breaking news
USA
-
ట్రంప్ నిర్ణయానికి సవాల్.. మమ్దానీ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికాలో వలసదారుల అంశంపై రాజకీయ వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. వలసదారుల డిపోర్టేషన్ అంశంపై కేంద్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తత మళ్లీ పెరిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలస విధానానికి సంబంధించి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర్పును అమలు చేయబోమని మమ్దానీ ప్రకటించారు.వలస విధానాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించేలా అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ట్రంప్ సర్కార్కు అనుకూలంగా తీర్పును వెల్లడించింది. హైతీ, సిరియా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు ఇప్పటివరకు లభిస్తున్న టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) రక్షణను రద్దు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ, ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది ఒక్కసారిగా డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్రంప్ ప్రభుత్వం "చట్టానికి దక్కిన విజయం"గా అభివర్ణిస్తుండగా.. మానవ హక్కుల సంఘాలు మాత్రం "వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయం" అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీర్పు తర్వాత డిపోర్టేషన్ ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఈ పరిణామంపై న్యూయార్క్ మేమర్ మమ్దానీ తాజాగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. న్యూయార్క్ నగరం సాంక్చువరీ సిటీ విధానాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ఫెడరల్ డిపోర్టేషన్ చర్యలకు నగర యంత్రాంగం సహకరించబోదని స్పష్టం చేశారు. హైతీ మరియు సిరియా వలసదారుల రక్షణకు కట్టుబడి ఉన్నామని బాంబు పేల్చారు. అవసరమైతే చట్టపరమైన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. దీంతో, ఫెడరల్ ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాల మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.సాంక్చువరీ సిటీ విధానం అంటే? అమెరికాలో వలసదారులపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో తరచుగా వినిపిస్తున్న పదం “సాంక్చువరీ సిటీ విధానం” (Sanctuary City Policy). ఇది ఫెడరల్ వలస అమలు సంస్థలతో సహకారాన్ని పరిమితం చేసి, వలసదారులకు స్థానిక స్థాయిలో కొంత రక్షణ కల్పించే విధానం. స్థానిక నగర ప్రభుత్వాలు అమలు చేసే విధానం ఇది. ఇందులో భాగంగా స్థానిక పోలీసులు వలస స్థితిని అడగరు. చిన్న కేసుల్లో వలస ఆధారంగా డిటైన్ చేయరు. ఫెడరల్ డిపోర్టేషన్ అభ్యర్థనలకు పూర్తిగా సహకరించరు. అయితే తీవ్రమైన నేరాల కేసుల్లో మాత్రం ఫెడరల్ ఏజెన్సీలకు సమాచారం ఇవ్వవచ్చు.TPS అంటే ఏంటంటే.. 1990లో అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, తీవ్ర రాజకీయ అస్థిరత లేదంటే మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాల పౌరులకు అమెరికా తాత్కాలిక రక్షణ(Temporary Protected Status.. TPS) కల్పిస్తుంది. ఈ హోదా పొందిన వ్యక్తులను వారి స్వదేశాలకు బలవంతంగా పంపించరు. అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది గ్రీన్కార్డు లేదంటే పౌరసత్వానికి మార్గం కాదు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ప్రభుత్వం ఈ హోదాను రద్దు చేయవచ్చు. అయితే 2010లో సంభవించిన భారీ భూకంపం తర్వాత హైతీ పౌరులకు టీపీఎస్ ఇచ్చారు. 2012లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడి ప్రజలకు కూడా ఈ రక్షణ కల్పించారు. అనంతరం ఆయా దేశాల్లో పరిస్థితులు పూర్తిగా మెరుగుపడకపోవడంతో వరుస ప్రభుత్వాలు ఈ గడువును పొడిగిస్తూ వచ్చాయి.ఎంతమందిపై ప్రభావమంటే.. ఈ తీర్పు తక్షణ ప్రభావం.. సుమారు 3.5 లక్షల మంది హైతీ పౌరులు, 6,100 మంది సిరియా పౌరులపై పడనుంది. వీరంతా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. అయితే దీని ప్రభావం ఇంతటితో ఆగే అవకాశం లేదు. ప్రస్తుతం 17 దేశాలకు చెందిన సుమారు 13 లక్షల మంది టీపీఎస్ కింద అమెరికాలో నివసిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తీర్పు ఆధారంగా.. భవిష్యత్తులో ఇతర దేశాల TPSలను కూడా రద్దు చేసే అవకాశాలు పెరిగాయని వలస నిపుణులు చెబుతున్నారు. -
చమురు ట్యాంకర్ పై ఇరాన్ దాడి.. అమెరికా కౌంటర్ అటాక్
-
ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఇరాన్, అమెరికా యుద్ధం.. రెండోరోజు అప్డేట్స్.. యూఎస్, గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక.. 👉అమెరికా దాడులపై స్పందించిన ఇరాన్. ఇంకా దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దళాలు ఇరాన్ లక్ష్యాలపై వైమానిక దాడులు చేయగా, దానికి ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు మరియు మిత్రదేశాలపై ప్రతిదాడులు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ అధికార వర్గాలు అమెరికా చర్యలను “ఉద్రిక్తత పెంచే దాడులు”గా అభివర్ణించాయి.👉ఇరాన్ ప్రకటనలో గల్ఫ్ దేశాలకు కూడా స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది. అమెరికా తమ భూభాగాన్ని లేదా సైనిక స్థావరాలను ఉపయోగిస్తే, దాని ఫలితాలు “విపరీతంగా ఉంటాయి” అని హెచ్చరించింది.👉ఇరాన్ హెచ్చరికల ముఖ్యాంశం గల్ఫ్ దేశాలపై కూడా దృష్టి సారించింది. అమెరికా సైనిక చర్యలకు సహకరిస్తే, ఆ దేశాలు కూడా పరిణామాలు ఎదుర్కొంటాయని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి.గల్ప్లో సైరన్ల మోత.. 👉పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్పై వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ ఇరాన్లోని సిరిక్ (Sirik), బందర్-ఎ-లెంగెహ్ (Bandar-e Lengeh), ఖెష్మ్ (Qeshm) ద్వీపం ప్రాంతాల్లో ఉన్న సైనిక లక్ష్యాలపై దాడులు జరిగినట్లు అమెరికా అధికారులు తెలిపారు.👉అమెరికా దాడులు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు హార్మూజ్ జలసంధి తమకు కీలక వ్యూహాత్మక ఒత్తిడి సాధనమని ఇరాన్ స్పష్టం చేసింది. జలసంధిపై తమ ప్రభావాన్ని వదులుకుంటే, అమెరికా మరోసారి దాడులు చేసేందుకు అవకాశం కల్పించినట్టే అవుతుందని టెహ్రాన్కు చెందిన అబ్బాస్ అస్లానీ తెలిపారు.👉అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బలప్రయోగం ద్వారా హార్మూజ్ జలసంధిలో పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తోందని, అయితే అలాంటి చర్యలు టెహ్రాన్కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు.👉ఇజ్రాయెల్–లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్వీర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం హెజ్బొల్లాకు మళ్లీ ఊపిరి పోసినట్టేనని, ఆ సంస్థను పూర్తిగా నిర్మూలించాల్సింది పోయి కాల్పుల విరమణతో అవకాశం కల్పించారని విమర్శించారు. లెబనాన్ సైన్యం హెబ్బొల్లాను నియంత్రించగలదన్న వాదన ప్రమాదకర భ్రమే అని ఆయన వ్యాఖ్యానించారు.👉అమెరికా–ఇరాన్ తాజా ఘర్షణలతో టెహ్రాన్ ప్రజల్లో మళ్లీ యుద్ధ భయాలు పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఎంత సున్నితంగా ఉందో ఈ పరిణామాలు చూపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 👉అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరిస్తూ, దాడులు కొనసాగితే సైనికంగా పూర్తిగా ముగిస్తాం అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, అందుకే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా పేర్కొంది.U.S. Navy and Air Force fighter jets conducted strikes tonight on 10 Iranian military targets at multiple locations in and near the Strait of Hormuz for Iran's drone attack on M/T Kiku. pic.twitter.com/Z0TLZRqmF6— U.S. Central Command (@CENTCOM) June 28, 2026👉ఇదిలా ఉండగా, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లతో అమెరికా మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్లో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగగా, కువైట్ తన గగనతల రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసి శత్రు డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కొంటున్నట్లు ప్రకటించింది.👉బహ్రెయిన్పై డ్రోన్ దాడి జరిగినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ స్థావరం ఉండటంతో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. దేశ సార్వభౌమాధికారంపై దాడిగా దీనిని బహ్రెయిన్ ఖండించింది.👉ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద భద్రతా పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ ప్రయాణించే వాణిజ్య నౌకలకు ముప్పు పెరగడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.👉ప్రస్తుతం ఇరు దేశాలు మరిన్ని సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడంతో, మధ్యప్రాచ్యంలో పరిస్థితి గంట గంటకూ ఉద్రిక్తంగా మారుతోంది. అంతర్జాతీయ సమాజం మాత్రం సంయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపునిస్తోంది.👉ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో కొన్ని అమెరికా మిత్రదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు సమాచారం. అయితే కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పూర్తి నష్టం, ప్రాణనష్టం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. -
మరోసారి మిసైళ్ల మోత.. ఇరాన్లోని కీలక స్థావరాలపై బాంబుల వర్షం
ఫ్లోరిడా: ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులు చేసింది. ఆదివారం తెల్లవారుజామున మిసైళ్లతో విరుచుకుపడింది. ఎం/వి ఎవర్ లవ్లీ వాణిజ్య సరుకు రవాణా నౌకపై ఇరాన్ దాడికి ప్రతిగా శుక్రవారం అర్ధరాత్రి దాటాక అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశాన్ని ఇరాన్కు అమెరికా ఇచ్చింది. అయితే, ఇరాన్ దాన్ని లెక్క చేయకుండా డ్రోన్ను ప్రయోగించి ఎం/టి కికు నౌకను ఢీకొట్టింది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఆ ట్యాంకర్, 2 మిలియన్లకు పైగా బ్యారెళ్ల ముడి చమురుతో హార్మూజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ఓ ప్రకటనలో తెలిపింది.ఏయే ప్రాంతాల్లో దాడులు? వాణిజ్య నౌకలపై ఇరాన్ కొనసాగిస్తున్న దూకుడుకు నేరుగా ప్రతిగా సెంట్కామ్ దళాలు దాడులు చేపట్టాయి. అమెరికా సైనిక విమానాలు ఇరాన్ సైనిక నిఘా వ్యవస్థలు, సమాచార ప్రసార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లేయర్ కెపాబిలటీస్ లక్ష్యంగా దాడులు చేశాయి. కాగా, హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, అమెరికా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని సెంట్కామ్ తెలిపింది. https://t.co/9JgYDCZXuB— U.S. Central Command (@CENTCOM) June 27, 2026మా సహనం నశించింది: ఇరాన్ ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రాహీం అల్ఫిఖర్ ఎక్స్లో వరుస పోస్టులు చేశారు. "మీరు మా సార్వభౌమాధికారంపై దాడి చేశారు. ఇక పరిస్థితుల్ని మార్చే కార్యాచరణకు సిద్ధంగా ఉండండి. మీరు తప్పుగా అంచనా వేశారు. మా సహనం నశించింది. కాళరాత్రిని చూడడానికి సిద్ధంగా ఉండండి. మీరు అన్ని హద్దులు దాటారు. మా నిర్ణయం మాటలకే పరిమితం కాదు.. కొన్ని గంటల్లో మా శక్తిని చూపిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇరాన్ సైన్యంలోని అత్యున్నత ఉమ్మడి యుద్ధ కమాండ్కు చెందిన అధికార ప్రతినిధి. మరోవైపు, బహ్రెయిన్ శనివారం ఇరాన్ తమ భూభాగంపై పలు డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించింది. ఈ దాడి తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని, శాంతిని కాపాడే ప్రయత్నాలకు ముప్పు తెచ్చిందని తెలిపింది.You miscalculated, and our patience has run out... so prepare for a long, endless night.— العميد إبراهيم ذو الفقاري (@Ibrahim_alFiqar) June 27, 2026 -
అక్కడ లేదు ఇక్కడ రాదు
సాక్షి, హైదరాబాద్: ఒరాకిల్, సిస్కో, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. వీరిలో భారతీయులూ ఉన్నారు. పరాయి గడ్డ మీద దిగ్గజ కంపెనీల్లో పనిచేసి ఉపాధి కోల్పోయిన వీరు భారత్లో తిరిగి ఉద్యోగాలు పొందడానికి కష్టపడుతున్నారు. మంచి అనుభవం, అంతర్జా తీయ ప్రాజెక్ట్ ఎక్స్పోజర్, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్నా కూడా చాలామంది తిరిగి వచ్చిన వెంటనే స్థిరమైన ఉద్యోగం పొందలేకపోతు న్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన, 280 బిలియన్ డాలర్ల ఔట్సోర్సింగ్ పరిశ్రమలో మునుపెన్నడూ లేని మందగమనాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.అక్కడేమో ఏడాదికి రూ. కోటిప్రత్యేక స్టాఫింగ్ సంస్థ ఎక్స్ఫెనో గణాంకాల ప్రకారం 2026లో ఇప్పటివరకు సుమారు 7,300 మంది అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చారు. ఈ సంఖ్య 2025లో 15,100, అంతక్రితం సంవత్సరంలో 9,700గా ఉందని అంచనా. అంటే రెండున్నరేళ్లలో 32 వేల మందికిపైగా ఇంటిబాట పట్టారు. ఇప్పటికే దేశీయ జాబ్ మార్కెట్లో అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. యూఎస్లో వీరు అధిక వేతనాలను అందుకున్నారు. రూ. కోటికిపైగా వార్షిక వేతనం అందుకున్నవాళ్లే అత్యధికం. ఇక్కడా అదే స్థాయి వేతనాలను వీరు ఆశిస్తున్నారు. దీంతో భారత్కు తిరిగివచ్చిన టెకీలకు ఉద్యోగాలు దొరకడం లేదు. కంపెనీలు నియామకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో జూన్లో ఇది 28 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో అవకాశాలున్నా.. అధిక ప్యాకేజీ డిమాండ్ చేస్తుండటంతో వీరి నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. అమెరికాలో పనిచేసిన అనుభవంతో తిరిగి వచ్చే అభ్యర్థులు అక్కడి స్థాయికి దగ్గరగా జీతం కోరుతున్నారు. కానీ మన దేశంలోని సంస్థలు, ముఖ్యంగా స్టార్టప్స్, మధ్యస్థాయి కంపెనీలు అంతటి ప్యాకేజీలను ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడం సమస్యను పెంచుతోంది. ఒకవైపు అమెరికా నుంచి తిరిగివస్తున్న నిపుణులు.. మరోవైపు స్థానికంగా కొత్తగా ఉద్యోగాలు వెతుకుతున్న యువ టెకీలు.. ఈ రెండు వర్గాలకు సరిపడే వేగంతో నియామకాలు జరగడం లేదు.ఉద్యోగ సంక్షోభంఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 204 టెక్ కంపెనీలు 1,21,516 మంది నిపుణులను తొలగించాయి. వీటిలో ఒక్క అమెరికాకు చెందిన మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలలో లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్నారు. వీరిలో ఎంతమంది హెచ్–1బీ వంటి నైపుణ్యం కలిగిన కార్మిక వీసాలపై ఉన్నారనేది స్పష్టత లేదు. నియామకాల్లో ఏఐ భారీ మార్పును సృష్టిస్తున్న సమయంలోనే ఈ ఉద్యోగ సంక్షోభం ఏర్పడింది. తిరిగి రావాలనుకునే హెచ్–1బీ కార్మికులకు సహాయపడే ఎక్స్హెచ్1బీ ప్లాట్ఫామ్లో ఐదు నెలల్లో 500–600 మంది సైన్ అప్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తిరిగి వచ్చిన వారికి ఉద్యోగం కనుగొనడం మునుపటి కంటే చాలా కష్టంగా మారిందని స్టాఫింగ్ కంపెనీలు చెబుతున్నాయి. ‘చాలామంది అధిక వేతన శ్రేణిలో వస్తారు. ఇక్కడి వారితో సమానమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారు. కాబట్టి ఉద్యోగం పొందడానికి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిందే’ అని టీమ్లీజ్ తెలిపింది.ఫ్రాక్షనల్ సీఎక్స్ఓలకు...కొన్ని జీసీసీలు, స్టార్టప్స్ అనుభవజ్ఞులైన టాలెంట్ను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డేటా, క్లౌడ్, ఏఐ, సైబర్సెక్యూరిటీ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి అవకాశాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. అయితే అవి ఎక్కువగా సీనియర్ ప్రొఫెషనల్స్కే పరిమితం అవుతున్నాయి. అందుకే అమెరికా నుంచి వచ్చిన అనేకమంది టెకీలు కంపెనీలకు ‘ఓవర్ క్వాలిఫైడ్’గా కనిపిస్తున్నారు. అయితే నిర్దిష్ట రంగంలో ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేసిన వారికి జీసీసీల నుండి డిమాండ్ ఉంటోంది. ప్రాడక్ట్ కంపెనీల్లో పనిచేసిన అమెరికా రిటర్నీలకు ప్రాధాన్యత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్లు, జీసీసీలలో హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్ విభాగాలలో తక్షణమే లీడర్షిప్ రోల్స్లో ఉద్యోగులు అవసరమైనందున ఫ్రాక్షనల్ సీఎక్స్ఓలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. 2020 నుంచి పోలిస్తే ఫ్రాక్షనల్ సీఎక్స్ఓ రోల్స్ మూడు రెట్లు పెరిగాయని ‘టీమ్లీజ్’ చెబుతోంది. అదేస్థాయి నైపుణ్యం కోసం ఒకరిని పూర్తి సమయం నియమించుకోవడంతో పోలిస్తే ఇలాంటి రోల్స్తో కంపెనీలు సాధారణంగా 40–60 శాతం ఆదా చేస్తున్నాయి. పైగా ఈ రోల్స్ను చేపట్టడానికి సిద్ధంగా ఉన్న అనుభవజ్ఞులైన నిపుణుల కొరత ఉందని పరిశ్రమ చెబుతోంది. -
‘‘తనను ఫూల్ చేశారని అనుకుంటున్న ట్రంప్’’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏంచేస్తారో పూర్తిగా ఎవరూ ఊహించలేరని మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ చెప్పారు. భారత్లో అత్యంత అనుభవజ్ఞులైన దౌత్యవేత్తల్లో తల్మీజ్ అహ్మద్ ఒకరు. పశ్చిమ ఆసియా, గల్ఫ్, ప్రపంచ వ్యూహాత్మక వ్యవహారాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. తాజాగా, ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇరాన్ యుద్ధం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.ఇరాన్పై తక్కువ సమయంలో విజయం సాధిస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుదోవ పట్టించారని అన్నారు. చివరకు యుద్ధం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం సాగిందని ఆయన చెప్పారు. అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. ట్రంప్ ఇలా భావిస్తున్నారుట్రంప్ ఇప్పుడు ఇలా అనుకుంటున్నారని తాను భావిస్తున్నట్లు తల్మీజ్ అహ్మద్ చెప్పారు. ‘‘నెతన్యాహు తనను అందరి ముందు వెర్రివాడిని చేశానని ట్రంప్ అనుకుంటున్నారు. ఎల్ డొరాడో (అపార సంపద, అసాధ్యమైన గొప్ప విజయానికి ప్రతీకగా వాడే పదం) చూపిస్తానని హామీ ఇచ్చాడని, చివరికి తనకు ఏమీ ఇవ్వలేదని ట్రంప్ అనుకుంటుండొచ్చు. తన దేశంలోనే అవమానం ఎదుర్కొంటున్నానన్న భావన ట్రంప్లో ఉంది. అమెరికా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తాను అగస్టస్ సీజర్లా ఉండాల్సిందని ట్రంప్ భావిస్తుండొచ్చు’’ అని అనుకుంటున్నారని తల్మీజ్ అహ్మద్ చెప్పారు.ట్రంప్ ఆశలు నెరవేరకుండా అడ్డొస్తే ఎవరిపై అయినా ఇలాంటి కోపమే బయటపడుతుందని తల్మీజ్ అహ్మద్ అన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్పై ఆయన చూపిన ఆగ్రహం గుర్తుందా? యుద్ధం ముగియడానికి ట్రంపే కారణమని చెప్పలేదని, తనకు గుర్తింపు ఇవ్వలేదని ఆయన మనపై నింద వేస్తున్నారు. మనం తనతో కలవకపోవడం వల్లే తనకు నోబెల్ బహుమతి రాలేదని ఆయన నమ్ముతున్నారు’’ అని తల్మీజ్ అహ్మద్ తెలిపారు.‘‘డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఎవరి ఊహకూ అందని విధంగా వ్యవహరించే వ్యక్తి. ఆయన ఎవరైనా ఇచ్చే సలహాలు తీసుకుంటారా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియదు.ఇప్పటి వరకూ ఆయన వైఖరి ఏమిటంటే... ఆయన బెంజమిన్ నెతన్యాహు ప్రభావానికి సులభంగా లోనయ్యారు. నెతన్యాహు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అధ్యక్షుడి బలహీనతలను ఆయన చాకచక్యంగా ఉపయోగించుకున్నారు. మొదటి పదవీకాలంలోనూ ఆయన ఇదే చేశారు. అధ్యక్షుడి మనస్తత్వం ఆయనకు పూర్తిగా తెలుసు. ఎప్పుడు ఏ మాట చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. తన గొప్పతనంపై అతిగా నమ్మకం పెట్టుకుని, అసాధారణ విజయాలే సాధిస్తానని భావించే మానసిక ధోరణి ట్రంప్ది. ఇరాన్లో మీకు కొత్త పాలనను తీసుకొస్తాను. గత 40 ఏళ్లలో వరుసగా వచ్చిన అమెరికా అధ్యక్షులు సాధించలేనిది మీరు సాధిస్తారు అని అమెరికా అధ్యక్షుడికి నెతన్యూహు చెప్పారు. నెతన్యాహూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ సేకరించిన అత్యంత సవివర పత్రాలను డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచారు. ఆ పత్రాల ప్రకారం, ఇరాన్ రహస్యంగా మరోసారి అణు ఆయుధాన్ని అభివృద్ధి చేసిందని, అది సిద్ధం కావడానికి ఇంకొన్ని వారాలే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఇది వినడానికి నవ్వొచ్చే విషయం. ఎందుకంటే గత 20 ఏళ్లలో కనీసం 10 లేదా 15 సార్లు నెతన్యాహు ఇదే మాట చెప్పారు.ప్రతి సారి వరుసగా వచ్చిన అమెరికా అధ్యక్షులు ఆ వాదనను తిరస్కరించారు. అమెరికా నిఘా సంస్థల అంచనాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇరాన్ వద్ద ఎలాంటి ఆయుధ కార్యక్రమం లేదని అవి స్పష్టంగా చెప్పాయి. అయినా ఫిబ్రవరి 11న జరిగిన సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ను నెతన్యాహు నేరుగా ఒప్పించగలిగారు. అలా ఆయనను తన వైపు తిప్పుకున్నారు’’ అని తెలిపారు.అతనే ప్రమాదకరమైన శత్రువు మొదటి రోజే వారి అత్యున్నత నాయకుల్లో 40 మందిని (సుప్రీం లీడర్ సహా) హతమారుస్తానని, దాంతో పాలన మార్పునకు మార్గం సుగమమవుతుందని ట్రంప్నకు నెతన్యాహు తెలిపారని తల్మీజ్ అహ్మద్ అన్నారు. ‘‘4 లేదా 5 రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తుందని, దీర్ఘకాల ఘర్షణ ఉండదని అన్నారు. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ఉన్న అత్యంత గొప్ప అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారని అన్నారు. జిమ్మీ కార్టర్ నుంచి ఇప్పటి వరకూ ఏ అమెరికా అధ్యక్షుడూ సాధించలేనిది సాధిస్తారని తెలిపారు. ప్రపంచ వేదికపై అమెరికా ఇచ్చిన అత్యంత గొప్ప సైనిక నాయకుడిగా, అత్యంత గొప్ప రాజనీతిజ్ఞుడిగా ట్రంప్ గర్వంగా నిలుస్తారని నెతన్యాహు అన్నారు. మీ ఎదుట మెగాలోమానియా (తన గొప్పతనంపై అతిగా నమ్మకం పెట్టుకుని అసాధారణ విజయాలే సాధిస్తానని భావించే మానసిక ధోరణి) ఉన్న వ్యక్తి ఉంటే, అతనే మీకు ఉండే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. ఎందుకంటే అతనిలో భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఆ అర్థంలో చూస్తే ఆయన హేతుబద్ధంగా ఆలోచించే సాధారణ మనిషి కాదు. ట్రంప్ మెగాలోమానియా ఉన్న వ్యక్తి. ఇప్పుడు జరిగినది కూడా అదే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిలో రగులుతున్న కోపానికి కారణం ఇదే’’ అని తల్మీజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. -
హర్మూజ్లో ఉద్రిక్తత.. మరో ట్యాంకర్పై క్షిపణి దాడి
హోర్ముజ్ జలసంధిలో కార్గో నౌకపై జరిగిన డ్రోన్ దాడికి ప్రతీకారంగా అమెరికా.. ఇరాన్పై దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇరుదేశాలు.. కాల్పుల విరమణ ఒప్పందం పరస్పరం ఉల్లంఘనలు వేళ.. మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలను పెంచింది. ఈ క్రమంలో హర్మూజ్లో మరో ట్యాంకర్ క్షిపణి దాడికి గురైంది. ఈ జలసంధిలో ప్రయాణిస్తోన్న ట్యాంకర్ను క్షిపణి తాకినట్లు వెల్లడించిన యూకే మిలటరీ.. నౌకకు నష్టం వాటిల్లినప్పటికీ సిబ్బంది సురక్షితమని పేర్కొంది.అయితే, ఈ క్షిపణిని ఎవరు ప్రయోగించారు అనేదానిపై స్పష్టత రాలేదు. హర్మూజ్ సమీపంలో అమెరికా, ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగానే ఇరు దేశాలు పరస్పరం సైనిక చర్యలకు దిగడంతో ప్రాంతీయ భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి, దానికి అమెరికా చేపట్టిన ప్రతీకార వైమానిక దాడులు, అనంతరం ఇరాన్ స్పందనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.ఈ పరిణామాలతో గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను కాపాడడం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ జలసంధి గుండా రోజూ లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. అందువల్ల అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
ఏఐ సంచలనం ‘ఆంథ్రోపిక్’లో రూ.కోట్ల జీతాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం పోటీ రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) తన ఉద్యోగులకు కోట్ల రూపాయల వేతన ప్యాకేజీలు అందిస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. క్లాడ్ (Claude), మైథోస్ (Mythos) వంటి ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్న ఈ సంస్థలో కొందరు సాంకేతిక ఉద్యోగుల వార్షిక ప్రాథమిక వేతనం (Base Salary) ఏకంగా 13 కోట్ల రూపాయల వరకు ఉండటం చర్చనీయాంశమైంది. ఇవి కేవలం బేస్ పే మాత్రమే. బోనస్లు, స్టాక్ ఆప్షన్లు (Equity) ఇందులో లేవు.ఇటీవల ముగిసిన భారీ నిధుల సమీకరణ తర్వాత ఆంథ్రోపిక్ విలువ 965 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఓపెన్ఏఐను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ ఏఐ కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. కొత్తగా సమీకరించిన నిధులను కంప్యూటింగ్ సామర్థ్యాల పెంపు, అధునాతన ఏఐ మోడళ్ల అభివృద్ధి, భద్రతా పరిశోధనల కోసం వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది.హెచ్-1బీ దరఖాస్తులతో వెలుగు చూసిన జీతాలుఅమెరికా ప్రభుత్వానికి సమర్పించిన హెచ్-1బీ వీసా దరఖాస్తుల ఆధారంగా ఈ వేతన వివరాలు బయటకు వచ్చాయి. బిజినెస్ ఇన్సైడర్ విశ్లేషణ ప్రకారం, "మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్" హోదాలో ఉన్న ఇద్దరు ఉద్యోగులకు వరుసగా 1.12 మిలియన్ డాలర్లు, 1.38 మిలియన్ డాలర్ల వార్షిక బేస్ పే నమోదు అయింది. అయితే ఈ హోదాను సంస్థ వివిధ సాంకేతిక విభాగాల్లో ఉపయోగిస్తుండటంతో వారి ఖచ్చితమైన బాధ్యతలు వెల్లడికాలేదు. అలాగే ఈ గణాంకాల్లో స్టాక్ అవార్డులు, పనితీరు బోనస్లు చేర్చలేదు.హెచ్-1బీ దరఖాస్తుల ప్రకారం ప్రధాన విభాగాల్లో వార్షిక బేస్ పే ఇలా ఉంది..మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్: రూ.1.26 కోట్లు – రూ.13.02 కోట్లుమెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ (మేనేజర్): రూ.1.26 కోట్లు – రూ.8.02 కోట్లురీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ రీసెర్చర్: రూ.1.06 కోట్లు – రూ.4.71 కోట్లుప్రొడక్ట్ డిజైన్ మేనేజర్: రూ.1.32 కోట్లు – రూ.3.60 కోట్లుప్రొడక్ట్ ఆపరేషన్స్: రూ.1.17 కోట్లు – రూ.4.71 కోట్లుఅకౌంటింగ్: రూ.1.33 కోట్లు – రూ.2.17 కోట్లుకమర్షియల్ కౌన్సెల్: రూ.1.87 కోట్లు – రూ.3.01 కోట్లుఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ: రూ.1.72 కోట్లు – రూ.2.92 కోట్లుమార్కెటింగ్: రూ.1.50 కోట్లు – రూ.1.88 కోట్లురిసెర్చ్ ఆపరేషన్స్: రూ.1.17 కోట్లు – రూ.4.71 కోట్లుటెక్నికల్ సేల్స్: రూ.1.46 కోట్లు – రూ.4.71 కోట్లుటాలెంట్ కోసం పోటీఅమెరికాలో హెచ్-1బీ వీసాలపై అనిశ్చితి కారణంగా అనేక కంపెనీలు నియామకాలను తగ్గిస్తున్నప్పటికీ, ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐ, ఎన్విడియా వంటి ఏఐ సంస్థలు మాత్రం అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించేందుకు నియామకాలను వేగవంతం చేస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లోనే ఆంథ్రోపిక్ సుమారు 80 హెచ్-1బీ ఉద్యోగాలకు సర్టిఫికేషన్ పొందినట్లు సమాచారం. అత్యున్నత స్థాయి వేతనాలతో పాటు భారీ స్టాక్ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా ఉద్యోగులను సంస్థలోనే కొనసాగించే వ్యూహాన్ని ఆంథ్రోపిక్ అమలు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. -
వీడియోలతో అమెరికా కవ్వింపు.. గల్ప్ దేశాలపై ఇరాన్ పంజా
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగానే ఇరు దేశాలు పరస్పరం సైనిక చర్యలకు దిగడంతో ప్రాంతీయ భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి, దానికి అమెరికా చేపట్టిన ప్రతీకార వైమానిక దాడులు, అనంతరం ఇరాన్ స్పందనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.సమాచారం ప్రకారం, హార్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న ఎవర్ లవ్లీ అనే వాణిజ్య నౌకపై ఇటీవల డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనకు ఇరాన్ మద్దతు ఉన్న బలగాలే కారణమని అమెరికా ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఈ దాడి జరిగిందని పేర్కొంటూ, అమెరికా మరోసారి ఇరాన్ తీరప్రాంతంలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ నిల్వ స్థావరాలు, రాడార్ వ్యవస్థలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కొన్ని కీలక సైనిక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి.అమెరికా దాడుల వీడియోలు విడుదల.. మరోవైపు.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్పై నిర్వహించిన సైనిక దాడులకు సంబంధించిన వీడియోలను అధికారికంగా విడుదల చేసింది. ఈ వీడియోల్లో అమెరికా యుద్ధ నౌకల నుంచి క్షిపణులు ప్రయోగించడం, ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించడం, అనంతరం భారీ పేలుళ్లు సంభవించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తీర ప్రాంతంలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ నిల్వ స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలపై ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్లు CENTCOM తెలిపింది. ఈ వీడియోల్లో అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల నుంచి వరుసగా క్షిపణులు దూసుకెళ్లడం, లక్ష్య ప్రాంతాలను తాకిన తర్వాత భారీ పేలుళ్లు చోటుచేసుకోవడం కనిపిస్తోంది. అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతను కాపాడేందుకు, తమ బలగాల రక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా దాడులు జరిపిందని ఆరోపించింది. అనంతరం, అమెరికా చర్యకు ప్రతిస్పందనగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇతర అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడుల వల్ల ఎంత మేర నష్టం జరిగిందనే విషయంపై అమెరికా ఇప్పటివరకు పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే తమ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది.ఈ పరిణామాలతో గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను కాపాడడం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ జలసంధి గుండా రోజూ లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. అందువల్ల అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
మళ్లీ యుద్ధం.. ఇరాన్ పై భారీ స్థాయిలో దాడులు చేసిన అమెరికా
-
హర్ముజ్లో మళ్లీ టెన్షన్.. టెన్షన్
ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ సంక్షోభంలో పడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ దాడులను కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని ఆరోపించిన అమెరికా, ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలపై భారీ ప్రతీకార దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపిన వివరాల ప్రకారం.. గల్ఫ్లోని ఒక ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినందుకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. ఇరాన్ తీర ప్రాంతాల్లోని క్షిపణి నిల్వలు, డ్రోన్ స్థావరాలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని "శక్తివంతమైన దాడులు" నిర్వహించినట్లు పేర్కొంది.ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్ముజ్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడం కాల్పుల విరమణ ఒప్పందానికే కాకుండా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)ను కూడా ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. ఇరాన్ "తెలివితక్కువ పని" చేసిందని వ్యాఖ్యానిస్తూ.. ఇటువంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసిందని, అమెరికా తన బాధ్యతలను పాటించిందని చెప్పారు. ఒప్పంద అమలుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, హింసకు హింసతోనే సమాధానం ఉంటుందని హెచ్చరించారు.అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికానే ఎప్పటిలాగే తన హామీలను ఉల్లంఘించిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతిగా ప్రాంతంలోని అమెరికా బలగాల మోహరింపు ప్రాంతాలను తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో అమెరికా దాడులు పునరావృతమైతే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. అయితే.. అమెరికా స్థావరాలపై దాడులు ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది.ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ చైర్మన్ ఎబ్రహీం అజిజీ కూడా ట్రంప్పై విమర్శలు గుప్పించారు. చర్చలు, కాల్పుల విరమణ సూత్రాల పట్ల ట్రంప్కు ఎలాంటి నిబద్ధత లేదని ఆరోపిస్తూ.. అమెరికా దాడులను నిర్లక్ష్యపూరిత చర్యగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా, హర్ముజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళన పెంచుతున్నాయి. ఖతార్ ఎనర్జీకి చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్ ‘ఉమ్ స్లాల్’ హర్ముజ్ సమీపంలో తన ప్రయాణాన్ని మధ్యలోనే వెనక్కి మళ్లించగా, అంతకుముందు గ్యాస్లాగ్ షాంఘై నౌక కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో పేలుళ్లు నమోదవడంతో గల్ఫ్ మార్గంలో ఎల్ఎన్జీ రవాణాపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.ఇరాన్ మాత్రం హర్ముజ్ జలసంధిని తన అత్యంత కీలక వ్యూహాత్మక అస్త్రంగా భావిస్తోంది. ఈ జలసంధిపై తన ఆధిపత్యాన్ని వదులుకోవడం అంటే చర్చల్లో తన బలమైన ఒత్తిడి సాధనాన్ని కోల్పోవడమేనని టెహ్రాన్ భావిస్తోంది. అందుకే రాజకీయ నాయకులు, సైనికాధికారులు, ఐఆర్జీసీ నేతలు హర్ముజ్పై తమ నియంత్రణను కాపాడుకునేందుకు అవసరమైతే పోరాటానికైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఇటీవల జరిగిన యుద్ధం ప్రాంతీయ వ్యూహాత్మక పరిస్థితులను పూర్తిగా మార్చేసిందని, ఆ కొత్త వాస్తవాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.మరోవైపు, అమెరికా మాత్రం ఈ ప్రతీకార దాడులను పరిమితంగానే ఉంచినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించిన అమెరికా, విస్తృత సైనిక స్థావరాలను మాత్రం టార్గెట్ చేయలేదు. హర్ముజ్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కాపాడుతూనే, దౌత్య చర్చలకు అవకాశం కొనసాగించాలనే ఉద్దేశంతోనే తమ సైనిక చర్యలను పరిమితం చేసినట్లు వాషింగ్టన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇరు దేశాల పరస్పర ఆరోపణలు, ప్రతీకార చర్యలతో కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యంపై మరోసారి తీవ్ర అనిశ్చితి నెలకొంది.ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధం.. వీళ్లకేమో కాసుల వర్షం! -
అమెరికాలో బోయింగ్ 777 ప్రమాదకరమైన విన్యాసం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లో పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. మార్బుల్ ఫాల్స్ సమీపంలోని హార్స్షూ బే రిసార్ట్ జెట్ సెంటర్ వద్ద ఖతార్ ఎయిర్వేస్ కార్గో కోసం సిద్ధం చేసిన బోయింగ్ 777–200ఎల్ఆర్ విమానం అతి తక్కువ ఎత్తులో విన్యాసం చేసింది. నేలకు కొన్ని అడుగుల ఎత్తులో రెక్కను దాదాపు నేలకు తాకించినంత ప్రమాదకర కోణంలో మలుపు తిరిగింది. జూన్ 24 బుధవారం నాడు జరిగిన ఘటన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. విమానం కుడి రెక్క నేలకు కొన్ని అంగుళాల దూరంలో వెళుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫుటేజ్ ఆన్లైన్లో వేగంగా వైరల్ అయి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇంత పెద్ద విమానానికి ఇలాంటి విన్యాసాలు అత్యంత ప్రమాదకరమని విమానయాన పరిశీలకులు అభివరి్ణంచారు. ఈ ఘటనలో ఆ విమానయాన సంస్థ ప్రమేయం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. అయితే, ఆ విమానం ఇంకా ఖతార్ ఎయిర్వేస్ సేవలోకి ప్రవేశించలేదని స్పష్టమైంది. ఆ విమానం యజమాని అయిన టెక్సాస్ ఆధారిత లీజింగ్ సంస్థ జెట్రాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనతో ఖతార్ ఎయిర్వేస్కు గానీ, ఆ విమానయాన సంస్థ పైలట్లకు గానీ సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ విమానం తమ యాజమాన్యంలోనే ఉందని, ఖతార్ ఎయిర్వేస్కు ఇవ్వడానికి ముందు పరీక్షల్లో భాగంగా దీనిని నడుపుతున్నామని ఆ సంస్థ తెలిపింది. పరీక్షల్లో డెలివరీకి ముందు ఈ తక్కువ ఎత్తు ప్రయాణం ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని వెల్లడించింది. నేలను తాకినట్లు ఎటువంటి నిర్ధారణ కాలేదని, విమానం తన ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేసి, ఆ తర్వాత ఫోర్ట్ వర్త్ అలయన్స్ విమానాశ్రయంలో ఎటువంటి సంఘటన లేకుండా ల్యాండ్ అయిందని వెల్లడించింది. పరీక్షల సమయంలో తక్కువ ఎత్తులో ప్రయాణించడం సాధారణం. అయినప్పటికీ, అవి సాధారణంగా కట్టుదిట్టమైన నియంత్రణ విధానాలతో, స్పష్టమైన భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తారు. రెక్కల వెడల్పు 200 అడుగులకు మించి ఉన్న విమానాలు తక్కువ ఎత్తులో మరింత ప్రమాదకరంగా మారతాయని విమానయాన నిపుణులు పేర్కొంటున్నారు. గాలి, నియంత్రణలో చిన్న మార్పులు కూడా ప్రమాద కారకం అవుతాయని హెచ్చరిస్తున్నారు. -
నేరాన్ని అంగీకరించిన జాన్ బోల్టన్
వాషింగ్టన్: అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తన నేరాన్ని శుక్రవారం అంగీకరించారు. రహస్య సమాచారాన్ని చట్టవిరుద్ధంగా తన వద్ద ఉంచుకున్నట్లు చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఒకప్పుడు మద్దతుదారుడైన జాన్ బోల్టన్ తర్వాత వ్యతిరేకిగా మారారు. బోల్టన్కు మేరీల్యాండ్లోని గ్రీన్బెల్ట్లో ఉన్న యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి థియోడోర్ చువాంగ్ అక్టోబర్ 28న శిక్షను ఖరారు చేయనున్నారు. జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న సమయంలో వర్గీకరించిన సమాచారాన్ని తన వద్ద ఉంచుకోవడం లేదా వ్యాప్తి చేయడం వంటి 18 అభియోగాలతో బోల్టన్పై గత అక్టోబర్లో కేసు నమోదయ్యింది. -
మళ్లీ తీవ్ర కలకలం.. ఇరాన్పై అమెరికా భీకరదాడులు
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇరాన్కు చెందిన క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా బలగాలు దాడులు చేసి, వాటిని బూడిద చేశాయి. దీంతో ఇప్పటికే అమల్లో ఉన్న సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, హార్మూజ్లో ఓ సరుకు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డ కొన్ని గంటలకే యూఎస్ సేనలు టెహ్రాన్పై దాడులు చేయడం గమనార్హం. రెండు రోజుల క్రితం ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై మిసైల్ దాడి జరిగినట్లు బ్రిటిష్ సైన్యం కూడా పేర్కొంది. అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాణిజ్య నౌకలపై ఇరాన్ బలగాలు అనవసరంగా దాడి చేశాయి. దానికి ప్రతిస్పందనగానే ఇరాన్పై అమెరికా దాడులు చేసింది.అమెరికా ఏమంది? క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడులను డ్రోన్ దాడికి "బలమైన ప్రతిస్పందన"గా అభివర్ణించింది. ఇరాన్ ప్రమాదకర ప్రవర్తన వల్ల కీలక అంతర్జాతీయ వాణిజ్య మార్గంలో నౌకల రాకపోకల స్వేచ్ఛ దెబ్బతింటోందని పేర్కొంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం సహకారాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. ఇరాన్ ఏమంది? ఈ దాడులకు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా కారణమని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆరోపించింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఓడరేవు నగరం తహెరూయెహ్ పియర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఆ ప్రాంతంలో క్షిపణి తాకడంతోనే పేలుడు జరిగిందని తెలిపింది.అమెరికా-ఇరాన్ యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. యుద్ధానికి తుది పరిష్కారం దిశగా అమెరికా, ఇరాన్ చర్చలు జరుపుతున్న వేళ హార్మూజ్ జలసంధి తెరిచి ఉంచేలా జరుగుతున్న ప్రయత్నాలపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇరాన్ యుద్ధంలో బాంబులు పేలుతుంటే.. వీరిపై రూ.కోట్ల వర్షం
యుద్ధం అంటే ప్రాణనష్టం, ఆస్తినష్టం, దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రమే అనుకుంటాం. కానీ ప్రతి యుద్ధం వెనుక మరో ఆర్థిక కోణం కూడా ఉంటుంది. ఒకవైపు ప్రజలు కష్టాలు పడుతుంటే, మరోవైపు కొన్ని రంగాలు మాత్రం భారీగా లాభపడతాయి. ఇరాన్-అమెరికా యుద్ధం కూడా అలాంటి పరిస్థితినే తీసుకొచ్చింది. ఈ యుద్ధం వల్ల అసలు ఎవరు ఎక్కువ లాభం పొందారు? ఎవరు నష్టపోయారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇరాన్-అమెరికా యుద్ధం కేవలం రణరంగానికే పరిమితం కాలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా భారీ ప్రభావం చూపింది. యుద్ధం తొలి నాలుగు రోజుల్లోనే అమెరికా నేతృత్వంలోని కూటమి 5,000కు పైగా ఆయుధాలు వినియోగించింది. మొత్తం యుద్ధ వ్యయం 35-40 బిలియన్ డాలర్ల వరకు చేరి ఉండొచ్చని అంచనా.యుద్ధం వల్ల లాభం పొందినవారుఆయుధాల తయారీ సంస్థలుటోమాహాక్ క్షిపణులు, పెట్రియట్ క్షిపణుల తయారీ కంపెనీలుద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) ఎగుమతి సంస్థలుముడి చమురు వ్యాపార సంస్థలుయుద్ధ పరిణామాలపై పందేలు కాసిన కొందరు పెట్టుబడిదారులుమరోవైపు రష్యా, చైనా దేశాలు కూడా భౌగోళిక రాజకీయాల పరంగా ప్రయోజనాలు పొందాయి. అయితే యుద్ధ భారం మాత్రం సాధారణ ప్రజలపై పడింది. ఇంధన ధరల పెరుగుదలతో పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.ఇలా కాల్పుల మోతలో కాసుల వర్షం..! యుద్ధంలో టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను పెద్ద ఎత్తున ప్రయోగించారు. దీంతో వాటి తయారీ సంస్థలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్కో టోమాహాక్ క్షిపణి ధర లక్షల డాలర్లలో ఉండటంతో ఆయుధ పరిశ్రమకు భారీ ఆదాయం లభించింది. పెరిగిన డిమాండ్ వల్ల తయారీ సమయం కూడా 2 నుంచి 3 సంవత్సరాల వరకు పెరిగింది.ఇరాన్ తక్కువ ధర కలిగిన షాహెద్ డ్రోన్లను వినియోగించగా, వాటిని కూల్చేందుకు అమెరికా అత్యంత ఖరీదైన పెట్రియట్ ఇంటర్సెప్టర్ క్షిపణులను ప్రయోగించింది. తక్కువ ఖర్చుతో దాడులు చేసిన ఇరాన్కు ఎదురుగా అమెరికా అత్యధిక వ్యయం చేయాల్సి వచ్చిన పరిస్థితి కనిపించింది.యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయుధ తయారీ సంస్థల అమ్మకాలు, ఆర్డర్లు, వాటాల విలువలు వేగంగా పెరిగాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీకి చెందిన ప్రముఖ రక్షణ సంస్థలు ఈ పరిణామాలతో భారీ లాభాలు పొందాయి.హార్మూజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ ద్రవీకృత సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితి అమెరికా గ్యాస్ ఎగుమతి సంస్థలకు అనుకూలంగా మారింది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరగడంతో అమెరికా నుంచి గ్యాస్ ఎగుమతి చేసే సంస్థలు భారీ ఆదాయాన్ని నమోదు చేశాయి.ముడి చమురు ధరలు కూడా యుద్ధ ప్రభావంతో ఒక్కసారిగా పెరిగాయి. దీంతో చమురు వ్యాపార సంస్థలు, వ్యాపారులు అధిక లాభాలు ఆర్జించారు. కొంతమంది సంస్థలకు యుద్ధం వల్ల కార్యకలాపాల్లో ఆటంకాలు ఎదురైనా, పెరిగిన ధరల కారణంగా గత ఎన్నో సంవత్సరాల్లో లేనంత లాభాలు నమోదయ్యాయి.యుద్ధం సమయంలో అమెరికా గల్ఫ్ దేశాలకు భారీ విలువైన ఆయుధాల విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో రక్షణ వ్యయాన్ని మరింత పెంచే ప్రణాళికలూ ప్రకటించింది. ఈ వ్యయ భారం చివరకు అమెరికా పన్ను చెల్లింపుదారులపై పడే అవకాశం ఉంది.ఈ యుద్ధంలో మరో ఆసక్తికర అంశంగా ప్రిడిక్షన్ మార్కెట్. యుద్ధం, కాల్పుల విరమణ వంటి పరిణామాలపై ముందుగానే పందేలు కాసి కొందరు కోట్ల డాలర్ల లాభాలు పొందినట్లు పరిశోధనలో వెల్లడైంది. దీనిపై అమెరికా సెనెట్ దర్యాప్తునకు ఆదేశించింది.మొత్తంగా చూస్తే ఈ యుద్ధంలో అత్యధిక లాభం ఆయుధ తయారీ సంస్థలు, గ్యాస్ ఎగుమతిదారులు, చమురు వ్యాపారులు పొందారు. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాల ప్రజలు అధిక గ్యాస్ ధరల భారం భరించాల్సి వచ్చింది. తక్కువ ధర డ్రోన్లను అడ్డుకునేందుకు ఖరీదైన క్షిపణులు కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా తీవ్ర ఆర్థిక ఒత్తిడి పడింది. -
సవాళ్లు ఉన్నా సందర్భోచితమే!
ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐ.ఎం.ఇ.సి.– ఐమెక్) పథకం ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో చర్చనీయాంశమైంది. భారత విధాన రూపకర్తలకు ఐమెక్ను ముందుకు తీసుకు వెళ్లటం పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ యుద్ధం ఒక వైపు ఐమెక్ పథకం బలహీనతలను బహిర్గతం చేస్తూనే దాని అవసరాన్నీ నొక్కి చెప్పింది. 2023 ఢిల్లీ జీ–20 సదస్సులో భారత్ ప్రతిపాదించిన ఐమెక్ ప్రతిపాదనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ, యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ యూనియన్లు అంగీకరించాయి. భారత్ను మధ్యప్రాచ్యం – ఇజ్రాయెల్ గుండా యూరప్తో అనుసంధానానికి ఉద్దేశించిన ఈ 4,800 కి.మీ. రవాణా కారిడార్ ఆసియా, పర్షియన్ గల్ఫ్, ఐరోపాల ఆర్థిక వ్యవస్థలను సమీకృతం చేస్తుంది. ఆసియా ఖండపు వినిమయ మార్కెట్లను, గల్ఫ్ చమురు– గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలను ఐరోపా పారిశ్రామిక ప్రాంతాలలో సముద్ర, భూతల మార్గాల ద్వారా అనుసంధానించే విశిష్టమైన పథకం ఐమెక్. ఈ మూడు ప్రాంతాల అనుసంధానంలో ప్రస్తుతం మూడు చిక్కుముడి ప్రాంతాలు (చోక్ పాయింట్లు) ఉన్నాయి. అవి హార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్ జలసంధులు. ఈ మూడు జలసంధులను పక్కన పెట్టే సురక్షితమైన రవాణా మార్గమే ఐమెక్.విస్తృత వాణిజ్యానికి కీలకంఐమెక్ రవాణా కారిడార్లో తూర్పుభాగం భారత పశ్చిమ తీరాన్ని పర్షియన్ సింధుశాఖలో కలిపే సముద్ర మార్గం. భారత్లోని ముంబై–ముంద్ర–కాండ్లా రేవు పట్టణాలను యూఏఈకి చెందిన జెబెల్ అలీ, ఫుజేరా, సౌదీకి చెందిన డమ్మామ్, జెడ్డాలతో కలుపు తుంది. ఐమెక్ ఉత్తర కారిడార్ పర్షియా సింధుశాఖను ఐరోపాతో రైలు మార్గాల ద్వారా కలుపుతుంది. యూఏఈ, సౌదీ, జోర్డాన్లను రైలు మార్గాల ద్వారా ఇజ్రాయెల్లోని హైఫా రేవు పట్టణానికి కలుపుతారు. హైఫా నుండి ఎర్ర సముద్రం గుండా గ్రీస్లోని పిరేస్, ఫ్రాన్స్లోని మార్సెల్లి, ఇటలీలోని మెస్సీనాలకు కలుపుతూ ఐరోపాకు సరకుల రవాణా జరుగుతుంది. ఐమెక్లో భాగంగా హరిత ఇంధనాలైన హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తి, విద్యుత్ గ్రిడ్ల అనుసంధానం కూడా జరుగుతుంది. సముద్ర, భూతల మార్గాల ద్వారా అత్యాధునిక ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల నిర్మాణం, విస్తృత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఐమెక్ పూర్తి స్థాయిలో అమలు జరిగితే భారత్– ఐరోపాల మధ్య రవాణా కాలం 40 శాతం, రవాణా వ్యయం 30 శాతం తగ్గిపోతాయి. రవాణా అనిశ్చితి కూడా తొలగిపోతుంది. భారత్–ఐరోపా యూనియన్ల మధ్య 2026 జనవరిలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన 40–65 శాతం వాణిజ్యం పెరుగు తుందని అంచనా. భారత్–యూఏఈ, సౌదీ, ఖతర్, ఒమన్ల మధ్య వాణిజ్యానికీ కూడా ఐమెక్ కీలకం.వ్యూహాత్మకంగానూ ముఖ్యమే!ఆసియా–పర్షియన్ సింధుశాఖ ప్రాంతంలో చైనాను నిలువరించటానికి ఐమెక్ ఉపయోగపడుతుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ద్వారా ఆసియా–గల్ఫ్ ప్రాంతంలో చైనా బలపడుతున్నది. ఒక రకంగా ఐమెక్ను బీఆర్ఐకు పోటీగా చెప్పు కోవచ్చు. వ్యూహాత్మక అంశాల దృష్ట్యా యూఎస్ఏ ఐమెక్కు మద్దతు పలికింది. ఇజ్రాయెల్ను ఇతర గల్ఫ్ దేశాలతో సంఘటితం చేయా లనేది అమెరికా లక్ష్యం. అబ్రహాం ఒప్పందం ద్వారా యూఏఈ, ఖతర్, ఒమన్లను ఇజ్రాయెల్కు కొంతవరకు దగ్గరకు తేగలిగింది. ప్రస్తుతం భూతల మార్గం ద్వారా భారత్ నుండి ఐరోపా వెళ్లాలంటే పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ల గుండా ప్రయాణించాలి. ఒక రకంగా భారత్–ఐరోపా భూతల రవాణాపై పాకిస్తాన్కు వీటో ఉన్నది. ఐమెక్ ద్వారా పాక్ వీటోను తొలగించినట్లవుతుంది. చైనా–పాక్–ఎకనమిక్ కారిడార్ (సిపెక్)లో భాగంగా పాకిస్తాన్లో పెద్ద మొత్తంలో రోడ్డు, రైలు మార్గాలను, రేవు పట్టణాలను చైనా అభివృద్ధి చేస్తున్నది. పాకిస్తాన్ గుండా అరేబియా సముద్రంలోనికి చైనా ప్రవేశిస్తున్నది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి ఐమెక్ తోడ్పడుతుంది. సూయజ్, బాబెల్ మాండెబ్లను పక్కకు పెట్టడం వలన భారత్–ఐరోపా వాణిజ్యంలో అస్థిరత, అనిశ్చితి తొలగి పోతాయి. పాకిస్తాన్కు వంత పాడుతున్న టర్కీకి కూడా ఐమెక్ ద్వారా చెక్ పెట్టినట్లవుతుంది. ఐమెక్ ద్వారా ఐరోపాకు శక్తి భద్రత ఏర్పడటంతో పాటు భారత్తో వాణిజ్యం విస్తృతమవుతుంది. గల్ఫ్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను వైవిధ్యీకరించటానికి ఐమెక్ ఉపయో గపడుతుంది. ఐమెక్కు కేంద్రకంగా ఉన్న ఇజ్రాయెల్కు ప్రాంతీయ స్థిరత్వం, భద్రత ఏర్పడతాయి.ప్రతికూలతలు బహిర్గతంసంక్షుభిత ప్రాంతాలైన సూయజ్, బాబెల్ మాండెబ్లకు దూరంగా ప్రతిపాదించబడిన ‘ఐమెక్ ప్రశాంత కారిడార్’యుద్ధంలో చిక్కుకున్నది. ఫుజెరా, జెబెల్ అలీ రేవు పట్టణాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఖతర్ గ్యాస్ క్షేత్రాలు కూడా దాడులకు గురయ్యాయి. ఐమెక్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయటం మూడు కీలక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అవి 1. సౌదీ–ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ. 2. జెబెల్ అలీ, ఫుజెరా (ఎమిరేట్స్) రేవు పట్టణాల భద్రత. 3. పెట్టుబడులు. ఇరాన్ యుద్ధం ఈ మూడు అంశాల ప్రతికూలతలను బహిర్గతం చేసింది. అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికి మొదటినుండీ సౌదీ రాజు విముఖత చూపుతున్నాడు. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం వలన నౌకల బీమా ఛార్జీలు అమాంతం పెరిగాయి. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ మదుపరులు ముందుకు రావటం కష్టం. అయితే, హార్మూజ్ దిగ్బంధనం, అంతకు ముందు బాబెల్ మాండెబ్ను హౌతీలు మూసివేస్తామని బెదిరించడం ఒక రకంగా ఈ ఇరుకైన సముద్ర మార్గాలకు ప్రత్యామ్నా యంగా రవాణా వ్యవస్థల అభివృద్ధి ఆవశ్యకతను గుర్తు చేసింది. 2023లో ఐమెక్ ఒప్పందం సమయంలో కంటే 2026లో దాని ఆవశ్యకత మరింత పెరిగిందనే చెప్పాలి. హార్మూజ్ ద్వారా రవాణాకు భవిష్యత్తులో కూడా అమెరికాతో సహా ఎవరూ భరోసా ఇవ్వలేరు. గల్ఫ్ ప్రాంత భూతల మార్గాల ద్వారా ఆసియాను ఐరోపాతో అనుసంధానించటమే శ్రేష్ఠమైన ప్రత్యామ్నాయం. శాంతియుత జియో పొలిటికల్ వాతావరణంలో ప్రతిపాదించ బడిన ఐమెక్ పథకాన్ని అశాంతి, ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణపు అనిశ్చిత వాస్తవాల నేపథ్యంలో సవరించాల్సిన అవసరం గోచరి స్తున్నది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధికి సమీపంలోని ఎమిరే ట్స్కు చెందిన ఫుజేరాకు బదులుగా ఒమన్కు చెందిన సలాలా, దుఖమ్, సోహర్ రేవు పట్టణాలను భారత్ పశ్చిమ తీరంతో అనుసంధానించాలి. ఈ పథకాన్ని రవాణా, ఎనర్జీ, డిజిటల్ కారిడార్లుగా విభజించి వేటికవే అమలు పరచటం వాంఛనీయం. ఇబ్బందులు, అడ్డంకులతో కూడిన రవాణా కారిడార్ నిర్మాణాన్ని రెండవ దశలో చేపట్టవచ్చు. మొదటి దశలో ఎనర్జీ, డిజిటల్ కారిడార్లను అమలు పరిచి సైద్ధాంతికంగా పథకం అమలు సాధ్యాన్ని నిరూపించవచ్చు. ఇంతవరకు వివిధ దేశాలు ప్రత్యేక ఒప్పందాల ద్వారా పథకాన్ని అమలు పరుస్తున్నాయి. కానీ ఒక కేంద్రీయ సెక్రటేరియట్ను ఏర్పాటు చేసి సభ్య దేశాల మధ్య సమన్వయం సాధించాలి. ఇజ్రా యెల్తో ముడిపడిన క్లిష్టమైన అంశాలను పక్కకుపెట్టి భారత్–గల్ఫ్ అనుసంధానంపై దృష్టి పెట్టాలి. భారత్ వ్యూహాత్మక, ఆర్థిక, శక్తి భద్రతలకు ఐమెక్ పథకం అమలు అత్యంత ఆవశ్యకం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
కలెక్టర్ గారూ..అదే నా చివరి కోరిక!
94 ఏళ్ల బామ్మ భారతీయ పౌరసత్వం కోసం కలెక్టర్ని ఆశ్రయించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె తన శేష జీవితం భారతీయురాలిగా గడపాలంటూ ఆయన వద్దకు వెళ్లి చెప్పిన తీరు అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె కథేంటంటే..ఆ బామ్మే ఆంద్రప్రదేశ్కు చెందిన 94 ఏళ్ల కొండ్రగుంట మహాలక్ష్మమ్మ. భర్త మరణానంతరం ఆమె అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో కుమారుడు బుచ్చయ్య చౌదరి వర్జీనియాలోని పీటర్స్బర్గ్లో ఆంకాలజిస్ట్గా (క్యాన్సర్ వైద్య నిపుణుడిగా) పనిచేసేవారు. 2000 సంవత్సరంలో మహాలక్ష్మమ్మ అమెరికా పౌరురాలిగా మారారు. ఆమె అక్కడ సుమారు 18 ఏళ్లు నివసించారు. ఆ తర్వాత తన కుమారుడు మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చేరడంతో ఆమె 2018లో తిరిగి భారతదేశానికి వచ్చారు. దాంతో ఆమెకు మళ్లీ భారతీయ పౌరురాలిగా మారాలనే కోరిక కలిగింది. ఈ ప్రక్రియ వేగంతంగా అవ్వాలని కోరుతూ మహాలక్ష్మమ్మ కలెక్టర్ గారిని కలిశారు. ఆయనతో బామ్మ "కలెక్టర్ గారు నాకు 95 ఏళ్లు నిండనున్నాయి. నా చివరి రోజులను నా మాతృభూమిలో భారతీయ పౌరురాలిగా గడపడమే నా ఏకైక కోరిక. నా అంత్యక్రియలు నా సొంత గ్రామంలోనే జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పటికే నా అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నాను. దయచేసి నాకు వీలైనంత త్వరగా భారతీయ పౌరసత్వం లభించేలా సహాయం చేయండి." అని కోరింది. తాను ఈ దేశ చట్టాలను గౌరవిస్తానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది. కేవలం తన మిగిలిన జీవితాన్ని తన జన్మస్థలంలోనే గడిపేందుకు చట్టపరమైన అనుమతి ఇవ్వాలని స్థానికి అధికారులను కోరారు. దీనికి జిల్లా కలెక్టర్గారు స్పందిస్తూ..పౌరసత్వంపై తుది సిఫార్సును కేంద్ర అధికారులకు పంపే ముందు స్థానిక విచారణ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని, ఆ తర్వాత ఈ అభ్యర్థనపై నిర్ణీత విధానాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ బామ్మకు హామీ ఇచ్చారు. (చదవండి: ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..!) -
నువ్వా-నేనా!.. నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..
