breaking news
USA
-
చైనా అరాచకం.. భారత సరిహద్దుల్లో రహస్య అణు పరీక్షలు
వాషింగ్టన్: భారత్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో చైనా రహస్యంగా జరిపిన అణు పరీక్షలపై అమెరికా సంచలన విషయాలను వెల్లడించింది. 2020లో భారత్, చైనాల మధ్య గాల్వాన్లో ఘర్షణలు చోటుచేసుకున్న అనంతరం.. చైనా రహస్యంగా అణు పరీక్షలను నిర్వహించినట్లు అమెరికా చెప్పింది. దీంతో, అమెరికా వెల్లడించిన వివరాలు తీవ్ర చర్చకు దారి తీశాయి.అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ థామస్ డినాన్నో శుక్రవారం జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా థామస్.. అణు పరీక్షల వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత వారం రోజుల వ్యవధిలో జిన్ఙియాంగ్ ప్రావిన్సుల్లోని లోప్ నూర్ సైట్లో చైనా అణు పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా భూమి కంపనాలను గుర్తించడం కష్టంగా ఉండేందుకు ‘‘డీకప్లింగ్’’ అనే టెక్నాలజీని చైనా ఉపయోగించినట్లు అమెరికన్ అధికారులు చెబుతున్నారు.కాగా, డీ కప్లింగ్ అంటే భూగర్భంలో అతిపెద్ద గుహలో పరీక్షలు నిర్వహించడం. దీని వల్ల ఏర్పడే భూకంప తరంగాలు గుహలోనే అబ్సార్వ్ అవుతాయి. అయితే, ప్రపంచం కళ్ల నుంచి తప్పించుకోవడానికి చైనా రహస్య అణు పరీక్షలు నిర్వహిస్తోందనే సమాచారం తమ వద్ద ఉందన్నారు. జూన్ 22, 2020న చైనా అలాంటి ఒక అణు పరీక్షను నిర్వహించిందని అమెరికా నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. గాల్వాన్ ఘర్షణల్లో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. ఈ క్రమంలో చైనాపై భారత్ జరిపిన దాడిలో 35-40 మంది చనిపోయినట్లు యూఎస్ నివేదికలు చెబుతున్నాయి. చైనా తన సైనికుల మరణాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే, గాల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత 2024లో ఈ ప్రతిష్టంభన ముగిసింది.చైనాపై ఎందుకు అనుమానం?చైనా తన అణ్వాయుధాలను పెంచుకోవడంపై అమెరికా ఆందోళన చెందుతోంది. బీజింగ్ వద్ద సుమారు 600 అణు వార్హెడ్లు ఉన్నాయని నమ్ముతున్నారు. గత సంవత్సరం, నవంబర్లో చైనా, పాకిస్తాన్ అణు పరీక్షలు చేసిన సమయంలో అమెరికా సైన్యాన్ని అణు ఆయుధాల పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ట్రంప్ ఆదేశించారు. మరోవైపు రష్యా కూడా అణు పరీక్షలు చేస్తోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు రష్యాతో భవిష్యత్తులో కుదిరే ఏ అణు ఒప్పందంలోనైనా చైనా కూడా భాగం కావాలని ట్రంప్ కోరుకుంటున్నారు. మరోవైపు.. అమెరికా, రష్యా మధ్య చివరి అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగిసిన తర్వాత ఈ ఆరోపణలు రావడం సంచలనంగా మారాయి. -
పాకిస్తాన్కు అమెరికా బిగ్ షాక్ POK భారత్లో అంతర్భాగమే..
-
‘రైతే ఎప్పటికీ రారాజు’.. అమెరికా ఒప్పందంలో స్పష్టం!
న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య కుదిరిన తాజా మధ్యంతర వాణిజ్య ఒప్పందం మన దేశీయ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప ఊరటను అందించింది. ఈ ఒప్పందంలో అమెరికా.. భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న దిగుమతి సుంకాలను గతంలో ఉన్న 50 శాతం నుండి ఏకంగా 18 శాతానికి తగ్గించింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి, మన ఎగుమతిదారులకు భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ భారీ రాయితీలను పొందుతూనే, భారతదేశం అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం దెబ్బతినకుండా జాగ్రత్తపడింది.అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాల్లో ఎటువంటి దిగుమతి రాయితీలను ప్రకటించలేదు. ముఖ్యంగా వరి, గోధుమలు, పాలు, పౌల్ట్రీ, ఇథనాల్ తదితర ఉత్పత్తులపై పన్నులను తగ్గించకుండా రక్షణ కల్పించింది. అమెరికాలో వ్యవసాయం భారీ సబ్సిడీలతో నడుస్తుండటంతో, అక్కడి నుండి తక్కువ ధరకే ఉత్పత్తులు భారత్కు వస్తే.. మన చిన్న , ఉపాంత రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ముందుగానే గుర్తించిన కేంద్రం సుమారు 70 కోట్ల మందికి ఆధారమైన వ్యవసాయ రంగాన్ని విదేశీ కార్పొరేట్ దిగ్గజాల నుండి కాపాడగలిగింది.భారతదేశం ప్రస్తుతం 51 బిలియన్ డాలర్ల(4.62 లక్షల కోట్లు) విలువైన వ్యవసాయ ఎగుమతులను కలిగివుంది. ఈ కొత్త ఒప్పందంతో రానున్న నాలుగేళ్లలో ఈ ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు చేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. భారతదేశంలోని సుగంధ ద్రవ్యాలు, బియ్యం, టీ, కాఫీ, పండ్లు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందేందుకు ఈ టారిఫ్ తగ్గింపు రైతులకు ఒక వరంగా మారనుంది. దేశంలోని రైతుల జీవనోపాధికి ఎటువంటి ముప్పు కలుగకుండా.. అమెరికాతో ఈ ఒప్పందాన్ని కుదరుర్చుకోవడం భారత్ సాధించిన చారిత్రక విజయమని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ -
పాక్కు షాకిచ్చిన అమెరికా..!
దాయాది పాకిస్తాన్.. గత కొన్ని రోజులుగా అమెరికా అండ చూసుకుని తెగ వయ్యారాలు పోయింది. కొన్ని నెలలుగా భారత్-అమెరికాల మధ్య నెలకొన్న అనిశ్చిత కారణంగా పాకిస్తాన్ బిల్డప్లు మీద బిల్డప్లు ఇచ్చేసింది. ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్తో పాటు ప్రధాని షహబాజ్ షరీఫ్లకు ఒకటి రెండు సందర్భాల్లో అమెరికా ఆహ్వానం పలకడంతో వారి వేషాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తమతో అమెరికా బంధం శాశ్వతమైనది అన్నంతగా ఓవరాక్షన్ చేసింది పాకిస్తాన్. ఈ క్రమంలోనే అమెరికా చెప్పిన ప్రతీ విషయానికి ఊ కొట్టింది పాక్. అయితే పాకిస్తాన్ను మింగుడు పడని విషయం తాజాగా చోటు చేసుకుంది. ఒకటి భారత్తో అమెరికా డీల్ ఒకటైతే, మరొకటి జమ్మూ-కశ్మీర్ మొత్తం భాగం అనేది ఎప్పటికీ భారత్దే అని ప్రపంచానికి తెలిసేలా అమెరికా ట్వీట్ చేసింది. భారత్-అమెరికాల ట్రేడ్ డీల్ కుదిరిన గంటల వ్యవధిలోనే భారత్ మ్యాప్ను అమెరికా పోస్ట్ చేసింది. ఇందులో కశ్మీర్ను భారత్ మ్యాప్లోనే ఉంచి మరీ పోస్ట్ పెట్టింది. యూఎస్ అధికారిక ‘X ’ హ్యాండిల్లో భారత్ మ్యాప్ పోస్ట్ పెట్టింది. ఆ మ్యాప్లో జమ్మూ & కశ్మీర్, లడఖ్, అలాగే పీఓకే(POK) భారత్లో భాగంగా చూపబడింది. ఫలితంగా భారత్ యొక్క మ్యాప్ను అమెరికా అంగీకరిస్తుందనే సంకేతాలిచ్చింది. అదే సమయంలో పాకిస్తాన్ చేస్తున్న ‘కశ్మీర్పై హక్కు’ అనే వాదనను తిరస్కరిస్తోందని స్పష్టమైన సందేశం ఇచ్చింది. దాంతో పాకిస్తాన్ గట్టి షాక్ తగిలింది,. From tree nuts and dried distillers’ grains to red sorghum and fresh and processed fruit, the U.S.-India Agreement will provide new market access for American products. pic.twitter.com/mqpP10LJp1— United States Trade Representative (@USTradeRep) February 6, 2026 ఇవీ చదవండి:ఇది భారత్ వ్యూహాత్మక ముందడుగేనా?ట్రంప్ సుంకాలు: భారత్కు భారీ ఊరట -
ఇది భారత్ వ్యూహాత్మక ముందడుగేనా?
ఎట్టకేలకు భారత్ మరో ముందడుగు వేసింది. ఎప్పట్నంచో అమెరికాతో ఏర్పడిన సందిగ్థతకు ఓ ముగింపు ఇచ్చింది. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన అదనపు 25 శాతం సుంకాలను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం వెనుక భారత్ వ్యూహాత్మక ముందడుగు వేసింది. రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిన నేపథ్యంలో అమెరికా సుంకాల ఆంక్షలను తగ్గించింది. మరి ఇది రష్యాతో వాణిజ్య స్నేహంపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అనేది ఇప్పుటు హాట్ టాపిక్గా మారింది. రష్యాతో స్నేహంపై ప్రభావం ఎంత?రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి భారత్పై విధించిన ఆంక్షల నడుమే ట్రంప్ సుంకాలను తగ్గించారు. అయితే ఇది రష్యాతో సంబంధాలపై ఎంతవరకూ ప్రభావం చూపుతుందనే అనుమానం కూడా మరొకవైపు మొదలైంది. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలకు భారత్ కట్టుబడటంతో ఓ డైలమా ఏర్పడింది. ఇక రష్యాతో భారత్ సంబంధాలు చెడిపోయినట్లేనా అనే వాదన తెరపైకి వచ్చింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా చమురు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తుందని కూడా చెప్పకొచ్చారు. అయితే ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితుల్లో రష్యా చమురును చేయడం కష్టమేనా? అంటే అవుననక తప్పదు. అయితే కేవలం చమురు అంశమే భారత్-రష్యాల స్నేహంపై ప్రభావం చూపదని విశ్లేషకులు అంటున్నారు. రష్యాతో భారత్కు చాలా వాణిజ్య ఒప్పందాలున్నాయని, కేవలం చమురు అంశం పక్కకు వెళ్లిపోయినంత మాత్రాన ఈ ఇరు దేశాల సుదీర్ఘ స్నేహ బంధం ఎక్కడికి పోదని అంటున్నారు. భారత్కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుభారత్కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారు అనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. భారత్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో రష్యా ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంది. ఇప్పుడు భారత్పై అమెరికా ఆంక్షలు చమురుపై మాత్రమే. అంటే చమురును మాత్రమే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయదన్నమాట. భారత్కు ఫైటర్ జెట్లు, ట్యాంకులు, మిసైల్ సిస్టమ్స్ వంటి పరికరాల్లో రష్యా కీలక భాగస్వామి. భారత్ స్వదేశీ ఉత్పత్తి పెంచుతున్నప్పటికీ, రష్యా టెక్నాలజీపై ఆధారపడటం కొనసాగుతూనే ఉంది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులు వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం పెంపు దిశగా సాగుతున్నాయి. జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్కు రష్యా ఎరువు, లోహాలు సరఫరా కూడా చేస్తోంది. ఇలా అమెరికా, యూరప్ ఒత్తిళ్ల మధ్య భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటూ, రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాతో కుదిరిన డీల్ భారత్ వ్యూహాత్మక ముందడుగానే చెప్పుకోవచ్చనేది విశ్లేషకుల అంచనా. ఇది సమతుల్య వ్యూహమేనని వారు అంటున్నారు.పూర్తిగా ఆపిసినట్లేనా..?రష్యా నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చమురు కొనుగోలు చేయకూడదనేది అమెరికా ఆంక్షలు. అంటే సాంక్షన్డ్ ఎంటిటీస్( ఆంక్షలు ఉన్న సంస్థలు), నాన్ -సాంక్షన్డ్ ఎంటిటీస్(ఎటువంటి ఆంక్షలు లేని సంస్థలు) అనే వాదన కూడా ఇక్కడ తెరపైకి వచ్చింది. రష్యాలోని ఆంక్షలున్న సంస్థల నుంచి మాత్రమే చమురు కొనుగోల చేయకూడదా.. లేక ఎటువంంటి ఆంక్షలు లేని సంస్థల నుంచి కూడా చమురు కొనుగోలు చేయకూడదా అనేది ప్రస్తుతం కాస్త డైలమాలోనే ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నప్పుడు ఈ రెండింటి కింద కూడా చమురు కొనుగోలు చేయకూడదనే విషయం అర్థమవుతున్నా ఇక్కడ పూర్తిగా క్లారిటీ లేదు. ఇదిలా ఉంచితే, భారత్-రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలు చారిత్రాత్మకంగా బలంగా ఉన్నప్పటికీ, గత రెండు మూడేళ్లుగా ప్రాపంచిక పరిస్థితుల కారణంగా కొంత అనిశ్చితి ఏర్పడింది. అయితే 2025 చివర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించిన నేపథ్యంలో సంబంధాలు మళ్లీ చురుకుగా మారాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అమెరికా ఆంక్షలతో రష్యా చమురును భారత్ కొనుగోలు చేయకుండా ట్రంప్ చేసినప్పటికీ, రష్యాతో ఉన్న పలు వాణిజ్య సంబంధాలపై ఇది ఎటువంటి ప్రభావం చూపదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది భారత్ అమలు చేస్తున్న వ్యూహాత్మక ముందడుగుగానే చూడాలని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అమెరికాతో ఎంత వరకూ అవసరముందో అంతవరకూ, రష్యాతో ఏమి అవసరమో వాటిని మాత్రమే పటిష్టం చేసుకునేలా భారత్ సమతుల్య వాణిజ్యాన్ని కొనసాగించడానికి వేసిన ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.ఇదీ చదవండి:ట్రంప్ సుంకాలు.. భారత్కు భారీ ఊరట -
న్యూస్టార్ట్ చర్చలకు అమెరికా, రష్యా ఓకే
మాస్కో: ఆయుధాల నియంత్రణకు సంబంధించిన న్యూస్టార్ట్ ఒప్పందంపై చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని అమెరికా, రష్యాలు అంగీకారానికి వచ్చాయి. రష్యా, ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య యూఏఈలోని దుబాయ్లో జరుగుతున్న శాంతి చర్చల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచి్చనట్లు శుక్రవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. అదేవిధంగా, రెండు దేశాల మిలటరీ మధ్య 2021 నుంచి నిలిచిపోయిన ప్రత్యక్ష సంబంధాలను తిరిగి నెలకొల్పుకునేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయని వివరించారు. బాధ్యతాయుతమైన రెండు దేశాలు స్టార్ట్ చర్చలపై ఆసక్తితో ఉన్నాయన్నారు. అమెరికా, రష్యాల మధ్య చిట్టచివరి వ్యూహాత్మక ఆయుధాల నియంత్రణ ఒప్పందం(స్టార్ట్) గడువు గురువారంతో ముగిసిపోయింది. దీంతో, అత్యధికంగా అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాలకు ఇప్పుడు ఇక ఎటువంటి పరిమితులు లేవు. స్టార్ట్ ఒప్పందం విధించిన పరిమితులకు కట్టుబడి ఉండేందుకు తాము సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ప్రకటించగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టించుకోలేదు. చైనా కూడా ఈ ఒప్పందంలో చేరాలని పిలుపునిచ్చారు. చైనా మాత్రం ససేమిరా అంటోంది. -
న్యూస్టార్ట్ ముగింపు.. తీవ్ర ఒత్తిడిలో భారత్!
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల పోటీ మళ్లీ పెరగనుందా?. అమెరికా-రష్యా మధ్య న్యూస్టార్ట్ ఒప్పందం ముగియడం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే అదనుగా.. ఇటు పాక్-చైనాలు పరస్పర అణు సహకారంతో భారత్కు సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. అయితే.. ఇదంతా ఇండియా మంచికే అంటున్నారు నిపుణులు. అమెరికా–రష్యా మధ్య ఉన్న New START అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు 2026 ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసింది. ఒప్పందం పునరుద్ధరణ ప్రస్తావనే లేకపోవడంతో.. ఈ రెండు దేశాల మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేకుండా పోయాయి. ఇప్పుడు అమెరికా, రష్యా తమ అణు శక్తిని ఇష్టానుసారం పెంచుకునే అవకాశం పొందాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న అణు శక్తి దేశాలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది. అమెరికా–రష్యా పరిమితులు తొలగిపోవడంతో కొత్త ఆయుధ పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. పెద్ద శక్తులే ఆయుధాలను పెంచుకుంటే.. మనం ఎందుకు నియంత్రించుకోవాలి? అని ఇతర దేశాలు భావించొచ్చు. ఇదే అదనుగా.. తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయవచ్చు. అదే గనుక జరిగితే.. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించడానికి 1970లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ ఒప్పందం ఎన్పీటీ (Non-Proliferation Treaty) కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎన్పీటీ అంటే.. • కొత్త దేశాలు అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించడం.• ఇప్పటికే అణు శక్తి కలిగిన దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్) ఆయుధాలను తగ్గించడం.• అణు శక్తిని శాంతి ప్రయోజనాల కోసం (ఉదా: విద్యుత్ ఉత్పత్తి) ఉపయోగించడానికి సహకారం అందించడం.భారత్పై ప్రత్యక్ష ప్రభావంభారత్ ఇప్పటిదాకా క్రెడిబుల్ మినిమమ్ డిటర్రెన్స్ అనే అణు వ్యూహాన్ని పాటిస్తోంది. దీని ప్రకారం.. శత్రువు దాడి చేయకుండా నిరోధించడానికి, భారత్ వద్ద ఉన్న అణు శక్తి నమ్మదగినది (credible)గా ఉండాలి. అది శత్రువుకు నమ్మదగిన నిరోధక శక్తిగా (deterrent) పనిచేయాలి. అవసరానికి మించి పెద్ద అణు నిల్వలు కాకుండా.. తన భద్రతకు అవసరమైన కనీస అణు ఆయుధ శక్తిని మాత్రమే కలిగి ఉంటే చాలూ(Minimum). అలాగే.. భారత్ అణు ఆయుధాలను మొదటగా వాడకూడదు(No First Use-NFU). కానీ దాడి జరిగితే తప్పనిసరిగా ప్రతిదాడి చేయొచ్చు. శత్రువు మొదట దాడి చేసినా, భారత్ వద్ద ప్రతిదాడి చేసే సామర్థ్యం ఉండాలి( Second Strike Capability). 1999లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ‘‘డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్ట్రైన్’’లో సీడీఎం అనే సూత్రాన్ని ప్రకటించింది. ఆపై 2003లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఏర్పాటుతో ఎన్ఎఫ్యూలో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం.. బయోలాజికల్ లేదంటే కెమికల్ దాడి జరిగినా అణు ప్రతిదాడి చేసే అవకాశం కల్పించారు. మొత్తంగా భారత అణువిధానం.. అణ్వాయుధాలను రక్షణ కోసం మాత్రమే దాడి కోసం కాదు అని పాటిస్తూ వస్తోంది. అయితే.. భారమే అయినా..న్యూస్టార్ట్స్ గడువు ముగిసింది. అణ్వాయుధ పోటీలో భాగంగా చైనా తన అణు శక్తిని పెంచే అవకాశం లేకపోలేదు. అలాగే పాకిస్తాన్తో అణు సహకారం పెంచుకోవచ్చు కూడా. అణ్వాయుధ పోటీ వల్ల ఈ రెండు దేశాలు మరింత శక్తివంతమైన వ్యూహాలను అవలంబించే అవకాశం ఉంది. అదే జరిగితే.. భారత్ కూడా తన నిరోధక శక్తిని పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. భారత్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, సబ్మేరిన్ ఆధారిత అణు నిరోధక శక్తిను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అణు ఆయుధాల అభివృద్ధి, నిర్వహణ ఖర్చులు భారత్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచొచ్చు. అలాగే.. రక్షణ బడ్జెట్లో మరింత పెంపు అవసరం పడుతుంది. అంటే ఆర్థిక, భద్రతా, రాజనీతిక సవాళ్లు పెరుగుతాయన్నమాట. మరోవైపు.. అమెరికా–రష్యా పోటీ వల్ల కొత్త మల్టిలేటరల్ చర్చలు అవసరం అవుతాయి. జీ20, బ్రిక్స్ సదస్సులతో పాటు ఐక్యరాజ్య సమితి లాంటివి అందుకు వేదికలు అవుతాయి. ఇందులో భారత్కు కచ్చితంగా ప్రాధాన్యత లభించవచ్చు. ఎన్పీటీలో సభ్యత్వం లేని భారత్ ఇదే అదనుగా అంతర్జాతీయ వేదికలపై పారదర్శకత, నియంత్రణ చర్యలు కోరవచ్చు. ఇది భారత్కు గ్లోబల్ లీడర్షిప్ అవకాశాన్ని కలిగిస్తుంది. నో ఫస్ట్ యూజ్ విధానం కొనసాగిస్తున్న భారత్.. తన నైతిక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఏంటీ న్యూస్టార్ట్? న్యూస్టార్ట్ (New Strategic Arms Reduction Treaty) అనేది.. అమెరికా–రష్యా మధ్య 2010లో కుదిరిన అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం. పూర్తి పేరు: Treaty between the United States of America and the Russian Federation on Measures for the Further Reduction and Limitation of Strategic Offensive Arms. దీని ప్రధాన ఉద్దేశ్యం రెండు దేశాల వద్ద ఉన్న వ్యూహాత్మక అణు ఆయుధాలను పరిమితం చేసి, ప్రపంచ భద్రతను బలోపేతం చేయడం.కోల్డ్ వార్ తర్వాత అమెరికా, రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధ ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో 2010 ఏప్రిల్ 8న, ప్రాగ్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ సంతకం చేశారు. 2011 ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాత 2021లో 5 సంవత్సరాలు పొడిగించబడింది. ఇందులో భాగంగా.. అణు ఆయుధాల విషయంలో ప్రపంచంలో శక్తివంతమైన దేశాలైన అమెరికా, రష్యాలు పరిమితంగా ఉండాలి. ఒకదానికొకటి లెక్కలు చెప్పుకోవాలి. అలాగే అణు ఆయుధాల నియంత్రణ ద్వారా ఇతర దేశాలకు కూడా భద్రతా హామీ ఇవ్వాలి. కానీ, 2026 ఫిబ్రవరి 5న గడువు ముగిసింది. ఇప్పుడు అమెరికా–రష్యా మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేవు.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
అమెరికా పవర్ఫుల్ కంట్రీ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా రక్షణ రంగాన్ని ఎప్పుడూ లేని స్థాయిలో బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో న్యూ స్టార్ట్ అణు ఆయుధ నియంత్రణ ఒప్పందంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా స్పందిస్తూ..‘అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం. నా ఫస్ట్ టర్మ్లోనే మిలిటరీని పూర్తిగా అత్యున్నతంగా తీర్చి దిద్దాను. కొత్త అణ్వాయుధాలు అభివృద్ధి చేశాం. పాత వాటిని రీఫర్బిష్ చేశాం. దేశ రక్షణ రంగాన్ని ఎప్పుడూ లేని స్థాయిలో బలోపేతం చేస్తున్నామన్నారు. అమెరికా సైనిక శక్తి, అణ్వాయుధ సామర్థ్యం గొప్పది. అమెరికా స్పేస్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం మా ప్రభుత్వ పెద్ద నిర్ణయం. అంతరిక్ష భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ చర్య అమెరికా రక్షణ వ్యవస్థను మరింత బలపరిచింది. భవిష్యత్ యుద్ధాలు భూమి మీదే కాకుండా అంతరిక్షంలోనూ జరుగుతాయని, అందుకే స్పేస్ ఫోర్స్ కీలకం’ అని పేర్కొన్నారు.యూఎస్ నౌకా దళంపై..నౌకాదళ విభాగంపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా మాట్లాడారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సేవలందించిన ఐవా, మిస్సోరీ, అలబామా వంటి యుద్ధనౌకల కంటే 100 రెట్లు శక్తిమంతమైన ఆధునిక బ్యాటిల్షిప్లను నిర్మిస్తున్నామని తెలిపారు. సముద్ర రక్షణను మరింత పటిష్టం చేయడమే తమ లక్ష్యమన్నారు.భారత్, పాక్పై పాత పాటే.. ఇక అణు యుద్ధాల అంశంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేకెత్తించాయి. భారత్-పాకిస్తాన్, ఇరాన్ ఇజ్రాయెల్, రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యే సమయంలో అణు ఘర్షణలు తలెత్తకుండా తానే జోక్యం చేసుకుని ఆపానని తెలిపారు. అయితే యుద్ధాలకు సంబంధించి స్పష్టమైన వివరాలు మాత్రం ఇవ్వలేదు. అదేవిధంగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా ట్రంప్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా మధ్యవర్తిత్వం చేసిందని చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు గత ఏడాది నుంచి కృషి చేస్తున్నానని, అర్మేనియా- అజర్బైజాన్ మధ్య దీర్ఘకాల ఘర్షణను కూడా పరిష్కరించానని పేర్కొన్నారు.అణు నియంత్రణపై.. ఇక న్యూ స్టార్ట్ అణు ఆయుధ నియంత్రణ ఒప్పందంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం సరైన విధంగా చర్చించకుండా కుదిరిందని, అమెరికాకు అనుకూలంగా లేదని విమర్శించారు. అంతేకాకుండా ఇది ఉల్లంఘనలకు గురవుతోందని ఆరోపించారు. దీనిని పొడిగించడానికి బదులుగా కొత్త, మెరుగైన, ఆధునిక ఒప్పందాన్ని రూపొందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా అణు నిపుణులు కలిసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఒప్పందం రూపొందించాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక భద్రతను కల్పించే విధంగా సమగ్ర అణు నియంత్రణ వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. -
భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. కడుపు మంటలో పాకిస్థాన్
ఇస్లామాబాద్: అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ పాకిస్థాన్ పాలకుల పరిస్థితిని గందరగోళంలోకి నెట్టింది. పొగడ్తలతో, ఫోటోలకు ఫోజులిచ్చే ప్రయత్నాలు సరిపోవని ప్రజలు, మాజీ మంత్రులు,ఆర్థిక నిపుణులు గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఒత్తిడిలో పాక్ ప్రధాని షెహబాజ్ పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా ఉంటే, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాత్రం ‘నిస్సహాయ ప్రేమికుడు’ అనే అపవాదు మూటగట్టుకుంటున్నారనే చర్చ మొదలైంది. మరి ఈ ట్రేడ్ డీల్ పాకిస్థాన్ పాలకుల పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చిందా?ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో స్తబ్ధుగా ఉన్న సంబంధాలు తాజాగా భారత్-అమెరికాల మధ్య కీలక వాణిజ్య పరమైన ఒప్పందాలతో పరిస్థితులు మెరుగున పడ్డాయి. అదే సమయంలో పాకిస్తాన్లో ప్రజలు తమ నేతల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు భారత్ గ్లోబల్ వాణిజ్యంలో ముందడుగు వేస్తుంటే..పాక్ ప్రజలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారుట్రంప్ సేవలో అసిమ్ మునీర్ఈ సందర్భంగా తమ పాలకుల తీరును గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పలు దుమ్మెత్తి పోస్తున్నారు. అమెరికాకు మరింత దగ్గరై వాణిజ్యంతో పాటు ఇతర అంశాల్లో లబ్ధి పొందేందుకు పడరాని పాట్లు పడింది. గతేడాది ట్రంప్ను కీర్తిస్తూ పాక్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్ష భవనంలో ట్రంప్తో కలిసి విందులో పాల్గొన్నారు. పైగా, ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఆపినందుకు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ ప్రతిపాదనలు సైతం పంపించింది దాయాది దేశం.ఆర్ధిక ఇబ్బందులతో సతమతంఅయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం పాక్పై కొంచెం కూడా కనికరం చూపించలేదు. పాక్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై 19శాతం సుంకాల్ని విధించింది. ఆ సుంకాలను చెల్లిస్తూ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంది. భారత్ మాత్రం తన ఎగుమతులపై సుంకాలను 18 శాతానికి తగ్గించినా అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల ఒప్పందాల నుంచి తప్పుకుంది. తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది. తాజాగా, అమెరికాతో ట్రేడ్డీల్ కుదుర్చుకున్న భారత్పై పాక్ దేశస్థులు ప్రశంసలు కురిపిస్తూనే తమదేశాది నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. భారత్ను చూసి నేర్చుకోండి. ఫొటోలకు ఫోజులివ్వడం కాదని, దేశానికి లబ్ధి చేకూరే పనులు చేయాలని సూచిస్తున్నారు. ఇక దాయాది మాజీ మంత్రులు ఎక్స్ వేదికగా పాలకులపై సెటైర్లు వేస్తున్నారు. మాజీ పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) మంత్రి హమ్మాద్ అజ్హర్ ఇలా ట్వీట్ చేశారు. 21వ శతాబ్దంలో విదేశాంగ విధానం అనేది కేవలం చూపులు, వ్యక్తిగత సంబంధాల గురించి కాదు. అది ఆర్థిక శక్తిని వినియోగించడం, సుంకాల తగ్గింపు, దేశీయ మార్కెట్ను మరింత విస్తరించడం. భారత్ ఇటీవల యూరోపియన్ యూనియన్ (EU), అమెరికాతో చేసిన వాణిజ్య ఒప్పందాలు దీనికి నిదర్శనం. అతిగా పొగడ్తలు కురిపించడం, ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకు అర్రులు చాచడం వంటివి పనికి రావు’ అని పేర్కొన్నారు. ట్రంప్ను నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేయకపోయినా సుంకాల విషయంలో తాను ఏది కావాలనుకుందో భారత్ అది సాధించింది. ట్రంప్ పాకిస్థానికి ఇచ్చింది అదనంగా షూ పాలిష్ చేసుకునే అవకాశం తప్ప ఇంకేముంది?’ అని పాకిస్తాన్ ఆర్థికవేత్త జావేద్ హసన్ ఎద్దేవా చేశారు.మొత్తానికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్లో ఎవరికి ఎంత లాభం అనేది పక్కనపెడితే.. దౌత్య పరంగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు పాక్ పాలకులకు మాత్రం కంట్లో నలుసులా, గోటి చుట్టూ రోకటి పోటులా మారాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రపంచ ఆర్ధిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. -
india us trade deal: భారత్కు అమెరికా బంపరాఫర్
సాక్షి,ఢిల్లీ: భారత్-అమెరికా ట్రేడ్ డీల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అమెరికాతో జరిగిన ట్రేడ్ డీల్లో రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిఫలంగా అమెరికా.. భారత్కు విధించే ప్రతీకార పన్నును 18 శాతం తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నారు.అదే సమయంలో అమెరికా నుంచి భారత్ సైతం 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రకటనపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం స్పష్టత ఇచ్చారు. సీనియర్ అమెరికా అధికారులు వచ్చే వారం ఢిల్లీలో ఒప్పందంపై సంతకం చేయడానికి రానున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఫిబ్రవరి 3న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం తుది రూపం దాల్చింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా భారతీయ వస్తువులపై విధిస్తున్న సుంకాలను 50శాతం నుంచి 18శాతానికి తగ్గించింది. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, భారత ఎగుమతులకు కొత్త అవకాశాలు కలిగేందుకు దోహదం చేయనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
పెన్నీ.. విన్నర్
న్యూయార్క్: అమెరికాలో పెంపుడు శునకాల క్రమ శిక్షణ, అద్భుత నైపుణ్యాల ప్రదర్శనకు పెట్టింది పేరైన వెస్ట్మినిస్టర్ షోలో నాలు గేళ్ల నలుపు డామర్మాన్ శునకం ‘పెన్నీ’ విజేతగా నిలబడి అందరి మదినీ దోచేసింది. దీని వయసు కేవలం నాలుగేళ్లే. బెస్ట్ ఇన్ షో టైటిల్ నెగ్గడంతో దీని పెంపకందారు పెద్దాయన యాండీ లిన్టన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత పెన్నీ ద్వారా తనకు గుర్తింపు దక్కిందని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. 200 జాతులకు చెందిన మొత్తం 2,500 శునకాల నుంచి గట్టి పోటీ ఎదురైనాసరే పెన్నీ తన ఆట నైపుణ్యం, తెలివితేటలతో విజయకేతనం ఎగురవేసింది. ‘‘నాకింకా ఎన్నో విజయాలను వరించాలని ఉంది. కానీ ఈ 150వ వెస్ట్మినిస్టర్ కెన్నెల్ క్లబ్ డాగ్ షోను గెలవడం ఎంతో ప్రత్యేకం. పెన్నీ నిజంగా ఎంతో మంచి డాబర్మాన్. ఇలాంటి శునకాన్ని ఎన్నడూ చూడలేదు’’ అని యాండీ లిన్టన్ అన్నారు. ఈసారి విజేతలు చరిత్రలో నిలిచిపోతారని పోటీలకు న్యాయమూర్తి డేవిడ్ ఫిజ్ప్యాట్రిక్ వ్యాఖ్యానించారు. పెన్నీ గత ఏడాదిసైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజేత శునకాలలకు ట్రోఫీతోపాటు రిబ్బన్, బ్రాగింగ్ హక్కులను కల్పిస్తారు. బ్రాగింగ్ రైట్స్తో శునకాల సంరక్షకులు వాటి పెంపకానికి అత్యధిక ఫీజులు వసూలుచేస్తారు. శునకం జాతికీ సమాజంలో అత్యధిక విలువ దక్కుతుంది. -
మన ఆహార, వ్యవసాయ రంగాలకు పూర్తి రక్షణ
న్యూఢిల్లీ: అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పారు. మన దేశ ఆహార, వ్యవసాయ రంగాలకు ఈ ఒప్పందంలో పూర్తి రక్షణలు ఉన్నట్లు తెలిపారు. ఆయన బుధవారం తొలుత లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. మన దేశ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని అన్నారు. అమెరికాతో ఒప్పందం వల్ల మనకు లాభం చేకూరుతుందని ప్రకటించారు. అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువులకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఎగుమతుల విషయంలో మన పోటీ సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని వివరించారు. ఈ ఒప్పందం హఠాత్తుగా కుదిరిందని కాదని, భారత్, అమెరికా మధ్య పలు దఫాల చర్చల తర్వాతే తుదిరూపు వచ్చిందని స్పష్టంచేశారు. ఇది సమతుల్య, పరస్పర ప్రయోజనాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందమని పేర్కొన్నారు. -
జాగ్రత్త..చైనా అటాక్ చేయవచ్చు: అమెరికా
చైనా విషయంలో భారత్కు అమెరికా కీలక సూచన చేసింది. డ్రాగన్ కంట్రీతో ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండడం మంచిదని హెచ్చరించింది. చైనా, భారత్పై ఏ క్షణానైన దాడికి తెగబడవచ్చని అమెరికా మెరైన్ ఇంటిలిజెన్స్ మాజీ అధికారి భారత్కు హెచ్చరిక జారీ చేశారు.అరుణాచల్ విషయంలో డ్రాగన్ కంట్రీ తరచుగా భారత్పై కయ్యానికి కాలు దువ్వుతుంది. అయితే ప్రస్తుతం ఆ సమస్య అంత పెద్దగా లేదు. అయితే భవిష్యత్తులో చైనా, భారత్పై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ మెరైన్ ఇంటెలిజెన్స్ అధికారి గ్రాంట్ న్యుషామ్ భారత్ను హెచ్చరించారు.2049వరకూ చైనా తనను ప్రపంచంలోనే తనను సూపర్ పవర్గా స్థాపించుకోవాలనుకుంటుందని దానికి ప్రత్యేక లక్ష్యాలను నిర్ణయించుకుంటుందని తెలిపారు. తైవాన్తో సమస్య ఉన్న సమయంలోనే అకస్మాత్తగా మరో దేశంపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు. భారత్, దక్షిణకొరియా, జపాన్, ఫిలీప్పీన్స్ వంటి ప్రాంతాలపై అది దాడి చేయగలదని తెలిపారు. అందులోనూ భారత్ తొలిస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.దీనికోసం ఆయన చైనా, భారత్ మధ్య గతంలో జరిగిన గల్వాన్ లోయ వివాదాన్ని ప్రస్థావించారు. అయితే ప్రస్తుతం అమెరికా రాయబారిగా ఉన్న సెర్గియా గోర్ అధ్యక్షుడు ట్రంప్కు సన్నిహితుడని ఆయనతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరో మెట్టు ఎక్కుతాయని అన్నారు. కాగా ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధిస్తున్న అధిక పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వెయిట్లాస్ డ్రగ్ ఉపయోగించకుండానే..90 కిలోలు తగ్గిన గ్రామీ విజేత
సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ ప్రముఖులు బరువు తగ్గేందుకు వెయిట్లాస్ డ్రగ్స్ లేదా సర్జరీలు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి..అక్కడ వారి ఆహార్యం, లుక్ అత్యంత ప్రధానం. అదీగాక నిధానంగా బరువు తగ్గాలనేంత వ్వవధి వారికి ఉండదు కూడా కానీ ఈ అమెరికన్ రాపర్, గాయకుడు అలా కాదు..తొందరగా బరువు తగ్గించే మందులు జోలికే పోకుండా..ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గాడు. అదీకూడా ఏకంగా 90 కిలోలు పైనే బరువు తగ్గడం విశేషం. ఎంతో ఓపికతో..ఫుడ్ ఎడిక్షన్ని దూరం చేసుకుని మరి..స్లిమ్గా మారి స్ఫూర్తిగా నిలిచాడు. మరి అతడి వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందంటే..పాటల రచయిత, గాయకుడు జెల్లీ 2026 గ్రామీ అవార్డుల ప్రెస్ ఈవెంట్లో స్మార్ట్లుక్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు అక్కడ మీడియా ఇంటర్వ్యూలో తాను ఇంతలా స్లిమ్గా మారేందుకు తన ఫుడ్ ఎడిక్షన్పై ఎంతలా పోరాటం చేశాడో బహిరంగా వెల్లడించారు. తన కొకైన్ అడిక్షన్ని దూరం చేసుకున్నట్లుగానే ఈ ఆహార వ్యసనానికి చెక్కుపెట్టగలిగానని అన్నారు. అలాగే తన ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకున్నట్లు తెలిపారు.ఆహార వ్యసనానికి చెక్పెట్టడం అంటే..తినాలనే ఆలోచనను రానివ్వకుండా చేయడమేని అంటున్నాడు. అలాగే జీవనశైలిలో వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవడం వల్ల ఈ మార్పులు సాధ్యమైనట్లు షేర్ చేసుకున్నారు. ఇంతకుమునుపు తన టూర్లన్నీ పార్టీలు, డ్రింక్, మత్తుపదార్థాల చుట్టూ తిరిగేది. ఇప్పుడు తన టూర్ సంస్కృతి మంచి ఆహారం, వ్యాయామం, భావోద్వేగ పరంగా బలంగా ఉండటం చుట్టూ ఉందని ఆనందంగా చెబుతున్నాడు జెల్లీ.బరువు తగ్గడంలో ఆ రెండే కీలకం..జెల్లీ రోల్ బరువు తగ్గించే ప్రయాణంలో నడక, పరుగు చాలా కీలకమైన ప్రభావాన్ని చూపించినట్లు పేర్కొన్నాడు. తాను 5కే రన్ కోసం శిక్షణ పొందుతున్నప్పుడు..చాలా బరువు తగ్గినట్లు పేర్కొన్నాడు. అలాగే 2024లో ఓ రన్ ఈవెంట్ కోసం సిద్దమయ్యే నేపథ్యంలో రోజుకి రెండు నుంచి మూడు మైళ్లు చోప్పున వారానికి నాలుగు నుంచి ఆరు రోజులు పరిగెత్తేవాడట. ఇలా బరువు తగ్గడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని..అందువల్ల మరింత బరువు తగ్గేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్లు వివరించాడు. పైగా తేలిగ్గా ఉండి, ఏ టూర్ అయినా ఇట్టే వెళ్లిపోగలం, హాయిగా ఎంజాయ్ చేయగలం అని అంటున్నాడు. View this post on Instagram A post shared by GRAMMYS (@grammys) (చదవండి: తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారా..!? కానీ ఆ ఏజ్కి..) -
అమెరికా ప్రయాణంలో కర్ణాటక మహిళకు షాక్.. భారీ దొంగతనం
అబుదాబి: విమాన ప్రయాణంలో అమెరికాకు చెందిన ఓ వృద్ధురాలికి షాకింగ్ ఘటన ఎదురైంది. విమాన ప్రయాణం సందర్బంగా తన లాగేజీలోని బంగారం, వజ్రాలు మాయం కావడంతో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..కర్ణాటకలోని ధార్వాడ్కు చెందిన శాంత రమేష్ కాశింకుంటి (62) కుటుంబ సభ్యులు.. నవంబర్ 15, 2025న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అమెరికాకు ప్రయాణించారు. బెంగళూరు నుండి ఆకాష్ ఎయిర్లైన్స్లో అబుదాబి చేరుకున్నారు. అయితే, బెంగళూరు విమానాశ్రయంలోని చెక్-ఇన్ కౌంటర్లో అన్ని పత్రాలను ధృవీకరించిన తర్వాత వారు తమ లగేజీని అప్పగించారు. అయితే, వారు అబుదాబి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తమ బ్యాగ్లోని విలువైన వస్తువులు పోయినట్టు వారు గుర్తించారు.కాగా, తమ సూట్కేస్కు డ్యామేజీ లేకుండా, ఓపెన్ చేయకుండానే తమ వస్తువులు మాయం కావడంపై ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇక, వారి లగేజీలో 790 గ్రాముల బంగారం, రూ.8 లక్షల విలువైన వజ్రాభరణాలు, అమెరికన్ డాలర్లు ఉన్నట్టు బాధితులు చెప్పుకొచ్చారు. వెంటనే ఈ విషయాన్ని అబుదాబి అధికారులకు, ఆకాష్ ఎయిర్లైన్స్కు సమాచారం ఇచ్చామని, కానీ సరైన స్పందన రాలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత జనవరి 7, 2026న భారత్కు తిరిగి వచ్చిన అనంతరం బాధితులు కర్ణాటక పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బెంగళూరు విమానాశ్రయ పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదు. భద్రతా సిబ్బందిని ప్రశ్నించడంలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో పోలీసులు జనవరి 31న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
భారత్ అమెరికా మధ్య 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ డీల్స్'
-
ఇరాన్–అమెరికా చర్చలకు పాక్
ఇస్లామాబాద్: ఇరాన్–అమెరికాల మధ్య త్వరలో జరిగే చర్చల్లో పాల్గొనాలని పాకిస్తాన్కు ఆహ్వానం అందింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంగళవారం ఈ విషయం వెల్లడించింది. ఇరాన్–అమెరికాల మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చేందుకు, ఒక ఒప్పందానికి వచ్చేందుకు తటస్థ దేశం తుర్కియే వేదికగా త్వరలో చర్చలు జరిగే అవకాశాలున్నాయి.శాంతి ప్రయత్నాలకు మరింత విస్తృతమైన గుర్తింపు, మద్దతు లభించేలా ఇరుగుపొరుగు దేశాలకు కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. విదేశాంగ మంత్రుల స్థాయి చర్చల్లో పాల్గొనాలంటూ సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్టు, ఒమన్, యూఏఈ తదితర దేశాలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు చేస్తున్న యత్నాలను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు దేశాల మధ్య వివాదానికి ఇదే ప్రధాన అంశంగా మారింది. తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిన పక్షంలో అణ్వాయుధాల అంశాన్ని వదిలేస్తామని ఇరాన్ అంటోంది. -
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు
ఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్పై కేంద్రం ప్రకటన చేసింది. అమెరికాతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ట్రేడ్డీల్తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం.ఆక్వా,టెక్స్టైల్స్ ఎగుమితిలో మనకు ఇబ్బందులున్నాయి. వాణిజ్యం ఒప్పందం విషయాన్ని పార్లమెంట్లో చెప్పాలని చూశాం. ఈలోపే ట్రేడ్ డీల్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషం చిమ్మారు.వాణిజ్య ఒప్పందంతో ఏ వర్గానికి నష్టం జరగదు. బలహీనవర్గాల ప్రజలకు మేలు జరగడం రాహుల్కు ఇష్టం లేదు. ట్రేడ్ డీల్తో లక్షలమంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని స్పష్టం చేశారు. -
అమెరికాలో వరుస భూ ప్రకంపనలు
వాషింగ్టన్: అమెరికాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు స్థానికులను వణికించాయి. ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం కాలిఫోర్నియాలోని కాంట్రా కోస్టా కౌంటీలో ఉన్న శాన్ రామన్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.శాన్ రామన్ నగరానికి సుమారు 3 మైళ్ల దూరంలో, భూ అంతర్భాగంలో 8.59 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సమాచారం ప్రకారం, ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ జరగలేదు. అయితే శాన్ రామన్, డబ్లిన్ , డాన్విల్లే ప్రాంతాల్లో ప్రజలు స్పష్టమైన ప్రకంపనలను గుర్తించారు. ప్లెజంటన్, కాస్ట్రో వ్యాలీ, హేవర్డ్, లివర్మోర్ ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు నివేదికలు అందుతున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ జోస్ వంటి ప్రధాన నగరాల్లో ప్రకంపనల ప్రభావం అంతగా కనిపించలేదని సమాచారం.గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో వరుస భూకంపాలు సంభవిస్తుండటం గమనార్హం. సోమవారం ఉదయం కూడా ఇదే ప్రాంతంలో 4.2 తీవ్రతతో కూడిన ప్రకంపనలు సంభవించాయి. ఆ సమయంలో దాదాపు 25కు పైగా చిన్నపాటి భూకంపాలు (Swarm) నమోదయ్యాయి. ఈ వరుస ప్రకంపనల కారణంగా బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ రైళ్లను తాత్కాలికంగా నెమ్మదిగా నడిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, వరుసగా భూమి కంపిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
గ్రేట్ ట్రేడ్ డీల్.. అయినా ష్ గప్చుప్
అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ దాదాపుగా కుదిరినట్లే!. ఇరు దేశాల మధ్య ర్చలు ఓ కొలిక్కి వచ్చాయని.. తన మిత్రుడు మోదీతో ఫోన్లో సంప్రదింపులు జరిపానని.. అన్నింటికి ఆయన ఒప్పుకున్నారని.. అందుకే భారత్పై సుంకాలను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటు ఈ డీల్ను గ్రేట్గా అభివర్ణిస్తూ భారత ప్రజల తరఫున ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు కూడా. అయితే.. ఇక్కడే ఓ మెలిక ఉంది. భారత్ నుంచి ప్రస్తుతం అమెరికా 50 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇందులో 25 శాతం ప్రతీకార సుంకాలు కాగా.. మరో 25 శాతం పెనాలిటీ టారిఫ్ ఉంది. టారిఫ్లు 18 శాతానికి తగ్గిస్తున్నామని.. వీటిని సున్నాకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తామని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలో రష్యా నుంచి పూర్తిగా చమురు కొనుగోలును ఆపేందుకు భారత్ అంగీకరించిందని చెప్పారు. అయితే సుంకాల తగ్గింపుపై థ్యాంక్స్ మెసేజ్లో మోదీ ఈ అంశాన్ని ఏమాత్రం ప్రస్తావించలేదు. అలాగే అమెరికా ఉత్పత్తులను భారీ మొత్తంలో భారత్ కొనుగోలు చేస్తుందన్న ట్రంప్ స్టేట్మెంట్పైనా స్పందించలేదు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ ఇలా ప్రకటనలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇలా చార్లు ఆయన బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనతో ఆయా సందర్భాల్లో భారత ప్రభుత్వం బహిరంగంగా విబేధించింది. అలాంటిదేం ఉండబోదని.. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గమని.. జాతి ప్రయోజనాల మేరకు తమ నిర్ణయం ఉంటుందని ప్రకటించింది. అయితే ఈసారి మాత్రం ఇంక ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనిని వ్యూహాత్మక మౌనమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా, రష్యాలతో సంబంధాల నేపథ్యంలోనే ఇలా వ్యవహరిస్తుందని అంచనా వేస్తున్నారు. రష్యా ఆయిల్ కొనుగోలు ఆపివేతపై టారిఫ్ల తగ్గింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన ఇస్తుందో చూడాలి. అలాగే టారిఫ్లు 50 నుంచి 18కి తగ్గాయా? లేదంటే 25 శాతం నుంచే 18కి చేరాయా? అనేదానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అటు.. రష్యా సైతం ట్రంప్ తాజా ప్రకటనపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. గతంలో మాత్రం.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకంగా చూస్తూ, తమ చమురు మార్కెట్పై ప్రభావం ఉంటుందని సూచించింది. అలాగే భారత్ తమకు మిత్ర దేశమని.. ఇతర దేశాల ఒత్తిళ్లకు తలొగ్గే అవకాశమే ఉండబోదని ధీమా వ్యక్తం చేసింది. ఒకవేళ భారత్ రష్యా చమురు దిగుమతులను ఆపితే, రష్యా ఆసియా మార్కెట్లో తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా చమురు ఆగిందా?ట్రంప్ చెబుతున్నట్లు.. భారత్ రష్యా చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోలేదు. 2024లో రష్యా నుంచి భారత్ సుమారు 52.7 బిలియన్ డాలర్ల విలువైన చమురు దిగుమతి చేసింది. 2025 చివరలో ఈ తగ్గుదల కనిపించినా.. 2026 జనవరిలో కూడా మూడు కంపెనీలు (IOCL, BPCL, Nayara Energy) రష్యా చమురు కొనుగోలు కొనసాగించాయి. ఇక..ఒకప్పుడు రష్యా నుంచి భారత్ కేవలం 2 శాతం మాత్రమే చమురు దిగుమతి చేసుకునేది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా చమురు కొనుగోలు పెంచింది. ఎందుకంటే ఆ సమయంలో డిస్కౌంట్ ధరలు లభించాయి కాబట్టి. అలా.. 2024లో సుమారు US$52.7 బిలియన్ విలువైన చమురును దిగుమతి చేసుకుంది. 2025లో.. అమెరికా సుంకాల-ఆంక్షల బెదిరింపులు.. ట్రంప్ ఒత్తిడి, రష్యా నుంచి వచ్చే డిస్కౌంట్ తగ్గిపోవడం, మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరా పెరగడం.. తదితర కారణాలతో చమురు దిగుమతులు తగ్గినట్లు అనిపించాయి. డిసెంబర్ 2025లో భారత్ మొత్తం చమురు దిగుమతులు 21.6 మిలియన్ టన్నులకు చేరాయి, అయితే.. గత 9 నెలల్లో ఇదే అత్యధికం. ఇక.. జనవరి 2026లో రష్యా చమురు దిగుమతులు నవంబర్తో పోలిస్తే 35% తగ్గాయి. రిలయన్స్ వంటి పెద్ద ప్రైవేట్ కంపెనీలు రష్యా చమురు కొనుగోలు తగ్గించాయి, కానీ IOCL, BPCL, Nayara Energy మాత్రం కొనుగోలు కొనసాస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.సూటిగా మూడు పాయింట్లలో.. భారత్: ట్రంప్ సుంకాల తగ్గింపును స్వాగతించింది. కానీ రష్యా చమురు అంశంపై మౌనం పాటిస్తోందిఅమెరికా: భారత్ రష్యా చమురు ఆపివేస్తుందని ధృవీకరించిందిరష్యా: ఆసియా మార్కెట్ దెబ్బ తినే అవకాశంతో.. ట్రంప్ ప్రకటనను ఖండించే చాన్స్ -
జడ్జి సంచలన తీర్పు చిక్కుల్లో ట్రంప్..
