంవత్సరం పొడవునా కొనసాగింది. నవంబరు 2025 నాటికి, దేశంలో 370కి పైగా మూక దాడులు (Mass Shootings) నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. ఈ ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 360కి పైగా ఉండగా, సుమారు 1,600 మంది గాయపడ్డారు. ఈ వరుస దాడులు అమెరికన్లను నిత్యం భయంలోకి నెట్టేస్తున్నాయి.ఆంటియోక్ హైస్కూల్లో కాల్పులు2025 ఆరంభంలోనే అంటే జనవరి 22న టెన్నెస్సీలోని నాష్విల్లేలో గల ఆంటియోక్ హైస్కూల్ (Antioch High School) లో కాల్పుల ఘటన జరిగింది. 17 ఏళ్ల విద్యార్థి సోలోమన్ హెండర్సన్ పాఠశాల క్యాంటీన్ వద్ద తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తోటి విద్యార్థిని జోస్సెలిన్ కొరియా ఎస్కలంటే మృతి చెందగా, మరొక విద్యార్థి గాయపడ్డాడు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన పాఠశాలల్లో ఆయుధాలను నియంత్రించే కఠిన చట్టాల ఆవశ్యకతపై చర్చకు దారితీసింది.ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో బీభత్సంఏప్రిల్ 17న ఫ్లోరిడాలోని టలహస్సీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ (ఎఫ్ఎస్యూ)లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒక విద్యార్థి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తక్షణమే స్పందించి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఉన్నత విద్యా సంస్థల్లో ఈ విధంగా దాడులు జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు.న్యూయార్క్ నైట్క్లబ్ కాల్పులుఆగస్టు 17న బ్రూక్లిన్లోని క్రౌన్ హైట్స్ (Crown Heights) లో ఉన్న 'టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్' అనే నైట్క్లబ్లో విచక్షణారహిత కాల్పులు జరిగాయి. ముఠాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా జరిగిన ఈ దాడిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భద్రత లేదనే భయాన్ని ఈ ఘటన మరింతగా పెంచింది.మిషిగాన్ చర్చిపై దాడి2025 సెప్టెంబరు 28న మిషిగాన్లోని గ్రాండ్ బ్లాంక్ టౌన్షిప్ (Grand Blanc Township) లోని ఒక ప్రార్థనా మందిరంపై భీకర దాడి జరిగింది. థామస్ జాకబ్ సాన్ఫోర్డ్ అనే దుండగుడు వాహనంతో చర్చిని ఢీకొట్టి, అనంతరం ఆయుధంతో కాల్పులు జరిపి, చివరకు భవనానికి నిప్పు పెట్టాడు. ఈ దాడిలో నలుగురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రార్థనా స్థలంలో జరిగిన ఈ దారుణం అమెరికాలో విద్వేష భావజాలం పెరుగుదలను సూచించింది.న్యూజెర్సీలో చిన్నారి బలినవంబరు 15న న్యూజెర్సీలోని నెవార్క్ (Newark)లో జరిగిన కాల్పుల ఘటన.. చిన్నారులు కూడా బాధితులుగా మారడాన్ని చూపింది. ఈ దాడిలో 10 ఏళ్ల బాలుడు జోర్డాన్ గార్సియాతో సహా ముగ్గురు పౌరులు మరణించారు. అమాయక చిన్నారులు తుపాకీ తూటాలకు బలికావడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను రేకెత్తించింది. ఈ నేపధ్యంలో చట్టాలను మరింత కఠినతరం చేయాలనే డిమాండ్ వినిపించింది.ఈ ప్రధాన ఘటనలతో పాటు 2025లో నమోదైన వందలాది ఇతర కాల్పుల ఘటనలను అమెరికా ప్రభుత్వానికి పెను సవాల్గా నిలిచాయి. ఆత్మరక్షణ పేరుతో తుపాకులను అందుబాటులో ఉంచుకోవడం అనేది దారుణాలకు దారి తీస్తున్నదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. తుపాకీ నియంత్రణపై రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతున్నంత కాలం ఈ రక్తపాతం ఆగదనే విషయాన్ని 2025 ‘ఘటనలు’ మరోసారి స్పష్టం చేశాయి.ఇది కూడా చదవండి: అమెరికాలో కాల్పుల మోత -
అమెరికాలో కాల్పుల మోత
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్కు కొద్ది దూరంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై కాల్పులకు జరిగాయి. వీరిని వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులుగా గుర్తించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల కస్టడీలో ఉన్న అనుమానితుడికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. అయితే అవి ప్రాణాపాయం కాని గాయాలని చట్ట అమలు అధికారులు తెలిపారు. అనుమానితుడి ఉద్దేశ్యం ఏమిటి? అతను గార్డ్ సభ్యులనే లక్ష్యంగా చేసుకున్నాడా? అనే విషయాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఈ ఘటన గురించి గవర్నర్ పాట్రిక్ మోరిస్సే స్పందిస్తూ ‘దర్యాప్తు కొనసాగుతున్నందున మేము సమాఖ్య అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని అన్నారు.చట్ట అమలు సంస్థలు సంఘటనా స్థలం నుండి సేకరించిన నిఘా వీడియోను సమీక్షిస్తున్నాయి. ఈ వీడియో ఆధారంగా అనుమానితుడు.. సైనికుల వద్దకు వచ్చి, తుపాకీని బయటకు తీసినట్లుగా తెలుస్తోంది. ఒక అధికారి చెప్పిన వివరాల ప్రకారం..సైనికులలో ఒకరు ఆ దాడి చేసిన వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ పరస్పర కాల్పుల ఫలితంగానే అనుమానితుడికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.ఈ కాల్పుల ఘటన వైట్ హౌస్కు రెండు బ్లాక్ల దూరంలో జరిగింది. ఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలలో.. సైనికులలో ఒకరికి సీపీఆర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. మరొక సైనికుడికి, అదుపులో ఉన్న అనుమానితునికి కూడా చికిత్స అందిస్తున్న దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నాయి. అలాగే ఆ దారిలో గాజు పెంకులు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఎఫ్బీఐ కూడా సమాఖ్య స్థాయిలో దర్యాప్తులో పాలుపంచుకుంటోంది. -
మూడు పిట్ బుల్స్ దాడి : కేర్ టేకర్ అమెరికా యువతి దుర్మరణం
పెంపుడు కుక్కలు యజమాని మీద ఆగ్రహం చూపించడం, ఒక్కోసారి ప్రాణాలను తీయడంచాలా అరుదుగా జరిగే విషాదం. అమెరికాలో కుక్కల కేర్ టేకర్గా పనిచేస్తున్న 23 ఏళ్ల కాలేజీ విద్యార్థిని, కుక్కల చేతిలో దారుణంగా చనిపోయింది. మూడు పిట్ బుల్స్ ఒకేసారి దాడి చేయడంతో ఆమె ప్రాణాలు విడిచింది.టెక్సాస్లోని టైలర్లోని ఉండే కుటుంబం మూడు పెట్ డాగ్స్ పిట్ బుల్స్ పెంచుకుంటోంది. టెక్సాస్ విశ్వవిద్యాలయ విద్యార్థిని మాడిసన్ రిలే హల్కు కూడా ఇవంటే చాలా ప్రేమ. అవి కూడా ప్రేమగానే ఉండేవి. నవంబర్ 21న సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో హల్ ఇంటి వెనుక వెనుక దాడిచేయడంతో విగతజీవిగా కనిపించింది. హల్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ఇటీవల కుక్కల యజమాని ఇంట్లో కుటుంబ పిల్లలను చూసుకునేంది. అలాగే కుక్కలను కూడా చూసుకునేందుకు అంగీకరించింది. ఏమైందో తెలియదు కానీ ఇంటి యజమానులు పట్టణంలో లేనప్పుడు ఆమెపై దాడి చేశాయి. ఆ శబ్దం విన్న పొరుగువాళలు, అత్యవసర సేవలకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న అక్కడకు వచ్చిన అధికారిపైనా దాడికి యత్నించడంతో పిట్ బుల్స్లో ఒకదానిని కాల్చి చంపాడు. మిగిలిన రెండు కుక్కలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గాయాలతో కొద్దిసేపటికే మరణించింది. హల్ తల్లి జెన్నిఫర్ హబ్బెల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆమె తల్లి జెన్నిఫర్ హబ్బెల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో ఆమె పట్ల ప్రేమగా ఉన్న కుక్కలలో ఇటీవల వచ్చిన మార్పు గురించి ప్రస్తావించిందని గుర్తు చేసుకున్నారు. -
H-1B వీసా స్కాం సంచలనం : ఏకంగా 220000 వీసాలా?
అమెరికా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఐటీ , కంపెనీలు ఉద్యోగుల్లో H-1B వీసాల టెన్షన్ నెలకొంది. ఈ ఆందోళన ఇలా ఉండగా చెన్నైలో హెచ్ 1బీవీసాలకు సంబంధించి భారీ కుంభకోణం ఆరోపణలు వెలుగులోకి రావడం హాట్ టాపిక్గా మారింది. భారతదేశంలోని చెన్నై జిల్లా దేశవ్యాప్తంగా అనుమతించబడిన మొత్తం వీసాల సంఖ్య కంటే రెండు రెట్లు ఎక్కువ పొందిందని అమెరికా మాజీ ప్రతినిధి , ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ ఆరోపించారు. దీంతో అధి నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం అమెరికా కంపెనీలు అందించే అమెరికా H-1B వీసా కార్యక్రమం మరోసారి చర్చనీయాంశమైంది. స్టీవ్ బానన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ H-1B వ్యవస్థను "పారిశ్రామిక-స్థాయి మోసం" జరిగిందని, వీసా కేటాయింపులు చట్టబద్ధమైన పరిమితులను మించిపోయాయని డేవ్ బ్రాట్ పేర్కొన్నారు. 71 శాతం H-1B వీసాలు భారతదేశం నుండి వస్తున్నాయని, అయితే 12 శాతం మాత్రమే ఈ కార్యక్రమంలో రెండవ అతిపెద్ద లబ్ధిదారు చైనా నుండి వస్తున్నాయని గుర్తు చేశారు. కేవలం 85,000 H-1B వీసాల పరిమితి ఉంది, కానీ ఏదో విధంగా భారతదేశంలోని ఒక జిల్లా, మద్రాస్ (చెన్నై) జిల్లా 220,000 పొందింది అని ప్రశ్నించారు. ఇక్కడ భారతీయులకు జారీ చేసిన హెచ్-1బీ వీసాల్లో 80-90 శాతం నకిలీవని ఆరోపించారు. H-1B వీసాల జాతీయ పరిమితి 85,000 అయితే, చెన్నైకి 220,000 వీసాలు ఎలా వచ్చాయి? ఇది 2.5 రెట్లు ఎక్కువ, మోసం చేశారన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ కర్ణాటక వంటి నాలుగు అధిక జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల నుండి ని, దరఖాస్తులను ప్రాసెస్ చేస్తోంది. అక్రమంగా ఈ వీసాలు పొందేందుకు వారు తప్పుడు డిగ్రీలు, నకిలీ పత్రాలు సమర్పించారని పేర్కొన్నారు.DR. DAVE BRAT: 71% of H-1B visas come from India. The national cap is 85,000, yet one Indian district got 220,000! That's 2.5x the limit!When you hear H-1B, think of your family, because these fraudulent visas just stole their future.@brateconomics pic.twitter.com/8O1v8qVJPe— Bannon’s WarRoom (@Bannons_WarRoom) November 24, 2025బ్రాట్ ఈ సమస్యను అమెరికన్ కార్మికులకు ప్రత్యక్ష ముప్పుగా అభివర్ణించారు. కాగా దాదాపు రెండు దశాబ్దాల క్రితం చెన్నై కాన్సులేట్లో పనిచేసిన భారత సంతతికి చెందిన అమెరికా విదేశాంగ సేవా అధికారి మహవాష్ సిద్ధిఖీ చేసిన ఆరోపణలను బ్రాట్ వాదనలు తిరిగి తెరపైకి తెచ్చాయి. చెన్నై కాన్సులేట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే H-1B ప్రాసెసింగ్ కేంద్రాలలో ఒకటి. -
ఏప్రిల్లో ట్రంప్ చైనా పర్యటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏప్రిల్లో చైనాలో పర్యటించనున్నారు. టారిఫ్ వార్ తరువాత రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో తాను ఫోన్లో సంభాషించానని, వచ్చే ఏడాది చివర్లో అమెరికా పర్యటనకు జిన్పింగ్ను ఆహ్వనించానని ఎక్స్వేదికగా ట్రంప్ పేర్కొన్నారు. చైనాతో అమెరికా సంబంధం బలంగా ఉందని, ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడేందుకు సహాయపడుతుందని వెల్లడించారు. నెల రోజుల కిందట ఇద్దరు నాయకులు దక్షిణ కొరియాలో భేటీ అయ్యారు. అనంతరం ఫోన్లో సంభాíÙంచారు. ఉక్రెయిన్, ఫెంటానిల్, అమెరికన్ సోయాబీన్స్ కొనుగోళ్లు వంటి అంశాలపై చర్చించామని ట్రంప్ తెలిపారు. పర్యటనలు ప్రస్తావించని చైనా అయితే ముందుగా ఫోన్ కాల్ గురించి ప్రకటించిన చైనా మాత్రం పర్యటనల గురించి వెల్లడించలేదు. కేవలం ఇరు దేశాల మధ్య వాణిజ్యం, తైవాన్, ఉక్రెయిన్ గురించి చర్చించారని పేర్కొంది. ‘‘చైనా ప్రధాన భూభాగానికి తైవాన్ తిరిగి రావడం ‘యుద్ధానంతర అంతర్జాతీయ క్రమంలో అంతర్భాగం’అని జిన్పింగ్ ట్రంప్తో అన్నారు. ట్రంప్ తన పోస్ట్లో ప్రస్తావించని బీజింగ్కు ఇది కీలకమైన సమస్య. ఫాసిజానికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం విజయాన్ని సంయుక్తంగా కాపాడుకోవాలని జిన్పింగ్ ట్రంప్తో అన్నారు. తెవాన్ ప్రశ్న చైనాకు ఎంత ముఖ్యమో అమెరికా అర్థం చేసుకుంటుంది.’’అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్కు సాయంపై అమెరికా అస్పష్టత వాణిజ్య యుద్ధాన్ని తగ్గించడానికి వరుస చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. రెండు అగ్రరాజ్యాల మధ్య వైరుధ్యాలు కొనసాగుతున్నాయని రెండు వైపుల నుంచి వచి్చన ప్రకటనల్లోని లోపాలు సూచిస్తున్నాయి. తైవాన్పై చైనా చర్య తీసుకుంటే, అమెరికాకు కీలకమైన మిత్రదేశమైన జపాన్లోని సైన్యం జోక్యం చేసుకోవచ్చని జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో చైనా–జపాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తకైచి వ్యాఖ్యలను బీజింగ్ ఖండించింది. ఎవరూ తాకకూడని ఎర్ర గీతను జపాన్ దాటిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు.స్వయం పాలనలో ఉన్న తైవాన్ సార్వభౌమాధికారంపై అమెరికా ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ తైవాన్ను స్వా«దీనం చేసుకోవడానికి బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తుంది. ఏదైనా సాయుధ దాడిని నిరోధించడానికి ద్వీపానికి సాయంగా అమెరికా దళాలను పంపే విషయంలో స్పష్టత లేదు. తైవాన్ తన రక్షణ బడ్జెట్ను పెంచాలని అమెరికా చెబుతోంది. తైవాన్కు 330 మిలియన్ డాలర్ల ఆయుధ అమ్మకాలకు అమెరికా ఈ నెలలో ఆమోదం తెలిపిందని తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో యుద్ధ విమానాల విడిభాగాలు కూడా ఉన్నాయి. దీనిపై చైనా నిరసన వ్యక్తం చేసింది. -
హెచ్1బీ వీసాదార్లను వెళ్లగొట్టబోం
న్యూయార్క్: అమెరికాలో క్షణక్షణ గండంగా గడుపుతున్న భారత హెచ్–1బీ వీసాదారులకు భారీ ఊరట. వారిని అమెరికన్లతో భర్తీ చేసి వారిని భారత్కు తిప్పి పంపాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారంటూ వస్తున్న వార్తలకు వైట్హౌస్ ఫుల్స్టాప్ పెట్టింది. అలాంటి ఆలోచనకు అధ్యక్షుడు అస్సలు మద్దతివ్వడం లేదని స్పష్టం చేసింది. హెచ్–1బీ వీసాలను గురించి ఆయనకున్న అవగాహన అత్యంత పరిమితమని వెల్లడించింది! ఈ విషయమై ట్రంప్కు ఉన్నది కేవలం సాధారణ పరిజ్ఞానంతో కూడిన అవగాహన మాత్రమేనని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ స్పష్టం చేశారు.హెచ్–1బీ వీసాదార్లను అమెరికన్లతో భర్తీ చేస్తారన్న వార్తలను మీడియా ప్రస్తావించగా ఆమె ఈ మేరకు స్పష్టతనిచ్చారు. దీనిపై ట్రంప్ వైఖరిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అధ్యక్షుని కోరికల్లా ఒక్కటే. విదేశీ కంపెనీలు అమెరికాలో లక్షలాది కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాలి. విదేశీ వృత్తి నిపుణులతో తమతో పాటు వెంటబెట్టుకు రావాలి. కొత్త తరం వాణిజ్య పోరులో ఏ దేశాన్నైనా ముందు వరుసలో నిలిపే బ్యాటరీల వంటి కీలక ఉత్పత్తుల్లో అమెరికాను అగ్రగామిగా నిలపాలి.అయితే, అంతిమంగా ఆయా ఉద్యోగాల్లో అమెరికన్లే ఉండేలా చూడాలన్నది ట్రంప్ లక్ష్యమని కూడా లెవిట్ చెప్పుకొచ్చారు! ‘మా దేశంలో వ్యాపారం చేయాలంటే మా దేశస్తులనే ఉద్యోగాల్లోకి తీసుకోవడం మంచిది’అని ఆయా కంపెనీలకు ట్రంప్ స్పష్టంగా చెప్పారన్నారు. ‘‘ప్రస్తుత గందరగోళం అంతటికీ ఆ స్టేట్మెంటే కారణం. కానీ అధ్యక్షుని ఉద్దేశం అంతా అనుకుంటున్నది మాత్రం కాదు’’అంటూ ముక్తాయించారు. అమెరికా ఉత్పత్తి రంగం మున్నెన్నడూ లేనంతగా కోలుకుని దూసుకుపోవాలన్నదే ట్రంప్ కల అన్నారు. నిజానికి ఆయా దేశాలపై టారిఫ్ల విధింపు వెనక అధ్యక్షుని ఏకైక ఉద్దేశం కూడా ఇదేనని చెప్పారు. విదేశీ కంపెనీలు తమతో పాటు సొంత వృత్తి నిపుణులను వేలాదిగా అమెరికాకు తీసుకు రావాలని, వారంతా కీలక వృత్తి నైపుణ్యాలను అమెరికన్లకు నేర్పి స్వదేశాలకు వెళ్లిపోవాలని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. -
అమెరికా హెచ్చరికలు.. వెనిజులాకు పలు దేశాల షాక్!
