ఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్పై కేంద్రం ప్రకటన చేసింది. అమెరికాతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ట్రేడ్డీల్తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం.ఆక్వా,టెక్స్టైల్స్ ఎగుమితిలో మనకు ఇబ్బందులున్నాయి. వాణిజ్యం ఒప్పందం విషయాన్ని పార్లమెంట్లో చెప్పాలని చూశాం. ఈలోపే ట్రేడ్ డీల్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషం చిమ్మారు.
వాణిజ్య ఒప్పందంతో ఏ వర్గానికి నష్టం జరగదు. బలహీనవర్గాల ప్రజలకు మేలు జరగడం రాహుల్కు ఇష్టం లేదు. ట్రేడ్ డీల్తో లక్షలమంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని స్పష్టం చేశారు.