-
జాబిలితో నాసా అష్టావధానం!
అర్ధ శతాబ్దం తర్వాత చందమామ చెంతకు మానవసహిత యాత్ర చేపట్టబోతోంది నాసా. వాతావరణం అనుకూలిస్తే అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 8న ‘స్పేస్ లాంచ్ సిస్టమ్’ (ఎస్ఎల్ఎస్)కు చెందిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ గాల్లోకి లేస్తుంది. 32 అంతస్తుల ఎత్తుండే ఈ భారీ ఆ రాకెట్లో అతి శీతల ద్రవ ఆమ్లజని, ద్రవ ఉదజనితో కూడిన 26.5 లక్షల లీటర్ల ఇంధనం వాడబోతున్నారు. 53 ఏళ్ల క్రితం 1972లో నిర్వహించిన ‘అపోలో 17’ మిషన్ తర్వాత నాసా చేపడుతున్న తొలి మానవసహిత చంద్రయాత్ర ఇది. నలుగురు అమెరికన్ వ్యోమగాములు రీడ్ వైస్ మాన్ (కమాండర్), విక్టర్ గ్లోవర్ (పైలట్), క్రిస్టినా కోచ్ (మిషన్ స్పెషలిస్ట్), జెరెమీ హాన్సెన్ (మిషన్ స్పెషలిస్ట్) చంద్రకక్ష్యలోకి వెళ్లి తిరిగిరానున్నారు. ప్రస్తుతానికి వీరు జాబిల్లిపై దిగబోవడం లేదు. చంద్రుడి చుట్టూ ‘ఓ రౌండ్’ కొడతారు. చంద్రుడి ఆవలి వైపునకు వెళతారు. ఆ సందర్భంలో వారికి భూమి కొంతసేపు అదృశ్యమవుతుంది. అంతేకాదు... 40 నిమిషాలపాటు వారికి భూమితో సమాచార సంబంధాలు తెగిపోతాయి. అన్ని కమ్యూనికేషన్స్ కట్ అవుతాయి. భూమితో రియల్ టైమ్ కాంటాక్ట్స్ ఉండవు. అంటే డీప్ స్పేస్ ఐసోలేషన్లో ఉండిపోతారు! భూమి నుంచి బయల్దేరి తిరిగొచ్చేవరకు ఈ చంద్రయాత్రకు దాదాపు పది రోజులు పడుతుంది. భూకక్ష్యకు చేరగానే రాకెట్ నుంచి విడివడి నాసా ఆస్ట్రోనాట్లు వ్యోమనౌక ‘ఆరియన్’లో ప్రయాణం కొనసాగిస్తారు. భూమి నుంచి చంద్రుడి వరకు వారి యాత్ర సరళరేఖా మార్గంలో ఉండదు. వ్యోమనౌక పయనించే పథం ‘8 అంకె’ ఆకారంలో ఉంటుంది. ఈ పయన మార్గం నౌకను చంద్రుడి ఆవలి వైపునకు పట్టుకెళ్లడమే కాకుండా తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొస్తుంది. దీన్ని ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ అంటారు. వ్యోమగాములు తొలుత భూమి చుట్టూ అత్యున్నత దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఒక రోజు గడుపుతారు. ‘ఆరియన్’ నౌకలోని జీవనాధార వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయో, లేదో ఈ వ్యవధిలో తెలిసిపోతుంది. ఈ సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే వారు భూమి సమీపంలోనే ఉంటారు కనుక వెంటనే క్షేమంగా తిరిగి వచ్చేయవచ్చు. 24 గంటల తర్వాత కూడా నౌకలో అన్ని వ్యవస్థలు సవ్యంగా పనిచేస్తున్నాయని ధృవీకరించుకున్నాక వారు ముందుకు సాగి నాలుగు రోజులకు చంద్రుడి కక్ష్యకు చేరతారు. చంద్రుడి గురుత్వశక్తిని ఉపయోగించుకుని వ్యోమనౌక మనకు కనిపించని జాబిలి ఆవలి వైపునకు వెళ్లడమే కాకుండా... తిరుగు ప్రయాణానికి అవసరమైన ఇంజిన్లను మండించకుండానే భూమి వైపు మళ్లగలదు. అంటే.. చంద్రయాత్రలో భూమిని విడిచిపెట్టాక ‘ఆరియన్’ వ్యోమనౌక చోదక వ్యవస్థలో ఏదైనా సమస్య ఉత్పన్నమై ఇంజిన్ పూర్తిగా విఫలమైనా ఆందోళన చెందనక్కర్లేదు. భౌతికశాస్త్ర సూత్రాలే భూ, చంద్రుల గురుత్వశక్తుల రూపంలో వ్యోమగాముల పాలిత సహజ రక్షాకవచాలుగా నిలిచి వారికి భద్రత కల్పిస్తాయి! గురుత్వశక్తే వారిని తిరిగి క్షేమంగా భూ వాతావరణంలోకి రప్పిస్తుంది. అంతరిక్షంలో వ్యోమనౌక ప్రయాణించే ‘8’ అంకె ఆకృతిలోని పథ విశేషం ఇదే. ఈ యాత్రలో వ్యోమగాములు చంద్రుడి ఆవలి (వెనుక) వైపున చంద్రుడి ఉపరితలం నుంచి 4,700 మైళ్ళ దూరంలో ప్రయాణిస్తారు. ఆ సందర్భంగా భూమి నుంచి ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యక్తులుగా వారు రికార్డు నెలకొల్పనున్నారు. చంద్రుడిపై దిగనప్పటికీ వారు భారీ గోతులమయమైన దాని ఉపరితలాన్ని దగ్గరిగా వీక్షిస్తారు. అలాగే ఉదయిస్తున్న భూమిని తిలకిస్తారు. చివర్లో ‘ఆరియన్’ క్రూ కేప్సూల్ గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ వేగంలో గాలి రాపిడికి నౌక వెలుపల 2,760 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి జనిస్తుంది. అంత తీవ్రమైన వేడిని తట్టుకోవడం నౌక ఉష్ణ రక్షాకవచం (హీట్ షీల్డ్)కు ఓ అగ్నిపరీక్ష. అనంతరం పారాచూట్ల సాయంతో కేప్సూల్ నిదానంగా పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది. వ్యోమగాములు లేకుండా ‘ఆర్టెమిస్-1’తో 2022లో మానవరహిత యాత్ర నిర్వహించి ‘ఆరియన్’ నౌక సన్నద్ధతను నాసా పరీక్షించింది. అప్పుడు కేప్సూల్ పసిఫిక్ మహా సంద్రంలో సురక్షితంగా దిగినప్పటికీ దాని హీట్ షీల్డ్ దెబ్బతిన్నట్టు అనంతర తనిఖీల్లో ఇంజినీర్లు గుర్తించారు. అయితే కేప్సూల్ లోపలి భాగానికి ఏమీ కాలేదు. అన్నీ సవ్యంగా సాగితే 2028లో చేపట్టే ‘ఆర్టెమిస్-3’ యాత్రతో జాబిల్లి దక్షిణ ధృవంపై నాసా వ్యోమగాములు దిగుతారు. చైనా కూడా ఈ విషయంలో అమెరికాతో తీవ్రంగా పోటీ పడుతోంది. 2030లో చంద్రుడిపై తమ వ్యోమగాములను దింపే దిశగా అది ప్రణాళికలు రచిస్తోంది. ద్రవ ఉదజని ఇంధనం లీక్... నాసా చంద్రయాత్ర మార్చికి వాయిదా!ఇంధన ట్యాంకు నుంచి లీకవుతున్న ద్రవ హైడ్రోజన్. దీంతో ‘ఆర్టెమిస్-2’ ప్రయోగాన్ని మార్చి నెలకు వాయిదా వేసిన నాసా. నలుగురు వ్యోమగాములు ప్రయాణించే ‘ఆరియన్’ వ్యోమనౌకను భూకక్ష్యకు చేర్చాల్సిన ఎస్ఎల్ఎస్ భారీ రాకెట్లో ఇంధనంగా క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ వాడతారు. ఈ రాకెట్ ఇంధన ట్యాంకుల్లో అతి శీతల ద్రవరూప హైడ్రోజన్ 20 లక్షల లీటర్లు, ఆక్సిజన్ 7 లక్షల లీటర్లు వినియోగిస్తారు. రాకెట్ అడుగు భాగం వద్ద ద్రవ ఉదజని లీకవుతున్నట్టు సెన్సర్లు గుర్తించడంతో ప్రయోగం వాయిదాపడింది. వాతావరణం అనుకూలించే దాన్ని బట్టి ఈ ఏడాది మార్చి 6, 7, 8, 9, 11 తేదీల్లో గానీ లేదా ఏప్రిల్ 1, 3, 4, 5, 6, 30 తేదీల్లో గానీ ఏదో ఒక రోజు ప్రయోగం జరిగే అవకాశముంది.(NASA, Interstellar Traveller, Space.com, BBC Sky at Night Magazine, India Today, News 18, El Mundo America, CBS News, WION, The Times of India).-జమ్ముల శ్రీకాంత్. -
ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం అవసరం
భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్పై విధించిన సుంకాలను తగ్గించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని అన్నారాయన. అమెరికా వాణిజ్య విషయంలో భారత్ తీరు సరిగా లేదంటూ.. గతేడాది ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని 18 శాతానికి తగ్గుతాయని ట్రంప్ తన సోషల్ ట్రూత్లో ప్రకటించారు. అయితే.. భారత ఉత్పత్తులపై అమెరికా మొత్తంగా 50 శాతం టారిఫ్లు వసూలు చేస్తోంది. ఇందులో రష్యాతో చమరు కొనుగోళ్ల నేపథ్యంతో విధించిన 25 శాతం సుంకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో.. రష్యాతో చమురు వాణిజ్యం పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని కూడా ట్రంప్ తన సోషల్ మీడియా సోషల్ ట్రూత్లో వెల్లడించారు. కానీ, ఆ సుంకాల పరిస్థితిపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు.మోదీ ఏమన్నారంటే..ట్రంప్ ఫోన్కాల్.. సోషల్ మీడియా పోస్ట్ పరిణామంపై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు. భారత వస్తువులపై అమెరికా ఇకపై 18 శాతం సుంకమే విధిస్తుందని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఇంత గొప్ప ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రెసిడెంట్ ట్రంప్కు ఎంతగానో కృతజ్ఞతలు. ప్రపంచ శాంతి, సుస్థిరత, ప్రగతికి ఆయన సారథ్యం ఎంతో కీలకం’’అంటూ కొనియాడారు. శాంతిసాధన దిశగా ఆయన ప్రయత్నాలకు భారత్ పూర్తిగా సహకరిస్తుంది.. .. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక, ప్రజాస్వామిక వ్యవస్థలు కలసికట్టుగా పని చేస్తే అంతిమంగా ప్రజలకు ఎనలేని మేలు కలుగుతుంది. ఇరు పక్షాలకూ లాభదాయంగా అపారమైన అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. భారత్, అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ట్రంప్తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా’’అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ట్రంప్ చెప్పిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రం మోదీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం! ఇక ట్రంప్ ఏమన్నారంటే.. ‘‘మోదీతో నా స్నేహం, ఆయనపై గౌరవం దృష్ట్యా, ఆయన విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చింది. అమెరికాపై టారిఫ్, టారిఫేతర అడ్డంకులన్నింటినీ సున్నాకు తగ్గించే దిశగా భారత్ చర్యలు చేపట్టనుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపేయనుంది. ఇకపై వెనెజువెలా, అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిణామం ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెర దించేందుకు దోహదపడుతుందని ట్రంప్ హర్షం వెలిబుచ్చారు. నేను, మోదీ మాటల మనుషులం కాదు. పక్కా చేతల వ్యక్తులం. కనుక భారత్, అమెరికా నడుమ ఇప్పటికే ఉన్న అద్భుత సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కానున్నాయి. మోదీని నా అత్యుత్తమ మిత్రుల్లో ఒకరు. వర్తకం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడంతో పాటు పలు అంశాలపై మోదీతో సుదీర్ఘంగా చర్చించా. ఇకపై అమెరికా వస్తువులను భారత్ మరింత భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తుందని మోదీ నాకు హామీ ఇచ్చారు(BUY AMERICAN). 500 బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే చమురు, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు తదితర ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు అని ట్రంప్ అన్నారు. అంతకు ముందు.. సోమవారం రాత్రి నుంచే ఈ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్.. ట్రంప్-మోదీ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అంటూ బ్రేకింగ్ న్యూస్లా ఒక్కో పరిణామాన్ని వివరించుకుంటూ పోయారు. అయితే.. రష్యా చమురు సంకాల పరిస్థితిపై మాత్రం అటు ట్రంప్, ఇటు మోదీ నుంచి క్లారిటీ రాలేదు. కానీ, గోర్ మాత్రం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘భారత్పై అమెరికా తుది టారిఫ్లు 18 శాతం మాత్రమే’అంటూ స్పష్టత ఇచ్చారు. అయితే.. రష్యా చమురు విషయంలో జాతి ప్రయోజనాల విషయంలో తగ్గేదే లే అని భారత్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ఒత్తిళ్లకు నిజంగానే తలొగ్గిందా? అనేదానిపై కేంద్రం నుంచి స్పష్టత రావ్సాల్సి ఉంది. -
బిగ్ డీల్.. ఇరాన్, అమెరికా చర్చలు ఫిక్స్?
ప్రస్తుతం ఇరాన్, యుఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అణు ఒప్పందంపై తగ్గకపోతే ట్రంప్ దాడి చేస్తానని హెచ్చరించడం. ఇరాన్ సుప్రీం లీడర్ తగ్గేదేలే అనడంతో రెండు దేశాల మధ్య వైరం మరింతగా ముదిరింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రతినిధులు త్వరలో అణు ఒప్పందంపై కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.ఇటీవల ట్రంప్ ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. అణుఒప్పందంపై దిగిరాకపోతే ఈ సారి జరిగే దాడి వెనిజువెలాను మించి ఉంటుందన్నారు. దానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సైతం ఘాటుగా రిప్లై ఇచ్చారు. అమెరికా తమపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్దానికి దారి తీస్తుందని బదులిచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదా అని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం ఇస్తాంబుల్లో జరిగే చర్చలలో ఏం జరుగుతుందా అని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.డొనాల్డ్ ట్రంప్ పత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ ఆర్కీ ఇద్దరు టర్కీ ఇస్తాంబుల్లో సమావేశం కానున్నారు. ఈ సమాచారాన్ని అమెరికా అధికారులు ప్రకటించారు. స్టీవ్ విట్కాఫ్ మాట్లాడుతూ" అధ్యక్షుడు వారిని ఒప్పందం కోసం పిలుస్తున్నారు. సమావేశంలో ఇరాన్ ఏమంటుందో తెలుస్తుంది" అని అన్నారు.అయితే గతంలో టెహ్రాన్ సైతం అణుఒప్పందపై చర్చలకు సిద్ధంగా ఉందని ఆ దేశ అధికారులు తెలిపారు. దీంతో ఇరు దేశాలు చర్చలకు సముఖంగా ఉండడంతో దాదాపు చర్చలు జరిగే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. -
ఇంటికి చేరుకున్న లియామ్
వాషింగ్టన్: అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్న అయిదేళ్ల లియామ్ కొనెజో రమోస్, తండ్రితోపాటు మినియాపొలిస్లోని సొంతింటికి చేరుకున్నాడు. వారిద్దరినీ వెంటనే విడుదల చేయాలంటూ టెక్సాస్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు జడ్జి ఫ్రెడ్ బియెరీ ఆదేశించిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకుంది. కుమారుడితోపాటు తండ్రిని శనివారం రాత్రి డిటెన్షన్ సెంటర్ నుంచి తీసుకువచ్చి, ఆదివారం వారి ఇంటి వద్ద వదిలిపెట్టానని టెక్సాస్ డెమోక్రాట్ జోక్విన్ కాస్ట్రో తెలిపారు. వీరి విడుదలను మిన్నెసొటా కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హామ్ ఒమర్ స్వాగతించారు. ఆడ్రియన్ అలెగ్జాండర్ కొనెజో రమోస్, అతడి కుమారుడు లియామ్ను పది రోజుల తర్వాత ఆదివారం విడిచిపెట్టిన విషయాన్ని హోమ్లాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లాఘ్లిన్ ధ్రువీకరించారు. ‘ఈ కేసులోని వాస్తవాల్లో ఎటువంటి మార్పు లేదు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ఒక చిన్నారిని లక్ష్యంగా చేసుకోలేదు, అరెస్టు చేయలేదు’అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇమిగ్రేషన్ వ్యవస్థలో చట్టబద్ధతను, విచక్షణను పునరుద్ధరించడానికి ట్రంప్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దేశంలో ఉండే హక్కు లేని విదేశీయుల అరెస్ట్, నిర్బంధం, బహిష్కరణ కోసం మా పోరాటం కొనసాగుతుంది’అని పేర్కొన్నారు. డి్రస్టిక్ట్ కోర్టు జడ్జి ఆదేశాలపై అప్పీలుకు వెళతామని డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్రాంచె చెప్పారు. ఇమిగ్రేషన్ చట్టాలు, నిబంధనలు సాధారణ క్రిమినల్ ప్రక్రియ కంటే చాలా భిన్నంగా ఉంటాయన్నారు. జనవరి 20వ తేదీన లియామ్ను, అతడిని తండ్రిని అదుపులోకి తీసుకున్న అధికారులు అక్కడి 1,300 కిలోమీటర్ల దూరంలో డిల్లే డిటెన్షన్ సెంటర్కు తరలించారు. ఈక్వెడార్కు చెందిన లియామ్ కుటుంబానికి అమెరికాలో ఉండేందుకు అవసరమైన ఎలాంటి అనుమతిపత్రాలు లేవని ఇమిగ్రేషన్ అధికారులు అంటున్నారు. ఆ రోజున తాము అరెస్ట్ చేసేందుకు యత్నించగా బాలుడిని కారులో వదలి ఆడ్రియన్ పరారయ్యాడని చెప్పారు. దీంతో, లియామ్ను స్కూలు బ్యాగుతో సహా ఇమిగ్రేషన్ అధికారులు తమ కారు వద్దకు తీసుకెళ్తున్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జనం దుమ్మెత్తిపోశారు. -
కుర్రాళ్లు కుమ్మేశారు.. అమెరికాపై భారత్ ఘన విజయం
టీ20 వరల్డ్కప్-2026 వార్మప్ మ్యాచ్లు సోమవారం నుంచి షురూ అయ్యాయి. ఈ క్రమంలో అమెరికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్లో 38 పరుగుల తేడాతో ఇండియా ‘ఏ’ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్ నారాయణ్ జగదీశన్(55 బంతుల్లో 104: 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కెప్టెన్ అయుష్ బదోని( 26 బంతుల్లో 60 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన తిలక్ వర్మ 24 బంతుల్లో 38 పరుగులు చేసి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్, శుభమ్, జస్దీప్ సింగ్ తలా వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య చేధనలో అమెరికా 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ (44) టాప్ స్కోరర్గా నిలవగా.. సంజయ్ కృష్ణమూర్తి (41),శుభమ్ (28), హర్మీత్ సింగ్ (25), మహ్మద్ మోసిన్ (21) రాణించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లతో సత్తాచాటగా.. ఖలీల్ అహ్మద్, తిలక్ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఫిబ్రవరి 4న సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. తిలక్ వర్మ మంగళవారం సీనియర్ జట్టుతో కలవనున్నాడు.చదవండి: T20 WC 2026: భారత్తో మ్యాచ్ బాయ్కట్.. పాకిస్తాన్ మరో కొత్త డ్రామా -
ఎప్స్టీన్ ఫైల్స్ : ఫొటో దెబ్బకి ఎంపీ రాజీనామా
లండన్: ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైళ్లు అమెరికాలో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంకీ ఎప్స్టీన్ పేజీలను విడుదల చేశారు. వాటిల్లో మాజీ యూకే రాయబారి ప్రస్తుత అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు పీటర్ బెంజమిన్ మాండెల్సన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందిఎప్స్టిన్ ఫైల్స్లో పీటర్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. పీటర్ లోదస్తులతో ఉండగా.. ఆయనతో ఓ మహిళా సన్నిహితంగా ఉంది. ఆ ఫొటోలపై దుమారం చెలరేగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ ఫొటో గురించి అడగ్గా.. 'తెలియదు గుర్తులేదు మర్చిపోయా'. దాట వేశారు. ప్రస్తుతం,ఈ అంశంపై యూకే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోందిఇక ఎప్స్టీన్ ఫైల్స్లో 2003-04 మధ్య కాలంలో ఎప్స్టీన్కు పీటర్కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఎప్స్టీన్ నుంచి పీటర్కు సుమారు 75వేల డాలర్లు అందగా.. 25వేల డాలర్లకు సంబంధించి లావాదేవీల వివరాలు ఉండటం గమనార్హం. పీటర్తో అస్పష్టంగా ఉన్న మహిళ గురించి వివరాలు గురించి ఆయన్ని మీడియా ఆరా తీసింది. ఫోటోలు ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియదు. ఆ ప్రదేశాన్ని, స్త్రీని తాను గుర్తించ లేకపోతున్నానని, ఏ సందర్భంలో ఆ ఫొటోను దిగాల్సి వచ్చిందో గుర్తించ లేకపోతున్నారని చెప్పుకొచ్చారు. -
ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..
అధిక బరువు కేవలం సామాన్యులనే వేధించే సమస్య కాదు. ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు కౌన్సలింగ్ ఇచ్చి బరువు తగ్గేలా చేసే ఒబెసిటీ వైద్యులు సైతం అధిక బరువు బాధితులే. అందుకు ఉదాహరణ ఈ వైద్యుడు కెవిన్ జెండ్రూ. అందరికి ఆరోగ్యకరమై జీవిన విధానానికి కౌన్సిలింగ్ ఇచ్చే ఈ ఒబెసిటి డాక్టరే తన స్వతం జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపించడంలో విఫలమై అధిక బరువుతో బాధపడ్డాడు. అధిక పని ఒత్తిడికి ఈ వైద్యుడు సైతం సామాన్యుడిలా అధిక బరువు బారినపడ్డాడు. రోగులకు కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తే సరైన జీవన విధానం అవలంభించకలేక ఇబ్బందిపడ్డాడు. చివరికి ఆ ఒక్క దురదృష్టకర ఘటన అతడి జీవితాన్ని ఊహించని మలుపుతిప్పి బరువు తగ్గేందుకు దారితీయడమే కాదు..వెయిట్లాస్ అవ్వడంలో స్ఫూర్తిగా నిలిచాడు. మరి ఆ వైద్యుడి వెయిట్లాస్ జర్నీ ఎలా మొదలైందంటే..మసాచుసెట్స్కి చెందిన కెవిన్ జెండ్రూ ఒకప్పుడూ 138 కిలోల బరువు ఉండేవాడు. అతడి వృత్తి ఊబకాయంతో బాధపడే రోగులకు వైద్యం చేయడం. విచిత్రం ఏంటంటే అతడే ఓ ఒబెసిటీ రోగి..పైగా తన లైఫ్ని ఆరోగ్యప్రదంగా ఉంచుకోలేదు. కానీ రోగులకు అధిక బరువు తగ్గించుకునేలా చికిత్స, కౌన్సిలింగ్ ఇస్తుండటం విశేషం. సుదీర్ఘ గంటల పని ఒత్తిడి అతడిని తరుచుగా ఏదో ఒకటి తినేలా చిరుతిండికి బానిసగా మార్చేసింది. అది కాస్త ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలైంది. మరోవైపు అతడి తండ్రికి టెర్మినల్ మెలనోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో ఏం తింటున్నాడో..ఎలా ఉంటున్నాడనే దానిపై స్పృహ లేకుండా జంక్ఫుడ్ తీసుకునేవాడు. అదికూడా నిర్ణిత సమయం అంటూ లేకుండా తినాలనిపించినా..లేకపోయినా..వీలు దొరికినప్పుడల్లా తినడం ఓ అలవాటుగా మారి..విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల బారినపడ్డాడు. ఊబకాయం ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన ఉన్న వైద్యుడే ఊబకాయంతో బాధపడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనడం ఒకింత సిగ్గుగా అనిపించడం మొదలైంది కెవిన్కి. ఇంతలో సోదరికి కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అవ్వడం ఒక్కసారిగా కెవిన్ ఉలిక్కిపడ్డాడు. ఇప్పటికైనా మేలుకోకపోతే పరిస్థితి అంతే అని ఫిక్స్ అయ్యి..ఆరోగ్యకరమైన జీవన విధానంపై దృష్టిపెట్టడం ప్రారంభించాడు. తన పిల్లల కోసమైన ఆరోగ్యం ఉండాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు.ఎలా తగ్గాడంటే..సాధారణ ఆహార మార్పులు, అడపాదడపా ఉపవాసం తదితరాలను ప్రారంభించాడు. అలాగే తనకున్న వైద్య పరిజ్ఞానంతో ఆరోగ్యకరంగా బరువు తగ్గే ప్రణాళిలు ఏర్పాటు చేసుకుని మరి బరువు తగ్గేందుకు ప్రయత్నించాడు. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక ఫైబర్ ఉండే ఆహారం, బెర్రీలను తీసుకోవడం ప్రారంభించాడు. ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు, శుద్ధి చేసిన చక్కెరను నివారించాడు. అతని సాధారణ భోజనంలో గ్రిల్డ్ చికెన్, సిర్లోయిన్ స్టీక్ లేదా చేపలు, కాల్చిన నాన్-స్టార్చీ కూరగాయలు ఉంటాయి. దాంతోపాటు అవకాడో, గింజలు, ఆలివ్ నూనె, గుడ్లు, చీజ్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మైండ్పెట్టి తినడం, కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకునేవాడు. ఇక అడదడపా ఉపవాసాన్ని కూడా హెల్దీగా చేసినట్లు తెలిపాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వ్యవధిలో తక్కువ కార్బ్, చక్కెర ఉన్న ప్రోటీన్ భోజనం మాత్రమే తీసుకునేవాడు. దీనివల్ల చక్కెర స్థాయిలు సాధారణస్థితికి వచ్చి డయాబెటిస్ అదుపులోకి వచ్చింది. వర్కౌట్ల దగ్గరకు వచ్చేటప్పటికీ..రోజుకి పదివేల నుంచి పదిహైను వేల వరకు నడక వంటివి కచ్చితంగా చేసేవాడు.ఇలా ఆరోగ్యకరమైన అలవాట్లతో కేవలం 18 నెలల్లో 138 నుంచి ఏకంగా 56 కిలోలు బరువు తగ్గాడు. ప్రస్తుతం ఆరోగ్యకరమైన బరువుతో 20లలో ఉన్న వ్యక్తిలా అన్నిపనులు సునాయాసంగా చేయగలుగుతున్నానంటూ తన వెయిట్లాస్ స్టోరీని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. (చదవండి: ట్విన్స్ పేరెంట్స్ చేసిన పనికి..ఉబ్బితబ్బిబైన డాక్టర్..!) -
అమెరికా దాడి చేస్తే.. రణరంగమే.. ఇరాన్ వార్నింగ్
-
ఖమేనీ హెచ్చరికలు.. ట్రంప్ బేఖాతర్
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ ముందుకు వస్తుందనే ఆశ తనలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన హెచ్చరికలను కూడా ఆయన ప్రస్తావించారు. అమెరికా గనుక దాడులకు దిగితే అది తీవ్రమైన ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని ఖమేనీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.వాషింగ్టన్తో ఇరాన్ చర్చలు ఒకవేళ విఫలమైతే ఖమేనీ చేసిన హెచ్చరిక ఎంతవరకు నిజమో తేలిపోతుందని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో నివాసంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ సమీపంలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను మోహరించినట్లు తెలిపారు. అయితే సైనిక చర్య కంటే దౌత్యపరమైన పరిష్కారానికే తాము మొగ్గు చూపుతున్నామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నామని, అది సాధ్యం కాకపోతే తదుపరి పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధమని ట్రంప్ పేర్కొన్నారు.ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సోషల్ మీడియా వేదికగా అమెరికాను హెచ్చరిస్తూ వరుస పోస్టులు చేశారు. అమెరికా గనుక యుద్ధాన్ని ప్రారంభిస్తే, అది కేవలం ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాదని, ఈ ప్రాంతాన్నంతా చుట్టుముట్టే యుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. యుద్ధ నౌకలు లేదా విమానాలతో చేసే బెదిరింపులకు ఇరాన్ భయపడదని అన్నారు. గతంలోనూ అమెరికా ఇలాంటి ప్రకటనలు చేసిందని, వీటివల్ల తమ దేశ ప్రయోజనాలకు భంగం కలగదని ఖమేనీ అన్నారు.తాము ఏ దేశంతోనూ యుద్ధాన్ని కాంక్షించడం లేదని, అయితే ఎవరైనా దాడికి దిగితే నిర్ణయాత్మకమైన దెబ్బ కొడతామని ఖమేనీ స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న సహజ వనరులు, వ్యూహాత్మక భౌగోళిక స్థానంపై పట్టు సాధించేందుకే అమెరికా తమను లొంగదీసుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.ఇది కూడా చదవండి: పొద్దున్నే వణికించిన భూకంపం -
అమెరికా దాడి చేస్తే.. రణరంగమే
దుబాయ్: అగ్ర రాజ్యం అమెరికా తమపై దాడి చేసిన పక్షంలో పశ్చిమాసియా యుద్ధ రంగంగా మారుతుందని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ(86) తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజల నిరసనలను హింసాత్మక అణచివేయాలని చూస్తే తీవ్ర దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించడం తెల్సిందే. విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్, ఇతర యుద్ధ నౌకలు అరేబియా జలాల్లోకి ప్రవేశించిన వేళ ఖమేనీ అమెరికానుద్దేశిస్తూ సూటిగా చేసిన హెచ్చరికలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా ముదిరే ప్రమాదముందని భావిస్తున్నారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలను తిరుగుబాటుగా ఖమేనీ అభివర్ణించారు. తమపై దాడులకు దిగితే అది ఈసారి ప్రాంతీయ యుద్ధంగా మారుతుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు. ‘మేం రెచ్చగొట్టే వాళ్లం కాము. మేం ఎవరిపైనా యుద్ధానికి వెళ్లాలనుకోవడం లేదు. మమ్మల్ని వేధించాలని చూసినా, దాడులకు పాల్పడినా తీవ్రస్థాయిలో ప్రతిచర్యలు తప్పవు’అని ప్రకటించారు. అదేవిధంగా, గతంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు నిరసనలకు పాల్పడుతున్నారంటూ గతంలో వ్యాఖ్యానించిన ఖమేనీ ఈసారి ఆందోళనకారులపై స్వరం పెంచారు. ‘ఇటీవల జరుగుతున్న నిరసనలు తిరుగుబాటుతో సమానమైనవి. అందుకే ఆ తిరుగుబాటును అణచివేశాం. దేశాన్ని నడిపించే కీలక వ్యవస్థలను ధ్వంసం చేయడమే నిరసనకారుల లక్ష్యం. అందుకే వారు పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, రివల్యూషనరీ గార్డుల కేంద్రాలు, బ్యాంకులు, మసీదులపై దాడులకు పాల్పడ్డారు. ఖురాన్ ప్రతులను దహనం చేశారు’అని ఆరోపించారు.ఈయూ సైనికులూ ఉగ్రవాదులేనిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న రివల్యూషనరీ గార్డ్స్ విభాగం బలగాలను యూరోపియన్ యూనియన్(ఈయూ)ఉగ్రవాదులుగా పక్రటించడంపై ఇరాన్ మండిపడింది. ఈయూ సభ్యదేశాల మిలటరీని కూడా ఉగ్ర గ్రూపులుగా ప్రకటించే విషయం పరిశీలిస్తున్నామని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం 2019లోనే రివల్యూషనరీ గార్డులను ఉగ్రవాదులుగా ప్రకటించింది. బదులుగా ఇతర దేశాల మిలటరీని ఉగ్రవాద గ్రూపుగా ప్రకటించే విషయం తామూ పరిశీలిస్తామని అప్పట్లోనే ఇరాన్ తెలిపింది. రివల్యూషనరీ గార్డు విభాగం సుప్రీం నేత ఖమేనీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. అయితే, యూరప్లోకి ఉగ్రవాదం వ్యాప్తి చెందకుండా కట్టడి చేస్తున్న రివల్యూషనరీ గార్డులను ఉగ్రవాదులుగా ప్రకటించడం ద్వారా యూరప్ తనకంటిని తానే పొడుచుకుందని గార్డుల మాజీ కమాండర్ మహ్మద్ బఘెర్ వ్యాఖ్యానించారు. అమెరికా మాట విని ఈయూ గుడ్డిగా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. మరో పరిణామంలో...వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆది, సోమవారాల్లో లైవ్ ఫైర్ మిలటరీ డ్రిల్ చేపడుతోంది. ప్రపంచంలో జరిగే చమురు రవాణాలో ఐదో వంతు పర్షియన్ గల్ఫ్లోని ఈ జలసంధి ద్వారానే సాగుతోంది. తమ యుద్ధ నౌకలు, విమానాలకు నష్టం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ హెచ్చరికలు జారీ చేసింది. -
పసివాడిని వదిలేయండి!
టెక్సాస్: అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు వారం క్రితం అదుపులోకి తీసుకున్న అయిదేళ్ల బాలుడు లియామ్ రమోస్, అతడి తండ్రి ఆడ్రియన్ల కథ సుఖాంతమైంది. తండ్రి, కొడుకులను వెంటనే వదిలేయాలని టెక్సాస్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మినియాపొలిస్లో జనవరి 24వ తేదీన స్కూలు నుంచి తండ్రితోపాటు కారులో వస్తున్న లియామ్ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించడం, వారిద్దరినీ అక్కడికి 1,300 కిలోమీటర్ల దూరంలోని టెక్సాస్ డిటెన్షన్ ఫెసిలిటీకి తరలించారు. బిక్కమొహం వేసిన లియామ్ భుజాలకున్న బ్యాగ్ను ఇమిగ్రేషన్ అధికారి వెనుక నుంచి పట్టుకుని, అతడిని కారు వద్దకు తీసుకెళ్తున్న ఫొటో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. చిన్నారులను నిర్బంధంలోకి తీసుకోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వారిని వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన జడ్జి ఫ్రెడ్ బియరీ అధికారులు, ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. లియామ్ కుటుంబం ఇమిగ్రేషన్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున మంగళవారం లోగా ఇద్దరినీ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈక్వెడార్కు చెందిన లియామ్ తండ్రిని దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంటుండగా, అతడు చట్టబద్ధంగానే వచ్చాడని లాయర్లు తెలిపారు. లియామ్ కుటుంబం 2024 డిసెంబర్లో టెక్సాస్లో అధికారుల ఎదుట హాజరై ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుందని చెప్పారు. వారికి ఈక్వెడార్తోపాటు అమెరికాలోనూ ఎలాంటి నేర చరిత్ర లేదని స్పష్టం చేశారు.చరిత్ర ప్రతిధ్వనిస్తోందిజడ్జి ఫ్రెడ్ బియరీ ఏమన్నారంటే.. ప్రభుత్వం నిర్ణయాలు అమెరికా రాజ్యాంగ స్ఫూర్తికి, మూల సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా చారిత్రక స్వాతంత్య్ర ప్రకటనపై ఈ ప్రభుత్వం అజ్ఞానంతో ఉందంటూ వ్యాఖ్యానించారు. అధికార దాహం కలిగిన అప్పటి ఇంగ్లండ్ రాజుకు వ్యతిరేకంగా థామస్ జెఫర్సన్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. అప్పటి రాజరిక పాలనలోని పరిస్థితులే నేడు కూడా కన్పిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న బహిష్కరణ విధానాల వల్ల పిల్లలు ఎంతో మానసిక వేదనను ఎదుర్కొంటున్నారు. రోజువారీ బహిష్కరణ కోటాలను చేరుకునేందుకు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘సరైన ఆలోచన లేకుండా, అసమర్థతతో ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల ఫలితమిది. పిల్లలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా సరే, ఆగడం లేదు’అని అన్నారు. ‘ప్రభుత్వ యంత్రాంగం తనకు తానుగా జారీ చేసుకునే పరిపాలనాపరమైన వారెంట్లకు సరైన కారణం ఉండటం లేదు. దీనినే కోళ్ల గూడుకు నక్కను కాపలా పెట్టడం అంటారు’అని ఆయన తీర్పులో రాశారు. అమెరికాలోని క్లిష్టమైన వలస చట్టాల వల్ల లియామ్, అతని తండ్రి చివరికి బహిష్కరణను ఎదుర్కోవాల్సి రావచ్చు అని పేర్కొన్న బియరీ.. అయితే, ఇది మరింత క్రమబద్ధమైన, మానవీయమైన విధానం ద్వారా జరగాలని అభిప్రాయపడ్డారు. ‘రెండు వారాల వ్యవధిలో ఇమిగ్రేషన్ అధికారులు తీసుకెళ్లిన నాలుగో చిన్నారి లియామ్’అని కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ ఒక ప్రకటనలో తెలిపింది.లియామ్ను ఎరవేశారు..తండ్రి ఆడ్రియన్ నుంచి లియామ్ను వేరు చేసిన ఇమిగ్రేషన్ అధికారులు అతడిని ఎరగా వేసి, అతడి తల్లిని కూడా నిర్బంధంలోకి తీసుకోవాలని చూశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. గర్భవతిగా ఉన్న ఆమెతోపాటు ఇంట్లో మరో చిన్నారి కూడా ఉందని చెప్పారు. అధికారుల భయంతోనే కుమారుడిని, భర్తను అధికారులు తీసుకెళ్తున్న దృశ్యాలను కిటికీలో నుంచి చూస్తూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిందన్నారు. ఈ ఆరోపణలను ఇమిగ్రేషన్ అధికారులు తోసిపుచ్చారు. చిన్నారని వదిలేసి, అతడి తండ్రి పారిపోయేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. దీంతో, లియామ్ను తల్లికి అప్పగించేందుకే ఇంటి వద్దకు వెళ్లామని, ఎవరూ బయటకు రాకపోవడంతో చిన్నారి బాధ్యతను తామే తీసుకున్నామన్నారు. వెంటనే అతడిని హోటల్కు తీసుకెళ్లి, ఆహారం పెట్టామన్నారు. తండ్రి కోరిక మేరకే ఇద్దరినీ తీసుకెళ్లామని చెప్పారు. -
ఇరాన్లో బాంబు పేలుళ్లు.. ఐదుగురు మృతి
ఇరాన్లో బాంబుల మోత మోగింది. ఆ దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో బాంబుల మోత మోగింది. ఈ దాడుల్లో ఐదుగురు మరణించినట్లు సమాచారం. కాగా ఈ పేలుళ్లును ఇరాన్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.శనివారం ఇరాన్లోని ఏడు నగరాల్లో బాంబుపేలుళ్లు సంభవించాయి. ఆ దేశ రాజధాని టెహ్రాన్తో పాటు, పరాండ్, తబ్రిజ్, కోమ్, అహ్వాజ్, నానాజ్ తో పాటు బందర్, అబ్బాస్ నగరాల్లో పెద్దఎత్తున పేలుళ్లతో దద్ధరిళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 14 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుళ్లకు తమ బాధ్యత లేదని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించాయి.అయితే ప్రస్తుతం ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్దఎత్తున రోడ్లెక్కారు. ఈ ఆందోళనలో దాదాపు ఐదు వేల మందికి పైగా మృతిచెందినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ స్పందించారు. ప్రస్తుతం ఇరాన్లో నడుస్తున్న నిరసనలను అమెరికా, ఇజ్రాయెల్ ఆసరాగా తీసుకోవాలని చూస్తున్నాయని తెలిపారు. తద్వారా ఇరాన్లో అశాంతి వ్యాప్తి చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ అధ్యక్షుడు తెలిపారు. -
అంతరిక్షంలోకి 10 లక్షల ఏఐ శాటిలైట్లు!
ప్రైవేట్ అంతరిక్ష రంగం, కృత్రిమ మేధ రంగాలను అత్యంత వేగంగా విస్తరించే బృహత్తర ప్రాజెక్టుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్మస్క్ రంగం సిద్ధంచేస్తున్నారు. మానవాళి కృత్రిమ మేధ అవసరాలను వందల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షం నుంచే నేరుగా తీర్చేందుకు ఏకంగా 10,00,000 ఏఐ సూపర్కంప్యూటర్లను నింగిలోకి పంపనున్నారు. ఒక్కో కృత్రిమమేథ సూపర్కంప్యూటర్ను ఒక్కో ఉపగ్రహంతో అనుసంధానించి సేవలు అందించాలని మస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తంగా 10 లక్షల ఏఐ సూపర్కంప్యూటర్ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లాలని స్పేస్ఎక్స్ నిర్ణయించింది. ప్రయోగాల కోసం అమెరికా ప్రభుత్వ అనుమతి కోరారు. అతిపెద్ద జల్లెడ మాదిరిగా శాటిలైట్లన్నీ ఒకదానితో మరోటి లేజర్ కాంతిపుంజంతో అనుసంధానమై ఉంటాయి. తద్వారా ఉమ్మడిగా ఊహించనంత వేగంగా కృత్రిమ మేధ సేవలను అందించనున్నాయి. ఇన్నేసి సూపర్కంప్యూటర్లను భూమిపై సర్వర్ఫామ్లో ఏర్పాటుచేసి నిర్వహించాలంటే అత్యధిక స్థాయిలో విద్యుత్ను నిరంతరంగా సరఫరాచేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాకపోవడంతో సౌరశక్తిని ఉపయోగించుకుని ఆకాశంలోనే అతిపెద్ద సోలార్ప్యానెల్ వ్యవస్థను ఏర్పాటుచేసి తద్వారా 10 లక్షల ఏఐ కంప్యూటర్ల శక్తి అవసరాలు తీర్చనున్నారు. 1968లో వచ్చిన ‘2001: స్పేస్ ఒడిస్సీ’హాలీవుడ్ చిత్రంలో ‘హాల్ 9000’కృత్రిమమేధావి చేసే ప్రయోగాలు ఇన్నాళ్లూ సినిమాలకే పరిమితంకాగా ఇకపై వాటిని నిజజీవితంలోకి తీసుకొస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఏఐ కంప్యూటర్ల దండును నింగిలో మోహరింపజేసి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది వినియోగదారుల కృత్రిమమేధ అవసరాలు తీర్చబోతున్నామని మస్క్ వివరించారు. ఈ వ్యవస్థకు ‘ఆర్బిటల్ డేటా సెంటర్ సిస్టమ్’అని పేరు పెట్టారు. ఇది అందుబాటులోకి వస్తే భూమిపై వినియోగదారులకు సంబంధించిన విపరీతమైన సమాచారం, సంక్లిష్టమైన డేటాను అత్యధిక వేగంతో ప్రాసెస్ చేయడమూ సాధ్యమవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా ఏఐ మోడళ్లను పరీక్షించి అందుబాటులోకి తేవచ్చు. భూమి నుంచి 500 నుంచి 2,000 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు. వీటిని ఒకదానితో మరోటి ఢీకొట్టకుండా వీలైనంత దూరంలో కక్ష్యలో స్థిరపరచనున్నారు. ‘‘ఊహించనంతగా వచ్చి పడుతున్న ఏఐ డిమాండ్ను అందుకోవాలంటే భూమి మీద సౌకర్యాల విస్తరణతో సాధ్యంకాదు. అంతరిక్షంలో కక్ష్యల్లో కొలువుతీరిన లక్షలాది ఉపగ్రహాలతోనే ఇది సాధ్యం. పుష్కలంగా లభించే సౌరశక్తిని ఒడిసిపట్టి ఈ సూపర్కంప్యూటర్ల విద్యుత్శక్తి అవసరాలు తీర్చుతాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా కేంద్రంగా అంతరిక్షాన్ని సిద్ధంచేయబోతున్నాం’’అని మస్క్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. స్టార్లింక్ స్ఫూర్తితో.. ఇప్పటికే వేలాది కృత్రిమ ఉపగ్రహాలతో మస్క్ కు చెందిన స్టార్లింక్ సంస్థ విశ్వవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీని స్ఫూర్తితోనే ఏఐ సేవలు అందించేందుకు ఆర్బిటల్ డేటా సెంటర్ సిస్టమ్ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ నెలలోనే ఇందుకు సంబంధించిన పనులు మొదలెట్టారు. ఇందుకోసం అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(యూఎస్ఎఫ్సీసీ) వద్ద స్పేస్ఎక్స్ దరఖాస్తు చేసుకుంది. భూమిపై ఏర్పాటుచేసిన డేటా సెంటర్లు పవర్ గ్రిడ్లతో అనుసంధానమై ఉన్నాయి. విద్యుత్ అంతరాయం పెద్ద అవరోధంగా తయారైంది. అతిపెద్ద సర్వర్ఫామ్ల ఏర్పాటుకు భూమి సేకరణ ఇబ్బందిగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో భూమి సేకరణ అనేది ఖరీదైన వ్యవహారంగా తయారైంది. విద్యుత్ తయారీకి బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను వినియోగిస్తారు. దీంతో ఇంతపెద్ద ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడమూ కష్టమే. ఈ సమస్యలేవీ అంతరిక్షంలో ఉండవు. ఆ కారణంతోనూ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు నింగిని వేదికగా ఎంపికచేశారు. భూమి మీద ఏఐ సూపర్కంప్యూటర్లను చల్లబరిచేందుకు కూలింగ్ వ్యవస్థలు అవసరం. అదే అంతరిక్షంలో శూన్యం ఉంటుందికాబట్టి ఇది సహజ రిఫ్రిజిరేటర్గా పనిచేస్తుంది. రాత్రిళ్లు అత్యల్ప ఉష్ణోగ్రతలకు ఏఐ వ్యవస్థ ఆటోమేటిక్గా చల్లబడుతుంది. విద్యుత్ అవసరం కూడా ఉండదు. 10 లక్షల ఉపగ్రహాల మధ్య సమాచారాన్ని హైస్పీడ్ లేజర్ కాంతిపుంజం రూపంలో బదిలీచేస్తారు. దీంతో ట్రిలియన్ల బైట్ల డేటా వేగంగా సరఫరా అవుతుంది. ఈ వ్యవస్థ మొత్తం ఆకాశంలో ఏర్పాటయ్యాక ప్రతి టన్ను సౌరఫలకాల వ్యవస్థ నుంచి ఏకంగా 100 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీంతో అక్కడి డేటా సెంటర్ల శక్తి అవసరాలు సైతం తీరనున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA: నో వర్క్ .. నో స్కూల్ .. నో షాపింగ్
-
ఎప్స్టీన్ ఫైల్స్ : రష్యన్ ముద్దుగుమ్మలతో బిల్గేట్స్ ఆ జబ్బు , అంతేనా!