కారకాస్: వెనిజులాలో భద్రతా పరిస్థితులు మరింతగా దిగజారడానికి తోడు, ఆ దేశ గగనతలంలో అమెరికా సైనిక కార్యకలాపాలు పెరగడంతో, ప్రపంచంలోని పలు ప్రధాన విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను వెనిజులాకు నిరవధికంగా రద్దు చేశాయి. యునైటెడ్ స్టేట్స్కు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఇటీవల పైలట్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. దేశంలో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో, అలాగే అన్ని ఎత్తులలో విమానాలకు బెదిరింపులు ఎదురయ్యే అవకాశాలున్నాయని దానిలో పేర్కొంది.ఒంటరిని చేసి..ఈ పరిణామాల దరిమిలా వెనిజులాలోని ఎయిర్లైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపిన వివరాల ప్రకారం, టీఏపీ, ఎల్ఏటీఏఎం, ఏవియాంకా, ఇబెరియా, గోల్, కరేబియన్ తదితర ఆరు ప్రధాన క్యారియర్లు ఇప్పటికే తమ విమానాలను నిలిపివేశాయి. టర్కిష్ ఎయిర్లైన్స్ కూడా తాత్కాలికంగా నవంబర్ 24 నుండి 28 వరకు తమ సర్వీసులను రద్దు చేసింది. ఈ సంక్షోభం ప్రధానంగా ట్రంప్ పరిపాలనా విభాగం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి పెంచడంతో ఏర్పడింది. మదురోను దక్షిణ అమెరికా దేశానికి చట్టబద్ధమైన నాయకునిగా అమెరికా పరిగణించడం లేదు. దీనిలో భాగంగానే అమెరికా సైన్యం వెనిజులా తీరం వరకు బాంబర్ విమానాలను మోహరించింది. విమానాల రద్దుపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా స్పందించారు. వెనిజులాకు అంతర్జాతీయ అనుసంధానాన్ని నిలిపివేయడాన్ని ఆయన ఖండించారు. ఈ చర్యలు తమ దేశానికి అంతర్జాతీయంగా ఒంటరితనాన్ని పెంచుతాయని, తద్వారా సామాన్య పౌరులు ఇబ్బందులు పడతారని పెట్రో అభిప్రాయపడ్డారు.వెనిజులాతో వివాదానికి కారణం ఇదే..అమెరికా- వెనిజులా మధ్య ఘర్షణ ప్రధానంగా నికోలస్ మదురో నాయకత్వం చుట్టూ తిరుగుతోంది. 2018 ఎన్నికల ఫలితాలను అమెరికా అంగీకరించకపోవడానికి తోడు ప్రతిపక్ష నేత జువాన్ గైడోకు మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. మదురో ప్రభుత్వంపై మానవ హక్కుల ఉల్లంఘనలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు చేస్తూ, అమెరికా ఆ దేశంలోని చమురు రంగంతో సహా పలు కీలక రంగాలపై భారీ ఆర్థిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు వెనిజులా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికితోడు అమెరికా.. కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకలను, బాంబర్ విమానాలను మోహరించి, సైనిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ ఉద్రిక్తతతలకు తొడు గగనతలంలో భద్రతపై అమెరికా జారీ చేసిన హెచ్చరికల కారణంగానే అంతర్జాతీయ విమానయాన సంస్థలు వెనిజులాకు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. అమెరికా మదురోను అధికారంలో నుండి తొలగించేందుకు యోచిస్తుండగా, మదురో తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ నేపధ్యంలో వెనిజులా ప్రజలు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇది కూడా చదవండి: Delhi: మోగిన ప్రమాద ఘంటికలు.. ఉదయాన్నే ఆగిన ఊపిరి -
యూఎస్ శాంతి ప్రణాళికపై జెనీవాలో చర్చలు
జెనీవా: రష్యా దురాక్రమణకు పుల్స్టాప్ పెట్టేందుకు ఉద్దేశించిన అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఆదివారం చర్చలు జరిపారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ జాతీయ భద్రతా సలహాదారులతో మొదటి దఫా చర్చలు ముగిశాయని ఉక్రెయిన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న అధ్యక్షభవనం చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యర్మాక్ ఎక్స్లో వెల్లడించారు. ప్రతిపాదిత 28 పాయింట్ల ఒప్పందం పొరుగుదేశంపై దురాక్రమణకు పాల్పడిన రష్యాకే అనుకూలంగా ఉండటంపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదనలను సమీక్షించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్ను అవి కోరుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ కూడా పాలుపంచుకున్నారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొనే దిశగా అమెరికా బృందంతో నిర్మాణాత్మకంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని యర్మాక్ తెలిపారు. ఈ ఒప్పందంతో దేశ సార్వభౌమత్వమా? అమెరికా మద్దతును నిలుపుకోవడమా? తేలిపోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించడం తెల్సిందే. ఇప్పటికే కనీసం డజను సార్లు తిరస్కరించిన రష్యా డిమాండ్లనే ఈ ఒప్పందంతో ఆమోదించాల్సి రావడం జెలెన్స్కీకి మింగుడు పడటం లేదు. ఉక్రెయిన్ పారిశ్రామిక రంగానికి ఎంతో కీలకమైన డోన్బాస్ను రష్యాకు వదిలేయడం, సైన్యాన్ని పరిమితం చేసుకోవడం వంటివి ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇవి తుది ప్రతిపాదనలు కావని, ఎలాగైనా యుద్ధాన్ని ఆపడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. అయితే, గురువారం కల్లా ఒక స్పష్టతకు రావాలని ఆయన శనివారం ఉక్రెయిన్కు గడువు విధించారు. కాగా, నల్ల సముద్రంపై ఉక్రెయిన్ స్వేచ్ఛగా ధాన్యం రవాణా చేసేందుకు ఉద్దేశించిన గత ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేలా రష్యా అధ్యక్షుడు పుతిన్తో సోమవారం మాట్లాడుతానని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు. -
జీ-20 సదస్సులో మరో వివాదం
దక్షిణాఫ్రికా జోహాన్స్ బర్గ్ లో నిర్వహిస్తున్న జీ-2౦ శిఖరాగ్ర సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. అయితే ఈ సదస్సు ముగింపులో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. శిఖరాగ్ర సమావేశం ముగింపులో తదుపరి జీ-20 సదస్సు నిర్వహించే దేశానికిచ్చే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి సౌతాఫ్రికా నిరాకరించింది.జీ-20 సమావేశం ప్రారంభం నుంచి సౌతాఫ్రికా- అమెరిాకా మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అమెరికా ఈ సమావేశంలో పాల్గొంటుందని సౌతాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా అనడం దానిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించడం అంతా తెలిసిందే. అయితే ఈ శిఖరాగ్ర సమావేశం ముగింపు సమయంలో మరో వివాదం చోటు చేసుకుంది. శిఖరాగ్ర సదస్సు ముగింపులో తదుపరి జీ-20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించే దేశానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి. కానీ ఆ బాధ్యతలివ్వడానికి సౌతాఫ్రికా నిరాకరించింది.తమ దేశాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలను అమెరికా అధికారికి అప్పగించబోరని సౌతాఫ్రికా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అమెరికా జీ-20లో మెంబర్ వారు ఈ శిఖరాగ్ర సదస్సును రిప్రజెంట్ చేయాలంటే ఏవరినైనా సరైన హోదా గల వ్యక్తిని తమ దేశానికి పంపాలన్నారు. వారు దేశాధ్యక్షుడైనా, లేదా మంత్రైనా ప్రభుత్వం చేత నియమించబడిన ప్రత్యేక రాయబారి అయినా కావచ్చు అని ఆయన తెలిపారు. లేకపోతే ఆ బాధ్యతలను ప్రభుత్వ కార్యాలయంలో ఒకే ర్యాంకు గల అధికారులచే మార్పు చేయబడుతుందని స్పష్టం చేశారు.అయితే సౌతాఫ్రికాలో శ్వేత జాతీయులపై అక్కడి ప్రభుత్వం వేదింపులకు పాల్పడుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. అందుకు గాను ఆ దేశంలో జరిగే జీ-౨౦ శిఖరాగ్ర సదస్సులో తమ దేశం పాల్గొనబోదని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో సౌతాఫ్రికా సైతం ఘూటుగానే స్పందించింది. -
17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్ఆర్ఐ జంట, వీడియో వైరల్
డాలర్ల వేటలో చాలామంది విదేశాల బాటపడతారు. కానీ అన్ని దేశాల్లోనూ, అన్ని రకాలుగా మనకు సౌకర్యంగా ఉండదు. కొన్నిచోట్ల కొన్ని సమస్యలు తప్పవు. ఇందులో అక్కడి నిబంధనలు, భాషా సంస్కృతి, వాతావరణ పరిస్థితులు, జీవన స్థితిగతులు, ఆరోగ్యం ఇలా ఈ జాబితాలోనే చాలానే ఉంటాయి. కొన్ని కావాలంటే కొన్ని సర్దుబాట్లు తప్పవు అని ఎడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. కానీ అమెరిలో ఒకటిన్నర దశాబ్దానికి పైగా ఉన్న జంట ప్రవాస భారతీయ (NRI) జంట ఇండియాకు తిరిగి వచ్చేసింది.ఎందుకు? అనుకుంటున్నారా? పదండి తెలుసుకుందాం ఈ కథనంలోఅమెరికాలో ఆరోగ్య ఖర్చులు బీమా భారం కావడంతో దాదాపు 17 ఏళ్ల తరువాత అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేసింది భారతేదేశానికి చెందిన ఎన్ఆర్ఐ జంట. వీరికి కవల పిల్లలు. యూఎస్లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తమ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తోందని, బీమా చాలా ఖరీదైనదని, దీంతో అక్కడ హాస్పిటల్కి వెళ్లాలంటేనే భయం వేస్తోందని ఇన్స్టా పోస్ట్లో వెల్లడించారు.అమెరికాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆరోగ్య బీమా సేవలకంటే ముందు, మీ జేబుకు చిల్లు తప్పదు. అంటే ఏ డాక్టర్ దగ్గరికెళ్లినా, ఎలాంటి పరీక్షలు చేయించుకున్నా, మినిమం డిడక్టబుల్ ఎమౌంట్ కట్టాల్సిందే అంటూ తమ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.తాము ఎంచుకున్న చౌకైన పథకం నెలకు 1,600 డాలర్ల ప్లాన్. ఇందులో 15వేల డాలర్లు డిడక్టబుల్ ఎమౌంట్. అయితే ఈ కవర్లో ట్విన్స్ యాడ్ అవ్వలేదు.దీంతో పిల్లలకి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన ఖర్చులు విపరీతం, దీనికి ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అందుకే ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించు కున్నాం. మంచి వైద్యులు, వేగవంతమైన సంరక్షణ, చికిత్స అందుబాటులో ఉండేలా చక్కటి వ్యవస్థ ఉంది. మేం ఇండియాకు రావడం అంటే సమస్య నుంచి పారిపోవడం కాదు, ఆరోగ్య సంరక్షణ భరించేదిగా ఉండటంతోపాటు, ఒంటరిగా మాతృత్వ భారాన్ని భరించాల్సిన అవసరం లేని జీవితం వైపు పరుగెత్తడం అని వివరణ ఇచ్చారు. తాము కోల్పోతున్న సమన్వయం, మనశ్శాంతిని వెదుక్కోవడం అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Dhara (@twinsbymyside) దీంతో నెటిజన్లు ఈ జంటతో ఏకీభవించారు. వారికి మద్దతుగా నిలిచారు. చక్కటి నిర్ణయం తీసుకున్న మీకు అభినందనలు అంటూ ప్రశంసించారు. అలాగే కొంత సర్దుబాటు అవవసరం అని కొందరు వ్యాఖ్యానిస్తే. ఇండియాలో 30వేలతో అయిపోయే అపెండిక్స్ ఆపరేషన్కు రూ. 3.74 కోట్లు అయిందంటూ ఒకరు,అక్కడ సాధారణ కట్టు , కుట్లు వేయడానికి చాలా ఖర్చవుతుంది అని మరొకరు తమ అనుభవాల్ని పంచుకున్నారు. రెండు దేశాల్లో వాటి ప్లస్లు మైనస్లూ ఉన్నాయి. కానీ చిన్న పిల్లలున్న కుటుంబాలకు ఇండియాలో మంచి ఆరోగ్య వ్యవస్థ ఉందన్నారు. ఎక్కడా పెర్ఫెక్ట్గా ఉండదు. కానీ మీకు మంచి జీవితం ఉండాలని భావిస్తున్నాను అని ఒకరు వ్యాఖ్యానించారు. వీడియో 10.6 లక్షలకు పైగా వీక్షణలు మరియు వందలాది వ్యాఖ్యలను సంపాదించింది. -
తొలిసారి డొనాల్డ్ ట్రంప్తో మామ్దానీ భేటీ..!
అమెరికాలో పెద్ద నగరమైన న్యూ యార్క్ మేయర్గా ఎన్నికైన డెమొక్రటిక్ సోషలిస్ట్, భారతీయ అమెరికన్ యువకుడు జొహ్రాన్ మమ్దాని.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలవనున్నారు. ఈరోజు(శుక్రవారం) డొనాల్డ్ ట్రంప్తో వైట్హౌస్లో భేటీ కానున్నారు మామ్దాని. అయితే న్యూయార్క్ మేయర్గా మామ్దాని ఎన్నిక కావడానికి ముందు, ఆ తర్వాత ఆయనపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. అతనొక కమ్యూనిస్టు అని ఒకవైపు, అతడి పేరు ఎదైనా కావొచ్చు, అతడు ఎవరైతే నాకేంటి? అని హేళన కూడా మాట్లాడారు. అమెరికా ప్రజలు కమ్యూనిజం కావాలో లేక కామన్సెన్స్ కావాలో తేల్చుకొనే సమయం వచ్చిందని అన్నారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా మామ్దానీపై విరుచుకుపడుతూనే ఉన్నారు ట్రంప్. న్యూయార్క్ అభివృద్ధికి సంబంధించి నిధులు ఆపేస్తున్నారని మామ్దానీ సైతం ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు వైట్హౌస్లో ముఖాముఖి ఎదురపడటం ఇదే తొలిసారి. ఏయే అంశాలు ప్రస్తావనకు వస్తాయి. దానికి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మామ్దానీ వైట్హౌస్కి వస్తున్న వేళ కూడా సెటైర్లు పడ్డాయి. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిత్.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాలో పెద్ద నగరమైన న్యూయార్క్కు మేయర్గా ఎన్నికైన కమ్యూనిస్టు మామ్దానీ వైట్హౌస్కు వస్తున్నారంటూ సెటైర్ల వేశారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీ ఒక్కరితోనూ మాట్లాడాతారంటూ చెప్పుకొచ్చారు. అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ట్రంప్ ఎవరితోనైనా మాట్లాడతారంటూ మామ్దానీని తక్కువగా చేసి వ్యాఖ్యలు చేశారు. -
భారత్ కు జావెలిన్ మిస్సైల్స్..
-
నైపుణ్యం కలిగిన వలసదారులను స్వాగతిస్తాం: ట్రంప్
వాషింగ్టన్: వలసదారులపై ఇన్నాళ్లూ కఠిన వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. అమెరికాకు వారి అవసరమేంటో ఆయనకు ఎట్టకేలకు తెలిసొచ్చింది. నైపుణ్యం కలిగిన వలసదారులను కచ్చితంగా స్వాగతిస్తామని చెప్పారు. కంప్యూటర్ చిప్స్, క్షిపణులు లాంటి సంక్లిష్టమైన ఉత్పత్తుల అభివృద్ధి విషయంలో అమెరికన్ కార్మీకులకు వలసదారులు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు గతంలో మద్దతు ఇచ్చానని గుర్తుచేశారు. ఇప్పుడు వలసదారులకు పెద్దపీట వేస్తే స్వదేశంలో కొందరి నుంచి వ్యతిరేకత రావొచ్చని అన్నారు. వ్యతిరేకతను భరిస్తానని చెప్పారు. బుధవారం యూఎస్–సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో ట్రంప్ మాట్లాడారు. దేశ ఆర్థిక ప్రగతి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, మిస్సైల్స్ వంటి కంపెనీల్లో పని చేయడానికి నిపుణులైన వలసదారులు కావాలని తెలిపారు. వారి పరిజ్ఞానం తమ కార్మీకులకు ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. వస్తువుల ఉత్పత్తికి అవసరమైన మానవ వనరులను విదేశాల నుంచి రప్పించుకోవచ్చని అమెరికా సంస్థలకు ట్రంప్ సూచించారు. వేలాది మంది వచ్చినా తప్పకుండా స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు.ఈ విషయంలో నన్ను క్షమించాలి వలసదారుల రాకను వ్యతిరేకించేవారు నిజంగా చాలా తెలివైనవారు, నమ్మశక్యంకాని దేశభక్తులు అని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. అయితే, అమెరికా కార్మీకులకు నైపుణ్యాలు నేరి్పంచాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. మన కంపెనీల్లో బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేవారిని అనుమతించకపోతే మనం విజయవంతమైన వ్యక్తులుగా ఎప్పటికీ ఎదగలేమని తేలి్చచెప్పారు. ఒక పెద్ద కంపెనీ ఏర్పాటై, ఉత్పత్తి ప్రారంభం కావాలంటే విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు, ఉద్యోగులు రావాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ విషయంలో తనను క్షమించాలని కోరారు. మాగా(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్)ను ఇప్పటికీ ఆరాధిస్తున్నానని, విదేశాల నుంచి మనకు కావాల్సిన నిపుణులను రప్పించుకోవడం కూడా ‘మాగా’అవుతుందని అమెరికా అధ్యక్షుడు వివరించారు. తనకు ఓటు వేసేవారి సంఖ్య తగ్గినా పట్టించుకోబోనని, చివరకు వారే అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. -
జీ20 శిఖరాగ్రంలో అమెరికా: దక్షిణాఫ్రికా
జొహన్నెస్బర్గ్: జీ20 శిఖరాగ్రం విషయంలో అమెరికా మనసు మార్చుకుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా చెప్పారు. ఇప్పటి వరకు శిఖరాగ్రాన్ని బాయ్కాట్ చేస్తామని చెప్పిన అగ్రరాజ్యం ఇప్పుడు పాల్గొనేందుకు సానుకూలత వ్యక్తపర్చిందని ఆయన అన్నారు. ఆఖరి క్షణంలో ఈ మేరకు తమకు సందేశం అందడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను మారుస్తున్నామన్నారు. మైనారిటీ శ్వేత జాతీయులపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నందున తాము ఆ దేశంలో జరిగే జీ20 శిఖరాగ్రాన్ని బహిష్కరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెల్సిందే. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
పోరులో పాక్ గెల్చిందట!