ఫిఫా ప్రపంచకప్-2026లో అమెరికా- తుర్కియే మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. లాస్ ఏంజెలెస్ వేదికగా తుర్కియే అనూహ్య రీతిలో పటిష్ట అమెరికా జట్టుపై విజయం సాధించింది. గ్రూప్- ‘డి’లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్లో ఆతిథ్య జట్టును 3-2తో చిత్తు చేసి తమ తొలి విజయం నమోదు చేసింది.కాగా గ్రూప్- ‘డి’ నుంచి ఇప్పటికే అమెరికా వరుసగా రెండు విజయాలతో నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఈ క్రమంలో తుర్కియే మీదా గెలిచి హ్యాట్రిక్ విజయంతో అజేయంగా నిలవాలని భావించింది. ఇక అప్పటికి రెండు మ్యాచ్లలో రెండూ ఓడిన తుర్కియే సులువుగా తలొగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కానీ తుర్కియే అంచనాలన్నీ తలకిందులు చేసింది. నిజానికి మూడో నిమిషంలోనే ఆస్టన్ ట్రస్టీ గోల్ కొట్టి అమెరికాకు శుభారంభం అందించాడు. అయితే, తుర్కియే ఆటగాడు బారిస్ యిల్మాజ్ ఇచ్చిన పాస్తో ఆర్డా గూలర్ గోల్ కొట్టి 1-1తో స్కోరు సమం చేశాడు.నువ్వా- నేనాఆ తర్వాత మ్యాచ్ రెండో అర్ధ భాగంలో ఒర్కూన్ కొకూ గోల్ కొట్టడంతో తుర్కియే 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, సెబాస్టియన్ బెర్హాల్టర్ గోల్ కొట్టడంతో.. అమెరికా 2-2తో స్కోరు సమం చేసింది. అయితే, అప్పటికి ఫలితం తేలకపోగా.. అదనపు సమయం కేటాయించారు. ఈ క్రమంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొనగా.. కాన్ అహ్యాన్ అనూహ్య రీతిలో గోల్ కొట్టి తుర్కియేను విజేతగా నిలిపాడు.ఆసీస్, పరాగ్వే సైతంఇక గ్రూప్-డి మరో మ్యాచ్లో ఆస్ట్రేలియా పరాగ్వేతో మ్యాచ్ను డ్రా చేసుకుంది. దీంతో టేబుల్ టాపర్ అమెరికాతో పాటు.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, పరాగ్వే నాకౌట్కు చేరాయి. అయితే, ఆఖరి మ్యాచ్లో తుర్కియే అమెరికాపై సంచలన విజయం సాధించినప్పటికీ.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు రెండు మ్యాచ్లలోనూ టర్కీ ఓడిపోవడం ఇందుకు కారణం. అయితే, వెళ్తూ వెళ్తూ.. అజేయంగా నాకౌట్కు చేరాలనుకున్న అమెరికాకు మాత్రం షాకిచ్చింది.చదవండి: వైభవ్ కోసం వాళ్లకు అన్యాయం చేయలేము! -
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట
దేశంలోని బల్క్, కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా వాణిజ్య గ్యాస్ సరఫరాపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను కేంద్రం తక్షణమే ఎత్తివేసింది.ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభానికి ముందు దేశంలో ఏ స్థాయిలో సరఫరా ఉండేదో, ఆ పాత నిబంధనలనే పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ ద్వారా స్పష్టం చేశారు. బల్క్ గ్యాస్ సరఫరా 50 శాతానికి పెంపు ప్యాక్డ్ సిలిండర్లతో పాటు, సంక్షోభం ప్రారంభమైన సమయంలో పూర్తిగా నిలిపివేసిన ‘బల్క్ ఎల్పీజీ’ సరఫరాపై కూడా కేంద్రం సడలింపులు ఇచ్చింది.పాత వినియోగంతో పోలిస్తే పరిశ్రమలకు 50 శాతం మేర బల్క్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్ వంటి భారీ ఇంధన ఆధారిత పరిశ్రమలకు గ్యాస్ కొరత తీరనుంది. -
డబుల్ ట్రబుల్లో ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధ వ్యవహారంలో.. తన సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. యుద్ధం సాగుతున్న తీరు, దాని వ్యయం, వ్యూహాత్మక లక్ష్యాలపై పెరుగుతున్న అసంతృప్తి మధ్య బుధవారం రిపబ్లికన్ పార్టీ ఎంపీలతో జరిగిన క్లోజ్డ్-డోర్ సమావేశంలో ట్రంప్, రిపబ్లికన్ సెనేటర్ బిల్ క్యాసిడీ Bill Cassidy మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.సమావేశంలో క్యాసిడీ.. ఇరాన్తో కుదిరిన తాజా ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై ప్రశ్నలు లేవనెత్తారు. అమెరికా ప్రకటించిన లక్ష్యాలు నెరవేరకుండానే ఇరాన్కు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారనే ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రజలకు ఇప్పటివరకు చెప్పిన దానికంటే ఎక్కువ సమాచారం తెలుసుకునే హక్కు ఉంది’’ అని సమావేశం అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధ వ్యూహం మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోందా? లేదా? అన్నది స్పష్టంగా లేదని కూడా అన్నారు.ఒకవైపు.. ఈ ఘటన రిపబ్లికన్ పార్టీలో పెరుగుతున్న విభేదాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికన్ కాంగ్రెస్ నియంత్రణను నిర్ణయించే కీలక ఎన్నికలు(మధ్యంతర) సమీపిస్తున్న సమయంలో ఇరాన్ యుద్ధం ట్రంప్కు రాజకీయ భారం అవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.బిల్ క్యాసిడీ.. అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్. వృత్తిరీత్యా వైద్యుడు అయిన ఆయన.. 2015 నుంచి అమెరికా సెనెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021లో ట్రంప్పై జరిగిన రెండో ఇంపీచ్మెంట్ విచారణలో ఆయన దోషిగా తేల్చాలని ఓటు వేసిన కొద్దిమంది రిపబ్లికన్ సెనేటర్లలో ఒకరు. మితవాద (Moderate) రిపబ్లికన్గా పేరున్న క్యాసిడీ, అవసరమైతే తన పార్టీ నాయకత్వాన్నీ బహిరంగంగా ప్రశ్నించే నేతగా గుర్తింపు పొందారు.ఇదిలా ఉండగా.. అమెరికా ప్రజల్లోనూ యుద్ధంపై అసంతృప్తి పెరుగుతున్నట్లు తాజా సర్వేలు సూచిస్తున్నాయి. యుద్ధం వల్ల వచ్చిన ఖర్చుకు తగిన ఫలితం లభించిందని కేవలం నలుగురిలో ఒకరు మాత్రమే భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ కూడా ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు తెలుస్తోంది.ఇంకోవైపు అమెరికా సెనెట్ ఆమోదించిన ఒక తీర్మానం కూడా ట్రంప్పై ఒత్తిడిని పెంచింది. ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని కోరుతూ తీసుకొచ్చిన ఆ తీర్మానానికి కొంతమంది రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వగా, వారిలో క్యాసిడీ కూడా ఒకరు. అయితే ఆ తీర్మానాన్ని ట్రంప్ “ప్రతీకాత్మక చర్య మాత్రమే” అంటూ కొట్టిపారేశారు. అలాంటి సందేశాలు ఇరాన్కు అమెరికా బలహీనంగా కనిపించేలా చేస్తాయని వ్యాఖ్యానించారు.మరోవైపు, ఈ అంతర్గత రాజకీయ ఉద్రిక్తతల మధ్యే ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్కు అదనంగా 70 బిలియన్ డాలర్ల యుద్ధ నిధుల కోసం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఉన్న 867 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్కు ఇది అదనంగా కావడం గమనార్హం. దీంతో యుద్ధ ఖర్చులు, వ్యూహాత్మక దిశ, రాజకీయ ప్రభావంపై అమెరికాలో చర్చ మరింత వేడెక్కుతోంది. -
యుద్ధంతో ప్రయోజనమే లేదు
ఇరాన్తో అమెరికా మధ్యంతర శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. యుద్ధ సమయంలో ఓడరేవులపై విధించిన అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఇరాన్ ముగించింది. దీంతో హార్మూజ్ జలసంధి తెరుచుకుంది. ఇరు దేశాలు శాశ్వత శాంతి కోసం కృషి చేస్తున్నాయి. ఇంతా చేసి ఈ నాలుగు నెలల యుద్ధంలో అమెరికా సాధించిందేమిటి? అగ్ర రాజ్యానికి 40 బిలియన్ డాలర్ల నష్టం మిగిల్చిన ఈ యుద్ధానికి తగిన ఫలితం వచ్చిందా? ఇదే విషయంపై రాయిటర్స్/ఇప్సోస్ జూన్ 18–22 మధ్య అమెరికాలో సర్వే నిర్వహించింది. ఇంతా చేస్తే అసలు ఈ సంఘర్షణకు విలువే లేదంటున్నారు సర్వేలో పాల్గొన్న సగం మంది అమెరికన్లు. యుద్ధానికి అయిన ఖర్చుకు తగిన ఫలితం సాధించిందని పావు వంతు అమెరికన్లు మాత్రమే నమ్ముతున్నారు. మరో పావు వంతు మాత్రం ఏమీ చెప్పలేమంటున్నారు. అమెరికా అగ్రరాజ్యం అంటే... ప్రపంచానికి పెద్దన్న పాత్ర. అలాంటి దేశానికి అధ్యక్షుడంటే ఎంతటి ప్రజామోదం ఉండాలి. కానీ.. యుద్ధ కాంక్షతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ తగ్గింది. రెండో పదవీకాలంలో అత్యల్ప స్థాయికి వచ్చింది. ఆయన ఆమోద రేటింగ్ 34%కి పడిపోయింది. ఇక, ప్రజల జీవన వ్యయంపై ట్రంప్కు ఆమోదం 22 శాతంగా ఉంది, ఇది ఆయన అధ్యక్ష పదవీకాలంలోనే అత్యల్ప స్థాయి. అంతేకాక, వైట్హౌస్లో ఆయనకు ముందున్న డెమొక్రటిక్ అధ్యక్షుడు జో బైడెన్ తన అధ్యక్ష పదవీకాలం చివరిలో పొందిన రేటింగ్ కంటే కూడా ఇది తక్కువ. బలహీన స్థితిలో అమెరికా ఇరాన్పై దాడులకు ఆదేశించడానికి ముందు ఉన్న దానికంటే అమెరికా ఇప్పుడు మరింత బలహీనమైన స్థితిలో ఉందని 35% మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అయితే, యుద్ధానికి ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇరాన్తో అమెరికా మరింత బలమైన స్థితిలో ఉందని కేవలం 23% మంది అమెరికన్లు మాతమ్రే నమ్ముతున్నారు. వీరిలో ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్కి చెందినవారు సగం మంది మాత్రమే ఉండటం గమనార్హం. శాంతి ఒప్పందం నిలవదు.. మరి ఈ మధ్యంతర శాంతి ఒప్పందంపై మెజారిటీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఒప్పందమైనా ఎక్కువ కాలం నిలస్తుందా అంటే? కష్టమేనంటున్నారు. ఇక, ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం జరిగే అవకాశం లేనే లేదని 63% మంది అమెరికన్లు చెబుతున్నారు. రిపబ్లికన్లలో దాదాపు సగం మంది, డెమొక్రాట్లలో ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే.. శాశ్వత శాంతి సాధ్యమవుతుందని 18 శాతం మంది నమ్ముతున్నారు. దీనిని విశ్వసించే వారిలో 34 శాతం రిపబ్లికన్లు, వీరిలో 10 శాతం డెమొక్రాట్లు ఉండటం గమనార్హం. పెరిగిన ద్రవ్యోల్బణం.. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని, ఖరీదైన విదేశీ యుద్ధాలకు అమెరికాను దూరంగా ఉంచుతానని వాగ్దానం చేసి ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. కానీ, మే నెలలో అమెరికా వార్షిక ద్రవ్యోల్బణం రేటు 4.2 శాతం పెరిగింది. 2023 తర్వాత ఇదే అత్యధికం. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలే జీవన వ్యయ పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. మధ్యంతర శాంతి ఒప్పందం ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గినా.. అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ముందున్న ధరతో పోలిస్తే, గ్యాసోలిన్ ధర ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. ఒక గ్యాలన్ సాధారణ పెట్రోల్ సగటు ధర 4.50 డాలర్లకు పైగా ఉన్న స్థాయి నుంచి 3.93 డాలర్లకు పడిపోయింది. అయితే, యుద్ధం ప్రారంభమవ్వడానికి ముందున్న ధరతో పోలిస్తే మాత్రం ఇది అధికమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇప్పుడు హార్మూజ్ పరిస్థితి ఏంటి? ఇంధన రవాణా కొనసాగుతోందా?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్ల దృష్టి అంతా హార్మూజ్ జలసంధిపైనే నిలిచింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం భవిష్యత్తుపై ఇటీవల అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం హార్మూజ్ జలసంధి పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ఇంధన రవాణా కొనసాగుతోందా? ప్రపంచ మార్కెట్లకు ఊరటనిచ్చేలా అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ వివరాలు తెలిపారు. హార్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణా జరగడం భారత్కు కూడా చాలా ముఖ్యం. గత 24 గంటల్లో హార్మూజ్ జలసంధి నుంచి 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు బయటకు వెళ్లిందని క్రిస్ రైట్ తెలిపారు. హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా ఘర్షణలకు ముందు ఉన్న స్థాయికి ఎక్కువగా చేరుకుందని, నౌకాదళ రక్షణతో ట్యాంకర్ రాకపోకలు క్రమంగా పునరుద్ధరణ అవుతున్నాయని క్రిస్ రైట్ తెలిపారు.ఇరాన్-ఇజ్రాయెల్/అమెరికా ఉద్రిక్తతలు, ఘర్షణల కారణంగా హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా కొంతకాలం తగ్గిపోయింది. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడటంతో, యుద్ధానికి ముందు ఎంత మేరకు చమురు ట్యాంకర్లు ప్రయాణించేవో దాదాపు అదే స్థాయికి మళ్లీ చేరుతున్నాయని క్రిస్ రైట్ చెప్పారు. నౌకాదళ భద్రత ఉండటంతో ట్యాంకర్ రాకపోకలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని తెలిపారు.72 నౌకలు.. 20 మిలియన్ బ్యారెళ్ల చమురు న్యూయార్క్లో జరిగిన రాయిటర్స్ గ్లోబల్ ఎనర్జీ ఫోరంలో క్రిస్ రైట్ మాట్లాడుతూ.. గత 24 గంటల్లో సుమారు 72 నౌకల ద్వారా 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఈ జలమార్గం గుండా తరలించారని చెప్పారు. ఈ పరిమాణం ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో దాదాపు ఐదో వంతుకు సమానం. రైట్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ముడి చమురు ఎగుమతులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్నాయి. హార్మూజ్ జలసంధిని మూసివేసే సామర్థ్యం ఇప్పుడు ఇరాన్కు లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ బెదిరింపును చాలా కాలంగా టెహ్రాన్ అత్యంత కీలక వ్యూహాత్మక సాధనంగా భావిస్తూ వచ్చింది.“జలసంధిపై ఇరాన్ ఒకప్పుడు ఉన్న ప్రభావం క్రమంగా తగ్గుతోంది” అని రైట్ అన్నారు. ఘర్షణ సమయంలో ఆ దేశ సైనిక సామర్థ్యాలు చాలా బలహీనపడ్డాయని చెప్పారు. నౌకా రవాణా మెరుగుపడటంతో ప్రపంచ చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. సరఫరా అంతరాయాలపై భయాలు తగ్గడంతో బుధవారం ప్రామాణిక ముడి చమురు ఫ్యూచర్స్ ధర బ్యారెల్కు $3 కంటే ఎక్కువగా పడిపోయింది. ఫిబ్రవరిలో ఇరాన్ ఘర్షణ ప్రారంభానికి ముందు ఉన్న కనిష్ఠ స్థాయికి చేరింది.వెనిజులాలో చమురు ఉత్పత్తి పెరుగుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రారంభంలో మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో తొలగింపు తర్వాత అమెరికా పరిపాలనలో ఆ దక్షిణ అమెరికా దేశం నుంచి ఎగుమతులు పెరిగాయని చెప్పారు.ప్రస్తుత స్థాయితో పోలిస్తే వెనిజులా చమురు ఉత్పత్తి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని రైట్ తెలిపారు. 2029లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసేలోపు రోజుకు సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరవచ్చని చెప్పారు. -
ఐఎస్ఎస్ను సముద్రంలో ముంచేస్తారా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను సముద్రంలో కూల్చేయనున్నారా? సుమారు ముప్పై ఏళ్లుగా పలు శాస్త్ర పరిశోధనలకు వేదికగా నిలిచిన ఈ భారీ అంతరిక్ష కేంద్రం ఇక గత చరిత్ర కానుందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అవునని అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా). అయితే వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఐఎస్ఎస్ను కూల్చాల్సిన అవసరమేమొచ్చింది? భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని ఈ 450 టన్నుల బరువైన కేంద్రాన్ని సముద్రంలో కూల్చేస్తే ప్రమాదమేమీ లేదా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో... ఎప్పుడో 1998లో రష్యా మొదలుపెట్టిన ఐఎస్ ఎస్ నిర్మాణం అమెరికాతోపాటు అనేక ఇతర దేశాల భాగస్వామ్యంతో 2000లో పూర్తయింది. ఆ తరువాత దశల వారీగా ఒక్కో పరిశోధన కేంద్రాన్ని జోడించుకుంటూ విస్తరించింది. మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ కూడా అందులో అనేకానేక ముఖ్యమైన ప్రయోగాలు జరిగాయి. వైద్యం, అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి పరిస్థితుల్లో పంటలెలా పండుతాయి? పదార్థాల ధర్మాలు ఎలా మారతాయి? అన్న విషయాలతోపాటు భూమిని నిత్యం పరిశీలించేందుకు కూడా ఐఎస్ఎస్ ఎంతో ఉపయోగపడింది. అయితే 1998లో తొలి మాడ్యూల్ను ప్రారంభించినçప్పుడు ఐఎస్ఎస్ వయసు 15 ఏళ్లు మాత్రమే అని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఇది అంతకు రెట్టింపు సమయం సేవలందించింది. ఫలితంగా ఈ నిర్మాణం అంత సురక్షితమైంది కాదన్న అంచనాలు ఉన్నాయి. పైగా మరమ్మతు చేయడం మరింత భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలోనే 2030 నాటికల్లా ఐఎస్ఎస్ను నెమ్మదిగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి సముద్రంలో కూల్చేయాలని నాసా ప్రతిపాదిస్తోంది. ఉపగ్రహ శ్మశానంలో... ఐఎస్ఎస్ ఒక చివర నుంచి ఇంకో చివర వరకూ ఉన్న దూరం సుమారు 358 అడుగులు. వెడల్పు 239 అడుగులు. ఎత్తు 66 అడుగులు. ఇంత భారీ సైజున్న ఐఎస్ఎస్ను కూల్చేయడం అంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పొరబాటున జనావాసాలున్న చోట కూలితే ఇక అంతే సంగతులు. అందుకే నాసా దీన్ని పాయింట్ నీమో వద్ద సముద్రంలో పడేలా చేస్తామంటోంది. కాలం చెల్లిన, అదుపు తప్పిన ఉపగ్రహాలన్నింటినీ కూల్చే ప్రాంతమే ఈ పాయింట్ నీమో. పసిఫిక్ మహాసముద్రం దక్షిణ భాగంలో న్యూజిల్యాండ్, దక్షిణ అమెరికాల మధ్య ఉంటుంది ఇది. అక్కడి నుంచి కనీసం 2,688 కిలోమీటర్ల దూరం వెళితే గానీ మనిషి అన్నవాడు కనిపించడు. పైగా ఈ ప్రాంతలో నౌకలు తిరిగేది కూడా చాలా తక్కువ. ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చే వ్యోమగాములు కూడా ఈ ప్రాంతంలోనే భూమ్మీదకు చేరుతూంటారు. ఒకవేళ అనుకోని విధంగా ఐఎస్ఎస్ ముక్కలు ముక్కలైనా ఈ నిర్మానుష్య సముద్ర ప్రాంతంలో పడటం వల్ల ఎవరికీ అపాయం జరగదన్న అంచనాతో నాసా దీన్ని ఎంచుకుందన్నమాట. పర్యావరణవేత్తల ఆందోళన... ముందుగా చెప్పుకున్నట్లు ఐఎస్ఎస్ బరువు సుమారు 450 టన్నులు. రకరకాల లోహాలు, ప్లాస్టిక్ పదార్థాలతో తయారైంది. అంతేకాకుండా... బోలెడన్ని రసాయన అవశేషాలు కూడా ఉంటాయి దీంట్లో. ఇవన్నీ పర్యావరణానికి ముఖ్యంగా సముద్ర జలచరాలకు హాని కలిగించే అవకాశాలు ఎక్కువ. అందుకే ఐఎస్ఎస్ను పాయింట్ నీమో వద్ద కూల్చాలన్న ప్రతిపాదనపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రాన్ని వ్యర్థాలను పడేసే చెత్తకుప్ప మాదిరిగా చూడొద్దని శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తంగా కూల్చేయడం కంటే... ఐఎస్ఎస్లో పనికొచ్చే వ్యవస్థలు, ఇంజిన్లు, మోటార్లను అక్కడే మరమ్మతు చేసి వాడుకోవాలని... ఎలాగైతే ఒక్కో భాగాన్ని జోడించి ఐఎస్ఎస్ను సిద్ధం చేశారో.. అదే పద్ధతిలో దశలవారీగా విడగొట్టి అత్యవసరం అనుకున్న భాగాలను మాత్రమే కూల్చేయాలని సూచిస్తున్నారు. శకలాల కారణంగా ఏ దేశానికైనా నష్టం జరిగితే ఆ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం పరిహారం చెల్లించాలని 1972 నాటి స్పేస్ లయబిలిటీ కన్వెన్షన్ చెబుతోందని, దురదృష్టవశాత్తూ ఈ నియమం సముద్రాలకు వర్తించదని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ద ఓషన్ ఫౌండేషన్’అధ్యక్షుడు మార్క్ స్పేడ్లింగ్ చెబుతున్నారు. ఈ లోటును భర్తీ చేయాల్సిన అవసరముందని స్పష్టం చేస్తున్నారు. మనుషులకు దూరంగా కూల్చేస్తున్నారని చెప్పుకుంటున్నా.. ఆ ప్రాంతానికీ ఎంతో కొంత విలువ ఉంటుందన్నది గుర్తించాలని చెబుతున్నారు. చూద్దాం ఏమవుతుందో? ఎలా కూలుస్తారంటే... → 2028లో ఐఎస్ఎస్ కూల్చివేత ప్రక్రియ మొదలవుతుంది. ఐఎస్ఎస్కు వెన్నెముక లాంటి జార్యా (రష్యా మాడ్యూల్) కక్ష్యను క్రమ పద్ధతిలో తగ్గిస్తారు. భూమి సహజ ఆకర్షణ శక్తికి గురయ్యేలా చేస్తారు. → 2029లో స్పేస్ ఎక్స్కు చెందిన డీ ఆర్బిటింగ్ అంతరిక్ష నౌక ఒకటి ఐఎస్ఎస్కు అనుసంధానమవుతుంది. సుమా రు 46 థ్రస్టర్లను ఉపయోగించి నియంత్రిత పద్ధతిలో ఐఎస్ఎస్ను పాయింట్ నిమోకు చేరుస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అగ్నిపర్వతం బుసలు.. ప్రాణాల కోసం పరుగులు!
Volcan de Fuego.. అమెరికాలో అగ్నిపర్వతం బద్ధలైంది. గ్వాటెమాలాలో అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద, పొగ, వేడి లావా వెలువడింది. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగసిపడిన బూడిద మేఘాలు, పేలుళ్ల వంటి శబ్దాలతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. దీంతో సమీపంలో ఉన్న పర్యాటకులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.వివరాల మేరకు.. సెంట్రల్ అమెరికా (Centrel America)లోని గ్వాటెమాలా (Guatemala)లో వోల్కన్ డీఫ్యూగో (Volcan Defugo) అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ క్రమంలో అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయి. ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు పొగలు విరజిమ్మాయి. అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా మంటలు, మండుతున్న రాళ్లు బుల్లెట్లలా దూసుకొచ్చాయి. దాంతో ఆ పర్వత పరిసరాల్లో ఉన్న పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.#Video 🧗🏽♀️🌋 Circula en redes sociales un video en donde durante el ascenso de un grupo de excursionistas al Volcán de Fuego, en #Guatemala, el coloso registró una erupción repentina que lanzó ceniza, rocas y material volcánico. pic.twitter.com/zhNlXA4lpp— Canal 13 Oaxaca (@canal13oaxaca) June 22, 2026 ఒక వీడియోలో ఒక పర్యాటకుడు ‘ఓరి దేవుడా, ఇది మరీ దారుణం. పరుగెత్తండి, పరుగెత్తండి..!’ అని అరుస్తూ పరుగులు తీశాడని స్థానికులు తెలిపారు. ఒక పర్యాటకుడు కుక్కను పట్టుకుని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళుతుండగా.. మరికొందరు కింద పడుతున్న శిథిలాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. కాగా, గ్వాటెమాల నగరానికి నైరుతి దిశలో సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఈ వోల్కాన్ డి ఫ్యూగో అగ్నిపర్వతం ఉన్నది. గ్వాటెమాలాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతంగా ఇది పరిగణించబడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.Guatemala: Drone footage of the first seconds of the Fuego volcano eruption. pic.twitter.com/ClBvGCrmT7— ((Hurkle Durkling)) 🇺🇸 🤟 🇮🇱 (@durklinghurkle) June 22, 2026అగ్నిపర్వత కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాద ప్రాంతాలకు వెళ్లొద్దని పర్యాటకులకు సూచనలు జారీ చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని భద్రతా చర్యలు చేపడతామని వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. అయితే ప్రకృతి విపత్తులు ఎంత ఆకస్మికంగా సంభవిస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని నిపుణులు పేర్కొంటున్నారు. పర్యాటకుల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.🌋 Lo que comenzó como una excursión terminó en una carrera por la supervivencia.Un grupo de senderistas fue sorprendido por una repentina erupción del Volcán de Fuego, en #Guatemala. Las imágenes muestran cómo los excursionistas corren para ponerse a salvo mientras columnas de… pic.twitter.com/mg6LJ0QfBc— GlobaLAT (@globaLATvideo) June 22, 2026 -
ట్రంప్నకు భారీ షాక్ ఇచ్చిన అమెరికా సెనేట్
వాషింగ్టన్ డీసీ: ఇరాన్తో జరుగుతున్న ఘర్షణ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక బలగాలను వెనక్కి తీసుకురావాలని ఆదేశించే తీర్మానాన్ని అమెరికా సెనేట్ ఆమోదించింది. ప్రభుత్వ సైనిక అధికారాలపై రెండు ప్రధాన పార్టీలు కలిసి అభ్యంతరం చెప్పిన అరుదైన ఘటనగా ఇది నిలిచింది. అలాగే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనను కాంగ్రెస్ వ్యక్తం చేసింది. ఈ తీర్మానం 50-48 ఓట్లతో ఆమోదం పొందింది. రిపబ్లికన్ సెనేటర్లు రాండ్ పాల్, సూసన్ కాలిన్స్, లిసా మర్కోవ్స్కీ, బిల్ క్యాసిడీ డెమొక్రాట్లకు మద్దతుగా ఓటు వేశారు. డెమొక్రటిక్ సెనేటర్ జాన్ ఫెటర్మన్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇంతకుముందు ఇలాంటి యుద్ధ అధికారాల తీర్మానాలకు వ్యతిరేకంగా ఉన్న రిపబ్లికన్ సెనేటర్లు మిచ్ మెక్కానెల్, డేవ్ మెక్కార్మిక్ ఈ ఓటింగ్కు దూరంగా ఉండటం వల్ల ఈ తీర్మానం ఆమోదం పొందింది.కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్పై సైనిక చర్య చేపట్టే అధ్యక్షుడి అధికారాన్ని పరిమితం చేయాలని డెమొక్రట్లు చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ ఓటింగ్ జరిగింది. ఇటీవలి వారాల్లో కొందరు రిపబ్లికన్లు కూడా ఈ ప్రయత్నాలకు క్రమంగా మద్దతు పెంచారు. ఈ తీర్మానం ఇంతకుముందు అమెరికా ప్రతినిధుల సభలోనూ 215-208 ఓట్లతో ఆమోదం పొందింది. నలుగురు రిపబ్లికన్లు డెమొక్రట్లతో కలిసి అనుకూలంగా ఓటు వేశారు.ఆ ఓటింగ్ తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్లో చట్టసభ సభ్యులపై విమర్శలు చేశారు. వారిని "గ్రాండ్స్టాండర్స్" అని పేర్కొంటూ, వారి చర్యలను "దేశభక్తికి విరుద్ధం" అని అన్నారు. రెండు సభల్లోనూ ఈ తీర్మానం ఆమోదం పొందినా, ఇది ఉమ్మడి తీర్మానం మాత్రమే. అందువల్ల అధ్యక్షుడి సంతకం అవసరం లేదు. దీనికి చట్టబద్ధ అమలు పవర్ కూడా లేదు. సెనేట్ ఓటింగ్పై స్పందించిన శ్వేతసౌధ అధికారి ఈ తీర్మాన ప్రాధాన్యాన్ని తగ్గించి చూపించారు."ఉమ్మడి తీర్మానాలు అధ్యక్షుడి వద్దకు వెళ్లవు. వాటికి చట్టబద్ధ అమలు శక్తి లేదు" అని ఆ అధికారి తెలిపారు. ఈ తీర్మానం ఎక్కువగా ప్రతీకాత్మకమేనని, కొందరు రిపబ్లికన్ సెనేటర్లు గైర్హాజరు కావటం వల్లే ఇది ఆమోదం పొందిందని కూడా ఆయన అన్నారు.శ్వేతసౌధం ఏమంటోంది? ఈ తీర్మానం అధ్యక్షుడు అమెరికా సాయుధ బలగాలను ఇరాన్పై జరుగుతున్న శత్రుత్వ చర్యల నుంచి వెనక్కి తీసుకురావాలని ఆదేశిస్తోంది. అయితే, అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. "ఏప్రిల్ 7న కాల్పుల విరమణతో శత్రుత్వ చర్యలు ముగిశాయి. అందువల్ల అమెరికా బలగాలను వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి లేదు" అని అక్కడి మీడియా తెలిపింది. ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకువచ్చిన డెమొక్రటిక్ సహాయకుడు ఈ అభిప్రాయాన్ని ఖండించారు. ఈ తీర్మానం అమల్లో ఉంటుందని, దీని ప్రభావంపై విభేదాలు వస్తే అది న్యాయపరమైన అంశంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఈ ఏడాది ఆరంభం నుంచి ఇరాన్కు సంబంధించిన యుద్ధ అధికారాలపై సెనేట్ ఇప్పటికే 10 సార్లు ఓటింగ్ నిర్వహించింది. గత నెలలో సెనేట్ మద్దతు పొందిన మరో ప్రతిపాదన ముందుకు వెళ్లినా, తుది ఓటింగ్ ఇంకా జరగలేదు. ఆమోదానికి అవసరమైన మద్దతు సమకూర్చేందుకు డెమొక్రటిక్ చట్టసభ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నా, భవిష్యత్తులో ఇరాన్కు సంబంధించిన ఏ సైనిక చర్య జరిగినా కాంగ్రెస్ పర్యవేక్షణ ఉండాలని కొందరు డెమొక్రటిక్ సెనేటర్లు పట్టుబడుతున్నారు. ఈ తీర్మానం యుద్ధ అధికారాల సమతుల్యతపై అమెరికా కాంగ్రెస్, అధ్యక్షుడి మధ్య వాషింగ్టన్లో కొనసాగుతున్న చర్చకు ప్రతిబింబంగా నిలిచింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో అమెరికా సైనిక ప్రమేయంపై ఈ చర్చ సాగుతోంది. -
అమెరికాలో ఘనంగా ‘మాటా’ మహాసభలు
ఫిలడెల్ఫియా(అమెరికా): ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) 2వ మహాసభలు ఘనంగా జరిగాయి. పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్, ఫెయిర్గ్రౌండ్స్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. 7,500 మందికి పైగా తెలుగు కుటుంబాలు పాల్గొనడంతో ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద తెలుగు సమ్మేళనంగా నిలిచింది.సినీ ప్రముఖులు ఈ వేడుకలను మరింతా కలర్ఫుల్గా మార్చారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్, దేవీశ్రీ ప్రసాద్, జయప్రద, సుమన్, అలీ, యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్ మాచిరాజు, విషి అయ్యర్ (హాలీవుడ్ నటుడు), శివారెడ్డి, అధిరే అభి, సునామి సుధాకర్, మిమిక్రీ రమేష్ తదితరులు తమ ఫార్మార్మెన్స్తో ఆహూతులను అలరించారు. గాయకుడు రామ్ మిర్యాల లైవ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి రోజు హోస్ట్ గా యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహా, రెండవ రోజు యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించి వేడుకలను మరింతా ఉత్తేజ పరిచారు.ఈ వేడుకల్లో ప్రముఖ నటి జయప్రదకు MATA లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. అలాగే ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డులను డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, డాక్టర్ హరినాథ్ పోలిచర్లలకు అందజేశారు. సమాజ సేవ, వ్యాపారం, కళలు, వైద్యం, ఆవిష్కరణలు తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి MATA ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. టీ.పీ. శ్రీనివాస్ రావు (బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్), భాస్కర్ గంటి (ఫిలాంత్రఫీ), సాయినాథ్ కర్నాటి (యంగ్ ఎంటర్ప్రెన్యూర్), స్వాతి అట్లూరి (ఆర్ట్స్ & కల్చర్), 24. దాము గేదల (కమ్యూనిటీ సర్వీస్), డా. విజయ భాస్కర్ బొల్గం (హ్యూమానిటేరియన్ సర్వీస్), నాగేశ్వరరావు పూజారి (ఫిల్మ్ కేటగిరీ), రాజు చామర్తి (గ్లోబల్ తెలుగు హెరిటేజ్), కృష్ణ మద్దిపట్ల (కమ్యూనిటీ సర్వీస్) అవార్డులు అందుకున్నారు.ఈ వేడుకల్లో సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) లైవ్ కాన్సర్ట్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రపంచ స్థాయి ఆడియో-విజువల్ సాంకేతికత, లైటింగ్, నిర్వహణతో ఈ కార్యక్రమం స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది.ఈ మహాసభలు గ్రాండ్ బ్యాంక్వెట్తో ప్రారంభమయ్యాయి. తెలుగు, భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఆకట్టుకుంది. ప్రధాన మహాసభ మత సామరస్యానికి ప్రతీకగా ఇమామ్, క్రైస్తవ పాస్టర్, హిందూ పూజారి సంయుక్త ప్రార్థనలతో ప్రారంభమైంది. అనంతరం శ్రీ సీతారామ శోభాయాత్ర, భద్రాచల సీతారామ కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.ఈ మహాసభల్లో నాయకత్వం, వ్యాపారం, కృత్రిమ మేధస్సు (AI), మహిళా సాధికారత, వైద్యం, న్యాయం, రాజకీయాలు, సాహిత్యం, యువజన అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక ఫోరమ్లు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సెలబ్రిటీ ఇంటరాక్షన్లు, నెట్వర్కింగ్ సెషన్లు, ఎగ్జిబిషన్లు విశేష ఆదరణ పొందాయి.MATA సింగింగ్ స్టార్ మహాసభలోని ప్రధాన సాంస్కృతిక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచి, ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 300 మందికి పైగా గాయకుల పాల్గొనడం విశేషం.MATA అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడల నాయకత్వంలో, వ్యవస్థాపకులు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గణగోని, ప్రదీప్ సామల, అలాగే అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు జితెందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గేదల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్, కన్వెన్షన్ కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్ చిలకపాటి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నారాల, స్పిరిచ్యువల్, మెంబర్షిప్ డైరెక్టర్ శిరీష గుండపునేని, ప్రోగ్రామ్స్ డైరెక్టర్ స్వాతి అట్లూరి, అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంట్యాల, ఇండియా కోఆర్డినేటర్ డా. విజయ భాస్కర్ బొల్గం, పబ్లిసిటీ, మీడియా డైరెక్టర్ ప్రశాంత్ శ్రీపెరంబుదూరు, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖాజానా, తదితరుల సేవలు మహాసభల విజయానికి కీలకమైన పాత్ర వహించాయని 'మాటా' నిర్వహకులు ప్రకటించారు.సేవ, సంస్కృతి, సమానత్వం అనే MATA ఆశయాలను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ మహాసభలు ప్రపంచ తెలుగు సమాజ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. -
హార్మూజ్ను దాటి భారత్ వైపు...
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన డీల్తో భారత జెండా కలిగిన 11 నౌకలు హార్మూజ్ను దాటేశాయని విదేశాంగ శాఖ మంగళవారం తెలిపింది. భారతీయ జెండా కలిగిన 10 నౌకలు ఇప్పటికీ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే ఉన్నాయి. తాజాగా, వాటికి మరో రెండు జతయ్యాయి’అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్జైశ్వాల్ మీడియాకు తెలిపారు.అమెరికా, ఇరాన్ డీల్ కుదిరిన తర్వాత 11 నౌకలు హార్మూజ్ను దాటేశాయన్నారు. వీటిలో 2.85 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు కలిగిన మూడు ట్యాంకర్లు ఉన్నాయని వివరించారు. వీటితోపాటు విదేశీ జెండాలు కలిగిన ఒక ఎల్పీజీ నౌక, మరో ముడిచమురు ట్యాంకర్ కూడా ఉన్నాయి. ఇవికాకుండా, ఎరువులతో వస్తున్న ఆరు విదేశీ నౌకలున్నాయన్నారు. మిగతా నౌకలు కూడా త్వరలోనే హార్మూజ్ను దాటే అవకాశాలున్నాయని జైశ్వాల్ పేర్కొన్నారు. -
స్టూడెంట్ వీసాలకు ఎక్స్పైరీ డేట్
వాషింగ్టన్: భారతీయ టెక్ నిపుణులు అత్యధికంగా వినియోగించుకునే హెచ్–1బీ వంటి వీసాలపై కఠిన ఆంక్షలను తీసుకువచ్చిన అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం..విదేశీ విద్యార్థి వీసా విధానంలోనూ తీవ్ర మార్పులకు శ్రీకారం చుట్టింది. విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉండే భారతీయ విద్యార్థులు వీటితో ఇబ్బందులు పడే అవకాశముంది. తాజా మార్పు ప్రకారం.. అంతర్జాతీయ విద్యార్థులు దేశంలో ఎంతకాలం ఉండేందుకు వీలుందో తెలియజేసే ఎక్ప్పైరీ తేదీని సైతం ముందుగానే నిర్ణయిస్తారు. ఇందుకు సంబంధించి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పంపిన ప్రతిపాదనపై అధ్యక్ష భవనం ఆమోదం తెలిపింది.ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి రానుంది. దీని ప్రకారం విదేశీ విద్యార్థులు స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఇకపై గరిష్టంగా నాలుగేళ్లపాటు మాత్రమే ఉండేందుకు అవకాశముందని బ్లూమ్బర్గ్ పత్రిక తెలిపింది. ఎఫ్–1 స్టూడెంట్ వీసాదారులు, జె–1 ఎక్సే్ఛంజి విజిటర్ వీసాలు కలిగిన వారు, ఇతర వీసా కేటగిరీ వారు ఇందులోకి వస్తారు. ఈ మార్పు అత్యధిక సంఖ్యలో అమెరికాలో చదువులు కొనసాగించే భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. నాలుగేళ్లకు మించి కొనసాగే పీహెచ్డీ, పరిశోధక, ఇతర దీర్ఘకాల కోర్సుల్లో నమోదై ఉన్న భారతీయ విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశముంది. వీరి చదువు నిర్ణిత కాల పరిమితిని దాటినట్లయితే గడువు పొడిగించాలంటూ ఇమిగ్రేషన్ అధికారులను తప్పక కోరాల్సి ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్కు బదులుగా.. ప్రస్తుతమున్న ’డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానాన్ని అనుసరించి అంతర్జాతీయ విద్యార్థులు తమ విద్యా కోర్సుల్లో కొనసాగుతూ, వీసా నిబంధనలను పాటిస్తున్నంత కాలం అమెరికాలో ఉండటానికి సాధారణంగానే అనుమతి లభిస్తుంది. దీనివల్ల విద్యార్థులు తమ చదువును పొడిగించుకోవడానికి, ఒక విశ్వవిద్యాలయం నుంచి మరో విశ్వవిద్యాలయానికి మారేందుకు, కోర్సుల మార్పునకు, డిగ్రీ నుంచి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సులువుగా ఉంది. కొత్తగా ప్రవేశ అనుమతి కాలపరిమితిని కోరకుండానే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ), స్టెమ్ ఓపీటీలను పూర్తి చేయడానికి అవసరమైన వెసులుబాటు వారికి దొరికేది. తాజా నిబంధన అమలైతే ఈ పాత పద్ధతి ముగియనుంది.బదులుగా విద్యార్థులు దేశంలో చట్టబద్ధంగా ఉండేందుకు ఇమిగ్రేషన్ విభాగం ఒక నిర్దేశిత కాలపరిమితిని మాత్రమే మంజూరు చేస్తుంది. ఈ నిబంధన ఇంకా అధికారికంగా అమల్లోకి రానప్పటికీ, ఇందుకు సంబంధించిన గత సూచనల ప్రకారం, చాలా మంది విద్యార్థులకు గరిష్టంగా నాలుగేళ్ల ప్రవేశ కాలపరిమితి మాత్రమే లభిస్తుందని అధికారులు అంటున్నారు. నాలుగేళ్ల పరిమితితో సాగే కోర్సులు చదివే విద్యార్థులు మాత్రమే దేశంలో చట్టబద్ధంగా ఉండటానికి ’యూఎస్ సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్విసెస్’ (యూఎస్సీఐఎస్) నుంచి ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుంది.ఈ ప్రక్రియలో అదనపు పత్రాల సమర్పణ, బయోమెట్రిక్ నమోదు, మరింత కఠినమైన పరిశీలన, ప్రాసెసింగ్లో ఆలస్యం వంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈ కొత్త నిబంధన ఇప్పటికే వైట్ హౌస్లోని ’ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్’ సమీక్షను పూర్తి చేసుకుంది. అధికారిక ప్రచురణ, పూర్తిస్థాయి అమలుకు ముందు చివరి విధానపరమైన దశల్లో ఇదొకటి. 30 శాతం మంది భారతీయ విద్యార్థులే ఈ మార్పు భారతీయ విద్యార్థులపై గణనీయమైన ప్రభావం చూపనుంది. అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. 2023–24 విద్యా సంవత్సరంలో అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో 3.31లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లు ఓపెన్ డోర్స్ సంస్థ తన నివేదికలో తెలిపింది. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల వాటా ఏకంగా 30 శాతం వరకు ఉండటం గమనార్హం.వీరిలో చాలా మంది విద్యార్థులు డాక్టోరల్ డిగ్రీలు, విస్తృత పరిశోధనలతో కూడిన మాస్టర్స్ ప్రోగ్రాంలు, కొన్ని రకాల ప్రొఫెషనల్ కోర్సులతో కలిపి సాధారణంగా నాలుగేళ్లకు మించి సాగే విద్యా కోర్సుల్లోనే నమోదై ఉన్నారు. కొత్త నిబంధనల ప్రకారం, వీరంతా తమ చదువును నిరంతరాయంగా కొనసాగించాలంటే అదనపు ధ్రువీకరణలను, ఇమిగ్రేషన్ అధికారుల కఠినమైన పరిశీలనను ఎదుర్కోవాల్సి రావచ్చు. అనిశ్చితిని సృష్టిస్తుంది: ఏఏయూఅసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్ (ఏఏయూ), అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ), ఎన్ఏఎఫ్ఎస్ఏ వంటి ప్రముఖ విద్యా సంస్థల కూటములు ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చదువు, పరిశోధనల సమయం తరచూ మారుతూ ఉండే కోర్సుల విద్యార్థుల విషయంలో నిర్దేశిత కాలపరిమితి విధానం తీవ్రమైన అనిశ్చితిని సృష్టిస్తుందని ఈ గ్రూపులు వాదిస్తున్నాయి.అలాగే, ఇది వర్సిటీల పరిపాలనా పరమైన భారాన్ని పెంచుతుందని, సుదీర్ఘ రీసెర్చ్, పీహెచ్డీ కోర్సుల విద్యార్థులు చట్టబద్ధమైన హోదాను కాపాడుకోవడం మరింత కష్టతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పైపెచ్చు, విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో పని అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పించే ’ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’(ఓపీటీ పైనా ప్రభావం చూపుతుంది. వీసా గడువు పొడిగింపునకు అధికారులు ఆమోదం తెలపడంలో ఏమాత్రం ఆలస్యమైనా అది విద్యార్థులు తమ చదువు ముగించుకుని ఉద్యోగంలోకి మారే ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తుంది. గడువు ముగిస్తే అక్రమంగా ఉంటున్నట్లేవైట్హౌస్ ఆమోదించిన ప్రతిపాదనల్లో మరో ఆందోళనకరమైన అంశం ఉంది. దీని ప్రకారం..విద్యార్థులకు అనుమతించిన కాలపరిమితి ముగిసిన వెంటనే వారు దేశం విడిచి వెళ్లిపోవడం తప్పనిసరి. లేకుంటే దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లే లెక్క. ప్రభుత్వ విభాగాల్లో పరిపాలనాపరమైన ఆలస్యం, దరఖాస్తుల పెండింగ్, ఇతర చిన్నపాటి పొరపాట్ల వల్ల విద్యార్థులు ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల, జరిమానాలను చెల్లించాల్సి రావడంతోపాటు భవిష్యత్తులో అమెరికాకు తిరిగి రాకుండా ప్రయాణ ఆంక్షలు వంటి కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి రావచ్చు.గతంలోనే తెచ్చినా అమలు కాలేదుహోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ ప్రతిపాదనను మొదటగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి పదవీకాలంలోనే తీసుకువచ్చింది. కానీ, అప్పట్లో ఇది అమలు కాలేదు. ట్రంప్ మళ్లీ బాధ్యతలు చేపట్టాక ఈ ఆలోచనను 2025లో మళ్లీ తెరపైకి తెచ్చారు. ఇప్పుడు వైట్ హౌస్ ఆమోదం కూడా లభించడంతో, ఇది త్వరలోనే అధికారిక విధానంగా మారేందుకు అవకాశమేర్పడింది. ప్రస్తుతానికి పాత నిబంధనల్లో ఎలాంటి మార్పూ లేదు. అంతర్జాతీయ విద్యార్థులు ప్రస్తుత డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంలో భాగంగానే అమెరికాలో కొనసాగవచ్చు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే గత కొన్ని దశాబ్దాలలో యూఎస్ స్టూడెంట్ వీసా వ్యవస్థలో వచ్చిన అతిపెద్ద మార్పుల్లో ఒకటిగా నిలుస్తుంది. -
మనతోనే ధైర్యలక్ష్మి
‘నువ్వు చేయలేవు’ అని ఎవ్వరైనా అంటే... ఆ పనిని చేసి నిరూపించడమే నా పని’ అంటారు తెలంగాణలోనిపాలకుర్తి వాసి ఝాన్సీరెడ్డి. అమెరికాలో పురుషాధిక్య రంగమైన రియల్ఎస్టేట్ రంగంలో రాణించి, ‘వెటా’ స్వచ్ఛంద సంస్థ ద్వారా అక్కడి తెలుగు మహిళల సాధికారతకు కృషి చేస్తున్నారు. పుట్టినగడ్డకు సేవలు అందిస్తూ, తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నేటినుంచి ‘విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) ఇండియా’ ద్వారా ఈ సేవలు దేశవ్యాప్తం చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డి పంచుకున్న విషయాలు...‘‘పురుషాధిక్య సమాజంలో మహిళ ఎప్పుడూ అణచివేతకు గురవుతూనే ఉంటుంది అది ఏ దేశమైనా. కానీ, మహిళలు తమ శక్తిని తెలుసుకుంటూ, సత్తా చూపుతూ, ప్రత్యేకతను చాటుతూనే ఉండాలి. అప్పుడే భావి తరాలకు ఉపయోగపడేలా మన జీవనవిధానం రూపుదిద్దుకుంటుంది. సాధారణంగా ఏదైనా పనిని ఎంచుకున్నప్పుడు దానిని పూర్తి చేసేదాకా వదలని స్వభావం నాది. ఆ స్వభావమే నన్ను అన్నింటా ముందుంచింది. అమెరికాలో తెలుగు మహిళల సమస్యల గురించి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉండేవి.దేశం కాని దేశంలో తమ వారికి దూరంగా ఉంటూ వారు పడుతున్న బాధలు విన్నప్పుడల్లా ఆలోచించేదాన్ని. వారికి అండగా ఉండేందుకు ‘వెటా’ అనే స్వచ్ఛంద సంస్థను 2019లో ప్రారంభించాను. దీని ద్వారా తెలుగు మహిళల హక్కులు, న్యాయ సమస్యలు, సాధికారత కోసం వర్క్ చేశాను. దీంతోపాటు పుట్టిల్లు, అత్తిల్లు ప్రాంతాలైన ఖమ్మం, వరంగల్ జిల్లాలోనూ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాను. విద్య, వైద్యకేంద్రాలకు భవనాలు, తాగునీటి ట్యాంకులు.. అవసరం ఎంత వరకు ఉందో గుర్తించి, ఆ దిశగా పనులు చేస్తూ వచ్చాను.అడ్డుకుంటే .. మరింత శక్తిగా...సేవాకార్యక్రమాలలో చురుగ్గా ఉండే నాకు అనుకోని అవాంతరం కలిగింది. ఖమ్మం జిల్లాలోని స్కూల్, కాలేజీ విద్యార్థినులకు ఉచిత శానిటరీ ΄్యాడ్స్ పంపిణీని ఏర్పాటు చేశాం. దానిని కొందరు పెద్దలు అడ్డుకున్నారు. పేరు ప్రఖ్యాతులు ఆశించి ఈ పనులు చేస్తున్నారు అన్నారు. ఆడపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఓ మంచి పనికి రాజకీయ రంగు పులమడం బాధగా అనిపించింది. నా వరకు నేను అమెరికా నుంచి వర్క్ చేస్తున్నాను. కానీ,‘మంచి పనులకు కూడా అడ్డు పడుతుంటారా..’ అనేది నన్ను ఆలోచించేలా చేసింది. మహిళలు ఎక్కడైనా మహిళలే. అన్నిచోట్లా, అన్నివిధాలా, అన్నిరంగాలలోనూ వివక్షకు లోనవుతూనే ఉన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ‘వెటా’(విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఫర్ ఇండియా)ను విస్తృతం చేయాలనుకున్నాను. దాంట్లో భాగంగా అమెరికా నుంచి పూర్తిగా ఇండియాకు వచ్చేశాను.మరింత విస్తృతంగా..నా భర్త అమెరికాలో కార్డియాలజిస్ట్. ముగ్గురు కొడుకులూ వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. చిన్నకొడుకు, కోడలు మినహా మిగతా అందరూ అమెరికాలోనే ఉన్నారు. పుట్టిన ప్రాంతానికి సేవలు అందించాలనే ఉద్దేశాన్ని వాళ్ల ముందుంచినప్పుడు ‘తమ పూర్తి మద్దతును ఇస్తామ’న్నారు. నా స్వశక్తినే పెట్టుబడిగా ఈ రోజు ‘వెటా’ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నాం.దీంట్లో బాలికావిద్య, వైద్యం, మహిళల వృత్తి, ఉద్యోగాలలో స్థిరపడేలా చూడటం .. ముఖ్యమైనవి. బాలికల విద్య పట్ల వారి తల్లిదండ్రుల్లో అవగాహన తీసుకురావడం, కేంద్ర, రాష్ట్ర పథకాలు సవ్యంగా అందేలా చూడటం, మహిళ సాధికారత వెటా ముఖ్య ఉద్దేశం. దీనికి 300 మంది ఒక టీమ్గా ఏర్పడి పనులు చేయనున్నారు. మొదట తెలంగాణ మొత్తంగా జిల్లా, మండలస్థాయిలో ‘వెటా’ ద్వారా నూటికి నూరుశాతం సేవలు అందేలా చూస్తాం. కూతురుగా, భార్యగా, తల్లిగా.. మహిళలకు ఏ దశలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయో గుర్తించి, వారికి చేయూతను అందివ్వడం ‘వెటా’ లక్ష్యం.సాధ్యం కానిదంటూ ఏమీ లేదు...నా విషయానికే వస్తే.. పదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాను. పెద్దనాన్నతోపాటు దేశం దాటి వెళ్లి పోయాను. ఎలా ఉండాలో తెలియని ప్రాంతంలో అక్కడి వాతావరణానికి తగ్గట్టు నన్ను నేను మలుచుకున్నాను. టెన్ ్త పూర్తయ్యాక సెలవుల్లో ఇండియాకు వచ్చినప్పుడు పదహారేళ్ల వయసులోనే పెళ్లి అయింది. నా భర్త డాక్టర్గా న్యూజెర్సీలో ప్రాక్టీస్ చేశారు. పెళ్లయ్యింది కాబట్టి ఇక ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అనుకోలేదు. చదువుకుంటూనే ఉద్యోగం చేసేదాన్ని. ఏ దేశం లో ఉన్నా భార్యాభర్త ఇద్దరూ పనిచేస్తేనే వారి జీవితాలు కూడా వృద్ధిలోకి వస్తాయని నమ్ముతాను.అలా ప్లస్ టూ పూర్తవగానే బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాను. కానీ, పై చదువులు చదవాలన్న ఆసక్తితో సాయంత్రాలు చదువుకుంటూ, పగటివేళ ఉద్యోగం చేశాను. పిల్లలు పుట్టడంతో వారి బాగోగులు చూసుకునే క్రమంలో ఉద్యోగానికి ఫుల్స్టాప్ పడింది. అయినా ఖాళీగా లేకుండా మా వారి హాస్పిటల్ నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకున్నాను. దీనివల్ల వచ్చిన అనుభవంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి మారాను. పురుషాధిక్య రంగం అది. అయినా, వెనకంజ వేయలేదు. ఈ రంగంలోనూ నన్ను నేను వ్యాపారవేత్తగా నిరూపించుకున్నాను. చాలామంది అంటుంటారు డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు అని. కానీ, ఉండాల్సింది మనో ధైర్యమే. చేయాల్సిన పని పట్ల నిబద్ధత, భవిష్యత్తు పట్ల ఫోకస్.. ఇవే మన విధిని నిర్దేశిస్తాయి. నా వరకు నేను సంపాదించేవారు ఉన్నారు కదా అని ఇంట్లో కూర్చోలేదు. నాకు నేనుగా సంపాదించుకున్న ఒక్క డాలర్ మిలియన్ డాలర్లతో సమానంగా భావించేదాన్ని. అందుకే ఏనాడూ ఖాళీగా లేను.ఉద్యోగినిగా, గృహిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా, వ్యాపారవేత్తగా.. నాపాత్రలకు సముచిత న్యాయం చేస్తూనే ఈ రోజు నా సాటివారికి చేయూతగా నిలుద్దామని మీ ముందుకు వచ్చాను. స్త్రీని లక్ష్మితో పోలుస్తారు. ధైర్యలక్ష్మి మనతో ఉంటే అన్నీ ఉన్నట్టే. మనతోపాటు మరికొంతమందిని వృద్ధిలోకి తీసుకురాగలం’’ అంటూ చేస్తున్న సేవాకార్యక్రమాలు, వాటి అమలు గురించి వివరించారు ఆమె.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
ఇంట్లోకి దూసుకెళ్లిన టెస్లా: స్పందించిన మస్క్!
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ఒక టెస్లా మోడల్ 3 కారు అధిక వేగంతో ఓ ఇంటిలోకి దూసుకెళ్లడంతో 76 ఏళ్ల మహిళ మరణించింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టం ఉపయోగించినట్లు సమాచారం రావడంతో, టెస్లా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై ప్రశ్నలు తలెత్తాయి.ప్రమాదం ఎలా జరిగింది?స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. 44 ఏళ్ల మైఖేల్ బట్లర్ కారును డ్రైవ్ చేసే సమయంలో ఒక ఇంటిని ఢీకొట్టాడు. ఈ ప్రమాద సమయంలో డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ యాక్టివ్గా ఉన్నట్లు అతను విచారణాధికారులకు తెలిపారు. కారు ఇంటి గోడను బలంగా ఢీకొట్టి లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 76 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినప్పటికీ, కొంతసేపటి తరువాత మరణించారు.కుటుంబ సభ్యుల ప్రకారం.. కారు ఢీకొట్టిన ప్రదేశంలో (ఇంట్లో) పిల్లలు తరచుగా ఉండేవారు. కానీ ఆ రోజు ఎవరూ లేదు. మహిళ తప్పా.. మరెవరికి ప్రమాదం జరగలేదు.ప్రమాదంలో డ్రైవర్ కూడా గాయపడ్డాడు. అయితే అధికారులు అతడు మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలను సేవించినట్లు లేదని తెలిపారు. కాగా ప్రస్తుతం అతను దర్యాప్తుకు సహకరిస్తున్నాడు. ఇప్పటివరకు అతనిపై ఎటువంటి కేసులు లేదా అభియోగాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు.దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రమాదం సమయంలో కారు ఏ సిస్టమ్ను ఉపయోగిస్తోందో స్పష్టంగా తెలియలేదు. అది టెస్లా 'ఆటోపైలట్' వ్యవస్థనా, లేక ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD)నా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.BUSINESS INSIDER you lying fucks. Prepare to be sued. pic.twitter.com/k68q64QvrB— Pete Balls to the wall FSD 🤖🚕 (@kylaschwaberow) June 22, 2026ఎలాన్ మస్క్ స్పందనఈ ఘటనపై వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ స్పందిస్తూ, డ్రైవింగ్ సిస్టమ్ కారణంగా ప్రమాదం జరిగిందనే ఆరోపణలను ఖండించారు. ఆయన ప్రకారం.. FSD వ్యవస్థను నివాస ప్రాంతాల్లో చాలా తక్కువ వేగంతో ప్రయాణించేలా రూపొందించినట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదం అధిక వేగంతో జరిగింది కాబట్టి, ఈ ఆరోపణలు సరైనవిగా కనిపించడం లేదని చెప్పారు.టెస్లా ఏఐ విభాగం వివరణటెస్లా ఏఐ హెడ్ అశోక్ ఎల్లుస్వామి కూడా స్పందించారు. డ్రైవర్ యాక్సిలరేటర్ను పూర్తిగా (100%) నొక్కి స్వయంచాలక డ్రైవింగ్ను మాన్యువల్గా ఓవర్రైడ్ చేశాడు. ప్రమాదం సమయంలో కారు గంటకు సుమారు 73 మైళ్ల (దాదాపు 117 కి.మీ.) వేగంతో ప్రయాణించింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా యాక్సిలరేటర్ నొక్కిన స్థితిలోనే ఉందని టెస్లా డేటా సూచిస్తోందని తెలిపారు.Yup. In this case, the driver manually overrode self-driving by pressing the accelerator all the way to 100% of the accel pedal in this residential area. They reached a speed of 73 mph during the crash, and had the accelerator pressed even after the crash.— Ashok Elluswamy (@aelluswamy) June 22, 2026 -
ట్రంప్ కొత్త నిర్ణయం.. లక్షల మంది ఇండియన్లకు షాక్
-
గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ సర్కారు బిగ్ షాక్!
వాషింగ్టన్: అమెరికా పౌరసత్వం కోసం కలలు కంటున్న విదేశీయులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. యూఎస్ పౌరసత్వ దరఖాస్తు రుసుములను ఏకంగా 75 శాతం మేరకు పెంచడంతో పాటు, వలసదారులకు ఇచ్చే ఫీజు మినహాయింపులను (ఫీజ్ వైవర్స్) పూర్తిగా రద్దు చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ప్రతిపాదించింది. వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ యంత్రాంగం చట్టబద్ధమైన పౌరసత్వ ప్రక్రియను మరింత కఠినతరం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులపై ఈ నిబంధనలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఫీజుల మోత.. ఎంత పెరగనుంది?యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన ప్రతిపాదనల ప్రకారం సాధారణ పేపర్ ఫైలింగ్ (Form N-400) ఫీజు ప్రస్తుతమున్న $760 నుండి ఏకంగా $1,330(రూ.64,000 నుండి రూ.1,13,050)కి పెరగనుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు కూడా $710 నుండి $1,280(రూ.59,000 నుండి రూ. 1,09,000)కి చేరనుంది. వీటితో పాటు, అప్పీల్ బోర్డు ముందు పునఃపరిశీలన కోరేందుకు సమర్పించే ఫామ్ (Form N-336) ఫీజు సైతం $830 నుండి $1,475 కి, అంటే సుమారు 77.7 శాతం పెంచాలని ప్రతిపాదించారు. దరఖాస్తుల స్క్రీనింగ్, వెట్టింగ్ ప్రక్రియలకు అయ్యే పూర్తి ఖర్చును దరఖాస్తుదారుల నుంచే వసూలు చేయాలన్నది ట్రంప్ ప్రభుత్వ ఆలోచనగా అధికారులు చెబుతున్నారు.ఫీజు మినహాయింపులకు శాశ్వతంగా చెక్ఇప్పటివరకు తక్కువ ఆదాయం ఉన్నవారికి, ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నవారికి అందుబాటులో ఉన్న ‘ఫీజ్ వైవర్స్’ (రుసుము మినహాయింపులు) విధానాన్ని ఈ కొత్త రూల్ పూర్తిగా రద్దు చేయనుంది. అలాగే ఫెడరల్ పేదరిక మార్గదర్శకాలకు లోబడి ఉన్నవారికి వర్తించే $380 తగ్గింపు ఫీజు (Reduced fee) సౌకర్యం కూడా ఇకపై ఉండదు. ఉచిత లేదా తక్కువ ఫీజులు ఉండటం వల్ల అర్హత లేనివారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని డీహెచ్ఎస్ వాదించింది. అయితే, చట్టప్రకారం యూఎస్ సాయుధ దళాలలో పనిచేస్తున్న వారికి మాత్రం ఈ ఫీజుల నుండి మినహాయింపు కొనసాగుతుంది.అమలు ఎప్పటి నుండి..ఈ ప్రతిపాదిత నిబంధనలు తక్షణమే అమలులోకి రావు. ఈ ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలియజేయడానికి 60 రోజుల సమయం ఉంటుంది. ఆ తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుంది. కాగా, గత నెలలోనే గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు దేశం విడిచి వెళ్లి తమ స్వదేశాల్లో ప్రక్రియ పూర్తి చేయాలంటూ జారీ చేసిన మెమో ఇప్పటికే వలసదారులను కలవరపెట్టగా, తాజా ఫీజుల పెంపు ప్రతిపాదన వారిని మరింత ఆందోళనలోకి నెట్టింది. తరతరాలుగా వలసలను ప్రోత్సహించిన అమెరికా, ఇప్పుడు దానికి భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోందని నిపుణులు విమర్శిస్తున్నారు. -
పాక్పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్ను దాచారంటూ ఆగ్రహం!
వాషింగ్టన్: అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న కీలకమైన శాంతి చర్చల్లో పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించడంపై అమెరికాకు చెందిన ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇస్తూ, వారికి ఆశ్రయం కల్పించే చరిత్ర కలిగిన దేశాలను నమ్మి చర్చలు జరపడం ఏంటని వారు ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ స్విట్జర్లాండ్లో పాక్, ఖతార్ ప్రతినిధులతో కలిసి చర్చల్లో పాల్గొన్న నేపథ్యంలో ఈ సంచలన వ్యాఖ్యలు వెలువడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.ఉగ్రవాదులకు ఆశ్రయం: సెనేటర్ రిక్ స్కాట్ ఆగ్రహంఫ్లోరిడా సెనేటర్ రిక్ స్కాట్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా అమెరికా ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. అసలైన మిత్రులు ఎవరో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్, ఖతార్ దేశాలకు దశాబ్దాల చరిత్ర ఉందని ఆరోపించారు. ఇరు దేశాలు శాంతి స్థాపన కంటే ఇరాన్ సాగిస్తున్న ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయని మండిపడ్డారు. అయితే, ఎలాంటి ఒప్పందం కుదిరినా ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసే అవకాశం మాత్రం శూన్యమని ఆయన స్పష్టం చేశారు.లాడెన్ను దాచారు: ఐఎస్ఐపై తీవ్ర ఆరోపణలుమరోవైపు మొంటానా సెనేటర్ టిమ్ షీహీ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు పదేళ్లపాటు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిందనే నిజాన్ని ఎవరూ మరువలేరని ఆయన గుర్తుచేశారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ద్వారా అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే తిరుగుబాటుదారులకు నిధులు అందించారని, ఇరాన్ నాయకత్వానికి మద్దతుగా నిలిచారని ఆరోపించారు. అలాంటి దేశాలు ఈ చర్చల్లో నిష్పక్షపాతంగా మధ్యవర్తిత్వం వహిస్తాయని అనుకోవడం ముమ్మాటికీ తప్పేనని ఆయన తేల్చిచెప్పారు.అసలైన మిత్రులు వీరేమధ్యప్రాచ్యంలో అమెరికాకు నమ్మకమైన భాగస్వాములు వేరే ఉన్నారని సెనేటర్ షీహీ అభిప్రాయపడ్డారు. ఖతార్ దేశం ఉగ్రవాద సంస్థలకు దశాబ్దాలుగా మనీలాండరింగ్ చేస్తోందని ఆరోపిస్తూ.. చర్చల్లో పాక్, ఖతార్లకు బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి దేశాలను భాగస్వామ్యం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈ దేశాలే అమెరికాకు నిజమైన అండగా నిలుస్తాయని, కాబట్టి యూఏఈ, ఇజ్రాయెల్ల వైపు అమెరికా స్పష్టమైన మద్దతుతో నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. -
వాన్స్ను ముందుకు నెట్టి.. ట్రంప్ సేఫ్ గేమ్?
స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధి బృందం అకస్మాత్తుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదనే ప్రచారం వైరల్ కాగా.. మరోవైపు, ఇరాన్తో కుదురుతున్న వివాదాస్పద ఒప్పందం విజయవంతమైతే కీర్తి ట్రంప్దే, విఫలమైతే నింద మాత్రం వాన్స్పైనే పడేలా రాజకీయ వ్యూహం నడుస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ సమావేశ మందిరంలోకి వచ్చి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్తో మాట్లాడి, అనంతరం అమెరికా ప్రతినిధుల వైపు చూడకుండానే వెనుదిరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిని చాలామంది అమెరికాకు, ముఖ్యంగా జేడీ వాన్స్కు జరిగిన దౌత్యపరమైన అవమానంగా అభివర్ణించారు.అయితే వాన్స్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. "నన్ను అవమానించారనే భావన నాకు లేదు. ఇరానీయన్లు చర్చల్లో కొన్నిసార్లు చాలా గందరగోళంగా వ్యవహరిస్తారు. కానీ ఆ ఘటన తర్వాత కూడా మేము దాదాపు తొమ్మిది గంటలపాటు చర్చలు కొనసాగించాం" అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కనిపించిన దృశ్యాల కంటే, చర్చల గదిలో జరిగిన పరిణామాలే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.ఇరాన్ మీడియా కథనాల ప్రకారం.. అమెరికా ప్రతినిధులతో కలిసి ఫొటో దిగాలన్న ప్రతిపాదనపై, అలాగే అదే సమయంలో ట్రంప్ చేసిన హెచ్చరికలపై అసంతృప్తితో ఇరాన్ ప్రతినిధులు కొద్దిసేపు సమావేశం నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. లెబనాన్లోని హెజ్బొల్లా కార్యకలాపాలపై ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేయడాన్ని కూడా టెహ్రాన్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.అయితే అసలు రాజకీయ చర్చ ఇప్పుడు మరో కోణంలో సాగుతోంది. ఇరాన్తో కుదురుతున్న తాత్కాలిక శాంతి ఒప్పందానికి అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చమురు ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన నిధుల విడుదల, ఇరాన్ పునర్నిర్మాణానికి భారీ ఆర్థిక సహకారం వంటి అంశాలు రిపబ్లికన్ పార్టీలోని కొందరికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ తనను పక్కన పెట్టి, ఒప్పందం ముఖచిత్రంగా జేడీ వాన్స్ను ముందుకు నెట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చర్చలకు వాన్స్నే నాయకత్వం వహించడమే కాకుండా, ఇరాన్ ఒప్పందాన్ని సమర్థించే బాధ్యత కూడా ఆయన భుజాలపై పడింది. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ శాఖ నేతలు వెనుకకు తగ్గిన వేళ.. విమర్శలన్నింటినీ ఎదుర్కొంటున్నది వాన్స్ కావడం గమనార్హం.ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూర్చాయి. "ఒప్పందం విజయవంతమైతే క్రెడిట్ నాదే.. విఫలమైతే నింద జేడీదే" అంటూ ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ట్రంప్ కావాలనే వాన్స్ను ముందుకు నెట్టి, తాను సురక్షిత దూరంలో నిలిచారని అమెరికా మీడియా విశ్లేషిస్తోంది.రిపబ్లికన్ వర్గాల్లో కూడా ఈ ఒప్పందాన్ని ఇప్పటికే "వాన్స్ డీల్"గా పిలవడం మొదలైంది. ఒప్పందం కుదిరితే 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో వాన్స్కు భారీ రాజకీయ లాభం కలిగే అవకాశం ఉంది. కానీ చర్చలు విఫలమైతే లేదంటే ఇరాన్ మరోసారి అమెరికాను ఇబ్బందుల్లోకి నెడితే.. ఆ రాజకీయ దెబ్బ కూడా ముందుగా వాన్స్కే తగిలే ప్రమాదం కనిపిస్తోంది. -
జీడీపీ వృద్ధికి సవాళ్లు..!
