Russia
-
యుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఉద్రిక్తమవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు తమ దేశం అందిస్తున్న నిఘా సమాచారాన్ని ఆపేస్తామన్నారు. అయితే దానికి ప్రతిగా ఉక్రెయెన్కు అమెరికా అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని షరతు పెట్టారు. ఒక వేళ కీవ్కు మద్దతు ఉపసంహరించుకోకుంటే టెహ్రాన్కు రష్యా సహాయం కొనసాగుతుందన్నారు. అయితే ఇరాన్కు రష్యా మద్దతు ఇస్తుందని ఊహగానాల నేపథ్యంలో ఇదివరకే పుతిన్ వివరణ ఇచ్చారు. తమ మిత్ర దేశమైన ఇరాన్కు సంపూర్ణ మద్ధతు ఇస్తామని ప్రకటించారు. టెహ్రాన్కు మాస్కో అండగా ఉంటుందని ప్రకటించారు. ఇరాన్ నూతన సుప్రీంగా ఎన్నికైన ముజ్తాబా ఖమేనీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా యుద్ధంలో రష్యా ఇరాన్కు సహకరిస్తుందని అమెరికా గతంలో ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రకటనపై అమెరికా ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి. -
నన్ను చంపడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించింది: రష్యన్ జర్నలిస్ట్
బీరుట్: ఇజ్రాయెల్ తనను చంపడానికి ప్రయత్నించిందని రష్యన్ జర్నలిస్ట్ స్టీవ్ స్వీనీ ఆరోపించారు. ఆ దేశం చేస్తున్న యుద్ధ నేరాలు బయటికి రావొద్దని ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేసిందన్నారు. గురువారం లెబనాన్లోని అల్–ఖస్మియా వంతెన సమీపంలో చిత్రీకరణ చేస్తుండగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో స్వీనీ, అతని కెమెరామెన్ అలీ రిదా గాయపడ్డారు. అనంతరం ఇద్దరూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్యులు స్వీనీ చేతి నుంచి శకలాలను తొలగిస్తున్న వీడియోను రిదా పంచుకున్నారు. అనంతరం, స్వీనీ శుక్రవారం ఇజ్రాయెల్పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘వంతెనలను లక్ష్యంగా చేసుకోవడం, 10 లక్షల మందిని బలవంతంగా ఖాళీ చేయించడం, నక్బా కంటే పెద్ద ఎత్తున జరుగుతున్న జాతి ప్రక్షాళన చర్యపై దక్షిణ లెబనాన్లో నేను రిపోరి్టంగ్ చేస్తుండగా ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి నన్ను చంపడానికి ప్రయతి్నంచింది’అని రష్యన్ టెలివిజన్ నెట్వర్క్ ఆర్టీలో కరస్పాండెంట్గా పనిచేస్తున్న ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. చిత్రీకరణకు లెబనీస్ సైన్యానికి ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా దాడి చేసిందని మండిపడ్డారు. ఇది ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను నమోదు చేస్తున్న జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నమని స్వీనీ ఆరోపించారు. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఈ దాడిని ఖండించారు. గాజాలో 200 మంది జర్నలిస్టుల హత్య తరహాలోనే ఇది జరిగిందని, ప్రెస్ జాకెట్లు ధరించిన జర్నలిస్టులపై దాడిని ప్రమాదవశాత్తుగా జరిగిందని చెప్పలేమని అన్నారు. రాకెట్ ముఖ్యమైన వ్యూహాత్మక సైనిక స్థావరంపై కాకుండా, రిపోర్ట్ చిత్రీకరిస్తున్న ప్రదేశంపై పడిందని, అంతర్జాతీయ సంస్థల నుంచి స్పందన కోసం రష్యా ఎదురుచూస్తోందని ఆమె తెలిపారు. అయితే, దాడి జరిగిన ప్రాంతం నుంచి పౌరులు వెళ్లిపోవాలని తాము పదేపదే హెచ్చరికలు జారీ చేశామని, తగినంత సమయం ఇచి్చన తర్వాతే క్షిపణిని ప్రయోగించామని ఇజ్రాయెల్ తెలిపింది. -
భారీ ఊరట : చైనాకు వెళ్లాల్సిన 7 రష్యా ట్యాంకర్లు భారత్వైపు
చైనాకు వెళ్లాల్సిన 7 చమురు ట్యాంకర్లు దక్షిణ చైనా సముద్రంలో యూ-టర్న్ తీసుకుని భారత్వైపు మళ్లడం అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కీలకంగా మారింది. రష్యా చమురు నౌకలు చైనా వైపు కాకుండా భారత్ వైపు మళ్లడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు. మాస్కో నుండి దిగుమతులను న్యూఢిల్లీ రెట్టింపు చేయడం ప్రారంభించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.దక్షిణ చైనా సముద్రం గుండా ప్రయాణిస్తూ, మొదట చైనాకు వెళ్లాల్సిన ఏడు రష్యన్ చమురు ట్యాంకర్లు అకస్మాత్తుగా తమ మార్గాన్ని మార్చుకున్నాయి షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, 'ఆక్వా టైటాన్' అనే ఈ నౌక, జనవరి చివరలో బాల్టిక్ సముద్ర ఓడరేవు నుండి లోడ్ చేసుకున్న యురల్స్ కార్గో మార్చి 21న న్యూ మంగళూరుకు చేరుకోనుంది. సూయజ్మాక్స్ జౌజౌ ఎన్. భారతదేశంలోని సిక్కాకు మార్చి 25న చేరుకుంటుందని అంచనా.రష్యా నుండి కొనుగోళ్లను తాత్కాలికంగా పెంచుకోవడానికి భారతదేశానికి అమెరికా అనుమతి ఇచ్చిన కొద్ది రోజులకే, ఈ అఫ్రామాక్స్ నౌక మార్చి మధ్యలో చైనాలోని రిజావో ఓడరేవుకు చేరాల్సి ఉంది. ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!ఎందుకిలా?రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా భారతదేశానికి 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల భారత్ ఎటువంటి ఆంక్షల భయం లేకుండా రష్యా చమురును దిగుమతి చేసుకునే అవకాశం కలిగింది. అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై యుద్ధం ప్రారంభించడంతో, ఇరాన్ ప్రతిచర్యగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేసింది. దీనివల్ల మధ్యప్రాచ్యం నుండి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ వ్యాప్తం చమురు సంక్షోభం ఏర్పడింది. ముడి చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగి, ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు 120 డాలర్లకు చేరుకుంది.ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఇంధన భద్రత కోసం భారత్ రష్యాపై మరింతగా ఆధారపడుతోంది.ఈ ఏడు ట్యాంకర్ల రాకతో దేశీయంగా పెరుగుతున్న చమురు ధరల నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని చైనాకు వెళ్లాల్సిన వనరులు ఇప్పుడు భారత అవసరాలకు ఉపయోగపడనున్నాయని అంచనా ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు -
రెండు దేశాలను వణికిస్తున్న రష్యా టైమ్ బాంబ్!
-
ఇరాన్-రష్యా రెండూ ఒకటే.. 'ద్వేష సోదరులు': జెలెన్స్కీ
