breaking news
Russia
-
సుంకాల్లో భారత్ ‘మహారాజ్’.. అమెరికా అధికారి విమర్శలు
వాషింగ్టన్: భారత్ టార్గెట్గా అమెరికా మరోసారి సంచలన విమర్శలు చేసింది. సుంకాల్లో భారత్ను ‘మహారాజ్’ అని పేర్కొంటూ వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ప్రకారమే రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భారత రిఫైనరీలు యుద్ధానికి ఆజ్యం పోస్తూ డబ్బు సంపాదిస్తున్నాయని అన్నారు.వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీటర్.. ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదన్నారు. గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సుంకాలు విధించడంలో భారత్.. ‘మహారాజ్’గా ఉంది. భారత్ సుంకాలు ఎక్కువగా ఉంటాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్కు చెందిన రిఫైనరీలు లాభాలు ఆర్జిస్తున్నాయి. రష్యా ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది.White House Trade Adviser Peter Navarro on India: "Nonsense that India needs Russian Oil""Profiteering by Indian refiners""India has Maharaja tariffs""Road to peace runs thru New Delhi" pic.twitter.com/w64a9nRg2P— Sidhant Sibal (@sidhant) August 21, 2025భారత్కు రష్యన్ చమురు అవసరం అనేది అర్ధం లేనిది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ తన పాత్రను గుర్తించాలని కోరుకోవడం లేదు. భారత్ మనకు వస్తువులను అమ్మి.. వారు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడానికి మన నుండి వచ్చే డబ్బును ఉపయోగిస్తున్నారు. రష్యన్లు ఆ డబ్బును మరిన్ని ఆయుధాలను కొనుగోలు చేయడానికి, ఉక్రెయిన్ ప్రజలపై దాడులు చేయడానికి అది వాడుకుంటున్నారు అని ఆరోపించారు. భారత నాయకత్వాన్ని నేను విమర్శించాలని నేను అనుకోవడం లేదు. మోదీ గొప్ప నాయకుడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర ఏంటో చూడండి.. మీరు ప్రస్తుతం చేస్తున్నది శాంతిని పునరుద్ధరించడానికి కాదు.. అది యుద్ధాన్ని కొనసాగిస్తోంది. రష్యా పట్ల భారత్ తన వైఖరి మార్చుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఆగని రష్యా, ఉక్రెయిన్ దాడులు
-
కాస్త తగ్గిన పుతిన్? ట్రంప్, జెలెన్స్కీ ‘నో’ కామెంట్స్
నాలుగేళ్ల తర్వాత అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు భేటీ అయ్యారు. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగానే ఈ సమావేశం జరిగిందన్నది తెలిసిందే. అయితే ఆ మీటింగ్ సారాంశమేమీ ఇప్పటిదాకా బయటకు రాలేదు.ఆగస్టు 15వ తేదీన మూడు గంటలపాటు రహస్య మంతనాలు చేసిన ఈ ఇరుదేశాల నేతలు.. సంయుక్త మీడియా సమావేశంలో తాము చెప్పాలనున్నది చెప్పి తలోదారి వెళ్లిపోయారు. దీంతో భేటీ సంతృప్తికరంగా జరగలేదనే విశ్లేషణలు నడిచాయి. అయితే తాజాగా ఆ భేటీలో ఉక్రెయిన్కు పుతిన్ చేస్తున్న(అలస్కాలో చేసిన) డిమాండ్లు ఏంటో ప్రస్తావిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. రష్యా అధ్యక్ష కార్యాలయం ‘క్రెమ్లిన్’ వర్గాలు వెల్లడించిన ఆ డిమాండ్లను పరిశీలిస్తే..డోన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా అప్పగించడంనాటోలో చేరాలనే ఆలోచనను పక్కనపెట్టేయడంపశ్చిమ బలగాల మోహరింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదుఉక్రెయిన్పై ఒత్తిడి తగ్గించిన పుతిన్?వాస్తవానికి ఈ మూడు పాత డిమాండ్లే! మరి కొత్తగా పుతిన్ ఏం చెబుతున్నారంటే.. 2024 జూన్లో ఉక్రెయిన్కు పెట్టిన కఠినమైన భూభాగాల డిమాండ్లను కొంత మేర తగ్గించినట్టు రష్యా వర్గాలు అంటున్నాయి. పాత డిమాండ్లను పరిశీలిస్తే.. డోనెత్స్క్(Donetsk), లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను పూర్తిగా రష్యాకు అప్పగించాలి. నాటో సభ్యత్వాన్ని త్యజించాలి. పశ్చిమ దేశాల బలగాలు ఉక్రెయిన్లో మోహరించకూడదు.కొత్త ప్రతిపాదనల్లో.. ఉక్రెయిన్ డోన్బాస్లో తన నియంత్రణలో ఉన్న భాగాల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గాలి. రష్యా జపోరిజ్జియా, ఖెర్సన్ ప్రాంతాల్లో ప్రస్తుత యుద్ధ రేఖలను నిలిపివేస్తుంది. ఖార్కివ్, సుమీ, డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతాల్లో రష్యా ఆక్రమించిన చిన్న భాగాలను తిరిగి అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం.. డోన్బాస్లో 88%, జపోరిజ్జియా, ఖెర్సన్లో 73% రష్యా నియంత్రణలో ఉంది.అయితే.. నాటో విస్తరణపై నిషేధం, ఉక్రెయిన్ సైన్యంపై పరిమితులు, పశ్చిమ శాంతి బలగాల మోహరింపు నిషేధం వంటి పాత డిమాండ్లు మాత్రం కొనసాగుతున్నాయి. అదే సమయంలో.. 2022 ఇస్తాంబుల్ ఒప్పందాలను పునరుద్ధరించే అవకాశం కూడా పరిశీలనలో ఉంది. ఇందులో ఐరాస భద్రతా మండలి నుంచి ఉక్రెయిన్కు భద్రతా హామీలు పొందే ప్రతిపాదన ఉంది.ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. గతంలో ఈ డిమాండ్లను "సరెండర్" (లొంగిపోవడం)గా అభివర్ణించిన తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, రష్యా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి వెనక్కి తగ్గే ఆలోచనను పూర్తిగా తిరస్కరించారు.డోనెత్స్క్, లుహాన్స్క్(Donetsk) కలిపిన డోన్బాస్ ప్రాంతం ఉక్రెయిన్కు రక్షణ కోటగా పనిచేస్తుందని జెలెన్స్కీ మొదటి నుంచి చెబుతున్నారు. ‘‘తూర్పు ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గడం అంటే దేశం ఉనికి కోల్పోవడం’’ అని అంటున్నారాయాన. ‘‘ఇది మా శక్తివంతమైన రక్షణ రేఖల అంశం’’ అని కుండబద్దలు కొట్టారు. ఇక.. నాటో సభ్యత్వం.. రాజ్యాంగబద్ధ లక్ష్యమని చెప్పారు. పైగా దీనిని ఉక్రెయిన్కు భద్రతా హామీగా భావిస్తున్నారు. నాటో సభ్యత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు రష్యాకు లేదు అని జెలెన్స్కీ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్, నాటో రష్యా కొత్త ప్రతిపాదనలపై ఇప్పటివరకైతే స్పందించలేదు.అలాస్కాలోని అంకరేజ్ నగరంలో జరిగిన అమెరికా-రష్యా అధ్యక్షులు భేటీ తర్వాత శాంతికి ఉత్తమ అవకాశాలు ఏర్పడినట్టు క్రెమ్లిన్ వర్గాలు అంటున్నాయి. అయితే.. డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం రాజకీయంగా, వ్యూహపరంగా అసాధ్యమైన విషయని పరిశీలకులు అంటున్నారు. రెండు పక్షాలకు అంగీకారయోగ్యంగా లేని షరతులతో శాంతి ప్రతిపాదనలు చేయడం.. ట్రంప్కు షో మాత్రమే కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.అస్పష్టతలు & అడ్డంకులుఉక్రెయిన్ డోన్బాస్ను అప్పగించేందుకు సిద్ధంగా ఉందా? అనే అంశంపై రష్యాకు స్పష్టత లేదు.అమెరికా రష్యా ఆక్రమించిన భూభాగాలను గుర్తిస్తుందా? అనే ప్రశ్న కూడా ఇంకా పరిష్కారమవ్వలేదు.జెలెన్స్కీ అధికార బాధ్యతపై పుతిన్ సందేహాలు వ్యక్తం చేశారు, కానీ కీవ్ ఆయనను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా పేర్కొంటోంది.ట్రంప్ పాత్రఉక్రెయిన్ యుద్ధం ముగించి.. తానొక శాంతి కాముకుడిననే విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పుతిన్, జెలెన్స్కీలతో విడిగా భేటీ అయిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్-అమెరికా త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. -
డ్రోన్లు, క్షిపణులతో రెచ్చిపోయిన రష్యా
కీవ్: రష్యా మరోసారి భీకర గగనతల దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. బుధవారం రాత్రి ఏకంగా 574 డ్రోన్లు, మరో 40 వరకు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. మూడేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య పరమైన ప్రయత్నాలు ఊపందుకున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దేశంలోని పశ్చిమ ప్రాంతాలు లక్ష్యంగా రష్యా చేపట్టిన ఈ దాడుల్లో ఎక్కువగా జనావాసాలకు నష్టం జరిగిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. ఈ ఏడాదిలో రష్యా జరిపిన మూడో అతిపెద్ద డ్రోన్ దాడి, 8వ క్షిపణి దాడి ఇదని వివరించింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు చనిపోగా 15 మంది గాయపడ్డారంది. పశి్చమ దేశాలు అందించిన ఆయుధ సామగ్రి గోదాములు, ఉక్రెయిన్ సైనిక పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. కొన్ని క్షిపణులు హంగరీ సరిహద్దులకు సమీపంలో పడ్డాయని, అమెరికా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ ఒకటి ధ్వంసమైందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఫ్లెక్స్ ఫ్యాక్టరీలో 600 మంది పనిచేస్తున్నారన్నారు. వీరిలో దాడి కారణంగా ఆరుగురికి గాయాలైనట్లు వెల్లడించారు. లీవ్ నగరంపై జరిగిన దాడిలో 26 నివాస భవనాలు దెబ్బతిన్నాయన్నారు. -
భారత ఉత్పత్తులకు స్వాగతం.. ఆందోళన అనవసరం
అమెరికా టారిఫ్ వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఉత్పత్తులను యూఎస్ దిగుమతి చేసుకోకపోతే రష్యా అండగా ఉంటుందని ఇండియాలోని రష్యా రాయబార కార్యాలయానికి చెందిన చార్గే డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు. భారత వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, రష్యా భారత దిగుమతులను సాధ్యమైనంత వరకు స్వాగతిస్తుందని, దాని గురించి ఆందోళన చెందకండంటూ భరోసానిచ్చారు. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల విస్తరణకు ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు.రష్యాతో భారత ఎగుమతులు, దిగుమతుల్లో వ్యాత్యాసం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యత 59 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రష్యా మరిన్ని భారతీయ వస్తువులను దిగుమతి చేసుకోవాలనే సంకేతాలను హైలైట్ చేస్తుంది. బాబుష్కిన్ చేసిన ప్రకటన ప్రత్యామ్నాయ మార్కెట్లను కోరుకునే భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.పెరుగుతున్న వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలుభారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో పర్యటన సానుకూలంగా సాగిందని, ఆచరణాత్మక సహకారానికి భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ) కీలక వేదికగా పనిచేస్తుందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఇరుదేశాల నేతలు ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. అధికారికంగా తేదీని ధ్రువీకరించనప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం గురించి ఊహాగానాలు పెరుగుతున్నాయి.చమురు సరఫరాకు అంతరాయం లేదుభారత్తో చమురు వాణిజ్యానికి సంబంధించి అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా ముడి చమురు ఎగుమతులను కొనసాగిస్తుందని బాబుష్కిన్ పునరుద్ఘాటించారు. భారత్ రష్యా చమురుకు అతిపెద్ద వినియోగదారని, రష్యా అతిపెద్ద చమురు ఉత్పత్తిదారని చెప్పారు. ఏకపక్ష చర్యలు సరఫరా గొలుసులకు విఘాతం కలిగిస్తాయని, ప్రపంచ మార్కెట్లను అస్థిరపరుస్తాయన్నారు.ఆంక్షలు ఉన్నప్పటికీ..రష్యాపై పాశ్చాత్య దేశాలు ఏళ్ల తరబడి ఆంక్షలు విధించినప్పటికీ భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యం విపరీతంగా పెరిగిందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇరు దేశాల వాణిజ్యం ఏడు రెట్లు అయిందన్నారు. పరస్పర చర్చల ద్వారా వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన అన్నారు. భారత్-రష్యా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే టాప్ 10 చమురు కంపెనీలు -
రష్యాతో వాణిజ్యం.. తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం
ముడిచమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య అసమతుల్యత పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. వాణిజ్యం, ఆర్థికం, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ-టీఈసీ)లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఆర్థిక పరిస్థితులను తక్షణమే పునసమీక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గత నాలుగేళ్లలో వస్తువులపరంగా ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరిగిందన్నారు. 2021లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 నాటికి 68 బిలియన్ డాలర్లకు పెరిగిందని చెప్పారు. ఏదేమైనా, ఈ వృద్ధి గణనీయమైన వాణిజ్య అసమతుల్యతతో పాటు 6.6 బిలియన్ డాలర్ల నుంచి 58.9 బిలియన్ డాలర్లకు చేరిందని, ఇది తొమ్మిది రెట్లు పెరిగిందని, దీన్ని అత్యవసరంగా పునసమీక్షించాలని కోరారు.ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంభారత్-రష్యాల మధ్య ప్రత్యేకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ వాణిజ్య అంతరాన్ని పరిష్కరించడమే కాకుండా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు జైశంకర్ రోడ్ మ్యాప్ను రూపొందించారు. టారిఫ్, నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించడం, నిరంతర లాజిస్టిక్స్ అడ్డంకులను పరిష్కరించడం, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (ఐఎన్ఎస్టీసీ), ఉత్తర సముద్ర మార్గం, చెన్నై-వ్లాదివోస్తోక్ సముద్ర కారిడార్ వంటి వ్యూహాత్మక వాణిజ్య మార్గాల ద్వారా కనెక్టివిటీని పెంచడం వంటి కీలక ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.చెల్లింపు యంత్రాంగాలను క్రమబద్ధీకరించాలని, భారత్-యురేషియన్ ఎకనమిక్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ)పై చర్చలను వేగవంతం చేయాలని జైశంకర్ సూచించారు. ఆయన ప్రస్తుత పర్యటనలో ఈ ఎఫ్టీఏకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడం గమనార్హం. ఈ ప్రయత్నాలు అసమతుల్య వాణిజ్యాన్ని పెంచడానికి సహాయపడటమే కాకుండా 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల సవరించిన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని సాధించడానికి చేరువ చేస్తుందని నమ్ముతున్నారు.రష్యా కంపెనీలకు ‘మేక్ ఇన్ ఇండియా’ మార్గాలుశరవేగంగా మారుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని జైశంకర్ రష్యన్ పరిశ్రమలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో పాటు పట్టణీకరణ, భారతీయ వినియోగదారుల పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త వాణిజ్య మార్గాలను తెరతీయాలని చెప్పారు. రష్యన్ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలి -
ట్రంప్ ఓవరాక్షన్.. భారత్కు రష్యా బంపరాఫర్
మాస్కో: భారత్–రష్యా సంబంధాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా నానాటికీ బలపడుతున్నాయని రష్యా సీనియర్ దౌత్యవేత్త, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రొమన్ బాబుష్కిన్ చెప్పారు. భారత ఉత్పత్తులకు తమ మార్కెట్ ద్వారాలు తెరిచి ఉన్నట్లు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.రొమన్ బాబుష్కిన్ బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తొలుత హిందీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ‘ఇక ప్రారంభిద్దాం.. శ్రీగణేషుడే ప్రారంభిస్తున్నాడు’ అని విలేకరులను ఉద్దేశించి చెప్పారు. భారత్–రష్యా సంబంధాలకు పరస్పర విశ్వాసమే మూలస్తంభమని పరోక్షంగా స్పష్టంచేశారు. అమెరికాతోపాటు పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి రష్యా–ఇండియా–చైనా(ఆర్ఐసీ) మధ్య చర్చలు, పరస్పర సహకారాన్ని పునరుద్ధరించుకొనే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.‘మిత్రులను’ అవమానించేందుకు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకాడటం లేదని మండిపడ్డారు. ‘రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తే తప్పేమిటి? దీనిపై పశ్చిమ దేశాలే సమాధానం చెప్పాలి. భారత్ మాకు చాలా ముఖ్యమైన దేశం. భారత్కు చమురు సరఫరాను తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదు’ అని బాబుష్కిన్ తేల్చి చెప్పారు. దీంతో, అమెరికాకు రష్యా గట్టి సమాధానం చెప్పినట్టు అయ్యింది.భారత్కు 5 శాతం రహస్య తగ్గింపుమరోవైపు.. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి భారత్ పరోక్షంగా అండగా నిలుస్తోందని ట్రంప్ కన్నెర్ర చేస్తున్న వేళ ముడి చమురు కొనుగోలుపై భారత్కు ఐదు శాతం రహస్య తగ్గింపు(డిస్కౌంట్) ఆఫర్ చేస్తున్నట్లు భారత్లోని రష్యా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి ఎవ్గెనీ గ్రీవా బుధవారం వెల్లడించారు. ఇది వాణిజ్య సీక్రెట్ అని చెప్పడం గమనార్హం. ఈ ఐదు శాతం డిస్కౌంట్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు ఉంటాయన్నారు. రష్యా నుంచి చమురు కొనే భారత వ్యాపారవేత్తలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. చమురు విషయంలో షిప్పింగ్, బీమా సంబంధిత అంశాలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగం ఉన్నట్లు తెలిపారు. ఇండియా చమురు అవసరాల్లో ఏకంగా 40 శాతం రష్యానే తీరుస్తోందని ఎవ్గెనీ గ్రీవా వివరించారు. బ్యారెల్కు 5 శాతం చొప్పున డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇండియా ప్రతిఏటా 250 మిలియన్ టన్నుల ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని, ఇందులో 40 శాతం రష్యా చమురే ఉంటోందని స్పష్టంచేశారు. -
రష్యా చమురుతో భారత సంపన్న కుటుంబాలే లాభపడుతున్నాయి
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల అంశంపై అమెరికా మరోసారి స్పందించింది. ఈ క్రమంలో భారతీయ బిలియనీర్లపై అక్కసు వెల్లగక్కింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఎన్బీసీ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో ఏకంగా ఓ పత్రికలో వ్యాసం రాశారు. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాల్లో భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యాతో కొనసాగుతున్న చమురు వాణిజ్యం.. ఈ కుటుంబాలకే భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంక్షలనూ లాభార్జనగా మార్చుకున్నారు అని ఆరోపించారాయన.2022 కంటే ముందు.. ఉక్రెయిన్ సంక్షోభం కంటే ముందు రష్యా నుంచి భారత్ 1 శాతం కంటే తక్కువ చమురును కొనుగోలు చేసేది. ఇప్పుడది 42 శాతానికి చేరి ఉండొచ్చు. భారత దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు రష్యా ఆయిల్ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను(ఒక లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు) పొందుతున్నాయి. అందుకే భారత్పై సుంకాలను పెంచే ప్రణాళిక రూపొందించాం. ఇవి సెకండరీ టారిఫ్లుగా ఉండొచ్చు అని బెసెంట్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో గతవారం ఓ ప్రముఖ పత్రిక కాలమ్లో భారతదేశంలోని చమురు వ్యాపారులపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు భారతదేశపు ‘‘బిగ్ ఆయిల్’’ లాబీ లాభాపేక్ష వల్ల జరిగాయని.. దేశీయ అవసరాల కోసం కాదని అందులో పేర్కొన్నారు. ఆ కథనంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై 50% టారిఫ్లు విధించారు. ఇందులో సగం శిక్ష రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించబడనుంది. భారత్ మాత్రం తక్కువ ధర ఉన్న చోట నుంచి చమురు కొనుగోలు చేయడం తమ హక్కు అని పేర్కొంటూ, ఈ అదనపు టారిఫ్లను అసమంజసమైనవిగా చెబుతోంది. కానీ.. చరిత్రపరంగా చూస్తే.. భారత్ రష్యా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకోలేదు. ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడేది. కానీ 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై $60-పెర బ్యారెల్ ధర పరిమితి విధించడంతో.. భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. ఇది అమెరికాకూ తెలుసు. ..ఇక చైనాపై సెకండరీ టారిఫ్లు విధించకపోవడానికి ఓ కారణం ఉంది. అది భారత్ కంటే ఎక్కువగా రష్యా చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే 2022 ముందు 13% ఉండగా, ఇప్పుడు 16%కి పెరిగింది. పైగా చైనా వివిధ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడమే కాకుండా.. విక్రయిస్తోంది కూడా. అందుకే అమెరికా చైనాపై అదనపు టారిఫ్లు విధించలేదు అని అన్నారాయన. -
భారత్పై సుంకాలు అందుకే.. కరోలిన్ లీవిట్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్పై సుంకాల విషయమై అమెరికా మరోసారి స్పందించింది. ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహంలో భాగంగానే భారత్పై సుంకాల విధించినట్టు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పుకొచ్చారు. రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలా చేసినట్టు తెలిపారు.వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయా దేశాల నేతలతో ట్రంప్ చర్చల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్పై దాడులు నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై ట్రంప్ దృష్టి సారించారు. ఆ దేశాలను లక్ష్యంగా చేసుకొని ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నారు. అది ట్రంప్ పరిపాలన వ్యూహం. ఇందులో భాగంగా భారత్పై 50 శాతం సుంకాలను విధించారని అన్నారు. ఇదే సమయంలో భారత్ ఎప్పుడు అమెరికాకు మిత్ర దేశమే అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత్- పాక్ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ వాణిజ్యంతో ముగించారని పాత పాటే పాడారు.మరోవైపు.. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని తెలిపారు. నాటో సెక్రటరీ జనరల్తో సహా యూరోపియన్ నాయకులతో జరిగిన చర్చలే తొలి అడుగు అని పేర్కొన్నారు. త్వరలోనే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. Breaking:President Trump has put 'sanctions' on India to put 'this war (in Ukraine) to a close' & he 'wants to see this war end' says White House Spokesperson Karoline Leavitt pic.twitter.com/rLLq6aiznT— Sidhant Sibal (@sidhant) August 19, 2025 -
రష్యా వెళ్లిన జై శంకర్
న్యూఢిల్లీ: రష్యాలో మూడు రోజుల పర్యటనకు గాను మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం మాస్కోకు బయలుదేరారు. రష్యాతో కొనసాగుతున్న చిరకాల మైత్రిని మరింత దృఢతరం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని విదేశాంగ శాఖ తెలిపింది. రష్యా నుంచి ముడి చమురు కొంటుందనే సాకుతో భారత్ ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్లను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కొంతమేర దెబ్బతిన్న నేపథ్యంలో జై శంకర్ చేపట్టిన ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం జరిగే వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సహకార రష్యా–చైనా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ 26వ సెషన్కు ఆయన సహాధ్యక్షత వహిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రధానమంత్రి డెనిస్ మంతురోవ్ సహాధ్యక్షత వహిస్తారంది. వీరిద్దరూ ఈ ఏడాది చివర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేపట్టే భారత పర్యటనకు అవసరమైన కార్యాచరణను రూపొందిస్తారని చెప్పారు. జై శంకర్ అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తోనూ భేటీ అవుతారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం, అందుకు సంబంధించి ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరుపుతారు. ఇతర ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలనూ చర్చిస్తారు. ఇంధన రంగంలో రెండు దేశాల సంబంధాలు కూడా ప్రస్తావనకు వస్తాయని విదేశాంగ శాఖ తెలిపింది. -
జెలెన్స్కీతో మాట్లాడతా
వాషింగ్టన్: ఉక్రెయిన్ యుద్ధానికి ఆఖరి గడియలు దగ్గర పడిన సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్పై ఆక్రమణాగ్రహంతో రగిలిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు కాస్తంత మెత్తబడినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ పుతిన్ స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపేందుకు అంగీకరించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం ప్రకటించారు. మంగళవారం అమెరికాలో ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థకు ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో రూబియో ఈ విషయం వెల్లడించారు.‘‘జెలెన్స్కీతో భేటీకి తాను ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నట్లు స్వయంగా పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఫోన్లో చెప్పారు. ఖచి్చతంగా జెలెన్స్కీని కలుస్తానని ట్రంప్కు పుతిన్ మాటిచ్చారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత జెలెన్స్కీతో పుతిన్ భేటీకి సమ్మతి తెలపడం శాంతిస్థాపన బాటలో కీలక ముందడుగు. అయితే జెలెన్స్కీ, పుతిన్ భేటీ అయ్యాక వెంటనే ఇద్దరు మంచి మిత్రులుగా మారతారని నేను అనుకోవట్లేదు. భేటీ జరిగిందంటే ఏకంగా శాంతి ఒప్పందం కుదిరిందని ఇప్పుడే భావించడం తొందరపాటే అవుతుంది. ఎన్నో అంశాలపై స్పష్టతరావాల్సి ఉంది.మరెన్నో అంశాలపై విస్తృతస్థాయి చర్చ జరగాల్సి ఉంది. గత మూడున్నరేళ్ల యుద్దకాలంలో రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులు సంయమనంతో మాట్లాడుకున్నదే లేదు. ఈ ధోరణే ఇన్నాళ్లూ రణరంగంలో మరింత రక్తంచిందేలా చేసింది. మరణాలు, మారణహోమాలకు యుద్ధం చిరునామాగా మారింది. కానీ ఇప్పుడు కాస్తంత సుహృద్భావ వాతావరణంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు మాటలు కలిపారు. తొలుత పుతిన్, జెలెన్స్కీ ముఖాముఖి భేటీ ఉంటుంది. ఇది సత్ఫలితాలనిస్తే ఆ తర్వాత ఇరునేతలకు ట్రంప్ జతకూడుతారు. అప్పుడు త్రైపాక్షిక సమావేశం సాకారమవుతుంది’’అని రూబియో అన్నారు. ఇరుపక్షాలకు అనువైన చోటే భేటీ: ట్రంప్ జెలెన్స్కీ, పుతిన్లకు అనువైన ప్రదేశంలోనే త్రైపాక్షిక సమావేశం నిర్వహిస్తామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు.‘‘సోమవారం మధ్యాహ్నం శ్వేతసౌధానికి విచ్చేసిన విశిష్ట అతిథులతో చక్కని సమావేశం జరిగింది. ఐరోపా సమాఖ్య సభ్యదేశాల అగ్రనేతలతో సంయుక్త భేటీలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం. త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలన్న మా ఉమ్మడి నిర్ణయాన్ని వెంటనే పుతిన్కు ఫోన్చేసి చెప్పా. ఆయన అందుకు సమ్మతించారు.త్వరలోనే ఈ భేటీ ఉంటుంది. జెలెన్స్కీ, పుతిన్కు అనువైన నగరంలోనే తొలుత వాళ్లిద్దరూ సమావేశమవుతారు. ఇది చక్కటి ఫలితాన్నిచ్చాకే నేను వాళ్లతో కలిసి త్రైపాక్షి సమావేశాన్ని నిర్వహిస్తా. ఈ భేటీకి సాకారం చేసేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి రూబియో, నా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ చెమటోడుస్తున్నారు’’అని ట్రంప్ అన్నారు. -
సంధి సాధ్యమేనా?!
పరస్పరం కలహించుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ల మధ్య సంధి కుదర్చటానికీ, సామరస్యం సాధించటానికీ అలాస్కా శిఖరాగ్ర సమావేశానికి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చివరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అనధికార అధికార ప్రతినిధిగా మారి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాల్పుల విరమణకు రష్యా అంగీకరించకపోతే కఠినాతికఠినంగా వ్యవహరిస్తామని అలాస్కా సమావేశానికి ముందు హెచ్చరించిన ఆయన... కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని, శాంతి ఒప్పందం కోసం చర్చలు జరగాలని చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం వైట్హౌస్లో తనను కలిసినప్పుడు సైతం ఇలాంటి సలహాయే ఇచ్చారు. దీన్ని ఏదో మేరకు సరిదిద్ది, ఉక్రెయిన్కు కనీస భద్రత గ్యారెంటీనైనా సాధించాలన్న ధ్యేయంతో ఆరుగురు యూరొప్ దేశాల నేతలు ట్రంప్తో భేటీ అయ్యారు. అమెరికాతో పాటు రష్యా, ఉక్రెయిన్లు పాల్గొనే త్రైపాక్షిక చర్చలకు సుముఖంగా ఉన్నామని ట్రంప్ చెప్పటం ఉన్నంతలో ఊరటనిచ్చే అంశం. కానీ ట్రంప్ దానికైనా కట్టుబడతారా లేదా... పుతిన్ను ఒప్పించగలరా లేదా అన్నది చెప్పలేం. జెలెన్స్కీకి మొన్న ఫిబ్రవరిలో వైట్హౌస్లో ఎదురైన చేదు అనుభవాలను నివారించి, ఆయన వెనక యూరప్ దేశాలన్నీ ఉన్నాయని చెప్పటానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడెరిక్ షుల్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తదితరులు కలిశారు. కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్నార్థకం. ఉక్రెయిన్కు ‘నాటో తరహా’ భద్రత కల్పించటానికి ట్రంప్ అనుకూలమే గానీ అదంతా యూరప్ దేశాలే చూసుకోవాలట. తమ వంతుగా గగనతల రక్షణ విషయంలో సాయంగా నిలుస్తారట! అసలు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ఏం చేస్తారనే ఆదుర్దా కన్నా ఆయన నాటో పక్షాన ఉంటారా ఉండరా అనే బెంగ ఎక్కువైంది. జెలెన్స్కీతో మళ్లీ ఆయన లడాయికి దిగితే అటుతర్వాత తాము సైతం మాట్లాడే స్థితి ఉండకపోవచ్చన్న భయంతోనే యూరప్ అధినేతలు వైట్హౌస్కు వెళ్ళినట్టు కనిపిస్తోంది. కోల్పోయిన భూభాగాల గురించీ, నాటో సభ్యత్వం గురించీ మరిచిపోవాలని తొలుత తనను కలిసిన జెలెన్స్కీకి చెప్పటంతో పాటు యూరప్ దేశాధినేతల ముందు కూడా ట్రంప్ ఆ మాటే అనటం గమనించదగ్గది. ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన నాటి నుంచీ పుతిన్ చెప్పిన మాటల్నే ట్రంప్ ఇప్పుడు వల్లిస్తున్నారు. చాలా అంశాల్లో పుతిన్కూ, తనకూ ఏకాభిప్రాయం కుదిరిందని ఆ శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన ఇప్పటికే ప్రకటించారు. పుతిన్ దాదాపు పన్నెండేళ్ల క్రితం ఆక్రమించిన క్రిమియాలో పలు పట్టణాలు, నదులూ, పర్వతశ్రేణులూ ఉన్నాయి. విలువైన పంటభూములున్నాయి. ఇవిగాక మూడున్నరేళ్లకు పైగా సాగుతున్న దురాక్రమణ యుద్ధంలో ఆక్రమించుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలున్నాయి. వీటిని వదులుకోవటమంటే జెలెన్స్కీకి ఆత్మహత్యా సదృశం. అయినా తమ కోసం ట్రంప్ ఎంతో చేస్తున్నారని ప్రశంసించి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సి వచ్చింది. జెలెన్స్కీకి అంతకన్నా గత్యంతరం లేదు. ఉక్రెయిన్కి ప్రస్తుతం అందుతున్న సాయంలో 47 శాతం వాటా అమెరికాదే. జర్మనీ 9, బ్రిటన్ 8, జపాన్ 6 శాతాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కెనడా, నెదర్లాండ్స్, స్వీడన్, ఫ్రాన్స్ వంటివి ఒకటి, రెండు శాతాలకు మించి ఇవ్వడం లేదు. అందుకే జెలెన్స్కీ నోరెత్తలేకపోతున్నారు.అమెరికా గత పాలకుల ప్రాపకంతో ఉక్రెయిన్ను రెచ్చగొట్టి, రష్యాతో గిల్లికజ్జాలకు దిగేలా చేసిన యూరప్ దేశాలకు ఇప్పుడు ఏం చేయాలో పాలుబోని దుఃస్థితి. నెలక్రితం ట్రంప్తో మాట్లాడాక అంతా సామరస్యంగా పరిష్కారమైందని, ఉక్రెయిన్ విషయంలో తమను సంప్రదించకుండా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోబోరని యూరప్ దేశాధినేతలు నమ్మారు. అలాస్కా శిఖరాగ్రానికి వారం రోజుల ముందు కూడా వారంతా ట్రంప్ను కలిశారు. ఆ భేటీకి జెలెన్స్కీని కూడా తీసుకెళ్లారు. ముందు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాలనీ, ఆ తర్వాతే ద్వైపాక్షికమో, త్రైపాక్షికమో చర్చలుండాలనీ ఆ భేటీలో అందరూ అభిప్రాయపడ్డారు. తాజాగా ట్రంప్ త్రైపాక్షిక చర్చల గురించి మాట్లాడుతున్నా పుతిన్ అందుకు సుముఖంగా ఉంటారా అన్న సంశయం అందరినీ పీడిస్తోంది. ఆ మాటెలా ఉన్నా అలాస్కా శిఖరాగ్రం భారత్కు ఎంతో కొంత మేలు చేసిందని చెప్పాలి. రష్యాపై ఆగ్రహంతో మనపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఆ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు చెబుతున్న మాటకు కట్టుబడి సాధ్యమైనంత త్వరలో త్రైపాక్షిక చర్చలకు ట్రంప్ చొరవ తీసుకుంటే... పుతిన్ను ఒప్పిస్తే అది శాంతికి దోహదపడుతుంది. -
ఉక్రెయిన్ను ఇరుకున పెట్టిన పుతిన్.. జెలెన్స్కీతో ట్రంప్ కీలక భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం(అమెరికా కాలమానం ప్రకారం) జెలెన్స్కీతో వైట్హౌస్లో భేటీ కానున్నారు. పుతిన్తో భేటీ వివరాలు, ప్రతిపాదనలను ఆయన ముందుంచనున్నారు. భేటీ విజయవంతమైతే ఈయూ దేశాల అగ్ర నేతలతోనూ ట్రంప్, జెలెన్స్కీ సమావేశం అవుతారు. ఈ నేపథ్యంలో యుద్ధం ఎలా మొదలైందో ఓసారి గుర్తు తెచ్చుకోవాలని జెలెన్స్కీకి ట్రంప్ సూచించినట్టు సమాచారం. ఇక, శాంతి ఒప్పందానికి పుతిన్.. ట్విస్ట్ ఇస్తూ కీలక ప్రతిపాదన చేసినట్టు తెలిసింది.డోన్బాస్ ఇచ్చేయండి..డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్పై పుతిన్ అజమాయిషీ కోరుతున్నట్టు జెలెన్స్కీకి ట్రంప్ చెప్పారని సమాచారం. అవిచ్చేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ ప్రతిపాదించినట్టు వివరించారు. అందుకు జెలెన్స్కీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సోమవారం ముఖాముఖిలో ఇందుకు జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. తూర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. తూర్పు డోన్బాస్ను ఇచ్చేశాక పుతిన్ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసినా, తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మారవచ్చ అనేది జెలెన్స్కీ ఆందోళనగా కనిపిస్తోంది.మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్తో భేటీకి ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పంపేందుకు ఐరోపా నేతలు భయపడుతున్నారు. ఫిబ్రవరిలో ట్రంప్ను కలిసేందుకు అమెరికా వెళ్లిన జెలెన్స్కీకి వైట్హౌస్లో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా చేయొద్దంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఆ భేటీలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఈసారి జెలెన్స్కీకి తోడుగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తదితరులు పాల్గొంటారు. ఇక, ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకున్నా అదే తరహాలో రక్షణ హామీ ఇచ్చేందుకు ట్రంప్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య రెండున్నర గంటలకు పైగా జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ యుద్ధానికి తెర!
న్యూయార్క్: ఉక్రెయిన్లో శాంతిస్థాపనకు అమెరికా, ఐరోపా సమాఖ్య చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం స్వీయ సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘రష్యా విషయంలో భారీ పురోగతి సాధించాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా’’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఉక్రెయిన్ విషయమై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారని అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ ప్రకటించారు. ‘‘ఉక్రెయిన్కు నాటో కూటమి తరహాలో అమెరికా, ఈయూ ‘రక్షణ హామీ’ ఇచ్చినా అభ్యంతరం లేదని పుతిన్ చెప్పారు. మొత్తం ప్రక్రియలో ఇదొక కీలక మలుపు. ఇకపై ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించబోమని హామీ ఇచ్చారు. రష్యాతో విజయవంతంగా ఒప్పందం కుదుర్చుకోనున్నాం. నాటో కూటమికి గుండెకాయ అయిన క్లాజ్–5 తరహాలో ఉక్రెయిన్కు రక్షణ ఆఫర్ ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధపడ్డారు. ఈ ప్రయోజనం కోసమే ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు ప్రయతి్నస్తోంది. ఇకపై ఆ అవసరం ఉండదు. ఉక్రెయిన్ నాటోలో చేరొద్దనేదే పుతిన్ ప్రధాన అభ్యంతరం. కనుక ట్రంప్ ఆఫర్ సమస్య పరిష్కారం చూపుతుంది. ప్రక్రియ సజావుగా సాగడానికి సమయం పట్టొచ్చేమో గానీ కచి్చతంగా శాంతి నెలకొంటుంది. మూడున్నరేళ్ల యుద్ధానికి తెర పడుతుంది’’ అన్నారు. 5వ క్లాజ్ ప్రకారం 32 నాటో దేశాల్లో దేనిపై శత్రువు దాడి చేసినా అన్ని దేశాలపై ఉమ్మడి దాడిగా పరిగణించి ప్రతి దాడికి దిగుతాయి.నేడు ట్రంప్–జెలెన్స్కీ భేటీ ట్రంప్ సోమవారం జెలెన్స్కీతో వైట్హౌస్లో భేటీ కానున్నారు. పుతిన్తో భేటీ వివరాలు, ప్రతిపాదనలను ఆయన ముందుంచనున్నారు. భేటీ విజయవంతమైతే ఈయూ దేశాల అగ్ర నేతలతోనూ ట్రంప్, జెలెన్స్కీ సమావేశం అవుతారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఫిన్లండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు పాల్గొంటారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకున్నా అదే తరహాలో రక్షణ హామీ ఇచ్చేందుకు ట్రంప్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్ చెప్పారు.డోన్బాస్ ఇచ్చేయండి డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్పై పుతిన్ అజమాయిషీ కోరుతున్నట్టు జెలెన్స్కీకి ట్రంప్ చెప్పారని సమాచారం. అవిచ్చేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ ప్రతిపాదించినట్టు వివరించారు. అందుకు జెలెన్స్కీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సోమవారం ముఖాముఖిలో ఇందుకు జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. తూర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. తూర్పు డోన్బాస్ను ఇచ్చేశాక పుతిన్ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసినా, తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మారొచ్చన్నది జెలెన్స్కీ ఆందోళనగా కనిపిస్తోంది. -
మనమంటే మొహం మొత్తిందా?
ఇండియాపై ట్రంప్కు మొహం మొత్తిందా? ఆయన తన చేతల ద్వారా అదే విషయాన్ని తెగేసి చెబుతున్నారా? ఆయన మనపై 50% సుంకాలు విధించారు. సుంకాలపై వివాదం పరిష్కారమ య్యేంత వరకూ వాణిజ్య చర్చలను సుప్తావస్థలో పెడుతున్నట్లు ఆయన తెలి పారు. భారతదేశ మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను లెక్క చేయబోనని కరాఖండీగా చెప్పేశారు. రష్యా చమురును కొంటూ, అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు తెస్తోందని ట్రంప్కు వాణిజ్య సలహాదారైన పీటర్ నవారో ప్రకటించారు. పుతిన్తో ట్రంప్ చర్చలు విఫలమైతే భారత్పై సెకండరీ సుంకాలు పెరగ వచ్చని ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ వెల్లడించారు. యూరప్ కూడా భారత్పై సెకండరీ సుంకాలు విధించాలని ఆయన కోరారు. అమె రికా స్నేహహస్తం నుంచి భారత్ చేజారిందని ఇవన్నీ సూచిస్తున్నాయా? చైనా, రష్యాలను హెచ్చరించేందుకు భారత్ను ట్రంప్ వాడు కుంటున్నారనే అభిప్రాయమూ ఉంది. అది కూడా సంతోషపడదగ్గ అంశం కాదు. మనం ఆనుషంగిక నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మనం ఏమైపోయినా నిజంగానే, ఆయనకు పట్టదు.మరోపక్క, ట్రంప్ పాకిస్తాన్తో ప్రేమలో పడినట్లు కనిపిస్తోంది. అదీ మనల్ని సంకటంలో పడేసే సంగతే. ఆయన పాక్పై 19% సుంకాలే విధించారు. ఆయన ప్రభుత్వం ఇస్లామాబాద్ను ఉగ్రవాదంపై పోరాటంలో ‘అసాధారణ భాగస్వామి’గా పరిగణి స్తోంది. ‘ఉగ్రవాద సంస్థలను అరికట్టడంలో విజయాలను కొనసా గిస్తున్నందుకు’ అది ఇటీవల పాకిస్తాన్ను కొనియాడింది. ట్రంప్... పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్ను విందుకు ఆహ్వానించి, చమురును వెలికితీయడంలో పాక్కు సాయపడతామని చెప్పారు. నిజం చెప్పా లంటే, ఏదో ఒక రోజున పాక్ నుంచి భారత్ కూడా చమురును కొనుగోలు చేసే రోజు రావచ్చని, ఆయన మనల్ని కవ్వించారు.అంటే, ఆయనకు పాకిస్తాన్ కొత్త ముద్దుగుమ్మగా మారినట్లా? రష్యన్ చమురు ఢిల్లీని చీకాకుపరచే అంశంగా మారడమేకాదు, అది పరిష్కారమయ్యేంత వరకూ భారత్తో వాణిజ్య చర్చలు జరి పేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు కనుక మొదట దానిపై దృష్టి కేంద్రీకరిద్దాం. పైగా, జరిమానా కింద మరిన్ని సుంకాలు విధిస్తా మని బిసెంట్ హెచ్చరించారు. సత్యం ఏమంటే, రష్యన్ చమురు కొనేటట్లుగా ఇండియాను బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ‘వాస్తవానికి, ధరపై పరిమితి ఉన్న రేటు వద్ద రష్యన్ చమురు కొనుగోలు చేయాల్సిందిగా మేము (అమెరికా) కోరబట్టే వారు (ఇండియా) కొనుగోలు చేశారు...ఎందుకంటే, చమురు ధరలు పెరగడం మాకిష్టం లేదు. వారు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించారు’ అని ఢిల్లీలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి 2024 మే నెలలో చెప్పారు. ట్రంప్ ఈరోజు, తనకు ముందున్న ప్రభుత్వ విధానాన్ని కావాలని ఉపేక్షిస్తూ, ఇండియాను నిందిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ ఆత్మవంచన తేటతెల్లమవుతోంది. రష్యా నుంచి అమెరికా పాలాడియం, యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే, గడచిన ఆరు నెలల్లో ఈ దిగుమతుల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్తాకథనంలో పేర్కొంది. రష్యా నుంచి అమెరికా స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నప్పుడు లేని అభ్యంతరం, ఇండియా పట్లనే ఎందుకు? ఇక మూడవ అంశం – ట్రంప్ అసలు ఉద్దేశాలను బయట పెడుతోంది. ఆయన ద్వంద్వ ప్రమాణాలకు ఇది మరో నిదర్శనం. రష్యా చమురును పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్న, మూడవ పెద్ద దిగుమతిదారులుగా ఉన్న చైనా, తుర్కియేలను ట్రంప్ హెచ్చరించ లేదు. రష్యన్ చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ, స్లొవేకియా – రెండూ యూరప్ దేశాలు, ‘నాటో’లో సభ్యత్వం ఉన్నవీనూ! కానీ ట్రంప్ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ ఏడాది జూన్ నుంచి జపాన్ కూడా దిగుమతి చేసుకుంటున్న సంగతిని ఆయన సమయానుకూలంగా విస్మరిస్తున్నారు. చైనాపై సుంకాల విధింపులో ఇచ్చిన విరామాన్ని ఆయన ఇటీవల మరో 90 రోజులు పొడిగించారు. ఆయన ఢిల్లీపైన మాత్రమే మూడవ కన్ను తెరిచారని స్పష్టమవుతోంది. ఈ సమస్యకు సంబంధించి మరో పార్శ్వం కూడా అంతే కలవరపరుస్తోంది. ‘క్వాడ్’ (ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమె రికా)లోని మిగిలిన మూడు దేశాలతో తనకు అవసరం తీరిపోయిందని ట్రంప్ భావిస్తున్నారని... ఆయన వైఖరి, నడతను బట్టి అర్థం చేసుకోవచ్చా? అదే నిజమైతే, ఇండో–పసిఫిక్ వ్యూహం విషయంలో అమెరికా వైఖరి ఏమిటి? చైనాతో మనకున్న సమస్యల దృష్ట్యా ‘క్వాడ్’ కూటమి మనకు ఊరటనిచ్చిన మాట నిజం. ‘క్వాడ్’ పట్ల ట్రంప్ నిబద్ధత చూపకపోతే, అది మనకు మరిన్ని చిక్కులు సృష్టించవచ్చు.చైనాతో ట్రంప్ ఆర్థిక ఒప్పందానికి వస్తారా? ఊహించడం కష్టం. కానీ, షీ జిన్ పింగ్తో శిఖరాగ్ర సమావేశమై ఆయన ఇప్పటికే మాట్లాడుతున్నారు కనుక, అటువంటి దానికి అవకాశం ఉందని పిస్తోంది. చైనాను రాజకీయంగా మరింత మెరుగ్గా అవగాహన చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందా అనేది ప్రశ్న. బీజింగ్ ప్రాంతీయ ఆకాంక్షలకు అమెరికా మరింత వెసులుబాటు కల్పిస్తుందా? ఒకవేళ అదే కార్యరూపం ధరిస్తే, చైనాతో సరిహద్దు వివాదంపై అమెరికా మద్దతు మనకు కొనసాగుతుందా? ఈ విషయమై మనం ఎటువంటి వైఖరిని అనుసరించాలన్నది పెద్ద ప్రశ్న? జవాబు కోసం మనం గాభరా పడాల్సిన అవసరం లేదు. మన నుంచి దిగుమతి చేసుకోకపోతే బతకలేమన్నంతగా, అమెరికా మొహం వాచి చూస్తున్నవాటిని మనం ఏమీ అమెరికాకు ఎగుమతి చేయడం లేదు. చైనా వద్ద రేర్ ఎర్త్ ఖనిజాలు, లోహాలు ఉన్నాయి. మనకి లేవు! కనుక, బేరసారాలకి మనకున్న అవకాశం తక్కువ. మనకున్న ఆశ ఒక్కటే! ఉక్రెయిన్పై పుతిన్–ట్రంప్ ఒక ఒప్పందానికి రాగలిగితే, అది మనపై విధించిన సెకండరీ ఆంక్షలను ఎత్తివేయడానికి తోడ్పడవచ్చు. అమెరికా దృష్టిలో భారత్ ఇప్పటికీ ఉందని స్కాట్ బిసెంట్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అనుకున్నట్లు జరగకపోతే ట్రంప్ తీవ్ర ఆగ్రహ జ్వాలలకు మనం గురికావాల్సిందే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత్కు మరో షాకిచ్చిన అమెరికా.. ట్రంప్ ప్లాన్ అదేనా?
ఢిల్లీ: భారత్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాణిజ్య చర్చల కోసం భారత్కు రావాల్సిన అమెరికా బృందం ట్విస్ట్ ఇస్తూ.. తమ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, వారి తదుపరి పర్యటనపై సస్పెన్స్ నెలకొంది.వివరాల ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంతో భారత్పై అమెరికా భారీగా సుంకాల భారాన్ని మోపింది. ట్రంప్ ఇటీవల భారత్పై 50శాతం సుంకాలు విధించారు. పాత 25శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అదనపు 25% టారిఫ్లు ఈ నెల 27ను అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సుంకాలు అమలులోకి రాకముందే.. అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపి మధ్యంతర ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.🚨 US trade team CALLS OFF Aug 25–29 Delhi visit for trade talks. pic.twitter.com/TOVBv10nwZ— Beats in Brief 🗞️ (@beatsinbrief) August 16, 2025ఈ క్రమంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ఐదు దఫాలు చర్చలు జరిగాయి. ఆరో దఫా చర్చలకు అమెరికా ప్రతినిధులు ఈ నెల 25-29 మధ్య భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ దఫా చర్చల్లో భాగంగా.. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు సంబంధించిన చిక్కుముడులు వీడే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే, తాజాగా వారు ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. చర్చలకు సంబంధించిన తదుపరి తేదీలను కూడా వారు వెల్లడించలేదు. దీంతో, మరోసారి ఇరు దేశాల మధ్య చర్చలు ఉంటాయా? లేదా? అనే సందిగ్థత నెలకొంది. ఒకవేళ చర్చలు విఫలమైతే.. భారత్పై టారీఫ్ల భారం పడే అవకాశం ఉంది. కాగా, భారత్పై సుంకాలు విధించాలనే ఆలోచనతోనే ట్రంప్ ఇలా ప్లాన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా, భారత్ను టార్గెట్ చేసి ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ దేశ ప్రజలకు సూచనలు చేశారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ట్రంప్తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య చర్చలు సఫలం అవుతాయా? అని అందరూ ఆసక్తికంగా ఎదురుచూస్తున్నారు. -
ట్రంప్-పుతిన్ల భేటీపై భారత్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య అలస్కాలో జరిగిన సమ్మిట్ను భారత్ స్వాగతించింది. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సుదీర్ఘంగా సాగిన సమావేశాన్ని భారత్ అభినందించింది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న దీర్ఘ కాలిక యుద్ధానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎక్కడైనా శాంతికి తొలి అడుగు పడాలంటే అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.‘అమెరికా-రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం పురోగతిని భారత్ అభినందిస్తుంది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ముందుకు వెళ్లడం మంచి పరిణామం. ఉక్రెయిన్ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా, అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) అర్థరాత్రి గం. 12.30 ని.లు దాటాకా ఇరువురి అధ్యక్షుల మధ్య దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిపోయింది వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు.కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పుకొచ్చారు.మరొకవైపు ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తానని ట్రంప్ తెలిపారు. కానీ ఏం జరుగుతుందో తెలియదన్నారు. ‘రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు ట్రంప్. -
రష్యా చమురుకి భారత్ దూరమైంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలో రష్యాకు భారత్ దూరమైందని ప్రకటించారు. అదే సమయంలో.. భవిష్యత్తులో భారత్పై అదనపు సుంకాలు విధించే ఆలోచన కూడా తనకేం పెద్దగా లేదని స్పష్టం చేశారు.అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చలపై భేటీ జరిపిన సంగతి తెలిసిందే. అయితే భేటీకి ముందు విమాన ప్రయాణంలో ది ఫాక్స్న్యూస్కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అతను(రష్యా అధినేత పుతిన్ను ఉద్దేశించి) ఇప్పటికే ఓ క్లయింట్ను కోల్పోయారు. అది 40 శాతం కొనుగోళ్లు జరిపే భారత దేశం. చైనా గురించి కూడా తెలిసిందే. ఆ దేశం కూడా రష్యాతో బాగానే వాణిజ్యం జరుపుతోంది. ఒకవేళ.. పరోక్ష ఆంక్షలు, అదనపు సుంకాలు గనుక విధించాల్సి వస్తే.. అది ఆ దేశాల దృష్టిలో చాలా విధ్వంసకరంగా ఉంటుంది. అందుకే అవసరం అయితే చేస్తాను. అవసరం లేకపోతే ఉండదు’’ అని అన్నారాయన.Trump says he may not impose 25% tariffs on India (to kick in from 27 August) for buying Russian oil..Trump: "They lost oil client India which was doing about 40% of the oil & China's doing a lot, if I did a secondary tariff it would be devastating, if I have to I will, may be… pic.twitter.com/dhyC7RpHNh— Dhairya Maheshwari (@dhairyam14) August 16, 2025అదే సమయంలో.. అలస్కా భేటీ తర్వాత కూడా ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొంటున్న దేశాలపై సుంకాలు గురించి మళ్లీ ఆలోచిస్తానని, రెండు-మూడు వారాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్ తాజా ప్రకటనపై ఢిల్లీ వర్గాలు స్పందించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంతో భారత్పై ట్రంప్ జులై 30వ తేదీన 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ మిత్రదేశమైనప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని.. పైగా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చమురు, ఆయుధాల కొనుగోళ్ల ద్వారా పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో.. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే తాను చెప్పినా కూడా భారత్ రష్యా ఆయిల్ కొనుగోళ్లు ఆపలేదంటూ ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం పెనాల్టీ సుంకం విధించారు. దీంతో భారత్పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరింది. పెరిగిన ఈ 25 శాతం ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్ 50 శాతం సుంకాలను భారత్ అన్యాయమని పేర్కొంది. సుంకాలను తాము పట్టించుకోబోమని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. ఎనర్జీ భద్రత, ధరల లాభం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే.. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటిదాకా వెనక్కి తగ్గలేదు. ఆయిల్ కొనుగోళ్లు ఆపేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటించలేదు. అమెరికా టారిఫ్లతో బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని తెలిపారు. ‘‘‘మాకు రష్యా నుంచి చమురు కొనమని కానీ కొనొద్దనీ కానీ ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అలాగే రష్యా చమురు దిగుమతులను పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మేం ప్రయత్నాలు కూడా చేయడం లేదు’’ అని అన్నారాయన. రష్యా చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు యథాతథంగానే కొనసాగిస్తున్నాయని, జులైలో ఇది రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లుగా ఉంటే.. ఆగస్టులో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లకు పెరిగిందని ఓ నివేదిక వెలువడింది. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ట్రంప్ 50 శాతం టారిఫ్ల ప్రభావంతో తాత్కాలికంగా కొంత తగ్గినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం.. తదితర సంస్థలు రష్యన్ ఆయిల్ను స్పాట్ మార్కెట్ నుంచి కొనడం ఆపేశాయని, రిలయన్స్, నారాయణ ఎనర్జీ లాంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం దీర్ఘకాలిక ఒప్పందాలకు అనుగుణంగా కొనుగోళ్లను యధాతథంగా జరుపుతున్నాయన్నది ఆ కథనాల సారాంశం. -
అదే జరిగితే భారత్కు మరిన్ని సుంకాలు తప్పవు: అమెరికా
భారత్ సుంకాలతో దాడి చేసిన అమెరికా.. భారత్కు మరో హెచ్చరిక జారీ చేసింది. భారత్పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవని అంటోంది. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చర్చల ఫలితాలను బట్టి ట్రంప్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.రష్యాతో చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై ఇప్పటికే సుంకాలు విధించాం. ఒకవేళ.. ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు గనుక విఫలమైతే భారత్పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ బుధవారం బ్లూమరాంగ్టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్పై సెకండరీ టారిఫ్లు, లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని స్కాట్ స్పష్టం చేశారు.భారత్ తమ మిత్రదేశమంటూనే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది అమెరికా. అంతేకాదు.. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు తమ వాణిజ్యం ద్వారా భారత్ పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆ టైంలో ఆరోపించారు. ఈ తరుణంలో.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు ఆపకపోవడంతో పెనాల్టీ కింద మరో 25 శాతం మోపారు. దీంతో భారత్పై అగ్రరాజ్యం టారిఫ్లు 50 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారమని తెలిసినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కూడా. ట్రంప్ విధించిన దటి దఫా సుంకాలు ఇప్పటికే అమలు అవుతుండగా.. ఈ నెల 27 నుంచి రెండో దఫా ప్రకటించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్ భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో.. భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారాయన. అయితే ఫాక్స్న్యూస్తో ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్కు చేరుకుంటారని తెలిపారు. అయితే.. వ్యవసాయ, డెయిరీ మార్కెట్ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలు ఉండబోతున్నాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధినేత కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది అలస్కా వేదికగా శుక్రవారం జరగబోయే చర్చలతోనే తేలిపోతుందని చెబుతున్నారాయన. అదే సమయంలో భూభాగాల మార్పిడితోనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇరు దేశాలకు మరోసారి సూచించారు కూడా. అయితే ఈ ఆలోచనను ఉక్రెయిన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భూభాగాల విషయంలో రాజీ పడటం తమ రాజ్యాంగానికి విరుద్ధమని అంటోంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీకి యూరప్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ లేకుండా జరిగే చర్చలకు అర్థం ఉండదని, పుతిన్తో జరగబోయే ఒకే ఒక్క భేటీ రష్యా లక్ష్యాలకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వవచ్చని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. -
భారత్ వైపు ప్రపంచం చూపు!