ముంబై: అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం విఫలమైనా, నైరుతి రుతుపవనాలు బలహీన పనితీరు చూపించినా భారత ఆర్థిక వ్యవస్థ... వృద్ధి పరంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్బీఐ తాజా బులెటిన్ పేర్కొంది. పశ్చిమాసియాకు సంబంధించి మధ్యంతర శాంతి ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అవరోధాలు కొనసాగుతున్నట్టు ప్రస్తావించింది.అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. పపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘ఈ ఒప్పందం విచ్ఛిన్నం అయితే తిరిగి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగిపోతాయి. కీలకమైన ఇంధన సరఫరాల్లో సమస్యలు, పెట్టుబడుల వ్యయాలు నిదానించడం, ఆహార భద్రత ఆందోళనలు, ఆర్థిక స్థిరత్వం దెబ్బతిని, వృద్ధి తగ్గిపోతుంది’’అని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ 2025–26లో చివరి త్రైమాసికంలో భారత్ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందంటూ.. ప్రైవేటు వినియోగం, స్థిర పెట్టుబడులు ఇందుకు మద్దతునిచ్చినట్టు వివరించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనూ (ఏప్రిల్, మే) ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగానే కొనసాగుతున్నాయని ముఖ్యమైన సూచికలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో పెరిగినప్పటికీ, అది నియంత్రిత శ్రేణిలోనే ఉండడాన్ని గుర్తు చేసింది. విదేశీ వాణిజ్యం, చెల్లింపుల స్థితులు బలంగానే ఉన్నాయని వెల్లడించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), తగినంత విదేశీ మారకం నిల్వలు మద్దతుగా నిలిచినట్టు పేర్కొంది. ఎదుర్కొనే స్థితిలో.. ఇతర దేశాలతో పోల్చి చూస్తే.. బలమైన ఆర్థిక మూలాలతో భారత్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభ పరిస్థితులను తట్టుకుని నిలవగలదని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. ఎల్పీజీ ధరలు పెంచినందున అది రెస్టారెంట్ల సేవలపై ప్రభావం చూపించి, ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుందని అంచనా వేసింది. జూన్ 18 నాటికి ఉన్న డేటా ప్రకారం ఆహార ధరల్లో పెరుగుదల కొనసాగుతున్నట్టు తెలిపింది. బియ్యం, గోధుమలు, ప్రధాన పప్పుల ధరలు పెరిగినట్టు వెల్లడించింది. అలాగే, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటా, నూనెల ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాల్లో సమస్యలతో భారత క్రూడ్ బాస్కెట్ ధరలు గరిష్టాల్లోనే ఉన్నట్టు పేర్కొంది. -
ట్రంప్-ఇరాన్ డీల్.. గల్ఫ్ దేశాల్లో గుబులు!
అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గల్ఫ్ దేశాల గుబులు.. డబ్బు, భద్రత, హర్ముజ్పై పెరుగుతున్న ప్రశ్నలు. ఇరాన్ పునర్నిర్మాణానికి 300 బిలియన్ డాలర్లు ఇస్తే.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చెల్లిస్తారు?. ప్రస్తుతం గల్ఫ్ దేశాలను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) తర్వాత ఈ అంశం ఆ రీజియన్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) మూడు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల నేతలు ఇరాన్కు ప్రతిపాదిస్తున్న భారీ ఆర్థిక ప్యాకేజీ, భద్రతా హామీలు, ఆంక్షల సడలింపులపై స్పష్టత కోరే అవకాశం ఉంది.300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ..అమెరికా-ఇరాన్ అవగాహన ఒప్పందం ప్రకారం, ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25 లక్షల కోట్లు) విలువైన ప్రణాళికను ప్రాంతీయ భాగస్వాములతో కలిసి రూపొందించాలని అమెరికా అంగీకరించింది. ఈ నిధుల అమలు విధానాన్ని 60 రోజుల్లో ఖరారు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు.అయితే ఈ భారీ నిధులు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, దాని సైనిక సామర్థ్యాలను కూడా పెంచే ప్రమాదం ఉందని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై ఒప్పందంలో స్పష్టమైన ప్రస్తావన లేకపోవడం వారికి మరింత కలవరపెడుతోంది.గల్ఫ్ దేశాల భద్రతా ఆందోళనలుసౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాలు అమెరికా భద్రతా వ్యవస్థలో కీలక భాగస్వాములు. ఇటీవల జరిగిన యుద్ధ సమయంలో ఈ దేశాల్లోని అమెరికా స్థావరాలు, పౌర మౌలిక వసతులు ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడుల ముప్పును ఎదుర్కొన్నాయి. అందుకే యుద్ధం ఆగడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, ఇరాన్కు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నారో తెలుసుకోవాలని గల్ఫ్ దేశాలు కోరుతున్నాయి.స్తంభింపజేసిన ఆస్తులపై కొత్త ఫార్ములా!చర్చల్లో మరో కీలక అంశం ఇరాన్కు చెందిన విదేశీ ఆస్తులు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ JD Vance వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంక్షల సడలింపు తర్వాత విడుదలయ్యే నిధుల వినియోగంపై అమెరికా, ఖతార్ సంయుక్త పర్యవేక్షణ ఉండేలా ప్రతిపాదన సిద్ధమైంది.అంటే విడుదలైన డబ్బును ఇరాన్ నేరుగా వినియోగించకుండా, అమెరికా గోధుమలు, మొక్కజొన్న వంటి అవసరమైన వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగించే విధంగా వ్యవస్థను రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ఆలోచనను ట్రంప్ అల్లుడు(ఇవాంక భర్త), మాజీ వైట్హౌస్ సలహాదారు జారెడ్ కుష్నర్ Jared Kushner ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.వందల బిలియన్ల డాలర్లు పణంగా..ప్రారంభ చర్చల్లో 6 నుంచి 25 బిలియన్ డాలర్ల మధ్య ఉన్న స్తంభింపజేసిన నిధుల గురించే చర్చ జరిగినప్పటికీ, వివిధ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్కు చెందిన 100 నుంచి 120 బిలియన్ డాలర్ల వరకు ఆస్తులు ఆంక్షల కారణంగా నిలిచిపోయి ఉన్నాయి. అయితే ఆ నిధుల వినియోగంపై తుది నిర్ణయం తమదే కావాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది.హర్ముజ్ జలసంధిపై దృష్టిరుబియో పర్యటనలో మరో కీలక అంశం హర్ముజ్ జలసంధి Strait of Hormuz. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాల్లో కీలక పాత్ర పోషించే ఈ జలసంధి ఇటీవల యుద్ధంతో ఉద్రిక్త ప్రాంతంగా మారింది. యుద్ధానికి ముందు రోజుకు 100 నుంచి 131 నౌకలు ఈ మార్గంలో ప్రయాణించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 71కు పడిపోయింది. 60 రోజుల చర్చల కాలంలో రవాణాపై అదనపు రుసుములు విధించబోమని ఒప్పందంలో ఉన్నప్పటికీ, ఆ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది.కీలక ప్రశ్న మాత్రం అదే..ఇరాన్తో శాంతి ఒప్పందం, పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి అన్నీ బాగానే ఉన్నా... 300 బిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అమెరికానా? గల్ఫ్ దేశాలా? లేదంటే అంతర్జాతీయ భాగస్వాములా?** అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే ప్రస్తుతం పశ్చిమాసియా రాజకీయాల్లో అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే... ఆ బిల్లు చివరికి ఎవరు చెల్లించాలి?. -
అడవి ఆమెను సీఈఓ చేసింది...
20 ఏళ్లకే అమెరికా మీడియా సంస్థ ‘అన్ టేమ్డ్ ప్లానెట్’ సీఈఓ అయ్యింది మలైకా వాజ్. గోవా తీరంలో అలలతో ఆడుకున్న అమ్మాయి నేడు అడవుల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపిస్తోంది. ‘వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకింగ్తో అడవిని రక్షించవచ్చు’ అని చదువు మానేసి అడవినే యూనివర్సిటీ చేసుకుంది. 21 ఏళ్లకే నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్ప్లోరర్గా ఎంపికైంది. ‘అవకాశాలు ఎదురుచూడవు, దూకెయ్యాలి’ అంటున్న మలైకా వాజ్ పరిచయం ఇది.‘టీవీ అడవికీ, నిజమైన అడవికీ తేడా ఉంది. నేను టీవీలో జనం లేని అడవిని చూశాను. కానీ నిజమైన అడవిలో ఎక్కడ చూసినా మనిషి పాదముద్రలే. జనం ప్రమేయం ఇంతగా ఉంటే అడవి, అటవీ జంతువులు ఏం కావాలి?’ అంటుంది మలైకా. అడవిని నిజరూపంలో చూపిస్తేనే మనిషి దాని పట్ల వివేకంతో వ్యవహరిస్తాడని ఆమె నమ్మకం.పచ్చటి బాల్యం...గోవాలోని సలిగావ్లో 1997లో పుట్టిన మలైక ఇంటి పక్కనే సముద్రం... పచ్చటి చెట్ల మధ్య ఉన్న స్కూలుతో పచ్చటి బాల్యాన్ని చూసింది . ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే మలైక పాముల కోసం చెట్లు ఎక్కేది. గాయపడిన జంతువులను రక్షించేది. స్కూబా డైవింగ్, విండ్సర్ఫింగ్, సెయిలింగ్ నేర్చుకుంటూ సముద్రాన్నే ప్లేగ్రౌండ్ చేసుకుంది. తండ్రి మాక్ వాజ్, తల్లి మరుషా వాజ్లది గోవాలో ప్రముఖ వ్యాపార కుటుంబం. వారు కూతురిని వ్యాపారంలోకి కాని, అకడెమిక్స్ వైపుగాని ఒత్తిడి చేయలేదు. నచ్చింది చేయనిచ్చారు. ఆ స్వేచ్ఛే మలైకాకు రెక్కలు తొడిగింది.జీవితంలో మలుపు...మలైకా ఈ దారిలోకి రావడానికి కారణం వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకర్ మైక్ పాండేను కలవడం. అప్పటికి ఆమె వయసు 14. ఆయన డాక్యుమెంటరీలు ప్రభుత్వాల పర్యావరణ నిర్ణయాలను ప్రభావితం చేశాయని తెలుసుకుంది. ‘అంటే మన కథలతో మార్పు సాధ్యం’ అని గ్రహించింది. ‘పర్యావరణం గురించి ఆలోచించడానికి నా వయసు చిన్నదేం కాదు’ అనుకుని హైస్కూల్ తర్వాత కాలేజీకి వెళ్లలేదు. డైరెక్ట్గా ప్రొడక్షన్ హౌస్లలో చేరింది. షార్ట్ ఫిల్మ్స్ తీసింది. 18 ఏళ్లకే ఆర్కిటిక్, అంటార్కిటికా రెండు చోట్లకు వెళ్లిన అతి పిన్న భారతీయురాలిగా లిమ్కా బుక్ రికార్డ్ కొట్టింది. 21 ఏళ్లకే నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్ప్లోరర్గా ఎంపికైంది. ‘లివింగ్ విత్ ప్రిడేటర్స్’ అనే సిరీస్ను ప్రొడ్యూస్ చేసి, హోస్ట్ చేసింది. భారత్లో చిరుత, పులి, ఎలుగుబంట్లతో మనుషులు ఎలా కలిసి బతుకుతున్నారో చూపించింది. డిస్కవరీ, యానిమల్ ప్లానెట్లో ‘ఆన్ ది బ్రింక్’ ఎనిమిది భాగాల సిరీస్ చేసింది.మంటా రేస్ రక్షకురాలు...సముద్రంలో ఏడు మీటర్ల రెక్కలతో తిరిగే ‘మంటా రేస్’ చేపల అక్రమ రవాణాపై సాహసోపేతమైన ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ చేస్తోంది మలైకా. మంటా రేస్ మొప్పలకు ఔషధ గుణాలున్నాయనే మూఢనమ్మకంతో వాటిని క్రూరంగా వేటాడుతున్నారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ నుంచి చైనా మార్కెట్కు అవి ఎలా స్మగుల్ అవుతున్నాయో అండర్కవర్గా షూట్ చేసింది. కెమెరాను ఆయుధంగా మార్చి మాఫియాను ఎక్స్పోజ్ చేస్తోంది. రువాండా వాల్కానోస్ నేషనల్ పార్క్లో మౌంటెన్ గొరిల్లాలపై విలువైన డాక్యుమెంటరీ చేసింది. ‘వాటి ఫ్యామిలీ డైనమిక్స్ చూస్తే అద్దంలో మనల్ని చూసుకున్నట్టే ఉంటుంది’ అంటుంది.20 ఏళ్లకే సీఈఓ...‘అన్ టేమ్డ్ ప్లానెట్’ మీడియా సంస్థను 2017లో స్టార్ట్ చేసి సీఈఓ అయ్యింది మలైక. న్యూయార్క్, బెంగళూరులో ఆఫీసులు నడుపుతూ బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్, అల్ జజీరా, డిస్కవరీకి కంటెంట్ ఇస్తోంది. ఆమె ‘నగర ఆఫీసు’ల్లో ఉండేకన్నా ‘అడవి ఆఫీసు’లో ఉండటమే ఎక్కువ. ‘అమ్మాయిలను బయటకు పంపొద్దు’ అనేవాళ్లకు మలైకా సమాధానం– ‘వారి చేతికి కెమెరా ఇవ్వండి, ప్రపంచాన్ని మారుస్తారు’. ‘నీకు భయం వేయదా? అడవిలో అంత రిస్క్ ఎందుకు అని అందరూ అడుగుతారు. భయం వేస్తుంది. కానీ ఏమీ చేయకుండా కూర్చుంటే అంతకన్నా బోర్ కొడుతుంది’ అని నవ్వుతుంది మలైకా.‘నా కంఫర్ట్ జోన్ అడవే. నా ఆఫీస్ జీప్, బోట్, కెమెరా... ఇవి ఉంటే చాలు’ అంటోందామె. -
వింబుల్డన్ సింగిల్స్లోనూ సెరెనా
లండన్: నాలుగేళ్ల తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన అమెరికా దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ గ్రాండ్స్లామ్ సింగిల్స్లో రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఈనెల 29 నుంచి జరిగే ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో 44 ఏళ్ల సెరెనా సింగిల్స్ విభాగంలోనూ బరిలోకి దిగనుంది. ఈ మేరకు వింబుల్డన్ టోర్నీ నిర్వాహకులు చివరిదైన ఎనిమిదో వైల్డ్ కార్డును సెరెనాకు కేటాయిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. తన సోదరి వీనస్ విలియమ్స్తో కలిసి సెరెనా వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలోనూ ఆడేందుకు ఇంతకుముందే వైల్డ్ కార్డు ఇచ్చారు. తాజా ప్రకటనతో సెరెనా సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీపడనుంది. చివరిసారి 2022లో వింబుల్డన్ టోర్నీలో ఆడిన సెరెనా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. అదే ఏడాది ఆటకు గుడ్బై చెప్పిన సెరెనా ఇటీవల పునరాగమనం చేసింది. సెరెనా తన కెరీర్లో 23 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గింది. ఆమె అత్యధికంగా ఏడుసార్లు చొప్పన వింబుల్డన్, ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకోగా... ఆరుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్స్ను, మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ను సాధించింది. -
భారత్తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్
వాషింగ్టన్: భారత్కు విక్రయిస్తున్న అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అత్యంత తేలికైన శతఘ్నుల్లో ఉపయోగించే ఉపకరణాలు, వాటి సర్వీసింగ్కు సంబంధించిన 482.2 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4,561కోట్ల) విలువైన ఒప్పందాన్ని అమెరికా లాంఛనంగా నోటిఫై చేసింది. లాంఛనంగా నోటిఫై చేసిన ఈ వివరాలను విదేశీ సైనిక కొనుగోళ్ల ప్రాజెక్టులను చూసుకునే అమెరికా భద్రతా సహకార ఏజెన్సీ(డీఎస్సీఏ) జూన్ 17వ తేదీన తన ఫెడరల్ రిజిస్టర్లో పొందుపరిచింది. అంతకుముందే మే 18వ తేదీన అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 హవిట్జర్ల సర్వీసింగ్ సేవల అమ్మకంపై అమెరికా కాంగ్రెస్కు ఆ దేశ విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చింది. పర్వతమయ సరిహద్దుల్లో శత్రుసేనల పీచమణిచేందుకు భారత్ విదేశీ సైనిక కొనుగోళ్ల మార్గంలో అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్లు, శతఘ్నులను కొనుగోలుచేయడం తెల్సిందే. ఇవిగాక ఏహెచ్–64ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లనూ భారత్ ప్రస్తుతం వినియోగిస్తోంది. ఈరకం ప్రపంచంలోనే అత్యుత్తమమైన యుద్ధహెలికాప్టర్లలో ఒకటి. ఇది అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయడంతోపాటు యుద్ధక్షేత్రాల్లో సైన్యానికి సైనిక, ఆయుధ సరఫరాలో ఎంతగానో సాయపడుతుంది. తాజాగా నోటిఫై అయిన ఒప్పందం ప్రకారం ఎం777ఏ2 శతఘ్నుల సేవల ఒప్పందాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలని భారత్ భావిస్తోంది. ఒప్పందంలో భాగంగా ఆయుధాల విడిభాగాల అందజేత, మరమ్మత్తు, పాడైనవి మార్చేసి కొత్తవి బిగించడం, వాటిని ఉపయోగించే సిబ్బందికి శిక్షణ, ఇతర సాంకేతిక తోడ్పాటును భారత దళాలకు అమెరికా అందించనుంది. శతఘ్నులకు సంబంధించి 230 మిలియన్ డాలర్లు, అపాచీ హెలికాప్టర్లకు సంబంధించి 198.2 మిలియన్ డాలర్లు మొత్తంగా 482.2 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. వాస్తవానికి అపాచీ సపోర్ట్ సర్వీసుల ప్రధాన కాంట్రాక్ట్ బోయింగ్ కంపెనీ, లాక్హీడ్ మార్టీన్లతో భారత్ గతంలో కుదుర్చుకుంది. శతఘ్నులకు సంబంధించి బ్రిటన్లోని కంబ్రియాలోని బీఏఈ సిస్టమ్స్తో భారత్ ప్రధాన సర్వీస్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఇప్పుడు కొత్తగా సహాయక సేవల అమ్మకం ఒప్పందాన్ని అమెరికాతో భారత్ కుదుర్చుకుంది. అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచే ఉద్దేశంతోనే సేవల అమ్మకాన్ని ముందుకొచ్చామని అమెరికా రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఎప్పటికప్పుడు రిపేర్లు, కొత్త విడిభాగాల బిగింపుతో ఆయుధాల సన్నద్ధత పెరిగి రక్షణ భాగస్వామ్య దేశమైన భారత్లో భద్రత మరింత పటిష్టమవుతుంది. ఇది ఇండోపసిఫిక్, దక్షిణాసియా ప్రాంతంలో సుస్థిరత, శాంతి, ఆర్థికాభివృద్ధికి బాటలుపరుస్తుంది’’అని అమెరికా పేర్కొంది. -
ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
జూరిచ్: యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా–ఇరాన్ల మధ్య కుదిరిన 60 రోజుల మధ్యంతర ఒప్పందం అమలు మొదలయ్యింది. ఒప్పందం షరతుల్లో భాగంగా ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఇరాన్ చమురు ఉత్పత్తి, సరఫరా, విక్రయాలకు ఇకపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఈ వెసులుబాటు ఆగస్ట్ 21వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. సోమవారం స్విట్జర్లాండ్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో సానుకూల పురోగతి సాధించడంతో ఈ పరిణామం సాధ్యమైంది. -
అరవై రోజుల్లో తుది ఒప్పందం?
ఒబ్యూర్జెన్: పశ్చిమాసియాలో యుద్ధ విరమణకు రంగం సిద్ధమైంది. ఇరాన్, అమెరికాల మధ్య స్విట్జర్లాండ్లోని ఒబ్యూర్జెన్ రిసార్ట్లో జరుగుతున్న ఉన్నత స్థాయి శాంతి చర్చలు ముగిశాయి. యుద్ధానికి శాశ్వత విరామం ప్రకటించేందుకు వీలుగా అరవై రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక ఒకటి సిద్ధం చేయాలని ఇరుపక్షాలు అంగీకరించినట్లు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్, ఖతార్లు ప్రకటించాయి. మరోవైపు సాంకేతిక అంశాలపై ఏకాభిప్రాయానికి ఇరుపక్షాలు ఈ వారం పొడవునా చర్చలు కొనసాగించనున్నట్లు సమాచారం. చర్చలు ఫలవంతమయ్యాయని ఇరాన్, పాకిస్థాన్, ఖతార్లు ప్రకటించగా అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’తో ఇరాన్పై విరుచుకుపడటంతో మొదలైన యుద్ధం అంతకంతకూ తీవ్రమైన విషయం తెలిసిందే. ప్రతిక్రియగా ఇరాన్ ప్రపంచ చమురు సరఫరా మార్గం హర్మూజ్ను మూసివేయడం... ఇజ్రాయెల్తోపాటు అమెరికా మిత్రపక్షాలుగా భావిస్తున్న సౌదీ అరేబియా, దుబాయి, ఖతార్లపై దాడులకు దిగింది. నాలుగునెలల కాలంలో శాంతి కోసం పలు దఫాలుగా చర్చలు జరిగినా సాధించింది పెద్దగా లేదు. ఒప్పందానికి వచ్చి తీరాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయి హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం స్విట్జర్లాండ్లో మరోసారి చర్చలు మొదలయ్యాయి. ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు పాక్, ఖతార్లు ప్రకటించడంతో యుద్ధం ముగిసే అవకాశాలు మెరుగయ్యాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను నియంత్రించేందుకు ఆ దేశ ప్రభుత్వం భాగస్వామ్యంతో ‘డి–కాన్ఫ్లిక్షన్ సెల్’ఒకదాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా, ఇరాన్లు అంగీకరించాయి. అలాగే హెజ్బోల్లా ఇజ్రాయెల్పై ప్రతిదాడులకు పాల్పడకుండా కూడా ఈ సెల్ పర్యవేక్షిస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ గుండా చమురు రవాణా సాఫీగా జరిగిందుకు వీలుగా ప్రత్యేకమైన కమ్యూనికేషన్ లైన్ను ఏర్పాటు చేస్తారు. అలాగే తుది ఒప్పందాన్ని సిద్ధం చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అరవై రోజుల్లో ఇది పూర్తవుతుందని అంచనా. అయితే ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా, ఇజ్రాయెల్లు ఘర్షణలు నిలిపివేస్తాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాలపై దాడులు చేస్తున్న హెజ్బొల్లా ఉగ్రవాదులను నియంత్రించే స్వేచ్ఛ తమకు ఉండాలని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. -
ఆగని 'గ్రేటర్ ఇజ్రాయెల్' పథకం
ప్రపంచం దృష్టి ఇరాన్, లెబనాన్ వైపు; అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ పూట ఏమంటారనే దానిపై కేంద్రీకరించి ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మాత్రం తమ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పథకాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉన్నారు. ఆ చర్యలన్నీ తమ దీర్ఘకాలిక పశ్చిమాసియా వ్యూహానికి అనుగుణమై నవే అయినందున అమెరికా ఆ విషయమై ఏమీ మాట్లాడటం లేదు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా చొరవతో 2025 అక్టోబర్లో జరిగింది. ఆ మేరకు కాల్పుల విరమణ అయితే అమలుకు వచ్చిందిగానీ, ఇజ్రాయెలీ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఉపసంహరించుకోలేదు. కొన్ని జోన్లకు పరిమితమై కొనసాగుతుందనీ, ఒప్పందంలోని ఆ యా అంశాలు అమలైనకొద్దీ క్రమంగా ఉపసంహరించుకుంటుందనే మాట ఆ పత్రంలో ఉన్నందున ఆ ప్రకారం అంతా జరుగుతుందనీ భావించారు. కానీ అటు వంటి ఉద్దేశాలు ఇజ్రాయెల్కు గానీ, అమెరికాకు గానీ లేవని త్వరలోనే స్పష్టం కాసాగింది.70 శాతం భూమి పోతుందా?ట్రంప్ తను అట్టహాసంగా ప్రకటించిన 20 అంశాల ‘శాంతి పథకం’వైపుగానీ, నియమించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ వైపుగానీ కన్నెత్తి చూడలేదు. మధ్యవర్తులు, బోర్డు సభ్యులు అయిన దేశాలు అదేమి టని అడగలేదు. ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం గాజా, వెస్ట్ బ్యాంక్ లను మించిన ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అయినందున వారికి ఈ పరిస్థితి కలిసి వచ్చింది. గాజాలో ఉత్తరం నుంచి దక్షిణానికి గీసిన కాల్పుల విరమణ రేఖను ఉల్లంఘిస్తూ కొత్త ఆక్రమణలు మొదలు పెట్టారు. హమాస్ను వ్యతిరేకించే పాలస్తీనియన్ వర్గాలను, నేరస్థులను ప్రోత్సహించి అక్కడి ప్రజలను పారదోలటం ఈ ఎనిమిది నెలలుగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నది.పోయిన నెల చివరిలో ఒక బహిరంగ కార్యక్రమంలో నెతన్యాహూ మాట్లాడుతూ, కాల్పుల విరమణ జరిగిన 2025 అక్టోబర్లో, గాజా భూభాగంలో 53 శాతం తమ ప్రత్యక్ష నియంత్రణలో ఉండేదనీ, అది 2026 మే చివరిలో 60 శాతానికి చేరిందనీ, దానిని 70 శాతానికి తీసుకుపోవలసిందిగా తమ సైన్యానికి ఆదే శాలు జారీ చేశాననీ ప్రకటించారు. అనగా, కాల్పుల విరమణ నాటి నుంచి మరొక 17 శాతం భూభాగాన్ని; గాజాపై ఇజ్రాయెల్ దాడులు 2023 అక్టో బర్లో మొదలైనప్పటినుంచి 2026 అక్టోబర్ వచ్చేసరికి మూడేళ్లలో మొత్తం 70 శాతాన్ని కోల్పోతుందన్నమాట. అప్పుడు, మొత్తం 365 చ.కి.మీ.ల విస్తీర్ణంగల గాజాలో అక్కడి ప్రజలకు మిగిలేది 110 చ.కి.మీ.లు. విషయం ఇంతటితో ముగియబోవటం లేదు. నెతన్యాహూ రక్షణ మంత్రి కట్జ్తో పాటు సైన్యాధికారులు, గాజాలోని పాలస్తీని యులందరూ అక్కడి నుంచి ‘స్వచ్ఛందంగా ఖాళీ చేసి’ వేరే దేశాలకు వెళ్లిపోవలసిందేనని హెచ్చరిస్తున్నారు. గాజాపై దాడులు మొదలైన కొత్తలో నెతన్యాహూ, ట్రంప్ చేసిన ప్రకటనలను బహుశా ఎవరూ మరిచి ఉండరు. అక్కడినుంచి స్థానికులను వెళ్లగొట్టి ‘అందమైన రిసార్టులు, వ్యాపార కేంద్రాలు’ నిర్మిస్తామన్నారు.ఆగని సెటిల్మెంట్లు!పాలస్తీనాలో మరొకవైపున గల వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంలను చూస్తే ఇటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వీటి గురించి అసలు వివాదమే లేదనీ, అదంతా తమ దేశంలో భాగమనీ ఇజ్రాయెల్ ఎన్నడో ప్రకటించింది. తమ రాజధాని టెల్ అవీవ్కు అదనంగా ఈస్ట్ జెరూసలేం ఉమ్మడి రాజధాని అన్నది. ఆ ప్రకటనలను ఐక్యరాజ్యసమితి తిరస్కరించగా, రాజధాని విషయాన్ని ట్రంప్ తన మొదటి హయాంలోనే అధికారికంగా గుర్తించారు. ఈ పరిస్థితుల మధ్య జరుగుతున్నది ఇజ్రాయెల్ సేనలు, యూదులు వెస్ట్ బ్యాంక్ను, ఈస్ట్ జెరూసలేం నగరాన్ని ఆక్రమించు కోవడం. ఈ పని కొంతకాలం క్రితమే మొదలు కాగా, నిరుటినుంచి వేగాన్ని అందుకున్నది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ నెల రెండవ వారంలో ఒక నివేదిక విడుదల చేస్తూ, వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్లపై ‘జాతి నిర్మూలన’ కార్యక్రమం జరుగుతున్నట్లు హెచ్చరించింది. యూదు సెటిలర్లు, ఇజ్రాయెలీ సైనికులు కలిసి ఆ పని చేస్తున్నారన్నది. అదే వారంలో అమెరికన్ వార్తా సంస్థ అసోసి యేటెడ్ ప్రెస్ (ఏపీ), బ్రిటిష్ వార్తా సంస్థ బీబీసీ ఆ ప్రాంతాలలో పర్యటించి ఇవే విషయాలను ధ్రువీకరించి చెప్పాయి. అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు విరుద్ధమని ప్రపంచమంతా ఖండించినా లెక్క చేయని ఇజ్రాయెల్ ఇప్పటికే ఏడు లక్షల మంది యూదులను అక్కడ సెటిల్ చేసింది. వారి కాలనీల కోసం కొత్త బడ్జెట్లోనూ వందల మిలియన్ల డాలర్లు కేటాయించింది. కొత్త పరిణామం ఏమంటే, ట్రంప్ విన్యాసాల వైపు ప్రపంచం మళ్లి ఉండగా, ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ లక్ష్యాన్ని సాధించుకొనచూడటం.ఎన్ని దేశాల్లోకి చొచ్చుకుపోతారు?ఇంతకూ ‘గ్రేటర్’ పరిధి ఎంత? అది గాజా, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంలకు పరిమితమైనది కాదంటే ఆశ్చర్యం కలగవచ్చు. యూదుల జియోనిస్టు సిద్ధాంతకర్తల ఒరిజినల్ సూత్రీకరణల ప్రకారం స్థూలంగా మధ్యధరా సముద్రం, పశ్చిమాన ఈజిప్టులోని నైలు నది, తూర్పున యూప్రటీస్ నది, దక్షిణాన పలు అరబ్ భూభాగాల మధ్య ప్రాంతమంతా ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అవుతుంది. అందులోకి ప్రస్తుత ఇజ్రాయెల్, గాజా, వెస్ట్ బ్యాంక్, మొత్తం జోర్డాన్, మొత్తం లెబనాన్, సిరియా, ఇరాక్లతో పాటు సౌదీ భూభాగాలు అనేకం వస్తాయి. ఇటువంటి పటాన్ని నిరుడు తమ దేశంలో స్వయంగా ఎత్తిచూపిన నెతన్యాహూ, ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆలోచనకు తాను బలంగా కట్టుబడి ఉన్నాననీ, ఆ ‘చారిత్రకమైన స్పిరిచ్యువల్ మిషన్లో తనను తాను ఒక భాగంగా భావిస్తా’ననీ ప్రకటించటం గమనించదగ్గది.ఇంత విస్తారమైన ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ అసాధ్యమేగానీ, అదే సమయంలో అర్థం చేసుకోవలసినవి కొన్నున్నాయి. పాలస్తీనా విషయంలో జరుగుతున్నది ఎవరూ ఆపలేకపోతున్నారు. కనీసం వర్తమానంలో. అరబ్ పాలకులు మొక్కుబడిగా ఏమి మాట్లాడినా, ఈజిప్టు నాయకుడు అబ్దుల్ నాసర్ మరణం (1970) తర్వాత పాన్– అరబిజం బలహీనపడటం, అరబ్ నాయకులంతా ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఇజ్రాయెల్, అమెరికాలతో రాజీపడటం, ఇజ్రాయెల్ పథకానికి ఒక మేరకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి. సిరియా నుంచి ఆక్రమించిన గోలన్ హైట్స్ను తమతో విలీనం చేసు కోవటం, జోర్డాన్, లెబనాన్ భాగాల ఆక్రమణలు, మరొకవైపు అమె రికా ఒత్తిడితో కొందరు అబ్రహామిక్ ఒప్పందాల పేర ఇజ్రాయెల్తో రాజీ పడటం వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇజ్రాయెల్ పథ కాన్ని రాజీ లేకుండా వ్యతిరేకిస్తున్న ఏకైక రాజ్యం ఇరాన్ను లొంగ దీసే ప్రయత్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. అటువంటి ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో అబ్రహామిక్ ఒప్పందం చేసుకుంటే సంతోషిస్తానన్న ట్రంప్ ఇటీవల అందరికీ వింత గొలపటం వేరే విషయం!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అణ్వాయుధాలపై కీలక నిర్ణయం.. జేడీ వాన్స్
జెనీవా: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చల్లో భాగంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) నుండి పరిశీలకులను ఆహ్వానించడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపారు. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయని పేర్కొన్నారు.స్విట్జర్లాండ్లో బర్గెన్స్టాక్ రిసార్ట్ వేదికగా నిన్న అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగిన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ భేటీపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ " చర్చల్లో చాలా మంచి పురోగతి లభించింది. అంతకుముందు రోజు జరిగిన చర్చలు కూడా చాలా సానుకూలంగా సాగాయి. అణు తనిఖీల కోసం ఇన్స్పెక్టర్లను ఆహ్వానించడానికి ఇరాన్ అంగీకరించింది. అణు పరిశీలకులతో చర్చలు శుక్రవారం నుంచే ప్రారంభం అయ్యే అవకాశంఉంది. ఇరుపక్షాల సాంకేతిక బృందాలు తమ పనిని కొనసాగిస్తాయి " అని వాన్స్ అన్నారు.ప్రస్తుతం హర్ముజ్ జలసంధి తెరిచే ఉందని ఈ కీలకమైన రవాణా మార్గం నిరంతరం అందుబాటులో ఉండేలా చూసేందుకు చర్చల ప్రతినిధులు ఒకప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. హిజ్బుల్లా ఇజ్రాయెల్పై కాల్పులు ఆపాలని అమెరికా కోరుకుంటోందన్నారు. అదే విధంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించే లక్ష్యంతో లెబనాన్ కోసం ఒక ఘర్షణ నివారణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని వాన్స్ అన్నారు.ఇరాన్తో చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా,ఇజ్రాయెల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపిందని వాన్స్ అన్నారు. అలాగే, వాషింగ్టన్ ఈ ప్రాంతంలోని దేశాలపై ఎలాంటి ఒప్పందాన్ని రుద్దడం లేదని ఆయన నొక్కి చెప్పారు. ఒకవేళ దౌత్యం విఫలమైతే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇంకా చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయని వాన్స్ పరోక్షంగా ఇరాన్ను హెచ్చరించారు. -
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
లండన్: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడి 24గంటల్లో కీర్ స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 2024లో బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ ప్రధానిగా రాజీనామా చేశారు. కీర్ స్టార్మర్తో కలిపి పదేళ్లలో ఆరుగురు ప్రధానులు తమ పదవికి రాజీనామా చేయడం గమనార్హం.రాజీనామాకు ముందు స్టార్మర్ తన భార్యతో కలిసి 10డౌనింగ్ స్ట్రీట్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ ఆయన మద్దతు దారులు హర్షధ్వానాలు, చప్పట్లుతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం డౌనింగ్ స్ట్రీట్లో అడుగుపెట్టిన క్షణాన్ని తన జీవితంలో అత్యంత గర్వించదగిన క్షణంగా కీర్ స్టార్మర్ గుర్తుచేసుకున్నారు.స్టార్మర్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో ప్రారంభించానని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ సాధించిన అఖండ విజయాన్ని గుర్తుచేసుకుంటూ, తన ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న వేతనాలు, పెరిగిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, తగ్గుతున్న ఎన్హెచ్ఎస్ నిరీక్షణ జాబితాలు, కార్మికులు, అద్దెదారుల హక్కులు, రక్షణ వ్యయం పెరుగుదల వంటి అంశాలను వివరించారు.నేను తీసుకున్న ప్రతి నిర్ణయం తొలి ప్రాధాన్యత దేశానికే. మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అభివృద్ధిలో మా సహచర దేశాల కంటే వేగంగా వృద్ధి సాధించాం. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి నెలా ద్రవ్యోల్బణం కంటే వేగంగా వేతనాలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో తమ విధానాల వల్ల ఐదు లక్షల మంది పిల్లలను పేదరికం నుండి బయటకు తీసుకువచ్చామని కూడా పేర్కొన్నారు.అయితే, వరుస వివాదాలు, విధాన మార్పులు, తగ్గుతున్న ప్రజా మద్దతు కారణంగా స్టార్మర్ ప్రధాని పదవి నుంచి వైదొలగాలనే డిమాండ్లు వినిపిస్తూ వచ్చాయి. 2024 ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన జీవన ప్రమాణాల మెరుగుదలను అందించడంలో ఆయన ప్రభుత్వం విఫలమైందని అంతర్గతంగా లేబర్ పార్టీలో విమర్శలు వెల్లువెత్తాయి.దీనికితోడు లేబర్ పార్టీ ప్రత్యర్థి ఆండీ బర్న్హామ్ పార్లమెంటరీ సీటు గెలుచుకోవడంతో కీర్ రాజీనామాపై మరింత ఒత్తిడి పెరిగింది. హౌస్ ఆఫ్ కామన్స్లో 100 మందికి పైగా లేబర్ చట్టసభ్యులు ఆయన రాజీనామా చేయాలని లేదా ఆయన నిష్క్రమణకు స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు.ప్రజా సేవలపై ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలు, అక్రమ వలసలు వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో వరుస ప్రభుత్వాల అసమర్థతపై పెరుగుతున్న ప్రజా అసంతృప్తిని ఈ తరచూ జరుగుతున్న మార్పులు ప్రతిబింబిస్తున్నాయి. -
కంపెనీని అమ్మేసి ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు!
సాధారణంగా కార్పొరేట్ ప్రపంచంలో మానవత్వానికి చోటు ఉండదు అనుకుంటాం. కానీ కరుణామయులైన వ్యాపారవేత్తలూ కొందరుంటారు. అలాంటి పారిశ్రామికవేత్త ఒకరు తన కంపెనీని అమ్మేసి ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను కోటీశ్వరులను చేశారు. ఎవరాయన.. ఎక్కడ.. ఆ కంపెనీ ఏంటి.. చూద్దాం ఈ కథనంలో..అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెందిన కుటుంబ యాజమాన్య సంస్థ ఫైబర్బాండ్ (Fibrebond) తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. విద్యుత్ పరికరాలు, డేటా సెంటర్ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిర్మాణాలను తయారు చేసే ఈ సంస్థను పవర్ మేనేజ్మెంట్ దిగ్గజం ఈటన్ (Eaton) 1.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,045 కోట్లు) కొనుగోలు చేసింది. అయితే ఈ ఒప్పందంలో అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే.. సంస్థ మాజీ యజమాని గ్రాహం వాకర్ ఉద్యోగుల కోసం 240 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,265 కోట్లు) కేటాయించాలనే షరతును పెట్టడం.ఈ నిర్ణయంతో సంస్థలో పనిచేస్తున్న 540 మంది పూర్తి కాల ఉద్యోగులు ఈ మొత్తాన్ని పంచుకోనున్నారు. అంటే సగటున ఒక్కో ఉద్యోగికి 4.43 లక్షల డాలర్లు (సుమారు రూ.4.18 కోట్లు ) లభించనున్నాయి. కంపెనీలో వాటాలు లేకపోయినా, సంస్థ ఎదుగుదలలో ఉద్యోగుల పాత్రను గుర్తించి ఈ బహుమతిని ఇవ్వాలని వాకర్ నిర్ణయించారు.బోనస్ చెల్లింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే పూర్తి మొత్తాన్ని పొందాలంటే ఉద్యోగులు ఐదేళ్లపాటు సంస్థలో కొనసాగాల్సి ఉంటుంది. 65 ఏళ్లు దాటిన ఉద్యోగులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రకటన వెలువడినప్పుడు చాలా మంది ఉద్యోగులు తొలుత నమ్మలేకపోయారని, కొందరు ఇది సరదా ప్రకటనేమోనని భావించారని అమెరికా మీడియా పేర్కొంది.అగ్నిప్రమాదం నుంచి ఏఐ బూమ్ వరకు...1982లో క్లాడ్ వాకర్ స్థాపించిన ఫైబర్బాండ్ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. 1998లో ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం, డాట్కామ్ సంక్షోభం, ఆర్థిక మందగమనం కారణంగా ఒక దశలో ఉద్యోగుల సంఖ్య 900 నుంచి 320కు పడిపోయింది. అయినప్పటికీ సంస్థ ఉద్యోగులను కాపాడుకునేందుకు యాజమాన్యం కృషి చేసింది.తరువాత డేటా సెంటర్ రంగంలో సుమారు 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం సంస్థకు టర్నింగ్ పాయింట్గా మారింది. కోవిడ్ అనంతరం క్లౌడ్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో ఫైబర్బాండ్ వ్యాపారం వేగంగా విస్తరించింది. కేవలం ఐదేళ్లలో కంపెనీ అమ్మకాలు దాదాపు 400 శాతం పెరిగాయి.ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులుఈ భారీ బోనస్తో అనేక మంది ఉద్యోగుల జీవితాలు మారిపోయాయి. కొందరు గృహ రుణాలను పూర్తిగా తీర్చగా, మరికొందరు చిన్న వ్యాపారాలు ప్రారంభించారు. 1995లో గంటకు కేవలం 5.35 డాలర్ల వేతనంతో కంపెనీలో చేరిన ఉద్యోగిని లెసియా కీ తన ఇంటి రుణాన్ని క్లియర్ చేసి దుస్తుల దుకాణం ప్రారంభించింది. మరో ఉద్యోగి హాంగ్ బ్లాక్వెల్ పదవీ విరమణ చేసి తన కుటుంబ అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించింది.కంపెనీ విక్రయం ద్వారా వాకర్ కుటుంబానికి 1 బిలియన్ డాలర్లకు పైగా లభించినప్పటికీ, ఆ సంపదలో కొంత భాగాన్ని ఉద్యోగులతో పంచుకోవడం కార్పొరేట్ ప్రపంచంలో అరుదైన ఉదాహరణగా నిలిచింది. ఉద్యోగులను కేవలం సిబ్బందిగా కాకుండా సంస్థ విజయానికి భాగస్వాములుగా భావించిన ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. -
అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం
మరో తెలుగు విద్యార్థి డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యంతో ఆకస్మికంగా కన్నుమూశాడు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.మహబూబ్నగర్కు చెందిన అరుణ్ సాయిరెడ్డి (జననం: ఆగష్టు 21, 1999) వెంకట్ రెడ్డి, సరళా దంపతుల ఏకైక కుమారుడు. అరుణ్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఫ్లోరిడాలోని టెంపా నగరంలో ఉంటూ, స్టెమ్ ఓపీటీ (STEM OPT)లో భాగంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్నాడు. అంతలోనే అతని అకాల మరణం కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. అతని పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు గాను నిధుల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. -
బిత్తర పోయిన పాక్ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!
స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన ఈ చర్చలు సజావుగా కొనసాగుతున్నాయని తొలుత ప్రకటించినప్పటికీ.. వేదికపై మాత్రం తీవ్ర ఉద్రిక్తతలు, ప్రోటోకాల్ వివాదాలు, ఆకస్మిక వాకౌట్లు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య చోటుచేసుకున్న హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల తొలి దశ ప్రారంభం నుంచే ఉత్కంఠభరిత వాతావరణంలో సాగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, ప్రోటోకాల్ అంశాలు మొదట్లోనే వివాదానికి దారితీశాయి.This was humiliation. No one in modern history has made America wait and beg for negotiations. This was the moment JD Vance should have returned to Washington. The Islamic regime did this on purpose. Trump, if you don't understand politics, you should at least understand… pic.twitter.com/NVWAxr8NMH— Amjad Taha أمجد طه (@amjadt25) June 21, 2026ముందుగా నిర్ణయించిన హ్యాండ్షేక్, జాయింట్ ఫోటో సెషన్లో ఇరాన్ ప్రతినిధులు పాల్గొనకపోవడం చర్చల్లో ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఫోటో-ఆప్ను తిరస్కరించి సమావేశ వేదిక నుంచి బయటకు వెళ్లినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.ఈ ఆకస్మిక పరిణామాల మధ్య, ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు కొద్దిసేపు ఏదో సమాచారం అందించినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ వెంటనే ఇరాన్ బృందం వేదిక నుంచి వాకౌట్ చేయడంతో షెహబాజ్ షరీఫ్ ఆశ్చర్యానికి లోనయ్యారని, పక్కనే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో వెంటనే చర్చించిన దృశ్యాలు వైరల్గా మారాయి. అదే.. సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పరిస్థితిని గమనిస్తూ.. షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ వద్దకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఇరాన్ ప్రతినిధుల వాకౌట్ కారణం గురించి ఆయన ఆరా తీసినట్లు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.మరోవైపు.. పలకరింపుల సమయంలోనూ అమెరికా ప్రతినిధి అయిన జేడీ వాన్స్కు ఘోర అవమానం జరిగింది!. ఖతార్ ప్రతినిధి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ను పలకరించి జేడీ వాన్స్ను పట్టించుకోనట్లు చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో జేడీ వాన్స్ ఆయన్ని పలకరించే ప్రయత్నం చేసినట్లు ఉంది. ఖతార్ ప్రతినిధి చేసిన పనితో పాక్ ప్రధాని బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఇదంతా సోషల్ మీడియాలో “ప్రోటోకాల్ స్నబ్”గా(అధికారిక కార్యక్రమాల్లో ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా లేదంటే నిర్లక్ష్యంగా సరైన గౌరవం ఇవ్వకుండా వదిలేయడం) చర్చకు దారితీసింది.Watch Qatar snub Vance. So embarrassing. pic.twitter.com/RWSpcsL5IU— 🇺🇸 Pamela Geller 🇮🇱 (@PamelaGeller) June 21, 2026ఇక.. మీటింగ్ హాల్లోకి ఇరాన్ విదేశాంగ మంత్రి తిరిగి ప్రవేశించినప్పుడు, అమెరికా బృందం సభ్యులు జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్తో ఒకే గదిలో స్వల్ప క్షణాల పాటు ఉన్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ ప్రతినిధులు కొంత దూరం పాటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు ఊపందుకున్నాయి. “అమెరికాకు దౌత్యపరమైన ఎదురుదెబ్బా?”, “ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనా?”, “ఇరాన్ వ్యూహాత్మక వాకౌటా?” అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య వైరల్గా మారాయి.అయితే మరోవైపు ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వ బృందాలు మాత్రం చర్చలు పూర్తిగా విఫలమయ్యాయన్న వార్తలను ఖండించాయి. తొలి దశ చర్చలు సుమారు 80 నిమిషాలు కొనసాగిన తర్వాత ఇరాన్ బృందం అంతర్గత సంప్రదింపుల కోసం తాత్కాలికంగా బయటకు వెళ్లినట్లు అధికారిక సమాచారం చెబుతోంది. ఇదే సమయంలో ఇరాన్ ఆర్థిక ఆంక్షల ఉపసంహరణ, నిలిచిపోయిన నిధుల విడుదల, చమురు ఆంక్షలపై సడలింపులు వంటి అంశాలపై సాంకేతిక స్థాయిలో చర్చలు కొనసాగినట్లు కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. ఖతార్ సహకారంతో కొన్ని కీలక ప్రక్రియలు ప్రారంభమైనట్లు సమాచారం బయటకు వచ్చింది.మొత్తం మీద, స్విట్జర్లాండ్ వేదికపై జరిగిన ఈ చర్చలు ఒకవైపు ఉద్రిక్తతలు, వాకౌట్లు, ప్రోటోకాల్ ఘర్షణలతో సాగినా.. మరోవైపు కొంత పురోగతి సంకేతాలు కూడా కనిపించాయని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అక్కడ కనిపించిన హావభావాలు, ఆకస్మిక పరిణామాలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. -
అమెరికాపై చైనా ప్రతీకారం.. 46 కంపెనీలపై నిషేధం
బీజింగ్: ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి ముదిరింది. చైనా సైన్యానికి సహకరిస్తున్నాయనే ఆరోపణలతో 80 చైనీస్ కంపెనీలను అమెరికా ఇటీవల బ్లాక్లిస్ట్లో చేర్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటూ, చైనా ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 46 అమెరికన్ కంపెనీలపై నిషేధాజ్ఞలు విధించింది. రక్షణ, కీలక ఖనిజాల మైనింగ్ రంగాలకు చెందిన యూఎస్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని బీజింగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.అమెరికా కంపెనీలపై ఆంక్షల పర్వంజాతీయ భద్రతను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త ఎగుమతి నియంత్రణలను విధిస్తున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికా రక్షణ విభాగంతో ఒప్పందాలు కలిగి ఉన్న ఓష్కోష్ డిఫెన్స్ (మిలిటరీ వాహనాల తయారీ సంస్థ), ఏవియాక్స్ వంటి 10 ప్రముఖ యూఎస్ కంపెనీలపై చైనా ఎగుమతి ఆంక్షలు విధించింది. వాషింగ్టన్ తీసుకున్న ‘చైనీస్ మిలిటరీ ఎంటర్ప్రైజ్ లిస్ట్’ నిర్ణయానికి ఇది ప్రత్యక్ష కౌంటర్ అని బీజింగ్ స్పష్టం చేసింది.ప్రభుత్వ కొనుగోళ్లపై పూర్తి నిషేధంమరోవైపు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ, తమ ప్రభుత్వ ఏజెన్సీలు 46 అమెరికన్ కంపెనీల నుండి ఎలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదని ఆదేశించింది. ఈ నిషేధిత జాబితాలో లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, బోయింగ్ రక్షణ విభాగాలు వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. సోమవారం నుంచే ఈ నిషేధం అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, చైనాలో అమెరికా పెట్టుబడులతో నడుస్తున్న కంపెనీలకు ఈ కొనుగోలు ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చారు.ముదిరిన వాణిజ్య వివాదంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో బీజింగ్లో భేటీ అయి, ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు చర్చలు జరిపిన కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల అమెరికా విధించిన బ్లాక్లిస్ట్లో చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజాలు అలీబాబా, బైదూలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బివైడి కూడా ఉన్నాయి. దీనికి ప్రతిచర్యగానే చైనా ఈ తాజా ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది.ఇది కూడా చదవండి: ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు -
బిగ్ రిలీఫ్.. చేతులు కలిపిన అమెరికా-ఇరాన్!
ఓవైపు హెచ్చరికలు, మరోవైపు శాంతి చర్చలు.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా-ఇరాన్ సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్విట్జర్లాండ్లో జరిగిన తొలి విడత చర్చల అనంతరం 60 రోజుల్లో తుది శాంతి ఒప్పందానికి చేరుకోవాలనే రోడ్మ్యాప్ను ఇరు దేశాలు ఆమోదించాయి. ఖతర్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో.. ఇందుకు ఇరు దేశాల ప్రతినిధులు చేతులు కలపడం గమనార్హం. స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో ఆదివారం జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక మలుపు తిరిగాయి. ఖతర్, పాకిస్తాన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం.. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య నెలకొన్న ప్రధాన విభేదాలను పరిష్కరించేందుకు 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక (రోడ్మ్యాప్)పై ఇరు దేశాలు అంగీకరించాయి.'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' (Islamabad MoU) కింద జరిగిన తొలి విడత చర్చలు సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగాయని మధ్యవర్తి దేశాలు పేర్కొన్నాయి. తుది ఒప్పందానికి అవసరమైన అమలు విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థ, నిబంధనల అమలు, పరస్పర బాధ్యతలపై ఇక నుంచి సాంకేతిక స్థాయి చర్చలు వెంటనే ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్నిఇటు ఇరాన్ సైతం ధృవీకరించింది. Tireless Pakistani and Qatari mediation has delivered major progress to end Lebanon War. Oil and petrochem exports are waived, blockade lifted, some frozen assets released, and major reconstruction & development plan launched for Iran. 1st real test: Lebanon deconfliction cell https://t.co/q0okD2qwSO— Seyed Abbas Araghchi (@araghchi) June 22, 2026చర్చల్లో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అపార్థాలు, ఉద్రిక్తతలు, అనుకోని ఘర్షణలు నివారించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య నేరుగా సమాచార మార్పిడి వ్యవస్థ (డైరెక్ట్ కమ్యూనికేషన్ ఛానెల్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చర్చల కాలంలో ఏవైనా సంఘటనలు చోటుచేసుకున్నా వాటిని వెంటనే పరిష్కరించేలా ఈ వ్యవస్థ పనిచేయనుంది.ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల సురక్షిత రాకపోకల అంశం కూడా ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. హర్ముజ్లో భద్రత, నౌకాయాన స్వేచ్ఛను కొనసాగించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని అంగీకరించారు. అలాగే రాజకీయ స్థాయిలో మొత్తం మధ్యవర్తిత్వ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి ప్రధాన చర్చాకర్తలు తరచూ నివేదికలు సమర్పిస్తారు. అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, పర్యవేక్షణ విధానాలు, వివాద పరిష్కార వ్యవస్థ వంటి అంశాలపై ప్రత్యేక వర్కింగ్ గ్రూపులు పనిచేయనున్నాయి.లెబనాన్లో కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించేందుకు అమెరికా, ఇరాన్, లెబనాన్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక 'డీ-కాన్ఫ్లిక్షన్ సెల్'ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ఖతర్, పాకిస్తాన్ సౌకర్యదాతలుగా వ్యవహరించనున్నాయి.ఈ చర్చల్లో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ పాల్గొనగా.. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబఫ్ హాజరయ్యారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఖతర్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ కూడా చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు.. చర్చలు జరుగుతుండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. దీంతో ఇరాన్ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారని.. చర్చల నుంచి వాకౌట్ చేశారని.. అమెరికాకు కౌంటర్ వార్నింగ్ ఇచ్చారని కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ చర్చల టేబుల్పై పురోగతి సాధించామని జేడీ వాన్స్ ప్రకటించారు. లెబనాన్లో కాల్పుల విరమణ కొనసాగించడం, ఇరాన్తో సంబంధాలను కొత్త దిశగా తీసుకెళ్లడంలో ముందడుగు పడిందని ఆయన పేర్కొన్నారు.మొదటి విడత చర్చల్లో విభేదాలు, వాకౌట్లు, హెచ్చరికలు కనిపించినప్పటికీ.. చివరకు 60 రోజుల రోడ్మ్యాప్పై అంగీకారం కుదరడం శాంతి ప్రక్రియకు ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ 60 రోజులు అమెరికా-ఇరాన్ సంబంధాల భవిష్యత్తును నిర్ణయించే కీలక కాలంగా మారనున్నాయి. -
జాగ్రత్తగా మాట్లాడండి.. మా సైన్యం సిద్ధంగానే ఉంది
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక మలుపు తిరిగాయి. స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు మొదలు కాగా.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆర్థిక ఆంక్షలు ప్రధాన అడ్డంకులుగా మారాయి. చర్చలు కొనసాగుతుండగానే మరోసారి దాడులు చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించగా.. ఇరాన్ అందుకు ధీటుగానే స్పందిస్తూ వాకౌట్ చేసింది. ఈ పరిణామాలు మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతల వేడిని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి.అత్యంత విలాసవంతమైన బర్గెన్స్టాక్ రిసార్ట్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య ఆదివారం తొలి విడత శాంతి చర్చలు జరిగాయి. గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మధ్య కుదిరిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొనగా.. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబఫ్ హాజరయ్యారు. పాకిస్తాన్, ఖతర్ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.అయితే.. చర్చలకు ముందు ఘాలిబఫ్ ఖతర్, పాకిస్తాన్ ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత నాలుగు పక్షాల చర్చలు ప్రారంభమయ్యాయి. సుమారు 80 నిమిషాల పాటు సాగిన తొలి విడత సమావేశంలో యుద్ధ విరమణ అమలు, ఆర్థిక ఆంక్షల సడలింపు, ఇరాన్కు చెందిన విదేశీ నిధుల విడుదల, చమురు ఎగుమతులపై పరిమితుల తొలగింపు వంటి అంశాలపై చర్చ జరిగింది.అయితే చర్చల ఆరంభంలోనే.. లెబనాన్ అంశం ప్రధాన అడ్డంకిగా మారింది. తాత్కాలిక ఒప్పందంలోని మొదటి నిబంధన అయిన "అన్ని రంగాల్లో కాల్పుల విరమణ"ను అమెరికా అమలు చేయలేదని ఇరాన్ ఆరోపించింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. లెబనాన్పై దాడులు ఆగేంత వరకు ఇతర అంశాలపై చర్చలు ముందుకు సాగబోవని ఇరాన్ చర్చల బృందంలోని సభ్యులు స్పష్టం చేశారు.ఇదే సమయంలో హర్ముజ్ జలసంధి అంశం కూడా చర్చల్లో ఉద్రిక్తతను పెంచింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ సముద్ర మార్గాన్ని ఇరాన్ తాజాగా మళ్లీ మూసేసిన సంగతి తెలిసిందే. లెబనాన్లో యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ వివరణ ఇచ్చింది. అయితే హర్ముజ్ తెరిచి ఉంచడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని అమెరికా స్పష్టం చేసింది.ఈ పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చలను మరింత సంక్లిష్టం చేశాయి. లెబనాన్లోని తమ అనుకూల బలగాలు, ముఖ్యంగా హెజ్బుల్లాను ఇరాన్ అదుపులో పెట్టాలని, లేదంటే గతవారం చేసిన దాడుల కంటే మరింత తీవ్రంగా దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతినిధులు కొద్దిసేపు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు ఇరానియన్ మీడియా వెల్లడించింది.BREAKING: Peace talks in Switzerland with Iran are falling apart already. Iran walks out. More of the same. Eff them. pic.twitter.com/N6WTYKGz34— Buzz Patterson (@BuzzPatterson) June 21, 2026అనంతరం స్పందించిన ఘాలిబఫ్.. అమెరికా బెదిరింపులను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోదని, బెదిరింపులు పనిచేసి ఉంటే అమెరికా ఈ స్థాయికి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. తమ సాయుధ బలగాలు అవసరమైతే భిన్నమైన రీతిలో ప్రతిస్పందించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.అయితే పరిస్థితిని చల్లబరచే ప్రయత్నం చేసిన జేడీ వాన్స్.. ఇలాంటి చర్చల్లో విభేదాలు సహజమని, ప్రక్రియ కొంత గందరగోళంగా కనిపించినా పురోగతి కొనసాగుతోందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని, ఇరాన్తో సంబంధాలను కొత్త దిశగా తీసుకెళ్లాలని ట్రంప్ సూచించారని పేర్కొన్నారు.చర్చల సందర్భంగా ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన నిధుల విడుదలపై కార్యాచరణను ఖరారు చేసే దిశగా చర్చలు జరిగాయి. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షల సడలింపుకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదా కూడా సిద్ధమైనట్లు ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే అణు కార్యక్రమం సహా మిగిలిన కీలక అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఇక చర్చల మధ్యలో అమెరికా ప్రతిపాదించిన ఉమ్మడి ఫొటో, కరచాలన కార్యక్రమాన్ని కూడా ఇరాన్ తిరస్కరించింది. దానిని అమెరికా మీడియా ప్రదర్శనగా అభివర్ణిస్తూ.. ఘాలిబఫ్, అరాఘ్చీ పాల్గొనలేదు.మరోవైపు లెబనాన్లో రెండు రోజుల తీవ్ర ఘర్షణల తర్వాత పరిస్థితి కొంత ప్రశాంతంగా కనిపించినప్పటికీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం దక్షిణ లెబనాన్లో ఏర్పాటు చేసిన భద్రతా మండలిని అవసరమైనంత కాలం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గే సూచనలు కనిపించడం లేదు.స్విట్జర్లాండ్లో శాంతి కోసం చర్చలు జరుగుతున్నా.. లెబనాన్లో యుద్ధం, హర్ముజ్లో ఉద్రిక్తతలు, ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ ప్రతిస్పందనలు చర్చల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. తొలి విడత చర్చలు నిలిచిపోయినా.. ముగియలేదని ఇరాన్ చెబుతోంది. ఇప్పుడు రెండో విడత చర్చలు మిడిల్ఈస్ట్లో శాంతిని తీసుకువస్తాయా? లేక మరోసారి యుద్ధానికి దారితీస్తాయా? అన్నదే ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
ఇరాన్కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తామని.. గత వారం కంటే ఈసారి దాడులు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. డీల్ కుదరకపోతే హర్మూజ్ను ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. హర్ముజ్ను క్లోజ్ చేస్తే మీకు దేశం లేకుండా చేస్తామన్న ట్రంప్.. హిజ్బొల్లాను అదుపు చేయకపోతే ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తామన్నారు.లెబనాన్లో సమస్యలు సృష్టిస్తున్న ప్రాక్సీలను ఇరాన్ వెంటనే నియంత్రించాలని తన 'ట్రూత్ సోషల్' పోస్ట్లో రాసుకొచ్చారు. 60 రోజుల్లో ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే హర్మూజ్లో టోల్స్ వసూలు చేస్తామన్నారు. మరో వైపు, పశ్చిమ ఆసియాలో నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో కీలక చర్చలు ప్రారంభమయ్యాయి.ఇటీవల కుదిరిన చారిత్రాత్మక ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ ఆధారంగా ఈ ఉన్నత స్థాయి దౌత్య సమావేశం జరుగుతోంది. కతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండగా, స్విస్ దౌత్యవేత్తలు ఈ వేదిక సిద్ధం చేశారు. రాబోయే 60 రోజుల్లో సమగ్ర అణు ఒప్పందాన్ని ఖరారు చేయడం, ప్రాంతీయ శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాలుపంచుకుంటున్నారు. -
అమెరికా-ఇరాన్ అత్యవసర భేటీ
బెర్న్: పశ్చిమ ఆసియాలో నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కుదిరిన చారిత్రాత్మక ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ ఆధారంగా ఈ ఉన్నత స్థాయి దౌత్య సమావేశం జరుగుతోంది. కతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండగా, స్విస్ దౌత్యవేత్తలు ఈ వేదిక సిద్ధం చేశారు. రాబోయే 60 రోజుల్లో సమగ్ర అణు ఒప్పందాన్ని ఖరారు చేయడం, ప్రాంతీయ శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాలుపంచుకుంటున్నారు.లెబనాన్ సంక్షోభంపై అత్యవసర సమావేశంఈ చర్చల మొదటి రోజే ఇజ్రాయెల్-హిజ్బుల్లా ఘర్షణలపై ఒక అత్యవసర సెషన్ను కేటాయించారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ చర్చల్లో ఇజ్రాయెల్ గానీ, హిజ్బుల్లా గానీ లేదా లెబనాన్ ప్రభుత్వం గానీ భాగస్వాములు కానప్పటికీ, అమెరికా తన వ్యూహాన్ని మార్చి ఈ అంశాన్ని ఎజెండాలోకి తెచ్చింది. దక్షిణ లెబనాన్లో కొనసాగుతున్న హింసను అరికట్టేందుకు ఇరుపక్షాల చర్చల ప్రతినిధులు అంగీకరించినట్లు వార్తా సంస్థ ఎఎన్ఐ పేర్కొంది. ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని బృందం హాజరుకాగా, అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్, సీనియర్ ప్రతినిధులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ చర్చల్లో పాల్గొంటున్నారు.హోర్ముజ్ జలసంధి వివాదపు నీడలుమరోవైపు, వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతమైన ‘హోర్ముజ్ జలసంధి’పై ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు ఈ చర్చలపై ప్రభావం చూపుతున్నాయి. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యల ఉల్లంఘనలకు నిరసనగా ఈ జలసంధిపై తమకు నియంత్రణ ఉందని ఇరాన్ క్లెయిమ్ చేయగా, అమెరికా దీనిని ఖండించింది. 60 రోజుల్లోగా తుది ఒప్పందం కుదరకపోతే ఈ షిప్పింగ్ లేన్లో అమెరికన్ టోల్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే ఇరాన్ మాత్రం, ఈ జలసంధిలో వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణం అనేది అంతకుముందు కుదిరిన తాత్కాలిక ఒప్పందాల అమలుపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.60 రోజుల రోడ్మ్యాప్.. తుది ఒప్పందమే లక్ష్యంఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఈ వారంలో సంతకం చేసిన ప్రాథమిక ఒప్పంద వివరాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం. చర్చల ప్రారంభానికి ముందు ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తాము దేశ అమరవీరులకు, మినాబ్ పాఠశాల ఘటన బాధితులకు జవాబుదారీగా ఉంటూ ఈ చర్చల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కాల్పుల విరమణను కాపాడుకుంటూనే, శాశ్వత అణు ఒప్పందాన్ని సాధించడానికి దౌత్యవేత్తలకు 60 రోజుల గడువు ఇచ్చారు. -
హార్మూజ్పై ట్రంప్ కొత్త ఎత్తుగడ.. చమురు ప్రపంచానికి షాక్?