న్యూఢిల్లీ: పహల్గామ్లో ఉగ్రవాదుల పాశవిక దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ జరిపిన దాడులకు పాకిస్తాన్ దీటుగా బదులిచ్చిందని, ఆ నాలుగు రోజుల పోరులో పాక్ పైచేయి సాధించిందని అమెరికా సెనేట్లో సమర్పించిన ఓ నివేదికపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది మోదీ సర్కార్ దౌత్యవైఫల్యానికి ప్రబల నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ గురువారం ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ వేళ కొనసాగిన పరస్పర సైనిక చర్యల్లో భారత్పై పాక్ విజయం సాధించిందని అమెరికా–చైనా ఆర్థిక, భద్రత సమీక్ష కమిషన్ మంగళవారం అమెరికా ఎగువసభ అయిన సెనేట్లో 800 పేజీల నివేదికను సమర్పించింది. ‘‘108, 109 పేజీల్లో ఏప్రిల్లో పహల్గాం దాడి వెనుక పాక్ హస్తముంది. ఆపరేషన్ సిందూర్ వేళ చైనా అందించిన అత్యాధునిక ఆయుధాలతో భారత్ను పాక్ ఓడించింది. చైనా అత్యాధునిక ఆయుధాలు, నిఘా సాయంతో పాక్ పైచేయి సాధించింది. పాక్ సైన్యం మాటున చైనా తన అధునాతన ఆయుధ సంపత్తిని నేరుగా భారత్ పరీక్షించుకునే సువర్ణావకాశాన్ని సద్వినియోగంచేసుకుంది. తద్వారా తమ ఆయుధాల పనితీరును ప్రపంచానికి చాటిచెప్పి అంతర్జాతీయ ఆయుధ, రక్షణ రంగ మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలని చూసింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘ అమెరికా సెనేట్లో సమర్పించిన నివేదికను చూశాకైనా ప్రధాని మోదీ మౌనం వీడతారా? భారత విదేశాంగ శాఖ తన అభ్యంతరాలను వ్యక్తంచేస్తుందా?’’ అని జైరాం రమేశ్ సూటి ప్రశ్న వేశారు. -
భారత్కు జావెలిన్ క్షిపణి వ్యవస్థ
న్యూయార్క్/వాషింగ్టన్: భారత భూతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసే రక్షణ ఒప్పందం కార్యరూపం దాల్చింది. భారత్కు రూ.826 కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా గురువారం అంగీకారం తెలిపింది. ఇటీవల యుద్ధంలో రష్యా యుద్ధ ట్యాంక్లను తుత్తునియలు చేసిన జావెలిన్ క్షిపణి వ్యవస్థలను సైతం ఒప్పందంలోభాగంగా భారత్కు అమెరికా విక్రయించనుంది. రష్యా నుంచి ముడిచమురును కొంటున్నందుకు ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 50 శాతం దిగుమతి టారిఫ్లను పెంచాక ఆ దేశంతో మోదీ సర్కార్ కుదుర్చుకున్న తొలి రక్షణరంగ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందం ఇదేకావడం విశేషం. దిగుమతి సుంకాల సుత్తితో మోదాక మోదీ సర్కార్ గుర్రుగా ఉండటంతో వేడెక్కిన ఇరుదేశాల సంబంధాలను శాంతపరిచేందుకే అమెరికా ఈ ఒప్పందాలు చేసుకుందని తెలుస్తోంది. తాజా ఒప్పందంపై అమెరికా స్పందించింది. ప్రధానమైన రక్షణరంగ భాగస్వామి దేశంలో భద్రతను పెంచేందుకే ఈ కొనుగోలు ఒప్పందం ఎంతో దోహదపడుతుంది. ఇండో–పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయ సుస్థిరత, శాంతికి ఈ ఆయుధ కొనుగోలు ఒప్పందం తన వంతు సాయంచేస్తుంది’’ అని అమెరికా పేర్కొంది. రూ. 418 కోట్ల విలువైన ఎం982ఏ1 రకం 216 ఎక్సాక్యాలిబర్ ప్రొజెక్టయిల్స్, సంబంధిత ఉపకరణాలతోపాటు రూ. 408 కోట్ల విలువైన ఎఫ్జీఎం–148 రకం 25 జావెలిన్ క్షిపణి వ్యవస్థలు, వాటికి అనుబంధంగా కమాండ్ లాంచ్ యూనిట్లు, 100 వరకు మందుగుండును భారత్కు విక్రయించేందుకు తమ విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చిందని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ సహకార ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున సాంకేతిక సహకారం, సమాచారం, రిపేర్లు, సేవలను సైతం ఈ ఒప్పందంలో భాగంగా అందివ్వనున్నారు. ఏమిటీ జావెలిన్ క్షిపణి లాంచర్? జావెలిన్ ఎఫ్జీఎం–148 యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థను అమెరికా దాదాపు మూడు దశాబ్దాలుగా వినియోగిస్తోంది. సైనికుడు భుజంపై పెట్టుకుని మాటువేసి ప్రయోగించే ఈ జావెలిన్ మిస్సైల్తో శత్రుదేశాల యుద్ధట్యాంక్లను అవలీలగా పేల్చేయవచ్చు. జావెలిన్ క్షిపణిని ప్రయోగించిన సైనికుడి జాడను కనిపెట్టడం చాలా కష్టం. దీంతో శత్రుయుద్ధట్యాంక్లను వేగంగా తుదముట్టించవచ్చు. జావెలిన్ లాంచర్ను సైనికుడు సులభంగా ఎక్కడికైనా మోసుకెళ్లవచ్చు. భూతల సమరంలో పైచేయి సాధించేందుకు భారతీయ సైన్యానికి ఇవి ఎంతగానో ఉపయుక్తంకానున్నాయి. 4 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అత్యంత కచి్చతత్వంతో పేల్చవచ్చు. దీనిలోని బాంబు బరువు 8 కేజీల పైమాటే. పొడవుగా రెండు కొనల్లో మందుగుండుతో దీనిని డిజైన్చేశారు. శత్రు యుద్ధ ట్యాంక్ను తాకగానే ఒకసారి పేలిపోయి దాని పైపొర, కవచాన్ని ఛిద్రం చేస్తోంది. వెనువెంటనే మరోసారి పేలి మొత్తం యుద్ధట్యాంక్నే ఛిన్నాభిన్నం చేస్తుంది. రష్యాకు చెందిన వందలాది ట్యాంక్లను ఉక్రెయిన్ సైనికులు ఈ జావెలిన్తోనే నాశనంచేశారు. జావెలిన్ భయానికి రష్యా ట్యాంక్లతో దాడులను తగ్గించుకుంది. -
పెద్దల్లోనూ యువతలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులు
తెలంగాణలో దీర్ఘకాలిక రుగ్మతలు (NCDs) రెండు వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయోవృద్ధుల్లోనే కాకుండా, ఇప్పుడిప్పుడే యువతలోనూ ఇవే వ్యాధులు వేగంగా పెరుగుతున్నట్టుగా తాజా అధ్యయనాలు చూపిస్తున్నాయని డా. జీషాన్ అలీ తెలిపారు.హైదరాబాద్లో తాజా సర్వే వివరాల ప్రకారం:60 ఏళ్లు దాటినవారిలో దాదాపు సగం మంది రక్తపోటుతో బాధపడుతున్నారునలుగురిలో ఒకరికి డయాబెటిస్తో బాధపడుతున్నారు సుమారు 44% శాతం మందికి ఊబకాయం సమస్యఇలా డయాబెటిస్, బీపీతో 30 నుంచి 40 ఏళ్ల పాటు జీవించడం ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. పెద్దవారు సులభంగా తట్టుకునే కొన్ని మందులు, చిన్న వయసు నుంచే ప్రారంభిస్తే.. పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.యువతలో పెరుగుతున్న జీవనశైలి రుగ్మతలుగతంలో 50 నుంచి 60 ఏళ్ల తర్వాత కనిపించే జీవనశైలి వ్యాధులు డయాబెటిస్, హైపర్టెన్షన్, హార్ట్ సమస్యలు ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్లకే నిర్ధారణ అవుతున్నాయని వైద్యులు తెలిపారు. చిన్న వయసులోనే ఈ రుగ్మతలతో 30–40 ఏళ్లు జీవించడం భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంహైదరాబాద్ ప్రజల ఆహారపు అలవాట్లలో అధిక కొవ్వు, తక్కువ ఫైబర్ ఉండటం, పైగా రోజురోజుకూ పెరుగుతున్న కూర్చునే జీవనశైలి ఇవే యువతలోనే దీర్ఘకాలిక రుగ్మతలు వేగంగా పెరగడానికి కారణం అఅని అమెరికాలోని Physicians Committee for Responsible Medicine (PCRM)కు చెందిన పోషకాహార నిపుణుడు డా. జీషాన్ అలీ తెలిపారు.ఇటీవల ఎం. ఎన్. ఆర్. మెడికల్ కాలేజీలో జరిగిన హెల్త్ సైన్స్ కార్యక్రమంలో మెడికల్ విద్యార్థులతో డాక్టర్ జీషాన్ అలీ మాట్లాడుతూ.. తృణ ధాన్యాలు, కూరగాయలు, పండ్లపై ఆధారపడిన ప్లాంట్-బేస్డ్ ఆహారం భుజించడం, జీవనశైలిలో మార్పులు తదితరాలు మెటాబాలిక్ రిస్క్లను గణనీయంగా తగ్గించగలదని పేర్కొన్నారు. అంతేగాదు ఇటీవల 48 మంది హృదయ రోగులపై నిర్వహించిన ఐదేళ్ల అధ్యయన వివరాలను కూడా వెల్లడించారు.తక్కువ కొవ్వు ఉన్న శాకాహారాన్ని పాటిస్తూ, తేలికపాటి కార్డియో వ్యాయామం చేసిన వారిలో రక్తనాళాల ఇరుకుదనం స్పష్టంగా తగ్గిందని చెప్పారు. మొదటి ఏడాదిలో 1.75 శాతం మెరుగుదల కనిపించగా, ఐదేళ్లకు ఇది 3.1 శాతానికి చేరిందన్నారు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పులు చేయకుండా కేవలం సాధారణ వైద్య చికిత్స మాత్రమే తీసుకున్న రోగుల్లో వ్యాధి మరింతగా పెరిగినట్టు అధ్యయనం వెల్లడించిందని తెలిపారు.(చదవండి: కొత్తిమీర పంటతో జస్ట్ 30 రోజుల్లోనే రూ.లక్ష లాభం!.. శెభాష్) -
40 ఏళ్ల సేవలు, రూ. 35 లక్షలు..ఎన్ఆర్ఐకి అరుదైన గౌరవం!
ఒక ఉద్యోగికగా తాను చేసిన సేవలకు గుర్తింపు లభించడం అంటే ఆస్కార్ వరించినంత ఆనందం. అది వ్యక్తిగత లేదా,బహిరంగ ప్రశంస అయినా, అవార్డులు, రివార్డు, నగదు బహుమతి అయినా, ఏదైనా ఎంత చిన్నదైనా కూడా గొప్ప గౌరవమే. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాదు, నిబద్దతను పెంచుతుంది. తమ కృషికి విలువ లభిస్తుందనే భావన, ఆరోగ్యకరమైన పోటీ, పనితీరును మెరుగుకు దారితీస్తుంది. అంతిమంగా ఇది సంస్థకు ఎనలేని మేలు చేస్తుంది. ఇపుడు ఇదంతా ఎందుకూ అంటే.. భారత సంతతి వ్యక్తికి తన సంస్థనుంచి లభించిన అరుదైన గౌరవంగా నెట్టింట హాట్ టాపిక్గా మారింది.మెరికాలోని మసాచుసెట్స్లో ఉన్న మెక్డొనాల్డ్స్లో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన ఉద్యోగి బల్బీర్ సింగ్ను సంస్థ చాగా గొప్పగా సత్కరించుకుంది 40 ఏళ్ల పాటు అంకిత భావంతో పనిచేసిన మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ లిండ్సే వాలిన్కు సుమారు రూ. 35 లక్షల బహుమతిని (40 వేల డాలర్లు) అందించింది. ఈవెంట్ వేదిక వద్దకు బల్బీర్ సింగ్ను లిమోజిన్ కారులో తీసుకువచ్చి, రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి మరీ దీనికి సంబంధించిన చెక్కును అందించారు. అలాగే సేవా పురస్కారం, స్మారక "వన్ ఇన్ ఎయిట్" జాకెట్నుకూడా అందుకున్నారు. ఈసందర్బంగా ఫ్రాంచైజ్ యజమాని లిండ్సే వాలిన్ మాట్లాడుతూ, బల్బీర్ సింగ్ తమ సంస్థకు గుండెలాంటి వారని కొనియాడారు. మొత్తం తొమ్మిది అవుట్లెట్లను కలిగి ఉన్న లిండ్సే వాలిన్, సింగ్ ఈ విజయాన్ని ఇతర ఉద్యోగులతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. బల్బీర్ తనతో కలిసి చేసిన 40 ఏళ్ల ప్రయాణం గురించి చెప్పలేమని చెప్పలేననీ, తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగు రెస్టారెంట్లను చాలా గొప్పగా, అచంచల దృష్టితో నడుపుతున్నాడు ఆమె ప్రశంసించారు. చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరుబల్బీర్ సింగ్ కెరీర్బల్బీర్ సింగ్ 40 ఏళ్ల క్రితం భారతదేశం నుండి అమెరికాకు వచ్చిన కొద్ది రోజులకే మెక్డొనాల్డ్స్లో కెరీర్ ప్రారంభించారు. తొలుత 1985లో సోమర్విల్లేలోని రెస్టారెంట్ కిచెన్లో పనిచేశారు. అలా కష్టపడి, పూర్తి నిబద్ధతతో పనిచేసి, ఒక్కో మెట్టు ఎదుగుతూ తాను పనిచేస్తున్న సంస్థలోని తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగుంటిని పర్యవేక్షించే స్థాయికి చేరుకోవడం విశేషం. మొదట బల్పీర్ సింగ్ తన తండ్రి బాబ్కింగ్ వద్ద పనిచేసేవారని కంపెనీ మోటో అయిన వై నాట్ అనే పద్ధతిని స్వీకరించారని, ఇంకా ఎదగాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆలోచనా విధానమే మా విజయానికి కారణమని లిండ్సే వాలిన్. మరోవైపు ఈ కంపెనీలో పనిచేయడం తనకు చాలా గర్వకారణమంటూ సంతోషాన్ని ప్రకటించారు బల్బీర్ సింగ్ . -
ట్రంప్ అభయం.. ఓ థ్యాంక్స్ పడేస్తే పోలా!
ఎలాన్ మస్క్తో డొనాల్డ్ ట్రంప్ సంబంధాలు మళ్లీ మెరగవుతున్నాయా?.. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. మస్క్ వ్యాపారాల గురించి మాట్లాడిన ట్రంప్.. ఆయన వెంట తాను ఉన్నానంటూ అభయం ఇచ్చారు. దానికి మస్క్ బదులిచ్చిన తీరు నెట్టింట చర్చకు దారి తీసింది.అమెరికా-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో ట్రంప్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించిన పన్ను రాయితీ గురించి వివరించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు లాభదాయకంగా ఉందని.. కారు కొనుగోలు చేసే వారికి ఇంత రాయితీ ఎప్పుడూ లేదని అన్నారు. ఈ క్రమంలో మస్క్ను ఉద్దేశిస్తూ.. ‘‘ఇంత చేస్తున్నా కనీసం అతను నాకు సరైన థ్యాంక్స్ చెప్పాడా?” అంటూ అక్కడ ఉన్నవాళ్లను ఉద్దేశిస్తూ సరదాగా ప్రశ్నించారు. మధ్య తరగతి ప్రజలు ఒక మంచి టెస్లా కారు కొనుగోలు చేసి, దానికి రుణం తీసుకుంటే, ఆ రుణంపై వడ్డీకి మేము రాయితీ (డిడక్షన్) ఇస్తున్నాం. నువ్వు(మస్క్ను ఉద్దేశించి..) నిజంగా అదృష్టవంతుడివి. నేను నీతో ఉన్నాను ఎలాన్’’ అని ట్రంప్ చిరునవ్వుతో అన్నారు. దీంతో అక్కడ మళ్లీ నవ్వులు విరబూశాయి.అయితే ఈ ప్రసంగం జరిగిన కొన్ని గంటలకు.. మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు థ్యాంక్స్ చెబుతూ.. ఆయన అమెరికాకు, ప్రపంచానికి ఎంతో చేశారంటూ కొనియాడాడు. I would like to thank President Trump for all he has done for America and the world pic.twitter.com/KdK9VC2MLs— Elon Musk (@elonmusk) November 19, 20252024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ విపరీతంగా పని చేశారు. ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించడం, ఆయన కోసం విరాళాల సేకరణ ద్వారా తన బలమైన మద్దతు ప్రకటించారు. ప్రతిగా ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత.. మస్క్ను Department of Government Efficiency (DOGE) అనే కొత్త శాఖకు నాయకుడిగా నియమించారు. ఈ శాఖ ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, వ్యవస్థను సరళతరం చేయడం లక్ష్యాలతో పని చేసింది. మస్క్కు ట్రంప్ అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం సహజంగానే రిపబ్లికన్లకూ కోపం తెప్పించింది. ఈలోపు.. ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు తేవడాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా.. ఈ ఏడాది మే 30న తన డోజ్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆపై ట్రంప్ పాలనా నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒకానొక టైంలో ఇది ట్రంప్నే తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ బహిరంగానే విమర్శలు చేసుకుంటూ, వార్నింగులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది సాధారణంగానే మస్క్ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపెట్టింది. టెస్లా షేర్లు పడిపోయి భారీ నష్టాలను చవిచూసింది. నాసాతో స్పేస్ఎక్స్ ఒప్పందాలు దాదాపుగా రద్దయ్యే స్థితికి చేరుకున్నాయి. ఈ పరిణామాలన్నీ.. మస్క్ను రాజకీయ పార్టీ ప్రకటన వైపు అడుగులేయించింది. అంతేకాదు ట్రంప్ను ఇరకాటంలో పడేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి అంశాన్ని సైతం మస్క్ ప్రధానంగా ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే.. హఠాత్తుగా అన్నీ మరిచిపోయి ఈ ఇద్దరూ ఇలా ఇప్పుడు కలిసి కనిపిస్తున్నారు. ఆ మధ్య కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ స్మారక సభలో ఈ ఇద్దరూ కనిపించి సందడి చేశారు. మరోవైపు.. పాశ్చాత్య దేశాలతో.. ప్రత్యేకించి వాషింగ్టన్తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు సౌదీ యువరాజు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆయన్ను వైట్హౌజ్కు ఆహ్వానించి ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్కు టిమ్ కుక్, జెన్సెన్ హువాంగ్ , క్రిస్టియానో రొనాల్డో లాంటి ప్రముఖులు హాజరయ్యారు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ మస్క్ సందడి చేశారు. దీంతో అపర కుబేరుడికి మళ్లీ మంచిరోజులు వచ్చాయనే టాక్ నడుస్తోంది. -
106 కోట్లు పలికిన బంగారు టాయిలెట్
న్యూయార్క్: కొందరు టాయిలెట్కు వెళితే ముక్కు మూసుకుని వెళ్తారు. కానీ ఈ టాయిలెట్ వార్త తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. 18 కేరట్ల స్వచ్ఛత ఉన్న బంగారంతో తయారుచేసిన ఈ టాయిలెట్ను బుధవారం అమెరికాలో ప్ర ఖ్యాత సోత్బే వేలంపాట సంస్థ వేలంవేయగా ఏకంగా 106 కోట్ల రూపాయల ధర పలికింది. ఈ టాయిలెట్ బరువు 101 కేజీలు. ఇది సాధారణ టాయిలెట్ కమోడ్ మాదిరే ఫ్లష్తోసహా పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.2016లో తొలిసారిగా అమెరికాలో దీనిని న్యూయార్క్ గుగెన్హామ్ మ్యూజియంలోని పబ్లిక్ బాత్రూమ్లో అమర్చారు. దీనిని చూసేందుకు లక్షలాది మంది జనం ఎగబడ్డారు. గతంలో ఒక అరటిపండుకు టేప్ను అతికించి ఇది కూడా కళాఖండమే అని ప్రకటించి కోట్ల రూపాయలకు అమ్ముడుపోయేలా చేసిన ఇటాలియన్ వ్యంగ్య కళాకారుడు మారీజియో క్యాటెలాన్ ఈ టాయిలెట్ను రూపొందించారు. ఈ టాయిలెట్కు వినూత్నంగా ‘అమెరికా’ అని పేరు పెట్టారు. అమెరికాలో అపార సంపద దాగుందని వెటకారంగా దీనికి ఈ పేరు పెట్టానని మారీజియో గతంలో వ్యాఖ్యానించారు. 2019లో అచ్చం ఇలాంటి మరో బంగారు టాయిలెట్ను తయారు చేశారు. బ్రిటన్లో విన్స్టన్ చర్చిల్ జన్మించిన బ్లెన్హామ్ ప్యాలెస్లో ఉంచగా దొంగలు దీనిని సుత్తితో పగలగొట్టి ముక్కలుగా ఎత్తుకుపోయారు. -
అమెరికాలో ఆంధ్రా తల్లి,కొడుకుల హత్య కేసులో ట్విస్ట్
అనూహ్య పరిస్థితుల్లో భార్య బిడ్డలు చనిపోయి కనిపించారు. తీరని దుఃఖంలో ఉండగానే నువ్వే నిందితుడని బంధువులు ఆరోపించారు. అనుమానాలున్నాయంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిదేళ్ల తరువాత అసలు నిజం తెలిసింది. సంచలనంగా మారిన ఈ స్టోరీ వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.2017, మార్చి 23, ఆంధ్రప్రదేశ్కు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు అనిష్ న్యూజెర్సీలోని వారి అపార్ట్మెంట్లోశవాలై కనిపించారు. మహిళ భర్త నర్రా హనుమంతరావునే ప్రాథమికంగా నిందితుడిగా భావించారు. కానీ అనూహ్యం ఎనిమిదేళ్ల తరువాత నజీర్ హమీద్ అనే వ్యక్తిపై అభియోగాలు మోసారు. న్యూజెర్సీలోని ఒక కంపెనీలో శశికళ నర్రా భర్త సహోద్యోగే ఈ హత్యలకు పాల్పడినట్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు.శశికళ, అనిష్ హత్యఏపీకి చెందిన నర్రా హనుమంతరావు న్యూజెర్సీలోని మాపుల్ షేడ్లోని ఫాక్స్ మేడో అపార్ట్మెంట్స్లో భార్య శశికళ నర్రా(38), 6 ఏళ్ల కుమారుడు అనిష్తో కలిసి ఉండేవారు. ఒక రోజు ఆఫీసునుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు ఒళ్లంతా రక్తమోడుతూ తీవ్రమైన కత్తిపోట్లతో చనిపోయి కనిపించారు. వెంటనే హనుమంత రావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని బంధువులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు హనుమంతరావును అరెస్ట్ చేశారు. ఈ సమయంలో దర్యాప్తు అధికారులు తమ విచారణలో భాగంగా సంఘటనా స్థలంనుంచి రక్తపు మరకల నమూనాలను సేకరించి, డీఎన్ఏ పరీక్షలు చేయించారు. అయితే అది హనుమంతరావు డీఎన్ఏతో మ్యాచ్ కాకపోవడంతో ఇది మరో మలుపు తిరిగింది.ఎలా ఛేదించారంటే..బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్ చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పాట్రిక్ థోర్న్టన్ అందించిన వివరాల ప్రకారం హనుమంతరావు ఇంటికి సమీపంలోనే ఉండే హమీద్ మధ్య గొడవలు ఉన్నట్టు గురించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో పనిచేస్తున్న సమయంలో హను నర్రాను వేధించినట్లు గతంలో నజీర్ హమీద్ పై ఆరోపణలు రావడంతో ఆ వైపుగా దర్యాప్తు మెుదలుపెట్టారు. డీఎన్ఏ నమూనాను సేకరించాలనే ఉద్దేశంతో అధికారులు 2024లో కోర్టుకు వెళ్లారు. కాగ్నిజెంట్ కంపెనీ,హమీద్కు జారీ చేసిన ల్యాప్టాప్ను తమకు పంపమని కోరారు. చివరికి ల్యాప్టాప్ నుండి డీఎన్ఏ సేకరించారు అధికారులు. నేరస్థలంలో దొరికిన నమూనాతో హమీద్ డీఎన్ఏ సరిపోలడంతో గుట్టు రట్టయింది.మరోవైపు జంట హత్యలు జరిగిన 6 నెలల తర్వాత హమీద్ ఇండియాకు చెక్కేశాడు. అయినా కాగ్నిజెంట్ ఉద్యోగిగా కొనసాగాడు. అంతేకాదు అమెరికా పోలీసులు హమీద్ డీఎన్ఏ కోసం చాలాసార్లు ప్రయత్నించారు. భారతీయ అధికారుల ద్వారా సంప్రదించినా స్పందించలేదు. చివరికి అతడి ల్యాప్ట్యాప్ మీద నమూనాల ఆధారంగా కేసును ఛేదించారు. మరోవైపు హమీద్ను అమెరికాకు రప్పించేందుకు భారత విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరుఈ దారుణమైన హత్యల వెనుక హమీద్ ఉద్దేశం ఏమిటనేది దర్యాప్తు అధికారులకు స్పష్టత లేదు కానీ హనుమంతరావుపై కోపంతోనే అతడి భార్య శశికళ, కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఇన్వెస్టర్ల క్యూ : కొత్త ఐటీ నగరం వచ్చేస్తోంది! -
అమెరికా నుంచి భారత్కు గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్..