అమెరికానుపట్టికుదపిన లైంగిక నేరాల కోసేలో దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణానికి సంబంధించిన తాజా ఫైల్స్లో అనేక ప్రముఖుల పేర్లు ఉండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో 2,000 వీడియోలు, 1,80,000 చిత్రాలతో సహా 30 లక్షలకు పైగా పేజీల పత్రాలను ఆమెరికా న్యాయ శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో టెస్లా అధినేత మస్క్పై తాజా ఆరోపణలతోపాటు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్పై సంచలన ఆరోపణలతో పాటు, న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ పేరును కూడా చేర్చడం గమనార్హం.బిల్ గైట్స్పై ఆరోపణలుబిల్ గేట్స్ రష్యన్ మహిళలతో శారీరంగా సంబంధాలను కలిగి ఉన్నాడని, దీంతో లైంగికంగా సంక్రమించే వ్యాధి(ఎస్టీడీ) బారిన పడ్డాడని పేర్కొంది. ఆ తర్వాత తన భార్య మెలిండా గేట్స్కు రహస్యంగా ఇవ్వడానికి యాంటీబయాటిక్స్ కోరాడని ఆరోపించింది. ఈ వివాదానికి కేంద్రంగా ఉన్న ఈమెయిల్స్ 2013, జూలై 18 నాటివి. ఎప్స్టీన్ డ్రాఫ్ట్ సందేశాలుగా కనిపిస్తున్నాయి. కొన్ని గేట్స్ అప్పటి సలహాదారు బోరిస్ నికోలిక్ గొంతులో ఉన్నాయి. వాటిలో, గేట్స్ "రష్యన్ అమ్మాయిలతో" నిద్రపోతున్నాడని, లైంగిక సంక్రమణ వ్యాధి బారిన పడ్డాడని, దీంతో మెలిండా గేట్స్కు "రహస్యంగా" ఇవ్వగల యాంటీబయాటిక్స్ కోసం అడుగుతున్నాడని ఎప్స్టీన్ ఆరోపించాడు. దీనికి సంబంధించిన ఈమెయిల్స్ను డిలీట్ చేయమని గేట్స్ కోరాడని ఎప్స్టీన్ కోరాడని కూడా ఈ మెయిల్స్ సారాంశం. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మస్క్ తాజా ఈమెయిల్స్ కలకలంతీవ్రంగా ఖండించిన బిల్గేట్స్ఈ ఆరోపణలపై గేట్స్ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా వాస్తవ దూరమైనవి, అసంబద్ధ మైనవి అని గేట్స్ ప్రతినిధి డైలీ మెయిల్తో అన్నారు. ఈ ఆరోపణలు ఎప్స్టీన్ ఫ్రస్ట్రేషన్కు నిరాశకు తార్కాణమని, అతని ఉచ్చులో చిక్కుకోవడానికి ,పరువు తీయడానికి ఎంత దూరం వెళ్లాడని ఆరోపించారు.జోహ్రాన్ మమ్దానీ తల్లి మరోవైపు ఈ ఆరోపణలో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి చిత్రనిర్మాత మీరా నాయర్ కూడా చేర్చారు. 2009 అక్టోబర్ 21 న ప్రచారకర్త పెగ్గీ సీగల్ జెఫ్రీ ఎప్స్టీన్కు పంపిన ఇమెయిల్, దర్శకుడు మీరా నాయర్ తన సినిమా ఆఫ్టర్ పార్టీలో ఉన్నారని వెల్లడించింది. లైంగిక అక్రమ రవాణాదారు,దోషిగా తేలిన గిస్లైన్ మాక్స్వెల్ ఇంట్లో జరిగిన 2009 నాటి మూవీ "అమేలియా" ఆఫ్టర్ పార్టీకి హాజరైయ్యారని ఆరోపించింది.ఈ పార్టీకి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ , అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కూడా హాజరయ్యారని పేర్కొంది. ఇదీ చదవండి: డాక్టర్ కల చెదిరి, యూట్యూబర్గా మారి..కట్ చేస్తే! -
ఎప్స్టీన్ ఫైల్స్లో మస్క్ తాజా ఈమెయిల్స్ కలకలం
సంచలనం ఎప్స్టీన్ ఫైల్స్లో టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ పేరు మరోసారి మారు మోగుతోంది.దీనికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ కొత్త ఫైళ్లను వెలికి తీసింది. ఎలోన్ మస్క్ జెఫ్రీ ఎఎప్స్టీన్ మధ్య ఈమెయిల్ మార్పిడి జరిగినట్టు చెబుతోంది. 2012- 2013లో ఎప్స్టీన్ తన ప్రైవేట్ వర్జిన్ దీవులకు మస్క్ను ఆహ్వానించినట్లు ఈ మెయిళ్ల సారాంశం. దాదాపు 30 లక్షలకు పైగా కొత్త పేజీల ఎప్స్టీన్ ఫైల్స్ను విడుదల చేసింది. అయితే ఎప్స్టీన్ ద్వీపానికి తనను రమ్మని ఆహ్వానించి నప్పటికీ, తానెప్పుడూ వెళ్లలేదని గతంలోనే మస్క్ ఖండించాడు.తాజాగా విడుదలైన US న్యాయ శాఖ పత్రం, మస్క్ జెఫ్రీ మధ్య ఈమెయిల్స్ ద్వారా చాలా పెద్ద చర్చే జరిగినట్టు గుర్తించింది. ఎప్స్టీన్ ఐలాండ్కు మస్క్ణు ఆహ్వానించినట్టు, మస్క్ అక్కడి వెళ్లినట్టుగా వాదిస్తోంది. వీటిలో షెడ్యూల్ తేదీలు, లాజిస్టిక్స్, ఇతర ప్లాన్స్ ఉన్నాయిన వాదిస్తోంది. 2012 క్రిస్మస్ నాటి ఇమెయిల్లో, తన ద్వీపాన్ని సందర్శించమని మస్క్ను ఆహ్వానించాడు ఎప్స్టీన్. అయితే, మస్క్ వెళ్లినట్టు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ మరోసారి ఈ వార్తలు నెట్టింట చర్చకు దారి తీశాయి. అయితే ఎప్స్టీన్ ఆఫర్ను మస్క్ తిరస్కరించాడు. దీనికి ప్రతిస్పందనగా, ఎప్స్టీన్ మస్క్ సంకోచాన్ని అర్థం చేసుకున్నానని, గర్ల్ఫ్రెండ్తో స్వేచ్ఛగా ఉండవచ్చనే నిగూఢార్థంతో మరో సందేశాన్ని పంపాడు. కొన్ని వారాల తర్వాత, ప్రయాణ ఏర్పాట్ల కోసం మస్క్ను అడుగుతూ ఒక ప్రత్యేక ఇమెయిల్లో పంపాడు. “మీరు హెలికాప్టర్ ద్వీపానికి ఎంత మంది ఉంటారు?”మరుసటి రోజు ప్రతిస్పందనగా, మస్క్ ఇలా వ్రాశాడు, “బహుశా తాలూలా,తాను మాత్రమేనని, మీ ద్వీపంలో పగలు/రాత్రి హార్డెస్ట్ పార్టీ ఉంటుందా అని మస్క్ అడిగాడు. ఆ తరువాత 1-8వ తేదీ వరకు ఏ రోజునా, ఎపుడూ మీకోసం సిద్ధంగా ఉంటుందని మరో ఈయిల్ పంపాడు.కరేబియన్ పర్యటనలోమస్క్ ఇక్కడికి వెళ్లి ఉంటాడని భావించే2013 ఇమెయిల్ మార్పిడి కూడా ఫైల్లో ఉంది. “సెలవులలో BVI/సెయింట్ బార్ట్స్ ప్రాంతంలో ఉంటాను. సందర్శించడానికి మంచి సమయం ఉందా?” మస్క్ 2013, డిసెంబర్ 13 నాటి ఇమెయిల్లో రాశారు. ఇలా పలు దఫాలుగా మారి మధ్య ఈమెయిల్స్ ద్వారా సంభాషణ జరిగిందని చెబుతోంది. కానీ మస్క్ ఎపుడు అక్కడికి వెళ్లాడు అనేదానిపై రికార్డులు స్పష్టమైన ధృవీకరణ లేదు.ఎప్స్టీన్తో మస్క్ ఈమెయిళ్ళ వార్త వెలువడిన వెంటనే, సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువెత్తాయి. సందర్భాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. బిలియనీర్లు బ్రిటిష్ వర్జిన్ దీవులలో సెలవుల్లో ఉండటం సర్వసాధారణం. ఉన్నత స్థాయి ఆర్థికవేత్తను కలవమని అడగడం నేరం కాదు. మస్క్ గతంలోనే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని, అక్కడికి ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు. ఈ ఫైల్స్లో లక్షలాది ఈమెయిళ్ళు ఉన్నాయి, ఒకరి ఇన్బాక్స్లో పేరు ఉన్నంత మాత్రాన వారి నేరంలో భాగస్వాములైనట్లు కాదు. ఇది కేవలం మస్క్ను వేధించడానికి చేస్తున్న మరో ప్రయత్నం మాత్రమే అని ఒకరువ్యాఖ్యానించారు. అప్పట్లో ఎప్స్టీన్కు ఈమెయిల్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ సందర్భం ముఖ్యం. ఏదైనా నిర్ధారణకు వచ్చే ముందు పూర్తి సంభాషణలను పరగణనలోకి తీసుకోవాలని మరొకరు రాశారు. తాను ఎప్స్టీన్తో సంభాషించలేదని మస్క్ ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి ఎప్స్టీన్ నిర్వహించిన అనేక 'లంచ్లకు' వెళ్లాడు. తలులా రిలే ఒకసారి ఎప్స్టీన్ న్యూయార్క్ సిటీ పెంట్హౌస్ను సందర్శించాడు. ఈ విషయం తలులా ఎక్స్లో ఇప్పటికీ ఉన్న ఒక పోస్ట్లో పేర్కొన్నారు. కూడా అని మరొకరు అభిప్రాయ పడ్డారు. -
అంతకు మించి అంటున్న ట్రంప్
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నివురు గప్పిన నిప్పులా కొనసాగుతోంది. తాజాగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. వెనెజువెలాపై జరిపిన దాడులకు మించి ఇరాన్పై చేసే అవకాశం ఉందంటూ ప్రకటించారు.ట్రంప్ తన సోషల్ ట్రూత్లో ఇలా రాసుకొచ్చారు. "ఇరాన్ వైపు వెళ్తున్న అమెరికా నౌకాదళం... ఇంతకు ముందు వెనిజులాకు పంపిన దానికంటే పెద్దది. ఏమవుతుందో చూద్దాం" అని పేర్కొన్నారు. తద్వారా ఇరాన్ వైపునకు మరిన్ని బలగాలు పంపడం ద్వారా.. ఆ దేశంపై అణు ఒప్పందం విషయంలో ఒత్తిడి చేయాలన్నదే ట్రంప్ ప్రయత్నంగా కనిపిస్తోంది. అంతకు ముందు..బుధవారం కూడా ట్రంప్ ఇదే తరహా హెచ్చరికలే జారీ చేశారు. సమయం మించి పోతుందని.. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ దిగి రాకపోతే పరిస్థితి దారుణంగా ఉండొచ్చని హెచ్చరించారు. అయితే అందుకు ఇరాన్ కూడా అదే రీతిలో స్పందించింది. తమ వేలు కూడా ట్రిగ్గరైపైనే ఉందని.. అమెరికా దాడులకు దిగితే ప్రతిస్పందన కూడా మునుపెన్నడూ లేని రీతిలో ఉంటుందని అంటోంది.అమెరికా.. టైం తక్కువగా ఉంది, ఇరాన్ వెంటనే చర్చల టేబుల్ వద్దకు రావాలిఇరాన్.. పరస్పర గౌరవం, ప్రయోజనాల ఆధారంగా చర్చలకు సిద్ధం, కానీ ఒత్తిడి చేస్తే ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా ప్రతిస్పందిస్తాంప్రస్తుతం ఇరాన్ వైపు అమెరికా భారీ నౌకాదళాన్ని మోహరించింది. ప్రధానంగా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే ఎయిర్ క్రాప్ట్ క్యారియర్ రెడీగా ఉంది. దీంతో పాటు యుద్ధనౌకలు, డిస్ట్రాయర్లు, క్రూయిజర్లు, సబ్మెరైన్లు.. అలాగే పైటర్ జెట్లు, హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఇరాన్ కూడా ప్రతిస్పందనగా తన షాహిద్ బఘేరి(Shahid Bagheri) డ్రోన్ క్యారియర్ను హార్ముజ్ జలసంధి వద్ద మోహరించింది.హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాకు కీలకం. ఇక్కడ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆంక్షలు కూడా..ఇరాన్పై ఒత్తిడి చేసే క్రమంలో ట్రంప్ సర్కార్ కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెనీపై, అలాగే ఓ ఇరానీయన్ ప్రముఖ వ్యాపారవేత్తపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇరాన్లో ఇటీవల జరిగిన ప్రజా నిరసనలను మొమెనీ ఆధ్వర్యంలోని బలగాలు క్రూరంగా అణచివేశాయని.. వేలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని.. అందుకే ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. -
అడుగు పెడితే.. అంతు చూస్తా.. ట్రంప్ కు ఇరాన్ వార్నింగ్
-
వార్ టెన్షన్.. ట్రంప్తో యుద్ధానికి సిద్ధమన్న ఇరాన్
ఇస్తాంబుల్: శాంతియుత ఆందోళనలను తీవ్రంగా అణచివేయడంతోపాటు మూకుమ్మడి మరణశిక్షలను అమలు చేస్తున్న ఇరాన్పై మిలటరీ దాడులు తప్పవంటూ అమెరికా చేస్తున్న హెచ్చరికలను ఆ దేశం బేఖాతరు చేస్తోంది. ఉద్రిక్తతలను సడలించేందుకు అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటున్న ఇరాన్ ప్రభుత్వం.. ప్రస్తుతానికి అందుకు సంబంధించిన ప్రణాళికేదీ లేదని మరోవైపు చెబుతోంది.ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి శుక్రవారం తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తో కలిసి ఇస్తాంబుల్లో మీడియాతో మాట్లాడారు. అమెరికాతో నిష్పక్షపాత, సమానత్వంతో కూడిన చర్చలకు సిద్ధమన్నారు. అయితే, ముందుగా ఏ అంశంపై చర్చ జరగాలి, ఎక్కడ కలుసుకోవాలి అనే వాటిపై నిర్ణయం జరగాలని స్పష్టం చేశారు. చర్చలకు, అవసరమైతే యుద్ధానికి కూడా తాము సిద్ధమేనంటూ అరాగ్చి వ్యాఖ్యానించారు. అమెరికా ఆంక్షలుమరోవైపు.. ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇస్కందర్ మోమినీపై అమెరికా శుక్రవారం ఆంక్షలు విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన నిరసనకారులపై మోమినీ ఆదేశాల మేరకు భద్రతా సిబ్బంది దమనకాండకు పాల్పడ్డారని ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. మోమినీతో పాటు.. ఇరాన్ పారిశ్రామిక బాబక్ జంజానీ సహా 18 మంది వ్యక్తులు, కొన్ని సంస్థలపై ఆంక్షలు విధించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. -
USA: మీ పాలన వద్దు బాబోయ్.. ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆ దేశంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇంతకాలం ఆయన ఇమ్మిగ్రేషన్ పాలసీనే వ్యతిరేకించిన అమెరికన్లు ఇప్పుడు ట్రంప్ పాలనపైనే వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఆయన పాలనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నట్లు సమాచారం."నేనేప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు" ఇది ఒక సినిమాలోని ఫేమస్ డైలాగ్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారంలో సరిగ్గా సరిపోతుంది. ఆయన ఎప్పుడు ఏంమాట్లాడుతారో.. ఏదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో.. ఏభూమిని స్వాధీనం చేసుకుంటారో.. ఏ దేశంపై పన్నులు పెంచుతారో ఆయనకే తెలియదు.. అందుకే ట్రంప్ పాలన విధానంపై ప్రపంచ దేశాలు భయంభయంగా ఉంటాయి. అయితే ఇప్పుడు సీన్ మరింతగా ముదిరింది. ఆయన పాలనపై తాజాగా అమెరికాలోనూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల అమెరికా మిన్నోసోటా రాష్ట్రంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల దాడుల్లో ఇద్దరు మరణించగా అందుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చాలామంది తమ వ్యాపారాలను మూసి వేసి రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. విద్యార్థులు సైతం పాఠశాలల నుంచి క్లాసులు వాకౌట్ చేశారు. అంతేకాకుండా నోవర్క్, నోస్కూల్, నోషాపింగ్ పేరుతో అమెరికా అంతటా ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.దీంతో ట్రంప్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఆయన ఇమ్మిగ్రేషన్ విధానాన్నే వ్యతరేకించిన అమెరికన్స్ తాజాగా ఆయన పరిపాలన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలోనూ ట్రంప్ పాలనను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడైంది. మెుత్తానికి మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ని చివరకు ఆ దేశ ప్రజల చేతే తిరస్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది. -
మరో మదురోగా ఖమేనీ? ఏ క్షణమైనా అమెరికా పూర్తిస్థాయి యుద్ధం..!!
వాషింగ్టన్ డీసీ: అయతుల్లా ఖమేనీ.. ఇరాన్ సుప్రీం లీడర్..! ఇప్పుడు ఇతణ్ని కూడా వెనిజెవెలా అధ్యక్షుడు మదురో మాదిరిగా పట్టుకునేందుకు అమెరికా సిద్ధమైందా?? 1979లో రిపబ్లిక్గా మారినప్పటి నుంచి ఇరాన్లో ఎన్నడూ లేని విధంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం.. దాన్ని అణచివేసేందుకు ఖమేనీ నేతృత్వంలోని ఐఆర్జీసీ బలగాల దమనకాండ.. వేల మంది మరణాల నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా ట్రంప్ తన సైన్యంతో టెహ్రాన్పై దాడికి సన్నద్ధమయ్యారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, జియోపాలిటిక్స్ ఈక్వేషన్లు అవుననే సమాధానం చెబుతున్నాయి. మదురోను అరెస్టు చేసిన సమయంలో అమెరికా తన నౌకదళాన్ని ఎక్కువగా వాడుకుంది. అదే సమయంలో సైబర్ ఎటాక్లు చేసింది. ఇప్పుడు కూడా అమెరికాకు చెందిన యుద్ధ విమానాల వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ జలాల సమీపంలోకి రావడంతో.. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇప్పుడు ఇరాన్ సమీపంలోని జలాల్లో పూర్తిస్థాయిలో మోహరించింది. అదే సమయంలో.. వెనిజెవెలా మాదిరిగా సైబర్ దాడి చేసేందుకు అమెరికా సైబర్ కమాండ్ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ పౌరులు కూడా ఖమేనీ శకాన్ని ఖతం చేయాలంటూ భీష్మించుకోవడం.. లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు కలిసివచ్చింది. నిజానికి 2012లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనేజాద్ తాము యురేనియం కడ్డీని తయారు చేశామని ప్రకటించినప్పటి నుంచే అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పుడు టెహ్రాన్లో ప్రజాందోళనలు అమెరికాకు కలిసివచ్చాయి. ఇదే అదనుగా యుద్ధానికి అమెరికా సిద్ధమవుతోంది.వాస్తవానికి ఇరాన్-అమెరికా వివాదాలు, దాడులు-ప్రతిదాడులు గత ఏడాది నుంచి మొదలయ్యాయి. గత ఏడాది జూన్ 21 అర్ధరాత్రి దాటాక ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఆ మర్నాడే ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే.. ఆ దాడి గురించి ఇరాన్ తమకు ముందుగానే సమాచారం అందించిందని అప్పట్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాహాటంగా చెప్పారు. ఫలితంగా తాము ఇరాన్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. 2020లో ట్రంప్ ఇదే తరహా దాడులు చేయించారు. ఆ ఏడాది జనవరి 3న ఇరాక్లోని బగ్దాద్ విమానాశ్రయం సమీపంలో.. కుద్స్ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమానీ లక్ష్యంగా దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణులతో ఇరాక్లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అల్-అసద్ వైమానిక స్థావరంపై విరుచుకుపడింది. అప్పట్లో కూడా ఇరాన్ ముందస్తుగా సమాచారం ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఈ దాడులతో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగకున్నా.. అప్పట్లో అక్కడ పనిచేసిన సైనికులు ఇప్పుడు అదే ట్రామాలో కొనసాగుతూ మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారనే నివేదికలు వచ్చాయి.గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇప్పుడు దాడులు-ప్రతిదాడుల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టమవుతోంది. అమెరికా సైనిక శక్తి విషయంలో బలంగా ఉంది. ఇరాన్ ఆ విషయంలో చాలా వెనుకబాటులో ఉంది. అయితే.. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలో ఇరాన్ గడిచిన మూడేళ్లలో చాలా పురోగతి సాధించింది. అయితే.. సొంత ప్రజలే వ్యతిరేకంగా ఉండడంతో.. ఇరాన్ సర్కారు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని ప్రాంతాలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందంటూ ఇటీవల నివేదికలు వచ్చాయి.ఖమేనీ ఇప్పటికీ టెహ్రాన్లోనే ఉన్నాడా? లేక రష్యాలో తలదాచుకుంటున్నాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశాలయ్యాయి. అయితే.. అమెరికా నిఘా సంస్థలు మాత్రం ఖమేనీ ఉనికిపై ఓ స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనా.. యుద్ధ విమానాలు, సేనలను ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నా.. ప్రజలకు నష్టం కలగకుండా.. కలుగులో దాక్కొన్న ఖమేనీ, నియంతృత్వ భావాలున్న ఇతర నాయకులే అమెరికా లక్ష్యమని స్పష్టమవుతోంది. అంటే.. పరిమిత ప్రాంతాలపైనే.. ఇంకా చెప్పాలంటే నిర్ణీత భవనాలు, బంకర్లపైనే అమెరికా దాడులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఇరాన్ గార్డ్స్, సైన్యాధికారులు కూడా తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా ట్రంప్ సేనలు ఇరాన్ పెద్దలను బంధించేందుకు దాడులు జరిపే అవకాశాలున్నాయి. -
టీ20 ప్రపంచకప్ కోసం యూఎస్ఏ జట్టు ప్రకటన
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 మంది సభ్యుల యూఎస్ఏ జట్టును ఇవాళ (జనవరి 30) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మోనాంక్ పటేల్ ఎంపికయ్యాడు. గత ఎడిషన్లో (2024) ఆడిన 10 మంది ఆటగాళ్లు, ఈసారి కూడా చోటు దక్కించుకున్నారు. కొత్తగా శుభమ్ రంజనే, మహ్మద్ మొహ్సిన్, షేహాన్ జయసూర్య ప్రపంచకప్ జట్టులోకి వచ్చారు.యూఎస్ఏకు ఇది రెండో టీ20 ప్రపంచకప్. గత ఎడిషన్లో ఈ జట్టు పాకిస్తాన్ను చిత్తు చేసి సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్లో సూపర్ ఓవర్లో విజయం సాధించి, సూపర్-8కు కూడా అర్హత సాధించింది. ఈసారి కూడా యూఎస్ఏ సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. ఆండ్రీస్ గౌస్, మోనాంక్ పటేల్ ఆ జట్టు ప్రధాన బ్యాటర్లుగా ఉన్నారు. బౌలింగ్లో నేత్రవల్కర్, నోస్తుష్ కెన్జిగే, అలీ ఖాన్ కీలకమయ్యే అవకాశం ఉంది.గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్ లాంటి జట్లతో పోటీపడాల్సి ఉన్న యూఎస్ఏ.. ఇదే గ్రూప్లోని నమీబియా, నెదర్లాండ్స్పై సంచలన విజయాలు సాధించే ఆస్కారం ఉంది. ఫిబ్రవరి 7న టీమిండియా మ్యాచ్తో యూఎస్ఏ తమ రెండో ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.టీ20 ప్రపంచకప్ 2026 కోసం యూఎస్ఏ జట్టు.. మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షేహాన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కమల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెన్జిగే, షాడ్లీ వాన్ స్కాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభమ్ రంజనే. గ్రూప్-ఏలో యూఎస్ఏ మ్యాచ్లు - ఫిబ్రవరి 7: ఇండియా vs USA (ముంబై) - ఫిబ్రవరి 10: పాకిస్తాన్ vs USA (కొలంబో) - ఫిబ్రవరి 13: నెదర్లాండ్స్ vs USA (చెన్నై) - ఫిబ్రవరి 15: నమీబియా vs USA (చెన్నై) -
టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అతి పెద్ద సంచలనాలు ఇవే..!
టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే, తక్కువ వ్యవధిలో ఆట స్వరూపమే మారిపోతుంది. ఒక్క చిన్న తప్పిదం.. ఒక్క ఆటగాడి అద్భుత ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంది. ఇక్కడ చిన్న జట్టు, పెద్ద జట్టు అన్న తేడా పెద్దగా ఉండదు. ఆ సమయానికి ఎవరిది పైచేయి అయితే, వారే మ్యాచ్ గెలుస్తారు. చిన్న జట్లతో పోలిస్తే పెద్ద జట్లే అధిక అంచనాల ఒత్తిడిలో ఉంటాయి. ఈ కారణంగానే ఫలితాలు తారుమారవుతాయి. పొట్టి ఫార్మాట్లో ఇలాంటి ఘటనలను తరుచూ చూస్తుంటాం.మెగా టోర్నీ అయిన ప్రపంచకప్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఈ టోర్నీ తొలి ఎడిషన్ నుంచే ఇలాంటి సంచలనాలు నమోదవుతూ వచ్చాయి. త్వరలో ప్రారంభం కానున్న 2026 ఎడిషన్ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నమోదైన టాప్-5 అతి పెద్ద సంచలనాలపై ఓ లుక్కేద్దాం.తొలి ఎడిషన్లోనే..!పురుషుల టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్లోనే (2007) అతి పెద్ద సంచలనం నమోదైంది. కేప్టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో పసికూన జింబాబ్వే 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. జింబాబ్వే ఆటగాళ్లు బ్రెండన్ టేలర్ (60*), ఎల్టన్ చిగుంబురా (3/20) ఈ మ్యాచ్ హీరోలుగా నిలిచారు.ఇంగ్లండ్కు నెదర్లాండ్స్ షాక్రెండో ఎడిషన్లో (2009) మరో సంచలనం నమోదైంది. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్పై చిన్న జట్టు నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో అనూహ్య విజయం సాధించింది. ఇక్కడ గమనించదగ్గ మరో విశేషమేమిటంటే.. నెదర్లాండ్స్ ఇంగ్లండ్ను వారి స్వదేశంలోనే ఓడించడం. టామ్ డి గ్రోత్ (49), ర్యాన్ టెన్ డోషాటే (2/35) నెదర్లాండ్స్ హీరోలుగా నిలిచారు.పెను సంచలనాల ఎడిషన్2022 ఎడిషన్లో రెండు భారీ సంచలనాలు నమోదయ్యాయి. శ్రీలంకకు నమీబియా.. సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ ఊహించని షాక్లు ఇచ్చాయి. నమీబియా తరఫున జాన్ ఫ్రైలింక్ (44), డేవిడ్ వీజ్, బెర్నార్డ్ స్కోల్జ్ (తలో 2 వికెట్లు) హీరోలుగా నిలువుగా.. నెదర్లాండ్స్ తరఫున కాలిన్ అకర్మాన్ (41*), బ్రాండన్ గ్లోవర్ (3/9) అద్భుతం చేశారు.పాక్ను మట్టికరిపించిన పసికూన2024 ఎడిషన్లో మరో పెను సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్కు అర్హత సాధించిన యూఎస్ఏ.. బలాడ్యులమని విర్రవీగే పాక్కు కర్రు కాల్చి వాత పెట్టింది. ఈ మ్యాచ్లో యూఎస్ఏ ఆటగాళ్లు మోనాంక్ పటేల్ (50), సౌరభ్ నేత్రవల్కర్ (2/18 + సూపర్ ఓవర్ ) అద్భుత ప్రదర్శనలు చేసి యూఎస్ఏకు చారిత్రక విజయాన్ని అందించారు. ఇదే ఎడిషన్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా పెను సంచలనాలు నమోదు చేసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి మెగా జట్లకు షాకిచ్చి సెమీఫైనల్ వరకు వెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు త్వరలో ప్రారంభం కాబోయే 2026 ఎడిషన్లోనూ పెను సంచలనాలు సృష్టించే ఆస్కారం ఉంది. ఆఫ్ఘన్తో పాటు యూఎస్ఏ, నేపాల్ కూడా పెద్ద జట్లకు షాకిచ్చే అవకాశం ఉంది. -
ఇరాన్ ను కవ్విస్తున్న ట్రంప్.. ఏ క్షణమైనా యుద్ధం..
-
ట్రంప్ శాంతి మండలి.. ఫస్ట్ షాక్
గాజా సంక్షోభాన్ని చల్లార్చే క్రమంలో.. బోర్డు ఆఫ్ పీస్ పేరిట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హడావిడి చూస్తున్నదే. ఇప్పటికే ఈ జాబితాలో 35 దేశాలు చేరాయి. రష్యా(చేరుతుందని ట్రంప్ ప్రకటించినా పురోగతి కనిపించడం లేదు), చైనా, జీ7 కూటమిలోని కొన్ని దేశాలు(యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా) ఇంకా చేరలేదు. భారత్ కూడా వాణిజ్య ఒప్పందం ఖరారు కాకపోవడంతో తన వైఖరిని స్పష్టం చేయకుండా దోబుచులాడుతోంది. ఈ క్రమంలో ట్రంప్ ఆహ్వానాన్ని నేరుగా తిరస్కరించింది న్యూజిలాండ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రారంభించిన శాంతి మండలికి తొలి షాక్ తగిలింది. ఇందులో చేరాలని ఇచ్చిన ఆహ్వానాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు ఆ దేశపు ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇందులో చేరకూడదనే నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారాయన. న్యూజిలాండ్ ఏం చెబుతోంది?ట్రంప్ ఈ బోర్డును గత వారం ప్రారంభించారు. మొదటగా గాజా ప్రాంతంలో తాత్కాలిక కాల్పుల విరమణను బలపరచడమే లక్ష్యంగా ఉన్నా, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విస్తృత పాత్ర పోషించాలనే ఉద్దేశం ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ స్పందిస్తూ.. ఇది కొత్త సంస్థ. దీని పరిధి, భవిష్యత్తు పాత్రపై స్పష్టత అవసరం ఉంది. అప్పుడే మా నిర్ణయాన్ని కూడా చెప్పగలం అని పేర్కొన్నారు. ఇదే విషయంపైనా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ‘‘గాజా సమస్యపై ఇప్పటికే ప్రాంతీయ దేశాలు ముందుకు వచ్చి సహకరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో న్యూజిలాండ్ పీస్ బోర్డులో చేరడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. న్యూజిలాండ్ అనేది ఇప్పటికే ఐక్యరాజ్యసమితి స్థాపక సభ్యదేశం. అలాంటప్పుడు ఈ కొత్త బోర్డు చేసే పనులు UN చార్టర్కు అనుగుణంగా ఉండాల్సిందే’’ అని విన్స్టన్ పీటర్స్ స్పష్టం చేశారు.ఇప్పటికే ట్రంప్ పీస్ బోర్డులో టర్కీ(తుర్కియే), ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి మధ్యప్రాచ్య(Middle East) దేశాలు. అలాగే ఇండోనేషియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం చేరాయి. కానీ, అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న దేశాలు సైతం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండడం కొసమెరుపు.భారత్ ఇంకా ఎందుకు చేరలేదు?భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ట్రంప్ ఆహ్వానం పంపించారు. అయితే భారత్ ఈ బోర్డు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ బోర్డు అంతర్జాతీయ చట్టబద్ధత, దీర్ఘకాల ప్రభావాలపై స్పష్టత లేకపోవడాన్ని భారత్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పైగా ఈ బోర్డు యూఎన్ చార్టర్కు విరుద్ధంగా ఉండే అవకాశం ఉండడం, ఐరాస శాంతి దళాల పనిని బలహీనపర్చవచ్చనే ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటోంది. అన్నింటికీ మించి పాకిస్తాన్ ఈ బోర్డులో చేరడంతో భారత్కు ఇది సున్నితమైన అంశంగా మారింది. ఈ క్రమంలో వేచిచూడాలనే ధోరణితో వ్యూహాత్మక వైఖరిని అవలంభిస్తోంది భారత్. -
హైదరాబాద్ వేదికగా అమెరికా-భారత్ TRUST కార్యక్రమం
హైదరాబాద్: అమెరికా- భారత్ కలిసి TRUST (Transforming the Relationship Utilizing Strategic Technology) కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాయి. హైదరాబాద్లో జరిగిన కీలక సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశ్రమ నాయకులు పాల్గొని కృత్రిమ మేధస్సు (AI) , సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశాన్ని అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్-వరల్డ్ ట్రేడ్ సెంటర్ (శంషాబాద్, విశాఖపట్నం) సంయుక్తంగా నిర్వహించాయి. ఇది 2025 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్- భారత ప్రధాని మోదీ ప్రారంభించిన TRUST కార్యక్రమాన్ని అమలు చేయడంలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, విద్యాసంస్థలు, ప్రైవేట్ రంగం కలిసి కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, ఇంధనం, అంతరిక్ష రంగం, దీర్ఘకాలిక భద్రతకు కీలకమైన రంగాల్లో భాగస్వామ్యాలను పెంపొందించనున్నారు.సరఫరా గొలుసును బలోపేతం చేయడంతో పాటు ఏఐ మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడం, ఆవిష్కరణ ఎకోసిస్టమ్లను పెంపొందించడం తదితర అంఃశాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉన్నాయి. దీని ద్వారా రెండు దేశాల సాంకేతిక సామర్థ్యాలు, ఆర్థిక పోటీ సామర్థ్యం మరింత బలపడనున్నాయి. -
అమెరికాలో రాజకీయ దుమారం
-
కాబోయే సుప్రీం మొజ్తబా ఖమేనీ..దిమ్మదిరిగే వ్యాపార సామ్రాజ్యం
ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కాబోయే వారసుడిగా ప్రచారంలో ఉన్న ఆయన రెండో కుమారుడు 56 ఏళ్ల ఈ మత గురువు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) విదేశాల్లో విస్తరించిన ఆయన వ్యాపార సామ్రాజ్యం ఇపుడు నెట్టింట్ చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ తన అణు కార్యక్రమం కారణంగా గత రెండు దశాబ్దాలుగా చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆ దేశ ఉన్నత వర్గాలు విదేశాలకు మూలధనాన్ని ఎలా తరలించగలిగాయో ఖమేనీ విదేశీ పెట్టుబడుల పోర్ట్ఫోలియో చూస్తే అర్థం అవుతుంది అంటోంది తాజా నివేదిక.ప్రముఖ పాశ్చాత్య గూఢచార సంస్థ అంచనా ప్రకారం ఉత్తర లండన్లోని "బిలియనీర్స్ రో" అని పిలువబడే వీధిలో, పొడవైన కంచెలు, మూసివేసిన గేట్ల వెనుక చాలా వరకు ఖాళీగా ఉన్న కొన్ని భవనాలు ఉన్నాయి. ది బిషప్స్ అవెన్యూలోని ఈ విలాసవంతమైన ఇళ్ల ముఖభాగాల వెనుక టెహ్రాన్ నుండి దుబాయ్ , ఫ్రాంక్ఫర్ట్ వరకు విస్తరించి ఉన్న ఒక నెట్వర్క్ ఉంది. అనేక బినామీ కంపెనీల ద్వారా, దీని అంతిమ యాజమాన్యం మధ్యప్రాచ్యంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరైన ఇరాన్ సర్వోన్నత నాయకుడి రెండవ కుమారుడు మొజ్తబా ఖమేనీదే అని చెబుతోంది.యువ ఖమేనీ తన ఆస్తులను తన సొంత పేరు మీద పెట్టడానికి ఇష్టపడకపోయినప్పటికీ, విస్తారమైన పెట్టుబడుల సామ్రాజ్యాన్ని నిర్మించారని, కొన్ని కనీసం 2011 నాటివి అని అంచనా. గ్లోబల్గా విస్తరించిన అతని ఆస్తులు విలువ పర్షియన్ గల్ఫ్ షిప్పింగ్ నుండి స్విస్ బ్యాంక్ ఖాతాలుదాకా విస్తరించి ఉన్నాయని భావిస్తున్నారు. 2019లో అతనిపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, ఈ సంస్థల నెట్వర్క్ మొత్తం కలిసి ఖమేనీకి నిధులను బిలియన్ల డాలర్లను పాశ్చాత్య మార్కెట్లలోకి మళ్లించారు.ముఖ్యమైన ఆస్తులుమొజ్తబా ఖమేనీ లండన్, దుబాయ్, జర్మనీ మరియు స్పెయిన్ వంటి దేశాల్లో వందల మిలియన్ డాలర్ల విలువైన విలాసవంతమైన భవనాలు, హోటళ్లు మరియు వ్యాపారాలను కలిగి ఉన్నారని బ్లూమ్బెర్గ్ పరిశోధనలో తేలింది. ఈ ఆస్తులేవీ నేరుగా ఆయన పేరు మీద లేవు. అలీ అన్సారీ అనే ప్రముఖ ఇరానియన్ వ్యాపారవేత్తను బినామీగా వాడుకుని, అనేక షెల్ కంపెనీల ద్వారా ఈ పెట్టుబడులు పెట్టారు. ప్రధానంగా ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా వచ్చిన నిధుల నుంచే ఈ సంపద సమకూరినట్టు సమాచారం. ఇరాన్పై కఠినమైన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ, గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకుని ఈ నిధులను విదేశాలకు తరలించారు.లండన్ (UK): లండన్లోని "బిలియనీర్స్ రో" (The Bishops Avenue) లో సుమారు రూ. 1,241 కోట్ల ($138 మిలియన్లు) విలువైన విలాసవంతమైన భవనాలున్నాయి. ఇందులో ఒక ఇల్లు 2014లో ఏకంగా రూ. 371.09కోట్లకు కొనుగోలు చేశారట.దుబాయ్లోని అత్యంత విలాసవంతమైన "ఎమిరేట్స్ హిల్స్" (దీనిని దుబాయ్ బెవెర్లీ హిల్స్ అంటారు) ప్రాంతంలో ఒక పెద్ద విల్లా ఉంది.ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ), మల్లోర్కా (స్పెయిన్) లాంటి నగరాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లు (ఉదాహరణకు Hilton Frankfurt Gravenbruch) ఈ నెట్వర్క్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. కెనాడాలోని టొరంటోలోని ఫోర్ సీజన్స్ ప్రైవేట్ రెసిడెన్స్లో ఒక పెంట్హౌస్ను సుమారు 7.7 మిలియన్ల డాలర్లకు విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి.మరికొన్ని ఆస్తులను నేరుగా మెజ్తబా పేరు మీద కాకుండా, Birch Ventures Ltd, Ziba Leisure Ltd, , A&A Leisure వంటి షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేశారు. ఇవి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఐల్ ఆఫ్ మ్యాన్ వంటి దేశాల్లో రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు ఇరాన్లో చమురుకంపెనీల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును దుబాయ్, స్విట్జర్లాండ్, లీచ్టెన్స్టెయిన్ బ్యాంకు ఖాతాల ద్వారా దారి మళ్లించి ఈ ఆస్తులను కొన్నారట."ఇరాన్ ప్రభుత్వం జర్మనీ ఆర్థిక వ్యవస్థలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది" అని ఫ్రాంక్ఫర్ట్ డిప్యూటీ మేయర్, టెహ్రాన్లో జన్మించి ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించిన నర్గెస్ ఎస్కందారి-గ్రున్బర్గ్ అన్నారు. మన వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం.ఎవరీ అన్సారీమొజ్తబా సామ్రాజ్యాన్ని నడపడంలో అలీ అన్సారీ (Ali Ansari) కీలక పాత్ర పోషించాడనే విమర్శలు భారీగానే ఉన్నాయి. ఇరాన్లోని అతిపెద్ద షాపింగ్ మాల్ (Iran Mall) యజమాని ,బ్యాంకర్. 1980ల చివరలో, ఇరాన్-ఇరాక్ యుద్ధం ముగిసే సమయానికి - యువ అన్సారీ సైన్యంలో చేరాడు. ఈ సమయంలోనే అతను మొదటిసారిగా మొజ్తబా ఖమేనీని కలిశాడు. ఆ తరువాత అన్సారీ లాభదాయకమైన ప్రభుత్వ కాంట్రాక్టులు , దిగుమతి లైసెన్సులను పొందాడు. నిర్మాణ రంగం, షిప్పింగ్ మరియు పెట్రోకెమికల్స్ రంగాలలోకి వేగంగా ప్రవేశించాడు. ఈ పరిశ్రమలు ప్రభుత్వ నిధులను విదేశాలకు తరలించడానికి మార్గాలుగా ఉపయోగపడ్డాయని సమాచారం. 1990- 2000లలో, అన్సారీ టెహ్రాన్లో ఒక వర్ధమాన పారిశ్రామికవేత్తగా ఎదిగాడు అతను 2009లో TAT బ్యాంక్ను స్థాపించాడు, ఇది తరువాత బ్యాంకు యాజమాన్యంలోని విలాసవంతమైన షాపింగ్ సెంటర్ అయిన ఇరాన్ మాల్ను నిర్మించే ప్లాన్ వేశాడు. 2013 నాటికి, ఒక విలీనం TAT బ్యాంక్ను అయందే బ్యాంక్గా మార్చింది. ఇది 2025లో కుప్పకూలింది. అంతర్గత రుణాల ఆరోపణలలో చిక్కుకుని, అప్పులు మరియు అధికారులతో ఉన్న సన్నిహిత రాజకీయ సంబంధాలపై వివాదాలతో కూరుకుపోయింది.బ్రిటన్ ఇతనిని "అవినీతిపరుడైన ఇరానియన్ వ్యాపారవేత్త"గా పేర్కొంటూ ఆంక్షలు విధించింది. అన్సారీపై UK ఆస్తులను స్తంభింపజేయడం వలన EU ఆంక్షలు విధించినట్లయితే నెట్వర్క్ యూరోపియన్ ఆస్తులను భారీగా విక్రయించే అవకాశం ఉందని మనీలాండరింగ్ దర్యాప్తు యూరోపియన్ అధికారి పేర్కొన్నారు.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!ఖమేనీ వారసుడిగామొజ్తబాతండ్రి 86 ఏళ్ల అలీ ఖమేనీ తర్వాత ఇరాన్ తదుపరి "సుప్రీం లీడర్" అయ్యేందుకు మెజ్తబా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఆస్తులు ఆయనకు రాజకీయంగా మరియు ఆర్థికంగా బలాన్ని ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇరాన్లో విప్లవం వచ్చి ప్రభుత్వం కూలిపోతే, విదేశాలకు పారిపోయి సుఖంగా జీవించడానికి ఈ భారీ సంపదను "రెయిన్ డే ఫండ్"గా సిద్ధం చేసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయి.2025-26లో అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో ఇరాన్పై ఒత్తిడి పెరిగింది. అలీ అన్సారీపై బ్రిటన్ ఆంక్షలు విధించడంతో, ఈ విదేశీ ఆస్తులను ఫ్రీజ్ (Freeze) చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే, పాలకుల కుటుంబం ఇలా కోట్లాది రూపాయల సంపదను విదేశాల్లో దాచుకోవడంపై ఇరాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.మరోవైపు ఇరాన్పై యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని యుద్ధనౌకలను తరలిస్తున్నామంటూ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ప్రజలు పేదరికంతో అలమటిస్తుంటే, పాలకుల కుటుంబం ఇలా విదేశాల్లో విలాసవంతమైన ఆస్తులు కూడబెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇరాన్ ప్రభుత్వం తమను తాము సామాన్య భక్తులుగా చెప్పుకున్నా, లోపల జరుగుతున్నది వేరని తాజా నివేదిక చెబుతోంది. ఈ నివేదికలోని పేర్కొన్న ఆస్తులపై అటు ఖమేనీ లేదా అన్సారీ స్పందించ లేదు. -
కుక్క కోసం రూ. 15 లక్షలా..? ఎన్నారై దంపతులు..
శునకాలను చాలమంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఎంత ప్రేమగా, లాలనగా చూస్తోరో తెలిసిందే. కానీ మరీ ఇంతలా పెంపుడు జంతువు కోసం డబ్బు ఖర్చే చేసిన వాళ్లను చూసుండరు. అది కూడా లక్షల్లో అంటే..ఇదేం పిచ్చిరా బాబు అనేస్తాం. కానీ ఈ ఎన్నారై దంపతులు అది కేవలం కుక్క కాదు తమ బిడ్డ అని చెబుతుండటం విశేషం. ఇంతకీ ఆ ఎన్నారై దంపతులు ఆ కుక్క కోసం ఎందుకు అంతలా ఖర్చు చేశారంటే..ఎన్నారై దంపతులు దివ్య, జాన్లు తమ కుక్క కోసం ఎంతలా కష్టపడి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తెచ్చుకున్నామో 'కహానీ ఆఫ్ టేల్స్' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఈ జంట ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నప్పుడూ..తామెంతో ప్రేమగా పెంచుకున్న స్కై అనే కుక్కని కూడా తమతోపాటే తెచ్చుకోవాలని అనుకున్నారు. అయితే భారత్ నుంచి కుక్క నేరుగా ఆస్ట్రేలియాకు తెచ్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించదు. భారతదేశం నుంచి వచ్చే కుక్కలు ర్యాబిస్ లేని దేశంలో ఆరు నెలలపాటు ఉంచాలి. అప్పుడే దాన్ని ఆస్ట్రేలియాకి తీసుకురావడానికి అనుమితిస్తుంది అక్కడ ప్రభుత్వం. పైగా ఆ తతంగం అంతా చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయినప్పటికీ తగ్గేదే లే అంటూ..ఈ జంట దుబాయ్లో తమ ప్రియమైన కుక్కతో కలిసి ఆరు నెలలు ఉన్నారు. మొత్తం ప్రక్రియకు 190 రోజులు పట్టింది. చాలా పేపర్ వర్క్, పలు పశువైద్య పరీక్షలు, టీకాలు, క్వారంటైన్ ఫీజులు అన్ని పూర్తయ్యాక..తాము ముగ్గురం కలిసి అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా వెళ్లే క్షణం రానే వచ్చింది. ఆక్షణం తమకెంతో అపురూపమైనదని, ఎన్నో త్యాగాలు, వ్యయప్రయాసాలు తర్వాత దక్కిన ఉద్విగ్నభరిత క్షణం అంటూ ఇన్స్టాగ్రామ్లో తమ భావోద్వేగ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ఎన్నారై జంట ఆ కుక్క కోసం ఎంత ఖర్చు చేశారో వింటే షాకవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ కుక్క కోసమే దాదాపు రూ. 15 లక్షలకు పైనే ఖర్చు చేశారట. పైగా ఆ దంపతులు ఇదేం పిచ్చి వ్యామోహం అనుకోవచ్చు. కానీ అది తమకు కేవలం కుక్క కాదని..తమ బిడ్డేనని..అందువల్ల ఇలా చేశామని ఆ దంపతులు పోస్ట్లో పేర్కొనడం విశేషం. View this post on Instagram A post shared by Kahaanioftails (@kahaanioftails) (చదవండి: ఎవరీ సోఫీ రెయిన్? సోషల్ మీడియా సాయంతో అన్ని కోట్లా..!) -
ఎవరీ సోఫీ రెయిన్? కంటెంట్ క్రియేటర్గా అన్ని కోట్లా..!
కంటెంట్ క్రియేటర్గా చాలామంది రాణిస్తున్నారు. కొందరు వేలల్లో ఆర్జిస్తే..ఇంకొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ కోట్లలలో సంపాదించడం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. జస్ట్ కంటెంట్ క్రియేటర్గా ఆ రేంజ్లో సంపాదనా..!? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆ అమ్మాయి తాను చెబుతోందంతా నిజం అంటూ ఏవిధంగా ఆమె ఆన్లైన్ ఫ్లాట్ఫామ్లలో కోట్లలో ఆర్జిస్తోంది ఆధారాలతో సహా ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరించింది. ప్రముఖ అమెరికన్ ఓన్లీఫ్యాన్స్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సోఫీ రెయిన్ వివిధ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ల ద్వారా సుమారు రూ. 930 కోట్లకు పైనే సంపాదిస్తున్నానని వెల్లడించింది. అందుకు సంబంధించిన ఆధారాలతో సహా స్కీన్షాట్లతో చూపించింది. మొత్తంగా ఆల్టైమ్ ఆదాయం ఎంత ఉంటుందో స్క్రీన్ షీట్ తీసి మరి చూపించింది. తాను అబద్ధం చెప్పడం లేదని, ఈ విజయం అసాధారమైనది మాత్రం కాదని చెప్పుకొచ్చింది. సగటు కంటెంట్ క్రియేటర్ నెలకు దగ్గర దగ్గర రూ. 13 వేలుదాక సంపాదించగలడని..తాను మాత్రం వాళ్లందరికంటే అధిక మొత్తంలో ఆర్జిస్తున్నానని ధీమాగా చెబుతోంది. అందుకు అపారమైన లక్తోపాటు..లక్షలాది ఫాలోవర్స్ కూడా చాలా అవసరమని పేర్కొంది. 2024 ఏడాదికే తాను రూ. 359 కోట్లు దాక ఆర్జించినట్లు వెల్లడించింది. జస్ట్ ఆన్లైన్ వీడియోలతో స్టార్ జేసన్ టాటమ్ వంటి ప్రొఫెషనల్ అథ్లెట్ల వార్షిక జీతాలను అధిగమించింది. ఆమె తన ఆదాయంలో కొంత ప్రైవేట్ జెట్లు, కార్ల కోసం ఖర్చు చేసినా..కొంత భాగాన్ని మాత్రం తండ్రి అప్పులు తీర్చడానికి ఉపయోగించడం విశేషం. అయితే రెయిన్ 70% సంపాదనను పెట్టుబడుల్లో పెట్టినట్లు పేర్కొంది. ఎవరీమె..?సోఫీ రెయిన్ 21 ఏళ్ల అమెరికన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , కంటెంట్ క్రియేటర్, ఓన్లీఫ్యాన్స్ వంటి సోషల మీడియా అకౌంట్లతో బాగా గుర్తింపు దక్కించుకుంది. అక్కడ ఆమె తన తన సబ్స్క్రైబర్లతో ప్రత్యేకమైన కంటెంట్ను పంచుకుంటుంది. 2004లో ఫ్లోరిడాలోని మయామిలో జన్మించిన సోఫీ, ఓన్లీఫ్యాన్స్లో 11 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉండగా, ఇన్స్టాగ్రామ్లో 8 మిలియన్ల మంది ఫాలోవర్లతో సహా బహుళ ప్లాట్ఫామ్లలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంది.సోఫీ తన కెరీర్ని వెయిటర్గా ప్రారంభించింది, కానీ ఆమె బాస్, ఓన్లీఫ్యాన్స్ వంటి సోషల్మీడియా ఖాతాల సాయంతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన కంటెంట్ క్రియేటివిటీ, మాటల ఆకర్షణ సాయంతో ఎక్కువమంది సబ్స్కైబర్లను ఆకర్షించింది. ఆమె కంటెంట్ పరంగానే కాకుండా సన్నిహిత ఫోటోషూట్ల విషయంలోనూ అత్యంత కేర్ఫుల్గా ఉంటుందామె. ప్రస్తుతం ఆమె బాప్హౌస్ కలెక్టివ్ కంటెంట్ క్రియేటర్ వ్యవస్థాకురాలు కూడా. (చదవండి: 'రాజా బేటా సిండ్రోమ్': 50 ఏళ్ల పైబడ్డ కూడా..) -
షాకింగ్ న్యూస్ : అమెజాన్లో వేలాది మంది ఉద్యోగులపై వేటు
టెక్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలక నుంది. ప్రధానంగా అమెరికాకు చెందిన కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మూడు నెలల నోటీసు పీరియడ్తో ఉద్యోగులను లేఆఫ్ చేయనుంది.ప్రపంచవ్యాప్తంగా 16,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు అమెజాన్ జనవరి 28న ప్రకటించింది. కోవిడ్ సంక్షోభం తరువాత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. ఏఐకి అప్డేట్ అవుతున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతపై నిర్ణయం తీసుకుంది. ఈ కోతలకు ప్రభావితమైన ప్రతీ ఒక్కరికి సహకారం అందించేందుకు కృషి చేస్తామని Amazon పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి తెలిపారు. లేయర్లను తగ్గించడం, యాజమాన్యాన్ని పెంచడం, బ్యూరోక్రసీని తొలగించడం ద్వారా తమ సంస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలో భారీగా కోతలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇది కొత్త పద్ధతా అని అడగవచ్చు.. కానీ మా ప్లాన్ అదికాదు గాలెట్టి పేర్కొనడం విశేషం.సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ మొత్తం 1.57 మిలియన్ల మందిని నియమించినప్పటికీ, వారిలో ఎక్కువ మంది గిడ్డంగులలో పని చేస్తున్నారు. కార్పొరేట్ వర్క్ఫోర్స్లో దాదాపు 3 లక్షల 50వేల మంది సిబ్బంది ఉన్నారు, అంటే తాజా కోతల్లోవారిలో దాదాపు 4.6 శాతం మందిపై వేటుపడనుంది.ఇదీ చదవండి: నిజాయితీకి మూల్యం, అజిత్ పవార్ మృతిపై రాజ్ థాకరే వ్యాఖ్యలు -
మంచు తుఫాను బీభత్సం గడ్డకట్టిన అమెరికా
-
హెచ్–1బీలకు ఉద్యోగాలివ్వకండి
హూస్టన్: ప్రభుత్వ నిధులతో పనిచేసే తమ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, విభాగాల్లో హెచ్–1బీ వీసాదారుల నియమాకాలను తక్షణం నిలిపేయాలని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో హెచ్–1బీ ఉద్యోగ వీసాదారుల కష్టాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ‘‘టెక్సాస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ టెక్సాస్ కార్మికులు, టెక్సాస్లోని సంస్థల యాజమాన్యాల ప్రయోజనాల కోసం మాత్రమే పాటుపడాలి. ఇలాంటి టెక్సాస్లో హెచ్–1బీ వీసా పథకంలో పలు అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. హెచ్–1బీ వీసాలను పలువురు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు అమెరికా కార్మికులకే దక్కాలి. అలాగే టెక్సాస్లో ఉద్యోగ అవకాశాలు టెక్సాస్ ప్రజలకే దక్కాలి. అందులో భాగంగానే మన రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల నిధులతో పనిచేసే అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న హెచ్–1బీ వీసాదారుల పిటిషన్ల పరిశీలనను తక్షణం నిలిపేయండి’’ అని వర్సిటీలు, ఏజెన్సీలకు రాసిన లేఖలో గ్రెగ్ పేర్కొ న్నారు. ‘‘నియామకాల నిబంధనలను కఠినతరం చేశాం. హెచ్–1బీ వీసాదారులను నియమించుకునే ప్రక్రియను 2027 మే 31వ తేదీదాకా నిలిపివేస్తున్నాం. కొన్ని ఉద్యోగాల్లో హెచ్–1బీ వీసాదారులను నియమించుకోవడం తప్ప మరో మార్గంలేదని టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్ నుంచి సిఫార్సు లేఖలు తీసుకొచ్చిన సందర్భాల్లో మాత్రమే పాక్షికంగా మినహాయింపు వర్తిస్తుంది’’ అని ఆయన స్పష్టంచేశారు. ‘‘ మీ పరిధిలో ఎంత మంది హెచ్–1బీ వీసాదారులకు ఉద్యోగాలిచ్చారు? ఎలాంటి ఉద్యోగాలిచ్చారు? వాళ్లది ఏ దేశం? వాళ్ల వీసా గడువు తేదీలను పేర్కొంటూ వివరాలు సమర్పించండి’’ అని గ్రెగ్ ఆదేశించారు. టెక్సాస్ ప్రభుత్వ వర్సిటీల్లో వందలాది మంది విదేశీ బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో ఇంజనీరింగ్, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక రంగాల నుంచి భారతీయులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. హెచ్–1బీ వీసాదారుల ఉద్యోగ నియమకాలు ఆగిపోతే వర్సిటీల్లో పరిశోధన, ఆవిష్కరణ రంగాలు కుదేలయ్యే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రెగ్ నిర్ణయంతో స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయని కొందరు భావిస్తుంటే ఉన్నత విద్య, పరిశోధనలో అంతర్జాతీయంగా టెక్సాస్ పోటీతత్వం తగ్గిపోతుందని విమర్శకులు వ్యాఖ్యానించారు. -
దక్షిణ కొరియాకు ట్రంప్ బెదిరింపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఇప్పటి వరకు అమలు చేయని కారణంగా దక్షిణ కొరియాపై టారిఫ్లు విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.ఈ సందర్భంగా ఔషధాలు, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందిన ఉత్పత్తులపై 15 నుంచి 25 శాతం వరకు టారిఫ్లను వసూలు చేస్తామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య గతేడాది జూలైలో వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీన్ని దక్షిణ కొరియా పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ‘వాణిజ్య ఒప్పందాలు మాకు చాలా ముఖ్యమైనవి. ఒప్పందాలు కుదిరిన చోట్ల టారిఫ్లు తగ్గించుకుంటూ వస్తున్నాం. భాగస్వామ్య దేశాలు కూడా ఇదే రీతిలో స్పందిస్తాయని భావిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ హెచ్చరికలపై దక్షిణ కొరియా ప్రభుత్వం స్పందించింది. హామీ ఇచ్చిన విధంగా అమెరికాలో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని, ఒప్పందంలోని ఇతర అంశాలపై ఉన్నత స్థాయి సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపింది. -
మంచు తుపాను గుప్పిట్లో అమెరికా
కెనుసా(యూఎస్): అమెరికాలోని పలు రాష్ట్రాలను మంచు తుపాను కమ్మేసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తోడవడంతో లక్షలాది కుటుంబాలు అంధకారంలో, చలిలో ఉండిపోయాయి. 8 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్క నాష్విల్లే పరిధిలోనే 1,50,000 ఇళ్లకు కరెంట్ సరఫరాలేక చలికి జనం అవస్థలుపడ్డారు. మిసిసిప్పీలోనూ ఇదే దారుణ పరిస్థితిని జనం చవిచూశారు. చాలా నగరాల్లో మంచు అర మీటర్కంటే ఎక్కువ ఎత్తులో పేరుకుపోయింది. దీంతో రహదారులపై వాహనాల ప్రయాణాలు ప్రాణాంతకంగా మారాయి.మంచు సంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. కన్సాస్లో ఒకావిడ కోటు ధరించకుండా బార్ నుంచి బయటికొచ్చి శీతలగాలులకు బలై మంచులో కూరుకుపోయారని అధికారులు తెలిపారు. జనం ఇళ్లకు పరిమితం కావాలని ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి. టెక్సాస్ రాష్ట్రం మొదలు మెనే రాష్ట్రం దాకా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పరిధిలోని అమెరికా రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లను వేడిగా ఉంచే వ్యవస్థలు విఫలమవడంతో అమెరికా పౌరుల చలి కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ‘‘ మంచు తుపాను ధాటికి మా ప్రాంతంలోమూగబోయిన ఫోన్లు..మసాచుసెట్స్లోని స్టెర్లింగ్లో ఏకంగా 56.2 సెంటీమీటర్ల ఎత్తు వరకు మంచు కురిసింది. నాష్ విల్లేలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపో వడంతో చార్జింగ్ అయిపోయి మొబైల్ఫోన్లు సైతం మూగబోయాయి. చివరకు అగ్నిమాపక, పోలీస్ స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. ‘‘ మా ప్రాంతంలో చెట్లు నేలకూలాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. ఉరుములు మెరుపులతో జనం బయపడిపోయారు’’అని మిసిసిప్పీలోని ఆక్స్ఫర్డ్కు చెందిన మార్షల్ రామ్సే చెప్పారు. అర్కాన్సాస్ మొదలు న్యూ ఇంగ్లాండ్ రీజియన్దాకా నగరాలను మంచు దుప్పటి కప్పేసింది.దీంతో ఎయిర్పోర్ట్ల నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పాఠశాలలను మూసేశారు. పిట్స్బర్గ్లో 20 అంగుళాల మేర మంచు కురిసింది. ఇక్కడ మైనస్ 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిసిసిప్పీలో 1994 ఏడాది తర్వాత తొలిసారిగా భారీస్థాయిలో మంచు కురిసింది. తుపాను భాధితులను ఆదుకునేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగి దుప్పట్లు, తాగునీరు, జనరేటర్లను సరఫరా చేశారు. టోర్నడో(ప్రచండగాలి) మాదిరి తమ నగరంలో ప్రతి వీధిలో మంచు తుపాను వినాశనం సృష్టించిందని ఆక్స్ఫర్డ్ నగర మహిళా మేయర్ రాబిన్ తన్హాహిల్ ఆవేదన వ్యక్తంచేశారు. -
చావును వెతుక్కుంటూ 70 కి.మి ప్రయాణించి.. చివరకు..The Nihilist Penguin సోర్టీ ఇదే
ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది.. డెడ్లైన్లు, బాధ్యతలు, బిల్లులు, stress… ఈ గందరగోళం మధ్య “ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోవాలి?” అనే భావన చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు కనిపించబోయే ఈ సీన్… మీ మనసు లోతుల్లో ఉన్న భావనకి మౌనంగా సమాధానం.ఇంటర్నెట్లో ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే ఒక చిన్న పెంగ్విన్. దాన్ని నెటిజన్లు ప్రేమగా “ది నిహిలిస్ట్ పెంగ్విన్” అని పిలుస్తున్నారు, అంటే ఇక ఏదీ పట్టించుకోని పెంగ్విన్. ఎందుకంటే అది వెళ్లే దారిలో ఎవరూ లేరు, ఏ శబ్దం లేదు, ఏ గమ్యం కూడా లేదు.ఈ వీడియో కొత్తది కాదు. ఇది 2007లో వచ్చిన ప్రఖ్యాత జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన Encounters at the End of the World అనే డాక్యుమెంటరీ నుంచి తీసుకున్న క్లిప్.డాక్యుమెంటరీ వీడియోలో డాక్టర్ డేవిడ్ ఎయిన్లే మాట్లాడుతూ.. ‘ఒక వేళ ఆ పెంగ్విన్ అక్కడి నుంచి తిరిగి కాలనీకి వచ్చేద్దామని అనుకున్నా కూడా సాధ్యపడదు. తిరిగి రావటం కూడా ‘డెత్ మార్చ్’ అవుతుంది. మార్గం మధ్యలోనే అది చనిపోయే అవకాశం ఉంది’ అని అన్నారు. ఆ డాక్యుమెంటరీ వీడియో తీసిన ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జోగ్ మాట్లాడుతూ...వీడియో తీసిన కొంత సేపటికే ఆ పెంగ్విన్ చనిపోయి ఉంటుంది. అది చనిపోవడానికి ముందు అంటార్కిటికా మంచు పర్వతాల్లో దాదాపు 70 కిలోమీటర్లు ఒంటరిగా నడిచింది’ అని చెప్పారు. అయితే, ఆ పెంగ్విన్ అలా అన్నిటినీ వదలి చావును వెతుక్కుంటూ వెళ్లిపోవటం వెనుక ఉన్న సరైన కారణం ఇంత వరకు తెలియరాలేదు. తన భాగస్వామి చనిపోవటం వల్ల ఆ పెంగ్విన్ డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని, ఆ బాధలో డెత్ మార్చ్ చేసి ప్రాణాలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది. ముఖ్యంగా దీనికి ఒక పాటను జోడించిన తర్వాత ఇది మరింత ఎమోషనల్ గా మారింది. కానీ అసలు ప్రశ్న ఇదే… ఈ పెంగ్విన్ వీడియోకి ఇంత క్రేజ్ ఎందుకు? ఎందుకంటే ఇది మనల్నే చూపిస్తోంది. ఆఫీసు కుర్చీలో కూర్చొని, ల్యాప్టాప్ ముందు కళ్ళు ముడుచుకుని “ఇక చాల్రా… అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలి” అనిపించిన క్షణాల్ని ఇది గుర్తుచేస్తోంది. పెంగ్విన్ మాటలు మాట్లాడదు, కానీ దాని నడక చెబుతోంది – “నాకు శాంతి కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు కొంచెం ఒంటరితనం కావాలి.అని.ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..ఇది ఒక పెంగ్విన్ కథ కాదు, ఇది మన ఆత్మ కథ. అని కామెంట్లు పెడుతున్నారు. పెంగ్విన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆ పెంగ్విన్తో తాను కూడా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఓ ఏఐ ఫొటో క్రియేట్ చేశారు. -
ట్రంప్ కు బిగ్ షాక్...యూరప్ భారత్ మెగా డీల్
-
అలాంటి ఉద్దేశం ట్రంప్నకు లేనే లేదు, కానీ..