ఇప్పుడు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదనటంలో అతిశయోక్తి లేదు. ఈ పరిణామం ఈ నెల 6వ తేదీన చోటుచేసుకుంది. ఆ రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై సుంకాలను మరొక 25 శాతం పెంచి, మొత్తం 50 శాతానికి చేర్చారు. దానితో మోదీ ప్రభుత్వం ఒత్తిడికి గురై రష్యన్ చమురు కొనుగోళ్ళను ఆపటంతో పాటు, వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలో తమ ప్రతిపాదనలకు అంగీకరించగలదన్నది ట్రంప్ ఎత్తుగడ. అనూహ్యమైన రీతిలో ప్రధాని మోదీ అదేరోజు రాత్రి ఎదురుదాడి ప్రారంభించారు.ప్రపంచం కోసం నిలబడగలమా?ట్రంప్ చర్యలను చైనా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్, దక్షిణాఫ్రికా, రష్యా వంటివి మొదటి నుంచి పూర్తిగానో, పాక్షికంగానో వ్యతిరేకిస్తుండటంలో విశేషం లేదు. వీటన్నింటికి భిన్నంగా పెద్ద దేశాలలో ఇండియా ఒక్కటే మొదటి నుంచి అమెరికాతో మెత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఒక పెద్ద వర్ధమాన దేశం అయి ఉండి, ‘బ్రిక్స్’లో ప్రధాన పాత్ర వహిస్తూ, ట్రంప్ చర్యల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నా, ప్రతిఘటించకపోవటంపై అంతటా విమర్శలు వినిపించాయి. అటువంటి స్థితిలో మోదీ చేసిన ప్రసంగం, అందులోని భాష, తనలో కనిపించిన దృఢమైన వైఖరి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడిక ఆయన భారతదేశం కోసమే గాక, తక్కిన ప్రపంచంతో కూడా కలిసి నిలబడవచ్చుననే ఆశాభావాలు వినవస్తున్నాయి.అదే సమయంలో, ఇల్లలకగానే పండుగ కాదనే పెద్దల హెచ్చరికను గుర్తుంచుకోవలసి ఉంటుంది. వీటికి స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రభావాలు అనేకం ఉంటాయి. అవి వాస్తవంగా భూకంపానికి దారితీయగలవు. స్లో మోషన్లో ఆర్థిక ప్రపంచ యుద్ధాన్ని సృష్టించగలవు. మన ప్రపంచం నిజమైన అర్థంలో రాజకీయంగా, ఆర్థికంగా, ప్రజాస్వామికంగా మారాలంటే, చిరకాలపు అధిపత్య శక్తుల భూమి కింద అటువంటి భూకంపం రావటం అవసరం.కొండ చరియలలో కింది వైపున కేవలం ఒక రాయి కదలికలో మొత్తం చరియలే కూలినట్లు, చరిత్రలో ఒకోసారి చిన్న ఘటనలు పెనుమార్పులకు దారి తీస్తుంటాయి. క్రమంగా బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక ఆధిపత్యాన్ని తిరిగి శక్తిమంతం చేయదలచిన ట్రంప్, అమెరికన్ కొండచరియలో ఒకొక్క రాయినే తనకు తెలియకుండానే తోసివేస్తున్నారు. ఇప్పుడు ఇండియా రూపంలో ఒక ముఖ్యమైన రాయి తొలగిపోతున్నదనుకోవాలా?ఇండియా దృఢ వైఖరినిజంగానా, లేక ఇది తొందరపాటు మాటా అన్నది ప్రశ్న. ఒకవైపు అమెరికా నాయకత్వాన ఒక శక్తిమంతమైన కూటమి ఉంది. అది బలహీన పడుతున్న మాట నిజమేగాని అవసాన దశకేమీ చేరలేదు. మరొకవైపు భారత్తో కూడిన ‘బ్రిక్స్’ దేశాలు నానాటికీ బలపడుతున్నాయి. ఇది తమ ఆధిపత్యానికి ఎంత ప్రమాదకరం కాగలదో అర్థమైనందువల్లనే ట్రంప్ ‘బ్రిక్స్’పై కత్తిగట్టారు. ఆయన వేర్వేరు దేశాలపై వేర్వేరుగా ప్రకటిస్తున్న ట్యారిఫ్లను, వేర్వేరు పద్ధతులలో సాగిస్తున్న చర్చలను గమనిస్తే, ‘బ్రిక్స్’ దేశాల పట్ల ‘విభజించి పాలించే’ వ్యూహాన్ని అనుసరిస్తున్నటు స్పష్టమవుతుంది.చర్చలోకి వెళితే, మోదీ నాయకత్వాన భారతదేశానికి అమెరికాతో అవసరాలున్నాయి, పేచీలు కూడా ఉన్నాయి. గతకాలపు చిన్నచిన్న పేచీలను అటుంచి ఇప్పుడు ట్యారిఫ్లతో, వాణిజ్య ఒప్పందంలోని ప్రతిపాదనలతో పెద్ద పేచీ తలెత్తింది. ఒకవైపు భారతదేశం స్వతంత్ర శక్తిగా గతం కన్నా బలపడుతూ తన భవిష్యత్తు పట్ల దృష్టి మారుతుండటం, మరొకవైపు అమెరికా క్రమంగా బలహీనపడుతూ ఏకధ్రువ ప్రపంచ స్థితి మారుతుండటం గమనించవలసిన కొత్త పరిణామాలు.ఇటువంటిది ఏర్పడినపుడు, వ్యూహాత్మకంగా అగ్రరాజ్యం ఎంతో వివేకంగా, చతురతతో వ్యవహరించాలి. ట్రంప్ నాయకత్వాన అమెరికా అవివేకపు వ్యూహాన్ని అనుసరిస్తున్నందున, ఇండియా వంటి మిత్రదేశంతోనూ సంబంధాలు చెదిరిపోతున్నాయి. అట్లా జరగకుండా ఉండేందుకు మోదీ మొదట గట్టి ప్రయత్నమే చేశారు. కానీ, ఏమి చేసైనా సరే తన ‘మాగా’ లక్ష్యాలను సాధించాలనే ఒత్తిడుల మధ్య అమెరికా అధ్యక్షుడు– యూరప్, కెనడా, జపాన్, మెక్సికో వంటి ఇతర మిత్ర దేశాలకు వలెనే ఇండియాను కూడా దారికి తెచ్చుకోగలనని నమ్మారు. వాటికీ,భారత్కూ మధ్యగల వ్యత్యాసాలను గ్రహించలేకపోయారు. దానితో, ఇంధనం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి... దేశ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం నిలబడక తప్పలేదు. వాస్తవానికి వ్యవసాయ రంగం విషయమై, గాట్ – డబ్ల్యూటీవో చర్చల దశలో ఇండియా ఇతర వర్ధమాన దేశాలతో కలిసి గట్టిగానే నిలబడింది. అదే ఇపుడు కూడా జరుగుతున్నది. పాఠాలు నేర్చుకోనిది అమెరికా కూటమే!ఆర్థిక భూకంపం రానుందా?ఇంతవరకు బాగున్నది. రాగల కాలపు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. ట్రంప్ తన ధోరణిని మార్చుకుని అంతా సుఖాంతం కావచ్చునా? భారతదేశంతో తగినంత రాజీ పడవచ్చునా? ట్రంప్ స్వభావమేమిటో ఈ సరికి బోధపడింది గనుక ఆయనను నమ్మలేమని ప్రధాని మోదీ తన స్వతంత్ర వైఖరిని కొనసాగించగలరా? మొన్నటి 6వ తేదీ తర్వాత వడివడిగా రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో సంప్రతింపులు జరిపి, పుతిన్ను ఆహ్వానించి, చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశాలకు వెళ్ళనున్నట్లు ప్రకటించి, అక్కడ జిన్పింగ్తో సమావేశం జరగవచ్చుననే సంకేతాలు పంపినందున, ఇవన్నీ మునుముందు బ్రిక్స్ వేదికగా కొత్త మార్గాన్ని మరింత దృఢంగా అనుసరించగలమనే సూచనలు కావచ్చునా? అటువంటిది గనుక అయితే, ఆగస్టు 6 నాటి భూ ప్రకంపనలు రాగల కాలపు భూకంపానికి నాంది అవుతాయి. అట్లా జరగాలన్నదే వర్ధమాన ప్రపంచపు కోరిక కావచ్చు కూడా! కానీ అది తేలిక కాదు. ట్రంప్ ప్రతీకారాన్ని తట్టుకునేందుకు సైతం సిద్ధపడవలసి ఉంటుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
భారత్పై అమెరికా సుంకాలు.. ఆగమవుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థ: ట్రంప్
ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యే వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత్ వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో.. ఇరు దేశాలవి డెడ్ ఎకానమీ అంటూ గతంలో వ్యాఖ్యానించింది తెలిసిందే. తాజాగా.. భారత్పై అమెరికా విధించిన భారీ సుంకాలు రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బలాంటిదని అభిప్రాయపడ్డారు.వైట్హౌజ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రష్యా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదు. అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు, అదే సమయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లలతో ఆగమాగమవుతోంది. అదొక విశాలమైన దేశం. అపారమైన సామర్థ్యమూ ఉంది. కాబట్టి తిరిగి తమ దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలి’’ అని సూచించారు. ఈ సమయంలో భారత్ ప్రస్తావన తీసుకొచ్చారాయన..‘‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశానికి.. 'మీరు రష్యా నుంచి చమురు కొంటే 50% టారిఫ్ వేస్తాం' అని హెచ్చరించాం. చెప్పినట్లే చేశాం కూడా. ఇది ముమ్మాటికీ రష్యాకు పెద్ద దెబ్బనే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ చేసిన ఈ ఎకానమీ వ్యాఖ్యలపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఇదిలా ఉంటే.. భారత్ అమెరికాకు మిత్రదేశమేనని, వాణిజ్యం మాత్రం సక్రమంగా లేదని చెబుతూ ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలను విధించారు. ఆ సమయంలో రష్యా నుంచి భారత్ చమురు కోనుగోళ్ల నేపథ్యంపైనా ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ భారత్ వెనకడుగు వేయలేదు. ఆ సమయంలో ఇరు దేశాల తమ డెడ్ ఎకానమీలను మరింత దిగజారచుకుంటున్నాయని.. ఆ అంశాన్ని అమెరికా పట్టించుకునే స్థితిలో లేవని అన్నారు. అటుపై భారత్పై మరో 25 శాతం పెనాల్టీ టారిఫ్ విధించడంతో ఆ సుంకాలు 50 శాతానికి చేరాయి. అయితే భారత్ ఈ సుంకాలను అన్యాయంగా పేర్కొంది. అదే సమయంలో.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే తాము ముందుకు సాగుతామని స్పష్టం చేసింది.మరో పక్క.. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తానే ఆపుతానంటూ చెబుతూ వస్తున్నారు కూడా. ఈ క్రమంలో.. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ కానున్నారు. అయితే తమను చర్చల్లో భాగం చేయకుంటే ఆ చర్చలకు అర్థం ఉండదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ క్రమంలో అలస్కా భేటీలో జెలెన్స్కీకి చోటు ఉంటుందా? లేదంటే ట్రంప్తో విడిగా భేటీ అవుతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. #WATCH | Washington, DC | On Russia-Ukraine war and meeting with Russian President Vladimir Putin, US President Donald Trump says, "This could have been a third world war... I thought it was very respectful that the president of Russia is coming to our country, as opposed to us… pic.twitter.com/rrOyuRkFTG— ANI (@ANI) August 11, 2025 -
మోదీకి జెలెన్స్కీ ఫోన్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమ వారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్లోని నగరాలు, గ్రామాలపై జరుగుతున్న రష్యా సైన్యం దాడుల గురించి వివరించారు. కాల్పుల విరమణకు రష్యా సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందని అన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతికి చొరవ చూపాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశం సందర్భంగా వ్యక్తిగతం భేటీ కావాలని జెలెన్స్కీ, మోదీ నిర్ణయించుకున్నారు. నరేంద్ర మోదీతో సంభాషణ అనంతరం జెలెన్స్కీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, ఉక్రెయిన్ మధ్య ద్వైపాకిక్ష సహకా రంతోపాటు దౌత్య సంబంధాల్లో పురోగతిపై చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఘర్షణకు తెరప డాలని, సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అందుకు భారత్ సహకారం అవసరమని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్కు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నందుకు ప్రధాని మోదీకి జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొ ద్దంటూ భారత్కు అమెరికా చేసిన హెచ్చరికల అంశం కూడా జెలెన్స్కీ, మోదీ మధ్య చర్చకు వచ్చింది. భారత్ చెల్లిస్తున్న డబ్బులతో రష్యా సైన్యం తమపై దాడులు చేస్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోదీ సైతం ‘ఎక్స్’లో ప్రతిస్పందించారు. ఉక్రెయిన్– రష్యా మధ్య శాంతికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టంచేశారు. ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. -
తొలి అంతరిక్ష వివాహం: భూమ్మీద వధువు..అంతరిక్షంలో వరుడు..
22 ఏళ్ల క్రితం ఇంచుమించు ఇదే రోజున అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త సందర్భం ఎదురైంది. ఒక కొత్త పోకడకు నాంది పలికింది. అంతరిక్షంలో వివాహం అన్న ఊహే వింతగా ఉన్నా..దాన్ని నిజం చేసుకుంది ఓ జంట. సరిగ్గా ఆగస్టు 10ని అంతరిక్షంలో పెళ్లి చేసుకుని అసాధారణమైన మైలురాయిని నమోదు చేసుకుంది ఆ జంట. ఆ దంపతులు ఎవరంటే..వారే రష్యన్ వ్యోమగామి యూరి మాలెన్చెంకో(Yuri Malenchenko), ఎకటెరినా డిమిత్రివ్(Ekaterina Dmitriev) దంపతులు. వ్యోమగామి యూరి మాలెన్ చెంకో అమెరికా టెక్సాస్లో ఉండే తన గర్ల్ఫ్రెండ్ని డిమిత్రివ్ని అంతరిక్షంలో పెళ్లి చేసుకుని సరికొత్త మైలురాయిని సృష్టించాడు. డిమిత్రివ్ హుస్టన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాసా అంతరిక్ష నియంత్రణ మధ్య ఉపగ్ర హుక్ అప్ ద్వారా తన ప్రియుడు వ్యోమగామి మాలెన్చెంకోని వివాహమాడింది. సరిగ్గా ఆగస్టు 10, 2003న ఈ జంట వివాహం జరిగింది. మాలెన్ చెంకో తన అధికారిక అంతరిక్ష సూట్ బో టైను ధరించగా, హుస్టన్లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో డిమిత్రివ్ సంప్రదాయ వివాహ దుస్తుల్లో వేచి చూస్తోంది. యూరి దూరంగా ఉన్నందునా ఆమె అక్కడ అతడి కటౌట్ బోర్డుతో దర్శనమిచ్చింది. వారిద్దరిని దగ్గర చేసేది వీడియో కాల్ కమ్యూనికేషన్. నిజానికి భూమ్మీద 200 మంది అతిధుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని భావించారు. అయితే మాలెన్చెంకో అంరిక్షకేంద్రంలో గడిపే సమయం పొడిగించడంతో..వారు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడానికి మరొక మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు. డిమిత్రివ్ మాలెన్చెంకో కార్డ్బోర్డు కటౌట్తో ఫోటోలకు ఫోజులిస్తూ..డేవిడ్ బోవి పాటకు స్టెప్పులేసింది. ఇక మాలెన్ చెంక్తో పాటు ఉన్న మరో వ్యోమగామి కీ బోర్డుపై వివాహ మార్చ్ను ప్లే చేశాడు. అంతేగాదు వీడియో కాల్ సాయంతో తన కాబోయే భర్తకు ముద్దుపెట్టి మరి ప్రపోజ్ చేసింది. ఈ సుదూర వివాహం కంటే ముందు నుంచే ఈ జంట సుదూరంగానే రిలేషన్లో ఉండటానికి అలవాటుపడ్డారు. నిజం చెప్పాలంటే ఇలా అంతరిక్షంలో పెళ్లి చేసుకునే అదృష్టం ఈ జంటకే లభించిందని పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ జంటలా మరేవ్వరూ అంతరిక్షంలో వివాహం చేసుకోకుండా నిషేధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టులో వివాహం అనంతరం కొన్ని నెలలకు మాలెన్చెంకో భార్యని కలిసేందుకు ఇంటికి తిరిగి వచ్చాడు.(చదవండి: పది కిలోలు బరువు తగ్గిన భారత్పే సహ వ్యవస్థాపకుడు..ఆ రెండు సూత్రాలే కీలకం..!) -
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేస్తే పెనుభారమే!
భారత్ తన చమురు అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశంలో ఉపయోగిస్తున్న చమురులో ఏకంగా 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. ఇందులో ప్రధాన వాటా రష్యాదే. రష్యా నుంచి చౌకగా ముడిచమురు లభిస్తోంది. ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేయడానికి, 50 శాతం సుంకాలు విధించడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడమే కారణం. ఒకవేళ రష్యా నుంచి ముడిచమురు కొనడం ఆపేస్తే భారత్పై మోయలేని భారం పడడం ఖాయం. అది దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రతికూలంగా మార్చేయగలదు. రష్యా చమురును వద్దనుకుంటే ఇండియా ఆయిల్ దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుందని ఎస్బీఐ ఒక నివేదికలో తేల్చిచెప్పింది. 2026లో 9 బిలియన్ డాలర్లకు, 2027లో 12 బిలియన్ డాలర్లకు చేరుతుందని వెల్లడించింది. చమురు కోసం పూర్తిగా అరబ్ దేశాలపైనే ఆధారపడితే విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. అంతిమంగా ఆ భారం మోయాల్సింది ప్రజలేనన్న సంగతి తెలిసిందే. 1.7 శాతం నుంచి 35.1 శాతానికి.. భారత్ 2022 నుంచి రష్యా నుంచి ముడిచమురును చౌక ధరకే కొంటోంది. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా చమురు ధరపై పరిమితిని నిర్దేశించాయి. దాంతో రష్యా తన చమురును ఇండియాకు విక్రయిస్తోంది. దీనివల్ల ఇండియాకు ఎనలేని మేలు జరుగుతోంది. చమురు బిల్లుల భారం చాలావరకు తగ్గిపోయింది. మన దేశానికి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో తొలి స్థానం రష్యాదే. 2020లో ఇండియా చమురు అవసరాల్లో రష్యా వాటా కేవలం 1.7 శాతం ఉండేది. ప్రస్తుతం అది ఏకంగా 35.1 శాతానికి చేరడం గమనార్హం. 2025లో 245 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు దిగుమతి చేసుకోగా, ఇందులో రష్యా వాటా 88 మిలియన్ మెట్రిక్ టన్నులు. ధరలు 10 శాతం పెరిగే అవకాశం అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా ఆయిల్ను ఇండియాతోపాటు ఇతర దేశాలు కొనడం ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రపంచమంతటా ఉపయోగిస్తున్న ఆయిల్లో 10 శాతం రష్యా నుంచే వస్తోంది. ఈ ఆయిల్ సరఫరాను హఠాత్తుగా నిలిపివేస్తే.. కొరత వల్ల చమురుకు డిమాండ్ పెరిగి ధరలు కనీసం 10 శాతం పెరుగుతాయి. ఇండియాతోపాటు అన్ని దేశాలపైనా భారం పడుతుంది. ఇండియాకు ఉన్న సానుకూలత ఏమిటంటే.. రష్యా నుంచే కాకుండా మరో 40 దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి సరఫరా ఆగిపోయినా ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఉండకపోవచ్చు. ధరల భారం మాత్రం తప్పదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎట్టకేలకు అమెరికా–రష్యా భేటీ
ఎటుచూసినా యుద్ధాలూ, ఊచకోతలూ, దురాక్రమణలూ కనబడుతున్న వర్తమానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర చర్చలు జరగబోతున్నాయన్న కబురు కాస్తంత ఉపశమనం కలిగిస్తుంది. అయితే అలవికాని డిమాండ్లు పెట్టడంలో, మొండి పట్టుదలకు పోవటంలో ఇద్దరికిద్దరే గనుక ఈ చర్చల వల్ల ఒరిగేదేమైనా ఉంటుందా అన్నది సందేహమే. చర్చల ఫలితం మాట అటుంచి, వాటి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ట్రంప్ ‘త్యాగం’ చేశారా అనే అనుమానాలు అందరిలో తలెత్తాయి. చర్చల తేదీలు ఖరారు కాకపోయినా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వచ్చేవారం అధినేతలిద్దరూ సమావేశమవుతారని రెండు దేశాల అధికార వర్గాలూ ప్రకటించాయి. ఉక్రె యిన్తో కాల్పుల విరమణ పాటించాలంటూ రష్యాకు ట్రంప్ పెట్టిన గడువు శుక్రవారంతో ముగిసింది. చర్చలపై స్పష్టత వచ్చింది గనుక ఈ గడువు విషయంలో ట్రంప్ ఏం చేస్తారన్నది చూడాలి. మూడున్నరేళ్లుగా సాగిస్తున్న యుద్ధాన్ని విరమించమని అధికారంలోకొచ్చింది మొదలు తన సొంత సామాజిక మాధ్యమం ద్వారా రష్యాను బెదిరించటం తప్ప, ట్రంప్ నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టింది లేదు. ఆయన దూత స్టీవ్ విట్కాఫ్ రష్యా ఉన్నతాధికార బృందంతో నాలుగు దఫాలు చర్చించిన మాట వాస్తవమే అయినా ఒరిగిందేమీ లేదు. ట్వీట్ల ద్వారా ప్రపంచ సమస్యలు పరిష్కారం కావని ఆర్నెల్ల తర్వాత ట్రంప్కు అర్థమైనట్టుంది. అమెరికా విజ్ఞప్తి మేరకు చర్చలు జరుగుతున్నాయని రష్యా ప్రతినిధి చెప్పటం గమనించదగింది. మొన్న ఫిబ్రవరిలో వైట్హౌస్లో మీడియా సాక్షిగా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఇష్టానుసారం మాట్లాడారు. అటు తర్వాత జెలెన్స్కీ ఉక్రెయిన్లోని విలువైన ఖనిజాలను అమెరికాకు దఖలుపరచటానికి అంగీకరించారు. ఆ తర్వాత నుంచి పుతిన్పై అమెరికా ఒత్తిళ్లు తీసుకురావటం మొదలెట్టింది. ట్రంప్లో అసహనం పెరుగుతున్నదని తెలిసినా రష్యా వెనక్కి తగ్గలేదు. పుతిన్ లక్ష్యాలు వేరు. ఉక్రెయిన్ను నాటో కూటమికి దూరంగా ఉంచటం, భవిష్యత్తులో నాటో విస్తరణ ఉండబోదన్న హామీ తీసుకోవటం వాటిల్లో ప్రధానమైనవి. రష్యా ఆగ్నేయభాగంలో పాక్షికంగా ఉక్రెయిన్ ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి వైదొలగాలని, దాంతోపాటు ఉక్రెయిన్ నుంచి తమ దళాలు చేజిక్కించుకున్న డొనెట్స్క్తో పాటు మరో నాలుగు ప్రాంతాలూ, 2014లో తాము ఆక్రమించిన దక్షిణ క్రిమియా ద్వీపకల్పం రష్యాకే చెందుతాయని గుర్తించాలని పుతిన్ కోరుకుంటున్నారు. మొత్తంగా ఉక్రెయిన్కి చెందిన 1,719 చదరపు కిలోమీటర్ల భూభాగం రష్యా ఆక్రమణలో ఉంది. పుతిన్తో సమావేశానికి ట్రంప్ ఎంత తహతహలాడుతున్నారో తాజా పరిణామాలు తెలియజెబుతున్నాయి. అమెరికా, రష్యాల మధ్య ద్వైపాక్షిక చర్చలు కాకుండా, జెలెన్స్కీని కూడా కలుపుకొని త్రైపాక్షిక చర్చలైతేనే సమస్య పరిష్కారం తేలికవుతుందని అమెరికా ప్రతిపాదిస్తూ వచ్చింది. అయితే ఇందుకు రష్యా సుముఖంగా లేదు. ముందు అమెరికా, రష్యాల మధ్య చర్చలు జరిగి, అవి సత్ఫలితాన్నిచ్చాకే త్రైపాక్షిక సమావేశం సంగతి చూడొచ్చని అది చెబుతోంది. కానీ ఇందుకు జెలెన్స్కీ మొదటి నుంచీ వ్యతిరేకం. రష్యా దాడుల పర్యవసానంగా నష్టపోయేది తామైతే... చర్చల్లో తమ ప్రమేయం లేకపోవడమేమిటన్నది ఆయన ప్రశ్న. కానీ నెలలు గడిచాక ఆయన వైఖరి మారింది. శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతిస్తూ తాజాగా జెలెన్స్కీ ట్వీట్ చేశారు. ఆయనకు అంతకన్నా గత్యంతరం లేదు.అమెరికా, రష్యాల మధ్య చివరిగా జో బైడెన్ హయాంలో 2021లో శిఖరాగ్రం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకే పుతిన్ దండయాత్ర మొదలైంది. ఆర్నెల్లుగా చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలించని నేపథ్యంలో ఇప్పుడెలా సాధ్యమైందన్న ప్రశ్నకు రెండు పక్షాల నుంచీ జవాబు లేదు.ఈ శిఖరాగ్ర సమావేశం తర్వాత ఉక్రెయిన్ను కూడా కలుపుకొని త్రైపాక్షిక చర్చలు సాగిస్తామనిఅంటున్నా అందువల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. ఘర్షణలకు మూలకారణం నాటో కూటమి, దాన్ని ప్రోత్సహించిన అమెరికా. ఉక్రెయిన్లో 2014లో ప్రజామద్దతుతో ఎన్నికైన అధ్యక్షుడు విక్టర్ యెనుకోవిచ్ రష్యాతో సన్నిహితంగా ఉండటాన్ని సహించలేని అమెరికా, నాటోలు... అక్కడ అల్లర్లు రెచ్చగొట్టి ప్రజావిప్లవం సాకుతో ఆయన దేశం విడిచిపోయేలా చేశాయి. అటు తర్వాత జెలెన్స్కీ దేశాధ్యక్షుడయ్యారు. నాటో ప్రాపకంతో రష్యాతో గిల్లికజ్జాలకు దిగింది జెలెన్స్కీయే. కనుక నాటో కూటమి, దాని ద్వారా కథ నడిపించిన అమెరికా తమ వైఖరులు మార్చుకోక తప్పదు. అధినేతగా దేశ ప్రయోజనాల కోసం పాటుబడాలి తప్ప అగ్రరాజ్యాల చేతుల్లో పావుగా మారకూడదని తాజా పరిణామాల తర్వాతైనా జెలెన్స్కీ గ్రహించాల్సి ఉంది. -
ట్రంప్కు మరోషాక్.. పుతిన్కు మోదీ ఆహ్వానం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాకిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా-భారత్ల మధ్య నెలకొన్న టారిఫ్ల వివాదంతో రష్యాతో వాణిజ్య సంబంధాలకే మోదీ జై కొట్టారు. ఈరోజ(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) రష్యా అధ్యక్షడు పుతిన్క స్వయంగా ఫోన్ చేసిన మోదీ.. ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే భారత్కు రావాలని మోదీ ఆహ్వానించారు. 23వ భారత-రష్యా వార్షిక సదస్సుకు హాజరుకావాలని మోదీ ఆహ్వానం పలికారు. మరొకవైపు ఉక్రెయిన్లో తాజా పరిస్థితులను మోదీకి వివరించారు పుతిన్. ఉక్రెయిన్తో సంబంధాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుతిన్కు విన్నవించారు మోదీ. అమెరికా ఆయుధాల కొనుగోలుకు భారత్ విముఖతఅగ్రరాజ్యం నుంచి కొత్త ఆయుధాలను, వైమానిక విమానాలను కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ట్రంప్ భారత్పై విధించిన భారీ సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయిభారత్ మిత్రదేశమే అయినా అమెరికాతో వాణిజ్యం అనుకున్నంత సంతృప్తిగా జరగడం లేదని.. పైగా రష్యాతో చమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ ట్రంప్ గతంలో 25 శాతం టారిఫ్ విధించారు. ఆపై అగష్టు 6వ తేదీన.. తాను చెప్పినా వినలేదంటూ మరో 25 శాతం సుంకాలు ప్రకటించారు.అమెరికాతో వాణిజ్యం జరిపే దేశాల్లో భారత్పై విధించిన సుంకమే హయ్యెస్ట్. దీంతో.. ట్రంప్ నిర్ణయాన్ని భారత్ అన్యాయంగా పేర్కొంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ దేశాలకు అనుగుణంగా రష్యాతో వాణిజ్యం చేస్తుండడాన్ని ప్రముఖంగా లేవనెత్తింది కూడా. అయితే భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్ వార్పై తాము కూడా తగ్గేదే లేదని భారత్ సంకేతాలిచ్చింది.రష్యాతో చమురు ఒప్పందాలు ఆగేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో.. రాజీ పడేది లేదని, సుంకాలతో భారీ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. అమెరికా సుంకాలపై అటు రష్యా, ఇటు అనూహ్యంగా చైనా భారత్కు మద్ధతుగా నిలిచాయి. ఈ క్రమంలో.. భారత ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటిస్తుండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వస్తుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ప్రత్యేకంగా పుతిన్కు ఫోన్ చేసి మోదీ ఆహ్వానించి ట్రంప్కు ఊహించని షాకిచ్చారు మోదీ. అమెరికా సుంకాలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్! -
ఆ రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరో మలుపు
అమెరికా-ఉక్రెయిన్ మధ్య రక్షణ సహకారం మరో మలుపు తిరిగింది. ఉక్రెయిన్కు పంపాల్సిన ఆయుధాలను తిరిగి అమెరికా డిఫెన్స్కు మళ్లించే ప్రక్రియ షురూ అయ్యింది. పెంటగాన్ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో జరగబోయే భేటీ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తిని రేపుతోంది. గత నెలలో వాషింగ్టన్లోని రక్షణ శాఖలో వెలువడిన ఓ రహస్య మెమో బయటకు వచ్చింది. ఉక్రెయిన్కు వెళ్ళాల్సిన కొన్ని రకాల ఆయుధాలను తిరిగి అమెరికా రక్షణ నిల్వల్లోకి మళ్లించే నిర్ణయం తీసుకున్నట్లు ఈ మెమో వెల్లడించింది. ఎల్బ్రిడ్జ్ కొల్బీ, అమెరికా రక్షణ విధానాల ప్రధాన అధికారి ఈ మెమో పై సంతకం చేశారు.ఈ నిర్ణయం అమలైతే… ఉక్రెయిన్ కోసం కేటాయించిన బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు అమెరికాలో డిఫెన్స్ నిల్వలను నింపడానికి ఉపయోగపడతాయి. ఉక్రెయిన్కు అధికంగా సాయం చేస్తే, అమెరికా వద్ద తక్షణ రక్షణ అవసరాల కోసం కీలకమైన సామగ్రి కొరత ఏర్పడుతుందన్నది పెంటగాన్ ఓ నివేదికలో పేర్కొంది. వాటిలో ముఖ్యంగా ఇంటర్సెప్టర్ క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థలు, ఆర్టిలరీ గోళాలు ఉన్నాయి. గత నెలలో రక్షణ మంత్రి పీటె హేగ్సెత్, ఉక్రెయిన్కి పంపాల్సిన పెద్ద ఆయుధాల ప్యాకేజీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది కొల్బీ మెమో ప్రకారం తీసుకున్న నిర్ణయమే. కొల్బీ ఎప్పటినుంచో ఉక్రెయిన్కు అధిక ఆయుధ సహాయం ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.అయితే, ఈ నిర్ణయం బయటకు రాగానే అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకున్నారు. రష్యా దాడులు రోజువారీగా జరుగుతున్న వేళ, ఉక్రెయిన్కి రక్షణాత్మక ఆయుధాలను నిరంతరం అందిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అదే కాకుండా, నాటోతో కొత్త ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్కి అవసరమైన ఆయుధాలను అమెరికా తయారు చేస్తుంది. వాటి ఖర్చు యూరోపియన్ మిత్రదేశాలు భరిస్తాయి. ఈ ప్రణాళిక విలువ బిలియన్ల డాలర్లు దాటే అవకాశం ఉండటంతో ఈ ఒప్పందం ఎలా అమలవుతుందనే దానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. -
వచ్చే వారంలో ట్రంప్తో పుతిన్ భేటీ.. వేదిక అక్కడే?
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వచ్చే వారం సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బహుశా యూఏఈలో శిఖరాగ్రం జరిగే అవకాశముందన్నారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. యూఏఈ అధ్యక్షుడు జాయెద్ అల్ నహ్యాన్తో క్రెమ్లిన్లో జరిగిన భేటీ అనంతరం పుతిన్ ఈ ప్రకటన చేశారు. ప్రతిపాదన తమదే అయినా, ఇరు దేశాలు ఈ భేటీపై ఆసక్తితో ఉన్నాయన్నారు. చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొంటారా అన్న ప్రశ్నకు పుతిన్.. ఇందుకు తాను వ్యతిరేకం కాదని గతంలోనూ అనేక పర్యాయాలు చెప్పానన్నారు. అయితే, ఇందుకు కొన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు. అంతకుముందు, రష్యా విదేశాంగ శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. శిఖరాగ్రం వచ్చే వారం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇందుకు వేదికపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు. తేదీలింకా ఖరారు కాలేదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ భేటీలో పాల్గొనే ఛాన్సుందన్న వార్తలను ఉషకోవ్ కొట్టిపారేశారు. పుతిన్, ట్రంప్ భేటీ విజయవంతం, ఫలవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు గతంలో జెలెన్స్కీ భేటీ ప్రతిపాదన తెచ్చినా పుతిన్ పట్టించుకోలేదు. తాజాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించలేదు. యుద్ధం ఆపకుంటే ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికల గడువు శుక్రవారంతో ముగియనుంది. ట్రంప్–పుతిన్ శిఖరాగ్రం తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసేందుకు ఒక అవకాశమని రష్యా బుధవారం వ్యాఖ్యానించింది. అరుదైన ఖనిజాల వెలికితీత వంటి అంశాల్లో ఉమ్మడి పెట్టుబడులకు ఆర్థిక అవకాశాలపైనా చర్చలు జరపవచ్చని తెలిపింది.యుద్ధానికి వ్యతిరేకంగా ఉక్రేనియన్లు2022తో పోలిస్తే రష్యాతో జరిగే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని ఎక్కువమంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధం మొదలైన కొత్తలో చేపట్టిన ఓ సర్వేలో విజయం సాధించేదాకా పోరాడాల్సిందేనంటూ మూడొంతుల మంది గట్టిగా కోరుకున్నారు. తాజాగా ఇటీవల చేపట్టిన సర్వేలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. యుద్ధానికి కొనసాగించాలనుకునే వారి సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనిపించింది. త్వరగా యుద్ధానికి ముగింపు పలికి, రష్యాతో ఒప్పందానికి రావాలని మూడొంతుల మంది కోరుకుంటున్నారని వెల్లడైంది. రష్యా ఆధీనంలోని భాగాలు మినహా మిగతా ప్రాంతాల్లోని 15 ఏళ్లు పైబడిన వెయ్యి మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
మూడు దేశాలు ఒక్కటైతే..!
అగ్రరాజ్యమన్న దురహంకారం, ఆధిపత్యధోరణితో ట్రంప్ టారిఫ్ల బాంబులు విసిరితే బాధిత దేశాలు జట్టుకట్టి పోరుసల్పే ప్రయత్నాలు మొదలెట్టాయా? అంటే తాజా అంతర్జాతీయ పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వినిమయ ప్రపంచంగా పేరొందిన అమెరికాకు అన్ని దేశాల వస్తూత్పత్తులు పోటెత్తుతాయి. చాలా దేశాల ఖజానా నిండటానికి అమెరికా కొనుగోళ్లే కారణం. దీనిని అలుసుగా తీసుకుని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని కారణంగా చూపి తమతో వాణిజ్యంచేసే దేశాలపై ట్రంప్ టారిఫ్ల గుదిబండలు పడేస్తుండటంతో ఆయా దేశాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. భారత్, చైనా వంటి దేశాలు అంతటితో ఆగకుండా రష్యాతో జట్టుకట్టి అగ్రరాజ్య దుందుడుకు చర్యలకు ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో గురువారం ఎన్ఎస్ఏ ధోవల్ సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపానని ధోవల్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి ట్రంప్ను ఎలా నిలువరించాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ దూకుడుకు ఎలా కళ్లెం వేయాలని అంశంపై చర్చించేందుకు త్వరలో భారతవిదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడనున్నారు. గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల ముష్టిఘాతం, ఘర్షణలు, 20కిపైగా భారత జవాన్ల వీరమరణంతో ఎగసిపడిన కోపాన్ని సైతం కాసేపు పక్కనబెట్టి ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. చైనాకు బద్దశత్రువైన అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ చర్చించనున్నట్లు వార్తలొచ్చాయి. మారుతున్న భారత్ వ్యూహం చైనాతో మైత్రీ విషయంలో ఇన్నాళ్లూ సమదూరం పాటించిన భారత్ ఇకపై అమెరికా కారణంగా స్నేహబంధాన్ని బలపర్చుకునే అవకాశముంది. చైనా, భారత్, రష్యా కూటమిలో తానూ చేరతానని ఇప్పటికే బ్రెజిల్ సూచనప్రాయంగా తెలిపింది. వ్యవసాయం, డైయిరీ రంగంలో అమెరికన్ కంపెనీల రాకను భారత్ అడ్డుకుంటుండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో అటు సుంకాలతో, ఇటు వాణిజ్య ఒప్పందంలో తనకు అనుకూల షరతులతో భారత్ మెడలు వంచాలని ట్రంప్ చూస్తున్నారు. ఇందుకు భారత్ ససేమిరా అనడంతో ఆగ్రహంతో ట్రంప్ మోపిన టారిఫ్ ఇప్పుడు భారత్ను చైనాకు దగ్గరచేస్తోందని తెలుస్తోంది. ఏడేళ్ల తర్వాత మోదీ చైనా పర్యటన ఖరారుకావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు ఇన్నాళ్లూ భారత్ను మచి్చకచేసుకునేందుకు గత అమెరికా ప్రభుత్వాలు చేసిన సఫలయత్నాలను ట్రంప్ ఒక్క టారిఫ్ దెబ్బతో నాశనంచేస్తున్నారు. 25 శాతం టారిఫ్ అమల్లోకి వచి్చనరోజు మాస్కోలో దోవల్ పర్యటించడం యాదృచి్ఛకం కాదని తెలుస్తోంది. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటూ ట్రంప్ పంపిన దూత, అమెరికా ఉన్నతాధికారి స్టీవ్ విట్కాఫ్.. వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయిన కొద్దిగంటల తేడాతోనే ధోవల్ సైతం మాస్కోలో కీలక చర్చలు జరపడం గమనార్హం. షాంఘై శిఖరాగ్ర సదస్సు వేదికగా.. త్వరలో చైనాలో జరగబోయే షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలిసి ట్రంప్ ప్రభుత్వ వ్యతిరేక వ్యూహాలను రచించనున్నట్లు వార్తలొచ్చాయి. ఇటీవలికాలంలో చైనా, భారత్ మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి. రష్యా ముడిచమురును చైనా, భారత్లు అత్యధికంగా కొనుగోలుచేస్తున్నాయి. ట్రంప్ బెదిరింపులను భారత్, చైనా రెండూ చవిచూశాయి. దేశ స్వప్రయోజనాలు, జాతీయ భద్రతకే తాము పెద్దపీట వేస్తామని చైనా, భారత్ ఒకే తరహాలో తమ వాణిని గట్టిగా వినిపించాయి. యురేనియం, ఎరువులు, ఇతర కీలక మిశ్రమ ధాతువులను రష్యా నుంచి కొంటూ మాకు సుద్దులు నేర్పుతావా? అని రెండు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. శత్రువుకు శత్రువు మిత్రువు అన్న సూత్రాన్ని భారత్, చైనాలు తూ.చ. తప్పకుండా పాటిస్తాయని తెలుస్తోంది. కలిసి నడుస్తానన్న బ్రెజిల్ తమపై ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడంపై అమెరికాపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా గుర్రుగా ఉన్నారు. ‘‘ ఇంతటి భారం మోపిన ట్రంప్కు అస్సలు ఫోన్ చేయను. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని మోదీకి ఫోన్చేస్తా. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ టారిఫ్లపై తేల్చుకుంటాం. ఈ దేశాలతో కలిసి నడుస్తా’’ అని డసిల్వా అన్నారు. రష్యా, ఇండియా, చైనా త్రయం మళ్లీ క్రియాశీలకం కావాల్సిన తరుణం వచి్చందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విచక్షణ మరిచిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు తన మాట వినని దేశాలపై తోచిన మోతాదులో సుంకాలు వేయటం నిత్యకృత్యమైంది. ఈ క్రమంలో న్యాయం, ధర్మం, విచక్షణ, హేతుబద్ధత వగైరాలు లేవు. రెండోసారి దేశాధ్యక్షుడైనా తమ దేశం ఎవరెవరితో ఏ స్థాయి వాణిజ్యం నెరపుతున్నదో తెలియని ట్రంప్... వేరే దేశాలు ఎవరితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకోవాలో, వద్దో నిర్ణయించటానికి తగుదునమ్మా అంటూ తయారయ్యారు. ఈనెల 1 నుంచి మన దేశంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు లోగడ ప్రకటించిన ట్రంప్, వారం తిరగకుండానే మరో 25 శాతం మేర సుంకాలుంటాయని తాజాగా నిర్ణయించారు. ఇవిగాక పరోక్ష సుంకాలు మొదలవు తాయట. ఇవన్నీ 250 శాతం దాటినా దాటొచ్చని లోగడే ఆయన సెలవిచ్చారు. తన మాట నెగ్గటానికి కనిపించిందల్లా విసిరికొట్టే అల్లరిపిల్లల మొండిధోరణికీ, ట్రంప్ చేష్టలకూ తేడా ఉందా? తనకు రష్యా నచ్చలేదు గనుక ఆ దేశం నుంచి ముడి చమురు కొనరాదని ఆయన శాసిస్తున్నారు. ఉక్రెయిన్తో జగడం ఆపేయాలని పదే పదే కోరుతున్నా వినని రష్యా అధ్యక్షుడు పుతిన్పై అక్కసుతో ఇవన్నీ చేస్తున్నట్టు అందరికీ కనబడుతోంది. కానీ అసలు కారణాలు వేరు. నిజానికి రష్యా చమురు కొని ప్రపంచమార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడమని గతంలో చెప్పింది అమెరికాయే!ప్రేమాభిమానాలను అపాత్రదానం చేయకూడదు. ట్రంప్ వ్యవహారశైలి చూచాయగా తెలుస్తున్నా, తొలి దఫాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారు. దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు సానుకూలత అవసరమే. కానీ దానికి కూడా అవధులుంటాయి. 2019 సెప్టెంబర్లో అమెరికాలోని టెక్సాస్లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమమైనా,ఆ మరుసటేడాది ట్రంప్ భారత్ సందర్శించినప్పుడు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ అయినా దౌత్య పరిమితులు దాటాయన్న విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం సంగతి సరే... పౌరులు కూడా ఆ మాదిరే ఉన్నారు. అమెరికాలోని కొందరు ఎన్నారైలు ఆయన దేశాధ్యక్షుడు కావాలని యజ్ఞయాగాదులు చేశారు. అంతేకాదు... ప్యూ రీసెర్చ్ సంస్థ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రపంచ వ్యవహారాల్లో ట్రంప్ వ్యవహారశైలిపై 24 దేశాల్లో 28,333 మందిని సర్వే చేస్తే సగం మంది భారతీయులు ఆయనపై విశ్వాసం వ్యక్తపరిచారట. ఆ సంగతి అప్పట్లో ఆ సంస్థ ప్రకటించింది. టర్కీ, జర్మనీ, మెక్సికో లాంటి దేశాల్లో మాత్రం అత్యధికులు (80 శాతం పైగా) ట్రంప్పై నమ్మకం లేదని తెలిపారు. ఈ ఫలితాల్లో మనం హంగేరి, ఇజ్రాయెల్, నైజీరియా, కెన్యాల సరసన చేరాం.అయితే ట్రంప్ వికృత విన్యాసాలు గమనించాక మోదీ ఆయన విషయంలో దృఢవైఖరి ప్రదర్శిస్తున్నారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అన్నదాతల, మత్స్యకారుల ప్రయోజనాలను విస్మరించే ప్రశ్నే లేదని గురువారం ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. ఇందుకు వ్యక్తిగతంగా మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధమేనన్నారు. మోదీ, ట్రంప్ల మైత్రి గురించి ఉన్న అభిప్రాయంతో సుంకాల ఒప్పందంలో అమెరికాదే పైచేయి అవుతుందనుకున్న మన విపక్షాలకు ఇది నిరాశ కలిగించే పరిణామమే. దేశంలో 70 కోట్లమంది ప్రజానీకం ఆధారపడి బతికే రంగాలను విదేశాలకు గంపగుత్తగా అప్పగించే దుస్సాహసం ఎవరైనా చేయగలుగుతారా? పైగా అవి జన్యుమార్పిడి చేసినవి. ఆ చెత్త మన మార్కెట్లను ముంచెత్తితే కలిగే దుష్పరిణామాల గురించి చాన్నాళ్లుగా పర్యావరణవాదులు చెబుతూ వచ్చారు. తమ సాగు, పాడి ఉత్పత్తులపై అసలు సుంకాలే విధించరాదన్నది ట్రంప్ ఆంతర్యం. ఆశపడటం సహజం... కానీ అది దురాశగా మార రాదని ఆయన గారికి చెప్పేదెవరు? ‘జీరో’ సుంకాల సంగతి బహిరంగంగా చెబితే నలుగురూ నోళ్లు నొక్కుకుంటారని ట్రంప్ భయపడి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ, రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలన్న రాగం అందుకున్నారు. ఏ సరుకు ధరైనా మార్కెట్ శక్తులు నిర్ణయించే వర్తమానంలో రష్యా నుంచి చవగ్గా కొనరాదని, దాన్ని హెచ్చు ధరకు అమ్మ రాదని ఆంక్షలు విధించాలని చూడటం ట్రంప్ తెలివితక్కువతనం. అమెరికా ఇన్నాళ్లూ ప్రవచించిన ప్రపంచీకరణకు వ్యతిరేకం. పైగా చైనాతో పోలిస్తే మన ముడిచమురు కొనుగోళ్లు తక్కువ. అయినా ఆ దేశంపై ట్రంప్ సానుకూలంగా ఉన్నారు.ట్రంప్ పాత, కొత్త సుంకాలు అమలైతే భారత్ జీడీపీపై 0.6 శాతం ప్రభావం పడుతుందని ప్రముఖ మదుపు సంస్థ గోల్డ్మాన్ శాక్స్ ప్రకటించింది. ఇదిగాక వాణిజ్య అనిశ్చితి వల్ల పరోక్ష ప్రభావం ఉండొచ్చని ఆ సంస్థ చెబుతోంది. మొత్తానికి ట్రంప్ ఇదే మంకుపట్టుతో ఉంటే మనకు ఏదోమేర సమస్యలుండక తప్పదు. ఈ వైరం మనం కోరుకున్నది కాదు. అయినా వచ్చి పడింది. కనుక కలిసికట్టుగా ఉండి ఎదుర్కొనటమే ఏకైక మార్గం. -
ఈ అణు దూకుడుతో మళ్లీ అనర్థం
హిరోషిమా, నాగసాకీలపై అణ్వస్త్ర ప్రయోగాలు జరిగిన 80 సంవత్సరాలకు తిరిగి అణ్వస్త్రాల ప్రస్తావనలు వస్తుండటం ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నది. కాకతాళీయంగా ఈసారి కూడా ఆ ప్రస్తావనలు చేస్తున్న అమెరికా... రష్యా సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలా లలోకి రెండు అణ్వస్త్ర జలాంతర్గాములను తరలించింది. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం స్వయంగా ప్రకటించారు. అక్కడి నుంచి దక్షిణాన అవే సముద్ర జలాలలో జపాన్ ఎంతో దూరంలో లేదు. ట్రంప్ చర్యలకు ప్రతిగా రష్యన్లు తమవద్ద గల ‘డెడ్ హ్యాండ్’ అణ్వస్త్ర వ్యవస్థ గురించి గుర్తు చేశారు. 1987 నుంచి గల అణ్వాయుధ క్షిపణుల నిరోధక ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నారు. ఇది ఈ 5వ తేదీ నాటి పరిణామం. ఇవన్నీ వెంటవెంటనే వారం రోజులలోపే జరిగిపోయాయి.ఏమిటీ ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ?అమెరికా, రష్యాల మధ్య అణు యుద్ధం రాగల అవకాశం సాధారణ దృష్టికైతే కనిపించటం లేదు. ట్రంప్ ఒకవైపు అణు జలాంతర్గాముల మోహరింపునకు ఆదేశాలిస్తూనే, ‘డెడ్ హ్యాండ్’ ప్రస్తావ నలు చేస్తున్న రష్యా అటువంటి చర్యలకు పాల్పడగలదని భావించటం లేదనీ, అయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ అన్నారు. మరొకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఈ తరహాలో అణు ప్రస్తావనలు ఎవరికీ మంచిది కాదన్నారు. ఆ విధంగా చూసినపుడు ఎవరికి వారు ఎంతో కొంత జాగ్రత్తలలోనే ఉన్నట్లు భావించాలి. అసలు విషయం ఇంత దూరం ఎందుకు వచ్చింది?చర్చను ఒక తక్షణ విషయంతో ఆరంభిద్దాము. రష్యా తన ఉక్రెయిన్ యుద్ధాన్ని 10 రోజులలో ఆపివేసి శాంతి ఒప్పందంపై సంతకాలు చేసి తీరాలని అమెరికా అధ్యక్షుడు తనంతట తానే ఒక గడువు విధించారు. ఆ గడువు ఈనెల 9వ తేదీతో ముగుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఇలాగే 50 రోజుల గడువు ప్రకటించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా అన్నట్లు ప్రపంచానికి అన్ని విధాలా ఒక చక్రవర్తి వలె వ్యవహరిస్తున్న ట్రంప్, అందరికీ ఆదేశాలు, హెచ్చరికలను ఎడాపెడా జారీ చేస్తున్న తీరును చూస్తూనే ఉన్నాము. ట్రంప్ నుంచి ఇటువంటి ధోరణిని సహించలేని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మెద్వెదేవ్ ఆయనకు తమ అణ్వస్త్ర శక్తిని, ‘డెడ్ హ్యాండ్’ పేరుతో గల అణు వ్యవస్థను గుర్తు చేశారు. సాధారణ ప్రచారంలో లేని ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ ఏమంటే, ఒకవేళ అమెరికా మొదటగా అణ్వస్త్రాలు ప్రయో గించి రష్యా రాజకీయ నాయకత్వాన్ని, సైనిక నాయకత్వాన్ని పూర్తిగా తుడిచి పెట్టినట్లయితే, తదనంతర చర్యలకు వారి నుంచి ఆదేశాలు అందని స్థితిలో, మొదటినుంచే మోహరించి ఉన్న అణ్వ స్త్రాలు అన్నీ వెంటనే తమంతట తాము అమెరికా, యూరప్లలోని తమ లక్ష్యాల వైపు క్షణాలలో దూసుకుపోతాయి. నాయకత్వాల నుంచి ఆదేశాలు ఆగిపోయాయనే సంగతి అల్ట్రా లో ఫ్రీకెన్సీ రేడియో తరంగాల ద్వారా తెలుస్తుంది. ఆ తరంగాలను అమెరికా సహా ఎవరూ పసిగట్టలేరు, విశ్లేషించలేరు, హైజాక్ చేయలేరు, నిరోధించ లేరు. ట్రంప్కు మెద్వెదేవ్ ఇచ్చిన సందేశమది. అంతిమార్థం ఏమంటే, ట్రంప్ చర్యలు వినాశనానికి దారితీయవచ్చునని.ప్రపంచం మొత్తానికీ యుద్ధమే!అణుయుద్ధం అమెరికా, రష్యాల మధ్య అయితే తక్కిన ప్రపంచానికి సమస్య ఏమిటనే సందేహం కలగవచ్చు. 1945కూ, ఇప్పటికీ తేడాలున్నాయి. అపుడు అమెరికా ఏకైక అణుశక్తి. తర్వాత నాలు గేళ్లకు 1949లో రష్యా అణుశక్తి పరీక్షతో పరిస్థితులు మారసాగాయి. అమెరికా, రష్యాలు పరస్పరం పోటీపడి అణ్వస్త్రాల సంఖ్యను వేలకు వేలుగా పెంచటంతో పాటు అందులో కొత్త రకాలపై పరిశోధనలు నేటికీ జరుపుతున్నాయి. అందులో, మొదటి విడత విధ్వంసం, దానిని తట్టుకుని రెండవ విడత విధ్వంసం, పరస్పర విధ్వంస శక్తి, యుద్ధ విమానాలు, సముద్ర జలాల నుంచి ప్రయోగాలు (ట్రయాడ్ వ్యవస్థ) అంటూ రెచ్చి పోయారు. ఈమధ్యలో మరొక అర డజన్ అణ్వస్త్ర దేశాలు తయారయ్యాయి. అటువంటి ఆయుధాలు అర డజను ఉన్నా చాలు విధ్వంసానికి అనే వివేకం కలగటంతో అణ్వస్త్ర పరిమితి ఒప్పందాలు, వాటి మోహరింపుల పరిమితిపై ఒప్పందాలు దశలు దశలుగా జరిగాయి.వాటిలోని లోపాలను అట్లుంచితే, ప్రపంచం కొన్ని దశాబ్దా లుగా ఇతర యుద్ధాలు ఎట్లున్నా అణ్వస్త్ర ప్రయోగాలు లేక ప్రశాంతంగా ఉంది. అందుకు కారణం పరస్పర విధ్వంస శక్తి (మ్యూచు వల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, లేదా మ్యాడ్) అని, ఆ విధంగా ‘బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్’ అనే స్థితి ఏర్పడిందని అంతా భావించారు. ఆ పరిస్థితు లలోనూ గమనించదగ్గవి కొన్ని జరిగాయి. ఎవరిపైనా అణ్వస్త్ర ప్రయోగపు ఆలోచనలు రష్యా చేయలేదు గానీ, వియత్నాం, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్లు కొరకరాని కొయ్యలుగా మారటంతో అమె రికా అందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి మళ్లీ వెనుకకు తగ్గింది.అప్రమత్తత కలిగేనా?ఇటువంటి చరిత్ర ఉన్నందువల్లనే ఇపుడు తిరిగి అమెరికా,అందులోనూ ట్రంప్ వంటి అనాలోచితుడు, చంచలచిత్తుడు, విపరీ తమైన అహంభావి ఆదేశాలతో అణుజలాంతర్గాములను ఇప్పటికే రష్యా సమీపానికి తరలించిందంటే, ప్రపంచవ్యాప్తంగా భయాందో ళనలు కలగటం సహజం. అణుయుద్ధం జరిగితే అది అమెరికా, రష్యాలకు పరిమితం కాదు. అమెరికా మిత్ర దేశాలను, రష్యా మిత్ర దేశాలను అనివార్యంగా అందులోకి లాగుతాయి. భయంకరమైన స్థాయిలో వెలువడే అణుధార్మిక శక్తి ఇండియా సహా అన్ని దేశాలకూ వ్యాపిస్తుంది. దాని ప్రభావం అన్ని సముద్ర జలాలతో పాటు మొత్తం వాతావరణాన్ని ఎంతకాలంపాటు కలుషితం చేస్తుందో బహుశా నిపుణులు కూడా అంచనా వేయలేరు. 80 ఏళ్ల క్రితం నాటి హిరో షిమా ప్రభావాలు జపాన్లో నేటికీ ఉన్నాయి.ఈ ప్రమాదకర పరిస్థితికి మూల కారణం, అమెరికా నాయ కత్వాన ‘నాటో’ దేశాలు ప్రత్యక్షంగా రష్యాను, పరోక్షంగా చైనాను లొంగదీసుకోవాలని భావించటంలో ఉంది. అందుకోసం చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో భాగంగా ఉక్రెయిన్ను ఒక పావుగా ఉప యోగించుకుంటున్నారు. అది ఒక తప్పు కాగా, ఆ యుద్ధ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించలేకపోవటం ఒక వైఫల్యం. రష్యాను ఎన్ని ఆంక్షలు విధించినా బలహీనపరచలేకపోవటం ఇంకొక వైఫల్యం అవుతుండగా, ట్యారిఫ్ల పేరిట రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వగైరాలను బెదిరించజూడటం అసమర్థ దుర్జనత్వమవుతున్నది. చివరకు అంతిమ ఆయుధంగా 50 రోజులు, 10 రోజుల గడువులు, అణు జలాంతర్గాముల స్థాయికి పతన మవుతూ యావత్ ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెడుతున్నారు.విచారకరం ఏమంటే, మన దేశంలో ఒకప్పుడు ఉన్నత స్థాయిలో ఉండిన ఈ అప్రమత్తత ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతున్నది. వారు మళ్లీ అప్రమత్తులు కావటం 80 ఏళ్ల హిరోషిమా విషాదానికి తగిన నివాళి అవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్బాక్స్ రిటన్ గిఫ్ట్స్
ఆసియా బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. కానీ 2016లోనే జరిగిన ఒక వెడ్డింగ్ వివాహం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైందిగా రికార్డ్ దక్కించుకుంది. అదేంటో తెలుసా? పదండి తెలుసుకుందాం.భారతదేశం ప్రపంచవ్యాప్తంగా దాని విలాసవంతమైన వివాహ వేడుకలకు ప్రసిద్ధి చెందింది. కానీ రష్యన్ బిలియనీర్ మిఖాయిల్ గుట్సేరీవ్ తన కొడుకు పెళ్లి కోసం పెట్టిన ఖర్చు ఏకంగా ఒక బిలియన్ డాలర్లు (ప్రస్తుత ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 876.94 కోట్లు). 2016లో అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డు క్రియేట్ చేసింది.మరిన్ని విశేషాలుమిఖాయిల్ గుట్సేరీవ్ కుమారుడు, 29 ఏళ్ల సయీద్ గుట్సేరీవ్, ఇరవై ఏళ్ల ఖాదీజా ఉజాఖోవ్స్ను వివాహం చేసుకున్నాడు. మాస్కోలోని ఒక విలాసవంతమైన రెస్టారెంట్లో ఈ జంట వివాహం చేసుకున్నారు. అతిరథమహారథులు హాజరయ్యే ఈ వివాహానికి భద్రత రీత్యా ఈ వేదికను ఎంచుకున్నారు.వధువు 11.5 కిలోల ఎలీ సాబ్ గౌను ధరించింది. పెళ్లి నాటి తన దుస్తులు, తరాల బడి గుర్తుండిపోయేలా, ప్రత్యేకంగా ఉండాలని భావించిందట. అందుకే ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ ఎలీ సాబ్ చేత ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది. ఈ దుస్తులను పారిస్ నుండి దిగుమతి చేసుకున్నారు.ఈ వెడ్డింగ్ గౌను బరువు దాదాపు 11.5 కిలోలు. పెద్ద ఫ్లేర్ ,అంతే పొడవైన వీల్తో దీన్ని రూపొందించారు. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, ఆ గౌను విలువ రూ. 2.28 కోట్లు.అత్యంత విలువైన వజ్రాభరణాలతో రాయల్ లుక్లో మెరిసిపోయింది వధువు. వజ్రాలు పొదిగిన తలపాగా, భారీ వజ్రాల చెవిపోగులు, మ్యాచింగ్ నెక్లెస్ ధరించింది. రెండు చేతులకు బ్రాస్లెట్లతో యువరాణిలా కనిపించింది.తొమ్మిది అంచెల వివాహ కేక్సాయిద్ గుట్సేరీవ్- ఖాదీజా ఉజాఖోవ్ వివాహ కేక్ మరో ప్రత్యేకత. అద్భుతమైన తొమ్మిది అంచెల ఐస్డ్ వెడ్డింగ్ కేక్ మరీ ముఖ్యంగా, నూతన వధూవరుల కంటే రెండు రెట్లు ఎత్తులో దీన్ని ఏర్పాటు చేశారట. దీనిని వైట్ క్రీమ్లో తయారు చేశారు.దానిపై పింక్ ఫ్రాస్టింగ్తో చేశారు.గిఫ్ట్లుగా గోల్డ్ బాక్స్లు: లగ్జరీ పెళ్లితోనే కాదు, అతిథులను కూడా ఆశ్చర్య పరిచాడు. ఈ వేడుకకు హాజరైన వారికి తీపి జ్ఞాపకంలా ఉండేలా గోల్డ్ బాక్స్ గిఫ్ట్గా అందించారు. ఇందులో జంట పేరు, వివాహ తేదీ చెక్కబడి ఉన్నాయి. వివాహ వేడుకలో జెన్నిఫర్ లోపెజ్, స్టింగ్, ఎన్రిక్ ఇగ్లేసియాస్ ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు.ఎవరీ గుట్సెరీవ్ ఫోర్బ్స్ నివేదిక ప్రకారం సఫ్మార్ గ్రూప్ వ్యవస్థాపకుడు, రష్యన్ బిలియనీర్ గుట్సెరీవ్ చమురు, బొగ్గు, రియల్ ఎస్టేట్ , రిటైల్ రంగాలలో వ్యాపారాలున్నాయి 2024 నాటికి ఆ కుటుంబ నికర విలువ రూ. 31,574.41 కోట్లు.కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం కోసం ముఖేష్ అంబానీ దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంచనా. ఇది అంబానీ కుటుంబం నికర విలువలో 0.5శాతం మాత్రమేనని అంచనా. అత్యంత విలాసవంతంగా జరిగిన ఈ పెళ్లి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. -
భారత్ సుంకాల మోతపై పునరాలోచన! ట్రంప్ ఏమన్నారంటే..