ఇరాన్, రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ యుద్ధం వల్ల కలిగే ప్రమాదాలపై లండన్లోని వెస్ట్ మినిస్టర్లో మాట్లాడుతూ.. ఇరాన్-రష్యా ప్రభుత్వాలను ద్వేషంలో సోదరులుగా అభివర్ణించారు. ఇరాన్ తయారు చేసిన షాహెడ్ ‘కామికాజే’ డ్రోన్లు రష్యాకు విక్రయించబడుతున్నాయని, అవి ఉక్రెయిన్పై దాడుల్లో ఉపయోగించబడుతున్నాయని వివరించారు. రష్యా చమురుపై ఆంక్షలను సడలించడం ప్రమాదకరమని, మాస్కోపై ఒత్తిడి కొనసాగించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. జెలెన్స్కీ తన ప్రసంగంలో మధ్యప్రాచ్య యుద్ధాన్ని ఉక్రెయిన్లో జరుగుతున్న దీర్ఘకాలిక యుద్ధంతో అనుసంధానిస్తూ.. ఉక్రెయిన్ ఇప్పుడు ఆధునిక యుద్ధంలో పయనీకులుగా మారిందని, తమ అనుభవాన్ని మిత్రదేశాలతో పంచుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ చౌకగా తయారయ్యే ఇంటర్సెప్టర్ డ్రోన్లను ఉపయోగించి రష్యా దాడులను ఎదుర్కొంటోందని తెలిపారు.ప్రస్తుతం 201 మంది ఉక్రెయిన్ సైనిక నిపుణులు మధ్యప్రాచ్యంలో ఉన్నారని, మరో 44 మంది అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరంతా ఇరాన్ డ్రోన్లను ఎదుర్కొనే విధానాలను మిత్రదేశాలకు బోధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, రక్షణ మంత్రి జాన్ హీలీ, ప్రతిపక్ష నాయకులు, 60 మంది ఎంపీలు, లార్డులు పాల్గొన్నారు. -
పశ్చిమాసియాలో ప్రపంచీకరణ శిథిలం
ఇరాన్పై లెక్కలేనితనంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలెట్టిన యుద్ధం ఆయన చేయి దాటిపోయింది. ట్రంప్ ప్రభుత్వ సామ్రాజ్యవాద పర్యవసానంగా నష్టాన్ని చవిచూస్తున్న ఓ భారతీయురాలిగా ఆయన పరాజయం చూసి కొంత పైశాచికానందం పొందాలని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఇరాన్పై సైనిక చర్య మన ఆర్థిక వ్యవస్థకు వినాశకర పరిణామాలను కలుగజేస్తోంది. మన ఇంధన భద్రతకు ముప్పు తెస్తోంది. మన భౌగోళిక రాజకీయ సమీకరణాలను తారుమారు చేస్తోంది. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న దాదాపు కోటి మంది భారతీయులు వారు ఏమాత్రం ఆశించని యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. భారతదేశపు ముడి చమురు దిగుమతులలో దాదాపు నలభై శాతం హోర్మూజ్ జలసంధి ద్వారానే వస్తాయి. ఆ సముద్ర మార్గం ఇపుడు పూర్తిగా ఇరానియన్ల చేతిలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తాము విధిస్తామని చెప్పిన అపరాధ సుంకాన్ని మాఫీ చేస్తున్నట్లు అమెరికా చెప్పుకొంది. నిజానికి, శ్వేత సౌధం చెప్పుకుంటున్నట్లుగా, మనం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఎన్నడూ ఆపలేదు. అమెరికా రాయితీ అధిక చమురు ధరల నుంచి మనకేమీ రక్షణ కల్పించలేదు. పెట్టుబడిదారులకూ రక్షణ కరవుఇది పైకి ప్రపంచీకరణ పర్యవసానంగా కనిపించవచ్చు. వాస్తవానికి, ఈ యుద్ధం ప్రపంచీకరణకు వ్యతిరేకమైనది. ట్రంప్ పాలన ప్రపంచీకరణకు చెందిన మూల సూత్రాన్నే ధ్వంసం చేసింది. ప్రపంచీకరణ అంటే, కేవలం పరస్పరం ఆధారపడటమే కాదు, ఏకీకరణ చెందడం కూడా. దుబాయ్, అబు దాబీ రోజూ డ్రోన్లు, క్షిపణుల దాడులకు లోనవుతున్నాయి. ప్రపంచీకరణ యుగంలో, పెత్తందారీ దేశాల పెనుగాలుల నుంచి పెట్టుబడిదారీ ఒయాసిస్సులకు రక్షణ ఉంటుందనే ఆలోచనను ట్రంప్ యుద్ధం పటాపంచలు చేసింది.ట్రంప్ అచ్చం ఒక నిర్దాక్షిణ్య నయా సామ్రాజ్యవాదిగానే ప్రవర్తిస్తున్నారు. అమెరికా అణు జలాంతర్గామి ఒకటి అంతర్జాతీయ జలాలలో ఇరానియన్ యుద్ధ నౌకను ముంచేసింది. ‘మిలన్’ నౌకాదళ విన్యాసాలలో అది భారతదేశానికి అతిథిగా వ్యవహరించిన రెండు వారాలకే ఆ దుర్ఘటన చోటుచేసుకుంది. అమెరికా దుశ్చర్య ఒక ప్రమాదకర, అశాంతిదాయక ప్రమాణాన్ని నెలకొల్పింది. రేపు, చైనా కూడా తన స్వీయ సైనిక చర్యకు తన నౌకలను ఇలాగే హిందూ మహా సముద్రంలోకి పంపించవచ్చు.భారత్కు రెండు వైపులా పాఠాలుఉన్న సమాచారం మేరకు, ఆ తర్వాత, భారత్ మంచి పనే చేసింది. శరణు కోరిన మూడు ఇరానియన్ నౌకలకు అభయమిచ్చింది. ఆ నౌకలకు 24 గంటల్లోగా అండగా నిలిచింది. కొలంబోలో ఉన్న ఐ.ఆర్.ఐ.ఎస్. దేనా నౌక నుంచి ఆపదలో ఉన్నట్లు సంకేతం రాగానే అన్వేషణ, రక్షణ సిబ్బందితో రంగంలోకి దిగింది. అమెరికా తన కార్యకలాపాలను హిందూ మహా సముద్రంలో, శ్రీలంకకి సమీపంలోకి విస్తరిస్తున్నట్లు మన నౌకాదళానికి తెలియజేయలేదు. ఎలాంటి కలాపాలు చేపట్టబోతున్నారో మనకేమీ చెప్పనవసరం లేదు. కనీసం తమ ఉనికిని తెలియచేయడం వృత్తిపరమైన మర్యాద అనిపించుకుంటుంది. అదే సమయంలో, అక్కడి జలాలలో ఒక భారతీయ నౌక ఉండి ఉంటే పరిస్థితి ఏమిటి? ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. కానీ, ఆ సమరం నాలుగు రోజులకు బదులు నాలుగు వారాల పాటు సాగి ఉంటే పరిస్థితిని ఊహించండి. ఉగ్రవాదులు లేదా పోషకుల చేతుల్లో డ్రోన్లు ఉండి ఉంటే! స్వల్ప కాలిక భద్రతా సవాళ్ళ నుంచి రక్షణకైనా లేదా దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెట్టి అయినా, భారత్ సైనిక శక్తిని బలోపేతం చేసుకుని తీరాలి. ఆ దిశగా సాగించే దీర్ఘకాలిక పయనానికి మన ప్రజాస్వామ్యం, వైవిధ్యం, బహుళత్వం, రాజ్యాంగ విలువలకు మనం ఇచ్చే ప్రాధాన్యం కరదీపికలు కావాలి. ట్రంప్ గద్దె దిగిన తర్వాత కూడా, ప్రపంచంలో మరెవరైనా ఇదే రీతిలో వ్యవహరించవచ్చు. మన మార్కెట్లు, సైనిక శక్తే మనకు శ్రీరామ రక్ష. మరింత తిరోగమన వ్యవస్థలుఅమెరికా అధ్యక్షులలో బాధ్యతారహితమైన యుద్ధాలను ప్రారంభించింది ట్రంప్ ఒక్కరే కాదు. దాదాపుగా 1960ల నుంచి ఇదే కథ నడుస్తోంది. క్యూబాలో కెన్నెడీ వేలు పెట్టడం నుంచి అఫ్గానిస్తాన్లో పరాభవం వరకు వివిధ దేశాల్లో పాలనా వ్యవస్థలను మార్చడానికి అమెరికా చేసిన ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. వారు ఏ పాలనా వ్యవస్థను కూలదోస్తామని చెబుతున్నారో ఆ పాలనా వ్యవస్థ కంటే రాక్షసమైన వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయి. ఇరాక్లో ‘ఐసిస్’ లేదా అఫ్గానిస్తాన్లో తాలిబన్ పునరాగమనం కన్నా నిదర్శనం ఏం కావాలి? కాకపోతే దౌత్యానికి సంబంధించిన మొత్తం రీతి రివాజులను పక్కకు నెట్టేసిన మొదటి ప్రభుత్వంగా ట్రంప్ ప్రభుత్వం అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ సందర్భంగా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ దావోస్లో చేసిన ప్రసంగం గుర్తుకు వస్తోంది. దౌత్యపరమైన పరిభాష చక్కెర పూతగా మారిందనీ, దౌత్యపరమైన చర్చలు కపటంగానే సాగుతున్నాయనీ ఆయన పేర్కొన్నారు. అది నిజమే కావచ్చు కానీ, కనీసం దానివల్ల కలసి కూర్చుని మాట్లాడుకునేందుకు ఒక ఉమ్మడి భాష అంటూ ఉంటుంది. పాటించవలసిన మానవ మర్యాదలు ఉంటాయి. ముఖ్యంగా, ప్రత్యర్థి దేశాన్ని బలహీనపరచేందుకు సాగే రణ తంత్రాలలో అవి సహాయపడతాయి. ఇది ఇరానియన్ పాలక వ్యవస్థకో లేదా మరి ఏ ఇతర నిరంకుశ ప్రభుత్వానికో చేస్తున్న సంగ్రహ హెచ్చరిక కాదు. నియంతృత్వాలకు లేదా మతపరమైన ఛాందసవాద పాలకులకు లేదా నియాండర్తల్ వ్యవస్థలకు గుణపాఠం నేర్పేందుకు చేసే యుద్ధాలకు ఒక అంతిమ లక్ష్యం అంటూ ఉండాలి. సాధారణ ప్రజానీకంపై విరుచుకుపడటం వల్ల ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తి చపలచిత్త ధోరణులు, హద్దులేనితనానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఐక్యం అయితే తప్ప ఫలితం ఉండదు. లేదంటే ప్రపంచీకరణ ఛిన్నాభిన్నమవుతుంది. ఏ దేశానికాదేశం అతలాకుతలం అవుతుంది.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-బర్ఖా దత్ -
మోజ్తబా ఖమేనీ ఆచూకీ : మరో బిగ్ ట్విస్ట్!