అమెరికాలో వలస నియంత్రణ కోసం పని చేస్తున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) దాడులు మళ్లీ తీవ్రతరమయ్యాయి. ఈ క్రమంలో మిన్నెసోటా స్టేట్లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికన్లలో ఆందోళన పెరిగిపోతుండగా.. ఐస్ వ్యతిరేక నిరసనలు ఒకసారిగా ఉధృతం అయ్యాయి. మరోవైపు.. ట్రంప్ సర్కార్ మానవ హక్కులను కాలరాస్తోందనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరుడు జరిపిన దాడుల్లో.. 32 మంది మరణించారు. ఈ ఏడాదిలో మొన్నమధ్యే మిన్నెసోటా రాష్ట్రంలో ఐస్ అధికారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఇది రాజకీయంగా పెను దుమారం రేపింది. జనాల ప్రాణాల్ని తీస్తున్న ట్రంప్ సర్కార్ అంటూ డెమోక్రటిక్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రిపబ్లికన్ పార్టీ మాత్రం ఈ దాడుల్ని సమర్థించుకుంటున్నారు. అదే సమయంలో పరిస్థితిని భూతద్దంలో చూపిస్తూ అమెరికన్లలో లేనిపోని భయాలను డెమోక్రాట్లే సృష్టిస్తున్నారని తిట్టిపోస్తోంది. ఇటు.. ప్రజాభిప్రాయ సర్వేలు మాత్రం అమెరికన్లలో మెజారిటీ ఐస్ దాడుల పద్ధతులను వ్యతిరేకిస్తున్నారు.వైట్ హౌస్ స్పందనమిన్నెసోటా ఘటనపై వైట్ హౌస్ స్పందించింది. అమెరికా వీధుల్ని నెత్తరోడ్చడం అధ్యక్షుడు ట్రంప్ ఉద్దేశం ఎంతమాత్రమూ కాదని పేర్కొంది. వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోనీన్ లెవిట్ మాట్లాడుతూ.. జనాల్ని గాయపర్చడమో.. చంపడమో ట్రంప్ ఉద్దేశం కాదని అన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారామె. ఈ పరిస్థితికి డెమోక్రటిక్ నాయకులే కారణమని ఆరోపించారామె. ఫెడరల్ అధికారులపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్, మేయర్ జాకబ్ ఫ్రేలపై ఆమె మండిపడ్డారు. ఇలాంటివి అవసరమా?న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మామ్దానీ ICE దాడులను “క్రూరమైనవి, మానవత్వరహితమైనవి” అభివర్ణించారు. ఆయన ఈ సంస్థను పూర్తిగా రద్దు చేయాలని పిలుపునిచ్చారు. ఏబీసీ ది వ్యూ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇలాంటి సంస్థకు అమెరికాలో స్థానం లేదన్నారు. అలాంటి దాడులు న్యూయార్క్ నగరం దాకా రానివ్వబోనని సవాల్ చేశారు.2026 మధ్యంతర ఎన్నికల్లో ఐస్ వ్యవహారం కీలకంగా మారే అవకాశం ఉందనే విశ్లేషణ నడుస్తోంది. అమెరికాలో ఈ ఏడాది నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సీట్లు, 35 సెనేట్ సీట్లు, అలాగే 39 రాష్ట్రాల్లో గవర్నర్ ఎన్నికలు జరుగుతాయి. ఇవి అమెరికా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలుగా భావిస్తున్నారు. కాబట్టి రెండో దఫా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్నకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమనే చెప్పొచ్చు. హౌస్ లేదంటే సెనేట్లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యం కోల్పోతే.. ఆయనపై ఇంపీచ్మెంట్ అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. -
అటెన్షన్.. ఏ క్షణంలోనైనా ఇరాన్పై దాడి!
ఇరాన్పై ఏ క్షణంలోనైనా దాడులు జరగొచ్చు. ఇందుకోసం అమెరికా అంతా సిద్ధం చేసుకుంటోంది. అబ్రహం లింకన్తో పాటు యూఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యూఎస్ఎస్ స్ప్రూయాన్స్ డెస్ట్రాయర్లు, యూఎస్ఎస్ మిషెల్ మార్ఫీ .. అన్నీ ఎర్ర సముద్రానికి చేరుకోవడమే ఆలస్యం!. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయంటూ వెస్ట్రన్ మీడియా కథనాలు ఇస్తోంది. అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ తాజాగా గల్ఫ్నకు చేరుకుంది. జనవరి 19నే మలక్కా జలసంధిని ఈ అణుశక్తి విమానవాహక దాటిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది కూడా. దీంతో ఇరాన్పై యూఎస్ ఏ క్షణాన దాడి చేస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.ఇరాన్ వద్ద కాచుకు కూర్చొన్న అమెరికా యుద్ధనౌకకు తోడుగా యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యుఎస్ఎస్ మిషెల్ మార్ఫి, యుఎస్ఎస్ స్ప్రుయాన్స్ డెస్ట్రాయర్లు చేరకున్నాయి. అయితే.. ప్రస్తుతం ఇవి ఇరాన్ సరిహద్దుల్లోని అరేబియా సముద్రంలో కాకుండా.. హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరోవైపు ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం దీన్ని మోహరించినట్లు అమెరికా చెబుతోంది. అయితే అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ మాత్రం పలు ఫైటర్ జెట్లు, మిలిటరీ కార్గో విమానాలను ఎర్ర సముద్రం రీజియన్కు తరలించనున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అక్కడి నుంచి సూయాజ్ కాలువకు చేరుకుకోవాలనేదే ఉద్దేశంగా పేర్కొంటున్నాయి. ఒకవేళ అదే గనుక జరిగితే మాత్రం.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకోవడం ఖాయం. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులకు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. వారికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో భారీగా తమ సైన్యాన్ని ఇరాన్ దిశగా పంపినట్లు ప్రకటించారు. అయితే.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ అంతే ధీటుగా స్పందిస్తోంది. తమ వేలు కూడా ట్రిగ్గర్ మీదే ఉందంటూ కౌంటర్ ఇస్తోంది. మరోవైపు తమ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని బంకర్లో సురక్షితంగా దాచినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో.. ఇటు చర్చల అంశమూ తెర మీదకు వస్తోంది. చర్చలు ముందుకుసాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో టెహ్రాన్కు ఇప్పటికే తెలుసని ట్రంప్ పేషీలోని ఓ ముఖ్యాధికారి వ్యాఖ్యానించారు కూడా. -
భారత్-యూరప్ డీల్.. కొత్త టెన్షన్!
భారత్, యురోపియన్ యూనియన్ల ట్రేడ్ డీల్ ఓ కొలిక్కి రావడం అమెరికాకు ఏమాత్రం నచ్చనట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ అండ్ టీం వరుస ప్రకటనలు ఇస్తోంది. తాజాగా.. అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా యూరప్ దేశాలు తమపై యుద్ధానికి తామే నిధులు సమకూర్చుకుంటున్నాయని వ్యాఖ్యానించారాయన. ‘‘ఈ ఒప్పందం ద్వారా యూరప్ తన భద్రతను తానే బలహీనపర్చుకుంటోంది. ఉదాహరణకు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25 శాతం సుంకాలను విధించాం. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూశారా?. ఇప్పుడు యూరోపియన్లు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ ఓ విషయం గమనించాలి. రష్యన్ చమురు తొలుత భారత్కు వెళ్తోంది. అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. వాటిని యూరప్ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమ తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారు’’ అంటూ బెసెంట్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో వాణిజ్యం, ఇంధన రంగం మళ్లీ అమెరికా–యూరప్ సంబంధాల్లో ప్రధాన ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందించారాయన. మరోవైపు.. భారత్పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు బెసెంట్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ‘‘రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుంది. అది భారీ విజయం. చమురు విషయంలో ఇప్పటికీ టారిఫ్లు అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని అనుకుంటున్నాను’’ అని సుంకాల తొలగింపు గురించి పరోక్షంగా చెప్పారాయన. తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోనే ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి తెరపడుతుందని బెసెంట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని, ఈ వ్యవహారంలో యూరప్ దేశాల కంటే అమెరికానే చాలా పెద్ద త్యాగాలు చేసిందని చెప్పారు. అయితే అంతపెద్ద త్యాగాలు ఏంటన్నది మాత్రం ఆయన ప్రస్తావించలేదు. డీల్ సెట్2007లో ప్రారంభమైన చర్చలు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ముగింపు దశకు చేరుకున్నాయి. ఈయూతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు విజయవంతంగా ముగిశాయని.. ఈమేరకు ఒప్పందం ఖరారైనట్లు భారత వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఆదివారం వెల్లడించారు. భారత్ కోణం నుంచి ఈ ఒప్పందం సమతుల్యంగా, దూరదృష్టితో కూడి ఉందని చెప్పారు. ఇరువైపులా వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు, ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత టెక్స్ట్టైల్స్, కెమికల్స్, రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రికల్ యంత్రాలు, లెదర్ వస్తువులు, ఆటోమొబైల్స్, ఫుట్వేర్ వంటి రంగాలకు డ్యూటీ-ఫ్రీ లభించనుంది. ఒక రకంగా ఈయూతో ట్రేడ్ డీల్.. ఆర్థిక పరంగా ఇది భారత్కు ఒక పెద్ద విజయంగా భావించవచ్చు. రష్యా చమురు దిగుమతులు తగ్గుతున్నప్పటికీ(డిసెంబర్లో భారత్ రష్యా చమురు దిగుమతులు రెండు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరాయి. అదే సమయంలో, OPEC దేశాల నుండి చమురు దిగుమతులు 11 నెలల గరిష్ట స్థాయికి పెరిగాయి).. యూరప్తో వాణిజ్య ఒప్పందం ద్వారా కొత్త మార్కెట్లు తెరుచుకోనున్నాయి. ఇది భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచగలదు. -
అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 25 మంది మృతి!
అగ్రరాజ్యం అమెరికాలో భారీ మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భీకర మంచు తుపాను జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాను కారణంగా ఇప్పటివరకు సుమారు 25 మంది మరణించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.న్యూయార్క్ సిటీలో అత్యధికంగా ఎనిమిది మంది ఈ ప్రకృతి వైపరీత్యానికి బలైనట్లు సమాచారం. సోమవారం మసాచుసెట్స్, ఒహియోలో మంచు తొలగించే వాహనాల కింద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అర్కాన్సాస్ నుండి న్యూ ఇంగ్లాండ్ వరకు దాదాపు 2,100 కిలోమీటర్ల మేర ఒక అడుగు కంటే ఎక్కువ మంచు పేరుకుపోయినట్లు తెలుస్తోంది.ఈ తుపాను కారణంగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ముఖ్యంగా మిసిసిపి, టేనస్సీ రాష్ట్రాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో పరిస్థితి దారుణంగా మారింది. 1994 తర్వాత మిసిసిపిలో సంభవించిన అత్యంత భయంకరమైన ఐస్ తుపాను ఇదేనని యూఎస్ మీడియా వర్గాలు వెల్లడించాయి.ఈ భీకర తుపాను కారణంగా పలు రాష్ట్రాల్లో పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆదివారం ఒక్కరోజే అమెరికాలో దాదాపు 45% విమానాలు రద్దయ్యాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత ఇన్ని విమానాలు రద్దు కావడం ఇదే మొదటిసారి. సోమవారం కూడా దాదాపు 8,000 విమానాలు రద్దు అయ్యాయి. -
సడలిన అమెరికా వైఖరి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న టీం సభ్యులు సైతం అచ్చం ఆయన తరహాలోనే రోజుకో రీతిన మాట్లాడటంలో ఆరితేరారు. అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్ చేస్తున్న ప్రకటనలు దాన్నే నిరూపిస్తున్నాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరబోతున్నదని, తమ షరతులన్నిటికీ తలొగ్గటానికి ఆ దేశం సిద్ధపడిందని పలుమార్లు ఏకపక్షంగా ప్రకటించటం, అంతలోనే ఏదో సాకుతో అదనపు సుంకాలు విధించటం ట్రంప్ అలవాటు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయనందు వల్ల భారత్పై విధించే సుంకాలు 500 శాతానికి కూడా చేరుకోవచ్చని పదిరోజులనాడు కూడా ట్రంప్ బెదిరించారు. స్కాట్ బిసెంట్ సైతం ఆ తోవనే పోయారు. కానీ ఇప్పుడు బెదిరింపుల పర్వం ఉపశమించినట్టు కనబడుతోంది. భారత్పై విధించిన అదనపు సుంకాల్లో 25 శాతాన్ని తగ్గించబోతున్నామని బిసెంట్ ప్రకటించారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లు పడిపోయినందు వల్ల ఈ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. చమురు కొనుగోళ్లు తగ్గిన మాట వాస్తవమే అయినా, దాన్ని అసలు గుర్తించనట్టు ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లు పెట్టడం అలవాటు చేసుకున్న అమెరికా వైఖరి మార్చుకోవటం వెనక వేరే మతలబు ఉంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో మన దేశం రేపో మాపో వాణిజ్య ఒప్పందం కుదురుతుండటమే ఇందుకు కారణం. ఉక్రెయిన్పై 2022లో రష్యా దాడి తర్వాత అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆదేశంతో సంబంధాలు తెంచుకున్నాయి. అటు తర్వాత మన రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు పెరిగాయి. ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో మనం రెండో స్థానంలో ఉన్నాం. ప్రపంచం మునుపటిలా లేదు. ఏకపక్షంగా, అనాలోచితంగా ఆంక్షలు విధిస్తే స్వీయ నష్టాలు కూడా తప్పవు. ప్రపంచ దేశాలపై విధించిన ఆంక్షల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో పడింది. తాజాగా డాలర్ విలువ నాలుగు నెలల కనిష్ఠస్థాయికి పడి పోయింది. అమెరికా బెదిరింపులకు దిగిన మొదట్లో మన దేశానికి చెందిన ప్రైవేటు సంస్థలు రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు తగ్గించిన మాట వాస్తవం. అప్పటికి రోజూ సగటున 17 లక్షల బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేస్తుండగా, మొన్న డిసెంబర్ నాటికి అది 12 లక్షల బ్యారెళ్లకు తగ్గింది. అమెరికా సంస్థలతో లావాదేవీలున్న కొన్ని భారత్ కంపెనీలు ఆంక్షలకు తలొగ్గటమే మంచిదని నిర్ణయించుకోవటం ఇందుకు కారణం. కానీ రష్యా ప్రముఖ చమురు కంపెనీలైన రోజ్నెఫ్ట్, లుకోయిల్ నుంచి చమురు కొనుగోలు చేయరాదన్నది అమెరికా పెట్టిన ఆంక్షల్లో ఒకటి. దానికి విరుగుడుగా రష్యా వేరే కంపెనీలను రంగంలోకి దించి వాటిద్వారా భారత్కు ముడి చమురు ఎగుమతులు మొదలుపెట్టింది. వీటి ప్రభావం ఒకటి రెండు నెలల్లో కనబడుతుందనీ, అటుతర్వాత రష్యా నుంచి వచ్చే ముడిచమురు కొనుగోళ్లు యథాప్రకారం ఉంటాయని నిపుణుల అంచనా. చవగ్గా వచ్చే రష్యా ముడి చమురును వదులుకోవటం ఎవరికైనా అంత సులభం కాదు. రష్యా చమురుకూ, సౌదీ అరేబియా నుంచి కొనే చమురుకూ మధ్య బ్యారెల్కు దాదాపు 10 డాలర్ల వ్యత్యాసం కనబడుతున్నప్పుడు ఆంక్షలకు తలొగ్గాలని ఎవరూ అనుకోలేరు. తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుపరంగా మార్పుచేసిన ఆహారధాన్యాలనూ భారత్ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నందు వల్లే వాణిజ్య ఒప్పందం కుదరటంలో ఆలస్యం అవుతోంది. ఏదో వంకతో ఆంక్షలు విధిస్తే భారత్ దారికొస్తుందని అమెరికా భావన. ఈలోగా ఈయూ–భారత్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదిరే అవకాశాలు కనబడటం అమెరికా జీర్ణించు కోలేకపోతోంది. అందుకే ఒకపక్క ఎఫ్టీఏను దృష్టిలో పెట్టుకున్నందు వల్లే భారత్ పట్ల ఈయూ మెతకవైఖరి ప్రదర్శించిందని విమర్శిస్తూనే, తాను విధించిన అదనపు సుంకాల్లో కోతకు సిద్ధపడుతోంది. అమెరికాతో ఒప్పందం కుదరటం మాటెలావున్నా, ప్రపంచ దేశాలన్నిటితో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునే ప్రస్తుత విధానాన్ని మన దేశం కొనసాగించటమే ఉత్తమం. ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే ధోరణి ఎప్పుడూ ప్రమాదకరమే! -
భారత్ టూర్కు కెనడా పీఎం ఏర్పాట్లు!
ఇటీవల కాలంలో అన్ని దేశాలను విసిగించినట్లు కెనడాకు అత్యంత చిరాకు తెప్పిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాము లేకపోతే కెనడానే లేదని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఆ దేశం తాను ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్కు మద్దతు తెలపకపోవడంతో అత్యంత అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమకు మద్దతు తెలపని దేశాలను గుర్తుపెట్టుకుంటామని కూడా ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో కెనడా కృతజ్ఞత లేని దేశమని కూడా హాట్ కామెంట్స్ చేశారు.దీనికి ఇప్పటికే కెనడా ప్రధాని మార్క్ కార్నే కౌంటర్ కూడా ఇచ్చారు. తాము ఎవరి మీద ఆధారపడి బతకడం లేదని, కెనడియన్లకు ఒక స్థానం ఉందని, తాము కెనడాకు చెందిన వారేమనని అమెరికాకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాము ఎప్పటికీ అమెరికాకు 51వ రాష్ట్రంగా ఉండబోమని తెగేసి చెప్పారు కార్నే.అయితే కెనడా ప్రధాని కార్నే.. భారత్ పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలో ఆయన భారత్లో పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నారు. భారత్తో కెనడాకు ఉన్న సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు పలు ట్రేడ్ డీల్స్ ఒప్పందం చేసుకునేందుకు కార్నే.. భారత్కు పర్యటన చేపట్టబోతున్నారు. ఇదే విషయాన్ని సూచనప్రాయంగా ధృవీకరించారు భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్. కెనడా ప్రధాని కార్నే.. భారత పర్యటన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్ తర్వాత ఉండొచ్చన్నారు. ఇదీ చదవండి:అమెరికా-కెనడాల మధ్య ‘బోర్డ్ ఆఫ్ పీస్’ అగ్గి..! -
మంచు తుఫాన్ బీభత్సం.. ఏడుగురు మృతి
-
అమెరికా చెప్పేవన్నీ అసత్యాలే: WHO
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలగడానికి అమెరికా చెప్పిన కారణాలు అసత్యమని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ స్పష్టం చేశారు. ఆమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క ఆదేశానికి కాకుండే ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ మాట్లాడుతూ..అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడానికి చూపిన కారణాల్లో ఎలాంటి వాస్తవం లేదు. డబ్ల్యూహెచ్ఓ అమెరికాతో పాటు అన్ని సభ్య దేశాలతో వారి సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ పనిచేస్తుంది’ అని సూచించారు.అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో, ఆరోగ్య కార్యదర్శి రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో డబ్ల్యూహెచ్వో నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగిందని ప్రకటించారు. కోవిడ్-19 సమయంలో డబ్ల్యూహెచ్వో పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. డబ్ల్యూహెచ్వో అమెరికాను తక్కువ చేసి, స్వతంత్రతను దెబ్బతీసింది. అలాగే,కోవిడ్ సమయంలో కీలక సమాచారం అందించకుండా కాలయాపన చేసింది. ఫలితంగా దేశంలో భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగిందన్నారు.అమెరికా చేస్తున్న ఈ ఆరోపణల్ని డబ్ల్యూహెచ్ఎవో ఖండించింది.అమెరికాతో నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించాము. కోవిడ్ సమయంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని వెంటనే ప్రపంచానికి తెలియజేశాం. మాస్క్లు, టీకాలు, భౌతిక దూరం పాటించమని సూచించాము. కానీ ఎప్పుడూ మాస్క్ మాండేట్లు, టీకా మాండేట్లు లేదా లాక్డౌన్లు విధించమని చెప్పలేదు. అవి ప్రతి దేశం స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలు’ అని డబ్ల్యూహెచ్వో తెలిపింది. -
డేంజర్ లో అమెరికా.. 22 రాష్ట్రాలకు ఎమర్జెన్సీ
-
‘మనది చరిత్రాత్మక బంధం’.. అమెరికా శుభాకాంక్షలు
వాషింగ్టన్: భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. అమెరికా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపింది. ఈ సందర్భంగా అమెరికా నేత మార్కో రూబియో మాట్లాడుతూ న్యూఢిల్లీ- వాషింగ్టన్ మధ్య ఉన్న సంబంధాన్ని చారిత్రాత్మక బంధంగా అభివర్ణించారు. రాబోయే ఏడాదిలో ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఇరు దేశాలు కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.అమెరికా ప్రజల తరఫున భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రూబియో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికా మైత్రి ప్రాముఖ్యతను ప్రత్యేకంగా తెలిపారు. రక్షణ, ఇంధనం, క్రిటికల్ మినరల్స్, అత్యాధునిక సాంకేతికత వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం అద్భుతమని రూబియో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలే కాకుండా, క్వాడ్ (Quad) కూటమి ద్వారా జరుగుతున్న బహుముఖ చర్చలు ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి, భద్రతకు దోహదపడుతున్నాయన్నారు. ఇరు దేశాల బంధం కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ఇరు దేశాల ప్రగతికి దోహదపడుతుందన్నారు.ఇదిలావుండగా గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. గురుగ్రామ్, చిల్లా, టిక్రి, సింఘు, బదర్పూర్ తదితర సరిహద్దుల వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మరోవైపు, ఈ చారిత్రక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతుండగా, ప్రజలు దేశభక్తి తో కూడిన వేడుకల్లో పాల్గొంటున్నారు.ఇది కూడా చదవండి: కనిపించని ఆ నాలుగో సింహమే.. -
అంతటి భవనాన్నీ..అలవోకగా ఎక్కేశాడు!
తైపీ: తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనం తైపీ 101ను అమెరికన్ రాక్ క్లైంబర్ అలెక్స్ హోనాల్డ్ అధిరోహించారు. 508 మీటర్ల ఎత్తున్న ఈ భవనాన్ని ఆయన ఎలాంటి తాళ్లు, రక్షణ పరికరాలు లేకుండా ఎక్కేశారు. ఆదివారం నాడు ఆయన చేసిన ఈ సాహసాన్ని చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. వారి హర్షధ్వానాల మధ్య అలెక్స్ సునాయాసంగా ఎక్కేశారు. తైపీ 101 భవనం ఒక మూలలో ఉన్న ఎల్ ఆకారపు నిర్మాణాల సాయంతో ఆయన అధిరోహించారు. టవర్పై ఉన్న అలంకార నిర్మాణాలను తప్పించుకుంటూ యుక్తితో ఎక్కేశారు. 1,667 అడుగులు ఎత్తున్న భవనాన్ని ఎక్కేందుకు ఆయనకు గంటన్నర సమయం పట్టింది. ఐకానిక్ భవనంపైకి అలెక్స్ ఆరోహణను నెట్ఫ్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. శనివారమే ఆరోహణ జరగాల్సి ఉన్నా.. వర్షం కారణంగా ఆదివారానికి వాయిదా పడింది. గతంలో అలెక్స్ కాలిఫోరి్నయాలోని యోస్మైట్ నేషనల్ పార్క్లో ఉన్న ఎల్ కాపిటన్ను కూడా తాడు సాయం లేకుండా అధిరోహించి రికార్డు సాధించారు. భవనంలో 101 అంతస్తులు ఉన్నాయి. వాటిలో కష్టతరమైన భాగం 64 అంతస్తుల మధ్య భాగం. భవనానికి సిగ్నేచర్ లుక్ ఇచ్చే ఈ విభాగంలో వెదురు పెట్టెలు ఉంటాయి. ఈ ఆకాశహారమ్యన్ని ఎలాంటి తాడు సాయం లేకుండా అధిరోహించిన మొదటి వ్యక్తి అలెక్స్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ భవనం ప్రారంభం రోజే, 2004లో క్రిస్మస్ రోజున ఫ్రెంచ్ రాక్ క్లైంబర్ అలైన్ రాబరŠట్ట్ అధిరోహించారు. ఆయన తాళ్లు, జీను సాయంతో ఎక్కారు. భవనంపైకి చేరుకోవడానికి ఆయనకు నాలుగు గంటల సమయం పట్టింది. -
పాక్స్ సిలికా... గేమ్ చేంజర్!
అమెరికా కొత్త రాయబారి సెర్గియో గార్ ఇటీవల బాధ్యతల స్వీకరణ సందర్భంగా భారత్కు అందజేసిన ఆహ్వానం ప్రపంచ దేశాల దృష్టినీ ఆకర్షించింది. ‘అరుదైన ఖనిజ, ఏఐ’ కూటమి ‘పాక్స్ సిలికా’లో భారత్ చేరాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిమతం కూడా ఇదేనని చెప్పుకొచ్చారు. దాంతో ఈ కూటమి ఒక్కసారిగా చర్చనీయంగా మారిపోయింది... అరుదైన ఖనిజాలు. ప్రస్తుతం ప్రపంచమంతా కలవరిస్తున్న అత్యంత విలువైన సంపద ఇది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు మొదలుకుని కృత్రిమ మేధ (ఏఐ)కు ప్రాణావసరాలైన పలు అత్యాధునిక పరికరాల దాకా అన్నింట్లోనూ అతి కీలక పాత్ర ఈ అరుదైన ఖనిజాలదే. దాంతో వాటిపై ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా దృష్టి సారిస్తున్నాయి. కానీ సిలికాన్, లిథియం వంటి ఈ అరుదైన ఖనిజ నిల్వలు ప్రస్తుతం చాలా తక్కువ దేశాల్లోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చైనాలో ఇవి విస్తారంగా చైనా ఖనిజ శుద్ధి కర్మాగారాలు, చైనా మార్కెట్ ఆధిపత్యం ఉన్న దేశాల్లో ఉన్నాయి. దాంతో కొంతకాలంగా ఆ దేశం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. దీనికి చెక్ చెప్పడమే లక్ష్యంగా అమెరికా ఏర్పాటు చేసిన కూటమే పాక్స్ సిలికా. ఇందులో పాక్స్ అంటే శాంతి, సుస్థిరత, ప్రగతికి సూచిక అన్నది అమెరికా చెబుతున్న అర్థం. ఇక సిలికా అన్నది సిలికాన్కు ముడి ఖనిజమన్నది తెలిసిందే. కంప్యూటర్ చిప్స్ మొదలుకుని ఏఐ రంగం దాకా అన్నింట్లోనూ ఇప్పుడు సిలికాన్ కు ఉన్న అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా కూటమికి ఆ పేరు పెట్టారు. ఈ కూటమి ఏర్పాటులో అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి జాకబ్ హెల్బర్గ్ కీలక పాత్ర పోషించారు. ‘20వ శతాబ్ది మొత్తం చమురు, స్టీల్ రాజ్యం చేస్తే 21వ శతాబ్ది అంతా అత్యాధునిక సూపర్ కంప్యూటర్లు, వాటి కీలక విడిభాగాల తయారీకి ఆయువుపట్లయిన అరుదైన ఖనిజాలదే’ అన్నది ఆయన అభిప్రాయం. ‘రానున్న ఏఐ ఆధారిత ప్రపంచంలో కీలకమైన ఈ అరుదైన ఖనిజాల తవ్వకం, వెలికితీత, అభివృద్ధి, సరఫరాలపై అదుపు సాధించేవారిదే పై చేయి’ అని హెల్బర్గ్ అన్నారు. సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడంతో పాటు ఆర్థికంగా భవిష్యత్తును సురక్షితం చేసుకునేందుకు ఇది తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. లక్ష్యమేమిటి? సభ్య దేశాలన్నీ కలిసి అరుదైన ఖనిజాలకు సంబంధించి ఒక ఆధారపడదగ్గ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నది పాక్స్ సిలికా ఏర్పాటు తాలూకు ఉద్దేశం. ఈ ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, సరఫరా మొదలుకుని సాఫ్ట్వేర్ తదితర అప్లికేషన్లలో వాటి వినియోగం దాకా అన్ని స్థాయిల్లోనూ కూటమి దేశాలన్నీ సమన్వయంతో పని చేయాలన్నది అమెరికా ఆకాంక్ష. సభ్య దేశాలెవరు? పాక్స్ సిలికా కూటమి తొలి శిఖరాగ్ర భేటీ గత డిసెంబర్లో జరిగింది. ఆ్రస్టేలియా, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, యూఏఈ, సింగపూర్ ఇందులో సభ్యులుగా చేరాయి. తాజాగా సోమవారం ఖతర్ ఈ కూటమి సభ్యత్వం స్వీకరించింది. అదే రోజు భారత్ను కూడా అమెరికా ఇందులో చేరాల్సిందిగా ఆహ్వానించింది. ‘‘సిలికా కూటమిలో భారత్ చేరాలన్నది మా ఆకాంక్ష. భారత్–అమెరికా సంబంధాల్లో ఇది మైలురాయి అవుతుంది’’ అని అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి హెల్బర్గ్ తాజాగా తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. చైనాదే హవా! ఈ అరుదైన ఖనిజాల వెలికితీతలో ప్రస్తుతానికి చైనా ఎవరికీ అందనంత దూరంలో ఉంది. ఆ దేశం ఇప్పటిదాకా కనీసం 2.7 లక్షల టన్నుల ఖనిజాలను వెలికితీసినట్టు అంచనా. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో 57 వేల టన్నుల దాకా అరుదైన ఖనిజాలను దిగుమతి చేసుకోవాల్సి వచి్చంది. అందులో 97 శాతం ఒక్క చైనా వచ్చాయి. ఈ విషయంలో చైనాపై అతిగా ఆధారపడటం భద్రతతో సహా ఏ కోణం నుంచి చూసినా మన ప్రయోజనాలకు శ్రేయస్కరం కాదు. ఎందుకంటే అమెరికా మితిమీరిన టారిఫ్లపై ఆగ్రహించి గతేడాది చైనా ఆర్నెల్ల పాటు ఈ ఖనిజాల ఎగుమతులను పూర్తిగా నిలిపేసింది. దాంతో మన దేశ ఆటోమొబైల్ తదితర పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బ్యాటరీల్లో కీలకమైన లిథియం, సిలికాన్ తదితర ఖనిజాల లభ్యత లేక పలు కార్ల తయారీ సంస్థలు అనివార్యంగా ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచి్చంది. దాంతో ఈ సమస్యకు విరుగుడుగా భారత్ యుద్ధ ప్రాతిపదికన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. పాక్స్ సిలికాను ఒకరకంగా దీనికి అంతర్జాతీయ రూపంగా భావించవచ్చు. కీలక అరుదైన ఖనిజాల విషయంలో చైనా ఏకఛత్రాధిపత్యానికి ప్రత్యామ్నాయంగా భావసారూప్య దేశాలన్నింటితో కలిసి ఈ కూటమి ఏర్పాటుకు అమెరికా నడుం బిగించింది.మనవద్ద అపార నిల్వలున్నా...! సెమీ కండక్టర్లు మొదలుకుని కంప్యూటర్ చిప్స్ దాకా అన్నింట్లోనూ అతి కీలకంగా మారిన అరుదైన ఖనిజ నిల్వలు నిజానికి భారత్లో అపారంగా ఉన్నట్టు తేలింది. ఏకంగా 85.2 లక్షల టన్నుల నిక్షేపాలు భారత్లో ఉన్నట్టు అంచనా. కానీ ఇప్పటిదాకా మనం వెలికితీయగలిగింది మాత్రం కేవలం 2,900 టన్నులే. దాంతో ఈ అరుదైన ఖనిజాల కోసం ఇతర దేశాలపై, ముఖ్యంగా ఎప్పటికీ నమ్మలేని చైనాపై అనివార్యంగా ఆధారపడాల్సి వస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాను వణికిస్తున్న చలి తుఫాన్
వాషింగ్టన్: భీకర శీతాకాలపు తుఫాన్ అమెరికాను వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్లలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకంగా 14,100 విమాన సరీ్వసులు రద్దు కాగా, 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రహదారులపై మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి, ప్రమాదాలు పెరుగుతున్నాయి. విద్యుత్ తీగలు తెగిపోయి లక్షలాది ఇళ్లు చీకట్లలో మగ్గుతున్నాయి. హీటింగ్ వ్యవస్థలు సైతం పనిచేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాలని అధికారులు సూచించారు. ఇవే పరిస్థితులు సోమవారం కూడా కొనసాగే అవకాశముందని అంచనా వేసింది. పలు రాష్ట్రాలకు అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు అధ్యక్షుడు ట్రంప్ అనుమతినిచ్చారు. -
అమెరికాలో దారుణం.. కుటుంబసభ్యులను కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి
-
ఇండియన్ టెకీలకు షాక్ ఇచ్చిన ట్రంప్
-
H-1B visa: ఇండియన్ టెకీలకు షాక్.. ఇంటర్వ్యూలు ఇంకా లేటు!
అమెరికా హెచ్-1బీ (H-1B) వీసా దరఖాస్తుదారులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే దాదాపు ఏడాది పాటు వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలకు విరామం కొనసాగుతుండగా, తాజా పరిణామాలతో అపాయింట్మెంట్లు నేరుగా 2027 సంవత్సరానికి మారాయి. దీని ప్రభావం ముఖ్యంగా భారతీయ ఐటీ వృత్తి నిపుణులపై తీవ్రంగా పడనుంది.భారత్లోని అమెరికా కాన్సులేట్లలో భారీ బ్యాక్లాగ్లు పేరుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా లభ్యం కాకపోవడంతో, ఇప్పటికే ఉన్న అపాయింట్మెంట్లను అధికారులు 18 నెలలు వెనక్కి నెట్టి 2027 మధ్యకాలానికి మార్చినట్లు సమాచారం.వాస్తవానికి 2025 డిసెంబర్లో మొదలైన జాప్యం కారణంగా అప్పట్లో అపాయింట్మెంట్లను 2026కి మార్చారు. అనంతరం అవి 2026 అక్టోబర్కి, ఇప్పుడు నేరుగా 2027కి వాయిదా పడడం వృత్తి నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసాదారులు స్టాంపింగ్ కోసం భారత్కు వెళ్లొద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. 2027 వరకు రెగ్యులర్ అపాయింట్మెంట్లు లేవని ‘అమెరికన్ బజార్’ కూడా వెల్లడించింది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన కొందరి ఇంటర్వ్యూలు కూడా రద్దయ్యాయని సమాచారం. జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఉన్నవారికి సైతం తేదీలు మార్చి ఏడాది తర్వాతకు కేటాయిస్తూ ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది.ఉద్యోగాలు, కుటుంబాలపై తీవ్ర ప్రభావంఈ జాప్యం వల్ల వేలాది మంది వృత్తి నిపుణులు భారత్లోనే చిక్కుకుపోయారు. కొందరి భార్యా పిల్లలు అమెరికాలో ఉండగా, వారు మాత్రం భారత్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ ఒప్పందాలు, హౌసింగ్ అగ్రిమెంట్లు, వీసా గడువు పొడిగింపుల విషయంలో పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తుతున్నాయి. వీసా గడువు ముగిసిన ఉద్యోగులకు కొన్ని సంస్థలు పొడిగింపులు కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఏ క్షణమైనా యుద్ధం.. ఈసారి అణుబాంబులేనా?
-
Venezuela: డెన్సీ రోడ్రిగ్జ్ వీడియో టేపుల కలకలం
కారకస్: ‘మేం చెప్పినట్లు వింటారా? లేదంటే మరో 15 నిమిషాల్లో మీ ప్రాణాలు తీయమంటారా?’ అంటూ తమని బెదిరించారంటూ అమెరికాపై వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ చేసిన కామెంట్స్ తాలుకూ వీడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. జనవరి 3న వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో దంపతులను అమెరికా నిర్బంధించి పదవీచ్యుతున్ని చేసిన విషయం తెలిసిందే. అమెరికా ప్రత్యేక దళాలు ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’(Operation Absolute Resolve) పేరుతో మిలటరీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ మిలటరీ ఆపరేషన్లో డెల్టా ఫోర్స్ సైనికులు హెలికాప్టర్ల ద్వారా వెనెజువెలా రాజధాని కారాకస్లోని ఫోర్ట్ టియునా సైనిక స్థావరంలోకి ప్రవేశించి మదురో దంపతుల్ని అదుపులోకి తీసుకున్నారు.అయితే, మదురో దంపతుల్ని నిర్భందించిన 15 నిమిషాల తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మాదురోను అమెరికా దళాలు పట్టుకున్న తర్వాత.. తమ డిమాండ్లను అంగీకరించాలని తమ మంత్రివర్గ సభ్యులకు బెదిరింపులను అమెరికా బెదిరించినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ అంతర్గత సమావేశంలో మాట్లాడిన వీడియో టేపులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాము చెప్పినట్లు వినకపోతే 15 నిమిషాల్లో మంత్రి వర్గ సభ్యుల ప్రాణాలు తీస్తామని అమెరికా దళాలు బెదిరించాయని డెల్సీ రోడ్రిగ్స్ మాట్లాడిన మాటలు ఆ వీడియోలో ఉన్నట్లు సమాచారం. -
అమెరికా గజగజ
డాలస్: అతి భారీ మంచు తుఫాన్ అమెరికాను వణికిస్తోంది. దేశంలో అధిక ప్రాంతాలు భారీ హిమపాతం, వర్షం, అతి శీతల పరిస్థితులతో అతలాకుతలమవుతున్నాయి. ఆరుబయట ఎటు చూసినా అడుగుల లోతున మంచు పేరుకునిపోయి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా ఈ భీకర తుఫాన్తో ప్రభావితులయ్యారు. 18 రాష్ట్రాల్లో జనజీవితం స్తంభించిపోయింది. దాంతో ఆయా రాష్ట్రాల్లో వింటర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. చాలా రాష్ట్రాల్లో విమాన తదితర రవాణా సేవలు స్తంభించిపోయాయి. తీవ్ర ప్రతికూల వాతావరణం కారణంగా శని, ఆదివారాల్లో కలిపి ఏకంగా 10 వేలకు పైగా విమాన సర్వీసులను ముందుజాగ్రత్త చర్యగా రద్దు చేశారు. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలకు సోమవారం కూడా సెలవు ప్రకటించారు. ఫెర్న్గా పేర్కొంటున్న ఈ తుఫాన్కు ఆర్కిటిక్ బ్లాస్ట్ వల్ల ఉత్తర ధ్రువం నుంచి వీస్తున్న అతి శీతల గాలులే కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండు మూడు రోజుల్లో దాని తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. ‘‘ఈ సీజన్లోకెల్లా అతి తీవ్రమైన తుఫాన్ ఇదే. బహుశా ఈ దశాబ్దంలోకెల్లా దారుణమైన తుఫాన్గా నిలిచినా ఆశ్చర్యం లేదు’’అని పేర్కొంది. నిత్యావసరాల కోసం జనం ఎగబడటంతో చాలా నగరాల్లో దుకాణాలు ఖాళీ అయిపోయాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అప్రమత్తమైంది. మైనస్లో ఉష్ణోగ్రతలు నార్త్ డకోటా మొదలుకుని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 20 నుంచి ఏకంగా మైనస్ 40 దాకా పడిపోతున్నాయి. దాంతో వాహనాలు కూడా మొరాయిస్తున్నాయి. ఫలితంగా అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోంది. టెక్సాస్, ఓక్లహామా, కాన్సాస్ తదితర రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఓక్లహామా నుంచి బోస్టన్ దాకా 1,500 మైళ్ల మేరకు తీవ్రంగా ప్రభావితమవుతోంది. టెక్సాస్ నుంచి వర్జీనియా దాకా హిమపాతం వణికిస్తోంది. రాజధాని వాషింగ్టన్ డీసీ మొదలుకుని న్యూయార్క్ తదితర మహా నగరాలు మంచు దుప్పట్లో కూరుకుపోయాయి. శనివారం 3,200, ఆదివారం 4,800 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్అవేర్ తొలుత పేర్కొంది. ఒక్క ఆదివారమే 7,600కు పైగా సర్వీసులు రద్దవుతున్నట్టు అనంతరం వెల్లడించింది.కరెంటు కోతలు అతి శీతల గాలుల ధాటికి అమెరికావ్యాప్తంగా చాలాచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దాంతో విద్యుత్సరఫరాకు అంతరాయం కలిగింది. దాంతో చలికి తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఒక్క శుక్రవారమే ఏకంగా 95 వేలకు పైగా కరెంటు కోత ఉదంతాలు నమోదయ్యాయి! వీటిలో 37 వేలకు పైగా టెక్సాస్లోనే కావడం గమనార్హం. ఈ సమస్య కనీసం కొద్ది రోజుల పాటు కొనసాగవచ్చని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. టెక్సాస్లో ఐదేళ్ల క్రితం ఇలాంటి తుఫాన్ సమయంలో భారీ కరెంటు కోతల వల్ల వందలాది మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు గవర్నర్ గ్రెగ్ అబట్ తెలిపారు. ఎయిరిండియా సర్వీసులు రద్దు శని, ఆదివారాల్లో భారత్ నుంచి అమెరికా తూర్పు తీరంలోని న్యూయార్క్, నెవార్క్ నగరాలకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. న్యూఢిల్లీ, ముంబైల నుంచి ఆ నగరాలకు ఎయిరిండియా రెగ్యులర్గా విమాన సర్వీసులు నడుపుతోంది. -
‘మేము భయపడే ప్రసక్తే లేదు..
‘ఇరాన్ వైపు అమెరికా బలగాలు.. ఇక యుద్ధమే తరువాయి.. ట్రంప్ ఆదేశాలు ఇచ్చిన మరుక్షణమే ఇరాన్పై అమెరికా విజృంబించడం ఖాయం..’ ఇవే మనకు గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న వార్తలు. అమెరికా వెనక్కి తగ్గిందనేది కాసేపు.. అంతలోనే ఇరాన్ కాళ్ల బేరానికి వచ్చిందనేది మరొకవైపు. ఏది ఏమైనా తమది వెనక్కి తగ్గే మనస్తత్వం కాదని అంటోంది ఇరాన్. అవసరమైతే ఎందాకైనా పోరాడతామని స్సష్టం చేసింది. తమకు యుద్ధాలు కొత్త కాదని, వాటికి భయపడటం అనేది తమ రక్తంలోనే లేదని భారత్లోని ఇరాన్ కాన్సుల్ జనరల్ సయ్యద రెజా మొసాయెబ్ మోత్లాఘ్ స్పష్టం చేశారు. ముంబైలో ఇరాన్ కాన్సులేట్ ప్రతినిధిగా పనిచేస్తున్న ఆయన.. ఇరాన్ నైజం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో వివరించే యత్నం చేశారు. ఇటీవల ఇజ్రాయిల్తో 12 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని, అంతకుముందు తాము ఎదుర్కొన్న యుద్ధ పరిస్థితులను వివరించారు. ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. ఏ సమయంలోనూ తాము ధైర్యం కోల్పోలేదన్నారు. తాము ఎవరో భయపెడితే భయపడిపోయే తత్వం కాదన్నారు. ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ కూడా దేనికి భయపడరన్నారు. ఖమేనీ బంకర్లో దాక్కున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. బంకర్లో దాక్కొనేంత పిరికి నేత ఖమేనీ కాదన్నారు. దేనికైనా తమ దేశం సిద్ధంగా ఉంటుందన్నారు. ఇక భారత్తో సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఆంక్షల బెదిరింపులు ఉన్నప్పటికీ భారత్తో సంబంధాలు యధావిధిగా కొనసాగించేందుకు యత్నిస్తున్నామన్నారు. -
H1B వెనుక పెద్ద స్కామ్! జర్నలిస్ట్ సంచలన రిపోర్ట్ బట్టబయలు
-
వెనక్కి తగ్గిన ట్రంప్.. గ్రీన్ ల్యాండ్ పై కొత్త రాగం..