భారత్పై పెనాల్టీగా మరో 25 శాతం టారిఫ్ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యాతో చమురు వాణిజ్యం కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతుండగా.. ఇదే పని చేస్తున్న ఈయూ, చైనాలాంటి దేశాల విషయంలో ట్రంప్ ఉదాసీనతపై భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో.. భారత్పై అదనపు సుంకాల నిర్ణయంపై ట్రంప్ వెనక్కి తగ్గుతారా?.. ఆయన ఏమన్నారంటే.. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున) వైట్హౌజ్లోని తన ఓవెల్ ఆఫీస్లో మీడియా సమావేశంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంలో రష్యాతో చమురు వాణిజ్యం ఇంకా కొనసాగితే భారత్పై ద్వితీయ శ్రేణి ఆంక్షలు (Secondary Sanctions) తప్పవంటూ హెచ్చరించారు. అయితే.. రష్యా నుంచి చైనా కూడా చమురును కొనుగోలు చేస్తోంది కదా.. కేవలం భారత్ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా సుంకాల మోత మోగిస్తున్నారు? అని కొందరు మీడియా ప్రతినిధులు ట్రంప్నుప్రశ్నించారు. ‘‘ఇప్పటికి 8 గంటలకేగా గడిచింది. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ సమాధానం ఇచ్చారాయన. మరిన్ని సుంకాలను మీరు చూడబోతున్నారు’’ అంటూ బదులిచ్చారు.ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంతో.. అమెరికా రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యాతో చమురు కొనుగోలు చేసే ఇతర దేశాలపై కూడా secondary sanctions విధించే అవకాశాలు ఉన్నాయి. తాను వద్దన్నా కూడా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే.. రెండు విడతలుగా భారత్పై 50 టారిఫ్ విధించారు. ఇప్పుడు ఆంక్షల హెచ్చరికలూ జారీ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: ఉల్టా చోర్.. అమెరికా సహా పెద్ద దేశాల దొంగ నాటకంఅయితే ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల్లో భాగంగా అతిత్వరలో ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీలను కలవనున్నట్లు వైట్హౌజ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఉద్రిక్తతలు చల్లారితే భారత్పై అదనపు సుంకాల నిర్ణయాన్ని తొలగిస్తారా? అనే ప్రశ్న ట్రంప్కు ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. ఆ అంశాన్ని తర్వాత పరిశీలిస్తాం అని పేర్కొన్నారు. ఇక రష్యాతో ఆయిల్ కొనుగోలు జరుపుతున్న చైనాపైనా సుంకాల మోత తప్పదా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘ఇప్పుడే ఏం చెప్పలేను.. బహుశా అది జరగొచ్చు. భారత్ విషయంలో అది జరిగింది. అలాగే మరికొన్ని దేశాలకూ అది తప్పకపోవచ్చు. అందులో చైనా కూడా ఉండొచ్చు’’ అని అన్నారాయన. ఉక్రెయిన్ దురాక్రమణకు ప్రయత్నిస్తున్న రష్యాతో వాణిజ్య ఒప్పందాలు చేసే దేశాలను ఉపేక్షించబోనంటూ ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్పై తొలుత 25 శాతం, తాజాగా మరో 25 శాతం టారిఫ్లను ప్రకటించారు. దీంతో.. భారత్పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
రష్యా–అమెరికా నిర్మాణాత్మక చర్చలు
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధం ముగించే దిశగా రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా రష్యా అధినేత పుతిన్తో చర్చల కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా స్టీవ్ విట్కాఫ్ను పంపించారు. విట్కాఫ్ బుధవారం ఉదయం మాస్కోలో పుతిన్తో దాదాపు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు తాజా పరిణామాలపై చర్చించారు. ట్రంప్ సందేశాన్ని విట్కాఫ్ ఈ సందర్భంగా పుతిన్కు చేరవేశారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సన్నద్ధం కావాలని, కాల్పుల విరమణ పాటించాలని చెప్పారు. పుతిన్, విట్కాఫ్ మధ్య సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని రష్యా విదేశాంగ ప్రతినిధి యూరి ఉషకోవ్ తెలిపారు. ఇరుపక్షాలు సానుకూల సంకేతాలు పంపించుకున్నాయని వివరించారు. వ్యూహాత్మక సహకారంపై చర్చించుకున్నాయని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, పుతిన్తో చర్చల అనంతరం విట్కాఫ్ బుధవారం మధ్యాహ్నం స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారని రష్యన్ మీడియా తెలియజేసింది. అయితే, పుతిన్, విట్కాఫ్ తాజా చర్చలపై అమెరికా, ఉక్రెయిన్ ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఉక్రెయిన్పై యుద్ధానికి ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టకపోతే కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యాను ట్రంప్ తీవ్రంగ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ బుకాయింపులు
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. టారిఫ్ల బాంబులు పేలుస్తున్నారు. కానీ, అదే అమెరికా అదే రష్యా నుంచి యురేనియం, ఎరువులు, రసాయనాలు భారీగా దిగుమతి చేసుకుంటోంది. తమ అవసరాల కోసం రష్యాపై ఆధారపడుతోంది. రష్యా నుంచి దిగుమతుల గురించి తనకేమీ తెలియదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. అసలేం జరుగుతోందో తనిఖీ చేస్తానని అన్నారు. ట్రంప్ మాటల్లోని ద్వంద్వ ప్రమాణాలను భారత విదేశాంగ శాఖ ఎండగట్టింది. ట్రంప్ బుకాయింపులు గణాంకాల సాక్షిగా బహిర్గతమయ్యాయి. నిజానికి అమెరికా–రష్యా మధ్య బలమైన వాణిజ్య బంధం కొనసాగుతోంది. అణు ఇంధన పరిశ్రమల కోసం అమెరికా కంపెనీలు రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్ను దిగుమతి చేసుకుంటున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కోసం పల్లాడియంను, వ్యవసాయం కోసం ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికా ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే.. అమెరికా–రష్యా మధ్య 2024లో 5.2 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో 3.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం సరుకులకు సంబంధించినదే. అమెరికా నుంచి రష్యాకు 528.3 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. రష్యా నుంచి అమెరికా 3 బిలియన్ డాలర్ల సరుకులు దిగుమతి చేసుకుంది. అంటే రష్యాతో అమెరికాకు 2.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది. 2025 ప్రథమార్ధంలో రష్యా నుంచి దిగుమతులు 2.4 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు అమెరికా సెన్సెస్ బ్యూరో, బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అనాలిస్ గణాంకాలు చెబుతున్నాయి నాలుగేళ్ల క్రితం ఇవి 14.14 బిలియన్ డాలర్లుగా ఉండేవి. అయినప్పటికీ 2022 జనవరి నుంచి ఇప్పటిదాకా రష్యా నుంచి అమెరికా 24.51 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు దిగుమతి చేసుకుంది. → 2021లో రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అయిన ఎరువుల విలువ 1.14 బిలియన్ డాలర్లు. 2024లో ఇది 1.27 బిలియన్ డాలర్లు. → 2021లో రష్యా నుంచి యూఎస్కు 646 మిలియన్ డాలర్ల విలువైన యురేనియం, ప్లుటోనియం వచ్చాయి. 2024లో 624 మిలియన్ డాలర్లకు తగ్గింది. → 2021లో 1.59 బిలియన్ డాలర్ల విలువైన పల్లాడి యం దిగుమతి చేసుకోగా, 2024లో 878 మిలియన్ డాలర్ల సరుకు దిగుమతి చేసుకుంది. → రష్యా నుంచి ఇండియా కంటే చైనా అధికంగా చమురు దిగుమతి చేసుకుంటోంది. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ చైనాను ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు. → 2024లో చైనా ఏకంగా 62.6 బిలియన్ డాలర్ల చమురును రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఇండియా దిగుమతులు 52.7 బిలియన్ డాలర్లే. దీనిపై ట్రంప్ నోరు మెదపడం లేదు. -
ఉల్టా చోర్..
‘రష్యా యుద్ధ యంత్రాంగం మొత్తానికీ ఆర్థిక ఇంధనాన్ని భారతే సరఫరా చేస్తోంది’ – తెంపరి ట్రంప్ ఇటీవల చేసిన తలతిక్క వ్యాఖ్యలివి. అంతేగాక, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై టారిఫ్లను భారీగా పెంచేస్తానంటూ బాధ్యతారహిత వ్యాఖ్యలకు దిగిన అమెరికా అధ్యక్షుడు బుధవారం అన్నంత పనీ చేశారు. టారిఫ్ను 50 శాతానికి పెంచేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. కానీ వాస్తవాల ఆధారంగా ఒకసారి పరిశీలన చేస్తే ఇలాంటి విషయాల్లో వర్ధమాన దేశాలకు నిత్యం సుద్దులు చెప్పే పెద్ద దేశాలు తమవరకూ వచ్చేసరికి మాత్రం ఎంతటి కొద్ది బుద్ధులు ప్రదర్శిస్తాయో తెలుస్తుంది. ట్రంప్ అనే కాదు, ఇలాంటి విషయాల్లో సంపన్న దేశాల స్వార్థపూరిత వైఖరి ఇట్టే కళ్లకు కడుతుంది... ఉక్రెయిన్పై ఏళ్లుగా సాగిస్తున్న మతిలేని యుద్ధానికి రష్యాకు అవసరమైన ఆర్థిక సాయం మొత్తాన్నీ ఒకరకంగా భారతే సమకూరుస్తూ వస్తోందన్నది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ కొద్దికాలంగా పాడుతూ వస్తున్న పాట. రష్యా నుంచి నానాటికీ పెరిగిపోతున్న భారత చమురు దిగుమతులనే ఇందుకు తార్కాణంగా అవి చూపిస్తున్నాయి. కానీ నిజానికి రష్యా నుంచి స్వీయ చమురు కొనుగోళ్లను నేటికీ ఆపని తెంపరితనం ఆ దేశాలది! ఇందుకు సంబంధించిన అన్ని విషయాలనూ ఒకసారి అంశాలవారీగా విశ్లేషిస్తే... ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే (దొంగే... దొం దొంగ అన్నట్టు) నానుడి ఈ దేశాల వైఖరికి అతికినట్టుగా సరిపోతుంది. రష్యా చమురే ముద్దు! ఉక్రెయిన్పై పాశ్చాత్య రష్యా యుద్ధానికి దిగిన వెంటనే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ పొలోమంటూ దానిపై నానారకాల ఆర్థిక తదితర ఆంక్షలు విధించాయి. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రష్యా చమురుపై మాత్రం అవి ఎలాంటి ఆంక్షలూ విధించలేదు. అంతేకాదు, స్వయంగా అమెరికాతోపాటు ఆ దేశాలన్నీ నేటికీ రష్యా చమురును చంకలు గుద్దుకుంటూ కొనుక్కుంటున్నాయి. స్వీయ అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నాయి. భారత్ వంటి దేశాలకు మాత్రం రష్యా చమురు కొనొద్దంటూ సుద్దులు చెబుతున్నాయి. ‘అలా ఎలా కొంటుం’దంటూ సన్నాయినొక్కులూ నొక్కుతున్నాయి. తెంపరితనానికి మారుపేరుగా మారిన ట్రంప్ అయితే ఆంక్షల రంకెలు వేస్తున్నారు. ధరపై పరిమితి మాత్రమేఇరాన్, వెనెజువెలా చమురు మాదిరిగా రష్యా చమురుపై అంతర్జాతీయంగా నేటికీ పూర్తిస్థాయి నిషేధం లేదు. అలా చేస్తే పెద్ద దేశాల్లో ఒక్కదానికీ పూట గడవని పరిస్థితి! అందుకే తెలివిగా ప్రపంచంలోని ఏడు అతి సంపన్న, శక్తిమంతమైన దేశాల కూటమి అయిన జీ7, యూరోపియన్ రష్యా చమురుపై ‘ప్రైస్ క్యాప్’విధానంతో సరిపెట్టాయి. దాంతో రష్యా దర్జాగా తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకుంటూ వస్తోంది. భారత్ కూడా జీ7, ఈయూ విధించిన ‘ప్రైస్ క్యాప్’కు లోబడే, వాటి మాదిరిగానే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతూ వస్తోంది. అది కూడా పూర్తి చట్టబద్ధంగా, అత్యంత పారదర్శకంగా! ఈ విషయంలో ఒక్క అంతర్జాతీయ నిబంధనను గానీ, చట్టాన్ని గానీ ఉల్లంఘించడం లేదు. మరి మనపై ఏడుపెందుకు? ఒక్కముక్కలో చెప్పాలంటే స్వీయ వంచన, పరవంచన! అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నానాటికీ పెరిగిపోతున్న భారత ప్రాభవాన్ని చూసి ఓర్వలేనితనం!! స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట. కేవలం ఆ ఒక్క కారణంగానే సంపన్న దేశాలన్నీ ఇలా ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతున్నాయి. అదే సమయంలో తాము మాత్రం చడీచప్పుడూ లేకుండా అదే రష్యా నుంచి ‘ఓపెన్ మార్కెట్’ముసుగులో నిరి్నరోధంగా చమురు కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ట్రంప్ అయితే శాపనార్థాలతో పాటు బెదిరింపులకు కూడా దిగుతున్నారు.పాశ్చాత్య దేశాల ‘గ్యాస్’ రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లపై గుండెలు బాదుకుంటున్న పాశ్చాత్య దేశాలు నిజానికి సహజ వాయువు కొనుగోళ్లలో నంబర్వన్ స్థానంలో ఉన్నాయి! గత జూన్లో ఈయూ దేశాలన్నీ కలిసి రష్యా సహజ వాయువు కొనుగోళ్ల నిమిత్తం వెచ్చించింది ఏకంగా 120 కోట్ల డాలర్లంటే నమ్మక తప్పదు! ఈ జాబితాలో ఫ్రాన్స్, హంగరీ, నెదర్లాండ్స్, స్లొవేకియా వంటి యూరప్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అంతేకాదు, రష్యా నుంచి రిఫైన్డ్ పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా నాటో దేశాలదే అగ్ర స్థానం. స్వార్థానికి మారుపేరైన తుర్కియే అయితే రష్యా రిఫైన్డ్ పెట్రో ఎగుమతుల్లో ఏకంగా 26 శాతాన్ని సొంతం చేసుకుంటోంది! ఈ విషయంలో భారత్ వాటా అక్షరాలా సున్నా! వీటన్నింటినీ బేరీజు వేసుకుని చూస్తే నిజానికి రష్యా యుద్ధ తంత్రానికి పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నది అమెరికా, పాశ్చాత్య దేశాలు మాత్రమేనన్నది అక్షరసత్యం. ఆ లెక్కన ఈ విషయంలో భారత్పై వాటి ఏడుపు దొంగే, ‘దొంగా’అంటూ దొంగ అరుపులు అరిచిన చందమన్నది అంతర్జాతీయ నిపుణుల మాట. చైనా కంటే తక్కువే భారత్ తన చమురు అవసరాల్లో ఏకంగా 38 శాతం రష్యా నుంచే కొనుగోలు చేస్తోంది. కానీ ఈ విషయంలో అగ్రతాంబూలం మాత్రం చైనాదే. అది ఏకంగా 47 శాతం చమురు కొంటోంది. పాశ్చాత్య దేశాలతో పాటు వాటి మిత్ర దేశాలు కూడా రష్యా చమురును నమ్ముకునే మనుగడ సాగిస్తున్నాయి.మనం తప్పుకుంటే..గగ్గోలు పుడుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. బ్యారెల్ ఏకంగా 200 డాలర్లు దాటేస్తుంది. అది మొత్తం ప్రపంచ దేశాలన్నింటికీ కోలుకోలేని దెబ్బేనని అంతర్జాతీయ చమురు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పేలిన ట్రంప్ టారిఫ్ బాంబు
న్యూయార్క్/న్యూఢిల్లీ: మెరుపువేగంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. 24 గంటల్లో మళ్లీ భారత్పై దిగుమతి టారిఫ్ విధిస్తానని చెప్పినట్టే బుధవారం అదనంగా 25 శాతం సుంకాన్ని మోపారు. వద్దని ఎంతగా వారించినా వైరి దేశం రష్యా నుంచి విపరీతంగా ముడి చమురును కొని, బహిరంగ మార్కెట్లో అమ్ముకుని లాభాల పంట పండిస్తున్నారని ఆరోపిస్తూ భారత్పై 25 శాతం టారిఫ్ విధిస్తూ బుధవారం ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై శ్వేతసౌధంలో ఆయన సంతకం చేశారు. ఇప్పటికే ప్రకటించిన 25 శాతం టారిఫ్ నేటి నుంచి అంటే ఆగస్ట్ ఏడో తేదీ నుంచి అమల్లోకి రానుంది. బుధవారం ప్రకటించిన అదనపు 25 శాతం టారిఫ్ను 21 రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 27వ తేదీ తర్వాత వర్తింపజేయనున్నారు. ‘‘రష్యా ముడిచమురును ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత్ విచ్చలవిడిగా దిగుమతి చేసుకుంటోంది. అందుకే మా చట్టాల ప్రకారం అమెరికా కస్టమ్స్ సుంకాల పరిధిలోకి వచ్చే భారతీయ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ను మరోసారి పెంచాలని నిర్ణయించాం’’అని కార్యనిర్వాహఖ ఉత్తర్వులో ట్రంప్ పేర్కొన్నారు. అదనపు టారిఫ్లకు స్పందనగా భారత్ ప్రతీకార నిర్ణయాలు తీసుకుంటే వైట్హౌస్ అందుకు తగ్గ టారిఫ్ల సవరణకు సిద్ధపడుతుందని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. మిత్రదేశమని కూడా చూడకుండా మితిమీరిన ఆవేశంతో భారత్ వీపు మీద పన్నుల వాత పెట్టి ట్రంప్ తన అగ్రరాజ్య అధిపత్యధోరణిని మరోసారి నిస్సుగ్గుగా ప్రదర్శించారు. స్నేహహస్తమందిస్తూనే సుంకాల సుత్తితో మోదడంపై భారత్ సైతం ధీటుగా, ఘాటుగా స్పందించింది. 140 కోట్ల జనాభా చమురు నిత్యావసరాలు, దేశ ఇంధన భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోమని మోదీ సర్కార్ స్పష్టంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘అదనం’అమలుకు మినహాయింపులు భారత్పై అమెరికా బుధవారం ప్రకటించిన ఈ అదనపు 25 శాతం టారిఫ్ను వెంటనే వర్తింపజేయబోమని ట్రంప్ సర్కార్ స్పష్టంచేసింది. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన 21 రోజుల తర్వాత ఈ అదనపు 25 శాతాన్ని భారతీయ ఉత్పత్తులపై వర్తింపజేస్తారు. ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన సరకుపై ఈ అదనపు 25 శాతం సుంకాన్ని విధించబోరు. అలాగే బుధవారం అర్ధరాత్రిలోపు అమెరికా చేరుకునే ఉత్పత్తులపైనా ఈ అదనపు భారం మోపబోరు. సెప్టెంబర్ 17వ తేదీ అర్ధరాత్రిలోపు అమెరికాలో మార్కెట్లోకి వచ్చేసిన భారతీయ ఉత్పత్తులపై ఈ అదనపు వడ్డింపు ఉండదు. తాము నష్టపోకుండా ముందుజాగ్రత్త భారత్పై రెట్టింపు పన్నులతో రెచ్చిపోయిన ట్రంప్.. ఈ అదనపు సుంకాలు అమెరికా ఖజానాకు నష్టదాయకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రంగాలవారీగా టారిఫ్ వసూలుచేస్తున్న ఉక్కు, అల్యూమినియంతోపాటు అత్యంత కీలకమైన ఫార్మాస్యూటికల్స్పై ఈ అదనపు భారం ఉండబోదని తెలుస్తోంది. తద్వారా అమెరికాలో ధరల పెరగకుండా జాగ్రత్తపడుతున్నారు. ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత్లో సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి సంక్షోభంలో పడనుంది. టెక్స్టైల్స్, సముద్ర ఉత్పత్తులు, తోలు, సానబట్టిన వజ్రాలు, రత్నాభరణాల ఎగుమతులపై అదనపు టారిఫ్ భారం పడొచ్చు. దీంతో అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తూత్పత్తుల పరిమాణం సగానికి సగం తగ్గిపోవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్ఐఈఓ) ఆందోళన వ్యక్తంచేసింది. అత్యంత విచారకరమన్న భారత్ అదనంగా 25 శాతం టారిఫ్ల గుదిబండ పడేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ బుధవారం రాత్రి ఒక అధికారిక ప్రకటన విడుదలచేసింది. ‘‘రష్యా నుంచి భారత్కు దిగుమతి అవుతున్న ముడి చమురునిల్వలను చూసి అమెరికా కళ్లలో నిప్పులు పోసుకుంటోంది. ఈ అంశంలో భారత్ తన వైఖరిని ఇప్పటికే సుస్పష్టంచేసింది. ముడిచమురు వంటి ఇంధన దిగుమతులు అనేవి పూర్తిగా మార్కెట్ ఒడిదుడుకులను అనుసరించి జరుగుతాయి. దేశ ఇంధన భద్రతే ఏకైక లక్ష్యంగా భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. భారత్పై అదనపు టారిఫ్ విధించడం ద్వారా ఎక్కువ సొమ్ములు కళ్లజూడాలని అమెరికా ఆశపడటం అత్యంత విచారకరం. ఇలాంటి చర్యలు ఏమాత్రం సబబుగా లేవు. ఇవన్నీ సహేతుకంకాని అన్యాయమైన నిర్ణయాలు. 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలు మా తక్షణ కర్తవ్యం. ఇంతటి అత్యంత కీలకమైన బాధ్యతల నుంచి భారత్ ఏనాడూ పక్కకు తొలగిపోదు. దేశ ప్రయోజనాలు, ఇంధన సంక్షోభ నివారణ చర్యల విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. విదేశాలు తీసుకునే భారతవ్యతిరేక నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం తగు కఠిన చర్యలు తప్పక తీసుకుంటుంది. జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుంది. స్వప్రయోజనాల కోసం ప్రతిదేశం స్వీయ నిర్ణయాలు తీసుకుంటుందని అమెరికా స్ఫురణకు తెచ్చుకుంటే మంచిది’’అని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. గత మూడ్రోజుల్లో ట్రంప్ ప్రభుత్వానికి దీటుగా భారతప్రభుత్వం ఘాటైన జవాబివ్వడం ఇది రెండోసారి. బ్రెజిల్.. భారత్ ఒక్కటే అమెరికా దృష్టిలో బ్రెజిల్, భారత్ ఒక్కటేనని తాజా పన్నుల పెంపు పర్వంతో తేలిపోయింది. బ్రెజిల్పై అమెరికా ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధిస్తుండగా భారత్పై తాజా పెంపుతో భారతీయ ఉత్పత్తుల దిగుమతి టారిఫ్ సైతం 50 శాతానికి చేరింది. మయన్మార్ ఉత్పత్తులపై 40 శాతం, థాయిలాండ్ కాంబోడియాలపై 36 శాతం, బంగ్లాదేశ్పై 35 శాతం, ఇండోసేసియాపై 32 శాతం, చైనా, శ్రీలంకలపై 30 శాతం, మలేసియాపై 25 శాతం, ఫిలిప్పీన్స్, వియత్నాంలపై 20 శాతం టారిఫ్ను అమెరికా విధించిన విషయం విదితమే. -
ఇది అన్యాయం.. మా దేశంపైనే ఎందుకిలా?: ట్రంప్ 50 శాతం సుంకాలపై భారత్ రియాక్షన్
అమెరికా అదనపు సుంకాల నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనంగా 25% టారిఫ్ విధించడంతో.. మొత్తం సుంకాలు 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అన్యాయం, అసమంజసం, అసంబద్ధమైందంటూ బుధవారం రాత్రి భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే.. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు భారత్ తీసుకుంటుందంటూ అందులో స్పష్టం చేసింది. ‘‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశాం. .. మా దేశంలోని 140 కోట్ల ప్రజల ఎనర్జీ సెక్యూరిటీ కోసం తీసుకునే నిర్ణయాలను మార్కెట్ ఫ్యాక్టర్ల ఆధారంగా చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాం. ఇలా చాలా దేశాలు తమ ప్రయోజనాల కోసం చేస్తున్నదే. అయినప్పటికీ అమెరికా భారత్పై మాత్రమే టారిఫ్ విధించింది. ఇది దురదృష్టకరం. ఈ నిర్ణయం.. అన్యాయం, అసమంజసం, అసంబద్ధమైనవిగా భారత్ ఖండిస్తోంది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది’’ అని ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే.. రష్యాతో ఇంకా చమురు వాణిజ్యం కొనసాగిస్తుందన్న కారణంగా ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 25 శాతం సుంకాన్ని విధించింది. దీంతో గత టారిఫ్తో కలిపి సుంకాలు 50 శాతానికి చేరాయి. తాజా పెంపు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలు ఇండో-అమెరికన్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
భారత్పై మరో టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు. అదనంగా మరో 25 శాతం టారిఫ్ విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై(Executive Order) ఇవాళ ఆయన సంతకం చేసినట్లు పలు జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. ఆగస్టు 27వ తేదీ నుంచి తాజా టారిఫ్ అమల్లోకి రానున్నట్లు సమాచారం.భారత్ మిత్రదేశమే అయినా, వాణిజ్య పరంగా అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయి అంటూ గత కొంతకాలంగా ఆయన చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో రష్యా నుంచి భారత్ చమురు, సైనిక ఉత్పత్తులను అధిక మొత్తంలో దిగుమతి చేసుకోవడంపైనా ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది. భారత్, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే భారత్పై 25శాతం సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం అని ఆ సమయంలో అన్నారాయన. మరో అల్టిమేటం, ఆ వెంటనే.. అయితే భారత్పై టారిఫ్లను పెంచే విషయమై తాజాగానూ ఆయన మరో ప్రకటన చేశారు. ‘‘మాతో భారత్ బాగానే వ్యాపారం చేస్తోంది. కానీ మేం ఆ దేశంతో వ్యాపారం తక్కువగానే చేస్తాం. అందుకే 25శాతం సుంకాలను విధించాం. కానీ 24 గంటల్లో దీనిని భారీగా పెంచనున్నాం. రష్యా నుంచి చమురును కొనడంద్వారా వారు యుద్ధ ఇంజిన్కు ఇంధనాన్ని అందిస్తున్నారు. దీంతో నేను సంతోషంగా లేను’’ అని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు.అయితే ఈ పరిణామాల తర్వాత కూడా.. రష్యా నుంచి ఇంకా ఆయిల్ కొనుగోలు చేస్తున్నందునే ఆయన మరో 25 శాతం టారిఫ్ వడ్డనతో ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్పై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి చేరాయి. తాజా సుంకాల పెంపుపై అర్ధరాత్రి తర్వాత ఆయన అధికారికంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ టారిఫ్ మోతపై ఇటు భారత ప్రభుత్వమూ స్పందించాల్సి ఉంది.భారత్పైనే అత్యధికమా?ట్రంప్ ఇప్పటిదాకా అత్యధికంగా టారిఫ్ విధించిన దేశంగా సిరియా ఇప్పటిదాకా ఉంది. 41 శాతం ఒకే విడతలో సిరియాపై అంత మొత్తంలో సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మయన్మార్&లావోస్పై 40 శాతం, స్విట్జర్లాండ్పై 39 శాతం, కెనడా.. ఇరాక్లపైనా 35 శాతం టారిఫ్ విధించారాయన. అయితే భారత్పై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి చేరినా.. అది రెండు విడతల్లో ప్రకటించారు. పైగా రెండో దఫా మోపిన 25 శాతం ఇంకా అధికారికంగా అమల్లోకి రాలేదు. -
మాట మార్చిన ట్రంప్.. రష్యా విషయంలో పరువు పోయినట్టేనా?
వాషింగ్టన్: రష్యా నుంచి అమెరికా దిగుమతుల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుక మడతేశారు. రష్యా నుంచి యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటున్న విషయంపై తనకు అవగాహన లేదని ట్రంప్ చేతులెత్తేసి అందరి ముందు నవ్వుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ.. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు కదా.. మరి ఇప్పుడు అమెరికాపై ఎవరు సుంకాలు విధించాలి అని ప్రశ్నిస్తున్నారు.లాస్ ఏంజిల్స్లో 2028కి సంబంధించి ఒలింపిక్స్ నిర్వహణపై వైట్ హౌస్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మరోసారి సుంకాల విషయంలో స్పందించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందున 25 శాతం సుంకాలు విధిస్తున్నానని గతంలో ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు మాట మార్చి.. అలాంటి శాతాలేవీ తాను చెప్పలేదన్నారు. దానిపై కసరత్తు చేస్తున్నామని, ఏం జరుగుతుందో చూస్తామని తెలిపారు. రేపు రష్యాతో సమావేశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఓ విలేకరి రష్యా నుంచి అమెరికా దిగుమతుల సంగతేంటని ప్రశ్నించగా.. మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటున్న విషయంపై తనకు అవగాహన లేదన్నారు. దిగుమతుల విషయం తెలుసుకుంటానని చెప్పారు.#WATCH | Responding to ANI's question on US imports of Russian Uranium, chemical fertilisers while criticising their (Indian) energy imports', US President Donald Trump says, "I don't know anything about it. I have to check..." (Source: US Network Pool via Reuters) pic.twitter.com/OOejcaGz2t— ANI (@ANI) August 5, 2025అమెరికా-రష్యా వాణిజ్యంరష్యా నుంచి అమెరికా ఇప్పటికీ బిలియన్ల డాలర్ల విలువైన ఇంధనం, యురేనియంతో సహా వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. జనవరి 2022 నుండి అమెరికా 24.51 బిలియన్ల డాలర్ల రష్యన్ వస్తువులను దిగుమతి చేసుకుంది. 2024లోనే వాషింగ్టన్ మాస్కో నుండి 1.27 బిలియన్ల డాలర్ల విలువైన ఎరువులను, 624 మిలియన్ల డాలర్ల విలువైన యురేనియం, ప్లూటోనియం దాదాపు 878 మిలియన్ డాలర్ల విలువైన పల్లాడియంను దిగుమతి చేసుకుంది.ట్రంప్నకు నిక్కీ హేలీ హితవుఅయితే, రష్యాతో వాణిజ్యం చేస్తున్న కారణంగా భారత్పై సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యాతో వాణిజ్యం ఆపకపోతే టారిఫ్లు మరింత పెంచుతానని హెచ్చరికలు సైతం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్ తీరుపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ వంటి బలమైన మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోకూడదని హితవు పలికారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ, చైనా చేయొచ్చా అని ప్రశ్నించారు. రష్యా, ఇరానియన్ నుంచి చైనా (China) అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజులు మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు. -
భారత్కు ట్రంప్ సుంకాల బెదిరింపుల వేళ.. రష్యాకు అజిత్ దోవల్
సాక్షి,న్యూఢిల్లీ: భారత్పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు వెనక్కి తగ్గని భారత్ .. రష్యాతో సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను రష్యాకు పంపించింది. ఈ నెలాఖరులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మాస్కోకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అజిత్ దోవల్ రష్యా పర్యటన ముందుగానే ఖరారైంది. అయితే, రష్యాతో భారత్ సంబంధాల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యల తరుణంలో అజిత్ దోవల్ పర్యటన చర్చకు దారి తీసింది. అజిత్ దోవల్ తన పర్యటనలో భాగంగా రష్యాతో వ్యూహాత్మక ఒప్పందం,రక్షణ సంబంధిత ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ టాస్ కథనాల్ని వెలువరించింది. అదే సమయంలో భారత రాయబారి వినయ్ కుమార్, రష్యా డిప్యూటీ రక్షణ మంత్రి కల్నల్-జనరల్ అలెగ్జాండర్ ఫోమిన్ మధ్య మాస్కోలో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి భారత్-రష్యాలు తమ నిబద్ధతను చాటిచెప్పాయి.రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. భారత రాయబారి అంతర్జాతీయ రక్షణ సహకారానికి బాధ్యత వహిస్తున్న కల్నల్-జనరల్ ఫోమిన్తో భేటీ అయ్యారు. ఇరువురి భేటీలో రక్షణ రంగంలో ద్వైపాక్షిక పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించాయి. భారత్-రష్యాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొంది. -
భారత్కు సుంకాల బెదిరింపు.. ట్రంప్పై నిక్కీ హేలీ సెటైర్లు
వాషింగ్టన్: ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించే సత్తాలేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిక్కుతోచని స్థితిలో భారత్పై తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. మంగళవారం (భారత కాలమాన ప్రకారం) భారత్పై సుంకాల మోత మోగిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ హెచ్చరికలపై మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ.. ట్రంప్పై విరుచుకుపడ్డారు. అత్యంత కీలక సమయాల్లో ఇలా వ్యవహరిస్తే అమెరికా-భారత్ల మధ్య సంబంధాలు సన్నగిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు. కానీ రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనాకు మాత్రం 90 రోజుల పాటు ఎలాంటి సుంకాలు విధించకుండా మినహాయింపు ఇవ్వొచ్చా? అని ప్రశ్నించారు. చైనాకు మినహాయింపు ఇచ్చి.. భారత్తో ఉన్న బంధాన్ని దెబ్బతీయకండి’ అని హితువు పలికారు.అమెరికా-భారత్ల సంబంధాలకు నిక్కీ హేలీ సుదీర్ఘంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇండో-పసిఫిక్లోని ప్రజాస్వామ్య దేశాలతో, ముఖ్యంగా భారత్తో సన్నిహిత భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా ప్రపంచ దేశాల్లో చైనా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తరచూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో మరోసారి అమెరికా-భారత్ సంబంధాలను హైలెట్ చేస్తూ.. సుంకాలు విధించే విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని తూర్పారబట్టారు.India should not be buying oil from Russia. But China, an adversary and the number one buyer of Russian and Iranian oil, got a 90-day tariff pause. Don’t give China a pass and burn a relationship with a strong ally like India.— Nikki Haley (@NikkiHaley) August 5, 2025 -
24 గంటల్లో సుంకాల మోత
న్యూయార్క్/మాస్కో: ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించే సత్తాలేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిక్కుతోచని స్థితితో భారత్పై తన ఆగ్రహాన్ని టారిఫ్ల రూపంలో తీర్చుకుంటున్నారు. మరో 24 గంటల్లో భారత్పై మరోమారు దిగుమతి సుంకాలను భారీగా పెంచుతానని ట్రంప్ మంగళవారం ప్రకటించారు. సుసంపన్న దేశమైన రష్యాకు భారత చమురు కొనుగోళ్ల కారణంగా మాత్రమే అపార లాభాల పంట పండుతున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. కేవలం ఈ ఒక్క కారణాన్నే చూపి భారత్పై తన అక్కసును వెళ్లదీస్తూ మరోసారి సుంకాల మోత మోగిస్తానని సీఎన్బీసీ స్క్వాక్ బాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ ప్రకటించారు.భారత్ నుంచి ఆర్జిస్తున్న చమురు లాభాల కారణంగానే ఉక్రెయిన్తో యుద్ధాన్ని రష్యా విజయవంతంగా నెలల తరబడి కొనసాగిస్తోందని ట్రంప్ మరోమారు నోరుపారేసుకున్నారు. తమతో కంటే రష్యాతోనే అధిక వాణిజ్యం చేస్తోందని, ఆ వాణిజ్యం పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధాగి్నకి ఆజ్యంపోస్తోందని ఆరోపించారు. ‘‘భారత్ ఇప్పటికీ మంచి వాణిజ్య భాగస్వామిగా ఎదగలేకపోయింది. భారత్ మాతో పెద్దస్థాయిలో వ్యాపారం చేస్తోందిగానీ మేం వాళ్లతో పెద్దగా వాణిజ్యం చేయట్లేదు.అందుకే ఇప్పటికే ఇటీవల 25 శాతం టారిఫ్ను విధించా. మరో 24 గంటల్లో మరోసారి దిగుమతి సుంకాలను పెంచుతా. దీనికి ప్రధాన కారణం వాళ్లు రష్యా ముడి చమురును కొనుగోలు చేయడమే. అక్కడ ఇంధనాన్ని కొంటూ రష్యాకు నగదు ఇంధనాన్ని సమకూర్చుతున్నారు. ఆ ఇంధనంతో రష్యా యుద్ధయంత్రంగా ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ పద్దతి వాళ్లకు నచ్చుతుందేమోగానీ నేనైతే అస్సలు సంతోషంగా లేను’’అని అన్నారు.భారత్తో వాణిజ్య సంబంధాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మా సరకులపై భారత్ అత్యంత ఎక్కువ టారిఫ్లను మోపుతోంది. మేం టారిఫ్లు పెంచడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం’’అని చెప్పారు. ‘‘మా ఈ సుంకాల మోత తర్వాత భారత్ దిగిరావొచ్చు. మా సరకులపై సున్నా దిగుమతి సుంకాన్ని ఆఫర్చేయొచ్చు. కానీ ఇది మాకు ముఖ్యం కాదు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్ల అంశమే మాకు ప్రధానం’’అని ట్రంప్ స్పష్టంచేశారు. -
ఈ సంక్షోభాన్ని దాటేదెలా?
రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలంటూ వరస బెదిరింపులతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ను లొంగదీసుకోవాలని చూస్తున్న తరుణంలో మన విదేశాంగ శాఖ తొలిసారి నేరుగా బదులీయటం కీలక పరిణామం. దీనికి రెండురోజుల ముందు స్థానిక తయారీ ఉత్పత్తుల్ని, సరుకుల్ని కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. అమెరికాలో గత కొన్ని దశాబ్దాలుగా అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చిన అస్తవ్యస్త విధానాల పర్యవసానంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి ట్రంప్ అమలుచేసిన తప్పుడు నిర్ణయాలు తోడై ఆర్థికవ్యవస్థను ఊపిరాడకుండా చేస్తున్నాయి. వాటి నుంచి బయటపడటం కోసం ఆయన ప్రపంచ దేశాలపై ఆర్థిక దండయాత్ర మొదలుపెట్టారు. చైనాపై 145 శాతం సుంకాల మోత మోగించటంతో మొదలుపెట్టి తన సన్నిహిత దేశాలపై సైతం దాదాపు 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించి, అనంతరకాలంలో వెనక్కితగ్గారు. ఈ దశలో ఆయన మన జోలికి రాలేదు. మోదీతో 2016 నుంచీ ఉన్న సాన్నిహిత్యంతో ఆయన తాను చెప్పినట్టు వింటా రని ట్రంప్ భ్రమపడ్డారు. తీరా కథ అడ్డం తిరిగేసరికి ఆగ్రహోదగ్రుడవుతున్నారు. అందుకే కావొచ్చు... జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండొనేసియాలపై 15–20 శాతంమధ్య సుంకాలు విధించిన పెద్ద మనిషి మన దగ్గరకొచ్చేసరికి ఇప్పటికే విధించిన 25 శాతం సుంకాలతోపాటు రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు ఆపకపోతే మరిన్ని రెట్లు పెంచుతానని హెచ్చరించారు. స్వదేశంలో సంపన్నులకూ, పారిశ్రామికవేత్తలకూ లక్షల కోట్ల డాలర్ల పన్ను రాయితీలు ప్రకటించి, ప్రపంచ దేశాలపై అదనపు సుంకాలు విధించటం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలన్నది ఆయన పథకం. దీన్ని చూసీచూడనట్టు వూరుకుంటే ఈ బాణీయే కొనసాగిస్తారు. అమెరికా పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఎవరికీ తెలియనివి కాదు. కానీ ట్రంప్ మరింత నిస్సిగ్గుగా వాటిని ఆచరిస్తున్నారు. ఒకపక్క తమ అణు పరిశ్రమలకు కావాల్సిన యురేనియం హెక్సాఫ్లోరైడ్ అయినా, విద్యుత్ వాహనాల తయారీలో అవసరమైన ప్లాటినం రకానికి చెందిన రసాయన మూలకం పలాడియం, ఎరువులు, రసాయనాలు వంటివి రష్యా నుంచి ఇప్పటికీ దిగుమతి చేసుకుంటూ... మనం మాత్రం ముడి చమురు కొనకూడదని శాసిస్తున్నారు. అందుకే మోదీ స్వదేశీ ఉత్పత్తుల్నీ, సరుకులనూ కొనటం అత్యవసరమని ప్రజలకు పిలుపునిచ్చారు. వర్తమాన తరుణంలో స్వదేశీ నినాదం సరైనది. అయిదేళ్లక్రితమే మోదీ ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చేసిందేం లేదు. అంతక్రితం ఉన్న యూపీఏ ప్రభుత్వం గురించి చెప్పనవసరం లేదు. గతంలో ప్రణాళికా సంఘం, ఇప్పుడు నీతి ఆయోగ్... అలాగే సాంకేతిక నిపుణుల మాట చెల్లుబాటవుతూ వచ్చింది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ ఈ విషయంలో ప్రభుత్వాన్ని గతంలో పలుమార్లు తీవ్రంగా తప్పుబట్టింది. కానీ మారిందేమీ లేదు.ట్రంప్ ఒక్కరే కాదు...బ్రిటన్, ఈయూలు సైతం తమ వినియోగవస్తువులపై, యంత్ర పరిక రాలపై సుంకాలు తగ్గించమంటున్నాయి. అందుకు తలొగ్గితే మన సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) దెబ్బతింటాయి. అమెరికా ఒత్తిళ్లకు లొంగితే మన సాగు రంగం, పాడి పరిశ్రమ రంగం ఇబ్బందుల్లో పడతాయి. ఆ రెండు రంగాలపైనా 70 కోట్లమంది ప్రజానీకం ఆధారపడతారు. ఇవిగాక జన్యుమార్పిడి చేసిన మొక్కజొన్న, సోయాబీన్స్ దిగుమతి చేసు కోవాలని అమెరికా కోరుకుంటోంది. ఇది ప్రమాదకరం. వాటి సంగతలావుంచి వర్తమాన అనిశ్చిత వాతావరణంలో మనమే కాదు...దేశాలన్నీ ఆత్మరక్షణ బాటపట్టాయి. తమ దేశానికొచ్చే విదేశీ సరుకుపై అధిక సుంకాలు విధించటం, విదేశాలకు ఎగుమతయ్యే తమ సరుకుకు తక్కువ సుంకాల కోసం ఒత్తిళ్లు తీసుకురావటం రివాజైంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండ క్టర్లు, రక్షణ, సౌరశక్తి రంగాలకు పెద్దయెత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాల్సివుంది. పెంచిన సుంకాల పరిధిలో ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు వగైరాలను ట్రంప్ మినహాయించారు. ‘జాతీయ ప్రయోజనాల రీత్యా’ ఈ నిర్ణయం తీసుకున్నారట. కానీ ఆ ఉత్పత్తుల ధరల్ని పెంచటం ద్వారా అదనపు రాబడికి వ్యూహరచన చేస్తే అమెరికా సృష్టించదల్చుకున్న సంక్షోభంనుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే వాటికి మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తేనే ఇదంతా సాధ్యం. ఇప్పటికే స్వావలంబన దిశగా అడుగులేసివుంటే వేరుగా వుండేది. ఇప్పటికిప్పుడు తీసుకునే చర్యల నుంచి వెంటనే ఫలితాన్ని ఆశించలేం. ఈలోగా అమెరికా కోరుతున్నదేమిటో, మన తిరస్కరణకు కారణమేమిటో పార్లమెంటు వేదికగా తేటతెల్లం చేయాలి. అది జరిగితేనే ప్రజలు మరింత దృఢంగా మద్దతిస్తారు. -
భారత్కు ‘టారిఫ్’ షాక్.. మరో బాంబు పేల్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి బెదిరింపులకు దిగారు. మరో 24 గంటల్లో భారత్పై మరిన్ని టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. భారత్తో వ్యాపారం చేయడం కష్టంగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. సీఎన్బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు. ఎందుకంటే వారు మాతో చాలా వ్యాపారం చేస్తారు. కానీ మేము వారితో వ్యాపారం చేయం. రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. ఆ చమరు కొనుగోళ్లను ఆపకపోతే మరో 24 గంటల్లో టారిఫ్ను భారీ ఎత్తున పెంచబోతున్నాను’అని అన్నారు. భారత కాలమాన ప్రకారం.. సోమవారం (ఆగస్టు 4)ట్రంప్.. భారత్కు హెచ్చరికలు పంపించారు. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. భారత్కు ముడి చమురును విక్రయించడం ద్వారా వచ్చిన నగదు ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్ యుద్ధం కోసం మంచి నీళ్లలా ఖర్చు పెడుతోంది. దీంతో రష్యా దాడుల్లో ఉక్రెయిన్లో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా ఒక యుద్ధ యంత్రంలా మారిపోయింది. భారత్కు ఇవేం పట్టవు. అందుకే భారత్పై మళ్లీ దిగుమతి సుంకాలను పెంచుతా’’అని ట్రంప్ ప్రకటించారు.మరోమారు దిగుమతి టారిఫ్ల మోత మోగిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఏ దేశం నుంచి ఏమేం కొనాలి, ఎంత కొనాలి అని నిర్ణయించుకునే స్వేచ్ఛ... సార్వభౌమత్వ దేశమైన భారత్కు ఉందని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికీ భారత చమురు కొనుగోళ్లకు ఎలాంటి సంబంధం లేదు.అయినా సరే ఉక్రెయిన్ సమరం మొదలయ్యాక రష్యా నుంచి మేం చమురును దిగుమతి చేసుకుంటుంటే అమెరికా, యురోపియన్ యూనియన్లు ఉద్దేశపూర్వకంగా భారత్ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక భారత్కు విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన ముడి చమురు సరఫరాలో ఆటంకాలు తలెత్తాయి. దీంతో చమురు తక్షణ అవసరాల కోసం రష్యా నుంచి దిగుమతులను పెంచుకున్నాం.భారతీయ వినియోగదారుల ఇంధన అవసరాలు తీర్చేందుకు, అనువైన ధరలకు ఇంధనాలను అందించేందుకు రష్యాపై ఆధారపడాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అస్థిరత ఏర్పడిన సందర్భాల్లో దిగుమతి సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అయినా రష్యాతో మా వాణిజ్యంపై ఇష్టారీతిగా మాట్లాడే ఇవే దేశాలు రష్యాతో వాణిజ్యంచేస్తున్నాయికదా. స్వయంగా అమెరికా సైతం రష్యాపై ఆధారపడుతోంది.అమెరికా తమ అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కోసం యురేనియం హెగ్జాఫ్లోరైడ్ను, విద్యుత్వాహనాలు, ఎరువుల పరిశ్రమల్లో వాడేందుకు పల్లాడియంను రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ దిగుమతి చేసుకుంటోంది. 2024లో రష్యాతో యురోపియన్ యూనియన్ ఏకంగా 67.5 బిలియన్ యూరోల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి దేశాలు కేవ లం భారత్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం సహేతుకం అనిపించుకోదు. ప్రపంచంలోని ప్రధానమైన ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన భారత్ సైతం తన సొంత జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత కోసం స్వీయ నిర్ణయాలు గతంలో తీసుకుంది. ఇకమీదటా ఇదే ఒరవడి కొనసాగిస్తుంది’’అని భారత్ తెగేసి చెప్పింది. -
ఉక్రెయిన్పై దాడి.. రష్యాకు మద్దతుగా పాక్, చైనా సైనికులు: జెలెన్స్కీ
కీవ్: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా తరఫున చైనా, పాకిస్తాన్ దళాలు పాల్గొంటున్నాయని వ్యాఖ్యానించారు. వీరందరిపై తమ సైన్యం పోరాటం చేస్తోందని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ సందర్బంగా జెలెన్స్కీ.. ఉక్రెయిన్పై యుద్ధంతో రష్యాకు పలు దేశాలు సహకరిస్తున్నాయి. ఆయా దేశాల నుంచి సైనికులు వస్తున్నారు. చైనా, తజికిస్థాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్తో సహా ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్న కిరాయి సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నట్లు మా దేశ దళాలు గుర్తించాయి. ఇందుకు ఉక్రెయిన్ సైన్యం నుంచి ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని హెచ్చరిస్తున్నామన్నారు. ఇదే సమయంలో యుద్ధంలో పాల్గొని దేశానికి సేవ చేస్తున్న దళాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.అలాగే, వోవ్చాన్స్క్ ప్రాంతంలోని సైనిక దళాలతో భేటీ అయినట్లు జెలెన్స్కీ తెలిపారు. ఫ్రంట్లైన్లోని కమాండర్ల గురించి, ఆ ప్రాంతంలోని రక్షణ వ్యవస్థల గురించి వారితో మాట్లాడినట్లు తెలిపారు. డ్రోన్ సరఫరాలు పెంచడం, దళాల నియామకం, బ్రిగేడ్లకు ప్రత్యక్ష నిధులపై కూడా చర్చించినట్లు వెల్లడించారు.Today, I was with those defending our country in the Vovchansk direction – the warriors of the 17th Separate Motorized Infantry Battalion of the 57th Brigade named after Kish Otaman Kost Hordiienko.We spoke with commanders about the frontline situation, the defense of… pic.twitter.com/40XsGHZU0T— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 4, 2025మరోవైపు.. అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపణలను పాక్ ఖండించింది. ఆయన ఆరోపణలు నిరాధారమైనవి అంటూ పాక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. జెలెన్స్కీ ఆరోపణలపై తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో వీటిపై తగిన ఆధారాలు చూపించేందుకు ఉక్రెయిన్ అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపింది. ఇక, ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా తరఫున చైనా పౌరులు పాల్గొంటున్నారని గతంలో జెలెన్స్కీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, వీటిని బీజింగ్ అప్పుడే ఖండించింది. మరోవైపు.. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు ఉత్తరకొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. రష్యాకు ఆయుధాలను, సైనికులను పంపిస్తోంది. -
భారత్పై రెచ్చిపోయిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై రెచ్చిపోయారు. భారత్పై మరోసారి సుంకాన్ని భారీ మొత్తంలో విధిస్తామని హెచ్చరించారు.గత వారం ట్రంప్ భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 25శాతం సుంకంతో పాటు అదనంగా పెనాల్టీ విధించారు. తాజాగా, రానున్న రోజుల్లో భారత్పై మరింత సుంకాల్ని విధిస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. చమురును కొనుగోలు చేయడమే కాదు.. దానిని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంది. రష్యా వార్ మెషిన్తో ఎంతమంది ఉక్రెయిన్లు ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు. అందుకే భారత్పై గణనీయంగా సుంకాలు విధిస్తామని’ పేర్కొన్నారు. రెండు రోజుల వ్యవధిలో మరోసారి టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ బెదిరింపులకు దిగడం వెనక భారత్ తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది. పలు జాతీయ,అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. భారత్పై 25శాతం ట్రంప్ సుంకం విధించారు. ట్రంప్ నిర్ణయం అనంతరం భారత్ సంస్థలు.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేశాయని.. ఆ నిర్ణయంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారనేది సదరు మీడియా కథనాల సారాశం. ఈ కథనలపై కేంద్రం స్పందించినట్లు సమాచారం. దేశ ఇంధన దిగుమతులు మార్కెట్ శక్తులు. జాతీయ ప్రయోజనాల కోసం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పునరుద్ఘటించింది. భారత చమురు సంస్థలు రష్యన్ చమురు దిగుమతులను నిలిపివేసినట్లు తమకు ఎటువంటి సమాచారం లేదని ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసింది.ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధంలో రష్యా ఆదాయ మార్గాలను అరికట్టేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్-రష్యా స్థిరమైన భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని తెలిపింది. ప్రస్తుత ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు సాగుతాయని వెల్లడించింది. -
భారత్పై ట్రంప్ సన్నిహితుడి వివాదాస్పద వ్యాఖ్యలు
వాషింగ్టన్: రష్యా-భారత్ వాణిజ్యంపై అమెరికా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సహాయకుడు స్టీఫెన్ మిల్లర్.. భారత్పై సంచలన ఆరోపణలు చేశారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్పై ఆ దేశం చేస్తున్న యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. యుద్ధం ఆగాలంటే భారత్పై ఆంక్షలు తప్పవని తేల్చి చెప్పారు. దీంతో, ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సహాయకుడు స్టీఫెన్ మిల్లర్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ వాణిజ్యం కారణంగానే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తోంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే విషయంలో భారత్ దాదాపుగా చైనాతో సమానంగా ఉంది. భారత్ చేసుకుంటున్న దిగుమతులు ఉక్రెయిన్పై రష్యా దాడికి నిధులు సమకూర్చడానికి సాయపడుతున్నాయి. ఇది అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ చాలా స్పష్టతతో ఉన్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక, ఆయన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. అయితే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు కీలక భాగస్వామి అయిన భారత్పై ట్రంప్ వర్గం నుంచి ఇలాంటి విమర్శలు రావడం తీవ్ర చర్చకు దారి తీశాయి. కాగా, కొద్ది రోజుల ముందే ట్రంప్.. భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారత్, రష్యా వాణిజ్యంపై ట్రంప్ ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తూ డెడ్ ఎకానమీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. ఉక్రెయిన్లో శాంతి చర్చల దిశగా పురోగతి లేకపోతే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.🚨 JUST IN: 🇺🇸🇮🇳 Stephen Miller, a top aide to President Trump, accused India of effectively financing Russia’s war in Ukraine by purchasing oil from Moscow. Miller made these remarks on Fox News " stating that it was “unacceptable” for India to continue buying Russian oil, which… pic.twitter.com/NYDbR6q7q1— Viral Max (@viralmax777) August 3, 2025ఇదిలా ఉండగా.. భారత్, తక్కువ ధరకే లభిస్తున్న రష్యా ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రస్తుతం దేశ చమురు అవసరాల్లో మూడింట ఒక వంతుకు పైగా రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ, దేశ ఇంధన భద్రత, సార్వభౌమ నిర్ణయాల దృష్ట్యా రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అయితే, ట్రంప్కు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య చారిత్రాత్మకంగా బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని మిల్లర్ అంగీకరించడం గమనార్హం. -
ప్రపంచానికే ప్రమాదం
-
జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంపై దాడి
మాస్కో: జనావాసాలపై పరస్పర బాంబులేసుకుంటున్న ఉక్రెయిన్, రష్యాలు ఒక్కసారిగా యుద్ధంలో రేడియోధార్మికత భయాలను పెంచాయి. ఉక్రెయిన్కు చెందిన అత్యంత కీలకమైన జపోరి జియా అణువిద్యుత్ కేంద్రంపై ఆదివారం దాడి జరిగింది. ఈ న్యూక్లియర్ ప్లాంట్ ఆవరణలోని నిర్మాణం నుంచి భారీ స్థాయిలో మంటలు, పొగ వెలువడుతున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ప్రసారమయ్యాయి. అయితే దాడిలో అణువిద్యుత్ కేంద్రం ప్రధానభాగం దెబ్బతిన్నదా? లేదా? అనేది తెలియరాలేదు. దీంతో రేడియోధార్మికత వ్యాపించవచ్చన్న భయాలు ఒక్కసారిగా యూరప్లో వ్యాపించాయి. యూరప్ ఖండంలోనే అతిపెద్ద అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా పేరొందిన జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ను యుద్ధసమయంలో రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ రష్యా అధీనంలో ఉంది. దీంతో ఉక్రెయిన్ సేనలే తమ డ్రోన్ ద్వారా దాడికి పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్లాంట్ ప్రధాన నిర్మాణానికి 1,200 మీటర్ల దూరంలో దాడి వి ధ్వంసం జరిగిందని, ప్రమా ద అంచనా, నిజా నిజాలు నిగ్గుతేల్చేందుకు అంతర్జాతీ య అణుఇంధన సంస్థ (ఐఏఈఏ) తమ ప్రత్యేక పర్యవేక్షణా బృందాన్ని హుటాహుటిన జపోరి జియా ప్లాంట్కు పంపించింది. ‘‘ మా ఏజెన్సీ టీమ్ను ఇప్పటికే పంపించాం. దాడి ధాటికి రేడియో ధార్మికత వెలువడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఈ ఉపద్రవాన్ని అడ్డుకోక తప్పదు’’ అని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసీ ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా చమురు నిల్వ కేంద్రంపై దాడిరష్యాలోని చమురు నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్ దాడులకు తెగబడింది. దీంతో చమురు కేంద్రం తగలబడి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఆస్తి నష్టం పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. నల్ల సముద్ర తీరంలో రిసార్ట్లకు పేరెన్నికగన్న సోచీ సిటీలో ఈ ఆయిల్ డిపో ఉంది. ఏకంగా 120కిపైగా అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు శ్రమించారని క్రాన్సో్నడార్ రీజనల్ గవర్నర్ వెనియామిన్ కోంద్రాతెవ్ తన ‘టెలిగ్రామ్’ ఖాతాలో ఒక పోస్ట్చేశారు. దట్టంగా కమ్ముకున్న పొగ కారణంగా ముందజాగ్రత్తగా సోచీ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలను నిలిపేశారు. గత 24 గంటల్లో 93 ఉక్రెయిన్ డ్రోన్లను నేలరాల్చామని రష్యా రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది. మరోవైపు తమపై 76 డ్రోన్లు, 7 క్షిపణులను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆదివారం తెలిపింది. -
రష్యాలో భారీ భూకంపం.. బద్దలైన అగ్నిపర్వతం.. సునామీ హెచ్చరిక జారీ..