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ, ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేనా? అసలు ఆయన బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? రష్యా అద్యక్షుడు పుతిన్ నీడలో రక్షణ పొందుతున్నాడనే మరో వార్తహల్ చల్ చేస్తోంది. ఇరాన్ సుప్రీం మోజ్తబా ఖమేనీ సేఫ్టీపై అగ్రనేతలు ఏమంటున్నారు? ఈ విషయాలపై కథనం.అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించిన వేళ, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ , ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు.మోజ్తబా ఖమేనీ ఉనికిపై ఊహాగానాలుఇరాన్పై ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన అమెరికా -ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ ఇతర కుటుంబ సభ్యులు మరణించారు. తండ్రి మరణం తర్వాత, 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ ఇరాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే, యుద్ధం ప్రారంభంలో జరిపిన దాడుల్లో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం కోమాలో ఉన్నారనే ఊహాగానాలు భారీగా వ్యాపించాయి. అయితే ఈ విషయాలను ఖండించిన ఇరాన్ మోజ్తబా గాయపడినప్పటికీ నాయకత్వ బాధత్యలను నిర్వహించే స్థితిలోనే ఉన్నారని ప్రకటించింది. రష్యాలో చికిత్స ?అయితే ఆయన రష్యాలో చికిత్స పొందుతున్నారని కువైట్ పత్రిక 'అల్-జరీదా' తెలిపింది. దీని ప్రకారం అమెరికా-ఇజ్రాయెల్ బాంబు దాడుల తర్వాత మోజ్తబాను అత్యంత రహస్యంగా ఒక రష్యన్ సైనిక విమానంలో మాస్కోకు తరలించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంలోని ఒక ప్రైవేట్ వైద్య సదుపాయంలో ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం అక్కడే కోలుకుంటున్నారని సమాచారం. ఇరాన్లో దాడులు కొనసాగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా ఆయన్ని రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది.ఇరాన్లోనే ఉన్నారా?మరోవైపు 'ది సన్' పత్రిక కథనం మాత్రం మరోలా ఉంది మోజ్తబా ఇరాన్లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడుల్లో ఆయన రెండు కాళ్లు కోల్పోయారని, కాలేయం లేదా కడుపు భాగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని పేర్కొంది.ట్రంప్ , నెతన్యాహు ప్రకటనలుఅయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర అనుమానాలను రేకెత్తించాయి.ఆయన అసలు బతికే ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇప్పటివరకు ఎవరూ ఆయన్ని చూడలేదు. ఆయన బతికే ఉంటే, తన దేశం కోసం శరణు కోరడం మంచిదని వ్యాఖ్యానించారు. అంతేకాదు మోజ్తబా సమాచారం కోసం అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఇరాన్ నేత మోజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం ఉందంటూనే "ఆయన ప్రాణాలకు నేను ఎలాంటి భరోసా (లైఫ్ ఇన్సూరెన్స్) ఇవ్వలేనునీ, అయితే ఖమేనీ ఉన్న ప్రదేశం గురించి ఇజ్రాయెల్కు నిఘా సమాచారం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలను మరింత సంక్లిష్టం చేసింది. ఇరాన్ సైనిక కమాండర్లకు కూడా తమ కొత్త నాయకుడి నుండి ఎటువంటి ఆదేశాలు అందడం లేదని, దీంతో ఇరాన్ అంతర్గత గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. మోజ్తబా అందుబాటులో లేని కారణంగా యుద్ధంపై ఆయనకు ఎటువంటి నియంత్రణ లేదని, కమాండర్లకు కూడా ఆయన స్థితిగతులపై స్పష్టత లేదని 'ది టెలిగ్రాఫ్' నివేదించింది.(నెతన్యాహూ కాఫీ వీడియో : షాకింగ్ ‘డీప్ఫేక్’ చర్చ)ఖమేనీ పరిస్థితి గురించి సీనియర్ అధికారులు కూడా అనిశ్చితంగా ఉన్నారని ఇరాన్ అధికారి ఒకరు ది టెలిగ్రాఫ్తో అన్నారు. "మోజ్తాబా గురించి ఎవరికీ ఏమీ తెలియదు, అతను బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా లేదా ఎంత తీవ్రంగా గాయపడ్డాడో. అతను గాయపడ్డాడని చెప్పారు. అతను ఇక్కడ లేనందున అతనికి యుద్ధంపై నియంత్రణ లేదు. మెజారిటీ కమాండర్లకు, లేదా మరింత సరిగ్గా చెప్పాలంటే, అన్ని కమాండర్లకు అతని గురించి ఎటువంటి సమాచారం లేదు." అని ఇరాన్ సీనియర్ అధికారిన ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ వెల్లడించింది.అలాగే సుప్రీం లీడర్ పేరుతో విడుదలైన మొదటి ప్రకటన ఆయన రాసింది కాదని, భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ రాసి ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి మోజ్తబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితి ఇరాన్ రాజకీయ , సైనిక వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో -
రష్యా నుంచి పెరిగిన చమురు కొనుగోళ్లు
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఈ నెలలో 50 శాతం పెరిగాయి. రోజువారీ 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేస్తోంది. ఫిబ్రవరిలో ఇది 1.04 మిలియన్ బ్యారెళ్లుగానే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో చమురు సరఫరాలు నిలిచిపోవడం తెలిసిందే. దీంతో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకుంది. మన దేశం ప్రతి రోజూ సగటున 5.8 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంటుంది. ఇందులో 2.5–2.7 మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ జలసంధి నుంచే భారత్కు వస్తుంటుంది.అంతేకాదు మన దేశ ఎల్పీజీ అవసరాల్లో 55 శాతం, ఎల్ఎన్జీలో 30 శాతం కూడా ఈ మార్గం నుంచే వస్తుంటుంది. రష్యా నుంచి రోజువారీ 1–1.2 మిలియన్ బ్యారెళ్ల చమురును సమకూర్చుకుంటున్న నేపథ్యంలో హర్మూజ్ను మూసివేయడం కారణంగా మనకు ఏర్పడే లోటు 1.6 మిలియన్ బ్యారెళ్లు (రోజువారీ/బీపీడీ)గా ఉంటుందని కెప్లర్ అనలిస్ట్ సుమిత్ రిటోలియా తెలిపారు. ఇక రోజువారీ ఎల్పీజీ వినియోగం ఒక మిలియన్ బీపీడీగా ఉంటే.. ఇందులో 40–45 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగిలిన మొత్తాన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. ఇందులో 80–90 శాతం హర్మూజ్ జలసంధి నుంచే రావాలి. ఈ మార్గం మూసుకుపోవడంతో దేశీయంగా ఎల్పీజీకి కటకట నెలకొంది. దేశీ సంస్థలు ఉత్పత్తిని 10–20 శాతం పెంచినా సరే, 47–50 శాతం లోటును ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్ నుంచి కాల్ వచ్చింది!
ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై యుద్ధంలో ఉన్నాయి. ఇరాన్ను తమ గుప్పిట్లోకి తీసుకునే వరకూ యుద్ధం ఆపేది లేదంటోంది అమెరికా. అదే సమయంలో ఇరాన్ కూడా తాము కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. ఈ యుద్ధం ఎంతవరకూ వెళుతుందో అనే భయం సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇరాన్ గగనతలం తమ గుప్పిట్లోకి వచ్చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ చెబుతున్నా.. పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు. ఇరాన్ సైతం అంతే ధీటుగా బదులిస్తూ ఉండటంతో అటు గల్ఫ్ దేశాలతో పాటు అమెరికాలో కూడా ఆందోళన చాయలు కనిపిస్తూనే ఉన్నాయి. ట్రంప్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇంకా ఇరాన్ లొంగిపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంచితే, ఒక లైవ్ షోలో ఉండగా అమెరికా ఆర్థికశాఖ కార్యదర్శి స్కాట్ బీసెంట్కు ఉన్నపళంగా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కాల్ రావడం చర్చనీయాంశమైంది. బీసెంట్ స్కై న్యూస్ స్టూడియోలో లైవ్ ప్రోగ్రామ్లో ఉండగా పిలుపు వచ్చింది. ఆ స్టూడియోకు ట్రంప్ నుంచి కాల్ రావడంతో ఉన్నపళంగా బీసెంట్ మధ్యలోనే వెళ్లిపోయారు.ఆ కాల్ సారాంశం ఏంటంటే.. ‘ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్ నుంచి కాల్ వచ్చింది.. మిమ్మల్ని ట్రంప్ వెంటనే కలవాలట. వైట్హౌస్ సిట్యువేషన్ రూమ్కి రమ్మన్నారు’ అని లైవ్ ప్రోగ్రామ్ మధ్యలో సందేశం వెళ్లింది. దాంతో బీసెంట్ తన ఇంటర్వ్యూను అక్కడే వదిలేసి పరుగు పరుగున వెళ్లి ట్రంప్ను కలిశారు. అయితే ఆ తర్వాత బీసెంట్ తన లైవ్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు బీసెంట్ ప్రోగ్రామ్ వాయిదా పడిన తర్వాత కొనసాగించారు. దీనిలో భాగంగా బీసెంట్ మాట్లాడుతూ.. ‘అధ్యక్షుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇరాన్ మిషన్ షెడ్యూల్కి ముందుగానే విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే ప్రభుత్వ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని ట్రంప్ను కొనియాడారు.U.S. Treasury Secretary Scott Bessent was abruptly pulled from a live interview after being told “the President wants you right away.” After returning, his voice was noticeably shaken. pic.twitter.com/jx5CamFi03— Clash Report (@clashreport) March 13, 2026 ఇదీ చదవండి: ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్ -
మాతో పెట్టుకుంటే అంతే.. ఇరాన్ మంత్రి
టెహ్రాన్: ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో రెండు వారాల యుద్ధానికే అమెరికా పనైపోయిందని తెలిపారు. వాషింగ్టన్ ఇప్పుడు భారత్తో పాటు అనేక దేశాలను రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలని అడుక్కుంటుందని ఆరోపించారు.పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం చమురు వాణిజ్యానికి ఆటంకం తలెత్తింది. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ స్థావరాలపై దాడులు చేయడంతో క్రూడాయిల్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే ట్రంప్ గతంలో విధించిన ఆంక్షలు సడలించారు. ప్రపంచ దేశాలు తాత్కాలికంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కౌంటరిచ్చారు,ఆయన మాట్లాడుతూ " గత కొద్ది నెలలుగా అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయద్దంటూ ఆంక్షలు విధించింది. ఇరాన్తో 15 రోజులు యుద్ధం చేయగానే పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు భారత్తో సహా ఇతర దేశాలని రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని యాచిస్తుంది. యూరప్ సైతం ఈ అక్రమ యుద్ధంలో మద్దతు ఇవ్వడం ద్వారా రష్యాకు వ్యతిరేకంగా యుఎస్ సపోర్టు లభిస్తోందని భావిస్తోంది" అని అన్నారు. వారి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉందని తెలిపారు.కాగా ఇంతకాలం రష్యాతో చమురు కొనుగోలు ఇతర దేశాలను అమెరికా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మాస్కో నుంచి పన్ను కొనుగోలు చేసిన వారిపై అధిక పన్నులు విధించింది. ఈ నేపథ్యంలో భారత్పైన తొలుత పన్నులు పెంచి అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేశారని ప్రకటించింది. అయితే ఇటీవలే రష్యా నుంచి తాత్కాలికంగా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చని ఆదేశించినట్లు తెలిపింది. కాగా దీనిపైఇరాన్ విదేశాంగమంత్రి స్పందించారు.కాగా ప్రస్తుతం ఇరాన్ భారత్ విషయంలో సానూకులంగా ఉంది. ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగశాఖ మంత్రితో చర్చలు జరిపారు.ఈ నేపథ్యంలో భారత్ వెళ్లే చమురు నౌకలకు ఇరాన్ అనుమతి తెలిపింది. ఇటీవల భారత్ పతాకంతో ఉన్న రెండు నౌకలు హార్మూజ్ గుండా ఇండియాకు చేరుకున్నాయి. -
పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. ఇరాన్ సంచలన ప్రకటన
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ బీభత్సంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇరాన్ విధిస్తున్న షరతులకు ఇజ్రాయెల్,అమెరికా అంగీకరించాలని తెలిపారు. షరతులపై అమెరికా,ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరిపేందుకు రష్యా,పాకిస్థాన్లు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. అంతేకాదు ఇరాన్ స్పష్టంగా ప్రకటించిన ఈ షరతులు నెరవేరితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని సూచించారు. అమెరికా-ఇజ్రాయెల్కు విధించిన షరతులు ఇవే మొదటి షరతుగా, ఇరాన్ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. తమ సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోతే శాంతి సాధ్యం కాదని స్పష్టం చేసింది. రెండవ షరతుగా, ఇప్పటి వరకు జరిగిన యుద్ధ దాడుల వల్ల కలిగిన నష్టాలకు అమెరికా, ఇజ్రాయెల్ పరిహారం చెల్లించాలని కోరింది.మూడవ షరతుగా, భవిష్యత్తులో ఇరాన్పై దాడులు జరగవని హామీ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. ఈ మూడు షరతులు నెరవేరితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని ఇరాన్ స్పష్టం చేసింది. లేకపోతే యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ షరతులు యుద్ధానికి ముగింపు దారితీస్తాయా లేదా అన్నది అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యుద్ధంపై మధ్యవర్తిత్వానికి కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇరాన్ స్పష్టమైన షరతులు పెట్టడం వల్ల ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో అనిశ్చితంగా ఉంది.Talking to leaders of Russia and Pakistan, I reaffirmed Iran’s commitment to peace in the region. The only way to end this war—ignited by the Zionist regime & US—is recognizing Iran’s legitimate rights, payment of reparations, and firm int'l guarantees against future aggression.— Masoud Pezeshkian (@drpezeshkian) March 11, 2026 -
ఇరాన్ వెనుక రష్యా.. అమెరికా కోసం రంగంలోకి ఉక్రెయిన్
-
దాడులు ఉదృతం.. నేను రెడీ.. మీరు రెడీనా..?