-
ఇరాన్-అమెరికా.. కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు!
ఇరాన్ అమెరికా మధ్య కమ్ముకుంటున యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తమ సైన్యం ఇరాన్కు బయల్దేరింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇరాన్ వైపు కదులుతున్నాయి. ఆర్థిక సంక్షోభం వేళ.. అక్కడి ప్రజల తీవ్ర నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోయింది. భద్రతా బలగాల ప్రతిఘటనలో వేల సంఖ్యలో నిరసనకారులు మరణించారని హక్కుల సంఘాలు నివేదికలు ఇచ్చాయి. అలాగే వేల మందిని జైల్లో పెట్టారని.. వాళ్లలో కొందరిని దేశద్రోహులుగా ఉరి తీయబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ అణచివేతపై ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తాము చూస్తూ ఉండబోమని.. ఇరాన్ నిరసనకారులకు అవసరమైన సాయం పంపిస్తామని ప్రకటించారు. ఈ లోపు పరిస్థితులు చల్లబడి ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో నిరసనకారుల ఉరితీత ఆగిపోయింది. అయితే.. తన వల్లే నిరసనకారుల ఉరి ఆగిందంటూ ట్రంప్ ప్రకటించుకోగా.. ఇరాన్ దానిని తోసిపుచ్చింది. కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదన్నట్లు ఖమేనీ ప్రభుత్వం సంకేతాలు పంపించింది. దీంతో ట్రంప్నకు మళ్లీ కోపమొచ్చింది. ఈలోపు.. ఇరాన్ అణు కార్యకలాపాలు నిర్వహిస్తుందన్న అనుమానాలూ వ్యక్తం చేసిన ఆయన.. గట్టి వార్నింగే ఇచ్చారు. సైనిక చర్యే చివరి ఆప్షన్ అంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో సైన్యం మోహరింపు ఆదేశాలు జారీ చేసిన ఆయన.. అదనపు బలగాలనూ సిద్ధం చేయాలని సూచించారు. దీంతో ఐదు వేల మంది సిబ్బందితో కూడిన బలగాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ధీటుగా స్పందిస్తోంది. తమ వేలు ట్రిగ్గర్పైనే ఉందంటూ ప్రకటనలు ఇస్తోంది. ఇరాన్ను నిశితంగా గమనిస్తున్నాం. భారీ సంఖ్యలో మా యుద్ధనౌకలు ఆ దేశం వైపు కదులుతున్నాయి. ఏమీ జరగకూడదనే అనుకుంటున్నా. వాటిని మేం ఉపయోగించకపోవచ్చు. ఏం జరుగుతోందో చూద్దాం అని ట్రంప్ దావోస్ సదస్సు అనంతరం వ్యాఖ్యానించారు. అయితే.. ట్రంప్ ఇప్పటిదాకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినా.. అమెరికా యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వైపు కదులుతుండటంతో పరిస్థితి హీటెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
చైనాతో జాగ్రత్త.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాను టార్గెట్ చేశారు. కెనడాపై విరుచుకుపడ్డారు. గ్రీన్లాండ్పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో చైనాతో కెనడా వ్యాపారం చేయడం వారికే నష్టం కలిగిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ట్రుత్ వేదికగా.. గ్రీన్లాండ్పై విస్తారమైన క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలనే అమెరికా ప్రణాళికను కెనడా వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ గోల్డెన్ డోమ్ కెనడాను రక్షిస్తుంది. అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్.. కెనడాను రక్షించబోతోంది. కెనడా మా నుండి చాలా ఉచితాలను పొందుతుంది. అమెరికా కారణంగానే కెనడా మనుగడ సాగిస్తోంది. వారు కూడా కృతజ్ఞతతో ఉండాలి. అలా కాకుండా అమెరికాతో సంబంధాలను తెంచుకుకుంటున్నారు. బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకు కెనడా ఆమోదం తెలిపింది. చైనాకు అనుకూలంగా ఓటు వేశారు. మొదటి సంవత్సరమే కెనడాను చైనా తినేస్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చైనాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడానికి బీజింగ్ను సందర్శించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికా మద్దతు కారణంగానే కెనడా మనుగడ సాగిస్తుందనే ట్రంప్ వాదనను తిరస్కరించారు. ఈ క్రమంలో మార్క్ కార్నీ మాట్లాడుతూ..‘కెనడాకు అమెరికాతో సంబంధమే లేదు. మనం కెనడియన్లం కాబట్టి కెనడా అభివృద్ధి చెందుతుంది. కెనడా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం. కెనడాకు మనమే యజమానులం. ఇది మన సొంత దేశం. ఇది మన భవిష్యత్తు అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, దావోస్లో ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే చిన్న దేశాల పట్ల గొప్ప శక్తులు బలవంతం చేయడాన్ని కార్నీ తప్పుబట్టారు. -
ఇక అమెరికా-భారత్ బంధానికి బీటలు!
శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెత ఒకటి ఉంది. భారత్ నిర్ణయాలకు వ్యతిరేకంగా.. అలాంటి శత్రువుతోనే జత కట్టాలని, భుజం తట్టి ప్రొత్సహించాలని అగర్రాజ్యం బలంగా భావిస్తోంది!. ఈ నేపథ్యంలోనే అమెరికా-భారత్ మధ్య స్నేహబంధానికి బీటలు వారే అవకాశం ఉందంటున్నారు..బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో శాంతి యుతంగా ఎన్నికల నిర్వహణ అనేది పెద్ద సవాలే. అయితే.. అక్కడి జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు పెంచుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో వాషింగ్టన్-ఢిల్లీ మధ్య సంబంధాలపై ప్రభావం పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారట్లు.. వాషింగ్టన్ పోస్ట్ ఓ సమగ్ర కథనం ప్రచురించింది. అందులో..ఇటీవల నిర్వహించిన సర్వేల్లో జమాత్, బీఎన్పీలకు ప్రజాదరణ అధికంగా ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా జమాత్ విద్యార్థి విభాగం ‘‘ఇస్లామీ ఛాత్ర శిబిర్’’ ఆమధ్య నిర్వహించిన వర్సిటీ ఎలక్షన్స్లో ఆధిపత్యం సాధించింది. దీంతో రాబోయే ఎన్నికలకు జమాత్ బలమైన పునాది వేసుకుందనే విశ్లేషణ నడుస్తోంది. ఈ పరిణామాలపై అమెరికన్ రాయబారి ఒకరు స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ఇస్లామిక్ వైపు మళ్లింది అని అన్నారు. ఈ తరుణంలో జమాత్ నాయకులతో అమెరికా స్నేహపూర్వక సంబంధాలు పెంచుకుంటే మంచిదని సూచించారు కూడా.భారత్ ఆందోళనలు ఏంటంటే..జమాత్-అమెరికా దోస్తానాపై భారత్ ఆందోళనలో అర్థం ఉంది. ఎందుకంటే.. జమాత్-ఎ-ఇస్లామీని భారత్ ఎప్పటినుంచో శత్రువుగానే చూస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 1971 యుద్ధంలో ఈ పార్టీ పాకిస్తాన్ పక్షాన నిలిచిన చరిత్ర ఉంది. అలాగే మతోన్మాదంతో ఆ సమయంలో మైనారిటీలను ఊచకోత కోసిందని అభియోగాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జమాత్ అధికారంలోకి వస్తే.. హిందువుల సహా ఇతర మైనారిటీలకు భద్రత ఉండబోదని ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో వాణిజ్య వివాదాలు, వ్యూహాత్మక విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా జమాత్కు మద్దతుగా నిలిస్తే.. భారత్-అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బ తినే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.జమాత్ బ్యాక్గ్రౌండ్ ఇది.. 1971 విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా.. పాక్కు మద్దతుగా నిలిచింది జమాత్-ఎ-ఇస్లామీ. పార్టీకి చెందిన అనేక నాయకులు, వార్ క్రైమ్స్ (యుద్ధ నేరాలు)లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. పైగా హింస, హత్యలతో పాటు మైనారిటీలపై దాడులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఒకప్పుడు ఆ పార్టీపై జనాల్లో వ్యతిరేకత ఉండేది.ఒకానొక టైంలో దేశద్రోహి పార్టీ అంటూ అనేకసార్లు నిషేధానికి గురైంది. విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా నిలిచినందుకు, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు, రాజ్యాంగ విరుద్ధ విధానాలు.. ఇలా రకరకాల కారణాలు చూపించారు. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ రాజ్యాంగం సెక్యులర్ విధానాన్ని అనుసరిస్తుంటే.. జమాత్ మాత్రం షరియా చట్టం అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధానం వల్లే.. 2013లో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆ పార్టీని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఆ వెంటనే ఎన్నికల సంఘం ఆ పార్టీ రిజిస్ట్రేషన్ను తీసేసింది. దీంతో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రధాని హోదాలో షేక్ హసీనానే ఆనాడు ఈ పని చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి.అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిపోయాక.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీం కోర్టు జమాత్పై నిషేధం ఎత్తేసింది. దీంతో అవినీతి వ్యతిరేకం.. సంక్షేమం.. అంటూ జమాత్ కొత్త నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి ఆదరణ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.అమెరికా మరోలా.. ప్రస్తుతానికైతే అమెరికా.. జమాత్తో ఫ్రెండ్షిఫ్ను కోరుకోవడం లేదని సమాచారం. ‘‘బంగ్లాదేశ్లో జరగబోయే ఎన్నికల్లో మేం ఎవరికీ మద్దతు ఇవ్వబోం’’ అని ఆ దేశ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో మత ఛాందస పార్టీగా పేరున్న జమాత్ భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసి.. షరియా చట్టాలను అమలు చేస్తే.. బంగ్లాదేశ్ గార్మెంట్ ఎగుమతులపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించింది కూడా.రాజకీయ వాతావరణంహసీనా తొలగింపుతో ఏర్పడిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వం.. ప్రజాస్వామ్య మార్పు పేరుతో ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే మాజీ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్.. యూనస్ ప్రభుత్వం మత ఛాందస వాదులతో చేతులు కలిపి అవామీలీగ్ కేడర్ను, హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. హసీనా ప్రస్తుతం భారత్లో ప్రవాసంలో ఉండగా.. జమాత్ సహా ఇస్లామిస్టులు ఆమె ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించారు. -
శాంతి మండలిపై ట్రంప్ కొత్త రాగం..
న్యూయార్క్/వాషింగ్టన్: అంతర్జాతీయ వేదికపై కొత్తగా శాంతి మండలి ఆవిర్భావం ఐక్యరాజ్యసమితికి కూడా మేలు చేసే అంశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఐరాస తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఫలితాలు సాధించడంలో విఫలమైందని ఆక్షేపించారు. గురువారం దావోస్ నుంచి అమెరికా తిరిగి వెళ్తూ ఎయిర్ఫోర్స్వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..‘గాజాలో శాంతి స్థాపనకు మాత్రమే కాదు, అంతకుమించి కూడా మరెన్నో అంశాల్లో ఐరాసతో కలిసి గొప్పగా పని చేస్తాం. ఒక సంస్థగా ఐరాసకు ఉన్న సామర్థ్యం అంతా ఇంతా కాదు. కానీ అందుకు తగ్గట్టుగా పని చేయడంలో, ఫలితాలు సాధించడంలో ఐరాస విఫలమైంది. నేను ఏకంగా ఎనిమిది యుద్ధాలు ఆపాను. కానీ దీని గురించి ఐరాసతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు’ అన్నారు.దీనిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫన్ డుజారిక్ స్పందించారు. ‘ట్రంప్ ప్రకటనలు (శాంతి మండలిని ఉద్దేశిస్తూ) చూశాం. అయితే సార్వత్రిక సభ్యత్వమున్న ఏకైక అంతర్జాతీయ సంస్థ ఐరాసే’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి దిశగా తమ కృషి, ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. గాజాలో అత్యధిక పరిమాణంలో మానవతా సాయాన్ని పంచింది ఐరాస మాత్రమేనని స్టీఫన్ గుర్తు చేశారు. -
అమెరికాలో టిక్టాక్ సేఫ్
వాషింగ్టన్: అమెరికాలో నిషేధం హెచ్చరికల నుంచి తప్పించుకోవడానికి టిక్టాక్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా సంస్థలతో చేతులు కలిపింది. ఈ మేరకు ఒప్పందాలపై తాజాగా సంతకాలు జరిగాయి. అమెరికాలో ఒరాకిల్, సిల్వర్ లేక్, ఎంజీఎక్స్ సంస్థలతో టిక్టాక్ కంపెనీ కలిసి పనిచేయనుంది. కొత్తగా టిక్టాక్ యూఎస్ జాయింట్ వెంచర్ ఏర్పాటు కానుంది. ఒరాకిల్, సిల్వర్ లేక్, ఎంజీఎక్స్కు 15 శాతం చొప్పున వాటా ఉంటుంది. డెల్ టెక్నాలజీస్, బైట్డ్యాన్స్ సంస్థలు కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నాయి. టిక్టాక్ ప్రసుతం చైనా కంపెనీ యాజమాన్యంలో ఉంది. అమెరికాలో 20 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నారు. వీడియోలు సృష్టించి, షేర్ చేసుకుంటున్నారు. తమ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని టిక్టాక్ కంపెనీ చోరీచేసి, చైనాకు చేరవేస్తోందని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు. చైనా యాజమాన్యం కింద కొనసాగితే తమ దేశంలో టిక్టాక్ను నిషేధిస్తామని ఆయన ఇప్పటికే హెచ్చరించారు. దేశ భద్రత కోసమే నిషేధించక తప్పదని పేర్కొన్నారు. అమెరికా సంస్థల పరిధిలో పనిచేస్తే అభ్యంతరం లేదని ప్రకటించారు. 20 కోట్ల మంది యూజర్లను వదులుకోవడం ఇష్టంలేని టిక్టాక్ యాజమాన్యం అమెరికా కంపెనీలతో జతకట్టింది. ఏడాదికాలంగా జరుగుతున్న చర్చలు పూర్తయ్యాయి. అమెరికా సంస్థలతో ఎట్టకేలకు ఒప్పందానికి వచి్చంది. ఇకపై నూతన జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలోనే అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇందులో ఏడుగురు సభ్యులు ఉంటారు. మెజార్టీ సభ్యులు అమెరికన్లే ఉంటారనడంలో సందేహం లేదు. సమగ్ర డేటా రక్షణలు, ఆధునిక కంటెంట్, సాఫ్ట్వేర్తో జాతీయ భద్రతకు కట్టుబడి ఉంటూ యూజర్లకు సేవలు అందించనున్నట్లు టిక్టాక్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో టిక్టాక్పై నిషేధం తప్పినట్లయ్యింది. సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ట్రంప్ ప్రశంసలు అమెరికా కంపెనీలతో టిక్టాక్ కుదర్చుకున్న ఒప్పందాన్ని అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. చైనా అధినేత షీ జిన్పింగ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. జిన్పింగ్ తమతో కలిసి పనిచేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో టిక్టాక్ యూజర్లకు తాను గుర్తుండిపోతానని ఉద్ఘాటించారు. -
90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!
చాలామంది భారతీయ యువత డ్రీమ్ అమెరికా. కానీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ఆ కలలన్నీ దాదాపు కనుమరుగనే చెప్పాలి. అయినా కూడా అమెరికా అంటే మోజు మాములుగా ఉండదు. అక్కడ ఉండే సౌకర్యాలు, ఉన్నత చదువులు, మంచి వేతనం తదితరాల రీత్యా ఆ దేశం అంటే మహా మక్కువ చాలామంది యువతకు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్లుగా అక్కడకు అడుగుపెడితేగానీ అసలు విషయం అవగతమవ్వదు. బహుశా అప్పటికి గానీ జన్మభూమికి మించిన స్వర్గసీమ మరొకటి లేదని తెలిసిరాదేమో. సౌకర్యాలు, జీతాలు పరంగా బాగున్నా..కొన్ని విషయాలు చూడగానే మన దేశం కచ్చితంగా గుర్తొచ్చేస్తుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఓ ఎన్నారై ఎదుర్కొన్నాడు. ఇదేం అమెరికా లైఫ్ అంటూ బాధపడుతున్నాడు. అసలేం జరిగిందంటే..ప్రవాస భారతీయుడు పార్థ్ విజయ వర్గియాకు ఐస్ స్కేటింగ్ చేస్తుండగా చిన్న గాయమైంది. అయితే అక్కడ అంబులెన్స్కి అయ్యే అధిక ఖర్చుకి భయపడి..నొప్పి భరిస్తూ మరి తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ రూమ్లో చికిత్స పొందాడు. అయితే ఆ ఎమర్జెన్సీ రూంలో గడిపింది జస్ట్ 90 నిమిషాలే..దానికే మనోడుకి వేసిన బిల్లు చూస్తే..కళ్లు బైర్లుకమ్ముతాయ్. పాపం ఇక్కడ వర్గియాకు కూడా ఆ ఆస్పత్రి వేసిన బిల్లు చూసి కళ్లుగిర్రున తిరిగాయి. ఏడుపు ఒక్కటే తక్కువ అన్నంత పనైంది. ఆ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా తన బాధనంతో ఓ వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. ఇంతకీ వర్గియాకు ఎంత బిల్లు వేశారంటే..అక్షరాల రూ. 1.5 లక్షలు. సర్జరీ లేదు ఏం లేదు..జస్ట్ కొద్దిపాటి ట్రీట్మెంట్కి గుబగుయ్యిమనిపించేలా బిల్లు వేసింది ఆస్పత్రి. అదృష్టం ఏంటంటే వర్గియాకు హెల్త్ ఇన్సురెన్సూ ఉండటంతో అది క్లైయిమ్ చేసుకున్నాడు లేండీ. అలా క్లైయిమ్ చేసుకునేటప్పుడే వర్గియాకు తెలిసింది తన వైద్యానికి అంత ఖర్చు అయ్యిందని. తనకు సుమారు రూ. 3.5 లక్షలపైనే హెల్త్ ఇన్సురెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది అంటూ బావురమన్నాడు. అందుకే అమెరికా..అమెరికా..అంటు సంబరపడొద్దు..ఇక్కడ జీవితం చాలా ఖరీదైనది అంటూ వీడియోని ముగించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ అధిక జీతానికి తగ్గట్టు..ఖర్చులు కూడాను అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Parth Vijayvergiya (@parthvijayvergiya) (చదవండి: అందుకేనా జపాన్ అంత క్లీన్గా ఉంటోంది..!) -
అమెరికా-కెనడాల మధ్య ‘బోర్డ్ ఆఫ్ పీస్’ అగ్గి..!
అమెరికా-కెనడాల మధ్య డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ అగ్గి రాజేస్తుంది. ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ పీస్ బోర్డుకు కెనడా సమ్మతి తెలపకపోవడంతో అది మరొక వివాదానికి దారి తీసింది. తమకు సహకరించని దేశాలను గుర్తుపెట్టుకుంటామని వ్యాఖ్యానించిన ట్రంప్.. కెనడాపై మాత్రం పెరు పెట్టి మరీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కెనడా కృతజ్ఞత లేని దేశం అంటూ నిప్పులు చెరిగారు. తమ వల్లే ఆ దేశం మనుగడలోకి వచ్చిందని, ఇప్పటికీ తామే ఆదేశానికి ఆధారమని ధ్వజమెత్తారు. దీనిపై కెనడా ఘాటుగా స్పందించింది. ట్రంప్.. ఇక మీ మాటలు చాలంటూ ఘాటుగా బదులిచ్చింది. దీనిపై కెనడా ప్రధాని మార్క్ కార్నే మాట్లాడుతూ.. తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. తమ ఎవరి మీద ఆధారపడి బతకడం లేదని, కెనడియన్లకు ప్రత్యేకమైన జీవన స్థితిగతులు ఉన్నాయన్నారు. ‘ అమెరికా వల్ల కెనడియన్లు జీవించడం లేదు. కెనడా అభివృద్ధి చెందుతోంది ఎందుకంటే మనం కెనడియన్లం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో బోర్డ్ ఆఫ్ పీస్లో తమను జాయిన్ అవ్వమని ట్రంప్ నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని కార్నే అంగీకరించారు. ఆయన రెండు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన భాగస్వామ్యాన్ని కూడా ఒప్పుకున్నారు. కాకపోతే తమకు ప్రత్యేక అభిప్రాయాలుంటాయనే విషయాన్ని కార్నే తేల్చిచెప్పారు. ఆ బోర్డుకు అత్యధిక మొత్తంలో చెల్లించడానికి తాము సిద్ధంగా లేమని తెగేసి చెప్పేశాకాగా, ఇక దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోఅమెరికా ఆధిపత్యంపై సెటైర్లు వేశారు. అమెరికా ఆధిపత్యం తగ్గిపోతున్నదని, మధ్యస్థ శక్తులు కలిసి కొత్త సహకార ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ శాంతి కూటమికి కెనడా దూరంగా ఉంది. అయితే ట్రంప్ మాత్రం కెనడాపై రెచ్చిపోయి ప్రసంగించడంతో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎటు దారితీస్తాయో అనే చర్చ మొదలైంది.ఇదీ చదవండి:Trump: మరో కొత్త తలనొప్పి..! -
ట్రంపరితనం.. పిల్లాడిని వదల్లేదు!
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో ఐదేళ్ల బాలుడు లియామ్ కోనేజో రామోస్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై దుమారం చెలరేగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం ఖండించారు. చిన్నారుల్ని ఇలా అరెస్టు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ చర్యను సమర్థించింది.మిన్నెసోటాలోని కొలంబియా హైట్స్ ప్రాంతంలో ప్రీ-స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్న లియామ్ను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)అధికారులు అదుపులోకి తీసుకున్నారు.బాలుడితో పాటు అతని తండ్రిని నిర్భందించి తీసుకెళ్లారు. ఇలా చిన్నారుల్ని అదుపులోకి తీసుకోవడం గత రెండు వారాల్లో అదే స్కూల్ జిల్లాలోని నాలుగు విద్యార్థులను ఐసీఈ అధికారులు అదుపులోకి తీసుకున్నారని స్థానిక పాఠశాల అధికారులు వెల్లడించారు.అదుపులోకి తీసుకున్న అనంతరం ఐసీఈ అధికారులు చిన్నారిని ‘ఎర’గా ఉపయోగించారని ఆరోపించారు. ఐదేళ్ల బాలుడిని ఎందుకు అదుపులోకి తీసుకోవాలి? ఇది మానవత్వానికి విరుద్ధం’ అని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రంప్ బృందం ఈ చర్యను చట్టపరమైన అమలు చర్యగా సమర్థించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తాము ఎలాంటి తప్పు చేయలేదు’ అని స్పష్టం చేసింది.ఈ ఘటన అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాలపై చర్చకు దారి తీసింది. ప్రజలు,పాఠశాల అధికారులు, మానవ హక్కుల సంస్థలు చిన్నారులను ఇలాంటి చర్యల్లో భాగం చేయడం అమానుషం’ అని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘He is just a baby’అనే ట్యాగ్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. Liam Ramos is just a baby. He should be at home with his family, not used as bait by ICE and held in a Texas detention center.I am outraged, and you should be too. pic.twitter.com/djr2z1AG0N— Kamala Harris (@KamalaHarris) January 22, 2026 -
Trump: మరో కొత్త తలనొప్పి..!
డొనాల్డ్ ట్రంప్.. కాసేపు యుద్ధం అంటారు..అంతలోనే శాంతి అంటారు. కాసేపు అది మాకు కావాలంటారు.. మరికాసేపటికి మాకు సహకరించకపోతే వారిని గుర్తు పెట్టుకుంటామంటారు ఎలా చెప్పుకున్నా ట్రంప్ వైఖరి గంటకో అవతారం అన్న మాదిరిగా ఉంది. ఈ క్రమంలోనే ట్రంప్ కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. వరల్డ్ ఎకానిమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు జరుగుతున్న దావోస్ నగర వేదికగా బోర్డ్ ఆఫ్ పీస్(శాంతి మండలి)ని ఏర్పాటు చేశారు. దీనికి 35 దేశాల మద్దతు తెలుపగా, భారత్ తటస్థ వైఖరిని అవలంభించింది. దీనికి భారత్ దూరంగా ఉండటానికి కారణాలను ఒక్కసారి విశ్లేషిస్తే.. ప్రధాన కారణం మాత్రం ఈ మండలి యొక్క న్యాయబద్ధతపై సందేహాలు ఉంటమేనని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దాంతో పాటు భారతదేశం యొక్క స్వతంత్ర విదేశాంగ ధోరణి మరొక కారణం. ట్రంప్ స్వ ప్రయోజనాలతో ఏర్పడిన కూటమా?ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలిపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ కొత్త కొలిమిని ఏర్పాటు చేసినా. అది ట్రంప్ స్వప్రయోజనాలతో ముడిపడి ఉందనే విషయాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆకస్మికంగా ట్రంప్ శాంతి కూటమిని ఏర్పాటు చేయడానికి ఆయన సొంత లాభం లేకపోతే ఎందుకు ఏర్పాటు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా UN General Assembly లాంటి సర్వసభ్యత్వం లేకపోవడం వల్ల ఇది అంతర్జాతీయంగా సమగ్రతను కోల్పోయందనేది విశ్లేషకుల మాట. మరొకవైపు మండలిలో పాలస్తీనా వర్గాల ప్రత్యక్ష భాగస్వామ్యం స్పష్టంగా లేకపోవడం భారతదేశానికి ఆందోళన కలిగించింది.భారతదేశం ఎప్పటినుంచో రెండు దేశాల సమస్య పరిష్కారానికి మద్దతు ఇస్తూ వస్తోంది.ఇది భారీ ఆర్థిక బాధ్యత.. అదే సమయంలో ఈ కూటమి భారీ ఆర్థిక బాధ్యతతో కూడుకున్నది. ఇందులో ఉన్న సభ్య దేశాలు $1 బిలియన్ (సుమారు ₹8,300 కోట్ల రూపాయలు) చెల్లించాల్సిన నిబంధన ఉంది. అంటే భారీ ఆర్థిక భారాన్ని సభ్య దేశాలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భారతదేశానికి భారీ ఆర్థిక బాధ్యతగా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. స్వతంత్ర, సమతుల్య విదేశాంగ విధానానికే భారత్ పెద్దపీటభారత్ ఎప్పుడూ స్వతంత్ర, సమతుల్య విదేశాంగ విధానాన్నే అనుసరిస్తుంది. అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన మండలిలో చేరడం వల్ల అంతర్జాతీయంగా పక్షపాత భావన కలగవచ్చని భారత్ భావించినట్లు కనబడుతోంది. భారత్ ఇప్పటికే యూఎన్ ఏజెన్సీల ద్వారా గాజాకు సహాయం అందిస్తోంది. ట్రంప్ మండలిలో చేరకుండా కూడా పునర్నిర్మాణం, సహాయం అందించగలదని భారత్ నమ్ముతోంది.ఇది కూడా గుర్తు పెట్టుకుంటారా?తమకు సహకరించిన, సహకరించిన దేశాలను గుర్తు పెట్టుకుంటామని అదే దావోస్ వేదికగా ట్రంప్ చెప్పుకొచ్చారు. తాము చేసేది మహాయజ్ఞం అన్న చందంగా బిల్డప్ ఇచ్చిన ట్రంప్.. సహకరించకపోతే మాత్రం తప్పుకుండా మదిలో పెట్టుకుంటామన్నారు. ఇప్పుడు ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి కూటమికి భారత్, రష్యాలతో పాటు చైనా కూడా తటస్థ వైఖరిని అవలంభించింది. ఇప్పుడు ఈ కూటమికి అంత సీన్ లేదనే ఈ మూడు దేశాలు భావించే కాస్త దూరంగా ఉన్నాయి. అలాగని కూటమిలో చేరడం లేదని కానీ, భవిష్యత్లో చేరే ఉద్దేశం కూడా లేదని కానీ చెప్పలేదు. మరి ఈ మూడు అగ్రదేశాలను ఒప్పించి, మెప్పించే పని ట్రంప్ చేస్తారా? అనేది మరొక ప్రశ్న. ఇప్పటికే భారత్పై పూర్వపు ప్రేమను ట్రంప్ కురిపిస్తున్నారు. భారత్ తమక మిత్రదేశమని, త్వరలో అతి పెద్ద ట్రేడ్ డీల్ ఉంటుందని కూడా చెప్పేశారు. ఇక రష్యా విషయానికొస్తే.. ఆ దేశం కూడా ట్రంప్ వైఖరిని చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. గ్రీన్లాండ్ అంశానికి సంబంధించి కూడా రష్యా సానుకూలంగానే స్పందించింది. అది ట్రంప్కు, నాటో దేశాలకు సంబంధించిన విషయమని, ఇక్కడ రష్యా జోక్యం ఉండదని చాలా కామ్ అండ్ నీట్గా పుతిన్ తేల్చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూల్గా వెళ్లిపోతేనే బెటర్ అనే భావనలో పుతిన్ ఉన్నారు. అందుకు గ్రీన్లాండ్పై ట్రంప్ వైఖరిని ఖండించలేదు. ఇక చైనా ఎప్పుడూ అమెరికాకు పోటీనే. మరి ఇప్పుడు ఆ దేశం కూడా ట్రంప్ శాంతి కూటమికి దూరంగానే ఉంది. కానీ భవిష్యత్లో జరగబోయే పరిణామాల దృష్యా చైనా ఒక నిర్ణయానికి రావొచ్చు. లేకపోతే శాశ్వతంగా ఈ కూటమికి దూరంగా కూడా ఉండొచ్చు. అమెరికా మాదిరిగానే చైనా కూడా స్వప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుందనేది కాదనలేని సత్యం. ఇక్కడ చైనాకు ఏమైనా ప్రయోజనాలు ఉంటేనే అందులో చేరుతుంది. అందుచేత అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కూటమిని చైనా నిశితంగా గమనించిన తర్వాతే ఒక్క నిర్ణయానికి రావొచ్చు.ఇప్పటికే ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, బ్రిటన్లుఘా కూటమిలో చేరమని తేల్చేయగా, ఖతార్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, మంగోలియా, పాకిస్తాన్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఇండోనేసియా, జోర్డాన్, అల్బేనియా, అర్మేని యా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, కజకిస్తాన్, కొసోవో, మొరాకోలు కూటమిలో చేరాయి. తటస్థంగా ఉన్న దేశాలు ఇవి..రష్యా, భారత్, సింగపూర్, థాయ్లాండ్, ఉక్రెయిన్, ఇటలీ, జర్మనీ, కాంబోడియా, చైనా, క్రొయేషియా, సైప్రస్, గ్రీస్, పరాగ్వే, యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం -
ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై మస్క్ సెటైర్లు
దావోస్: గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అపర కుబేరుడు ఎలాన్ మస్క్ దుమ్మెత్తి పోశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి మండలి)ని బోర్డ్ ఆఫ్ పైస్ (శాంతి ముక్కలు)గా మార్చుకుంటే సరిపోతుందని పరోక్షంగా దుయ్యబట్టారు.దావోస్ వేదికగా కొనసాగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో బ్లాక్రాక్ సీఈవో లారీ ఫిక్ అధ్యక్షత వహిస్తున్న ప్యానల్ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ట్రంప్ బోర్డు పీస్ బదులుగా పైస్ అని ఉండాలని మస్క్ సూచించారు. ‘నేను పీస్ సమ్మిట్ ఏర్పాటు గురించి విన్నాను. అది పీసా లేదంటే గ్రీన్లాండ్ పైస్,వెనిజువెలా పీస్ అని నేను అనుకున్నాను’. మనకు కావాల్సింది పైస్ కాదు పీస్ అంటూ నిశబ్ధంగా ఉన్న ఆడియెన్స్తో నవ్వులు పూయించారు. ELON MUSK: "I heard about the formation of the peace summit? And I was like, is that piece or peace? Like little piece of Greenland a little piece of Venezuela." 😂 pic.twitter.com/QxmbOrH2wC— DogeDesigner (@cb_doge) January 22, 2026 -
H-1B వీసాల పేరిట భారీ మోసం!
-
తగ్గేదేలే.. ఇరాన్ వైపునకు భారీగా అమెరికా బలగాలు
చల్లారుతుందనుకున్న అమెరికా-ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు ట్రంపరితనంతో మళ్లీ మొదటికొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ వైపు భారీ నౌకాదళాన్ని పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సైనిక చర్యకు దిగేదాకా పరిస్థితిని తెచ్చుకోవద్దంటూ ఇరాన్ను హెచ్చరించారాయన. అయితే.. ఈ చర్యపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ ప్రకటించింది.ఇరాన్ వైపు భారీగా అమెరికా నౌకాదళం వెళ్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు నాకు నివేదికలు అందిస్తున్నారు. పరిస్థితిని నేనే స్వయంగా సమీక్షిస్తున్నా. ఏం జరుగుతుందో చూడాలి. అయితే సైనిక చర్య జరగకూడదని ఆశిస్తున్నా. ఒకవేళ ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని గనుక కొనసాగిస్తే.. అమెరికా కచ్చితంగా కఠినంగా స్పందిస్తుంది అని ట్రంప్ స్పష్టం చేశారు.ఇప్పటికే అమెరికా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్తో పాటు డిస్ట్రాయర్లు, యుద్ధవిమానాలను మిడిల్ఈస్ట్కు తరలిస్తోంది. అదనపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ నిరసనలపై కఠిన చర్యలు తీసుకోవడంతో వేలాది మంది మరణించినట్లు మానవహక్కుల సంస్థలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ హెచ్ఆర్ఏఎన్ఏ లెక్కల ప్రకారం ఆ సంఖ్య వేలల్లోనే ఉంది. ఇరాన్ అధికారులు మాత్రం ఆ సంఖ్య 5,000 దాకా ఉండొచ్చని అంటున్నారు. మృతుల్లో వందలాది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వేల మంది నిరసనకారుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. వాళ్లలో కొందరిని దేశద్రోహం కింద ఉరి తీయాలనే ఆలోచనతో ఉన్నారు.అయితే వాళ్లను ఉరి తీసే ప్రయత్నాలు చేస్తే.. ఇరాన్పై సైనిక చర్య చేపడతామని ట్రంప్ మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో.. తమ ఒత్తిడి కారణంగానే ఇరాన్ నిరసనకారులను ఉరి వేసే ప్రణాళికను రద్దు చేసిందని మొన్నీమధ్య ప్రకటించారు కూడా. ఈ నిర్ణయం కారణంగానే ఆ దేశంపై సైనిక చర్య విషయంలో తాను వెనక్కి తగ్గినట్లు చెప్పుకున్నారు కూడా. అయితే తాజాగా.. సుమారు 837 మందిని ఉరి తీయకుండా నేను కాపాడాను అంటూ ఆయన ప్రకటించారు.‘అణు’ వార్నింగ్దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో ట్రంప్ ఇరాన్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే అమెరికా మళ్లీ చర్యలు తీసుకుంటుంది, కానీ పరిస్థితి శాంతియుతంగా ముగియాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉంటే.. ఐరాస విభాగం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) తన మార్గదర్శకాల ప్రకారం.. సాధారణంగా నెలకు ఓసారి ‘అణు తనిఖీ’ చేపట్టాలి. కానీ, గత ఏడు నెలలుగా ఇరాన్లోని యురేనియం నిల్వలను పరిశీలించలేదని సమాచారం. దీంతో అధిక స్థాయిలో ఉండొచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది.ఖబడ్దార్.. అమెరికా బలగాల కదలికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ.. అమెరికా గనుక దాడి చేస్తే ప్రతిదాడి తప్పదు. ఇది బెదిరింపు కాదు, వాస్తవం. ఈసారి ఇరాన్ సైన్యం పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తుంది. అప్పుడు యుద్ధం దీర్ఘకాలం సాగుతూ మిడిల్ఈస్ట్ అంతా విస్తరిస్తుంది. అమెరికా బేస్లు ఉన్న దేశాలు జాగ్రత్త అంటూ పరోక్షంగా ఇజ్రాయెల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అయితే.. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరించే పరిస్థితి మీద మాత్రం ఆయన స్పందించలేదు. -
త్రైపాక్షిక చర్చలు మొదలెడతాం
దావోస్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగింపు దిశగా కీలక ముందడుగు వేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో గురువారం జెలెన్స్కీ ప్రసంగించారు. ‘‘యుద్ధం ముగింపే లక్ష్యంగా శుక్రవారం నుంచి రెండ్రోజులపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉక్రెయిన్, రష్యా, అమెరికాల మధ్య త్రైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి. అంతకుముందు గురువారమే అమెరికా ప్రతినిధి బృందంతో మేం మంతనాలు జరుపుతాం. మా చర్చల పురోగతిని రష్యాకు వివరించేందుకు మరో అమెరికా బృందం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఆ తర్వాత రష్యా బృందంతో కలిసి అమెరికా, ఉక్రెయిన్ బృందాలు యునైటెడ్ అరబ్ ఎమిర్సేట్లో త్రైపాక్షిక చర్చలు జరుపుతాయి. యుద్ధం పరిసమాప్తి కోసం ఉక్రెయిన్ మాత్రమేకాదు రష్యా సైతం కొన్నిసార్లు త్యాగాలుచేయాల్సి ఉంటుంది. అందుకు రష్యా సిద్ధపడాలి. చర్చలనేవే లేకుండా ఉండటం కంటే ఏదోరకమైన చర్చలకు ప్రయత్నించడం మంచిదే కదా. యుద్ధం ముగిసిపోయేలా మాకు దేవుడి దీవెనలు ఉంటాయని ఆశిస్తున్నా’’ అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ‘‘ గత ఏడాది ఇదే వేదికపై ఐరోపా సాయం కోసం వేడుకున్నా. ఆనాడు ఏం మాట్లాడానో అవే మాట్లాడాల్సి వస్తోంది. అప్పటికి ఇప్పటికి పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. ‘గ్రౌండ్హాగ్ డే’ సినిమాలో పాత్రలాగా ఒకే రోజు మళ్లీ మళ్లీ పునరావృతమవుతోంది’’ అని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తంచేశారు.ట్రంప్తో జెలెన్స్కీ కీలక చర్చలువరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జెలెన్స్కీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తర్వాత జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు. ‘‘ ట్రంప్తో భేటీ ఉక్రెయిన్కు లబ్ధి చేకూరేలా సాగింది. మేమిద్దరం నేడో, రేపో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమవుతాం. ఆ తర్వాతే త్రైపాక్షిక భేటీ జరగనుంది’’ అని అన్నారు. ట్రంప్, జెలెన్స్కీ భేటీ వివరాలను పుతిన్కు వివరించేందుకు ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ మాస్కోకు వెళ్లనున్నారు. పుతిన్తో అమెరికా బృందం భేటీని ట్రంప్ సైతం ్ర«ధువీకరించారు. ఎలాగైనాసరే ఈసారి చర్చలు విజయవంతంచేసి యుద్ధాన్ని ఆపేస్తామని ట్రంప్ ధీమా వ్యక్తంచేశారు. మరోవైపు దావోస్ పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన ట్రంప్కు ప్రతికూల వాతావరణం సమస్యగా మారింది. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ట్రంప్ హెలికాప్టర్ ఎగరలేకపోయింది. దాంతో రోడ్డు మార్గంలో ట్రంప్ జ్యూరిచ్కు చేరుకుని అక్కడి నుంచి ఎయిర్ఫోర్స్వన్ విమానంలో అమెరికాకు తిరుగుపయనమైనట్లు తెలుస్తోంది. -
అధ్వాన్నంగా అమెరికాలో ఆరోగ్యం : ఎండోస్కోపీ కోసం 6 వారాలు
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆధీనంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లోని ఒక ప్రధాన ఉద్యోగి ట్వీట్ వైరల్గా మారింది. అమెరికాలో H1b ఫీజు పెంపుతో, అమెరిలో వైద్యం అందని ద్రాక్ష మారుతోందని అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిపుణులైన విదేశీ డాక్టర్లు అందుబాటులో లేని కారణంగా మెడికల్ డెసర్ట్లు ఇంకా పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆధీనంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొడక్షన్ హెడ్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.ఎక్స్ ప్రొడక్షన్ హెడ్ నికితా బియర్ తన ఆరోగ్యం గురించి తన ట్వీట్ ద్వారా ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫ్రైడ్ చికెన్ తింటు న్నప్పుడు తనకు గొంతులో గాయమైందని, దీంతో తాను సరిగ్గా మాట్లాడలేక పోతున్నానని లేదా మింగలేకపోతున్నానని చెప్పారు. వైద్యులు ఎండోస్కోపీ చేయించు కోవాలని సలహా ఇచ్చారట. ఇక్కడే అసలు విషయం గురించి చెప్పారు. ముందు నష్టాన్ని అంచనా వేయడానికి చాలా వారాలు వేచి ఉండాలని తనకు సలహా ఇచ్చారని బియర్ పేర్కొన్నారు.ఎండోస్కోపీ పరీక్షకోసం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా , నాలుగు లేదా ఆరు వారాల తరువాతే మాత్రమే అని చెప్పడంతో షాక్ అవడం అతని వంతైంది. బియర్ ఈ అనుభవాన్ని “కాఫ్కా నవల” ను వర్ణిస్తూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది.అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ ఇంత దారుణంగా ఉందా అనేచర్చకు దారి తీసింది.అమెరికన్ హెల్త్కేర్ వ్యవస్థకు సంబంధించి అనేకమంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నిలిచిపోయిన ఉద్యోగ నియామకాలు, నిపుణుల కొరత, బీమా సంబంధిత ఆంక్షలు, అధిక ఖర్చులపై మాట్లాడారు. వీటి కారణంగానే సాధారణ రోగనిర్ధారణ విధానాలకు కూడా చాలా జాప్యం జరుగుతోందని మండిపడ్డారు.హాయిగా ఇండియా ట్రిప్ వేయండి! మరోవైపు బియర్ను భారతదేశంలో చికిత్స పొందాలని , అక్కడ ఆసుపత్రులలో రోగనిర్ధారణ పరీక్షలు చాలా తొందరగా అయిపోతాయని చెప్పారు. ఇండియాకు అలా విమానంలో వెళ్ళండి. గంటలోపే టాప్ డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఆరు గంటల్లో ఎండోస్కోపీ లాంటివి పూర్తి చేసుకుని మూడు రోజుల్లో తిరిగి వెళ్లిపోవచ్చు అంటూ మరొకరు సూచించారు. సత్వర చికిత్స కోసం బియర్ను దక్షిణ కొరియా, దుబాయ్ లేదా థాయ్లాండ్కు వెళ్లమని కొంతమంది నెటిజన్లు సలహా ఇచ్చారు.(అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత?)వ్యవస్థాపకుడు అమన్ గైరోలా కూడా భారతదేశ వైద్య మౌలిక సదుపాయాలను ప్రశంసిస్తూ వ్యాఖ్యానించారు. "ఇక్కడ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా మహా అయితే 48 గంటలు పడుతుంది. దేశం అందించే సౌకర్యాలను ప్రజలు ఎప్పుడూ గ్రహించరు. ఇక్కడ కూడా ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి కానీ క్రమంగా మెరుగుపడుతోంది" అని ఆయన రాశారు.ఇదీ చదవండి: H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో! -
‘పైలట్లపైకి తోసేస్తారా?’.. అమెరికా సంస్థ ఆగ్రహం
వాషింగ్టన్: గత ఏడాది(2025) జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమాన ప్రమాదంపై అమెరికాకు చెందిన ‘ఫౌండేషన్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ’ (ఎఫ్ఏఎస్) సంచలన విషయాలను వెల్లడించింది. ఈ ప్రమాదానికి గురైన విమానం (రిజిస్ట్రేషన్ VT-ANB) సర్వీసులో చేరక ముందు నుంచే లెక్కలేనన్ని సాంకేతిక లోపాలతో సతమతమవుతున్నదని ఆ సంస్థ ఆరోపించింది.ఎయిర్ ఇండియాలో ఈ విమానం సేవలు ప్రారంభించిన తొలి రోజు (2024, ఫిబ్రవరి 1) నుంచే సిస్టమ్ వైఫల్యాలు నమోదయ్యాయని ఎఫ్ఏఎస్ పేర్కొంది. ఈ విమానం తయారీ, ఇంజనీరింగ్, నాణ్యతా ప్రమాణాల్లో అనేక లోపాలు ఉన్నాయని, ఇవే ఈ ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. గత 11 ఏళ్లుగా ఈ విమానంలో ఎలక్ట్రానిక్, సాఫ్ట్వేర్ లోపాలు, వైరింగ్ డ్యామేజ్, పవర్ సిస్టమ్ వేడెక్కడం లాంటి సమస్యలు నిరంతరం తలెత్తుతూనే ఉన్నాయని ఎఫ్ఏఎస్ నివేదిక స్పష్టం చేసింది.2022, జనవరి 2022లో ‘పి100 ప్రైమరీ పవర్ ప్యానెల్’లో మంటలు చెలరేగడంతో కీలకమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థ దెబ్బతిన్నదని, 2022, ఏప్రిల్లో ల్యాండింగ్ గేర్ ఇండికేషన్ సిస్టమ్ లోపాలతో విమానాన్ని గ్రౌండ్ చేయాల్సి వచ్చిందని ఎఫ్ఏఎస్ పేర్కొంది. ఈ లోపాలను సరిదిద్దేందుకు పలుమార్లు విడిభాగాలను మార్చాల్సి వచ్చిందని, అయినప్పటికీ సమస్యలు పునరావృతమయ్యాయని ఆరోపించింది. ఈ విమానమే కాకుండా, ఇతర ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానాల్లోనూ ఇలాంటి విద్యుత్ వైఫల్యాలు ఉన్నాయని ఎఫ్ఏఎస్ హెచ్చరించింది.ఈ ప్రమాదంపై భారతీయ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో పైలట్లదే తప్పని సూచించడాన్ని ఎఫ్ఏఎస్ తప్పుబట్టింది. గతంలో బోయింగ్ 737 మ్యాక్స్ ప్రమాదాల సమయంలోనూ సంస్థ ఇలాగే పైలట్లపై నిందలు వేసే వ్యూహాన్ని అనుసరించిందని గుర్తు చేసింది. బోయింగ్ 787 ప్రోగ్రామ్ షెడ్యూల్ కంటే మూడేళ్లు ఆలస్యంగా, బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చుతో నడిచిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,235 విమానాల్లో సుమారు 18 శాతం విమానాల రిపోర్టులను తాము విశ్లేషించామని ఎఫ్ఏఎస్ తెలిపింది. కాగా ఈ ఆరోపణలపై స్పందించేందుకు బోయింగ్ ప్రతినిధి నిరాకరిస్తూ, విచారణ బాధ్యతను ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం భారతీయ ఏఏఐబీకే వదిలేశామన్నారు. ఈ వ్యవహారంపై అమెరికా అధికారులు తక్షణమే క్రిమినల్ విచారణ జరిపించాలని ఎఫ్ఏఎస్ డిమాండ్ చేసింది.ఇది కూడా చదవండి: ఇదేం సినిమా కాదు.. ఈ లక్షణాలే ప్రాణాంతకం -
గ్రీన్లాండ్ టారిఫ్లు.. వెనక్కి తగ్గిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చల్లబడ్డారు. గ్రీన్లాండ్ విషయంలో యూరప్ దేశాలపై విధించబోయే సుంకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దావోస్ వేదికగా గ్రీన్లాండ్.. యూరోపియన్ దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. యూరప్లో తమ మిత్రదేశాలపై ఫిబ్రవరి 1 నుంచి సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా అకౌంట్లో ప్రకటించారు. నాటో చీఫ్ మార్క్ రుట్టేతో జరిగిన భేటీలో ఆర్కిటిక్ భద్రతపై భవిష్యత్ ఒప్పందానికి రూపకల్పనపై అంగీకారం కుదిరిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 1న అమలులోకి రావాల్సిన సుంకాలను విధించబోను. గ్రీన్లాండ్కు సంబంధించిన "గోల్డెన్ డోమ్" అంశంపై అదనపు చర్చలు కొనసాగుతున్నాయని, చర్చలు ముందుకు సాగేకొద్దీ మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. ఈ చర్చలు, ఒప్పందాలు అమెరికా మరియు నాటో దేశాలందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. చర్చల బాధ్యతను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరియు ఇతరులు నిర్వహిస్తారు. వారు నేరుగా నాకు నివేదిస్తారు.. అని ట్రంప్ తన పోస్టులో తెలియజేశారు. అంతకు ముందు.. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో మాట్లాడుతూ.. గ్రీన్లాండ్ను ఓ ఐస్ ముక్కగా అభివర్ణించారు. ఎలాగైనా దానిని అమెరికా సొంతం చేసుకోవాల్సిందేనంటూ మాట్లాడారు. అయితే ఇందుకోసం బలప్రయోగం(సైనిక చర్య) చేయబోమని.. అమెరికా విస్తరణను నాటో అడ్డుకునేందుకు ప్రయత్నించకూడదని అంటూనే ఇటు యూరప్ మిత్రదేశాలనూ ఆయన హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికానే యూరప్ను రక్షించింది. ఆ సంగతి మరిచిపోకూడదు. అలాగే.. నాటోకు మేమెంతో సాయం అందించాం. కాబట్టి మా అభ్యర్థన చిన్నదే అని అనుకుంటున్నాం అంటూ గ్రీన్లాండ్ విషయంలో అడ్డుపడకూడదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. మేం బలప్రయోగం జరిపితే పని తేలికగా అవుతుంది. కానీ, అలా చేయం. ఆ అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్కు అమెరికా భద్రత కోసం అవసరమని, రష్యా–చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఇది కీలకమని ఆయన వాదించారు. గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరకులపై 10 శాతం అదనపు సుంకం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలకు ఈ సుంకం వర్తిస్తుందన్నారు. ఒకవేళ.. గ్రీన్లాండ్ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1కల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలను యూరోపియన్ దేశాలు ఖండించాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్.. అమెరికా సుంకాలు విధిస్తే యూరప్ ఒక్కటిగా.. కఠినంగా ప్రతిస్పందిస్తుందన్నారు. అమెరికా–యూరప్ మధ్య వాణిజ్య ఒప్పందం దెబ్బతింటే.. అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం కలుగుతుందని హెచ్చరించారు. గ్రీన్లాండ్ భవిష్యత్తుపై సుంకాల బెదిరింపులకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం అన్నారు. మరోవైపు యూరోపియన్ పార్లమెంట్ సైతం అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేసే ఆలోచనను తీవ్రతరం చేసింది. ఈలోపు దావోస్లో ట్రంప్ ప్రసంగం, నాటో చీప్తో భేటీ జరిగిన కాసేపటికే యూరప్ దేశాలపై సుంకాలు విధించాలన్న తన నిర్ణయాన్ని ఆయన మార్చుకున్నారు. రియాక్షన్ ఇదే.. దావోస్ వేదికగా ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రభుత్వం స్పందించింది. తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని అమెరికాకు స్పష్టం చేసింది. మరోవైపు.. ఇది తమ దేశాన్ని అవమానించడమేనని గ్రీన్లాండ్ భావిస్తోంది. ట్రంప్ అనిశ్చితి కలిగించే నాయకుడంటూ తిట్టిపోస్తోంది. అయితే సైనిక చర్య ఉండదని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. గ్రీన్లాండ్ ప్రభుత్వం మాత్రం అప్రమత్తమైంది. ఐదు రోజుల పాటు సరిపడా ఆహారం, నీరు, ఇంధనం నిల్వ చేసుకోవాలంటూ ఆ దేశ ప్రజలకు సూచనలు చేసింది. నూక్ నగరంలోని ప్రజలు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
'వ్యూహం' అమలు తీరు ఇదేనా?