-
రష్యాను వణికించిన మరో భూకంపం.. సునామీ హెచ్చరిక
మాస్కో: రష్యాలో వరుస భూకంపాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఆదివారం కురిల్ దీవులలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.0గా నమోదైనట్టు జపాన్ వాతావరణ శాఖ, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ వెల్లడించాయి. అలాగే, పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇక, భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. రష్యాలోని కురిల్ దీవులలో ఆదివారం ఉదయం భూమి కంపించింది. భూకంపం ధాటికి పలు నగరాల్లోని భవనాలు ఊగిపోయాయని రష్యా మీడియా తెలిపింది. ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియలేదు. సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.Amazing footage of the tsunami run up from that M8.8 off Kamchatka. Filmed at Onekotan, Kuril Islands.Credit (doni_nikz on TikTok) pic.twitter.com/d50gStm1pd— GeoGeorgeShad (@GeoGeorgeology) August 3, 2025మరోవైపు.. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి బద్దలైనట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల సంభవించిన భారీ భూకంపం వల్ల దాదాపు 600 ఏళ్ల తర్వాత మొదటిసారి ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో 6 వేల మీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడినట్లు వెల్లడించింది. మరో ఘటనలో కమ్చట్కా ద్వీపకల్పంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతం క్ల్యూచెస్కీ బద్దలైంది.NOW: 7M earthquake hits Russia's Kuril IslandKrasheninnikov volcano erupts. Tzunami pic.twitter.com/0biWlDushO— Mossad Commentary (@MOSSADil) August 3, 2025హెచ్చరికలు జారీ.. ఇదిలా ఉండగా.. ఇటీవల రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భారీ భూ ప్రకంపనల ధాటికి రష్యా, జపాన్తో పాటు ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. పసిఫిక్ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొన్నారు. దాని ప్రభావంతోనే తాజాగా భూకంపం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.Tsunami Warning Centre, @ESSO_INCOIS detected an #earthquake of M 6.5 on 03 August 2025 at 11:07 IST @ Kuril Islands (Location: 50.66 N, 157.89 E)NO TSUNAMI THREAT to India in connection with this earthquake.Details at https://t.co/YJ3rTlWcTf pic.twitter.com/9Ht1bTSRB2— INCOIS, MoES (@ESSO_INCOIS) August 3, 2025 -
ట్రంప్ చెప్పింది అబద్ధం
వాషింగ్టన్: రష్యా నుంచి ఆయుధాలు, చమురును కొనుగోలు చేయొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్లురిమి చూసినా భారత్ ఏమాత్రం బెదరలేదని తాజాగా వెల్లడైంది. భారత్ చమురు, ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా ఆర్జించిన లాభాలను రష్యా.. ఉక్రెయిన్పై యుద్ధం కోసం వెచ్చిస్తోందని ట్రంప్ ఇప్పటికే ఆరోపించారు. ఈ కొనుగోల్లు ఆపకపోతే భారీ దిగుమతి సుంకాలు విధిస్తానని భారత్ను ట్రంప్ బెదిరించినా రష్యా ముడిచమురును భారత రిఫైనరీ కంపెనీలు నిరాటంకంగా కొనుగోలుచేస్తూనే ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భవిష్యత్తులో రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలుచేయబోదనే వార్తలను విన్నానని ట్రంప్ శనివారం వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే జాతీయమీడియాలో భిన్నమైన వార్తలు రావడం విశేషం. ‘‘రష్యా నుంచి చమురు కొనే సంస్కృతికి భారత్ మంగళం పాడుతుందని విన్నా. ఇది నిజంగా మంచి విషయం. అయితే ఇందులో నిజమెంతో నాక్కూడా తెలీదు. తర్వాత ఏం జరుగుతుందో వేచిచూద్దాం’’ అని ట్రంప్ న్యూజెర్సీలోని బెడ్మిన్స్టర్ గల్ఫ్ క్లబ్లో మీడియాతో ట్రంప్ అన్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికా ఎంతగా బెదిరించినా సరే భారత్ తన స్వప్రయోజనాలకు, సార్వ¿ౌమతానికే అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మరోసారి రుజువైందని జాతీయమీడియాలో శనివారం పలు కథనాలు వచ్చాయి. ‘‘ రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయాలా? వద్దా? కొంటే ఎంత పరిమాణంలో కొనాలి? అనేవి కేవలం మార్కెట్ ధర ప్రకారంమే నిర్ణయం తీసుకుంటాంగానీ ట్రంప్ వంటి బయటివ్యక్తి బెదిరింపులకు భయపడికాదు’’ అని రిఫైనరీల సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘‘ ముడి చమురు నాణ్యత, సరఫరా వ్యయాలు, ఇతరత్రా ఖర్చుల గురించే మేం ఆలోచిస్తాంగానీ అమెరికా ఆదేశించిందనో మరెవరో వద్దన్నారో మేం చమురు కొనుగోళ్లను ఆపబోం’’ అని భారతీయ రిఫైనరీలు స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. -
ట్రంప్ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన భారత్..
-
అంత సీన్ లేదు.. ఎక్కడున్నారో మరచిపోయారా?: ట్రంప్కు రష్యా కౌంటర్
మాస్కో: అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యా మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికాకు చెందిన రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అమెరికా చర్యలకు రష్యా కౌంటరిచ్చింది. అమెరికాను ఎదుర్కొనేందుకు తమవద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని రష్యా హెచ్చరించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అమెరికా మోహరించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ స్పందిస్తూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు రష్యా వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో అమెరికా జలాంతర్గాముల సంఖ్య కంటే రష్యావి చాలా ఎక్కువే ఉన్నాయి. అమెరికా మోహరించినవి జలాంతర్గాములు సైతం రష్యా జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు.🚨 BREAKING: Russian lawmaker Viktor Vodolatsky says Russia has enough nuclear submarines to counter the 2 U.S. subs recently repositioned by President Trump. The move follows provocative remarks from former Russian President Medvedev. #Defense #NuclearSubmarines #USRussia pic.twitter.com/QnsGLdx4Q5— India Defence Daily (@IndiaDefDaily) August 2, 2025మరోవైపు.. గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఇన్చీఫ్ ఫ్యోడర్ లుక్యానోవ్ మాట్లాడుతూ.. ట్రంప్ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మాస్కో, వాషింగ్టన్ల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గా లావ్రోవ్ పేర్కొన్నారు.మెద్వెదెవ్ కామెంట్స్..ఇదిలా ఉండగా.. శుక్రవారం అమెరికా రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదెవ్ చేసిన ‘డెడ్ హ్యాండ్’ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్..‘అవి మతిలేని, రెచ్చగొట్టే ప్రకటనలు. నిజంగానే అలాంటి పరిస్థితి తలెత్తే ఆస్కారముంటే దీటుగా స్పందించేందుకే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. రెండు సబ్మెరైన్లను సరైన ప్రదేశాల్లో మోహరించాల్సిందిగా ఆదేశించాను’ అని వివరించారు.ఏమిటీ డెడ్ హ్యాండ్? ఇది రష్యా (నాటి సోవియట్ యూనియన్) అభివృద్ధి చేసిన ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వ్యవస్థ. ఆ దేశంపై ఎవరన్నా అణు దాడి చేస్తే అందుకు ప్రతిగా ఆటోమేటిక్గా అణు దాడులు జరుపుతుంది. దేశ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినా తనంత తానుగా స్పందించి దాడులకు దిగటం దీని ప్రత్యేకత. -
రష్యాతో భారత్ కటీఫ్.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురుపై ట్రంప్ స్పందించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇది మంచి చర్య.. భారత్ సరైన నిర్ణయం తీసుకుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనబోదని నేను అనుకుంటున్నాను. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, నేను విన్నది సరైందో కాదో నాకు తెలియదు. భారత్ కనుక ఇలా చేస్తే అది మంచి నిర్ణయం. ఏం జరుగుతుందో చూద్దాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.#WATCH | "I understand that India is no longer going to be buying oil from Russia. That's what I heard, I don't know if that's right or not. That is a good step. We will see what happens..." says, US President Donald Trump on a question by ANI, if he had a number in mind for the… pic.twitter.com/qAbGUkpE12— ANI (@ANI) August 1, 2025జైశ్వాల్ కీలక వ్యాఖ్యలు..మరోవైపు, తాజా పరిణామాలపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ దేశంతోనూ భారత్కు ఉన్న సంబంధాలను మూడో దేశం కోణంలో చూడవద్దని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు కట్టుబడి ఉన్నామని, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. దేశ ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తాం. పరస్పర ఆసక్తులు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య బలమైన సంబంధాల విషయంలో భారత్, అమెరికా దేశాలు అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాయి. ఇందులో ఇరు దేశాలు ఎన్నో మార్పులు, సవాళ్లను ఎదుర్కొన్నాయి. అందుకే ముఖ్యమైన ఎజెండాపైనే మేము దృష్టి సారించాం. ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. భారత్, అమెరికా బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి బలోపేతమయ్యాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.నిలిచిన కొనుగోళ్లు..ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ, భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా సహా పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. అయితే, చమురు కొనుగోలుపై భారత్ ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తోంది. కాగా, దీన్ని ఓ కారణంగా చూపుతూ ఇటీవల ట్రంప్.. భారత్పై పెనాల్టీలు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను దేశీయ సంస్థ నిలిపివేశాయంటూ వార్తలు వస్తున్నాయి.భారత్కు చెందిన ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్ లిమిటెడ్ వంటి సంస్థలు గత వారం రోజులుగా మాస్కో నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి. రిఫైనరీ సంస్థలకు చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం ప్రచురించింది. అయితే, దీనిపై ఆయా సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. ఇప్పటివరకు అలాంటి ఆదేశాలేమీ ప్రభుత్వం జారీ చేయలేదని వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. -
‘ఎఫ్–35’ కొనుగోళ్లు బంద్!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు భారత ప్రభుత్వం ప్రతిచర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధించడం, రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే అదనపు జరిమానాలు విధిస్తామని హెచ్చరించడం భారత్ను పునరాలో చనలో పడేశాయి. ట్రంప్ దూకుడుకు విరుగుడుగా అమెరికా నుంచి రక్షణ పరికరాల కొనుగోలును విరమించుకోవాలని ఇండియా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా ఎఫ్–35 యుద్ధ విమానాల కొనుగోలును పూర్తిగా నిలిపి వేయనున్నట్లు తెలిసింది. ట్రంప్ ఇటీవల భారత్పై కారాలు మిరియాలు నూరుతున్నారు. సోషల్ మీడి యాలో వరుసగా పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియాపై అమెరికా అధ్యక్షుడి మాటల దాడి మరింత తీవ్రమైంది. పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహ రిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను వైట్హౌస్ ఆహ్వా నించి, విందు ఇచ్చారు. ఇండియా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్లు విధించనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఒకవైపు భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. భారత్తో తమకు వాణిజ్య లోటు ఉందని, దీన్ని కచ్చితంగా తగ్గిస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ పరిణామా లన్నీ భారత్కు ఇబ్బందికరంగా మారాయి. అమెరికాతో చర్చలు జరుపలేదు రక్షణ రంగంలో భారత్–అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికా రక్షణ పరికరాలు, ఆయుధాలు, సైనిక రవాణా విమానాలను భారత్ ఉపయోగిస్తోంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయించాలని డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. తద్వారా వేల కోట్ల డాలర్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటనలో ఎఫ్–35 యుద్ధ విమానాల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఈ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు బ్లూబర్గ్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్రంప్ ఆఫర్ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. సమీప భవిష్యత్తులోనూ వీటిని కొనే అవకాశం లేదని పేర్కొంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాల కోసం అమెరికా ప్రభుత్వంతో అధికారికంగా ఎలాంటి చర్చలు జరుపలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా, వాణిజ్య లోటుపై ట్రంప్ అభ్యంతరాల నేపథ్యంలో అమెరికా నుంచి సహజ వాయువు, కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం కొనుగోళ్లు పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అందుకు దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అమెరికాతో నెలకొన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని అంచనా వేస్తోంది. -
రష్యా సమీపంలోకి... అణు జలాంతర్గాములు!
మాస్కో: అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం అమెరికా రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ద్మిత్రీ మెద్వెదెవ్ చేసిన ‘డెడ్ హ్యాండ్’ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘అవి మతిలేని, రెచ్చగొట్టే ప్రకటనలు. నిజంగానే అలాంటి పరిస్థితి తలెత్తే ఆస్కారముంటే దీటుగా స్పందించేందుకే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. రెండు సబ్మెరైన్లను సరైన ప్రదేశాల్లో మోహరించాల్సిందిగా ఆదేశించా’’అని వివరించారు. ఏమిటీ డెడ్ హ్యాండ్? ఇది రష్యా (నాటి సోవియట్ యూనియన్) అభివృద్ధి చేసిన ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వ్యవస్థ. ఆ దేశంపై ఎవరన్నా అణు దాడి చేస్తే అందుకు ప్రతిగా ఆటోమేటిగ్గా అణు దాడులు జరుపుతుంది. దేశ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినా తనంత తానుగా స్పందించి దాడులకు దిగటం దీని ప్రత్యేకత. భూమిపై ఎక్కడైనా కొట్టగల క్షిపణి: రష్యా మాస్కో: అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణులను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో వాటిని బెలారస్లో మోహరించే యోచన ఉందని తెలిపారు. రష్యాకు అత్యంత సన్నిహిత దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జండర్ లుకషెంకోతో కలిసి సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో పుతిన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ క్షిపణులకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. సంవత్సరాంతానికి ఉత్పత్తి్త మొదలవుతుంది. ఉక్రెయిన్తో యుద్ధంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఒరెíÙ్నక్, దానికి సంబంధించిన ఆయుధ వ్యవస్థలను గత అక్టోబర్లో పుతిన్ రంగంలోకి దించారు. ఆ సందర్భంగా ఒరెషి్నక్ సామర్థ్యాలను ప్రస్తుతించారు. ‘‘సంప్రదాయ, అణు వార్హెడ్లు రెండింటినీ మోసుకెళ్లగలగడం దీని ప్రత్యేకత. లక్ష్యం భూమిపై ఎక్కడున్నా ఇప్పటికైనా ఈ క్షిపణులు ఆదుకోవాల్సిందే. ఇవి దాదాపుగా మాక్10 వేగంతో దూసుకెళ్తాయి. -
భారత్ కారణంగా పుతిన్ రెచ్చిపోతున్నారు.. రుబియో సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్, రష్యా చమురు కొనుగోలు విషయమై అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర భారత్ కొంటున్న చమురుతోనే పుతిన్.. ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే భారత్తో చర్చల్లో తమను ఇబ్బందిపెట్టే అంశమని వ్యాఖ్యలు చేశారు.అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో గురువారం ఫాక్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అన్ని దేశాల్లాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు చమురు, బొగ్గు, గ్యాస్ కొనగలిగే శక్తి భారత్కు ఉంది. అయితే, భారత్.. తమ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. భారత్కు భారీగా ఇంధన అవసరాలున్నాయి. రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్కు చమురు చౌకగా లభిస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే రష్యాలను నిధులు సమకూరుతున్నాయి. వాటిని రష్యా.. ఉక్రెయిన్తో యుద్ధం చేయడంలో వాడుకుంటోంది. అదే యుద్ధంలో మనగలగడానికి రష్యాకు ఉపయోగపడుతోందన్నారు. అలాగే, ఇదే భారత్తో చర్చల్లో అమెరికాను ఇబ్బందిపెట్టే అంశం. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాదారు. వ్యూహాత్మక భాగస్వామి. అయితే అన్ని అంశాల్లో మాదిరిగా విదేశాంగ విధానంలోని ప్రతి విషయంలో 100 శాతం సమయం కేటాయించడం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.ఇక, అంతకుముందు.. భారత్, రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకోనీయండని, కలిసి మునగనీయండని వ్యాఖ్యానించారు. బుధవారం భారత్పై 25 శాతం సుంకాలతోపాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వారిద్దరూ మునిగిపోతుంటే మాకెందుకని, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని స్పష్టం చేశారు. ‘మనకు భారత్ స్నేహితురాలే అయినా ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.#BREAKING | US Secretary of State Marco Rubio calls India a "strategic partner" while also expressing concern over its continued energy imports from Russia. "Look, global trade – India is an ally. It’s a strategic partner. Like anything in foreign policy, you’re not going to… pic.twitter.com/m8OfCpHUXQ— NewsMobile (@NewsMobileIndia) July 31, 2025 -
సుంకాలు... శాపనార్థాలు!
రాక తప్పదనుకుంటున్న ముప్పు ముంగిట్లోకొచ్చింది. అమెరికా అధ్యక్షపీఠం అధిష్ఠించింది మొదలు నిలకడలేనితనంతో, పొంతనలేని వ్యాఖ్యలతో మిత్రుల్ని, వ్యతిరేకుల్ని కూడా సమానంగా ఇరకాటంలో పడేస్తున్న డోనాల్డ్ ట్రంప్... గతంలో హెచ్చరించినట్టే సుంకాల మోత మోగించారు. శుక్రవారం నుంచి భారత్ నుంచి వచ్చే సరుకులపై 25 శాతం సుంకాలు విధిస్తామని, ఇవిగాక రష్యా నుంచి ముడిచమురు, రక్షణ సామగ్రి కొంటున్నందుకు అదనంగా జరి మానా ఉంటుందని ప్రకటించారు. అది ఎంత శాతమో చెప్పకపోయినా రష్యాతో వాణిజ్యం సాగించే భారత్, చైనాలపై 500 శాతం వరకూ అదనపు సుంకాలుంటాయని ఆయన లోగడ ప్రకటించారు. కనుక ఈ సుంకాల కన్నా జరిమానా వాటాయే ఎక్కువుంటుందని అంచనా వేయొచ్చు. తన ఆదేశాలను ఔదలదాల్చనందుకు మన ఆర్థిక వ్యవస్థను ‘మృత ఆర్థిక వ్యవస్థ’గా దూషించారు. అనాల్సిన వన్నీ అన్నాక ‘ఇంకా భారత్తో చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం’ అని ముక్తాయించారు. ఆయన హుకుం అమలైతే వస్త్రాలు, రొయ్యలు, ఆభర ణాలు, వజ్రాలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై తీవ్ర ప్రభావం పడుతుందనీ, ఆ రంగాల్లో ఉపాధి దెబ్బతింటుందనీ నిపుణుల అంచనా. ఈ రంగాల్లో 8,700 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులుంటున్నాయి. ఈ ఏడాది జీడీపీ 6.5 శాతానికి మించి వుండొచ్చని అంచనాలున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అది బాగా తగ్గవచ్చంటున్నారు. ట్రంప్కు దౌత్య మర్యాదల సంగతి అటుంచి వ్యక్తిగా ఎలా మెలగాలో కూడా తెలియదు. బహిరంగ బెదిరింపులకు దిగటం, అన్యాయమని అందరికీ తెలిసేలా ప్రవర్తించటం ఆయన నైజం. బ్రెజిల్ సంగతే తీసుకుంటే అక్కడ ఆ మధ్య అధికారం కోల్పోయిన బోల్సొనారో ఆయ నకు ఇష్టుడు. కనుక అతనిపైవున్న నేరారోపణలు ఉపసంహరించి వదిలేయమని తాఖీదు పంపారు. అంగీకరించనందుకు అదనపు సుంకాలు విధించారు. దేశాలకు సార్వభౌమత్వం ఉంటుందనీ, దానికి లోబడి సంబంధాలు నెరపాలనీ ఆయన భావించరు. వాణిజ్య ఒప్పందాలు సాకారం కావాలంటే వాటిని కుదుర్చుకోదల్చుకున్న రెండు పక్షాలకూ పరస్పర విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఓపిగ్గా చర్చించాలి. బ్రిటన్తో మనకు ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే ఇందుకు ఉదాహరణ. దాదాపు మూడేళ్లపాటు ఆ ఒప్పందంపై చర్చలు సాగాయి. ఒప్పందం అన్నాక ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి. ‘మేం పుచ్చుకుంటాం... ఇవ్వం’ అంటున్నారు. ‘మాతో ఒప్పందానికి భారత్ సుముఖంగా వుంది... ఇక సంతకాలే తరువాయి’ అంటూ చాన్నాళ్ల క్రితమే మన ప్రభుత్వం తరఫున తానే ప్రకటించారు. ట్రంప్ ఆగ్రహావేశాలకు వేరే కారణాలున్నాయి. మన సాగు, పాడి రంగాలను పరిరక్షించేందుకు అమెరికా నుంచి వచ్చే ఆ ఉత్పత్తులపై మన దేశం అధిక సుంకాలు విధిస్తోంది. ఇందులో సహేతుకత ఉంది. అమెరికాలో ఆ రంగాలకు భారీ సబ్సిడీలుంటాయి. దాంతో తమ ఉత్పత్తుల్ని వేరే దేశాల్లో కారుచౌకగా అమ్ముకోవటానికి వీలుంటుంది. అమెరికాతో పోలిస్తే మన సబ్సిడీలు చాలా తక్కువ. అవి రైతులకు లాభదాయకం కాకపోగా, ఆ రెండు రంగాల్లోనూ వ్యయం విపరీ తంగా పెరిగింది. రైతులు అధిక వడ్డీకి బయట అప్పులు చే యాల్సి వస్తోంది. తీరా గిట్టుబాటు ధర లభించక, అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్టు అధిక సుంకాలు తొలగిస్తే ఈ సంక్షోభం మరింత పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా ఉన్న ఆ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నిజానికి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో చేరినప్పుడే మన పాలకులు నిక్కచ్చిగా ఉండాల్సింది. కానీ దాటవేత ధోరణి ప్రదర్శించారు. రష్యాతో వాణిజ్యంపైనా ఇంతే. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్నట్టు ఉంటే వేరుగా ఉండేది. కానీ మన దేశం వారి ఆదేశాలు పాటించింది. 2009–13 మధ్య మన ఆయుధ కొనుగోళ్లలో రష్యా వాటా 76 శాతం. అదిప్పుడు 36 శాతానికి పడిపోయింది. దీన్ని ఆపేయాలని, తన ఎఫ్–35 యుద్ధ విమానాలు, ఎంక్యూ–9బి డ్రోన్లు, పీ–81 సాగర ప్రాంత గస్తీ విమానాలు కొనితీరాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. నిజానికి భారత్కు ఆయుధ అమ్మకాలపై 1960 ప్రాంతాల్లో అమెరికా నిషేధం విధించబట్టే రష్యాపై ఆధారపడటం పెరిగింది. ముడి చమురు విషయానికొస్తే మొన్న ఫిబ్రవరికి రష్యా నుంచి కొనుగోళ్లు 25 శాతం మేర పడిపోయాయి. అదే సమయంలో అమెరికా నుంచి కొనుగోళ్లు వంద శాతం పెరిగాయి. తన అంధభక్త గణాన్ని సంతృప్తిపరచటం కోసం, ఓటుబ్యాంకు పెంచుకోవటం కోసం ట్రంప్ దశాబ్దాల తరబడి ఎంతో ఓపిగ్గా నిర్మించుకుంటూ వచ్చిన ఇరు దేశాల సంబంధాలపైనా గొడ్డలి వేటు వేశారు. దీని పర్యవ సానాలు మనపై ఉన్నట్టే, అమెరికాపైనా ఉంటాయి. ఆయన ధోరణి మారకపోతే మన ఆర్థిక వ్యవస్థ మాటేమోగానీ... అమెరికా ఆర్థిక వ్యవస్థ ‘మృతప్రాయం’ కావటం ఖాయం. -
అవి డెడ్ ఎకానమీలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ/మాస్కో: ఆంక్షలు విధిస్తామ ని భయపెట్టినా గత కొంతకాలంగా రష్యా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోళ్లను తగ్గించుకోని భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్కు చమురును సరఫరాచేస్తున్న శత్రు దేశం రష్యాను సైతం ట్రంప్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. భారత్, రష్యా రెండూ కలిసి సాధించేది ఏమీ ఉండదని ఎద్దేవాచేశారు. జట్టుకట్టి అనవసరంగా రెండు దేశాల ఆర్థికవ్యవస్థలను మరింత నిర్వీర్యంచేస్తున్నా యని ఇరు దేశాల ప్రభుత్వాలపై విమర్శల బురద చల్లారు. భారత్పై పాతికశాతం టారిఫ్ ఆర్థిక భారం మోపిన ట్రంప్ గురువారం భారత్, రష్యాల వాణిజ్యబంధంపై తన అక్కసును వెళ్లగక్కుతూ సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. ఐ డోంట్ కేర్..‘‘ రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందీ, రష్యాతో భారత్కు ఉన్న సత్సంబంధాలు ఏంటి అనేవి నాకు అస్సలు అవసరం లేదు. అత్యంత కీలకమైన అమెరికాతో వాణిజ్యం అత్యల్ప స్థాయిలో చేసుకుంటూ భారత్ సొంత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యంచేసుకుంటోంది. ఇక రష్యా సంగతి చెప్పనక్కర్లేదు. రష్యాతో అమెరికాకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవు. ఇలాంటి రష్యా, భారత్లో కూడబలుక్కుని సాధించింది ఏమీ లేదు. అవి రెండూ డెడ్ ఎకానమీలు (నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థలు). ఉమ్మడిగా పతనమవుతున్నాయి. ఈ దేశాలను నేనసలు పట్టించుకోను. భారత్తో మేం చాలా తక్కువ స్థాయిలో వాణిజ్యం చేస్తున్నాం. భారత్ మాపై విధించే అధిక టారిఫ్లే ఇందుకు ప్రధాన కారణం. భారత్ విధించే దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక దిగుమతి సుంకాలు వసూలుచేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్తో వ్యవహారాలు ఒక్కోసారి సవ్యంగా ఉండవు. దాని పర్యవసానమే ఈ 25 శాతం దిగుమతి సుంకాలు. వీటికి పెనాల్టీ(జరిమానా) అదనం. ఇవన్నీ ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి అమలుచేసి వసూలు మొదలెడతా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘భారత వాణిజ్య విధానాలు అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉంటాయి. దానికితోడు భారత్తో పరస్పర సరుకుల విలువను మాత్రమే జమకట్టే నగదుయేతర వాణిజ్య అవరోధాలు చాలా ఉన్నాయి. మేం వద్దు అని వారిస్తున్నా, హెచ్చరిస్తున్నాసరే రష్యా నుంచి ఆయుధ, ఇంధన ఉత్పత్తులను భారీ ఎత్తున భారత్ కొనుగోలుచేస్తోంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధం కోసం రష్యా వినియోగిస్తోంది’’ అని ట్రంప్ ఆరోపించారు.మెద్వెదేవ్, ట్రంప్ మాటల యుద్ధంభారత్ను విమర్శించిన ట్రంప్ పనిలోపనిగా రష్యాపైనా, రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్పైనా విమర్శలు గుప్పించారు. దీంతో మెద్వదేవ్ సైతం ప్రతివిమర్శలు చేశారు. తొలు త మెద్వదేవ్నుద్దేశిస్తూ ట్రంప్ వ్యంగ్య పోస్ట్ చేశారు. ‘‘రష్యా అధ్యక్షుడిగా పేలవంగా పాలించిన మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ ఇంకా రష్యాకు అధ్యక్షుడినే అని అనుకుంటున్నారేమో. ఏదైనా మాట్లాడేముందు చూసి మాట్లాడండి. అమె రికాపై మాట్లాడే దుస్సాహసం చేయొద్దు’’ అని హెచ్చరించారు. దీనిపై రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడి హోదాలో మెద్వదేవ్ ఘాటుగా జవాబిచ్చారు. ‘‘ట్రంప్ ఎలా స్పందించినాసరే రష్యా తన పంథాను వీడబోదు. డెడ్ ఎకానమీ అని నోటికొచ్చినట్లు మాట్లాడటంకాదు. సోవి యట్ కాలంలోనే రష్యా అణుబాంబును తయా రుచేసిందన్న విషయం మర్చి పోవద్దు. అయినా ‘డెడ్’ అనే పదానికి ‘ది వాకింగ్ డెడ్’ అనే సినిమాకు, ‘డెడ్ హ్యాండ్ అనే ‘వ్యవ స్థ’కు ఉన్న శక్తి ట్రంప్కు తెలీదనుకుంటా’’ అని మెద్వదేవ్ వ్యాఖ్యానించారు. శత్రుదేశం దాడిచేసి రష్యా నా యక త్వాన్ని అంతమొందించినాసరే తిరిగి అణు బాంబులు ప్రయోగించేలా రష్యా రూపొందించిన ఆటో మేటిక్ దాడి వ్యవస్థ పేరే డెడ్ హ్యాండ్. -
భారత్-రష్యా బంధం.. ఐ డోంట్ కేర్: ట్రంప్
మిత్రదేశం అంటూనే భారత దిగుమతులపై 25 శాతం సుంకం విధించిన ట్రంప్.. మరో బాంబ్ పేల్చారు. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడమే అందుకు కారణమని కూడా ఆయన అన్నారు. ఈ తరుణంలో భారత్-రష్యా బంధంపైనా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయని అన్నారాయన. భారత్ రష్యా (Russia) నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఆ రెండు దేశాలు ఏ వ్యాపారం చేసుకున్నా నాకు సంబంధం లేదు. కాకుంటే వారి ఆర్థిక వ్యవస్థను ఆ దేశాలు మరింత పతనం చేసుకుంటున్నాయి అని వ్యాఖ్యానించారాయన. న్యూఢిల్లీతో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామన్న ఎందుకంటే భారత్ అత్యధికంగా సుంకాలు విధిస్తుందని, ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఆరోపించారాయన. ఈ సందర్భంగా.. రష్యా, యూఎస్లు కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని ట్రంప్ స్పష్టంచేశారు. అలాగే రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్పై విరుచుకుపడ్డారు. ‘‘మెద్వెదేవ్ ఓ విఫల నేత. ఆయన ఇప్పటికీ తానే అధ్యక్షుడిని అనుకుంటున్నారేమో. ఆయన మాటలను చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆయన ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రంప్ హెచ్చరికలు చేశారు. భారత్ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది. భారత్, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే భారత్పై 25శాతం సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి అని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను గమనించాం. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్రిటన్తో ఇటీవల కుదుర్చుకున్న ‘ఎఫ్టీఏ’ సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే.. ఈ వ్యవహారంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని ఓ ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో ట్రంప్ రష్యాకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. మరో 10, 12 రోజుల్లో శాంతి ఒప్పందానికి పుతిన్ గనుక ముందుకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ ‘అల్టిమేటం గేమ్’ యుద్ధానికి దారి తీస్తుందని దిమిత్రి మెద్వెదేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అయిన మెద్వెదేవ్.. ప్రస్తుతం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్కు డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. ట్రంప్ జారీ చేసే ప్రతీ అల్టిమేటం యుద్ధం వైపునకు అడుగుగా మారుతుంది. ఇది ఉక్రెయిన్ రష్యా మధ్య కాదు.. అమెరికాతోనే అంటూ సోషల్ మీడియాలో ఆయన ఓ ఘాటు పోస్ట్ చేశారు. -
వణికిస్తున్న సునామి.. మానవ వినాశనం తప్పదా?
-
వణుకుతున్న రష్యా, జపాన్
-
రింగ్ ఆఫ్ ఫైర్
ప్రకృతి ఓ దెయ్యంలా మెల్లగా ఒళ్లు విరుచుకుని అలా సాగర జలాల్లోకి కాలు పెట్టింది...! అంతే తీరాన్ని తుత్తునియలు చేసేలా అలలు మిన్నంటి మరీ ఎగిసిపడ్డాయి. ఆ ధాటికి భూమి ఉలిక్కిపడింది. రష్యాను ఠారెత్తించిన బలమైన భూకంపం, ఆ వెంటనే విరుచుకుపడ్డ సునామీ హడలెత్తించాయి. ప్రపంచపు మోకాలిగా చెప్పదగ్గ ఆ రహస్య ప్రాంతంలో పుట్టిన మంటలు, ప్రకంపనలతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఆ ప్రాంతమే ‘రింగ్ ఆఫ్ ఫైర్’. అగ్నిపర్వతాలు ఎందుకు అక్కడే ఉప్పొంగుతాయి? భూకంపాలు ఎందుకు అక్కడే ఠంచనుగా ప్రతి వారం సంభవిస్తాయి? ఈ వలయం, దాని తాలూకు విలయం వెనక దాగున్న రహస్యం ఏమిటి?సైలెంట్ కిల్లర్మౌనంగా కనిపించే మృగాలే మహా ప్రమాదకరం. రింగ్ ఆఫ్ ఫైర్లోని అగ్నిపర్వతాలు కూడా ఆ బాపతే. చూసేందుకు నిద్రాణంగా కనిపిస్తాయి కానీ, భూమి లోతుల్లో మంటలు ముదిరిన ప్రతిసారీ ఆ మౌనం పెను శబ్దంగా మారుతుంది. కొన్నిసార్లు విస్ఫోటనంలా బయటపడుతుంది. రష్యాలోని కమ్చా తీరంలో ఎగిసిపడి, ఇటు జపాన్తీరాన్ని కూడా తాకిన ఆ రాకాసి అలలకు కారణమదే. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అచ్చం వలయంలా ఉంటుంది. అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రాన్ని అట్టడుగున కప్పేసే అగ్నివలయమిది. ఈ మంటల మార్గం దాదాపు 40 వేల కిలోమీటర్ల పొడవుంటుంది! దక్షిణ అమెరికా కొసన మొదలై ఉత్తర అమెరికా తీరాల దా కొనసాగుతుంది. అటు అలాస్కా ద్వీపాలను తాకి, బేరింగ్ సముద్రం దాటి, జపాన్ మీదుగా ఇటు న్యూజిలాండ్ వరకు వ్యాపించి ఉంది. దక్షిణ ధ్రువంలోని మంచు అగ్నిపర్వతాల వరకు చేరుతుంది. ఈ మార్గంలోని దేశాలు మనకు తెలియని ప్రమాదంతో నిత్యం మందుపాతరపై భయంభయంగా గడుపుతున్నాయి. చిలీ, పెరూ, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, న్యూజిలాండ్... ఇలా ప్రపంచంలోని అతి శక్తిమంతమైన అగ్నిపర్వతాలన్నీ ఈ వలయంలోనే ఉన్నాయి. భూకంపాలు, అగ్ని విస్ఫోటనలూ ఈ ప్రాంతంలోనే ఎక్కువ.పలకల్లో కలకలంరింగ్ ఆఫ్ ఫైర్లో జరుగుతున్నది భూమి లోతుల్లో భూ పలకల పోరాటం. బయటి నుంచి బలంగా, స్థిరంగా కనిపించే భూమి లోలోతుల్లో ఈ భూ పలకలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. అవి పరస్పరం ఢీకొన్నప్పుడు భూమి కంపిస్తుంది. ఒక పలక కిందకి జారితే అక్కడ పెను మంటల్లాంటివి పుట్టుకొస్తాయి. రష్యాలో తాజా భూకంపానికి కారణం కూడా ఇదే. పసిఫిక్ ప్లేట్ తాలూకు ఒక పెద్ద భూ పలకం, ఉత్తర అమెరికా పలకం పరస్పరం ఢీకొన్నాయి. దాంతో భూమి లోతుల్లో ఒత్తిడి పెరిగి భూగోళం అంతటినీ ఊపేసింది. అందుకే కమ్చట్కా తీరంలో ఏకంగా 8.8 తీవ్రతతో నేల వణికిపోయింది. ఆ వెంటనే సముద్రం గర్జించి అలలుగా ఎగిసింది. ఇలాంటివి రింగ్ ఆఫ్ ఫైర్లో నిజానికి నిత్య సన్నివేశాలే.పసిఫిక్కు గుండెకాయ!పసిఫిక్ మహాసముద్రాన్ని ఒక సువిశాల శరీరంగా భావిస్తే రింగ్ ఆఫ్ ఫైర్ను దాని గుండెగా చెప్పొచ్చు. అక్కడే శ్వాస, అక్కడే ధ్వని, అక్కడే మంట! ఈ గుండె ఒక్కసారి గట్టిగా కొట్టుకుందంటే చాలు... రష్యాలో అలలు ఎగసిపడతాయి. జపాన్ తీరాలు వణికిపోతాయి. అలాంటి గుండెపోటు ఇప్పుడు జరుగుతోంది. అదే కమ్చట్కాలో, జపాన్తీరాంలో సునామీ రూపంలో ఎగసిపడింది. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మానవాళికి ఒక శక్తి, ఒక శాపం, ఒక శాస్త్రం. అది ఎప్పుడు, ఎక్కడ మళ్లీ పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. పుట్టిందంటే మాత్రం దాని దెబ్బకు ప్రపంచమంతా విలవిలలాడిపోవాల్సిందే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
25 శాతం సుంకాలు
ప్రభావాన్ని సమీక్షిస్తున్నాం: కేంద్రం భారత్పై 25 శాతం సుంకాల విధింపు, రష్యాతో వర్తకం చేస్తున్నందుకు జరిమానా ప్రకటన తాలూకు ప్రభావాన్ని మదింపు చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇరు దేశాలకూ ఆమోదనీయ, లాభదాయక రీతిలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కట్టుబడి ఉన్నాం. కొద్ది నెలలుగా ఆ దిశగాఅత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి’’అని గుర్తు చేసింది. వీటిలో భాగంగా ఆరో రౌండ్ చర్చల నిమిత్తం అమెరికా బృందం ఆగస్టు 25న భారత్ రానుంది.వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అనూహ్యంగా భారీ టారిఫ్ బాంబు విసిరారు. భారత దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు బాదారు. అంతేగాక వీటికి అదనంగా రష్యాతో వర్తకం చేస్తున్నందుకు భారత్పై ప్రత్యేకంగా జరిమానా కూడా విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆ మొత్తం ఎంత న్నది పేర్కొనలేదు. ఈ నిర్ణయాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ట్రూత్ సోషల్’లో బుధవారం ఈ మేరకు ఆయన పలు పోస్టులు పెట్టారు. అమెరికాతో భారత వర్తక విధానాలు, నిబంధనలను అత్యంత దారుణమైనవిగా అభివర్ణించారు.‘‘భారత్ మా మిత్ర దేశమే. కానీ వర్తక, వాణిజ్య సంబంధాల విషయంలో ఆ దేశంతో అంతా సజావుగా లేదు. అమెరికాపై ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అందుకే ఆ దేశంతో మేం భారీ స్థాయిలో వ్యాపారం చేయడం లేదు’’అని రాసుకొచ్చారు. భారత్తో అమెరికాకు భారీ వర్తక లోటు ఉందని గుర్తు చేశారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకే అదనంగా జరిమానా విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘ఉక్రెయిన్లో జనహననం ఆగాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో అందుకు పాల్పడుతున్న రష్యాతో భారత్ భారీ వాణిజ్య సంబంధాలు నెరుపుతోంది’’అంటూ ఆక్షేపించారు.అదే జరిగితే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు అమెరికా నుంచి జరిమానా ఎదుర్కోనున్న తొలి దేశం భారతే అవుతుంది. భారత్తో వర్తక ఒప్పందం నిమిత్తం అమెరికా బృందం ఆగస్టు 25 నుంచి భారత్లో పర్యటించనుందని కేంద్రం ప్రకటించిన మర్నాడే ట్రంప్ నుంచి అనూహ్యంగా సుంకాల పోటు నిర్ణయం వెలువడటం గమనార్హం. ఈ దెబ్బకు రూపాయి విలువ గత మూడేళ్లలో అత్యధికంగా బుధవారం ఏకంగా 89 పైసలు పతనమైంది. అమెరికా డిమాండ్లకు తలొగ్గేలా భారత్పై ఒత్తిడి పెంచడమే ట్రంప్ ప్రకటన ఉద్దేశమని భావిస్తున్నారు.ఇటీవలి కాలంలో జపాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్పై కూడా ట్రంప్ ఇలాంటి ఒత్తిళ్లే తెచ్చి అమెరికాకు అనుకూలంగా ఒప్పందాలు కుదుర్చుకుందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. గతంలో చైనాపై కూడా ఇలాగే ట్రంప్ అడ్డగోలుగా టారిఫ్లను ప్రకటించడం, చివరికి వెనక్కు తగ్గడం తెలిసిందే. భారత చమురు దిగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న రష్యా వాటా ఉక్రెయిన్తో ఆ దేశం యుద్ధానికి దిగిన అనంతరం ఏకంగా 35 నుంచి 40 శాతానికి పెరిగింది. అయితే ఇప్పటికీ రష్యా నుంచి అతి పెద్ద చమురు దిగుమతిదారుగా చైనాయే నిలుస్తోంది. ఆ దేశంపై మాత్రం ట్రంప్ ఎలాంటి జరిమానాలు విధించలేదు. ట్రంప్ సుంకాల నిర్ణయంపై భారత పరిశ్రమల రంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.ట్రంప్ ప్రకటించిన 25 శాతం సుంకాలు ఇప్పటికే అన్ని దేశాలతో పాటు భారత్పైనా అమల్లో ఉన్న 10 శాతం బేస్లైన్ టారిఫ్లకు అదనమా, కాదా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్ ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచి్చంది. దీనికి అదనంగా స్టీల్, అల్యుమినియం దిగుమతులపై 50 శాతం, ఆటో రంగంపై 25 శాతం అదనపు సుంకాలను కూడా ట్రంప్ విధించారు. ట్రంప్ ప్రకటన వెలువడ్డ కాసేపటికే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ జరిపి పరిస్థితిని సమీక్షించారు. ఏప్రిల్లో 26 శాతం సుంకాలు భారత్తో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని మంగళవారమే ట్రంప్ మీడియాకు చెప్పడం తెలిసిందే. 25 శాతం టారిఫ్ విధించనున్నట్టు అప్పుడే ఆయన సంకేతాలిచ్చారు. 20 నుంచి 25 శాతం దాకా టారిఫ్లు విధిస్తారా అని మీడియా ప్రశ్నించగా, అలాగే భావిస్తున్నట్టు బదులిచ్చారు. గత ఏప్రిల్ 2న భారత్పై 26 శాతం టారిఫ్లను ట్రంప్ ప్రకటించారు. కొద్ది రోజులకే ఆ నిర్ణయం అమలును 90 రోజుల పాటు, అంటే జూలై 9 దాకా, అనంతరం ఆగస్టు 1 దాకా వాయిదా వేశారు. అమెరికా, భారత్ నడుమ వాణిజ్య ఒప్పందం నిమిత్తం అత్యున్నత స్థాయి బృందాల నడుమ ఇప్పటికే ఐదు రౌండ్ల పాటు చర్చలు జరిగాయి. అతి పెద్ద వాణిజ్య భాగస్వామి 2021–25 నడుమ భారత్కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతం. అమెరికాతో భారత్కు 2022–23లో 27.7 బిలియన్లు, 2023–24లో 35.32 బిలియన్లు, 2024–25లో 41 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య మిగులు నమోదైంది. 2024–25లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్ డాలర్ల మేర నమోదైంది. వీటిలో భారత్ 86.5 బిలియన్ డాలర్ల మేర వస్తువులను ఎగుమతి చేయగా, 45.3 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. సేవల రంగంలో అమెరికాకు 28.7 బిలియన్ డాలర్ల మేరకు ఎగుమతులు జరిపింది. 25.5 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతులు చేసుకుంది.మొత్తమ్మీద అమెరికాతో వాణిజ్యంలో భారత్ 44.4 బిలియన్ డాలర్ల మిగులు నమోదు చేసింది. ఇది ట్రంప్కు కంటగింపుగా మారింది. అందుకే ఇలా పదేపదే టారిఫ్ల కత్తి దూస్తున్నారు. 2024లో అమెరికాకు భారత ఎగుమతుల్లో డ్రగ్ ఫార్మూలాలు–బయోలాజికల్స్ (8.1 బిలియన్లు), టెలికాం పరికరాలు (6.5 బిలియన్లు), అరుదైన రాళ్లు (5.3 బిలియన్లు) పెట్రోలియం ఉత్పత్తులు (4.1 బిలియన్లు), వాహనాలు–ఆటో పరికరాలు (2.8 బిలియన్లు), బంగారం–ఇతర లోహాలు (3.2 బిలియన్లు) రెడీమేడ్ దుస్తులు, కాటన్ తదితరాలు (2.8 బిలియన్లు) ఇనుము, స్టీల్ ఉత్పత్తులు (2.7 బిలియన్లు) ప్రధానమైనవి. అమెరికా నుంచి దిగుమతుల్లో ప్రధానంగా చమురు (4.5 బిలియన్లు), పెట్రో ఉత్పత్తులు (3.6 బిలియన్లు), బొగ్గు, కోక్ (3.4 బిలియన్లు), వజ్రాలు (2.6 బిలియన్లు), ఎలక్ట్రిక్ యంత్రాలు (1.4 బిలియన్లు), విమాన, రాకెట్ల విడిభాగాలు (1.3 బిలియన్లు), బంగారం (1.3 బిలియన్లు) ఉన్నాయి. మోదీతో ట్రంప్ స్నేహానికి ఇదీ ఫలం!: విపక్షాల ధ్వజం భారత్పై 25 శాతం టారిఫ్ల విధింపు మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యమేనంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. మోదీతో స్నేహానికి ట్రంప్ ఏ మాత్రమూ విలువ ఇవ్వడం లేదనేందుకు ఇది తాజా నిదర్శనమని ఎద్దేవా చేశాయి. మోదీపై ట్రంప్ తారీఫ్ (పొగడ్తలు), హౌడీ మోడీ వంటి నినాదాలు ఎందుకూ కొరగానివని తేలిపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్లో పేర్కొన్నారు.భారత్–పాక్ యుద్ధాన్ని ఆపానని ట్రంప్ 30సార్లకు పైగా చెప్పుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్కు వైట్హౌస్లో ప్రత్యేక విందు ఇచ్చారు. ఐఎంఎఫ్ నుంచి భారీ ఆర్థిక సహాయ ప్యాకేజీ ఇప్పించారు. ఇన్ని చేస్తున్నా మౌనంగా భరిస్తే బహుశా ట్రంప్ నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తుందని మోదీ ఆశపడ్డారు. కానీ అలా జరగలేదు’’అన్నారు. కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి స్ఫూర్తి పొంది అమెరికా అధ్యక్షుని నిర్ణయాలను దీటుగా ఎదిరించాలని మోదీకి సూచించారు. టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, వామపక్షాలు తదితరాలు కూడా మోదీ ప్రభుత్వానిది ఘోర వైఫల్యమంటూ నిందించాయి. ఇది భారత్కు తీవ్ర అవమానమని అభిప్రాయపడ్డాయి. -
సునామీ ప్రకంపనలు
టోక్యో/మాస్కో/వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యా సమీప పసిఫిక్ మహాసముద్రగర్భంలో జనించిన ప్రళయ భీకర సునామీ రెప్పపాటులో ఆ సముద్ర తీర దేశాలను చివురుటాకులా వణికించింది. సముద్రగర్భ భూకంపం ధాటికి ఉద్భవించిన రాకాసి అలలు క్రూరంగా తీరపట్టణాలపై విరుచుకుపడ్డాయి. రిక్టర్స్కేల్పై 8.8 తీవ్రతతో మొదలైన భూ ప్రకంపనలు తీర దేశాల్లోని కోట్లాది మంది ప్రజలను ప్రాణభయంతో పరుగులు పెట్టించాయి. భవనాలు పేకమేడల్లా కూలుతాయన్న భయంతో ఇప్పటికే లక్షలాది మంది తీరప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఆగకుండా ప్రకంపనలు ఉధృతస్థాయిలో రావడంతో భవనాలు కొన్ని నిమిషాలపాటు ఊగిపోయాయి. తీర ప్రాంతాల్లోకి సముద్రపునీరు ఊహించనంతగా కొట్టుకొచ్చింది. రష్యా తూర్పున సుదూరంగా ఉన్న కామ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్సక్–కామ్చాట్స్కీ నగర సమీపంలో ఈ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రష్యాలో బుధవారం ఉదయం 11.24 గంటలకు పసిఫిక్ మహాసముద్రగర్భంలో 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అమెరికా జియాలజికల్ సర్వే సంస్థ ప్రకటించింది. కామ్చట్కా పరిధిలో కొన్ని చోట్ల అలలు ఏకంగా 20 అడుగుల ఎత్తులో దూసుకొచ్చి తీరంలో పెను విలయం సృష్టించాయని రష్యా సోషనాలజీ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. సివిరో కురిల్సŠక్ తీరపట్టణంపై 14 అడుగుల ఎత్తైన రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. తీరంలోని నిర్మాణాలను సర్వనాశనం చేశాయి. రష్యా మొదలు జపాన్, అమెరికా, హవాయి, న్యూజిలాండ్, చిలీ, కొలంబియా దాకా సమీపంలోని అన్ని దేశాలను సునామీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆయా దేశాల ప్రభుత్వాలు ఇచ్చిన సునామీ హెచ్చరికలతో తీరప్రాంతాల్లోని ప్రజలంతా ప్రాణభయంతో ఎత్తైన ప్రదేశాలు, బీచ్లకు దూరంగా ఉన్న పచ్చికబయళ్లకు పరుగులు తీశారు. ప్రకంపనలకు తాము ఉంటున్న భవనాలు ఊగిపోవడంతో కొందరు భయంతో కిటికీల నుంచి బయటకు దూకి గాయాలపాలయ్యారు. అమెరికాలోని హోనలూనూ సిటీలో జనం ఒక్కసారిగా కార్లతో వేరే చోట్లకు తరలిపోవడంతో రహదారులన్నీ ట్రాఫిక్తో స్తంభించిపోయాయి. ద్వీప రాష్ట్రం హవాయీలో పలుచోట్ల సునామీ సైరన్లు మోగించారు. భూ ప్రకంపనలు జపాన్ తీరాలను తాకినా ఆ దేశంలోని అణువిద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అంతర్జాతీయ అణుఇంధన సంస్థ స్పష్టంచేసింది. సాధారణంగా భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనల తీవ్రత అత్యల్పంగా ఉంటుంది. కానీబుధవారం సంభవించిన పెను భూకంపం ధాటికి ఆ తర్వాత వచ్చే ప్రకంపనలు సైతం 6.9 తీవ్రతతో విస్తరించడం గమనార్హం. సునామీ తర్వాత పలు దేశాల బీచ్లు నిర్మానుష్యంగా మారాయి.1900 ఏడాది నుంచి సంభవించిన భారీ భూకంపాలు→ 1960 చిలీ దేశంలోని బియబియో (రిక్టర్ స్కేల్పై 9.5 తీవ్రత)→ 1964 అమెరికాలోని అలాస్కా(రిక్టర్ స్కేల్పై 9.2 తీవ్రత)→ 2011 జపాన్లోని తొహోకూ (రిక్టర్ స్కేల్పై 9.1 తీవ్రత)→ 2004 ఇండోనేసియాలోని సుమత్రా (రిక్టర్ స్కేల్పై 9.1 తీవ్రత)→ 1952 రష్యాలోని కామ్చట్కా (రిక్టర్ స్కేల్పై 9 తీవ్రత)→ 2025 రష్యాలోని కామ్చట్కా (రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత)→ 2010 చిలీలోని బియోబియో (రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత)→ 1906 ఈక్వెడార్లోని ఎస్మిరాల్డాస్ (రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత)→ 1965 అమెరికాలోని అలాస్కా (రిక్టర్ స్కేల్పై 8.7 తీవ్రత)→ 2012 ఇండోనేసియాలోని సుమత్రా (రిక్టర్ స్కేల్పై 8.6 తీవ్రత)బద్దలైన అగ్నిపర్వతంభూకంపం సంభవించినప్పుడే రష్యాలోని కామ్చట్కా పరిధిలోని కిచెవ్స్కయా సోప్రా అగ్నిపర్వతం బద్దలైంది. ఉత్తరార్థ గోళంలోనే అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన ఈ అగ్నిపర్వతం బద్దలవడంతో అందులోంచి భారీ స్థాయిలో లావా ఎగజిమ్మింది. పలు పేలుళ్లు సైతం వినిపించాయని రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని జియోఫిజికల్ విభాగం ప్రకటించింది. పలు దేశాల్లో ప్రకంపనలు తీవ్రస్థాయిలో సంభవించినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కొన్ని దేశాలు అత్యధిక స్థాయి సునామీ హెచ్చరికలు జారీచేసి తర్వాత పెనుప్రమాదం లేదని తెలిశాక ఉపసంహరించుకున్నాయి.అయినా సర్జరీ ఆగలేదు...రష్యాలోని కామ్చట్కా ప్రాంతంలో భూకంపం వచ్చినప్పుడే అక్కడి ఒక ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లో శస్త్ర చికిత్స జరుగుతోంది. కాళ్ల కింద నేల కదులుతున్నా వైద్యులు ఏమాత్రం జంకకుండా జాగ్రత్తగా సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు. సంబంధింత వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఆపరేషన్ థియేటర్లోని రోగి పడుకున్న స్ట్రెచర్ను సహాయక సిబ్బంది గట్టిగా పట్టుకోవడం, వైద్యులు సర్జరీని కొనసాగించడం ఆ వీడియోలో రికార్డయింది. దీంతో ఆపత్కాలంలోనూ వైద్యులు చూపిన వృత్తి నిబద్ధతను మెచ్చుకుంటూ పలువురు సామాజికమాధ్యమాల్లో కామెంట్లు పెట్టారు. -
భారత్పై అమెరికా సుంకాల మోత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాల మోత మోగించారు. భారత్పై 25శాతం సుంకాలే కాదు అదనంగా పెనాల్టీ విధించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్ బాంబ్ పేల్చారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ఆట్వీట్లో భారత్పై టారిఫ్తో పాటు అదనంగా జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సుంకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. భారత్ మాకు మిత్రుడే అయినప్పటికీ అత్యధిక దిగుమతి టారిఫ్లు, కఠినమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయని విమర్శించారు. భారత్.. రష్యా నుంచి భారీగా ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తుంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నిర్ణయం హేయమైన చర్య’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ మా స్నేహ దేశమే. కానీ వారు ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకటి. రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు గాను 25శాతం టారిఫ్తో పాటు పెనాల్టీ కూడా చెల్లించాల్సిందేనని ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. -
Tsunami waves: చరిత్రలోనే అత్యంత ఎత్తైన సునామీ
సునామీ.. 2004 డిసెంబర్ 26వ తేదీన హిందూ మహాసముద్ర తీర దేశాల్లో విధ్వంసం సృష్టించే దాకా ఈ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. తాజాగా రష్యాలో సంభవించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఫసిఫిక్ తీరంలోని 30 దేశాలు గజగజ వణికిపోతున్నాయి. రాకాసి అలలు తీర ప్రాంతాలను ఇప్పటికే పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో చరిత్ర ఇప్పటిదాకా చవిచూసిన శక్తివంతమైన సునామీ ఏదో చూద్దాం.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్.. భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం. ఈ రీజియన్లో ఉన్న రష్యా కామ్చట్కా ద్వీపకల్పం వద్ద రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత భూకంపం సంభవించి.. పసిఫిక్ తీర దేశాల అంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్, అలాస్కా, హవాయి వంటి ప్రాంతాల్లో అలలు 3-4 మీటర్ల(9-13 అడుగుల) ఎగసిపడ్డాయి. ప్రపంచంలో ఇప్పటిదాక సంభవించిన శక్తివంతమైన భూకంపాల లిస్ట్లో.. ఇవాళ్టి రష్యా భూకంపానికి ఆరో స్థానం దక్కింది. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సునామీల జాబితాను ఓసారి పరిశీలిస్తే.. 2004.. ఇండోనేషియా (సుమాత్రా)లో సంభవించిన 9.1 తీవ్రత భూకంపం. ఈ భూకంపం ధాటికి సునామీ 13 దేశాల తీరాలను ముంచెత్తి 2,30,000 మందిని బలిగొంది. 2011.. 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం జపాన్ (టోహోకు) తీరాన్ని ముంచెత్తించింది. ఈ ధాటికి ఫుకుషిమా అణు ప్రమాదం సంభవించడంతో పాటు 18,500 మంది మృతి చెందారు. 1960.. చిలీ (వాల్డివియా) 9.5 తీవ్రతతో భూకంపం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. ఈ ప్రభావం పసిఫిక్ మహాసముద్రం అంతటా కనిపించింది. 1883.. ఇండోనేషియా (క్రాకటోవా) అగ్నిపర్వత విస్ఫోటనం ధాటికి బారీ అలలు ఎగసిపడ్డారు. మొత్తం 36,000 మంది మృతి చెందారు. ఈ పేలుడు శబ్దం.. 4,800 కిలోమీటర్ల దూరం దాకా వినిపించింది!!.సునామీ అనేది జపనీస్ భాషకు చెందింది. దానికి అర్థం హార్బర్ కెరటం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి.సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్తో ఇది సమానం.ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి. 1896.. జపాన్ (సాన్రికు)లో 8.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 125 అడుగుల అలలు ఎగసిపడ్డాయి. ఈ సునామీ ధాటికి 22,000 మంది మృతి చెందారు. ఈ సునామీ ప్రభావంతో.. హవాయిలో 25 అడుగుల ఎత్తు మేర అలలు ఎగసిపడ్డాయి. చరిత్రలోనే అత్యంత ఎత్తైన సునామీ(Mega Tsunami).. 1958 అలాస్కా (లిటుయా బే)లో జులై 9వ తేదీన సంభించింది. రిక్టర్ స్కేల్పై 7.8 నుంచి 8.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి.. 914 మీటర్ల (3000 అడుగుల) నుంచి కొండచరియలు విరిగిపడ్డాయి. 90 మిలియన్ల టన్నుల రాళ్లు ఒక్కసారిగా గిల్బర్ట్ ఇంటెల్ ఉపనదిలోకి పడిపోయాయి. దీంతో ఓ పెద్ద కొండ ఎత్తు మేర నీరు అలలాగ ఎగసిపడింది. సుమారు 1,720 అడుగుల (524 మీటర్లు) అల.. లిటుయా బేను ముంచెత్తింది. ఇది న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే ఎక్కువ!. ఇదే ప్రాంతంలోని లిథుయా గ్లేసియర్ (Lituya Glacier) వద్ద కొంత మంచు కూడా విరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల వివరాలు చెబుతున్నప్పటికీ.. ప్రధాన అలను ఏర్పరచినది రాళ్ల పతనం మాత్రమే. అయితే ఇక్కడ జనసాంద్రత.. అదీ ఆ సమయంలో తక్కువగా ఉండేది. అందుకే మెగా సునామీ ముంచెత్తినా కేవలం ఐదుగురే మరణించారు. వీళ్లంతా పడవలో ప్రయాణిస్తుండగా మృత్యువాత పడ్డారు. అయితే మరో ఇద్దరు అనూహ్యంగా ఈ విలయం నుంచి ప్రాణాలతో బయటపడడం గమనార్హం. 1868.. పెరూ(చిలీ) 8.5 తీవ్రత భూకంపంతో సునామీ ముంచెత్తి 25,000 మందిని బలిగొంది. ఇది కూడా హవాయిపై ప్రభావం చూపెట్టింది. 1755.. పోర్చుగల్ (లిస్బన్)లో 8.5–9.0 భూకంపం సంభవించింది. 3 నుంచి 6 నిమిషాలపాటు భూమి కంపించింది. 40 నిమిషాల తర్వాత.. భారీ అలలతో అట్లాంటిక్ మహాసముద్రం అల్లకల్లోలంగా మారింది. సునామీ ముంచెత్తడంతో 50,000 మంది మృతి చెందారు. యూరోప్ అంతటా, అలాగే కరేబియన్ దీవులు, బ్రెజిల్ను ఈ సునామీ ప్రభావం తాకింది. ఈ భూకంప సునామీ చరిత్రలోనే తత్వవేత్తల రచనలతో.. అత్యంత విధ్వంసకరమైన ప్రకృతి విపత్తుగా నిలిచిపోయింది ఇది. -
జపాన్ జ్యోతిష్యం నిజమైంది... సునామి వచ్చేసింది!!!