-
ఎన్ఐఏ కస్టడీకి అన్మోల్ బిష్ణోయ్
న్యూఢిల్లీ: అమెరికా నుంచి వచ్చిన గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను ఢిల్లీలోని న్యాయస్థానం 11 రోజులపాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కస్టడీకి అప్పగిస్తూ బుధ వారం ఉత్తర్వులు జారీచేసింది. కరడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు సోదరుడైన అన్మోల్ను గత ఏడాది అరెస్ట్చేసిన అమెరికా మంగళవారం దేశం నుంచి బహిష్కరించి ప్రత్యేక విమానంలో భారత్కు తరలించింది. ఆ విమానం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకోగానే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్చేశారు. సాయంత్రం ఢిల్లీలోని పటియాలా కోర్టుల ప్రాంగణంలోని కోర్టులో జడ్జి ప్రశాంత్ శర్మ ఎదుట హాజరుపరిచారు. లోతుగా విచారించేందుకు తమకు 15 రోజులపాటు అన్మోల్ను అప్పగించాలని కోరారు. దీంతో 11 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ప్రశాంత్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. నేరముఠాలకు, ఉగ్రవాద సంస్థలకు మధ్య సంబంధాల కేసులో అన్మోల్ను అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి చెప్పారు. 2024 అక్టోబర్లో మహారాష్ట్ర ఎన్సీపీ నేత, మాజీమంత్రి బాబా సిద్ధిఖీ హత్య, 2024 ఏప్రిల్లో ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు, 2022లో ప్రముఖ పంజాబీ యువ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతంలోనూ అన్మోల్పై గతంలో అభియోగాలు మోపారు. హత్యలు, బెదిరింపు వసూళ్లు చేసే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్స్టర్ సిండికేట్లో అన్మోల్ అరెస్ట్తో ఇప్పటిదాకా అరెస్టులు 19కి పెరిగాయి. -
H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత భారత ఐటీ కంపెనీలకు, ఐటీ నిపుణులకు భారీ ఎదురుదెబ్బ గిలింది. 2025 ఆర్థిక సంవత్సరంలో H-1B వీసా దరఖాస్తులను భారతీయ కంపెనీలు గణనీయంగా తగ్గించేశాయి. బ్లూమ్బెర్గ్ లెక్కల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గాయి. మరోవైపు ఈ పరిణామం అమెరికా ఉద్యోగులను నియామకాలకు దారి తీస్తోంది. శరవేగంగా మారుతున్న సాంకేతిక మార్పులు, భారతదేశం నుండి రిమోట్గా ప్రాజెక్టులను అమలు చేసే సామర్థ్యం పెరుగుదలను ప్రతిబింబిస్తుందని నిపుణులు తెలిపారు.గత దశాబ్ద కాలంతో పోలిసతే ఇది మరింత తీవ్రంగా ఉంది. తీవ్రంగా ఉంది; టాప్ ఏడు భారతీయ సంస్థలు H-1B అప్లికేషన్స్ను 70శాతం తగ్గించాయి. 2025లో, కేవలం 4,573 ప్రారంభ ఉపాధి (initial employment) ఆమోదాలను మాత్రమే పొందారు. అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు H-1B వినియోగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. USCIS డేటా NFAP విశ్లేషణ ప్రకారం, అమెజాన్ 4,644 ప్రారంభ ఆమోదాలతో టాప్లో ఉండగా, మెటా (1,555), మైక్రోసాఫ్ట్ (1,394), గూగుల్ (1,050) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆపిల్ ఆరో స్థానంలో నిలిచింది. నాలుగు అమెరికన్ టెక్ కంపెనీలు తొలి నాలుగు స్థానాలను ఆక్రమించడం ఇదే మొదటిసారి.చదవండి: ఎనిమిదేళ్లనాటి దారుణ హత్యలు : క్లూ ఇచ్చిన ల్యాప్ట్యాప్భారతీయ ఐటీ సంస్థలు టాప్ నుంచి కిందికి పడిపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మొత్తం మీద ఐదో స్థానంలో నిలిచింది, కానీ LTIMindtree (20వ స్థానం), HCL అమెరికా (21వ స్థానం) టాప్ 25లో చోటు దక్కించుకోలేకపోయాయి. దీనికి ఐటీలో నిర్మాణాత్మక మార్పులు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆన్షోర్ ఉద్యోగులు ,రిమోట్ ఎగ్జిక్యూషన్ మోడల్లపై సంస్థలు ఎక్కువగా ఆధారపడుతున్నాయన్నారు. ట్రంప్ కొత్త వీసావిధానం, ప్రతీ కొత్త H-1B కోసం 100,000 డాలర్ల ఫీజు లాంటి వాటికారణంగా కంపెనీల దృక్పథంలో మరింత మార్పువస్తుందని భావిస్తున్నారు.అత్యధిక H-1B వీసాలు ఇక్కడే ఇనీషియల్ ఎంప్లాయ్మెంట్ కోసం 21,559 దరఖాస్తులతో H-1B వీసాల ఆమోదాల జాబితాలో కాలిఫోర్నియా అగ్రస్థానంలో ఉంది, తరువాత టెక్సాస్ (12,613), న్యూయార్క్ (11,436), న్యూజెర్సీ (7,729), వర్జీనియా (7,579) ఉన్నాయి.న్యూయార్క్ నగరం అత్యధిక సంఖ్యలో కొత్త ఆమోదాలను (7,811) నమోదు చేసింది, ఆర్లింగ్టన్, చికాగో, శాన్ జోస్, శాంటా క్లారా, శాన్ఫ్రాన్సిస్కో కూడా ప్రముఖ నగరాలుగా ఉన్నాయి. ప్రొఫెషనల్ , టెక్నికల్ సర్వీసెస్, విద్య, తయారీ, సమాచారం, ఆరోగ్య సంరక్షణ మరియు ఫైనాన్స్ వంటి రంగాలలో H-1B వీసాలకు ప్రాధాన్యత లభించింది. ఇదీ చదవండి: BMW కారు బీభత్సం : భారత సంతతి గర్భిణి దుర్మరణం -
గ్యాంగ్స్టర్ అన్మోల్ను అప్పగించిన అమెరికా
ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో కీలక నిందితుడు, గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణో య్ను అమెరికా నుంచి రప్పిస్తున్నట్లు మంగళవారం ముంబై పోలీసులు తెలిపారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద ఏప్రిల్ 2024లో జరిగిన కాల్పుల కేసులోనూ ఇతడు వాంటెడ్గా ఉన్నాడన్నారు. అమెరికా నుంచి ఇతడు బుధవారం ఢిల్లీకి చేరుకుంటాడని పోలీసులు వివరించారు. అన్మోల్ బిష్ణోయ్పై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులున్నాయని, ముందుగా అతడిని ఎవరికి అప్పగించాలనేది కేంద్రం నిర్ణయిస్తుందన్నారు. తాము కూడా అతడి కస్టడీని కోరుతామన్నారు.అమెరికా, కెనడా మధ్య రాకపోకలు సాగిస్తున్న అన్మోల్ బిష్ణోయ్ను ఇటీవల కెనడా అధికారులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడి వద్ద ఫోర్జరీ చేసిన రష్యా పాస్పోర్టు ఉన్నట్లు సమాచారం. ఇతడి తలపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. 2022లో జరిగిన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ ఇతడి పేరు బయటకు వచ్చింది. 2024 అక్టోబర్ 12వ తేదీ రాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తన కుమారుడు జీషన్తో కలిసి ఉండగా మాజీ మంత్రి బాబా సిద్దిఖీని దుండగులు కాల్చి చంపడం తెల్సిందే. -
గ్రామాలను దత్తత తీసుకున్న శంకర నేత్రాలయ USA మిల్వాకీ దాతలు
శంకర నేత్రాలయ USA నిర్వహించిన మిల్వాకీలో ఒక చిరస్మరణీయ రాత్రి, అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాలకు మద్దతుగా $50,000(రూ. 43 లక్షలు) దాక సేకరించారు. భారతదేశంలోని పేద వర్గాలకు కంటి శస్త్రచికిత్సలు చేయడానికి రూపొందించబడిన అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమానికి మద్దతుగా శంకర నేత్రాలయ USA లైట్ మ్యూజికల్ కన్సర్ట్ను నిర్వహించడంతో పెవాకీలోని విస్కాన్సిన్ హిందూ దేవాలయం సంస్కృతి, కరుణల శక్తిమంతమైన వేదికగా రూపాంతరం చెందింది. ఈ కార్యక్రమం దాదాపు ౩50 మంది ప్రేక్షకులతో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమైంది. గ్రామీణ భారతదేశంలో నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంలో సమాజం, కళ, సేవ, శక్తిని ప్రదర్శించింది. వారి ప్రారంభ వ్యాఖ్యలలో, పాలకమండలి సభ్యుడు చంద్ర మౌళి సరస్వతి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్-మిల్వాకీ సత్య జగదీష్ బాదం ఇలా పంచుకున్నారు. “మిల్వాకీ సేవా స్ఫూర్తితో పసిగడుతుంది. ఈ రాత్రి, మేము కలిసి వచ్చాం. కేవలం సేకరించడానికికాదు, ఉమ్మడి ఉద్దేశ్యం ద్వారా జీవితాలను ప్రకాశవంతం చేయడానికి.” "శంకర నేత్రాలయ USA టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లోకి తన పరిధిని విస్తరిస్తూనే ఉంది. దృష్టి లోపాలతో బాధపడుతున్న నిరుపేద వ్యక్తులకు సేవ చేయాలనే మా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మిల్వాకీ నుంచి ఉత్సాహభరితమైన మద్దతు మాకు ప్రోత్సాహాన్నిచ్చింది" అని శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందూర్తి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం జయప్రదం కావడంలో..పాలకమండలి సభ్యుడు చంద్ర మౌళి సరస్వతి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ సత్య జగదీష్ బాదం, కమిటీ సభ్యులు డాక్టర్ హరి బండ్ల, పోలిరెడ్డి గంటా, చాప్టర్ లీడ్స్ మహేష్ బేలా మరియు అర్జున్ సత్యవరపు, వాలంటీర్లు ఆనంద్ అడవి, సాయి యార్లగడ్డ, రవి నాదెళ్ల, శ్రీని కిలిచేటి, చండీ ప్రసాద్, క్రాంతి మల్రెడ్డి, గుప్తా కళ్లేపల్లి, పవన్ శ్రీభాష్యం, విజయ్ వల్లూరి, చంద్రశేఖర్ గుడిసె, కరుణాకర్ రెడ్డి దాసరి, రత్నాకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, కొండారెడ్డి, వెంకట్ శశి కొద్దంరెడ్డి, వౌనద్ శవధరి, వెంకట్ జాలరి రెడ్డి రెడ్డి, గోపాల్ గారు, రాజా బాబు నేతి, విక్రాంత్ రెడ్డి, గోపాల్ సింగ్, శ్రీనివాస్ నిమ్మ, రంజిత్, శ్రావణి మీసరగండ, వాసవి బాదం, ప్రీతి, కీర్తి, లావణ్య, సునీత, పావని గంట, చంద్రిక, సంతోషి, భాను, సరోజిని, కావ్య వి, రాధిక పెబ్బేటి, శరణ్య రాఘవ, శరణ్య జాలరి, కిరణ్య జ్ఙాపక ముత్తూరు, డీఎస్ రెడ్డి, రవి కుమార్ గుంత, రమేష్ పుసునూరు, శ్రీనివాస్ యూర్కేరి, ప్రమోద్ అల్లాణి, పవన్ జంపాని, ప్రీతి శర్మ, అనిల్ పబ్బిశెట్టి. రాజ్ వధేరాజ్, యాజులు దువ్వూరు, ఫణి చప్పిడి, దుర్గ, ధనలక్ష్మి, కార్తీక్ పాసెం, భారతి కొల్లి, ఉమాదేవి పువ్వాడి, దుర్గా బండారుపల్లి, వెంకట కుందూరి, డా. రెడ్డి ఊరిమిండి, మూర్తీ రేకపల్లి,శ్యాంఅప్పాలి, వంశీ ఏరువారం, రత్నకుమార్కవుటూరు, త్యాగరాజన్, దీన్ దయాళన్, సురేశ్ కుమార్లు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన బృందం శంకర నేత్రాలయ సేవా లక్ష్యం పట్ల అంకితభావం, సహకారం, భాగస్వామ్య నిబద్ధతను ఉదహరించారు. చంద్ర మౌళి తమ వందన సమర్పణలో కార్యక్రమ వ్యాఖ్యాతలు మాలతి కర్రి, శ్రీ వల్లిల సహకారాన్ని గుర్తించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు . -
ఎగుమతులు డీలా
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్లు మన దేశ ఎగుమతులపై అక్టోబర్లో చెప్పుకోతగ్గ ప్రభావమే చూపించాయి. వస్తు ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 11.8 శాతం తక్కువగా 34.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే నెలలో దిగుమతులు 16.63 శాతం అధికమై 76.06 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 41.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్లను అమలు చేస్తుండడం తెలిసిందే. సేవల ఎగుమతులు 38.52 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో సేవల ఎగుమతులు 34.41 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. → బంగారం దిగుమతులు 200 శాతం అధికమై 14.72 బిలియన్ డాలర్లకు చేరాయి. 2024 అక్టోబర్లో పసిడి దిగుమతుల విలువ 4.92 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చూసినా బంగారం దిగుమతులు 21.44 శాతం పెరిగి 41.23 బివలియన్ డాలర్లకు చేరాయి. → వెండి దిగుమతులు ఏకంగా 529 శాతం పెరిగి 2.71 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → చమురు దిగుమతులు మాత్రం 14.8 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2024 అక్టోబర్లో చమురు దిగుమతులు 18.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే చమురు దిగుమతుల స్థాయికి బంగారం దిగుమమతులు చేరినట్టు తెలుస్తోంది. → ఇంజనీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాభరణాలు, అపారెల్స్, టెక్స్టైల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ప్లాస్టిక్ గూడ్స్ ఎగుమతులు చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గాయి. ఇక చేతి ఉత్పత్తులు, కార్పెట్, లెదర్, ఐరన్ఓర్, టీ, రైస్, పొగాకు, దినుసుల ఎగుమతులు మరింత క్షీణించాయి. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో ఎగుమతులు 254.25 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 0.63 శాతం ఎక్కువ. ఇదే కాలంలో దిగుమతులు 6.37 శాతం పెరిగి 451.08 బిలియన్ డాలర్లకు చేరాయి. తొలి ఆరు నెలల్లో వస్తు వాణిజ్య లోటు 196.82 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో 5 శాతం బంగారం దిగుమతుల విలువ మొత్తం ఎగుమతుల్లో 5 శాతంగా ఉండడం గమనార్హం. అయితే, పసిడి దిగుమతులు భారీగా పెరగడానికి పండుగల సమయంలో డిమాండ్ కారణమని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేజ్ అగర్వాల్ పేర్కొన్నారు. బంగారం దిగుమతుల్లో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచి రాగా, యూఏఈ నుంచి 16 శాతం, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం చొప్పున దిగుమతైంది. -
అమెరికాతో భారత్ ఎల్పీజీ డీల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు ఏడాదిపాటు యూఎస్ నుంచి వంట గ్యాస్(ఎల్పీజీ) కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకున్నాయి. డీల్లో భాగంగా 2026వరకూ 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకోనున్నాయి. దీంతో యూఎస్ నుంచి భారత ప్రభుత్వం ఇంధన కొనుగోళ్లను పెంచుకోనుంది. తద్వారా యూఎస్తో వాణిజ్య మిగులును తగ్గించుకోనుంది. దేశీ వస్తువులపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 50% టారిఫ్లను విధించిన నేపథ్యంలో తాజా డీల్కు ప్రాధాన్యత ఏర్పడింది. దేశీ పీఎస్యూ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్.. యూఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి ఎల్పీజీ దిగుమతికి ఏడాదిపాటు అమల్లో ఉండే కాంట్రాక్టుకు తెరతీసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. భారత వార్షిక ఎల్పీజీ దిగు మతుల్లో ఇది 10% కాగా, దేశీ మార్కెట్లకు యూఎస్ ఎల్పీజీ సరఫరాపై తొలి కాంట్రాక్టుగా నిలవనుంది. 31 మిలియన్ టన్నులు పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధనం విషయంలో భారత్ స్వయం సమృద్ధిని సాధించినప్పటికీ.. దేశీయంగా వినియోగించే 31 మిలియన్ టన్నుల ఎల్పీజీలో 65 శాతంవరకూ దిగుమతి చేసుకుంటోంది. 2024లో దిగుమతి చేసుకున్న 20.4 మిలియన్ టన్నులలో 90 శాతంవరకూ యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి లభించింది. గత రెండు నెలలుగా యూఎస్తో భారత్ నిర్వహిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలలో భాగంగా వంట గ్యాస్ దిగుమతులకు తెరతీసింది. మరోపక్క పెట్రోల్, డీజిల్ తదితరాలను ప్రాసెస్ చేసేందుకు వీలయ్యే ముడిచమురులో 8 శాతంవరకూ యూఎస్ నుంచి కొనుగోలు చేస్తోంది. 51 శాతం అధికం ఈ ఏడాది(2025) తొలి అర్ధభాగంలో యూఎస్ నుంచి రోజుకి 2,71,000 బ్యారళ్ల(బీపీడీ) ముడిచమురు ను భారత్ దిగుమతి చేసుకుంది. 2024 తొలి ఆరు నెలల దిగుమతులతో పోలిస్తే ఇవి 51 శాతం అధికం. చారిత్రాత్మకం ప్రపంచంలోనే వేగవంత వృద్ధిలో ఉన్న, భారీ ఎల్పీజీ మార్కెట్ అయిన భారత్ తొలిసారి యూఎస్తో డీల్ కుదుర్చుకున్నట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది చారిత్రాత్మకంకాగా.. తద్వారా దేశ ప్రజలకు అందుబాటు ధరలో ఎల్పీజీ సరఫరాలకు తెరతీసినట్లు చెప్పారు. -
ఇక అమెరికా నుంచి ఎల్పీజీ గ్యాస్..