వాషింగ్టన్: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం 60 రోజుల తర్వాత శాశ్వత ఒప్పందంగా మారకపోతే, ప్రపంచ ఇంధన సరఫరాలకు ప్రాణాధారంగా భావించే హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకలపై అమెరికా టోల్లు (రుసుములు) విధించే అవకాశాన్ని ఆయన ప్రస్తావించారు.ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికలో చేసిన పోస్టులో.. ప్రస్తుతం అమలులో ఉన్న 60 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) సమయంలో ఎలాంటి టోల్లు ఉండవని స్పష్టం చేశారు. అయితే చర్చలు విఫలమై తుది ఒప్పందం కుదరకపోతే, మధ్యప్రాచ్య దేశాలకు అమెరికా ‘Guardian Angel’గా అందించిన భద్రతా సేవలకు ప్రతిఫలంగా అమెరికానే టోల్లు విధించవచ్చని పేర్కొన్నారు. గతం, వర్తమానం, భవిష్యత్తులో అందించిన భద్రతా సేవల ఖర్చులకు ఇది పరిహారం అని ఆయన వ్యాఖ్యానించారు.There will be NO TOLLS in the Hormuz Strait for 60 days during the Cease Fire Period, and there will be NO TOLLS after the 60 day period has expired, unless they are imposed by and for the United States of America, should the deal not be completed, for services rendered as the… pic.twitter.com/f2DtGeiLUf— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) June 20, 2026ఇరాన్ వాదన.. అమెరికా ఖండనఇదిలా ఉండగా, తాజాగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య లెబనాన్లో కొనసాగుతున్న ఘర్షణలు కాల్పుల విరమణకు విరుద్ధమని ఆరోపించింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ వాదనను ఖండించింది. జలసంధి తెరిచే ఉందని, ఒక్కరోజులోనే 55 వాణిజ్య నౌకలు 17 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురుతో ప్రయాణించాయని వెల్లడించింది.స్విట్జర్లాండ్లో కీలక చర్చలుఈ వివాదాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ మహ్మద్ బాకిర్ క్వాలిబాఫ్ నేతృత్వంలోని ప్రతినిధులతో స్విట్జర్లాండ్లో కీలక చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, హార్మూజ్ భవిష్యత్ నిర్వహణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?ట్రంప్ తాజా వ్యాఖ్యలు కేవలం రాజకీయ హెచ్చరికలు మాత్రమే కావు. హార్మూజ్పై టోల్లు లేదా కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే ప్రపంచ చమురు ధరలు, రవాణా వ్యయాలు, ఇంధన మార్కెట్లు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం శాంతి చర్చల ఫలితాలపైనే ప్రపంచ ఇంధన మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పుడు అందరి దృష్టి స్విట్జర్లాండ్లో జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చలపైనే ఉంది. -
హార్మూజ్ మళ్లీ మూసివేత
దుబాయ్: లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడుల పట్ల ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్ దుశ్చర్యను ఖండిస్తూ హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు శనివారం ప్రకటించింది. అవగాహనా ఒప్పందాన్ని అమలు చేయడంలో, లెబనాన్పై దాడులు ఆపడంలో అమెరికా దారుణంగా విఫలమైందని ఇరాన్కు చెందిన జాయింట్ మిలటరీ కమాండ్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒప్పందంలోని షరతులు అమల్లోకి రాకపోవడంతో అందుకు ప్రతిస్పందనగా హార్మూజ్ తక్షణమే మూసివేస్తున్నామని ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. లెబనాన్పై దురాక్రమణ ఇలాగే కొనసాగితే, తదుపరి చర్యలు తీసుకోక తప్పదని, అందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేశామని హెచ్చరించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినవారి సంఖ్య 4 వేలు దాటిందని లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. సాంకేతిక స్థాయి చర్చలే స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఆదివారం సాంకేతిక స్థాయి చర్చలు ప్రారంభమవుతాయని కీలక మధ్యవర్తి అయిన పాకిస్తాన్ తెలిపింది. ఖతార్ సహా ఇతర భాగస్వామ్య దేశాలు కూడా ఈ చర్చల్లో పాల్గొంటాయని వెల్లడించింది. ఇరాన్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్కు పయనమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మధ్యవర్తుల సమక్షంలో అమెరికా, ఇరాన్ల మధ్య శుక్రవారం జరగాల్సిన చర్చలు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, మధ్యంతర ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉందని తాము విశ్వసించేదాకా ఈ చర్చల్లో పెద్దగా పురోగతి ఉండకపోవచ్చని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాహీ సంకేతాలిచ్చారు. అవతలి పక్షం(అమెరికా) కూడా బాధ్యతలను నెరవేర్చాలని డిమాండ్ చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని అన్నారు. అవగాహనా ఒప్పందంలోని కీలకమైన హామీలను నెరవేర్చిన తర్వాతే తుది ఒప్పందం కోసం చర్చలు ముందుకు సాగుతాయని తేల్చిచెప్పారు. ఒకవేళ నెరవేర్చకపోతే అప్పుడు మొత్తం అవగాహన ఒప్పందమే ప్రమాదంలో పడుతుందని ఇస్మాయిల్ బగాహీ అభిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్ చర్చల్లో తమ బృందం పాల్గొంటుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం ధ్రువీకరించారు. తమ ప్రతినిధులు జేర్డ్ కేష్నర్, స్వీట్ విట్కాఫ్ ఇప్పటికే స్విట్జర్లాండ్కు చేరుకున్నారని తెలిపారు. -
ఒప్పందం ఉత్తదేనా?
జెరూసలేం: దక్షిణాసియాలో శాంతి సాధనే ధ్యేయoగా అమెరికా–ఇరాన్ల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి ఏ విలువా లేకుండాపోతోంది. ఇరుదేశాల అధ్యక్షులు స్వయంగా సంతకాలు చేసిన ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏమాత్రం లేక్కచేయడం లేదు. దాంతో తమకు సంబంధమే లేదన్నట్లుగా లెబనాన్పై భీకర దాడులకు దిగుతోంది. గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన వైమానిక, డ్రోన్ దాడుల్లో 47 మంది మరణించగా, ఇజ్రాయెల్ సైన్యం శనివారం సైతం దాడుల పరంపర కొనసాగించింది. దక్షిణ లెబనాన్పై జరిగిన తాజా దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా కనీసం 16 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. నబాతియే నగరంతోపాటు పరిసర గ్రామాలు బాంబుల మోతతో దద్దరిల్లాయి. పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం ఏడుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు లెబనాన్ జాతీయ వార్తా సంస్థ తెలియజేసింది. స్థానికులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నట్లు సమాచారం. ఇరాన్ అండదండలతో లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెజ్బోల్లా మిలిటెంట్ గ్రూప్ను అంతం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ చెబుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇజ్రాయెల్, హెజ్బోల్లా అంగీకరించినట్లు శుక్రవారం వార్తలొచ్చాయి. కానీ, అందులో నిజం లేదని శనివారం నాటి దాడులతో తేలిపోయింది. ఉద్రిక్తతలకు ఇజ్రాయెల్ కారణం: హెజ్బోల్లా దక్షిణ లెబనాన్లో ఉన్న తమ సైన్యంపై హెజ్బొల్లా గ్రూప్ తొలుత దాడులకు పాల్పడిందని, 50కి పైగా క్షిపణులను ప్రయోగించిందని, దాంతో తమ సైన్యం ఎదురుదాడికి దిగినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలు, కమాండ్ సెంటర్లతో సహా డజన్ల కొద్దీ లక్ష్యాలు, మిలిటెంట్లపై దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ ఉద్రిక్తతలకు ముమ్మాటికీ ఇజ్రాయెల్ కారణమని హెజ్బోల్లా ఆరోపించింది. కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. అయితే, శుక్రవారం రాత్రి కాల్పుల విరమణను ఇజ్రాయెల్ పలుమార్లు ఉల్లంఘించినట్లు విమర్శించింది. ఒప్పందానికి ముప్పు? మధ్యంతర (అవగాహనా) ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూదు పెజెష్కియాన్ సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. లెబనాన్లో తక్షణమే సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలన్న షరతును ఈ ఒప్పందంలో చేర్చారు. కానీ, దీనిపై ఇజ్రాయెల్ గానీ, హెజ్బొల్లా గానీ సంతకాలు చేయలేదు. అందులో భాగస్వామిగా చేరలేదు. రెండు పక్షాల దాడులు, ప్రతిదాడులు ఇలాగే కొనసాగితే మధ్యంతర ఒప్పందానికి ముప్పు వాటిల్లినట్లేనని, పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్కు ముప్పు తొలగిపోయే వరకు దక్షిణ లెబనాన్లో తమ బలగాలను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టంచేశారు. లెబనాన్ నుంచి వైదొలగడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే తప్ప తాము దాడులను ఆపలేమని హెజ్బోల్లా చెబుతోంది. లెబనాన్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ మధ్య తదుపరి విడత చర్చలు వచ్చేవారం వాషింగ్టన్లో జరుగుతాయని సమాచారం. -
రియా కపూర్ రూ.1.35 కోట్ల చెవి రింగులు మాయం
ముంబై: ఇటీవల అమెరికా వెళ్లిన బాలీవుడ్ దర్శకురాలు, ఫ్యాషన్ స్టయిలిస్ట్ రియా కపూర్ అద్దెకు తెచ్చుకున్న రూ.1.35 కోట్ల విలువైన వజ్రపు చెవి రింగులను పోగొట్టుకున్నారు. ఈ మేరకు ఆమె సన్నిహితురాలు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుపై సహర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. న్యూయార్క్లో జరిగే మెట్ గాలాలో పాల్గొనేందుకు రియా కపూర్ ముంబైలోని మెహతా జువెల్లర్స్ అండ్ గోయెంకా జువెల్లర్స్ వద్ద ఖరీదైన రెండు జతల చెవి రింగులను అద్దెకు తీసుకున్నారు. వాటిని సవ్లీన్ సింగ్కు ఇవ్వగా, ఆమె తన బ్యాగులో పెట్టుకున్నారు. రియా, సవ్లీన్ బృందం ఏప్రిల్ 17వ తేదీన ముంబై నుంచి దుబాయ్కి, అక్కడి నుంచి న్యూయార్క్కు 28న చేరుకున్నారు. న్యూయార్క్లో బస చేసిన పియెర్రె హోటల్కు వెళ్లాక బ్యాగు తెరిచి చూడగా రెండు వేర్వేరు బాక్సుల్లో ఉన్న చెవి రింగులు కనిపించలేదు. వీటితోపాటు సుమారు రూ.లక్షన్నర విలువైన మరో రెండు జతల చెవిరింగులు బ్యాగులో లేవు. తిరిగి ముంబై వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆభరణాలు ముంబైలో మాయమయ్యాయా లేక దుబాయ్, అమెరికాలో ఎవరైనా దొంగిలించారా అనేది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు శనివారం తెలిపారు. -
చైనా ముప్పు మరింత పెరిగింది
వాషింగ్టన్: చైనా నుంచి బెడద తమకు మరింతగా పెరిగిందని తైవాన్ అంటోంది. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం తక్షణమే అమెరికా ఆయుధాలను అందించాలని కోరుతోంది. అదేసమయంలో, తమ విషయంలో అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లుగా ఎటువంటి చాయలు కనిపించడం లేదని తెలిపింది. అమెరికాలోని తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ రిప్రజెంటేటివ్ కార్యాలయం చీఫ్ అలెగ్జాండర్ యుయి టాహ్ రే ఇటీవల వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. తైవాన్ విషయంలో గత ప్రభుత్వాల విధానాలకు భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. అమెరికా ప్రధాన భూభాగానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ను రక్షించడం తమవల్ల కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో తైపీలోని నేతలు షాకయ్యారు. తైవాన్ రక్షణ బాధ్యత ఆ దేశ ప్రజలే చూసుకోవాలని కూడా అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎకనామిక్ అండ్ కల్చరల్ రిప్రజెంటేటివ్ కార్యాలయం చీఫ్ అలెగ్జాండర్ యుయి టాహ్ రే తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అమెరికా కోసం ఎదురు చూడలేం ‘ఆత్మరక్షణ కోసం మాకు ఆయుధాలు కావాలి. రక్షణ బడ్జెట్ను పెంచుకుంటున్నాం. సంక్షోభాన్ని తట్టుకుని, మమ్మల్ని మేం రక్షించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం’అని అలెగ్జాండర్ చెప్పారు. ‘మా భద్రతకు మాదే బాధ్యత. అమెరికా సైన్యం వచ్చి మమ్మల్ని కాపాడుతుందని ఎదురు చూస్తూ ఉండలేం. ఆ దేశ సైన్యంపై ఆధారపడలేం. అందుకే మమ్మల్ని మేం మరింత బలోపేతం చేసుకోవ డానికి అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’అని ఆయన అన్నారు. చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు స్థాయికి తగినట్లుగా ఆయుధాల విక్రయం ఉండాలన్న ఆయన.. ప్రస్తుతం చైనా నుంచి ముప్పు వాస్తవానికి చాలా ఎక్కువగానే ఉందని వ్యాఖ్యానించారు. ‘మేం దురాక్రమణదారులం కాదు. చైనా మాత్రమే నిరంతరం యుద్ధ విమానాలను, నౌకలను మా వైపునకు పంపుతూ కయ్యానికి కాలు దువ్వుతోంది. తైవాన్లో మాకున్న స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నది కూడా చైనాయే’అని ఆయన ఆరోపించారు.రుబియో చెప్పిందదే..తైవాన్ విషయంలో అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లు తమకు కనిపించడం లేదని అలెగ్జాండర్ చెప్పారు. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కొన్ని ప్రకటనలను తమ ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. తమకు ఆయుధాల విక్రయం విషయంలో ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో కాంగ్రెస్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆయన ప్రస్తావించారు. తైవాన్కు ఆయుధాల విక్రయం అంశంపై చైనాతో సంప్రదింపులు, చర్చలు జరపలేదని రుబియో చెప్పారన్నారు. ఆయు ధాల ప్యాకేజీని నిలిపివేయలేదు, ఆయుధాల నిల్వలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్యాకేజీపై సమీక్ష మాత్రమే చేపట్టామని రుబియో తెలిపారని అలెగ్జాండర్ గుర్తు చేశారు. చైనా దాడి చేసిన పక్షంలో తైవాన్కు కాపాడేందుకు సైన్యాన్ని పంపేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు గత అధ్యక్షుడు జో బైడెన్ పలుమార్లు ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పసిఫిక్ సముద్రంలోని తైవాన్ తదితర ద్వీపాలపై చైనా పెత్తనాన్ని నిలువరించేందుకు రక్షణ వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయాలని రక్షణ శాఖ నివేదిక సైతం పేర్కొంది.మాట మార్చిన ట్రంప్చైనాను నిలువరించేందుకు తైవాన్కు 1,400 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు ఉద్దేశించిన భారీ ప్యాకేజీపై ఈ ఏడాది ఆరంభంలో అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అప్పట్లో ట్రంప్ దీనిని ‘చైనాతో అత్యుత్తమమైన బేరసారాల చిప్’గా అభివర్ణించారు. కాగా, మేలో చైనా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్తో కుదిరిన ఒప్పందం మేరకు తైవాన్కు వాగ్దానం చేసిన 1,400 కోట్ల డాలర్ల ఆయుధ ప్యాకేజీని పక్కన బెడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనిపై తైవాన్తోపాటు అమెరికా ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.తైవాన్పై తీవ్ర ఒత్తిడులుతైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా తాము కలిపేసుకుంటామని చైనా గట్టిగా చెబుతోంది. చైనా ఒత్తిళ్లతో అమెరికా సహా చాలా దేశాలు తైవాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. తైవాన్ సాధారణ దౌత్య సంబంధాలను కొనసాగించకుండా చైనా అడ్డుతగులుతోంది. అదే సమయంలో, అమెరికా ఆయుధాలను అందజేస్తూ గట్టి మద్దతుదారుగా ఉంటోంది. అలెగ్జాండర్ అధికారికంగా తైవాన్ రాయబారి కాదు, ఉన్నత స్థాయి ప్రతినిధి మాత్రమే . చైనా దురాక్రమణను నిరోధించేందుకు తైవాన్కు అవసరమైన ఆయుధాలను అందజేయాలన్నది అమెరికా విధానంగా ఉంటూ వస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో తైవాన్ చుట్టూ చైనా పలుమార్లు పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలను నిర్వహించింది. దాదాపు నిత్యం తైవాన్ సరిహద్దులకు సమీపంలోకి యుద్ధనౌకలను, సైనిక విమానాలను పంపుతోంది. -
రూ. 3,800 కోట్ల గిఫ్ట్ : మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఖతార్ దేశం బహుమతిగా ఇచ్చిన, అమెరికా అధ్యక్షుడి కొత్త 'ఎయిర్ ఫోర్స్ వన్' (Air Force One) విమానాన్ని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆవిష్కరించారు. సరికొత్త బోయింగ్ 747-8ను ఒక "ఫ్లయింగ్ వైట్ హౌస్" (గాల్లో ఎగిరే శ్వేతసౌధం)గా అభివర్ణించారు.అధ్యక్షుడు ట్రంప్ యూఎస్ ఎయిర్ ఫోర్స్ సరికొత్త విమానం 'వీసీ-25బి బ్రిడ్జ్' (VC-25B Bridge)ను జాయింట్ బేస్ ఆండ్రూస్లో ఈ విమానాన్ని పరిశీలించిన అనంతరం ఆవిష్కరించారు. విమాన హ్యాంగర్ (విమానశ్రయ షెడ్)లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానం అని ప్రకటించారు. ఇంతటి అద్భుతమైన విమానాన్ని అందించినందుకు ఖతార్ దేశాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. దాదాపు 35 ఏళ్ల నాటి పాత అధ్యక్ష విమానాల స్థానంలో, అమెరికా అగ్రరాజ్య శక్తికి ప్రతీకగా ఈ కొత్త విమానం నిలుస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. శాశ్వత నెక్స్ట్-జనరేషన్ 'ఎయిర్ ఫోర్స్ వన్' ప్రోగ్రామ్ పూర్తయ్యే దాకా, బోయింగ్ 747 తాత్కాలిక అధ్యక్ష విమానంగా సేవలు అందిస్తుందని ట్రంప్ ప్రకటించారు. ఇదీ చదవండి : రూ. 18 కోట్ల మేయర్ కిడ్నాప్ డ్రామా : సంచలన ఆరోపణలువిమానం ప్రత్యేకతలపై ట్రంప్ వ్యాఖ్యలుఅమెరికా అధ్యక్షుడు ఈ విమానంలో ప్రయాణించేటప్పుడు అధికారికంగా దీనిని 'ఎయిర్ ఫోర్స్ వన్' అని పిలుస్తారు. ఈ విమానం లోపలి భాగాన్ని పరిశీలించిన ఒక జర్నల్ కథనం ప్రకారం, అధునాతన లెదర్ సీట్లు, ఖరీదైన తివాచీలు (కార్పెట్లు), చెక్క ప్యానెలింగ్ , బంగారం రంగుల షేడ్స్తో కూడిన గోడలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాషింగ్టన్ ల్యాండ్మార్క్ రిఫ్లెక్టింగ్ పూల్'లో ఒక బాతు ఈదుతున్నట్లు ఉన్న ఫ్రేమ్డ్ పెయింటింగ్తో పాటు దేశభక్తిని ప్రతిబింబించే చిత్రాలను గోడలపై అలంకరించారు. అద్భుతమైన వేగంతో ఇది దూసుకుపోతుంది. అలాగే ఇప్పటివరకు ఉన్న పాత విమానం నీలం మరియు తెలుపు రంగులో ఉండేది. కానీ కొత్త విమానం కింది భాగం 'నేవీ బ్లూ', మధ్యలో ఒక 'ఎరుపు గీత' , పైభాగం 'తెలుపు' రంగుతో సరికొత్తగా రూపొందించారు..@POTUS makes the inaugural exit from the BRAND NEW AIR FORCE ONE! 🔥🇺🇸 pic.twitter.com/jBciB2atAV— Rapid Response 47 (@RapidResponse47) June 19, 2026> ఇప్పటివరకు ఉన్న అన్ని ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల కంటే చాలా వేగంగా, చాలా దూరం ప్రయాణించగలదని అని ట్రంప్ ప్రశంసించారు. జూలై 4న జరిగే అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కొత్త విమానం ఫ్లైఓవర్ (గగన విన్యాసాలు) లో పాల్గొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు.మరోవైపు వందల మిలియన్ల డాలర్ల విలువైన ఈ విమానాన్ని ఖతార్ బహుమతిగా ఇవ్వడంపై అమెరికాలో నైతిక, రాజ్యాంగపరమైన భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ బహుమతిని తిరస్కరించడం మూర్ఖత్వం అవుతుందని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ విమానాన్ని తన ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి విరాళంగా ఇస్తానని చెప్పడం మరింత చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంకాగా 1990ల నుండి సేవల్లో ఉన్న పాత విమానాలను మార్చాలనేది ట్రంప్ మొదటి విడత పదవీకాలం నాటి నుండి ఉన్న బలమైన కోరిక. అధ్యక్షుడి విమాన శ్రేణి కోసం రెండు కొత్త 747-8 విమానాలను సరఫరా చేయడానికి అమెరికా ప్రభుత్వం గతంలో 'బోయింగ్' సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పాటు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ తరుణంలో ఖతార్ ఇచ్చిన విమానాన్ని ట్రంప్ ఆవిష్కరించడం గమనార్హం.ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ -
అమెరికా లేకుంటే.. ఇజ్రాయెల్ పరిస్థితి ఇదేనా?
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్-ఇజ్రాయెల్ విభేదాలు, హెజ్బొల్లా-హమాస్ ముప్పుల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇరాన్తో అమెరికా అవగాహన ప్రయత్నాలను ఇజ్రాయెల్ విమర్శిస్తున్న వేళ.. ఇజ్రాయెల్కు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అమెరికానే అని వాన్స్ వ్యాఖ్యానించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రశ్న మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోగలదా?. రక్షణ నిపుణులు, వ్యూహాత్మక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దీనికి సరళమైన సమాధానం లేదు. స్వల్పకాలిక యుద్ధాలు, పరిమిత దాడులను ఇజ్రాయెల్ స్వయంగా ఎదుర్కోగలిగినా, దీర్ఘకాలిక ప్రాంతీయ యుద్ధంలో అమెరికా సహకారం కీలకంగా మారుతుందని వారు చెబుతున్నారు.అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటిఇజ్రాయెల్ భౌగోళికంగా చిన్న దేశమే అయినప్పటికీ, సైనిక పరంగా అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలో తప్పనిసరి సైనిక సేవా విధానం ఉండటంతో భారీ స్థాయిలో శిక్షణ పొందిన రిజర్వ్ బలగాలు అందుబాటులో ఉంటాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాల వద్ద అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, సైబర్ యుద్ధ సామర్థ్యాలు, అత్యున్నత నిఘా సాంకేతికత ఉన్నాయి. అలాగే మోసాద్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన భద్రతా సంస్థలుగా గుర్తింపు పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రక్షణ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సాధారణ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తన సరిహద్దులను రక్షించుకోవడానికి అవసరమైన సామర్థ్యాన్ని పూర్తిగా కలిగి ఉంది.అమెరికా ఎందుకు ముఖ్యమైంది?ఇజ్రాయెల్ బలమైన దేశమే అయినప్పటికీ, అమెరికాతో దాని సంబంధం కేవలం మిత్రదేశ స్థాయిలో మాత్రమే లేదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మారింది. ప్రతీ సంవత్సరం అమెరికా ఇజ్రాయెల్కు బిలియన్ల డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో ఆధునిక యుద్ధ విమానాలు, ఖచ్చిత లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ సాంకేతికత, గూఢచార సమాచార సహకారం ఉంటాయి. ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐరన్ డోమ్ వ్యవస్థ అభివృద్ధి, నిర్వహణలో అమెరికా ఆర్థిక సహకారం కీలక పాత్ర పోషించింది. గాజా, లెబనాన్ ప్రాంతాల నుంచి వచ్చే రాకెట్లను అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ ప్రధాన రక్షణ కవచంగా నిలుస్తోంది.ఇరాన్తో ప్రత్యక్ష యుద్ధం వస్తే..ఇటీవలి కాలంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీలు, ఇతర ప్రాంతీయ మిత్ర బలగాలు ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. రక్షణ నిపుణుల అంచనా ప్రకారం, ఒకేసారి ఇరాన్, హెజ్బొల్లా, హమాస్ వంటి పలు వర్గాల నుంచి దాడులు జరిగితే ఇజ్రాయెల్పై భారీ ఒత్తిడి పడుతుంది. క్షిపణి నిరోధక వ్యవస్థల నిల్వలు వేగంగా ఖాళీ కావడం, ఆయుధాల వినియోగం పెరగడం, ఆర్థిక వ్యయం విపరీతంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో అమెరికా నుంచి ఆయుధాలు, విడిభాగాలు, ఇంటర్సెప్టర్ క్షిపణులు, గూఢచార సమాచారం నిరంతరం అందడం ఇజ్రాయెల్కు కీలక బలంగా మారుతుంది.అయితే, అమెరికా నుంచి ఇజ్రాయెల్కు లభించే అతిపెద్ద మద్దతు కేవలం సైనిక సహాయం మాత్రమే కాదు. అంతర్జాతీయ వేదికలపై అమెరికా రాజకీయ అండ కూడా అత్యంత కీలకం. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో ఇజ్రాయెల్పై విమర్శలు లేదా చర్యలకు సంబంధించిన అనేక తీర్మానాలను అమెరికా గతంలో వీటో చేసింది. అమెరికా మద్దతు తగ్గితే ఇజ్రాయెల్పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.వాన్స్ అసలు సందేశం ఇదేనా?జేడీ వాన్స్ వ్యాఖ్యలను కేవలం రక్షణ అంశంగా మాత్రమే కాకుండా రాజకీయ సంకేతంగా కూడా విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, అవసరమైతే వాషింగ్టన్ తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు పరోక్షంగా తెలియజేస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాన్ విషయంలో దౌత్యపరమైన పరిష్కారాలను అమెరికా ప్రాధాన్యంగా చూస్తున్న సమయంలో, ఇజ్రాయెల్ మరింత కఠిన వైఖరిని అవలంబిస్తే రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు మరింత పెరిగే అవకాశముందని వారు చెబుతున్నారు.మొత్తానికి.. ఇజ్రాయెల్ స్వయంగా తనను తాను రక్షించుకునే శక్తి కలిగిన దేశమే. కానీ మధ్యప్రాచ్య స్థాయిలో దీర్ఘకాలిక, బహుముఖ యుద్ధం ఎదురైతే అమెరికా సహాయం దాని సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. అందుకే నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే.. ఇజ్రాయెల్కు అమెరికా అవసరం మనుగడ కోసం కాదు.. ఆధిపత్యం కొనసాగించడానికి అని తెలుస్తోంది.ఇజ్రాయెల్ వద్ద సైన్యం..దాదాపు 1.7 లక్షల యాక్టివ్ సైనికులు4 లక్షలకుపైగా రిజర్వ్ దళాలువందల సంఖ్యలో ఆధునిక యుద్ధవిమానాలుఅధునాతన డ్రోన్లుసైబర్ యుద్ధ సామర్థ్యాలుప్రపంచంలోనే అత్యుత్తమ గూఢచారి వ్యవస్థల్లో ఒకటైన మోసాద్అణ్వాయుధ సామర్థ్యం (అధికారికంగా అంగీకరించకపోయినా)అమెరికా నుంచి వచ్చే సహాయంలో..అత్యాధునిక ఆయుధాలుF-35 యుద్ధవిమానాలుక్షిపణి నిరోధక వ్యవస్థల కోసం నిధులురాడార్, నిఘా సాంకేతికతవిడిభాగాలు, మందుగుండు సామగ్రి -
నెతన్యాహు.. కాస్త బుర్ర వాడండి: ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య మళ్లీ ముదురుతున్న ఘర్షణలను ఆపేందుకు తానే నేరుగా జోక్యం చేసుకున్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ నాయకత్వానికి "Calm down and use your head" (శాంతించండి... కాస్త ఆలోచించండి) అని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ వెల్లడించారు.కాగా, ఇటీవల లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా, ప్రతిగా హెజ్బొల్లా కూడా రాకెట్ దాడులకు దిగింది. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి యుద్ధం ప్రాంతమంతా వ్యాపించే అవకాశాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. ఇరాన్ కూడా పరోక్షంగా సహకరించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. చివరకు శుక్రవారం సాయంత్రం నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు.అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో నేరుగా చర్చించినట్టు తెలిపారు. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలకు దూరంగా ఉండాలని సూచించానని, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అమెరికా తీవ్ర దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పారు. కొన్నిసార్లు ఇజ్రాయెల్ నాయకత్వాన్ని "కాస్త సెన్స్తో వ్యవహరించేలా చేయాల్సి వస్తోంది" అంటూ వ్యాఖ్యానించారు.అంతకుముందు జూన్ ప్రారంభంలో కూడా ట్రంప్, నెతన్యాహూతో మాట్లాడి బీరూట్ వైపు సాగుతున్న ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిలిపివేయించానని ప్రకటించారు. అదే సమయంలో మధ్యవర్తుల ద్వారా హెజ్బొల్లాతోనూ సంప్రదింపులు జరిగాయని, ఇరు పక్షాలు కాల్పులు తగ్గించేందుకు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించిన పలు ఒప్పందాలు కొద్ది రోజులకే విఫలమయ్యాయి. తాజా ఒప్పందం కూడా ప్రాంతీయ శాంతి చర్చలు, అమెరికా-ఇరాన్ చర్చల భవిష్యత్తుకు కీలకంగా మారింది -
భీకర దాడులు ఆపై కాల్పుల విరమణ
జెరూసలేం: అమెరికా–ఇరాన్ల మధ్య తాత్కాలిక ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత పశ్చిమాసియాలో భగ్గుమన్న ఉద్రిక్తతలు ఒక్కరోజులోనే చల్లారాయి. అమెరికా, ఇరాన్, ఖతార్ దేశాల ఒత్తిడితో ఇజ్రాయెల్, హెజ్బోల్లా మిలిటెంట్ గ్రూప్ దాడులు ఆపేశాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి అంగీకరించాయి. దాంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అంతకుముందు ఇజ్రాయెల్ సైన్యం తమ పొరుగుదేశం లెబనాన్పై విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం దాకా దక్షిణ, తూర్పు లెబనాన్పై భీకర స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్, హెజ్బోల్లా మిలిటెంట్ గ్రూప్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ దాడుల్లో లెబనాన్లో కనీసం 47 మంది మరణించారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే తమ జవాన్లు నలుగురు మృతిచెందినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. హెజ్బోల్లా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. ఒప్పందంపై సంతకాలు జరిగిన మరుసటి రోజే ఇజ్రాయెల్ రెచ్చిపోవడం నివ్వెరపర్చింది. స్విట్జర్లాండ్లో శుక్రవారం అమెరికా, ఇరాన్ల మధ్య జరగాల్సిన కీలక చర్చలు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదాపడ్డాయి. తదుపరి చర్చలు ఎప్పుడు జరుగుతాయన్నది తెలియరాలేదు. అసలు తాత్కాలిక ఒప్పందం అమలవుతుందా? పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందా? అనే సందేహాలు తలెత్తాయి. తుది ఒప్పందం కోసం చర్చలు జరగాలంటే లెబనాన్లో దాడులు ఆగాల్సిందేనని ఇరాన్ ప్రతినిధులు తేల్చిచెప్పారు. స్విట్జర్లాండ్ ప్రయాణాన్ని విరమించుకున్నారు. స్విట్జర్లాండ్ చర్చల్లో పాల్గొనాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. చర్చలను రీషెడ్యూల్ చేయడానికి మధ్యవర్తులు తీవ్రంగా ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. తాత్కాలిక ఒప్పందం ప్రకారం.. తుది విడత ఒప్పందం కోసం 60 రోజుల్లోగా చర్చలు పూర్తికావాల్సి ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతుగల హెజ్బోల్లా మధ్యనున్న సంఘర్షణే అమెరికా–ఇరాన్ ఒప్పందంలో అత్యంత ముఖ్యమైన అంశం. దీనిపై ఇజ్రాయెల్ గానీ, హెజ్బోల్లా గానీ సంతకాలు చేయలేదు. అందులో తాము భాగస్వాములం కాదని ఇరుపక్షాలు చెబుతున్నాయి. తమ మిత్ర దేశమైన లెబనాన్పై దాడులను సహించబోమని, అవసరమైతే ఇజ్రాయెల్పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ సంకేతాలిస్తోంది. పశ్చిమాసియాలో సంఘర్షణను శాశ్వతంగా ముగించి, శాంతిని నెలకొల్పడానికి చర్చలు ఎప్పుడు జరుగుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. హార్మూజ్లో నౌకలరిజి్రస్టేషన్ తప్పనిసరి అవగాహనా ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు సంతకాలు చేయడంతో హార్మూజ్ జలసంధి తెరుచుకుంది. చమురు నౌకల రాకపోకలు మొదలయ్యాయి. జలసంధి పర్యవేక్షణ బాధ్యతను నూతన ఇరానియన్ అథారిటీకి అప్పగించారు. ప్రస్తుతం హార్మూజ్లో నౌకల రవాణా ఉచితం (టోల్–ప్రీ) అయినప్పటికీ అవి తమ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఈ అథారిటీ శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. త్వరలో విదేశీ నౌకల నుంచి టోల్ ఫీజు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెజ్బోల్లా మూల్యం చెల్లించుకోవాల్సిందే: నెతన్యాహు హెజ్బోల్లా దాడుల్లో లెఫ్టినెంట్ కల్నల్ సహా నలుగురు జవాన్లు మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలియజేసింది. హెజ్బోల్లా గ్రూప్ బహిరంగంగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించింది. హెజ్బోల్లా దాడులపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ‘‘మా సైనికులపై గానీ, మా భూభాగంపై గానీ దాడులను సహించం. ఈ దాడులకు హెజ్బోల్లా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’అని హెచ్చరించారు. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులను లక్ష్యంగా చేసుకున్నట్లు హెజ్బోల్లా అంగీకరించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ స్వయంగా ఉల్లంఘించడం వల్లే తాము ప్రతిస్పందించాల్సి వచ్చినట్లు తేల్చిచెప్పింది.10 సెంట్లు కూడా ఇవ్వం: ట్రంప్ వాషింగ్టన్: ఇరాన్ పని అయిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్ధం ఇరాన్ సైనిక సామర్థ్యాలను నాశనం చేసిందని చెప్పారు. అక్కడ వైమానిక దళం, నౌకాదళం, కీలక రక్షణ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇరాన్కు అమెరికా నుంచి 10 సెంట్లు కూడా దక్కవని తేల్చిచెప్పారు. ఈ మేరకు ట్రంప్ తాజాగా ట్రూత్ సోషల్లో పోస్టుచేశారు. ఇరాన్కు తాము ఆర్థిక సాయం అందజేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. యుద్ధం తర్వాత ఇరాన్ బలపడిందని, అమెరికా నష్టపోయిందని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ యుద్ధం ఇరాన్ సైనిక బలాన్ని గణనీయంగా తగ్గించిందని పేర్కొన్నారు.ఐఏఈఏకు ఇరాన్ ఆహ్వానం! వాషింగ్టన్: ఇరాన్ అణు స్థావరాలను తనిఖీ చేయడానికి, అలాగే శుద్ధి చేసిన యురేజియం స్థానాలను గుర్తించి, వెలికితీసే పనిని ప్రారంభించడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ)ను ఇరాన్ ఆహ్వానిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ అమెరికా చట్టసభ సభ్యులకు తెలియజేశారు. ఐఏఈఏను ఆహ్వానించడానికి ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. అయితే, దీనిపై ఐఏఈఏ ఇంకా స్పందించలేదు. ఇరాన్ వద్దనున్న శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ పర్యవేక్షణలో నిరీ్వర్యం చేయాలన్న షరతును తాత్కాలిక ఒప్పందంలో చేర్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదని, అభివృద్ధి చేయకూడదని ఒప్పందంలో ప్రస్తావించారు. ఫలించిన ఒత్తిడి ఇజ్రాయెల్ సైన్యం, హెజ్బోల్లా మధ్య దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉండడంతో అమెరికా, ఇరాన్, ఖతార్ శుక్రవారం రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్తోపాటు హెజ్బోల్లా గ్రూప్పై ఒత్తిడి పెంచాయి. వెంటనే దాడులు ఆపాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేలి్చచెప్పాయి. దాంతో ఇజ్రాయెల్, హెజ్బోల్లా దిగిరాక తప్పలేదు. కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించినట్లు అమెరికా అధికారులు ధ్రువీకరించారు. -
ఆస్ట్రేలియాపై గెలుపు.. నాకౌట్కు యూఎస్ఏ
ఫిఫా వరల్డ్కప్ 2026కు సహ ఆతిథ్య దేశమైన యూఎస్ఏ గ్రూప్ దశలో (గ్రూప్-డి) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి నాకౌట్కు అర్హత సాధించింది. ఆస్ట్రేలియాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32కు చేరింది. గ్రూప్ దశలో మరో మ్యాచ్ (తుర్కియేతో) మిగిలి ఉండగానే ఆరు పాయింట్లు సాధించి తదుపరి దశలోకి ప్రవేశించింది.ఆసీస్తో మ్యాచ్కు స్టార్ ఆటగాడు క్రిస్టియన్ పులిసిక్ గాయంతో దూరమైనప్పటికీ అమెరికా జట్టు ఏమాత్రం తడబడలేదు. మ్యాచ్ ప్రారంభమైన 11వ నిమిషంలో ఆస్ట్రేలియా డిఫెండర్ కెమరూన్ బుర్గెస్ చేసిన సెల్ఫ్ గోల్ అమెరికాకు తొలి ఆధిక్యాన్ని అందించింది.ఆ తర్వాత తొలి అర్ధభాగం ముగియడానికి కొద్దిసేపటి ముందు అలెక్స్ ఫ్రీమన్ హెడ్డర్ ద్వారా రెండో గోల్ సాధించాడు. మొదట ఆఫ్సైడ్గా ప్రకటించిన ఈ గోల్ను వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) సమీక్ష అనంతరం చెల్లుబాటు అయ్యే గోల్గా నిర్ధారించారు. -
అమెరికాలో విద్వేషానికి చోటు లేదు
వాషింగ్టన్: అమెరికాలో భారత్కు వ్యతిరేకంగా విద్వేష ఘటనలు పెరగటంపై భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. వివక్ష, పక్షపాతాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. మతం, జాతీయతతో సంబంధం లేకుండా, ఏ వర్గంపై అయినా జరిగే ద్వేషపూరిత చర్యలను సమిష్టిగా వ్యతిరేకించాలని ఎక్స్ వేదికగా నొక్కి చెప్పారు. టెక్సాస్లోని ఫ్రిస్కోలో ఇటీవల జరిగిన ఒక సంఘటనను ఆయన ప్రస్తావించారు. ‘శ్వేతజాతి ఆధిపత్యవాదులుగా గుర్తించబడిన ఒక బృందం సిటీ హాల్ బయట భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ భారత జాతీయ జెండాను చించివేశారు. హిందువులైనా, ముస్లింలైనా, యూదులైనా.. ఎవరిపట్ల అయినా పక్షపాతం, వివక్షలకు వ్యతిరేకంగా మనం భుజం భుజం కలిపి నిలబడాలి. మతం, జాతీయతతో సంబంధం లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలి’అని పిలుపునిచ్చారు. విద్వేషానికి వ్యతిరేకంగా సెనేట్లో తీర్మానంఈ విషయంపై కృష్ణమూర్తి గతంలో కాంగ్రెస్లో కూడా తన గళం వినిపించారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై దాడి చేస్తూ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన ఒక విద్వేషపూరిత పోస్ట్ను ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ప్రచారం చేయడాన్ని కృష్ణమూర్తి ఖండించారు. భారతీయ అమెరికన్లు, చైనీస్ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ డెమొక్రటిక్ సభ్యులతో కలిసి సెనేట్లో ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.‘భారత్, చైనా గురించి అవమానకరమైన భాషను ఉపయోగించడం, వలసదారుల విధేయతను ప్రశ్నించడం, భారతీయ అమెరికన్లను, చైనీస్ అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని హానికరమైన మూసధోరణులను ప్రచారం చేయడం సరికాదు’ అని తీర్మానంలో పేర్కొన్నారు. ‘ది సావేజ్ నేషన్’రేడియో కార్యక్రమంలో ‘ఇక్కడ జన్మింంచిన ఒక శిశువు తక్షణమే పౌరురాలు అవుతుంది. ఆ తర్వాత వారు చైనా, భారత్ లేదా ఈ భూమ్మీద ఉన్న మరేదైనా నరక కూపం నుంచి మొత్తం కుటుంబాన్ని తీసుకువస్తారు’ అంటూ వ్యాఖ్యాత మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని తీర్మానం ఖండించింది. ఈ భాష హానికరమైన మూస ధోరణులను బలపరుస్తుందని, వలస సమాజాల పట్ల విద్వేషాన్ని పెంచుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇరాన్–అమెరికా శాంతి చర్చలకు బ్రేక్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత తెర పడే ప్రయత్నాలకు విఘాతం కలిగింది. అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందం తాలుకా కీలక సమావేశం వాయిదా పడింది. శుక్రవారం స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ పర్వత రిసార్ట్లో జరగాల్సిన ఈ భేటీ చివరి నిమిషంలో రద్దైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో.. తాత్కాలిక కాల్పుల విరమణ (ట్రూస్) భవిష్యత్తుపై భారీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.శాంతి ఒప్పందానికి అవసరమైన పరస్సర అవగాహన ఒప్పందంపై అమెరికా, ఇరాన్ అధ్యక్షులు సంతకాలు కూడా చేశారు. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్లో ఇవాళ భేటీ జరగాల్సి ఉంది. దీనికి ఇరాన్-అమెరికా విదేశాంగ అధికారులతో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరవుతారని అంతా భావించారు. అయితే.. ఇంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏర్పాట్లలో సమస్యలు తలెత్తడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతోనే చర్చలు ఆగాయని ఇరాన్ ప్రకటించింది. దీంతో మరోసారి చర్చలకు బ్రేక్ పడింది. ఇప్పటికే ఇరాన్–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక 60 రోజుల ఒప్పందాన్ని కుదిరింది. ఈ కాలంలోనే శాంతి చర్చలు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం అమలు చేసే దశలో కీలకమైన ఈ భేటీ రద్దు కావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.వైట్ హౌస్ ప్రకారం.. చర్చలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, సమన్వయం, ప్రయాణాలు, షెడ్యూల్ వంటి విషయాలు(లాజిస్టిక్స్) అనూహ్యంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే అమెరికా అధికారులు మాత్రం ఈ ఒప్పందం ఇంకా పూర్తిగా రద్దు కాలేదని, భవిష్యత్తులో చర్చలు కొనసాగవచ్చని సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం అమెరికా ముందుగా ఒప్పందాన్ని అమలు చేయాలన్న స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చర్చలకు షరతులు విధిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా అమెరికా అధిక డిమాండ్లు చేస్తే ఒప్పుకోబోమని హెచ్చరించారు.ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు వేలాది మంది మరణించగా, ఎనర్జీ ధరలు పెరిగి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. తాజా ఒప్పందం కింద ఇరాన్కు ఆర్థిక ఆంక్షల సడలింపు, ఆస్తుల విడుదల వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ ఈ చర్చల్లో భాగం కాకపోవడం వివాదంగా మారింది.అదే సమయంలో లెబనాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 16 మంది మరణించగా, పలు ప్రాంతాల్లో భీకర బాంబు దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ మధ్య కూడా ఈ యుద్ధ విధానంపై అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. కొన్నిగంటల ముందు ఇజ్రాయెల్ను ఉద్దేశించి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ఈ యుద్ధ లక్ష్యాలు.. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిలిపివేయడం, ప్రాంతీయ దాడులను ఆపడం. అయితే ఈ రెండూ ఇప్పటివరకు పూర్తిగా సాధ్యం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ కొత్త ఒప్పందంలో ఆర్థిక సడలింపులు, పునర్నిర్మాణ నిధులు వంటి అంశాలు ఉండటం చర్చలకు కొత్త మలుపు ఇచ్చాయి.చర్చలు ప్రస్తుతానికి రద్దు కావడంతో మిడిల్ ఈస్ట్లో శాంతి ఆశలు మరోసారి అనిశ్చితిలో పడిపోయాయి. రాబోయే రోజుల్లో ఇరాన్–అమెరికా మళ్లీ చర్చల టేబుల్కి వస్తాయా? అనేది ప్రపంచ రాజకీయాల్లో కీలక ప్రశ్నగా మారింది. -
బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరం
అమెరికాలో రోజు రోజుకి అస్తవ్యస్థంగా మారిపోతున్న వైద్య వ్యవస్థ, సేవల్లో జాప్యం, ఖరీదైన వైద్యంలాంటి వాటిపై ఇప్పటికే చాలా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇండియాలో హెల్త్కేర్ సిస్టం, అందిస్తున్న సేవలపై ఒక అమెరికన్ మహిళ ప్రశంసలు కురిపించడం విశేషంగా నిలిచింది. అమెరికా చూసి నేర్చుకోఅంటూ ఇన్స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అపాయింట్మెంట్ లేకుండా భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్లు కొనుక్కో గలిగాను అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.ఆమె తన వీడియోలో వివరించిన వివరాల ప్రకారం భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్ల కొనుగోలు ప్రక్రియ ఎంతో అందుబాటులోనూ, తక్కువ ధరలోనూ ఉంది.ఒక ఆప్టికల్ స్టోర్కు వెళ్లి లెన్స్లను ఆర్డర్ చేయడం, చాలా తక్కువ ధరకే వాటిని త్వరగా పొందడం వంటి విషయాలను వివరిస్తూ, ‘ఐవీ' (Ivy) అనే మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. అమెరికా దీనిని గమనించాలని (పాఠంనేర్చుకోవాలని) ఆమె సూచించారు. బీమా లేదా ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే రూ. 2,451లకే కొనుగోలు చేసి, ఇక్కడి వైద్య సేవల లభ్యతను ఆమె కొనియాడారు.షాపింగ్ అనుభవం ఐవీ కోసం కేవలం ఒక జత కాంటాక్ట్ లెన్స్లు మాత్రమే తెచ్చుకుంది. దీంతో మరో జత కొనాలని నిర్ణయించుకుంది. కేవలం 20 నిమిషాల నడక దూరంలో ఉన్న ఒక మాల్లోని ఆప్టికల్ స్టోర్కు వెళ్లి, తన ప్రిస్క్రిప్షన్ను వారికి చూపించింది. ఆమె వాడే బ్రాండ్ లెన్స్లను సోమవారం రాత్రి కల్లా తెప్పించి ఇస్తామని స్టోర్ సిబ్బంది చెప్పారు. మరిన్ని బాక్సులు కొంటే అదనపు డిస్కౌంట్ ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ, ఆమె ఒక బాక్స్ మాత్రమే తీసుకుంది. చెప్పిన సమయానికి ఆమెకు లెన్స్లు అందడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది.ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీఇలా నేరుగా ఆప్టికల్ స్టోర్లోకి నడుచుకుంటూ వెళ్లి లెన్స్ కొనుక్కోవడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అమెరికాలో ఇలా చేయడం అస్సలు సాధ్యం కాదు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ లేకుండా అస్సలు కుదరదని ఐవీ పేర్కొంది. చాలా తక్కువ ధరకే మూడు జతలు వచ్చాయంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.నెటిజన్లు ఏమన్నారంటేఈ పోస్ట్ వైరల్ కావడంతో, అమెరికన్లకు కాంటాక్ట్ లెన్స్లు కొనడానికి కూడా ఇన్సూరెన్స్ కావాలనే విషయం తెలిసి మెజారిటీ నెటిజన్లు ఆశ్చర్యపోయారు "నిజమా! నేనైతే ఎప్పుడు పడితే ఒక మామూలు గ్లాసెస్ షాప్కి వెళ్తాను. నా కళ్లద్దాలు లూజ్ అయితే టైట్ చేయించుకుంటాను. దానికోసం ఆ షాప్ అతను ఒక్క రూపాయి కూడా తీసుకోడు, ఫ్రీగా చేస్తాడు." అని తెలిపారు. కాంటాక్ట్ లెన్స్ కోసం ఇన్సూరెన్స్ కావాలనే కాన్సెప్ట్ వినడానికే చాలా వింతగా ఉందంటూ మరొక యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకూ ఈ విషయం తెలియదంటూ మరికొందరు కూడా విస్తుపోయారు. కాగా ఇటీవల మరొక అమెరికన్ మహిళ (విక్టోరియా) అమెరికాలో సుమారు రూ. 94వేలు ఖరీదు చేసే ముఖ్యమైన మందులను ఇండియా నుంచి కేవలం రూ. 2,350 లకే కొనుగోలు చేసానని, , అమెరికా హెల్త్కేర్ సిస్టమ్ను ఒక "స్కామ్" అని అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు -
డీల్ వేళ పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
ఇరాన్–అమెరికా మధ్య అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగిన మరుసటిరోజే పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. దక్షిణ లెబనాన్లోని నబాతియే ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 16 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. లెబనాన్ జాతీయ వార్తా సంస్థ (NNA) తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి తరువాత ఈ దాడులు జరిగాయి. నబాతియే నగరంతో పాటు క్ఫర్ జౌజ్, క్ఫర్ రేమాన్, జెబ్డైన్ పట్టణాలపై బాంబుల వర్షం కురిసింది. ఇటు క్ఫర్ టిబ్నిట్, రేహాన్ హైట్స్ ప్రాంతాలపై వరుసగా వైమానిక దాడులు జరిగాయని తెలుస్తోంది.నబాతియే, హరూఫ్ ప్రాంతాల్లో కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అల్-షర్కియా, డువైర్ మధ్య ఉన్న ఓ ఇంటిపై జరిగిన దాడిలో నలుగురు మరణించారు. క్ఫర్ సిర్ పట్టణంలో జరిగిన మరో దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు ఎన్ఎన్ఏ వెల్లడించింది. అదే సమయంలో డువైర్ మునిసిపాలిటీ భవనం సమీపంలో మోటార్సైకిల్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఈ దాడులతో దక్షిణ లెబనాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.డీల్ కొలిక్కి రావడంలో ఆలస్యానికి లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యం కూడా ఓ కారణమే!. కాల్పుల విరమణ అమల్లో ఉండగానే.. హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 5 వేల మంది మరణించగా.. సాధారణ పౌరులే ఉన్నారనని చెబుతూ ఇజ్రాయెల్పై లెబనాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటు లెబనాన్పై దాడులు ఆపకపోతే ఒప్పందానికి ముందుకు రామని.. అవసరమైతే భీకర యుద్ధం చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తూ వచ్చింది. దీంతో ఈ విషయంలో మిత్రదేశాలైన అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం సైతం నడిచింది. ఒకానొక టైంలో దాడులు ఆపాలంటూ నెతన్యాహును ఉద్దేశించి ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు సైతం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే.. అవేవీ పట్టించుకోకుండా నెతన్యాహు ఇంతకాలం లెబనాన్పై పరిమిత దాడులు జరిపిస్తూ వచ్చారు. ఇజ్రాయెల్లో రాజకీయ ఒత్తిళ్లే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. హర్ముజ్ వేదికగా ఇంతకాలం కొనసాగిన ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలకు డీల్ తర్వాత చెక్ పడింది. అయితే.. ఈ డీల్పై ఇజ్రాయెల్లో నెతన్యాహు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజా దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ దాడులపై ఇటు ఇరాన్, అటు అమెరికాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. -
త్వరలో ‘ఇంధన అత్యవసర’ ఆంక్షల ఎత్తివేత!
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్ రక్షణ కోసం అమలు చేసిన ‘ఇంధన అత్యవసర’ ఆంక్షలను అంతర్జాతీయ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత దశలవారీగా ఉపసంహరించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య 111 రోజుల యుద్ధానికి ముగింపు పలికే మధ్యంతర ఒప్పందం కుదిరింది. దీంతో వ్యూహాత్మకంగా కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధి ద్వారా నౌకాయాన కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి రానుండటం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారతదేశానికి భారీ ఊరటనిచ్చే అంశం.ముందస్తు రక్షణ చర్యలుగా ఆంక్షలు ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చమురు, సహజ వాయువు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ముడి చమురు ధరలు, షిప్పింగ్ భీమా ప్రీమియంలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సంక్షోభం తీవ్రరూపం దాల్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పలు అత్యవసర ప్రత్యామ్నాయ చర్యలను అమలు చేసింది. అందులో భాగంగా... ఎల్పీజీ సరఫరాలపై నిఘా పెంచింది. సిలిండర్ల అక్రమ రవాణా, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై కఠిన నిబంధనలు తెచ్చింది. ఇందులో భాగంగానే పెట్రోకెమికల్స్ ఉత్పత్తికి వాడే గ్యాస్ను ఎల్పీజీ వైపు మళ్లించాలని రిఫైనరీలను ఆదేశించింది.హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాను తగ్గించడంతో పాటు, గృహ వినియోగదారుల సిలిండర్ బుకింగ్ వ్యవధిని పెంచి నిల్వలను నియంత్రించింది. గృహ అవసరాలు, రవాణా (సీఎన్జీ), ఎరువుల రంగానికి ప్రాధాన్యత ఇస్తూ దేశీయ సహజ వాయువు కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేసింది.‘‘ఈ ఆంక్షలన్నీ కేవలం ముందస్తు నివారణా చర్యలే. అంతర్జాతీయంగా చమురు మార్కెట్ స్థిరపడి, సరఫరా ముప్పు తొలగిపోగానే ఈ ఆంక్షలను దశలవారీగా ఉపసంహరిస్తాం’’ అని అధికారి స్పష్టం చేశారు.చమురు కంపెనీలకు రోజూ రూ.550 కోట్ల నష్టం యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్కు 70–72 ডy్థయి నుంచి గరిష్టంగా 119 డాలర్లకు చేరుకున్నాయి. అయితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం కొంతకాలం పాటు పెరగకుండా నియంత్రించింది. మార్చి 27న పశి్చమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.10 చొప్పున కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అనంతరం ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.7.50 చొప్పున, సీఎన్జీ ధరలను కిలోకు రూ.6 మేర పెంచింది.గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రెండు విడతల్లో మొత్తం రూ.89 పెంపు అమలు చేసింది. ఈ ధరల పెంపు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయ రిటైల్ ఇంధన ధరలు ఇంకా తక్కువగానే ఉండటంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికీ రోజుకు సుమారు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని అధికారి వెల్లడించారు. గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మూడు నెలల కనిష్టానికి పతనమమయ్యాయి. గురువారం బ్యారెల్ ధర సుమారు 78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తొలిసారి స్పందించారు. ఇరాన్ ప్రయోజనాలు, "రెసిస్టెన్స్ ఫ్రంట్" హక్కులు కాపాడతామనే హామీతోనే తాను ఈ ఒప్పందానికి అంగీకరించానని అన్నారాయన. ఈ క్రమంలోనే ట్రంప్ తీరుపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిన తర్వాత ప్రజలను ఉద్దేశించి విడుదల చేసిన సందేశంలో మొజ్తబా ఖమేనీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం కోసం తామేమీ ప్రయత్నించలేదని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే తీవ్రంగా ఆరాటపడ్డారని.. ఈ క్రమంలో "అన్ని రకాల ఒత్తిళ్లు, ఎత్తుగడలు" ఉపయోగించారని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..తొలుత తాను ఈ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించానని.. అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, జాతీయ భద్రతా మండలి సభ్యులు తనను ఒప్పించారని అన్నారు. ఇరాన్ ప్రయోజనాలు దెబ్బతినవని హామీ ఇవ్వడంతోనే ఆమోదం తెలిపినట్లు చెప్పారు. "ఈ ఒప్పందం కోసం ఇరాన్ అధికారులు నిజాయితీగా కృషి చేశారు. కానీ దీనిని సాధించేందుకు అన్ని రకాల ఒత్తిళ్లు ఉపయోగించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడే. నిరాశతోనే ఈ డీల్ను ముందుకు తీసుకొచ్చాడు" అని ఖమేనీ వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో అమెరికా ఒప్పంద పరిధిని దాటి అదనపు షరతులు విధించాలనుకుంటే వాటికి తాము లొంగబోమని అధ్యక్షుడు తనకు స్పష్టంగా చెప్పారని ఖమేనీ వెల్లడించారు. ఇరాన్ హక్కులు, స్వాతంత్ర్యం, గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో అమెరికాతో ముఖాముఖి చర్చలు జరగడం అంటే.. అమెరికా వైఖరిని అంగీకరించినట్లు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28వ తేదీన యుద్దం ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఆనాడు ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే దాడిలో తీవ్రంగా గాయపడిన మొబ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మధ్యలో నాయకత్వ బాధ్యతలు ఇరాన్లో తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు.. మత, భద్రతా వర్గాల మద్దతుతో మొజ్తాబానే కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు. తాజాగా అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఖమేనీకి మద్దతుగా విదేశాంగ మంత్రిఖమేనీ ప్రకటనతో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఏకీభవించారు. సుప్రీం లీడర్ మార్గదర్శకాల ప్రకారమే చర్చలు కొనసాగుతాయని పేర్కొన్నారు. చర్చల తదుపరి దశలో దేశ ప్రయోజనాలు, గౌరవం, స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగించే ఒప్పంద తాలుకా ఎంవోయూపై ఇరు దేశాల అధినేతలు డిజిటల్ సంతకాలు చేశారు. ఒప్పందం కుదిరిన వెంటనే తొలి చర్యలు ప్రారంభమయ్యాయి. హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమలు చేస్తున్న సముద్ర నిర్బంధ చర్యలను అమెరికా సెంట్రల్ కమాండ్ నిలిపివేసింది. ఇకపై ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చీపోయే వాణిజ్య నౌకలపై ఆంక్షలు ఉండవని ప్రకటించింది.మరోవైపు హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణాను పునరుద్ధరించేందుకు ఇరాన్ చర్యలు ప్రారంభించింది. వచ్చే 60 రోజుల పాటు నౌకలకు వేగవంతమైన అనుమతులు, జలసంధి రుసుముల మినహాయింపు కల్పిస్తామని వెల్లడించింది.ఒప్పందంలో అసలు ఏముంది?"ఇస్లామాబాద్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్" పేరుతో కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు సైనిక చర్యలను నిలిపివేయాలి. హర్ముజ్ జలసంధిలో సాధారణ రవాణా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. అలాగే 60 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలి. ఆ చర్చల్లో ఆంక్షల ఎత్తివేత, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇక..ఇటు స్విట్జర్లాండ్లో జరగాల్సిన కీలక సమావేశం యథాతథంగా జరగనుంది. అమెరిరా, ఇరాన్తో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరు కానున్నారు. అవగాహన ఒప్పందం అమలుతో పాటు తుది ఒప్పందం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. -
తుది ఒప్పందం కుదరకుంటే పశ్చిమాసియా మళ్లీ రక్తసిక్తమే!