-
అదే జరిగితే సంక్షోభం తప్పదు యుద్ధంపై పుతిన్ వార్నింగ్
-
ఆ ధైర్యం ఇరాన్కు ఎక్కడనుంచి వచ్చింది?
ఇరాన్ యుద్ధం.. ఆ దేశం కోరుకున్నది కాదు.. అమెరికా-ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్పై యుద్ధానికి కాలు దువ్వితే, దానికి ఆ దేశం అంతే ధీటుగా బదులిస్తోంది. తమ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనిని కోల్పోయి తీవ్ర వేధనను భరిస్తూనే అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు అదే స్పీడ్లో ప్రతిదాడులు చేస్తోంది ఇరాన్. ఖమేనీ హత్య తరువాత ఇరాన్ పరిస్థితి ఇక ముగిసినట్లే అనుకున్నవారికి ఆ వాదన తప్పు అని నిరూపిస్తూ ఇరాన్ వరుస దాడులతో చెలరేగిపోతోంది. ‘నిండా మునిగిన వాడికి చలేమిటి’ అన్నట్లు ఇరాన్ యుద్ధం చేసే తీరును గమిస్తేనే అర్థమవుతోంది.అటు చేతలతోనూ, ఇటు మాటలతోనూ అమెరికాకు గుబెల్ పుట్టిస్తోంది. ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా దెబ్బకొట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోట రాగానే, అంతే వేగంగా స్పందించింది ఇరాన్. తమను తక్కువ అంచనా వేయొద్దని అమెరికా--ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించింది. యుద్ధాన్ని ముగించేది మీరు కాదు.. మేం అంటూ ట్రంప్కు కౌంటరిచ్చింది. తాము చేసే యుద్ధం ఒక నెల, రెండు నెలలు కాదు.. ఆరు నెలలైనా కంటిన్యూగా చేస్తామని రెండు రోజుల క్రితం చెప్పిన ఇరాన్.. ఇప్పుడు పదేళ్లు అయినా యుద్ధం చేస్తూనే ఉంటామని, ఆ రెండు దేశాలే తమ శత్రువులని, వారికి నేరుగా మద్దతిచ్చే వారు కూడా తమ శత్రువులేననే చెబుతోంది. ఈ యుద్ధంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తున్నామని, తమకు ఎవరి సహాయం అవసరం లేదని కూడా అంటోంది. ట్రంప్లో భయం మొదలైందా..?ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ట్రంప్ ఒక్కసారిగా హుకుం జారీ చేశారు. ఇరాన్ చమురు నిల్వలు మన టార్గెట్ కాదని, వాటిపై దాడులు వద్దంటూ ఇజ్రాయెల్ను హెచ్చరించారు. దాంతో అమెరికా-ఇజ్రాయెల్లో భిన్న వైఖరి కనిపించింది. ఇక ‘ మీ పని అయిపోయింది’ అంటూ ఇరాన్ స్వయంగా లొంగిపోవాలంటూ బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్న ట్రంప్కు ఎక్కడో భయం ఉన్నట్లే కనిపిస్తోంది. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు చేసే సమయంలో అది ప్రపంచ మార్కెట్పై ప్రభావం చూపుతుందని, వాటిని వద్దని ట్రంప్ ఖండించారు. అయితే ఇక్కడ ట్రంప్లో ఉన్నది ఒక్కటే భయం ఉండి ఉండవచ్చు. చమురు సంక్షోభం ఏర్పడితే మొత్తం ప్రపంచదేశాల ట్రంప్ ముఖాన్ని చీదిరించుకుంటారనే ఉద్దేశంతోనే ఇరాన్ చమురు నిల్వలపై దాడిని ఆపి ఉండవచ్చనేది విశ్లేషకులు అభిప్రాయం. మరొకవైపు అమెరికా నిఘా వర్గాల సమాచారం కూడా ట్రంప్లో అలజడి రేపుతున్నట్లే కనబడుతోందని అంటున్నారు. ఇరాన్ను తక్కువగా చూడొద్దు: అమెరికా నిఘా వర్గాలుమరొకటి ఏమిటంటే ఇరాన్ అణుబాంబును తయారు చేసే శక్తిని దాదాపు క్రోడీకరించుకుందనే అనుమానం కూడా ట్రంప్లో ఉంది. అమెరికా నిఘా వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. తాము ధ్వంసం చేశామనే ఇరాన్ అణు కేంద్రాలను ఆ దేశం తిరిగి పునరుద్ధరించే పనిలో ఉందని అమెరికా నిఘా వర్గాలే చెప్పాయి. అయితే దానిపైనే ప్రస్తుతం తమ ఫోకస్ ఉందని, వాటిని వారు ఎక్కడికి తరలిస్తారు.. ఎలా పునరుద్ధరిస్తారు అనే దానిపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాయి. అంటే ఇరాన్ అణు ఆయుధాల అవసరమైన స్థాయిలో యురేనియంను శుద్ధిచేస్తోందనే విషయం అమెరికా చెప్పకనే చెప్పేసింది. అంటే అణు ఆయుధాలు ఇరాన్ నుంచి తయారైతే అదే తమకు ముప్పని అమెరికాకు బాగా తెలుసు. దాంతోనే అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్లు కనబడుతుండగా, ఇరాన్ మాత్రం యుద్ధాన్ని ఘనంగా ముగిస్తామని అంటోంది. అది అమెరికా-ఇజ్రాయెల్కు బుద్ధిచెప్పిన తర్వాతే తమ యుద్ధం ఆగుతుందని.. అంత వరకూ యుద్ధంలో వెనకడుగేసి ప్రసక్తే లేదని అంటోంది.పుతిన్కు ట్రంప్ ఎందుకు ఫోన్ చేసినట్లు?ఇక్కడ మరొక విషయం ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్ ఫోన్ చేయడం. ఇరాన్పై దాడిని తొలుత ఖండించిన వారిలో పుతినే ఉన్నారు. మరి అటువంటి పుతిన్కు ట్రంప్ ఫోన్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇరాన్కు రష్యా, చైనాలు ఆయుధాలను సప్లై చేస్తున్నాయి ఆరోపించిన అమెరికా.. ఒక్కసారిగా రూట్ మార్చిందా అనేది కూడా అనుమానంగా ఉంది. అసలు ఇరాన్ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఫోన్ చేశారా.. లేక యుద్ధాన్ని ఇక్కడితో ఆపేద్దాం అని ఇరాన్తో మధ్యవర్తిత్వం కోసం ఫోన్ చేశారా? అనే దానిపైనే చర్చ నడుస్తోంది. ఇరాన్కు రష్యా సపోర్ట్ చేస్తుందని ఆరోపించిన అమెరికా.. ఇప్పుడు ఆ ధేశ అధ్యక్షుడికే ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అనేది మరొక ప్రశ్న. తాడోపేడో తేల్చుకుందామని స్థితిలో ఉన్న ఇరాన్.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ట్రంప్కు ఏదో రకంగా చెప్పి యుద్ధాన్ని ఆపొచ్చు.. కానీ ఇరాన్ ఎవరు చెబితే వింటుంది అనేది మాత్రం ప్రపంచ నాయకులకు సవాల్గా మారింది. ఒకవేళ అమెరికా అనుమానపడుతున్నట్లే అణ్వాయుధాలను ఇరాన్ తయారు చేసే పనిలో ఉంటే మాత్రం అది ప్రపంచానికి ముప్పుగానే చెప్పొచ్చు. -
రష్యా మాస్టర్ ప్లాన్.. ఇదే అదను!
పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం మండిపోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రిఫైనరీలు, ఆయిల్ స్టోరేజ్ డిపోలు ధ్వంసమవుతున్నాయి. హార్ముజ్ జలసంధి దాదాపు మూతపడింది. ప్రపంచంలో 20 శాతం చమురు సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో మిడిల్ ఈస్ట్ నుంచి చమురు, ఎల్ఎన్జీ సరఫరాలు తీవ్రంగా తగ్గాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటింది.. కొన్ని సమయాల్లో 119 డాలర్ల వరకు చేరింది.ఈ సంక్షోభానికి సద్వినియోగం చేసుకోవాలని రష్యా భావిస్తోంది. "ఇదే అదను! చమురు ధరలు భారీగా పెరిగిన ఈ సమయంలో మన సరఫరాలను సద్వినియోగం చేసుకోవాలి!" అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారులకు స్పష్టం చేశారు. రష్యా ఇప్పటికే యూరప్కు సరఫరా చేస్తున్న గ్యాస్ను తగ్గించి.. లేదా పూర్తిగా ఆపేసి.. ఆ సరఫరాలను ఇతర మార్కెట్లకు (ఆసియా దేశాలు, భారత్ వంటివి) మళ్లించాలని సూచించారు."మనం ఇప్పుడే ఎక్కువ సరఫరాలు అవసరమయ్యే మార్కెట్లకు మా దృష్టిని మళ్లిస్తే.. అక్కడ అడుగు పెట్టవచ్చు" అని పుతిన్ చెప్పారు. యూరప్ దేశాలు రష్యా గ్యాస్పై ఆంక్షలు విధించాలని, 2027 నాటికి పూర్తిగా ఆపేయాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడే ఆ సరఫరాలను ఆపి.. ధరలు ఎక్కువగా ఇచ్చే కొత్త మార్కెట్లలో స్థానం సంపాదించుకోవచ్చనేది ఆయన వ్యూహం.రష్యా ఆయిల్ (ఉరల్స్ క్రూడ్) ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో 40 డాలర్లకి పడిపోయిన ధర.. ఇప్పుడు 60 డాలర్లు పైగా ఉంది. కొన్ని మార్కెట్లలో బ్రెంట్ కంటే కూడా ప్రీమియంతో అమ్ముడవుతోంది! ఇరాన్ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ ఎల్ఎన్జీ ఉత్పత్తి పునరుద్ధరణకు నెలల తరబడి సమయం పడుతుందని పుతిన్ చెప్పారు. దీంతో రష్యా ఎనర్జీ ఎగుమతుల నుంచి భారీ ఆదాయం వస్తుంది.. అది ఉక్రెయిన్ యుద్ధ ఖర్చులకు కూడా సహాయపడుతుంది.ఈ 'మాస్టర్ ప్లాన్'తో రష్యా ఆర్థికంగా బలపడుతుందా.. లేక యూరప్ ఎనర్జీ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా? ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.Putin says Russia should take advantage of the sky-high oil prices after US-Israeli attacks on Iran.Russia should redirect supplies to Europe elsewhere, he adds. “If we shift our focus right now to the markets that need more supplies, we might get a foothold there.” pic.twitter.com/FZAHksP2p6— max seddon (@maxseddon) March 9, 2026 -
పేరు మాయని మనిషి
అసలైన సాహిత్యజీవికి వర్తమానం ఎలాంటి కిరీటమూ పెట్టకపోవచ్చు, కానీ చరిత్ర అతడిని తగిన విధంగా ఆశీర్వదిస్తుందనడానికి ఐజాక్ బేబెల్ జీవితమే ఉదాహరణ. అయితే ఆ వర్తమానపు విషాదం చరిత్ర ఎప్పటికీ తుడుచుకోలేని మచ్చ. ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగమైన ఉక్రెయిన్లో జన్మించిన ఈ యూదు తన మాతృభాష యిడ్డిష్ను కాదని రష్యన్ను రచనా భాషగా ఎంచుకున్నాడు. సోవియట్ రష్యా ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచాడు. పోలిష్–సోవియట్ యుద్ధ సమయంలో రచయిత గోర్కీ సూచన మీద పాత్రికేయుడిగా పనిచేసిన బేబెల్ ఆ యుద్ధం తాలూకు చీకటి, బీభత్సాల చేదు వాస్తవికతను ‘రెడ్ కావల్రీ’ కథలుగా అందించాడు. 1926లో తొలిసారి ప్రచురితమైన ఈ కథలకు ఇది శతాబ్ది సంవత్సరం.అత్యంత సంక్షిప్తంగా రాయడం, ఉన్నట్టుండి కథను మరో తలంలోకి కొనిపోవడం, ‘సాల్ట్’ కథ గురించి బోర్హెస్ అన్నట్టు– కవిత్వానికే సాధ్యమై మననానికి వీలుండే లయను కథలో సాధించడం బేబెల్ గొప్పతనం. రెడ్ కావల్రీ, తను పుట్టి పెరిగిన ఒడెస్సా పట్టణం నేపథ్యంలో ‘ఒడెస్సా స్టోరీస్’, ఇంకా రెండు నాటకాలు, ఒక సినిమాకు స్క్రీన్ప్లే మాత్రమే రాసిన బేబెల్(1894–1940) వచనంలో కరుణ, కాఠిన్యం కలగలసి మనసును మెలిపెడతాయి. యుద్ధభూమి తాలూకు బహుముఖ పార్శా్వలనూ, అత్యంత సున్నితమైన మనిషి కూడా అనూహ్య కార్యాలకు సిద్ధమయ్యే విపరిణామాలనూ ఆయన చిత్రించాడు. సాధారణ జీవితం గడపాలని కోరుకుంటూ రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న నిస్సహాయ మానవులు అందులో కనబడతారు. చావు వాసన వేసే కథలు ఆయనవి! యుద్ధం అనేది యుద్ధ క్షేత్రానికే పరిమితమై ఉండదని కూడా ఈ కథలు చెబతాయి.కమ్యూనిస్టు వ్యతిరేకి కాకపోయినా బేబెల్ ప్రాపగాండా వ్యతిరేకి. దాంతో విమర్శను తట్టుకోలేని రాజ్యం ఆయన్ని సోవియట్ యూనియన్లో ‘నాన్–పర్సన్’ చేయడానికి పూనుకుంది. 1933 నుంచే ఆయన పుస్తకాలను ఉపసంహరించడం మొదలైంది. స్టాలిన్ హయాంలోని ‘సామ్యవాద వాస్తవికత’కు తగ్గట్టుగా రచయితలు తమ పాత రచనలను తిరగరాస్తున్న వేళ, తనను తాను సరిచేసుకోవడం ఇష్టంలేని బేబెల్ మౌనం అనే కొత్త సాహిత్య ప్రక్రియలో రాణిస్తున్నానని చెప్పుకొన్నాడు. ఇక ‘ప్రజా శత్రువు’గా అరెస్టయిన తర్వాత బేబెల్ మీద ట్రాట్స్కీయిస్టు, ఉగ్రవాదం, గూఢచర్యం లాంటి కేసులు పెట్టారు. ఆయన పేరును సాహిత్య నిఘంటువుల్లోంచీ, ఎన్సైక్లోపీడియాలోంచీ తొలగించారు. ఆయన గురించి ఏ సాహిత్య కార్యక్రమంలోనూ ఎత్తడానికి లేదు. బేబెల్ అనే మనిషి లేనట్టుగానే వ్యవహరించారు. ఆధునిక సోషల్ మీడియా యుగంలో జడలు విప్పిన ‘క్యాన్సిల్ కల్చర్’ అనేదానికి ఆ కాలంలో బీజాలున్నాయి. 1940 జనవరి 16న పార్టీకీ, సోవియట్ ప్రభుత్వానికీ శత్రువులైన 457 మంది జాబితా స్టాలిన్కు అందింది. అందులో బేబెల్ సహా 346 మందిని కాల్చేయాలన్న సిఫారసు ఉంది. జనవరి 27న మధ్యాహ్నం 1:30కు 45 ఏళ్ల బేబెల్కు కాల్చివేత శిక్ష అమలైంది. బేబెల్ సమగ్ర రచనలను ఆంగ్లంలోకి అనువదించిన పీటర్ కాన్స్టంటీన్ ఈ మరణ శిక్షను ‘ఇరవయ్యో శతాబ్ద సాహిత్యపు అతి దారుణ విషాదాల్లో ఒకటి’గా అభివర్ణించారు. 1954లో కృశ్చేవ్ పాలనలో బేబెల్ను నిరపరాధిగా ప్రకటించిన తర్వాతగానీ ఆయన రచనలు మళ్లీ వెలుగు చూడలేదు.రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ తన గతాన్ని పునఃసమీక్షించుకుంటూ, కొత్త చరిత్రను లిఖించకుంటున్న వేళ, అక్కడి మేధావర్గంలో బేబెల్ మీద సంక్లిష్ట స్పందన ఉంది. కానీ ’(ఉక్రెయిన్) అంధత్వం, అశక్తత, ఆ ఆశక్తత లోంచి పుట్టిన తెలియని కఠినత్వం’ గురించి రాసిన బేబెల్ సృజన విస్మరించలేనిదని పొలిటికల్ సైంటిస్ట్ వాలెంటీన్ బుషాన్స్కీ అంటారు. ఒక దిశ లేకుండా పుస్తకాలు చదువుతున్న భార్య ఆంటోనినా పీరుష్కోవాకు అనవసర పుస్తకాల మీద సమయం వృథా చేసుకోకుండా ముఖ్యమైన క్లాసిక్స్ ఏవి చదవాలో ఒక జాబితా ఇస్తాడు బేబెల్. చదవడం ఎంత ముఖ్యమో, ఏవి చదవాలో తెలియడం అంతకన్నా ముఖ్యం. ఆ జాబితాలో మనం బేబెల్ను కలుపుకోవచ్చు. -
" ప్రెసిడెంట్ మీ పని మీరు చూసుకొండి "
అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. రెండు సౌర్వభౌమాధికారం ఉన్న దేశాలు అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకోవడమే ప్రపంచ శాంతికి పునాది రాయన్నారు. అవతలి వారి విషయాల్లో తలదూర్చకుండా ట్రంప్ తన పని తాను చూసుకోవాలని హెచ్చరించారు.ఇండియా విషయంలో ట్రంప్ వ్యవహార శైలి తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇది వరకే భారత అంతరంగిక విషయాలు పలు మార్లు అమెరికా అధ్యక్షుడు బహిరంగ విమర్శలు చేశారు. వీటిని భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ట్రంప్ తీరు మార్చుకోలేదు. తాజాగా రష్యా నుంచి భారత్ నెల రోజుల పాటు చమురు కోనుగోలు చేసుకోవచ్చని దానికి అనుమతిచ్చామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తాజాగా ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ స్పందించారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్రంప్కు లేఖ రాశారు. " ప్రియమైన ప్రెసిడెంట్ భారత ప్రజలు సౌర్వభౌమ దేశానికి చెందిన వారు. మాకు వేరే దేశాల అనుమతులు అవసరం లేదు. దయచేసి మీ సామర్థ్యం మేరకు మీ పని చూసుకొండి" అన్నారు. సౌర్వభౌమ దేశాల అభిప్రాయాలకు పరస్పర గౌరవమివ్వడమే శాంతికి మూలమని మీ దేశ ప్రజలకు శాంతి, సౌభాగ్యం లభించాలని కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.అంతకు మందు స్కాట్ బెసెంట్ " ఇండియన్స్ మంచి యాక్టర్స్, వారికి మేము రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని కోరాం. వారు అలానే చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా ఆజ్ఞలకు తాత్కాలిక విరమింపు ఇచ్చాం. వారికి చమురు కొనుగోలుకు అనుమతి ఇచ్చాం" అని అన్నారు. దీంతో బీసెంట్ వ్యాఖ్యలపై భారత్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.ToThe President of the United States of America @POTUSDear Mr. President, We, the people of India, belong to a free and sovereign nation. We no longer take orders from distant foreign shores.Please mind your own business to the best of your abilities.Mutual respect…— Kamal Haasan (@ikamalhaasan) March 7, 2026 -
భీకర యుద్ధం వేళ ఇరాన్ అధ్యకుడికి పుతిన్ ఫోన్
-
యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. ఇరాన్ కు రష్యా నిఘా సహాయం?