భారత్కు ఇక అమెరికా నుంచి ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ) దిగుమతి కానుంది. ఈమేరకు భారత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు యూఎస్ ఉత్పత్తిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.‘ఇది చరిత్రలో తొలిసారి! అతిపెద్ద, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎల్పీజీ మార్కెట్లలో ఒకటైన భారత్ యునైటెడ్ స్టేట్స్కు తెరుచుకుంటోంది. భారత దేశ ప్రజలకు తక్కువ ఖర్చులో సురక్షితమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఎల్పీజీ సోర్సింగ్ ను వైవిధ్యభరితం చేస్తున్నాం. భారతీయ పీఎస్యూ చమురు కంపెనీలు ఒక సంవత్సరానికి దాదాపు 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీ దిగుమతి చేసుకునేలా ఒప్పందాన్ని విజయవంతంగా కుదుర్చుకున్నాయి.’ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా కేంద్ర మంత్రి వెల్లడించారు.ఒప్పందం ప్రకారం.. 2026 సంవత్సరానికి గానూ 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీ భారత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు అమెరికా ఉత్పత్తిదారుల నుంచి దిగుమతి చేసుకోనున్నాయి. యూఎస్ గల్ఫ్ తీరం నుంచి దిగుమతి చేసుకోనున్న ఈ దిగుమతుల పరిమాణం భారతదేశ మొత్తం వార్షిక ఎల్పీజీ దిగుమతులలో 10 శాతం మేర ఉండనుంది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) బృందాలు ప్రధాన అమెరికన్ ఉత్పత్తిదారులతో చర్చలు జరపడానికి ఇటీవలి నెలల్లో అమెరికాను సందర్శించాయని, అవి ఇప్పుడు విజయవంతంగా ముగిశాయని ఆయన తెలిపారు. A historic first!One of the largest and the world’s fastest growing LPG market opens up to the United States. In our endeavour to provide secure affordable supplies of LPG to the people of India, we have been diversifying our LPG sourcing. In a significant development,…— Hardeep Singh Puri (@HardeepSPuri) November 17, 2025 -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై దాదాపు 500 శాతం సుంకాలు విధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. రెండు దేశాల యుద్ధం ముగించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో భేటీ కూడా అయ్యారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అది సాధ్యం కాకపోవడంతో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ పెద్దమొత్తంలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా దాదాపు విఫలం కావడంతో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు సహకరిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్ప ప్రస్తుతం తమ దేశానికి వేరే మార్గం లేదని ట్రంప్ పేర్కొన్నారు.రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్లు విధిస్తానన్నారు. సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు తాజాగా ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ దేశాల జాబితాలో భారత్, చైనా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ను కూడా ఇందులో చేర్చనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తున్నామన్నారు. భారత్, చైనాలే ఆ దేశం నుంచి 70శాతం చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడనుంది. BREAKING:US president Trump approves bill allowing tariffs up to 500% on countries trading with Russia. pic.twitter.com/Lko3wXVuLU— Recon & surveillance (@Recon_surv) November 17, 2025 -
అమెరికాలో కొత్త వైరస్ కలకలం
అమెరికాలో కొత్త రకం వైరస్ కలకలం రేపుతోంది. వాషింగ్టన్ కు చెందిన ఓవ్యక్తికి బర్డ్ ప్లూ సోకడంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి " హెచ్5 ఎన్5 ఏవియన్ ఇన్ప్లూయింజా" అనే కొత్తరకం వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇటువంటి వైరస్ మానవులలో సోకడం ఇది మెుదటిసారని డాక్టర్లు తెలిపారు.వాషింగ్టన్ లోని ఓ వ్యక్తికి "ఎచ్5ఎన్5 ఏవియన్ ఇన్ప్లూయింజా" వైరస్ సోకడం ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది. సాధారణంగా ఈ వైరస్ మనుషులకు అంటుకోదని కానీ ఈ వ్యక్తికి ఎలా సోకిందనే విషయాలను అధ్యయనం చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. బాధితుడు బహుశా కోళ్ల ద్వారనే వైరస్ వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు.అయితే ఈ వైరస్ సోకిన వ్యక్తి వృద్ధుడని అతనికి ఇతర ఆరోగ్యసమస్యలున్నాయని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా ఇన్ప్లూయింజా వైరస్ జంతువులలోనే వ్యాపిస్తుందని ఈ వైరస్ సోకిన జంతువుల లాలాజలం, మలపదార్థాలు, పాడి పశువుల పాల ద్వార వేరే ప్రాణులకు సోకే అవకాశం ఉందని తెలిపారు. ఇది ఒకప్రాణి నుంచి మరోప్రాణికి సోకే అవకాశం శీతాకాలంలో మరింత అధికంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నామని వారికి కూడా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్లు పేర్కొన్నారు.అమెరికాలో బర్డ్ ప్లూ వైరస్ కేసు రావడం గడిచిన తొమ్మిది నెలల్లో ఇదే తొలిసారని అక్కడి వైద్యశాఖ ప్రకటించింది. ఈ వైరస్ మనుషులలలో అంత ప్రభావం చూపే అవకాశాలు లేవని అయితే అలా అని దానిని తేలికగా తీసుకోకూడదని డాక్టర్లు తెలిపారు. బర్డ్ ప్లూ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్త పాటించాలని ఆరోగ్యశాఖ తెలిపింది. కోళ్ల పరిశ్రమలలో విధులు నిర్వహించే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
ఆ ముస్లిం దేశాలపై ట్రంప్ యుద్ధం?
-
హెచ్–1బీ పూర్తిగా బంద్
వాషింగ్టన్: వృత్తి నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు వరంగా ఉన్న హెచ్–1బీ వీసా పథకాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు అమెరికా ప్రజా ప్రతినిధి ఒకరు ప్రయత్నాలు ప్రారంభించారు. హె1బీ కలిగిన వారు అనంతరం అమెరికా పౌరసత్వానికి అర్హులయ్యే అవకాశముంది. అయితే, తాజా ప్రయత్నాల కారణంగా ఈ వెసులుబాటుకు తెరపడనుంది. ఇకపై వీసా గడువు ముగిసిన వెంటనే ఎవరైనా స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ‘దశాబ్దాలుగా హెచ్–1బీ ప్రోగ్రాంలో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయి. అమెరికన్ల అవకాశాలను విదేశీయులు ఎగరేసుకుపోతున్నారు. అందుకే, హెచ్–1బీని ఆసాంతం రద్దు చేసేందుకు బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటున్నాను’అంటూ కాంగ్రెస్ మ ర్జొరీ టేలర్ గ్రీన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కీలకమైన వైద్య రంగానికి అవసరమైన వైద్యులు, నర్సుల కోసం మాత్రం ఏడాదికి 10 వేల వరకు వీసాలను మంజూరు చేసేందుకు వీ లుండేలా ప్రతిపాదనలను రూపొందిస్తున్నామన్నారు. పదేళ్ల తర్వాత ఈ వెసులుబాటు కూడా రద్దవుతుందన్నారు. విదేశీయుల స్థానంలో అమెరికా పౌరులే వైద్యులు, నర్సు ల స్థానాలకు ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వివరించారు. వివిధ వీసాలపై ఇక్కడికి వచ్చే ప్రత్యేక వృత్తి నిపుణులు నిరీ్ణత కాల పరిమితి ముగిశాక తిరిగి స్వదేశాలకు వెళ్లిపోవాలే తప్ప, శాశ్వతంగా నివాసం ఉండేందుకు అనుమతించరాదని మర్జొరీ టేలర్ అభిప్రాయపడ్డారు. అమెరికా పౌరులు కాని వైద్య విద్యార్థుల కోసం ప్రస్తుతమున్న మెడికేర్ పథకాన్ని కూడా ఎత్తివేయాలన్నారు. ఒక్క 2023లోనే విదేశాల్లో జని్మంచిన 5 వేల మందికిపైగా డాక్టర్లకు దేశంలో అవకాశాలు దొరికాయని తెలిపారు. 2024లో అమెరికాలో వైద్యవిద్యనభ్యసించిన 9 వేల మంది మాత్రం అవకాశాల్లేక విదేశాలకు వెళ్లిపోయారని టేలర్ తెలిపారు. ఇలా అమెరికన్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఏడాదికి 65 వేల మంది వృత్తి నిపుణులతోపాటు మరో 20 వేల మంది అడ్వాన్స్డ్ డిగ్రీ హోల్డర్లకు రెగ్యులర్ హెచ్–1బీ వీసాలిచ్చేందుకు కాంగ్రెస్ వీలు కలి్పస్తోంది. ఈ అవకాశాన్ని ప్రైవేట్ సంస్థలు వినియోగించుకుని, విదేశీ నిపుణులను రప్పిస్తున్నాయి. హెచ్–1బీతో లాభం పొందే వారిలో భారతీయ నిపుణులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వైద్యులు అత్యధికంగా ఉన్నారు. అయితే, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్ హెచ్–1బీపై తీవ్ర ఆంక్షలు విధిస్తుండటం తెల్సిందే. అర్హులైన హెచ్–1బీ దరఖాస్తుదారులు లక్ష డాలర్లు చెల్లించాలంటూ ఆయన నిబంధన తీసుకువచ్చారు. -
బై బై పెన్నీ
వాషింగ్టన్: అమెరికాలో 232 ఏళ్ల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన పెన్నీ(అధికారికంగా సెంట్) కథ ముగిసింది. ఫిలడెల్ఫీయాలోని అమెరికన్ టంకశాల(మింట్) చివరి పెన్నీని బుధవారం మధ్యాహ్నం ముద్రించింది. ఆ తర్వాత పెన్నీల ప్రింటింగ్ శాశ్వతంగా నిలిచిపోయింది. పెన్నీల తయారీని ఆపేయడం ద్వారా 56 మిలియన్ డాలర్ల ప్రజాధనం ఆదా చేయబోతున్నట్లు కోశాధికారి బ్రాండన్ బీచ్ చెప్పారు. ఈ నాణేల తయారీని ఎందుకు నిలిపివేశారన్నది చర్చనీయాంశంగా మారింది. వాటి అసలు విలువ కంటే తయారీ ఖర్చే ఎక్కువ కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఒక్కో పెన్నీ తయారీ ఖర్చు పదేళ్ల క్రితం 1.42 సెంట్లుగా ఉండేది. ఇప్పుడు అది ఏకంగా 3.69 సెంట్లకు పెరిగిపోయింది. దాంతో తయారీని ఆపేయడానికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గుచూపారు. ఒక్కో నాణెంపై 2 సెంట్లకుపైగా నష్టపోవాల్సి వస్తోందని, అదంతా వృథా ఖర్చు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే చాలా నష్టపోయామంటూ ఆన్లైన్లో పోస్టు చేశారు. ఒక్కో నాణేం ధర లక్ష డాలర్లు? అమెరికా మింట్ గణాంకాల ప్రకారం చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో 5.61 బిలియన్ డాలర్ల విలువైన నాణేలు చలామణిలో ఉండగా, అందులో పెన్నీల వాటా 57 శాతం(3.2 బిలియన్ డాలర్లు). వెండింగ్ యంత్రాల నుంచి క్యాండీలు, చాక్లెట్లు కొనడానికి, పార్కింగ్ టికెట్లకు డబ్బులు చెల్లించడానికి సాధారణంగా పెన్నీలు ఉపయోగిస్తుంటారు. కానీ, కొన్నేళ్లుగా వీటి వాడకం తగ్గిపోయింది. నాణేలు సేకరించేవారు మాత్రం వీటిని దాచుకుంటున్నారు. కొత్త పెన్నీలను మార్కెట్లోకి తీసుకురావడం కొన్ని నెలల క్రితమే నిలిపివేశారు. ఒమేగా గుర్తు ఉన్న ప్రత్యేక పెన్నీలను మాత్రం చివరిసారిగా ముద్రించారు. వీటిని డిసెంబర్లో వేలం ద్వారా విక్రయించబోతున్నారు. ఇవి గుర్తుగా దాచుకోవడానికే ఉపయోగపడతాయి. బుధవారం ఈ రకం నాణేలను 235 వరకు ముద్రించారు. వీటిలో 232 నాణేలను వేలం వేస్తారు. ఒక్కొక్కటి లక్ష డాలర్లు(రూ.88.71 లక్షలు) పలకవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సొమ్మును టంకశాల కార్యకలాపాల కోసం వెచి్చస్తారు. మిగతా మూడు నాణేలను ప్రజల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచుతారు. అలాగే మింట్లో 235 గోల్డ్ పెన్నీలు కూడా ముద్రించినట్లు సమాచారం. వీటిని ఏం చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు. పాత నాణేల చెలామణి యతాథతం ఫిలడెల్ఫీయాలో పెన్నీల తయారీ 1793లో ప్రారంభమైంది. ఇది డాలర్ విలువలో వందలో ఒక వంతు. అంటే వంద పెన్నీలు ఒక డాలర్లు అని చెప్పొచ్చు. అమెరికా కరెన్సీలో అత్యల్ప ముఖ విలువ కలిగినవి పెన్నీలే. మొదట్లో కాపర్తో తయారు చేసేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జింక్, కాపర్ ఉపయోగించడం ప్రారంభించారు. ఎందుకంటే యుద్ధం వల్ల కాపర్ కొరత ఏర్పడడమే ఇందుకు కారణం. ముద్రణ ఆపినంత మాత్రాన వాటి చెలామణి ఆగిపోదు. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న పాత పెన్నీ నాణేలను యథాతథంగా వాడుకోవచ్చు. అమెరికాలో చివరిసారిగా నాణేన్ని ఆపేసిన ఘటన 1857లో జరిగింది. ఆప్పట్లో హాఫ్–పెన్నీ ముద్రణను నిలిపివేశారు. అరుదైన హాఫ్–డాలర్ నాణేలు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి. -
భారత ఉత్పత్తులకు మరింత పోటీతత్వం
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్లను బలంగా ఎదుర్కొనేందుకు, ఎగుమతులను పెంచుకునేందుకు కేంద్ర కేబినెట్ రూ.45,000 కోట్ల ప్రోత్సాహకాలతో రెండు పథకాలకు ఆమోదం తెలిపింది. రూ.25,060 కోట్లతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం), రూ.20,000 కోట్లతో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (సీజీఎస్ఈ) ఇందులో ఉన్నాయి. ఈపీఎం అన్నది భారత ఉత్పత్తుల పోటీతత్వాన్ని పెంచుతుందని, ఎంఎస్ఎంఈలు, మొదటిసారి ఎగుమతిదారులు, కారి్మకులపై ఎక్కువగా ఆధారపడిన రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్పై ప్రకటించారు. ‘‘ప్రపంచ మార్కెట్లో భారత్లో తయారీ మరింత మార్మోగుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ (ఈపీఎం) ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచుతుంది. ఎంఎస్ఎంఈలు, మొదటిసారి ఎగుమతిదారులు, కారి్మక ఆధారిత రంగాలకు ప్రయోజనం లభిస్తుంది’’అని పోస్ట్ చేశారు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్తో ఎగుమతిదారులు అంతర్జాతీయంగా మరింత పోటీపడగలరని, వ్యాపార కార్యకలాపాలను సాఫీగా నిర్వహించుకోగలరని అభిప్రాయపడ్డారు. సీజీఎస్ఈ పథకంతో ఎగుమతిదారులకు నగదు లభ్యత పెరుగుతుందని, ఎంఎస్ఎంఈలను బలోపేతం చేస్తుందని, ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం సాధనను వేగవంతం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా పేర్కొన్నారు. సవాళ్లకు పరిష్కారం.. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలు.. అందుబాటు ధరలకే రుణాలు, నిబంధనల సంక్లిష్టత, బ్రాండింగ్ అంతరాయాలకు కేంద్రం ప్రకటించిన పథకాలు పరిష్కారం చూపిస్తాయని సీఐఐ ఎగుమతుల కమిటీ చైర్మన్ సంజయ్ బుధియా అభిప్రాయపడ్డారు. ఎంఎస్ఎంఈలకు కొత్త అవకాశాలు కలి్పస్తాయన్నారు. ‘‘రుణ లభ్యతను పెంచుతాయి. మార్కెట్ సన్నద్ధత, దేశ ఎగుమతులు బలపడతాయి. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశ ఎగుమతుల వృద్ధికి తాజా ప్రేరణ లభిస్తుంది’’అని అప్పారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) వైస్ చైర్మన్ ఎ.శక్తివేల్ అభిప్రాయపడ్డారు. రుణ సదుపాయం, నిబంధనల అమలులో సమస్యలను ఎదుర్కొనే ఎంఎస్ఎంఈలకు ఈ పథకాలు సాధి కారత కలి్పస్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెండ్ ఎస్.సి. రల్హాన్ పేర్కొ న్నారు. ఎగుమతుల రంగంలో 85 శాతం ఎంఎస్ంఎఈలేనని, 2047 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం సాధ్యపడుతుందని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి పేర్కొంది. స్థిరంగా టెక్స్టైల్స్ ఎగుమతులు 111 దేశాలకు మాత్రం 10 శాతం వృద్ధి న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లతో కూడిన వాతావరణం మధ్య దేశ టెక్స్టైల్ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) ఫ్లాట్గా నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పోల్చి చూస్తే 0.1 శాతమే పెరిగాయి. కానీ, 111 దేశాలకు మాత్రం 10 శాతం అధికంగా 8,489 మిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ దేశాలకు ఎగుమతులు 7,718 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. యూఏఈకి 14.5 శాతం, యూకేకి 1.5 శాతం, జపాన్కు 19 శాతం, జర్మనీకి 2.9 శాతం, స్పెయిన్కు 9 శాతం, ఫ్రాన్స్కు 9.2 శాతం చొప్పున ఎగుమతులు పెరిఆయి. ఈజిప్్టకు 27 శాతం, సౌదీ అరేబియాకి 12.5 శాతం, హాంగ్కాంగ్కు 69 శాతం అధికంగా టెక్స్టైల్ ఎగుమతులు జరిగాయి. రెడీ మేడ్ గార్మెంట్స్ (ఆర్ఎంజీ) ఎగుమతులు 3.4 శాతం పెరగ్గా, జ్యూట్ ఎగుమతులు 5.56% అధికంగా నమోదయ్యాయి. టెక్స్టైల్స్ పరిశ్రమ పోటీతత్వం, మార్పుల స్వీకరణకు ఈ పనితీరు అద్దం పడుతుందని కేంద్ర టెక్స్టైల్స్ శాఖ పేర్కొంది. -
సిరియా దశ మారుతుందా?