అమెరికా గత నవంబర్లో ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ’ పత్రాన్ని చది విన వారికి, ఆ తర్వాత నుంచి అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును గమనించి నప్పుడు, ఆ వ్యూహాన్ని అమలు పరచవలసింది ఇట్లాగేనా అనే సందేహం కలుగు తుంది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) అనే లక్ష్యంతో రూపొందించిన ఆ సమగ్ర వ్యూహం అమలులో చాకచక్య మైన దౌత్య నైపుణ్యాన్ని, ఓర్పును ప్రదర్శించాలి. అమెరికా ఆధిపత్యానికి 21వ శతాబ్దం ఆరంభం నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్న స్థితిలో, తమ దేశాన్ని ‘తిరిగి గొప్పదిగా’ చేయదలచుకునే నాయకత్వం అటువంటి నీతిని అనుసరించని పక్షంలో, ఉన్న సవాళ్లు పరిష్కారం కాకపోగా కొత్తవి తలెత్తక తప్పదు.ట్రంప్ చాణక్యనీతికి బదులు ధూర్తనీతికి పాల్పడుతున్నందున ప్రస్తుతం జరుగుతున్నది అదే. అందుకు వెనిజులా, గ్రీన్ల్యాండ్, యూరప్, కెనడా, ఇండియా వంటి కొన్ని ఉదాహరణలను గమనించినా, ఆయన నాయకత్వాన అమెరికా ‘తిరిగి గొప్పది’ కావటం అట్లుంచి మరింత వేగంగా తన గొప్పతనాన్ని కోల్పోక తప్పదనే అభిప్రాయం కలుగుతుంది. గ్రీన్ల్యాండ్కు సంబంధించి జరుగుతున్నది ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటం అట్లుంచి, అమెరికా మిత్ర ప్రపంచంలోనే కల్లోలాన్ని సృష్టిస్తున్నది. చివరకు విషయం ఎటు తేలినా, ఆ మిత్ర ప్రపంచంతో పాటు తక్కిన ప్రపంచం దృష్టిలోనూ ట్రంప్ పట్ల విశ్వసనీయత మాత్రం తీవ్రంగా దెబ్బతింటున్నది. ఒక వ్యూహం విజయవంతం కావాలంటే కేవలం అమెరికాకు గల ఆర్థిక బలం, మార్కెట్ బలం, సైనిక బలం చాలవు. వాటితో పాటు శాస్త్ర, సాంకేతిక బలం ఉండి కూడా గత పాతికేళ్ళుగా సవాళ్ళు పెరగటం లేదా? కనుక కావలసింది దేశాలతో విశ్వసనీయత, సత్సంబంధాలు. కేవలం బలాలను ఉపయోగించి ఇతరులను బెదిరించే కాలం గతించి పోయిందని సాక్షాత్తూ ‘వ్యూహ’ పత్రమే అంగీకరిస్తున్నది. అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోక పోవటం ఆశ్చర్యకరం.మొత్తంగా వశమైతేనే...గ్రీన్ల్యాండ్ విషయం ముందు చూద్దాం. యూరప్లోని డెన్మార్క్కు చెందిన ఆ ద్వీపపు రక్షణ, అక్కడి వనరులు ఆ ప్రాంతాల కోసమో, యూరప్ కోసమో అవసరమనీ, వాటిని రష్యా, చైనాల బారిన పడకుండా కాపాడాలనీ ట్రంప్ భావిస్తున్నట్లయితే, ఆ ప్రకారం గ్రీన్ల్యాండ్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్లతో చర్చలు జరిపి తగిన ఉమ్మడి విధానాన్ని రూపొందించవచ్చు. కానీ ఆయన గ్రీన్ల్యాండ్ భూభాగం, అక్కడి వనరులు, దాని రక్షణ ‘అమెరికా ప్రయోజనాల కోసం తప్పక అవసర’మని బాహాటంగా ప్రకటిస్తున్నారు. అందుకు గ్రీన్ల్యాండ్, డెన్మార్క్, యూరప్లలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, ‘అంగీకరిస్తారా, సైన్యాన్ని పంపమంటారా’ అని భయపెట్టజూస్తున్నారు. ఒత్తిడి చేసేందుకు ఈ నెల 17న 10 శాతం సుంకాలు ప్రకటించి, వాటిని జూలై నుంచి 25 శాతానికి పెంచగలనని హెచ్చరించారు.అమెరికాను ‘తిరిగి గొప్పది’ చేయగల దౌత్యనీతి, ఆర్థిక విధానం ఇవేనా అన్నది ప్రశ్న. అది కూడా ‘నాటో’ కూటమిలో తన సహచరులై, రాగల కాలంలో తమతో తప్పక నిలవవలసిన దేశాలంటూ ‘వ్యూహ పత్రం’లో తామే ప్రకటించిన వారిపట్ల చూపవలసిన వైఖరి? వాస్తవానికి గ్రీన్ల్యాండ్లో అమెరికన్ సైనిక స్థావరాల నిర్మాణం, వాటి విస్తరణ కోసం డెన్మార్క్తో 1951లోనే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందపు పాఠాన్ని చూసిన వారికి, అక్కడ ఏమి చేయాలన్నా డెన్మార్క్తో ‘సంప్రదింపులు’ జరపాలనే నిబంధన తప్ప వారి ‘అంగీకారం’ కావాలనే షరతు కనిపించదు. అనగా అంతటి స్వేచ్ఛ అమెరికాకు ఉందని స్పష్టమవుతుంది. అమెరికన్లు అక్కడ గతంలోనే ఒక ఉపరితల స్థావరం, ఒక భూగర్భ అణుశక్తి స్థావరం నిర్మించారు కూడా! కానీ ఇవేవీ చాలవని, గ్రీన్ల్యాండ్ ‘పూర్తిగా స్వాధీనమైతేనే దాని రక్షణకు తగిన మానసిక స్థితి’ తనకు కలుగుతుందని ట్రంప్ ఆశ్చర్యకరంగా వాదిస్తున్నారు. ఆ ప్రాంతంలోని రష్యా, చైనా యుద్ధ నౌకలున్నాయని, వారు మైనింగ్ జరుపుతూ వనరులను కొల్లగొడుతున్నారనే మాటలు ఎంతమాత్రం నిజం కాదని గ్రీన్ల్యాండ్, డెన్మార్క్లు స్పష్టం చేస్తున్నా లెక్క చేయటం లేదాయన.మిత్రులు సైతం దూరంగ్రీన్ల్యాండ్ విషయం అట్లుంచి కూడా, ముఖ్యంగా చైనా సవాలు గురించి ‘వ్యూహపత్రం’లో సుదీర్ఘంగా చేసిన చర్చలో, యూరప్ తిరిగి శక్తిమంతం కావటం, రష్యా–యూరప్ల మధ్య రాజీ, అమెరికాతో సంబంధాల అభివృద్ధి వంటి తనదైన దార్శ నికతను చూపిన ట్రంప్, ఆచరణలో అందుకు తగిన దౌత్యపరిణతిని ప్రదర్శించటానికి బదులు, అంతకుముందు వలెనే, ఈ ‘పత్రం’ ప్రకటన తర్వాత సైతం ధూర్త దౌత్యాన్నే ప్రయోగిస్తున్నారు. ఉక్రె యిన్ యుద్ధం, సుంకాల విధింపు దరిమిలా యూరోపియన్ యూని యన్కు అమెరికాతో ఇప్పటికే పేచీలున్నాయి. ముఖ్యంగా వాణిజ్య వివాదాల కారణంగా వారు అమెరికా నుంచి చైనా వైపు మళ్లటం మొదలైంది. చైనాను వ్యతిరేకిస్తూ వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ... అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదనీ, చైనా నమ్మదగ్గదనీ బహిరంగంగా ప్రకటిస్తూ, గత వారమే బీజింగ్కు వెళ్లి భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. చైనా ఎలక్ట్రికల్ కార్ల దిగుమతిపై సుంకా లను 100 శాతం ఎత్తివేయటం వాటిలో ఒకటి. రానున్న కొద్ది నెలల్లో మరికొందరు యూరోపియన్ ప్రభుత్వాధినేతల పర్యటనలు కూడా ఖరారయ్యాయి.అమెరికాకు అన్నివిధాలా సన్నిహితమైన యూరప్ పరిస్థితి ఇది కాగా, తక్కిన ప్రపంచ దేశాల ఆలోచనలు ఏమిటో ఊహించవచ్చు. అటు తూర్పున అమెరికాకు ఇంతే సన్నిహితమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్ కూడా ఈ నెల మొదటి వారంలో చైనా వెళ్లి ఒప్పందాలు చేసుకోవటం గమనించదగ్గది. ఇంతకూ ట్రంప్ ‘వ్యూహ పత్రం’, దాని అమలు తీరు, అమెరికా పట్ల దాని మిత్ర దేశాల విశ్వాసం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. తనకు ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’తో తప్ప అంతర్గతంగా గానీ, అంతర్జాతీయంగా గానీ ఏ నియమ నిబంధనలతో నిమిత్తం లేదని బాహాటంగా ప్రక టించిన ట్రంప్ 33 పేజీల ‘వ్యూహ పత్రాన్ని’ పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, మిత్రులా, ప్రత్యర్థులా అనే దానితో నిమిత్తం లేకుండా అందరినీ అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. అందుకోసం సామ దాన భేద దండోపా యాలు అన్నింటినీ ప్రయోగించగలమనే సూచనలు కూడా ఆ పత్రంలో దండిగానే ఉన్నాయి.వాడుకొని వదిలెయ్!ఇండియా గురించి కూడా ‘వ్యూహ పత్రం’లో రాసిన మాట లన్నింటి సారాంశం ఇదే. ఒకవైపు వాణిజ్యం, మరొకవైపు ఇండో– పసిఫిక్లో సైనిక వ్యూహాల విషయంలో భారతదేశాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ట్రంప్ గత ఏడాదిగా చేస్తూ వస్తున్నదేమిటో చూస్తూనే ఉన్నాము. ఇపుడు ఈ ‘పత్రం’ మూలంగా అర్థం చేసుకోవలసిందేమంటే, ‘ఉపయోగించుకో – ఒత్తిడి చెయ్ – ఉపయోగించుకో – వదిలెయ్’ విధానం ఇండియాకు సంబంధించి రాగల కాలంలో కూడా కొనసాగుతుందన్నమాట. వ్యూహ పత్రాల రూపంలో ప్రకటించినా, లేకున్నా సామ్రాజ్యవాద విధానాలు ఎప్పుడూ ఇవే!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్ విమానంలో విద్యుత్కు అంతరాయం.. యూటర్న్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం అలాగే వెనక్కి మళ్లింది. చిన్నపాటి విద్యుత్ సమస్య వల్లే ఇలా జరిగిందని.. విమానం సురక్షితంగానే దిగిందని వైట్హౌజ్ వర్గాలు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఎయిర్ఫోర్స్ విమానంలో ఆయన బయల్దేరారు. అయితే కాసేపటికే విద్యుత్ సమస్య తలెత్తడంతో.. ప్రెస్ కేబిన్లోని లైట్లు ఆరిపోయాయి. దీంతో సిబ్బంది సేఫ్టీ ప్రొటోకాల్ ప్రకారం విమానాన్ని తిరిగి యూఎస్ బేస్కు మళ్లించారు. #AirForce one is returning back to Washington DC because the crew detected a minor electrical issue. @POTUS Trump and staff are safe. pic.twitter.com/4EBPfEMw8w— @BeeNewsDailyB (@BeenewsdailyB) January 21, 2026వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్రంప్ మరో విమానంలో(బ్యాకప్ ఎయిర్ఫోర్స్ వన్) దావోస్కు వెళ్లినట్లు ప్రెస్ సెక్రటరీ కరోలీనా లెవిటీ స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సాధారణమని తెలిపారామె. ట్రంప్ రెండో దఫా అధ్యక్ష పదవి చేపట్టాక.. భారీ ఖర్చుతో బోయింగ్ 747-200 మోడల్ విమానాలు రెండింటికీ మార్పులు(ఒకటి బ్యాకప్) చేయించారు. ట్రంప్ ప్రయాణించే విమానాలు ఎయిర్ఫోర్స్ వన్(Air Force One) నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువ. ఒక్క గంట ప్రయాణానికి సుమారు 2,00,000–2,50,000 డాలర్లు (రూ.16–20 కోట్లు) వరకు ఖర్చు అవుతుంది(ఇంధనం, సిబ్బంది, భద్రతా, నిర్వహణ.. అన్నీ కలిపి). ఈ భారం పన్నుల రూపంలో మోసేది అమెరికన్లే. అయితే.. అధికారిక పర్యటనలే కాదు తన వ్యక్తిగత పర్యటనలకూ ఆయన ఈ విమానాన్ని వినియోగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. -
ఆంధ్రా అల్లుడు.. మళ్లీ తండ్రి కాబోతున్నాడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి గుడ్న్యూస్ను అందరితో పంచుకున్నారు. మరోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని అటు ఆయన సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ కూడా ధృవీకరించారు. దీంతో వాళ్లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వాన్స్ దంపతులు త్వరలోనే నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జులై చివరిలో పండంటి మగబిడ్డ తమ జీవితాల్లోకి రానున్నట్లు తెలిపారు. జేడీ- ఉషా వాన్స్లకు 2014లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఈవాన్, వివేక్, మిరాబెల్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. జేడీ వాన్స్ (James David Vance).. 1984 ఆగస్టు 2న ఓహియో స్టేట్లోని మిడిల్టౌన్లో జన్మించారు. స్థానిక స్టేట్ యూనివర్సిటీలో చదివి, తరువాత యేల్ లా స్కూల్లో న్యాయ విద్య పూర్తి చేశారు. 2016లో ఆయన ఆత్మకథ “Hillbilly Elegy” అమెరికా అంతటా విశేష ఆదరణ పొందింది. ఈ పుస్తకం ఆధారంగా Netflix చిత్రం కూడా రూపొందింది. 2022లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి, ఓహాయో నుంచి సెనేటర్గా ఎన్నికయ్యారు. తన స్పష్టమైన అభిప్రాయాలు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం వల్ల జనాదరణ పొందగలిగారు. 2025 జనవరి 20న జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి ఆయన వైట్ హౌస్లో పనిచేస్తున్నారు.ఉషా చిలుకూరి అమెరికాలో కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేశారు. We’re very happy to share some exciting news. Our family is growing! pic.twitter.com/0RohEBYXM7— Second Lady Usha Vance (@SLOTUS) January 20, 2026యేల్ లా స్కూల్లోనే ఉషా, జేడీ వాన్స్ (JD Vance) తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే పరస్పరం ఇష్టపడ్డారు. ఈ క్రమంలో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. జేడీ వాన్స్ క్రిస్టియానిటీ, ఉష హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. -
ఇదంతా మాదే! మూడు దేశాలను కలుపుకుని అమెరికా కొత్త మ్యాప్
-
చాగోస్లా కావొద్దనే...
లండన్/దావోస్: గ్రీన్లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాను చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. ‘‘బ్రిటన్ వంటి దేశమే మారిషస్ నుంచి అప్పుడెప్పుడో కొనుగోలు చేసిన చాగోస్ దీవులపై అధికారాన్ని అకారణంగా తిరిగి ఆ దేశానికి వదిలేసుకుంటోంది. అక్కడి డీగో గార్షియా దీవుల్లో అమెరికాకు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన నావిక, బాంబర్ స్థావరాలున్నాయి. వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారిందిప్పుడు.గ్రీన్లాండ్ విషయంలోనూ అలాంటిది జరగొద్దనే ఆ దీవి అమెరికా చేతిలో ఉండాలని చెబుతున్నాను’’ అని సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్సోషల్లో రాసుకొచ్చారు! ‘నాటోకు చెందిన అత్యంత తెలివైన సభ్య దేశం’ ఇలాంటి తెలివి తక్కువ పనికి దిగుతోందంటూ బ్రిటన్ను ఎద్దేవా కూడా చేశారాయన. ‘‘బ్రిటన్ కనబరిచిన ఈ బలహీనతను చైనా, రష్యా కచ్చితంగా గమనించే ఉంటాయి. గ్రీన్లాండ్పై మరింత దూకుడు పెంచే ఆలోచన కూడా చేస్తుండి ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలను బ్రిటన్ ఖండించింది.చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించాలన్న నిర్ణయం పూర్తిగా సబబేనని పేర్కొంది. చాగోస్ దీవుల్ని రెండు శతాబ్దాల క్రితం మారిషస్ నుంచి బ్రిటన్ కారుచౌకగా కొనుగోలు చేసింది. వాటిని మారిషస్కు తిరిగిచ్చేలా, డీగో గార్షియా దీవిని మాత్రం 99 ఏళ్ల లీజుకు బ్రిటనే అట్టిపెట్టుకునేలా గతేడాది ఒప్పందం కుదిరింది. అప్పుడు దాన్ని స్వాగతించిన ట్రంప్ ఇప్పుడు మాత్రం తప్పుబడుతున్నారు!ట్రంప్ విశ్వసనీయత కోల్పోయారు: ఉర్సులాగ్రీన్లాండ్ స్వాధీన యత్నాలకు మద్దతివ్వనందుకు పలు యూరప్ దేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటనను యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ తూర్పారబట్టారు. ఈ నిర్ణయాన్ని ఘోర తప్పిదంగా అభివర్ణించారు. ‘‘ఈయూపై ఇక టారిఫ్లు విధించబోనని గతేడాది ఇచ్చిన హామీని ట్రంప్ సునాయాసంగా తుంగలో తొక్కారు. ఆయనకు అసలు విశ్వసనీయత అన్నది ఏమైనా ఉందా?’’ అంటూ ఆమె మండిపడ్డారు. ‘‘వ్యాపారంలో మాదిరిగానే రాజకీయాల్లో కూడా ఒప్పందమంటే ఒప్పందమే. ఈయూ సమైక్యంగా నిలుస్తుంది. ట్రంప్ టారిఫ్లపై దీటుగా స్పందిస్తుంది’’ అని ప్రకటించారు. కాస్త వెన్నెముక చూపండి!టారిఫ్ల వ్యవహారంలో యూరప్ దేశాలు పిరికిగా వ్యవహరిస్తున్నాయంటూ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఎద్దేవా చేశారు. ఆ దేశాలకు అసలు వెన్నెముక అనేదే లేదా అంటూ తూర్పారబట్టారు. ట్రంప్ టారిఫ్లను కలసికట్టుగా, దీటుగా ఎదుర్కోవాలని వాటికి సూచించారు. అలాగే గ్రీన్లాండ్కు కూడా యూరప్ దేశాలన్నీ సమైక్యంగా మద్దతిచ్చి ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నారు.అమెరికాపై ట్రేడ్ బజూకా?ట్రంప్ టారిఫ్లకు అదే విరుగుడుఈయూ దేశాలకు మాక్రాన్ పిలుపుదావోస్: గ్రీన్లాండ్ స్వాధీ నానికి అంగీకరించడం లే దంటూ పలు యూరప్ దేశా లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10 శాతం టారిఫ్పై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యు యేల్ మాక్రాన్ మరోసారి ధ్వజమెత్తారు. అంతూ పొంతూ లేకుండా సాగుతున్న ట్రంప్ టారిఫ్ల బెదిరింపులను దీటుగా ఎదుర్కోవాలని యూరోపియన్ యూనియన్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. అందుకోసం అవసరమైతే ‘ట్రేడ్ బజూకా’గా పిలిచే యాంటీ కొయెర్షన్ ఇన్స్ట్రుమెంట్ (ఏసీఐ) ఆయుధాన్ని వాడేందుకు కూడా ఈయూ కూటమి వెనకాడొద్దన్నారు. మంగళవారం దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరంలో మాట్లాడుతూ మాక్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈయూ కూటమి చేతిలో ఉన్న అతి పదునైన ఆయుధం ఏసీఐ.ప్రస్తుత కఠిన పరిస్థితుల దృష్ట్యా దాన్ని అమెరికాపై వాడేందుకు ఈయూ దేశాలు ఏమాత్రం వెనకాడొద్దు’’ అని అభిప్రా యపడ్డారు. ఈయూ దేశాలపై ఆర్థిక, ఇతరత్రా ఒత్తిళ్లు, బెదిరింపులను తిప్పికొట్టేందుకు ఆ సమాఖ్య రూపొందించుకున్న వాణిజ్య అస్త్రం ట్రేడ్ బజూకా. దీనిద్వారా కూటమేతర దేశాలపై ప్రతీకార సుంకాల విధింపుతో పాటు పలు ఇతరత్రా ఆంక్షలు విధించే అధికారం ఈయూకు దఖలు పడింది. అలాగే ఈయూకు చెందిన ఎలాంటి బిడ్డింగుల్లోనూ సదరు దేశాలు పాల్గొనేందుకు వీలుండదు. కూటమేతర దేశాలను, ముఖ్యంగా చైనా, రష్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ట్రేడ్ బజూకాను మిత్రదేశమైన అమెరికాపైనే ఈయూ ప్రయోగించే పరిస్థితులు కన్పిస్తుండటం విశేషం! -
కెనడాపైనా ట్రంప్ కన్ను!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు నానాటికీ శ్రుతి మించి రాగాన పడుతోంది. అర్ధరాత్రి అధ్యక్ష దంపతులను కిడ్నాప్ చేసి చెరబట్టిన వెనెజువెలాతో పాటు గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలని కలలుగంటున్న ట్రంప్ దృష్టి పొరుగుదేశం కెనడా పైనా పడింది. ఆ మూడు దేశాలనూ అమెరికా మ్యాప్లో చేర్చేసి మురిసిపోయారాయన! కెనడా, వెనెజువెలా, గ్రీన్లాండ్తో కలిపిన అమెరికా మ్యాప్ను సొంత సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్లో ట్రంప్ మంగళవారం పోస్టు చేశారు. తద్వారా అవి ఎప్పటికైనా అమెరికా భూభాగాలేనన్న సంకేతాలిచ్చారు! ఈ మేరకు ట్రంప్ పోస్టు చేసిన ఏఐ ఫొటో వైరల్గా మారింది. అందులో వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో పలువురు దేశాధినేతలతో ఆయన ఏదో సీరియస్గా చర్చిస్తూ కన్పిస్తున్నారు.నేపథ్యంలో మూడు దేశాలను అమెరికా భూభాగంతో కలిపి చూపుతున్న ఆ దేశ సరికొత్త మ్యాప్ ప్రముఖంగా కన్పిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టె తదితరులు ఫొటోలో ఉన్నారు. తద్వారా... కెనడా, వెనెజువెలా, గ్రీన్లాండ్ స్వాధీనానికి ఆయా దేశాల ఆమోదముందని చెప్పడం ట్రంప్ ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు.ట్రంప్ అక్కడితో ఆగలేదు! గ్రీన్లాండ్ గడ్డపై తాను సగర్వంగా అమెరికా జెండా పాతుతున్నట్టుగా మరో ఏఐ ఆధారిత ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫొటోలో కన్పిస్తున్నారు. ‘‘గ్రీన్లాండ్, అమెరికా భూభాగం, స్థాపితం: 2026’ అని రాసిన బోర్డు కూడా ఫొటోలో దర్శనమిస్తోంది. కెనడా స్వచ్ఛందంగా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని గతంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక డెన్మార్క్ అధీనంలోని స్వయంపాలిత ప్రాంతమైన గ్రీన్లాండ్ స్వాధీ నానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఆ క్రమంలో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కొంతకాలంగా అంతర్జాతీయ రగడకు దారితీస్తు న్నాయి. డెన్మార్క్ తో పాటు గ్రీన్లాండ్ కూడా ట్రంప్ యత్నాలను ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. అమెరికాలో కలిసేది లేదని గ్రీన్లాండ్ స్పష్టం చేసింది.గ్రీన్లాండ్కు యూఎస్ విమానం!డెన్మార్క్తో నానాటికీ తీవ్రతరమవుతున్న ఉద్రిక్తతల నడుమ, గ్రీన్లాండ్లోని అమెరికా సైనిక స్థావరంలో యుద్ధ విమానాన్ని మోహరించాలని ట్రంప్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణ యం తీసుకున్నారు. అక్కడి పిటుఫిక్ స్థావరంలో దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం ఈ చర్య చేపడుతున్నట్టు వైట్హౌస్ చెప్పుకొచ్చింది. -
ట్రంప్ సంచలనం.. అమెరికా కొత్త మ్యాప్ రిలీజ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. వెనెజువెలా, కెనడా, గ్రీన్లాండ్ ద్వీపంతో కూడిన అమెరికా మ్యాప్ను ట్రంప్ తాజాగా విడుదల చేశారు. దీంతో, ట్రంప్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా ట్రంప్.. మ్యాప్ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది.అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేసిన రెండు ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక పోస్టులో గ్రీన్లాండ్ సరిహద్దులో అమెరికా జెండాను పాతుతున్నట్లు చూపించే చిత్రాన్ని షేర్ చేశారు. ఆ చిత్రంలో ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మైలురాయి బోర్డుపై ‘గ్రీన్లాండ్ అమెరికా భూభాగం-2026లో ఏర్పాటైంది’ అని రాసి ఉన్న సూచిక బోర్డు కనిపిస్తుంది. మరో పోస్టులో ఏకంగా అమెరికా మ్యాప్ను మార్చేశారు. ఓవల్ ఆఫీస్లో ట్రంప్తో పాటుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సహా ఇతర నాటో నేతలు కనిపించారు. అయితే, ఆ ఫొటోలో ఓ బోర్డుపై అమెరికా మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో కెనడా, గ్రీన్లాండ్, వెనిజువేలా దేశాలు అమెరికా భాగాలుగా చూపించారు. దీంతో, అమెరికా మ్యాప్ ఇప్పుడు సంచలనంగా మారింది.గ్రీన్లాండ్లోకి యుద్ధ విమానం..మరోవైపు.. ట్రంప్ తొలి పోస్ట్ పెట్టిన కాసేపటి తర్వాత నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (ఎన్ఓఆర్ఏడీ) ఎక్స్ వేదికగా కీలకమైన ట్వీట్ చేసింది. ఒక యుద్ధ విమానాన్ని గ్రీన్లాండ్లోని పిటుఫిక్ వైమానిక స్థావరానికి పంపుతున్నామని ఎన్ఓఆర్ఏడీ కమాండ్ ప్రకటించింది. గ్రీన్లాండ్ భద్రత కోసం రూపొందించిన పలు దీర్ఘకాలిక ప్రణాళికల అమలు కోసమే ఆ విమానాన్ని పంపుతున్నామని వెల్లడించింది. డెన్మార్క్, గ్రీన్లాండ్ల సమన్వయంతోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది.అమెరికాలో కెనడా 51వ రాష్ట్రం..2025 సంవత్సరం మే నెల చివరి వారంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. కెనడా అనేది అమెరికాలో 51వ రాష్ట్రం అవుతుందన్నారు. నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా గవర్నర్ అవుతారని కామెంట్ చేశారు. కానీ కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ వ్యాఖ్యలను ఖండించారు. కెనడా ఎన్నటికీ అమెరికాలో కలవదని తేల్చి చెప్పారు. అయినా ట్రంప్ తన వాదనను కొనసాగించారు. -
H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో!
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజుల విషయంలో తీసుకున్న నిర్ణయం గ్రామీణ అమెరికాను తీవ్రంగా ప్రభావితం చేయనుందా? అక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత సంక్షోభంలోకి కూరుకుపోనుందా. లక్షలాదిమంది అమెరికన్ల ఆరోగ్యం ప్రమాదంలో ఉందా? తాజా అంచనాలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. హెచ్1 బీ వీసాల ఫీజు భారీ పెంపు అమెరికాలోని అత్యంత అవసరమైన ప్రాంతాలకు విదేశీ శిక్షణ పొందిన వైద్య నిపుణుల రాకకుఅంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విధానం వల్ల సామాన్య అమెరికన్లకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం లక్షలాది మందికి వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి.గ్రామీణ అమెరికా వైద్య సంక్షోభం సమస్యను అధిగమించడానికి గ్రామీణ ఆసుపత్రులు గతంలో H-1B వీసా ద్వారా విదేశీ నిపుణులను నియమించుకునేవి. తక్కువ ఖర్చుతో నైపుణ్యం కలిగిన సిబ్బందిని పొందేందుకు ఇదొక గొప్ప మార్గంగా ఉండేది. అయితే, ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈ ఆసుపత్రులపై కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న చిన్న ఆసుపత్రులు అంత భారీ మొత్తాన్ని చెల్లించి విదేశీ వైద్యులను నియమించుకోవడం అసాధ్యంగా మారింది.ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్' (One Big Beautiful Bill Act) వల్ల మెడికెయిడ్ నిధులు తగ్గిపోవడం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి తక్కువ రీయింబర్స్మెంట్ రావడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోంది. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు పెరిగిన వీసా ఖర్చుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా సామాన్యులకు ప్రాథమిక చికిత్స అందడం గగనంగా మారుతోంది.మెడికెయిడ్ (Medicaid) నిధులలో కోతలు విధించడం వల్ల 2034 నాటికి సుమారు 1.7 కోట్ల మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఖర్చులకు భయపడి ప్రజలు ఆసుపత్రులకు వెళ్లడం తగ్గించేస్తున్నారు, ఫలితంగా తక్కువ రోగులు ఉండటంతో ఆసుపత్రుల ఆదాయం తగ్గి అవి మూతపడుతున్నాయి. అమెరికాలో 2026 నాటికి దాదాపు 32 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ కార్మికుల కొరత ఏర్పడవచ్చని అంచనా, ఇది ఇప్పటికే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచుతోంది. పెరుగుతున్న మెడికల్ డెసర్ట్స్ఈ పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాలు "మెడికల్ డెసర్ట్స్" (వైద్య ఎడారులు) గా మారుతున్నాయి. అమెరికాలోని 80శాతం గ్రామీణ కౌంటీలు ఈ జాబితాలోకి వస్తున్నాయి. అత్యవసర చికిత్స లేదా తీవ్రమైన గాయాల కోసం ప్రజలు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రజల్లో ఊబకాయం మరియు అకాల మరణాల రేటు 20% ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల మూత వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరగక, చికిత్స అందక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను తీర్చడానికి విదేశీ నిపుణులు, ముఖ్యంగా H-1B వీసాదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలోని ప్రతి నలుగురు వైద్యులలో ఒకరు విదేశీయులే. అయితే తాజా వీసా రుసుమును భారీగా పెంచడం వల్ల ఈ ఆసుపత్రులు కొత్తవారిని నియమించుకోలేక పోతున్నాయి.జామా ఆందోళనది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,080 మంది వైద్యులకు H-1B వీసాలను స్పాన్సర్ చేశారు, ఇది అమెరికాలోని మొత్తం వైద్య సిబ్బందిలో 0.97 శాతానికి సమానం. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆధారపడటం దాదాపు రెట్టింపు ఎక్కువగా ఉంది, అక్కడ 1.6 శాతం మంది వైద్యులు H-1B వీసాలపై ఉండగా, పట్టణ ప్రాంతాలలో ఈ సంఖ్య 0.95 శాతంగా ఉంది. మొత్తంగా, వైద్య మరియు ఆరోగ్య వృత్తులలో H-1B ఆమోదాల సంఖ్య 16,937గా ఉంది, ఇది మొత్తం ఆమోదాలలో 4.2 శాతం. ఇందులో వైద్యులు ,సర్జన్లు సుమారు సగం మంది (8,557) ఉన్నారు.దీని వల్ల సామాజిక-ఆర్థికంగా అత్యంత బలహీనమైన సమాజాలు తీవ్రంగా దెబ్బతింటామని మాస్ జనరల్ బ్రిగమ్లో నివాసి వైద్యుడు , JAMA అధ్యయనం సహ రచయిత డాక్టర్ మైఖేల్ లియు పేర్కొన్నారు. హై క్వాలిటీ హెల్త్ కేర్ కోసం "మిలియన్ల మంది అమెరికన్లు విదేశీ ఆరోగ్య సంరక్షణ కార్మికులపై ఆధారపడతారు" అని ఆయన హెచ్చరించారు.గ్రామీణ అమెరికా ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తగినంత మంది వైద్యులు, నర్సులు లేకపోవడం , ప్రభుత్వ నిధుల కొరత కారణంగా వందలాది ఆసుపత్రులు మూతపడుతున్నాయి లేదా సేవలను నిలిపివేస్తున్నాయి. ముఖ్యంగా 2005 నుండి సుమారు 195 గ్రామీణ ఆసుపత్రులు మూతపడగా, ప్రస్తుతం మరో 700 ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందుల వల్ల మూతపడే దిశలో ఉన్నాయి. దీనివల్ల కొన్ని లక్షల మంది ప్రజలు అత్యవసర వైద్య సేవలకు మరియు ప్రసూతి వంటి కీలక చికిత్సలకు దూరమవుతున్నారు. -
మాట వినని మాక్రాన్.. ట్రంప్ మరో హెచ్చరిక
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాను అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలనే ఆలోచనతో ట్రంప్ ముందుకు సాగుతున్నారు. ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు టారిఫ్లను ఆయుధంగా వాడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. తన మాట వినని కారణంగా టారిఫ్లు విధిస్తానంటూ ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగారు.అయితే, గాజా శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాక్రాన్పై ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ నేపథ్యంలో మాక్రాన్ను టార్గెట్ చేసిన ట్రంప్.. తాజాగా ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు వేస్తానని బెదిరించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. మాక్రాన్ తప్పకుండా శాంతి మండలిలో చేరాల్సిందే. లేని పక్షంలో ఫ్రాన్స్ వైన్, షాంపైన్ దిగుమతులపై 200 శాతం టారిఫ్లు విధిస్తాను అని హెచ్చరించారు. అనంతరం, ఫ్రాన్స్పై టారిఫ్లు విధిస్తే.. మాక్రాన్ శాంతి మండలిలో చేరాల్సిన అవసరం ఉండదు అని సెటైర్లు సైతం వేయడం గమనార్హం. మరోవైపు.. గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.ABSOLUTE CINEMA 😳Trump threatens 200% tariffs on French wine and champagne after Paris signals it may decline his invitation to join his proposed “Board of Peace.”Trump also shared on Truth Social a private message he received from President Macron regarding Greenland. pic.twitter.com/i8MSN28DwW— Sharp Sighter (@SharpSighter) January 20, 2026ఇదిలా ఉండగా.. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఉద్దేశించిన మండలిలో భాగం కావాలని భారత్ సహా కొన్ని దేశాలను డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. ఈ క్రమంలో గాజా పునరాభివృద్ధికి నిధుల సమీకరణ, పాలన పర్యవేక్షణకు మండలిని తొలుత ఉద్దేశించారు. ఇక, గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ రెండోదశలో భాగంగా దీనిని తెరపైకి తెచ్చారు. అయితే, ట్రంప్ ఆహ్వానాన్ని మాక్రాన్ తిరస్కరించారు. ట్రంప్ హెచ్చరికలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. దీంతో, ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. -
పాములు పట్టే వాడు చివరికి పాము కాటుకే బలైనట్లు..
నుయుక్: పాములు పట్టే వాడు చివరికి పాము కాటుకే బలైనట్లు.. ట్రంప్నకు అధికారాన్ని తెచ్చిన మాగా (MAGA) నినాదమే గ్రీన్లాండ్ వీధుల్లో వ్యంగ్యంగా మారింది. ఒకప్పుడు అమెరికా గర్వానికి ప్రతీకగా నిలిచిన ఆ నాలుగు పదాలు, ఇప్పుడు నిరసనకారుల చేతిలో ఎరుపు టోపీలపై ఆయుధంగా మారాయి.‘మాగా’ అనేది ట్రంప్ 2016 ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినిపించిన స్లోగన్. 1980లో రోనాల్డ్ రీగన్ ‘Let’s Make America Great Again’ అనే నినాదాన్ని వినిపించగా, ట్రంప్ దాన్ని ‘Make America Great Again’గా మార్చి 2015లో అధికారికంగా ట్రేడ్మార్క్ చేసుకున్నారు. ఎరుపు టోపీపై తెల్ల అక్షరాలతో రాసిన ఈ నినాదం ఆయన మద్దతుదారులలో ఐకానిక్ గుర్తుగా నిలిచింది.2016లో ట్రంప్ సభల్లో మాగా నినాదం భావోద్వేగాన్ని రగిలించింది. ఒక ఆశగా, ఒక ఉద్యమంగా మారింది. మద్దతుదారులు దీన్ని అమెరికా శక్తి, జాతీయ గర్వం, సరిహద్దుల రక్షణకు ప్రతీకగా చూశారు. విమర్శకులు మాత్రం దీన్ని విభజనాత్మకంగా భావించారు. అనూహ్యంగా, డెన్మార్క్.. గ్రీన్లాండ్లో ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కొత్త రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘Make America Great Again’ కాస్తా అక్కడి వీధుల్లో ‘Make America Go Away’గా మారింది. ఈ నినాదంతో ఎరుపు రంగు టోపీలు ధరించి ప్రజలు వీధుల్లోకి వచ్చారు.డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లో మంచులో గడ్డకట్టే స్థితిలో వేలాది మంది ప్రజలు ఈ టోపీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. గ్రీన్ లాండ్ను సైనికంగా స్వాధీనం చేసుకోవాలన్న వ్యాఖ్యలు, అలాగే యూరప్పై కొత్త టారిఫ్లు విధించాలన్న నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. ఈ నిరసనలో పాల్గొన్నవారు అమెరికా అధ్యక్షుడి విధానాలను వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ, గ్రీన్ లాండ్ స్వతంత్రతను కాపాడాలని గట్టిగా నినదించారు.నిరసనకారులు కేవలం అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకే కాకుండా, ఆర్కిటిక్ ప్రాంత భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనతో కూడా వీధుల్లోకి వచ్చారు. యూరప్లోని అనేక దేశాలు కూడా డెన్మార్క్, గ్రీన్లాండ్కు మద్దతు తెలుపుతూ..ట్రంప్ చర్యలు పాశ్చాత్య భద్రతకు ప్రమాదకరమని హెచ్చరించాయి. మొత్తం మీద, ట్రంప్ గ్రీన్లాండ్ స్వాధీనం ప్రయత్నాలు యూరప్లో తీవ్ర ప్రతిఘటనకు దారితీశాయి. ‘Make America Go Away’ క్యాప్స్ ఇప్పుడు గ్రీన్లాండ్, డెన్మార్క్ ప్రజల నిరసనకు ప్రతీకగా మారాయి. ఇది కేవలం సెటైరికల్ నినాదం మాత్రమే కాదు.. అమెరికా విధానాలపై యూరప్ ప్రజల అసహనాన్ని స్పష్టంగా చూపించే చిహ్నంగా నిలిచింది. -
Trump: సుప్రీం చెప్పిన.. వెనక్కి తగ్గేదేలే..!
-
థాంక్యూ అమెరికా..కానీ భారత్ అంటే ప్రేమ..!
అమెరికాలో నివశిస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి చేసిన పోస్ట్ నెట్టింట అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఓ పక్క అమెరికాను మెచ్చుకుంటూనే.. భారత్పై ఉన్న తన ఇష్టాన్ని గురించి కూడా వివరించాడు. అతడి పోస్ట్ అత్యంత ఆలోచనాత్మకంగ..విదేశాల్లో ఉండే సౌకర్యాలు, అక్కడి తీరు తెన్నులు..వలస వచ్చిన భారతీయలుకు ఎలాంటి ఛాలెంజ్లు, అవకాశాలు అందిస్తుందో వివరించాడు. ఈ పోస్ట్ ఎన్నారైలందర్నీ బాగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి పోస్ట్లో ఏం రాశాడంటే..యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఇన్వెస్టర్ వేణు తాను అమెరికా వెళ్లడంతో తన జీవిత గమనం ఎలా పూర్తిగా మారిపోయిందో షేర్ చేసుకున్నారు. అమెరికాలో లభించే అవకాశాల గురించి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాను అమెరికాలో సక్సెస్ అందుకున్నప్పటికీ..తాను పుట్టిన మాతృగడ్డ భారతదేశాన్ని జీవిత కాలం ప్రేమిస్తానంటూ దేశభక్తిని కూడా చాటుకున్నారు. ఆయన పోస్ట్లో తాను అమెరికాకు వెళ్లడాన్ని తన జీవిత గమనాన్ని ఊహించని విధంగా మార్చేసిన అరుదైన అవకాశంగా అభివర్ణించారు. "కృషి, క్రమశిక్షణ, స్థిరత్వానికి ప్రతిఫలమిచ్చే అమెరికన్ వ్యవస్థను ఎంతగానో కొనియాడారు. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడే వ్యక్తులు, ముఖ్యంగా రిస్కులు తీసుకోవడానికి సిద్ధపడే వారికి, ఓపికతో ఉండేవారికి తప్పక మంచి ఫలితాలు అందించి లైఫ్నే అద్భుతంగా మార్చుకునే అద్భుత అవకాశాన్ని అందిస్తుందని పోస్ట్లో వేణు రాసుకొచ్చారు. అంతేగాదు చాలామంది ఇతర దేశాల్లో జీవితాన్ని అనుభవించకుండానే అమెరికాని విమర్శిస్తుంటారని కూడా అన్నారు. ప్రపంచంలో మరోవైపు నిశిసించిన తర్వాత..ఈ స్థాయి అవకాశం ఎంత అరుదైనదో అర్థమవుతుంది. ఇక్కడ జన్మించడం లేదా ఇక్కడే మంచిగా జీవితాన్ని నిర్మించుకోవడం ఓ అద్భుతమైన ప్రయోజనమని అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటానంటూ తన పోస్ట్ని ముగించారు. ఈ పోస్ట్ భారతీయ ప్రవాసులలో చాలామందిని ఆకట్టుకుంది. అతడి పోస్ట్లోని కృతజ్ఞత, అమెరికన్ డ్రీమ్ గురించి అతడు రాసిన విలువైన భావాలు ప్రతి భారతీయుడి మనసుని తాకడమే గాక భారత వలసదారుల నుంచి పెద్ద ఎత్తున మద్దతులో కూడిన స్పందన రావడం విశేషం. సోదరా మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అంటూ పోస్టులు కూడా పెట్టారు. Since it’s a long weekend, a small thought.I’m genuinely grateful to the United States. It was a one-time opportunity that completely changed my life. I love India and always will, but coming here altered my trajectory in ways I couldn’t have imagined.This country rewards…— Venu (@Venu_7_) January 19, 2026 (చదవండి: కళ్లకు గంతలు...సహా ఆ సిటీలో వెరైటీ డేటింగ్స్ ఎన్నో...) -
గ్రీన్ల్యాండ్పైకి అమెరికా యుద్ధ విమానాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేయబోతున్నారా?.. గ్రీన్ల్యాండ్ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారా?.ఈ క్రమంలోనే సైన్యాన్ని గ్రీన్ల్యాండ్లోకి దింపబోతున్నారా?. ఈ తరుణంలో డెన్మార్మ్ ఆందోళనలో అర్థం ఉందా?.. అసలు దీనంతటికి కారణమైన నోరాడ్ అంటే ఏంటసలు?..గ్రీన్ల్యాండ్లోని పిటుఫిక్ స్పేస్ బేస్కి అమెరికా తన యుద్ధ విమానాలు పంపడం ఆర్కిటిక్ ప్రాంతంలో రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు దారి తీసింది. అగ్రరాజ్యం చర్యపై డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిగా డెన్మార్క్ తన సైన్యాన్ని ఇప్పటికే గ్రీన్ల్యాండ్లో మోహరింపజేసింది. అయితే.. నోరాడ్ (ఉత్తర అమెరికా వైమానిక రక్షణ కమాండ్) మాత్రం ఇది రొటీన్ ఆపరేషన్స్ అంటూ చెబుతోంది.అమెరికా సైనిక విమానాలు త్వరలో గ్రీన్లాండ్లోని పిటుఫిక్ స్పేస్ బేస్ (మునుపటి తులే ఎయిర్ఫోర్స్ బేస్) వద్దకు చేరనున్నాయి. దీనిని దీర్ఘకాలిక రక్షణ కార్యకలాపాల భాగంగా పేర్కొంటూ.. అమెరికా, కెనడా, డెన్మార్క్ మధ్య ఉన్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని నోరాడ్ చెబుతోంది. అయితే.. అమెరికా చర్యలను డెన్మార్క్ మాత్రం ఖండిస్తోంది.ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పెంచుకోవడం అమెరికా ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. అయితే.. తమ ఆధీనంలో ఉన్న స్వయం పాలక గ్రీన్ల్యాండ్పై అమెరికా సైనిక చర్యలకు దిగితే అది తమ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమేనని డెన్మార్క్ భావిస్తోంది. అదే జరిగితే నాటోలో విబేధాలు తప్పవని డెన్మార్క్ ప్రధాని ఇప్పటికే ట్రంప్కు స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. తాజా పరిణామంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఏమిటీ నోరాడ్NORAD అంటే "North American Aerospace Defense Command". ఇది అమెరికా-కెనడా కలిసి ఏర్పాటు చేసిన ద్వైపాక్షిక రక్షణ సంస్థ. దీని ప్రధాన పని ఉత్తర అమెరికా మీదకు వచ్చే విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహనాలపై హెచ్చరికలు ఇవ్వడం.. గగనతల నియంత్రణ చేయడం, అలాగే సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేయడం. నోరాడ్ గ్రీన్ల్యాండ్లో ప్రధానంగా.. పిటుఫిక్ స్పేస్ బేస్ నుంచే తన కార్యకలాపాలు నిర్వహించుకుంటోంది. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న అత్యంత కీలకమైన సైనిక స్థావరం కూడా. పిటుఫిక్ బేస్లోని రాడార్ వ్యవస్థలు రష్యా, చైనా వంటి దేశాల నుండి వచ్చే బాలిస్టిక్ మిసైల్ దాడులను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడతాయి.గ్రీన్ల్యాండ్ స్వయం పాలనలో ఉన్నప్పటికీ.. విదేశాంగం, రక్షణ వ్యవహారాలు ఇంకా డెన్మార్క్ ఆధీనంలో ఉన్నాయన్నది తెలిసిందే. కాబట్టి NORAD కార్యకలాపాలకు డెన్మార్క్ అనుమతి కచ్చితంగా అవసరం. నాటో సభ్యదేశమైన డెన్మార్క్.. నోరాడ్లో కార్యకలాపాల్లో భాగస్వామి కూడా. ఈ మేరకు అమెరికాతో 1951లో ప్రత్యేక రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకే ఒప్పందం ప్రకారం ఇప్పుడు అమెరికా చర్యలను అడ్డుకోవడానికి లేదు. కానీ, గ్రీన్ల్యాండ్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలను మాత్రం అడ్డుకునే అవకాశం ఉంది. అదే జరిగితే.. యుద్ధం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
అమెరికాకు నో కెనడాకే జై
సాక్షి, అమరావతి: విదేశీ విద్యలో భారతీయ విద్యార్థుల ఎంపిక మారుతోంది. దశాబ్దాలపాటు తొలి స్థానంలో నిలిచిన అగ్రరాజ్యం అమెరికాను కాదని పక్కనే ఉన్న కెనడాకు క్యూ కడుతున్నారు. ఫలితంగా విదేశీ విద్యా గమ్యస్థానాల్లో యూఎస్ రెండో స్థానానికి దిగజారిపోయింది. 2024–25 విద్యా సంవత్సరంలో కెనడా అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియాను అధిగమించి యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మూడో స్థానానికి ఎగబాకింది.ప్రపంచీకరణ, నాణ్యమైన ఉన్నత విద్య కోసం భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఫలితంగా విదేశాల బాటపడుతున్న వారి సంఖ్య అధికం అవుతోంది. అయితే అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016లో 4.24 లక్షలు ఉండగా... 2024 నాటికి 3.38 లక్షలకు పడిపోయింది. ఈ క్రమంలోనే భారత విద్యార్థుల దృష్టి అమెరికాను ఆనుకుని ఉన్న కెనడా వైపు మళ్లుతోంది. అతి తక్కువ కాలంలోనే ఇక్కడ విద్యార్థుల చేరికల్లో భారత్ ఏకంగా 350 శాతం వృద్ధిని కనబరిచింది. 2020లో 1.79 లక్షల నుంచి 2024కు 4.27 లక్షలకు దూసుకెళ్లింది. దీంతో కెనడా అగ్రస్థానంలో కొనసాగుతోంది.నాణ్యమైన విద్యకే ప్రాధాన్యం ప్రపంచంలోనే అతి పెద్ద అంతర్జాతీయ మార్కెట్ కలిగిన భారత్ అవుట్ బౌండ్ విద్యార్థుల్లో 2016–2024 మధ్య ఏకంగా 8.84 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు కావడం విశేషం. భారతీయ విద్యార్థులు వైద్యం, సాంకేతిక రంగాల్లో నాణ్యమైన విద్యను అందించే దేశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా భారతీయ విద్యార్థుల విదేశీ విద్య ఎంపికలో ఆస్ట్రేలియా నాలుగేళ్లు (2016–2020) మూడో స్థానంలో స్థిరంగా ఉంది. ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యింది. అయితే 2024లో 1.22 లక్షల విద్యార్థుల స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ నాలుగో స్థానానికి దిగజారింది.ఆస్ట్రేలియాను వెనక్కి నెడుతూ యూకే మూడో స్థానంలోకి వచ్చింది. ఈ దేశంలో 2016లో విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య 16,559 నుంచి 2020లో 90,300కి చేరుకోగా 2024 నాటికి ఏకంగా 1.85 లక్షలకు పెరిగింది. దీంతోపాటు యూఏఈ, మధ్య ఆసియా ప్రాంతమైన కిర్గిస్తాన్ కూడా భారతీయ విద్యార్థుల ఎంపిక జాబితాలో చేరాయి. రష్యా, జార్జియా, ఫిలిప్పీన్స్ 2020 నుంచి టాప్–10లో నిలుస్తున్నాయి. -
అమెరికాలో.. స్వేచ్ఛకు తూట్లు..! పెరుగుతున్న పేదరికం..!!