-
భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందంటూ అమెరికా ట్రెజరీ శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కామెంట్లు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. ఇప్పటికే సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేయటానికి భారత్కు అనుమతి ఇచ్చినట్టు అమెరికా తెలిపిన విషయం తెలిసిందే. అయితే, అమెరికా మనకు అనుమతి అనుమతి ఇవ్వడం ఏంటని భారత్లో విపక్షాలు మండిపడుతున్నాయి. ఇటువంటి సమయంలో స్కౌట్ కీలక వ్యాఖ్యలు చేశారు.“ప్రపంచానికి చమురు సరఫరా బాగానే కొనసాగుతోంది. ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న రష్యా చమురు కొనుగోలును ప్రారంభించటానికి మా మిత్ర దేశం భారత్కు నిన్న అమెరికా ట్రెజరీ శాఖ అనుమతి ఇచ్చింది” అని స్కాట్ బెసెంట్ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.“భారత్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. ముందుగా ఆంక్షలు ఉన్న రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని మేము కోరాం.. భారత్ ఆపింది. దాని స్థానంలో అమెరికా నుంచి చమురు కొనాలని భారత్ నిర్ణయించింది. కానీ, ప్రపంచ చమురు సరఫరాలో ఏర్పడ్డ తాత్కాలిక లోటును తగ్గించటానికి ఇప్పుడు రష్యా చమురును కొనడానికి మేము భారత్కు అనుమతి ఇచ్చాం. రష్యా చమురుపై ఉన్న మరికొన్ని ఆంక్షలను కూడా తొలగించవచ్చు” అని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుండడంతో మార్కెట్కు ఉపశమనం ఇవ్వటానికి చర్యలు ప్రకటించే ప్రక్రియ కొనసాగుతుంది” అని తెలిపారు.ట్రంప్ పరిపాలనలోని మరికొంతమంది అధికారులు కూడా రష్యా చమురును కొనుగోలు చేయడానికి భారత్కు అనుమతి ఇచ్చామని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొన్ని నెలల క్రితం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో రష్యా నుంచి చమురు కొనుగోలుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చామని అమెరికా అంటోంది.అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై యుద్ధం చేస్తున్న సమయంలో చమురు సరఫరాకు ఆటంకాలు లేకుండా చేయడం, మార్కెట్లో ఒత్తిడి తగ్గించడమే లక్ష్యమని అమెరికా అధికారులు చెప్పారు. హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న పరిస్థితుల వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. -
యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. అమెరికా దాడులకు పుతిన్ చెక్?
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు రష్యా చాటుగా సాయపడుతోందా? అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల కదలికలతో పాటు గల్ఫ్లోని ఆ దేశ సైనిక స్థావరాలు తదితరాలకు సంబంధించిన సున్నితమైన నిఘా సమాచారాన్ని వారం రోజులుగా ఎప్పటికప్పుడు ఇరాన్కు అందిస్తూ వస్తోందా? తద్వారా వాటిపై దాడులకు సహకరిస్తోందా? అంటే, అవునని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్టు వార్తా సంస్థ సంచలనాత్మక కథనం వెలువరించింది.‘యుద్ధం మొదలైన ఒకట్రెండు రోజుల్లోనే ఇరాన్ నిఘా సామర్థ్యం దాదాపుగా కుప్పకూలింది. అయినా అమెరికా యుద్ధ నౌకలు, గల్ఫ్ దేశాల్లోని స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్ కచ్చితత్వంతో దాడులు చేయగలిగింది. రష్యా అందించిన నిఘా సమాచారంతోనే ఇది సాధ్యమైందనడం సుస్పష్టం’ అని సదరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ దీనిపై ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాపైనా ఆయన తీవ్ర చర్యలకు దిగితే ఇప్పటికే పశ్చిమాసియా అంతటా కుంపట్లు రాజేస్తున్న యుద్ధం మరింతగా విస్తరించే ప్రమాదముంది.ఇరాన్కు కావాల్సింది.. ఓ మంచి నాయకుడు: ట్రంప్ మరోవైపు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు ఒక మంచి నాయకుడు కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలువురు నేతల పేర్లు తమ దృష్టిలో ఉన్నట్టు చెప్పారు. ‘ఇరాన్కు మంచి భవిష్యత్తుంటుంది. ఇతర దేశాల సాయంతో ఆ దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేస్తాం. ఆర్థికంగా అత్యంత బలోపేతం చేస్తాం’ అని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’తరహాలో ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’అంటూ అధ్యక్షుడు ముక్తాయించడం విశేషం! మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధానికి తెర దించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధ నౌకను ముంచేశాం: అమెరికా డ్రోన్లు, ఇతర ఆయుధాలతో కూడిన ఇరాన్ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ షహీద్ బఘేరీని ముంచేసినట్టు అమెరికా ప్రకటించింది. అది మంటల్లో తగలబడిపోతున్న ఫుటేజీని యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ శుక్రవారం విడుదల చేసింది. ఇరాన్ సైన్యం మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. 180 మీటర్ల పొడవైన షహీద్ నిజానికి రవాణా నౌక. యుద్ధ అవసరాల రీత్యా ఇరాన్ దాన్ని తాత్కాలికంగా డ్రోన్ క్యారియర్గా మార్చినట్టు సమాచారం. ఇది రీ ఫ్యూయలింగ్ కోసం ఆగకుండా ఏకబిగిన 22 వేల నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు!. -
మళ్లీ మనకి రష్యా క్రూడ్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో అమెరికా అనుమతి మేరకు, రష్యా నుంచి మళ్లీ క్రూడాయిల్ కొనుగోలు చేసేందుకు భారత్కి అవకాశం లభించింది. ఇందుకు సంబంధించి 30 రోజుల పాటు భారత్కి వెసులుబాటునిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది.‘‘అధ్యక్షుడు ట్రంప్ ఎజెండాతో చమురు, గ్యాస్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో చమురును అందుబాటులో ఉంచే దిశగా రష్యా ఆయిల్ని భారత రిఫైనరీలు కొనుగోలు చేసేందుకు తాత్కాలికంగా 30 రోజుల పాటు మినహాయింపునిస్తున్నాం. ఇంధనాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను నిలువరించేందుకు ఇది తోడ్పడుతుంది. కీలక భాగస్వామి అయిన భారత్, ఈ వ్యవధి ముగిసిన తర్వాత మా దగ్గర్నుంచే మరింతగా ఆయిల్ కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నాం’’ అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో పేర్కొన్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యన్ ట్యాంకర్ల నుంచి మాత్రమే కొనుగోళ్లకు అనుమతించినందున, ఈ తాత్కాలిక వెసులుబాటుతో రష్యాకి భారీగా ఆర్థిక ప్రయోజనాలేమీ చేకూరవని బెసెంట్ తెలిపారు. సముద్ర జలాల్లో 130 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ఆంక్షలు వర్తించని సంస్థల నుంచి దేశీ రిఫైనింగ్ సంస్థలు ఇప్పటికే దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి, అమెరికా మినహాయింపునివ్వడానికి ముందే, పశ్చిమాసియా నుంచి సరఫరా దెబ్బతిన్నప్పటి నుంచే కొనుగోళ్లు మొదలయ్యాయని వివరించాయి. ఆంక్షలు ఎదుర్కొంటున్న సంస్థల నుంచి కొనుగోళ్లకు కూడా మినహాయింపు వర్తిస్తుందా లేదా అనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం 15 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్తో అరేబియన్ సముద్రం, బంగాళాఖాతంలో రష్యన్ ట్యాంకర్లు నిల్చి ఉండగా, మరో 7 మిలియన్ బ్యారెళ్ల ట్యాంకర్లు సింగపూర్ దగ్గర్లో ఉన్నాయి. వీటికి తోడు కొద్ది రోజుల వ్యవధిలోనే భారత్కి చేరుకునేంత దూరంలో, సింగపూర్ సమీపంలో మరో ఎనిమిది ట్యాంకర్లు ఉన్నాయి. ఇవే కాకుండా నెల రోజుల వ్యవధిలో భారత్కి రాగలిగేలా మధ్యధరా సముద్రం, సూయెజ్ కెనాల్లో మరిన్ని నౌకలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దాదాపు 50 శాతం క్రూడ్ దిగుమతుల కోసం హార్మూజ్ జలసంధిపై ఆధారపడటంతో సరఫరా సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్కి 30 రోజుల వెసులుబాటు భారీ ఊరటనిచ్చే విషయమని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ’కెప్లర్’ అనలిస్ట్ సుమీత్ రితోలియా తెలిపారు. ప్రస్తుతం 130 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ క్రూడ్, సముద్ర జలాల్లో ఉందని, సరైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే అది దేశీ పోర్టులకు మళ్లడానికి వీలవుతుందని వివరించారు. దేశీ రిఫైనర్లు ఇప్పుడు రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ఆయిల్ కొంటున్నాయని, తాజాగా దాన్ని మరింతగా పెంచేందుకు వీలు చిక్కిందని వివరించారు. అయితే, అదే ఆయిల్ కోసం చైనా కూడా పోటీపడుతున్నందున డిస్కౌంట్లపరంగా భారత్కి పెద్దగా ప్రయోజనం లభించకపోవచ్చని పేర్కొన్నారు. 25 రోజులకు సరిపడా నిల్వలు...ఉక్రెయిన్ మీద దాడికి శిక్షగా పాశ్చాత్య దేశాలు రష్యాపై 2022లో ఆంక్షలు విధించడం, అటుపైన ఆ దేశం భారత్కి భారీ డిస్కౌంటుపై చమురును ఆఫర్ చేయడం తెలిసిందే. దీనితో మిగతా దేశాల నుంచి కొనుగోళ్లు తగ్గించుకున్న భారత్ 2023 మేలో రోజుకు ఏకంగా 2.15 మిలియన్ బ్యారెళ్ల స్థాయిలో రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసింది. కానీ అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గించుకోవాల్సి వచి్చంది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 25 రోజులకు సరిపడే చమురు నిల్వలు ఉన్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు తీవ్రమై.. క్రూడ్ రేట్లు కొండెక్కుతున్న నేపథ్యంలోనే అమెరికా మినహాయింపునివ్వడం కొంత ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు తెలిపారు. -
ఇరాన్ కి అండగా రష్యా, చైనా సూసైడ్ డ్రోన్స్ వెనుక వ్యూహం ఏంటి?