అమెరికా అధ్యక్ష పీఠాన్ని డోనాల్డ్ ట్రంప్ దాదాపు పది నెలల క్రితం అధిరోహించాక ఎన్నో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఆ వరసలో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా రాక కూడా ఒకటి. ఒక దేశాధ్యక్షుణ్ణి మీడియా సాక్షిగా తీవ్రంగా మందలించటం, ఆయనతో వాదులాటకు దిగటంతో ట్రంప్ ఏలుబడి మొదలైంది. కానీ ఆ ‘సత్కారం’ అందుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దాన్నంతటినీ దిగమింగుకుని అనంతర కాలంలో ట్రంప్తో చేతులు కలిపి, తమ ఖనిజ సంపద అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఆయన మెప్పు పొందారు. ఇప్పుడు షరాకు రెడ్ కార్పెట్ పరచటంలోని అంతరార్థం ఏమిటో మున్ముందు తెలుస్తుంది. పైకి చెబుతున్న కారణమైతే ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)పై పోరాటానికి సంఘటితమైన 88 దేశాలతో సిరియా చేతులు కలపటానికి సిద్ధపడటం. తాము ఏమనుకుంటే మిగతా ప్రపంచం కూడా అలాగే అనుకోవాలని అమెరికా భావిస్తుంటుంది. ఏడేళ్ల క్రితం అమెరికా దృష్టిలో అల్ షరా కరుడుగట్టిన ఉగ్రవాది. అతన్ని పట్టిస్తే కోటి డాలర్లు ఇస్తామంటూ ప్రకటించింది. నిరుడు డిసెంబర్లో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆ నజారానాను ఉపసంహరించుకున్నారు. మొన్న జూలైలో షరా ఆధ్వర్యంలోని హయత్ తహ్రీర్ అల్ షామ్ (హెచ్టీఎస్)పై ఉగ్రవాద సంస్థ ముద్రను రద్దుచేశారు. సిరియాపై ఉన్న ఆర్థిక ఆంక్షలను రద్దు చేస్తామని మే నెలలో ప్రకటించటంతోపాటు సౌదీ అరేబియాలో ట్రంప్ ఆయన్ను కలుసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో షరా అధ్యక్ష హోదాలో అమెరికా సందర్శిస్తారనగా మొన్న గురువారం ఆదరాబాదరాగా భద్రతా మండలి సమావేశమై నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. చైనా మినహా మిగిలిన 14 సభ్య దేశాలూ మరో మాట లేకుండా ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. అమెరికా తాజా నిర్ణయాలు తప్పని, గత వైఖరే సరైందని ఎవరూ అనరు. కానీ తల్చుకున్నదే తడవుగా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటం, వాటికి భద్రతా మండలి వంటి సంస్థలు సైతం ఎలాంటి ప్రశ్నలూ లేవనెత్తకుండా అంగీకరించటం ఆందోళన కలిగించే అంశం. అమెరికా ఆగ్రహించినంత కాలమూ ఆ దేశంతో సంబంధాలు కలిగి ఉన్నందుకు అమెరికా తీసుకున్న చర్యలతో నష్టపోయిన దేశాల మాటేమిటి? ఇప్పుడు ఇరాన్పైనా, రష్యాపైనా ఆంక్షలున్నాయి. వాటితో వాణిజ్య సంబంధాలు నెరపుతున్నందుకు మన దేశంపై ట్రంప్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందరూ తమకు తోకల్లా ఉండాలన్నది అమెరికా విధానం. సిరియాపై అమెరికా ఆంక్షలు ఈనాటివి కాదు. గత ఎనభైయ్యేళ్లుగా... అంటే 1946లో ఆ దేశం ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందినప్పటినుంచి కొనసాగుతున్నాయి. 1979లో రీగన్, అటుతర్వాత జార్జి బుష్, ఒబామా వాటిని మరింత పెంచారు. 2003లో అమెరికా ఇరాక్ను దురాక్రమించినప్పుడు షరా పట్టుబడ్డారు. ఆయన్ను 2011 వరకూ అమెరికా జైల్లో నిర్బంధించారు. అక్కడ పరివర్తన పొంది విడుదలయ్యాక సిరియా వెళ్లి అల్ కాయిదాతో, అటుతర్వాత ఐఎస్తో చేతులు కలపటం, హెచ్టీఎస్ స్థాపించటం, 2013లో అమెరికా ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించటం చరిత్ర. షరా పలుకుబడి ఉన్న ఉత్తర సిరియా ప్రాంతంలో ఐఎస్ చీఫ్ అబూ బకర్ బగ్దాదీని 2019లో అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఆ మాటెలా ఉన్నా ప్రస్తుతం ఆయన ఏలుబడిలో గత పది నెలలుగా సిరియాలోని మైనారిటీ వర్గాలైన అలావైట్లు, డ్రూజ్లు, క్రైస్తవులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. షరా అనుకూల మిలిటెంట్ సంస్థలు ఇళ్లల్లోకి చొరబడి కాల్చిచంపటం, ఎత్తయిన భవంతుల నుంచి దూకమని హుకుం జారీచేసి ప్రాణాలు తీయటం కొన సాగుతోంది. మొన్న మార్చిలో దాదాపు 2,000 మంది ఆ హింసాకాండకు బలయ్యారు. వాటి నివారణపై ట్రంప్, షరా ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ శిథిలాల దిబ్బగా ఉన్న సిరియాలో 90 శాతంమంది పౌరులు తీవ్ర దారిద్య్రంలో మగ్గుతున్నారు. దేశ పునర్నిర్మాణానికి కనీసం 20,000 కోట్ల డాలర్లు అవసరమవుతాయని ప్రపంచ బ్యాంకు అంచనా. ట్రంప్–షరా సమావేశం తర్వాతైనా సిరియాలో సాధారణ పరిస్థితులు నెలకొని, అది ఆర్థికంగా పుంజుకుంటే మంచిదే. -
భారత్కు అమెరికా అవసరం లేదు: మార్కో రూబియో
వాషింగ్టన్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట బాంబు సంచలనంగా మారింది. తాజాగా ఢిల్లీ పేలుళ్ల ఘటనపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికి ఉగ్రదాడే అని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించడంలో భారత్కు ఎవరి సాయం అవసరం లేదు.. అధికారుల పనితీరు ప్రశంసనీయం అని కొనియాడారు.అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం కెనడాలో జరిగిన జీ-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మార్కో రుబియో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకొచ్చామని, కానీ ఆ అవసరం భారత్కు లేదని వ్యాఖ్యానించారు. భారత అధికారులు అసాధారణమైన వృత్తి నైపుణ్యంతో దర్యాప్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు.US Secy of state Marco Rubio on Delhi terror incident"It is clearly a terrorist attack""India doing very good job carrying out investigation""US has offered help, but India capable of investigation" pic.twitter.com/a0Ol6uw1OJ— Sidhant Sibal (@sidhant) November 13, 2025ఇక, కెనడాలో జరగుతున్న జీ-7 సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, మార్కో రూబియోతో భేటీ అయ్యారు. ఇరువురి మంత్రులు అనేక ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై చర్చించారు. ఢిల్లీ పేలుడు విషయం కూడా వారు చర్చించినట్లు.. రూబియోతో భేటీ గురించి జైశంకర్ ఎక్స్లో పోస్టు పెట్టారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన మరో 17 మందికి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి (LNJP హాస్పిటల్) ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన విషయం తెలిసిందే. -
షట్డౌన్కు తెర
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43 రోజులపాటు కొనసాగిన షట్డౌన్ ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వ నిధుల బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి సంతకం చేశారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్యుల కష్టాలకు తెరపడింది. షట్డౌన్కు ముగింపు పలికే గవర్నర్మెంట్ ఫండింగ్ బిల్లు సోమవారం సెనేట్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అనంతరం అమెరికా కాంగ్రెస్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుకు అనుకూలంగా 222, వ్యతిరేకంగా 209 ఓట్లు వచ్చాయి. అధికార రపబ్లికన్ పార్టీ సభ్యులు మద్దతు ఇవ్వగా, విపక్ష డెమొక్రాట్లు బిల్లులోని కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వ్యతిరేకంగా ఓటువేశారు. అయినప్పటికీ సభలో అధికార పార్టీకి మెజార్టీ ఉండడంతో బిల్లు గట్టెక్కింది. అనంతరం గంటల వ్యవధిలోనే అధ్యక్షుడి ఆమోదం కోసం బిల్లును పంపించడం, ఆయన సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. #BREAKING: U.S. House votes to end government shutdown, 222-209. Goes now to the president. pic.twitter.com/LPySa48qUZ— CSPAN (@cspan) November 13, 2025దోపిడీకి అమెరికా లొంగదు: ట్రంప్ షట్డౌన్ కారణంగా ఉద్యోగులకు ఇన్నాళ్లూ వేతనాలు ఆగిపోయాయి. ఆఖరికి ఎయిర్పోర్టుల్లో విమానాల రాకపోకలపైనా భారీ ప్రభావం పడింది. ఆహారం కోసం ఫుడ్ బ్యాంకుల ఎదుట జనం బారులు తీరాల్సి వచి్చంది. షట్డౌన్ ఆగిపోవడంతో ఆ కష్టాలకు ఇక తెరపడినట్లే. ప్రజల కష్టాలకు డెమొక్రాట్లే కారణమని డొనాల్డ్ ట్రంప్ నిందించారు. వచ్చే ఏడాది జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయం మర్చిపోవద్దని కోరారు. విపక్ష సభ్యులు చేసిన అన్యాయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. అమెరికా ఎప్పటికీ దోపిడీకి లొంగిపోదన్న సందేశాన్ని పంపిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అమెరికన్లకు రాయితీపై చౌకగా వైద్య సేవలందించే అంశంపై అధికార, విపక్షాల మధ్య మొదలైన ప్రతిష్టంభన చివరకు షట్డౌన్కు దారితీసింది. ఈ రాయితీ ఈ ఏడాది ఆఖర్లో ముగిసిపోనుండగా, దాన్ని ఇంకా పొడిగించాలని డెమొక్రటిక్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. ట్రంప్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. అక్టోబర్ 1న షట్డౌన్ మొదలైంది. అత్యవసరం కాని సాధారణ ప్రభుత్వ సేవలకు నిధుల విడుదల ఆగిపోయింది. విపక్షాలను దారికి తీసుకురావడానికి కొందరు ఉద్యోగులను ట్రంప్ బలవంతంగా తొలగించారు. ప్రభుత్వ నిధుల బిల్లు ప్రకారం.. తొలగింపుకు గురైన ఉద్యోగులను మళ్లీ విధుల్లో చేర్చుకుంటారు. ప్రభుత్వ సేవలకు యథావిధిగా నిధులు విడుదల చేస్తారు. మరోవైపు రాయితీపై ఆరోగ్య సేవలను కొనసాగించడంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై త్వరలో చర్చలు జరుగనున్నాయి. -
నెతన్యాహును క్షమించండి.. ట్రంప్ లేఖ
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును క్షమించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. నెతన్యాహుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. కోర్టుల్లో విచారణ జరుగుతోంది. దోషిగా తేలితే పదవి నుంచి తప్పుకోవాల్సిందే.ఈ నేపథ్యంలో నెతన్యాహుకు మద్దతుగా ట్రంప్ లేఖ రాయడం గమనార్హం. నెతన్యాహుపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని ట్రంప్ పేర్కొన్నారు. ఆయనను విచారించడం న్యాయ సమ్మతం కాదని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ను శాంతి మార్గంలో నడిపిస్తున్నారంటూ నెతన్యాహును ప్రశంసించారు. మరోవైపు ఇజ్రాయెల్ అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ పెత్తనం పెరిగిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ గత నెలలో ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించారు. అప్పుడు కూడా నెతన్యాహును వెనకేసుకొచ్చారు. ఆయనను పెద్ద మనసుతో క్షమించాలని అన్నారు. -
విదేశీ ఉద్యోగులు ఉండాల్సిందే
న్యూయార్క్: విదేశీయులన్నా, హెచ్–1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్లన్నా అంతెత్తున లేచి గోలచేసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా హెచ్–1బీ వీసాదారుల ప్రాధాన్యతను గుర్తించారు. అమెరికా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తి అయిన పరిశ్రమలు, సాంకేతిక రంగంలో విదేశీ ప్రతిభావంతుల కీలకపాత్రను ఆయన తొలిసారిగా కొనియాడారు. విదేశీయుల ప్రతిభ ఖచ్చితంగా అమెరికాకు అవసరమని, హెచ్–1బీ వీసా ఉన్న విదేశీ వృత్తినిపుణులు అమెరికాకు అత్యావశ్యకమని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే అమెరికాలోని నైపుణ్యసంబంధ ఉద్యోగాలన్నీ హెచ్–1బీ వీసాదారులకే కేటాయించకుండా స్థానిక అమెరికన్లకు తగు ప్రాధాన్యతనివ్వాలని ఆయన వెనువెంటనే తనదైన శైలిలో మాట్లాడారు. బుధవారం ఫాక్స్న్యూస్ వార్తసంస్థ వ్యాఖ్యాత లారా ఇన్గ్రహామ్తో ప్రత్యేక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. లక్షలాది మంది విదేశీ కార్మీకులు వద్దు ‘‘ కేవలం స్థానిక అమెరికన్ కార్మీకులతో పని ముందుకు సాగదని నాకూ ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. అమెరికాలోకి విదేశీ ప్రతిభ రావాల్సిందే. అలాఅని ఉద్యోగాలన్నీ లక్షలాది మంది విదేశీ కార్మికులతో నింపేస్తామంటే కుదరదు. స్థానికుల్లోనూ ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. అయితే విదేశీయులకే ప్రత్యేకమైన అదనపు వృత్తి నైపుణ్యాలుంటే వాటిని స్థానిక అమెరికన్లు నేర్చుకోవాల్సిందే. స్థానికులకు నైపుణ్యం తప్పనిసరి. సెపె్టంబర్లో జార్జియా రాష్ట్రంలో దక్షిణకొరియాకు సంబంధించిన హ్యాందాయ్ ఫ్యాక్టరీల్లో అక్రమంగా అమెరికాకు వచ్చిన వలసదారులు కార్మీకులుగా పనిచేస్తున్నారు. వాళ్లను గుర్తించి అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు బహిష్కరించి స్వదేశానికి పంపేశారు. అయితే ఇక్కడ పెద్ద సమస్య వచ్చిపడింది. మేం పంపేసిన కార్మికులు బ్యాటరీలను తయారుచేయడంలో సిద్ధహస్తులు. బ్యాటరీల తయారీ అనేది అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన ప్రక్రియ. అది అంత తేలికైన పని కానేకాదు. ఏమైనా తేడాలొస్తే పేలుళ్లు జరుగుతాయి. సమస్యలు మరింత పెద్దవవుతాయి. మేం బహిష్కరించిన బ్యాటరీ తయారీ కార్మికులు ఒక ఐదారు వందల మంది ఉంటారేమో. అలాంటి వాళ్ల నుంచి స్థానిక అమెరికన్లు వృత్తి మెళకువలను నేర్చుకోవాల్సిందే. ప్రతి రంగంలోనూ విదేశీ ప్రతిభావంతుల నుంచి స్థానిక అమెరికన్లు నైపుణ్యాలను నేర్చుకోవాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగులతో క్షిపణులు అసాధ్యం నిరుద్యోగులుగా ఖాళీగా ఉన్న వాళ్లను హఠాత్తుగా ఉద్యోగాల్లోకి తీసుకుంటే సానుకూల ఫలితాల కంటే తీవ్ర ప్రతికూల ఫలితాలే వస్తాయి. ఉదాహరణకు అమెరికాపై ఆసక్తితో ఏదైనా విదేశీ కంపెనీ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఒక రక్షణరంగ కర్మాగారం స్థాపించేందుకు ఆసక్తి కనబరచిందనుకుందాం. అలాంటప్పుడు వెంటనే మేం ఖాళీగా ఉన్న నిరుద్యోగ అమెరికన్లను ఆ కొత్త ఫ్యాక్టరీలో కొలువుల్లో కూర్చోబెట్టలేం. ఐదేళ్లుగా ఎలాంటి ఉద్యోగం చేయని వ్యక్తులను కార్మీకులుగా మార్చేసి ఏకంగా క్షిపణులను తయారుచేయించలేం’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొత్త హెచ్–1బీ వీసా ఫీజును అనూహ్యంగా ఒకేసారి 1,00,000 డాలర్లకు పెంచేసి అమెరికాకు విదేశీ వృత్తినిపుణులు రాకుండా పరోక్షంగా కట్టడి చర్యలను ఆరంభించిన ట్రంప్ రెండు నెలలు తిరక్కుండానే హెచ్1బీ అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
టారిఫ్లను కొంత తగ్గిస్తాం : ట్రంప్ కొత్త హింట్
వాషింగ్టన్: భారత్తో న్యాయబద్ధమైన వాణిజ్య ఒప్పందం అతి సమీపంలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం ఓకే అయిన పక్షంలో భారత్ వస్తువులపై కొంతమేర టారిఫ్లను తగ్గిస్తామన్నారు. అయితే, భారత్తో కుదరబోయే ఒప్పందం, గతంలో వాటికంటే భిన్నంగా ఉంటుందన్నారు. ‘ప్రస్తుతానికి వాళ్లు నన్ను ఇష్టపడటం లేదు. ఒప్పందం కుదిరితే మళ్లీ నన్ను తిరిగి ప్రేమిస్తారు’అని వ్యాఖ్యానించిన ట్రంప్ ఇతర వివరాలను వెల్లడించలేదు. రెండు వారాల వ్యవధిలో ట్రంప్ ఇలాంటి ప్రకటన చేయడం ఇది రెండోసారి. భారత్తో ద్వైపాక్షిక ఒప్పందం అతిత్వరలోనే కుదరనుందంటూ ఇటీవల ట్రంప్ ప్రకటించడం తెల్సిందే. అయితే, తాజాగా ఆయన చేసిన ప్రకటన ఎప్పటి మాదిరిగానే అతిశయోక్తా?, లేక ఒప్పందం కోసం రెండు పక్షాల మధ్య జరుగుతున్న చర్చల్లో నిజంగానే పురోగతి ఉందా?అనేది స్పష్టం కావాల్సి ఉంది. భారత్లో రాయబారిగా నియమితులవనున్న సెర్గియో గోర్తో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణం చేయించారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ పైవ్యాఖ్యలు చేశారు. ‘చర్చల్లో వాళ్లు(భారత్) సిద్ధహస్తులు. సెర్గియో, వీలైతే ఈ విషయం నువ్వు చూసుకో’అని పేర్కొన్నారు. అదేవిధంగా, రష్యా ఆయిల్ను కొంటున్నందునే భారత్పై అత్యధికంగా టారిఫ్లు వేశామన్నారు. వాణిజ్య ఒప్పందం కుదిరిన పక్షంలో టారిఫ్లను కొంతమేర తగ్గిస్తామని చెప్పారు. ఇదే సమయంలో గత అధ్యక్షుడు బైడెన్పై పాత ధోరణిలోనే విమర్శలు గుప్పించారు. ‘బైడెన్కు భారత్ గురించి తెలియదు. అతడికి అసలేమీ తెలియదు. ఇప్పుడు మేం ఏం చేస్తున్నామో చూడండి’అంటూ బడాయిగా మాట్లాడారు(100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద) -
H1B Visa: తలొగ్గిన ట్రంప్.. మాకు వలస కార్మికులు కావాలి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస కార్మికులపై తొలిసారిగా పాజిటివ్గా స్పందించారు. అమెరికా పారిశ్రామిక, రక్షణ రంగాలలో అభివృద్ధి సాధించాలంటే ఇతర దేశాల నుంచి నైపుణ్యత గల కార్మికులను తమ దేశానికి తీసుకురావాలన్నారు. అయితే, అది పరిమిత స్థాయిలో ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు.డొనాల్ట్ ట్రంప్ ఈ పేరు వింటే చాలు ప్రపంచ దేశాలన్ని తలపట్టుకుంటున్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయంతో ఎవరిని ఇబ్బందిపెడతారో అని ఆలోచిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన తొందరపాటు నిర్ణయాలతో ప్రపంచ దేశాలను ఇబ్బందిపెట్టిన ట్రంప్.. హెచ్-1బీ వీసాలపై కూడా తన మార్క్ చూపించారు. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లు (రూ.88లక్షలు)కు పెంచి అమెరికాలో స్థిరపడాలనుకొనే ఉద్యోగస్థుల ఆశలపై నీళ్లు చల్లారు. వీసాల విషయంలో కఠిన నిబంధనలను కూడా తెరపైకి తెచ్చారు. అయితే, తాజాగా ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్యూలో మాత్రం వలస కార్మికులపై ట్రంప్ పాజిటివ్గా మాట్లాడారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్తోపాటు, రక్షణ రంగంలో నైపుణ్యత గలిగిన వలస కార్మికులను నియమించుకోవాలని తెలిపారు. ఆ రంగాలలో అమెరికన్లకు నైపుణ్యత లేదన్నారు. తమ దేశంలో ఎంతో ప్రతిభ గల యువకులనున్నారని తమ ప్రభుత్వ విధానాలతో అమెరికన్లకు వేతనాలు పెరిగే అవకాశముందని ట్రంప్ తన చర్యలను సమర్థించారు. దేశ యువత స్కిల్స్ నేర్చుకొవాలని అలా చేస్తే వారితో మిస్సైల్స్ తయారు చేయిస్తానని, దేశంలో నిరుద్యోగం లేకుండా చేయవచ్చని అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా మ్యాను ఫ్యాక్చరింగ్ సెక్టార్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నైపుణ్యత గల కార్మికులను అక్రమ వలసలు పేరుతో తొలగించడం ద్వారా తయరీ రంగంలో కార్మికుల కొరత ఏర్పడిందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా పరిస్థితులు మరింత దిగజారగ ముందే ట్రంప్ ఇలా మాట్లాడినట్టు సమాచారం. -
అమెరికా షట్డౌన్ ముగిసినట్టే!