-
tsunami: తీరానికి కొట్టుకొస్తున్న భారీ తిమింగలాలు
టోక్యో: జపాన్ను సునామీ తాకింది. బుధవారం రష్యా తీరంలో 8.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కురిల్ దీవులు, జపాన్లోని హక్కైడో తీరప్రాంతాలలో సునామీకి కారణంగా నిలిచింది. అమెరికాలోని కాలిఫోర్నియా, అలాస్కా, హవాయి న్యూజిలాండ్ వైపు ఉన్న ఇతర తీరాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.జపాన్ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం తూర్పు తీరంలోని ఇషినోమాకి ఓడరేవును 50 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ తాకింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత పెద్దదయిన అల. పసిఫిక్ తీరం వెంబడి దక్షిణానికి, హక్కైడో నుండి టోక్యోకు, పలు ఈశాన్య ప్రాంతాలకు సునామీ కదులుతున్నప్పుడు 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఏర్పడ్డాయి. ఇటువంటి భారీ అలలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. JUST IN: At least 4 whales have washed up along the coast of Japan, hours after 8.8 earthquake pic.twitter.com/t9siMZDHFS— BNO News Live (@BNODesk) July 30, 2025భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత సునామీ తాకిడికి జపాన్ తీరం వెంబడి నాలుగు భారీ తిమింగలాలు కొట్టుకువచ్చాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. అలలు ముందుకు వెనుకకు కదులుతుండగా తీరం వెంబడి వస్తున్న తిమింగలాలకు సంబంధించిన వీడియోను బీఎన్ఓ న్యూస్ షేర్ చేసింది.సునామీ అలలు సాధారణ అలల కంటే బలంగా ఉంటాయని, ఈ విధంగా వచ్చే 50 సెం.మీ. అల 200 కిలోల వరకు శక్తిని మోయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టోక్యో విశ్వవిద్యాలయ భూకంప శాస్త్రవేత్త సకాయ్ షినిచి మీడియాతో మాట్లాడుతూ గతంలో వచ్చిన శక్తివంతమైన భూకంపాల ఫలితంగా సంభవించిన సునామీలు జపాన్కు భారీ నష్టాన్ని కలిగించాయన్నారు. ఇప్పుడొచ్చిన భూకంపం 1952 నాటి భూకంపాన్ని పోలి ఉంని అన్నారు. -
tsunami warning: ‘బీచ్ రోడ్డులో భీకర ట్రాఫిక్.. బిడ్డతో 13వ అంతస్థు సేఫ్’
మాస్కో: రష్యా తీరంలో బుధవారం 8.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిన అనంతరం రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని హక్కైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. అలాస్కా, హవాయి, న్యూజిలాండ్కు దక్షిణాన ఉన్న తీరాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇంతటి భయానక పరిస్థితుల నేపధ్యంలో హవాయిలోని హోనోలులులో తన ఇంటి వదిలి వెళ్ళడానికి తాను ఎందుకు నిరాకరిస్తున్నానో వివరించే టిక్టాక్ వీడియోను ఒక మహిళ షేర్ చేసింది.సునామీ హెచ్చరికల నేపధ్యంలో సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు తన పసిబిడ్డను ఎత్తుకుని 15 నుండి 20 నిమిషాలు నడవాల్సి ఉంటుందని షెల్బీ కె బ్లాక్బర్న్ అనే మహిళ తన టిక్టాక్ వీడియోలో వివరించింది. సునామీ తాకనున్నదనే భయంతో స్థానికులు, సందర్శకులు హవాయి నుంచి అలా వే హార్బర్, వైకికి, ఓహులకు కార్లలో చేరుకునే ప్రయత్నంలో ట్రాఫిక్లో చిక్కుకున్నారని షెల్బీ కె బ్లాక్బర్న్ తెలిపింది. ఈ ట్రాఫిక్లో చిక్కుకునే బదులు తన ఇంటిలోనే ఉండటం సురక్షితమని భావిస్తున్నట్లు ఆమె పేర్కొంది. MOTHER AND DAUGHTER WAIT IN WAIKIKI CONDO AS TSUNAMI APPROACHES“I don’t want to risk leaving with my daughter,” she says as sirens blare across Hawaii.Waikiki Beach is in the path. The clock is ticking.This is real. Pray for everyone still there. pic.twitter.com/ttfcFcerYm— HustleBitch (@HustleBitch_) July 30, 2025షెల్బీ తన వీడియోలో తాను బీచ్కు చాలా దూరంలోని బహుళ అంతస్థుల భవనంలోని 13వ అంతస్తులో ఉన్నానని తెలిపింది. తనకు కారు లేదని, ఏదో ఒక కారులో బయలుదేరాలనుకున్నా, బీచ్ నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న వారితో వీధులు పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలంటే, కుమార్తెను ఎత్తుకుని 20 నిమిషాలు నడవాలని ఆమె వివరించింది. అందుకే ఇక్కడే ఉండటం మంచిదని భావిస్తున్నానని షెల్బీ పేర్కొంది. బీచ్కు దూరంగా ఎత్తుగా ఉన్న తానుంటున్న భవనం సురక్షితమేనని అనుకుంటున్నానని, ఇరుగు పొరుగువారు కూడా పై అంతస్తులకు చేరుకుంటున్నారని ఆమె తెలిపింది. ఈ పరిస్థితులను ఆమె వీడియోలో చూపించింది. -
దూసుకొచ్చిన సునామీ.. లక్షల మంది..!
-
Earthquake: రష్యా లో భారీ భూకంపం
-
భారీ భూకంపంతో వణికిన రష్యా.. 8.7 తీవ్రత నమోదు
మాస్కో: రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. రాబోయే మూడు గంటల్లో రష్యా, జపాన్ తీరప్రాంతాలకు విధ్వంసక సునామీ అలలు చేరుకోవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. భూకంప ప్రభావిత ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. 🚨 BREAKING: Tsunami waves from the 8.7 magnitude earthquake have begun slamming RussiaBuildings are already being swept awayTsunami waves are also heading to Hawaii, expected to arrives within hours pic.twitter.com/dPg72zln9N— Nick Sortor (@nicksortor) July 30, 2025భూకంప తీవ్రతకు భవనాల లోపల జరిగిన కంపనలు ఆ వీడియోలలో కనిపిస్తున్నాయి. ఒక వీడియోలో భూకంపం సంభవించిన సమయంలో అపార్ట్మెంట్లోని ఫర్నిచర్ తీవ్రంగా ఊగిపోవడాన్ని గమనించవచ్చు. Videos are pouring in showing VIOLENT SHAKING from the MASSIVE M8.8 Earthquake off Kamchatka, RUSSIA! pic.twitter.com/zwx1jbhx0y— RT (@RT_com) July 30, 2025రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి అతి సమీపంలో ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు నేపధ్యంలో జపాన్ వాతావరణ విభాగం రష్యా తీరం వెంబడి సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ కాలమానం ప్రకారం ఈ భూకంపం బుధవారం ఉదయం 8:25 గంటలకు సంభవించింది.#BREAKING Yuzhno-Sakhalinsk, Russia 8.7 Earthquake - 46 Miles deep in the Ocean ALL OF THE WEST COAST IS UNDER TSUNAMI WARNING - We will know soon if the bouys pick up the TSUNAMI level soon hereMillions of people could end up evacuating depending how this goes.Hard to… pic.twitter.com/w54KXkE3If— MəanL¡LMə♡₩ (@MeanLILMeoW) July 30, 2025Breaking right now..Earthquake near Russia 8.7 magnitude and a tsunami alert has been spread to Alaska, Japan, and Russia..Developing story here as information is just coming out now..Prayers for all in its wake..🙏🙏🙏pic.twitter.com/aaTokSE7OQ— Chris from Massachusetts AKA TommyboyTrader (@autumnsdad1) July 30, 2025ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. జపాన్లోని నాలుగు దీవులకు ఉత్తరాన ఉన్న హక్కైడోకు ఈ భూకంప కేంద్రం 250 కిలోమీటర్లు (160 మైళ్ళు) దూరంలో ఉందని సమాచారం. జపాన్కు చెందిన ఎన్హెచ్కే టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది స్వల్ప ప్రభావమే చూపిందని తెలుస్తోంది. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 12 మైళ్ల లోతులో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే కమ్చట్కాలో ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే సంగతిని రష్యా ఇంకా వెల్లడించలేదు. కాగా హవాయికి దీపానికి రష్యా సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఇది తక్కువ ముప్పు కలిగిన అలర్ట్ అని తెలుస్తోంది. టోక్యో భూకంప శాస్త్రవేత్త షినిచి సకాయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూకంపం జపాన్ను తీవ్రంగా ప్రభావితం చేసే సునామీకి కారణంగా నిలవనున్నదని అంచనా వేశారు. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. ఈ ప్రాంతంలో ఈ నెల ప్రారంభంలోనే ఐదు భారీ భూకంపాలు- 7.4 తీవ్రతతో సంభవించాయి. అతిపెద్ద భూకంపం 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో ఇది తన ప్రభావాన్ని చూపింది. 1952,నవంబర్ 4న కమ్చట్కాలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆందోళన కలిగించింది. నాడు హవాయిలో 9.1 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
‘ ఇక్కడ ఉంది రష్యా.. ఇజ్రాయిల్, ఇరాన్ కాదు’
వాషింగ్టన్: ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాలని రష్యాకు అమెరికా ఇచ్చిన డెడ్లైన్పై ఇప్పుడు ఆ రెండు(అమెరికా-రష్యా) దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్లో రష్యా సృష్టిస్తున్న రక్తపాతాన్ని ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువును యూఎస్ రిపబ్లిక్ సెనేటర్ లిండే గ్రాహం గుర్తు చేశారు. ట్రంప్ గడువును రష్యా సీరియస్గా తీసుకున్నట్లు కనబడుటం లేదు. గడువు సమీపిస్తోంది. దీనిపై రష్యా స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయంపై రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆ దేశ అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడైన దిమిత్రి మెద్వెదేవ్ తీవ్రంగా స్పందించారు. లిండే గ్రాహం చేసిన ట్వీట్ను కోడ్ చేస్తూ మెద్వెదేవ్ కౌంటరిచ్చారు. To those in Russia who believe that President Trump is not serious about ending the bloodbath between Russia and Ukraine:You and your customers will soon be sadly mistaken. You will also soon see that Joe Biden is no longer president.Get to the peace table. https://t.co/IRWk9I0Ljf— Lindsey Graham (@LindseyGrahamSC) July 28, 2025 ఇక్కడ అమెరికా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రష్యాతో ట్రంప్ అల్టిమేటం గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ ఉంది రష్యా.. ఇజ్రాయిలో లేక ఇరాన్ దేశమో కాదు. 50 రోజులు లేదా 10... అని కాదు 2 విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రతి అల్టిమేటం ముప్పు యుద్ధం వైపు అడుగు అనే విషయం ట్రంప్ గుర్తుంచుకోవాలి. ట్రంప్ చేస్తున్నది రష్యాపైనో, ఉక్రెయిన్ పైనో యుద్ధం కాదు. వేరే పరిణామాలకు దారి తీయొచ్చు(మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని సంకేతాలిస్తూ) ’ అంటూ ఘాటుగా స్పందించారు మెద్వెదెవ్.రష్యాకు 50 రోజుల సమయమేఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు భారీ సుంకాలు ముప్పుతో హెచ్చరించారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం( జూలై 14) నాడు హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్లు చవిచూస్తుంది. ఆ టారిఫ్లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్లో నాటో చీఫ్ మార్క్ రూట్ను కలిసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త ఘాటుగా స్పందించారు. -
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల భయం.. నేవీ వేడుకలను తగ్గించుకున్న రష్యా
మాస్కో: ఉక్రెయిన్ డ్రోన్ దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో రష్యా తన నేవీ డే వేడుకలపై కోత పెట్టింది. భద్రతాపరమైన ఆందోళనలతో బాల్టిక్ సముద్ర తీరంలోని సెయింట్ పీటర్స్బర్గ్, కలినిన్ గ్రాడ్లలో, సుదూర తూర్పు తీర నౌకాశ్రయంలో వార్షిక నేవీ డే ఉత్సవాల సందర్భంగా ఆదివారం చేపట్టాల్సిన యుద్ధ నౌకల పరేడ్లను రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని రష్యా అధికారులు తెలిపారు. సొంత నగరం సెయింట్ పీటర్స్బర్గ్లోని నేవీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు పుతిన్ స్వయంగా హాజరు కావాల్సిన జరిగే కార్యక్రమాలను సైతం రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ధ్రువీకరించారు. అన్ని రకాల పరిస్థితులను బేరీజు వేసుకున్నాకే ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. భద్రతకు మించింది మరేది లేదని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాలపైకి ఉక్రెయిన్ ప్రయోగించిన 99 డ్రోన్లను కూల్చినట్లు ఆదివారం రక్షణ శాఖ తెలిపింది. వీటిలో సెయింట్ పీటర్స్బర్గ్ నగరంపైకి వచ్చినవి కూడా ఉన్నాయంది. లెమొనొసోవ్ ప్రాంతంలో డ్రోన్ శకలాలు పడి ఒక మహిళ గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. డ్రోన్ల భయంతో సెయింట్ పీటర్స్బర్గ్లోని పుల్కొవో ఎయిర్పోర్టు అధికారులు ఆదివారం ఉదయం డజన్ల కొద్దీ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్నారు. యుద్ధ నౌకలను నిర్మించడంతోపాటు నేవీ శిక్షణను వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. -
రష్యాలో కూలిపోయిన అంగారా ఎయిర్ లైన్స్ విమానం
-
చైనా సరిహద్దుల్లో రష్యా విమానం అదృశ్యం
-
బాలీవుడ్ సాంగ్కు చిన్నారుల స్టెప్స్ అదుర్స్.. ఆ కెమెరా మేన్ ఉన్నాడే..!
సోషల్మీడియాలో ఒక ఇంట్రస్టింగ్ వీడియో హల్చల్ చేస్తోంది. రష్యాకు చెందిన చిన్నారులు బాలీవుడ్ సూపర్స్టార్ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అడింకా మాండరింకా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 2.4 కోట్ల వీక్షణలను సంపాదించింది.అమీర్ ఖాన్ , కాజోల్ నటించిన ఫనా (2006) చిత్రం నుండి 'చందా చమ్కే' పాటకు రష్యాకు చెందిన చిన్నారులు అద్భుతంగా స్టెప్పులేశారు. చక్కటి హావభావాలు, అద్భుతమైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అందమైన ఎరుపు లెహంగాలు ధరించిన చిన్నారుల బృందం పాటలోని ప్రతి బీట్ను క్యాచ్ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసేలా చేశారు. సో క్యూట్ ఎంత బాగా చేశారో, మంచి డ్యాన్సర్లు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే! View this post on Instagram A post shared by Adinka Mandarinka (@adina_madikyzy)అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. చిన్నారుల డ్యాన్స్ వీడియోను రికార్డ్ చేసిన 'కెమెరామెన్' పై ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తాయి. అతని కెమెరా యాంగిల్స్పై నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. చక్కటి వీడియోను పాడు చేసేశాడు అంటూ కమెంట్ చేశారు.ఇవీ చదవండి: జిమ్కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్ లుక్ వైరల్ పొంగల్లో పురుగు : మరో వివాదంలో రామేశ్వరం కెఫే -
ఆఖరి నిమిషంలో కూలిన విమానం
మాస్కో: ల్యాండింగ్ విఫలంకావడంతో మళ్లీ గాల్లోకి లేచి మరోసారి ల్యాండింగ్ కోసం గాల్లో చక్కర్లు కొడుతున్న 50 ఏళ్ల పాత రష్యా విమానం ఒకటి అనూహ్యంగా కొండప్రాంతంలో కూలిపోయింది. రష్యాలోని చైనా సరిహద్దుల్లోని మారుమూల అమూర్ రీజియన్లోని టిండా పట్టణ సమీపంలో ఈ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కుప్పకూలిన విమానం నుంచి చెలరేగిన మంటల్లో విమానంలోని వారంతా అగ్నికి ఆహుతయ్యారు. మొత్తం 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారు. టిండా విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలో గురువారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. రష్యా శివారు అమూర్ రీజియన్ గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోవియట్ కాలంనాటి అంగారా ఎయిర్లైన్స్ ఆంటోనోవ్ ఏఎన్24 విమానం ఖబరోవ్సŠక్ నుంచి బ్లాగోవెచెన్సక్ సిటీకి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం మార్గమధ్యంలో టిండా పట్టణంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ల్యాండింగ్కు ప్రయత్నించగా అది సాధ్యంకాలేదు. దీంతో మళ్లీ గాల్లోకి లేచి మరోసారి ల్యాండింగ్ కోసం ఆకాశంలో అలా చుట్టూ తిరిగి వస్తోంది. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్కు 15 కిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతంపై ఎగురుతుండగా హఠాత్తుగా రాడార్ల నుంచి అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రం నుంచి ఈ విమానానికి సంబంధాలు తెగిపోయాయి. వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి ఎంఐ–8 హెలికాప్టర్తో గాలింపు చేపట్టగా సమీప కొండప్రాంతంలో విమానం శకలాలు కనిపించాయి. ప్రమాదానికి అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం అదుపుతప్పి నేలరాలి ఉంటుందని స్థానిక ఇంటర్ఫ్యాక్స్ న్యూస్ఏజెన్సీలో కథనాలు వెలువడ్డాయి.🚨 JUST IN: Aerial footage shows the wreckage of the crashed An-24 in Russia’s Amur Region.Civil Defense confirms: no survivors found.The plane was carrying nearly 50 people.🎥👇 #Russia #PlaneCrash #An24 #Breaking pic.twitter.com/LyXWnBmRa9— Depin Bhat (@DepinBhat) July 24, 2025#BREAKING: Russian plane missing with about 50 people on board.the plane, operated by the Angara airline, was headed for the town of Tynda in the Amur region bordering China.#Russia #PlaneMIssing #AngaraAirline #An24 #China #RussianPlane #aviation #aviationnews pic.twitter.com/RQVKxlfKOM— upuknews (@upuknews1) July 24, 2025 దుర్ఘటనలు:2011: Flight 9007 – ఇన్-ఫ్లైట్ ఇంజిన్ ఫైర్ వల్ల ఒబీ నదిలో విమానం కూలి ఏడుగురు చనిపోయారు2019: Flight 200 – టేకాఫ్ తర్వాత ఇంజిన్ ఫెయిల్యూర్ జరిగి ఓ బిల్డింగ్ను ఢీకొని అగ్నిప్రమాదం సంభవించింది. ఇద్దరు సిబ్బంది ఈ ఘటనలో చనిపోయారు.2025, జులై 24న: ఏ24 ఫ్లయిట్- గమ్యస్థానానికి కొద్దికిలోమీటర్ల దూరంలో ఉండగా తెగిపోయిన సిగ్నల్స్.. కాసేపటికే ప్రమాదం.. విమానంలోని 43 మంది మరణించినట్లు తెలుస్తోంది. -
మిగ్-21.. ‘రష్యన్’ యుద్ధ విమానానికి వీడ్కోలు!
మిగ్-21 యుద్ధ విమానాలు.. ఇవి రష్యన్ ఫైటర్ జెట్స్. ఒకప్పుడు యుద్ధాల్లో భారత్ విజయానికి బాటలు పరిచిన మిగ్స్.. పిట్టల్లా నేల కూలి, ఎందరో పైలట్ల ప్రాణాలు తీసి ‘ఎగిరే శవపేటికలు’ గానూ అపకీర్తి మూటగట్టుకున్నాయి. 60 ఏళ్లపాటు మనల్ని కంటికి రెప్పలా కాపాడిన మిగ్-21 విమానాలు ఇక భారత నేలను ముద్దాడి ఈ మట్టిపైనే శాశ్వత విశ్రాంతి తీసుకోబోతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు కల్లా మిగ్-21 యుద్ధ విమానాలను విడతలవారీగా సేవల నుంచి తప్పించాలని, దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్ మార్క్-1ఎ’ను వాటి స్థానంలో మోహరించాలని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) భావిస్తోంది.భారత్ వద్ద ప్రస్తుతం 36 మిగ్-21లు ఉన్నాయి. వీటిలో చివరి వేరియంట్ అయిన ‘బైసన్’ను ఇప్పుడు సేవల నుంచి తొలగించనున్నారు. మనకు మిగ్-21 సేవలు 1963లో తొలిసారి ప్రయోగాత్మకంగా మొదలయ్యాయి. అప్పటినుంచి రష్యన్ సుఖోయ్ ఎస్యు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు భారత్ చేతికి అందే వరకు కొన్ని దశాబ్దాల పాటు భారత వైమానిక దళానికి మిగ్-21 వెన్నెముకగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఇటు రక్షణ పరంగానూ, అటు ప్రత్యర్థులపై దాడుల పరంగానూ మన వైమానిక దళానికి గగనతలంలో స్పష్టమైన ఆధిపత్యం కట్టబెట్టింది ఈ యుద్ధ విమానమే.సోవియట్ కాలంలో తయారీ!సోవియట్ యూనియన్ హయాంలో మికోయాన్-గురెవిచ్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన మిగ్-21 ఫైటర్ జెట్ తొలిసారిగా రెక్కలు విప్పుకుని 70 ఏళ్ల క్రితం 1955లో ఆకాశంలో రివ్వున ఎగిరింది. శక్తిమంతమైన ‘తుమన్ స్కై ఆర్-25’ టర్బోజెట్ ఇంజిన్ సాయంతో ఈ విమానం ధ్వని వేగానికి రెండు రెట్ల పైబడిన వేగం అందుకుంటుంది. ఒకప్పుడు మన దేశంలో 900 దాకా మిగ్-21 ఫైటర్ జెట్స్ ఉండేవి. వాటిలో 660 విమానాలను నాటి ఒప్పందం మేరకు ఇండియాలోనే హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారుచేశారు.1965, 1971 సంవత్సరాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాల్లో, 1999లో కార్గిల్ యుద్ధంలో మిగ్-21 తనదైన ముద్ర వేసింది. 2019లో బాలాకోట్ (పాక్)లోని ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన దాడుల్లోనూ కీలక పాత్ర పోషించింది. మిగ్-21లో మూడో తరానికి చెందిన ‘మిగ్-21 బిస్’ను 1976లో మన వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఇక రాడార్, ఏవియానిక్స్, ఆయుధ వ్యవస్థల పరంగా మరింత అధునాతనమైన ‘మిగ్-21 బైసన్’ వేరియంట్ వీటిలో చివరిది.మిగ్-21 బైసన్.. అరివీర ‘డాగ్ ఫైటర్’!నరాలు తెగే ఉత్కంఠ పుట్టించేలా రెండు యుద్ధ విమానాలు గగనతలంలో ఊహకందని విన్యాసాలతో అతి సమీపంగా ఒకదానికొకటి భీకరంగా తలపడుతూ రెండో దానిపై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తే అది... ‘డాగ్ ఫైట్’! క్షిపణుల వంటి ఆధునిక ఆయుధాలు లేని తొలినాళ్లలో యుద్ధ విమానాలకు మెషీన్ గన్స్ ఉండేవి. శత్రు యుద్ధ విమానాన్ని కూల్చడం కోసం కాల్పులు జరపడానికి రెండో విమానం మొదటి దానికి బాగా దగ్గరగా వెళ్లాల్సి వచ్చేది.ఇలా రెండు విమానాలూ మెరుపు వేగంతో పైకీ, కిందికీ కదులుతూ, హఠాత్తుగా మలుపులు తీసుకుంటూ, ఒకదానికి మరొకటి చిక్కకుండా గిరికీలు కొడుతూ హోరాహోరీగా ‘డాగ్ ఫైట్’లో పాల్గొనేవి. మిగ్-21 బైసన్ గొప్ప ‘డాగ్ ఫైటర్. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఆర్-73 క్షిపణులను దానికి అమర్చారు. ఆరితేరిన సుశిక్షిత పైలట్ దొరకాలే గానీ.. ప్రత్యర్థిపై మిగ్-21 బైసన్ వీరోచితంగా విరుచుకుపడుతుందనడంలో కించిత్ అతిశయోక్తి లేదు! 2004లో ‘కోప్ ఇండియా’ పేరిట భారత్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. అతి సమీప యుద్ధ విన్యాసాల సందర్భంగా అమెరికన్ ఎఫ్-15 ఫైటర్ జెట్స్ కంటే మిగ్-21 బైసన్ విమానాలు మెరుగ్గా రాణించి ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి.కూలిన మిగ్స్ 400... 200 మంది పైలట్ల మృతి!చారిత్రకంగా భారత వైమానిక దళానికి ఎన్ని సేవలందించినా, ఎన్ని విజయాలు సాధించిపెట్టినా, దేశ భౌగోళిక ప్రాంతాన్ని ఎంత గొప్పగా పరిరక్షించినా మిగ్-21లకు ‘ఎగిరే శవపేటికలు’గా, ‘వితంతువుల సృష్టికర్త’ (Widow Maker)గా చెడ్డ పేరు మాత్రం తప్పలేదు. మన దేశంలో గత 60 ఏళ్లలో మిగ్-21 యుద్ధ విమానాలు కూలిపోయిన సంఘటనలు 400 దాకా ఉన్నాయి. 200 మందికి పైగా ఐఏఎఫ్ పైలట్లు, 60 మందికి పైగా పౌరులు ఆయా దుర్ఘటనల్లో మరణించారు. ఉద్దేశిత కాలం కంటే సుదీర్ఘ కాలంపాటు ఈ యుద్ధ విమానాలను సర్వీసులో ఉంచడంతో ఇటు భారీగా ప్రాణనష్టం సంభవించగా అటు జెట్స్ నిర్వహణ ఖర్చూ పెరిగిపోయింది.2023 మే మాసంలో ఓ మిగ్-21 విమానం బహ్లాల్ నగర్ (రాజస్థాన్) వద్ద సాంకేతిక లోపంతో కూలిపోవడంతో ముగ్గురు గ్రామస్థులు మరణించారు. ఆ దుర్ఘటనతో మన వైమానిక దళం మిగ్-21 శ్రేణి విమానాలన్నిటినీ గ్రౌండ్ చేసింది. ఇక వీడ్కోలు యాత్రలో భాగంగా స్క్వాడ్రన్-4కు చెందిన మిగ్-21 బైసన్ విమానం చివరిసారిగా 2023 అక్టోబరులో రాజస్థాన్ పట్టణమైన బార్మర్ గగనవీధుల్లో చక్కర్లు కొట్టింది. యూరప్ ఖండంలో చివరి మిగ్-21 గత ఏడాది క్రొయేషియాలో రిటైరైంది. మరో రెండు నెలల్లో మన దేశంలోనూ మిగ్-21 అధ్యాయం ముగియబోతుంది. మిగ్-29 యుద్ధ విమానాలకు కూడా 2027 నాటికి స్వస్తి పలకాలని ఐఏఎఫ్ భావిస్తోంది. - జమ్ముల శ్రీకాంత్. -
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైంది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు.పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరానికి తూర్పున 143 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి ముందు దాదాపు గంట సమయంలోనే ఈ ప్రాంతంలో ఐదు భూకంపాలు నమోదైనట్లు యూఎస్జీఎస్ తెలిపింది.ఈ భారీ భూకంపాలు.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:28 నుంచి 3:49 గంటల మధ్య సంభవించాయి. ఈ భూకంపాల కారణంగా కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని, అయితే ప్రాణ నష్టం గురించి ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం వెల్లడికాలేదు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. -
నాటో మొరటు భాష!
ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. కానీ ఆర్నెల్ల నిరీక్షణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో కొద్దో గొప్పో సయోధ్య కుదిరేసరికి నాటో కూటమి ఆయన లక్షణాలు పుణికి పుచ్చుకున్నట్టు కనబడుతోంది. రష్యాతో వాణిజ్యం సాగిస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు చేసిన హెచ్చరిక దీన్నే చాటు తోంది. ట్రంప్తో నాలుగు రోజులక్రితం భేటీ అయ్యేవరకూ తన భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో నాటో దిగాలుగా, అయోమయంగా వుంది. ఎందుకంటే నాటో ఖర్చులో సింహభాగం అమెరికాదే. అది తప్పుకున్న మరుక్షణం సంస్థ కుప్పకూలుతుంది. ట్రంప్ ప్రసన్న వదనంతో పలక రించేసరికి పులకరించి తన స్థాయి ఏమిటన్నది నాటో మరిచిందని రూట్ మాటలు చెబుతున్నాయి. ఈ మూడు దేశాలూ యుద్ధం వద్దని రష్యాకు నచ్చజెప్పాలట. లేనట్టయితే ఆ పర్యవసానాలు ఈ దేశాలూ ఎదుర్కొనాల్సి వస్తుందట. ఇంకా వలస పాలన మాటున దోపిడీ సాగించిన నాటి రోజులే వున్నాయని రూట్ భ్రమపడుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఎవరూ సమర్థించరు. అలాగే గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం, ఇటీవల ఆ దేశమే ఇరాన్పై చేసిన దాడి, దానికి వత్తాసుగా అమెరికా సాగించిన దాడులు అంగీకరించరు. నాటో దన్నుతో ఉక్రె యిన్ కావాలని రష్యాతో గిల్లికజ్జాలకు దిగిన వైనం అందరికీ తెలుసు. తమ చేతికి మట్టి అంటకుండా రష్యాను దెబ్బతీసి, దాన్ని సర్వనాశనం చేయగలమన్న భ్రమలో యూరప్ దేశాలు ఉక్రె యిన్ను ఉసిగొల్పాయి. కానీ మూడేళ్లయినా ఆ యుద్ధం ఆగకపోవటంతో యూరప్ దేశాలకు దిక్కు తోచటం లేదు. ఆ నిరాశా నిస్పృహల పర్యవసానంగానే నాటో కూటమి అతిగా మాట్లాడుతోంది. అటువంటి బెదిరింపులకు దిగేందుకు తనకున్న అర్హతేమిటో నాటో గమనించుకోలేదు. 1949లో ఆవిర్భావం మొదలుకొని దాని చరిత్రంతా దురాక్రమణలు, యుద్ధాలే. నిక్షేపంగా వున్న లిబియాపై చమురు, సహజవాయు నిక్షేపాల్ని కొల్లగొట్టడానికి దండెత్తి, రసాయన ఆయుధాలున్నా యంటూ ఆరోపించి, పాలకుడు గడాఫీని దారికి తెచ్చుకుని, ఆయన నిరాయుధుడు కాగానే సాయుధ ముఠాలను ఎగతోసింది నాటోయే. ఆ ముఠాలతో ఆయన్ను అత్యంత అమానుషంగా హత్య చేయించింది కూడా నాటోయే. 2011 మొదలుకొని ఇప్పటివరకూ ఆ దేశం అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. బోస్నియా, హెర్జ్గోవినా, కొసావో, అఫ్గాన్, ఇరాక్, సోమాలియా తదితర చోట్ల అమెరికాతో కలిసి, విడిగా నాటో సృష్టించిన కల్లోలం సామాన్యమైంది కాదు. ఈ యుద్ధాల్లో లక్షలాది మంది పౌరులు మరణించారు. రష్యా–ఉక్రెయిన్ లడాయిలోఉక్రెయిన్కు సైనిక, ఆర్థిక సాయాన్నందిస్తూ ఈ యుద్ధం ఆరకుండా కాపాడుతున్నది కూడా నాటోయే. అలాంటి సంస్థ ఏ అర్హతతో మననూ, వేరే దేశాలనూ బెదిరిస్తుంది? నాటో అనేది పుట్టుకనుంచీ అమెరికా కోసం, దాని ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేస్తున్న పెద్ద పోలీస్. ఒక సైనిక కూటమిగా వుంటూ ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించటం సాధ్యమనే నాటో అనుకుంటున్నదా? ఆ పని యూరప్ దేశాలది. కానీ వాటికి హెచ్చరించటం సంగతలా వుంచి అడిగే ధైర్యం కూడా లేదు. ఒకనాడు సంపన్న రాజ్యాలుగా చలామణి అయిన యూరప్ దేశాలు ఇప్పుడు ఉత్పాదకతను పెంచటం ఎలాగో... అరకొర ఆర్థిక వ్యవస్థలతో ప్రజానీకంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చటం ఎలాగో అర్థంకాక తలలు పట్టుకుంటున్నాయి. ఈ దేశాలతో కూడిన నాటో మాత్రం పెద్ద మాటలు మాట్లాడుతోంది. ఇన్నేళ్ల అమెరికా సాహచర్యంతో ఇష్టాను సారం బడుగు దేశాలపై బలప్రయోగం చేయటం అలవాటైన నాటోకు ఈ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి, భద్రతామండలి వంటి అంతర్జాతీయ వేదికలున్నాయని కూడా గుర్తున్నట్టు లేదు. ఆంక్ష లైనా, విధినిషేధాలైనా వాటిద్వారా అమలు కావాలి. అదనంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వంటివి వున్నాయి. రష్యాతో వ్యాపారం చేయాలో లేదో అమెరికా, యూరప్సొంతంగా నిర్ణయించుకోవచ్చు. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేరు. కానీ మేమే కాదు... ఎవరూ వ్యాపారం చేయకూడదంటే చెల్లదు. తన ఇంధన అవసరాలేమిటో, దాన్ని నెరవేర్చుకోవటానికి అనుసరించాల్సిన వ్యూహమేమిటో భారత్ ఆలోచించుకుంటుంది. రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినా మన దేశం బేఖాతరుచేసింది. రష్యా చవగ్గా అమ్మజూపిన ముడి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసింది.క్రితంతో పోలిస్తే 2023లో రష్యా నుంచి చమురు, సహజవాయు దిగుమతులు 1,500 శాతం పెరగటానికి ఇదే కారణం. చైనా, బ్రెజిల్ కూడా ఈ దోవనే వెళ్లాయి. రష్యాను ఏకాకిని చేయాలన్న పాశ్చాత్య ప్రపంచం కలల్ని బద్దలుకొట్టాయి. మన విదేశాంగ శాఖ నాటో ద్వంద్వ ప్రమాణాలను సరిగానే ఎత్తిచూపింది. ప్రజల ఇంధనావసరాలు మినహా తమకేదీ ప్రాముఖ్యంగల అంశం కాదని జవాబిచ్చింది. ఒకప్పుడు 27 దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేసిన మన దేశం, ఇప్పుడు 40 దేశాలనుంచి కొంటున్నది. రష్యాపై తీసుకొచ్చిన అభిశంసనపై ఓటింగ్ జరిగినప్పుడల్లా ఐక్యరాజ్యసమితిలో మన దేశం గైర్హాజరైంది. అదే సమయంలో యుద్ధాన్ని విరమించాలని రష్యా అధినేత పుతిన్కు నచ్చజెప్పింది. అదే సలహా ఉక్రెయిన్కు కూడా ఇచ్చింది. ఇవి తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడటం, హెచ్చరికలు జారీ చేయటం తగదని నాటో గుర్తించాలి. తెలిసీ తెలియ కుండా తగుదునమ్మా అని జోక్యం చేసుకుంటే వున్న పరువు కాస్తా పోతుందని గుర్తెరగాలి. -
జాతీయ ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే, వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే 100 శాతం టారిఫ్లు విధిస్తామంటూ ‘నాటో’ సెక్రెటరీ జనరల్ మార్క్ రుట్టే చేసిన హెచ్చరికలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తిప్పికొట్టారు. జాతీయ ప్రయోజనాలు, మార్క్ అవసరాల ఆధారంగానే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. తమకు దేశ ప్రయోజనాలు, అవసరాలే ముఖ్యమని తేల్చిచెప్పారు. రష్యా చమురు విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దని నాటోకు సూచించారు. రణధీర్ జైశ్వాల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మార్క్ రుట్టే హెచ్చరికలను నిశితంగా గమనిస్తున్నా మని చెప్పారు. భారత ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ప్రజా ప్రయోజన కోణంలోనే ఉంటాయన్నారు. సుస్థిరమైన ఇంధన భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మార్కెట్లో తక్కువ ధరకు చమురు లభించినప్పుడు కొనడం సాధారణమేనని వివరించారు. రష్యా నుంచి యూరప్ దేశాలు చమురు కొనుగోలు చేస్తున్నారని రణధీర్ జైశ్వాల్ పరోక్షంగా ప్రస్తావించారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపాలని, ఉక్రెయిన్పై యుద్ధం విరమించేలా రష్యాపై ఒత్తిడి పెంచాలని ఇండియా, చైనా, బ్రెజిల్కు మార్క్ రుట్టే సూచించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఈ మూడు దేశాలే అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్నాయి. -
రష్యాపై ఆంక్షలు విధిస్తే ప్రత్యామ్నాయాలు ఉన్నాయ్
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆర్థిక ఆంక్షల రిస్క్ ను కేంద్రం తోసిపుచ్చింది. రష్యా దిగుమతుల విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే, ఇతర దేశాల నుంచి ముడి చమురు సరఫరాతో అధిగమిస్తామని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల రూపంలోనే సమకూరుతోంది. సాధారణంగా మధ్యప్రాచ్యం నుంచి భారత్కు ముడి చమురు సరఫరా అధికంగా అవుతుండేది. ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత నుంచి మారిన పరిణామాలతో గత మూడేళ్లుగా రష్యా ప్రధాన సరఫరాదారుగా మారిపోయింది. పాశ్చాత్య దేశాలు కొనుగోళ్లు తగ్గించడంతో భారత్ తదితర దేశాలకు రష్యా తక్కువ ధరకే చమురు సరఫరా చేస్తోంది. దీంతో భారత రిఫైనరీలు రష్యా ముడి చమురు దిగుమతుల వైపు మళ్లాయి. ఇప్పుడు మొత్తం దిగుమతుల్లో 40 శాతం రష్యా నుంచే ఉంటున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి పురి దీనిపై మాట్లాడారు. చమురు సరఫరా మార్కెట్లోకి ఇటీవలి కాలంలో గయానా తదితర కొత్త సరఫరాదారులు ప్రవేశించగా, ఇప్పటికే ఉన్న బ్రెజిల్, కెనడాలు సరఫరాను పెంచినట్టు చెప్పారు. గతంతో పోల్చిచూస్తే భారత్ ముడి చమురు సరఫరాలు వైవిధ్యంగా మారినట్టు తెలిపారు. సాధారణంగా 27 దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 40కు చేరినట్టు తెలిపారు. స్థిరంగానే చమురు ధరలు ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్ ధర 68.5 డాలర్ల వద్ద ఉండగా.. రానున్న నెలల్లోనూ 65 డాలర్ల స్థాయిలో స్థిరంగా కొనసాగొచ్చని మంత్రి పురి అభిప్రాయపడ్డారు. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం మించి పెంచే విషయమై నీతి ఆయోగ్ అధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రష్యా సరఫరా నిలిచిపోతే ఉక్రెయిన్–రష్యా సంక్షోభం ముందు నాటి విధానానికి (పూర్వపు సరఫరా చైన్కు) మళ్లుతామని ఐవోసీ చైర్మన్ ఏఎస్ సాహ్నే ఇదే కార్యక్రమంలో భాగంగా స్పష్టం చేశారు. -
రష్యాతో వ్యాపారం చేస్తే ఊరుకోం
వాషింగ్టన్: ఉక్రెయిన్పై ఆక్రమణ జెండా ఎగరేసిన రష్యాను నిలువరించేందుకు దాని ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు నాటో కూటమి పరోక్ష చర్యలకు దిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలుసహా పలురకాల వాణిజ్య కార్యకలాపాల కొనసాగిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్లపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరికలు చేశారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని రుట్టే బ్రెజిల్, చైనా, భారత్లను హెచ్చరించారు. బుధవారం అమెరికా సెనేటర్లతో వాషింగ్టన్లో సమావేశమైన అనంతరం మీడియాతో రుట్టే మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను శాంతి చర్చలకు ఒప్పించేలా పుతిన్పై భారత్, చైనా, బ్రెజిల్లు ఒత్తిడితేవాలని రుట్టే వ్యాఖ్యానించారు. ‘భారత ప్రధాన మంత్రి, చైనా అధ్యక్షుడు, బ్రెజిల్ అధ్యక్షుడు... మీరు ఎవరైనా కావొచ్చుగానీ రష్యాతో మీరు ముడిచమురు, సహజ వాయువు కొనుగోలుసహా వాణిజ్య వ్యాపారాలను వెంటనే ఆపేయండి. మీరో విషయం గుర్తుంచుకోవాలి. రష్యాలోని ఆ పెద్దమనిషి(పుతిన్) గనక ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే నేను టారిఫ్ల కొరడాతో రంగంలోకి దిగుతా. భారత్, బ్రెజిల్, చైనాలపై 100 శాతం టారిఫ్లు విధిస్తా. ఆర్థిక ఆంక్షలు సైతం విధిస్తా. నా ఈ హెచ్చరికలను మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే. లేదంటే దీని విపరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కోక తప్పదు. కొత్తగా ఈ 100 శాతం టారిఫ్ల బాధ తప్పాలంటే మీరు వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఒత్తిడి బాగా పెంచాలి. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు పుతిన్ను ఒప్పించాలి. పుతిన్ ఆ శాంతి చర్చలకు కట్టుబడి ఉండాలి. పుతిన్కు వెంటనే ఫోన్ చేసి, శాంతి చర్చలపై మరింత సీరియస్గా ఆలోచించాలని సూచనలు చేయండి. మీరు చర్చలపై ముందడుగువేయకుంటే నాటో మాపై 100 శాతం టారిఫ్లు విధిస్తుందట అని పుతిన్కు చెప్పండి. శాంతి ఒప్పందంగనక సాధ్యంకాకపోతే మీ మూడు దేశాలపై టారిఫ్లు విధించడం ఖాయం. ఈ గుదిబండను మీరు మోయకతప్పదు’’’ అని రుట్టే హెచ్చరించారు. ఉక్రెయిన్కు సైనిక మద్దతు మరింత పెంచుతామని, రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై టారిఫ్లను విపరీతంగా పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజు రుట్టే ఇలా భారత్ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. రష్యా, దాని భాగస్వాములపై 100 శాతం సుంకాలు విధిస్తాం: అమెరికా రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. 50 రోజుల్లోపు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యా నుంచి ముడిచమురును కొనుగోలుచేసే దేశాలపై మరోదఫా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ‘50 రోజుల్లోపు శాంతి ఒప్పందం కుదరాల్సిందే. అది జరక్కపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. టారిఫ్ల మోత మోగిస్తా. ఇతర ఆర్థిక ఆంక్షలు మోపుతా’’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరం లేకుండానే మరోదఫా టారిఫ్లను అమలు చేయవచ్చన్నారు. అత్యధిక కొనుగోలుదారుల్లో భారత్ తాజా అంతర్జాతీయ వాణిజ్య నివేదికల ప్రకారం రష్యా నుంచి ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న, కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా, తుర్కియే తొలి వరసలో ఉన్నాయి. ట్రంప్ నిజంగానే ఆర్థిక ఆంక్షలు విధిస్తే భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్న ఈ తరుణంలో ట్రంప్ కొత్తగా టారిఫ్ల కొరడా ఝులిపిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగే వీలుంది. ట్రంప్ బెదిరింపులపై రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ దీటుగా స్పందించారు. ‘ ట్రంప్తో చర్చలు జరపడానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ రష్యానే బెదిరించాలని చూడటం తగదు. అలి్టమేటం జారీ చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి చర్యలు సానుకూల ఫలితాలను ఇవ్వవని గుర్తుంచుకుంటే మంచిది’ అని సెర్గీ వ్యాఖ్యానించారు. -
ట్రంప్ వేస్తారు.. మేము భరిస్తాం: రష్యా
బీజింగ్: వచ్చే 50 రోజుల్లోపు ఉక్రెయిన్పై యుద్ధాన్ని రష్యా ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, వంద శాతం సుంకాలను ఆ దేశం ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. ఈరోజు(మంగళవారం, జూలై 15) షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమ్మిట్కు హాజరైన రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ప్రెస్ కాన్పరెన్స్లో మాట్లాడారు. దీనిపై అమెరికా అధ్యక్షడు ట్రంప్ విధిస్తామన్న సుంకాలపై కాస్త వ్యంగ్యంగా బదులిచ్చారు లావ్రోవ్. ‘ ట్రంప్ సుంకాలు వేస్తానన్నారు కదా.. అది కూడా వంద శాతం దాటి సుంకాలన్నారు. వేయనీయండి.. మేము భరిస్తాం. ఈ రకమైన బెదిరింపులు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి’ అంటూ బదులిచ్చారు. పుతిన్.. నీకు 50 రోజుల సమయమేకాగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం( జూలై 14) నాడు హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్లు చవిచూస్తుంది. ఆ టారిఫ్లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్లో నాటో చీఫ్ మార్క్ రూట్ను కలిసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త ఘాటుగా స్పందించారు. ఇదీ చదవండి:ట్రంప్-పుతిన్ బ్రొమాన్స్ ముగిసిందా? -
రష్యాకు 10 లక్షల మంది భారత కార్మికులు
మాస్కో: ఉక్రెయిన్తో మూడేళ్లుగా సాగుతున్న యుద్ధం కారణంగా రష్యాలో మానవ వనరుల కొరత ఏర్పడింది. దేశంలో కార్మికుల కొరతను భర్తీ చేసేందుకు భారత్ వైపు దృష్టి సారించింది. ఈ ఏడాది చివరికల్లా 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారత కార్మికులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా యాకటెరిన్బర్గ్లో కొత్తగా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తోందని ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ అండ్రీ బెసెడిన్ ప్రకటించారు. రష్యాలోని ఉరల్ పర్వతాలకు సమీపంలోని యాకటెరిన్ బర్గ్ ప్రాంతం భారీ పరిశ్రమలకు కేంద్రస్థానం.అక్కడ సైనిక పరిశ్రమలూ భారీగానే ఉన్నాయి. రష్యా ప్రభుత్వ అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో కారి్మక శక్తి కొరత 31 లక్షలకు పెరగనుంది. అందుకే, ఉత్తర కొరియా, శ్రీలంకల నుంచీ కారి్మకులను రప్పించాలని ప్రణాళికలు వేసింది. -
పగలంతా తేనె పలుకులు, రాత్రైతే..