-
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
మాస్కో: ఇజ్రాయెల్, అమెరికాలతో పోరాడుతున్నప్పటికీ ఇరాన్ తమను సైనిక సాయం అడగలేదని రష్యా ప్రకటించింది. మిత్రదేశానికి సాయపడబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్ష కార్యాలయం అధికారిక ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం స్పందించారు. ‘‘ఇరాన్ నుంచి ఇంతవరకు ఎలాంటి అభ్యర్థనా రాలేదు. ఇరాన్తో మా మిత్రత్వం ఎప్పటి లాగానే కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు లేవు. 2025 జనవరిలో ఇరాన్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. కానీ ఆ ఒప్పందంలో ఆపత్కాలంలో ఇలాంటి సైనిక సాయం అంశం లేదు’’ అని పెస్కోవ్ స్పష్టంచేశారు.చైనా ఆఫర్..గతవారం నుంచి అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలకు దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. పోరాటాన్ని ముగించడానికి తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. అలాగే, జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యూఏఈకి చైనా మద్దతు ఇస్తుందని, దౌత్యం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకునేలా ఇతర గల్ఫ్ దేశాలకు కూడా మద్దతు ఇస్తుందని వాంగ్ యీ అన్నారు. ‘‘యుద్ధం వల్ల ప్రజలు మాత్రమే నష్టపోతారు.. శాంతి కోసం చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూనే ఉంటుంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శాంతి ప్రక్రియ కోసం ప్రత్యేక రాయబారిని పంపే ప్రణాళికలను ధ్రువీకరించింది.భారత్ కీలక ప్రకటన..మరోవైపు, ఘర్షణలను వీలైనంత త్వరగా ముగించాలని ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్లకు భారత్ పిలుపునిచ్చింది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత్ చట్టాలను గౌరవిస్తుంది.. సైనిక ఘర్షణలతోనే ఏ సమస్య పరిష్కారం కాదు.. అది ఉక్రెయిన్ అయినా.. పశ్చిమాసియా అయినా’’ అని అన్నారు. -
అణ్వస్త్ర రాశులు!
ఇరాన్తో అమెరికా అణు చర్చలు చెప్పుకోదగ్గ పురోగతి సాధిస్తున్నా లెక్కచేయకుండా అధ్యక్షుడు ట్రంప్ దానిపై ఉన్నట్టుండి యుద్ధానికి తెర తీశారు. ఆ దేశం ఎన్నటికీ అణ్వ్రస్తాలను తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇజ్రాయెల్తో కలిసి ఉన్నపళంగా ఇరాన్పై అంత స్వేచ్చగా దాడికి దిగగలిగారంటే దానివద్ద అణు బాంబులు లేకపోవడమే కారణమని చెప్పవచ్చు. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై మాత్రం ట్రంప్ ఎంతగా కత్తులు నూరినా, నాలుగేళ్లుగా కఠిన ఆంక్షలు తదితర చర్యలకే పరిమితమయ్యారే తప్ప ఎన్నడూ యుద్ధానికి దిగే సాహసం చేయలేదు. ఆ దేశం వద్ద అపారంగా పోగుపడ్డ అణ్వాయుధ నిల్వలే అందుకు ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అణుపాటవమున్న దేశాలెన్ని, వాటి వద్ద ఎన్ని అణ్వాయుధాలున్నాయి అన్నది ఓసారి చూస్తే... అణ్వస్త్ర దేశాల జాబితాలో అగ్రాసనం అమెరికా, రష్యాలదే. ప్రపంచంలోని మొత్తం అణుబాంబుల్లో 90 శాతానికి పైగా ఈ రెండు దేశాల వద్దే పోగుపడ్డాయి! ఆ రెండింట్లో సంఖ్యాబలం రీత్యా రష్యాదే పైచేయి. అమెరికా వద్ద 5,277 అణు బాంబులుంటే రష్యా వద్ద ఏకంగా 5,459 దాకా పోగుపడ్డాయి! అమెరికా తన అణ్వాయుధాలను బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీల్లో కూడా మోహరించి ఉంచడం విశేషం! రష్యా కూడా తన అణ్వాస్త్రాల్లో కొన్నింటిని మిత్ర దేశం బెలారస్లో ఉంచింది. ఇతర అణ్వస్త్ర దేశాల్లో ఇజ్రాయెల్, ఉత్తర కొరియా వద్ద ఉన్న అణుబాంబుల సంఖ్యపై కచి్చతమైన స్పష్టత లేదు. ఇజ్రాయెల్ వద్ద కనీసం 200 అణు బాంబుల తయారీకి అవసరమైన అన్ని వనరులూ ఉన్నట్టు చెబుతారు. ఆ దేశం ఇప్పటికే 90 అణు బాంబులను తయారు చేసిందని అంచనా. ఉత్తర కొరియా కూడా 50 అణు బాంబుల తయారీకి అవసరమైన యురేనియం తదితరాలను పలు మార్గాల సేకరించి ఉంచుకున్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు. అణు పాటవమున్న మొత్తం 9 దేశాల వద్దా కలిపి 12,341 అణు బాంబులున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటమిక్ సైంటిస్ట్స్ 2025 నివేదిక చెబుతోంది. వాటిలో 9,600కు పైగా అణు వార్హెడ్లు ఏ క్షణంలోనైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఆయా దేశాల సైన్యం నియంత్రణలో ఉన్నట్టు సమాచారం. అయితే ప్రచ్ఛన్నయుద్ధ కాలంతో పోలిస్తే ఇది చాలా తక్కువే కావడం విశేషం. ఆ సమయంలో ప్రపంచ దేశాలన్నింటి దగ్గరా కలిపి ఏకంగా 70 వేల పై చిలుకు అణు వార్హెడ్లు పోగుపడ్డాయి!– సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్కు పుతిన్ భారీ సాయం
ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ చమురు నిల్వలు భారత్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రష్యా మరోసారి భారత్కు అండగా నిలిచింది. ఇరాన్తో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఏకంగా 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో హార్మోజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో దాదాపు 40% హార్మోజ్ ద్వారా జరుగుతోంది. భారత్ వద్ద ప్రస్తుతం కేవలం 25 రోజులకు సరిపడ ముడి చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధమైనట్టు తెలిసింది. భారతీయ సముద్ర జలాలకు సమీపంలోనే ఉన్న నౌకలలోని దాదాపు 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్ చేరుకోగలదని పరిశ్రమ వర్గాలు రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపాయి.అయితే.. రష్యన్ చమురు నౌకల అసలు గమ్యస్థానం వివరాలను మాత్రం వెల్లడించడానికి సదరు పరిశ్రమ వర్గాలు నిరాకరించాయి. దీంతో, రిఫైనరీ సంస్థలకు ఊరట కలిగిస్తూ కొన్ని వారాల్లోనే ఈ చమురు నౌకలు భారత్ చేరుకుంటాయని మాత్రం వారు వెల్లడించారు. అదేవిధంగా గ్యాసాయిల్, గ్యాసోలిన్, ఎల్పీజీ కూడా పరిమిత పరిమాణంలోనే రిఫైనరీల వద్ద ఉన్నాయి. రానున్న 10-15 రోజులు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.ప్రస్తుతం యుద్ధం కారణంగా జలసంధి మార్గం దాదాపు మూతపడడంతో ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత్ అన్వేషించక తప్పని పరిస్థితి నెలకొంది. భారతీయ రిఫైనరీలు రోజుకు సుమారు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు దరిమిలా ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడడంతో హార్మోజ్ జలసంధి సమీపంలో వందలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్కు చమురు సరఫరాకు రష్యా అంగీకరించినట్టు సమాచారం. -
భారత్ గ్లోబల్ పవర్గా ఎదగకుండా చేయడానికే..: ఖమేనీ ప్రతినిధి
న్యూఢిల్లీ: భారత్తో పాటు చైనాను గ్లోబల్ పవర్స్గా ఎదగకుండా చేయడానికే తమ దేశంతో అమెరికా ఘర్షణలకు దిగుతోందని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి (ఖమేనీ ప్రతినిధి) అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో అబ్దుల్ మజీద్ ఇవాళ ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయం నుంచి భారత్కు ప్రత్యేక ప్రతినిధిగా అబ్దుల్ మజీద్ ఉన్నారు.అమెరికా అగ్రరాజ్య హోదాను నిలుపుకోవడానికి ప్రపంచ ఘర్షణలను ప్రోత్సహిస్తోందని అబ్దుల్ మజీద్ ఆరోపించారు. “సమీప భవిష్యత్తులో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలుగా భారత్, చైనా, రష్యా, అమెరికా ఉంటాయి. అయితే, భారత్ లేదా చైనా తనతో పాటు సమాన శక్తులుగా ఎదగడాన్ని అమెరికా జీర్ణించుకోదు. అందుకే దీన్ని అడ్డుకోవడానికి ఈ యుద్ధాలను ప్రేరేపించి అమెరికా తన ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది” అని అబ్దుల్ మజీద్ చెప్పారు.అమెరికా ప్రారంభించిన యుద్ధమిది..ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్ అని, ఇరాన్ కాదని అబ్దుల్ మజీద్ తెలిపారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ దేశం తనను తాను రక్షించుకుంటోందని ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజానీ కూడా ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. “మాపై దాడి చేసి మా పౌరులపై బాంబులు వేస్తున్నారు. మేము కేవలం మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాం” అని చెప్పారు. యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికానే కాబట్టి దానిని ముగించాల్సింది కూడా ఆ దేశమేనని అబ్దుల్ మజీద్ తెలిపారు. వారు ఆపితే తాము కూడా ఆపుతామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: భారత్కు మరో ఐదు ఎస్-400లు.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..ఇరాన్ రెండు యుద్ధాలు ఎదుర్కొంటోందని అబ్దుల్ మజీద్ తెలిపారు. ఒకటి అమెరికా, ఇజ్రాయెల్తో సైనిక ఘర్షణ, మరొకటి నకిలీ వార్తల యుద్ధం అని అన్నారు. “అమెరికా, ఇజ్రాయెల్పై సైనిక యుద్ధాన్ని మేము ఎదుర్కోగలం. అయితే దీనికంటే పెద్ద మరో యుద్ధం జరుగుతోంది. అదే నకిలీ కథనాల యుద్ధం. ఈ యుద్ధంలో వారు నకిలీ వార్తలు సృష్టిస్తారు. ఇరాన్ ప్రజలు పాలన మార్పు కోరుకుంటున్నారని చెబుతారు” అని ఆయన అన్నారు. మొత్తానికి ఇతర దేశాల ఎదుగుదలను అడ్డుకోవడమే అమెరికా లక్ష్యమని, తద్వారా వాషింగ్టన్కు తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందని చెప్పారు. -
‘బాబా వంగ’ భవిష్యవాణిపై ఊపందుకున్న చర్చలు