ఎవియన్–లెస్–బెయిన్స్/దుబాయ్/వాషింగ్టన్: ప్రపంచ దేశాలను అష్టకష్టాలకు గురిచేస్తున్న పశ్చిమాసియా యుద్ధం ముగిసిపోయింది. యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరుపక్షాలు ప్రకటించాయి.దీనికి ‘ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆప్ ఇరాన్’అని పేరుపెట్టారు. నిజానికి ఇదొక మధ్యంతర ఒప్పందమే. దీని ప్రకారం.. అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు ప్రతిదాడులు పూర్తిగా నిలిచిపోతాయి. ఇరాన్ అణ్వాయుధ ప్రయోగాల నిలిపివేతపై తుది ఒప్పందం కుదుర్చుకునేందుకు రాబోయే 60 రోజులపాటు చర్చలు జరుగుతాయి. తుది ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై దాడులు మళ్లీ ప్రారంభించే వెసులుబాటును ట్రంప్ తన గుప్పిట పెట్టుకున్నారు. ఇక స్వేచ్ఛగా చమురు విక్రయాలు షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో శుక్రవారం సంతకాలు జరగాల్సి ఉండగా, స్థానిక కాలమానం ప్రకారం బుధవారమే ఫ్రాన్స్లో ట్రంప్ సంతకాలు చేశారు. రాజధాని పారిస్లోని వెర్సెయిల్స్ ప్యాలెస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ ఇచ్చిన విందు సందర్భంగా అవగాహనా ఒప్పందం భౌతిక ప్రతిపై(ఫిజికల్ కాపీ) ట్రంప్ లాంఛనంగా సంతకం చేశారు. అదే సమయంలో ఇరాన్లో అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒప్పందం ప్రతిపై సంతకం పెట్టారు. రెండు సంతకాలతో కూడిన పత్రాన్ని పెజెష్కియాన్ ప్రదర్శిస్తున్న చిత్రాన్ని ఇరాన్ మీడియా విడుదల చేసింది.ఒప్పందం పూర్తి వివరాలను అమెరికా, ఇరాన్లు ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు. ఇరుదేశాలు విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇరాన్ తన వద్ద ఉన్న అత్యంత శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తగ్గించుకోవాలి. ఆ దేశంపై ఆంక్షలను అమెరికా తొలగిస్తుంది. ఇరాన్ తన ముడి చమురును తక్షణమే స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చు. యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ పునరి్నర్మాణం కోసం కనీసం 300 బిలియన్ డాలర్లను అమెరికా అందిస్తుంది. ఈ అగ్రిమెంట్ను జాగ్రత్తగా గమనిస్తే ఇరాన్కు ఎక్కువ, అమెరికాకు తక్కువ లబ్ధి చేకూరేలా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే సంతకం పూర్తయ్యింది: ట్రంప్ ట్రంప్ సంతకం చేసిన వీడియోను వైట్హౌస్ సిబ్బంది ఆన్లైన్లో షేర్ చేశారు. ఇందులో ట్రంప్, మేక్రాన్ పక్కపక్కనే కూర్చున్నారు. ఫిజికల్ కాపీపై సంతకం పూర్తయిన తర్వాత ట్రంప్ ఆ డాక్యుమెంట్ను, సంతకం చేయడానికి ఉపయోగించిన పెన్నును అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు అందజేశారు. ఆ గదిలో ఉన్నవారంతా చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. సంతకం కంటే ముందు ట్రంప్ మాట్లాడారు. ‘ఇది అంత సులభం కాదు’అని వ్యాఖ్యానించారు. సంతకం చేసిన తర్వాత వెర్సెయిల్స్లో విందు ముగించుకొని బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు.‘ఇరాన్తో కుదిరిన అవగాహనా ఒప్పందంపై ఇప్పుడే సంతకం పూర్తయ్యింది’అని చెప్పారు. ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గత ఆదివారం డిజిటల్ విధానంలో సంతకాలు చేశారని అమెరికా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా ఒప్పందంపై సంతకం చేశారు. ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలతో కూడిన ఒప్పంద పత్రాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఇదిలా ఉండగా, డిజిటల్ సంతకంతో కూడిన ఒప్పందం, భౌతిక సంతకంతో కూడిన ఒప్పందం మధ్య వ్యత్యాసం ఏమిటన్న దానిపై అమెరికా ఇంకా స్పందించలేదు. అధికారిక హామీదారుగా షెహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు చేసిన తర్వాత.. యుద్ధాన్ని ముగించే ఈ అవగాహనా ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రెండు దేశాల మధ్య ఇన్నాళ్లూ ఆయన మధ్యవర్తిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీన్ని ‘ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందం’గా ఆయన అభివరి్ణంచారు. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించినందుకు ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీలను షరీఫ్ ప్రశంసించారు. హార్మూజ్ జలసంధి వెంటనే తిరిగి తెరుచుకుంటుందని, ఇరాన్ ఓడరేవుపై దిగ్బంధనాన్ని అమెరికా తక్షణమే ఎత్తివేస్తుందని ప్రకటించారు.ఒప్పందం విషయంలో తమకు సహకరించిన సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఈజిప్ట్ వంటి పశ్చిమాసియా దేశాలకు షరీఫ్ ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘దౌత్యం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఉన్న దృఢమైన నిబద్ధత, శాంతియుత పరిష్కారానికి ఆయన చూపిన చొరవ పశ్చిమాసియాలో వినాశకరమైన పరిణామాలకు అడ్డుకట్ట వేశాయి’’అని ఉద్ఘాటించారు.అమెరికా, ఇరాన్ల అత్యున్నత దౌత్య బృందం కృషి వల్లే ఒప్పందం సాకారమైందని కొనియాడారు. ఈ అవగాహన ఒప్పందం పశ్చిమాసియాలో శాంతి, శ్రేయస్సుకు శాశ్వత పునాదిగా నిలవాలని ఆకాంక్షించారు. పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం కుదిరిన ‘ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందం’పై షెహబాజ్ షరీఫ్ కీలక మధ్యవర్తిగా గురువారం సంతకం చేశారని ఆయన కార్యాలయం ప్రకటించింది. అధికారికంగా హామీదారుగా షరీఫ్ సంతకం చేసినట్లు సమాచారం. స్విట్జర్లాండ్ సమావేశం యథాతథం! స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ నెల 19న ఒప్పందంపై సంతకాలు చేయడానికి అమెరికా, ఇరాన్లు అంగీకరించాయి. అయితే, షెడ్యూల్ కంటే ముందే సంతకాల కార్యక్రమం ముగిసింది. అయినప్పటికీ స్విట్జర్లాండ్ సమావేశం శుక్రవారం యథాతథంగా జరుగుతుందని సమాచారం. అమెరికా, ఇరాన్లతోపాటు పశ్చిమాసియా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. అవగాహనా ఒప్పందం అమలుతోపాటు తుది ఒప్పందం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. ఎవరికెంత లాభం? అవగాహనా ఒప్పందంపై సంతకాలు పూర్తి కావడంతో ఎవరికెంత లాభం అనే చర్చ మొదలైంది. హార్మూజ్ జలసంధి దాదాపు తెరుచుకున్నట్లే. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుపక్షాలు చర్చలు ప్రారంభించబోతున్నాయి. తక్షణ లాభం మాత్రం ఇరాన్కే అని చెప్పొచ్చు. ఆ దేశం తమ చమురును ప్రపంచ దేశాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విక్రయించుకోనుంది. భారీగా ఆదాయం గడించనుంది. ఆంక్షలు లేవు కాబట్టి బహిరంగంగానే వ్యాపారం చేసుకోవచ్చు. కొత్త మార్కెట్లకు చమురును సరఫరా చేయొచ్చు. ధరలు కూడా పెంచే వీలుంది.మరోవైపు ప్రపంచ దేశాలు కూడా ఎంతోకొంత లబ్ధి పొందబోతున్నాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకోవడంతో ఎలాంటి సుంకాలు లేకుండా నౌకలు రాకపోకలు సాగిస్తాయి. దాంతో చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఉండవు. అయితే, ఎనిమిది ఏళ్ల క్రితం తాను రద్దు చేసిన 2015 నాటి అణు ఒప్పందం కంటే మెరుగైన ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ సాధించగలరా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా ఇరాన్ను కట్టడి చేయగలరా? అనే అనుమానాలున్నాయి. ఇరాన్పై యుద్ధంతో ట్రంప్ కొత్తగా సాధించింది ఏమిటో చెప్పాలని అమెరికన్లు ప్రశి్నస్తుండడం గమనార్హం. హార్మూజ్లో మళ్లీ నౌకల సందడిప్రారంభమైన రాకపోకలు న్యూయార్క్: అవగాహనా ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు సంతకాలు చేయడంతో హార్మూజ్ జలసంధిలో మళ్లీ నౌకల సందడి మొదలైంది. ప్రధాన షిప్పింగ్ కంపెనీలు హార్మూజ్ గుండా తమ నౌకలను తరలించడం ప్రారంభించాయని సముద్రయాన డేటా సంస్థ లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జలసంధిలో చిక్కుకుపోయిన ప్రముఖ కంపెనీల నౌకలు.. 110 రోజుల తర్వాత మొదటిసారిగా అక్కడి నుంచి ప్రయాణం ఆరంభించాయని లాయిడ్స్ లిస్ట్ ప్రధాన సంపాదకుడు రిచర్డ్ మీడ్ చెప్పారు.పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఈ జలసంధిని ఇరాన్ మూసివేసింది. నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించింది. గురువారం ఆంక్షలు తొలగిపోయాయి. ప్రధాన షిప్పింగ్ కంపెనీలైన గ్రిమాల్డి గ్రూప్, కోస్కో, నట్సెన్, ఎన్వైకే నియంత్రణలో ఉన్న ట్యాంకర్లు జలసంధి గుండా ప్రయాణించాయి. ఇరాన్ జెండా కలిగిన, నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీ యాజమాన్యంలోని రెండు ముడి చమురు ట్యాంకర్లు జలసంధిలోకి ప్రవేశించాయి. అయితే, హార్మూజ్పై ఇరాన్ అమర్చిన జల మందుపాతరలను ఇంకా వెలికితీయలేదు. దాదాపు 80 మందుపాతరలను వెలికి తీయాల్సి ఉందని చెబుతున్నారు. హార్మూజ్ గుండా మరింత చమురు: వాన్స్ ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తేశామని జేడీ వాన్స్ గురువారం చెప్పారు. పదుల సంఖ్యలో నౌకలు ఇరాన్ ఓడరేవులకు చేరుకోవడానికి తమ సైన్యం అనుమతించిందని అన్నారు. హార్మూజ్ జలసంధి గుండా ఇప్పుడు మరింత చమురు ప్రవహిస్తోందని చెప్పారు.దక్షిణ లెబనాన్లోనే ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుజెరూసలేం: లెబనాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకొనే ఆలోచన లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ప్రస్తుతం దక్షిణ లెబనాన్లో ఉన్న తమ సైన్యం ఇకపైనా అక్కడే ఉంటుందని గురువారం ప్రకటించారు. అవగాహనా ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు సంతకం చేసిన తర్వాత ఆయన తొలిసారి స్పందించారు.సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల వరకు లెబనాన్ భూభాగంలో ఇజ్రాయెల్ సైన్యం తిష్టవేసింది. దక్షిణ లెబనాన్లో ఒక సెక్యూరిటీ జోన్ను ఏర్పాటు చేయాలని, ఇజ్రాయెల్ భద్రతా అవసరాలకు అది అవసరమైనంత కాలం అక్కడి నుంచి సైన్యం వైదొలగకూడదని నెతన్యాహు అన్నారు. లెబనాన్లో సైతం దాడులు ఆపాలని ఒప్పందం నిర్దేశిస్తోంది. అందుకు సిద్ధంగా లేమని నెతన్యాహు సంకేతాలిస్తున్నారు. -
ఇజ్రాయెల్పై అమెరికా ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంపై విమర్శలు చేస్తున్న ఇజ్రాయెల్ నేతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచిన ఏకైక ప్రపంచ నాయకుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అని అన్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్ తమ ప్రధాన సమస్య అని భావించే వారు వాస్తవ పరిస్థితిని గుర్తించాలని ఘాటు హెచ్చరిక చేశారు.వైట్హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వాన్స్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరిపడిందని, అమెరికా అందించిన దౌత్య, సైనిక సహకారాన్ని కొందరు ఇజ్రాయెల్ మంత్రులు గుర్తించడం లేదని విమర్శించారు. "Wake up and smell the reality" అంటూ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేసినప్పటికీ, ఏప్రిల్ 8న కుదిరిన తొలి కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగించాలని భావించగా, ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి తాజాగా అమెరికా–ఇరాన్ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండబోమని వ్యాఖ్యానించడం ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపైనే వాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇక ట్రంప్ కూడా ఇటీవల నెతన్యాహుపై అసహనం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఉనికికి అమెరికా మద్దతే ప్రధాన కారణమని పేర్కొన్డాను. అలాగే నెతన్యాహును "crazy" అని వ్యాఖ్యానించినట్లు అమెరికా మీడియా నివేదించింది.అయితే నెతన్యాహు స్పందిస్తూ, అమెరికాతో ఉన్న కీలక సంబంధాలను కొనసాగించడం తమకు ఎంతో ముఖ్యమని, యుద్ధ సమయంలో అమెరికా అందించిన సహకారాన్ని ఇజ్రాయెల్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. -
ఎట్టకేలకు శాంతి దిశగా...
అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఖరారు దిశగా తొలి అడుగు పడింది. ఫ్రాన్స్లోని ప్యాలెస్ ఆఫ్ వెర్సాయ్లో ఈ ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రం (ఎంఓయూ)పై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఇద్దరూ పరస్పరం వేల కిలోమీటర్ల దూరంలో ఉండి ఈ తంతు ముగించడాన్నిబట్టే ఆ రెండు దేశాలమధ్యా ఉన్న వైషమ్యాల తీవ్రతేమిటో తెలుస్తుంది. మొదట ట్రంప్ సంతకం చేసి ఆన్లైన్లో పంపిన ఎంఓయూ నకలు తీసుకుని దానిపై పెజెష్కియాన్ సంతకం చేశారు. ఈ వారం ఆఖరులో జెనీవాలో ఈ సంతకాల కార్యక్రమం ఉంటుందని తొలుత ప్రకటించినా, ఎందుకనో అంతా మారింది. అనుసరించిన విధానం ఏమైనా, ఇకపై పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటే అదే పదివేలని ప్రపంచ ప్రజానీకమంతా ఆరాట పడుతున్నది. తుది ఒప్పందానికి రావటం కోసం రాగల అరవై రోజుల వ్యవధిలో అమెరికా, ఇరాన్ రెండూ ఏమేం చేయాలో ఈ 14 అంశాల ఎంఓయూలో ఉంది. ఇతరత్రా అంశాల మాటెలావున్నా హార్మూజ్ ప్రతిష్ఠంభనకు తెరపడటం, అణ్వాయుధాల జోలికిపోనని ఇరాన్ హామీ ఇవ్వటం ప్రధానమైనవి. లెబనాన్లో ఇజ్రాయెల్ సాగించే హత్యాకాండను ఆపటంతోసహా అన్ని రకాల యుద్ధాలూ పరిసమాప్తం చేయటం, ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా, ఈ ప్రాంత భాగస్వామ్య దేశాలూ 30,000 కోట్ల డాలర్ల నిధిని సమకూర్చటం, ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షల తొలగింపుపై విధివిధానాలు వెల్లడించటం కూడా ఇందులో భాగమే. 30 రోజుల్లో ఇరాన్ సమీపంలోని అమెరికా నౌకలన్నీ నిష్క్రమిస్తాయనీ, యుద్ధ ప్రారంభానికి ముందున్న పరిస్థితులు పునరుద్ధరిస్తారనీ ఎంఓయూ చెబుతోంది. అయితే ఇప్పటికే 60 శాతం అభివృద్ధి చేసిన యురేనియం విషయంలో ఇరాన్ ఏం చేయాలో ఇరు దేశాలూ చర్చించుకుంటాయి. ఇజ్రాయెల్తో కుమ్మక్కయి అకారణంగా, ఏకపక్షంగా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ఎటు తీసుకుపోవాలో, ‘గౌరవప్రదంగా’ ఎలా బయటపడాలో దిక్కుతోచని అమెరికాకు ఇప్పుడు అన్నివిధాలా గర్వభంగమైంది. చిత్రమేమంటే... ఒకే లక్ష్యంతో ఈ ఊబిలోకి దిగిన మిత్రులు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలిద్దరికీ కొద్ది రోజుల్లోనే మార్గాలు వేరయ్యాయి. ఈ యుద్ధాన్ని తక్షణం వదుల్చుకుంటే తప్ప ఏడాది ఆఖరుకల్లా దేశంలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవటం ఖాయమని ట్రంప్కు అర్థమైతే... ఇది కొనసాగుతుంటే తప్ప ఏడాది చివరన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని నెతన్యాహూ లెక్కలేసుకున్నారు. ఆయన సమస్యేమిటో ట్రంప్కు తెలియకపోలేదు. కానీ మిత్రత్వం కంటే స్వీయ పీఠ సంరక్షణే ప్రధానమని ఆయన గ్రహించారు. అందుకే విధి లేని స్థితిలో ఈ ఒప్పందానికొచ్చారు. హార్మూజ్ మూతతో అమెరికాలో గ్యాసోలిన్ ధరలు మిన్నంటాయి. ద్రవ్యోల్బణం హద్దులు దాటింది. సరుకుల కొరత ఏర్పడింది. ఒబామా హయంలో ఇంతకంటే మెరుగ్గా కుదిరిన ఒప్పందాన్ని బుట్టదాఖలు చేసిన ట్రంప్, దీనికెలా అంగీకరించారన్న కథనం ఆసక్తికరమైనది. దౌత్యంలో దేశాల అధినేతలు అవతలి పక్ష సైనిక, ఆర్థిక, భౌగోళిక రాజకీయ స్థితిగతుల్ని విశ్లేషించగల నిపుణుల సాయం తీసుకుంటారని చెబుతారు. కానీ ఇరాన్ మరో అడుగు ముందుకేసి మానసిక ఆరోగ్య నిపుణుల్ని కూడా ఇందులో చేర్చిందంటున్నారు. ట్రంప్ ప్రకటనల్ని, క్షణక్షణానికి మారే ఆయన వైఖరుల్ని గమనిస్తూ ఎలా మాట్లాడితే బోధపరుచుకుని సానుకూలంగా స్పందిస్తాడో వారు సలహాలిచ్చారని దాని సారాంశం. ట్రంప్ తీరుతెన్నులు గమనిస్తే అది నిజమే అనిపిస్తుంది. తన కనుసన్నల్లో ఖరారైన ఎంఓయూ తనకి నచ్చకుంటే మళ్లీ బాంబులేయటానికి వెనకాడనని ఆయనే చెప్పటాన్ని గమనిస్తే ట్రంప్ను ఇరాన్ సరిగానే అంచనా వేసిందనుకోవాలి. పారిస్ వెలుపలనున్న ప్యాలెస్ ఆఫ్ వెర్సాయ్ రాచరిక ఉత్థాన పతనాలు చూసింది. ఫ్రెంచ్ విప్లవాన్నీ, దానిలోని ప్రజాస్వామిక ఆకాంక్షలనూ గమనించింది. 1783లో బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ల సరిహద్దు తగాదాలపై ఒడంబడికకు సాక్షిగా నిలిచింది. జర్మనీని అవమానకరమైన ఒప్పందంతో శాసించి, 1919లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిందీ ఇక్కడే. కానీ అమెరికాకు ఇప్పుడెదురైన అవమానం స్వచ్ఛందం, స్వయంకృతం. ఇన్నింటికి వేదికైన చోట కుదిరిన ఈ ఎంఓయూను ట్రంప్ గౌరవిస్తారని ఆశించాలి. -
'సవాళ్ల నడుమ' సమర్థ దౌత్యం?
వేగంగా మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు, ట్రంప్ దూకుడు, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లలో ప్రతికూల వాతావరణం; చైనా, యూఎస్లతో బలపడుతున్న పాక్ మైత్రీబంధం... భారత దౌత్యనీతికి పెద్ద సవాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో జాతీయ, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను రక్షించుకుంటూ అంతర్జాతీయ శక్తిగా ఎదగటం భారత్కు అగ్నిపరీక్షే. గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే, భారత దౌత్యనీతిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అమెరికా, రష్యా ప్రాపకం కోసం అర్రులు చాచే దశ నుండి బయటకు వచ్చింది. జాతి ప్రయోజనాల దృష్ట్యా ‘వ్యూహాత్మక స్వతంత్రత’ వైపు అడుగులు వేసింది. అలీన విధానం, పంచశీల సూత్రాలు, మానవ హక్కులు వంటి విలువల బంధనాలను తెంచుకొని లావాదేవీలకు సంబంధించిన దౌత్యనీతిని అమలుపరుస్తున్నది. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా భారత్... ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఆర్థిక, వాణిజ్య, సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవటంపై దృష్టిని కేంద్రీకరించింది. యు.ఎస్., ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని బాహాటంగా ఎత్తి చూపింది. కుండబద్దలు కొడుతూ...ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేయటాన్ని ఐరోపా దేశాలు విమర్శించి నప్పుడు, భారత్ విదేశాంగ మంత్రి ‘‘ఐరోపా దేశాలు తమ సమ స్యల్ని ప్రపంచ సమస్యలు అనుకుంటాయి. కానీ అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల సమస్యలను ఐరోపా ఏనాడైనా పట్టించుకుందా?’’ అని నిలదీయటం భారత్ వైఖరిని సూచిస్తున్నది. రష్యా నుండి చమురు దిగుమతుల విష యంలో యూఎస్ ఆంక్షల గురించి భారత విదేశాంగ మంత్రి, ‘‘మనమెవరమూ ఈ పెద్దవాళ్ల ఆటను అర్థం చేసుకోలేనంత పిల్లలం కాము’’ అని యూఎస్ నిజస్వరూపాన్ని విమర్శించటం భారత దౌత్య ధృడత్వానికి సంకేతం. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నప్పుడూ ఆయన సమ క్షంలోనే ‘‘అమెరికాకు అమెరికన్ ప్రయోజనాల మాదిరిగా భారత్కు భారత ప్రయోజనాలు ముఖ్య’’మని కుండబద్ధలు కొట్టారు.భద్రతాపరంగా అత్యంత ప్రమాదకరమైన పాకిస్తాన్, చైనా లతో సంబంధాల విషయంలో సైతం భారత్ కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు మిన్నకుండే బుజ్జగింపు విధానం నుండి పూర్తిగా వైదొలగి ‘కన్నుకు కన్ను, కాలుకు కాలు’ సిద్ధాంతాన్ని అమలు పరుస్తున్నది. గల్వాన్ ఘర్షణల అనంతరం భారత్ పెద్ద మొత్తంలో లద్దాఖ్లో సైన్యాన్ని మోహరించి చైనాతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నట్లు సవాలు విసిరింది. సరిహద్దుల్లో కాలుదువ్వుతూ వాణిజ్యపరంగా స్నేహ సంబంధాలు కుదరదని చైనా పెట్టుబడులపై తీవ్ర ఆంక్షలు విధించింది. మాల్దీ వుల ప్రభుత్వపు భారత వ్యతిరేక ధోరణి నేపథ్యంలో భారత పర్యా టకులను లక్ష దీవులవైపు మళ్లిస్తూ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.విమర్శలకు వెరవని దృఢత్వంఅయితే భారత విదేశాంగ విధానం కొన్ని ప్రత్యేక సందర్భా లలో లొంగుబాటు ధోరణిని కనబరచిందన్న విమర్శ ఉంది. ముఖ్యంగా ట్రంప్ తెంపరితనం విషయంలో భారత్ మెతక వైఖరి అనుసరించిందని విశ్లేషకుల అభిప్రాయం. ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థను ఒక మృత ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించినా భారత్ స్పందించలేదనీ, ట్రంప్ ఆదేశాల మేరకు ఒక దశలో రష్యా నుండి చమురు కొనుగోళ్లు కూడా ఆపేసిందనీ మరొక విమర్శ. ఇజ్రాయెల్ ‘గాజా’పై బాంబుల వర్షం కురిపించి నేలమట్టం చేస్తున్నా భారత్ ఇజ్రాయె ల్ను సమర్థించి పాలస్తీనాకు వ్యతిరేకంగా వ్యవహరించిందనీ, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ విధానం పూర్తిగా రష్యాను సమర్థిస్తు న్నట్లుగా ఉందనీ కూడా రాజకీయ పరిశీలకుల వ్యాఖ్యానం. ఇదే దృష్టికోణంతో, భారత్ పొరుగుదేశాలు భారత్కు ప్రతికూలంగా మారిపోయాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకల విష యంలో మన దౌత్య నీతి విఫలమైందా అనే సందేహాలు తలెత్తాయి!ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవిని చేపట్టడంతో భారత్– అమెరికా సంబంధాలు మరింత పటిష్టమవుతాయని అందరూ ఆశించారు. కానీ ఆపరేషన్ సిందూర్ తరువాత ట్రంప్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. అయినప్పటికీ అమెరికా వాణిజ్య సుంకాల యుద్ధంలో భారత్ దృఢంగా నిలబడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో కూడా అమెరికా ఒత్తిడులను తట్టుకొని నిల బడింది. అదే సమయంలో భారత్–పాకిస్తాన్ల విషయంలో యూఎస్ మధ్యవర్తిత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది కూడా! హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి ఉగ్రవాద సంస్థల ఉగ్ర చర్యలను భారత్ ఏ రకంగానూ సమర్థించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇంకొక ముఖ్యమైన అంశం గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు. గల్ఫ్ దేశాలలో కోటి మందికి పైగా భారతీయులు ఉపాధి పొందు తున్నారు. యూఏఈ వంటి గల్ఫ్ దేశాలతో భారత్కు పటిష్టమైన వాణిజ్య సంబంధాలున్నాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచు కొని భారత్ కేవలం హార్మూజ్ జలసంధి నుండి భారత్కు చమురు, గ్యాస్ రవాణాకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. అదే సమయంలో ఇరాన్కు వ్యతిరేకంగా ఏ చర్యనూ తీసుకోలేదు. ఈ సందర్భంగా ఇరాన్ భారత్కు పూర్తిగా సహకరించటాన్ని గమనించాలి. ఉక్రెయిన్ యుద్ధంలో మనం కేవలం మన పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావటానికే ప్రాధాన్యతనిచ్చాం. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుండి చౌక ఇంధనాన్ని కొనుగోలు చేశాం. దౌత్యనీతికి నిదర్శనందక్షిణాసియాలో పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు కాస్త యినా క్షీణించాయన్నది వాస్తవం. సంబంధాలు బలహీనపడి నప్పుడు ఆయా దేశాలను నియంత్రించటానికి దౌత్యనీతిలో భాగంగా కీలకమైన వ్యవస్థలను ఏర్పాటు చేశామా లేదా అన్నదే ప్రశ్న. బంగ్లాదేశ్ విషయానికి వస్తే అక్కడ రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడకుండా ఆపలేం. కానీ మత ఛాందస శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న షేక్ హసీనా ప్రభుత్వాన్ని బలపరిచాం. ఛాందస శక్తు లది పైచేయి అయినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నియంత్రించ టానికి మన దగ్గర తురుపు ముక్కలున్నాయా? ఈ కోణంలో చూస్తే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విద్యుచ్ఛక్తి విషయంలో భారత్పై బంగ్లా దేశ్ ఆధారపడాల్సిందే. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ స్వతంత్రించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు. ఈ విద్యుచ్ఛక్తి సంబం ధాన్ని గత దశాబ్దంలో ఏర్పరచటం మన దౌత్యనీతి విజయం.అమెరికా సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫ్రాన్స్, ఇజ్రా యెల్, రష్యా, దక్షిణ కొరియాలతో సైనిక, వ్యూహాత్మక ఒప్పందా లను చేసుకుంది. ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యామ్నాయాలున్నా యని యూఎస్కు భారత్ స్పష్టం చేస్తున్నది. దౌత్యనీతి అంటే ఇదే. ఓపిక, వివేకం, సహనాలతో మాత్రమే దౌత్యం నడుస్తుంది. గురజాల శ్రీనివాసరావు వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
దిగ్బంధం ఎత్తివేత.. హర్మూజ్లో ఊపందుకున్న చమురు రవాణా
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇరాన్ పోర్టులపై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది. దీంతో హర్మూజ్లో చమురు రవాణా ఊపందుకుంది. 60 రోజుల చర్చల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఎలక్ట్రానిక్ విధానంలో యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన పత్రంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది.అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఒప్పందంపై తనకు మొదట భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఇరాన్ హక్కులు మరియు రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రయోజనాలను కాపాడుతామని అధ్యక్షుడు హామీ ఇవ్వడంతో అనుమతి ఇచ్చినట్లు ఖమేనీ పేర్కొన్నారు.ఓ పక్క అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాలు అమల్లోకి వస్తుండగా.. ఇజ్రాయెల్.. దక్షిణ లెబనాన్పై సైనిక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. తాజా దాడుల్లో ముగ్గురు హెజ్బోల్లా సైనికులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిని పక్కన పెడితే హెజ్బోల్లా నేత నైమ్ ఖాస్సెమ్ అమెరికా–ఇరాన్ ఒప్పందాన్ని అతి పెద్ద విజయంగా అభివర్ణించారు. -
ఏఐ వల్ల మరో ముప్పు.. ఈ సారి ఉద్యోగాలు పోవడం కాదు..
చిన్న సందేహం వచ్చినా చాలా మంది కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఆశ్రయిస్తున్నారు. అలా ప్రతిదానికీ కృత్రిమ మేధస్సుపై ఆధారపడితే మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలోచించడం, గుర్తు పెట్టుకోవడం వంటి పనులను మనమే చేయకపోతే మెదడు చురుకుదనం తగ్గవచ్చని చెబుతున్నారు. ఇది వయస్సు పెరిగిన తర్వాత వచ్చే డిమెన్షియా వంటి సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా బలహీనపరచవచ్చని అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని పొసిబిలిటీ ఇన్స్టిట్యూట్ ప్రధాన శాస్త్రవేత్త, సిద్ధాంత న్యూరోసైంటిస్టు వివియెన్ మింగ్ ఈ విషయంపై హెచ్చరిక చేశారు. అయితే కృత్రిమ మేధస్సు వల్ల నేరుగా వ్యాధి రాదని, దాన్ని ఎలా వినియోగిస్తున్నామన్నదే అసలు అంశమని ఆమె స్పష్టం చేశారు.వివియెన్ మింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతిరోజు చిన్న విషయాల గురించి కూడా కృత్రిమ మేధస్సుపై తరచుగా ఆధారపడటం వల్ల డిమెన్షియాను ఎదుర్కొనే మెదడు సహజ రక్షణ బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనికి కారణం నిపుణులు "కాగ్నిటివ్ రిజర్వ్" అని పిలిచే సామర్థ్యం తగ్గిపోవడమేనని చెప్పారు. కాగ్నిటివ్ రిజర్వ్ అంటే వయస్సు పెరగడం లేదా వ్యాధుల ప్రభావం వచ్చినా మెదడు పనితీరును కొనసాగించే సామర్థ్యం.కృత్రిమ మేధస్సు నేరుగా నాడీ సంబంధిత వ్యాధులను కలిగించదని వివియెన్ మింగ్ చెప్పారు. అయితే, ప్రజలు దాన్ని ఎలా వినియోగిస్తున్నారన్నదే ఆందోళన కలిగించే అంశమని వివరించారు. అసలు సమస్య "క్రానిక్ సబ్స్టిట్యూషన్"లో ఉందని తెలిపారు. అంటే, కృత్రిమ మేధస్సు పని చేస్తోందనే కారణంతో యూజర్లు తమ ఆలోచనా శ్రమను మానేయడమేనని వివరించారు.క్రానిక్ సబ్స్టిట్యూషన్ అంటే మనం స్వయంగా ఆలోచించకుండా ఆ పనిని దీర్ఘకాలం పాటు కృత్రిమ మేధస్సుకు పూర్తిగా అప్పగించే అలవాటు. కాలక్రమంలో ఈ అలవాటు వల్ల కాగ్నిటివ్ రిజర్వ్ను పెంచుకునే, నిలబెట్టుకునే మెదడు సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. వయస్సు పెరగడం వల్ల వచ్చే నష్టాన్ని, డిమెన్షియాను ఎదుర్కోవడంలో ఈ సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.కాగ్నిటివ్ రిజర్వ్ అంటే శారీరక మార్పులు లేదా వ్యాధి వచ్చినా మెదడు పరిస్థితులకు అనుగుణంగా తన పనితీరును కొనసాగించే సామర్థ్యం. నిరంతర మానసిక శ్రమ, కొత్త విషయాల అభ్యాసం, చురుకైన మేధో కార్యకలాపాల వల్ల ఇది బలపడుతుంది.కృత్రిమ మేధస్సుపై అధికంగా ఆధారపడటం వల్ల ఈ ప్రక్రియ దెబ్బతినే ప్రమాదం ఉందని వివియెన్ మింగ్ అభిప్రాయపడ్డారు. మానసిక చురుకుదనం తగ్గిపోతే, దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరింత కష్టమవుతుందని హెచ్చరించారు.మెక్గిల్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. దారి తెలుసుకోవడానికి తరచుగా జీపీఎస్పై ఆధారపడిన వారిలో, స్వయంగా దారి గుర్తించే స్థల అవగాహన జ్ఞాపకశక్తి బలహీనంగా కనిపించింది.అలాగే, ఎంఐటీ మీడియా ల్యాబ్ నిర్వహించిన చిన్న అధ్యయనంలో.. పెద్ద భాషా నమూనాలను ఉపయోగించి రచనలు చేసిన వారిలో, సంప్రదాయ పద్ధతులు ఉపయోగించిన వారితో పోలిస్తే మెదడు నాడీ అనుసంధానం బలహీనంగా కనిపించిందని వెల్లడైంది. అంతేకాదు, తాము ఇప్పుడే రాసిన విషయాన్నే గుర్తు పెట్టుకోవడంలో కూడా వారు ఇబ్బంది పడ్డారని అధ్యయనం తెలిపింది. -
మళ్లీ దాడులకు సిద్ధమైన అమెరికా..! లాస్ట్ వార్నింగ్ వచ్చేసింది..
బ్రస్సెల్స్: అమెరికా-ఇరాన్ ఒప్పందంలోని హామీలను ఇరాన్ పాటించకపోతే మళ్లీ సైనిక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ గురువారం తెలిపారు. నాటో రక్షణ మంత్రుల సమావేశం అనంతరం బ్రస్సెల్స్లో ఆయన మీడియాతో మాట్లాడారు.ఒప్పందం అమలు, చర్చల సమయంలో ఇరాన్ నిబంధనలు పాటించకపోతే ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. "ఈ చర్చల గడువులో ఇరాన్ చెప్పినట్టు చేయకపోతే, మేము మళ్లీ చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటామని అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇరాన్ నిబంధనలు పాటించకపోతే, అత్యంత కఠినమైన సముద్ర దిగ్బంధనాన్ని మళ్లీ అమలు చేసే సామర్థ్యం మాకు ఉంది" అని పీట్ హెగ్సెత్ అన్నారు.అమెరికా-ఇరాన్ మధ్య 3 నెలలకు పైగా సాగిన ఘర్షణలకు ముగింపు పలికే లక్ష్యంతో ఇటీవల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందంలో శత్రుత్వానికి ముగింపు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల సడలింపు, ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత స్థాయి ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభించడం వంటి అంశాలు ఉన్నాయి.ఇరాన్ బాధ్యతగా వ్యవహరిస్తేనే.. ఇరు పక్షాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించినప్పటికీ ఒప్పందం ద్వారా లభించే ఆంక్షల సడలింపు, ఇతర ప్రయోజనాల వంటివి ఇరాన్ తన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే అమల్లోకి వస్తాయని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు.తాజా వ్యాఖ్యలతో, ఒప్పందం అమలు సమయంలో ఇరాన్ చర్యలను ట్రంప్ ప్రభుత్వం నిశితంగా పరిశీలించనున్నట్టు మరోసారి సంకేతాలు ఇచ్చింది. ఈ ఒప్పందాన్ని "పనితీరు ఆధారిత ఒప్పందం"గా పేర్కొంటున్నారు. ఇందులో ఆంక్షల సడలింపు, నిలిపివేసిన నిధుల విడుదల, ఇతర చర్యలు అన్నీ ఇరాన్ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటాయి.అయితే ఇరాన్ నిధుల విడుదల, సముద్ర ఆంక్షల సడలింపు వంటి హామీలను ఏ క్రమంలో అమలు చేయాలనే విషయంలో రెండు పక్షాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. ఘర్షణల సమయంలో హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడటంతో ఇంధన మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయి. అనేక నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చింది.ఈ ఒప్పందంతో ఆ ప్రాంతంలో సముద్ర రాకపోకలు సాధారణ స్థితికి వస్తాయని వాషింగ్టన్ భావిస్తోంది. అదే సమయంలో ఇరాన్ ఒప్పంద నిబంధనలు పాటించకపోతే, సైనిక, ఆర్థిక ఒత్తిడిని మళ్లీ తీసుకురావచ్చని అమెరికా స్పష్టం చేసింది. -
న్యూయార్క్ టూర్ విషాదం : తల్లిని కాపాడబోయి యువకుడు దుర్మరణం
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుర్రపు బగ్గీ నుండి కింద పడి పోయిన తల్లిని రక్షించే ప్రయత్నంలో ఒక భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్రం అదుపు తప్పి ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది.'ది న్యూయార్క్ టైమ్స్' ప్రకారం కుటుంబంతో కలిసి న్యూయార్క్కు మొదటిసారి విహారయాత్రకు వచ్చిన 18 ఏళ్ల రోమాంచ్ మహాజన్కు బుధవారం జీవితంలోని మర్చిపోలేని శోకాన్ని మిగిల్చింది. కుటుంబ ఫోటో తీసుకోవడానికి డ్రైవర్ బండిని ఆపిన వెంటనే, గుర్రం ఒక్కసారిగా అదుపు తప్పి పరిగెత్తడం మొదలుపెట్టింది. అది వేగంగా దూసుకెళ్లి ఫుట్పాత్ ఎక్కి, గడ్డి ఉన్న ప్రదేశంలోకి దూసుకెళ్లింది. ‘‘రక్షించండి, రక్షించండి’’ అని అరుస్తూనే ఉన్నామని రోమాంచ్ తండ్రి దీపక్ మహాజన్ వాపోయారు. అందరమూ ఒకర్నొకరు గట్టిగా పట్టుకున్నప్పటికీ తన భార్య ప్రియ బగ్గీ నుండి కింద పడి పోవడంతో, ఆమెను రక్షించడానికి రోమాంచ్ కిందకు దూకి చనిపోయాడని కన్నీటి పర్యంతమయ్యాడు.కిందకు దూకిన రోమాంచ్ తల నేలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. బుధవారం రాత్రి న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ వీల్ కార్నెల్ మెడికల్ సెంటర్లో చికిత్సపొందుతూ చని పోయాడు. రోమాంచ్ తండ్రి తల్లి , తమ్ముడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టావెర్న్ ఆన్ ది గ్రీన్ అనే హోటల్లో పనిచేసే టాటియానా బ్రెస్లర్ న్యూయార్క్ పోస్ట్తో మాట్లాడుతూ, గుర్రం భయంతో చాలా వేగంగా పరుగెత్తిందని, వెంటనే తాము 911కి ఫోన్ చేశారు. బగ్గీ బోల్తా పడకముందే ఒక ప్రత్యక్ష సాక్షి ఆ గుర్రాన్ని కట్టడి చేశాడని బ్రెస్లర్ తెలిపారు.ఇదీ చదవండి : 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీగుర్రపు బగ్గీలతో జరుగుతున్న వరుస ప్రమాదాల్లో ఇది తాజాది. ఈ ప్రమాదంతో పార్కులో గుర్రపు బగ్గీలను నిషేధించాలనే డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. బగ్గీ డ్రైవర్ల యూనియన్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. గత ఏడాది మే నుండి పార్క్ లేదా దాని పరిసరాల్లో గుర్రాలకు సంబంధించిన ప్రమాదాలు ఎనిమిది జరిగాయని, గత నెలలో కూడా ఒక గుర్రం మరో బగ్గీని ఢీకొట్టడంతో అది బోల్తా పడిందని పార్క్ కన్సర్వెన్సీ తెలిపింది. సదరు డ్రైవర్ను యజమాని నిరవధికంగా సస్పెండ్ చేశారు.ఇదీ చదవండి: మాస్కోపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ : తీవ్ర ఉద్రిక్తత -
బీబీకి దొరికిన ‘బెస్ట్ డీల్’ ఇదేనా!?
ఇజ్రాయెల్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. ఇరాన్తో కుదిరిన తాజా శాంతి ఒప్పందం అనేది ఇజ్రాయెల్కు దక్కిన బెస్ట్ డీల్ అని.. ఇంతకు మించి ఆ దేశానికి ఇంకేది అక్కర్లేదని.. ఇదే విషయాన్ని తాను నెతన్యాహుకి చెప్పానని అన్నారాయన.ఇరాన్–అమెరికా మధ్య తాజాగా కుదిరిన శాంతి ఒప్పందం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి ముందు తాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు చెప్పారు. అలాగే ఈ ఒప్పందం వల్ల ఇజ్రాయెల్కు ఉన్న అత్యంత పెద్ద భద్రతా ముప్పు తొలగిపోయిందని ఆయన అన్నారు. ఆ సంభాషణలో “ఆలోచించు బీబీ(నెతన్యాహుని ఉద్దేశించి.. ఆయన ముద్దు పేరు, పైగా రాజకీయ వర్గాల్లో అలానే పిలుస్తారు).. నీకు ఇది బెస్ట్ డీల్. ఇకపై ఇజ్రాయెల్పై అణు దాడి ప్రమాదం ఉండదు” అని చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండే ప్రమాదమే ఇజ్రాయెల్కు అతిపెద్ద భయం అని, ఈ ఒప్పందంతో ఆ ముప్పు తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. “ఇజ్రాయెల్ కోరుకున్న అత్యంత కీలకమైన భద్రతా హామీ ఇదే” అని నెతన్యాహుకు చెప్పినట్లు వెల్లడించారు.ఫ్రాన్స్ ఈవియన్-లెస్-బెయిన్స్లో G7 సమావేశం జరిగింది. దీనికి హాజరైన ట్రంప్ పారిస్లోని ఓ హోటల్లో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చిన విందుకు ట్రంప్ హాజరయ్యారు. అక్కడే ఆయన ఇరాన్తో ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ మీద సంతకం చేశారు. ఆ సమయంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేశారు.మరోవైపు అమెరికా-ఇరాన్ ఒప్పందంపై పూర్తి స్పష్టత ఇంకా లేదు. ఎంవోయూ ప్రకారం.. ఇరాన్ తన అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించాల్సి ఉంటుందని, అలాగే కొన్ని ఆంక్షల సడలింపు అంశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇదే సమయంలో లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు, హెజ్బొల్లా గ్రూపుల అంశం వంటి సున్నిత విషయాలు కూడా ఈ ఒప్పంద చర్చల్లో భాగమయ్యాయి.అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్పై దాడికి దిగడంతోనే పశ్చిమాసియా యుద్ధం మొదలైందన్న సంగతి తెలిసిందే. అయితే మధ్యలో కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకరించినప్పటికీ.. హెజ్బొల్లాను తుడిచిపెట్టే ఉద్దేశంతో లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని వద్దని వారించినా.. నెతన్యాహు మాత్రం పరిమిత దాడులు కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో లెబనాన్లో భారీగా ప్రాణ నష్టం(దాదాపు 5 వేలమంది) సంభవించింది. అయితే ఇరాన్-అమెరికా ఒప్పందంలో లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో సైనికచర్యలు నిలిపి వేయాలనే ప్రతిపాదన ఉంది.ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తమ భద్రత కోసం చేపట్టే చర్యల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు సొంత వర్గంలోని కొందరు మాజీ నేతలు నెతన్యాహుపై ఒత్తిడిని పెంచే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద, ఇరాన్–అమెరికా ఒప్పందం కేవలం ప్రాంతీయ రాజకీయాలకే కాకుండా, ఇజ్రాయెల్ భద్రతా సమీకరణాలపై కూడా పెద్ద ప్రభావం చూపేలా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
అమెరికా-ఇరాన్ యుద్ధం: ప్రపంచాన్ని కుదిపేసిన మహా నష్టం
వాషింగ్టన్: గత కొన్ని నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. జూన్ 17న ఇరు దేశాలు 14 పాయింట్ల చారిత్రాత్మక శాంతి ఒప్పందం పై సంతకాలు చేయడంతో యుద్ధ మేఘాలు విడిపోయాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ భీకర పోరు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసింది. ఈ యుద్ధం వల్ల అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందో అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ప్రాణ నష్టం ఇలా..ఈ 108 రోజులకు పైగా సాగిన యుద్ధంలో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, ఇరాన్ అధికారిక మీడియా ప్రకారం 3,300 మందికి పైగా ఇరానియన్లు మరణించారు. అలాగే లెబనాన్లో 3,826 మంది, ఇజ్రాయెల్లో దాదాపు 60 మంది ఈ హింసకు బలయ్యారు. కాగా తాజా ఒప్పందం ప్రకారం ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలసంధిని తక్షణమే తిరిగి తెరుస్తున్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకూడదనే నిబంధనతో పాటు, ఆ దేశ పునర్నిర్మాణం కోసం 300 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 25 లక్షల కోట్లు) భారీ ఆర్థిక ప్యాకేజీని అందించడానికి అమెరికా అంగీకరించింది.అమెరికాపై భారీ ఆర్థిక భారంమూడీస్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం, ఈ యుద్ధం కారణంగా అమెరికా వినియోగదారులు, పన్ను చెల్లింపుదారులు ఇప్పటివరకు సుమారు 132 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 11 లక్షల కోట్లు) మేరకు నష్టపోయారు. పెంటగాన్ గణాంకాల ప్రకారం కేవలం సైనిక చర్యలకే 29 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. యుద్ధం ప్రారంభంలో గ్యాలన్ గ్యాస్ ధర 3 డాలర్ల లోపు ఉండగా, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో అది ఏకంగా 4.56 డాలర్లకు చేరింది. దీనివల్ల అమెరికన్లు ప్రతిరోజూ చమురు కోసం వందల మిలియన్ల డాలర్లు అదనంగా వెచ్చించాల్సి వచ్చింది. డీజిల్ ధరలు కూడా గ్యాలన్కు 5.69 డాలర్ల రికార్డు స్థాయికి చేరడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బఈ యుద్ధ ప్రభావం కేవలం అమెరికా, ఇరాన్లకే పరిమితం కాలేదు. ప్రపంచబ్యాంక్ 2026 అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను కోవిడ్ కాలం తర్వాత అత్యంత కనిష్టంగా 2.5 శాతానికి తగ్గించింది. మధ్యప్రాచ్య దేశాల జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుండి 1.3 శాతానికి పడిపోయింది. వ్యవసాయానికి కీలకమైన ఎరువుల ధరలు ఏకంగా 47 శాతం పెరిగాయి. భారతదేశంలో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కమర్షియల్ ఎల్పీజీ ధరలు విపరీతంగా పెరగడంతో పాటు వంటగ్యాస్ కొరత ఏర్పడి సామాన్యులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఇది కూడా చదవండి: నీట్ వివాదం వేళ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య -
ఇరాన్ తో US రహస్య ఒప్పందం.. ఇజ్రాయెల్ కు ట్రంప్ షాక్
-
ఇరాన్తో యుద్ధానికి ముగింపు.. ఒప్పంద పత్రంపై ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో రూపొందించిన అవగాహన ఒప్పందం (MoU)పై బుధవారం సంతకం చేశారు. ఈ విషయాన్ని వైట్హౌస్కు చెందిన ఓ అధికారి వెల్లడించినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఈ ఒప్పంద పత్రంలో 14 కీలక అంశాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది.వీటిలో కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య రవాణా పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమంపై భవిష్యత్ చర్చలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఒప్పందంలోని 14 అంశాలు (అంచనా):1. తక్షణ కాల్పుల విరమణఇరాన్, అమెరికా అనుబంధ బలగాలు పాల్గొంటున్న అన్ని యుద్ధ చర్యలను వెంటనే నిలిపివేయాలి. లెబనాన్లోని ఘర్షణలు కూడా ఇందులో భాగం.2. పరస్పర సార్వభౌమాధికారానికి గౌరవంఇరు దేశాలు ఒకదాని అంతర్గత వ్యవహారాల్లో మరొకటి జోక్యం చేసుకోకూడదని అంగీకరించాయి.3. 60 రోజుల్లో తుది ఒప్పందంగరిష్టంగా 60 రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. అవసరమైతే పరస్పర అంగీకారంతో గడువు పొడిగించవచ్చు.4. హర్మూజ్ జలసంధిపై ఆంక్షల ఎత్తివేతఅమెరికా 30 రోజుల్లో హర్మూజ్ జలసంధిపై విధించిన నౌకాదళ నిర్బంధాన్ని పూర్తిగా ఎత్తివేస్తుంది. తుది ఒప్పందం తర్వాత ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ కూడా ఉంటుంది.5. ఉచిత నౌకా రవాణాఇరాన్ హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఎలాంటి రుసుము లేకుండా భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చింది.6. 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ ప్రణాళికఇరాన్ ఆర్థిక పునర్నిర్మాణం కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు అమెరికా సహకరిస్తుంది. అయితే నేరుగా అమెరికా నిధులు ఇవ్వబోదని అధికారులు స్పష్టం చేశారు.7. ఆంక్షల ఎత్తివేతతుది ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్పై ఉన్న అమెరికా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలను తొలగించేందుకు అమెరికా అంగీకరించింది.8. అణ్వాయుధాలకు నోఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని మరోసారి హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న అధిక సాంద్రత కలిగిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో తొలగించేందుకు అంగీకరించింది.9. ప్రస్తుత పరిస్థితుల కొనసాగింపుతుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా సైనిక మోహరింపుల విషయంలో కొత్త మార్పులు ఉండవు.10. ఇరాన్ చమురు ఎగుమతులకు అనుమతిఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మినహాయింపులు ఇస్తుంది. బ్యాంకింగ్, బీమా, రవాణా సేవలపైనా సడలింపులు ఉంటాయి.11. స్తంభింపజేసిన నిధుల విడుదలఒప్పందం విజయవంతంగా అమలైతే ఇరాన్కు చెందిన కొన్ని విదేశీ ఆస్తులు, నిధులను విడుదల చేస్తారు.12. పర్యవేక్షణ వ్యవస్థఒప్పంద అమలు, భవిష్యత్ నిబంధనల పాటింపును పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు.13. తుది ఒప్పందంపై చర్చలుMoUపై సంతకం అనంతరం శాశ్వత ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి.14. ఐరాస భద్రతా మండలి ముద్రతుది ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఆమోదం తీసుకుని, బైండింగ్ తీర్మానం రూపంలో అమలు చేస్తారు.ఈ ఒప్పందం అమలైతే హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనుంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం సాధారణ స్థితికి రావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. -
కమాండ్ నుంచి ఇండో తొలగింపు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. యూఎస్ ఇండో–పసిఫిక్ కమాండ్ పేరును యూఎస్ పసిఫిక్ కమాండ్గా మార్చేసింది. ఈ నిర్ణయాన్ని అమెరికా రక్షణ శాఖ మంగళవారం ప్రకటించింది. 1947లో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ స్థాపించిన ఈ కమాండ్కు సంబంధించిన లోతైన చారిత్రక మూలాలను గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా పసిఫిక్ కమాండ్ పరిధి అమెరికా పశ్చిమ తీరం నుంచి భారతదేశ పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉంది. ‘‘వాస్తవానికి 1947 జనవరి 1న అధ్యక్షుడు హ్యారీ ఎస్.ట్రూమన్ ఈ కమాండ్ను స్థాపించారు.70 ఏళ్లకు పైగా యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరుతో పనిచేసింది. యునైటెడ్ స్టేట్స్ ఏకీకృత పోరాట కమాండ్లలో పురాతనమైనదిగా, అతిపెద్దదిగా ఘనత సాధించింది’’అని రక్షణ శాఖ ఒకప్రకటనలో వెల్లడించింది. పేరు మారినప్పటికీ ఈ కమాండ్ బాధ్యతల్లో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొంది. కమాండ్ ప్రాథమిక లక్ష్యంలో, ప్రాంతీయ మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి స్వేచ్ఛాయుత పరిస్థితులను కొనసాగించాలన్న నిబద్ధతలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ‘‘యూఎస్ పసిఫిక్ కమాండ్ తిరిగి వచి్చంది’’అంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు.. యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరును 2018లో యూఎస్ ఇండో–ఫసిఫిక్ కమాండ్గా మార్చారు. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి, ఈ కమాండ్ పేరును ఇండో–పసిఫిక్ కమాండ్గా మార్చినట్లు 2018లో అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ వెల్లడించారు.ఈ కమాండ్ పరిధి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు, పెంగి్వన్ల నుంచి ధ్రువపు ఎలుగుబంట్ల వరకు విస్తరించి ఉందని చమత్కరించారు. అమెరికా జాతీయ రక్షణ వ్యూహంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అయితే, ఎనిమిదేళ్ల తర్వాత పాత పేరును పునరుద్ధరించడం గమనార్హం. ఫ్రాన్స్లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ సమావేశం అవుతున్న సమయంలోనే కమాండ్ నుంచి ఇండియా పేరును హఠాత్తుగా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. చైనా ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్న ట్రంప్? ఇండో–యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరు మార్పు వెనుక అమెరికా వ్యూహం ఏమిటన్నదానిపై చర్చ మొదలైంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవాలన్న తమ ప్రణాళికలను అమెరికా విరమించుకుంటోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా విషయంలో అమెరికా వైఖరిలో ఇటీవల మార్పు వస్తోంది. బలమైన చైనా బారి నుంచి తైవాన్ను రక్షించలేమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. దాదాపుగా ఆయన చేతులెత్తేశారు. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ‘క్వాడ్’కూటమిని కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇండో–యూఎస్ పసిఫిక్ కమాండ్ పేరును మార్చేసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ విషయానికొస్తే ఈ పరిణామం పేరు మార్పునకు సంబంధించిన విషయం కంటే కూడా మారుతున్న అమెరికా ప్రాధాన్యతల గురించి తెలియజేసే అంశంగా భావించాల్సి ఉంటుంది. అమెరికా జాతీయ రక్షణ వ్యూహాన్ని ఈ ఏడాది జనవరి 23న బహిర్గతం చేశారు. ‘‘ఉమ్మడి రక్షణ భారాన్ని మిత్రదేశాలు కూడా పంచుకోవాలి. భాగస్వామ్య దేశాల భద్రతకు దశాబ్దాలుగా మోస్తున్న ఆర్థిక భారాన్ని ఇకపై మోయలేం’’అని ఇందులో స్పష్టం చేశారు.ఈ పరిణామాలను గమనిస్తే అమెరికా దృష్టిలో ఇండియాలో స్థానంపై సహజంగానే ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు ఈ ప్రాంతంలో పాకిస్తాన్కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్నదే ట్రంప్ వ్యూహంగా అంచనా వేస్తున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని ట్రంప్ పరోక్షంగా ఆమోదిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. పేరు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా స్పందించారు. ‘‘క్వాడ్ పతనానికి ఇది మరో అడుగు లాంటిదా?’’అని ‘ఎక్స్’లో ప్రశ్నించారు. పాకిస్తాన్లో అంతర్భాగం పీఓకే పసిఫిక్ కమాండ్ మ్యాప్పై వివాదం యూఎస్ పసిఫిక్ కమాండ్ వెబ్సైట్లోని ‘బాధ్యతాయుత ప్రాంతం’మ్యాప్ భారతదేశ సరిహద్దులను తప్పుగా చూపిస్తుండడం రాజకీయంగా వివాదాస్పదంగా మా రింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), అక్సాయ్ చిన్లు భారతదేశంలో అంతర్భాగం కాదన్నట్లుగా ఈ మ్యాప్ను రూపొందించారు. పీఓకేను పాకిస్తాన్లో అంతర్భాగంగా చిత్రీకరించారు. తప్పులతడక మ్యాప్ ఉన్న వెబ్సైట్లో సంబంధిత వెబ్ పేజీని చివరిసారిగా మార్చి నెలలో అప్డేట్ చేశారన్న సమాచారం కనిపిస్తోంది. 1947లో జమ్మూకశ్మీర్ భారతదేశంలో విలీనం కావడం అనేది సంపూర్ణమైన, చట్టబద్ధమైన, తిరుగులేని ప్రక్రియ అని భారత్ చెబుతోంది.జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు తమ దేశంలో అంతర్భాగమని, వాటిని వేరు చేయలేమని స్పష్టం చేస్తోంది. తాజా పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా తీవ్రంగా స్పందించారు. భారత్కు, భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే అలవాటు నరేంద్ర మోదీ గారి మిత్రులకు ఉందని విమర్శించారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి దేశాన్ని ఇలాంటి ప్రతికూల స్నేహబంధాల్లోకి నెట్టినప్పుడు, ఏ దేశానికైనా శత్రువుల అవసరం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. -
తలెగరేస్తే మళ్లీ బాంబులేస్తాం
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, ఇక యుద్ధం ఆగిపోతుందని, చమురు, గ్యాస్ ధరలు దిగొస్తాయని ఆశపడిన ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు. ఇరాన్తో కేవలం అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) మాత్రమే కుదిరిందని, అది తుది ఒప్పందం కాదని తేలి్చచెప్పారు. ఇరాన్ ఇకనుంచి సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్లీ బాంబు దాడులు చేస్తామని హెచ్చరించారు. తద్వారా ఇరాన్ తమ దారికి రాకపోతే యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చని సంకేతాలిచ్చారు. ఫ్రాన్స్లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడారు.ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు శుక్రవారమే సంతకాలు చేయబోతున్నారు. స్విట్జర్లాండ్లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇంతలోనే ఇరాన్కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం చూస్తే ఆ ఒప్పందం అనుకున్నంత దృఢంగా లేదని స్పష్టమవుతోంది. ‘‘ఇరాన్తో కుదుర్చుకున్నది తుది ఒప్పందం కాదు. కేవలం ఒక అవగాహన ఒప్పందం మాత్రమే.ఒకవేళ ఇది నాకు నచ్చకపోయినా లేదా ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోయినా, మేము వెంటనే వారి తలలపైనే బాంబులు కురిపిస్తాం. మళ్లీ కాల్పులు ప్రారంభిస్తాం. ఎందుకంటే గత 47 ఏళ్లుగా వారు(ఇరాన్) దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రంప్ ఆక్షేపించారు. అవగాహనా ఒప్పందంలో ఏవైనా మార్పులు చేసినా లేదా దానిని పాటించడంలో విఫలమైనా తక్షణమే సైనిక చర్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ను హెచ్చరించారు. ఇదీ ఒప్పందం ముసాయిదావాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తాలూకు ముసాయిదా పత్రంలోని 14 అంశాలను అమెరికా ఉన్నతాధికారులు బుధవారం బహిర్గతంచేశారు. ఆ అధికారులు చెప్పిన ఆ అంశాలు.. 1. లెబనాన్, ఇరాన్, హార్మూజ్ జలసంధి సముద్రజలాలు సహా పశి్చమాసియాలో అన్ని చోట్ల అమెరికా తన సైనిక, వైమానిక దాడులను తక్షణం నిలిపేస్తుంది 2. అమెరికా, ఇరాన్ను పరస్పరం ఆయా దేశాల సార్వ¿ౌమత్వాలను గౌరవించుకుంటాయి 3. ఉమ్మడి ఏకాభిప్రాయంతో 60 రోజుల్లోపు చర్చలను ఫలవంతంగా ముగిస్తాయి 4. అవగాహన ఒప్పందంపై సంతకాలుచేశాక 30 రోజుల్లోపు హార్మూజ్ దిగ్బంధనాన్నిఅమెరికా పూర్తిగా ఎత్తేస్తుంది 5. సంతకాలు పూర్తయ్యాక 60 రోజులపాటు సుంకాల్లేకుండా హార్మూజ్ గుండా నౌకల రాకపో కలకు ఇరాన్ సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తుంది 6. ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి మిత్రదేశాలతో కలిసి అమెరికా 300 బిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తుంది 7. ఇరాన్పై ఐరాస భద్రతా మండలి, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ సహా అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అన్నిరకాల ఆంక్షలను ఎత్తేసేందుకు అమెరికా కృషిచేస్తుంది 8. అణ్వ్రస్తాలను ఇరాన్ తయారుచేయకూడదు, కొనుగోలుచేయకూడదు. ఇప్పటికే అత్యంత శుద్ధిచేసిన యురేనియం నిరీ్వర్యంపై ఇరాన్, అమెరికా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయి 9. అణుకార్యక్రమం ఇప్పుడు ఏ దశలోఉందో అదే యథాతథస్థితి కొనసాగించేందుకు ఇరాన్కు హక్కు ఉంటుంది. ఇరాన్పై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించబోదు, బలగాలను దింపబోదు 10. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం వస్తూత్పత్తుల ఎగుమతులకు ఊతమిచ్చేలా అమెరికా ఆర్థిక శాఖ సబ్సిడీలు, రాయితీల రూపంలో సాయపడుతుంది. బ్యాంకింగ్, బీమా, రవాణా పరంగానూ సాయపడనుంది 11. విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాక్కు చెందిన ఖాతాల నుంచి పెద్దమొత్తంలో నగదు ఉపసంహరణకు అవకాశం 12. అవగాహన ఒప్పందం సవ్యంగా, సమర్థవంతంగా అమలయ్యేలా ఒక ప్రత్యేక కార్యనిర్వాహణ వ్యవస్థను కొలువుతీర్చి దానిని పర్యవేక్షించడం 13. సంతకాలు చేయగానే 1, 4, 5, 10, 11 పేరాల్లోని అంశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. అందుకే మిగతా పేరాల్లోని అంశాల మీదనే చర్చలు జరుగుతాయి. 14. ఐరాస భద్రతా మండలి నిబంధనలకు లోబడి తుది ఒప్పందం కుదుర్చుకోవాలి -
భారత మ్యాప్ వివాదం.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ (USINDOPACOM)ను మళ్లీ పాత పేరైన యూఎస్ పసిఫిక్ కమాండ్ (USPACOM)గా మార్చినట్లు ప్రకటించారు. ఎనిమిదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఈ మార్పు చేశారు.1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ యూఎస్ పసిఫిక్ కమాండ్గా ఏర్పాటు చేశారు. అయితే 2018లో అమెరికా అధ్యక్షుడు, అప్పటి రక్షణ మంత్రి జిమ్ మాటిస్లు యూఎస్ పసిఫిక్ కమాండ్ను కాస్తా యూఎస్ ఇండియా పసిపిక్ కమాండ్గా మార్చారు.ఎనిమిదేళ్ల తర్వాత పాత పేరు అయిన యూఎస్ పసిఫిక్ కమాండ్గా మార్పు చేశారు. సాంకేతిక, చారిత్రక వారసత్వాన్ని గౌరవించేందుకే మళ్లీ పాత పేరును తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అయితే పేరు మారుస్తూ అమెరికా రక్షణ శాఖ వెబ్సైట్లో యూఎస్ పసిఫిక్ కమాండ్ మ్యాప్ను ఏర్పాటు చేసింది. ఆమ్యాప్పై తీవ్ర దుమారం చెలరేగింది. ఆ మ్యాప్లో అమెరికా పీవోకేను పాక్ భూభాగంలో చూపించింది. దీంతో తప్పుడు మ్యాప్ను ప్రదర్శించడంపై భారతీయులు ట్రంప్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం అమెరికా-భారత్ సంబంధాలపై దౌత్య పరమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. -
నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ భేటీ
పారిస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. రక్షణ, వాణిజ్యం, పశ్చిమ ఆసియాలోని ఘర్షణపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సుంకాలు, వాణిజ్యం, ఇరాన్తో కొనసాగుతున్న ఘర్షణ కారణంగా భారత్-అమెరికా సంబంధాల్లో నెలకొన్న ఆందోళనల మధ్య ఈ భేటీ జరుగుతోంది. జీ7 సదస్సు-2026 ఫ్రాన్స్లోని ఎవియన్ స్పా పట్టణంలో జరుగుతోంది. ఇందులో భాగంగా మోదీ, ట్రంప్ సమావేశయ్యారు. నౌకా సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి..ప్రపంచ సముద్ర మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛ కొనసాగడం, నౌకా సిబ్బంది భద్రతకు భరోసా ఉండడం అత్యంత ముఖ్యమని ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో లక్షలాది మంది భారతీయ నౌకా సిబ్బంది సముద్ర వాణిజ్యంలో పనిచేస్తూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ నిరంతరంగా సాగేందుకు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య నౌకా సిబ్బంది సంక్షేమం, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఉండాలని మోదీ అన్నారు. ఇరాన్కు సంబంధించిన ప్రతిపాదిత ఒప్పందంపై ఆశాభావం వ్యక్తం చేసిన మోదీ.. నౌకా కార్మికుల భద్రతతో పాటు ప్రపంచ నౌకాయాన మార్గాల నిర్వహణకు తగిన రక్షణ లభిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వం అద్భుతం“నరేంద్ర మోదీ నాయకత్వం కొనసాగినంత కాలం భారత్ ఎంతో బాగా పురోగమిస్తుంది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక సమావేశంలో అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని “దేవదూత”గా ట్రంప్ అభివర్ణించారు. ‘‘ప్రధాని మోదీ నాకు చిరకాల మిత్రుడు. త్వరలో భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుంది. బేరసారాల్లో మోదీన నిక్కచ్చిగా ఉంటారు. భారత్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. అమెరికా భారత పెట్టుబడులకు మోదీ సహకరిస్తున్నారు. భారత్కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం’’ అని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. తాను 8 యుద్ధాలకు ఆపానంటూ మరోసారి చెప్పారు. ఇరాన్ 48 ఏళ్లుగా ప్రపంచాన్ని ఉపయోగించుకుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, జీ7 సదస్సులో యూకే, అమెరికా, ఇటలీ, జపాన్, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్ దేశాల నాయకులు పాల్గొని ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఘర్షణ, ఇతర కీలక అంశాలపై చర్చించారు. జీ7 దేశాలతో పాటు భారత్, బ్రెజిల్, కెన్యా, దక్షిణ కొరియా ప్రతినిధులకు కూడా ఈ కీలక సదస్సుకు ఆహ్వానం అందింది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పంద ప్రకటనను జీ7 దేశాలు స్వాగతించాయి. ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. -
80 గంటల పని.. అమెజాన్ అనుభవాలు చెప్పిన సీఈవో!
విజయవంతమైన వ్యాపారవేత్తల జీవితంలో ఎన్నో కఠినమైన అనుభవాలు, కష్టపడి పనిచేసిన రోజులు ఉంటాయి. అమెరికాకు చెందిన ఏఐ భద్రతా సంస్థ డీప్ సెంటినెల్ సీఈవో డేవిడ్ సెలింగర్ కూడా అలాంటి అనుభవాలనే గుర్తు చేసుకున్నారు. ఆయన తన కెరీర్ ప్రారంభ దశలో అమెజాన్లో పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నాయకత్వం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని చెప్పారు.డేవిడ్ సెలింగర్ 2002లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా అమెజాన్లో ఉద్యోగం పొందారు. 2003 జనవరిలో కంపెనీలో చేరి.. కస్టమర్ కస్టమర్ బిహేవియర్ రోల్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో అమెజాన్ ఇప్పటిలా లక్షలాది ఉద్యోగులతో కూడిన దిగ్గజ సంస్థ కాదు. కొద్దిమంది ఉద్యోగులతో పనిచేస్తున్నప్పటికీ, భారీ స్థాయిలో డేటాను విశ్లేషించే అవకాశాలు అక్కడ ఉండేవని ఆయన తెలిపారు.అమెజాన్లో పనిచేసే సమయంలో జెఫ్ బెజోస్ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు కలిసేవాడినని సెలింగర్ చెప్పారు. బెజోస్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో శక్తివంతమైన, లక్ష్యసాధనపై పూర్తిగా దృష్టి పెట్టే నాయకుడని పేర్కొన్నారు. “ఆయనతో పనిచేయడం అద్భుతమైన అనుభవం” అని సెలింగర్ అన్నారు.అమెజాన్లోని పని సంస్కృతి కూడా అంతే కఠినంగా ఉండేదని ఆయన వివరించారు. వారానికి సుమారు 80 గంటలు పనిచేసేవాళ్లమని చెప్పారు. ఉద్యోగుల నుంచి అత్యుత్తమ ఫలితాలను రాబట్టే వాతావరణం ఉండేదని, అక్కడ పనులు కూడా వేగంగా పూర్తయ్యేవని తెలిపారు. సంప్రదాయ సంస్థల్లో ఉండే అనవసర ప్రక్రియలు, సమస్యలు తక్కువగా ఉండటంతో పనిలో వేగం పెరిగేదని చెప్పారు.ఆ కఠినమైన అనుభవమే.. తనను మరింత మెరుగైన నాయకుడిగా తీర్చిదిద్దిందని సెలింగర్ అభిప్రాయపడ్డారు. అమెజాన్ను విడిచిన తర్వాత ఆయన డీప్ సెంటినెల్ అనే ఏఐ బేస్డ్ హోం సెక్యూరిటీ సంస్థను స్థాపించారు. పెద్ద స్థాయి డేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలపై అమెజాన్లో పొందిన అనుభవం తన వ్యాపార విజయానికి బలమైన పునాదిగా మారిందని పేర్కొన్నారు. -
అమెరికా–ఇరాన్ డీల్ జరగబోయేది ఇక్కడే..!