వాషింగ్టన్ డీసీ: ‘అందమైన లోకమని.. రంగురంగులుంటాయని.. అందరూ అంటుంటారు రామరామ.. అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా’ అని సినీకవి అన్న మాటలు అగ్రరాజ్యం అమెరికాకు సరిగ్గా నప్పుతాయి..! స్వేచ్ఛాసమానత్వాల భూమిగా అమెరికా గడ్డకు పేరుంది. కానీ, ఆ పేరు వెనక విరోధ భావాలు కూడా ఉన్నాయి. అణచివేత ధోరణులూ ఉన్నాయి. మరో కోణంలో అమెరికాను చూస్తే.. విస్తుపోయే నిజాలు కనిపిస్తాయి. డొనాల్డ్ ట్రంప్ ఏడాది పాలన నేపథ్యంలో.. ‘అమెరికా మరో పార్శ్వం’పై సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ రిపోర్ట్..గన్కల్చర్కు అమెరికా పెట్టింది పేరు..! ఎప్పుడు ఏ బడిలో తూటా పేలుతుందో తెలియదు..! ఎప్పుడు ఏ పబ్లిక్ ఈవెంట్పై ఉన్మాదుల తుపాకీ గర్జిస్తుందో ఊహించలేం..! మనుషుల కంటే తుపాకులే ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం అమెరికా. విద్యార్థులు పరీక్షలకు కాకుండా.. గన్ షూటింగ్కు సన్నద్ధమవుతుంటారు. తొమ్మిది.. పదేళ్ల వయసులోనే బ్యాగులో తుపాకీ తెచ్చుకుని, కోపంతో టీచర్లు, తోటి విద్యార్థులపై గురిపెడతారు. 33.5 కోట్ల జనాభాకు 40 కోట్ల గన్స్ ఉండడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. 2024లో తుపాకీ తూటాలకు 40 వేల మంది బలవ్వగా.. వారిలో 1,200 మంది చిన్నపిల్లలున్నారు. అమెరికాలో తల్లిదండ్రులు ఏకంగా తమ పిల్లలకు బుల్లెట్ ప్రూఫ్ బ్యాగులు, దుస్తులు కొనే పరిస్థితి అక్కడ నెలకొంది. తుపాకీ కారణంగా అమెరికాలో పౌరులు బిక్కుబిక్కుమంటూ గడిపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి పౌరులకు స్వేచ్ఛ ఉన్నట్లా..? లేనట్లా..?స్వేచ్ఛావాయువులు అమెరికాలో బలంగా వీస్తాయంటారు. ఇంకా చెప్పాలంటే.. ఫలానా దేశంలో స్వేచ్ఛేలేదంటూ రిపోర్టులిచ్చే ఎన్నెన్నో ఏజెన్సీలకు అమెరికా ఆలవాలం. ఫలానా దేశంలో ఫలానా మతస్థులను ఊచకోత కోస్తున్నారంటూ గగ్గోలు పెట్టే మీడియా అమెరికాకు సొంతం. అయితే.. ఇదంతా గురివింద చందమే..! అమెరికాలో జాతి వివక్ష ఏమాత్రం తగ్గ లేదు. ఇంకా చెప్పాలంటే.. అమెరికా జైళ్లలో ఉంటున్న ఖైదీల్లో శ్వేత జాతీయుల కంటే.. నల్ల జాతీయుల సంఖ్య ఐదు రెట్లు అధికంగా ఉంటోంది. అమెరికాలో జీఈ, న్యూస్ కార్ప్, డిస్నీ, వియాకామ్, టైమ్ వార్నర్, సీబీఎస్ అనే ఆరు సంస్థల చేతుల్లో 90% మీడియా ఉంది. ఈ సంస్థలేవీ అమెరికాలో జరుగుతున్న జాతి వివక్షను బయటి ప్రపంచానికి చూపించవు. కానీ, భారత్ లాంటి దేశాల్లో స్వేచ్ఛ లేదంటూ గగ్గోలు పెడతాయి. అమెరికా జైళ్లలో రెండు మిలియన్ల ఖైదీలుండగా.. వీరిలో సింహభాగం శ్వేతజాతీయులు కాని వారే. 21 లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారు. వీరితో జైళ్లలో బండ చాకిరీ చేయించుకుని, ముష్టి పారేసినట్లు గంటకు 25 సెంట్ల చొప్పున కూలీ ఇస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కడో స్లమ్లలో పరిస్థితులను భూతద్దంలో చూపించే అమెరికా మీడియా.. ఆయా దేశాల్లో పేదరికం పేట్రేగుతోందని, ప్రజలు కూడు, గూడు, గుడ్డకు నోచుకోవడం లేదని చూపడం సహజమే..! అయితే.. అమెరికాలో అంతా సంపన్నులే ఉన్నారా? పేదలే లేరా? అనే ప్రశ్నకు పాశ్చాత్య మీడియా కూడా నోరు మెదపదు. నిజమేంటంటే.. అమెరికాలో 18శాతం మంది పౌరులు నిరాశ్రయులు. ఆరున్నర లక్షల మంది పౌరులు వంతెనల కింద, రోడ్లపైనే నిద్రిస్తుంటారు. సైనికులు ఏర్పాటు చేసే టెంట్లలో 40 వేల మంది నిద్రిస్తారని అంచనా..! ఇక లాస్ ఏంజిల్స్, సాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్ ప్రాంతాల్లో ఏకంగా ‘టెంట్ సిటీస్’ పేరుతో పేదల బస్తీలు పుట్టుకొస్తున్నాయి. అదే సమయంలో.. బిలియనీర్ల సంపద ఒక్క కొవిడ్ సమయంలోనే 2 ట్రిలియన్ డాలర్ల మేర పెరగడం గమనార్హం..! ఏటా వైద్యంపై 4.5 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నామని అమెరికా గొప్పలు చెప్పుకొంటోంది. అయితే.. అనారోగ్యంతో సరైన వైద్యం అందక అమెరికాలో చనిపోతున్న వారి ఏటా 50 వేల మంది చనిపోతున్నట్లు ఓ నివేదిక ఉంది. అమెరికా అంటేనే వైద్య బీమా తప్పనిసరి అంటారు. అది కేవలం ఇమిగ్రెంట్లకేనని తెలుస్తోంది. ఇప్పటికీ అమెరికాలో 2 కోట్ల 70 లక్షల మంది పౌరులకు బీమా అందడం లేదని, ఐదు లక్షల కుటుంబాలు వైద్య ఖర్చుల కారణంగా దివాళా తీస్తున్నాయని పలు నివేదికలు వచ్చాయి. వైద్యం ప్రాథమిక హక్కు అని చెప్పుకొనే అమెరికాలో ఒక సర్జరీ కాస్ట్ 50 వేల డాలర్లుగా.. అంబులెన్స్ చార్జీలు కనీసం రెండు వేల డాలర్లుగా ఉండడం గమనార్హం..! అంటే.. అమెరికాలో రోగి ప్రాణాన్ని ధనమే నిర్ణయిస్తుందని స్పష్టమవుతోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పుడు అమెరికాలో ధరాభారం పెరిగింది. అమెరికాలో ఒక సగటు ఉద్యోగి జీతం తీసుకుని ఒక్కరోజు గడవక ముందే.. మళ్లీ జీతం రావడానికి ఎన్నిరోజులు ఉందా? అని లెక్కలేసుకుంటున్నాడు. ఈ కోవలో 60శాతం మంది ఉద్యోగులు ఉన్నట్లు ఓ అధ్యయనం చెబుతోంది. ఇళ్ల ధరలు, అద్దెలు, విద్య, వైద్యం, నిత్యావసరాలు.. ఇలా అన్నీ చుక్కలనంటుతున్నాయి. దిగుమతులపై ట్రంప్ టారిఫ్లతో ధరలు పెరిగి, అమెరికా పౌరులు విలవిల్లాడుతున్నారు. వేతనాలు పెరగవు.. ధరలు తగ్గవు అంటూ నిట్టూరుస్తున్నారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎన్నికల వ్యవస్థపై అభాండాలు వేసే అమెరికాలో.. ఎన్నికలు కూడా అత్యంత ఖరీదుతో కూడుకున్నవే..! ట్రంప్ విజయం సాధించిన 2024 ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలిచిపోయాయి. ఇందుకు 16 బిలియన్ డాలర్ల మేర ఖర్చయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖర్చులో కార్పొరేట్ కంపెనీల విరాళాలు కూడా ఉంటాయి. ఫలితంగా ఆయా సంస్థలు తమకు అనుకూల చట్టాలు తెప్పించుకుంటాయి. నేతల స్టాక్ పోర్ట్ఫోలియోలు కూడా విమర్శలకు తావిస్తున్నాయి. 2023లో 50 మంది నేతలు ఈ తరహాలో వ్యాపారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక అమెరికాలో ట్రంప్ వంటి పాలకుల కారణంగా.. పౌరుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక రుగ్మతను ఎదుర్కొంటున్నట్లు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సైకియాట్రీ చెబుతుంగా.. ఈ కారణాలతో 15 – 34 ఏజ్ గ్రూప్ వారిలోనే ఎక్కువగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఒంటరితనం, ఒత్తిడి, డ్రగ్స్ వంటివి ఈ ఆత్మహత్యలకు కారణాలుగా తెలుస్తోంది. యాంటీ డిప్రెసెంట్ ఔషధాలు అత్యధికంగా అమెరికాలోనే వినియోగమవుతున్నట్లు సమాచారం. ఓహియో, వెస్ట్ వర్జీనియా, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యసనం తీవ్రంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ఓవర్ డోస్ మరణాలు కూడా ఇక్కడ ఎక్కువే..! ఇక్కడి యువత డీ-అడిక్షన్ ఔషధాల కోసం వేల డాలర్లు ఖర్చుపెడుతోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ డేటా ఈ విషయాలను చెబుతోంది.ఇక టెక్నాలజీ.. డిజిటల్ యుగం అని చెప్పే అమెరికాలో యువత చదువు కోసం విలవిల్లాడుతోంది. విద్య ఓ హక్కు అయినా.. మన విద్యావేత్త చుక్కా రామయ్య లాంటి వారు రాసిన ‘అమెరికా పాఠం’ వంటి పుస్తకాల్లో ఆ దేశంలో విద్యకు ఇచ్చే ప్రాధాన్యతను చక్కగా వివరించినా.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. విద్యలో ఒకప్పుడు అమెరికా నాయకత్వ ధోరణిలో ఉన్నా.. ఇప్పుడు విద్యపై అప్పులు పెరుగుతున్నాయి. స్టూడెంట్ డెబ్ట్ ఇప్పుడు 1.7 ట్రిలియన్ డాలర్లను దాటినట్లు అంచనా. సగటు కాలేజీ విద్యార్థి 38 వేల డాలర్ల మేర అప్పును భరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం పాఠశాలల బడ్జెట్ను తగ్గిస్తోంది. ప్రైవేటు యూనివర్సిటీలు భారీ లాభాల్లో ఉంటున్నాయి. అమెరికాలో ఇప్పుడు విద్య అంటే ఆలోచనల సృష్టి కాదు. ఉద్యోగుల తయారీ వ్యాపారం అనే స్థాయికి చేరుకుంది. ఇక కాలుష్యంలోనూ అమెరికా అతిపెద్ద ఉత్పత్తిదారు కావడం తెలిసిందే. ఏటా 5 బిలియన్ టన్నుల మేర కార్బన్-డై-యాక్సైడ్ ఆ దేశంలో ఉత్పత్తి అవుతోంది. క్లైమేట్ యాక్షన్, పారిస్ ఒప్పందాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసేది కూడా అమెరికానే. ప్రపంచాన్ని పాలించాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతుంటే.. ఆ ప్రపంచాన్ని నాశనం చేసే రేంజ్లో కాలుష్యం వెదజల్లుతోంది అమెరికా..! ఇప్పుడు చెప్పండి.. ఇంతటి దరిద్రాలను కలిగి ఉన్న అమెరికాకు వెళ్లడం.. అక్కడ సెటిల్ అవ్వాలని, గ్రీన్కార్డు పొందాలని ఆశించడం సరైనదేనా?? -
విద్యుత్తు బిల్లులో అసమానతలు
అమెరికాలో గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు గుదిబండగా మారుతున్నాయి. గత ఐదేళ్లలో విద్యుత్ ధరలు ఆకాశాన్ని తాకగా ఈ భారం పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డేటా సెంటర్ల విద్యుత్ అవసరాలు పెరుగుతున్నప్పటికీ, వాటి ఖర్చును కూడా సామాన్య పౌరులే మోయాల్సి వస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆకాశాన్నంటుతున్న ధరలుఫిబ్రవరి 2020తో పోలిస్తే అమెరికా వ్యాప్తంగా విద్యుత్ ధరలు సగటున 40 శాతం పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా వాషింగ్టన్లో జులై 2020 నుంచి జులై 2025 మధ్య విద్యుత్ ఖర్చులు ఏకంగా 93 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) డేటా ప్రకారం 2022-2024 మధ్య..నివాస వినియోగదారుల విద్యుత్తు బిల్లులు 10 శాతం పెరిగాయి.వాణిజ్య వినియోగదారులపై 3 శాతం మాత్రమే పెరిగాయి.పారిశ్రామిక వినియోగదారులపై ధరలు 2 శాతం తగ్గాయి.డేటా సెంటర్లుచిన్నపాటి నగరాలకు సరిపోయే విద్యుత్తును వినియోగించే డేటా సెంటర్లు గ్రిడ్లోకి వస్తున్నా వాటికి తక్కువ ధరలకే విద్యుత్ అందుతోంది. ఈఐఏ గణాంకాల ప్రకారం, 2024 చివరి నాటికి నివాస వినియోగదారులకు యూనిట్ (కిలోవాట్-గంట) ధర 16 సెంట్లు ఉండగా వాణిజ్య వినియోగదారులకు అది 13 సెంట్లు మాత్రమే ఉంది.ఈ వ్యత్యాసానికి కారణాలునివాస ప్రాంతాలకు విద్యుత్ చేరవేయడానికి స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఖర్చు పెరిగింది. ఇవి తుఫానులు, అడవి మంటల వల్ల దెబ్బతింటే ఆ మరమ్మతు ఖర్చులు వినియోగదారులపైనే పడుతున్నాయి.డేటా సెంటర్లు నేరుగా హై-వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్లకు అనుసంధానమవుతాయి. తద్వారా పంపిణీ ఖర్చుల నుంచి తప్పుకుంటున్నాయి.పెద్ద కంపెనీలకు ఉన్న లాబీయింగ్ బలం సామాన్య ప్రజలకు ఉండదు. యుటిలిటీ రెగ్యులేటర్ల వద్ద కంపెనీలు తమకు అనుకూలమైన ధరలను సాధించుకోగలుగుతున్నాయి.గ్రిడ్ అప్గ్రేడ్ భారం ఎవరిది?ఇటీవల యూఎస్లో పీజేఎం అనే గ్రిడ్ ఆపరేటర్ 5 బిలియన్ డాలర్ల వ్యయంతో ట్రాన్స్మిషన్ లైన్ల అప్గ్రేడ్ ప్రాజెక్టును చేపట్టింది. డేటా సెంటర్ల వల్లేఈ అప్గ్రేడ్ అవసరం ఏర్పడినప్పటికీ వర్జీనియా, మేరీల్యాండ్ వంటి ప్రాంతాల్లో ఈ భారాన్ని నివాస వినియోగదారుల బిల్లుల్లో చేర్చడం వివాదాస్పదమైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నివేదిక ప్రకారం, అనేక యుటిలిటీ సంస్థలు మెటా వంటి దిగ్గజ కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. టెక్సాస్లో ఎల్ పాసో ఎలక్ట్రిక్ సంస్థ మెటా డేటా సెంటర్ కోసం ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఆ విషయాన్ని ప్రజల దృష్టికి రాకుండా దాచేందుకు ప్రయత్నించడం గమనార్హం.మార్పు దిశగా..ఈ అసమానతలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ లా స్కూల్ ఎక్స్పర్ట్ అరి పెస్కో మాట్లాడుతూ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత రెగ్యులేటర్లపై ఉందన్నారు. ఇప్పటికే వర్జీనియా రాష్ట్రం డేటా సెంటర్ల కోసం ప్రత్యేక వినియోగదారుల క్లాస్ను ఏర్పాటు చేసి గ్రిడ్ అప్గ్రేడ్ల కోసం వారి నుంచే ఎక్కువ వసూలు చేసేలా నిబంధనలు మార్చింది. విస్కాన్సిన్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. పెరుగుతున్న విద్యుత్ ధరలు అమెరికాలో ఒక ప్రధాన రాజకీయ, ఆర్థిక అంశంగా మారాయి. దీన్ని సరిదిద్దకపోతే ఓటర్ల ఆగ్రహం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: డిజిటల్ భారత్ ముంగిట ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’ విప్లవం -
అమెరికాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారు ఈ వారాంతంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న పిల్లలకు భోగి పండ్ల కార్యక్రమం చేశారు. స్థానిక సౌతెర్న్ పార్క్ వేలో ఉన్న సాయి మందిర్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కుటుంబాలు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నాయి.అమెరికాలోనే పుట్టి పెరిగిన చిన్నారులకు మన పండుగలు, సంప్రదాయాలు తెలిసేలా పండుగలను ప్రతీ యేటా నైటా నిర్వహిస్తోంది. రేగు పండ్లు, నాణేలు, పూలు, చెరకు ముక్కలతో భోగి పండ్లు పోసి, పిల్లలందరూ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దలందరూ దీవించారు.పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు, పైళ్ల సాధన మళ్లారెడ్డి పిల్లలందరికీ ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు అందరికీ నైటా తరపున బహుమతులు అందించారు. నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.(చదవండి: జపాన్లో ఘనంగా తెలుగువారి సంక్రాంతి సంబరాలు) -
బాబోయ్ ట్రంపూ.. అప్పుడే ఏడాది పూర్తి
2024 జనవరి 20.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వైట్హౌజ్లో అడుగు పెట్టిన రోజు. అమెరికా ఫస్ట్ నినాదంతో నెగ్గిన ఆయన.. దేశాన్ని ఓ గాడిన పెడతాడని, అదే సమయంలో అంతర్జాతీయంగా పెద్దన్న రోల్ను సమర్థనీయంగా పోషిస్తారని ఆనాడు అంచనాలు ఉండేవి. కానీ, ఒక సంవత్సరం గడిచేలోపే సీన్ సితార అయ్యింది. ట్రంప్ సంతకం చేసిన అనేక నిర్ణయాలు అమెరికాలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చలకు దారితీశాయి. వాటిలో చాలామట్టుకు ‘‘తల తిక్క’’ నిర్ణయాలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.. వలసవాదానికి చుక్కలు .. అధికారంలోకి రాగానే ట్రంప్ చేసిన మొదటి పని.. శరణార్థులపై కఠిన ఆంక్షల విధింపు. ఈ నిర్ణయంలో అక్రమ వలసవాదుల్ని వెతికి మరీ.. వాళ్ల వాళ్ల దేశాలకు డిపోర్ట్ చేశాడు. ఈ క్రమంలో బేడీలు వేసి.. కనీస వసతుల్లేని విమానాల్లో తరలించడం తీరు తీవ్రవిమర్శలు తావిచ్చింది. మానవ హక్కుల సంస్థలు వలసవాదులకు తలుపులు మూసేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. అయినప్పటికీ అమెరికా భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ సమర్థించుకున్నాడు.. ఇదేగాక.. వీసా టఫ్ రూల్స్.. అమెరికన్ల ఉద్యోగాల్ని రక్షించడం అనే పేరుతో.. హెచ్1బీ వీసా నియమాలను కఠినతరం చేశారు. ఫీజులు గణీయంగా పెంచారు. అధిక వేతన ప్రమాణాలు, కఠిన అర్హతలు, తక్కువ అనుమతులతో.. తీవ్ర చర్చనీయాంశంగా మారారాయన. ఈ నిర్ణయంతో.. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ప్రభావితమయ్యారు.ఆ దేశాలపై ట్రావెల్ బ్యాన్.. 2025 డిసెంబర్లో ట్రంప్ చేసిన ఒక ప్రకటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 39 దేశాల పౌరులపై అమెరికా ప్రవేశ నిషేధం విధించారాయన. అఫ్గన్ పౌరుడొకడు వాషింగ్టన్లో గన్ ఫైర్ ఎటాక్ జరపడమే ఇందుకు కారణం. ఈ లిస్టులో చాలా వరకు ముస్లిం దేశాలే ఉన్నాయి. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.టారిఫ్ కింగ్.. 2025లో ట్రంప్ను ప్రత్యేకంగా నిలిపింది ఏదైనా ఉందీ అంటే.. అది సుంకాల యుద్ధమే. తనకు నచ్చని.. తన మాట వినని దేశాలపై టారిఫ్ కొరడా ఝుళిపించారాయన. ఈ క్రమంలో.. చైనా, యూరప్, కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీ దిగుమతి సుంకాలు (tariffs) విధించారు. ట్రంప్ టారిఫ్ వార్లు అమెరికా పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రారంభమైనా, అవి గ్లోబల్ ట్రేడ్లో ఉద్రిక్తతలు, భారత్ లాంటి మిత్రదేశాలతో సంబంధాల క్షీణత, వినియోగదారులపై అదనపు భారాలు వంటి అనేక సమస్యలకు దారితీశాయి.ఫెడరల్ టు స్టేట్స్.. 2024 నవంబర్లో ట్రంప్ తన ఎన్నికల హామీలో.. విద్యాశాఖను పూర్తిగా రద్దు చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా.. అధికారంలోకి రాగానే ఆ పని చేశారు. 2025 మార్చి 20న ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసి, కేంద్ర(ఫెడరల్) విద్యాశాఖను మూసివేయడానికి అధికారిక ప్రక్రియను ప్రారంభించారు. ఫెడరల్ ప్రభుత్వంపై అనవసర భారం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. 40 ఏళ్లలో 3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. విద్యా నియంత్రణ రాష్ట్రాలకే ఉండాలి అనేది ఆయన వాదన. దీంతో ఆ దేశంలో కేంద్ర విద్యా శాఖ కనుమరుగు అయ్యే ప్రాసెస్ నడుస్తోంది. అయితే.. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భారం కానుంది.అదే సమయంలో.. ఇటు అమెరికా ఆరోగ్య శాఖ (Department of Health and Human Services – HHS)ను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. రెండో టర్మ్లో ఈ మేరకు ప్రతిపాదన కూడా చేశారు. ఆయన వాదన ప్రకారం, ఆరోగ్య విధానాలు రాష్ట్రాలకే అప్పగించాలి.. ఫెడరల్ స్థాయిలో ప్రత్యేక శాఖ అవసరం లేదు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. ప్రస్తుతానికి దాని అధికారాలు, నిధులు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒబామాకేర్( Affordable Care Act) రద్దు ప్రయత్నాలతో కలిపి, ఆరోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళిక మాత్రం రేపో మాపో అమలయ్యే ఛాన్స్ ఉంది.వీటితో పాటు ఐక్యరాజ్య సమితిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గప్పించడం.. నిధుల్ని తగ్గించడం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధుల్ని కోత వేసే ప్రయత్నాలు.. భారత్తో వాణిజ్య వివాదాలు.. పాక్తో మైత్రి, వెనెజువెలా అధ్యక్షుడ్ని బంధించి ఎత్తుకెళ్లి.. ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు మద్దతు.. ఆమెకు దక్కిన నోబెల్ మెడల్ను స్వీకరించడం.. “ఇకపై కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన బాధ్యత లేదు” అని వ్యాఖ్యలు చేయడం, ఇరాన్ నిరసనకారుల్ని రెచ్చగొట్టడం.. డెన్మార్క్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ గ్రీన్లాండ్ను చేజిక్కించుకునే ప్రయత్నాలు.. వీటికి తోడు ఫేక్ న్యూస్ అంటూ మీడియా సంస్థలపై దాడులు, దావాలు వేయడం.. ఈ ఏడాది కాలంలో కుటుంబ వ్యాపారాలు విపరీతమైన లాభాలు అర్జించి సంపద పెరగడం ట్రంప్ను తిట్టిపోసేలా చేశాయి. -
నితీశ్ రెడ్డి సెంచరీ.. అయ్యో పాపం!
ఐసీసీ అండర్–19 వన్డే ప్రపంచకప్లో సుదిని నితీశ్ రెడ్డి (133 బంతుల్లో 117 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ తెలుగు సంతతి కుర్రాడు... అండర్–19లో అమెరికా తరఫున సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. జింబాబ్వేలోని బులవాయో వేదికగా వరల్డ్కప్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో మ్యాచ్లో నితీశ్ సత్తా చాటాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. నితీశ్ ఒంటరి పోరాటంతో జట్టుకు మంచి స్కోరు అందించగా... శివ్ శని (33), అదిత్ (40) ఫర్వాలేదనిపించారు. అంతా మనోళ్లే అమెరికా జట్టులోని పదకొండు మంది ప్లేయర్లు భారత సంతతి ఆటగాళ్లే కాగా... కెప్టెన్ ఉత్కర్ష్ శ్రీవాస్తవ (0), సాహిల్ గార్గ్ (9), అమరిందర్ గిల్ (10), అదిత్ (6), అమోఘ్ రెడ్డి ఆరెపల్లి (0) విఫలమయ్యారు. మ్యాచ్ రద్దున్యూజిలాండ్ బౌలర్లలో ఫ్లిన్ మోరె 4, మాసన్ క్లార్క్ 3 వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 1 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు ఎంతకూ శాంతించకపోవడంతో పలుమార్లు పరిశీలించిన అనంతరం అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్ -
ట్రంప్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. ఇలా మోసం చేస్తాడనుకోలేదు
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు.. ప్రపంచాన్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకసారి సైనిక చర్యకు సిద్ధమని.. మరోసారి శాంతి చర్చలని.. ఇంకోసారి ఇరాన్ నాయకత్వాన్ని పొగుడుతూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టులే అందుకు కారణం. దీంతో ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఆయన సరిగా అంచనా వేయలేకపోయారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. అదే సమయంలో.. పోటస్(President of the United States) ట్రంప్ ఫేస్ చూసి ఇరాన్ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తమ దేశంలో తలెత్తిన సంక్షోభంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని.. ఖమేనీని గద్దె దించుతుందని.. తమకు స్వేచ్ఛ లభిస్తుందని వాళ్లు బలంగా నమ్మారు. ఆ ఆశతోనే నిరసనల్లో ఉవ్వెత్తున పాల్గొని మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలో ప్రాణాలు పోతున్నా.. అరెస్టులు జరిగినా లెక్క చేయలేదు. అయితే తమను ఇంతలా రెచ్చగొట్టిన ట్రంప్.. చివరకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని తిట్టిపోస్తున్నారు. ఆ ప్రకటన తర్వాతే.. మతపరమైన పాలనపై ఎప్పటి నుంచో ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి ఆర్థిక సంక్షోభం తోడైంది. సోషల్ మీడియా ప్రచారం ద్వారా డిసెంబర్ 28న రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనలు మొదలయ్యాయి. అదే సమయంలో వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య జరిపి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి తీసుకెళ్లింది. ఇది సాధారణంగానే ఇరాన్ ప్రజలకు ఆశలు పుట్టించింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు.. అప్పటికే రోడ్డెక్కిన ఆందోళనకారులకు ట్రంప్ ప్రకటనలు బలాన్ని ఇచ్చాయి. ‘‘సహాయం వస్తోంది.. నిరసనలు కొనసాగించండి’’ అని.. ‘‘లాక్డ్ అండ్ లోడెడ్’’ అంటూ చేసిన సో.మీ. పోస్టులు చూసి వేల మంది రోడ్డెక్కారు. అయితే నిరసనలు మళ్లీ ఉధృతం కావడంతో ఇరాన్ ప్రభుత్వం పాత పద్ధతులను అనుసరించింది. కమ్యూనికేషన్లు నిలిపివేయడం, భద్రతా బలగాలను మోహరించడం, కాల్పులు జరపడం. దేశవ్యాప్తంగా స్నైపర్ దాడులు, మెషిన్ గన్ కాల్పులు, వందలాది మరణాలు, అదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో.. ప్రజలు ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని బలంగా ఫిక్సయ్యారు. సరిగ్గా అప్పుడే..అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ నుంచి ఇరాన్కు యుద్ధ విమానాలు రెడీ ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఏ క్షణమైనా అమెరికా తమ భూభాగంపై దాడులు జరుపుతుందని ఆకాశం వంక చూడసాగారు. అనూహ్యంగా ట్రంప్ వెనక్కి తగ్గి.. ‘‘ఇరాన్ నాయకత్వం ఆందోళనకారుల ఉరి శిక్షలు ఆపుతామని హామీ ఇచ్చింది.. అందుకు కృతజ్ఞలు అని చెబుతూ సైనిక చర్య జరగదని పరోక్షంగా చెప్పేశారు. ఈ ప్రకటన ఇరాన్ నిరసనకారులకు గట్టి షాక్ ఇచ్చింది.ట్రంప్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఇరాన్ నిరసనలను కొందరు అధికారులు ఎగతాళి చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్నవాళ్లకు ఇక చుక్కలు చూపిస్తామంటూ కొందరు బాహటంగానే ప్రకటిస్తున్నారు. దీంతో చాలా మంది భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఇరాన్లో నిరసనలు చాలా వరకు చల్లారాయి. మళ్లీ జరుగుతాయో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలిపశువుల్ని చేశారా?ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని భావించామని.. కానీ, చివరకు ఆయనొక బిల్డప్ బాబాయ్గా తేలిపోయిందని గాలి తీస్తున్నారు ఇరాన్ ప్రజలు. ఓ అంతర్జాతీయ మీడియా అక్కడి ప్రజలను ఇంటర్వ్యూ చేసింది. ఆందోళనల్లో వేలమంది మరణించారు. ఆ మరణాలకు ట్రంపే బాధ్యుడు అంటూ ఓ వ్యాపారి తెలిపాడు. అమెరికా అధ్యక్షుడి పిలుపుతోనే వేలమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చివరికి ఆయన మా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మమ్మల్ని మోసం చేశాడు అని ఆరోపించింది మరో మహిళ. మరికొందరేమో.. ట్రంప్ తమను బలిపశువుల్ని చేశాడంటూ తిట్టిపోస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ట్రంప్ వెనకడుగు వ్యూహాత్మకమని.. ఇరాన్ ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేసి దెబ్బ తీస్తాడని చెబుతుండడం కొసమెరుపు. -
గ్రీన్లాండ్ వివాదం.. ట్రంప్నకు యూరప్ షాక్!
బెల్జియం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలింది. గ్రీన్లాండ్ దక్కించునేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. అందుకు ఒప్పుకోని యూరోపియన్ యూనియన్ దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగాడు. అయితే, ఈక్రమంలో ట్రంప్ బెదిరింపులకు తాము తలొగ్గబోమని, అవసరమైతే అమెరికాతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకుంటామంటూ యూరోపియన్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. అంతేకాదు, తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్ కంపెనీలపై సుంకాల పేరుతో ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలైలో అమెరికా-యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ ట్రంప్ తాజా బెదిరింపులు ఈ ఒప్పంద భవిష్యత్తుపై ఆందోళనలను రేకెత్తించాయి. ఫిబ్రవరి 1 నుంచి గ్రీన్లాండ్ కొనుగోలుకు ఒప్పుకోని డెన్మార్క్తో సహా ఎనిమిది దేశాలపై 10శాతం సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ ఒప్పుకోకపోతే, జూన్ నుంచి ఈ సుంకం 25 శాతం వరకు పెరుగుతుందన్నారు. గ్రీన్లాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకం. చైనా, రష్యా ఈ ప్రాంతంలో ఆధిపత్యం పెంచుతున్నందున గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవడం అమెరికాకు అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.ఈ క్రమంలో డెన్మార్క్తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఈయూ నాయకులు సైతం సోషల్ మీడియా వేదికగా..‘అమెరికా బెదిరింపులకు తలొగ్గం. అవసరమైతే ఒప్పందాలను రద్దు చేస్తాం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో యూరప్లో పనిచేస్తున్న అమెరికన్ కంపెనీలపై జరిమానాలు, నిషేధాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇది గూగుల్, మెటా, ఎక్స్ వంటి టెక్ దిగ్గజాలకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ట్రంప్ సైనిక చర్య తీసుకోవచ్చనే భయంతో జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్ గ్రీన్లాండ్లో దళాలను మోహరించాయి. డెన్మార్క్ కూడా తన సైనిక ఉనికిని పెంచుకుంది. ట్రంప్ సైనిక చర్య తీసుకుంటే నాటో కూటమి కూలిపోతుంది. ఈ పరిస్థితి ట్రాన్స్ అట్లాంటిక్ భద్రతా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.గ్రీన్లాండ్ వివాదం అమెరికా-ఈయూ సంబంధాలను కొత్త సంక్షోభంలోకి నెడుతోంది. ట్రంప్ సుంకాల బెదిరింపులు, ఈయూ ప్రతిస్పందన, సైనిక ఉద్రిక్తత అన్నీ కలిపి ఇరు దేశాల వాణిజ్య ఒప్పంద భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగంలో ప్రధాన చర్చగా మారనుంది. -
CBS న్యూస్ యాంకర్ కు ట్రంప్ టీమ్ వార్నింగ్
-
ట్రంప్ బెదిరింపులు.. మాక్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్లాండ్ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. గ్రీన్లాండ్ అంశంలో అమెరికా విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలను ట్రంప్ టార్గెట్ చేశారు. తాజాగా ఆయా దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పలు దేశాల అధినేతలు..కాగా, ట్రంప్ గ్రీన్లాండ్ అంశంపై చేసిన టారిఫ్ బెదిరింపులపై తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా స్పందించారు. మాక్రాన్ ట్విట్టర్ వేదికగా..‘ట్రంప్ టారిఫ్లు అంటూ ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అది ఉక్రెయిన్ అయినా, గ్రీన్లాండ్ అయినా, ప్రపంచంలోని మరెక్కడైనా సరే. ఈ తరహా పరిస్థితుల్లో మేం వెనక్కి తగ్గం. టారిఫ్ల పేరుతో ఒత్తిడి తేవడం సరికాదు. ఈ సందర్భంలో వాటికి ఎలాంటి స్థానం లేదు. అలాంటి బెదిరింపులు పూర్తిగా అంగీకరించే ప్రసక్తే లేదు’ అని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో టారిఫ్లు అమలయ్యే పరిస్థితి వస్తే యూరప్ దేశాలన్నీ కలిసికట్టుగా, సమన్వయంతో దీనికి తగిన సమాధానం ఇస్తాయని హెచ్చరించారు. గ్రీన్లాండ్తో పాటు ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఫ్రాన్స్ కట్టుబడి ఉందని మరోసారి ఆయన స్పష్టం చేశారు.France is committed to the sovereignty and independence of nations, in Europe and elsewhere. This guides our choices. It underpins our commitment to the United Nations and to its Charter.It is on this basis that we support, and will continue to support Ukraine…— Emmanuel Macron (@EmmanuelMacron) January 17, 2026ఫ్రాన్స్ ప్రాధాన్యం అదే.. మరోవైపు.. దేశాల సార్వభౌమత్వం, స్వతంత్రతకు ఫ్రాన్స్ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని మాక్రాన్ గుర్తు చేశారు. అదే సూత్రాల ఆధారంగానే ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచామని, భవిష్యత్తులో కూడా ఆ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ను గౌరవించడం ఫ్రాన్స్ విదేశాంగ విధానానికి మూలస్తంభమని ఆయన చెప్పారు. ‘యూరప్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశాల సార్వభౌమత్వం, స్వాతంత్ర్యం మా నిర్ణయాలకు మార్గదర్శకం. అదే కారణంగా ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచాం. శాంతి కోసం, భద్రత కోసం ఎంత దూరమైనా వెళ్తాం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. గ్రీన్లాండ్ విషయంలో వ్యతిరేకంగా ఉన్న డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలపై 10 శాతం సుంకం వర్తిస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరకులపై 10 శాతం అదనపు సుంకం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని శనివారం ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్లాండ్ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ ఒకటో తేదీకల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25శాతానికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. -
సిరియాపై ఉరిమిన అమెరికా .. ఉగ్ర నేత హతం!
డమాస్కస్: అల్-ఖైదా అనుబంధ నేతపై అమెరికా తన భీకర పంజా పంజా విసిరింది. ఇటీవల ఇద్దరు అమెరికన్ సైనికులు, ఒక పౌరుని మృతికి కారణమైన ఐసిస్ (ఐఎస్ఐఎస్)ఉగ్రవాదులతో సంబంధం ఉన్న అల్-ఖైదా నేతను లక్ష్యంగా చేసుకుని అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. శుక్రవారం సిరియాలో జరిపిన ఈ మెరుపు దాడిలో ఆ ఉగ్ర నేత హతమైనట్లు అధికారులు ధృవీకరించారు.ఈ ఆపరేషన్పై యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) కీలక వివరాలను వెల్లడించింది. జనవరి 16న జరిపిన ఈ దాడిలో ‘బిలాల్ హసన్ అల్-జాసిమ్’ అనే కీలక ఉగ్రవాద నేత హతమయ్యాడు. ఇతను ఉగ్ర దాడులకు కుట్రలు పన్నడంలో ఆరితేరినవాడని, 2025, డిసెంబర్ 13న సిరియాలోని పల్మైరాలో సార్జెంట్ ఎడ్గార్ బ్రియాన్ టోర్రెస్ టోవర్, సార్జెంట్ విలియం నథానియల్ హోవార్డ్, ఇంటర్ప్రెటర్ అయద్ మన్సూర్ సకత్లను బలిగొన్న ఐసిస్ ఉగ్రవాదితో ఇతనికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని సెంట్రల్ కమాండ్ పేర్కొంది.తమ పౌరుల మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని అమెరికా సెంట్-కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పేర్కొన్నారు. అమెరికన్ పౌరులు లేదా సైనికులపై దాడులకు ప్లాన్ చేసే వారికి, దాడులు చేసే వారికి ప్రపంచంలో ఎక్కడా సురక్షిత స్థానం ఉండదని, వారిని ఎక్కడున్నా వేటాడుతామని ఆయన హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు చేపట్టిన ‘ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్’లో భాగంగానే ఈ తాజా దాడి జరిగింది. బషర్ అసద్ పాలన ముగిసిన అనంతరం తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న ఐసిస్ మూకలను అణచివేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.జార్డాన్, సిరియా తదితర భాగస్వామ్య దేశాల సహకారంతో అమెరికా ఇప్పటివరకు 100కు పైగా ఐసిస్ మౌలిక సదుపాయాలు, ఆయుధ కేంద్రాలపై 200కు పైగా ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. గత ఏడాది కాలంలో సిరియా వ్యాప్తంగా 300 మందికి పైగా ఐసిస్ కార్యకర్తలను బంధించామని, ప్రాంతీయ భద్రతకు ముప్పుగా ఉన్న 20 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చామని సెంట్-కామ్ వెల్లడించింది. ఇది కూడా చదవండి: మిషన్ డాల్ఫిన్: నదీ గర్భంలో భారీ ‘ఆపరేషన్’ -
వెనెజువెలా అధ్యక్షురాలిపై... ఏళ్లుగా అమెరికా నిఘా!
వాషింగ్టన్: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్పై అమెరికా ఏళ్ల తరబడి నిఘా వేస్తూ వస్తోందా? తాజాగా వెలుగు చూసిన అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మిని్రస్టేషన్ (డీఈఏ) పత్రాలు అవుననే చెబుతున్నాయి. 2018లో ఉపాధ్యక్షురాలు అయినప్పటి నుంచే ఆమెకు సంబంధించిన అన్ని వివరాలనూ డీఈఏ సేకరిస్తూ వస్తున్నట్టు అవి వెల్లడించాయి. అంతేగాక రోడ్రిగ్జ్ను డీఈఏ తమ ‘ముఖ్యమైన లక్ష్యం’ జాబితాలో చేర్చింది కూడా! డ్రగ్ ట్రాఫికింగ్ మొదలుకుని బంగారం స్మగ్లింగ్ దాకా ఆమెపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఎప్పటికప్పుడు డీఈఏ ట్రాక్ చేస్తూ వస్తోంది. కరీబియన్ దీవుల్లోని ఇస్లా మార్గరీటా రిసార్టుల్లోని పలు హోటళ్లను మనీ లాండరింగ్కు కేంద్రాలుగా రోడ్రిగ్జ్ మలచుకున్నట్టు కూడా 2021 నాటి డీఈఏ రహస్య పత్రాలు పేర్కొన్నాయి. అయితే ఆమెపై అమెరికా ఇప్పటిదాకా ఎలాంటి నేరారోపణలూ చేయకపోవడం గమనార్హం. పైగా రోడ్రిగ్జ్ అద్భుత నాయకురాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పదేపదే కీర్తించడం తెలిసిందే. ఇటీవల వెనెజువెలా నియంత నికొలస్ మదురో దంపతులను అమెరికా నిర్బంధించి పదవీచ్యుతున్ని చేయడం తెలిసిందే. -
చందమామను చుట్టొచ్చేలా...
మనిషి చివరిసారిగా చంద్రునిపై దిగి 50 ఏళ్లు దాటింది. అర్ధ శతాబ్ది సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి ఆ ఫీట్ను పునరావృతం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆర్టెమిస్–2 స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్ శనివారం కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ ప్యాడ్కు చేరింది. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఫిబ్రవరి 6న ఆర్టెమిస్–2 ప్రయోగం జరగనుంది. దీనిద్వారా నలుగురు వ్యోమగాములు ఓరియాన్ స్పేస్ క్యాప్సూల్లో చంద్రుని చుట్టూ పరిభ్రమించి రానున్నారు. అమెరికాకు చెందిన నాసా కమాండర్ రీడ్ వైజ్మన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన జెరెమీ హన్సెన్ ఈ మిషన్లో భాగస్వాములు. ఓరియాన్ క్యాప్సూల్ భూ దిగువ కక్ష్యను దాటుకుని చంద్రుని చుట్టూ ఓ రౌండ్ కొట్టి భూమికి 10 రోజుల అనంతరం తిరిగి వస్తుంది. తద్వారా వ్యోమగాములు చంద్రునిపై దిగేందుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేస్తుంది. అనంతరం ఆర్టెమిస్–3 మిషన్లో భాగంగా వ్యోమగాములను చంద్రునిపై దింపాలన్నది నాసా లక్ష్యం. ఆర్టెమిస్–2 ఫలితాన్ని బట్టి 2027లో గానీ, 2028లో గానీ ఈ మిషన్ను చేపట్టే అవకాశముంది. నాసా చివరిసారిగా 1972లో అపోలో 17 మిషన్లో భాగంగా చంద్రునిపైకి వ్యోమగాములను పంపింది. ఆర్టెమిస్–2 ఎస్ఎల్ఎస్ రాకెట్ ఎత్తు ఏకంగా 100 మీటర్లు కావడం విశేషం. ఇక దీని బరువు 5,000 టన్నులు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో భారతీయుడికి జైలు శిక్ష
అమెరికా నుంచి రష్యాకు నిషేధిత విమానయాన పరికరాలను అక్రమంగా ఎగుమతి చేయడానికి కుట్ర పన్నినందుకు సంజయ్ కౌశిక్ అనే 58 ఏళ్ల భారత జాతీయుడికి రెండున్నరేళ్ల జైలు శిక్ష పడింది. ఈ వారం ప్రారంభంలో ఈ తీర్పు వెలువడగా, సంజయ్ కౌశిక్ చర్యలు “ఉద్దేశపూర్వకం, దురాశతో కూడివని ఒరెగాన్ యు.ఎస్. అటార్నీ స్కాట్ బ్రాడ్ఫోర్డ్ పేర్కొన్నారు.ఢిల్లీకి చెందిన కౌశిక్ 2023 సెప్టెంబర్లో ఇతరులతో కలిసి రష్యన్ సంస్థల కోసం అమెరికా నుండి ఏరోస్పేస్ వస్తువులు, సాంకేతికతను చట్టవిరుద్ధంగా పొందడానికి కుట్ర పన్నాడు. కౌశిక్, అతని సహచరులు ఒరెగాన్లోని సరఫరాదారు నుండి విమానాల కోసం నావిగేషన్, ఫ్లైట్ కంట్రోల్ డేటా అందించే పరికరం ‘యాటిట్యూడ్ అండ్ హెడింగ్ రిఫరెన్స్ సిస్టమ్’(AHRS)కొనుగోలు చేశారు.వాణిజ్య శాఖ అనుమతి లేకుండా ఇటువంటి పరికరాలను రష్యా వంటి కొన్ని దేశాలకు ఎగుమతి చేయడం చట్టవిరుద్ధం. లైసెన్స్ పొందేందుకు, కౌశిక్ తన భారతీయ కంపెనీ తుది కొనుగోలుదారు అని, పరికరాన్ని పౌర హెలికాప్టర్లలో ఉపయోగిస్తారని తప్పుడు వాదనలు చేశారు.కౌశిక్, అతని సహచరులు ఏహెచ్ఆర్ఎస్ పరికరాన్ని కొనుగోలు చేసిన తర్వాత, దాన్ని ఎగుమతి చేయకముందే అధికారులు పట్టుకున్నారు. 2024 అక్టోబర్లో మయామిలో కౌశిక్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుండి కస్టడీలో ఉన్నారు. -
నయా వలసవాద కేంద్రం అమెరికా
అమెరికా ఇటీవల కాలంలో తాను వేసుకున్న ముసుగును పూర్తిగా తొల గించి బాహాటంగానే దురాక్రమణ కాంక్షను వ్యక్తం చేస్తోంది. వరుసగా ఒక దేశం తరువాత మరొక దేశాన్ని ఆక్రమించడానికి వేగంగా పావులు కదుపుతోంది. వెనిజులా అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసి పట్టుకుపోవడం, గ్రీన్ల్యాండ్ తమదేనని ప్రకటించడం, తాజాగా ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు అండగా ఉంటామని ప్రకటించడం... ఇవన్నీ అమెరికా దూకుడును సూచించే అంశాలే. ముఖ్యంగా అణు పాటవం సంతరించుకోకుండా ఇరాన్ను అడ్డుకోవడం, దాని చమురు సంపదను చేజిక్కించుకోవడంపై అమెరికా ఎప్పటి నుంచో కన్నేసింది. దాని కొనసాగింపే ప్రస్తుత ఇరాన్ సంక్షోభం.2015 అణు ఒప్పందం నుండి అమెరికా ఏకపక్షంగా బయటకు రావడంతో ఇరాన్తో అమెరికా ఘర్షణ ముదిరింది. ఇరాన్కు చెందిన సుమారు 100 బిలియన్ డాలర్ల నిధులను అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా స్తంభింపజేయడమే కాకుండా, కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించింది. గడిచిన కొద్ది నెలలుగా ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో ఏడు బి–2 స్టెల్త్ బాంబర్లు, అత్యంత శక్తిమంతమైన 14 బంకర్ బస్టర్ బాంబర్లు, 30,000 పౌండ్ల మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఫోర్డో, నటాంజ్, ఇస్ప హాన్ వంటి కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 400 మందికి పైగా ఇరా నీయులు ప్రాణాలు కోల్పోగా, 3,000 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూల మధ్య ఇటీవల జరిగిన భేటీ పశ్చిమ ఆసియాలో యుద్ధ తీవ్రతను పెంచేలా ఉంది. గాజాలో ప్రతిఘటనను తుడిచిపెట్టడమే కాకుండా, ఇరాన్ పుంజుకుంటే తీవ్రంగా దెబ్బతీస్తామని వారు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఇరాన్ లోపల వ్యూహాత్మక అల్లర్లు ప్రారంభమయ్యాయి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న కరెన్సీ విలు వపై ప్రజల్లో అసహనం పెంచుతూ నిరసనలను, సమ్మెలను అమెరికా ప్రోత్సహిస్తోంది. శాంతియుత నిరసనల ముసుగులో జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటికే వందలాదిమంది మర ణించారు. నిరసనకారులకు అమెరికా బాసటగా నిలుస్తామని ప్రకటించడం వెనుక ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టే పక్కా ప్లాన్ ఉంది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురి పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఆర్థిక విధ్వంసం – చమురు రాజకీయం 2025 జూన్ నాటి యుద్ధ పరిస్థితులు, చమురు ధరల పతనం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. నిత్యా వసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజల జీవన ప్రమా ణాలు పడిపోయాయి. విద్యుత్ కోతలు పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీయగా, వాతావరణ మార్పుల వల్ల వర్షాలు లేక వ్యవసా యోత్పత్తి తగ్గి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అమెరికా చర్యలను ఇరాన్ నేత ఖమేనీ తీవ్రంగా ఖండిస్తున్నారు. పాత కాలపు షా రాజరికం లాంటి బానిసత్వాన్ని ‘నయా వలస వాదం’ రూపంలో అమెరికా మళ్లీ రుద్దాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. దేశంలోని కార్పొరేట్ శక్తులు తమ స్వార్థం కోసం అమెరికా, ఐరోపా దేశాలతో చేతులు కలుపు తున్నాయనీ, దీనివల్ల కార్మికులు, గ్రామీణ ప్రజలపై భారం పెరుగుతోందనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచ ముడిచమురు నిల్వల్లో ఇరాన్ వాటా 13 శాతం ఉండగా, అమెరికా అడుగులకు మడుగులొత్తే సౌదీ అరేబియా వద్ద 16 శాతం నిల్వలు ఉన్నాయి. వెనిజులా నిల్వలను కూడా కలిపితే, ప్రపంచ చమురులో 50 శాతాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని అమెరికా ఆశిస్తోంది. రష్యా, చైనాలు అమెరికా చర్యలను ఖండించే ప్రకటనలకే పరిమితం అవుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగకపోవడం గమనార్హం.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తన గూఢ చారి సంస్థ ‘సీఐఏ’ ద్వారా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేసింది. 1954లో గ్వాటెమాల, 1963లో ఈక్వె డార్, 1964లో బ్రెజిల్, 1973లో చిలీ... ఇలా సుమారు 20కి పైగా దేశాల్లో అమెరికా తన తోలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు కుట్రలు చేసింది. క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రోను హతమార్చేందుకు 621 సార్లు విఫలయత్నం చేయడం అమెరికా దురహంకారానికి పరాకాష్ఠ. డ్రగ్స్పై పోరాటం పేరుతో మెక్సికో, కొలంబియా వంటి దేశాల్లో అరాచ కాలు సృష్టించింది. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ట్యారిఫ్ యుద్ధాలు, సైనిక బెదిరింపులతో నూతన సామ్రాజ్యవాదాన్ని విస్తరించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. బుడ్డిగ జమిందార్వ్యాసకర్త ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం’జాతీయ కార్యవర్గ సభ్యులు -
ట్రంప్ టారిఫ్ బెదిరింపు..