వాషింగ్టన్: అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 41 రోజులపాటు ప్రజలను అష్టకష్టాలకు గురిచేసిన షట్డౌన్ ఎట్టకేలకు ముగింపు దశకు చేరింది. షట్డౌన్ను ముగించి, ప్రభుత్వ సేవలను మళ్లీ ప్రారంభించడానికి వీలుగా సంబంధిత బిల్లును సోమవారం సెనేట్లో ఆమోదించారు. బిల్లుకు మద్దతివ్వడాన్ని విపక్ష డెమొక్రటిక్ పార్టీలో కొందరు సభ్యులు వ్యతిరేకించారు. అయినప్పటికీ మెజార్టీ సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. అధికార రిపబ్లికన్ పార్టీతో అవగాహన కుదరడమే ఇందుకు కారణం. సెనేట్లో బిల్లుకు అనుకూలంగా 60 ఓట్లు, వ్యతిరేకంగా 40 ఓట్లు వచ్చాయి. ఇకపై కాంగ్రెస్లోని ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరిస్తుండడంతో అతిత్వరలో షట్డౌన్ ముగిసిపోనున్నట్లు తెలుస్తోంది.బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ సేవలను చాలా వేగంగా పునరుద్ధరించబోతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, షట్డౌన్ ముగింపు బిల్లును బుధవారం మధ్యాహ్నమే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిసింది. ఈ సభలో కూడా ఆమోదం పొందితే బుధవారమే షట్డౌన్కు తెరపడే అవకాశం ఉంది. గత నెలలో వార్షిక నిధుల బిల్లుకు సెనేట్ ఆమోదం తెలపకపోవడంతో దేశమంతటా షట్డౌన్ మొదలైన సంగతి తెలిసిందే.దీంతో ప్రభుత్వ సేవలు చాలావరకు నిలిచిపోయాయి. అత్యంత ముఖ్యమైన సేవలు మాత్రమే కొనసాగాయి. వేతనాలు హఠాత్తుగా ఆగిపోవడంతో ఉద్యోగుల ఇక్కట్లపాలయ్యారు. నిధులు లేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. పలు కీలక రంగాలు ప్రభావితమయ్యాయి. విమానయాన సేవలు కూడా ఆగిపోయాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
రాష్ డ్రైవింగ్, దాడులు, దోపిడీలు : 80 వేల వీసాలు రద్దు
న్యూఢిల్లీ: రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన దేశంలోని విదేశీయులను తరిమేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు డొనాల్డ్ ట్రంప్. చిన్నచిన్న తప్పులకు కూడా వీసాలు రద్దుచేసి బలవంతంగా వారి స్వదేశాలకు పంపేస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి 80 వేల వీసాలు రద్దుచేసినట్టు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉటంకిస్తూ వాషింగ్టన్ ఎగ్జామినర్ సంస్థ పేర్కొంది. మద్యం సేవించి వాహనాలు నడపటం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, దొంగతనాల వంటి నేరాలు చేసిన వారి వీసాలను రద్దుచేసి వారిని స్వదేశాలకు పంపినట్టు తెలిపింది. రద్దుచేసిన ఈ 80 వేల వీసాలు నాన్ ఇమిగ్రేషన్ విభాగానివేనని వెల్లడించింది. ఇందులో 8 వేల వరకు విద్యార్థి వీసాలున్నాయి. అమెరికా చట్టాలను ఏమాత్రం ఉల్లంఘించినా వీసా రద్దు తప్పదని అధికారులు హెచ్చరించినట్టు వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది. ‘అమెరికా చట్టాలను ఉల్లంఘించినా, మన దేశ భద్రతకు ముప్పు కలిగించే పనులు చేసినా.. వారి వీసాలు రద్దుచేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఏమాత్రం సంకోచించదు. మా సందేశం సుస్పష్టం. అమెరికాలోకి ప్రవేశించటం హక్కు కాదు. మేం ఎల్లప్పుడూ అమెరికా ప్రజల భద్రత, ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం’అని ఇమిగ్రేషన్ విభాగం ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి టామీ పిగోట్ తేల్చి చెప్పారు. వీసాల జారీ కఠినతరం ఇప్పటికే జారీచేసిన వీసాలను వివిధ కారణాలు చూపి రద్దుచేయటంతోపాటు కొత్తగా వీసాల జారీలోనూ అమెరికా కఠిన విధానాలు అమలుచేస్తోందని రాయిటర్స్ పేర్కొంది. వీసా జారీ కోసం దరఖాస్తుదారుడి సోషల్మీడియా యాక్టివిటీని పూర్తిగా అధ్యయనం చేస్తున్నారని తెలిపింది. ఈ ఏడాది రద్దు చేసిన వీసాల్లో డ్రైవింగ్లో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినవి 16,000 ఉన్నాయి. దాడులకు పాల్పడినవారికి 12,000, దోపిడీలు చేసినవారికి 8,000 ఉన్నాయి. గడువు దాటిన తర్వాత కూడా దేశంలో ఉన్నవాళ్లు, చట్టాలను ఉల్లంఘించినవాళ్లతోపాటు ఉగ్రవాదానికి మద్దతిచ్చి దాదాపు 6,000 మంది విద్యార్థుల వీసాలు రద్దుచేసినట్టు గత ఆగస్టులు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. కరుడుగట్టిన అమెరికా జాతీయవాది, ట్రంప్ మద్దతుదారుడు చార్లీ కిర్క్ హత్యను సమరి్ధస్తూ సోషల్మీడియాలో పోస్టులు పెట్టిన ఆరుగురి వీసాలు గత నెలలో రద్దుచేసినట్టు ఓ అధికారి వెల్లడించారు. అమెరికా విదేశాంగ విధానాన్ని వ్యతిరేకించి వేలమంది వీసాలను రద్దుచేసినట్టు గత మేలో అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో స్వయంగా ప్రకటించారు. ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యంపాలస్తీనాకు మద్దతిస్తే అంతే సంగతులు.. గాజాపై ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ కొన్నాళ్లుగా అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఆందోళన జరిగాయి. దీంతో ట్రంప్ యంత్రాంగం ఆ నిరసనల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పనిచేసినా, మాట్లాడినా వీసాలు రద్దుచేయాలని విదేశాంగ శాఖ నుంచి ఇమిగ్రేషన్ విభాగానికి ఆదేశాలు వెళ్లాయని రాయిటర్స్ పేర్కొంది. వీసా దరఖాస్తు దారుల్లో పాలస్తీనా మద్దతుదారులుంటే వారి దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. -
ఢిల్లీ ఘటన: ‘అమెరికా’ హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు అనంతరం అమెరికా రాయబార కార్యాలయం జనసమూహం ఉన్న ప్రాంతాలకు వెళ్లద్దంటూ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పలు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.‘2025, నవంబర్ 10న మధ్య ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఒక కారు పేలిపోయిందని స్థానిక మీడియా నివేదించింది. పేలుడుకు కారణం తెలియనప్పటికీ, భారత ప్రభుత్వం దేశంలోని పలు రాష్ట్రాలను హై అలర్ట్లో ఉంచింది’ అని తెలియజేస్తూ అమెరికా రాయబార కార్యాలయం పలు భద్రతా సూచనలు జారీచేసింది. అవి..ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరగకండి.గుంపులు గుంపులుగా ఏర్పడకండి.అప్డేట్ల కోసం మీడియాను చూస్తుండండి.మీ పరిసరాలను జాగ్రత్తగా గమనించండి.పర్యాటకులు వచ్చే ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండండి.సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న కారును శక్తివంతమైన పేలుడు తునాతునకలు చేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలలో చాలా వాహనాలు మంటల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ‘ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు. ఈ ప్రమాదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షించారు.ఇది కూడా చదవండి: తలొగ్గిన ట్రంప్.. ‘భారత్తో న్యాయమైన ఒప్పందం’ -
అమెరికాతో ఆచి తూచి...
ఇండియా, అమెరికా వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి వచ్చినట్లేనా? సంతకాలు చేయడమే తరువాయి అంటూ ఆరు నెలలుగా వింటున్నాం. అయినా, ఉభయ పక్షాలూ ఆ చివరి ఘట్టం చేరుకోలేకపోతున్నాయి. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఇండియా మీద విధించిన 25 శాతం అదనపు సుంకం విషయానికి వద్దాం. ప్రైవేటు రంగ సంస్థలు రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించాయి. మరి ఆ 25 శాతం అదనపు సుంకాలను అమెరికా ఎత్తివేస్తుందా? అలాంటి సంకేతాలేమీ లేవు.చమురు కొనకపోయినా...ఇండియా–యూఎస్ రక్షణ సహకారం మరో పదేళ్లు కొన సాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా యుద్ధ వ్యవహారాల మంత్రి పీట్ హెగ్సేథ్ ‘ఏసియాన్’ రక్షణ మంత్రుల సదస్సు సందర్భంగా అక్టోబర్ 31న కౌలాలంపూర్లో ప్రకటించారు. దీంతో వాణిజ్య వివాదం త్వరలోనే పరిష్కరం కాగలదన్న ఆశలు చిగురించాయి. ఇండియాకు రక్షణ సామగ్రి సరఫరా చేయడం ద్వారా అమెరికా బిలియన్ల డాలర్లను అర్జిస్తోంది. కాబట్టి మనపై ఆంక్షలు తొలగిస్తుందని అనుకోవడానికి వీల్లేదు. అమెరికా అధ్యక్షుడి లెక్కలు వేరేగా ఉంటాయి. ఇండియా జాగ్రత్తగా అడుగులు వేయాలి. రాబోయే రోజుల్లో ఎస్–500 తరహా రష్యా అత్యాధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ట్రంప్ అభ్యంతరం చెప్పరని అనుకోలేం. వాటిని సమకూర్చుకునేట్లయితే తాము ఇండియాకు రక్షణ పరికరాలను, విడిభాగాలను విక్రయించబోమంటూ పేచీ పెట్టరన్న గ్యారంటీ లేదు. చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తారని అనుకున్నామా? రష్యా చమురుకు చైనా కూడా భారీ కొనుగోలుదారు. నాటో కూటమి సభ్యులైన టర్కీ, హంగరీ సైతం గణనీయంగా ఆ దేశం నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. అయినా, అమెరికా ఇండియాను మాత్రమే వేరు చేసి ఆంక్షల శిక్ష విధించింది. బూసాన్ (దక్షిణ కొరియా)లో ఎపెక్ సదస్సు సందర్భంగా ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ చర్చలు జరిపారు. అందులో రష్యా చమురు ప్రస్తావన తేలేదని అన్నారు. ఇండియా మీద ఆంక్షల కత్తి ఝుళిపించిన ట్రంప్ చైనా విషయంలో అలా చేయలేక పోయారు. ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా ముందే హెచ్చరించడం అందుకు కారణం కావచ్చు.‘క్వాడ్’ లేనట్లేనా?అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం చైనా ముప్పు నుంచి కాపాడుతుందన్న నమ్మకాన్ని పునఃసమీక్షించుకోవాలి. నంబర్ 1, నంబర్ 2 దేశాల నడుమ నెలకొన్న వ్యవస్థాగత పోరు సమసి పోనప్పటికీ, ఇరు దేశాలూ వ్యూహాత్మక సర్దుబాట్లు చేసుకుంటున్నందువల్ల ఇండియా ఎత్తుగడలు ఫలించే అవకాశం తగ్గిపోతుంది. యుక్తమైన దౌత్యవిధానం అనుసరించడం ద్వారానే ఈ ముప్పును ఎదుర్కోవలసి ఉంటుంది.అమెరికా ఇండో–పసిఫిక్ వ్యూహం యథాతథంగా కొనసాగు తుందనడానికి ఇటీవలి ట్రంప్ ఆసియా పర్యటనే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. అయితే, ఈ వ్యూహంలో ఇండియా ప్రయోజనాలకు సంబంధించిన ‘క్వాడ్’ అంశం మరుగున పడింది. ఈ ఏడాది అఖరున క్వాడ్ దేశాధినేతల సమావేశం జరగాల్సి ఉంది. ఇది అనుమానమే. ట్రంప్ ఎక్కడా క్వాడ్ ఊసెత్తలేదు. భాగస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్ సైతం ప్రస్తావించక పోవడం గమ నార్హం. అవి ట్రంప్ మనసెరిగి మసలుకున్నట్లుంది.ఒకవేళ ఆస్ట్రేలియా, జపాన్లతో ఇండియా తన సహకారాన్ని ముమ్మరం చేసుకుని ఒక త్రైపాక్షిక కూటమి (ట్రయడ్) ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది అనుకుంటే, దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయన్నది మరో ప్రశ్న. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇండియాకు ఉన్న ఇతర అవకా శాలను చూద్దాం. యూరప్తో సన్నిహిత సమగ్ర భాగస్వామ్య ఒప్పందం వీటిలో ఒకటి. యూరప్ రక్షణ పరిశ్రమ భారీ విస్తరణ కోసం నమ్మకమైన విపణి, అగ్రశ్రేణి మానవ వనరులు అవసరం.ఇండియా వీటిని సమకూర్చగలదు. యూరప్, ఇండియాల మధ్య దృఢ మైన రక్షణ భాగస్వామ్యం ఉన్నట్లయితే, నిలకడ లేని అమెరికా విధానా లకు విరుగుడుగా అది ఉభయ పక్షాలకూ ఉపయోగపడుతుంది. ఇండియా బలాలుఅరిగిపోయిన రికార్డులా నేను మళ్లీ చెబుతున్నా. ఉపఖండ సరిహద్దుల భద్రత మన తక్షణ ఆవశ్యకత. పొరుగు దేశాలతో ద్వైపా క్షిక సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యపడు తుంది. మనం దక్షిణాసియా వృద్ధికి ఒక కేంద్రకంగా, భద్రత కల్పించే శక్తిగా మారడం ముఖ్యం. అనూహ్యంగా అనిపించినా కాలక్రమంలో పాకిస్తాన్ కూడా ఈ పరిధిలోకి వచ్చి తీరాలి. మన ప్రాంతానికి వాతావరణ మార్పు అతిపెద్ద సవాలు కాబోతోంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడం ప్రాంతీయ దేశాల నడుమ సహకారంతోనే సాధ్యమవుతుంది. ఈ విపత్తుపై ఉమ్మడి పోరాటానికి సారథ్యం వహించే శక్తి ఇండియాకు మాత్రమే ఉంది. తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లోనూ ఇండియా ప్రముఖ పాత్ర వహించాలి. ఇందుకు వీలుగా ఆర్సీఈపీ, సీపీటీపీపీ స్వేచ్ఛా వాణిజ్య కూటముల్లో సభ్యత్వం కోసం ప్రయత్నించాలి. శాస్త్ర సాంకేతిక మానవ వనరులతో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సంక్షుభిత సమకాలీన ప్రపంచంలో చెక్కు చెదరని రాజకీయ సుస్థిరత... ఈ రెండూ ఇండియా సొంతం. వివేకంతో వినియోగించుకోగలిగితే దేశాన్ని ఇవి వ్యూహాత్మకంగానూ ముందంజ వేయిస్తాయి. చైనాతో సంబంధాలను మెరుగుపరచడంలో వీటి పాత్ర ఉంది. ఏమైనప్పటికీ, విదేశీ విధానంలో, రక్షణ వ్యవహారాల్లో బయటి శక్తుల ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా నిర్ణ యాలు తీసుకోగల ‘వ్యూహాత్మక స్వతంత్రత’ సాధించడానికి... సామర్థ్యం కంటే సంకల్పం ముఖ్యం.శ్యామ్ శరణ్వ్యాసకర్త కేంద్ర విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇండియన్స్ నెత్తిన ట్రంప్ భారీ పిడుగు
-
40 రోజుల షట్డౌన్కు తెర?