స్విట్జర్లాండ్లోని ఓ ప్రశాంత పర్వత ప్రాంతం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా లగ్జరీ రిసార్ట్గా, పర్యాటక వేదికగా మాత్రమే గుర్తింపు పొందిన ఈ ప్రదేశం… ఇప్పుడు యూఎస్–ఇరాన్ శాంతి ఒప్పంద సంతకానికి వేదికగా మారనుండటంతో అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. కానీ ఈ ప్రదేశానికి ఉన్న చరిత్ర, అక్కడ జరిగిన గత కీలక పరిణామాలు చూస్తే… ఇది కేవలం ఒక రిసార్ట్ మాత్రమే కాదనే ఫీలింగ్ కలగకమానదు.స్విట్జర్లాండ్లోని బుర్గెన్స్టాక్ (Bürgenstock) రిసార్ట్ ప్రపంచ రాజకీయాలకు మరోసారి కేంద్రబిందువుగా మారింది. నాలుగు నెలలుగా కొనసాగిన యుద్ధాన్ని ముగించేందుకు యూఎస్–ఇరాన్ మధ్య కుదిరిన మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు ఈ శుక్రవారం ఇక్కడే జరగనున్నట్లు సమాచారం. అయితే.. పర్వత శిఖరంపై, సరస్సును చుట్టుముట్టినట్లుగా ఉన్న ఈ రిసార్ట్ను సమావేశానికి ఎంపిక చేయడం వెనుక భద్రతా కారణాలు ప్రధానంగా ఉన్నాయని స్విస్ అధికారులు తెలిపారు. యూఎస్, ఇరాన్తో పాటు పాకిస్తాన్ మరియు ఖతర్ మధ్యవర్తుల సూచనల మేరకు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ లగ్జరీ హోటల్ సముదాయం 150 ఏళ్ల చరిత్ర కలిగినది. ప్రపంచ నేతలు, రాజ కుటుంబాలు, హాలీవుడ్ ప్రముఖులు తరచూ ఇక్కడి అతిథులుగా వచ్చారు. ప్రశాంత వాతావరణం, బహుముఖ భద్రతా ఏర్పాట్లు, చేరుకోవడం కష్టమైన భౌగోళిక స్థానం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇక్కడి చరిత్రలో ప్రముఖ ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. 1950లలో ప్రపంచ నాయకులు, కళాకారులు ఈ రిసార్ట్ను కలుసుకునే వేదికగా ఉపయోగించారు. బ్రిటిష్ నటుడు సీన్ కానరీ జేమ్స్ బాండ్ సినిమా “గోల్డ్ఫింగర్” షూటింగ్ సమయంలో ఇక్కడే నెలరోజులు ఇక్కడే బస చేశారు. ఈ రిసార్ట్లోని నిర్మాణం కూడా విశిష్టంగా ఉంటుంది. పర్వత అంచున 450 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సముదాయం నాలుగు ప్రధాన హోటల్ భవనాలు, విలాసవంతమైన సూట్లు, విల్లాలతో కూడి ఉంటుంది. కొన్ని సూట్ల ధరలు ఒక్క రాత్రికి వేల డాలర్ల వరకు ఉంటాయి. ప్రత్యేక రైల్వే మార్గాలు, లిఫ్టులు, సరస్సు ద్వారా రాకపోకలు ఈ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.హాలీవుడ్ క్లాసిక్ జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్కు వేదికైన ఈ లగ్జరీ ప్రదేశం… ఇప్పుడు యుద్ధం ముగింపు చర్చలు అక్కడే ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నకు ప్రపంచం సమాధానం వెతుకుతోంది. అయితే.. ప్రపంచ రాజకీయ చర్చలు, శాంతి ఒప్పందాలు కూడా ఇదే ప్రదేశంలో జరిగిన సందర్భాలు ఉన్నాయట. గతంలో కూడా ఇక్కడ ప్రపంచ స్థాయి రాజకీయ సమావేశాలు జరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు, సుడాన్ శాంతి ఒప్పందం, సైప్రస్ సమస్యపై చర్చలు వంటి కీలక సమావేశాలకు ఇది వేదికగా నిలిచింది. అంతేకాదు, బిల్డర్బర్గ్ వంటి అత్యంత రహస్య గ్లోబల్ మీటింగ్స్ కూడా ఇక్కడే జరిగిన చరిత్ర ఉంది. మొత్తానికి, సినిమాల్లో కనిపించే లాంటి ఆ లగ్జరీ పర్వత రిసార్ట్ ఇప్పుడు మరోసారి ప్రపంచ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారుతోంది. -
పైసా ఇవ్వని అమెరికా.. ఇరాన్ డీల్లో మెగా ట్విస్ట్
ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు దేని కోసం అన్న ప్రశ్నకు అణు ఒప్పందం, హర్ముజ్ జలసంధి వంటి అంశాల చుట్టూ భిన్న భిన్న వెర్షన్లు వినిపిస్తున్నాయి. డీల్లో అసలు ఏముంది అన్నదానిపై స్పష్టత లేకపోయినా, ఒక్కో వర్గం ఒక్కో కోణాన్ని ప్రధానంగా చూపిస్తోంది. ఇక ఈ మొత్తం సమీకరణాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తున్న పదం మాత్రం ఇప్పుడు చర్చల్లో బలంగా వినిపిస్తోంది… అదే మెగా డీల్.ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు కేవలం రాజకీయ ఒప్పందాలకే పరిమితం కావడం లేదు. అణు కార్యక్రమంపై నియంత్రణలు, ఆంక్షల ఎత్తివేత, అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి అంశాలు ఈ డీల్లో ప్రధాన భాగాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలు భౌగోళిక రాజకీయాల కోణంలో అత్యంత కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి. హర్ముజ్ జలసంధి విషయానికి వస్తే, ఇది ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాకు అత్యంత కీలక మార్గం. ఈ మార్గంపై స్థిరత్వం లేకపోతే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు నేరుగా ప్రభావితమవుతాయి. అందుకే శాంతి ఒప్పందంలో దీనిపై ప్రత్యేక అంగీకారాలు అవసరమవుతున్నాయి. అదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమం కూడా ఈ చర్చల కేంద్రబిందువుగా కొనసాగుతోంది.అయితే ఈ రెండు కీలక అంశాల మధ్య ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది ఆర్థిక ప్యాకేజీ. సుమారు 300 బిలియన్ డాలర్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మొత్తం ఈ చర్చను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇరాన్-యూఎస్ పీస్ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్లో భాగంగా ప్రతిపాదించిన ఈ ఫండ్.. యుద్ధానంతర పునర్నిర్మాణం కోసం రూపొందించిన భారీ ఆర్థిక ప్యాకేజీగా భావిస్తున్నారు.రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ ఫండ్ పూర్తిగా ప్రైవేట్ పెట్టుబడులతోనే నడుస్తుంది. అమెరికా ప్రభుత్వం నుంచి పైసా సాయం ఉండదు. అయితే.. ఇప్పటికే సుమారు 150 బిలియన్ డాలర్లకు పైగా కమిట్మెంట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆసియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన కంపెనీలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టడమట. ఎనర్జీ, రవాణా, లాజిస్టిక్స్, పరిశ్రమలు వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకురావడం ద్వారా దేశాన్ని మళ్లీ గ్లోబల్ ఎకానమీకి కలపడం దీని ఉద్దేశమని ఆ కథనం పేర్కొంది. ముఖ్యంగా ఈ ఆర్థిక ప్యాకేజీని అణు ఒప్పంద చర్చలు, అలాగే హర్ముజ్ జలసంధి అంశం నుండి వేరుగా ఉంచినట్లు సమాచారం. అంటే ఒక వైపు రాజకీయ భద్రతా ఒప్పందాలు కొనసాగుతుండగా, మరోవైపు ఈ ఫండ్ పూర్తిగా ఆర్థిక ట్రాక్లో ముందుకు వెళ్లనుందన్నమాట.ఇరాన్ మొదట యుద్ధ నష్టాలకు 400 బిలియన్ డాలర్ల పరిహారం కోరినప్పటికీ.. అమెరికా ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. దాంతో ప్రత్యామ్నాయంగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆలోచన ముందుకు వచ్చింది. ఈ మార్పే ఇప్పుడు ఈ డీల్ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తోందనే విశ్లేషణ నడుస్తోంది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. హర్ముజ్ జలసంధి భద్రత, అణు ఒప్పందం రాజకీయ స్థిరత్వాన్ని నిర్ణయిస్తే… ఈ 300 బిలియన్ డాలర్ల ఫండ్ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే గేమ్చేంజర్గా మారే అవకాశం ఉంది. అంటే ఒకవైపు వ్యూహాత్మక భద్రత, మరోవైపు ఆర్థిక జాక్పాట్ – రెండూ ఈ డీల్ను నడిపిస్తున్న రెండు ఇంజిన్లలా భావిస్తున్నారు. -
ఆంక్షలతో అల్లాడిన జీవితాలు.. ఇరానీల మౌన వేదన
టెహ్రాన్ ‘విజయం’ అంటోంది.. కానీ ఇరాన్ ప్రజలు ‘ఉపశమనం’ అంటున్నారు. అమెరికాతో ఒప్పందాన్ని ప్రభుత్వం రాజకీయ గెలుపుగా చూపిస్తుండగా, సంక్షోభంలో కూరుకుపోయిన ప్రజలు మాత్రం తమ జీవితం మెరుగుపడుతుందా?.. ధరలు తగ్గుతాయా? ఉద్యోగాలు వస్తాయా? పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? అనే దానిపైనే దృష్టి పెట్టారు. ఆర్థిక కష్టాలు, యుద్ధ భయాలే ఈ ఒప్పందానికి అసలు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజలు మాత్రం దాన్ని తమ జీవితాల్లో కొంత వెలుగు నింపే అవకాశంగా చూస్తున్నారు.గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. దేశ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులపై పరిమితులు విధించడంతో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా ఇరానియన్ రియాల్ విలువ క్షీణించింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు మధ్యతరగతికి అందుబాటులో ఉన్న అనేక వస్తువులు ఇప్పుడు విలాసంగా మారిపోయాయి.టెహ్రాన్కు చెందిన 45 ఏళ్ల ఉపాధ్యాయుడు అలీ రెజా మాటల్లో చెప్పాలంటే.. మాకు రాజకీయ విజయాలు అవసరం లేదు. మార్కెట్కు వెళ్లినప్పుడు సరుకులు కొనగలిగితే అదే విజయం.. ఈ భావన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రజల దృష్టిలో అమెరికాతో ఒప్పందం అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో గెలుపు కాదు.. కుటుంబ ఖర్చులు తగ్గే అవకాశం అని భావిస్తున్నారు.ఆంక్షల అసలు ప్రభావం ప్రజలపైనే.. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్లో కేవలం చమురు ఆదాయం మాత్రమే తగ్గలేదు. విదేశీ బ్యాంకింగ్ వ్యవస్థలతో సంబంధాలు దెబ్బతినడంతో మందులు, వైద్య పరికరాలు, పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకుల దిగుమతులు కూడా కష్టతరమయ్యాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు దొరకక చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.ఇరాన్ యువత పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. నిరుద్యోగం, తక్కువ వేతనాలు, విదేశాల్లో అవకాశాల కొరత కారణంగా వేలాది మంది యువకులు నిరాశలో ఉన్నారు. చాలా మంది ఉన్నత విద్య పూర్తిచేసినా సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. ఆర్థిక ఆంక్షల కారణంగా విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడంతో పరిశ్రమలు కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అందుకే అమెరికాతో ఒప్పందం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని యువత ఆశిస్తోంది.మహిళల ఆశలుఇటీవలి సంవత్సరాల్లో ఇరాన్లో మహిళల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే సమాజంలో మరిన్ని సంస్కరణలు వస్తాయనే ఆశ కొంతమంది మహిళల్లో ఉంది. అయితే ఒప్పందం వల్ల రాజకీయ స్వేచ్ఛలు పెరుగుతాయా అనే విషయంలో మాత్రం సందేహాలు ఉన్నాయి. అలాగే ఇరాన్లో మహిళల విద్యా స్థాయి గణనీయంగా పెరిగినా, ఉద్యోగ అవకాశాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ప్రైవేట్ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని, మహిళల ఉపాధి పెరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా యువతులు ఈ ఒప్పందాన్ని ఉపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా ఒక అవకాశంగా చూస్తున్నారు. మరోవైపు, 2022లో జరిగిన Mahsa Amini protests తర్వాత మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛల అంశాలు ఇరాన్లో ప్రధాన చర్చగా మారాయి. ఆర్థికంగా ప్రపంచంతో సంబంధాలు పెరిగితే సమాజంలో మరింత తెరవెనుకత, సంస్కరణలకు అవకాశం ఏర్పడుతుందనే ఆశ కొందరు మహిళల్లో ఉంది. ప్రజల్లో ఆందోళన..మరో ముఖ్యమైన అంశం యుద్ధ భయం. గత కొంతకాలంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్తో పెరిగిన ఘర్షణలు ప్రజల్లో ఆందోళన పెంచాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరిస్తే తమ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఈ ఒప్పందం ద్వారా ఉద్రిక్తతలు తగ్గితే అదే తమకు పెద్ద ఊరట అని చెబుతున్నారు. అయితే ఆశలతో పాటు అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందాలు కుదిరినా తరువాత అవి నిలవలేదు. అందుకే ‘ఈసారి నిజంగా మార్పు వస్తుందా?’ అనే సందేహం చాలా మందిలో కనిపిస్తోంది. ఒప్పందం కుదిరిందనే వార్త కంటే, దాని ఫలితాలు తమ జేబుల్లో కనిపిస్తాయా లేదా అన్నదే వారికి ముఖ్యం.రాజకీయంగా చూస్తే టెహ్రాన్ దీనిని విజయగాథగా చెప్పుకోవచ్చు. కానీ సాధారణ ఇరానీయులకు ఇది విజయోత్సవాల విషయం కాదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు తగ్గడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, యుద్ధ భయం తగ్గడం, పిల్లలకు మెరుగైన భవిష్యత్తు దొరకడం వారికి అసలైన విజయం అదే. అందుకే అమెరికాతో కుదిరిన ఈ ఒప్పందాన్ని ఇరాన్ ప్రజలు ‘గెలుపు’గా కాదు, ‘బతుకును నిలబెట్టే ఆశాకిరణం’గా చూస్తున్నారు. దీంతో, ఈ ఒప్పందం నిజంగా ఇరాన్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందా? లేక రాజకీయ ప్రచారానికే పరిమితమవుతుందా? అన్నది రాబోయే నెలల్లో తేలనుంది. -
లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగాల్సిందే
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించి, శాంతిని నెలకొల్పాలంటే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మంగళవారం తేల్చిచెప్పారు. అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చినట్లు వెల్లడించారు. అయితే, ఈ షరతును ఇజ్రాయెల్ ఇప్పటికే తిరస్కరించిందని అన్నారు. ఇజ్రాయెల్ వైఖరిలో మార్పు రాకపోతే తాత్కాలిక ఒప్పందం నిరీ్వర్యమైపోయి, మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభం కావొచ్చని ఉద్ఘాటించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఇంకా బహిర్గతం చేయలేదు. అందులోని అంశాలపై అమెరికా, ఇరాన్ అధికారులు అప్పుడప్పుడు పరస్పర విరుద్ధమైన వివరణలు ఇచ్చారు. ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ భాగస్వామి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి లెబనాన్లో ఇరాన్ మద్దతు కలిగిన హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్తో ఇజ్రాయెల్ పోరాడుతోంది. లెబనాన్లో విస్తృతమైన ప్రాంతాలను ఇప్పటికే స్వా«దీనం చేసుకుంది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దురాక్రమణ ఇంకా కొనసాగితే.. అది తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని అబ్బాస్ అరాగ్చీ స్పష్టంచేశారు. ఈ యుద్ధ సమయంలో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి వెళ్లకపోతే యుద్ధం పూర్తిగా ముగిసినట్లు కాదని పేర్కొన్నారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఉపసంహరణ అంశాన్ని ఒప్పందంలో చేర్చలేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం మాట్లాడుతూ.. అవసరమైనంత కాలం తమ సైన్యం లెబనాన్లోనే ఉంటుందని అన్నారు. అయితే ఇరాన్ పట్టుబడుతున్నట్లుగా, లెబనాన్లో ఇజ్రాయెల్ సహా సైనిక కార్యకలాపాలను ముగించాలని ఈ ఒప్పందంలో ఉన్నట్లు తాజాగా పాకిస్తాన్ వెల్లడించింది. -
వైట్హౌస్లో భారీ రక్తపాతానికి కుట్ర
అమెరికా వైట్హౌస్లో నిర్వహించిన UFC ఫ్రీడమ్ 250 ఈవెంట్పై భారీ దాడికి కుట్ర పన్నిన ఐదుగురిని ఎఫ్బీఐ అరెస్ట్ చేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖులను హత్య చేయడమే లక్ష్యంగా వీరు ప్రణాళిక రూపొందించినట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించింది.అమెరికాలోని ఓహాయో, మిస్సోరీ, నెబ్రాస్కా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో వారాంతంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కుట్రపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.నిందితులు డ్రోన్లకు పేలుడు పదార్థాలు అమర్చి వైట్హౌస్ ప్రాంగణంలో జరిగిన UFC కార్యక్రమంపై దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. డ్రోన్ల పేలుళ్లతో కార్యక్రమంలో గందరగోళం సృష్టించి, ప్రజలు బయటకు పరుగులు తీస్తున్న సమయంలో స్నైపర్లతో "హై వాల్యూ టార్గెట్లను" కాల్చి చంపాలనుకున్నట్లు దర్యాప్తులో తేలింది.ఈ కేసులో టైసెన్ సి. ప్రాపర్ (19), బ్రయాన్ ఒమర్ రో (24), మైఖేల్ అలాన్ థామస్ (32), డేనియల్ కె. ఎస్క్రిడ్జ్ (32), అబ్రహం హెర్మోసిల్లో అల్వారెజ్ (31)లను అభియోగాలు మోపారు.దర్యాప్తులో భాగంగా ఓహాయోకు చెందిన టైసెన్ ప్రాపర్ ఇంట్లో భారీగా ఆయుధాలు, వేలాది రౌండ్ల బుల్లెట్లు, వ్యూహాత్మక సైనిక సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు కాంగ్రెస్ సభ్యులను లక్ష్యాలుగా గుర్తించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. -
ఆగిన యుద్ధం ఆగినట్టేనా?
ఎంతమాత్రం అవసరం లేని దుర్మార్గపు యుద్ధాన్ని 108 రోజులపాటు సాగించి ఇరాన్కే గాక ప్రపంచానికంతా తీవ్ర నష్టాలు కలిగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తానిక ఏమీ చేయలేనని గ్రహించి కావచ్చు యుద్ధ విరమణకు ‘అవగాహనా పత్రం’ ఒకటి ఇరాన్తో పాటు ప్రకటించారు. ఆ పత్రంపై ఈ నెల 19న జెనీవాలో జరగగలవంటున్న సంతకాలకు ట్రంప్ సహచర యుద్ధవీరుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ నుంచి కొత్త విఘాతాలు ఏర్పడని పక్షంలో, మరొక రెండు మాసాలకు మలివిడత చర్చలు జరుగుతాయి. అంతవరకు అందరం మధ్యంతర ఊపిరి పీల్చుకున్నా, తదనంతర పరిస్థితిపై ఇంకా ఊపిరి బిగబట్టవలసిందే.కుదిరినట్టేనా ‘అవగాహన’?ఆ ‘పత్రం’లో ఏమున్నదనే వివరాలు జెనీవాలో సంతకాల తర్వాతే ప్రకటిస్తామని అంటున్నారు. ఇంతవరకు ట్రంప్ చెప్పిన దానినిబట్టి, అన్ని క్షేత్రాలలో కాల్పులు వెంటనే ఆగిపోతాయి. ఇరాన్ రేవులపై దిగ్బంధాన్ని అమెరికా, హార్మూజ్పై దిగ్బంధాన్ని ఇరాన్ ఎత్తివేస్తాయి. ఓడలపై ఇరాన్ సుంకాలు విధించదు. చమురు రవాణా మునుపటి వలె స్వేచ్ఛగా సాగవచ్చు. ట్రంప్ చేసిన ప్రకట నను ఇరాన్ ఖండించలేదు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పిన దాని ప్రకారం, యుద్ధం అన్ని క్షేత్రాలలో వెంటనేగాక శాశ్వతంగా కూడా నిలిచిపోతుంది. ఇంకా ఇతరత్రా వెల్లడవుతున్న వివరాల ప్రకారం, అమెరికా స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల నిధులలో మొదట సగం మేర విడుదల చేస్తారు. ఇరాన్ పునర్ నిర్మాణానికి అమెరికా మిత్ర దేశాలతో కలిసి 300 బిలియన్లు సమకూర్చుతారు. అవగాహనా పత్రంలో ఇరాన్ యురేనియం నిల్వలు, క్షిపణులు, హమాస్, హెజ్బొల్లా, హౌతీల వంటి మిలిటెంట్ సంస్థల ప్రస్తావనలు లేవు. ఈ చర్చలు మలిదశలో ఉండగలవన్నది సూచన.ఇరాన్ రేవుల దిగ్బంధాల ఎత్తివేత 19 లోగా పూర్తిగా జరిగితేనే తాము అవగాహనా పత్రంపై సంతకాలు చేయగలమని ఇరాన్ వెంటనే స్పష్టం చేసింది. ఇందులోని మెలిక ఏమంటే, అమెరికా తాను చేయగలిగింది తాను చేయవచ్చుగాక. కానీ, లెబనాన్పై, అక్కడి హెజ్బొల్లాపై దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్, ఇపుడు ఆపుతుందా అన్నది పెద్ద ప్రశ్న. చివరకు ఆదివారం రాత్రి తన ప్రక టనకు కొద్ది గంటల ముందు కూడా నెతన్యాహూను ట్రంప్ పరుషమైన భాషలో హెచ్చరించవలసి వచ్చింది. ఆ మీదట నెతన్యాహూతో పాటు ఆయన రక్షణ మంత్రి కట్జ్ అసాధారణమైన రీతిలో సంయుక్త ప్రకటన చేస్తూ, తాము దాడులు చేస్తున్నది హెజ్బొల్లాపై తప్ప లెబనాన్పై కాదని వివరించబూనారు. అది నిజం కాదని అందరికీ తెలుసు. గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టి దీర్ఘకాలిక లక్ష్యంగా గల ఇజ్రాయెల్, అందుకోసం పాలస్తీనా, జోర్డాన్లతో పాటు లెబనాన్ తదితర అరబ్ దేశాల భూభాగాలను ఆక్రమించటం ఒక కార్యక్రమంగా నేటికీ కొనసాగిస్తున్నది. ఆ మేరకు జియోనిస్టు సిద్ధాంత కర్తలు ప్రతిపాదించిన ఒక మ్యూపును నెతన్యాహూ నిరుడు విడుదల చేస్తూ, తానందుకు కట్టుబడి ఉన్నాన న్నారు. పాలస్తీనాను మొత్తంగా ఇజ్రాయెల్లో భాగంగా చూపే మ్యాపును ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోనే ప్రదర్శించారు.‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆగుతుందా?నిజానికి ప్రస్తుత యుద్ధాన్ని అణ్వాయుధాల సాకుతో అమె రికాతో కలిసి మొదలుపెట్టడంలోని రహస్యోద్దేశం కూడా పాలస్తీనా ఆక్రమణకు, పశ్చిమాసియాలో ఆధిపత్యానికి అడ్డంకిగా గల ఇరాన్ను విచ్ఛిన్నం చేయటమేనన్నది రహస్యం కాదు. అందుకే, ప్రస్తుత యుద్ధంలో శాంతి ప్రయత్నాలకు ప్రతిసారి విఘాతం కలి గిస్తూ వస్తున్న ఇజ్రాయెల్, అవగాహనా పత్రం అమలును మరొక మారు భంగపరచబోదన్న హామీ లేదు. అందుకే కావచ్చు ఇరాన్ నాయకత్వం, అవగాహన అంటూ కుదిరినా తమ వేళ్లు ఎల్లప్పుడూ ట్రిగ్గర్పైనే ఉంటాయని ఆ వెంటనే ప్రకటించింది.సమస్యలలో సులభమైన వాటిపై ప్రస్తుతానికి రాజీ కుదురు తున్నది. జరుగుతున్న దాడుల నిలిపివేత, నౌకా దిగ్బంధాల ఎత్తివేత వంటివి తేలికైన విషయాలు. అందువల్ల చమురు, సరకుల రవాణాలు సాఫీగా జరిగి ఇరాన్, గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచాని కంతా ఉపయోగకరమవుతుంది. తమకిచ్చిన హామీలు జెనీవా సంతకాల తర్వాత 60 రోజులపాటు సక్రమంగా అమలైతేనే మలి విడత చర్చలు జరప గలమని ఇరాన్ స్పష్టం చేసింది. అంతా అదే ప్రకారం జరుగుతుందనీ, మొదట ఈ నెల 19 వరకూ, తర్వాత 60 రోజుల వరకూ ఇజ్రాయెల్ను ట్రంప్ పూర్తి నియంత్రణలో ఉంచ గలరనీ, మరొకవైపు హెజ్బొల్లాను ఇరాన్ నియంత్రించగలదనీ భావించినా, ఆ మలి విడత చర్చలు ఎంత మాత్రం తేలిక కాబోవు. అప్పటి అజెండా క్లిష్టమైనది కాగలదు.వాటిలో అన్నింటికన్న ప్రధానమైనది ఇరాన్ అణుశక్తి కార్య క్రమం. ఆదివారం రాత్రి ట్రంప్ తమ ఒప్పందాన్ని ప్రకటిస్తూ,అంతా సాధారణ పరిస్థితికి చేరినాక తాము ఇరాన్లో ప్రవేశించి యురేనియంను స్వాధీనపరచుకుని, అమెరికాకు తెచ్చి నిరుపయో గంగా మార్చగలమన్నారు.ఆ పని చేయటంవల్ల ఇజ్రాయెల్కు అణుముప్పు తొలగిపోతుందని, కనుక ప్రస్తుతానికి మౌనంగా ఉండాలంటూ నెతన్యాహూను ఒప్పించినట్లు వార్తలు చెప్తున్నాయి. కానీ, ఇరాన్ వార్తలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. శాంతియుత ఉప యోగం తమ అంతర్జాతీయ హక్కు అని మొదటినుంచి ప్రకటిస్తున్న ఇరాన్, అది ఎప్పటికీ వదలుకోబోమనీ, యురేనియం శుద్ధి శాతాన్ని ప్రస్తుత 60 శాతం నుంచి గణనీయంగా తగ్గించి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలు మరింత పెరిగేందుకు అనుమతించగల మనీ చెప్తున్నది. తమ క్షిపణులు ఆత్మరక్షణకు తప్పనిసరి గనుక వాటి పరిధి తగ్గింపు ఆమోదయోగ్యం కాదనీ, మిలిటెంట్ సంస్థలు ప్రధా నంగా ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి స్వతంత్రంగా పని చేస్తాయి గనుక, వాటిని నిరోధించే శక్తి తమకు లేదనీ అంటున్నది. ఏం సాధించినట్టు?ఇంతకూ, ఫిబ్రవరి 28న ఆరంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో అమెరికా, ఇజ్రాయెల్ సాధించిందేమిటి? ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగా దాడులకు పాల్పడ్డ అమెరికా తన విశ్వసనీయతను కోల్పోవటం మొదటి ఘనత. ఇస్లామిక్ వ్యవస్థ మార్పు (రెజీమ్ ఛేంజ్), అణుశక్తి సామర్థ్య నిర్మూలన, బాలిస్టిక్ క్షిపణుల ధ్వంసం, మిలిటెంట్ మిత్రుల అంతం అనే లక్ష్యాలలో ఏ ఒక్కటీ నెరవేరక పోవటం రెండవ ఘనత. అగ్రనేత ఖొమెనేయ్ని కుటుంబంతో సహా మొదటి రోజునే ప్రాణాలు తీసినా ఇరానీ నాయ కత్వం, జాతి మొత్తం ఏకమై నిలిచి నెలల తరబడి ప్రతిఘటించేట్లు చేయటం మూడవ ఘనత. ఇరాన్ ప్రతిఘటనతో స్వయంగా తమ స్థావరాలతో పాటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాలకు గురి కావటం నాల్గవ ఘనత. చమురు, గ్యాస్ సమస్యలతో ప్రపంచం అతలాకుతలం కావటం అయిదో ఘనత. ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవాలన్న డిమాండ్ ఏమైందో అమెరికా అధ్యక్షుడే చెప్పాలి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అమెరికాలో భారత సంతతి విద్యార్థినుల మృతి
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రతీరంలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయిన ఇద్దరు భారత సంతతి కళాశాల విద్యార్థినులు భారీ అలలకు చిక్కి సముద్రంలో కొట్టుకుపోయారు. వారిలో ఒకరు ఘటన జరిగిన రోజే మృతి చెందగా, మరో యువతి కొన్ని రోజులపాటు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. జూన్ 10న కాలిఫోర్నియాలోని బోనీ డూన్ బీచ్లో ఈ ప్రమాదం జరిగింది. ఫ్రీమాంట్కు చెందిన 21 ఏళ్ల హర్షిత నాయర్, 20 ఏళ్ల మహియాల్ శ్రాన్ సముద్రతీరంలోని ప్రమాదకర ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటుండగా, భారీ అలలు వారిని సముద్రంలోకి లాగేశాయి.సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది, రక్షక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టాయి. సుమారు ఎనిమిది మంది రెస్క్యూ స్విమ్మర్లు ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దిగి ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు.హర్షిత ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మరణించగా.. తీవ్రంగా గాయపడిన మహియాల్ కొన్ని రోజులు మృత్యుతో పోరాడి, చివరికి ప్రాణాలు కోల్పోయింది.హర్షిత, మహియాల్ 2023లో వాషింగ్టన్ హైస్కూల్లో చదువు పూర్తి చేశారు. హర్షిత యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్కిలీలో లీగల్ స్టడీస్ చదువుతుండగా, మహియాల్ సాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీలో పబ్లిక్ హెల్త్ విద్యను అభ్యసిస్తోంది. ఇద్దరూ 2027లో పట్టభద్రులయ్యే అవకాశం ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. -
లెబనాన్పై ఇజ్రాయెల్ మరోసారి దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయన్న సంకేతాల మధ్య లెబనాన్పై ఇజ్రాయెల్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడింది. దక్షిణ లెబనాన్లో మంగళవారం జరిగిన వరుస డ్రోన్ దాడుల్లో కనీసం నలుగురు మరణించగా, పలువురు గాయపడినట్లు లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ (NNA) వెల్లడించింది.మయ్ఫదౌన్ గ్రామంలో ఓ కారును లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. పేలుడు జరిగిన తర్వాత ఘటనాస్థలికి చేరుకున్న వారిపై మరోసారి డ్రోన్ దాడి జరగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీనిని "డబుల్ ట్యాప్ స్ట్రైక్"గా అధికారులు పేర్కొన్నారు. మరోవైపు షౌకిన్ పట్టణంలో జరిగిన డ్రోన్ దాడిలో మరో ఇద్దరు మరణించారు.అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి అవగాహన కుదిరిన నేపథ్యంలో ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య పోరాటం కొంత తగ్గినప్పటికీ పూర్తిగా ఆగలేదని తాజా ఘటనలు సూచిస్తున్నాయి. మంగళవారం మొత్తం దక్షిణ లెబనాన్లో డ్రోన్ దాడులు, క్షిపణి ప్రయోగాలు, ఫిరంగి కాల్పులు కొనసాగినట్లు ఎన్ఎన్ఏ తెలిపింది. అదే సమయంలో రాజధాని బీరూట్పై కూడా ఇజ్రాయెల్ నిఘా డ్రోన్లు చక్కర్లు కొట్టాయి.ఈ ఏడాది మార్చి 2 నుంచి ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యల్లో ఇప్పటివరకు 3,820 మందికిపైగా మరణించారు. సుమారు 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారని లెబనాన్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘర్షణల్లో కనీసం 28 మంది ఇజ్రాయెల్ సైనికులు, నలుగురు పౌరులు మరణించినట్లు సమాచారం. -
ఇజ్రాయెల్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా లేకుంటే ఇజ్రాయెల్ ఉండేది కాదంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాన్ని రక్షించిన ఘనత తనదేనంటూ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ మనుగడ, భద్రత.. అమెరికా మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు. ఆ దేశాన్ని రక్షించడంలో తన సొంత విధానాలే నిర్ణయాత్మక పాత్ర పోషించాయన్నారు. తాను చేసిన పనులను చేయడానికి మరే ఇతర అధ్యక్షుడూ సిద్ధంగా లేరన్నారు.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో తనకున్న సంబంధాలు బలంగా ఉన్నాయని వివరిస్తూనే.. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్య పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్.. లెబనాన్ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందంటూ పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రముఖ నిపుణులకు నిలయంగా ఉన్న లెబనాన్.. కాలక్రమేణా తీవ్రంగా క్షీణించిపోవడంపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు.లెబనాన్, హెజ్బొల్లా విషయంలో ఇజ్రాయెల్ వ్యవహరించిన తీరుపై తాను సంతృప్తిగా లేనన్నారు. ఈ ఘర్షణ చాలా కాలంగా సాగుతోందని.. ఇది ఇరాన్తో ఇటీవలే కుదిరిన ఒప్పందాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. ఇజ్రాయెల్కూడా శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాలి. శుక్రవారం లోపు హర్మూజ్ పూర్తి ఓపెన్ అవుతుంది. ఇకపై హర్మూజ్లో టోల్ ఫీజు ఉండదన్న ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదన్నారు.కాగా, దాదాపు 107 రోజులుగా హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి.ఈ నేపథ్యంలో నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తనకు కొన్నిసార్లు విభేదాలు వస్తుంటాయని.. అయితే, అమెరికాతో సంబంధాల విషయంలో ఇజ్రాయెల్ తన సొంత ప్రయోజనాలకే కట్టుబడి ఉందని.. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేకుండా చూడటమే తమ లక్ష్యమంటూ మరోసారి తేల్చి చెప్పారు. -
ఒకే రోజు.. అమెరికా, రష్యాలకు భారీ షాక్!
అవేం సాధారణ యుద్ధ విమానాలు కావు.. అవసరమైతే అణ్వాయుధాలను మోసుకెళ్లి వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై విరుచుకుపడగల గగన కోటలు. ఒకటి అమెరికా బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్, మరొకటి రష్యా టీయూ-22ఎం3.. కోల్డ్వార్ కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించిన రెండు మహాశక్తుల అణు బలానికి ప్రతీకలవి. అలాంటి రెండు దేశాల వ్యూహాత్మక శక్తికి ప్రతీకలైన బాంబర్లు.. కొన్ని గంటల వ్యవధిలో నేలకూలడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. అమెరికా, రష్యాలకు ఒకే రోజు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న రెండు దేశాల వ్యూహాత్మక బాంబర్లు ప్రమాదానికి గురయ్యాయి. అమెరికాకు చెందిన బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ కూలి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. రష్యాకు చెందిన టీయూ-22ఎం3 బాంబర్ కూడా కుప్పకూలింది. అయితే రష్యా విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పింది.SHOCKING COINCIDENCE: On June 15, 2026, TWO strategic bombers crashed on the SAME DAY — first Russia's Tu-22M3 in Siberia (4 pilots survived), then US B-52 in California (8 crew died) ❄️🇺🇸Both Cold War-era aircraft. Both gone in one day. pic.twitter.com/rxZ01MztPX— RB. (@KailashVashi) June 16, 2026అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బాంబర్ టెస్టింగ్లో భాగంగా.. ప్రమాదానికి గురైనట్లు అమెరికా వైమానిక దళం తెలిపింది. ప్రమాదంలో సిబ్బంది సజీవ దహనం కాగా.. స్పాట్ నుంచి భారీగా నల్లటి పొగలు ఎగసిపడిన దృశ్యాలు వైరల్గా మారాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.. ఎడ్వర్డ్స్ ఎయిర్ బేస్లోని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.All 8 crew DEAD in B-52 bomber crash in routine test flight — CNN 'Indications are crash was not survivable' — officialshttps://t.co/Llhou3fYku pic.twitter.com/DwEmKbAhTb— RT (@RT_com) June 16, 2026మరోవైపు రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని ఇర్కుట్స్క్లో టీయూ-22ఎం3 వ్యూహాత్మక బాంబర్ కూలిపోయింది. శిక్షణా విమానయానంలో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ప్రమాదం సంభవించే ముందే సిబ్బంది ఎజెక్ట్ కావడంతో ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. విమానం ఎలాంటి యుద్ధ సామగ్రి లేకుండానే ప్రయాణిస్తోందని, భూమిపై కూడా ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది.అసలు ఈ రెండు వ్యూహాత్మక బాంబర్ల ప్రత్యేకతే వాటిని ప్రపంచ సైనిక చరిత్రలో అత్యంత కీలక వేదికలుగా నిలిపింది. బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ 1952లో తొలి ప్రయోగాన్ని పూర్తి చేసుకోగా, 1955లో అమెరికా వైమానిక దళంలో అధికారికంగా ప్రవేశించింది. దాదాపు ఏడు దశాబ్దాలుగా ఇది అమెరికా వ్యూహాత్మక వైమానిక శక్తికి వెన్నెముకగా కొనసాగుతోంది. వియత్నాం యుద్ధం, గల్ఫ్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఆపరేషన్లలో ఈ బాంబర్లు కీలక పాత్ర పోషించాయి. అణు బాంబుల నుంచి అత్యాధునిక క్రూయిజ్ క్షిపణుల వరకు మోసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది.దీని ప్రారంభ ఉత్పత్తి కాలంలో ఒక్క బీ-52 విమానం ఖర్చు సుమారు 14 మిలియన్ డాలర్లకు చేరువగా ఉండేది. కానీ ఆధునికీకరణలు, అప్గ్రేడ్లు కలిపితే ప్రస్తుత విలువ మరియు నిర్వహణ వ్యయం వందల మిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్లు రక్షణ విశ్లేషణలు పేర్కొంటాయి. ఇప్పటికీ కొత్త ఇంజిన్లు, అవియానిక్స్, ఆయుధ వ్యవస్థలతో దీన్ని నిరంతరం అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు.మరోవైపు రష్యా టీయూ-22 బాంబర్ కుటుంబానికి చెందిన టీయూ-22ఎం3 వెర్షన్ 1980లలో సేవల్లోకి వచ్చింది. నాటో దేశాలు దీనిని "బ్యాక్ఫైర్"గా పిలుస్తాయి. సోవియట్ యుగం నుంచి రష్యా వ్యూహాత్మక వైమానిక శక్తిలో ఇది కీలక భాగంగా కొనసాగుతోంది. సిరియా, ఉక్రెయిన్ యుద్ధాల్లో కూడా ఈ బాంబర్లను వినియోగించారు. ఖెచ్-22 క్రూయిజ్ క్షిపణులు, అలాగే ఆధునిక హైపర్సోనిక్ ఆయుధాలు మోసుకెళ్లగల సామర్థ్యం దీని ప్రధాన బలం.టీయూ-22ఎం3 ఖర్చు విషయానికి వస్తే, సోవియట్ కాల అంచనాలు మరియు ఆధునిక పునర్మూల్యాంకనాల ప్రకారం ఒక్క విమానం ఉత్పత్తి వ్యయం సుమారు 40–50 మిలియన్ డాలర్ల మధ్యగా భావించబడుతుంది. అయితే ఆయుధ సమీకరణ, నిర్వహణ, ఆధునికీకరణతో కలిపితే దీని మొత్తం జీవన వ్యయం గణనీయంగా పెరుగుతుంది.బలం విషయానికి వస్తే.. బీ-52 విమానం దాదాపు 31 టన్నుల వరకు ఆయుధాలను మోసుకెళ్లగలదు. గాల్లో ఇంధనం నింపుకుంటే వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకుని దీర్ఘదూర దాడులు చేయగల సామర్థ్యం దీనికి ఉంది. మరోవైపు టీయూ-22ఎం3 సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించగలదు. సముద్రంలోని యుద్ధ నౌకలు, భూభాగంలోని వ్యూహాత్మక స్థావరాలపై వేగవంతమైన దాడుల కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కోల్డ్వార్ ముగిసి మూడు దశాబ్దాలకు పైగా గడిచినా అమెరికా, రష్యా ఇప్పటికీ ఈ పాత తరం బాంబర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కొత్త వ్యూహాత్మక బాంబర్ల అభివృద్ధికి అయ్యే భారీ వ్యయం!. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అణు జలాంతర్గాములు, హైపర్సోనిక్ ఆయుధాల అభివృద్ధితో బాంబర్ల ప్రాధాన్యం కొంత తగ్గినప్పటికీ.. అణు నిరోధక వ్యూహంలో వీటి పాత్ర మాత్రం ఇప్పటికీ కీలకంగానే ఉంది.అమెరికా ప్రస్తుతం అత్యాధునిక బీ-21 రైడర్ స్టెల్త్ బాంబర్ను అభివృద్ధి చేస్తుండగా.. రష్యా పాక్-డీఏ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. అయితే సాంకేతిక సవాళ్లు, భారీ వ్యయభారం, పరీక్షల్లో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తిస్థాయిలో సేవల్లోకి రాలేదు. ఫలితంగా 1950ల, 1980ల కాలానికి చెందిన ఈ గగన దిగ్గజాలే ఆధునికీకరణలతో ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అణు శక్తికి ప్రతీకగా నిలిచిన బీ-52, రష్యా వ్యూహాత్మక బలానికి చిహ్నంగా భావించే టీయూ-22ఎం3 బాంబర్లు ఒకే రోజు ప్రమాదాలకు గురికావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోల్డ్ వార్ ప్రత్యర్థులైన రెండు దేశాలకు ఒకేసారి ఎదురైన ఈ అరుదైన ఎదురుదెబ్బ.. ప్రపంచ సైనిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. -
డీల్పై ట్రంప్ ఒక మాట.. ఇరాన్ మరో మాట!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. తమ మధ్య ఓ కీలక అవగాహన ఒప్పందం కుదిరినట్టు అమెరికా–ఇరాన్లు ప్రకటించాయి. అయితే ఈ ఒప్పందంలో నిజంగా ఏముంది? ప్రచారంలో వినిపిస్తున్నట్లుగా 14 ప్రతిపాదనల ప్యాకేజీ నిజమేనా? అణు కార్యక్రమంపై ఇరాన్ ఎలాంటి హామీలు ఇచ్చింది? ఈ చర్చల్లో అమెరికా ఎక్కడైనా వెనక్కి తగ్గిందా? ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల అభివృద్ధికి శాశ్వతంగా స్వస్తి చెప్పిందా?.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలతో అంతర్జాతీయ సమాజంలో మరింత గందరగోళం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలను కలిగి ఉండబోదని అంగీకరించింది. ఈ మేరకు స్పష్టమైన హామీని కూడా ఇచ్చింది’’ అని అన్నారాయన. అలాగే గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఆర్థిక ప్యాకేజీ ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. ‘‘అమెరికా ఇరాన్కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందన్న వార్త పూర్తిగా అబద్ధం" అని స్పష్టం చేశారాయన. అయితే ఇరాన్ మాత్రం పాత పాటే పాడింది. అవును.. మేం అణ్వాస్త్రాలు వదిలేశాం అని చెప్పడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పందిస్తూ.. ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని "ఒక ముఖ్యమైన ముందడుగు"గా అభివర్ణించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా ‘‘చర్చలు ముందుకు వెళ్తున్నాయి.. కీలక పురోగతి చోటు చేసుకుంది.. ముసాయిదా ఒప్పందాలు ఉన్నాయి’’అని చెబుతున్నారే తప్ప.. తుది నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా చెప్పడం లేదు. దీంతో అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరింది పూర్తి శాంతి ఒప్పందం కాదు. ఇరు దేశాలు ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం (MoU)పై అంగీకరించాయి. అదీ నెలల తరబడి జరిగిన చర్చల తర్వాతే. అయితే ఖతార్ సమక్షంలో ఎంవోయూపై డిజిటల్ సంతకాలు కూడా పూర్తయ్యాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. తుది సంతకాల కార్యక్రమం మాత్రం ఈ వారం(19న) జెనీవా( స్విట్జర్లాండ్)లో జరగనుంది. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది. ట్రంప్ హాజరుపై స్పష్టత లేదు.ఈ అవగాహన ఒప్పందంలో అత్యంత కీలక అంశం హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు ఊరట లభించనుంది. ఇప్పటికే చమురు ధరలపై ఒత్తిడి తగ్గినట్లు అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు చెబుతున్నాయి.అలాగే ఇరాన్పై విధించిన కొన్ని ఆంక్షల సడలింపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇరాన్కు నేరుగా నగదు బదిలీ చేయబోమని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించడం వంటి షరతులు నెరవేర్చిన తర్వాతే ఆంక్షల సడలింపు అమల్లోకి వస్తుందని ఆయన చెబుతున్నారు.ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ "ఇరాన్ అణ్వస్త్రాలు కలిగి ఉండదు" అని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాల ప్రకారం అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుత అవగాహన ఒప్పందం కేవలం చర్చలకు మార్గం సుగమం చేసే ఫ్రేమ్వర్క్ మాత్రమేనని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ఆంక్షల పూర్తి ఎత్తివేత వంటి అంశాలపై తదుపరి చర్చలు జరగాల్సి ఉంది.లేటెస్ట్ అప్డేట్స్:* అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది.* జెనీవాలో ఈ వారం తుది సంతకాల కార్యక్రమం జరగనుంది.* హర్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంది. * ఇరాన్కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నారన్న వార్తలను ట్రంప్ ఖండించారు. * అణు కార్యక్రమంపై తుది ఒప్పందం ఇంకా పెండింగ్లోనే ఉంది. ట్రంప్ దీనిని చారిత్రాత్మక విజయంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. అసలు పరీక్ష ఇప్పుడు మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల దిశగా అడుగులు ఆపుతుందా? అమెరికా వాగ్దానం చేసిన ఆంక్షల సడలింపు ఎంతవరకు అమలవుతుంది? జెనీవా సమావేశం తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది. -
అమెరికాలో కూలిన విమానం.. 8 మంది దుర్మరణం
అమెరికా కాలిఫోర్నియా స్టేట్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. స్థానికకాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 11గం.20ని. సమయంలో ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. అయితే కాసేపటికే అది ప్రమాదానికి గురైంది. విమానం కుప్పకూలిన వెంటనే అగ్నికి ఆహుతి కావడంతో అందులో సిబ్బంది అగ్నికి ఆహుతి అయ్యారు. సాధారణ పరీక్షా మిషన్లో భాగంగా బీ-52 బాంబర్ బయలుదేరిందని.. ఆ వెంటనే ఈ ఘోరం జరిగిందని ఎయిర్ఫోర్స్ అధికారులు ప్రకటించారు. ప్రమాద స్థలానికి అత్యవసర సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం ఎయిర్ బేస్ను తాత్కాలికంగా మూసివేసి, అక్కడికి వచ్చే ఇతర విమానాలను మళ్లించారు.ఇఇలా ఉంటే.. 1954లో అమెరికా ఆర్మీలో అడుగు పెట్టిన బీ-52 బాంబర్.. అమెరికా వైమానిక దళంలో అత్యంత కీలకమైన యుద్ధ విమానాల్లో ఒకటి. అణ్వస్త్రాలు సహా వివిధ రకాల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యంతో ఈ విమానం అనేక యుద్ధాల్లో సేవలందించింది. -
డీల్తో ఎగుమతులకు బూస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో దాదాపు నాలుగు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పెడుతూ, శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న అమెరికా–ఇరాన్ నిర్ణయంతో భారత్కి ఊరట లభించనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈసారైనా ఒప్పందం సజావుగా అమలైతే, పశ్చిమాసియాకి భారత్ ఎగుమతులు మళ్లీ పుంజుకునేందుకు ఊతం లభిస్తుందని ఎగుమతిదారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దిగుమతి బిల్లుల భారం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయని, రూపాయి స్థిరపడగలదని భావిస్తున్నారు. వెరసి వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని వారు తెలిపారు. జూన్ 19 స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ‘ దాదాపు 50 శాతం క్రూడాయిల్, సుమారు 70 శాతం వంట గ్యాస్, 90 శాతం ద్రవీకృత సహజ వాయువు దిగుమతుల కోసం పశ్చిమాసియాపై భారత్ ఆధారపడుతోంది. అక్కడ ఉద్రిక్తతలతో సరఫరా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో శాంతి ఒప్పందంతో భారత్కి తక్షణం ఆర్థికంగా ఊరట లభిస్తుంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటే, ఇంధన మార్కెట్లు స్థిరపడతాయి. చమురు..గ్యాస్ ధరలపై ఒత్తిడి తగ్గి రూపాయి బలపడవచ్చు. భారత్ వృద్ధి అవకాశాలు మెరుగుపడొచ్చు‘ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అనిశ్చితికి తెర.. శాంతి ఒప్పంద ప్రకటనతో అనిశ్చితి, ఆర్థిక మందగమనం, అనవసర సమస్యలకి తెర పడుతుందని టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ తెలిపారు. ఎగుమతులు ఎగియడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభించవచ్చన్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరా, ధరలు తిరిగి సాధారణ స్థాయికి తిరిగి రావొచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. హార్మూజ్ మూసివేత వల్ల నౌకలు ఆఫ్రికా చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనితో సముద్ర మార్గంలో రవాణా, నౌకల బీమా వ్యయాలు భారీగా పెరిగిపోవడంతో పాటు డెలివరీల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. హార్మూజ్ తెరుచుకుంటే నౌకల రాకపోకలకు కూడా వెసులుబాటు లభిస్తుందని నిపుణులు తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఆ దేశంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దానితో మార్చిలో భారత్ ఎగుమతులు 7 శాతం క్షీణించి అయిదు నెలల కనిష్ట స్థాయి 38.92 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. పశ్చిమాసియాకి ఏకంగా 58 శాతం తగ్గి 3.5 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు 52 శాతం పడిపోయాయి. ఇక ఇంధనాల సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చాలా కాలం తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లను ఇటీవల పాక్షికంగా పెంచినప్పటికీ, అంతర్జాతీయంగా ఎగిసిన స్థాయికి తగ్గట్లు పెంచకపోవడంతో ఆదాయ నష్టాలను చవిచూస్తున్నాయి. అవి పూర్తి ఆర్థిక సంవత్సరపు లాభాలకు సరిసమానంగా ఒక్క త్రైమాసికంలోనే నష్టాలు నమోదు చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకుంటే సరఫరా మెరుగుపడి, ముడి చమురు ధరలు నెమ్మదించవచ్చు. -
డీల్ ఓకే.. ఎట్టకేలకు శాంతి వీచికలు
ఇస్లామాబాద్/వాషింగ్టన్/టెల్ అవీవ్: దాదాపు 107 రోజులుగా హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో అమెరికా, ఇరాన్ల మధ్య సంతకాల కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు పాకిస్తాన్ సోమవారం ప్రకటించింది. శాంతి ఒప్పందంలో ఏఏ వివరాలను పొందుపర్చబోతున్నారనే సమాచారం ఇంకా వెల్లడికాలేదు. ప్రపంచ మార్కెట్లపై యుద్ధ్దకుంపట్లను రాజేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అమెరికా కాలమానంప్రకారం ఆదివారం రాత్రి ఇరాన్తో డీల్పై ప్రకటన చేశారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్సోషల్లో ఒక పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరింది. అందరికీ అభినందనలు. ఇకపై ఎలాంటి సుంకాల్లేకుండా హార్మూజ్ తెరుచుకోబోతుంది. హార్మూజ్ వద్ద అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేస్తున్నాం. ప్రపంచ నౌకలకు ఇదే నా పిలుపు. ఇంజిన్లు స్టార్ట్ చేయండి. చమురు సరఫరాను సముద్రమార్గంలో ఉరకలెత్తించండి. గొప్పదైన ఈ ఒప్పందంలో పశ్చిమాసియాలో శాంతి, భద్రత నెలకొంటాయి. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవాలని గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు ప్రయత్నించి విఫలమయ్యారు. తొలిసారిగా నేను శాంతి పవనాలు వీచేలా చేశా. శుక్రవారం సంతకాలు పూర్తయ్యాక హార్మూజ్ తెరుచుకుంటుంది. సముద్ర మందుపాతరల తొలగింపు ప్రక్రియ మొదలవుతుంది. హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చమురు నౌకల రాకపోకలు ఆరంభమవుతాయి’’అనిట్రంప్ తెలిపారు. 60 రోజుల సంప్రదింపుల వ్యవధి! ‘‘ఇరు వైపుల ప్రతినిధి బృందాలు వచ్చాక శుక్రవారం స్విట్జర్లాండ్లో సంతకాలు చేస్తారు. అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాక 60 రోజులపాటు సంప్రదింపుల వ్యవధి ఉంటుంది. యురేనియంను అత్యంత నాణ్యత స్థాయికి శుద్ధిచేయడం, ఇప్పటికే శుద్ధచేసిన యురేనియంను నిర్వీర్యంచేయడం, ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు, రెండో దశ ఆంక్షలు, అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతపై చర్చలు జరుగుతాయి’’అని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాసిం ఘరిబాబాడీ వెల్లడించారు. మరోవైపు ఒప్పందానికి అంగీకరించిన అమెరికాకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. మధ్యవర్తిత్వం వహించిన ఖతర్, తుర్కియే, సౌదీ అరేబియాలను షెహబాజ్ అభినందించారు. దాడి చేస్తే ప్రతిదాడి: ఇజ్రాయెల్ ఓవైపు శాంతి ఒప్పందానికి అమెరికా ముందడుగేస్తుంటే మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం అదే యుద్ధధోరణిని మళ్లీ కనబర్చింది. ‘‘ఇరాన్ గనక మళ్లీ మాపై దాడులకు దిగితే మేం యుద్ధాన్ని కొనసాగిస్తాం. ఇప్పటిదాకా గాజా స్ట్రిప్, సిరియా, లెబనాన్లో మేం ఆక్రమించుకున్న సరిహద్దు ప్రదేశాలకు ఖాళీచేసేదే లేదు’’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. శాంతి ఒప్పందంలో లెబనాన్నూ చేర్చాలని ఓవైపు ఇరాన్ పట్టుబడుతుంటే అదే లెబనాన్పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ సోమవారం సైతం స్పష్టంచేయడంతో శాంతి ఒప్పందం ఏ మేరకు సవ్యంగా అమలవుతుందనే కొత్త అనుమానాలు బయల్దేరాయి. గత రెండున్నరేళ్లలో సిరియా, లెబనాన్, గాజా స్ట్రిప్లో మొత్తంగా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇది దాదాపు అమెరికాలోని న్యూయార్క్ సిటీ అంత ఉంటుంది. ‘‘కొత్త ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలుచేయాల్సిన బాధ్యత అమెరికాదే. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను అమెరికా నిలువరించాల్సిందే’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టంచేశారు. ఖమేనీ మృతి నుంచి ఒప్పందం దాకా.. వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఇరాన్తో మూడ్రోజుల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించడంతో ఇన్నాళ్లూ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్పై అమెరికా కాల్పులు మొదలెట్టి తాజాగా చర్చలు మొదలెట్టిన దాకా జరిగిన క్రమంలో కీలక పరిణామాలు కొన్ని... ఫిబ్రవరి 28: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు. దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా సయీద్ అలీ ఖమేనీ సహా పలువురు టాప్ కమాండర్ల దుర్మరణం మార్చి 1: దూరంగా ఉన్న అమెరికా భూభాగాలకు బదులు అమెరికా స్థావరాలున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఇరాన్ దాడులు మార్చి 2: పొరపాటున అమెరికా యుద్ధవిమానాలను నేలకూల్చిన కువైట్ మార్చి 4: ఇరాన్ యుద్దనౌక ఐఆర్ఎస్ డేనాను హిందూమహాసముద్రంలో టోర్పెడోతో దాడిచేసి ముంచేసిన అమెరికా మార్చి 8: సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి. శకలాలు పడి భారతీయుడు మృతి మార్చి 9: తండ్రి స్థానంలో ఇరాన్ సుప్రీంనేతగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ మార్చి 17: అమెరికా దాడిలో ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ అంతం మార్చి 18: సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై అమెరికా భీకర దాడులు మార్చి 21: చమురు సంక్షోభం పెరగడంతో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడిచమురు విక్రయానికి అమెరికా తాత్కాలిక అనుమతి మార్చి 27: ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా బాంబర్ విమానాల దాడి మార్చి 31: ఐదు అంశాలతో శాంతి ప్రతిపాదనలను తెచ్చిన చైనా, పాకిస్తాన్ ఏప్రిల్ 3: తొలిసారిగా అమెరికా యుద్ధవిమానాన్ని కూల్చేసిన ఇరాన్ ఏప్రిల్ 8: రెండు వారాల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఓకే చెప్పిన అమెరికా, ఇరాన్ ఏప్రిల్ 11: పాక్ వేదికగా తొలిసారిగా చర్చలకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏప్రిల్ 12: చర్చలు విఫలమైనట్లు అమెరికా ప్రకటనఏప్రిల్ 15: ఇరాన్లో పర్యటించిన అగ్రనాయకత్వంతో చర్చించిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఏప్రిల్17: హార్మూజ్ను తెరుస్తున్నామన్న ఇరాన్. తాము దిగ్బంధించామన్న అమెరికా ఏప్రిల్ 20: ఇరాన్ జెండాతో రాకపోకలు సాగించే నౌకలను అడ్డుకోవడం మొదలెట్టిన అమెరికా ఏప్రిల్ 22: హార్మూజ్లో మూడు నౌకలపై దాడిచేసి రెండింటిని స్వా«దీనంచేసుకున్న ఇరాన్ ఏప్రిల్ 24: తమ ప్రతిపాదనలు తెలియజేసేందుకు పాక్లో పర్యటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబాŠబ్స్ అరాఘ్చీ ఏప్రిల్ 27: అమెరికా దిగ్బంధాన్ని ఎత్తేస్తే హార్మూజ్ను తెరుస్తామని తొలిసారిగా ప్రకటించిన ఇరాన్ మే 6: విదేశీ నౌకలు హార్మూజ్ను సురక్షితంగా దాటేందుకు ఇకపై అమెరికా యుద్దనౌకలు రక్షణగా రాబోవని ప్రకటించిన ట్రంప్ మే 13: ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి మే 18: చర్చలు కీలకదశలో ఉండటంతో దాడులు తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటన జూన్ 1: తమ ఎంక్యూ–1 ప్రిడేటర్ డ్రోన్ను కూల్చినందుకు ఇరాన్పై భీకర దాడులు మొదలెట్టినట్లు ట్రంప్ వెల్లడి జూన్ 3: కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడిలో భారతీయుడి దుర్మరణం జూన్ 6: బహ్రెయిన్, కువైట్లపై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించిన ఇరాన్ జూన్ 7: చర్చల ప్రక్రియలో కదలిక తెచ్చిన పాక్ జూన్ 8: కాల్పుల విరమణకు తూట్లుపొడుస్తూ పరస్పర దాడులకు దిగిన ఇజ్రాయెల్, ఇరాన్ జూన్ 9: అమెరికా ఆర్మీ హెలికాప్టర్ను కూల్చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటానన్న ట్రంప్ జూన్ 10: పలావూ జెండాతో ఉన్న నౌకపై అమెరికా దాడిలో ముగ్గురు భారతీయుల దుర్మరణం జూన్ 15: కాల్పులకు ముగింపు పలుకుతూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటన ఒప్పందంలో ఏముంది ? మరో మూడ్రోజుల్లో ముసాయిదా ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు సంతకాలుచేసి తదుపరి సమగ్రమైన సంప్రదింపుల ప్రక్రియకు తెరలేపనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు ఈ ముసాయిదా ఒప్పందంలో ఏమేం అంశాలను పొందుపరిచారనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కువైంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సుంకాలు విధిస్తారా? అణ్వాయుధం తయారీ కోసం ఇప్పటికే అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధికి సాహసించిన ఇరాన్ను ఆ దిశగా మరో అడుగు ముందుకువేయకుండా అమెరికా షరతు విధించింది? అనే పలు సందేహాల నడుమ ఇరాన్ మీడియా ఈ ముసాయిదాలోని 14 అంశాలను సంపాదించిందని కథనాలు వెలువడ్డాయి. సైనిక, ఆర్థిక, అణు అంశాలతో ఈ ముసాయిదాను సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాల గురించి క్లుప్తంగా...1. అమెరికా, ఇరాన్ దశాబ్దాల శత్రుత్వాలకు ఇకనైనా ముగింపు పలకడం 2. ముడి చమురు సహా వాణిజ్య వస్తూత్పత్తుల సరఫరా కోసం నౌకల రాకపోకల నిమిత్తం హార్మూజ్ తెరవడం 3. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన ఆంక్షలు, అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేయడం 4. చర్చలు ఓవైపు జరుగుతుండగా ఒప్పందం తమకు అనుకూలంగా కుదిరేలా ఇరాన్పై ఒత్తిడి పెంచేలా ఆ దేశంపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించకపోవడం 5. ఈలోపు ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై తక్షణం ఆంక్షలు ఎత్తేయడం 6. విదేశీ బ్యాంకుల ఖాతాల్లో అమెరికా, మిత్రదేశాలు స్తంభింపజేసిన ఇరాన్ ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల డాలర్ల నిధులను విడుదలచేయడం 7. కనీసం 60 రోజులపాటు నిరాటంకంగా సవ్యంగా సంప్రదింపులు జరపడం 8. ఇరాన్ ఇకపై అణ్వస్త్ర సమీకరణ కోసం ప్రయత్నాలను విరమించుకోవడం 9. ఇరాన్ ఇకపై మిలటరీ గ్రేడ్లో నాణ్యత స్థాయికి యురేనియంను శుద్ధిచేయకుండా మిన్నకుండిపోవడం 10. అణు కేంద్రాల విస్తరణ ప్రతిపాదనలను ఇరాన్ పక్కనపడేయడం 11. అణుకేంద్రాలపై అమెరికా బాంబర్ దాడులతో భూస్థాపితమైన శుద్ధయురేనియం అప్పగింత లేదా నిర్వీర్యంచేయడంపై చర్చలు జరపడం 12. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందని స్పష్టమయ్యేలా ఇరాన్ సైనిక చర్యలను ఉపసంహరించుకోవడం 13. ఆర్థికపర ఆంక్షలను అమెరికా ఎత్తేయడంతోపాటు ఇరాన్ పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషిచేయడం 14. సమగ్రమైన తుది ఒప్పందం కోసం కృషిచేయడంతెరమీదకు మరికొన్ని అంశాలు! ఇవిగాక మరిన్ని ప్రతిపాదనలు ముసాయిదా ఒప్పందంలో ఉన్నాయని మీడియాలో వార్తలొచ్చాయి. ఇరాన్కు 300 బిలియన్ డాలర్లతో ఆర్థికాభివృద్ధి ప్యాకేజీని ట్రంప్ అందించడం, ఇరాన్లో అమెరికా సంస్థలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి ఇరాన్ పునరుజ్జీవనానికి పాటుపడటం, ఆర్థికసహకారం, రుణాలు అందివ్వడం, భవిష్యత్లో ఉద్రిక్తతలు తలెత్తకుండా తగు పరస్పర సహకార విభాగాలను ఏర్పాటుచేయడం, గ్లోబల్ మార్కెట్లతో ఇరాన్ను మరింతగా అనుసంధానం చేయడం వంటివీ ఇందులో ఉన్నాయని వార్తలొచ్చాయి. పరస్పర దాడులు ఆపేస్తే సరిపోదని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ‘‘ఇరాన్ యుద్ధంలో కీలకమైన నాలుగు అంశాలు దాగి ఉన్నాయి. చమురు సంక్షోభం భవిష్యత్లో తలెత్తకుండా సుంకాల్లేకుండా చమురు నౌకల రాకపోకలను శాశ్వతంచేయడం, దెబ్బతిన్న ఇరాన్ ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకునేలా పలు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందివ్వడం, అణ్వస్త్ర సామర్థ్యంలేకపోవడంతోనే తమపై అగ్రదేశాలు దాడులుచేస్తున్నాయనే భావన ఇరాన్లో లేకుండా చేయడం, తద్వారా ఇరాన్.. లెబనాన్(హెజ్»ొల్లా), యెమెన్(హూతీ), గాజా(హమాస్)లో పరోక్ష సైన్యాలను పెంచిపోషించకుండా అడ్డుకోవడం వంటివి చేయగలిగితేనే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి సుసాధ్యమవుతుంది’’అని నిపుణులు విశ్లేషించారు. తర్వాత ఏం జరగొచ్చు? ప్రతిపాదిత ముసాయిదా ఒప్పందం అమల్లోకి వచ్చాక తొలి 60 రోజులపాటు హార్మూజ్ తెరుచుకోవడంతో చమురు సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణిగే ఆస్కారముంది. అయితే ఈ 60 రోజుల్లో సమగ్ర శాంతి ఒప్పందం కుదిరితే అందరికీ లాభమే. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఏళ్ల తరబడి ఇరాన్పై అమెరికా సహా ఏ దేశమూ ఆంక్షలు విధించకుండా చూసుకోవడం, ఒప్పందాన్ని సమగ్రస్థాయిలో అమలుచేసే వ్యవస్థను కొలువుతీర్చడం, ఇరాన్ దొంగచాటుగా యురేనియంను శుద్ధిచేయకుండా అడ్డుకోవడం వంటివి కీలకంగా మారనున్నాయి. 14 అంశాలపై ఇరుదేశాలు ఉమ్మడిగా ఏకాభిప్రాయానికొస్తే చరిత్రాత్మక శాంతి ఒప్పందానికి ఈ 14 అంశాలే మూలస్తంభాలుగా నిలుస్తాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న లేదా మూడో ప్రపంచ దేశాలుగా పిలిచే దేశాల నుంచి భారీ స్థాయిలో వలసదారులను అనుమతిస్తే, అమెరికా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు.తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో స్పందిస్తూ.. మూడో ప్రపంచ దేశాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటే, చాలా త్వరగా మన దేశం కూడా మూడో ప్రపంచ దేశంలా మారిపోతుంది. దాన్ని ఆపడానికి మనమేమీ చేయలేమని పేర్కొన్నారు. అలాగే తన రాజకీయ నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA)ను ప్రస్తావించారు.కాగా, ట్రంప్ రాజకీయ ప్రయాణంలో వలసల నియంత్రణ, జాతీయ గుర్తింపు, సరిహద్దు భద్రత వంటి అంశాలు కీలక అజెండాలుగా కొనసాగుతున్నాయి. తాజా వ్యాఖ్యలు కూడా అదే దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఇటీవల హెచ్-1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధించే తన ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు రద్దు చేయడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఆ ఫీజు విధించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.దీనిపై స్పందించిన ట్రంప్, ఫెడరల్ న్యాయమూర్తులు మా ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్నది ఆశ్చర్యకరం. ఇది దేశానికి నష్టం చేస్తోందని విమర్శించారు.మరోవైపు, జన్మహక్కు పౌరసత్వం (Birthright Citizenship) అంశంపై కూడా ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమెరికాలో ప్రసవం ద్వారా పిల్లలకు పౌరసత్వం లభించే విధానాన్ని కొందరు వలసదారులు దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలకు ఆయన మద్దతు పలికారు.ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికాలో వలస విధానాలపై మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. ట్రంప్మద్దతుదారులు దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల కోసమే ఆయన మాట్లాడుతున్నారని చెబుతుండగా, విమర్శకులు మాత్రం ఈ వ్యాఖ్యలను వలసదారులపై ప్రతికూల అభిప్రాయాలను ప్రోత్సహించేవిగా అభివర్ణిస్తున్నారు. -
యుద్ధానికి స్వస్తి?