-
అమెరికా ‘కస్టడీ’లో ఇద్దరు భారత విద్యార్థులు
న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. సెయింట్ లూయిస్ పార్క్లోని ఓ ప్రముఖ భారతీయ రెస్టారెంట్లో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్కడ పనిచేస్తున్న పలువురు సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు.. ఇద్దరు భారతీయ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతోనే ఈ ఇద్దరు విద్యార్థులను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఈ విద్యార్థులు తమ వీసా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నందువల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతర్జాతీయ విద్యార్థులకు ఉపాధి కల్పిస్తున్న ప్రదేశాలపై ఇటీవలి కాలంలో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిఘా పెంచారు. గత కొన్ని నెలలుగా అనధికారిక ఉపాధి,వీసా నిబంధనల అమలుపై ఐసీఈ అధికారులు పలు రాష్ట్రాల్లో ఈ తరహా చర్యలను ముమ్మరం చేశారు. BREAKINGICE reportedly detained two Indian students at an Indian restaurant in St. Louis Park yesterday afternoon.STUDENTS, BE VERY CAREFUL. DO NOT TAKE UP ANY PART TIME JOBS THAT ARE NOT LEGALLY ALLOWED. pic.twitter.com/WmEwnAAIVf— M9 USA🇺🇸 (@M9USA_) January 16, 2026విద్యార్థులు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తుండటానికి తోడు తాజా అరెస్టులతో అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మరింతగా పెరిగింది. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, నిపుణులు భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సరైన అనుమతులు లేకుండా క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయడం లాంటి పొరపాట్లు చేయవద్దని సూచిస్తున్నారు. ఇటువంటి ఉల్లంఘనలు.. డిటెన్షన్, వీసా రద్దు లేదా దేశ బహిష్కరణ వంటి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: కెనడాలో హత్య చేసొచ్చి.. పంజాబ్లో హల్చల్! -
ఖమేనీ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో నిరసనల్లో అరెస్టైన వందలాది మందిని ఉరి తీయాలని తొలుత అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ పరిణామం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే.. ఏమైందోగానీ వాటిని వాయిదా వేసింది. అయితే.. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేసిందట. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా ప్రకటించారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇలా చెప్పుకొచ్చారు.. నిన్న జరగాల్సిన 800కిపైగా ఉరి శిక్షలను ఇరాన్ నాయకత్వం రద్దు చేసింది. ఈ పని చేసినందుకు ధన్యవాదాలు. ఈ చర్యతో వాళ్లపై గౌరవం పెరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. నిన్న మొన్నటిదాకా సైనిక చర్యకు ఉవ్విళ్లూరిన ట్రంప్.. హఠాత్తుగా ఇలా వెనక్కి తగ్గడం అమెరికా–ఇరాన్ సంబంధాల విషయంలో ఒక కొత్త మలుపు అనే చెప్పొచ్చు.ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలు, రాజకీయ ఆంక్షలు, మహిళల స్వేచ్ఛ అణచివేత.. ఈ కారణాలతో ఇరాన్ వ్యాప్తంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వం గద్దె దిగాలని.. బహిష్కృత యువరాజు రెజా పహ్లావి తిరిగి ఇరాన్లో అడుగుపెట్టాలని నినాదాలతో ప్రధాన నగరాలను అట్టుడికి పోయేలా చేశారు. అయితే వేలాది మంది నిరసనకారులు అరెస్టు అయ్యారు. వాళ్లను విదేశీ శక్తులకు సహకరించే శక్తులుగా పేర్కొంటూ ఉరి తీయాలని ఖమేనీ ప్రభుత్వం, అక్కడి న్యాయవ్యవస్థ నిర్ణయించింది. ఇదీ చదవండి: ఎప్పుడేం చేయాలో ట్రంప్నకు తెలుసు ‘‘ఇంటర్నెట్ బ్లాకౌట్ జరిగిన వెంటనే.. 3 వేల మంది విదేశీ గూఢచారులను అరెస్టు చేశాం. గూఢచర్యం నేరానికి ఇరాన్లో మరణశిక్ష ఉంటుంది. మేం అరెస్టు చేసిన విదేశీయులంతా నిరసనకారుల ముసుగులో అల్లర్లను రెచ్చగొట్టారు. వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులు’’ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి.అమెరికా అధ్యక్షుడు కూడా ముందుగా ఇరాన్ చర్యలపై హెచ్చరికలు జారీ చేసి.. శిక్షలు అమలు చేస్తే సైనిక చర్యలు తీసుకోవచ్చని సూచించారు. అదే సమయంలో ఇరాన్తో చర్చలు ఉండొచ్చనే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఆందోళనకారుల విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ ప్రకటించడంతో ఆయన మరోసారి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయితే ఈ విషయంలో ఇరాన్ అనూహ్యంగా వెనక్కి తగ్గడం, ట్రంప్ ధన్యవాదాలు తెలపడం ఒక విధంగా ఉద్రిక్తతలను తగ్గించే సంకేతంగా కనిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వం విషయంలో ఏం జరిగిందో ఎవరికీ స్పష్టత లేదు. గల్ఫ్ దౌత్యం చేశాయని ప్రచారం ఉంది. అయితే ఎలాంటి ఒప్పందం కుదిరిందో(అణు చర్చకు సంబంధించి), లేదంటే చర్చల పురోగతిలో ఇది ముందడుగు మాత్రమేనా? అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ తాను చేసిన ఒత్తిడి వల్లే ఇరాన్ ఈ నిర్ణయం వెనక్కి తీసుకుందని కలరింగ్ ఇచ్చుకునే అవకాశం ఉంది. మరోవైపు.. అంతర్జాతీయంగా ట్రంప్పై ఒత్తిడి తెచ్చి ట్రంప్ను వెనక్కి తగ్గేలా చేశామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించుకుంది కూడా. కొసమెరుపు.. ఒకవైపు నిరసనకారుల మరణశిక్ష విషయంలో ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గగా.. వారందరినీ చంపేయాలంటూ అక్కడి మత పెద్ద ఒకరు ఫత్వా జారీ చేశారు. రాజధాని టెహ్రాన్కు చెందిన అహ్మద్ ఖటామీ అనే మతాధికారి శుక్రవారం ప్రార్థనల అనంతరం.. ‘‘ఇది దేవుని తీర్పు. అల్లాహ్ మా వెనక ఉన్నాడు. ఇరాన్ ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి మానసికంగా సిద్ధంగా ఉంది’’ అంటూ జనం కోలాహలం మధ్య ప్రకటించాడు. -
కెనడా, చైనా స్నేహగీతం
బీజింగ్: కెనడా క్రమంగా అమెరికాకు దూరమవుతూ చైనాకు దగ్గరవుతోంది. చైనా నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ వాహనాలపై టారిఫ్లను 100 శాతం తగ్గించనున్నట్టు కెనడా ప్రధాని మార్క్ కార్నీ శుక్రవారం ప్రకటించారు. కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై చైనా ఇప్పటికే టారిఫ్లను 84 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఇరుదేశాల నేతలు రెండు రోజుల క్రితం బీజింగ్లో సమావేశమయ్యారు. వాణిజ్య బంధం బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఐదేళ్లలో చైనా నుంచి 70 వేలకు పైగా ఈవీలను దిగుమతి చేసుకుంటామని కార్నీ వెల్లడించారు. గత రెండు రోజులు చరిత్రాత్మక, ఫలవంతమైన దినాలు అంటూ వ్యాఖ్యానించారు. కెనడాతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తామని చైనా అధినేత జీ జిన్పింగ్ స్పష్టంచేశారు. గత ఏడాది అక్టోబర్లో మార్క్ కార్నీతో సమావేశమయ్యాయని, చైనా–కెనడా సంబంధాల్లో అప్పుడే నూతన అధ్యాయం ప్రారంభమైందని స్పష్టంచేశారు. గత ఎనిమిదేళ్లలో చైనాలో పర్యటించిన తొలి కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ రికార్డుకెక్కారు. వాస్తవానికి కెనడా, చైనాల మధ్య టారిఫ్ల యుద్ధం నడిచింది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత కెనడా ప్రభుత్వం చైనా వైపు మొగ్గుచూపుతోంది. -
అమెరికాతో అత్యుత్తమ వాణిజ్య ఒప్పందం
తైపీ: అమెరికాతో అత్యుత్తమ వాణిజ్య ఒప్పందం కుదిరిందని తైవాన్ ప్రధాని చో టుంగ్–టై ప్రకటించారు. అమెరికాతో వాణిజ్యంలో మిగులు ఉన్నప్పటికీ ఈ ఒప్పందం కుదరడంపై హర్షం వ్యక్తం చేశారు. తాజా ఒప్పందం ప్రకారం తైవాన్ ఉత్పత్తులపై 15 శాతం వరకు టారిఫ్లు తగ్గుతాయి. ప్రతిగా అమెరికాలో 25 వేల కోట్ల డాలర్ల మేర తైవాన్ కంపెనీలు పెట్టుబడులుగా పెడతాయి. ఇప్పటికే అమెరికా యూరోపియన్ యూనియన్, జపాన్లతో ఇలాంటి ఒప్పందాలే కుదుర్చుకుంది. ట్రంప్ ప్రభుత్వం తైవాన్పై వాస్తవానికి 32 శాతం టారిఫ్లను విధించింది. ఆ తర్వాత దానిని 20 శాతానికి తగ్గించింది. కాగా, తైవాన్తో అమెరికా తాజా వాణిజ్య ఒప్పందాన్ని చైనా వ్యతిరేకించింది. తమ భూభాగమైన తైవాన్తో దౌత్య సంబంధాలను నెలకొల్పుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామంది. -
జంతువులా ఈడ్చుకెళ్లారు
వాషింగ్టన్: అమెరికాలో ఒక మహిళను ఇమిగ్రేషన్ అధికారులు కారులోనుంచి బలవంతంగా బయటకు లాగి అరెస్టు చేసి, చేతులు పట్టుకొని బరబరా ఈడ్చుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. అలియా రెహ్మాన్(42) అమెరికా పౌరురాలు. ఇక్కడే జన్మించారు. మిన్నెపొలిస్ నగరంలో నివసిస్తున్నారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీ సెంటర్లో చికిత్స కోసం ముందే అపాయింట్మెంట్ తీసుకున్నారు. మంగళవారం కారులో అక్కడికి బయలుదేరారు. మధ్యలో ముఖాలకు మాస్క్లు ధరించిన ఇమిగ్రేషన్ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఆమె కూర్చున్నవైపు కారు అద్దం పగులగొట్టారు. సీటు బెల్ట్ను కట్ చేశారు. డ్రైవర్ సీటు గుండా ఆమెను బయటకు లాగారు. కాళ్లు చేతులు పట్టుకొని ఈడ్చుకెళుతూ తమ వాహనంలోకి ఎక్కించారు. డిటెన్షన్ సెంటర్కు తరలించారు. ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని, వదిలిపెట్టాలని రోదిస్తూ వేడుకున్నా కనికరించలేదు. కనీసం చికిత్స అందించే ఏర్పాటు కూడా చేయలేదు. దాంతో బాధితురాలు చాలాసేపు స్పృహ కోల్పోయారు. చివరకు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తాను ఇప్పటికీ బతికి ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని అలియా రెహ్మానచెప్పారు. ఒక జంతువును ఈడ్చుకెళ్లినట్లుగా తనను ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు. మిన్నెపొలిస్లో అక్రమ వలసదారులపై ఇమిగ్రేషన్ అధికా రులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. వారిని గుర్తించడానికి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను డిటెన్షన్ కేంద్రాలకు తరలించి ప్రశి్నస్తున్నారు. మరోవైపు వలసదారులకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి. -
ఇరాన్పై దాడులు లేనట్లే!
వాషింగ్టన్: ఇరాన్ విషయంలో పూర్తి సంయమనం పాటించాలని అమెరికాతో సన్నిహితంగా మెలిగే పలు మధ్య ప్రాచ్య దేశాలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇరాన్పై దాడులు చేయొద్దని అమెరికాను కోరినట్లు అరబ్ దౌత్యవేత్త ఒకరు చెప్పారు. అయతొల్లా అలీ ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్పై సైనిక చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా సంకేతాలిస్తున్నారు. నిరసనకారులపై దమనకాండ ఆపకపోతే భీకర దాడులకు దిగుతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల ఈజిప్టు, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయాదేశాల అత్యున్నత దౌత్యవేత్తలు తాజాగా సమావేశమై చర్చించుకున్నారు. ఇరాన్పై ఇప్పుడు సైనిక చర్యకు పాల్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను మరింత అస్థిరంగా మార్చొద్దని విన్నవించారు. మధ్యప్రాచ్య దేశాల విజ్ఞప్తిని ట్రంప్ మన్నించినట్లే కనిపిస్తోంది. ఆయన కొంత మెత్తబడ్డారు. ఇరాన్పై దాడులకు దిగే ఆలోచన లేదని ప్రకటించారు. సానుకూల సంకేతాలు రావడంతో గురువారం చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. 26 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ సుల్తానీకి విధించిన మరణ శిక్షను ఇరాన్ ప్రభుత్వం రద్దు చేయడంపై ఫాక్స్న్యూస్లో ప్రచురితమైన వార్తను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఎప్పుడేం చేయాలో ట్రంప్కు తెలుసు మరోవైపు వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ భిన్న స్వరం వినిపించారు. ఇరాన్ను డీల్ చేసే విషయంలో అన్ని రకాల ఐచి్ఛకాలు ట్రంప్ చేతిలో ఇప్పటికీ ఉన్నాయని స్పష్టంచేశారు. ఎప్పుడేం చేయాలో ఆయనకు తెలుసని ఉద్ఘాటించారు. ఇరాన్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు. ఆగని ఆందోళనలు ఇరాన్లో పరిస్థితులు కుదుటపడే సూచనలు కనిపించడం లేదు. ఖమేనీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం వీధుల్లోకి వచి్చ, ఖమేనీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటిదాకా కనీసం 2,637 మంది మరణించారు. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని స్థానిక ప్రసార మాధ్యమాలు చెబుతున్నాయి. ఆ ఆలోచన ఇంకా ఉంది ఇరాన్ సైనిక చర్య అనే ఆలోచన ఇంకా ఉందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ పేర్కొన్నారు. గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశం జరిగింది. అమెరికాతోపాటు ఇరాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మైక్ వాల్జ్ వ్యాఖ్యానించారు. ఇరాన్లో ప్రజల ఊచకోతను ఆపడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అందుకోసం అన్ని రకాల అవకాశాలను ఆయన ఉపయోగించుకుంటారని, ఆ విషయం ఇరాన్ నాయకత్వానికి బాగా తెలుసని స్పష్టంచేశారు. -
పురుషులు గర్భం దాల్చగలరా? భారత సంతతి వైద్యురాలు ఏమన్నారంటే..
అమెరికాలోని డిర్క్సెన్ సెనేట్ కార్యాలయంలో జరిగిన "మహిళల రక్షణ: కెమికల్ అబార్షన్ డ్రగ్స్ ముప్పు" అనే అంశంపై జరిగిన చర్చ వివాదాస్పదంగా మారింది. మందుల ద్వారా జరిగే అబార్షన్ నుంచి మహిళలను కాపాడటం.. అనే అంశంపై సెనేట్లో జరుగుతున్న చర్చకు భారత సంతతి గైనకాలజిస్ట్, డాక్టర్ నిషా వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెనేటర్కు, డాక్టర్ మధ్య జరిగిన వాగ్వాదం హాట్టాపిక్గా మారి చర్చనీయాంశమైంది.ఆ ఒక్క ప్రశ్నతో దద్దరిల్లిన పార్లమెంట్..చర్చలో భాగంగా సెనేటర్ జోష్ హాలే నేరుగా డాక్టర్ నిషా వర్మను ఉద్దేశించి.. " మగవారు గర్భం దాల్చగలరా ?" అని ప్రశ్నించారు. అందుకు ఆమె నేరుగా అవును లేదా కాదు అని సమాధానం చెప్పకుండా దాటవేస్తూ.. తాను మహిళలుగా గుర్తింపులేని వివిధ జెండర్ ఐడెంటిటీలు ఉన్న రోగులకు కూడా చికిత్స అందించాను అని బదులిచ్చారు. ఆ సమాధానంపై తీవ్ర అసంతృప్తికి గురైన సెనేటర్ హాలే తాను అడిగిన ప్రశ్న..సైన్స్, జీవశాస్త్ర వాస్తవాలకు సంబంధించినదని, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన పని లేదంటూ మండిపడ్డారు. దాంతో డాక్టర్ నిషా వర్మ తన వాదనను కొనసాగిస్తూ.. ఇలాంటి ప్రశ్నలను ముమ్మాటికి రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటారంటూ ధ్వజమెత్తారామె. అంతేగాదు తాను సైన్స్ నమ్మే వ్యక్తినని, రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే రోగులకు చికిత్స అందిస్తుంటాను. ఆ నేపథ్యంలోనే ఈ చర్చలో పాల్గొనేందుకు వచ్చాను. కానీ ఇలాంటి ప్రశ్నలు పక్కదారి పట్టిస్తాయంటూ ఘాటుగా సమాధానమిచ్చారు నిషా. అయితే "జీవశాస్త్రపరంగా పురుషులు గర్భం దాల్చలేరనే కనీస సత్యాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు.. కాబట్టి మిమ్మల్ని సైన్స్ తెలిసిన వ్యక్తిగా ఎలా నమ్మాలి?" అంటూ హాలే ఆగ్రహం వ్యక్తం చేశారు. అబార్షన్ మందుల భద్రతపై ఆందోళనకేవలం జెండర్ వివాదమే కాకుండా అబార్షన్ కోసం వాడే మందుల భద్రతపై కూడా సెనేటర్ హాలే కీలక గణాంకాలను ప్రస్తావించారు. "అబార్షన్ డ్రగ్స్ వాడటం వల్ల 11 శాతం కేసుల్లో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని సైన్స్ చెబుతోంది. ఇది ఎఫ్డీఏ లేబుల్పై ఉన్న దానికంటే 22 రెట్లు ఎక్కువ" అని ఆయన ఆరోపించారు. మరోవైపు డాక్టర్ నిషా వర్మ ఈ వాదనను తోసిపుచ్చారు. 2000 సంవత్సరంలో ఆమోదం పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 75 లక్షల మందికి పైగా ఈ మందులను సురక్షితంగా వాడారని, వందకు పైగా అత్యున్నత స్థాయి సమీక్షలు ఈ మందులు సురక్షితమని నిరూపించాయని ఆమె చెప్పడం విశేషం. కేవలం రాజకీయ కారణాల వల్లే అబార్షన్ హక్కులపై ఆంక్షలు విధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారామె. ఇంతకీ ఎవరీ భారత సంతతి వైద్యురాలు నిషా వర్మ..ఆమె ఎవరంటే..నిషా వర్మ నార్త్ కరోలినాలోని గ్రీన్స్బోరోలో భారత వలస తల్లిదండ్రులకు జన్మించారు. ఆమె జీవశాస్త్రం,మానవ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, కరోలినా విశ్వవిద్యాలయం నుంచి వైద్య డిగ్రీ (MD)ని పొందారు.ఆమె బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్లో ఇంటర్న్షిప్ OB/GYN (ప్రసూతి మరియు గైనకాలజీ) రెసిడెన్సీని పూర్తి చేసింది. వర్మ ఆ తర్వాత కాంప్లెక్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫెలోషిప్ను పూర్తి చేసి ఎమోరీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MPH) డిగ్రీని పొందారు.ఆమె డబుల్-బోర్డ్-సర్టిఫైడ్ ప్రసూతి వైద్యురాలు, పైగా కుటుంబ నియంత్రణలో స్పెషలిస్ట్ కూడా. వర్మ ప్రస్తుతం జార్జియాలో సమగ్ర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణపై ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె ఫిజిషియన్స్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్లో ఫెలో కూడా.అంతేగాదు ఆమె అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG)లో రిప్రొడక్టివ్ హెల్త్ పాలసీ అండ్ అడ్వకేసీకి సీనియర్ అడ్వైజర్గా పనిచేయడమే గాక ఎమోరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో అనుబంధ అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తోందామె. Sen. Hawley: “Can men get pregnant?”Dr. Nisha Verma: “I'm not really sure what the goal of the question is.”Sen. Hawley: “The goal is just to establish a biological reality...Can men get pregnant?”pic.twitter.com/exjxLqJBTC— America (@america) January 14, 2026 (చదవండి: అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారుపు గాజులను'..) -
నిరసనకారులను చంపేయండి
టెహ్రాన్: ఇరాన్లో నిరసనలు చేస్తున్న వారందరినీ చంపేయాలంటూ అక్కడి మత పెద్ద ఒకరు ఫత్వా జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం మతాధికారి అహ్మద్ ఖటామీ ఈ మేరకు మరణ ఆజ్ఞలను విడుదల చేశారు. ‘‘ఇది దేవుని తీర్పు’’ అని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. శుక్రవారం ఆయన టెహ్రాన్లో జరిగిన ప్రార్థనలకు నాయకత్వం వహించారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక రేడియో వెల్లడించింది. నిరసనకారులను ఉరితీయాలంటూ ఖటామీ ఫత్వాను జారీ చేయగానే.. ఆ ప్రాంగణం కేరింతలతో మార్మోగిపోయింది. ఇదే వేదికపైనుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కూడా ఖటామీ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘అల్లాహ్ మా వెనక ఉన్నాడు. ఇరాన్ ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి మానసికంగా సిద్ధంగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.ఇరాన్పై దాడిని వాయిదా వేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్న మర్నాడే.. ఖటామీ నుంచి ఈ తరహా ఫత్వా జారీ కావడం గమనార్హం..! గల్ఫ్ దేశాలు ముక్తకంఠంతో కోరడంతో.. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోగా.. ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీ ఊపిరి పీల్చుకున్నాడు. మరోవైపు ఇరాన్లోని భారతీయులను తరలించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలను ప్రారంభించింది. అటు ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో ఇరాన్ ఉప రాయబారి గులాం హుస్సేన్ దర్జీ ప్రస్తుత పరిస్థితులపై ఓ ప్రకటన చేశారు. తమ దేశంలో గందరగోళానికి అమెరికానే కారణమని ఆరోపించారు. ఇరాన్లో జరుగుతున్న అల్లర్ల వెనక అమెరికా వ్యూహాత్మక హస్తముందని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా మళ్లీ ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీపై గుర్రుగా ఉన్నట్ల తెలుస్తోంది. ఇరాన్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై ట్రంప్ సీరియస్ అయినట్లు సమాచారం. ఇదెలా ఉండగా.. ఇంటర్నెట్ బ్లాకౌట్ జరిగిన వెంటనే.. 3 వేల మంది విదేశీ గూఢచారులను అరెస్టు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) అధికారులు ప్రకటించారు. గూఢచర్యం నేరానికి ఇరాన్లో మరణశిక్ష ఉంటుంది. తాము అరెస్టు చేసిన విదేశీయులంతా నిరసనకారుల ముసుగులో అల్లర్లను రెచ్చగొట్టారని, వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులని ఆరోపించారు. -
5,200 ఏళ్ల నాటి పడవ గుర్తింపు, సూపర్ టెక్నాలజీ
ఈజిప్టు పిరమిడ్ల కంటే పురాతనమైన పడవను అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విస్కాన్సిన్లోని పరిశోధకులు మెన్డోటా సరస్సులో 5,200 సంవత్సరాల పురాతన ఈ పడవను గుర్తించారు. ఇక్కడ మొత్తం 16 పురాతన బోట్లను గుర్తించడం విశేషం. న్యూస్వీక్ నివేదిక ప్రకారం ఉత్తర అమెరికాలోని విస్కాన్సిన్ హిస్టారికల్ సొసైటీ (WHS) పరిశోధకులు మెన్డోటా సరస్సులో 5,200 సంవత్సరాల పురాతన పడవను కనుగొన్నారు. మెన్డోటా సరస్సులో మొత్తం 16 పురాతన బోలు చెక్క పడవలను పరిశోధకులు గుర్తించారు. ఈ పడవలలో పురాతనమైనది ఈజిప్టులోని గిజా పిరమిడ్ ఉనికిలో ఉండటానికి ముందు కాలం నాటిదని పరిశోధకులు చెబుతున్నారు. గతంలో అనుకున్న దానికంటే చాలా ముందుగానే జీవించి వ్యవస్థీకృత సమాజాలుగా అభివృద్ధి చెందారని వెల్లడిస్తుందని చెప్పారు.ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచిసహజంగా రేడియోధార్మిక మూలకం ఎంతవరకు క్షీణించిందో చూడటానికి కలపను పరీక్షించినప్పుడు, ఈ పడవలు 1300AD , 3000BC మధ్య నిర్మించబడ్డాయని తేలింది. మెండోటా సరస్సు కింద కనుగొనబడిన ఆవిష్కరణలు శాస్త్రవేత్తలు ఉత్తర అమెరికాలో ప్రారంభ మానవ జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.వేల ఏళ్లకుముందే ప్రపంచవ్యాప్తంగా మానవ పడవ తయారీ నైపుణ్యాలు అభివృద్ధి గురించి వివరించింది. ఈ పడవలు 5,200 సంవత్సరాల క్రితం గ్రేట్ లేక్స్ ప్రాంతంలో ప్రజలు ఎలా ప్రయాణించారు, ఎలా నివసించారో ఇది వెల్లడిస్తుంది. ముఖ్యంగా ఆ కాలంలోనే ఇక్కడి ప్రజలు బలమైన, మన్నికైన ఓడలను నిర్మించేంత అవగాహన , సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం విశేషం.2021లో శాస్త్రవేత్తలు 1,200 సంవత్సరాల నాటి మొదటి పడవను కనుగొన్నారు. 3,000 సంవత్సరాల నాటి మరో పడవను 2022లో కనుగొన్నారు. ఆ తర్వాత మరో పద్నాలుగు పడవలు గుర్తించారు. వాటిలో ఆరు 2025లో కనుగొనబడ్డాయి. 16 పడవలలో రెండు మాత్రమే నీటి నుండి బయటకు తీశారు. వీటిలో దాదాపు 3,000 సంవత్సరాల నాటి 14 అడుగుల పొడవైన పడవ కూడా ఉంది. ఇవి ఎక్కువగా ఎరుపు , తెలుపు ఓక్ వంటి గట్టి చెక్కలతో తయారు చేసినవి. పడవల పైన రాళ్లను జాగ్రత్తగా ఉంచారట. శీతాకాలంలో పడవ తయారీకి ఉపయోగించే చెక్క వంకర పోకుండా చూసుకోవడానికి ఈజాగ్రత్త తీసుకుని ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. అలాగే WHS బృందం ఓక్ను ఉపయోగించడం అసాధారణ మని పేర్కొంది. సాధారణంగా చెట్టుకు ఉండే ఓపెన్ పోర్స్ నీటిని గ్రహిస్తాయి. ఇవి పడవలు మునిగిపోకుండా తేలియాడేలా చేస్తుంది.ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి -
Trumpపై న్యాయవ్యవస్థ సీరియస్
-
ట్రంప్కు నోబెల్ బహుమతి..!
-
భారత వలసదారులపై కోపమెందుకు?
అమెరికా అభివృద్ధిలో భాగస్వాములైన భారతీయ వలసదారులు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా అత్యంత శాంతియుతమైన, విజయవంతమైన వర్గంగా పేరుగాంచిన భారతీయులపై ఇటీవల కాలంలో ఆన్లైన్ వేదికగా, రాజకీయంగా అసహనం పెరుగుతోంది. అమెరికాను వివిధ సంస్కృతుల కలయికగా అభివర్ణించే ‘మెల్టింగ్ పాట్’(Melting Pot- వివిధ సంస్కృతుల సమ్మేళనం) సిద్ధాంతానికి ఈ పరిణామాలు సవాలుగా మారుతున్నాయి.ఆన్లైన్ వేదికలపై..2025 నుంచి సోషల్ మీడియాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హెచ్-1బీ వీసా నిబంధనలపై జరుగుతున్న చర్చలు ద్వేషపూరిత వ్యాఖ్యలకు దారితీస్తున్నాయి. అమెరికా టెక్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే తప్పుడు ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగ మార్కెట్లో వస్తున్న మార్పులు కూడా వలసదారులపై వ్యతిరేకత పెరగడానికి కారణమవుతున్నాయి.రాజకీయ దుమారంప్రస్తుత అమెరికా రాజకీయ పరిణామాలు భారతీయుల్లో మరింత అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి. అక్కడి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (JD Vance) గతంలో చేసిన ‘అధిక సంఖ్యలో ఉన్న వలసల వల్ల అమెరికా ప్రయోజనాలు నీరుగారుతున్నాయి’ అనే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ క్రమంలో ఆయన భార్య భారత సంతతికి చెందిన ఉషా వాన్స్ కూడా ఆన్లైన్లో ట్రోల్ అయ్యారు. నిక్ ఫ్యుయెంటెస్ వంటి తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు ఉషా వాన్స్ను లక్ష్యంగా చేసుకుని జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. దీనిపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకుడు వివేక్ రామస్వామి ఘాటుగా స్పందించారు. ఇటువంటి ద్వేషపూరిత భావజాలానికి పార్టీలో చోటు ఉండకూడదని స్పష్టం చేశారు.చారిత్రక పునరావృతంచరిత్రను గమనిస్తే అమెరికాలో ఆర్థిక మాంద్యం లేదా ఉద్యోగాల కోత ఉన్న సమయాల్లో వలసదారులపై దాడులు పెరగడం కొత్తేమీ కాదు. గతంలో ఐరిష్, ఇటాలియన్, జపనీస్ వలసదారులు కూడా ఇటువంటి వివక్షను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం భారతీయుల పట్ల కనిపిస్తున్న అసహనం కూడా అటువంటి ఆర్థిక అభద్రతాభావం నుంచే పుట్టుకొస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.తాజా గణాంకాల ప్రకారం వివక్ష ఇలా..49 శాతం భారతీయ అమెరికన్లు గడిచిన ఏడాది కాలంలో ఏదో ఒక రూపంలో వివక్షను ఎదుర్కొన్నారు. చర్మం రంగు, భాష యాస, మతపరమైన ఆచారాల ఆధారంగా భారతీయులను వేరుగా చూస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తున్న భారతీయ నిపుణులపై ఈ విధమైన అసహనం ప్రదర్శించడం ఇరు దేశాల సంబంధాలపైనే కాకుండా, అమెరికా ప్రజాస్వామ్య విలువలపై కూడా ప్రభావం చూపుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం వలసదారులను విమర్శించడం ఆపేయాలని, ఆన్లైన్లో ద్వేషాన్ని అరికట్టాలని పౌర సమాజం కోరుతోంది.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్! -
ఏ క్షణమైనా.. అమెరికా.. ఇరాన్ యుద్ధం..!
-
ఇజ్రాయెల్లోని ఇండియన్స్కు అలర్ట్..
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఇజ్రాయెల్కు అనవసరమైన ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది.ప్రస్తుతం ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయులు అందరూ స్థానిక అధికారులు, ఇజ్రాయెల్ హోం ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్ను కచ్చితంగా పాటించాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారతీయులు ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయ 24x7 హెల్ప్లైన్ నంబర్లు +972-54-7520711, +972-54-3278392 సంప్రదించాలని తెలిపింది.పెరుగుతున్న ఉద్రిక్తతలుఇరాన్లో విస్తృత స్థాయిలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ జారీ అయింది. ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా అవకాశం కొట్టిపారేయకపోవడంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా దాడి చేస్తే ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారతాయని ఇరాన్ హెచ్చరించింది.ఈ పరిణామాల ప్రభావంతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్తో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాల్లో ప్రజా ఆశ్రయాలను తెరవాలని స్థానిక అధికారులు ఆదేశించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.టర్కీకి చెందిన అనడోలు ఏజెన్సీ ప్రకారం, దక్షిణ ఇజ్రాయెల్లోని డిమోనా నగరంలో “అనూహ్య పరిస్థితులకు సిద్ధంగా ఉండటం మంచిది” అనే ఉద్దేశంతో అన్ని ప్రజా ఆశ్రయాలను తెరవాలని మేయర్ ఆదేశాలు జారీ చేశారు.ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు ప్రయత్నాలుఇరాన్లో పరిస్థితులు అస్థిరంగా మారుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి భారతీయులను తరలించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఇరాన్లో నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారత పౌరులకు ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశాన్ని విడిచిపెట్టాలని, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. -
ఉక్రెయిన్ రాజధానిలో.. ఇజ్రాయెల్ రాయబారుల ‘గజగజ’..!
కీవ్: ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్లో ఇజ్రాయెల్ రాయబారులు గజగజ వణికిపోతున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారిక వార్తాసంస్థ ‘యెదువోత్ అహ్రోనోత్’ స్వయంగా పేర్కొంది. ప్రస్తుతం కీవ్లో మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రష్యా భారీ దాడులతో అక్కడ వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అంతేకాదు.. మూడ్రోజులుగా ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా లేదు. దీంతో.. ఇజ్రాయెల్ రాయబారులు చలికి గజగజ వణికిపోతున్నారు.ఇజ్రాయెల్ రాయబారి మైఖేల్ బ్రాడ్స్కీ ఈ సందర్భంగా వైనెట్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘కీవ్ ఇప్పుడు ఘోస్ట్ సిటీగా మారిపోతోంది. విద్యుత్తు లేకపోవడంతో.. హీటర్లు పనిచేయక ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగునీటి సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో.. పరిసర నగరాలకు తరలిపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు. యుద్ధం కొనసాగుతున్నా.. తాము రాయబార కార్యాలయ విధులకు ఆటంకం కలిగించడం లేదని, అయితే.. మౌలిక సదుపాయాలు మృగ్యమవ్వడంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించారు. ‘మేము ఉంటున్న అపార్ట్ మెంట్లలో విద్యుత్తు లేదు. బయట మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. దాంతో వెచ్చని కోట్లు ధరించి గడపాల్సి వస్తోంది. శీతాకాలం చలికి తోడు.. రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. ఉక్రెయిన్లో ఉంటున్న ఇజ్రాయెలీలకు రక్షణ కల్పించేందుకు మేము మా వంతు కృషి చేస్తున్నాం’ అని ఆయన వివరించారు.దీనిపై కీవ్ మేయర్ మాట్లాడుతూ రష్యా దాడులతో వేల మంది పౌరులు చీకట్లో మగ్గిపోతున్నారని, చలికి వణుకుతున్నారని వాపోయారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కాగా.. రష్యా ప్రయోగించిన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఓర్ష్నిక్’ కారణంగా కీవ్లోని విద్యుత్తు వ్యవస్థ చాలా వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే.. పౌరులకు ఇబ్బందులు కలగకుండా జనరేటర్లను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
చెలరేగిన భారత బౌలర్లు.. 107 పరుగులకే అమెరికా ఆలౌట్
అండర్-19 ప్రపంచకప్లో భాగంగా బులవాయో వేదికగా అమెరికాతో జరగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు యువ భారత బౌలర్ల ధాటికి 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా టీమిండియా పేసర్ హెనిల్ పటేల్ అద్భుతమైన బౌలింగ్తో అమెరికా నడ్డి విరిచాడు.హెనిల్ 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. అమరీందర్ గిల్, అర్జున్ మహేష్ వంటి కీలక వికెట్లను హెనిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు దీపేష్, అబ్రిష్, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలా వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్ సుదిని (36) టాప్ స్కోరర్గా నిలివగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.తుది జట్ల వివరాలు:భారత్: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, హెనిల్ పటేల్, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వాన్ష్ పంగాలియా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్, ఖిలాన్ పటేల్అమెరికా: సాహిల్ గార్గ్,అమరీందర్ గిల్, అర్జున్ మహేష్,ఉత్కర్ష్ శ్రీవాస్తవ,అద్నిత్ జంబ్, అమోఘ్ ఆరేపల్లి, నితీష్ సుదిని, ఆదిత్ కప్పా, శబరీష్ ప్రసాద్, రిషబ్ షింపీ, రిత్విక్ అప్సిడి -
ట్రంప్ టారిఫ్లు.. కేంద్రానికి శశిథరూర్ కీలక సూచన
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపులపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల మన ప్రాంతీయ పోటీదారులతో పోలిస్తే భారత్ ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే సమయంలో అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం విషయంలో ఆలస్యం చేయవద్దని శశిథరూర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.అమెరికా సుంకాలపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఈ సందర్బంగా శశిథరూర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు భారత్పై 50 శాతం సుంకాలు విధించారని.. మళ్లీ ఇరాన్తో వ్యాపారం విషయంలో 25 శాతం సుంకాలు విధిస్తున్నారన్నారు. ఇన్ని టారిఫ్లను తట్టుకొని 75 శాతం సుంకాలతో అమెరికాకు మన ఉత్పత్తులను ఎగుమతి చేయడం సాధ్యమైనంత ఈజీ కాదు. భారీ నష్టాలు ఎదురవుతాయని హెచ్చరించారు.ఇదే సమయంలో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా రాయబారి సెర్గియో గోర్ సహకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఇరాన్ పై దాడులకు అమెరికా రెడీ!
-
ట్రంప్ వార్నింగ్తో వెనక్కి తగ్గిన ఇరాన్?
అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఇరాన్లో నిరసనకారులకు మరణదండన శిక్షలు వాయిదా పడ్డట్లు ప్రకటించారు. అదే సమయంలో.. సైనిక చర్య ఆలోచనను విరమించుకున్నారన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. మరోవైపు.. ఇరాన్ సైతం ఆందోళనకారులను ఉరి తీసే ఆలోచనను ప్రస్తుతానికైతే పక్కన పెట్టినట్లు ధృవీకరించింది. ‘‘ముఖ్యమైన వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలు నిలిపిశారని.. అలాగే మరణశిక్షణలను కూడా వాయిదా వేసినట్లు తెలిసింది’’ అని వాషింగ్టన్లో మీడియా ప్రతినిధులతో ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంతో సైనిక చర్యపై వెనక్కి తగ్గుతారా? అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. అక్కడి ప్రభుత్వం నిరసనకారుల్ని హత్యలు చేస్తోంది. ఇప్పుడు వాటిని ఆపేసింది. ఇలాంటి టైంలో వేచి చూసే ధోరణి అవలంభించాలనుకుంటున్నాం అని అన్నారు. దీంతో.. ఏ క్షణమైనా ఇరాన్పై దాడి చేయవచ్చనే సంకేతాన్ని అలాగే ఉంచారు.ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కఠినంగా అణచివేస్తున్నది తెలిసిందే. ఇప్పటివరకు 18,000 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఘర్షణల్లో మరణాల సంఖ్య 2,600 దాటిందని.. 3,000 మందికి పైగా మరణించారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో జరిగిన అత్యంత ఘోర నిరసనలలో ఒకటిగా భావిస్తున్నారు. అయితే.. అరెస్టైన నిరసనకారుల్ని దేశద్రోహులుగా పరిగణిస్తూ న్యాయవిచారణ జరపకుండానే మరణశిక్ష అమలు చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వరుసలో ఇర్ఫాన్ సోల్తానీ పేరు ప్రముఖంగా వినిపించింది. న్యాయపరంగా ఎలాంటి సాయం అందకుండా చేసి.. కేవలం 10ని. మాట్లాడుకోవడానికి కుటుంబానికి అనుమతిచ్చి.. సోల్తానీని ఉరి తీసేందుకు బుధవారం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చివరి నిమిషంలో ఆ ఉరి వాయిదా పడింది. నార్వేలోని హ్యూమన్ రైట్స్ సంస్థ హెన్గావ్ ప్రకారం.. సోల్తానీకి విధించబోయే శిక్షను వారంపాటు వాయిదా వేసినట్లు సమాచారం. అందుకు గల కారణాలకు మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ట్రంప్ వార్నింగ్ ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఇరాన నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని.. అవసరమైతే సైనిక చర్యలకు దిగుతామని ఖమేనీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైన సాయం పంపిస్తాం అంటూ ఆందోళనలను ప్రొత్సహిస్తున్నారు. అయితే కఠిన మార్గాలు ఆయన ఉద్దేశాలు కావని.. ఏదైనా సామరస్యంగా పరిష్కారం కావాలనే కోరుకుంటున్నారని వైట్హౌస్ ప్రతినిధి కరోలైన్ లేవిట్ విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి సైతం ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు. నిరసనలతో సంబంధం ఉన్నవాళ్లకు మరణదండనలు అమలు చేయాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. వాళ్లను ఉరి తీసేందుకు ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేయలేదు అని ఆయన ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఇరాన్ న్యాయవ్యవస్థ మాత్రం వేగంగా విచారణలు జరిపి శిక్షలు అమలు చేయాలని చూస్తోంది. -
‘అప్పుడు మిస్సయిన బుల్లెట్ ఇప్పుడు దిగుతుంది’
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చుతామని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థలు బహిరంగంగా ప్రసారం చేయడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఇంకా గుర్తుండగానే ఈ బెదిరింపు వెలువడింది. ఆ ఏడాది జూలై 14న పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఆయన చెవికి గాయమైంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రక్షణగా చేరి ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు అక్కడికక్కడే హతమార్చాయి.ఇప్పుడు అదే ఘటనకు సంబంధించిన ఫొటోలు, విజువల్స్తో ఇరాన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తూ..‘గతంలో బుల్లెట్ మిస్సైంది.. ఇక మిస్సవ్వదు, ఖచ్చితంగా లక్ష్యాన్ని తాకుతుంది’ అంటూ ట్రంప్ను బహిరంగంగా బెదిరించింది. దాడులకు దిగితే ఇరాన్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందనే అంచనాతో అమెరికా అప్రమత్తమైంది. మధ్యప్రాచ్యంలో తన సైనిక స్థావరాలను ఖాళీ చేస్తోంది. ఈ తరుణంలో ఇరాన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ఇరాన్పై సైనిక దాడులు చేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, టెహ్రాన్ ఇప్పటివరకు చేసిన అత్యంత బహిరంగ బెదిరింపులలో ఈ ప్రసారం ఒకటిగా నిలిచింది. అదే సమయంలో, అమెరికా తమ దేశంలో అంతర్గత అశాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ప్రభుత్వ అవినీతి కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రకటనలు దేశంలో ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. ట్రంప్పై ఇరాన్ మీడియా చేసిన బెదిరింపులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
అండర్-19 ప్రపంచకప్లో నేడు తొలి మ్యాచ్.. అందరి చూపు వైభవ్వైపే..!
జింబాబ్వే, నమీబియా వేదికలుగా నేటి నుంచి (జనవరి 15) అండర్-19 క్రికెట్ వరల్డ్కప్-2026 ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 16 జట్లు పోటీపడుతున్నాయి. భారత్–యూఎస్ఏ మ్యాచ్తో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుండగా, టాంజానియా తొలిసారి అండర్-19 వరల్డ్కప్లో అడుగుపెట్టింది.23 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్లు జరుగనున్నాయి. 16 జట్లు 4 గ్రూప్లుగా (గ్రూప్కు 4) విభజించబడి పోటీపడతాయి. అనంతరం సూపర్-6, సెమీస్, ఫైనల్ జరుగుతాయి. గ్రూప్ల వివరాలు- గ్రూప్ A: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జపాన్ - గ్రూప్ B: భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అమెరికా - గ్రూప్ C: జింబాబ్వే, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్ - గ్రూప్ D: వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, టాంజానియా ఈ టోర్నీలో భారత్కు అద్భుతమైన రికార్డు ఉంది. మొత్తం ఐదు సార్లు టైటిల్ గెలిచింది. గత ఎడిషన్ (2024) ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్కు ఆయుశ్ మాత్రే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు. యువ భారత జట్టులో మరి కొంతమంది గమనించదగ్గ ఆటగాళ్లు ఉన్నారు. ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిగ్యాన్ కుందు, దీపేశ్ దేవేంద్రన్, హెనిల్ పటేల్, అంబ్రిష్ లాంటి వారు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నారు. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, రోహిత్ శర్మ లాంటి వారు అండర్-19 ప్రపంచకప్లో మెరిసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. అందుకే ఈ టోర్నీకి చాలా ప్రత్యేకత ఉంది.ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు భారత్ (5) కాగా.. ఆస్ట్రేలియా 4, పాకిస్తాన్ 2, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ తలో సారి టైటిళ్లు గెలిచాయి. ఈ మెగా టోర్నీ భారత అభిమానుల కోసం JioHotstar యాప్, వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇవాళ జరిగే భారత్-యూఎస్ఏ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం కానుంది. బులవాయోలోని క్వీన్స్ క్లబ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
దాడులకు అమెరికా రెడీ!
దుబాయ్/వాషింగ్టన్/బ్యాంకాక్/న్యూఢిల్లీ: ఇరాన్తో వాణిజ్యంచేసే దేశాలపై పాతిక శాతం సుంకాలువేసి టారిఫ్ల కొరడా ఝళిపించిన ట్రంప్ సేన హఠాత్తుగా సుంకాల మాటెత్తకుండా సైన్యంతో దండెత్తబోతోందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఖతార్లోని అమెరికా సైనిక స్థావరం నుంచి పెద్దసంఖ్యలో బలగాలు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తమ బలగాలపై ఇరాన్ దాడి చేయొచ్చనే ముందస్తు అంచనాతోనే తమ సైన్యాన్ని స్థావరం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని, దాడి ఉద్దేశం తమకు లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఆందోళనకారులపై కాల్పులు జరిపితే కన్నెర్ర జేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు ఏకంగా తమ స్థావరం మీదనే ఇరాన్ దాడులకు దుస్సాహసం చేస్తే చూస్తూ ఊరుకోబోడని, ఇరాన్ కంటే ముందే దాడులతో విరుచుకుపడతాడని అంతర్జాతీయ యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇరాన్లో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. తొలుత వందల్లో కన్పించిన మరణాలు ఇప్పుడు వేలల్లో తేలుతున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం పరిపాలనా బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మొదలైన ఆందోళనల్లో, పోలీసులతో ఘర్షణల్లో ఇప్పటిదాకా 2,571 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 2,403 మంది ఉద్యమకారులు కాగా 147 మంది పోలీసులు ఉన్నారు. ఉద్యమంలో పాల్గొనని, అభంశుభం ఎరుగని 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు సైతం ఈ ఘర్షణల్లో చనిపోయారని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘ ది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజె న్సీ’ బుధవారం ప్రకటించింది. ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచేస్తున్న ప్రభుత్వం ఇప్పటిదాకా 18,100 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. దీటుగా బదులిస్తాం.. దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికాకు దీటుగా బదులిస్తామని ఖమేనీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖమేనీ సలహాదారు అలీ షామ్ఖానీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘గతంలో ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేశామని ప్రగల్భాలు పలికే ట్రంప్.. మేం మీ అల్ ఉదేయిద్ స్థావరంపై క్షిపణులతో దాడి చేసి వినాశనం సృష్టించిన విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు?. ఆనాటి మా దాడి మా సంకల్పం, సామర్థ్యాలకు బలమైన నిదర్శనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టార్లింక్ నుంచి ఉచిత ఇంటర్నెట్ సేవలు ఉద్యమకారులపై పోలీస్ల దమనకాండతో రక్తసిక్తమవుతున్న ఇరాన్లో వాస్తవ పరిస్థితులు ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిచిపోవడంతో ఎప్పటికప్పుడు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎలాన్ మస్్కకు చెందిన స్టార్లింక్ సంస్థ ఉచితంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందిస్తోందని ఉద్యమకారులు బుధవారం వెల్లడించారు. అయితే ఈ వార్తలను స్టార్లింక్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ‘‘టెహ్రాన్ ఫోరెన్సిక్ వైద్య కేంద్రం వరండాలో వరసబెట్టి మృతదేహాలు పడి ఉన్నాయి. ఇలాంటి దారుణోదంతాలను బయటి ప్రపంచానికి తెలియజేయాలంటే కనీసం ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. ఈ విషయంలో స్టార్లింక్ పాత్ర కీలకం’’ అని ఇరాన్లోని మెహ్దీ యాహ్యానిజాద్ అన్నారు.ఇరాన్ను వీడాలన్న భారత్పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇరాన్లోని తమ పౌరులు, భారతీయు లు వెంటనే దేశం వీడాలని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఉద్యమస్థలాల వైపు వెళ్లొద్దని, ఎంబసీ వద్ద తమ పేర్లను నమోదుచేసుకోవాలని తమ పౌరులకు రాయబార కార్యాలయం సూచించింది. మరోవైపు ఇరాన్కు ప్రయాణాలను వాయిదావేసుకోవాలని భారత్లోని పౌరులకు భారత విదేశాంగ శాఖ ఒక సూచన చేసింది. -
ఇరాన్పై ఇప్పుడే దాడి చేయొద్దు: ట్రంప్ను కోరిన అరబ్ దేశాలు
ఇరాన్పై సైనిక దాడి చేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇజ్రాయెల్తో పాటు కొన్ని అరబ్ దేశాలు కోరినట్లు ఎన్బిసి న్యూస్ నివేదించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం ఇంకా అమెరికా దాడితో కూలిపోయేంత బలహీనంగా లేదని ఈ దేశాల అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.ఇరాన్లో ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా నిరసనకారుల హత్యలపై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన క్రమంలో ఈ నివేదిక వెలువడింది.నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్లో పాలన మార్పునకు అనుకూలంగా ఉన్నప్పటికీ, కేవలం విదేశీ సైనిక దాడితో ఆ లక్ష్యం సాధ్యం కాదని అమెరికా అధికారులకు స్పష్టం చేశారు. అలాంటి దాడి ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడం కన్నా పరిస్థితిని మరింత సంక్లిష్టతరం చేసే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.సైనిక చర్యలకు బదులుగా, ఇరాన్ ప్రభుత్వాన్ని లోపలినుంచి బలహీనపరిచే వ్యూహాలపై దృష్టి పెట్టాలని ఇజ్రాయెల్ సూచించింది. ఇందులో కమ్యూనికేషన్ బ్లాక్అవుట్లను ఎదుర్కొనేందుకు ఇరానియన్ ప్రజలకు సహాయం చేయడం, ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడం, సైబర్ దాడులు నిర్వహించడం, అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఉన్నతాధికారులపై పరిమిత చర్యలు తీసుకోవడం వంటి అంశాలు ఉన్నాయి.ప్రస్తుతం ఇరాన్పై అమెరికా నేతృత్వంలో దాడి చేపట్టేందుకు పొరుగు దేశాల మద్దతు లేదని ఒక అరబ్ అధికారి పేర్కొన్నారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రతీకార చర్యలు చోటు చేసుకునే అవకాశం ఉందని, అలాగే ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ఏకమయ్యే ప్రమాదం కూడా ఉందని మరో అరబ్ అధికారి హెచ్చరించారు. -
ఎర్ర సముద్రంలోకి అమెరికా నౌక..
ఇరాన్పై యుద్ధం దిశగా అమెరికా సన్నాహాలను వేగవంతం చేస్తోంది. యూఎస్ విమాన వాహక నౌక రూజ్ వెల్ట్ ఇటీవలే ఎర్ర సముద్రంలోకి ప్రవేశించింది. ఈ మేరకు యూఎస్ సైనిక అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.అదే సమయంలో, మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా సైన్యానికి చెందిన ఒక జలాంతర్గామితో పాటు మూడు క్షిపణి విధ్వంసక నౌకలు కూడా మోహరించబడి ఉన్నాయని ఆ వార్తాపత్రిక తెలిపింది. ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేపట్టవచ్చిన చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు పెంటగాన్ పలు ఎంపికలను సమర్పించింది. వీటిలో సైబర్ దాడులు అలాగే హోంల్యాండ్ సెక్యూరిటీ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే చర్యలు కూడా ఉన్నట్లు సమాచారం.ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో, ఎర్ర సముద్రం, మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికిని బలోపేతం చేయడం ద్వారా తమ మిత్ర దేశాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్కు అనుబంధంగా ఉన్న సాయుధ గుంపులు వాణిజ్య నౌకలపై దాడులు పెంచుతున్న నేపథ్యంలో, సముద్ర మార్గాల రక్షణకు ఈ మోహరింపు కీలకంగా మారింది.ఇదిలా ఉండగా, ఇరాన్తో ప్రత్యక్ష సైనిక ఘర్షణకు దిగకుండా ఒత్తిడి పెంచడమే అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచుతూనే, అవసరమైతే సత్వర స్పందనకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపడమే ఈ సైనిక కదలికల ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలు ప్రాంతీయ రాజకీయాలపై, అలాగే ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్
దుబాయ్: తమ దేశంలోని నిరసనకారులకు మద్దతు తెలుపుతూ పదే పదే జోక్యం చేసుకుంటున్న అమెరికాను ఇరాన్ మరోసారి హెచ్చరించింది. అమెరికా తమపై దాడికి యత్నించాలనే యత్నిస్తే అంతకుమించి ఎదురుదాడులకు దిగుతామని ఇరాన్ స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా సైనికా దళానికి పొరుగు దేశాలు ఏమైనా సహకారం అందిస్తే మాత్రం ఆ స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లతో దాడులకు దిగుతామని పేర్కొంది. ఇరాన్కు సమీపంలో అత్యాధునిక డ్రోన్ల నిఘాను అమెరికా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం హీటెక్కింది. ఏ క్షణంలోనైనా ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. అమెరికా గనుక వెనక్కి వెళ్లకపోతే మాత్రం మూల్యం చెల్లించుకుంటారని ఇరాన్ హెచ్చరించింది. కాగా, గత కొంతకాలంగా వెనిజులా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ తన వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు నిరంతర నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) రకానికి చెందిన డ్రోన్. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరంగా 24 గంటల పాటు ఇది ఎగరగలదు. సముద్ర ప్రాంతాల్లోని కదలికలను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం.