వాషింగ్టన్: 40 రోజులకు చేరిన అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగింపు దశకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. రిపబ్లికన్ల డిమాండ్ ప్రకారం ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలపై ఓటింగ్కు హామీ ఇస్తే.. జనవరి చివరి వరకు నిధులను పొడిగించేందుకు మితవాద డెమొక్రాట్ల బృందం తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది.సెనేటర్లు జీన్ షాహీన్, మాగీ హసన్, అంగస్ కింగ్ నేతృత్వంలోని బృందం చేసిన ప్రతిపాదనతో విమానాల రద్దు, ఆహార సహాయం నిలిపివేత, ఫెడరల్ కార్మికుల జీతాల కొరత తదితర తీవ్ర పరిణామాలకు అడ్డుకట్ట పడగలదని ఆశిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అమెరికా షట్డౌన్ ముగింపునకు దగ్గరగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఒప్పందంపై డెమొక్రాటిక్ పార్టీలో తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతోంది. సెనేట్ డెమొక్రాటిక్ నేత చక్ షుమెర్, సెనేటర్ బెర్నీ సాండర్స్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.అఫర్డబుల్ కేర్ చట్టం (ఏసీఏ) కింద ఆరోగ్య సబ్సిడీల పొడిగింపు అనే ప్రధాన డిమాండ్ను పక్కన పెట్టడం అంటే ట్రంప్నకు లొంగిపోవడమే అని సాండర్స్ పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించకుండా ఒప్పందం చేసుకోవడం లక్షలాది మందికి చేసే ద్రోహం అని హౌస్ ప్రోగ్రెసివ్ నాయకులు విమర్శించారు. ఈ అంతర్గత విభేదాల కారణంగా, ఒప్పందం ఆమోదం పొందడానికి జాప్యం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.ఈ షట్డౌన్ అమెరికా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 2,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. లక్షలాది మందికి అవసరమైన ఆహార సహాయం (ఎస్ఏపీ) అందడంలో ఆలస్యం అవుతోంది. వర్జీనియా వంటి ప్రాంతాలలో లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతుండటంతో, స్థానిక ఫుడ్ బ్యాంక్లపై భారం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, వర్జీనియా సెనేటర్ టిమ్ కైన్ వంటి కొందరు డెమొక్రాట్లు ఫెడరల్ శ్రామిక శక్తిని, ప్రభుత్వ కార్యకలాపాలను రక్షించేందుకు ఈ ఒప్పందానికి మద్దతు ఇస్తున్నారు.కాగా ప్రభుత్వ ఫట్డౌన్ను ఎత్తివేడానికి రిపబ్లికన్లకు కేవలం ఐదుగురు డెమొక్రాట్ల మద్దతు మాత్రమే అవసరం. అయినప్పటికీ, హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ఏసీఏ సబ్సిడీలపై భవిష్యత్తులో ఓటు వేస్తామనే హామీకి కట్టుబడి ఉండకపోవచ్చని వస్తున్న వార్తలు.. ఒప్పందంపై అనుమానాలను పెంచుతున్నాయి. డెమొక్రాట్ల మధ్య చీలిక ఏర్పడటం, రిపబ్లికన్ల తుది హామీపైనే ఈ షట్డౌన్ ముగింపు ఆధారపడి ఉంటుంది.ఇది కూడా చదవండి: ‘శ్వాస చంపేస్తోంది’.. ఢిల్లీలో భారీ నిరసనలు -
ఒక్కో అమెరికన్కు 2వేల డాలర్లు ఇస్తా
వాషింగ్టన్: విదేశాలపై సుంకాల భారం మోపడం వల్లే దేశాదాయం విపరీతంగా పెరిగిందని, తద్వారా సమకూరిన ఆదాయం నుంచి అర్హులైన అమెరికన్లకు సుంకాల డివిడెండ్గా 2,000 డాలర్లు పంపిణీ చేస్తానని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ప్రకటించారు. విదేశాలపై సుంకాలను ఇష్టారీతిగా పెంచే విచక్షణాధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుందా? అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాలు అధ్యక్షుడికి వర్తిస్తాయా? అనే అంశాలపై సుప్రీంకోర్టు లోతైన సమీక్ష జరపనున్న నేపథ్యంలో ట్రంప్ ఆదివారం ఈ మేరకు తనదైన రీతిలో స్పందించారు.సొంత సామాజిక మాధ్యమ ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ‘‘సుంకాలను వ్యతిరేకించే వాళ్లంతా మూర్ఖులు. అధిక సుంకాలతో రెవిన్యూ వసూళ్ల వరద మొదలయ్యాక మనం అత్యంత ధనిక, గౌరవప్రద దేశంగా మారాం. మన దగ్గర ద్రవ్యోల్బణం దాదాపు లేదు. స్టాక్మార్కెట్ దూసుకుపోతోంది. ట్రిలియన్ల డాలర్లు వచ్చిపడుతున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్ల అప్పులను తీర్చే ప్రక్రియ మొదలెడతా. అమెరికాలోకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. దాదాపు మిగతా వాళ్లందరికీ సుంకాల డివిడెండ్గా 2,000 డాలర్లు నేరుగా బదిలీచేస్తా’’ అనిట్రంప్ అన్నారు. -
అమెరికా ఉన్నతాధికారులతో బాస్కెట్ బాల్ ఆడిన సిరియా అధ్యక్షుడు
వాషింగ్టన్: సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా (Ahmed al-Sharaa) అంతర్జాతీయంగా అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ (Brad Cooper)తో పాటు పలువురు అమెరికా అధికారులతో కలిసి అల్-షరా బాస్కెట్ బాల్ ఆడారు.ఈ స్నేహపూర్వక ఆట వాషింగ్టన్లో నిర్వహించబడిందని సమాచారం. సిరియా అధ్యక్షుడు అల్-షరా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సిరియా అధ్యక్షుడిగా అల్-షరా చేసిన తొలి అధికారిక అమెరికా పర్యటనగా గుర్తించబడింది. -
వివేక్ రామస్వామికి డోనాల్డ్ ట్రంప్ మద్దతు
-
అమెరికాలో ఇద్దరు భారత గ్యాంగ్స్టర్లు అరెస్ట్
న్యూఢిల్లీ: విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత దేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లలో ఇద్దరిని అరెస్టు చేయడంలో భారత భద్రతా సంస్థలు విజయాన్ని సాధించాయి. హర్యానా పోలీసులతోపాటు భద్రతా సంస్థ అధికారులు జార్జియాలో వెంకటేష్ గార్గ్ను అరెస్టు చేయగా, భాను రాణాను అమెరికాలో అరెస్టు చేశారు.ప్రస్తుతం భారతదేశానికి చెందిన 25 మందికి పైగా గ్యాంగ్స్టర్లు దేశం వెలుపల ఉన్నారు. వీరు క్రిమినల్ సిండికేట్లను నడుపుతున్నారని ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. గార్గ్, రాణాలను అరెస్టు చేయడానికి సాగించిన ఆపరేషన్లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయని సమాచారం. గార్గ్.. హర్యానాలోని నారాయణ్గఢ్ నివాసి. ప్రస్తుతం జార్జియాలో ఉంటున్న గార్గ్పై భారతదేశంలో 10 కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతను హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, తదితర రాష్ట్రాలకు చెందిన యువతను ప్రలోభపెట్టిన తన బృందంలో నియమించుకుంటాడు. గురుగ్రామ్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత హత్య తరువాత అతను జార్జియాకు పారిపోయాడు.గార్గ్ ప్రస్తుతం విదేశాలలో ఉంటున్న గ్యాంగ్స్టర్ కపిల్ సంగ్వాన్తో కలిసి దోపిడీ సిండికేట్ను నడుపుతున్నాడు. కాగా భాను రాణా .. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం కలిగి ఉంటూ, చాలా కాలంగా అమెరికాలో నివసిస్తున్నాడు. కర్నాల్ నివాసి అయిన రాణా చాలా కాలంగా నేర ప్రపంచంలో చురుగ్గా ఉన్నాడు. అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. రాణా నేర నెట్వర్క్ హర్యానా, పంజాబ్, ఢిల్లీ వరకు విస్తరించి ఉంది. పంజాబ్లో జరిగిన గ్రెనేడ్ దాడి దర్యాప్తులో అతని పేరు బయటకు వచ్చింది.ఇది కూడా చదవండి: 11న భూటాన్కు ప్రధాని మోదీ -
‘పాక్’ పని అప్పుడే ముగిసేది..’!
న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత దాయాది పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దాదాపు ఫుల్స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. మళ్లీ పాకిస్తాన్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ అనేది ఆన్లోనే ఉందనే విషయాన్ని భారత్ పదే పదే నొక్కి చెప్పిన నేపథ్యంలో పాక్ కాస్త తగ్గినట్లే కనబడుతోంది. అయితే ‘‘మాది అణ్వాయుధ దేశం. అవసరమైతే అణుయుద్ధం చేస్తాం’‘ అనే మాట పాకిస్తాన్ నుంచి అప్పుడప్పుడు నినిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ అణు యుద్ధానికి దిగకపోయినా గొప్పలు చెప్పకోవడంలో మాత్రం ముందుంటుంది పాకిస్తాన్. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్లోని న్యూక్లియర్ స్థావరాలను ఎప్పుడో తుంచేయాల్సి ఉందని, కానీ అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ నుంచి అనుమతి రాకపోవడం వల్లే అది ఆగిపోయిందన్నారు అమెరికా గూఢచార సంస్థ (Central Intelligence Agency) మాజీ అధికారి రిచర్డ్ బార్లో. ఈ విషయాన్ని తాజాగా ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారాయన. ఆనాడు ఇజ్రాయిల్తో కలిసి భారత్ సంయుక్త ఆపరేషన్కు సిద్ధమైంది. 1980 ఆరంభంలో భారత్-ఇజ్రాయిల్లు సంయుక్త ఆపరేషన్.. పాకిస్తాన్పైనే. పాక్లోని కతువాలోని న్యూక్లియర్ స్థావరాన్ని ధ్వంస చేయడమే ఆ ఆపరేషన్ లక్ష్యం. కానీ దానికి అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఒప్పుకోలేదు. అప్పటికే ఇజ్రాయిల్ సిద్ధంగా ఉంది. కానీ భారత్ అనుకూలంగా స్పందించలేదు. ప్రధానంగా ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి అనుమతి రాలేదు. దాంతో ఆ ఆపరేషన్ ఆగిపోయింది. లేకపోతే పాకిస్తాన్ న్యూక్లియర్ స్థావరాల ఎపిసోడ్ అనేది అప్పుడే ముగిసేది. ఇందిరా గాంధీ దానికి అనుమతి ఇవ్వకపోవడం నిజంగా సిగ్గు పడాల్సిన విషయం. పాకిస్తాన్ అణు స్థావరాలను మొగ్గలోనే తుంచేసే అవకాశం అప్పుడు వచ్చింది. కానీ దానికి ముందడుగు భారత్ నుంచి పడకపోవడం బాధాకరం’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం.. పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని ఎలా కప్పిపుచ్చిందో బహిర్గతం చేశారు.పాకిస్తాన్ అణు ఆయుధాలు అభివృద్ధి చేస్తోందన్న స్పష్టమైన ఆధారాలు ఉన్నా, అమెరికా అధ్యక్షులు 1989 వరకు పాకిస్తాన్ను అణు ఆయుధాలు లేనిదిగా ధృవీకరించారని ఆయన ఆరోపించారు. అమెరికా కూడా తమ స్వలాభం కోసం ఇలా చేసిందన్నారు. F-16 యుద్ధ విమానాలను అణు ఆయుధాల రవాణాకు అనుకూలంగా పాక్ మార్చినట్లు ఆయన చెప్పారు. అయినా అమెరికా ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా అప్పట్లో పాకిస్తాన్ను అణ్వాయుధ దేశంగా గుర్తించలేదని, దానికి చాలా కారణాలున్నాయన్నారు, ఒకవేళ అనాడే భారత్-ఇజ్రాయిల్లు సంయుక్తంగా ఆ ఆపరేషన్ చేపట్టి పాకిస్తాన్ రహస్య న్యూక్లియర్ స్థావరాలను ధ్వంసం చేసి ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం లభించి ఉండేదన్నారు.ఇదీ చదవండి:మాలీలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ -
జీ-20 సదస్సును బహిష్కరిస్తున్నాం: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును అమెరికా బాయ్కాట్ చేస్తున్నట్టు ట్రంప్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో జీ-20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇందుకు గల కారణాలను ట్రంప్ వెల్లడించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా..‘జీ-20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగడం పూర్తిగా అవమానకరం. ఆ దేశంలో మైనార్టీలు అయిన తెల్లజాతి రైతులపై హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలు జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న దారుణాలు ప్రపంచానికి తెలియాలి. అందుకే అమెరికా జీ-20 సదస్సుల్లో అమెరికా పాల్గొనడం లేదు. జీ-20 దేశాల అధినేతల సదస్సుకు అమెరికా నుంచి ఎవరూ హాజరు కావడం లేదు. ఈ సదస్సును బహిష్కరిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.అయితే, ఇటీవల మియామిలో చేసిన ప్రసంగంలో దక్షిణాఫ్రికాను జీ-20 గ్రూప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన ట్రంప్, తాజాగా అక్కడ జరిగే సదస్సును బహిష్కరించాలని నిర్ణయించారు. కాగా, తెల్లజాతి ఆఫ్రికన్ రైతులు దక్షిణాఫ్రికాలో దాడులకు గురవుతున్నారని, అక్కడి సర్కారు వారిని రక్షించడంలో విఫలమైందంటూ ఆరోపించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన తెల్లజాతీయుల కోసం ట్రంప్ ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. వలసదారులకు ఆశ్రయం ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.ట్రంప్కు దక్షిణాఫ్రికా కౌంటర్.. అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ దేశంలో తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ నల్లజాతి ప్రజల కంటే ఎక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని స్పష్టం చేసింది. తెల్లజాతి రైతులపై వివక్ష, హింస జరుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తప్పుడు సమాచారం అందినట్లు తెలిపింది.నవంబర్ 22-23 తేదీల్లో సదస్సు.. ఇక, జీ-20 సదస్సు ఈ ఏడాది నవంబర్ 22-23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరగనుంది. ఈ సదస్సు ఆఫ్రికా ఖండంలో జరగడం ఇదే మొదటిసారి. వాస్తవానికి ట్రంప్ ఇప్పటికే తాను జీ-20 సదస్సుకు హాజరు కావట్లేదని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు వాన్స్ కూడా తన ప్రయాణాన్ని రద్దు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బహిష్కరించారు. -
అమ్మ సినిమాలు వాస్తవం తెలిపాయి
ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక అమ్మ ఉంటుంది. న్యూయార్క్ మేయర్గా గెలిచి చరిత్ర సృష్టించిన జొహ్రాన్ మమ్దానీ తన ఆలోచనా విధానం, వ్యక్తిత్వం ద్వారానే ఓటర్లను ఆకట్టుకున్నాడు. ‘మా అమ్మ మీరా నాయర్ సినిమాలే నా ఆలోచనలను తీర్చిదిద్దాయి’ అన్నారాయన. మీరా నాయర్ ప్రపంచ సినిమాలో భారతీయ ప్రతిభను చాటిన దర్శకురాలు.‘ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే’ అంటుంటారు. ఇప్పుడు కాస్త మార్చి ‘న్యూయార్క్కు మేయర్ అయినా..అమ్మకు కొడుకే’ అనాలేమో. అవును! 400 ఏళ్ల చరిత్ర ఉన్న న్యూయార్క్ మహా నగరానికి మేయర్గా ఎన్నికైన దక్షిణాసియా తొలి వ్యక్తిగా జోహ్రాన్ మమ్దానీ (34) తాను వార్తలలో ఉండటమే కాదు తల్లి మీరా నాయర్ను కూడా వార్తలలోకి ఎక్కించారు. మేయర్గా గెలిచినందుకు మమ్దానీ ఎంత గర్వపడుతున్నారో అతణ్ణి చూసి మీరా నాయర్ కూడా అంతే గర్వపడుతున్నారు. మమ్దానీ కోసం ఆమె స్వయంగా ప్రచారం చేశారు కూడా. సంచలన సినీ దర్శకురాలిగా పేరు తెచ్చుకుని ఆస్కార్కు నామినేట్ అయిన మీరా ప్రత్యక్షంగా పరోక్షంగా కుమారుణ్ణి ప్రభావితం చేశారు. ప్రత్యక్షంగా పెంపకం ద్వారా అయితే పరోక్షంగా తన సినిమాల ద్వారా. ‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై’న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ ప్రచారం మొదలైనప్పుడు గెలుపు అవకాశం ఉన్న వ్యక్తుల జాబితాలో పదవ స్థానంలో ఉన్న మమ్దానీ ఒకటవ స్థానానికి ఎగబాకి విజయం సాధించడం సినిమాటిక్గా అనిపించవచ్చు. కాని అతని గెలుపు సినిమాటిక్ కాదు. మమ్దాని ఇచ్చిన నినాదం ‘న్యూయార్క్ వలసవాదుల నగరంగానే ఉంటుంది’ అనేది యాదృచ్చికంగా రాలేదు. తల్లి మీరా నాయర్ సినిమాల ప్రభావంతో అంది పుచ్చుకున్నది. మీరా నాయర్ తీసిన ‘సలాం బాంబే’, ‘మిసిసిపి మసాలా’ పరాయి దేశాల్లో, పరాయి నగరాల్లో తమ స్థాయి, స్థానం కోసం పెనుగులాడే వలసజీవుల కథలు. ‘మీరు మావాళ్లు కాదు వెళ్లిపోండి’ అంటే మానవ పరిణామక్రమం, వలసతో వికసించిన నాగరికతలను నిరాకరించడమే. అందుకే మమ్దాని వలసవాదుల కోసం గట్టిగా నిలబడ్డారు. అలాగే నగరంలో సగటు వ్యక్తి జీవించగలిగేలా, అన్ని సంస్కృతులను ఇనుమడించేలా చూస్తానని మమ్దాని హామీ ఇవ్వడం మీరా నాయర్ ప్రభావమే. యువకుడిగా ఉన్నప్పుడు ఆమె సినిమా సెట్లలో పని చేసేవారు మమ్దాని. స్వతహాగా అతను రాప్ సింగర్ కూడా.వాస్తవ ప్రపంచం‘అమ్మ సినిమాలు చూడటం అంటే వాస్తవ ప్రపంచంలో ఉండటమే’ అంటారు మమ్దాని. వాస్తవికవాద సినిమాలనే మీరానాయర్ తీశారు. ఆమె తీసిన ‘మాన్సూన్ వెడ్డింగ్’ భారతీయ సంపన్న కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న బోలుతనాన్ని చూపితే, ‘నేమ్సేక్’ వలస జీవనంతో భారతీయులు తమ సాంస్కృతిక అస్తిత్వం కోసం చేసే అన్వేషణను చూపుతుంది. మీరా చిత్రాల్లో స్త్రీవాదం ఉంటుంది. అయితే ఆమె మహిళా కథానాయకులు బాధితులు కారు, ఆ బాధల్లోంచి బయటపడాలని భావించేవారు, అందుకు తగ్గ పోరాటాలు చేసేవారు. ఇప్పుడు మమ్దాని ఏ న్యూయార్క్ నగరానికైతే మేయర్ అయ్యారో అదే నగరంపై జరిగిన 9/11 దాడి నేపథ్యంలో మీరానాయర్ ‘ది రిలక్టెంట్ ఫండమెంటలిస్ట్’ సినిమా తీశారు. తల్లికి ఉన్న ఈ బలమైన దృష్టికోణం, వ్యక్తిత్వం, సత్యం వైపు నిలబడే ధీమత్వం తనకు దిశా నిర్దేశం చేసిందంటారు మమ్దాని. తండ్రి మహమూద్ మమ్దానీ కొలంబియా యూనివర్సిటీలో ్ర΄÷ఫెసర్ మాత్రమే కాదు సామ్రాజ్యవాద రాజకీయాల నిపుణుడు కావడం జొహ్రాన్ మమ్దానీకి లాభించింది.మమ్దాని సలహా– మీరా ‘ది నేమ్సేక్’తన జీవితంలోని అతి ముఖ్యమైన నిర్ణయాల్లో తన కుమారుడి సలహా ఉందని మీరా నాయర్ అంటారు. అందుకు ఒక ఉదాహరణ చెబుతారు. ‘ది నేమ్సేక్’ సినిమా తీద్దామనుకుంటున్న సమయంలో ‘హ్యారీ పోటర్–4’కు దర్శకత్వం వహించే అవకాశం మీరాకు వచ్చింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్, ప్రపంచ ప్రఖ్యాత నవల, బోలెడంత డబ్బు, పేరు. కానీ అప్పటికే ‘ది నేమ్సేక్’ పనుల్లో ఆమె నిమగ్నమయ్యారు. ఆ సమయంలో మమ్దానీకి 14 ఏళ్లు. ఇప్పుడేం చేయాలని కొడుకును అడగ్గా, ’అమ్మా! హ్యారీ పోటర్ తీయడానికి చాలామంది దర్శకులున్నారు. కానీ ‘ది నేమ్సేక్’ సినిమా నువ్వే తీయగలవు’ అని చె΄్పాడు. అది చాలా స్వేచ్ఛాయుతమైన, స్పష్టమైన ప్రకటన అని, అందుకే తాను ‘హ్యారీపోటర్’ అవకాశం వదులుకున్నానని ఆమె వివరించారు. ‘నేను ముగింపును నమ్మను, ప్రారంభాలను నమ్ముతాను.‘ అంటారు మీరా నాయర్. ఆ లెక్కన మమ్దానీకి ఇది ప్రారంభం. మేయర్గా ఆయన ఎదుర్కోవాల్సిన సమస్యలు బోలెడున్నాయి. ఎల్లప్పుడూ తల్లి పంచే స్ఫూర్తి ఆయనకు తోడుగా ఉంటుంది. -
దేశవ్యాప్తంగా 1,800 విమానాలు రద్దు