ప్రపంచాన్ని పలుమార్లు అంతిమ ఘడియల అంచులవరకూ తీసుకెళ్లిన పశ్చిమాసియా యుద్ధం పరిసమాప్తమైంది. ఘర్షణలు నిలిచిపోయాయని ఈ 107 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే స్వయంగా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి గనుక, యుద్ధం ఆగిందంటే ఎవరూ నమ్మలేదు. చివరకు ఇరాన్ ధ్రువీకరించాకే ట్రంప్ మాటను అందరూ విశ్వసించారు. దీన్ని భగ్నం చేసితీరాలన్న కాంక్షతో ఇజ్రాయెల్ చెలరేగిపోతోంది. లెబనాన్పై క్షిపణి దాడులు చేస్తోంది. హార్మూజ్ జలసంధి దగ్గర ప్రస్తుతం 800 నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లోని 20,000 మంది సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంతక్రితం మాటెలా వున్నా ట్రంప్ రెండో ఏలుబడిలో అమెరికా, ఇజ్రాయెల్ అవిభక్త కవలల్లా ప్రవర్తించటం మొదలెట్టాయి. సకల వ్యవస్థల్లో ఇజ్రాయెల్ చాపకింద నీరులా విస్తరిస్తున్న తీరుపై అమెరికా ఉన్నతాధికార యంత్రాంగంలోనే భయాందోళనలు అలుముకున్నాయి. నిరుడు సెప్టెంబర్లో ట్రంప్ వీరాభిమాని, మాగా ఉద్యమ సారథుల్లో ఒకరైన చార్లీ కిర్క్ను దుండగుడు కాల్చిచంపిన ఉదంతంలో ఇజ్రాయెల్ హస్తముందని ఆ ఉద్యమకారులే ఆరోపించారు. అతను ఇరాన్పై యుద్ధానికి బద్ధవ్యతిరేకి. ఒబామా హయాంలో ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందాన్ని గత ఏలుబడిలోనే రద్దుచేసిన ట్రంప్... దాన్ని తలదన్నేలా కొత్త ఒప్పందం సాధించితీరతానని శపథం చేశారు. తాజా ఒప్పందం వివరాలు తెలియాల్సేవున్నా, ఇరు దేశాలమధ్యా కుదిరిందంటున్న అవగాహన గమనిస్తే ఆ శపథం నీరుగారినట్టే. తననూ, పార్టీనీ, దేశాన్నీ అధః పాతాళానికి నెట్టేసిన ఈ యుద్ధం నుంచి బయటపడాలని మొదటి వారానికే ట్రంప్ తహతహలాడారు. కానీ దోవ దొరకలేదు. దీనికి ప్రపంచం భారీ మూల్యం చెల్లించింది. క్షిపణి దాడుల్లో దాదాపు 4,000 మంది ఇరాన్ పౌరులు చనిపోగా, అమెరికావైపు 13 మంది సైనికులు మరణించారు. ఇరాన్లో 240 వైద్య ఆరోగ్య కేంద్రాలు ధ్వంసంకాగా, 20 పాఠశాలలు శిథిలాలయ్యాయి. ప్రపంచ పురావస్తు సంపదగా గుర్తించిన అయిదు ప్రాంతాలు, 54 మ్యూజియంలు నాశనమయ్యాయి. చివరకు హార్మూజ్లో భారత్ వస్తున్న నౌకపై దాడి జరిగి మన నావికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విమాన ఇంధన ధరలు రెట్టింపు కావటంతో పలు సంస్థలు వేలాది విమాన సర్వీసుల్ని రద్దు చేశాయి. చమురు ధరలు పైపైకి ఎగబాకి ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ యుద్ధంతో మూడున్నర కోట్లమంది పేదరికంలోకి జారుకున్నారని ఏప్రిల్ నెలాఖరున ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. అమెరికా యుద్ధ వ్యయం లక్ష కోట్ల డాలర్లు ఉండొచ్చని హార్వర్డ్ ఆర్థికవేత్త లిండా బిల్మ్స్ అంచనా. విదేశీ యుద్ధాల్లో అమెరికా ప్రమేయం ఉండబోదని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన ట్రంప్... దేశాన్ని యుద్ధం ఊబిలోకి నెట్టారు. యుద్ధం మొదలెడుతూనే ఆయతుల్లా అలీ ఖమేనీతోసహా పలువురు అగ్రనాయకుల్ని హతమార్చి అమెరికా చాలా నష్టపోయింది. ఉన్నంతలో మధ్యేవాద దృక్పథంతో ఉండే ఆ నాయకత్వంతో పోలిస్తే ఇప్పుడున్నవారంతా అత్యంత కఠినంగా వ్యవహరించే రకం. అందుకే ‘బేషరతు లొంగుబాటు’ తప్ప దేనికీ అంగీకరించబోనని మొదట్లో బీరాలు పలికిన ట్రంప్, చివరకు రాజీకోసం కాళ్లావేళ్లా పడాల్సివచ్చింది. ఇంతకూ తనదగ్గరున్న శుద్ధి చేసిన యురేనియంను ఇవ్వ డానికీ, బాలిస్టిక్ క్షిపణుల తయారీని ఆపటానికీ, హార్మూజ్ వద్ద యథాపూర్వస్థితి పునరుద్ధరణకూ ఇరాన్ అంగీకరించిందా? మరో నాలుగు రోజుల్లో ఆ సంగతి తేలాక ట్రంప్ పరువు మరింత దిగజారుతుంది. వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికలనాటికి ఆర్థికవ్యవస్థ ఎంతో కొంత మెరుగు పడితేనే రిపబ్లికన్ పార్టీకి ఓట్లు రాలతాయనీ, లేదంటే అమెరికన్ కాంగ్రెస్పై పట్టు కోల్పోవటం ఖాయమనీ ట్రంప్ బెంగపడుతున్నారు. కానీ ఇంతవరకూ వెల్లడైన వివరా లకే అన్ని వర్గాలూ ఆయన్ను దుయ్యబడుతున్నాయి. ఇరాన్ ముందు సాగిలపడ్డారని విమర్శిస్తున్నాయి. ఆర్థికంగా, సైనికంగా నష్టపోయినా తనకున్న అరకొర బలంతోనే చివరివరకూ దృఢంగా పోరాడి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. ఏదేమైనా యుద్ధంలో ఆయుధ సంపత్తి కాదు... సంకల్ప బలమే విజేతను నిర్ణయిస్తుందన్న పురాతన చైనా యుద్ధ వీరుడు సన్ జూ మాట మరోమారు రుజువైంది. -
అమెరికా–ఇరాన్ ఒప్పందంపై స్పందించిన మోదీ
పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన కుదిరింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటిస్తూ.. శాంతి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ పరిణామాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పశ్చిమాసియాలో జరిగిన ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిందని, అనేక దేశాల్లో ప్రాణనష్టం కూడా జరిగిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడమే కాకుండా ప్రపంచ వాణిజ్య మార్గాలకు ఊరట లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. “పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణను ముగించేందుకు అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను నేను స్వాగతిస్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అంతరాయాలను కలిగించింది, అనేక దేశాల్లో ప్రాణనష్టానికి కారణమైంది. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించబడుతుంది. కీలక సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం సజావుగా కొనసాగుతుంది. ఈ అవగాహన అమలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా వాణిజ్య నౌకా మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణాను నిర్ధారిస్తుందని మేము ఆశిస్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. మిగిలిన అంశాలపై.. అమెరికా–ఇరాన్ మధ్య జరిగే చర్చలు స్థిరమైన, దీర్ఘకాలిక ఒప్పందానికి దారితీయాలని కూడా మోదీ ఆకాంక్షించారు.I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries. India hopes that the implementation of this understanding will…— Narendra Modi (@narendramodi) June 15, 2026ప్రస్తుతం మోదీ స్లోవేకియా పర్యటనలో ఉన్నారు. 1993 తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని ఆయనే కావడం గమనార్హం. ఫ్రాన్స్ నుంచి అక్కడికి వెళ్లిన ఆయనకు.. వందేమాతరంతో ఘన స్వాగతం లభించింది.ఇక.. ఇరాన్-అమెరికా డీల్కు సంబంధించి కొన్ని మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. ఈ ఫ్రేమ్వర్క్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. హర్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తిరిగి ప్రారంభం, తాత్కాలిక ఆంక్షల సడలింపు, అలాగే ఇరాన్కు నిలిచిపోయిన ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇందులో భాగమని తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గం కావడంతో.. ఈ ఒప్పందం భారత్ వంటి దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్కు, ఈ మార్గంలో ఉద్రిక్తతలు తగ్గితే ఇంధన ధరల ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ప్రమాదంలో ఇరాన్–అమెరికా డీల్?!
పశ్చిమాసియా సంక్షోభం మరో కీలక మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే ఇజ్రాయెల్ వైఖరి కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. భద్రతా విషయంలో తగ్గేదేలే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతుండడం.. లెబనాన్పై కొనసాగుతున్న భీకర దాడులు శాంతి చర్చలపై తీవ్ర ప్రభావం చూపొచ్చన్న ఆందోళనలు పెంచుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన శాంతి చర్చలు తుది దశకు చేరుకుంటున్న సమయంలోనే మిడిల్ఈస్ట్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డీల్కు ససేమీరా చెబుతూ.. లెబనాన్పై ఇజ్రాయెల్ చర్యలకు దిగింది. లెబనాన్ రాజధాని బీరూట్తో పాటు దక్షిణ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగినట్లు లెబనాన్ మీడియా తెలిపింది. కఫర్ టెబ్నిట్ ప్రాంతంలో కూడా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఆదివారం హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవి జనావాసాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని లెబనాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ జోక్యం కోరుతున్నారు. డీల్ కుదిరిందని ట్రంప్ ప్రకటించిన వేళ.. ఇజ్రాయెల్ వైపు నుంచి మరింత కఠిన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ‘‘ట్రంప్ నిర్ణయాలు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. లెబనాన్పై దాడులు కొనసాగిస్తాం. భద్రతా విషయంలో రాజీ పడేది లేదు’’ అని నెతన్యాహు చెప్పినట్లు అంతర్జాతీయా మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇక ట్రంప్ కుదిర్చిన ఒప్పందం తమను కట్టిపడేయదని ఇజ్రాయెల్ మంత్రి ఇత్మార్ బెన్ గ్విర్ వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. “భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు” అనే సందేశాన్ని ఇజ్రాయెల్ స్పష్టంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, ప్రధాని నెతన్యాహుతో కలిసి తాము స్పష్టమైన భద్రతా విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. లెబనాన్, సిరియా, గాజా ప్రాంతాల్లో భద్రతా జోన్లలో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఒత్తిడులున్నప్పటికీ తమ వైఖరిలో మార్పు ఉండదని, దేశ భద్రతే ప్రధాన ప్రాధాన్యమని ఆయన తేల్చిచెప్పారు. లెబనాన్ పరిణామాల కారణంగా ఇరాన్ దాడి చేస్తే తక్షణ ప్రతిచర్య తప్పదని ఆయన హెచ్చరించారు.🔴 Israel’s Defense Minister Israel Katz says that along with Prime Minister Benjamin Netanyahu, he is leading a clear policy that states that the Israeli army will remain in the security zones in Lebanon, Syria and Gaza🔴 Katz says that Israel opposes the Israeli army’s… pic.twitter.com/dYPahEDsTE— Al Arabiya English (@AlArabiya_Eng) June 15, 2026అంతకు ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, నెతన్యాహు చాలా కఠినమైన నాయకుడని, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు శాంతి చర్చలను క్లిష్టం చేశాయని వ్యాఖ్యానించారు. బీరూట్ ఘటనలు అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం పరిణామాలను చూస్తే, ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు లెబనాన్ కేంద్రంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ చర్యలు ఆ ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ గనుక ఈ దాడులకు ప్రతిస్పందిస్తే.. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు మళ్లీ ప్రమాదంలో పడిన పరిస్థితి నెలకొంది. -
ఫిఫా షాక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన ఒమర్ ఆర్టాన్
ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్కప్లో మ్యాచ్లను నిర్వహించాల్సిన ఓ రిఫరీకి ఊహించని అవమానం ఎదురైంది. సోమాలియాకు చెందిన ప్రముఖ రిఫరీ ఒమర్ అబ్దుల్కదీర్ ఆర్టాన్కు అమెరికాలోకి ప్రవేశం నిరాకరించారు. అందుకు సరైన కారణాలేవీ చూపించకపోవడమూ తీవ్ర దుమారం రేపింది. దీంతో.. ఆయన ప్రపంచకప్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఈ పరిస్థితుల్లోనూ ఆయనోక బంపర్ ఆఫర్ తగిలింది.. సోమాలియా రిఫరీ ఓమర్ ఆర్టాన్కు అమెరికాలో ఊహించని షాక్ ఎదురైంది. మియామీ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయన్ని.. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఆయన్ని ఆపేసి విచారణ పేరుతో 11 గంటలపాటు ప్రశ్నించారు. ఈ విచారణలో ఆయన ప్రయాణ ఉద్దేశ్యం, ప్రపంచకప్లో తన అధికారిక బాధ్యతలు, అలాగే సోమాలియాలోని రాజకీయ పరిస్థితులు, భద్రతా నేపథ్యం వంటి అంశాలపై అధికారులు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అంతేకాకుండా సోమాలియాలో క్రియాశీలంగా ఉన్న అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. విచారణ అనంతరం అధికారులు ఆయనను ‘అమెరికాలో ప్రవేశానికి అనర్హుడు’ (inadmissible)గా ప్రకటించి.. తిరిగి పంపించారు. జూన్ 6వ తేదీన ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు పాస్పోర్ట్ వెరిఫికేషన్, భద్రతా డేటా మ్యాచ్ లేదంటే వెట్టింగ్ ప్రాసెస్లో వచ్చిన సందేహాల ఆధారంగా తీసుకుంటారు. అయితే ఆర్టాన్ విషయంలో ఖచ్చితమైన కారణాన్ని అధికారులు బహిర్గతం చేయకపోవడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో తమ వైపు నుంచి వివరణ ఇస్తూ అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్.. ఇది సాధారణ భద్రతా తనిఖీల్లో భాగమేనని, అవసరమైన వెట్టింగ్ ప్రక్రియ కారణంగానే ప్రవేశం నిరాకరించాల్సి వచ్చిందని పేర్కొంది. అంతర్జాతీయ ఈవెంట్ అధికారుల విషయంలో కూడా భద్రతా ప్రోటోకాల్లు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది.ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్బాల్ వర్గాల్లో విమర్శలు కూడా వచ్చాయి. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్కు అధికారికంగా ఎంపికైన రిఫరీకి ఇలా ప్రవేశం నిరాకరించడం సరైన చర్య కాదని పలువురు అభిప్రాయపడ్డారు.అయితే.. వరల్డ్కప్లో అంపైరింగ్ చేసే అవకాశం కోల్పోయినా, ఒమర్ ఆర్టాన్ కెరీర్ అక్కడితో ఆగిపోలేదు. అమెరికాలో ప్రవేశం నిరాకరించబడటంతో ఆయనకు ప్రపంచకప్ మ్యాచ్లను ఆఫిషియేట్ చేసే అవకాశం దక్కలేదంతే. కానీ ఆయన అనుభవం, ప్రతిభను గుర్తించిన యూరప్ ఫుట్బాల్ సంస్థ యూఈఎఫ్ఏ ఆయనకు కీలక బాధ్యతను అప్పగించింది. దీని ప్రకారం ఆర్టాన్కు యూఈఎఫ్ఏ సూపర్ కప్ మ్యాచ్లో రిఫరీగా పనిచేసే అవకాశం లభించింది. ఈ మ్యాచ్ సాధారణంగా యూరప్లోని రెండు ప్రధాన క్లబ్ టోర్నమెంట్ల విజేతల మధ్య జరుగుతుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్లబ్ మ్యాచ్లలో ఒకటిగా పరిగణిస్తారు.34 ఏళ్ల ఆర్టాన్ ఆఫ్రికా ఖండంలో అత్యుత్తమ రిఫరీలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2025లో ఆఫ్రికా ఫుట్బాల్ సమాఖ్య(CAF కాఫ్) రిఫరీ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. అంతకుముందు ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్, కాఫ్ చాంపియన్స్ లీగ్ ఫైనల్ వంటి కీలక మ్యాచ్లకు ఆయన రిఫరీగా వ్యవహరించారు.ఫిఫా షాక్తో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆర్టాన్కు సోమాలియాలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో వందలాది అభిమానులు, అధికారులతో కలిసి ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టాన్ మాట్లాడుతూ వచ్చే వరల్డ్కప్లో తప్పకుండా పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. “దేవుని ఆశీస్సులతో తదుపరి టోర్నమెంట్లో ఉంటాను” అని ఆయన పేర్కొన్నారు. -
అమెరికా, ఇరాన్ ఒప్పందం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో జోష్
-
19న జెనీవాకు ట్రంప్ వస్తారా? జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఉత్కంఠ!
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం ఖరారైనప్పటికీ, ఇప్పుడు ట్రంప్ ఎటువంటి మెలిక పెడతారో, చివరి నిముషంలో ఏం చేస్తారో అనే సందేహం ప్రపంచవ్యాప్తంగా పలువురి మదిలో మెదులుతోంది. అలాగే ఆయన జనీవా రాకపై సస్పెన్స్ నెలకొంది. మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచే ఈ కీలక ఒప్పందంపై వచ్చే జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవాలో సంతకాలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ట్రంప్ స్వయంగా హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ ఒప్పందాన్ని తన ప్రభుత్వ దౌత్య విజయంగా భావిస్తున్నప్పటికీ, ఆయన నేరుగా వేదికపైకి వస్తారా అనే విషయంలో ట్రంప్ వైఖరి ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు.ఈ సస్పెన్స్కు మరింత బలాన్ని చేకూరుస్తూ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాము ఇంకా దీనికి సంబంధించిన లాజిస్టిక్స్ వివరాలను పరిశీలిస్తున్నామని, తాను కచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరవుతానని చెబుతూనే, అధ్యక్షుడు ట్రంప్ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమెరికా ప్రజలకు దక్కిన విజయమని, దీనివల్ల దీర్ఘకాలంలో ఇంధన ధరలు భారీగా తగ్గి, మిడిల్ ఈస్ట్లో కొత్త శకానికి నాంది పడుతుందని వాన్స్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ రాకపై తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం దౌత్య వర్గాలలో చర్చనీయాంశమైంది.మరోవైపు, ఇరాన్ సైతం జూన్ 19న ఒప్పందం జరగనుందనే విషయాన్ని ధృవీకరిస్తూనే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంతకాల కార్యక్రమాన్ని వర్చువల్ (రిమోట్) పద్ధతిలో నిర్వహించే అవకాశం కూడా ఉందని గతవారమే స్పష్టం చేసింది. టెహ్రాన్ తరఫున ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్-బాగర్ గాలిబాఫ్ లేదా విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీలలో ఒకరు హాజరయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ వైపు నుంచి రిమోట్ సైనింగ్ ఆప్షన్ తెరపైకి రావడం కూడా ట్రంప్ స్వయంగా జెనీవా రావడంపై సస్పెన్స్ను మరింత పెంచేలా చేసింది.అన్నింటికంటే ముఖ్యంగా, ట్రంప్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఇరాన్ అణు కార్యక్రమంపై ఈ ఒప్పందంలో పెద్దగా స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇరాన్ తన యురేనియం సంపదను అప్పగించాలని ట్రంప్ డిమాండ్ చేస్తుండగా, తమ అణు కార్యక్రమం కేవలం పౌర అవసరాల కోసమేనని ఇరాన్ వాదిస్తోంది. ఈ వివాదాస్పద అణు సమస్య అలాగే ఉండిపోవడం, దీనికి తోడు హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనాన్ని తొలగించడం, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను పునరుద్ధరించడంపై వాషింగ్టన్ వైఖరిని పరిశీలించేందుకు ఇరాన్ 60 రోజుల డెడ్లైన్ విధించడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యూహాత్మక ఉత్కంఠల నడుమ, ఒప్పందాన్ని ఖరారు చేసిన ట్రంప్ జూన్ 19న జెనీవా వేదికపై ప్రత్యక్షంగా కనిపిస్తారా లేదా అనేదే ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. -
‘మేము ఆడేందుకు వచ్చాం.. ట్రంప్తో మాకు అనవసరం’
అమెరికా, ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఫిఫా ప్రపంచకప్కు కూడా పాకిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల వీసాల విషయంలో అనిశ్చితి, జట్టు అధికారుల్లో కొందరికీ ఎంట్రీ నిరాకరించడం, ఇరాన్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను అమెరికా రద్దు చేయడం, అమెరికాలో ఏర్పాటు చేసుకున్న తమ బేస్ క్యాంప్ను కూడా అరిజోనాలో కాకుండా మెక్సికోలోని టిజువానాకు తరలించుకోవడం చూసి అసలు ఇరాన్ ఫిఫా ప్రపంచకప్ ఆడుతుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది. కానీ వాటన్నింటికీ తెర దించుతూ ఇరాన్ ఫుట్బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్ ఆడేందుకు అమెరికాలో ల్యాండ్ అయింది. ఇవాళ రాత్రి లాస్ ఏంజిల్స్ వేదికగా న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తున్న అమెరికా యుద్ధంలో ఉండడం, అదే యుద్ధంలో ఉన్న ఇరాన్కు ఆతిథ్యం ఇవ్వనుండడం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. ఇక అమెరికాలో అడుగుపెట్టిన ఇరాన్ ఫుట్బాల్ జట్టు మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇరాన్ ఫుట్బాల్ కోచ్ అమీర్ ఘలేనోయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మేము ఇక్కడికి మ్యాచ్లు ఆడేందుకు వచ్చాం. మా చుట్టూ జరుగుతున్న హడావిడి, ఇతర విషయాల గురించి పట్టించుకోము. ట్రంప్తో మాకు అనవసరం. ఆ దేశంతో చర్చలు, ఒప్పందాలు అనేవి రాజకీ అంశాలు.ఇప్పుడు మా దృష్టంతా ఫిఫా ప్రపంచకప్పైనే ఉంది. సహజంగానే ప్రతీ జట్టుకు వారి దేశంలో అనేక సమస్యలు ఉంటాయి. అంతేకాదు అవి ఆటకు సంబంధం లేకుండా ఉంటాయి. అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ నెలకొని ఉండొచ్చు. కానీ అవి ఆటతో ముడిపెట్టలేం. మేము రాజకీయ వ్యక్తులం కాదు.. ఫుట్బాల్ ఆటగాళ్లం.' అని చెప్పుకొచ్చాడు. ఇక ఫిఫా ప్రపంచకప్లో ఇరాన్ ఎన్నడూ నాకౌట్ రౌండ్కు చేరలేదు. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్కు న్యూజిలాండ్, బెల్జియం, ఈజిప్ట్ రూపంలో గట్టి ప్రత్యర్థులే ఉన్నాయి. అయితే ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అమెరికా తమపై దాడులు చేస్తున్న కారణంగా తొలుత ఫిఫా ప్రపంచకప్ ఆడబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఆ తర్వాత మనసు మార్చుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తమ దేశానికి వస్తే ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే తాజాగా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందని రెండు దేశాలు అధికారిక ప్రకటన విడుదల చేయడంతో కొంత సానుకూలాంశం. ఇరాన్ స్వేచ్ఛగా మ్యాచ్లు ఆడేందుకు ఇది అవకాశం కల్పించనుంది.ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. చదవండి: ‘మ్యాచ్ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’ -
యుద్ధానికి బ్రేక్.. అసలు ముప్పు పొంచి ఉందా?
గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందం (Framework Agreement)తో యుద్ధ భయాలు కొంత మేర తగ్గాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లు, మధ్యప్రాచ్య భద్రతపై నెలకొన్న అనిశ్చితికి ఇది ఉపశమనం కలిగించినప్పటికీ, సంక్షోభం పూర్తిగా ముగిసిందని చెప్పేందుకు ఇంకా సమయం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైన ఘర్షణలతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్పై అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అధికారుల ప్రకారం, ఈ ముసాయిదా ఒప్పందంలో ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలకు సడలింపులు, విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన సుమారు 25 బిలియన్ డాలర్ల ఇరానియన్ ఆస్తుల విడుదల, కొత్త ఆంక్షలు విధించకుండా ఉండటం వంటి అంశాలు ఉన్నాయి. ప్రతిగా ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని, తన అణు కార్యక్రమ విస్తరణను తాత్కాలికంగా నిలిపివేస్తామని అంగీకరించినట్లు సమాచారం.డాలర్ బలహీనం.. అయితే అసలు సమస్య ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు. అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ వేర్వేరు వ్యాఖ్యానాలు చేస్తుండటంతో ఒప్పందం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలోని కొన్ని అంశాలపై ఇరాన్, అమెరికా అధికారులు భిన్న ప్రకటనలు చేయడం కూడా అనిశ్చితిని పెంచుతోంది. ముఖ్యంగా శుద్ది చేసిన యురేనియం నిల్వలు, ఆంక్షల ఎత్తివేత విధానం, ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. ఈ ఒప్పందం వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు ధరలు నాలుగు శాతానికి పైగా పడిపోగా, ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అదే సమయంలో డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలు పెరిగాయి. యుద్ధ భయాలు తగ్గడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి కొంత మేర తగ్గిందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ముప్పు తప్పలేదు.. కాగా, ఒప్పందం కుదిరిందనే కారణంతో ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని మూసివేసే సామర్థ్యం ఇరాన్ వద్ద ఇప్పటికీ ఉంది. అలాగే లెబనాన్, ఇజ్రాయెల్కు సంబంధించిన ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల కార్యకలాపాలు, అణు చర్చల భవిష్యత్తు వంటి అంశాలు మళ్లీ పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కుదిరింది కేవలం ఒక ప్రాథమిక అవగాహన మాత్రమే. తుది ఒప్పందం కోసం రాబోయే 60 రోజుల్లో మరిన్ని చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత, ప్రాంతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ఇజ్రాయెల్ అంశం.. ఇజ్రాయెల్ అంశం కూడా అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ చాలా కాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. తాజా ఒప్పందం ఇరాన్కు మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తుందని భావిస్తే, ఇజ్రాయెల్ నుంచి రాజకీయ, దౌత్య లేదా భద్రతాపరమైన ప్రతిస్పందనలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు కొంతవరకు చెదిరినప్పటికీ, మధ్యప్రాచ్య సంక్షోభానికి పూర్తిస్థాయి ముగింపు లభించిందని చెప్పడానికి ఇంకా సమయం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమెరికా–ఇరాన్ తదుపరి అడుగుల వైపే ఆసక్తిగా ఎదురుచూస్తోంది.అలాగే, ప్రాంతీయ భద్రత కూడా మరో ప్రధాన సమస్యగా ఉంది. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్ మరియు సిరియాలోని ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపుల కార్యకలాపాలు అమెరికా, దాని మిత్రదేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ గ్రూపుల చర్యలు భవిష్యత్తులో ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు. -
స్కైడైవింగ్ యాత్ర విషాదాంతం.. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం
మిస్సోరీ: అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అక్కడ జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 11 మంది స్కైడైవర్లు, ఒక పైలట్ సహా మొత్తం 12 మంది దుర్మరణం పాలయ్యారు. బట్లర్ మెమోరియల్ ఎయిర్పోర్టు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కైడైవింగ్ కోసం ప్రయాణికులను తీసుకెళ్తున్న పసిఫిక్ ఎయిరోస్పేస్ పీ-750ఎల్(Pacific Aerospace P750XL) సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సమస్యలను ఎదుర్కొంది. విమానం అవసరమైన ఎత్తుకు చేరుకోకముందే అకస్మాత్తుగా ఎడమవైపు తిరిగింది. అనంతరం రన్వేకు సుమారు 300 గజాల దూరంలో నేలపై కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. విమానాన్ని నిర్వహిస్తున్న Skydive Kansas City సంస్థ ఒక ప్రకటనలో ప్రమాదంలో ఉన్న 12 మంది మరణించినట్లు ధృవీకరించింది. మృతుల్లో 11 మంది స్కైడైవర్లు కాగా, మరో వ్యక్తి పైలట్ అని వెల్లడించింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాతే మృతుల పేర్లను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.ఈ ప్రమాదాన్ని పలువురు కుటుంబ సభ్యులు తమ కళ్లముందే చూసినట్లు బేట్స్ కౌంటీ షెరీఫ్ చాడ్ ఆండర్సన్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.🚨😭 12 killed in plane crash near Butler, Missouri. A skydiving plane went down shortly after takeoff from Butler Memorial Airport this morning, with all 11 skydivers and the pilot perishing in the crash.Our deepest condolences go out to all the families and loved ones… pic.twitter.com/mU8EdLrmrZ— The Watchdog (@TheWatchdoggs) June 14, 2026బేట్స్ కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ డైరెక్టర్ డెన్నిస్ జాకబ్స్ ప్రాథమిక అంచనా ప్రకారం.. పైలట్ సమీపంలోని రహదారిపై అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నించి ఉండొచ్చని ఆయన తెలిపారు. అయితే ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, అధికారిక కారణం ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో విమానం ఇంకా తక్కువ ఎత్తులోనే ఉండటంతో స్కైడైవర్లలో ఎవరూ దూకే అవకాశం పొందలేదని అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని డ్రోన్లు, ప్రత్యేక బృందాలతో పూర్తిగా పరిశీలించినప్పటికీ ఎలాంటి ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు కనిపించలేదని తెలిపారు.ఈ ఘటనపై ఏవిషేయన్ సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. విమానం నిర్వహణ చరిత్ర, సాంకేతిక పరిస్థితి, పైలట్ వివరాలు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించే తుది నివేదిక రావడానికి 12 నుంచి 24 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఎన్టీఎస్బీ పేర్కొంది. ఈ ఘటనతో మిస్సోరీ రాష్ట్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. స్కైడైవింగ్ కోసం ఉత్సాహంగా బయలుదేరిన 12 మంది జీవితాలు క్షణాల్లో ముగియడంతో స్థానిక సమాజం శోక సంద్రంలో మునిగిపోయింది. -
యుద్ధానికి తెర.. రెండు అంశాలకు కట్టుబడిన అమెరికా, ఇరాన్..
-
ఫెడ్ సమీక్షే మార్కెట్కు దిక్సూచి
పలు దేశ, విదేశీ గణాంకాలపై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. మరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. యూఎస్, ఇరాన్ మధ్య డీల్పైనా భారీ అంచనాలున్నాయి. వెరసి ఈ అంశాల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ ప్రధానంగా యూఎస్, ఇరాన్ మధ్య ఒప్పందం కోసం ప్రపంచవ్యాప్తంగా అటు ఇన్వెస్టర్లు, ఇటు ఆర్థికవేత్తలు ఎదురుచూస్తున్నారు. మూడు నెలలుగా పలు అంశాలలో అనిశ్చితికి కారణమవుతున్న పశి్చమాసియా యుద్ధం ముగింపుపై గత వారాంతాన ఆశలు చెలరేగాయి. యుద్ధం ముగిసే ఒప్పందం కుదరనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో గత వారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కె ట్లు జోరందుకున్నాయి. హార్ముజ్, న్యూక్లియర్ అంశాలు ఒక కొలిక్కి వచ్చే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ వారం ఇరాన్, యూఎస్ మధ్య కుదిరే వీలున్న శాంతి ఒప్పందానికి విశ్వవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలిపారు. ద్రవ్యోల్బణంపై ఫోకస్ నేడు(సోమవారం) దేశీయంగా మే నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్లో డబ్ల్యూపీఐ ఏకంగా 3.88 శాతం నుంచి 8.3 శాతానికి ఎగసింది. ఇది 42 నెలల గరిష్టంకాగా.. పశి్చమాసియా సంక్షోభం ప్రధానంగా ప్రభావం చూపినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. గత వారం విడుదలైన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) సైతం ఆహార ధరల కారణంగా 3.93 శాతానికి పెరిగింది. ఇవి ఆర్బీఐ పరపతి విధానాలను ప్రభావం చేయగలవని ఆర్థికవేత్తలు తెలియజేశారు. మే నెలకు రేపు(16న) వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. ఏప్రిల్లో వాణిజ్య లోటు 28.4 బిలియన్ డాలర్లకు చేరింది. యథాతథంగా 5.25 శాతం వద్దే రెపో రేటు కొనసాగించిన ఆర్బీఐ గత వారం పాలసీ వివరాలు(మినిట్స్) వారాంతాన(19న) వెల్లడి కానున్నాయి. విదేశీ అంశాలు మే నెలకు యూఎస్ వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు అంచనాలను మించుతూ 1,72,000గా నమోదైంది. దీంతో నిరుద్యోగ రేటు 4.3% వద్దే ఉంది. ఇది ఫెడరల్ రిజర్వ్ రేట్ల స్టేటస్ కో నిర్ణయాలను సమరి్థస్తున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. గత పాలసీ సమావేశంలో ఫెడ్ 3.5–3.75% వద్ద ఫండ్స్ రేట్లను నిలిపి ఉంచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం(17న) ఫెడ్ పరపతి సమీక్షా నిర్ణయాలు వెలువడనున్నాయి.సాంకేతికంగా చూస్తే.. గత వారం ప్రధాన ఇండెక్సులు బలాన్ని పుంజుకోవడం ద్వారా పరిమిత కన్సాలిడేషన్ నుంచి సాంకేతికంగా బయటపడ్డాయి. దీంతో ఈ వారం నిఫ్టీ వెనువెంటనే 23,800 పాయింట్లను తాకవచ్చు. ఈ స్థాయిలో ఎదురయ్యే రెసిస్టెన్స్ని అధిగమిస్తే 24,000–24,200వరకూ పుంజుకునే వీలుంది. మరోపక్క 23,450– 23,350 పాయింట్ల స్థాయిలో మద్దతు లభించవచ్చు.గత వారమిలా ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,285 పాయింట్లు(1.75 శాతం) ఎగసి 75,528 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 256 పాయింట్లు(1.1 శాతం) పుంజుకుని 23,623 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్క్యాప్ 0.3% నీరసించగా.. , స్మాల్ క్యాప్ 0.2% లాభపడింది.ఎఫ్పీఐ అమ్మకాల స్పీడ్ ఈ నెల 15 రోజుల్లో రూ. 62,853 కోట్లు దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెల తొలి రెండు వారాల్లో రూ. 62,853 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. పశి్చమాసియా సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు, డాలరుతో మారకంలో రూపాయి క్షీణత తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్ఎస్డీఎల్ వివరాల ప్రకారం దేశీ స్టాక్స్ నుంచి ఎఫ్పీఐలు 2026లో ఇప్పటివరకూ రూ. 2.87 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. తద్వారా 2025 కేలండర్ ఏడాదిలో నమోదైన రూ. 1.66 లక్షల కోట్ల విలువైన అమ్మకాలను దాటేశాయి. 2026లో ఫిబ్రవరిలో మినహా అన్ని నెలల్లోనూ ఎఫ్పీఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తూ వస్తున్నారు. -
ముగిసిన ఇరాన్-అమెరికా యుద్ధం
పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడింది. మూడు నెలలుగా జరుగుతున్న ఇరాన్-అమెరికా యుద్దం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. ఇటు ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.లెబనాన్ సహా అన్ని సరిహద్దు ఫ్రంట్లలో తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఈ అంగీకారంతో 60 రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ కాలంలో ఇరు దేశాలు మరిన్ని శాంతి చర్చలు నిర్వహించి దీర్ఘకాలిక పరిష్కారానికి మార్గం సుగమం చేయనున్నాయి. అయితే ఈ డీల్ తాలుకా మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే ఈ ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. డీల్ కుదిరిన నేపథ్యంలో.. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకా దళ దిగ్భంధనం తక్షణమే రద్దు కానుంది. శాంతి ఒప్పందం పూర్తైందని.. ఇరాన్పై ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. హర్ముజ్ను వెంటనే తెరవాలంటూ సోషల్ మీడియాలో ఆయనో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని నౌకలు హర్ముజ్లో ఇంజిన్లు ప్రారంభించాలని.. తమ ప్రయాణాలను తిరిగి ప్రారంభించాలని.. చమురు సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలని ట్రంప్ పేర్కొన్నారు.ఇటు ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ట్రంప్ పుట్టినరోజు సమయంలోనే(జూన్ 14) డీల్ కుదరడం విశేషమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. భారీ మూల్యం అయితే ఈ మూడు నెలల యుద్ధం ఇరు దేశాలనే కాదు.. పలు దేశాల్ని సైతం భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది. అమెరికా వైమానిక దాడులు, క్షిపణి దాడులతో ఇరాన్లోని పలు సైనిక స్థావరాలు, చమురు నిల్వ కేంద్రాలు, కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హర్ముజ్లో అమెరికా బ్లాకేడ్ వల్ల వాణిజ్య నౌకలు ఆగిపోయాయి. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడుల కారణంగా అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధ సంపత్తి నాశనం అయ్యాయి. ఇరువైపులా తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.యుద్ధ ప్రభావంతో పశ్చిమాసియాలోని అనేక ప్రాంతాల్లో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. వేలాది మంది ప్రజలు తమ నివాస ప్రాంతాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. హర్ముజ్ జలసంధి మూతపడే ప్రమాదం నెలకొనడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. సముద్ర రవాణా వ్యయాలు పెరగడంతో.. ప్రపంచ వాణిజ్యంపై కూడా ప్రభావం పడింది. ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా వ్యవస్థలపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
‘మా గోస వినండి .. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది’
గల్ఫ్ దేశాల్లో భారతీయ నౌకలనే టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని ఇరాన్లో వాణిజ్య నౌకలపై పనిచేస్తున్న భారత నౌకాదళ కార్మికులు వాపోతున్నారు. అమెరికా సైనిక దాడులలో తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల ఒమన్ తీరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృత్యువాత పడగా, ఆ భయానక వాతావరణం ఇంకా కొనసాగుతుందని పలువురు భారత నౌకాదళ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.భారతీయ నావికులను తీసుకువెళ్తున్న నౌకలపై పదేపదే దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. కొనసాగుతున్న దాడుల మధ్య తాము ఆ ప్రాంతంలో చిక్కుకుపోయామని, అసురక్షిత పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ఆపదలో ఉన్న భారతీయ నావికుల పరిస్థితిని వివరించారు. ‘ మేము ఇరాన్లో ఉన్నాము, ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై మాత్రమే దాడులు జరుగుతున్నాయి. మమ్మల్ని మాకు సంబంధంలేని యుద్ధంలోకి ఎందుకు లాగుతున్నారు? మేము సైనిక సిబ్బంది కాదు. మేము కాంట్రాక్టులపై పనిచేస్తున్న నావికులం. మేము చమురును తీసుకువస్తూ, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తున్నాం’ అని వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ సిబ్బందిలో ఒకరు మాట్లాడుతూ.. ‘ మేము సైనికులం కాదు. మేము కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి వస్తాం. అలాంటప్పుడు మాపై ఎందుకు దాడి చేస్తున్నారు? మా తప్పేంటి?" అని ప్రశ్నించారు. ఇటీవల దాడికి గురైన ఒక నౌకలో తాను గతంలో పనిచేశానని, ఆ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా ఆ నౌకాదళంలోని మరో కాంట్రాక్ట్ కార్మికుడు ప్రస్తావించాడు. We are in Iran. Only Indian ships are being attacked by the US . We are not military personnel . Why are you dragging us into your conflict ?Distress call from Indian seafarers in Iran .pic.twitter.com/yBI8BjvV4w— Surbhi (@SurrbhiM) June 14, 2026 -
మా యురేనియం మా వద్దే.. దాచి పెట్టిన ఇరాన్
-
పశ్చిమాసియా యుద్ధంలో బిగ్ ట్విస్ట్..?
-
కువైట్, బహ్రెయిన్లలో అమెరికా రాడార్లు ధ్వంసం..
టెహ్రాన్: మిడిల్ ఈస్ట్లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, రాబోయే 24 గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. అయితే ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే.. కువైట్, బహ్రెయిన్లలోని కీలక అమెరికా క్షిపణి గుర్తింపు రాడార్ వ్యవస్థలను తాము ధ్వంసం చేశామంటూ ఇరాన్ కొన్ని ఉపగ్రహ చిత్రాలను విడుదల చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.అమెరికా వ్యవస్థల ధ్వంసం.. ఇరాన్ ఆధారాలు!యుద్ధ రంగంలో ఇరాన్ పైచేయి సాధించినట్లు ప్రకటించుకుంది. అమెరికాకు చెందిన క్షిపణి గుర్తింపు రాడార్ వ్యవస్థలపై తాము జరిపిన దాడుల తాలూకు ఉపగ్రహ చిత్రాలను ఇరాన్ అధికారికంగా విడుదల చేసింది. కువైట్, బహ్రెయిన్లలో మోహరించిన రెండు అత్యంత కీలకమైన అమెరికా రాడార్ వ్యవస్థలు ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనట్లు ఇరాన్ పేర్కొంది. ఈ పరిణామాల మధ్యనే జోర్డాన్లో ఆకస్మికంగా సైరన్లు మోగడం, లెబనాన్ సరిహద్దులోని హులా ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్బుల్లా డ్రోన్ దాడికి పాల్పడటం లాంటి ఘటనలతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం క్షణక్షణం మారుతోంది. BREAKING: Iran has released satellite images showing the Destruction of two Key U.S. radar systems in Kuwait and Bahrain that were used to detect Incoming missiles. The bases are now useless. pic.twitter.com/02IvZoaekG— Daily Iran News (@DailyIranNews) June 14, 2026ట్రంప్ కీలక ప్రకటన.. ఒప్పందానికి రంగం సిద్ధంమరోవైపు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ నుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్తో యుద్ధం ముగిసిందని, శాంతి ఒప్పందం తుది దశకు చేరుకుందని ప్రకటించారు. ఇరాన్ అణు సంపత్తిని నియంత్రించడం, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఈ సరికొత్త ఒప్పందాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసేందుకు యూరప్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ట్రంప్ తెలిపారు. ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ వంటి దేశాల నేతలతో తాము చర్చలు జరిపినట్లు ఆయన స్పష్టం చేశారు.సంతకం ఎప్పుడు? ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ ముసాయిదాపై ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం గరీబాబాది.. రష్యా, చైనా రాయబారులతో కీలక చర్చలు జరిపారు. అయితే ఈ ఒప్పందంపై సంతకాల ప్రక్రియ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై కొంత గందరగోళం నెలకొంది. ఇరు దేశాల ప్రతినిధులు నేరుగా హాజరయ్యే కార్యక్రమం రద్దయిందని, వర్చువల్ విధానంలో సంతకాలు జరుగుతాయని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నప్పటికీ, ఆదివారం నాటి ప్రెసిడెంట్ ట్రంప్ అధికారిక షెడ్యూల్లో దీనికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేదని అంతర్జాతీయ మీడియా నివేదించింది. కాగా, ఈ ఒప్పందం కుదిరితే అది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యూహాత్మక ఎదురుదెబ్బ అవుతుందని అక్కడి ప్రతిపక్ష నేత యాయీర్ లాపిడ్ విమర్శించారు. -
మా యురేనియం మా వద్దే.. దాచి పెట్టిన ఇరాన్
-
మిత్రం దేశం ఇలా చేస్తుందా.? అమెరికాపై థరూర్ ఆగ్రహం
సాక్షి, ఢిల్లీ: ఇటీవల ఒమన్ తీరంలో అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు మృతిచెందిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఒమన్ దాడిలో భారతీయ నావికుల మృతిపై 'మిత్రదేశం' అమెరికా సంతాపం తెలపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో భారతీయ సిబ్బంది మరణించిన ఘటనపై అమెరికా స్పందించిన తీరు సరైంది కాదని విమర్శించారు.శశిథరూర్ మాట్లాడుతూ.."ఈ అధికారిక అమెరికా ప్రకటనను చదవడం చాలా షాకింగ్గా ఉంది. అమాయక భారతీయ ప్రాణాలు కోల్పోవడంపై ఇందులో ఎలాంటి విచారం లేదా సంతాపం లేదు. ఒక 'మిత్రదేశం', వ్యూహాత్మక భాగస్వామి ఇంత ఘోరమైన ఉదాసీనతను ఎలా ప్రదర్శిస్తుంది?" అని ఎక్స్ వేదికగా వాషింగ్టన్ని ప్రశ్నించారు.ఒకవేళ ఆ నౌక నిబంధనలను పాటించకుండా ఉన్నా.. ఆ వాణిజ్య నౌకపై దాడులు కాకుండా ఇతర మార్గాల ద్వారా ఎందుకు ఆపలేకపోయారని అడిగారు. సాధారణ సిబ్బంది ప్రాణాలను బలిగొనేలా క్షిపణులను ప్రయోగించకుండా, ఒక నౌక యొక్క ప్రొపల్షన్ (నడిచే వ్యవస్థ) లేదా స్టీరింగ్ను మాత్రమే నిలిపివేయడం సాధ్యం కాదా?" అని ఆయన ప్రశ్నించారు.ట్రంప్ వివరణ కాగా ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే వివరణ ఇచ్చారు. ఈ దాడులు జరిపింది. ఇరాన్ అని వాటిని ఎట్టిపరిస్థితుల్లో ఊపేక్షించేది లేదన్నారు.మార్కో రూబియోతో జైశంకర్ ఫోన్ఒమన్ గల్ఫ్లో అమెరికా జరిపిన సైనిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన అంశాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడారు. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా కేవలం మూడు రోజుల వ్యవధిలో అమెరికా మూడు సార్లు భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న నౌకలపై దాడి చేసింది. ఇందులో రెండు సార్లు భారతీయ నావికులను రక్షించగా ఒకసారి దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై న్యూఢిల్లీ ఇప్పటికే వాషింగ్టన్కు తన తీవ్ర అభ్యంతరాలను, ఆందోళనను తెలియజేసింది. -
మా ఏఐ మాకే సొంతం..
ఏఐని నియంత్రిస్తున్న దేశాలు రూటు మారుస్తున్నాయి. ఇప్పటిదాకా చిప్లను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవటంపై దృష్టి పెట్టినా... ఇపుడు ఏఐ మోడల్స్నూ నియంత్రించే చర్యలు మొదలెట్టాయి. అమెరికా ప్రభుత్వం ఆదేశించిన మీదట... ఆంథ్రోపిక్ సంస్థ తన క్లాడ్లో మైథోస్–5, ఫేబుల్–5 మోడళ్లను ఇతర దేశాల్లో ఎవరూ వాడకుండా నిషేధించటం... ఒక ఆరంభం మాత్రమే. అత్యాధునిక ఏఐ మోడళ్లను స్వదేశంలో తప్ప ఇంకెక్కడా వాడకుండా చేయటం ద్వారా ఏఐపై గుత్తాధిపత్యం సాధించాలనేది అమెరికా వ్యూహం కావచ్చనేది నిపుణుల మాట.ఇలాంటి చర్యలతో ఏఐ వాడకంలో అంతరాలు తారస్థాయికి చేరుతాయి కాబట్టి భారతదేశం ఏఐ మిషన్ను ఆరంభించి, రూ.50వేల కోట్లు కేటాయించాలని టెక్నోక్రాట్ మోహన్దాస్ పాయ్ ప్రధాని మోదీని అభ్యరి్థంచటం గమనించాల్సిన విషయం. అమెరికా నిషేధం నేపథ్యంలో అసలు ఈ మైథోస్–5, ఫేబుల్–5 ఏం చేస్తాయి? నిషేధంతో నష్టాలేంటి? అమెరికా చెబుతున్న భద్రత కారణాలు నిజమేనా?ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి’ప్రత్యేక కథనం... అమెరికాలో మినహా విదేశాల్లో యాక్సెస్ లేకుండా నిషేధించిన మైథోస్, ఫేబుల్ మోడళ్లు అత్యా«ధునికమే కాదు. శక్తిమంతమైనవి కూడా. ప్రత్యేకించి మైథోస్–5 ఉపయోగించి సైబర్ సెక్యూరిటీని ఉల్లంఘించవచ్చు. ఎదురుదాడులు చేయొచ్చు. అందుకే గ్లాస్వింగ్ లాంటి కార్యక్రమాల ద్వారా దీని వాడకాన్ని కొన్ని సంస్థలకే అందించింది ఆంథ్రోపిక్. మైథోస్లోని ఫీచర్లన్నీ ఉండి... కొన్ని నియంత్రణలతో అందరికీ అందించిన మోడల్ ఫేబుల్. ఒక్కమాటలో చెప్పాలంటే మైతోస్–5 రేసింగ్ కార్ అయితే... సాధారణ రోడ్లపై తిరగటానికి ఆవిష్కరించిన దాని లీగల్ వెర్షనే ఫేబుల్–5. మైథోస్–5 ఎందుకు స్పెషల్ అంటే? అటానమస్ కోడింగ్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సెక్యూరిటీ అనాలిసిస్, దీర్ఘ కాలిక రీజనింగ్, శాస్త్రీయ పరిశోధనల్లో సాయం విషయంలో మైథోస్కు అసాధారణమైన సామర్థ్యాలున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఇక ఫేబుల్ మోడళ్ల విషయానికొస్తే... ⇒ అత్యంత భారీ సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను మైగ్రేట్ చేయడానికి ⇒ కొన్నేసి గంటల పాటు రెగ్యులర్గా అటానమస్ పనులు చేయటానికి... ⇒ అడ్వాన్స్డ్ కోడింగ్, ఇంజినీరింగ్ టాస్క్లు చేయటానికి వాడొచ్చు. నిషేధం వల్ల నష్టాలేంటి? ⇒ ఆంథ్రోపిక్ విడుదల చేసిన అత్యంత శక్తిమంతమైన మోడళ్లను అమెరికా వెలుపల ఎవరూ యాక్సెస్ చేసుకోలేరు. ⇒ మెరుగైన కోడ్ను జనరేట్ చేయటం... బగ్స్ను కనిపెట్టడం... భారీస్థాయి సాఫ్ట్వేర్ మైగ్రేషన్లను ఈజీగా చేసే సామర్థ్యాన్ని డెవలపర్లు కోల్పోతారు. ⇒ సైబర్ సెక్యూరిటీలోని లోపాలను కనిపెట్టడానికి ఉపయోగపడే అత్యంత ఆధునిక టూల్స్ను పరిశోధకులు వాడలేరు. ⇒ అన్నిటికన్నా ప్రధానం... అమెరికా వెలుపల ఉండేవారికి అమెరికాలో ఉండేవారితో పలు అంశాల్లో పోటీపడే సామర్థ్యం తగ్గిపోతుంది. అమెరికన్ కంపెనీలకు ప్రొడక్టివిటీ అడ్వాంటేజ్ పెరిగి... విదేశాల్లోని స్టార్టప్ల ఇన్నోవేషన్ సామర్థ్యం స్లో అవుతుంది. అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ల మాదిరి ఏఐ సామర్థ్యాలపై కూడా కొన్ని దేశాల ఆధిపత్యం కొనసాగుతుంది. భారత్కు ఇబ్బందులేంటి? భారత్కు ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే అత్యంత ఆధునికమైన అడ్వాన్స్డ్ అమెరికన్ ఏఐ మోడళ్ల యాక్సెస్ మన స్టార్టప్లకు ఉండదు. మన సైబర్సెక్యూరిటీ సంస్థలు అత్యాధునిక టూల్స్ను కోల్పోతాయి. పైపెచ్చు నిషేధం ఎక్కువకాలం కొనసాగితే మన సాఫ్ట్వేర్ సంస్థల పోటీ సామర్థ్యం తగ్గొచ్చు. నిశితంగా చూస్తే ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఏఐ చిప్లను, సెమీకండక్టర్ పరికరాలను, సూపర్ కంప్యూటర్ల హార్డ్వేర్ను మాత్రమే నియంత్రించాయి. ఇపుడు ఏఐ మోడల్ను సైతం అమెరికా ఓ సాఫ్ట్వేర్లా కాకుండా కీలకమైన మిలిటరీ టెక్నాలజీలా చూడటం ఆరంభించింది. ఈ కారణాల వల్లే అమెరికా మోడళ్లపై పూర్తిగా ఆధారపడకుండా భారత్కు సొంత ఏఐ మోడళ్లు ఉండాలని మోహన్దాస్ పాయ్ వంటి టెక్నోక్రాట్లు చేస్తున్న వాదనకు బలం చేకూరుతోంది. ఈ ఏఐ నియంత్రణ మున్ముందు మరిన్ని మలుపులు తిరుగుతుందన్నది కాదనలేని నిజం.ఆంథ్రోపిక్ కొత్త ఏఐ మోడళ్లు వెనక్కి వాషింగ్టన్: ట్రంప్ విధానాలతో దేశాలు మాత్రమేకాదు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చుచేసి పరిశోధన పూర్తిచేసి వినియోగదారులకు అందుబాటులోకి తెచి్చన అధునాతన కృత్రిమమేధ (ఏఐ) టూల్స్ను కంపెనీలు వెనక్కి(రీకాల్) చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు ఏఐ దిగ్గజ సంస్థ ‘ఆంథ్రోపిక్’చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అందుబాటులోకి తెచి్చన క్లాడ్ ఫేబుల్5, మైథోస్5 ఏఐ మోడళ్లను వెనక్కితీసుకుంటున్నట్లు ఆంథ్రోపిక్ శనివారం ప్రకటించింది.భద్రతా కారణాలు చూపి వీటిపై అమెరికా ప్రభుత్వం ఆంక్షల విధించడంతో తప్పనిపరిస్థితుల్లో వీటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆంథ్రోపిక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘భద్రత లేని, క్షేమదాయకంకాని మోడళ్లపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ అత్యంత భద్రమైన మా మోడళ్లకు ఏ సాంకేతిక లోపాల మాటున అడ్డుచెబుతున్నారో ప్రభుత్వం వివరిస్తే బాగుండేది. అప్పుడే ఈ ఆంక్షల ప్రక్రియ పారదర్శకంగా, స్వేచ్ఛగా జరుగుతుందని అంతా భావిస్తారు’అని ఆంథ్రోపిక్ తన అసహనం వ్యక్తంచేసింది. (రమణమూర్తి మంథా) -
ఫేబుల్-5, మైథోస్-5 సేవలు నిలిపివేత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ‘ఆంథ్రోపిక్’కు అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా యూఎస్ ప్రభుత్వం ‘ఎగుమతి నియంత్రణ’ ఆదేశాలను జారీ చేసింది. దీనికి స్పందించిన ఆంథ్రోపిక్ తన అధునాతన ఏఐ మోడళ్లు ‘ఫేబుల్ 5’, ‘మైథోస్ 5’లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లందరికీ ఈ సేవల యాక్సెస్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.అమెరికా భూభాగంలోనైనా, వెలుపలనైనా, ఏ విదేశీ పౌరుడికైనా, చివరికి ఆంథ్రోపిక్ సంస్థలో పనిచేసే విదేశీ ఉద్యోగులకు సైతం ఫేబుల్ 5, మైథోస్ 5 మోడళ్ల యాక్సెస్ను పూర్తిగా నిలిపివేయాలని యూఎస్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, అయితే తమ ఇతర ఏఐ మోడళ్ల సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని ఆంథ్రోపిక్ వివరణ ఇచ్చింది.భారత్పై తీవ్ర ప్రభావం అమెరికా తర్వాత ఆంథ్రోపిక్ సంస్థకు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ కావడంతో తాజా నిర్ణయం భారతీయ క్లయింట్లు, కార్పొరేట్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇటీవలే దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన 50 వేల మంది ఉద్యోగులకు ఆంథ్రోపిక్ ఏఐ మోడళ్లపై శిక్షణ అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా క్లాడ్ మోడళ్ల ఆధారంగా అధునాతన ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్లను అమలు చేసేందుకు ఫిబ్రవరిలో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అలాగే సైబర్ సెక్యూరిటీ చొరవ కింద ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ ద్వారా కొన్ని భారత ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలకు కూడా ఈ మైథోస్ మోడల్ యాక్సెస్ లభించింది. తాజా నిర్ణయంతో ఈ సేవలన్నీ నిలిచిపోనున్నాయి.ప్రభుత్వ నిర్ణయంతో విభేదిస్తున్న ఆంథ్రోపిక్ప్రభుత్వ ఆదేశాలు జూన్ 12న సాయంత్రం 5.21 గంటలకు అందినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ‘ఫేబుల్ 5’, ‘మైథోస్ 5’ మోడళ్లలో భద్రతా లోపాలను దారి మళ్లించే ఒక పద్ధతి బయటపడిందని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ప్రభుత్వం చెబుతున్న లోపం చాలా చిన్నదని, సాఫ్ట్వేర్ లోపాలను సరిదిద్దమని మోడల్ను కోరడం లాంటి సాధారణ విషయమేనని కంపెనీ వాదిస్తోంది. ఇలాంటి ఫీచర్లు ఓపెన్ఏఐకు చెందిన జీపీటీ–5.5తో పాటు ఇతర ఏఐ మోడళ్లలో కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఒక కమర్షియల్ మోడల్ను ఇలాంటి చిన్న కారణంతో నిలిపివేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ, సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంథ్రోపిక్ వెల్లడించింది. -
ఇరాన్తో ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలను తరిమేస్తూ శాంతికపోతాలకు స్వాగతం పలుకుతూ శాశ్వత శాంతి ఒప్పందం ఇరాన్తో ఆదివారం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి ప్రకటించారు. ఒప్పందం సంతకాలు పూర్తవగానే హార్మూజ్ను అందరికీ తెరుస్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు.ఇరాన్ విషయంలో ఒబామా హయాంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పు అని ఎత్తిపొడుస్తూ ఒక పోస్ట్పెట్టారు. ‘‘బరాన్ హుస్సేన్ ఒబామా ఇరాన్తో ఉమ్మడి సమగ్ర కార్యాచరణ(జేసీపీఓఏ) ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇరాన్ అణ్వాయుధం తయారీకి ఒక రకంగా బాటలుపరిచింది. ఇది ఇలాగే అమల్లో ఉండి ఉంటే ఇరాన్ ఆరేళ్ల క్రితమే అణ్వాయుధాన్ని తయారుచేసి ఉండేది. ఇప్పటికే దానిని ఉపయోగించేవారు. ఇరాన్తో నేను కుదుర్చుకుంటున్న ఒప్పందం దీనిని పూర్తి విరుద్ధం.ఇరాన్ అణ్వాయుధ కలను కల్లను చేసే ఒప్పందం ఇది. కొనుగోలు, సమీకరణ, అభివృద్ధి ద్వారా కూడా వాళ్ల లక్ష్యం నెరవేరకుండా నా ఒప్పందం చేస్తుంది. ఇంతటి గొప్ప ఒప్పందం ఆదివారం జరగబోతోంది. ఒప్పందంపై సంతకాలు పూర్తవగానే హార్మూజ్ను అందరి కోసం తెరుస్తాం. ఇరాన్తో మా బంధం గతం కంటే భిన్నంగా, గత ప్రభుత్వాల కంటే ఎంతో మెరుగ్గా ఉండనుంది. ఒబామా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడులు, ఒప్పందాలు, నగదు రూపంలో ఇరాన్ కోసం ఖర్చుచేశారు. కానీ మేం అదనుచూసి గుట్టుచప్పుడుకాకుండా ఇరాన్లోని అణుధూళిని పట్టుకొచ్చేస్తాం.అద్భుతమైన పైలట్లు బీ–2 బాంబర్ విమానాలతో ఇరాన్ పర్వతాల్లో రేడియోధార్మిక పదార్థాన్ని భూస్థాపితం చేశారు. ఇప్పుడు మేం ఇరాన్తో, యావత్ పశి్చమాసియాతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భవిష్యత్లోనూ కలిసి పనిచేస్తాం. ఈ ప్రక్రియ వేగంగా, సులభంగా, సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నా. ఇది ఒకవేళ ఆచరణసాధ్యంకాకపోతే మాకు భయంకరమైన ప్రత్యామ్నాయం ఉంది. ఇది ఎప్పటికీ ఉపయోగించకూడదనే కోరుకుంటున్నా’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.]24 గంటల్లోనే: షెహబాజ్ షరీఫ్యుద్దం ముసిగి శాంతి ఒప్పందం రాబోయే 24 గంటల్లో ఖరారు కావొచ్చని అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగీ్చలను ట్యాగ్ చేశారు. ‘‘శాంతి ఒప్పందం విషయంలో గతంలో ఎన్నడూ లేనంత దగ్గరగా వచ్చేశాం. రాబోయే 24 గంటల్లో దీనికి తుదిరూపం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే ఒప్పందంపై ఎల్రక్టానిక్ విధానంలో అమెరికా, ఇరాన్లు సంతకాలు పెట్టేందుకు పాకిస్తాన్ సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చేవారం సాంకేతిక స్థాయి చర్చలు జరుగనున్నాయి. శాంతి చర్చల సమయంలో అమెరికా, ఇరాన్లు చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు’’అని షరీఫ్ తెలిపారు.వచ్చే నెల 4న ఖమేనీ అంత్యక్రియలు!ఇస్లామాబాద్: ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెల 4వ తేదీన జరుగుతాయని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. పశి్చమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా అమెరికా, ఇరాన్ల మధ్య అతిత్వరలో ఒప్పందం కుదరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.ట్రంప్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం: ఇరాన్ ఒమన్ తీరంలో భారతీయులున్న మూడు నౌకలపై ఇరాన్ సైన్యమే డ్రోన్లతో దాడి చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను భారత్లోని ఇరాన్ ఎంబసీ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పారు. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించిన ఘటన నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇరాన్పై అసంబద్ధ ఆరోపణలు చేశారని పేర్కొంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేసింది. -
నరకానికి పంపించేశాం.. ట్రంప్ సంచలన ప్రకటన
డ్రగ్స్ ముఠా ట్రెన్ డి అరాగువా (Tren de Aragua)కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ ముఠా లీడర్ హెక్టర్ రుస్తెన్ఫోర్డ్ గెర్రెరో ఫ్లోరెస్ అలియాస్ నినో గెర్రెరో హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గ్యాంగ్పై అమెరికా కీలక ఆపరేషన్ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్రంప్ షేర్ చేశారు. ఈ వీడియోలో పచ్చటి పైకప్పు ఉన్న భవనం పేల్చివేయబడి.. ముక్కలు ముక్కలుగా అవ్వడం కనిపించింది."ట్రెన్ డి అరాగువా ఉగ్రవాదులకు ఇకపై వెనిజులాలో కానీ.. మరెక్కడా కానీ సురక్షితమైన స్థావరం ఉండదు. నా నాయకత్వంలో ఈ ఘోరమైన హంతకులను, డ్రగ్ మాఫియా నాయకులను ఎప్పుడైనా, ఎక్కడైనా సరే వెతికి పట్టుకుంటాం. వారు ఉండాల్సిన నరకానికి వారిని పంపుతాం’’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్లో రాసుకొచ్చారు. ఈ ఆపరేషన్ను తాము ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్న వెనిజులాలోని తమ స్నేహితులతో కలిసి సమన్వయంతో చేపట్టినట్లు ట్రంప్ పేర్కొన్నారు.“నా ఆదేశాల మేరకు అమెరికా సదర్న్ కమాండ్ వేగవంతమైన, అత్యంత కచ్చితమైన దాడి నిర్వహించి ట్రెన్ డి అరాగువా నాయకుడు నినో గెర్రెరోను హతమార్చింది. ప్రపంచంలోని అత్యంత రక్తపిపాసి ఉగ్ర సంస్థల్లో ఇది ఒకటి” అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ముఠాను అమెరికా గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే.గెర్రెరో తలపై ఐదు మిలియన్ డాలర్ల రివార్డ్ కూడా ఉంది. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు హింసాత్మక ఘటనల వెనుక ఈ ముఠా హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. పదేళ్ల క్రితం ఓ జైల్లో ఏర్పాటైన ట్రెన్ డి అరాగువా.. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో కన్నుసన్నల్లోనే ఈ గ్యాంగ్ పనిచేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. -
మార్కో రూబియోకు జైశంకర్ ఫోన్.. దాడిపై సీరియస్
న్యూఢిల్లీ: హర్ముజ్ జలసంధిలో ఇటీవల అమెరికా జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్స్పందించారు. ఈ విషయమై ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడినట్లు పేర్కొన్నారు.ఇటీవల హర్ముజ్ జలసంధిలో అమెరికా భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా తరచుగా దాడులకు తెగబడుతుంది. ఈ దాడులలో ముగ్గురు భారతీయులు మృతిచెందారు. అయినప్పటికీ మరోసారి దాడులకు తెగబడింది20 మంది భారతీయ నావికులతో వెళ్తున్న 'గినియా-బిస్సావు' పతాకం గల నౌకపై అమెరికా అటాక్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ భారత్లో అమెరికా అత్యున్నత దౌత్యవేత్త (ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్కు రెండు సార్లు సమన్లు జారీ చేసింది.ఇదిలా ఉండగా తాజాగా ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఎక్స్ ఖాతాలో "ఈ సాయంత్రం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడాను. గల్ఫ్లో అమెరికా నౌకాదళం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించడాన్ని భారతదేశం తీవ్రంగా నిరసిస్తున్నట్లు మరోసారి పునరుద్ఘాటించాను. వాణిజ్య నౌకలపై ఇటువంటి ప్రాణాంతక చర్యలు సమర్థనీయం కావు." అని మాట్లాడినట్లు తెలిపారు.కాగా ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది వరకే వివరణ ఇచ్చారు. ఒమన్ తీరం సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడి చేసింది తాము కాదని.. అది ముమ్మాటికీ ఇరాన్ ఘాతుకమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న( శుక్రవారం) తేల్చిచెప్పారు. హర్ముజ్ జలసంధి నుంచి బయలుదేరిన నౌకలపై ఇరాన్ సైన్యం డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్టుచేశారు. -
ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాక్.. బూట్లు ఎత్తుకెళ్లిన దొంగలు!