ఉక్రెయిన్ సంక్షోభంలో.. పుతిన్ వైఖరి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ విధానాలు తనకేమాత్రం నచ్చడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. ఈ ఇద్దరు దేశాధినేతలు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటుండడం తెలిసిందే.రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరి పట్ల నేను తీవ్ర నిరాశ చెందారు. పుతిన్ శాంతి కోసం మాట్లాడతారని అనుకున్నాను. కానీ రాత్రికి రాత్రి ఉక్రెయిన్పై దాడులు చేయిస్తున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు అని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పుల్స్టాప్ పెట్టే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడితే.. పుతిన్-జెలెన్స్కీ వైఖరి వల్ల నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. దీంతో ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. పైగా ట్రంప్-పుతిన్లు తరచూ ఈ అంశంపై ఫోన్లో మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యాపై ఆంక్షలు?రష్యాపై కొత్త ఆంక్షలు విధించే అవకాశాన్ని ట్రంప్ సూచన ప్రాయంగా తెలియజేశారు. మేము రేపు ఏం చేస్తామో చూడండి అంటూ మీడియాతో వ్యాఖ్యానించారాయన. అమెరికా సెనేటర్లు ఇప్పటికే రష్యాపై ‘స్లెడ్జ్హామర్’(కఠినమైన) ఆంక్షల బిల్లును ప్రతిపాదించిన సమాచారం. పైగా ఈ బిల్లు రష్యా విషయంలో ఆంక్షలు విధించేందుకు ట్రంప్కు విస్తృత అధికారాలను కల్పించనుందని తెలుస్తోంది.తాజా వ్యవహారంతో ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరీముఖ్యంగా అమెరికా-రష్యా సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతున్నాయి. ట్రంప్ మాటలు, చర్యలు.. ఉక్రెయిన్ ఉద్రిక్తతల్లో రష్యాపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను అందించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్కు ఇది ఎంతో అవసరమని అని ఆయన.. ఈ ఆయుధాల ఖర్చును అమెరికా భరించదని, యూరోపియన్ యూనియన్ 100% చెల్లించనుందని తెలిపారు.ఈ క్రమంలో ఇది జస్ట్ బిజినెస్ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. -
రష్యా మంత్రి ఆత్మహత్య
మాస్కో: ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా గత వారం రాజధాని మాస్కోతోపాటు, సెయింట్ పీట ర్స్బర్గ్ తదితర ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. వేలాదిగా ప్రయాణికులు గంటలపాటు విమానాశ్రయాల్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ సోమవారం రవాణా శాఖ మంత్రి రొమాన్ స్టరొవోయ్(53)ను సస్పెండ్ చేశారు. డిప్యూటీ మంత్రి ఆండ్రీ నికిటిన్కు రవాణా శాఖ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే స్టరొవోయ్ తన నివాసంలో తుపాకీ గాయాలతో విగతజీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. 2024 మేలో రవాణా శాఖ మంత్రిగా స్టరొవోయ్ బాధ్యతలు చేపట్టారు. -
అప్పుడు ఆశ్చర్యపరిచాయి.. ఇప్పుడు అలవాటుగా మారింది..!
మన దేశంలో జీవించడమే మంచిది ఇక్కడే హాయిగా ఉంటుందని పలువురు విదేశీయలు భారతదేశాన్ని మెచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక విదేశీయురాలు తన పిల్లలను ఇక్కడే పెంచుతానని చెప్పగా, మరొకరు ఇక్కడ జీవిస్తానని అన్నారు. ఇప్పుడు ఈ విదేశీ మహిళ ఏకంగా మన భారతీయుల అలవాట్లు నచ్చాయి, వాటికి అలవాటు పడిపోయాను అని చెబుతుండటం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టిట తెగ వైరల్ మారింది. మరి ఇంతకీ ఆమె అనుసరిస్తున్న భారతీయ అలవాట్లు ఏంటంటే..బెంగళూరులో నివశిస్తున్న కంటెంట్ క్రియేటర్ యులియా అస్లమోవా అనే రష్యన్ మహిళ భారతీయ అలవాట్ల గురించి షేర్ చేసుకుంది. మొదట్లో ఆ అలవాట్లు చూసి ఆశ్చర్యపోయానని, ఇప్పుడు అవి తన దైనందిన జీవితంలో భాగమైపోయానని చెప్పుకొచ్చింది. పైగా వాటిని తాను కూడా పాటిస్తున్నానని చెప్పడం విశేషం. అందుకు సంబంధించిన మొత్తం ఎనిమిది అలవాట్లను లిస్ట్ ఔట్ చేసింది. అవేంటో వరసగా చూద్దామా..! ఈ అలవాట్లు వింతగా ఉన్నప్పటికీ, తన దినచర్యలో భాగమై కొండంతా సంతోషాన్ని మద్దతుని ఇస్తున్నాయని అంటోంది యులియా. ఇంతకీ అవేంటంటే..అత్తమామలతో జీవించడం: ఇంటిని తాను నిర్వహించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇదొక వరంలా భావిస్తోందామెచేతులతో తినడం: ఇది ఎంతో కంఫర్ట్బుల్గా ఉందంటోంది. పైగా ఇలా తింటేనే ఆహారం రుచిగా అనిపిస్తోందట. కొంచెం ఆలస్యమైనా పట్టించుకోను: ఎవరైనా వ్యక్తులు ఆలస్యంగా వచ్చినా..అందుకు తగ్గట్టుగా తాను ఇతర పనులు ప్లాన్ చేసుకుంటోందట, సమస్యగా ఫీల్ కాలేదట. ఎక్కువ మంది పనిమనుషులు ఉండటం: ఇది చూడటానికి వింతగా అనిపించినా..ఇదేరాను రాను సౌకర్యవంతంగా, స్మార్ట్గా అనిపిస్తోందిచర్చలు: భారతదేశం నుంచి నేర్చుకున్నది ఇదే. దీన్ని సూపర్ పవర్గా అభివర్ణించింది.మసాలా చాయ్ తాగడం: ఈ టీ తనకెంతో మనశ్శాంతినిస్తుందట. దీన్ని ఆమె మంగోలియన్ చాయ్తో పోల్చారామె. ప్రేమ విలువ: భారతీయ జీవితం సినిమాలు , సంభాషణలు, ప్రేమ చుట్టూ తిరుగుతాయని చెప్పుకొచ్చింది. బహుళ భాషలు మాట్లాడటం: ఇక్కడ ఉండే బహుళ భాషలు నచ్చాయట. అలాగే త్వరలో హిందీ నేర్చుకోవాలని భావిస్తోందట.భారతీయ జీవితంలో ప్రేమ చాలా గాఢంగా ఉంటుందని, సినిమాల్లో లేదా రోజువారీ సంభాషణలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. భారతదేశం చాలా భావోద్వేగ దేశం. అందువల్ల ఇక్కడ ప్రతీది అద్భుతంగా ఉంటుంది. యులియా పోస్ట్ని చూసిన నెటిజన్లు.. భారతదేశ రియల్ స్ఫూర్తిని తెలుసుకున్నారు, స్వీకరించారు కూడా. అలాగే అత్తమామలతో కలిసి ఉండటంపై మీ అభిప్రాయం అత్యంత హర్షాతిరేకంగా ఉందంటూ యులియాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) (చదవండి: పేరెంట్స్ త్యాగాలకు ఫలితం ఏంటో చూపిస్తున్నా..! కుమారుడి భావోద్వేగం..) -
పుతిన్ అంతే.. చంపుతూనే ఉంటారు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మనుషులను చంపుతూనే ఉంటారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. యుద్ధం ఏమాత్రం మంచిది కాదంటూ ట్రంప్ హితవు పలికారు. మరోవైపు, రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉండొచ్చంటూ ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఇటీవల ట్రంప్-పుతిన్లు ఫోన్ కాల్లో మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఉక్రెయిన్తో యుద్ధ విరమణ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. యుద్ధం ఆపుతాడని అనుకోవడం లేదంటూ పుతిన్తో ఫోన్ సంభాషణ అనంతరం వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్పై రష్యాతో యుద్ధ విరమణ చేయించడానికి ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మరోసారి భీకర దాడులకు తెరతీసిన సంగతి తెలిసిందే.గురువారం రాత్రి కేవలం 7 గంటల వ్యవధిలో 550 వరకు డ్రోన్లు, 11 క్షిపణులను ప్రయోగించింది. రష్యా మూడేళ్ల క్రితం ఉక్రెయిన్పై దురాక్రమణ ప్రారంభించాక చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. షహీద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల పేలుళ్ల మోతలతో కీవ్ దద్దరిల్లింది. సైరన్లు రాత్రంగా మోగుతూనే ఉన్నాయి. ‘మా ప్రజలు కఠినమైన, నిద్ర లేని రాత్రి గడిపారు’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు.ప్రజలు మెట్రో స్టేషన్లు, బేస్మెంట్లు, భూగర్భ పార్కింగ్ గ్యారేజీల్లోకి పరుగులు తీశారని ఉక్రెయిన్ మంత్రి యూలియా తెలిపారు. కీవ్తోపాటు మరో ఐదు ప్రాంతాలపైకి రష్యా దాడులు చేసిందని జెలెన్స్కీ చెప్పారు. తాము 270 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషణ జరిపిన రోజే తాజా దాడి జరగడం గమనార్హం. -
రష్యాతో భారత్ స్నేహం.. అమెరికా కక్షసాధింపు హెచ్చరిక
వాషింగ్టన్: భారత్, చైనా విషయంలో అమెరికా మరో సంచలన ప్రకటన జారీ చేసింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్, చైనాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. దీంతో, అగ్రరాజ్యం అమెరికా తీరు తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక, ఇటీవలే భారత్తో బిగ్ డీల్ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఇలా మాట మార్చడం గమనార్హం.రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిస్థితులను గమనిస్తున్నాం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై తప్పకుండా చర్చలు ఉంటాయి. ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తాం. రష్యా నుంచి చమురును భారత్, చైనాలు 70శాతం కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రెండు దేశాలపై సుంకం విధించే అంశం పరిశీలిస్తున్నామని అన్నారు. ఇదే సమయంలో ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ బిల్లుపై ట్రంప్ కూడా ఓకే చెప్పారని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యా కాల్పులు విరమణకు అంగీకరించలేదు. ట్రంప్ సూచనలు, హెచ్చరికలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లెక్క చేయలేదు. దీంతో, రష్యాను అమెరికా టార్గెట్ చేసింది. రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే యూఎస్ ప్రయత్నాల్లో ఇది ఒకటిగా తెలుస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడుతుంది. ఇక, ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ బిగ్ డీల్ ప్రకటన..ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్తో బిగ్ డీల్ ఉండనున్నట్టు తెలిపారు. త్వరలోనే భారత్తో ఒప్పందం కుదుర్చుకోనున్నాం. అది ఒక కొత్త డీల్ అవుతుంది. ప్రస్తుతం భారత్ ఇంకా దాన్ని అంగీకరించలేదు. వాళ్లు డీల్కు ఒప్పుకుంటే తక్కువ సుంకాలు విధించేలా ఒప్పందం కుదురుతుందని అన్నారు. జూలై తొమ్మిదో తేదీ నాటికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై చర్చలు సైతం జరుగుతున్నట్టు తెలుస్తోంది. -
రష్యా-ఉక్రెయిన్ వార్ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే
శనివారం రాత్రి రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులతో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. యుద్ధం మొదలైన నాటి నుంచి జరిగిన అతిపెద్ద దాడి ఇదేనంటూ ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిల్లో 249ని కూల్చేశామని.. మరో 226 ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని.. గత రాత్రి అతిపెద్ద దాడే జరిగిందంటూ ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసినట్లు అధికారులు వివరించారు. ఈ దాడిలో ఉక్రెయిన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం కూలిపోయిందని.. ఒక పైలట్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం రష్యా ఆరు గంటలకు పైగా దాడులు చేసింది. దేశ వ్యాప్తంగా కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతీన్నాయని అధికారులు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య 2022 దాడులు కొనసాగుతున్నాయి. 36 నెలలు గడిచినా ఆగని రష్యా, ఉక్రెయిన్ పోరు ఆగడం లేదు.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది.తొలి రోజుల్లో రాజధాని కీవ్దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు.ఇదీ చదవండి: Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు -
రష్యాలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి
మాస్కో: రష్యా ఆందోళనను పట్టించుకోకుండా పశ్చిమదేశాలు విస్తరణ వాదాన్ని అనుసరిస్తున్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. తమ దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. శుక్రవారం పుతిన్ బెలారస్ రాజధాని మిన్స్క్లో జరిగిన యురేసియన్ ఎకనామిక్ సమిట్(ఈఏఈయూ)కు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రష్యాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు, కాల్పులకు తెగబడుతున్నా ఎవరూ పట్టించుకోరు. ఇప్పటికీ దారుణాలు కొనసాగుతున్నా వాటి గురించి మాట్లాడరు. అంతా బాగుందని చెప్పుకుంటుంటారు’అంటూ పశ్చిమదేశాలపై పుతిన్ ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని సైతం రష్యాలో వేర్పాటువాదానికి ఒక సాధనంగా పశ్చిమ దేశాలు భావించాయని ఆరోపించారు. ‘నాటో విస్తరణకు సంబంధించి రష్యాకు ఇచ్చిన హామీలను పశ్చిమదేశాలు విస్మరించాయి. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో సైతం విఫలమయ్యాయి. ఉక్రెయిన్లో మేం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ మూలాలేమిటనే అంశంపై పశ్చిమ దేశాలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఉక్రెయిన్ సంక్షోభానికి దశాబ్దాల క్రితమే బీజాలు పడ్డాయి. నాటో విస్తరణ విషయంలో చెప్పిన పచ్చి అబద్ధాలే తాజా సమస్యకు కారణం. ఒకదాని తర్వాత మరో దేశాన్ని నాటోలోకి కలుపుకుంటూ విస్తరించుకుంటూ వస్తున్నాయి. మా ఆందోళనలను పట్టించుకోకుండా నాటో కార్యకలాపాలు యథా ప్రకారం కొనసాగిస్తోంది. ఇది కాదా దుందుడుకు వైఖరి? ఇది కచ్చితంగా దుందుడుకు విధానమే. పశ్చిమ దేశాలు దీనిపై దృష్టి పెట్టడానికి ఇష్టపడవు’అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో మూడేళ్లుగా సాగిస్తున్న యుద్ధంపై పశ్చిమ దేశాలతో రష్యాకు విభేదాలు తీవ్రతరమైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యా దూకుడును నిలువరించేందుకు సభ్య దేశాలు తమ జీడీపీలో 5 శాతం రక్షణకు కేటాయించాలంటూ నాటో ఇటీవల నిర్ణయించడం తెల్సిందే. -
శశి థరూర్... ఈసారి ఫ్రెంచ్లో!
కీవ్: తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు కానీ.. ఆయన ఫ్రెంచ్లోనూ అదరగొట్టగలరని మాత్రం తాజాగా స్పష్టమైంది. అది కూడా రష్యా దౌత్యవేత్తతో మాట్లాడుతూ! విషయం ఏమిటంటే...పహల్గామ్ దాడి తరువాత దాయాది దేశం పాకిస్థాన్పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రపంచదేశాలకు వివరించే పార్లమెంటరీ బృందానికి శశి థరూర్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందం ప్రస్తుతం మాస్కోలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా రష్యాలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు లియోనిడ్ స్లట్స్కీతో థరూర్ బృందం సమావేశమైంది. భారత్ హస్తకళల వైభవాన్ని చాటే ఒక జ్ఞాపికను రష్యా దౌత్యవేత్తకు అందించిన థరూర్.. ప్రతిగా ఆయన అందించిన అరుదైన పెన్నును స్వీకరించారు.‘‘రాతగాడికి పెన్ను బహుమానంగా ఇవ్వడం సంతోషాన్నిచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఇరువురి మధ్య చర్చలు ఉగ్రవాదం.. నివారణ చర్యలు.. రషా ఏం చేస్తోందన్న అంశాలపైకి మళ్లింది.. ఈ సందర్భంగా లియోనిడ్ స్లట్స్కీ మాట్లాడుతూ.. ‘‘రష్యా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో బహుముఖ వ్యూహం అనుసరిస్తోంది. ఇందులో భాగంగా ఏటా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఆరుసార్లు ఈ సమావేశాలు జరిగాయి. వచ్చే ఏడాది ఏడో సమావేశం నిర్వహిస్తున్నాం. పాకిస్థాన్తోపాటు ఇతర దేశాలను ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు.పాకిస్థాన్ పేరు వినపడగానే స్పందించిన శశిథరూర్ భారత దౌత్యవేత్తల అంతర్జాతీయతను గుర్తు చేసేలా ఫ్రెంచ్లో స్లట్స్కీకి సమాధానమిచ్చారు. ‘‘పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిచ్చే దేశం’’ అని గుర్తు చేశారు. తద్వారా రష్యాతోపాటు యూరోపియన్ దేశాల దౌత్యవేత్తలకు భారత్ ఉద్దేశాలను స్పష్టం చేసినట్టు అయ్యింది. అయితే థరూర్ వ్యాఖ్యలను విన్న స్లట్స్కీ పాకిస్థాన్ను ఆహ్వానించడాన్ని సమర్థించుకున్నారు.అది వేరే విషయం!Shashi Tharoor takes on Pakistan in fluent French pic.twitter.com/2H7lbg1pxE— Shashank Mattoo (@MattooShashank) June 25, 2025 -
రష్యా దాడుల్లో 12 మంది మృతి
కీవ్: రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్తోపాటు పలు ప్రాంతాలపై ఆదివారం రాత్రి డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో కీవ్లో ఏడుగురు సహా మొత్తం 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 30 మంది క్షతగాత్రులయ్యారు. రష్యా 352 డ్రోన్లు, 11 బాలిస్టిక్ క్షిపణులు, ఐదు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ పేర్కొంది. వీటిలో 339 డ్రోన్లు, 15 క్షిపణులను తమ గగనతల వ్యవస్థలు అడ్డుకున్నాయంది. నివాసప్రాంతాలు, ఆస్పత్రులు, క్రీడా సముదాయాలు లక్ష్యంగా దాడులు జరిగాయని ఆర్మీ తెలిపింది. కీవ్లో ఐదంతస్తుల అపార్టుమెంట్లో కొంతభాగం కుప్పకూలగా ఏడుగురు చనిపోయారని, నలుగురు శిథిలాల్లో చిక్కుకున్నారంది. -
ఇరాన్కు రష్యా సహకారం?.. విమర్శలపై పుతిన్ ఆగ్రహం
మాస్కో: ఇరాన్- రష్యాల మధ్య కొన్ని దశాబ్ధాలుగా సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా జోక్యంతో ఇరాన్ మరిన్ని చిక్కుల్లో పడింది. ఇదే సమయంలో ఇరాన్కు ఎందుకు సహాయం అందించడం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ను విలేకరులు అడిగినప్పుడు ఆయన ఘాటైన సమాధానం ఇచ్చారు.ఇరాన్ అణు కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకున్న తర్వాత కూడా, టెహ్రాన్ను రక్షించేందుకు మాస్కో(రష్యా) ఎందుకు ముందుకు రాలేదో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియాకు వివరించారు. రష్యా- ఇరాన్ల మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలున్నప్పటికీ.. ఇజ్రాయెల్లో రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నందున ఈ వివాదంలో తటస్థంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు పుతిన్ తెలిపారు.సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికపై పుతిన్ మాట్లాడుతూ.. పూర్వ సోవియట్ యూనియన్, రష్యన్ ఫెడరేషన్లకు చెందిన దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. ఇది నేడు దాదాపు రష్యన్ మాట్లాడే దేశంగా ఉంది. రష్యా సమకాలీన చరిత్రలో భాగంగా ఆ దేశాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రష్యా తన మిత్రదేశాల విషయంలో ప్రదర్శిస్తున్న విధేయతను ప్రశ్నించేవారి విమర్శకులను కూడా పుతిన్ తిప్పికొట్టారు. అటువంటి వారిని రెచ్చగొట్టేవారుగా పేర్కొన్నారు. ఇస్లామిక్ దేశాలతో రష్యా సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని, రష్యా జనాభాలో 15 శాతం మంది ముస్లింలున్నారని పుతిన్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నిపుణులకు షాకిచ్చిన అమెరికా దాడుల వ్యూహం -
రష్యా నుంచి పెరిగిన చమురు దిగుమతులు
న్యూఢిల్లీ: రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతులను భారత్ గణనీయంగా పెంచుకుంది. జూన్ నెలలో మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాల కంటే రష్యా నుంచే అధిక చమురు దిగుమతి కావడం గమనార్హం. మొత్తం మీద ఈ నెలలో రోజువారీ 2–2.2 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చంటూ అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణ సంస్థ ‘కెప్లెర్’ వెల్లడించింది. గత రెండేళ్ల కాలంలో రష్యా నుంచి ఈ స్థాయి దిగుమతులు తిరిగి ఈ నెలలోనే అధికమయ్యాయని వివరించింది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్కు మించి రష్యా నుంచి దిగుమతులే అధికంగా ఉన్నట్టు తెలిపింది. మే నెలలో రష్యా నుంచి చమురు దిగుమతులు రోజువారీగా 1.96 మిలియన్ బ్యారెల్స్గా ఉన్నాయి. మరోవైపు అమెరికా నుంచి ఈ నెలలో రోజువారీ 4,39,000 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా, గత నెలలో ఇది 2,80,000 బ్యారెల్స్గానే ఉండడం గమనార్హం. మధ్యప్రాచ్యం నుంచి భారత్కు ఈ నెల మొత్తంమీద చమురు దిగుమతులు సగటున రోజువారీ 2 మిలియన్ బ్యారెళ్లుగా ఉండొచ్చన్నది కెప్లెర్ నివేదిక అంచనా. చమురు దిగుమతుల్లో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉంది. రోజువారీ 5.1 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. సంప్రదాయంగా మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాల నుంచే భారత్ అధికంగా చమురు దిగుమతి చేసుకునేది. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి అనంతరం మారిన సమీకరణాల నేపథ్యంలో.. రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతమే ఉండగా, ఆ తర్వాత 40–44 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ధర కంటే తక్కువ రేటుకే చమురును భారత్కు రష్యా ఆఫర్ చేయడం గమనార్హం. సరఫరాపై ప్రభావం పడొచ్చు.. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పటి వరకు మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాలపై లేదని కెప్లెర్ నివేదిక స్పష్టం చేసింది. వెసెల్స్ కార్యకలాపాలను గమనిస్తే రానున్న రజుల్లో సరఫరా తగ్గే అవకాశం కనిపిస్తున్నట్టు కెప్లెర్ ముఖ్య పరిశోధన విశ్లేషకుడు సుమిత్ రితోలియా తెలిపారు. షిప్ యజమానులు గల్ఫ్ ప్రాంతానికి ఖాళీ ట్యాంకర్లు పంపేందుకు వెనుకాడుతున్నట్టు, దీంతో వెసెల్స్ సరఫరా 69 నుంచి 40కు తగ్గినట్టు తెలిపారు. దీంతో సమీప కాలంలో సరఫరాలు కఠినంగా మారొచ్చని.. ఇది భారత దిగుమతుల్లో సర్దుబాట్లకు దారితీయొచ్చని అంచనా వేశారు. హర్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ జలసంధి ద్వారానే వస్తోంది. మన దేశ ముడి చమురు దిగుమతుల్లో 40 శాతం, ఎల్ఎన్జీ దిగుమతుల్లో సగం సరఫరా ఈ ప్రాంతం నుంచే ఉంటోంది. ఇరాన్పై దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మూసివేసే రిస్క్ ఉందని.. అదే సమయంలో పూర్తిస్థాయి దిగ్బంధనం అవకాశాలు తక్కువే ఉండొచ్చని కెప్లెర్ నివేదిక తెలిపింది. ఎందుకంటే ఇరాన్కు చైనా అతిపెద్ద కస్టమర్గా ఉందని, చైనా సముద్ర మార్గ చమురు దిగుమతుల్లో 47% ఇరాన్ నుంచే వస్తుండడాన్ని ప్రస్తావించింది. ఇరాన్ 96% చమురు ఎగుమతులు ఈ జలసంధి నుంచే ఉంటున్నందున పూర్తిస్థాయి దగ్బంధనం ఇరాన్కే నష్టం కలిగిస్తుందని పేర్కొంది. -
ఇరుకున పడ్డ ఇరాన్!
అగ్రరాజ్యం అమెరికా సైతం తమపై కత్తికట్టడంతో ఇప్పుడు ఇరాన్ తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణమొచ్చింది. అయితే ఈ కష్టకాలంలో కాడెత్తేయకుండా కడదాకా తమకు తోడుగా నిలిచే నిజమైన నేస్తలెందరో ఇప్పుడు ఇరాన్ లెక్కబెట్టుకుంటోంది. యుద్ధంలో పైచేయి సాధించేందుకు పనికొచ్చే ప్రత్యామ్నాయాలు ఎన్ని ఉన్నాయో బేరీజువేసుకుంటోంది. ఇజ్రాయెల్, అమెరికాలకు దీటుగా చైనా, రష్యా ఏమేరకు తనకు సైనిక సాయం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇస్తాయోనని ఇరాన్ సమీక్ష జరుపుతోంది. హోర్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకల రాకపోకలను అడ్డుకుంటే తనకు ఒనగూరే లాభమెంతో లెక్కేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ ముందు ఆప్షన్లు ఎన్ని అనే అంశం ప్రధానంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. హోర్ముజ్ జలసంధిని ఆపేస్తే?సముద్రం ద్వారా రావాణా అయ్యే చమురులో దాదాపు 25 శాతం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఈ జలమార్గం గుండా చమురు, సహజవాయువు రవాణా నౌకలను అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల మంటలు పైకి ఎగిస్తే ప్రపంచార్థికం దెబ్బతినడం ఖాయం. ఈ భయాలను బూచిగా చూపి తమపై దాడులను ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్ కూటమి దేశాలను ఇరాన్ హెచ్చరించే వీలుంది. వేగంగా దూసుకెళ్లే బోట్ల ద్వారా వేలాదిగా మెరైన్ మైన్(సముద్ర మందుపాతర)లను జలసంధి మార్గంలో ఇరాన్ మొహరించిందనే వార్తలు వెలువడ్డాయి. వీటిలో నిజమెంతో ఎవరికీ తెలీదు. అదే నిజమైతే నౌకలు అటు వెళ్లేందుకు వణుకుతాయి. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ముప్పేట దాడి?అమెరికా భూభాగం నుంచి నేరుగా దాడులు చేయడం కష్టం. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిష్టవేసి ఏర్పాటుచేసుకున్న సమీప స్థావరాల నుంచే అమెరికా దాడిచేయగలదు. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ మెరుపుదాడులు చేసి ప్రతిదాడులను నిలువరించవచ్చు.ఈ భయంతోనే అమెరికా ఇప్పటికే ఒకటి, రెండు స్థావరాల నుంచి యుద్ధవిమానాలను వేరేచోటుకు తరలించినట్లు ప్రైవేట్ శాటిలైట్ తాజా చిత్రాలతో స్పష్టమైంది. అమెరికా గడ్డపై తమ మద్దతుదారుల ద్వారా పేలుళ్లు జరిపి మారణహోమం సృష్టించే ఛాన్సుంది. అందుకే ఈ విషయంలో అమెరికా ఇప్పటికే అప్రమత్తమై పలు ప్రధాన ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టంచేసిందని వార్తలొచ్చాయి.పెంచిపోషించిన సాయుధ సంస్థల సాయంతో..గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హౌతీ రెబల్స్, ఇరాక్లో మిలీషియా సంస్థలకు ఆర్థిక, ఆయుధసాయం చేసి ఇరాన్ తన పరోక్ష సైన్యంగా తీర్చిదిద్దుకుంది. వీటిని ఒకరంగా ప్రతిఘటన దళంగా పేర్కొంటారు. అయితే 20 నెలలుగా ఇజ్రాయెల్తో పోరాడి హమాస్ తన అగ్రనాయకత్వాన్ని కోల్పోయి ఒకరకంగా అలసిపోయింది. హెజ్బొల్లా ఉగ్రసంస్థ పోరాడే వీలుంది. ఇరాన్తో కలిసి నడుస్తామని మూడ్రోజుల క్రితమే హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఎర్రసముద్రంలో విదేశీ చమురు నౌకలు అడ్డుకుంటామని చెప్పారు. ఇరాక్లోని మిలీషియా సంస్థలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మిలీషియాలు, హౌతీలకు డ్రోన్లు, చిన్నపాటి క్షిపణులను ప్రయోగించడంలో నైపుణ్యముంది. వీళ్లు ఇరాన్కు తోడు నిలిచే అవకాశముంది.చైనా, రష్యాల పరోక్ష సాయంచైనా ఇప్పటికే కొన్ని చమురునౌకల ముసుగులో కొన్ని ఆయుధాలను ఇరాన్కు తరలించి సాయపడినట్లు తెలుస్తోంది. యుద్దం తీవ్రతరమైతే తమ చిరకాల మిత్రుడు ఇరాన్కు సాయంగా రష్యా, చైనాలు ముందడుగు వేసే వీలుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. ఈ విషయమై ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు.అణుకార్యక్రమం ఆగకపోవచ్చా?యురేనియం శుద్ది కర్మాగారాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి, బాంబు దాడులు ఇరాన్ను అణ్వాయుధం తయారుచేయకుండా మరికొన్ని వారాలు, నెలలు అడ్డుకో గలవుగానీ శాశ్వతంగా ఆపలేవని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. న్యూక్లియర్ సెంటర్లలోకాకుండా వేరేచోట్ల యురేనియంను నిల్వచేస్తే అమెరికా, ఇజ్రాయెల్ల పరిస్థితి ఏంటనే అంశం తెరమీదకొచ్చింది. తన దేశ ఉనికి, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితే వస్తే ఇరాన్ ఎంతకైనా తెగిస్తుందనే విశ్లేషణల నడుమ ఈ సమరం ఏ దిశలో పయనిస్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇది దుస్సాహసాల యుగం
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగింది. కానీ అదంత తేలిక కాలేదు. ఇప్పటికీ తన లక్ష్యం సాధించలేక పోయింది. చైనాపై ఆధారపడటం అనివార్యమైంది. ఇటీవలి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు దాన్ని మరీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే రష్యా ఏం ఓడలేదు. పైగా, 2022 ఫిబ్రవరి తర్వాత ఎన్నడూ లేనంత బలీయంగా ఇప్పుడు రూపొందింది. అంతర్జాతీయంగా రష్యాను ఏకాకి చేయాలన్న పథకం నీరుగారి పోయింది. ఈ పథక రచనలో ప్రధాన సూత్రధారి అమెరికా భంగపడింది. ఎలాగోలా రష్యాతో ఒప్పందం చేసుకోవాలని ఈ అగ్రరాజ్యం ఇప్పుడు అంగలారుస్తోంది. యూరోపియన్ యూనియన్ భద్రత మీద, ఉక్రెయిన్ సార్వభౌమికత మీద చేస్తున్న వ్యయం తగ్గించుకోవాలని భావిస్తోంది. యుద్ధం ద్వారా కాకుండా దౌత్యంతోనే ఈ ఊబి నుంచి బయటపడాలనుకుంటోంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇందుకు ససేమిరా అన్నా ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. ‘దుస్సాహసం ఫలిస్తుంది’ అన్నది పుతిన్ తన అనుభవాల నుంచి నేర్చుకున్నపాఠం. ఒక దేశం మీద దండెత్తాడు. ఇప్పటిదాకా నెగ్గుకొచ్చాడు. మరింత ఉక్రెయిన్ భూభాగంపై పట్టు సాధించగలనన్న, తద్వారా తన విదేశాంగ విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి రష్యాకు సమకూరుతుందన్న, తూర్పు మధ్య యూరప్ ప్రాంతాల భద్రతకు ఢోకా ఉండదన్న ఆలోచన ఇలాగే కొనసాగవల్సిందిగా పుతిన్ను పురిగొల్పి ఉంటుంది. దుస్సాహసం ఫలిస్తుంది!గాజా మీద ఇజ్రాయెల్ దురాక్రమణకు దిగింది. హమాస్ టెర్రరిజం ప్రస్తుత సంక్షోభానికి పురిగొల్పింది అనడంలో సందేహం లేదు. అయితే, అందుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మితిమీరి ప్రతిస్పందించింది. అంతర్జాతీయ విశ్వసనీయతను కోల్పోయింది. ఇజ్రాయెల్ అంటే అదో జాతి నిర్మూలన శక్తి అని ప్రపంచవ్యాప్తంగా ఒక తరం మనస్సులో శాశ్వతంగా ముద్ర పడింది. ఈ దాడి ఆ దేశ వనరులను హరించివేసింది. పొరుగున ఉన్న అరబ్బు దేశాలతో సాధారణ సంబంధాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక భద్రత కూడా ప్రమాదంలో పడినట్లే!అయితే ఇజ్రాయెల్ ఏం ఓడలేదు. ఆ దేశపు దూరదృష్టి లేని వ్యూహకర్తలు కోణం నుంచి చూస్తే, హమాస్ నాయకత్వాన్ని తుదముట్టించడంతో పాటు వారి సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ ఈ పోరులో విజయం సాధించింది. హెజ్బొల్లా నాయకత్వాన్ని, సైనిక సదుపాయాలను నిర్మూలించి, లెబనాన్ పాలనలో మార్పు తెచ్చింది. సిరియా ప్రభుత్వ మార్పుకు పరోక్షంగా దోహదపడింది. నెతన్యాహూ ఇలాగే ముందుకు సాగి ఇరాన్ మీద దాడి చేశాడంటే అందులో ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు తీర్చిదిద్దుతాయి. పుతిన్ అనుకున్నట్లే, నెతన్యాహూకు కూడా అతడి అనుభవం పాఠం నేర్పింది. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలను అన్నింటినీ ఉల్లంఘించాడు. యుద్ధఖైదీ అభియోగం మోపి అరెస్టు చేయాలన్న ఇంటర్నేషనల్ వారెంటును పట్టించుకోలేదు. పాలస్తీనా కలలను చిదిమివేసిన అనుభవమే మరో దేశంపై దండెత్తడానికి, ఆ దేశ అణుశక్తి కార్యక్రమాలను వమ్ము చేయడానికి, అక్కడ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నెతన్యాహూను పురిగొల్పి ఉంటుంది.ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోయినా...వీగర్ల స్వయంప్రతిపత్తి ప్రాంతమైన షిన్జియాంగ్ను చైనా జైలుగా మార్చేసింది. టిబెట్లో జనాభా స్వరూప స్వభావాలను మార్చింది. హాంకాంగ్ను హస్తగతం చేసుకుని రెండు వ్యవస్థల విధానాన్ని అమలు చేస్తామన్న చట్టబద్ధ హామీని విస్మరించింది. సౌత్ చైనా సముద్రంలోని ద్వీపాలను సైనిక స్థావరాలుగా చేసుకుంది. తన సరిహద్దుల వెలుపల తైవాన్తోపాటు, ఇతర తూర్పు ఆసియా దేశాల్లో పరోక్ష అధికారం చలాయిస్తోంది. ఇవేవీ కూడా ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోవచ్చు. కానీ ఇవన్నీ కలిపి చూస్తే, తన ఆధిపత్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోయి చివరకు పూర్తిగా కబళించివేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ చర్యలతో చైనా ప్రతిష్ఠ మసకబారింది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు వీలుగా పలు దేశాలు కూటములుగా జట్టు కట్టేందుకు, చైనా వస్తు సరఫరాలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పరిస్థితికి దారితీసింది. అయినా చైనా ఏం ఓడలేదు. వాస్తవానికి, తన ఆక్రమణలు అన్నిటినీ ‘న్యూ నార్మల్’గా మార్చేయగలిగింది. సాగర జలాల్లో తన అధికార ప్రదర్శనను కొనసాగించగలనని, లేదా తైవాన్ను ఆక్రమించుకోగలనని జిన్పింగ్ అనుకుంటే అందులో ఆశ్యర్యపడేదేం లేదు. ఒక మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే జిన్పింగ్ కూడా అనుభవాల నుంచి పాఠం నేర్చుకున్నాడు. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను హస్తగతం చేసుకున్నాడు. దేశానికి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ప్రత్యర్థులను అణచివేయడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమాలను ఉపయోగించుకున్నాడు. హిమాలయాల్లో కానీ, సాగరాల్లో కానీ, పసిఫిక్ లేదా యూరేషియాలో కానీ ఇలాగే ముందుకు సాగాలని ఈ అనుభవమే జిన్పింగ్ను పురిగొల్పి ఉంటుంది. ఉగ్రవాద దుస్సాహసంఏప్రిల్ 22న పాకిస్తాన్ తైనాతీలు మరోసారి ఇండియాపై పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడ్డారు. అలాంటి ఘటన, దాని పర్యవసానాలు... టెర్రరిజం ఎగుమతుల కేంద్రంగా పాకిస్తాన్ పొందిన గుర్తింపును ఇంకా బలపరిచాయి. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక సామర్థ్యాన్ని మరింత కుంగదీశాయి. సైనిక పరంగా పాకిస్తాన్ బలహీనతలను బహిర్గత పరచాయి. దేశ సౌభాగ్యానికి అవసరమైన ప్రాదేశిక సమగ్రతను మరింత దూరం చేశాయి.అయితే తాను ఓడిపోయానని పాకిస్తాన్ అనుకోవడం లేదు. పైగా, రావల్పిండిలోని మిలిటరీ జనరళ్ల దృష్టిలో పాకిస్తాన్ గెలిచింది. తామే తప్పూ చేయడం లేదన్న యుద్ధోన్మాద ధోరణి ఇకమీదటా చెల్లిపోతుందని ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ అనుకుంటే అందులో ఆశ్చర్యపడేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. జిన్పింగ్, పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే, తన అనుభవాలు అతడికి పాఠం నేర్పాయి. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. మునీర్ ద్వేషం రగిల్చే ప్రసంగాలు చేశాడు. ఉగ్రవాద తైనాతీలను ప్రోత్సహించాడు. ప్రత్యర్థిని సైనిక ఘర్షణలోకి దించాడు. అంతర్జాతీయ పాత్ర కోసం అభ్యర్థన చేశాడు. కాల్పుల విరమణను విజయంగా ప్రకటించుకున్నాడు. కొన్ని తరాల ప్రజలను శోకంతో తపించేలా చేసినా, పాకిస్తాన్కు కావల్సిన ప్రచారాన్ని, ప్రజల్లో చీలికను సాధించిపెట్టిన ఇలాంటి ఉగ్రదాడులతోనే ముందుకుసాగేందుకు మునీర్ను అతడి అనుభవం పురిగొల్పవచ్చు. మరో దేశం మీద దండెత్తడం, ప్రజలను ఆకలితో అలమటింపజేయడం దుస్సాహసం (అడ్వెంచరిజమ్) అవుతుంది. టెర్రరిజానికి ఆశ్రయం ఇవ్వడం లేదా మరొకరి భూభాగాన్ని కైవసం చేసుకోవడం దుస్సాహసం అవుతుంది. అన్ని అంతర్జాతీయ నియమాలనూ, చట్టాలనూ ఉల్లంఘించడం, ట్రైబ్యునల్ ఉత్తర్వులను తిరస్కరించడం దుస్సాహసం అవుతుంది. మానవ సమాజాలు ఏర్పడినప్పటి నుంచీ దుస్సాహసం ఉంది. దీన్ని అడ్డుకునేది చట్టం, ఆచారం, స్వీయ నిగ్రహం... ఇవేవీ కావు. విఫలమవుతామన్న భయం, అందుకు చెల్లించాల్సిన మూల్యం మాత్రమే దుస్సాహసాన్ని అడ్డుకోగలవు. విషాదం ఏమిటంటే, ఇప్పుడు ఈ వైఫల్యభీతి అంతరించింది. అడ్వెంచరిజం ఫలించే యుగం ఇది.ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అమెరికా దాడులు.. ఇరాన్కు అండగా రష్యా..!
టెహ్రాన్: ఇరాన్పై యుద్ధం వద్దూ అంటూ ఇది వరకే అమెరికాను హెచ్చరించిన రష్యా... ఈ మేరకు దిద్దబాటు చర్యలు చేపట్టడానికి నడుంబిగించింది. ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని రష్యా మరోసారి హెచ్చరికలు పంపింది.రష్యాకు ఇరాన్ రక్షణమంత్రిఇజ్రాయిల్, అమెరికాలు.. ఇరాన్ను అతలాకుతులం చేసే దిశగా యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో ఇరాన్ ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడింది. దీనిలో భాగంగా తమకు అండగా ఉన్న రష్యా సహకారం కోసం ఇరాన్ ప్రయత్నాలు ఆరంభించింది. ఈ మేరకు ఇరాన్ రక్షణమంత్రి అబ్బాస్ అరాగ్చీ.. అగమేఘాల మీద రష్యాకు బయల్దేరారు. రేపు(సోమవారం) రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ రక్షణశాఖ అధికారికంగా వెల్లడించింది. రక్షణమంత్రి అరాగ్చీ.. రష్యాకు వెళ్లే విషయాన్ని వెల్లడించారు. మూడు ఇరాన్ కీలక అణుస్థావరాలపై అమెరికా బాంబుల దాడితో విరుచుకుపడిన తరుణంలో.. రష్యా ఆదేశాలతో ఇరాన్ ముందుకెళ్లే అవకాశం ఉంది.‘ఇరాన్కు రష్యా మిత్రదేశం. మేము ఎప్పుడూ రష్యాను ఆశ్రయిస్తూనే ఉంటాం. నేను మాస్కోకు అత్యవసరంగా బయల్దేరి వెళుతున్నా. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కీలక సమావేశం ఉండనుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మాపై అమెరికా చేసే దాడి కచ్చితంగా అతిక్రమణ కిందకే వస్తుంది. మా అణుస్థావరాలపై దాడులకు దిగిన అమెరికా రెడ్ లైన్ క్రాస్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో మాకున్న హక్కులను కాపాడుకోవడమే మా తదుపరి కర్తవ్యం. మేము కచ్చితంగా వారికి బుద్ధి చెబుతాం’ అని అరాగ్చీ స్పష్టం చేశారు. ట్రంప్ మరో యుద్ధాన్ని మొదలుపెట్టారు..ఇరాన్పై అమెరికా దాడులకు దిగడాన్ని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ ఖండించారు. ఇరాన్పై దాడులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో యుద్ధానికి తెరలేపారని విమర్శించారు. ఈ యుద్దంతో అమెరికా సాధించింది ఏమీ లేదనే విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎటువంటి గణనీయమైన సైనిక లక్ష్యాలను ఛేదించడంలో విఫలమైందన్నారు. ఇక్కడ ఇరాన్ స్వల్ప నష్టాన్ని మాత్రమే చవిచూసిందన్నారు.ఆ దుస్సాహసం వద్దు.. రష్యా వార్నింగ్ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా దాడులు చేయడానికి దిగడానికి ముందుగానే రష్యా క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. ఇజ్రాయిల్-ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా ఇదివరకే స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. ఏదైనా జరగొచ్చు..ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని అమెరికాను పరోక్షంగా హెచ్చరించిన రష్యా.. నేరుగా రంగంలోకి దిగితే యుద్ధం మరింత ముదరడం ఖాయం. ఇరాన్కు ఆది నుంచి మద్దతు ఇస్తూ వస్తున్న రష్యా.. ఇప్పుడు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఇరాన్ రక్షణమంత్రితో భేటీ అనంతరం రష్యా తదుపరి కర్తవ్యం ఏమటనేది తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ రష్యా యుద్ధంలోకి దిగి ఇరాన్కు మద్దతిస్తే మాత్రం భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ శాంతి చర్చలు అనేది చాలా కీలకమని వారు భావిస్తున్నారు. ఇరాన్ రక్షణమంత్రితో జూన్ 23వ తేదీన పుతిన్ భేటీలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యుద్ధాన్ని ఇక్కడితో ముగిస్తే మంచిదని ఇరాన్కు పుతిన్ ఆదేశాలు ఇస్తే ఫర్వాలేదు కానీ, నేరుగా రష్యా కూడా యుద్ధంలోకి వస్తే మాత్రం సైనిక పరంగా రెండు అగ్రదేశాల మధ్య వార్ మరింత హీట్ పుట్టించే అవకాశాలు కూడా లేకపోలేదు. -
ఉక్రెయిన్ మొత్తం మాదే.. పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటేనని.. ఉక్రెయిన్ మొత్తం రష్యాదే అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం తమదేనని అన్నారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెర లేపాయి.రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ..‘ఉక్రెయిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఇదే విషయం నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఉక్రెయిన్ తమకు తాముగా సమస్యలను సృష్టించుకుంటోంది. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటే. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం మాదే. ఉక్రెయిన్ నగరం సుమీని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం మాకు లేదు. ఉక్రెయిన్లో శాంతి సాధించాలనుకుంటే మాతో కలిసి రావాలి. మేము ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అలాగే, ఉక్రెయిన్ లొంగిపోవాలని కూడా మేము కోరుకోవడం లేదు. రష్యా శాంతికి కట్టుబడే ఉంది. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆకాంక్షలను వదులుకోవాలి. ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాలపై మాస్కో నియంత్రణను అంగీకరించాలి. ఉక్రెయిన్ స్వతంత్రంగా మారిన 1991 ఒప్పందాలను గుర్తుచేసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.Russians and Ukrainians are one people, and in that sense, the whole of Ukraine is ours — Putin 😳 pic.twitter.com/krghibrx0m— Frontalforce 🇮🇳 (@FrontalForce) June 20, 2025ఖండించిన పుతిన్అయితే, ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని నివాస ప్రాంతాలపై తాము దాడి చేశామన్న వ్యాఖ్యలను పుతిన్ ఖండించారు. తమ సైన్యం అటువంటి లక్ష్యాలను ఢీకొట్టలేదని వెల్లడించారు. తాము నివాస గృహాలపై దాడులు చేయలేదని, సైనిక స్థావరాలపైనే చేశామన్నారు. జెలెన్ స్కీతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కానీ గతేడాది తన పదవీకాలం ముగియడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన చట్టబద్ధతను కోల్పోయారని ఆరోపించారు.ఈ సందర్భంగా పుతిన్..‘జెలెన్ స్కీతో సహా ఎవరినైనా కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది సమస్య కాదు. ఉక్రెయిన్ ఆయనకు చర్చలు జరిపే బాధ్యత అప్పగిస్తే, జెలెన్ స్కీనే అనుమతించండి. అసలు ప్రశ్న ఏమిటంటే ఫలితంగా వచ్చే పత్రాలపై ఎవరు సంతకం చేస్తారు? సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. జెలెన్ స్కీ అధ్యక్ష పదవీకాలం గతేడాది అధికారికంగా ముగిసింది. మార్షల్ లా విధించడం వల్ల అతడి వారసుడిని ఎన్నుకోలేదు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం పదవీ కాలం ముగిస్తే అధ్యక్ష అధికారాలను పార్లమెంటు స్పీకర్కు బదిలీ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగవచ్చని జెలెన్ స్కీ వాదిస్తున్నారు. అయితే తీవ్రమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు మేము చట్టపరమైన అంశాల గురించి శ్రద్ధ వహిస్తాం. సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. లేకపోతే జెలెన్ స్కీ తర్వాత ఎవరు వచ్చినా దానిని చెత్తబుట్టలో వేస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఆ దుస్సాహసం వద్దు.. అమెరికాకు రష్యా వార్నింగ్
మాస్కో: ‘ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో తాము భాగస్వాములం కావొచ్చు. కాకపోవచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా ఒకడుగు ముందకేసి మరీ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇజ్రాయిల్-ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. కాగా, ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య యుద్ధం భీకర రూపాన్ని దాల్చింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసమైంది. ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపిస్తోంది. చాలా నగరాలు నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. వలసదారులు తప్పితే ఇరాన్ నగరాల రోడ్లపై ఎవరూ కనిపించడం లేదు. -
ప్రసూతివార్డునూ వదలని రష్యా డ్రోన్లు
కైవ్: రష్యా మరోమారు ఉక్రెయిన్పై భీకర దాడులకు దిగింది. రాజధాని కైవ్ను లక్ష్యంగా చేసుకుని, ఇక్కడి ఒడెసాలోని ఒక ఆస్పత్రిలోని ప్రసూతివార్డుపై డ్రోన్లతో దాడి చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ మీడియాకు తెలిపింది. దీనికిముందు కూడా ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లతో భారీ దాడులకు తెగబడింది. ఉక్రెయిన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిగా రష్యా వరుస దాడులను కొనసాగిస్తోంది. శత్రు డ్రోన్లు నగరంలోని అనేక జిల్లాలపై ఒకేసారి దాడి చేస్తున్నాయని కైవ్ సైనిక పరిపాలన అధికారి తైమూర్ త్కాచెంకో టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో తెలిపారు. నివాస భవనాలను మంటలు చుట్టుముట్టాయని, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలంలో సేవలు అందిస్తున్నారని అన్నారు. దక్షిణ ఒడెసా ఓడరేవులో భారీ డ్రోన్ దాడి జరిగిందని, అలాగే అత్యవసర వైద్య భవనం, ప్రసూతి వార్డుతో పాటు నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని, డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయని ఒడెసా ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ కైపర్ టెలిగ్రామ్లో తెలిపారు. ప్రసూతి ఆసుపత్రిపై జరిగిన దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, బాధితులు, సిబ్బంది అప్రమత్తమై ముందుగా భవనాన్ని ఖాళీ చేశారని తెలిపారు. అయితే భవనం ధ్వంసమయ్యిందని పేర్కొంటూ, దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్పై రష్యా ప్రారంభించిన ఈ యుద్ధంలో వేలాదిమంది పౌరులు మరణించారు. వారిలో అధిక శాతం ఉక్రేనియన్లు ఉన్నారు. ఇది కూడా చదవండి: ఎనిమిది నిమిషాలు చనిపోయి.. ఏమైందో చెప్పిన మహిళ -
ట్రంప్తో ఫైటింగ్.. మస్క్కు రష్యా బంపరాఫర్
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)ల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎలాన్ మస్క్ను రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. మస్క్ తమ దేశానికి రావాలని.. రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్కు అవకాశం కల్పిస్తామని రష్యా తెలిపింది. ఈ మేరకు దిమిత్రి నోవికోవ్ చెప్పుకొచ్చారు.డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహ బంధం బీటలు వారింది. ఈ నేపథ్యంలో మస్క్ను మచ్చిక చేసుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది. తాజాగా రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోవ్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ భిన్నమైన వ్యక్తి. ఆయన ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తోంది. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్కు కూడా రష్యాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని మస్క్ కోరుకోవడం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు.మరోవైపు.. ట్రంప్, మస్క్ల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ నిరాకరించారు. ఇది యూఎస్ సమస్య అని, తమకు ఇందులో జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము అనుకుంటున్నట్లు తెలిపారు.Breaking News 🔴Russian MP Dmitry Novikov states that Elon Musk may be offered political asylum in Russia. pic.twitter.com/rp2pwqomuD— Global Report (@Globalrepport) June 6, 2025ఇదిలా ఉండగా.. నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు. -
400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగింది. ఏకంగా 400 డ్రోన్లు, 40 క్షిపణులను ప్రయోగించి, అతిపెద్ద దాడికి పాల్పడింది. ఈ దాడి దేశమంతటినీ ప్రభావితం చేసిందని, లెక్కలేనంత మంది గాయపడ్డారని, వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాకు చెందిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను లక్ష్యంగా చేసుకుని, ఉక్రెయిన్ ‘ఆపరేషన్ స్పైడర్వెబ్’ను నిర్వహించిన దరిమిలా, రష్యా తాజాగా ఉక్రెయిన్పై భీకరదాడి చేసింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ‘ఈరోజు, మన దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరాల్లో రెస్క్యూ ఆపరేషన్తో పాటు అత్యవసర కార్యకలాపాలు రోజంతా కొనసాగాయి. రష్యన్లు 400కు మించిన డ్రోన్లు, 40కిపైగా క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో 80 మంది గాయపడ్డారు. కొందరు ఇప్పటికీ శిథిలాల కింద విలవిలలాడుతున్నారు. ప్రపంచంలోని కొందరు ఇటువంటి దాడులను ఖండించరు. పుతిన్ ఈ కోవకు చెందిన వ్యక్తి. యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.ఉక్రెయిన్ రాజధాని కైవ్లో ఈ దాడి కారణంగా ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు. లుట్స్క్లో ఇద్దరు పౌరులు, చెర్నిహివ్లో మరొక వ్యక్తి మృతిచెందారు. మొత్తం ఆరుగురు మరణించారని, పలువురు గాయపడ్డారని ఉక్రేనియన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ (సీఎన్ఎన్) మీడియాకు తెలిపింది. రష్యా జరిపిన ఈ సైనిక దాడి ఇరు దేశాల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న దాడులలో అతిపెద్ద దాడి. కైవ్ ఉగ్రవాద చర్యలకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: కాళ్ల బేరానికి పాక్.. ‘సింధు ఒప్పందం’పై వేడుకోలు -
కొన్నాళ్లు కొట్టుకోనీ!