ఫిఫా ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు అమెరికాకు వెళ్లిన ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఆటగాళ్లకు సంబంధించిన పలు జతల బూట్లు శిక్షణకు ఉపయోగించే పరికరాలు, మ్యాచ్ బాల్స్ భారీగా దొంగతనానికి గురయ్యాయి. ఫ్లోరిడాలోని వారి ప్రాక్టీస్ క్యాంప్ నుంచి మిస్సోరిలోని 'స్వోప్ సాకర్ విలేజ్కు' సామాగ్రిని తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యాన్ తాళాలను పగులగొట్టి ఈ దొంగతానికి పాల్పడ్డారు. ఆ వ్యాన్లో ఒక్క ఫుట్బాల్ను మాత్రమే విడిచిపెట్టారు.దొంగిలించబడిన వాటిలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్, స్టార్ మిడ్ఫీల్డర్ జూడ్ బెల్లింగ్హామ్ వ్యక్తిగత మ్యాచ్ బూట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మెగా టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్లో జూన్ 18న క్రొయేషియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు శనివారం కాన్సాస్ సిటీలో తొలి ట్రైనింగ్ సెషన్లో పాల్గొనాల్సి ఉంది. అంతలోనే ఈ ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో ఇంగ్లీష్ ప్లేయర్లకు షాక్కు గురయ్యారు. ఈ ఘటనపై కాన్సాస్ పోలీసులు వేగంగా స్పందించారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.చదవండి: FIFA World Cup 2026: అమెరికా సంచలన విజయం.. ఫిఫా చరిత్రలోనే -
చంద్రుడి దారిలో.. 'ఆర్టెమిస్-3'
పిల్లలూ... చంద్రుడి పై మళ్లీ మనిషి కాలు పెట్టే ప్రయత్నం వేగంగా సాగుతోంది. 2026 జూన్ 9న అమెరికా హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ ‘ఆర్టెమిస్ 3’ అంతరిక్ష యాత్రకు వెళ్లే నలుగురు వ్యోమగాములను అనౌన్స్ చేసింది.ఆ వ్యోమగాములురాండీ బ్రెస్నిక్ – యాత్రకు కమాండర్. ఇంతకు ముందు రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లారు.లూకా పర్మిటానో – పైలట్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి ఆర్టెమిస్ కార్యక్రమానికి ఎంపికైన మొదటి వ్యోమగామి.ఫ్రాంక్ రూబియో – మిషన్ స్పెషలిస్ట్. వైద్యుడు. అంతరిక్షంలో 371 రోజులు గడిపిన అమెరికన్ రికార్డు ఇతనిదే!ఆండ్రే డగ్లస్ – మిషన్ స్పెషలిస్ట్. ఇది ఆయన మొదటి అంతరిక్ష యాత్ర.వీరి యాత్ర 2027 చివర్లో ప్రారంభం కానుంది. కానీ, ఈ వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టరు.అసలు సంగతి..ఆర్టెమిస్ 3 మొదట చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాల్సిన యాత్ర. కానీ ల్యాండర్ వాహనాలు సిద్ధం కాకపోవడంతో, నాసా 2026 ఫిబ్రవరిలో ప్లాన్ మార్చింది. ఇప్పుడు వీరు భూమికి దగ్గరగా ఉన్న లోఎర్త్ ఆర్బిట్లోనే ఉంటారు.ప్రధాన లక్ష్యంఓరియన్ అనే వ్యోమనౌకను, చంద్రుడిపై దిగడానికి స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్ తయారు చేస్తున్న ‘హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్’ వాహనాలతో అంతరిక్షంలో అనుసంధానం చేయడం. దీనినే ‘డాకింగ్’ అంటారు. ఇది భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులు దిగడానికి చేసే కీలక సన్నాహం.పిల్లలూ.... మనుషులు చివరిసారిగా 1972 డిసెంబర్లో అపోలో 17 యాత్రలో చంద్రుడిపై దిగారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ దేశం కూడా మనుషులను చంద్రుడిపైకి పంపలేదు. 2026 ఏప్రిల్లో ‘ఆర్టెమిస్ 2’ యాత్ర విజయవంతంగా చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చింది. అందులో నలుగురు వ్యోమగాములు ఉన్నారు. కానీ వారు కూడా చంద్రుడిపై దిగలేదు. 2027లో జరగబోయే ‘ఆర్టెమిస్ 3’ యాత్ర విజయవంతమైతే, తర్వాత వచ్చే ‘ఆర్టెమిస్ 4’ యాత్ర 2028లో మనుషులను నిజంగా చంద్రుడిపై దించుతుంది. -
అమెరికా సంచలన విజయం.. ఫిఫా చరిత్రలోనే
ఫిఫా ప్రపంచకప్ 2026లో తమ తొలి మ్యాచ్లోనే ఆతిథ్య అమెరికా చారిత్రత్మక విజయాన్ని అందుకుంది. లాస్ ఏంజిల్స్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-డి మ్యాచ్లో పరాగ్వేను 4-1 తేడాతో అమెరికా చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు యూఎస్ఎ ఆధిపత్యం చెలాయించింది.మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పరాగ్వే ఆటగాడు డామియన్ బొబాడిల్లా చేసిన పొరపాటు అమెరికాకు కలిసొచ్చింది. బొబాడిల్లా ప్రత్యర్థి పాస్ను అడ్డుకునే క్రమంలో బంతిని తానే స్వయంగా నెట్లోకి పంపి 'ఓన్ గోల్' చేశాడు. దీంతో అమెరికా 1-0తో ముందంజ వేసింది.బలోగన్ జోరు..ఆ తర్వాత 28 నిమిషంలో అమెరికా స్ట్రైకర్ ఫోలారిన్ బలోగన్ అద్భుతమైన పాస్ను అందుకుని, బంతిని సునాయాసంగా నెట్లోకి పంపాడు. దీంతో అమెరికా సంబరాల్లో మునిగిపోయింది. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. రిఫరీ డానీ మాకెలీ ఆ గోల్ను 'అంపైర్ ఆఫ్సైడ్'గా ప్రకటించి తిరస్కరించాడు.అయినప్పటికి బాలోగన్ ఏమాత్రం నిరాశ పడలేదు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే (31వ నిమిషంలో) బంతిని గోల్ పోస్ట్లోకి పంపి స్కోరును 2-0కు చేర్చాడు. అయితే ఫస్ట్ హాఫ్లో ఇంజ్యురీ టైమ్ పేరిట 5 నిమిషాలు అదనంగా కేటాయించారు. ఈ సమయం అమెరికాకు కలిసొచ్చింది. బలోగన్ మరో సూపర్ గోల్తో మెరిశాడు. దీంతో ఫస్టాఫ్ ముగిసేసరికి అమెరికా 3-0తో పూర్తి ఆధిక్యంలో నిలిచింది.ఇక సెకెండ్ హాఫ్లో పుంజుకునేందుకు పరాగ్వే గట్టిగా ప్రయత్నించింది. ఈ క్రమంలో 73వ నిమిషంలో సబ్స్టిట్యూట్ ప్లేయర్ 'మౌరిసియో' పరాగ్వే తరఫున తొలి గోల్ సాధించి ఆశలు రేకెత్తించాడు. అయితే ఆ ఆతర్వాత డిఫెండర్లు అప్రమత్తంగా వ్యవహరించి ఆ తర్వాత పరాగ్వేకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ ఆఖరిలో అమెరికాకు చెందిన జియోవన్నీ రేనా అద్భుతమైన గోల్ను సాధించి 4-1 ఆధిక్యాన్ని అందించాడు. కాగా ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్లో యూఎస్ఎ నాలుగు గోల్స్ సాధించడం ఇదే మొదటిసారి. -
ట్రంప్ వేట.. వెనిజువెలా డ్రగ్ లార్డ్ హతం
వాషింగ్టన్: అంతర్జాతీయ నేర సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ లీడర్ హెక్టార్ ‘నినో’ గెరెరోను అమెరికా సైన్యం మట్టుబెట్టింది. వెనిజువెలాకు చెందిన ‘ట్రెన్ డి అరాగువా’ ట్రాన్స్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ హెడ్ గెరెరోను సైనిక దాడిలో హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన వీడియో ఫుటేజీని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ - సంచలన వీడియోఅమెరికా సదరన్ కమాండ్ మెరుపు వేగంతో నిర్వహించిన ఈ ‘కైనెటిక్ స్ట్రైక్’లో గెరెరో హతమయ్యాడని ట్రంప్ పేర్కొన్నారు. ‘మా నాయకత్వంలో, ఈ క్రూరమైన హంతకులను, డ్రగ్ లార్డ్లను ఎక్కడైనా, ఎప్పుడైనా సరే వేటాడి పట్టుకుంటాం’ అని ట్రంప్ హెచ్చరించారు. వెనిజువెలా అధికారులతో సంపూర్ణ సమన్వయంతోనే ఈ వ్యూహాత్మక ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం వెనిజువెలా ప్రభుత్వంతో అమెరికా కలిసికట్టుగా పనిచేస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు.𝗗𝗼𝗻𝗮𝗹𝗱 𝗝. 𝗧𝗿𝘂𝗺𝗽 𝗣𝗼𝘀𝘁𝘀 𝗩𝗶𝗱𝗲𝗼 𝗼𝗻 𝗧𝗿𝘂𝘁𝗵 𝗦𝗼𝗰𝗶𝗮𝗹 - 𝟬𝟮:𝟬𝟯 𝗣𝗠 𝗘𝗦𝗧 𝟬𝟲.𝟭𝟮.𝟮𝟲At my direction, the United States Southern Command delivered a swift and lethal kinetic strike to successfully execute Niño Guerrero, the infamous leader of… pic.twitter.com/IMj9iZzTYM— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) June 13, 2026బైడెన్ సరిహద్దు విధానాలపై తీవ్ర విమర్శలుఈ అద్భుతమైన విజయాన్ని ప్రకటిస్తూనే, ట్రంప్ తన పూర్వ అధ్యక్షుడు జో బైడెన్ అనుసరించిన సరిహద్దు విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బైడెన్ హయాంలో సరిహద్దులను అదుపులేకుండా వదిలేయడం వల్లే ‘ట్రెన్ డి అరాగువా’ వంటి విదేశీ క్రిమినల్ ముఠాలు అమెరికాలోకి చొరబడ్డాయని ఆరోపించారు. గతంలో అమెరికాలో కలకలం రేపిన 12 ఏళ్ల జోస్లిన్ నుంగారే, 22 ఏళ్ల లాకెన్ రైలీల హత్యలను ప్రస్తావిస్తూ, ఈ సైనిక చర్య ద్వారా బాధిత కుటుంబాలకు న్యాయం చేకూరిందని, అమెరికా సైన్యం వారి తరఫున ప్రతీకారం తీర్చుకుందని ట్రంప్ ఉద్ఘాటించారు. ‘ట్రెన్ డి అరాగువా’ నేరచరిత్రవెనిజువెలాలో పుట్టిన ఈ ‘ట్రెన్ డి అరాగువా’ గ్యాంగ్ ప్రస్తుతం లాటిన్ అమెరికా అంతటా విస్తరించి ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ ముఠా దోపిడీలు, మానవ అక్రమ రవాణా, వలసదారుల స్మగ్లింగ్, డ్రగ్స్ మాఫియా, అనేక క్రూరమైన హింసాత్మక నేరాలకు పాల్పడుతున్నట్లు పలు దేశాల అధికారులు గుర్తించారు. ట్రంప్ ప్రభుత్వం తమ వలస విధానాలు, జాతీయ భద్రతా ఎజెండాలో భాగంగా ఈ గ్యాంగ్ను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది.ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన -
నిన్నటి మిత్రులు.. నేటి ప్రత్యర్థులా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కలిసి ఇరాన్పై యుద్ధాన్ని ప్రారంభించినప్పటికీ, ఇప్పుడు అదే యుద్ధం ముగింపుపై ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఒకే వ్యూహంతో ముందుకెళ్లిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం తమ తమ దేశీయ రాజకీయ అవసరాల కారణంగా వేర్వేరు దారుల్లో నడుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.యుద్ధం ఎలా మొదలైంది?ఫిబ్రవరి 28, 2026న అమెరికా-ఇజ్రాయెల్ మద్దతుతో ఇరాన్పై భారీ సైనిక చర్య ప్రారంభమైంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ప్రాంతీయ భద్రతా ముప్పులను తగ్గించడం, టెహ్రాన్ ప్రభావాన్ని కట్టడి చేయడం ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. ప్రారంభ దశలో ట్రంప్, నెతన్యాహు ఒకే వైఖరితో ముందుకు సాగారు.ఇప్పుడు ఎందుకు విభేదాలు?ప్రస్తుతం ట్రంప్ ప్రధానంగా యుద్ధాన్ని ముగించి ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) దాదాపు సిద్ధమైందని, త్వరలోనే సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, నెతన్యాహు మాత్రం ఇరాన్పై ఒత్తిడిని కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి కార్యక్రమం, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై మరింత కఠిన చర్యలు అవసరమని ఇజ్రాయెల్ వాదిస్తోంది.ట్రంప్ రాజకీయ లెక్కలునవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు (Midterm Elections) ట్రంప్కు కీలకం. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడం, చమురు ధరల అస్థిరత, ప్రజల్లో యుద్ధ వ్యతిరేక భావన పెరగడం ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే యుద్ధాన్ని ముగించిన నాయకుడు అనే గుర్తింపుతో ఎన్నికల్లోకి వెళ్లాలని ట్రంప్ భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.నెతన్యాహు లక్ష్యం వేరుఇక నెతన్యాహు కూడా దేశీయ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్లో భద్రతా అంశం అత్యంత కీలకమైన రాజకీయ అంశం కావడంతో, ఇరాన్పై పూర్తి స్థాయి వ్యూహాత్మక ఆధిపత్యం సాధించకుండానే యుద్ధాన్ని ముగించడం ఆయనకు రాజకీయంగా ప్రమాదకరంగా మారవచ్చని భావిస్తున్నారు. అందువల్ల ఆయన మరింత కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.బయటపడుతున్న ఉద్రిక్తతఇటీవల ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్ధమైన దాడులను రద్దు చేసి, చర్చలకు ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయం నెతన్యాహును ఆశ్చర్యానికి గురి చేసిందని వార్తలు వెలువడ్డాయి. ఆ నిర్ణయం గురించి ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఇరాన్పై మరోసారి యుద్ధాన్ని ప్రారంభించవద్దని ట్రంప్ నెతన్యాహును హెచ్చరించినట్లు కూడా రాయిటర్స్ వెల్లడించింది. "మరింత జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఒంటరిగా మిగిలిపోతారు" అని ట్రంప్ హెచ్చరించినట్లు కథనాలు పేర్కొన్నాయి.శాంతి చర్చలపై విభేదాలుప్రస్తుతం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇజ్రాయెల్ పాత్ర పరిమితంగా ఉండటం, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా కొంత సడలింపు చూపుతుందనే అనుమానాలు నెతన్యాహు వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొత్తంగా ట్రంప్నకు యుద్ధం ముగింపు రాజకీయ లాభం అయితే, నెతన్యాహుకు ఇరాన్పై మరింత ఒత్తిడి కొనసాగించడం రాజకీయ అవసరంగా మారింది. ఈ విభిన్న లక్ష్యాలే ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో కనిపిస్తున్న చీలికకు ప్రధాన కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
యుద్ధానికి ముగింపు? కీలక ప్రకటన చేసిన ఇరాన్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ ఘర్షణ ముగింపుకు చేరువైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ట్రంప్ ప్రకటనలను ఖండిస్తూ వచ్చిన ఇరాన్.. ఈసారి కాస్త సానుకూలంగానే స్పందించింది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన హర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనున్న నేపథ్యంలో.. అసలు ఈ ఒప్పందంలో ఏం ఉండబోతోంది? యుద్ధం ముగిస్తే ఎవరు గెలిచినట్లు?.. అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదాపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా పరిపాలనలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే కొద్ది రోజుల్లో తొలి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు ఖరారైందని ప్రకటించింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. చర్చలు తుది దశకు చేరాయని అన్నారు. "అమెరికాతో ఒప్పందం ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదు" అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆ పోస్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు.ఇరాన్ మీడియా ప్రచురించిన 14 అంశాల అవగాహన ఒప్పందం వివరాలను ట్రంప్ ఖండించారు. ఇటు అసలు షరతులపై ఊహాగానాలు చేయొద్దని అరాఖ్చీ మీడియాను కోరారు. చర్చలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఈ యుద్ధంలో తామే గెలిచినట్లు ఇరాన్ ప్రకటించుకోవడం.. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.అదే కీలకంఈ ప్రతిపాదిత ఒప్పందంలో.. అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి ఉండబోతోందని తెలుస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. యుద్ధం తర్వాత ఇరాన్ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా అమెరికా ఇరాన్పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు, నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడదీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.అణు ఒప్పందం.. ఆగాల్సిందే!అయితే అణు కార్యక్రమం అంశం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. 60 రోజులపాటు ప్రత్యేక చర్చలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందంలో ప్రతిపాదించినట్లు సమాచారం. అమెరికా వాదన ప్రకారం ఇరాన్ అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ మాత్రం యురేనియాన్ని పూర్తిగా వదులుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. దాన్ని తక్కువ శుద్ధి స్థాయికి మార్చే (డౌన్బ్లెండింగ్) మార్గానికే తాము సిద్ధమని అరాఖ్చీ ఓ అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ ఒప్పందంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యుద్ధ నష్టాలకు పరిహారం, అలాగే ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా చాలా కాలంగా చేస్తున్న డిమాండ్లను పక్కన పెట్టే అవకాశాలపై కూడా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా అధికారులు ఈ అంశాలను ఖండిస్తున్నారు.ఇది ఇంకో ట్విస్ట్ఇక ఈ చర్చల్లో ఇజ్రాయెల్ భాగస్వామి కాకపోవడం మరో కీలక పరిణామం. అమెరికాతో కలిసి ఇరాన్పై సైనిక చర్యలకు దిగిన ఇజ్రాయెల్.. తుది ఒప్పందంలో భాగం కాదని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే లెబనాన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతుందని ఇరాన్ కోరుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాత్రం అలాంటి ఆలోచన లేదని ప్రకటించింది.ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరాలపై భయాలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం తన ప్రధాన లక్ష్యాలను నెరవేర్చిందని చెబుతున్నప్పటికీ, ఒప్పంద నిబంధనలు ఇరాన్కు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు “యుద్ధంలో విజేత ఇరానే” అని టెహ్రాన్ ప్రకటించడం ఈ ఒప్పందం చుట్టూ మరింత రాజకీయ ఆసక్తిని పెంచుతోంది.ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా ఒక్క విషయంపైనే ఉంది. నిజంగానే యుద్ధానికి ముగింపు పలికే చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందా? లేదంటే చివరి క్షణంలో మళ్లీ కొత్త మలుపులు తిరుగుతుందా?.. -
యుద్ధం ముగిసింది
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. శాంతి ఒప్పందం ఖరారు చేసుకోవడానికి అత్యంత చేరువలోకి వచ్చామని అన్నారు. ఒప్పందంపై ఈ వారాంతంలోనే సంతకాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. యూరప్లో సంతకాలు జరిగే అవకాశం ఉందన్నారు. గురువారం మధ్యాహ్నం వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్తో శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమానికి తమ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇరాన్తో తాజా చర్చలకు సంబంధించి ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, పాకిస్తాన్లతో సహా మధ్యప్రాచ్య దేశాల నాయకులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఇరాన్తో ఒప్పందాన్ని స్టాక్ మార్కెట్ కూడా అనుకూలంగా భావిస్తోందని చెప్పారు. ఒప్పందం ఖరారైన తర్వాత హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని వివరించారు. ఇది చాలా బలమైన, సమగ్రమైన అవగాహన ఒప్పందమని, కచ్చితంగా కార్యరూపం దాల్చబోయే విషయమని వ్యాఖ్యానించారు. ‘‘చాలా తక్కువ మంది మాత్రమే తట్టుకోగలిగే తీవ్రమైన దెబ్బలను వారు(ఇరాన్) ఎదుర్కొన్నారు. అందుకే శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని నాకంటే వారే ఎక్కువగా కోరుకుంటున్నారు’’అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మా డిమాండ్కు ఇరాన్ అంగీకారం అనంతరం.. గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న జార్జియా లెఫ్టినెంట్ గవర్నర్ బర్ట్ జోన్స్కు మద్దతుగా నిర్వహించిన ఆన్లైన్ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. ఈ రోజు (గురువారం) ఇరాన్తో యుద్ధాన్ని ముగించామని ప్రకటించారు. ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదన్న తమ డిమాండ్కు ఇరాన్ అంగీకరించిందని ఉద్ఘాటించారు. ఇరాన్ వద్ద ప్రాణాంతక ఆయుధాలు ఉండకూడదని, అదే తమ అసలు ఉద్దేశమని వివరించారు. ‘‘వారు(ఇరాన్) అణ్వాయుధాన్ని కొనుగోలు చేయరు లేదా ఏ విధంగానూ దానిని అభివృద్ధి చేయరు. వారి వద్ద అణ్వాయుధం ఉండదు’’అని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్పై దాడులు ఆపాలని అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందంపై జెనీవాలో సంతకాలు జరుగుతాయని ప్రచారం సాగుతోంది. అలాంటిదేమీ లేదు: ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరినట్లేనని, ఈ వారాంతంలో సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఒప్పందం కుదిరిందన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. -
30 దేశాలు.. 120 బయోల్యాబ్స్ - అమెరికా ఫండింగ్?
అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా 30కిపైగా దేశాల్లో ఉన్న 120కు పైగా బయోలాజికల్ ల్యాబొరేటరీలకు ఆర్థిక సహాయం అందించిందని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) తులసి గబ్బార్డ్ వెల్లడించారు. ఈ సమాచారం తాజాగా డీక్లాసిఫై చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగా బయటకు వచ్చింది. ఈ ప్రకటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.ఈ బయోల్యాబ్స్లో అనేక ప్రమాదకరమైన, అత్యంత సంక్రమణ వ్యాధులు కలిగించే వైరస్లు, బ్యాక్టీరియాలపై పరిశోధనలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా 'గైన్-ఆఫ్-ఫంక్షన్' అనే రకం పరిశోధనలు తక్కువ పర్యవేక్షణలో జరిగాయని DNI కార్యాలయం పేర్కొంది. ఈ రకమైన పరిశోధనలు వైరస్లను మరింత శక్తివంతంగా లేదా ప్రమాదకరంగా మార్చే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.తులసి గబ్బార్డ్ ప్రకారం.. అమెరికా ప్రభుత్వం ఈ ల్యాబ్స్ ఉన్న ప్రదేశాలు, అక్కడ ఉన్న రోగకారకాలు, అలాగే జరుగుతున్న పరిశోధనలను గుర్తించి వాటిపై కఠిన నియంత్రణ తీసుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే పరిశోధనలను ఆపేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.డీక్లాసిఫై చేసిన పత్రాల్లో ఉక్రెయిన్లో ఉన్న 40కు పైగా ల్యాబ్స్ సోవియట్ కాలం నాటి బయోలాజికల్ వెపన్స్కు సంబంధించిన రోగకారకాలపై పని చేశాయని పేర్కొన్నారు. వీటిలో ఆంథ్రాక్స్, ఈబోలా, MERS, SARS, ప్లేగ్ వంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వాలు, కొంతమంది ఆరోగ్య నిపుణులు ఈ బయోల్యాబ్స్ గురించి ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వలేదని తులసి గబ్బార్డ్ ఆరోపించారు. ఈ అంశాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసిన వారిని కూడా అడ్డుకున్నారని ఆమె పేర్కొన్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గైన్-ఆఫ్-ఫంక్షన్ పరిశోధనలకు ఇచ్చే ఫెడరల్ నిధులను ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసినట్లు సమాచారం. ఇది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర పరిశోధనలను నియంత్రించడానికి కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. -
టెక్సాస్లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి!
అమెరికాలోని టెక్సాస్లోని మిడ్ల్యాండ్లో ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కాల్పులు ఉదయం సుమారు 8 గంటల సమయంలో నగరంలోని ఒక ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. తరువాత ఘటన మరింత విస్తరించి ఒక వెటర్నరీ హాస్పిటల్ సమీపానికి చేరుకుంది. పరిస్థితి తీవ్రమవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వెంటనే చర్యలు ప్రారంభించారు.🚨 UPDATE: Midland Texas shooter contained. 11 Injured, 1 killed. pic.twitter.com/U0sjuiyFPJ— Juanita Broaddrick (@atensnut) June 12, 2026ఈ ఘటన సమయంలో కనీసం 40 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయని సమీపంలోని ఒక ఆటోమొబైల్ బాడీ షాప్లో పనిచేసే ఆండ్రియా మెండియాస్ తెలిపారు. ఆమె తీసిన వీడియోల్లో ఆర్మర్డ్ పోలీస్ వాహనాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే డ్రోన్లు, రోబోట్లు కూడా ఘటన స్థలంలో ప్రవేశపెట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.మిడ్ల్యాండ్ మెమోరియల్ హాస్పిటల్ ప్రకారం, గాయపడిన తొమ్మిది మందిలో నలుగురు ఆపరేషన్ థియేటర్లో చికిత్స పొందుతుండగా, మిగతా ఐదుగురు స్థిరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ ఘటనతో నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
తుది దశలో కీలక ఒప్పందం.. ఇరాన్ విదేశాంగ మంత్రి పోస్ట్!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ముగించడానికి అమెరికా - ఇరాన్ దేశాలు ఒక కీలక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి (Abbas Araghchi) ప్రకటించారు. ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.అరాఘ్చీ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో, 'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' గతంలో ఎప్పుడూ లేనంతగా తుది దశకు చేరుకుందని తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే వరకు మీడియా సంయమనం పాటించాలని, ఊహించి చెప్పవద్దని పేర్కొన్నారు.The Islamabad Memorandum of Understanding has never been closer. Pending its finalization, the media should refrain from entering speculation about its content. In line with our responsible and transparent approach, all details will be shared with the public in due course.— Seyed Abbas Araghchi (@araghchi) June 12, 2026ఇటీవల కొన్ని ఇరానియన్ మీడియా సంస్థలు ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను ప్రచురించాయి. దీనిపై స్పందించిన అరాఘ్చీ, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, ఒప్పందం ఖరారైన తర్వాత అన్ని వివరాలను ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు.ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ అంశంపై స్పందించారు. అరాఘ్చీ చేసిన పోస్టును తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేస్తూ.. మీడియాలో వస్తున్న లీకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ మీడియాలో ప్రచురితమైన వివరాలు సరైనవి కావని ఆయన స్పష్టం చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఇంకా కొన్ని విభేదాలు, చర్చించాల్సిన అంశాలు మిగిలి ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ, ఇరు దేశాలు ఒక ఒప్పందం దిశగా ముందుకు సాగడం ప్రపంచ శాంతి, మధ్యప్రాచ్య స్థిరత్వానికి సానుకూల సంకేతం అని చెబుతున్నారు. -
వాణిజ్య నౌకలపై అమెరికా వరుస దాడులు
సాక్షి, ఢిల్లీ: హర్ముజ్ జలసంధిలో 20 మంది భారతీయ నావికులతో వెళ్తున్న 'గినియా-బిస్సావు' పతాకం గల నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇటీవల భారత్కు చెందిన చమురు నౌకలపై అమెరికా తరచుగా దాడులు చేస్తోంది. ఒమన్ సమీపంలోని హర్మూజ్ సముద్ర జలాల్లో చమురు రవాణా నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పూర్తై రెండురోజులైన గడవక ముందే మరోసారి భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడులు చేసింది. దీంతో ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది..ఈ ఘటనను నిరసిస్తూ (శుక్రవారం) భారత్లోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి , అమెరికా రాయబారితో ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు బుధవారం నాడు 'పలావు' పతాకంగల MT సెట్టెబెల్లో నౌకపై జరిగిన దాడికి సంబంధించి కూడా జేసన్ మీక్స్ను MEA పిలిపించి మాట్లాడింది. మూడు రోజుల్లో అమెరికా దౌత్య కార్యాలయానికి సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి.భారతీయ నావికులే టార్గెట్గా జరుగుతున్న ఈ దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి సమీపంలో భారత నౌకాదళం అత్యున్నత నిఘాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. "వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు తక్షణమే ముగియాలి. అంతర్జాతీయ చట్టాలకు లోబడి అంతర్జాతీయ జలమార్గాలలో స్వేచ్ఛా వాణిజ్యం, నౌకల రాకపోకలను పునరుద్ధరించాలి. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల భారతీయ నావికులకు ముప్పు వాటిల్లడం తీవ్ర ఆందోళనకరం." అని తెలిపింది.కాగా ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో 18,000 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, క్షేమం, దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో స్టాక్ సూచీలు ఎగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 461.30 పాయింట్లు లేదా 1.99 శాతం పెరిగి 23,622.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,695.40 పాయింట్లు లేదా 2.30 శాతం పెరిగి 75,527.95 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 50 ఇండెక్స్లో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టూబ్రో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 2.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 2.8 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది. -
ఇరాన్పై యుద్ధం.. ట్రంప్ను లైట్ తీసుకున్న నెతన్యాహు?
జెరూసేలం: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ముందే సమాచారం లేకపోవడం, ఆయనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న తిరుగులేని శక్తి పరిమితులను బహిర్గతం చేస్తున్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇటీవల ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా నెతన్యాహుతో మాట్లాడారు. ఇరాన్తో తాము జరుపుతున్న అణు చర్చలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ప్రతీకార దాడులకు వెళ్లవద్దని ఆయన ఇజ్రాయెల్ను కోరారు. అయితే, ఈ విజ్ఞప్తిని లైట్ తీసుకుంది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ట్రంప్ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఈ పరిణామాలపై అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా అగ్రరాజ్య హోదాకు, దాని శక్తికి అవమానకరం. దాడి చేయవద్దని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా నెతన్యాహును కోరినప్పటికీ, ఇజ్రాయెల్ వెనుకాడకుండా దాడికి తెగబడింది. ఇది పశ్చిమాసియాలో అమెరికా ప్రభావం ఎంతలా తగ్గిపోయిందో స్పష్టం చేస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో ఇరాన్తో త్వరలోనే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లేదా మంగళవారంలోగా సంతకాలు జరుగుతాయి అని కూడా ఆయన ప్రకటించారు. ఇరాన్ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మీరు క్షిపణులు ప్రయోగించారు. ఇక చాలు. ఇప్పుడు చర్చలకి రండి’ అని పిలుపునిచ్చారు. కానీ, ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులు ఈ చర్చల ప్రక్రియను మరింత సంక్లిష్టం చేశాయి.మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దృక్పథం పూర్తిగా భిన్నంగా ఉంది.ఇరాన్ అణు ప్రణాళికలు,క్షిపణి సామర్థ్యాల విస్తరణ, ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఇస్తున్న మద్దతు..వీటన్నింటినీ ఇజ్రాయెల్ తన దేశ అస్తిత్వానికే ముప్పుగా భావిస్తోంది. అమెరికా కుదుర్చుకునే తాత్కాలిక దౌత్య ఒప్పందాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపలేవని నెతన్యాహు నమ్ముతున్నారు.ఈ పరిణామాలు సాంప్రదాయ మిత్రదేశాలైన అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలలో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తనను తాను ఒక ‘ప్రపంచ శాంతి దూత’గా నిరూపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ఇమేజ్కు భంగం కలిగిస్తోంది. ఒకవేళ ఇరాన్తో అమెరికా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఇజ్రాయెల్ దానిని అంగీకరించేలా లేదనే అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో బలంగా వ్యక్తమవుతోంది. -
ఇరాన్ కోసం మెట్టు దిగిన ట్రంప్.. భారీ ఆఫర్!
అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించిన తాజా శాంతి ఒప్పంద ముసాయిదాలో, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల అంశంపై కొంత సడలింపు చూపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదని, పూర్తి వివరాలు రెండో దశ చర్చల్లో ఖరారు కావాల్సి ఉందని సమాచారం.ఇరాన్ అణు కార్యక్రమం చాలా కాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియాన్ని దేశం వెలుపలికి తరలించాలని, లేదా పూర్తిగా నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేసింది. అయితే తాజా చర్చల్లో ఇరాన్ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని కొనసాగించబోమని హామీ ఇవ్వడం, అలాగే అణు నిల్వల భవిష్యత్పై ప్రత్యేక చర్చలకు అంగీకరించడం వల్ల చర్చల్లో పురోగతి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక, ట్రంప్ గతంలో పలుమార్లు ఇరాన్ యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని, వాటిని ఇరాన్ వద్ద ఉంచబోమని ప్రకటించారు. కానీ తాజా అవగాహన ఒప్పందంలో యురేనియం నిల్వల నిర్వహణపై మరింత సౌలభ్యవంతమైన విధానం అవలంబిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఈ అంశంపై అమెరికా, ఇరాన్ వర్గాల నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తుండటంతో తుది నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఐరాస ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో ఈ యురేనియం నిల్వలపై సంతకాల కార్యక్రమం జెనీవాలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జేడీ వాన్స్ పర్యటనకు అవసరమైన పరికరాలతో నాలుగు సీ-17 విమానాలు ఐరాపాకు ప్రయాణం అయ్యాయి.ఇదిలా ఉండగా, ఇరాన్ మాత్రం తమ శుద్ధి చేసిన యురేనియం దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని, దాన్ని విదేశాలకు తరలించే ఒప్పందం ఇప్పటివరకు కుదరలేదని స్పష్టం చేసింది. ఇరాన్ అధికారులు యురేనియం నిల్వలపై తుది నిర్ణయం భవిష్యత్ అణు చర్చల్లోనే తీసుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళిక అమల్లోకి వస్తే, హార్మూజ్ జలసంధి పునఃప్రారంభం, ఆంక్షల సడలింపు, అణు చర్చల కొనసాగింపు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యురేనియం నిల్వల భవితవ్యమే ఈ ఒప్పంద విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశంగా మారింది. -
డొనాల్డ్ ట్రంప్కు ఊరట
వాషింగ్టన్: ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న అమెరికా 10 శాతం గ్లోబల్ టారిఫ్ల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తాత్కాలిక ఊరట లభించింది. ఈ సుంకాలను నిలిపివేయాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే విధించిన స్టేను అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తాజాగా పొడిగించింది. దీంతో కేసుపై తుది విచారణ పూర్తయ్యే వరకు ఈ టారిఫ్లు అమల్లోనే ఉండనున్నాయి.అమెరికాలోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీళ్ల కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు ప్రకారం.. ట్రంప్ ప్రభుత్వం ముగ్గురు దిగుమతిదారుల నుంచి 10 శాతం సుంకాలను వసూలు చేయడం కొనసాగించవచ్చు. ఈ ముగ్గురిలో రెండు చిన్న వ్యాపార సంస్థలతో పాటు, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కొనుగోళ్లపై సుంకాలు చెల్లించిన వాషింగ్టన్ రాష్ట్రం కూడా ఉంది.వాస్తవానికి మే 7న అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు (U.S. Court of International Trade) ఈ టారిఫ్లకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా సుంకాల వసూళ్లను నిలిపివేయకుండా, కేసు దాఖలు చేసిన ముగ్గురు పిటిషనర్లకే పరిమిత ఉపశమనం కల్పించింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం వెంటనే అప్పీల్కు వెళ్లగా.. మే 12న అప్పీళ్ల కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చి టారిఫ్ల వసూళ్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అదే స్టేను మరింత కాలం కొనసాగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.అమెరికా సుప్రీంకోర్టు 2025లో ట్రంప్ విధించిన పలు టారిఫ్లను రద్దు చేసిన తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ప్రభుత్వం ‘ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 122’ కింద కొత్తగా 10 శాతం గ్లోబల్ టారిఫ్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి లేకుండానే పరిమిత కాలానికి దిగుమతులపై సుంకాలు విధించే అధికారం కలిగి ఉంటారు.ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్ జూలైలో ముగియాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ గడువు పొడిగిస్తే మరింత కాలం కొనసాగించే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, టారిఫ్ల చట్టబద్ధతపై తుది తీర్పు ఇంకా రావాల్సి ఉంది. కేసు పూర్తయిన తర్వాత కోర్టు ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే.. ఇప్పటివరకు వసూలు చేసిన సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి రావచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.మొత్తంగా చూస్తే.. ట్రంప్ టారిఫ్ విధానానికి ఇది తాత్కాలిక న్యాయ విజయం. అయితే ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్లు భవిష్యత్తులో కొనసాగుతాయా? లేక కోర్టు వాటికి బ్రేక్ వేస్తుందా? అన్నది తుది తీర్పుపైనే ఆధారపడి ఉంది. -
అమెరికా సంబంధమని ఆశపడితే అంతే సంగతి.. భారత మహిళ షాకింగ్ నిజాలు..
-
ఒమన్ తీరంలో నౌకపై దాడి.. సురేష్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో వైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ సురేశ్ పట్నాల మృతిచెందడం అత్యంత విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సురేశ్ పట్నాల ఉండటం మరింత కలచివేసిందని అన్నారు. ఒక మెరైన్ ఇంజినీర్ ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమన్నారు. సురేష్ను కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న వేదన మాటల్లో చెప్పలేనిదన్నారు.మృతుడు సురేశ్ పట్నాల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు వారికి ఇవ్వాలని కోరారు. సురేశ్ పట్నాల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఒమన్ తీరంలో నౌకపై దాడివైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ పత్నాల సురేష్ (44) విధులు నిర్వహించిన నౌకపై ఒమన్ తీరంలో అమెరికా సైన్యం మిసైళ్లతో దాడి జరిపింది. ఈ దాడిలో ఆయనతో పాటు మరో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జూన్ 10న హర్మూజ్ జలసంధిలోని ఒమన్ తీరంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే ఆయిల్ ట్యాంకర్పై మిసైల్ దాడి సమయంలో జరిగింది. ఈ నౌక ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటూ నిబంధనల్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిందని అమెరికా సైన్యం ఆరోపించింది.ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా సైన్యం జరిపిన మిసైల్ దాడిలో సురేష్తో పాటు హిమాచల్ ప్రదేశ్ నివాసి ఆదిత్య శర్మ (23) ఉన్నారు. మూడవ బాధితుడు ఎవరనే పూర్తి వివరాలు వెలువడలేదు. సదరు బాధితుడు భారతీయుడేనని అధికారులు ధృవీకరించారు -
ట్రంప్ హామీ.. డీల్ కుదిరిందా? లేదంటే మరో ట్విస్ట్ తప్పదా??
మూడునెలలుగా యుద్ధ జ్వాలల్లో చిక్కుకున్న పశ్చిమాసియా ఒక్కసారిగా ఆశల వైపు చూస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన ఘర్షణకు ముగింపు దగ్గరపడిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అయితే అదే సమయంలో ఇరాన్ నుంచి వచ్చిన స్పందన కొత్త సందేహాలకు తావిచ్చింది. నిజంగానే శాంతి ఒప్పందం కుదిరిందా? లేదంటే ఇంకా చివరి అడ్డంకులు మిగిలే ఉన్నాయా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వారాంతంలోనే రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వైట్హౌజ్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. "ఇరాన్తో యుద్ధానికి అద్భుతమైన పరిష్కారం దొరికింది. కొన్ని పత్రాలపై తుది సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి" అని చెప్పారు.ఒప్పందంపై సంతకాలు యూరప్లో జరగవచ్చని, అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుందని కూడా ఆయన ప్రకటించారు.అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. చర్చల ముసాయిదాలో చాలా భాగం పూర్తయిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒప్పంద ప్రతిపాదన ప్రస్తుతం దేశంలోని కీలక నిర్ణయాధికార సంస్థల పరిశీలనలో ఉందన్నారు. అమెరికా చర్చల మధ్యలో కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తోందని ఆరోపించిన ఆయన.. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన "రెడ్లైన్స్"ను దాటదని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యల మర్మం ఏంటన్నదానిపై కుతూహలం నెలకొంది.ఇక ఈ ఒప్పందంలో అత్యంత కీలక అంశం ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమమే. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని, కొనుగోలు చేయబోదని అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. ఇదే మొత్తం చర్చల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని గతంలాగే పునరుద్ఘాటిస్తోంది.అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై సంయుక్త దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి చివరి వారంనుంచి ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఇరాన్, లెబనాన్లో భారీ నష్టం సంభవించింది. చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ.. పరస్పర దాడులు కొనసాగించాయి. అమెరికా అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసిన ఘటన తర్వాత హర్ముజ్ ప్రాంతంలో అమెరికా కొత్త దాడులు జరిపింది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.ఇదిలా ఉండగా, ఒప్పందానికి ఇరాన్ అత్యున్నత నాయకత్వం కూడా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆమోదం తెలిపారని తనకు సమాచారం ఉందన్నారు. అలాగే ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ సహా పశ్చిమాసియాలోని పలు దేశాలు ఈ ఒప్పందానికి మద్దతు తెలిపాయని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం మాత్రం ఈ అవగాహన ఒప్పందంలో తాము భాగస్వాములు కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇరాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఒప్పందం ఉండాలని ట్రంప్కు నెతన్యాహూ సూచించినట్లు వెల్లడించింది.మొత్తంగా చూస్తే.. ట్రంప్ "డీల్ దాదాపు ఖరారైంది" అంటుండగా, ఇరాన్ "ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు" అంటోంది. నిజంగానే ఈ వారాంతంలో శాంతి ఒప్పందం కుదిరి యుద్ధానికి తెరపడుతుందా? లేదంటే చివరి క్షణంలో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటాయా? అని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
అమెరికా దాడిలో విశాఖ వాసి మృతి
-
అమెరికా దుశ్చర్య!
దుబాయ్/న్యూఢిల్లీ/విశాఖపట్నం/ఐరాస: ఇరాన్పై ముమ్మర దాడులకు తెగించిన అమెరికా బుధవారం ఒమన్ సమీప హార్మూజ్ జలసంధి సముద్రజలాల్లోని ఎంటీ సెటెబె చమురురవాణా నౌకపై జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించారు. వరసబెట్టి భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్యనౌకలపై అమెరికా దాడులు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛావాణిజ్యానికి భంగం కల్గించేలా కాల్పులు జరపడం చట్టవ్యతిరేకమని భారత్ పునరుద్ఘాటించింది. తక్షణం కాల్పుల పర్వానికి ఫుల్స్టాప్ పెట్టాలని భారత్ సూచించింది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్డిఅఫైర్స్ జేసన్ను పిలిపించి భారత్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మృతదేహాల స్వా«దీనం ఎంటీ సెటెబె నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు గల్లంతైనట్లు బుధవారం వార్తలొచ్చాయి. అయితే వాళ్లు ప్రాణాలు కోల్పోయారని, వాళ్ల మృతదేహాలను స్వా«దీనంచేసుకున్నామని భారత నౌకాయాన మంత్రి శర్బానంద సోనోవాల్ గురువారం ప్రకటించారు. వాళ్ల కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ అన్నివేళలా అండగా ఉంటారని మంత్రి భరోసా ఇచ్చారు. సెటెబెపై దాడిలో మిగతా 21 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ తీరగస్తీ బలగాలు కాపాడాయని మంత్రి వెల్లడించారు. 24 మంది భారతీయ సిబ్బంది ఉన్న మరో చమురు రవాణా నౌక మారీవెక్స్పై అమెరికా దాడిలో మొత్తం 24 మందినీ కాపాడటం తెల్సిందే. మూడో నౌక మీదా దాడి భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడులపర్వం గురువారమూ కొనసాగింది. ఒమన్లోని షినాస్ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎంటీ జల్వీర్ నౌక పైనా అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావూ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధవిమానం నుంచి రెండు హెల్ఫైర్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించింది. ఇవి నౌక ఇంజిన్ రూమ్ను నాశనం చేశాయి. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది. ఒమన్ రాయల్ నేవీ దళాల సాయంతో నౌకలోని 22 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా తీసుకొస్తున్నామని మస్కట్ నగరంలోని భారతీయ రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో స్పష్టంచేసింది. గత నాలుగు రోజుల వ్యవధిలో భారతీయులున్న నౌకపై అమెరికా దాడి చేయడం ఇది మూడోసారి అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైశ్వాల్ తెలిపారు. భారతీయ సిబ్బంది ఉన్నారని తెలిసీ దాడిచేశామని అమెరికా గురువారం తొలిసారిగా ఒప్పుకుంది. ‘‘ఎంటీ జల్వీర్ ఇరాన్ చమురును అనుమతిలేకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా తరలిస్తోంది. దిశ మార్చుకోవాలని పదేపదే హెచ్చరించినా బేఖాతరు చేశారు. అందుకే నౌకపై దాడిచేశాం’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ తన చర్యను సమర్థించుకుంది. 2 వారాల్లో 15వ వివాహ వార్షికోత్సవం అమెరికా దాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు వ్యక్తి 44 ఏళ్ల పటా్నల సురేశ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారని ఢిల్లీలోని ఆంధ్రభవన్ గురువారం ప్రకటించింది. భార్య భార్గవితో కలిసి జూన్ 24వ తేదీన 15వ వివాహ వార్షికోత్సంకోసం స్వస్థలానికి వచ్చేందుకు సురేశ్ అధికారుల అనుమతి తీసుకుని ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో సురేశ్ మృతి వార్త తెలిసి అతని కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. ఆయనకు 12, 10 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మరణించాడన్న వార్త తెలిసి పిల్లలిద్దరూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘గత ఐదు నెలలుగా సముద్రంలో విధినిర్వహణలో ఉండిపోయారు. మ్యారేజ్డే కోసం త్వరలో ఇంటికొస్తున్నా అని చెప్పారు. కానీ ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మెరైన్ ఇంజనీరింగ్ను ఆయన వృత్తిలా భావించరు. ఎంతో తపనతో పనిచేస్తారు’’అని భార్య భార్గవి వాపోయారు.ఐరాస వేదికగా భారత్ నిరసన అమెరికా దాడి సంస్కృతిపై భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా ధ్వజమెత్తింది. ఏకపక్ష దాడులను తక్షణం నిలిపేయాలని డిమాండ్చేసింది. ఐరాస భద్రతా మండలిలో ‘అంతర్జాతీయ శాంతి,భద్రత: మధ్యవర్తిత్వం ద్వారా పశ్చిమాసియా సమస్యకు పరిష్కారం’’అంశంపై జరిగిన చర్చలో ఐరాసలో భారతరాయబార శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. ‘‘పశ్చిమాసియా దేశాలపై దాడులు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై దాడులు జరుగుతున్నాయి. సముద్రగర్భ కేబుళ్లూ ధ్వంసమవుతున్నాయి. పశ్చిమాసియాలో సుస్థిరత కొనసాగాలంటే వాణిజ్యం, ఇంధన సరఫరా గొలుసులు అస్సలు తెగిపోకూడదు. అగ్రరాజ్యం(అమెరికా) దాడులు ఆపాల్సిందే’’అని హరీశ్ గట్టిగా డిమాండ్చేశారు. -
ట్రంప్ క్యాబినెట్లోకి కీలక వ్యక్తి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై దాడులకు బ్రేక్ ఇచ్చిన తరువాత, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పదవికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.'జే క్లేటన్'ను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) పదవికి ఎంపిక చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ పదవి అమెరికా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన భద్రతా బాధ్యతలలో ఒకటి. దేశంలోని అన్ని గూఢచార సంస్థల పనిని సమన్వయం చేయడం ఈ పదవి ప్రధాన బాధ్యత.జే క్లేటన్ను అమెరికా అధ్యక్షుడు అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా పేర్కొన్నారు. ఈయన గతంలో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) చైర్మన్గా పని చేశారు. అంతే కాకుండా ఈయన సులివన్ & క్రామ్వెల్ మాజీ హెడ్, ప్రస్తుతం న్యూయార్క్ దక్షిణ జిల్లాకు యునైటెడ్ స్టేట్స్ అటార్నీగా పనిచేస్తున్నారని కూడా వెల్లడించారు.నా మంత్రివర్గంలో పనిచేయడానికి క్లేటన్ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఈయన నియామకాన్ని వీలైనంత త్వరగా ధృవీకరించాలని నేను యునైటెడ్ స్టేట్స్ సెనేట్ను కోరుతున్నాను ట్రంప్ పేర్కొన్నారు. -
ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!
మధ్యప్రాచ్యంలో ఏర్పడిన ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ఇరాన్ - అమెరికా మధ్య జరిగిన యుద్ధం చమురు ధరలు భారీ పెరుగుదలకు కారణమైంది. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై దాడి ప్రణాళికలను రద్దు చేసినట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ఊహకందని మార్పులు జరిగాయి.ట్రంప్ ప్రకటన అనంతరం చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 3.6 శాతం తగ్గి బ్యారెల్కు 89.73 డాలర్లకు చేరుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ కూడా అదే స్థాయిలో తగ్గి 86.83 డాలర్లకు పడిపోయాయి. ఈ తగ్గుదల పెట్టుబడిదారులలో తాత్కాలిక ఊరటను కలిగించింది.ఇరాన్పై అమెరికా “కఠిన చర్యలు” తీసుకుంటుందనే హెచ్చరికలు, అలాగే మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లలో ఆందోళనకు కారణమయ్యాయి. చమురు సరఫరా మార్గాలపై ప్రభావం పడవచ్చన్న భయంతో ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే పరిస్థితులు మారడంతో మార్కెట్ దిశ కూడా వెంటనే మారిపోయింది.ట్రంప్ ప్రకారం.. ఇరాన్ నాయకత్వంతో అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. తుది అంశాలపై అన్ని పక్షాల అంగీకారం లభించింది. ఈ కారణంగానే సైనిక దాడులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. చర్చలు పరోక్షంగా కొనసాగుతున్నాయని, శాంతి ఒప్పందం దిశగా కొన్ని కీలక అంశాలు ముందుకు సాగుతున్నాయని సమాచారం.అయితే.. ఈ ప్రకటనలో తుది ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఒప్పందం పూర్తయ్యే వరకు పరిస్థితులు పూర్తిగా స్థిరపడినట్లు చెప్పలేమని స్పష్టమవుతోంది. అయినప్పటికీ, సైనిక చర్యల భయం తగ్గడంతో ప్రపంచ చమురు మార్కెట్లు తాత్కాలికంగా స్థిరత్వం దిశగా కదులుతున్నాయి. -
భారత నౌకలపై దాడులా?
ప్రపంచానికి పీడలా పరిణమించిన అమెరికా... భారత్ వస్తున్న నౌకలపై తన ప్రతాపాన్ని చూపటం మొదలెట్టింది. మంగళవారం ఒమన్ తీరంలో 24 మందితో వెళ్లే నౌకపై క్షిపణి ప్రయోగించటంతో ముగ్గురు నావికులు మరణించారు. వారిలో ఒకరు ఆంధ్ర ప్రదేశ్కు చెందిన పట్నాల సురేష్ అనే చీఫ్ మెరైన్ ఇంజినీర్. అంతకుముందు రోజు సైతం భారత్కు వస్తున్న మరో నౌకపై ఇలాగే దాడి జరగ్గా, అందరూ క్షేమంగా బయట పడగలిగారు. ఆ రెండు నౌకలూ భారత్కు చెందినవని తెలిసే ఉద్దేశపూర్వకంగా దాడి చేశా రని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ రెండు ఉదంతాల్లోనూ ఒమన్ సైన్యం మన నావికుల్ని ఆదుకుంది. తమ నిషేధాన్ని ధిక్కరించి ఇరాన్నుంచి చమురు కొనుగోలు చేసి వెళ్తుండటంవల్లే దాడులు చేశామని అమెరికా సైనిక దళం పశ్చిమాసియా సెంట్రల్ కమాండ్ (సెంట్కాం) అంటున్నది. ఒకపక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రాణ మిత్రుడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతారు. మనతో వాణిజ్య ఒప్పందం కోసం వెంపర్లాడతారు. కానీ భారత్కొస్తున్న వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తారు. అసలు రెండు దేశాల మధ్య కుదిరే వాణిజ్య లావాదేవీలపై, సంబంధం లేని మూడో దేశం ఆంక్షలు విధించటమేమిటి? మనం ఎవరి దగ్గర కొనాలో, కొనకూడదో చెప్పడానికి ట్రంప్ ఎవరు?దాడులు జరిగిన ప్రాంతం అమెరికాకు సరిహద్దేమీ కాదు. ఆ నౌకల గమనంవల్ల దానికి కలిగే ముప్పేమీ లేదు. అయినా ఖండాంతరాలు దాటి, వేల మైళ్లు ఈవలకొచ్చి విధినిషేధాలు పెట్టడం వింత కాదా? ఒక్క సెంట్కాం మాత్రమే కాదు... భూగోళమంతటా వేర్వేరు పేర్లతో అమెరికా పహారా కాస్తోంది. ఆఫ్రికాలో ‘ఆఫ్రికాం’, ఇండో–పసి ఫిక్లో ‘ఇండోపాకాం’, యూరప్లో ‘ఈయూకాం’, ఉత్తరమెరికాలో ‘నార్త్ కాం’ పేరిట సైన్యాల్ని దించి, క్షిపణులు గురిపెట్టి, యుద్ధ విమానాలు మోహరించి, అక్కడక్కడ అణు బాంబులు పోగేసి దేశాలపై పెత్తనం చలాయిస్తోంది. ఈ లక్షలాదిమంది సైన్యాన్ని పోషించటం కోసం అడ్డగోలు సుంకాలతో, వేరే దేశాలకు భారీనష్టం కలిగే వాణిజ్య ఒప్పందా లతో చెలరేగిపోతోంది. చిత్రమేమంటే... ఒక్కటంటే ఒక్క దేశం ‘నీకిక్కడేం పని?’ అని అమెరికాను ప్రశ్నించలేకపోతోంది. తాజా దాడుల తర్వాత మన దేశం గట్టిగా స్పందించింది. అమెరికా చార్జ్ డీ ఎఫైర్స్ జాసన్ మీక్స్ను పిలిపించి, ‘దౌత్యపరమైన నిరసన’ తెలిపింది. అందరూ ముక్తకంఠంతో నిరసిస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది.అక్రమంగా యుద్ధానికి దిగి, శాంతి ఒప్పందానికి రావాలని ఇరాన్ను ట్రంప్ బెదిరి స్తున్నారు. ప్రపంచంలోనే ఎదురులేనిదని గప్పాలు కొట్టుకున్న మిలిటరీ హెలికాప్టర్ అపాచేను అది కూల్చేయటంతో గత మూడు రోజులుగా దాడులు, ప్రతిదాడులతో పశ్చి మాసియా దద్దరిల్లుతోంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. తమ దాడి ఆత్మరక్షణ అని అమెరికా చెప్పు కోవటం సిగ్గుచేటు. ట్రంప్ వచ్చాక అమెరికా రక్షణ శాఖ పేరునే యుద్ధశాఖ అని మార్చాక, అందులో ‘ఆత్మరక్షణ’ ప్రసక్తి ఎక్కడ? అసలు తమ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల ఆవలనున్న దేశాలపై దాడులు జరుపుతూ, దానికి ఆత్మరక్షణ అని పేరెట్టడం నయవంచన కాదా? వేరేవాళ్లపై యుద్ధానికి దిగుతూ, అందుకు పర్యవసానాలుండరాదని ట్రంప్ అత్యాశకు పోతున్నారు. స్వల్పకాలంలోనే ఇరాన్ కీలక చమురు క్షేత్రాలున్న ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటానని హెచ్చరికలు జారీచేస్తున్నారు.నాలుగో నెలలోకి ప్రవేశించిన ఈ యుద్ధంవల్ల ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ పెను సంక్షోభంలో కూరుకుపోయాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో ప్రపంచ చమురు మార్కెట్ ఒక్కసారిగా భగ్గుమంది. దాడులకు వెరవకుండా ఇరాన్ దీటైన జవాబివ్వటంతో అమెరికాకు ఎటూ పాలుబోవడం లేదు. నిజంగా ట్రంప్ అంటున్నట్టు ఖర్గ్ ద్వీపం జోలికిపోతే ఇది మరింత వికటించి, పరిస్థితులు ఇంకా క్షీణిస్తాయి. దురదృష్టమేమంటే, అమెరికాకు ఎవరూ నచ్చజెప్పే స్థితి లేదు. పటిష్టమైన వ్యవస్థలున్నాయనుకున్న ఆ దేశంలోనూ ఏ ఒక్కటీ ట్రంప్ను నియంత్రించలేకపోతోంది. అక్కడి ప్రజల్లో కదలికవచ్చి, ట్రంప్పై ఒత్తిళ్లు పెరగనంతకాలం ప్రపంచం ఇలా బిక్కుబిక్కుమని బతుకీడ్చక తప్పదు. -
రూపాయి 60 పైసలు క్రాష్..!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ 60 పైసలు క్షీణించి 95.85 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం కావడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 95.55 వద్ద ప్రారంభమైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనవుతూ, కోలుకోలేకపోయింది. ఒకానొకదశలో ఇంట్రాడే కనిష్ట స్థాయి 95.85ను తాకిన రూపాయి, చివరికి అదే స్థాయి వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 95 డాలర్ల దిశగా కదలడం, అమెరికా చమురు నిల్వలు తగ్గడం వల్ల సరఫరా కొరత భయాలు నెలకొన్నాయి. -
తూచ్.. మేము బాంబులెయ్యం!
ఈ రాత్రి ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేశారు. అయితే తాజాగా.. డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇందులో ''ఈ సాయంత్రం ఇరాన్పై జరగాల్సిన వైమానిక దాడులను, బాంబు దాడులను రద్దు చేశాను'' అని పేర్కొన్నారు.ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో చర్చలు ఇరాన్ నాయకత్వంలోని అత్యున్నత స్థాయికి చేరి, ఆమోదం పొందాయి. కాబట్టి నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా, ఈ సాయంత్రం ఇరాన్పై జరగాల్సిన దాడులను రద్దు చేశాను. తుది ఒప్పందానికి అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్తాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్, ఇతరులతో సహా ఇందులో పాలుపంచుకున్న అన్ని పక్షాలు, ఈ చర్చలకు ఆమోదం తెలిపాయి.ఒప్పందం ఖరారయ్యే వరకు.. నౌకాదళ దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమలులో ఉంటుంది. తుది ఒప్పందానికి సంబంధించిన సమయం, ప్రదేశం వంటి విషయాలను తాను అధికారికంగా ప్రకటించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. -
గంట తరువాత బిడ్డ చావు కబురు.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి!
గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో.. జరిగిన ఒక విషాదకర ఘటన భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలావు (Palau) దేశ జెండా కింద ప్రయాణిస్తున్న ఏంటీ సెట్టెబెల్లో (MT Settebello) అనే చమురు ట్యాంకర్పై అమెరికా సైన్యం దాడి చేయడంతో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 23 ఏళ్ల యువకుడు ఆదిత్య శర్మ (Aditya Sharma) కూడా ఉన్నాడు. ఈ సంఘటన అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రత, యుద్ధ నిబంధనలు & భారతీయ నావికుల రక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.అమెరికా ఆరోపణలుఅమెరికా ఆరోపణల ప్రకారం.. ఏంటీ సెట్టెబెల్లో నౌక ఇరాన్ నుంచి చమురును తరలిస్తూ అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించింది. ఈ కారణంగా నౌకపై దాడి చేసినట్లు అమెరికా తెలిపింది. అయితే.. నౌక యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండిస్తూ అంతర్జాతీయ విచారణ జరపాలని డిమాండ్ చేసింది.ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి తర్వాత ఒమాన్ అధికారులు 21 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. అయితే.. ముగ్గురు భారతీయ నావికులు కనిపించకుండా పోయారు. అనంతరం వారి మృతదేహాలను గుర్తించి మరణించినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది. మరణించిన వారిలో డెక్ కేడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ ఉన్నారు.క్షేమంగా ఉన్నా అని మెసేజ్.. అంతలోనేఆదిత్య శర్మ మరణం హృదయ విదారకంగా మారింది. దాడికి ఒక గంట ముందు మాత్రమే ఆయన తన తండ్రికి వాట్సాప్లో ''నేను క్షేమంగా ఉన్నాను'' అని సందేశం పంపారు. ఆ తరువాత జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడి మరణంతో తీవ్ర వేదనకు గురైన ఆయన తండ్రి, వాణిజ్య నౌకపై క్షిపణులతో దాడి చేయడం యుద్ధ నేరంగా పరిగణించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే.. ఏంటీ మారివెక్స్ నౌకపై కూడా అమెరికా దాడికి గురైంది. అందులోని 24 మంది భారతీయ నావికులను ఒమాన్ అధికారులు రక్షించారు. అదేవిధంగా ఏంటీ జాల్వేర్ ఏంటీ జావీర్ అనే మరో నౌక ప్రమాదంలో చిక్కుకోవడంతో భారత రాయబార కార్యాలయం, ఒమాన్ నౌకాదళం సహాయంతో సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది.ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ శాఖ అమెరికా ప్రతినిధిని పిలిపించి అధికారిక నిరసన తెలిపింది. భారత ప్రభుత్వం సముద్ర రవాణా రంగంలో పనిచేస్తున్న భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసింది.ప్రమాదకర పరిస్థితుల్లో నావికులుప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గం. ప్రపంచంలోని రోజువారీ చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల వేలాది మంది నావికులు ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.Three Indian Seafarers killed in US attack on a Vessel off the coast of Oman. 3 attacks in last 4 days. Family of Indian seafarer Aditya Sharma calls it a war crime, demanding investigation. Several Indian crew rescued. India summons top American diplomat, lodges strong protest. pic.twitter.com/fhw4kqTm84— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 11, 2026 -
భారత షిఫ్పై అమెరికా దళాలు దాడి.. తెలుగు ఇంజనీర్ మృతి
విశాఖ: ఒమన్ తీరంలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో తెలుగు ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంకు చెందిన సురేష్ అనే మెరైన్ ఇంజనీర్ మృతిచెందాడు. భారత్కు చెందిన షిప్పై ఒమన్ తీరంలో అమెరికా దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్న విశాఖ వాసి సురేష్ మృత్యువాత పడ్డారు. 15 ఏళ్ల క్రితం సురేష వివాహం కాగా, ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్లుగా మర్చంట్ నేవీలో సురేష్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. దాంతో విశాఖలోని శ్రీహరిపురం శ్రీనివాస నగర్లోని సురేష్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.