వాషింగ్టన్/కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. రెండు దేశాలనూ ఇంకొన్నాళ్లు కొట్టుకోనివ్వడమే మేలని వ్యాఖ్యానించారు. గురువారం వైట్హౌస్లో జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్తో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవి మరీ చిన్నపిల్లల మాదిరిగా కీచులాడుకుంటున్నాయంటూ ఆక్షేపించారు. ‘‘కొన్నిసార్లు ఓపికున్నంత సేపు కొట్టొకోనివ్వడమే మేలు. తర్వాత ఇద్దరినీ చెరోవైపు లాగేయాలి. నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పా’’ అని ట్రంప్ అన్నారు. అయితే, ‘‘నా మాట వినకపోతే చాలా కఠినంగా వ్యవహరిస్తా. యుద్ధానికి తెర దించకపోతే రెండు దేశాలపైనా ఆంక్షలు విధిస్తా’’ అంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు.రష్యా డ్రోన్ దాడుల్లో ఐదుగురు మృతిబుధవారం రాత్రి ఉత్తర ఉక్రెయిన్లోని ప్రిలుకీ నగరంపై రష్యా డ్రోన్ దాడిలో ఐదుగురు మరణించారు. ‘‘స్థానిక ఫైర్ చీఫ్ ఒలెక్జాండర్ లెబిడ్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయి. ఆయన భార్య, కుమార్తె, ఏడాది వయసున్న మనవడు చనిపోయారు’’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. చిన్నారి తల్లి కీవ్లో పోలీసు అధికారి. అక్కడ రష్యా దాడులు పెరగడంతో బాబును తల్లిదండ్రుల దగ్గర వదిలేందుకు వచ్చి తనతో పాటుగా బలైంది. పుతిన్తో ట్రంప్ ఫోన్ సంభాషణ జరిగిన కొద్ది గంటల్లోపే ప్రిలుకీపై దాడి జరగడం గమనార్హం. ఆదివారం తమ వైమానిక స్థావరాలపై జరిపిన దాడులకు గట్టి ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ తనతో అన్నట్లు అనంతరం ట్రంప్ చెప్పారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు సాగిస్తుండటం తెల్సిందే. -
రష్యాకు తత్వం బోధపడాలి!
శాంతి సాధన కోసం తుర్కియేలో రష్యా–ఉక్రెయిన్ల మధ్య చర్చలకు 24 గంటల ముందు ‘ఆపరేషన్ స్పైడర్స్ వెబ్’ పేరిట ఉక్రెయిన్ ప్రయోగించిన వందలాది డ్రోన్లు ఆదివారం రష్యా సైనిక స్థావరాలు అయిదింటిలో భారీ విధ్వంసం సృష్టించగలిగాయి. మరోవైపు రష్యా అంతకుముందూ, ఆ తర్వాతా ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇలా పరస్పర దాడుల నేపథ్యంలో సోమవారం జరిగిన చర్చలు సహజంగానే గంటన్నరలో ముగిశాయి. కరచాలనాలు లేకుండా, కాల్పుల విరమణ ఊసెత్తకుండా యుద్ధఖైదీల మార్పిడిపై ఒప్పందం కుదుర్చుకుని రెండు బృందాలూ నిష్క్రమించాయి. అయిదు స్థావరాలపై ఉక్రెయిన్ దాడులకు ప్రయత్నించిన మాట వాస్తవమే అయినా మూడు చోట్ల దాడుల్ని నిరోధించగలిగామని రష్యా చెప్పుకుంటోంది. అందుకు భిన్నంగా తమ డ్రోన్లు రష్యాలోని 41 బాంబర్ విమానాలను ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ వివరిస్తోంది. దానికి వేలకోట్ల నష్టం వాటిల్లిందని చెబుతోంది. రష్యా దాడుల పర్యవసానంగా ఈ మూడేళ్ల కాలంలో ఉక్రెయిన్ సైన్యం వేలాదిమందిని కోల్పోయింది. ఇలాంటి నష్టాలను పెద్ద దేశం కనుక రష్యా భర్తీ చేసుకోగలుగుతోంది. అందుకే నల్లసముద్రంలో రష్యా దూకుడును తగ్గించేందుకు ఉక్రెయిన్ పూర్తిస్థాయిలో డ్రోన్లను నమ్ముకున్నట్టు కనబడుతోంది. యుద్ధం మొదలైన తొమ్మిది నెలల తర్వాత ఉక్రెయిన్ తొలిసారి 2022 డిసెంబర్లో రష్యా భూభాగంలో దాడులు మొదలు పెట్టింది. ఈ మూడేళ్ల కాలంలో తన స్థావరాలు, ఇంధన డిపోలు, యుద్ధ విమానాల గోడౌన్లు పటిష్టం చేసుకోవటంలో రష్యా శ్రద్ధ పెట్టిన మాట నిజమే అయినా ఉక్రెయిన్ సైతం డ్రోన్ల వినియోగంలో తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే పనిలోబడింది. ఆ విషయంలో అది విజయవంతమైందని ఆదివారంనాటి దాడులు వెల్లడిస్తున్నాయి. ప్రత్యర్థి దేశం తమతో పోలిస్తే పిపీలకమని, తమది అగ్రరాజ్యం, సంపన్న దేశమని మిడిసిపడే పరిస్థితి వర్తమాన కాలంలో ఎవరికీ లేదని ఉక్రెయిన్ దాడి వెల్లడిస్తోంది. యుద్ధం తప్పనిసరైనప్పుడు అందుకు అనుగుణంగా లోతైన అధ్యయనం చేసి, ఎప్పటికప్పుడు తనను తాను తీర్చిదిద్దుకున్న పక్షమే దీటుగా నిలబడగలుగుతుంది. ఉక్రెయిన్ ఆ పని చేయగలిగిందని ఈ ఉదంతం నిరూపిస్తోంది. యుద్ధం ప్రారంభించిందీ, దాన్ని వద్దు వద్దని ఎంతమంది చెబుతున్నా వినకుండా కొనసాగిస్తున్నదీ రష్యాయే గనుక అది ప్రస్తుత నష్టానికి తనను తానే నిందించుకోవాలి. చర్చలు ప్రారంభమయ్యాకైనా గౌరవప్రదంగా కాల్పుల విరమణకు సిద్ధమై తన డిమాండ్లేమిటో చెబితే వాటిపై ఉక్రెయిన్ వైఖరేమిటో తేటతెల్లమయ్యేది. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినా, నిలిచిపోయిన యుద్ధాన్ని తిరిగి కొనసాగనీయరాదన్న ఆత్రుత అందరిలో వుండేది. అందువల్ల కొంత రాజీకి ఉక్రెయిన్ను ఒప్పించటానికి కూడా ప్రయత్నాలు సాగేవి. కానీ చర్చలకు ఒప్పుకున్నాక కాల్పుల విరమణ ఇంకా ఉనికిలోకి రాలేదన్న ఏకైక కారణంతో అది దాడుల్ని కొనసాగించింది. రష్యా దురాక్రమించిన భూభాగమంతా వెనక్కిస్తే తప్ప యుద్ధ విరమణ ఉండబోదని మొన్న జనవరి నెలాఖరున ఉక్రెయిన్ చెప్పటంతో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ఇకపై అమెరికా నిఘా సమాచారం అందబోదని ప్రకటించారు. తాజా దాడులు గమనిస్తే ఉక్రెయిన్ ఆ అవరోధాన్ని కూడా అధిగమించగలిగిందని అర్థమవుతుంది. పైగా రష్యా గడ్డపైకి ట్రక్కుల్లో డ్రోన్లు తీసుకెళ్లి, లక్ష్యాలను చేరుకోగానే అవి ఒక్కసారిగా ఎగిరి యుద్ధ విమానాలను ధ్వంసం చేసేలా పథకం రచించింది.ఈ పరిణామానికి రష్యా ఎటూ ఆందోళన పడుతుంది. కానీ పాశ్చాత్య దేశాలు సైతం కంగారు పడక తప్పదు. ఎందుకంటే ఎవరి నిఘా సాయమూ లేకుండా చవగ్గా లభించే డ్రోన్లతో రష్యావంటి దేశంలో పెనువిధ్వంసం సృష్టించగలగటం మాటలు కాదు. తమ పొరుగునేవుండి, తమ ప్రోత్సాహంతో రష్యాను చీకాకు పర్చటానికి ముందుకొచ్చిన చిన్న దేశం సైనికంగా ఇంత పటిష్టం కావటం పాశ్చాత్య దేశాలు జీర్ణించుకోలేనిది. 2014 మొదట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా వుండిన విక్టర్ యెనుకోవిచ్ తమ కీలుబొమ్మ కాలేదని అతన్ని కుట్రపూరితంగా పడగొట్టి జెలెన్స్కీని ప్రతిష్టించింది పాశ్చాత్య దేశాలే. అందుకు అమెరికా సైతం దన్నుగా నిలబడింది. నాటోను తూర్పువైపు విస్తరించాలన్న ఆ దేశాల దురాలోచనే ఇందుకు కారణమని గ్రహించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ దురాక్రమణకు తెరతీశారు. డ్రోన్ దాడుల్లో రష్యా కోల్పోయిన యుద్ధ విమానాలు టియూ–95, టియూ–160 విమానాలు. అవి క్రూయిజ్ క్షిపణుల్ని ప్రయోగించగల సామర్థ్యం వున్నవి. ఉక్రెయిన్ చెబుతున్నదే నిజమైతే రష్యా వైమానిక పాటవం 34 శాతం కోల్పోయిందని సైనిక నిపుణుల అంచనా. వీటిని తిరిగి సమకూర్చుకోవాలంటే వేలాది కోట్ల రూబుళ్ల వ్యయమవుతుంది. రష్యాకు తత్వం బోధపడినట్టేనా? తమ దాడులతోపాటు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షల తీవ్రతను పెంచాలన్నది జెలెన్స్కీ వాదన. కానీ అమెరికా కనుసన్నల్లో నడిచే ఆ దేశాలు అందుకు సిద్ధపడలేవు. యుద్ధాన్ని ప్రారంభించటం సులభమే, కొనసాగించటమూ పెద్ద కష్టం కాదు. కానీ ముగించటం అత్యంత క్లిష్టమైనది. ఇరుపక్షాలకూ అప్పటికే యుద్ధం ప్రతిష్టాత్మకంగా మారిపోతుంది. విరమణకు సిద్ధపడితే దేశాన్ని పాదాక్రాంతం చేశారన్న అపఖ్యాతి వస్తుంది. అలాంటి అవమానాన్ని దిగమింగటానికి జెలెన్స్కీ సిద్ధంగా వున్నా పుతిన్ ససేమిరా అనటమే ప్రస్తుత సమస్య. ఇప్పటికే ఎంతో జాప్యం జరిగింది. కనుక ఈ యుద్ధం ఆపటానికి ప్రపంచ దేశాలు ప్రయత్నించాలి. తగిన హామీలిచ్చి పుతిన్ను ఒప్పించాలి. -
రణ పంచతంత్రం
అగ్రరాజ్యం అమెరికాకు సరిసాటిగా ప్రపంచంలోనే పేరెన్నికగన్న రష్యా గత మూడేళ్లుగా ఉక్రెయిన్ను యుద్ధంలో ముచ్చెమటలు పట్టిస్తోంది. యుద్ధం తొలినాళ్లలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ను వందలాది ట్యాంక్లతో చుట్టేసి ఆక్రమించినంత పనిచేసిన రష్యా ఆతర్వాత కాస్తంత వెనుక్కు తగ్గింది. అణ్వాయుధాలు లేని ఉక్రెయిన్ ఏనాటికైనా తన ముందు తలవంచక తప్పదన్న రష్యా నిఘా నిర్లక్ష్యం తాజాగా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఉక్రెయిన్ డ్రోన్ల దండు ‘స్పైడర్ వెబ్’ పేరుతో చేసిన దాడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్తతరహా రణతంత్రంగా మార్మోగిపోతోంది.దీంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు యుద్ధవ్యూహాలకు పదునుపెట్టక తప్పదని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. గతంలో యుద్ధట్యాంకులను ఎంత త్వరగా ముందుకు ఉరికిస్తే అంత త్వరగా శత్రుదేశ భూభాగం మన వశం అవుతుందనే భావన ఉండేది. ఇప్పుడు ఎంత మెరుపువేగంతో డ్రోన్లను సరైన లక్ష్యందిశగా పంపితే అంత త్వరగా సమరక్షేత్రంలో జైత్రయాత్ర పూర్తిచేయొచ్చనే వాదన మొదలైంది. ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ దాడి ప్రపంచవ్యాప్తంగా ఐదు రకాలుగా రణవ్యూహాలను రాటుదేల్చాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. ఆ ఐదింటి గురించి ఓసారి పరిశీలిస్తే..1. దాడి కంటే వ్యూహం కీలకంయుద్ధంలో ఎంత బలంగా కొట్టామనేది కాదు. ఎక్కడ ఎప్పుడు ఎలా కొట్టామనేది ముఖ్యం. దాడి కంటే వ్యూహం ప్రధానమని తాజా ఘటన మరోసారి నిరూపించింది. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కంటే ముందు.. ముందస్తు ప్రణాళికలో ఎలాంటి పొరపాట్లులేకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. రష్యా వైమానికస్థావరాలపై దాడి కోసం తాము దాదాపు ఏడాది, ఏడాదిన్నరకాలంగా వ్యూహరచన చేస్తున్నామని ఆదివారం దాడి తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఖచ్చితమైన దాడి కంటే అత్యంత స్పష్టమైన ప్రణాళిక అనేదే యుద్ధవిజయానికి కీలకం. కొత్త తరహా వ్యూహాన్ని రచించడం, దాని అమలుకు సిబ్బందిని మోహరించడం, దాడి చేయడం, దాడి తర్వాత అక్కడి నుంచి మెరుపువేగంతో అదృశ్యమవడం అనేవి ముఖ్యం.2. రవాణా మార్గాలు.. రణతంత్ర ఆయుధాలుయుద్ధంలో సరిహద్దుల వద్దకు క్షిపణులను, భారీ బాంబులను తరలించడానికి స్వదేశంలోని రహదారులనే ఏదేశమైనా ఉపయోగించుకుంటుంది. కానీ ఉక్రెయిన్ ఈ దాడిలో రష్యన్ రహదారులనూ ఉపయోగించుకుంది. డ్రోన్లను సరిహద్దు దాటించాక ఎవరూ గుర్తుపట్టకుండా చెక్క క్యాబిన్లలో సర్దిపెట్టి వాహనాల్లోకి ఎక్కించారు. తర్వాత వందల కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుమార్గంలోనే తీసుకెళ్లారు. సరిహద్దు దాటొచ్చిన డ్రోన్లను ఉక్రెయిన్ సమీప ప్రాంతాల్లో ఉపయోగించకుండా ఇలా వందల కిలోమీటర్లు తరలిస్తుందనే రష్యా అధికారులు అస్సలు ఊహించలేదు.అందుకే సుదూర ప్రాంతాల్లో ఎక్కడా వాహనాల తనిఖీలు జరగలేదు. యుద్ధంవేళ దేశవ్యాప్తంగా భారీ కంటైనర్లను సైతం తనిఖీచేయాలనే కొత్త నిబంధనను ఈ ఉదంతం తెరమీదకు తెస్తోంది. ప్రతీ కంటైనర్ను తనిఖీచేస్తే ఇంతటి దాడుల నుంచి ఏ దేశమైనా రక్షణ పొందొచ్చనే కొత్త పాఠాన్ని ఈ దాడి బోధిస్తోంది. రష్యాలో జరిగే అక్రమ సరకు రవాణా మార్గాలను ఉక్రెయిన్ తనకు అనుకూలంగా మలుచుకుంది. ఏదైనా దేశంలో జరిగే స్మగ్లింగ్, అక్రమ రవాణా అనేది ఇలాకూడా వైమానికస్థావరాలపై దాడులకు పరోక్షంగా కారణమవుతుందని ఈ ఉదంతం చాటుతోంది.3. బుల్లి డ్రోన్తోనూ భారీ లక్ష్యం బద్దలు!ఆదివారం రష్యాలో ధ్వంసమైన విమానాలను ఉక్రెయిన్ ప్రధాన భూభాగం నుంచి సుదూర ప్రాంతాల్లో నిలిపి ఉంచారు. ఈ విమానాలను ఉక్రెయిన్ తన సొంత భూభాగం నుంచి లక్ష్యంగా చేసుకుని దాడిచేయాలంటే దీర్ఘశ్రేణి క్షిపణి కావాలి. ఆ క్షిపణి తయారీకి భారీ స్థాయిలో వ్యయం తప్పదు. సైబీరియా, ఆర్కిటిక్ ఖండ సమీప రష్యా వైమానిక స్థావరాలపై దాడి చేయాలంటే అత్యంత సుదూరాలకు ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణులు అవసరం. కానీ ఇవేం లేకుండానే ఇదే పనిని బుల్లి డ్రోన్లు అత్యంత సులభంగా పూర్తిచేయగలవని తాజా ఘటనతో స్పష్టమైంది. అంటే సుదూర లక్ష్యల ఛేదనకు వందల కోట్ల ఖర్చుతో తయారైన క్షిపణులతో పనిలేదని ఈ ఘటనతో తేలిపోయింది. లక్ష్యం ఎంత దూరంగా ఉందనేది ముఖ్యంకాదు. దానికి ఎంత దగ్గరి నుంచి బద్దలుకొట్టగలం అనేదే ప్రధానం.4. తక్కువ వ్యయంతో ఎక్కువ నష్టం చేయొచ్చు..ముల్లును ముల్లుతోనే తీయాలనేది పాత సామెత. యుద్దవిమానాలను కూల్చేయాలంటే మనం కూడా యుద్ధవిమానంతోనో, క్షిపణితోనో దాడి చేసి నాశనంచేయాల్సిన పనిలేదని ఈ దాడి కొత్త విషయాన్ని చెబుతోంది. అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న బాంబర్ విమానాలను నాశనం చేయడానికి అత్యంత చవకైన డ్రోన్లు ఉంటే చాలు. ఉక్రెయిన్ దాడిలో రష్యాకు చెందిన 41 యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి.వాటి విలువ ఏకంగా రూ.60,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇంతటి శక్తివంతమైన అస్త్రాలను నిర్వీర్యంచేసేందుకు మనం కూడా అంతే స్థాయిలో ఖర్చుచేయాల్సిన పనిలేదని ఈ దాడి ఘటన తేటతెల్లంచేసింది. స్పైడర్స్ వెబ్ దాడి తర్వాత రణతంత్రాల పాఠాలను తమకూ బోధించాలని కొన్ని మిత్రదేశాలు బతిమాలినట్లు అంతర్జాతీయమీడియాలో కథనాలు వెలవడ్డాయి. అణ్వస్త్ర దేశంకాకపోయినా ఇప్పుడీ దాడితో ఉక్రెయిన్ ఒక్కసారిగా వార్ హాట్ఫేవరెట్గా నిలిచింది.5. మనం మాత్రమే రహస్యం అనుకుంటే సరిపోదు..రహస్య స్థావరం అనేది రహస్యంగా ఉంటేనే బాగుంటుంది. అందరికీ తెల్సిపోయాక రహస్య స్థావరం అంటే బాగోదు. గగనతల నిఘా నేత్రాలు కొలువైన శాటిలైట్లయుగంలో ప్రతీదీ బహిరంగమే. అందుకే ఫలానా చోట స్థావరం ఉందని తెలిసినా దానిపై దాడి చేయడం అసాధ్యం అనే స్థాయిలో దానికి భద్రత కల్పించడం అవశ్యమని తాజా ఘటనతో నిరూపితమైంది. నిఘా సంస్థ కార్యాలయంలో రహస్యాలు ఎంత భద్రంగా ఉంటాయో, నిఘా సంస్థ పరిసరాలు సైతం అంతే రక్షణాత్మకంగా ఉండాలని తాజా ఘటన చాటింది.రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ ఎఫ్ఎస్బీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం సమీపంలోనే తమ కమాండర్సెంటర్ను నిర్వహించామని ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో శత్రు దేశాలపై నిఘాతోపాటు స్వీయ నిఘాపైనా మరింత దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. అధునాతన ఆయుధాలకంటే అధ్భుతమైన ఆలోచనలే ఆయాదేశాలకు అసలైన అస్త్రాలుగా అక్కరకొస్తాయని స్పైడర్స్వెబ్ ఘటన ఉద్ఘాటిస్తోంది. -
తక్కువ ఖర్చుతో రష్యాలో ఉక్రెయిన్ బీభత్సం.. ప్రపంచ నేతల్లో ఇదే చర్చ!
కీవ్: ఆపరేషన్ స్పైడర్స్ వెబ్. వీడియోగేమ్ ఆడుతున్నంత అలవోకగా రష్యా భూభాగం 4 వేల కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుని వెళ్లి దాడులు చేసేందుకు ఉక్రెయిన్ చేపట్టిన కోవర్ట్ మిలటరీ ఆపరేషన్. ఇప్పుడిదే ప్రపంచ నేతల్లో హాట్ టాపిక్. ఎందుకంటే?.2022 నుంచి ప్రారంభమైన ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో ఓ వైపు శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధమంటూ ఉక్రెయిన్ భీకర దాడికి తెగబడింది. ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ పేరుతో రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఊహించని పరిణామంలో 40 రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా మాస్కో 60వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.అయితే, నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యంలో ఉక్రెయిన్ బీభత్సం ఎలా సృష్టించిందనేదే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న.🇺🇦 #Ukraine - 🇷🇺 #Russia: Ukraine struck four Russian airbases in a coordinated long-range drone attack, destroying over 40 aircraft, including Tu-95 and Tu-22M3 bombers, as well as an A-50 surveillance jet. The drones were smuggled deep into Russia, hidden inside wooden sheds… pic.twitter.com/y7L0wVTMS6— POPULAR FRONT (@PopularFront_) June 1, 2025 రహస్యంగా రష్యాలోకి డ్రోన్ల తరలింపుఈక్రమంలో రష్యాపై ఉక్రెయిన్ దాడి జరిపిన తీరుపై జాతీయ,అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా.. మూడు టైమ్ జోన్లు. 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు రష్యా వైమానిక స్థావరాలు. ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరిపేందుకు ఉక్రెయిన్ మార్కెట్లో అతి తక్కువ ధరకే ఒక్కో డ్రోన్ ఖరీదు 1200 డాలర్లు ఖర్చుతో మొత్తం 117 డ్రోన్లను సెమీ ట్రైలర్ ట్రక్కుల్లో నింపింది. ఇందుకోసం ట్రక్కును ప్రత్యేకంగా చెక్కతో డిజైన్ చేయించింది. Today, a brilliant operation was carried out. The preparation took over a year and a half. What’s most interesting, is that the “office” of our operation on Russian territory was located directly next to FSB headquarters in one of their regions.In total, 117 drones were used in… pic.twitter.com/tU0SMN9jdB— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 1, 2025మనుషుల అవసరం లేకుండానేమనుషుల సహాయం లేకుండా ఉక్రెయిన్లో ఉండి.. రష్యాలోకి చొరబడ్డ ట్రక్ డోర్లును ఓపెన్ చేయడం, ట్రక్కు లోపల ఉన్న డ్రోన్లు లోపలి నుంచి ఎగురుకుంటూ బయటకు రావడం, రష్యా బాంబర్ విమానాలపై మెరుపు దాడి చేయడం ఇదంతా ఉక్రెయిన్ రిమోట్ కంట్రోల్తో చేసింది. ఫలితంగా కొన్ని గంటల వ్యవధిలో రష్యా 40 యుద్ధ విమానాలు సర్వనాశనం చేసింది. ఈ హాని విలువ సుమారుగా 7 బిలియన్ (దాదాపు రూ.60వేల కోట్లకు)పైగా ఉన్నట్లు అంచనా.రష్యన్ భద్రతా సంస్థకు సమీపం నుంచి ఈ దాడిలో అత్యంత కీలకమైనది సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలోని బిలాయా ఎయిర్ బేస్. ఇది ఉక్రెయిన్ నుండి దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సాధారణంగా ఉక్రెయిన్ డ్రోన్లు చేరుకోలేని దూరం. అందుకే ప్రత్యేక వ్యూహంతో డ్రోన్లను దగ్గరకు తీసుకెళ్లి దాడి చేశారు. ఈ ఆపరేషన్ను రష్యన్ భద్రతా సంస్థ (FSB) కార్యాలయానికి సమీపంలో కోఆర్డినేషన్ సెంటర్ నుంచి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. స్పైడర్స్ వెబ్ అనే కోడ్ పేరుతో జరిగిన అతిపెద్ద దాడిని చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఆపరేషన్గా అభివర్ణించారు. “The ‘office’ of our operation on Russian territory was located directly next to an FSB headquarters in one of their regions,” — Zelenskyy. pic.twitter.com/RC10fBPUrG— Special Kherson Cat 🐈🇺🇦 (@bayraktar_1love) June 1, 2025ఈ దాడిలో మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్న సైనిక విమానాల్లో టు-95, టు-22ఎం, టు-160 వంటి వ్యూహాత్మక బాంబర్లతో పాటు ఏ-50 విమానం కూడా ఉంది. ఈ దాడి ద్వారా రష్యా క్రూయిజ్ మిసైల్ వాహక బాంబర్లలో సుమారు 34శాతం నష్టం జరిగింది.జెలెన్స్కీ ఈ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడి కోసం 18 నెలలపాటు ప్రణాళికలు రూపొందించారు. దాడికి ముందు, ఆపరేషన్లో పాల్గొన్న అన్ని గూఢచారులను రష్యా భూభాగం నుండి ఉక్రెయిన్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడిని ధ్రువీకరించింది. కానీ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఈ విమానాల నష్టం వల్ల ఉక్రెయిన్పై విధ్వంసకర క్షిపణి దాడులను అందించగల సామర్ధ్యం రష్యాకు తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏడాదిలోపు సుదర్శన చక్రాలిచ్చేస్తాం
న్యూఢిల్లీ: కొత్తగా తయారుచేసి భారత్కు ఇవ్వాల్సిన ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థ(సుదర్శన చక్ర)లను 2025–2026 షెడ్యూల్ ప్రకారం అందజేస్తామని రష్యా స్పష్టంచేసింది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్పైకి భారత్ క్షిపణులను ప్రయోగించడం, ప్రతిగా అటు నుంచి దూసుకొచ్చిన క్షిపణులను భారత ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకోవడం తెల్సిందే. దీంతో ఒప్పందం ప్రకారం మిగతా ఎస్–400 యూనిట్లనూ త్వరగా తయారుచేసి సరఫరాచేయాలని భారత్ ఇటీవల రష్యాను కోరింది. దీనిపై రష్యా డెప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఇన్ ఇండియా రోమన్ బబూష్కిన్ సోమవారం స్పందించారు. ‘‘భారత్, పాక్ పరస్పర సైనిక చర్యల్లో ఎస్–400 అద్భుత పాటవాన్ని ప్రదర్శించిందని మేం కూడా విన్నాం. భారత్తో భాగస్వామ్యానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో యూరప్ మాత్రమేకాదు భారత్లోనూ రక్షణ సన్నద్ధత అత్యంత కీలకమైన అంశంగా మారింది. మరో రెండు యూనిట్లను భారత్కు అందించాల్సి ఉంది. వాటిని షెడ్యూల్ ప్రకారం తయారుచేసి డెలివరీ ఇస్తాం’’అని బబూష్కిన్ అన్నారు. 2018లోనే రష్యాతో భారత్ రూ.46,000 కోట్లతో ఎయిర్ డిఫెన్స్ డీల్ కుదుర్చుకోవడం తెల్సిందే. ఇందులోభాగంగా ఐదు స్క్వాడ్రాన్ల ఎస్–400 యూనిట్లను రష్యా తయారుచేసి భారత్కు ఇవ్వనుంది. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ మరికొద్ది వారాల్లో ఖరారుకానుంది. -
ఆపరేషన్ స్పైడర్స్వెబ్...నయా పెరల్ హార్బర్!
నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యానికి చెందిన ఏకంగా 41 బాంబర్ విమానాలను ఏదో వీడియోగేమ్ ఆడుతున్నంత అలవోకగా దాని సొంతగడ్డ మీదే ధ్వంసం చేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా పెను కలకలం సృష్టించింది. అది కూడా ఏ ఒక్కచోటో కాదు. రష్యావ్యాప్తంగా ఏకంగా మూడు టైమ్ జోన్లలో, ఏకంగా 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు వైమానిక స్థావరాలపై ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరగడం విశేషం. ఆ దెబ్బకు రష్యా బాంబర్ శ్రేణి విమానాల్లో మూడో వంతు తుడిచిపెట్టుకుపోయాయి! అత్యంత సంక్లిష్టమైన ఇంతటి ఆపరేషన్ను పూర్తి కచ్చితత్వంతో, కేవలం డ్రోన్ల సాయంతో కారుచౌకగా, తనవైపు ఎలాంటి ప్రాణనష్టమూ లేకుండా పూర్తి చేసిన వైనం రక్షణ నిపుణులనే విస్మయపరిచింది. ఆధునిక ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అతి పెద్ద, అత్యంత సంక్లిష్టమైన సర్జికల్ స్ట్రైక్ ఇదేనని చెబుతున్నారు. అంతేగాక ఏ కోణం నుంచి చూసినా అత్యంత విజయవంతమైన దాడిగా కూడా ఇది నిలిచింది. రష్యా చరిత్రలో అతి పెద్ద నిఘా వైఫల్యంగా కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ దాడులను తమ పాలిట ‘పెరల్ హార్బర్’ ఉదంతంగా రష్యా మీడియానే అభివర్ణిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం చివర్లో హవాయిలోని పెరల్ హార్బర్పై జపాన్ మెరుపు దాడులకు దిగి అమెరికా యుద్ధనౌకలను సముద్రంలో ముంచేసింది. ఈ ఉదంతం అమెరికాను యుద్ధంలోకి లాగడమే గాక జర్మనీ, జపాన్ తదితర అక్షదేశాల ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ‘ఆపరేషన్ స్పైడర్స్వెబ్’ పేరిట ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులు రష్యాను ఆ స్థాయిలో దెబ్బకొట్టాయని అక్కడి మీడియా వాపోతోంది. అది అక్షరాలా నిజమేనని రక్షణ నిపుణులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆధునిక యుద్ధ వ్యూహాలను తక్షణం సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది మరోసారి గుర్తు చేసిందని వారంటున్నారు.ఇంత భారీ ఆపరేషన్కు రష్యా గడ్డ మీద కూడా అవసరమైన మద్దతు తప్పనిసరి. ఇందుకోసం ఉక్రెయిన్ రష్యాలో ఏకంగా ఆఫీసే తెరిచింది! అది కూడా రష్యా అంతర్గత భద్రతా విభాగం ఎఫ్ఎస్బీ కార్యాలయం పక్కనేనని జెలెన్స్కీ వెల్లడించడం విశేషం. ఏ ప్రాంతంలో అన్నది మాత్రం చెప్పలేదు. → మొత్తం ఆపరేషన్ను ఉక్రెయిన్ సీక్రెట్ సరీ్వస్ (ఎస్బీయూ) పక్కాగా నిర్వహించింది.→ దీన్ని జెలెన్స్కీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దాడి వెనక ఏడాదిన్నర ప్రణాళిక ఉన్నట్టు వెల్లడించారు. ‘‘రష్యా గడ్డ నుంచే ఎంతోమంది ఇందుకు తోడ్పడ్డారు. వారందరినీ దాడులకు ముందే సురక్షితంగా తరలించాం. మావైపు ప్రాణనష్టం లేకుండా రష్యాను చావుదెబ్బ తీశాం’’ అన్నారు. రష్యాపై మరిన్ని దాడులు తప్పవన్నారు.→ డ్రోన్ దాడుల అనంతరం రష్యా ప్రతీకార దాడుల్లో 12 మంది ఉక్రెయిన్ సైనికుల మృతికి బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్ పదాతి దళాధిపతి మేజర్ జనరల్ మైకేలియో ద్రాపత్యు రాజీనామా చేశారు.ఎక్కడెక్కడ దాడులు... → ఒలెన్యా (ముర్మాన్స్క్ ), బెలయా (ఇర్కుట్స్క్ –సైబీరియా), ద్యాగిలెవొ (సెంట్రల్ ర్యాజాన్), ఇవనొవొ → ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బెలయా ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉంటుంది! → వీటిలో ఒలెన్యా, బెలయా స్థావ రాల మధ్య దూరం ఏకంగా 6,000 కి.మీ.! ఇవి పరస్పరం మూడు టైమ్ జోన్ల దూరంలో ఉండటం విశేషం. → అమూర్, ఇవనోవో, ర్యాజన్ తదితర ప్రాంతాల్లోనూ డ్రోన్ దాడుల యత్నాలు జరిగాయని రష్యా ధ్రువీకరించింది.గతంలోనూ... మూడేళ్ల పై చిలుకు యద్ధంలో అనూహ్య, ఆకస్మిక దాడులతో రష్యాకు ఉక్రెయిన్ తీవ్ర నష్టం కలిగించడం ఇది తొలిసారేమీ కాదు. → 2022 ఏప్రిల్లో రష్యా యుద్ధనౌక మోస్క్ వాను నెప్ట్యూన్ యాంటీ షిప్ మిసైళ్లతో ఉక్రెయిన్ నల్లసముద్రంలో ముంచేసింది. ళీ 2022 అక్టోబర్లో ఆక్రమిత క్రిమియాను రష్యా భూభాగానికి కలిపే కీలక కెర్చ్ బ్రిడ్జిని బాంబులతో పేల్చేసింది. ళీ 2024 ఆగస్టులో ఉక్రెయిన్ సైన్యం తొలిసారిగా సరిహద్దులు దాటి రష్యా భూభాగంపై మెరుపు దాడులకు దిగి కుర్క్స్ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకుంది. తీరని అవమానం మిగిల్చిుంది!ట్రక్కుల్లో తరలించి...సింపుల్ ప్లానింగ్. పూర్తి గోప్యత. పక్కా రిహార్సల్స్. ఆకస్మిక దాడి. అమలులో మెరుపువేగం. 100 శాతం లక్ష్యసాధన. సర్జికల్ స్ట్రైక్స్ వంటి స్పెషల్ ఆపరేషన్స్ ఏ మేరకు సఫలమైందీ తేల్చేందుకు ప్రఖ్యాత సైనిక నిపుణుడు అడ్మిరల్ విలియనం మెక్రావెన్ సిద్ధాంతీకరించిన గీటురాళ్లు. వాటన్నింటినీ పూర్తిస్థాయిలో మేళవించిన ఆపరేషన్గా స్పైడర్స్ వెబ్ నిలిచింది. → మొత్తం ఆపరేషన్లో ఉక్రెయిన్ చాలావరకు పౌర మౌలిక సదుపాయాలనే వాడుకుంది. → ఇంతటి భారీ స్థాయి దాడులకు ప్రణాళిక రచించిన ఉక్రెయిన్, అందుకు సిద్ధం చేసిన డ్రోన్లను రష్యాలోకి తేలిగ్గా దొంగచాటుగా తరలించడం విశేషం. → అనంతరం వాటిని ట్రక్కుల్లో చెక్క కంటైనర్లలో పెట్టి ఎయిర్బేస్లకేసి తరలించారు. → ఒక్కో కంటైనర్లో 36 డ్రోన్లను ఉంచారు. వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. → దాడుల్లో ఎక్కడా ప్రత్యక్షంగా సిబ్బందిని నియోగించే అవసరమే లేకుండా పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు చేశారు. → ట్రక్కులను వైమానిక స్థావరాలకు అతి సమీపంలోకి తీసుకెళ్లారు. → అక్కడినుంచి నిర్ధారిత సమయంలో కంటైనర్ల పైకప్పును రిమోట్ ద్వారా తెరిచారు. → ఆ వెంటనే వాటిలోంచి డ్రోన్లు పైకెగిరి లక్ష్యాలపైకి దూసుకెళ్లాయి. సరిగ్గా విమానాలపై పడి పేలిపోయాయి. కంటైనర్ల నుంచి డ్రోన్లు పైకి ఎగురుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా మీడియా విడుదల చేసింది. వాటిని అడ్డుకునేందుకు కొందరు సాయుధులు ట్రక్కులపైకి ఎక్కుతున్న దృశ్యాలు కూడా కొన్నింట్లో కనిపిస్తున్నాయి.కారుచౌకే.. కానీ ఖతర్నాక్ రష్యా ఎయిర్బేస్లపై దాడుల్లో ఉక్రెయిన్ వాడింది ఎఫ్పీవీ (ఫస్ట్ పర్సన్ వ్యూ) రకం డ్రోన్లు. → ఇవి కారుచౌకగా దొరుకుతాయి. పేలుడు పదార్థాలను బిగించి పంపగల ఒక్కో ఎఫ్పీవీ డ్రోన్ ఖరీదు కేవలం రూ.42 వేలు మాత్రమేనని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. → అయితే గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో వీటికివే సాటి. → డ్రోన్కు అమర్చిన కెమెరా సాయంతో అక్కడి పరిసరాలను దాని ఆపరేటర్ ప్రత్యేక కళ్లద్దాల సాయంతో లైవ్లో చూడటమే గాక వీడియో తీయగలడు. రిమోట్గా ఆపరేట్ చేయగలడు. → పరిసరాల చిత్రీకరణ వంటి సైనికేతర పనుల్లో ఈ డ్రోన్లను విరివిగా వాడుతుంటారు. వీటి రేంజ్ కొన్ని కిలోమీటర్లకే పరిమితం.రష్యా అణుదాడి చేస్తుందా...? ఉక్రెయిన్ డ్రోన్ దాడులపై రష్యా తీవ్ర అవమాన భారంతో ఉడికిపోతోంది. కారుచౌకైన డ్రోన్లతో కోలుకోలేని దెబ్బతీయడాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారం తప్పదని రష్యా రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కనుక ఉక్రెయిన్పై భారీ స్థాయిలో విరుచుకుపడటం ఖాయమే. → ఉక్రెయిన్ ప్రధానంగా నాటో సభ్యదేశాలు సమకూర్చిన ఆయుధాలనే తనపై వాడుతోంది. కనుక యూరప్లోని నాటో దేశాల్లోని సైనిక స్థావరాలు, ఆయుధాగారాలను రష్యా లక్ష్యంగా చేసుకోవచ్చు. వాటిపై దాడులు చేస్తామని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించింది కూడా. → ఉక్రెయిన్ బహుశా ఈ ప్రమాదాన్ని ముందే ఊహించింది. డ్రోన్ దాడులు పూర్తిగా తన పనేనని, నాటో మిత్రులకు ఏ సంబంధమూ లేదని జెలెన్స్కీ ప్రకటించారు. వాణిజ్యపరంగా సులువుగా అందుబాటులో ఉన్న డ్రోన్లనే దాడుల్లో వాడినట్టు వివరించారు. అందుకు రుజువుగా దాడుల ఫొటోలను విడుదల చేశారు. → నష్ట, అవమాన తీవ్రత దృష్ట్యా ఉక్రెయిన్పై రష్యా అణుదాడికి దిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.రష్యాకు నష్టం ఇలా... → 41 టీయూ–95, టీయూ–22ఎం3 దీర్ఘ శ్రేణి బాంబర్లు, దాడుల్లో వాటికి ఆద్యంతం దన్నుగా నిలిచే ఏ–50 నిఘా విమానాలపై డ్రోన్ దాడులు జరిగాయి. → వాటిలో 14 పూర్తిగా, మిగతా 27 చాలావరకు ధ్వంసమైనట్టు చెబుతున్నారు. → మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్నది ఈ విమానాలనే! → ఈ నష్టం విలువ కనీసం రూ.60 వేల కోట్ల (700 కోట్ల డాలర్ల)పై చిలుకేనని రష్యా రక్షణ శాఖే అంచనా వేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
OP Spider Web: రష్యాకు తగిన శాస్తే జరిగింది
కీవ్: ఉక్రెయిన్ తాజాగా రష్యా సైనిక వైమానిక స్థావరాలపై భీకర డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ మెగా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Ukrainian President Zelensky) సమర్థించుకున్నారు. ఇది అద్భుతమైన ఆపరేషన్గా అభివర్ణించిన ఆయన.. రష్యాకు భారీ స్థాయిలో నష్టం కలిగించిందని, ఆ దేశానికి తగిన శాస్తేనని ప్రకటించారు.Today, a brilliant operation was carried out — on enemy territory, targeting only military objectives, specifically the equipment used to strike Ukraine. Russia suffered significant losses — entirely justified and deserved.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 1, 2025‘స్పైడర్స్ వెబ్’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో ఉక్రెయిన్ మొత్తం 117 డ్రోన్లను ఉపయోగించిందని, దీనికి తగిన సంఖ్యలో డ్రోన్ ఆపరేటర్లు పాల్గొన్నారని జెలెన్స్కీ చెప్పారు. వారు రష్యా వైమానిక స్థావరాలలో ఉంచిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను ఢీకొట్టేలా చేశారని పేర్కొన్నారు. తమ సిబ్బంది ఈ దాడులు చేసేందుకు ఏడాది పాటు ప్రణాళిక వేశారని, అది ఇప్పుడు ఇది సంపూర్ణంగా అమలయ్యిందని, ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్(Special operation) అని గట్టినమ్మకంతో చెబుతున్నానని జెలెన్స్కీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ దాడితో రష్యన్లు 40 యూనిట్లకు పైగా వ్యూహాత్మక వైమానిక స్థావరాలను కోల్పోవడం తనకు సంతృప్తికరంగా అనిపించిందని, తాము ఇటువంటి దాడులను ఇకముందు కూడా కొనసాగిస్తామని జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడిలో కీవ్ సహాయం అందించిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఆయన తెలిపారు. తాము దాడి చేయడానికి కొద్దిసేపటి ముందు, తమకు రష్యా మరో దాడికి సిద్ధమవుతోందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రజలను అన్ని విధాలుగా రక్షించుకుంటామని అన్నారు. తాము ఈ యుద్ధాన్ని కోరుకోలేదని, యుద్ధాన్ని కొనసాగించాలని ఎంచుకున్నది రష్యన్లే అని జెలెన్స్కీ ఆరోపించారు. ఇస్తాంబుల్లో మాస్కో- కైవ్ మధ్య జరగనున్న శాంతి చర్చలకు ఒక రోజు ముందు ఉక్రెయిన్ ఈ దాడులకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి లో ప్రారంభమైంది. ఇరు దేశాలు పరస్పరం సరిహద్దు షెల్లింగ్, డ్రోన్ దాడులు, రహస్య దాడులు చేసుకుంటున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన సూచించారు.ఇది కూడా చదవండి: రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి -
ఉక్రెయిన్ అతిపెద్ద ఆపరేషన్.. 40 రష్యన్ విమానాలు ధ్వంసం!
కీవ్: రష్యాపై ఉక్రెయిన్ మెరుపు దాడికి దిగింది. తాజాగా ఉక్రెయిన్ చేసిన దాడుల్లో 40కి పైగా రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. .యుద్ధంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ చేపట్టిన అతిపెద్ద సైనిక చర్య ఇదే కావడం గమనార్హం. ఇది రష్యా వైమానిక బలగాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.రష్యాపై తాము చేసిన దాడుల్లో 40 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ మీడియా స్పష్టం చేసింది. సరిహద్దు నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు సైబీరియాలోని పలు సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడిందని తెలిపింది. ఇర్కుట్స్క్ ప్రాంత రష్యన్ గవర్నర్ ఈ దాడిని ధృవీకరించారు. శ్రీద్ని గ్రామంలోని సైనిక యూనిట్పై కీవ్ ఎటాక్ చేసిందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ సైబీరియాలోని ఒలెన్యా, బెలయాలోని వైమానిక స్థావరాలతో సహా నాలుగు రష్యన్ సైనిక వైమానిక స్థావరాపై ఏకకాలంలో దాడులు చేసింది.2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం!ఈ విధ్వంసకర దాడుల కారణంగా సుమారు 2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఈ దాడులు యుద్ధ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ ఇటీవలి కాలంలో డ్రోన్ టెక్నాలజీలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఈ దాడుల ద్వారా తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ దాడుల్లో ఏడుగురు మృతి చెందగా, 69 మందికి గాయాలయ్యాయి. 524 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశామని రష్యా చెబుతోంది. -
రష్యాలో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి, గాయాలు
మాస్కో: రష్యాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోయింది. అదే సమయంలో ప్యాసింజర్ రైలు వెళ్తున్న కారణంగా సదరు రైలు ప్రమాదానికి గురైంది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.⚡ BREAKING Russian Emergency crews are cutting through metal train cars to rescue trapped passengers. The Klimov–Moscow train was crushed after the blast, caused by the detonation of a bridge support in the Vygonichsky district of Russia’s Bryansk region.#Russia #Bryansk https://t.co/X6oD1mZJUk pic.twitter.com/RZoahsb4wC— ⚡𝙉𝙊𝙄𝙎𝙀 𝘼𝙇𝙀𝙍𝙏𝙎 (@NoiseAlerts) May 31, 2025ఈ సందర్భంగా బ్రయాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బొగోమాజ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాదం నేపథ్యంలో అత్యవసర సేవలు, ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. మృతిచెందిన వారిలో రైలు లోకో పైలట్ కూడా ఉన్నారు. ప్యాసింజర్ రైలు మాస్కో నుండి క్లిమోవ్కు వెళుతోందని అన్నారు.BREAKING: Multiple dead and wounded after bridge collapses onto passenger train in Russia's Bryansk region, according to BazaSabotage is suspected pic.twitter.com/S4v4c0aXfJ— Faytuks News (@Faytuks) May 31, 2025అయితే, గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రయాన్స్క్ ప్రాంతం రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉండటంతో డ్రోన్ దాడులు, బాంబు దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దాడుల ప్రభావంతో వంతెన కూలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. -
ఆర్ఐసీని పునరుద్ధరిద్దాం: రష్యా
మాస్కో: రష్యా–భారత్–చైనా త్రయం బంధాన్ని పునరుద్ధరించాలని రష్యా పిలుపునిచ్చింది. లద్దాఖ్లో సైనిక ప్రతిష్టంభనకు సంబంధించి భారత్, చైనా అవగాహనకు వచ్చిన నేపథ్యంలో మూడు దేశాలూ మరింతగా కలసి సాగాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. ‘‘రష్యా–భారత్–చైనా (ఆర్ఐసీ) కార్యకలాపాల పునరుద్ధరణపై మేం ఆ సక్తిగా ఉన్నాం. రష్యా మాజీ ప్రధాని యెవగనీ ప్రిమ కోవ్ చొరవతో చాలా ఏళ్ల క్రితం స్థాపించిన ఆర్ఐసీ పునరుద్ధరణ కోసం వేచి చూస్తున్నాం. వాటి మధ్య గతంలో ఏకంగా 20సార్లకు మించి అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి. సరిహద్దులో పరిస్థితిని సుల భతరం చేయడంపై భారత్, చైనా మధ్య అవగా హన కుదిరింది. కనుక ఆర్ఐసీ పునరుద్ధరణకు ఇదే సరైన సమయం’’ అని లావ్రోవ్ అన్నారు. పెర్మ్లో జరిగిన అంతర్జాతీయ సామాజిక, రాజకీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ను చైనా వ్యతి రేక కుట్రలోకి లాగేందుకు నాటో ప్రయ త్నిస్తోందని ఆరోపించారు. 2020 జూన్లో గల్వాన్ సంక్షోభం అనంతరం ఆర్ఐసీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. -
మూడో ప్రపంచ యుద్ధమే.. ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా వార్నింగ్
మాస్కో: అమెరికా, రష్యా మధ్య మాటల మంటలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఉక్రెయిన్తో శాంతి చర్చల్లో పాల్గొనకపోవడం ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించడం తెలిసిందే. ‘నేనే లేకుంటే రష్యా లెక్కలేనన్ని దుస్సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చేది’ అంటూ పుతిన్ తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ సన్నిహితుడు దిమిత్రి మెద్వెదేవ్ ఘాటుగా స్పందించారు. ‘‘నాకు తెలిసిన అతి పెద్ద దుస్సంఘటన ఒక్కటే. మూడో ప్రపంచ యుద్ధం! నా మాటల ఆంతర్యాన్ని ట్రంప్ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రపంచం మొత్తాన్నీ యుద్ధంలోకి లాగుతామన్నదే మెద్వెదేవ్ ఆంతర్యమని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవి నిజంగా నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలని ట్రంప్ సీనియర్ సలహాదారు, ఉక్రెయిన్ ప్రత్యేక రాయబారి కీత్ కెల్లాగ్ విమర్శించారు. -
రష్యాను కట్టడి చేయండి.. మూడు రోజుల్లో 900లకు పైగా డ్రోన్ల దాడి: జెలెన్ స్కీ
క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. మూడు రోజుల్లో 900లకు పైగా రష్యా డ్రోన్ల దాడి జరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. తమ దేశంపై రష్యా దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించిన జెలెన్ స్కీ.. ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరిపినా దాడులు ఆగడం లేదంటూ మండిపడ్డారు. రష్యాను కట్టడి చేయాలని.. అమెరికా, యూరప్లు కఠిన ఆంక్షలు విధించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.కాగా, ఉక్రెయిన్పై శనివారం రాత్రి నుంచి మొదలుకుని సోమవారం ఉదయం దాకా రష్యా భారీ వైమానికి దాడులకు పాల్పడింది. యుద్ధం మొదలైన ఈ మూడేళ్లలో అతి పెద్ద వైమానిక దాడులు ఇవే! ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇష్టమొచ్చినట్టు మనుషులను చంపుకుంటూ పోతూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని పుతిన్ చూస్తే అది అంతిమంగా రష్యా పతనానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘‘ఆయన తన దేశానికి మేలు చేసేలా మాట్లాడటం లేదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటా సమస్యలను సృష్టిస్తోంది. నాకది నచ్చడం లేదు. జెలెన్స్కీ మాట్లాడకపోవడమే మంచిది’’అని తన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. -
దూసుకొచ్చిన డ్రోన్లు.. పుతిన్పై హత్యాయత్నం?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)పై హత్యాయత్నం జరిగిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది!. పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల దాడి జరిగిందని.. అయితే ఆ ప్రయత్నాన్ని సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఆ దేశ సైన్యాధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.రష్యా న్యూస్ ఏజెన్సీ ఆర్బీసీ కథనం ప్రకారం రష్యా ఎయిర్ డిఫెన్స్ యూనిట్ కమాండర్ యూరీ డాష్కిన్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘మే 20-22 తేదీల మధ్య ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్లతో(Ukraine Drone Attacks) రష్యాపై దాడికి తెగబడింది. అయితే రష్యా వైమానిక దళం ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో 1,170 డ్రోన్లను నాశనం చేసింది... మే 20వ తేదీన కురుస్క్(Kursk)లో దాడి జరగ్గా.. 46 డ్రోన్లను రష్యా సైన్యం నాశనం చేసింది. అయితే అదే తేదీన పుతిన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఆయన హెలికాఫ్టర్ ప్రయాణిస్తున్న మార్గంలోకి హఠాత్తుగా డ్రోన్లు దూసుకొచ్చాయి. అయితే సకాలంలో వాటిని వైమానిక బలగాలు నేలకూల్చాయి. ఆపై అధ్యక్షుడి ప్రయాణం కొనసాగింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతోంది’’ అని యూరీ డాష్కిన్ వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన లేదు.మరోవైపు.. ఈ పరిణామం ఉక్రెయిన్ డ్రోన్ల సామర్థ్యంపై రష్యాకు ఆందోళన కలిగిస్తోందన్న చర్చ నడుస్తోంది. అయితే అసలు ఇది పుతిన్పై జరిపిన హత్యాయత్నమేనా? లేక ఉక్రెయిన్ ఆడుతున్న మైండ్ గేమా? అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. కౌంటర్గా రష్యా ఉక్రెయిన్పై ప్రతిదాడికి దిగింది. శనివారం రాత్రి రాజధాని కీవ్ నగరంతో పాటు పలు చోట్ల డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడింది. అయితే రష్యా దాడులపై అమెరికా సహా అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండడం ఏమాత్రం సరికాదని, ఇది పుతిన్ను మరింత రెచ్చిపోయేలా చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రత్యేక రాయబారి కీత్ కెల్లోగ్ రష్యా దాడులను తీవ్రంగా ఖండించారు. ఇదీ చదవండి: పుతిన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు, ఏమన్నారంటే.. -
పుతిన్కు పిచ్చి పట్టింది.. రష్యాకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణకు సంబంధించి మంతనాలు జరుగుతున్న వేళ పుతిన్ సైన్యం దాడులు చేయడంతో మండిపడ్డారు. పుతిన్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ అసహనం వ్యక్తపరిచారు.ట్రంప్ తాజాగా ట్విట్టర్లోని ట్రుత్ వేదికగా స్పందిస్తూ..‘రష్యా అధ్యక్షుడు పుతిన్ నాకు చాలా కాలంగా తెలుసు, మా మధ్య మంచి సంబంధం ఉంది. కానీ, ఇప్పుడు పుతిన్ వ్యవహారం సరిగా లేదు. ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు తెలియదు. ఉక్రెయిన్పై ఆయన బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. ఎటువంటి కారణం లేకుండా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. నగరాలపై దాడి చేస్తున్నాడు. అన్యాయంగా ప్రజలను చంపుతున్నాడు. నాకు ఇది అస్సలు ఇష్టం లేదు.Donald Trump Truth Social 05.25.25 08:46 PM ESTI’ve always had a very good relationship with Vladimir Putin of Russia, but something has happened to him. He has gone absolutely CRAZY! He is needlessly killing a lot of people, and I’m not just talking about soldiers. Missiles…— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) May 26, 2025పుతిన్.. ఉక్రెయిన్లోని ఒక భాగాన్ని మాత్రమే కాకుండా, మొత్తం ఉక్రెయిన్ను కోరుకుంటున్నారని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. బహుశా అది నిజమే కావచ్చు.. కానీ అలా చేస్తే, అది రష్యా పతనానికి దారి తీస్తుంది. అధ్యక్షుడు జెలెన్స్కీ తను మాట్లాడే విధానం ద్వారా తన దేశానికి ఎటువంటి మేలు చేయడం లేదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమస్యలను సృష్టిస్తుంది. అతడు తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లో రష్యా 367 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఉక్రేనియన్ వైమానిక దళం ప్రకారం, వారు 45 క్షిపణులను కూల్చివేసి 266 డ్రోన్లను ధ్వంసం చేశారు. అనేక నగరాల్లో భారీ విధ్వంసం జరిగింది. కీవ్తో సహా 30 కి పైగా నగరాలు, గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో కనీసం 12 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. -
ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా
కీవ్: రష్యా మరోసారి క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్పై భీకర దాడులకు పాల్పడింది. రాజధాని కీవ్తోపాటు ఇతర ప్రాంతాలే లక్ష్యంగా శనివారం రాత్రి చేపట్టిన దాడుల్లో కనీసం 12 మంది చనిపోగా పదుల సంఖ్యలో జనం క్షతగాత్రులయ్యారు. మొత్తం 69 క్షిపణులు, 298 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ పేర్కొంది. ఇరాన్ డిజైన్ చేసిన షహీద్ రకం డ్రోన్లు కూడా ఇందులో ఉన్నాయంది. మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఒకే రాత్రిలో రష్యా ఇంత భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగడం ఇదే మొదటిసారని తెలిపింది. శుక్రవారం మాదిరిగానే శనివారం రాత్రంతా కీవ్ వాసులు కంటిపై కునుకు లేకుండా గడిపారు. సైరన్ మోతలు, పేలుళ్లతో రాజధాని దద్దరిల్లింది. క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడి నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లో మంటలు చెలరేగాయి. కీవ్లో అత్యధికంగా నలుగురు మరణించగా, 16 మంది గాయపడ్డారని నగర భద్రతా విభాగం తెలిపింది. తర్వాత, జిటోమిర్ ప్రాంతంలో ముగ్గురు బాలలు సహా 12 మంది క్షతగాత్రులయ్యారు. సుమీ, మైకోలైవ్, ఖ్మెల్నిట్స్కీ, చరి్నహివ్, ఒడెసా, టెర్నోపిల్, పొల్టావా, నీప్రో, చెర్కసీ ప్రాంతాలపైనా దాడులు జరిగాయి. కీవ్ శివారులోని మర్ఖాలివ్స్కాలో పలు నివాసాలు మంటల్లో కాలిబుగ్గయ్యాయి. దాడుల అనంతరం మరో గ్రామం మొత్తం పొగలు, మంటలతో నిండిపోయింది. ఇక్కడ చోటుచేసుకున్న విధ్వంసం మరియుపోల్, బాఖ్ముత్లను తలపించిందని స్థానికుడొకరు పేర్కొన్నారు. రష్యా క్షిపణులు, డ్రోన్లతో 30కి పైగా నగరాలు, గ్రామాల్లో విధ్వంసం జరిగిందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా ఉద్దేశ పూర్వకంగా సామాన్యులపై దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఆంక్షలు విధించడం వంటి తీవ్రమైన ఒత్తిడి తేకుండా రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేయలేమన్నారు. ఇలా ఉండగా, ఉక్రెయిన్ శనివారం రాత్రి ప్రయోగించిన 110 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయని రష్యా రక్షణ శాఖ తెలిపింది.మూడో విడత ఖైదీల మార్పిడి రష్యా, ఉక్రెయిన్ అధికారుల మధ్య మూడో విడత యుద్ధ ఖైదీల మారి్పడి కొనసాగింది. ఒకవైపు భీకర దాడులు కొనసాగుతుండగానే ఆదివారం మరో 303 మంది ఖైదీలను ఇచి్చపుచ్చుకున్నామని ఇరుదేశాలు ప్రకటించాయి. తుర్కియేలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు వెయ్యి మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మారి్పడి చేసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా మొదటి విడతలో శుక్రవారం 390 మందిని, శనివారం మరో 307 మందిని పరస్పరం మార్చుకోవడం తెల్సిందే. వీరిలో వివిధ విభాగాలకు చెందిన సైనికులతోపాటు పౌరులు కూడా ఉన్నారు. మూడేళ్లలో మార్చుకున్న మొత్తం యుద్ధ ఖైదీల కంటే ఈ మూడు రోజుల్లో పరస్పరం అప్పగించుకున్న యుద్ధ ఖైదీల సంఖ్యే ఎక్కువని సమాచారం. -
మాస్కోలో భారత ఎంపీల బృందానికి తప్పిన ముప్పు!
న్యూఢిల్లీ: రష్యాలో భారత ఎంపీల బృందానికి భయానక అనుభవం ఎదురైంది. వాళ్లు ఎక్కిన విమానం ల్యాండ్ అవ్వకుండా గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు చాలా ఆలస్యంగా.. విమానం ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం మాస్కో ఎయిర్పోర్టుపై ఉక్రెయిన్ డ్రోన్తో దాడి చేసింది. దీంతో విమానాల రాకపోకలను ఆపేసి.. ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసేశారు. అయితే ఎయిర్పోర్ట్ మూసేయడంతో భారత ఎంపీలు ఉన్న విమానం చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. చివరకు అనుమతి లభించడంతో సేఫ్ ల్యాండ్ అయ్యింది. ఆపై భారత రాయబార ప్రతినిధులు వాళ్లకు స్వాగతం పలికి సురక్షితంగా హోటల్కు చేర్చారు.All-Party Delegation led by Member of Parliament Ms. Kanimozhi Karunanidhi @KanimozhiDMK arrives in Moscow to convey 🇮🇳’s strong resolve to fight terrorism in all its forms. @PMOIndia @narendramodi @DrSJaishankar @MEAIndia @Office_of_KK @PIB_India @DDIndialive @DDNational… pic.twitter.com/Qu57uV5WHJ— India in Russia (@IndEmbMoscow) May 22, 2025పాక్పై దౌత్య యుద్ధంలో భాగంగా.. ఆ దేశం ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తోందని, దానిని భారత్ ఎలా ఎదుర్కొంటోందని.. అలాగే భారత్ విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచానికి చాటిచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపిస్తోంది. మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. మాస్కోకు వెళ్లిన బృందానికి డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వం వహిస్తున్నారు. -
175 బిలియన్ డాలర్లతో ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’.. చైనా, రష్యా ఆందోళన..
వాషింగ్టన్: ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధం వాతావరణం కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వార్.. ఇక, ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ వంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రక్షణ వ్యవస్థల గురించి చాలా చర్చలు జరిగాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ దేశానికి కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. ఈ ‘గోల్డెన్ డోమ్’ కోసం ఏకంగా దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా( 175 బిలియన్ డాలర్లు)ఖర్చు చేస్తామని వెల్లడించారు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలోనే ‘గోల్డెన్ డోమ్’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి 25 బిలియన్ డాలర్ల ప్రారంభ నిధులు కేటాయిస్తున్నామని, అంతిమంగా 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజల కోసం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అత్యంత సాంకేతికతతో కూడిన మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాజెక్ట్ ను ఆమోదిస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అవతలి నుంచి అమెరికాపై క్షిపణి దాడులు చేసినా ఇది తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. స్పేస్ నుంచి దాడులు చేసినా అమెరికాకు ఏమీ కాదన్నారు. మన దేశం విజయంలో.. మనం భూమి మీద నివసించాలంటే ఇలాంటివి అవసరం అని ట్రంప్ పేర్కొన్నారు.🚨 #BREAKING: President Trump and Secretary Hegseth have announced the GOLDEN DOME missile defense system for the U.S."Golden Dome will be capable of catching missiles from across the world or even SPACE.""We'll be completing the job Reagan started 40 years ago!"Trump also… pic.twitter.com/MX1URx1fa0— Nick Sortor (@nicksortor) May 20, 2025యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ నాయకత్వంలో గోల్డెన్ డోమ్ నిర్మాణం జరుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీని నిర్మాణంలో భాగం కావడానికి కెనడా సైతం ఆసక్తిని చూపినట్లు తెలిపారు. డోమ్ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. దీనికి 542 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుండొచ్చని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశాన్ని క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లు, అణు దాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా దీని ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.చైనా, రష్యా ఆందోళన..ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్.. ఐరన్ డోమ్ వ్యవస్థను 2011 నుంచి ఉపయోగిస్తోంది. ప్రత్యర్థుల క్షిపణులు దూసుకొచ్చినా.. ఉక్కు కవచంలా వాటిని అడ్డుకునేందుకు టెల్అవీవ్ ఈ డోమ్ను ఉపయోగిస్తుంది. దీని నిర్మాణానికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. దీంతో అటువంటి గోల్డెన్ డోమ్ను అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా (USA) సైతం సిద్ధమయ్యింది. అయితే, ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా, రష్యా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల అంతరిక్షం యుద్ధభూమిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. ప్రపంచంలో అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశాయి. . @SecDef "The Golden Dome for America’s game changer. A generational investment in security in America and Americans..." pic.twitter.com/uazlPcCytR— DOD Rapid Response (@DODResponse) May 20, 2025 -
‘యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం.. కానీ’
కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని.. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ ఇందుకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. పుతిన్తో ట్రంప్ సోమవారం రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా ఫోన్ చర్చలు జరిపారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ కూడా చర్చించారు.ఈ క్రమంలో యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదంటూ జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యా నియమాలు ఏంటో తనకు తెలియదన్న జెలెన్స్కీ.. ఈ యుద్ధంలో మేము చాలా కోల్పోయామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తి కాల్పుల విరమణకు తాము సిద్ధం.. కానీ.. రష్యా అందుకు రెడీగా ఉన్నట్లు తనకు అనిపించడం లేదంటూ జెలెన్స్కీ చెప్పుకొచ్చారు.ముందుగా కాల్పుల విరమణను రష్యా అంగీకరించాలని.. ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలంటూ జెలెన్స్కీ కోరారు. మరో వైపు, ఈ కాల్పుల విరమణను ప్రతిపాదించినందుకు ట్రంప్నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
తక్షణ చర్చలకు రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయి: ట్రంప్
వాషింగ్టన్: కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ ఇందుకు అంగీకరించినట్టు వెల్లడించారు. చర్చల విధి విధానాలను ఆ దేశాలే నిర్ణయించుకుంటాయని చెప్పారు. పుతిన్తో ట్రంప్ సోమవారం రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా ఫోన్ చర్చలు జరిపారు. అనంతరం జెలెన్స్కీతోనూ చర్చించారు.‘‘యుద్ధం ముగిశాక అమెరికాతో రష్యా భారీ ఎత్తున వ్యాపారం చేయాలని పుతిన్ అభిలషించారు. అందుకు నేను సరేనన్నాను’’ అని చెప్పుకొచ్చారు. తద్వారా ఉక్రెయిన్ కూడా భారీగా లబ్ధి పొందుతుందని అభిప్రాయపడ్డారు. యుద్ధానికి తెర దించడంపై పుతిన్, ట్రంప్ మధ్య ఇది మూడో ఫోన్ సంభాషణ కావడం విశేషం! చర్చల వివరాలను జెలెన్స్కీతో పాటు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ తదితర దేశాధినేతలతో పంచుకున్నట్టు అధ్యక్షుడు వివరించారు. -
ఛీ ఛీ.. ఈమె టీచరేనా.. బాలుడి జీవితం సర్వనాశనం!
మాస్కో: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ వివాహిత టీచర్.. విద్యార్థితో అనుచితంగా ప్రవర్తించింది. 11 ఏళ్ల బాలుడితో హద్దులు దాటి ప్రవర్తించింది. సదరు బాలుడిని లైంగికంగా వేధింపులకు గురిచేసి.. తన శారీరక అవసరాలను తీర్చుకుంది. ఈ విషయం బాలుడి తల్లికి తెలియడంతో.. ఆమె వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో, ఆమెకు తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ దారుణ రష్యాలో చోటుచేసుకుంది. ఈ మేరకు ది న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది.వివరాల ప్రకారం.. రష్యాలో ఉన్న సెయింట్ పీటర్స్బర్గ్ ఉత్తర శివారులోని పాఠశాలలో అన్నా ప్లాక్సుక్ (27) టీచర్లో పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థి(11)తో ఆమె అనుచితంగా ప్రవర్తించారు. ఆమె శారీరక అవసరాల కోసం అతడిలో లైంగిక వాంఛలకు ప్రేరేపించారు. క్లాస్రూమ్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన శారీరాన్ని తాకే విధంగా ప్రవర్తించింది. అతడి పెదవులను సైతం ముద్దాడింది. అంతేకాకుండా సదరు విద్యార్థికి వాట్సాప్లో ఆమె నగ్న చిత్రాలను పంపించింది. మెసేజ్లు చేయడం, వీడియోలు పంపించడం చేసింది. దీంతో, బాలుడు.. ఆమె చేసే పనులను అడిక్ట్ అయిపోయాడు.ఒకానొక సమయంలో బాలుడు.. ఇంట్లో ఉండగా వింతగా ప్రవర్తించాడు. అనుమానం వచ్చిన అతడి తల్లి.. ఫోన్ చెక్ చేయడంతో టీచర్ బండారం బయటకు వచ్చింది. దీంతో, ఆమెను పేరెంట్స్ నిలదీశారు. పాఠశాల ప్రిన్సిపాల్కు టీచర్పై తల్లి ఫిర్యాదు చేసింది. అనంతరం, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు టీచర్ ప్లాక్సుక్కు తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఒక సంవత్సరం పాటు బోధించకుండా నిషేధం విధించింది.Shocking: Anna Plaksyuk, a 27-year-old married primary school teacher from Toksovo, Russia, sentenced to 9 years for sexually abusing an 11-year-old boy. The “dream teacher” sent naked selfies, exposed by the victim’s mother. Justice served! pic.twitter.com/SXv0WrZHxs— Make Europe Great Again - M.E.G.A (@ScaryEurope) May 16, 2025 -
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం.. యువతితో మస్క్పై పుతిన్ కుట్ర?
వాషింగ్టన్: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్పై రష్యా యుద్ధంపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభంలో రహస్యాల్ని తెలుసుకునేందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk)పై రష్యా యువతితో వలపు వల విసిరినట్లు మాజీ ఎఫ్బీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఏజెంట్ జోనాథన్ బౌమా సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మన్ బ్రాడ్కాస్టర్ జెడ్డీఎఫ్ తీసిన డాక్యుమెంటరీలో జోనాథ్ బౌమా మాట్లాడారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా రష్యా ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాన్ మస్క్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్పై ఓ యువతి ప్రయోగించారు. మస్క్కు ఉన్న జూదం,మత్తు పదార్ధాల వినియోగంలాంటి వీక్నెస్ను అడ్డం పెట్టుకుని యుద్ధం సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. పుతిన్కు ఆపరేషన్ గురించి తెలుసా?ఇక మస్క్, పీటర్ థీల్పై జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ పుతిన్ కనుసన్నల్లోనే జరిగింది. పుతిన్ అనుమతి లేకుండా స్పై చేయరు కదా? అని జోనాథన్ బౌమా అన్నారు. అయితే, రష్యా జరిపిన సీక్రెట్ ఆపరేషన్లో మస్క్, పీటర్ థీల్ చిక్కుకున్నారా? లేదా? అనే విషయాల్ని వెల్లడించేందుకు జోనాథన్ బౌమా విముఖత వ్యక్తం చేశారు.కాగా, ఎఫ్బీఐలో 16 ఏళ్లు పని చేసిన జోనాథ్ బౌమా ఓ మీడియా సంస్థకు రహస్య సమాచారాన్ని అందించారు. దీంతో అమెరికా ప్రభుత్వం జోనాథ్ బౌమాను అరెస్ట్ చేసింది. చివరకు లక్షడాలర్ల పూచికత్తుతో బెయిల్పై విడుదలయ్యారు. -
యుద్ధ ఖైదీల మార్పిడి
ఇస్తాంబుల్: సర్వత్రా ఆసక్తి రేపిన రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణ చర్చలు ఆశాజనకంగా మొదలయ్యాయి. వెయ్యి మంది యుద్ధ ఖైదీల పరస్పర మార్పిడికి అంగీకారం కుదిరింది. రష్యా ప్రతినిధి వ్లాదిమిర్ మెడిన్స్కీ ఈ మేరకు వెల్లడించారు. వాటిమధ్య దాదాపు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఇదే అతి పెద్ద ఖైదీల మార్పిడి కానుంది. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు శుక్రవారం ఇస్తాంబుల్లో సమావేశమై తమ తమ డిమాండ్లు వినిపించారు. 2022లో యుద్ధం మొదలయ్యాక వాటి మధ్య ఇది తొలి ముఖాముఖి కావడం విశేషం. ఉక్రెయిన్ ప్రతినిధి వర్గానికి రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్, రష్యా బృందానికి అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు మెడిన్స్కీ సారథ్యం వహించారు. తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ చర్చలను ప్రారంభించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇరు పక్షాలను కోరారు. తక్షణం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ముఖ్యమన్నారు. ‘‘కాల్పుల విరమణ ప్రతిపాదనలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించాం. పుతిన్, జెలెన్స్కీ భేటీ ఏర్పాటు చేయాలన్న ఉక్రెయిన్ విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పాం. చర్చలను కొనసాగించేందుకు రష్యా సిద్ధంగా ఉంది’’ అని మెడిన్స్కీ వెల్లడించారు. కీలకాంశాలను పరిష్కరించుకుని, చర్చల్లో పురోగతి సాధించాలని సూత్రప్రాయంగా అభిప్రాయానికి వచ్చినట్టు ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే రష్యా ముందెన్నడూ ప్రస్తావించని డిమాండ్లను ముందుకు తెచ్చిందని విమర్శించారు. కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలవాలంటే ఆక్రమిత ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సైన్యాలను ఉపసంహరించాలన్నది అందులో ఉన్నట్టు చెప్పారు. రెండు గంటల్లోపే చర్చలు ముగిసినట్టు తుర్కియే పేర్కొంది.పుతిన్కు ఆసక్తి లేదు: జెలెన్స్కీచర్చల పురోగతిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పెదవి విరిచారు. కాల్పుల విరమణకు కూడా అంగీకారం కుదరలేదంటే దౌత్య మార్గంపై పుతిన్కు విశ్వాసం లేదని అర్థమన్నారు. అల్బేనియా రాజధాని టిరానాలో 47 యూరప్ దేశాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. చర్చల్లో రష్యా ప్రతిపాదనలు అంగీకారయోగ్యంగా లేవని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ పేర్కొన్నారు. ‘‘చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జెలెన్స్కీ ఫోన్లో చర్చించారు. ఈ విషయంలో మేమంతా సహకారంతో సాగుతాం. సమష్టి బాధ్యత వహిస్తాం. ట్రంప్తో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్ కూడా ఆమోదించాయి’’ అని వెల్లడించారు.త్వరలో పుతిన్తో భేటీ: ట్రంప్రష్యా ఉక్రెయిన్ చర్చలపై ట్రంప్ స్పందించారు. పుతిన్తో తాను అతి త్వరలో భేటీ అయ్యే అవకాశముందన్నారు. ‘‘మా భేటీతో యుద్ధం ముగియవచ్చు, ముగియకపోవచ్చు. అయితే యుద్ధం కొనసాగితే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అంటూ గమ్మత్తైన వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్ చర్చలకు తాను వెళ్లని కారణంగానే పుతిన్ కూడా హాజరవలేదని ట్రంప్ గురువారం పేర్కొనడం తెల్సిందే. తన కుమార్తె టిఫానీకి కొడుకు పుట్టిన కారణంగానే ఉన్నట్టుండి అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ‘అందమైన నా మనవడిని చూడాలనుంది’ అని పేర్కొన్నారు. పుతిన్, ట్రంప్ భేటీకి వేళైందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కూడా అన్నారు. వారి శిఖరాగ్రానికి ఏర్పాట్లకు సమయం పడుతుందని చెప్పారు. -
పుతిన్ లేకుండానే ఉక్రెయిన్–రష్యా చర్చలు
ఇస్తాంబుల్: తుర్కియే వేదికగా ఉక్రెయిన్తో జరిగే మొట్టమొదటిసారిగా జరిగే ప్రత్యక్ష శాంతి చర్చలకు అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదని రష్యా తెలిపింది. అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు వ్లాదిమిర్ మెడిన్స్కీ సారథ్యంలోని బృందం గురువారం తుర్కియే రాజధాని అంకారా చేరుకుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు. ముగ్గురు సభ్యులతో కూడిన సీనియర్ అధికారుల బృందానికి సాయంగా నలుగురితో కూడిన నిపుణుల బృందం కూడా ఉందన్నారు. ఉక్రెయిన్తో జరిగే చర్చలకు అధ్యక్షుడు పుతిన్ వెళ్లడం లేదన్నారు. మూడేళ్లుగా జరిగే యుద్ధానికి ముగింపు పలికేందుకు తుర్కియేలో జరిగే శాంతి చర్చలకు రావాలని పుతిన్కు జెలెన్స్కీ సవాల్ విసిరారు. తాజా పరిణామంపై తుర్కియేలోని అంటాల్యాలో జరుగుతున్న నాటో సమావేశానికి హాజరైన జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ.. కీలకమైన విధాన నిర్ణయాలను తీసుకునే అధికారం ఆ బృందంలోని వారెవరికీ లేదని వ్యాఖ్యానించారు. అందుకే చర్చలకు తాను సైతం వెళ్లనని, రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్ సారథ్యంలో ప్రతినిధి బృందాన్ని పంపుతానని ప్రకటించారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్తో మాట్లాడాక చర్చల తేదీ, ప్రాంతం వెల్లడిస్తామన్నారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామన్న యూరప్ నేతల హెచ్చరికలు, ట్రంప్ ఒత్తిడితో పుతిన్ ఈ చర్చలకు హాజరయ్యే అవకాశముందని సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. చివరికి ఇరుదేశాల అధ్యక్షులకు బదులుగా ప్రతినిధి బృందాలను పంపడం నిరాశ కలిగించిందని పరిశీలకులు అంటున్నారు. నేను వెళ్లనిదే పుతిన్ రారు తుర్కియేలో జరిగే చర్చలకు పుతిన్ హాజ రు కాకపోవడంపై ఖతార్లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయం తనకు ఆశ్చ ర్యం కలిగించలేదన్నారు. ‘నేను వెళ్లనిదే ఆ యన అక్కడికి రావడం అసాధ్యం’అంటూ పుతిన్ నిర్ణయాన్ని సమరి్ధస్తూ మాట్లాడారు. -
పాకిస్తాన్కు చుక్కలే.. రష్యాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను సమర్థంగా తిప్పికొట్టడంలో ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థలు కీలకంగా పనిచేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ వ్యవస్థలు ‘సుదర్శన చక్ర’గా భారతదేశ రక్షణ శాఖకు తురుపుముక్కగా మారాయి. శత్రుదేశాల క్షిపణులను నేలకూల్చడంలో వీటికి తిరుగులేదు.ఈ నేపథ్యంలో మరిన్ని ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందజేయాలని రష్యాకు భారత ప్రభుత్వం తాజాగా విజ్ఞప్తి చేసింది. అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. భారత్ వినతిని అతిత్వరలోనే రష్యా అంగీకరించే సూచనలు కనిపిస్తున్నట్లు తెలిపాయి. ఇటీవలి పరిణామాల తర్వాత గగనతల రక్షణ వ్య వస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రష్యా నుంచి ఐదు ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు కోసం 2018లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ 5.43 బిలియన్ డాలర్లు. 2021 నుంచి దశలవారీగా ఐదు వ్యవస్థలు రష్యా నుంచి భారత్కు చేరుకున్నాయి. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ఎస్-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఓ వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ని ధ్వంసం చేస్తుంది. ఒకేసారి 36 టార్గెట్లను ట్రాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే, 12 టార్గెట్స్పై ఒకే సారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్ చేస్తూ.. 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిస్సైల్స్ను కూల్చే సత్తా వీటి సొంతం. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేసి ఛేదిస్తుంది. వీటిని రియాక్షన్ టైమ్ చేలా వేగంగా ఉంటుంది. ఎస్-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ను ఫైర్ చేసేందుకు ఐదు నిమిషాల్లోనే రెడీ చేయొచ్చు. ఇందులో 3డీ ఫేజ్డ్ అరే రాడార్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. -
మాస్కోలో అట్టహాసంగా విక్టరీ డే
మాస్కో: నాజీ జర్మనీపై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ రష్యా శుక్రవారం 80వ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకుంది. మాస్కోలోని రెడ్ స్క్వేర్లో జరిగిన భారీ పరేడ్లో అధ్యక్షుడు పుతిన్తోపాటు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా తదితరులు పాల్గొన్నారు. సుమారు 11,500 బలగాలు, ట్యాంకులు, శతఘ్ని వాహనాలు తదితర 180కి పైగా మిలటరీ వాహనాలు పరేడ్లో పాల్గొన్నాయి. ఖండాంతర అణు బాలిస్టిక్ క్షిపణులతో కూడిన యార్స్ లాంఛర్లు రెడ్ స్క్వేర్ పరేడ్లో ప్రత్యేకార్షణగా మారాయి. గగనతలంలో యుద్ధ విమానాలు చేసిన ఏరోబిక్ విన్యాసాలు ఆహూతులను అలరించాయి. నాలుగేళ్లుగా ఉక్రెయిన్తో జరుగుతున్న యు ద్ధంతో ప్రపంచ శక్తిగా తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు, మిత్ర దేశాలతో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు పుతిన్ ఈ కార్యక్రమాన్ని వేదికగా మార్చుకున్నారని పరిశీలకులు అంటున్నారు. -
యుద్ధంలో పిట్టల్లా రాలిపోతున్న రష్యా దళాలు
-
ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్
-
భారత్కు అండగా ఉంటాం: రష్యా
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. భారత్ కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్ చేసిన పుతిన్.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతిచెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పుతిన్,. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందుకు తీసుకురావాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు స్సష్టం చేశారుఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్లో పాకిస్తాన్కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని రెండురోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన రద్దైంది. మే 9వ తేదీ మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ బదులు.. భారత దౌత్య ప్రతినిధి హాజరవుతారని క్రెమ్లిన్ వర్గాలు ఇవాళ ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ మీద సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యా ప్రతీ ఏటా మే 9వ తేదీని విక్టరీ డేగా నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది 80వ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రపంచ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపింది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ వర్గాలు ధృవీకరించాయి కూడా.అయితే ఆయన బదులు.. ప్రతినిధి హాజరవుతారని ఇప్పుడు ప్రకటన వెలువడింది. అయితే పహల్గాం ఘటన తర్వాత.. పాక్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలోనే మోదీ పర్యటన రద్దై ఉండొచ్చని పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. -
ఎనర్జిటిక్ హేమంగి..! న్యూక్లియర్ సైన్స్లో..
నూక్లియర్ సైన్స్లో మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మకమైన మేరీస్లో్కడోస్కా–క్యూరీ ఫెలోషిప్ ప్రోగ్రామ్(ఎంఎస్సీఎఫ్పీ)కు ఇండియన్ స్టూడెంట్ హేమంగి శ్రీవాస్తవ ఎంపికైంది. మాస్కో పవర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ (ఎంపీఈఐ) లో హేమంగి ఎలక్ట్రానిక్స్ అండ్ నానో ఎలక్ట్రానిక్స్లో మాస్టర్స్ చేస్తుంది.2023లో రష్యాలో నిర్వహించిన ‘వరల్డ్ యూత్ ఫెస్టివల్’కు హాజరైన హేమంగి అక్కడ ఒక మహిళా ప్రొఫెసర్ నోటినుంచి నూక్లియర్ ఎనర్జీ ప్రాముఖ్యత గురించి విన్న మాటలు ‘ఎంపీఈఐ’కి దరఖాస్తు చేయడానికి స్ఫూర్తిని ఇచ్చాయి. తాను ఎంచుకున్న సబ్జెక్ట్ గురించి ‘సైన్స్, ఆర్ట్ల సమ్మేళనం’ అంటుంది హేమంగి. మరింతమంది మహిళలు నూక్లియర్ సెక్టర్లోకి రావడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) మేరీస్లో్కడోస్కా–క్యూరీ ఫెలోషిప్ ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టింది. (చదవండి: ఖాదీ కమ్ బ్యాక్) -
శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్ కీలక ప్రకటన
రోమ్: ఉక్రెయిన్ సంక్షోభం ముగింపు దిశగా కీలక అడుగు పడిందా?. ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో నేరుగా చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమ్మతి తెలిపారా?. శుక్రవారం అమెరికా దౌత్యవేత్తతో జరిగిన చర్చల సారాంశం ఇదేనని తెలుస్తుండగా.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఈ విషయంపై నేరుగా ప్రకటన చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో(Pope Francis Funeral) పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోమ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒప్పందానికి చాలా దగ్గరగా పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ‘‘చర్చల్లో ఒక మంచి రోజు. రష్యా ఉక్రెయిన్లు నేరుగా సమావేశం అయ్యేందుకు అంగీకరించాయి. చాలావరకు అంశాలపై సానుకూలంగా రెండు దేశాలు స్పందించాయా’’ అని మీడియాతో ప్రకటించారాయన. ఆ తర్వాత ఇదే విషయాన్ని ట్రూత్ సోషల్ ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేశారు.మరోవైపు.. క్రెమ్లిన్(Kremlin) వర్గాలు తమ అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్తో జరిగిన చర్చ సానుకూలంగా జరిగిందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. శాంతి ఒప్పందానికి తాము సిద్ధమేనని, అయినప్పటికీ ఎట్టిపరిస్థితుల్లో క్రిమియాను వదులుకునేందుకు ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదని ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. కానీ, శుక్రవారం టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ట్రంప్ ఇంటర్వ్యూలో.. క్రిమియా రష్యాతోనే ఉంటుందని, జెలెన్స్కీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించడం గమనార్హం.అమెరికన్ బిలియనీర్ అయిన స్టీవ్ విట్కాఫ్(Steve Witkoff).. ట్రంప్కు అత్యంత నమ్మకస్తుడు కూడా. అందుకే ఆయన్ని ఈ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం కోసం ట్రంప్ ప్రయోగించారు. అయితే ఉక్రెయిన్ను రెచ్చగొట్టేలా ఆయన తరచూ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.ఇదిలా ఉంటే.. చర్చల్లో పురోగతి గనుక చోటు చేసుకుంటే తాను మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటానంటూ ట్రంప్ గత కొంతకాలంగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయని.. ఈ సాగదీత వ్యవహారం ఇలాగే కొనసాగితే పెద్దన్న పాత్ర నుంచి ఆయన తప్పుకుంటారని వైట్హౌజ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఈలోపే.. చర్చల్లో పురోగతి చోటు చేసుకుందన్న ప్రకటన వెలువడడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో రష్యా బలగాలు ఉక్రెయిన్ ఆక్రమణతో మొదలు పెట్టిన యుద్ధం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరువైపుల నుంచి వేల మంది మరణించగా.. ఆస్తి నష్టం ఊహించని స్థాయిలోనే జరిగింది. తాజాగా.. రష్యా కీవ్పై జరిపిన దాడుల్లో 12 మంది మరణించారు. ఈ కారణంగా పోప్ అంత్యక్రియలకు జెలెన్స్కీ హాజరు కాకపోవచ్చనే చర్చ నడుస్తోంది. మరోవైపు.. విట్కాఫ్తో పుతిన్ చర్చ జరగడానికి కొన్నిగంటల ముందే.. మాస్కో శివారులో కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా జనరల్ యరోస్లావ్ మోస్కాలిక్ కన్నుమూయడం విశేషం. అయితే ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపిస్తుండగా.. కీవ్ వర్గాలు ఇంతదాకా ఎలాంటి స్పందన చేయలేదు.తాను అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఇటు పుతిన్పై, అటు జెలెన్స్కీ తీరుపై(దాడులు కొనసాగిస్తుండడం.. చర్చలకు అడుగులు ముందుకు పడకుండా చేస్తుండడం) ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. -
చివరి నిమిషంలో సమావేశం రద్దు..
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కోసం బుధవారం లండన్లో జరగాల్సిన సమావేశం చివరి నిమిషంలో రద్దయ్యింది. మూడేళ్లకు పైగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు పలు దేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపించకపోవడం, షెడ్యూల్ సమస్య కారణంగా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆకస్మిక రద్దుతో చర్చల దిశపై సందేహాలు వ్యక్తమయ్యాయి. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినా.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించడంతో ఉక్రెయిన్ ప్రతి దాడులకు దిగింది. వెయ్యి కిలోమీటర్ల ఫ్రంట్ లైన్ వెంబడి ఇరు పక్షాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. శాంతి ఒప్పందంపై సమావేశం జరుగుతుందని భావించిన బుధవారం ఉదయం కూడా రష్యా ఉక్రెయిన్పై దాడి చేసింది. తూర్పు ఉక్రెయిన్లో కార్మికులతో వెళ్తున్న బస్సుపై రష్యా చేసిన దాడిలో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు మరణించారు. 40 మందికి గాయపడ్డారు. -
ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై ఆసక్తి పోయిందా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో యుద్ధం ఆపడం సాధ్యం కాకపోతే తమ ప్రయత్నాలు విరమించుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగించడం సాధ్యంకాని పక్షంలో.. చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. ఈ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు. ఇన్నాళ్లూ కేవలం ఉక్రెయిన్కు సాయం చేస్తున్నాం. ఇది మా యుద్ధం కాదు కాబట్టి ముగించాలనుకుంటున్నాం అని మార్కో రూబియో అన్నారు.ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ యుద్ధాన్ని ఓ ముగింపునకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగని నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండబోరు. ఆయనకు ప్రపంచంలో ఇతర ప్రాధాన్యాలు కూడా ఉన్నాయి. చర్చల్లో గనుక పురోగతి కనిపించకపోతే ఆయన దీనిని వదిలేస్తానన్నారు అని రుబియో వెల్లడించారు.తాజాగా ఐరోపా నేతలతో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే ఇది సాకారం కావచ్చని పేర్కొన్నారు. అమెరికా ఓ శాంతిఒప్పందం ముసాయిదా తయారుచేసి ఐరోపా నేతలకు వెల్లడించింది. వారినుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక దీనినే మార్కో రూబియో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్కు వెల్లడించారు. -
రష్యా క్షిపణి దాడుల్లో 34 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్పై రష్యా మరోసారి భీకర క్షిపణి దాడులకు పాల్పడింది. సుమీ నగరం నడిబొడ్డున ఆదివారం జరిపిన వరుస దాడుల్లో కనీసం 34 మంది మృత్యువాత పడగా 117 మంది క్షతగాత్రులయ్యారు. ఉదయం 10.15 గంటల సమయంలో జనావాసాలున్న ప్రాంతంలో పామ్ సండే వేడుకల్లో పాల్గొన్న వారిపై పడ్డాయి. వీటి పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగకమ్ముకుని భీతావహంగా మారింది. ఇద్దరు చిన్నారులు సహా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది చిన్నారులు సహా 117 మంది గాయపడ్డారు. భవనాలు శిథిలాల దిబ్బగా మారింది. నుజ్జయిన వాహనాల నుంచి మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు. రష్యాను ఉగ్రవాదిగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్నారంటూ రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకున్న మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
రష్యా గ్యాస్ పైప్లైన్ మాకిచ్చేయండి
వాషింగ్టన్: ‘మినరల్స్ ఫర్ వెపన్స్’ ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్పై మరింత నియంత్రణకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ భూభాగం నుంచి వెళ్లే రష్యా పైప్లైన్ను తమకు అప్పగించాలనే కొత్త డిమాండ్ ముందుకు తెచ్చింది. అరుదైన ఖనిజాలు, ఆయిల్, గ్యాస్ సహా ఉక్రెయిన్ విస్తారమైన వనరులను అమెరికా కంపెనీలకు అప్పగించాలని.. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా వైఖరిని ఉక్రెయిన్కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్ స్ట్రాటజీకి చెందిన సీనియర్ ఎకనమిస్ట్ వోలోదిమిర్ లాండా తప్పుబట్టారు. ఈ డిమాండ్లు వలసవాద తరహా ఒత్తిడిని తలపిస్తున్నాయని, వాటిని అంగీకరించే అవకాశం లేదని ఆయన చెప్పారు. సోవియట్ కాలం నాటి సహజ వాయువు పైప్లైన్ ఉక్రెయిన్ భూభాగం గుండా వెళ్తోంది. పశ్చిమ రష్యాలోని సుడ్జా నుంచి స్లొవేకియా సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ నగరం ఉజ్హోరోడ్ వరకు ఈ పైప్లైన్ ఉంది. ఇది యూరప్కు రష్యన్ గ్యాసు సరఫరా చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. దీన్ని నియంత్రణలోకి తీసు కోవాలని యూఎస్ ప్రభుత్వ సంస్థ అయిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తోంది. రష్యా ప్రభుత్వ ఇంధన సంస్థ గాజ్ప్రోమ్తో ఉక్రెయిన్ ఐదేళ్ల ఒప్పందం గడువు ఈ ఏడాది జనవరితో ముగిసింది.బెర్లిన్ తరహాలో విభజిద్దాం... ఉక్రెయిన్ను బెర్లిన్లాగా విభజించవచ్చని అమెరికా ప్రత్యేక రాయబారి కీత్ కెల్లాగ్ సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బెర్లిన్లో రష్యన్ జోన్, ఫ్రెంచ్ జోన్, బ్రిటీష్ జోన్, యూఎస్ జోన్ తరహాలో.. ఉక్రెయిన్లో యూకే, ఫ్రాన్స్ దళాలు పశ్చిమ ప్రాంతంలో భరోసాగా ఉంటాయన్నారు. ఆక్రమిత తూర్పు ప్రాంతంలో రష్యా సైన్యం ఉండవచ్చని, రెండింటి మధ్య ఉక్రెయిన్ దళాలతో సైనిక రహిత ప్రాంతం ఉంటుందని వెల్లడించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తన మాటలను వక్రీకరించారన్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమన్నారు. -
భారతీయ ఫార్మా కంపెనీ గోదాంపై రష్యా మిస్సైల్ దాడి
-
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ను టార్గెట్ చేసిన రష్యా దళాలు.. భీకర దాడులు చేశాయి. ఈ క్రమంలో భారతీయ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో, పేలుడు సంభవించి దట్టమైన మంటలు చెలరేగాయి. మరోవైపు.. రష్యా దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు.వివరాల ప్రకారం.. కీవ్లోని భారతీయ ఔషధ కంపెనీ కుసుమ్ అనే కంపెనీకి చెందిన గోదాముపై శనివారం రష్యా దాడి చేసింది. రష్యాకు చెందిన డ్రోన్ల దాడిలో గోదాం పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు గోదాంపై దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రష్యా కావాలనే భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది. పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై ఇలా దాడులు చేస్తోందని విమర్శించింది. భారత్తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించింది.Breaking⚡️ : #Ukraine allege Indian pharmaceutical company godown hit by Russia leading to loss of medicines meant for children and distress people. Still to receive any statement from India or Moscow. #RussiaUkraineWar pic.twitter.com/VfpYND8PNq— Neeraj Rajput (@neeraj_rajput) April 12, 2025ఇక, అంతకుముందు ఉక్రెయిన్లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఔషధాల గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్తోపాటు 29 దేశాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కుసుమ్ హెల్త్కేర్ వెబ్సైట్లో ఉంది. భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్, ఉక్రెయిన్లోని అతిపెద్ద ఫార్మా సంస్థలలో ఒకటి. -
ప్రాసంగికత కోల్పోతున్న యూరప్?
డోనాల్డ్ ట్రంప్, జె.డి. వాన్స్ కలిసి వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఎలా వేధించారో ప్రపంచం అంతా చూసింది. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆయన పట్ల పాశవికంగా ప్రవర్తించి గుడ్ బై సైతం చెప్పకుండా తరిమేశారు. ‘రష్యాను ధిక్కరించండి, మీకు మేము అండగా ఉన్నాం...’ అంటూ ఉక్రెయిన్ అధినేతకు బాసటగా నిలిచి ఎంతగా ప్రోత్సహించాలో అంతగా ప్రోత్సహించిన యూరప్ ఈ ఘట్టాన్ని చేష్టలుడిగి చూసింది. యూరప్ ప్రభావం పలుచబడిపోతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?తగ్గుతున్న జనాభాయూరోపియన్ యూనియన్ (ఈయూ)కు బలమైన నాయ కత్వం లేదు. ఎవరి దౌత్య విధానం వారిదే. ‘యూరప్తో మాట్లాడా లనుకుంటే, నేను ఎవరికి ఫోన్ చేయాలి?’ అంటూ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ ఒక సందర్భంలో చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్య ఇందుకు అద్దం పడుతుంది. యూరప్ దేశాలకు కాలం కూడా కలిసిరావడం లేదు. ఆ దేశాల్లో జననాల రేట్లు తగ్గుతున్నాయి.వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా, యువకులు తగ్గిపోతున్నారు. 2050 నాటికి యూరప్ సగటు వయసు 48 ఏళ్లకు పెరుగుతుంది. 60 ఏళ్లు దాటినవారు జనాభాలో 40 శాతం ఉంటారు. వందేళ్ల క్రితం ప్రపంచ జనాభాలో 25 శాతం యూరప్ దేశాల ప్రజలే ఉండేవారు. 2050 నాటికి, వీరి వాటా కేవలం 7 శాతానికి పరిమితం అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.యుద్ధరంగానికి దళాలు సమకూర్చుకోవడం కూడా ఈ దేశాలకు సమస్యగా మారుతోంది. రష్యా ఇప్పటికే ఉత్తర కొరియా దళాలను రెగ్యులర్ ప్రాతిపదికన తన సైన్యంలో నియమించుకోవలసి వచ్చింది. పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నా సరే... యూరప్ కాలం చెల్లిన తన పాత ఇమ్మిగ్రేషన్ విధానాలనే పట్టుకు వేలాడుతోంది. ఇది శ్రమశక్తి సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఉక్రెయిన్ శ్వేతజాతి శరణార్థుల పుణ్యమా అని పనిచేసే వారి సంఖ్య పెరిగినా ఇది తాత్కాలికమే! ఎదుగుదల లేని ఆర్థిక వ్యవస్థపరిపాలన సరిగా ఉండదు, ఆర్థికంగా పురోగమనం లేదు, వయసు మళ్లుతున్న జనం పెరుగుతున్నారు, వృత్తిపరమైన అవకా శాలూ అంతంత మాత్రమే. ఇలాంటి యూరప్ ఇండియాను ఎలా ఆకట్టుకుంటుంది? అమెరికాలో ఒంటి రంగును బట్టి కాకుండా, సత్తాను బట్టి మనుషుల్ని అంచనా వేస్తారు. ఆ మాదిరిగా మార్పు చెందటంలో యూరప్ సమాజం విఫలమైంది. నత్తనడకగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు, పెరుగుతున్న సామాజిక భద్రతా వ్యయాలు, నడ్డి విరుస్తున్న రుణభారం... ఇవన్నీ ఆ ఖండం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. అమెరికా పాత్రికేయుడు ఫరీద్ జకారియా చెప్పినట్లు, యూరప్ దుఃస్థితికి మూల కారణం ఆర్థిక వృద్ధి లోపం. ఉదాహర ణకు ఇటలీ ఆర్థిక వ్యవస్థలో ఏకంగా ఒక దశాబ్దంగా ఎలాంటి పెరుగుదల లేదు.ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాల్లోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు బలం పుంజుకుంటూ దూసుకు వస్తున్నాయి. గ్లోబల్ గవర్నెన్స్లో తమకు అధిక పాత్ర ఉండాలని ఈ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, జీ–7, నాటో వంటి ప్రపంచ అధికార సంస్థలు ఇప్పటికీ యూరప్ చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. కానీ ఆర్థిక వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం అయిదు యూరప్ దేశాలు (జర్మనీ, యూకే, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ) ప్రపంచ టాప్–10 ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నాయి. 2050 నాటికి ఈ అయిదింటిలో కేవలం జర్మనీ, యూకే రెండే టాప్–10 జాబితాలో మిగిలి ఉంటాయి. ఆ పదిలో వాటికి దక్కే ర్యాంకులు చిట్టచివరి తొమ్మిది, పది! ఇందుకు భిన్నంగా, వాటి కంటే ముందుండే ఇండియా, బ్రెజిల్, ఇంకా ఇతర వర్ధమాన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో తమకు గణనీయ పాత్ర ఉండాలని ఒత్తిడి చేస్తాయి. ఇప్పటి ప్రపంచ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణను ఎంతో కాలం అడ్డుకోలేరు.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్మాణం ఇప్పటికే కాలం చెల్లిపోయింది. దీన్ని ఎలా పునర్ వ్యవస్థీకరించాలనే అంశంపై పరిశీలన జరుగుతోంది. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు ప్రస్తుత సభ్యత్వాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఒత్తిడి తెస్తున్నాయి.ఇండియా జీడీపీలో మూడోవంతు కంటే తక్కువ, జపాన్ జీడీపీలో దాదాపు సగం ఉండే యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు శాశ్వత సభ్యు లుగా ఉండటం... ఇండియా, జపాన్ వెలుపల ఉండటం ఎలా సమంజసమనీ, వాటి మీద ఈ రెండు యూరప్ దేశాలు ఎలా పెత్తనం చలా యిస్తాయనీ గట్టి వాదన వినబడుతోంది. భద్రతా మండలి, జీ–7 లను సభ్యత్వ పరంగా విస్తరించడం మీద చర్చలు నడుస్తున్నాయి. ప్రపంచ పాలన సంస్థల పునర్ వ్యవస్థీకరణ జరగాలన్నది కాదనలేని అంశం. తిరుగులేని అమెరికా?శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా మున్ముందు కూడా ప్రబలమైన ప్రపంచ శక్తిగా కొనసాగుతుంది. చైనా, ఇండియా వంటి దేశాలు దాన్ని వెన్నంటి ఉంటాయి. ఒకవేళ అధిగమించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఏమైనా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు గడిచే లోపే అప్పటి విజేతల్లో ఒక్క అమెరికా మినహా మిగిలినవన్నీ టాప్–10 జాబితా నుంచి కను మరుగవుతాయి.అమెరికా లోలోపల పలు మార్పులు చెందుతోంది. జనాభా వర్గాల్లో పరివర్తన ఫలితంగా రాజకీయంగానూ మార్పులు సంభవి స్తున్నాయి. నల్ల జాతీయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆఫ్రో–ఇండి యన్ మహిళ ఉపాధ్యక్ష పదవిని చేపట్టగలిగింది. భారతీయ అమెరికన్లు ప్రభుత్వంలో, విద్యా పారిశ్రామిక రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎగబాకారు. గుజ్జూభాయి కశ్యప్ పటేల్ ఎఫ్బీఐ పగ్గాలు చేపడతాడని ఎప్పుడైనా అనుకున్నామా? వివిధ దేశాల సంతతులకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ, ఇతర రంగాల్లో ప్రముఖ స్థానాలు పొందడం వల్ల ఆ యా దేశాలు అమెరికాతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాయి. విదేశీయులకు ప్రవేశం కల్పించడం వల్ల అమెరికా ప్రతిభ ఇనుమడించింది. యూరప్ ఈ విషయంలో విఫలమైంది. వర్ధమాన దేశాలు 21వ శతాబ్దపు నూతన వ్యవస్థకు రూపు దిద్దబోతున్నందున... ప్రపంచ వ్యవహారాల్లో యూరప్ పాత్ర క్రమేపీ క్షీణించిపోతుంది. యూరప్ గనుక జనాభా సంబంధిత (డెమో గ్రాఫిక్) నూతన విధానాలు రూపొందించకపోతే, ఆర్థిక పరమైన సంస్కరణలు చేపట్టకపోతే అది ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో గుర్తింపు లేని ఖండంగా మిగిలిపోతుంది.రానున్న రోజుల్లో ఆసియానే ప్రపంచ అధికార కేంద్రంగా ఆవి ర్భవిస్తుంది. 2020లో ఈ ఒక్క ఖండమే ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 60 శాతం వాటా కైవసం చేసుకుంది. ఇదే ట్రెండ్ ఇక మీదటా కొనసాగబోతోంది. చైనా, ఇండియా ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమ పలుకుబడి పెంచుకుంటూ పోయి, ప్రపంచ పాలన (గ్లోబల్ గవర్నెన్స్)లో మార్పుల కోసం పట్టుబడతాయి. అయితే, అమెరికాతో విరోధం కారణంగా చైనా, యురోపియన్ యూనియన్ (ఈయూ)కు చేరువయ్యే అవకాశం ఉంది. ఇక చైనాతో సంబంధాలు బెడిసినందువల్ల ఇండియా, అమెరికాకు బహుశా మరింత దగ్గర అవుతుంది.మోహన్ గురుస్వామి వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com -
ఐదేళ్ల తర్వాత రష్యాకు మోదీ.. కారణం ఇదే..
మాస్కో: రష్యా ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని మాస్కోలో మే 9న జరగబోయే విజయ దినోత్సవ (విక్టరీ డే) పరేడ్కు ఆహ్వానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 80వ విజయదినోత్సవ వార్షికోత్సవం జరగనుంది.ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తున్నట్లు రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో తెలిపారు. రష్యా రాజధాని మాస్కో(Moscow)లోని రెడ్ స్క్వేర్లో జరిగే ఈ వేడుకలో భారత ప్రధాని పాల్గొనే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని రుడెంకో తెలిపారు. 2024 జూలైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. ఇప్పుడు ఐదేళ్ల తరువాత మరోమారు మోదీ రష్యాకు వెళ్లనున్నారు. ఈ ఆహ్వానం భారత్-రష్యా లమధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా చూడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రధాని మోదీ రష్యా పర్యటన గురించి భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.రష్యాలో నిర్వహించే విజయ దినోత్సవం ఆ దేశంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా సైనిక పరేడ్, యుద్ధ వీరులకు సన్మానం, చారిత్రక ఘటనలను స్మరించుకునే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ వేడుకలకు అంతర్జాతీయ నేతలను ఆహ్వానించడాన్ని రష్యా తన సంప్రదాయంగా కొనసాగిస్తోంది. 2005లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రష్యా విజయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఇది కూడా చదవండి: లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే! -
ఉక్రెయిన్పై రష్యా దాడులు.. ట్రంప్ రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులు చేయకుండా తాము రష్యాను ఆపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. యుద్ధం కారణంగా ప్రతీ వారం వేలాది మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తోంది. మేము రష్యాతో మాట్లాడుతున్నాం. దాడులను ఆపాలని మేము కోరుకుంటున్నాం. నిరంతరం రష్యా బాంబు దాడులు చేయడం సరికాదు. దాడుల కారణంగా ప్రతీ వారం వేలాది పౌరులు చనిపోతున్నారు. ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. కాల్పులు విరమణపై చర్చలు జరుగుతున్నాయి. రష్యాను ఒప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇటీవల పుతిన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన అనంతరం.. కాల్పుల విరమణ ఒప్పందానికి మాస్కో కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే, రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షలు ఎత్తివేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేస్తామని పుతిన్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేగాక.. జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్ను ఉక్రెయిన్కు తిరిగిచ్చేందుకు కూడా రష్యా నిరాకరిస్తున్నట్లు సమాచారం. కీవ్తో కాల్పుల విరమణ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని మాస్కో తారుమారు చేస్తోందని ఆరోపించారు.#WATCH | On the ongoing Russia-Ukraine war, and if any peace deal is expected, US President Donald Trump says, "We are talking to Russia, we would like them to stop. I don't like them bombing on and on, and every week thousands of young people being killed."(Source - US Network… pic.twitter.com/L15l0oECdw— ANI (@ANI) April 7, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రైవీరిపై శుక్రవారం రష్యా క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులు సహా మొత్తం 18 మంది మరణించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించిన తీరుపై జెలెన్స్కీ అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. జెలెన్స్కీ మాట్లాడుతూ..‘క్రైవీరిపై జరిగిన దాడి విషయంలో అమెరికన్ ఎంబసీ స్పందన పేలవంగా ఉంది. అంత పెద్ద దేశం ఇలాంటి బలహీన ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది. చిన్నారులను చంపిన క్షిపణి గురించి మాట్లాడేటప్పుడు వారు ‘రష్యన్’ అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. యుద్ధం ముగియాలి. అయితే ఈ ఉద్రిక్తతలను ముగించాలనే ఉద్దేశం రష్యాకు లేదు. కాల్పుల విరమణను కాకుండా చిన్నారుల ప్రాణాలు తీయడాన్ని మాస్కో ఎంచుకుంటోంది. అందుకే ఆ దేశంపై పూర్తిస్థాయి ఒత్తిడి తీసుకురావాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రష్యా దాడిపై జపాన్, స్విట్జర్లాండ్ దేశాల రాయబార కార్యాలయాలు స్పందించిన తీరును జెలెన్స్కీ ప్రశంసించారు. -
యూకే అణు జలాంతర్గాములపై రష్యా నిఘా!
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే) అణు జలాంతర్గాములపై రష్యా ప్రత్యేకంగా నిఘా పెట్టిందా? సముద్రంలో వాటి కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి రహస్యంగా సెన్సార్లు ఏర్పాటు చేసిందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. యూకే చుట్టుపక్కల ఉన్న సముద్ర జలాల్లో కొన్ని సెన్సార్ పరికరాలను బ్రిటిష్ రాయల్ నేవీ గుర్తించినట్లు సమాచారం. రష్యా తమ అణు జలాంతర్గాములపై నిఘా పెట్టినట్లు యూకే ఆరోపిస్తోంది. తమకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నట్లు రష్యాపై ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. తమ ఆయుధ సంపత్తిని దెబ్బతీయాలన్నదే రష్యా ప్రయత్నంగా కనిపిస్తున్నట్లు అనుమానం వ్యక్తంచేస్తోంది. ఈ పరిణామాన్ని దేశ భద్రతకు ముప్పుగా సైనికాధికారులు అభివరి్ణంచారు. అట్లాంటిక్ మహా సముద్రంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని, రష్యా కార్యకలాపాలు అసాధారణ రీతిలో పెరిగిపోయాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రష్యా అధినేత పుతిన్ చేపట్టిన గ్రేజోన్ యుద్ధ వ్యూహంలోనే భాగంగానే తమ అణు జలాంతర్గాములను రష్యా టార్గెట్ చేసుకున్నట్లుగా యూకే అధికారులు అనుమానిస్తున్నారు. సముద్ర గర్భంలోని రహస్య కేబుల్స్తోపాటు పైప్లైన్లు, కీలక పరికరాలను ధ్వంసం చేయడం ద్వారా పరోక్ష యుద్ధం సాగించడమే గ్రేజోన్ వ్యూహం. ఇది ఇటీవలి కాలంలో మరింత ఉధృతమైందని చెబుతున్నారు. గత 15 నెలల వ్యవధిలో బాల్టిక్ సముద్రంలో 11 డీప్–సీ కమ్యూనికేషన్ కేబుల్స్ ధ్వంసమయ్యాయి. సముద్ర గర్భంలోని తమ మౌలిక సదుపాయాలను రక్షించుకోవడానికి కృషి చేస్తున్నామని యూకే అధికారులు అంటున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగినప్పటి నుంచి బ్రిటన్–రష్యా మధ్య పిల్లి, ఎలుక తరహాలో పోరాటం జరుగుతూనే ఉంది. అది ఇటీవలి కాలంలో మరింత ఉధృతమైందని యూకే నిపుణులు అంటున్నారు. -
ట్రంప్ సైలెంట్ బాంబ్! అంతకు మించి..
వాషింగ్టన్: ఒకవైపు ప్రపంచమంతా ట్రంప్ టారిఫ్(Trump Tariffs)ల గురించి చర్చించుకుంటున్న వేళ.. అమెరికా అనూహ్య చర్యలకు దిగింది. గప్చుప్గా ఆసియా రీజియన్లో భారీగా సైన్య మోహరింపునకు దిగింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్ విమానాలను రంగంలోకి దించడం తీవ్ర చర్చనీయాంశమైంది.బీ-2 స్టెల్త్ బాంబర్లకు ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధవిమానాలుగా పేరుంది. అమెరికాలో అలాంటివి 20 ఉండగా.. వాటిలో ఆరింటిని హిందూ మహాసముద్ర రీజియన్లోని యూఎస్-బ్రిటన్ మిలిటరీ బేస్ డియాగో గార్సియా రన్వేపై మోహరింపజేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాడార్ సిగ్నల్స్ కూడా అందకుండా.. షెల్టర్లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు..ఇండో ఫసిఫిక్ రీజియన్లోనూ యుద్ధవిమానాల గస్తీని అమెరికా పెంచాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక విమాన వాహక నౌకతోనే(అరేబియా సముద్రంలో USS Harry S. Truman) గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 3కి పెంచే యోచనలో ఉంది. హిందూ మహాసముద్రం రీజియన్లో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ దగ్గర ఒక విమాన వాహక నౌకతో గస్తీ ఉంచాలనుకుంటోంది. అంతేకాదు ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. అయితే.. ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.యూఎస్ఎస్ నిమిట్జ్హఠాత్తుగా ఎందుకంటే..ఆయా రీజియన్లలో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఈ మోహరింపు అని పెంటగాన్ ప్రకటించుకుంది. అదే సమయంలో.. భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు.. వాటికి కొనసాగింపుగా చెలరేగే ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ.. మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగిందన్నది విశ్లేషకుల మాట. ప్రధానంగా ఇరాన్, యెమెన్లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే సైన్యాన్ని రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు.హెచ్చరికలతో మొదలైనప్పటికీ..గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే హౌతీలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్ను, మద్ధతుగా నిలిచిన ఇరాన్ను హెచ్చరించారాయన. అలాగే.. అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్ను హెచ్చరిస్తూ వస్తున్నది చూస్తున్నాం. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం బీ-2 లాంటి శక్తివంతమైన బాంబర్లను కేవలం హౌతీలు, ఇరాన్ కోసమే మోహరింపజేసి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా యెమెన్పై దాడికి ఇది చాలా ఎక్కువనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పనిలో పనిగా ఇరాన్ మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్ హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ వద్ద యూఎస్ఎస్ నిమిట్జ్ క్యారీయర్ను, మిడిల్ ఈస్ట్లో యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ వాహక నౌకను మోహరింపజేయడమే ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. దీంతో ట్రంప్ ఆలోచన అంతకు మించే ఉందన్న చర్చ నడుస్తోంది.