టెహ్రాన్: మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో యావత్ ప్రపంచం మరోసారి తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా మెరుపు దాడులు చేపట్టాయి. ఈ నేపధ్యంలో దివంగత బల్గేరియన్ ప్రవక్త ‘బాబా వంగ’ గతంలో చెప్పిన సంచలన భవిష్యవాణి నిజమవుతున్నదంటూ ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.2020వ దశకంలో ప్రపంచం పెను మార్పులకు లోనవుతుందని, తీవ్రమైన దౌత్య సంక్షోభాలు తలెత్తి, అవి పెను యుద్ధానికి దారితీస్తాయని ‘బాబా వంగ’ అప్పట్లో పేర్కొన్నట్లు సోషల్ మీడియా వేదికలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 1996లోనే ఆమె మరణించినప్పటికీ, ఆమె చెప్పిన భవిష్యత్ ప్రపంచ పరిణామాలను నిజమవుతున్నాయని ఆమె అనుచరులు నమ్ముతున్నారు. దీంతో ప్రస్తుతం నెలకొన్న అస్థిరతను మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతంగా వారు అభివర్ణిస్తున్నారు.కాగా ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి వ్యవస్థలను అడ్డుకోవడమే లక్ష్యంగా భారీ యుద్ధ కార్యకలాపాలను ప్రారంభించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ దాడుల నేపథ్యంలో యూఏఈ, బహ్రెయిన్, ఖతార్ వంటి పొరుగు దేశాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండగా, మరోవైపు పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం మొదలు కావడం ఆందోళన కలిగిస్తోంది.అయితే బాబా వంగ భవిష్యవాణికి సంబంధించి ఎటువంటి ప్రామాణిక రాతపూర్వక ఆధారాలు లేవని చరిత్రకారులు, పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలు సందర్భానుసారంగా అన్వయించుకున్నవేనని వారు కొట్టిపారేస్తున్నారు. భౌగోళిక రాజకీయ విశ్లేషకులు సైతం ప్రస్తుత పరిస్థితులను ‘ప్రపంచ యుద్ధం’గా పిలవలేమని, ఇవి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పోరాటాలని అంటున్నారు. సంక్షోభ సమయాల్లో జనం ఇలాంటి ప్రతీకాత్మక లేదా ప్రాచీన జోస్యాలపై మొగ్గు చూపడం సహజమేనని, దౌత్యపరమైన చర్చలు, సంయమనం ద్వారానే ఈ పెను ముప్పును తప్పించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘ప్రతిజ్ఞ నెరవేర్చా’.. ఖమేనీ చివరి సందేశం? -
"నేను మంచి తండ్రిని కాలేకపోయా"
ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తోనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు ఇతరులు యుద్ధాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా పురోగతి కనిపించడం లేదు. అయితే నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావోద్వేగ ప్రకటన చేశారు. తను ఒక మంచి తండ్రిగా ఉండలేక పోయానన్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మెుదలయ్యి నాలుగేళ్లు గడిచింది. ఈ సంగ్రామంలో దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ‘సెంటర్ ఫర్ స్ట్రాటిజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్(సీఎస్ఐఎస్)’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. అయితే ఈ యుద్ధం ముగింపుకోసం ఎన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సహా పలు దేశాలు అంతర్జాతీయ సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావోద్వేగ ప్రకటన చేశారు.ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ " ఈ యుద్ధ సమయంలో నేను మంచి తండ్రిగా ఉండలేకపోయా, ఎందుకంటే నాపిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోయా, ఎందుకంటే నేను ఉక్రెయిన్ అధ్యక్షున్ని, నామెుదటి ఎంపిక ఎప్పుడూ దేశమే" అని జెలెన్స్కీ ఉద్వేగభరితంగా మాట్లాడారు. మా ప్రజలు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు.అయితే రష్యా దాడులతో దేశంలో ఎలక్ట్రిసిటీ లేక దేశ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని జెలెన్స్కీ తెలిపారు. పగలు రాత్రి తేడా లేకుండా వాతావరణం మైనస్ 30 డిగ్రీలకు చేరుకుందని దీంతో ప్రజలంతా అవస్థలు పడుతున్నారన్నారు. అయితే యుద్ధం వల్ల పాడైపోయిన విద్యుత్ వ్యవస్థ తిరిగి పునరుద్దరిద్దామంటే రష్యా దాడులతో అది సాధ్యపడడం లేదన్నారు.ట్రంప్కు థ్యాంక్స్కొద్దిరోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడానని శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ధన్యవాదాలని తెలిపారు. అయితే తమ దేశానికి చెందిన భూభాగాలని రష్యా తమదని ప్రచారం చేసుకోవడంతో విభేదాలు సాగుతున్నాయని తెలిపారు. అయితే రష్యా అధ్యక్షుడితో ముఖాముఖీ సమావేశం ఏర్పాటు చేయాలని జెలెన్స్కీ కోరుతున్నారు. అయితే రష్యా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దాని బదులు జెలెన్స్కీని మాస్కోకు రావాలని ఆహ్వానించగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒప్పుకోలేదు. -
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం.. చైనా, రష్యా ఆందోళన
ఢిల్లీ: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పాక్ సైన్యం ఆప్ఘన్ ప్రజలపై వైమానిక దాడులు ప్రారంభించింది. ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’పేరిట కాబూల్, కాందహార్, పాక్తియా తదితర ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 274 మంది తాలిబన్లు మరణించారు. ఈ నేపథ్యంలో దాడులపై పలు దేశాలు స్పందిస్తున్నాయి.ఉద్రిక్తతలపై చైనా, రష్యా ఆందోళన పాక్, అఫ్గాన్ మధ్య 2,611 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సరిహద్దు ఉంది. దీన్ని డ్యురాండ్ లైన్ అని పిలుస్తుంటారు. అయితే, ఈ సరిహద్దును తాలిబన్లు గుర్తించడం లేదు. ఇటీవల డ్యురాండ్ లైన్ వద్ద అఫ్గాన్ దళాల కాల్పుల్లో 55 మంది తమ సైనికులు మృతి చెందినట్లు పాకిస్తాన్ రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. తాలిబన్లు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే దాడులకు దిగుతున్నారని, తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తమ చెక్పోస్టులను కూడా స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ తుర్కియే, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిణామాలను వారికి వివరించారు. పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని ఆయా మంత్రులు స్పష్టంచేశారు. మరోవైపు పాక్–అఫ్గాన్ ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంపై చైనా, రష్యా ఆందోళన వ్యక్తంచేశాయి. వివాదాలను దౌత్య మార్గాల్లో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు సూచించాయి. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని చైనా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. పరిస్థితి మరింత విషమించకముందే సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని కోరింది. -
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మరోసారి భీకరంగా మారింది. నిన్న గురువారం రాత్రి ఆ దేశంపై పెద్ద ఎత్తున డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకపడినట్లు తెలుస్తోంది. ఈ దాడులలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్లు సమాచారం.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ పరిస్థితులు సద్ధుమణగడం లేదు. ఇరు దేశాల మధ్య ఓ వైపు శాంతి చర్చలకు అవకాశం ఉందంటూనే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకపడింది. ఆదేశంలోని రైల్వే, ఎనర్జీ సెక్టార్ లక్షంగా దాడులు జరిపింది. ఈ అటాక్స్లో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా పెద్ద ఎత్తున భవనాలు నెలకొరిగాయి.అయితే దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. తమ దేశంపై 420 డ్రోన్లు, 39 మిస్సైల్స్, 11 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందన్నారు. వాటిలో 374 డ్రోన్లను, 32 మిస్సైల్స్ను, 5 క్షిపణులను గాలిలోనే ధ్వంసం చేశామని పేర్కొన్నారు. అయితే కొన్ని ఉక్రెయిన్ భూభాగాలను తాకాయన్నారు. రష్యా జరిపిన దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని వారిలో పిల్లలు అధికంగా ఉన్నారని జెలెన్స్కీ పేర్కొన్నారు. -
ఉక్రెయిన్కు అణ్వాయుధాలు.. ఆ రెండు దేశాలపై రష్యా ఆరోపణలు
మాస్కో: ఉక్రెయిన్కు గుట్టుచప్పుడు కాకుండా అణ్వాయుధాలను బదలాయించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్నాయని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మంగళవారంతో ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రష్యా విదేశీ నిఘా విభాగం (ఎస్వీఆర్) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. ఇది చాలా ప్రమాదకర పరిణామమంటూ క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ ఆందోళన వెలిబుచ్చారు. యుద్ధానికి తెర దించేందుకు జరుగుతున్న చర్చల్లో తాము విధించిన ప్రధాన షరతుల్లో ఉక్రెయిన్ అణ్వస్త్రరహిత దేశంగా ఉండటం అతి ముఖ్యమైనదని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి నాలుగేళ్లు నిండాయి. ఇరువైపులా లక్షలాది మంది సైనికులు సమరంలో సమిధలుగా నేలకూలినా రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణ దాహం తీరడం లేదంటూ ప్రపంచ దేశాలు ఆగ్రహిస్తున్నాయి. కానీ ఈ పోరును ఆపలేక చేష్టలుడిగి చూస్తున్నాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి విఫలమై చోద్యం చూస్తోంది. ఉక్రెయిన్ రణక్షేత్రంలో రక్తధారాలు ఆగి శాంతి కపోతం ఎగురుతుందా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి ఎవరూ బదులు చెప్పలేని పరిస్థితి!ఉక్రెయిన్పై తక్షణం యుద్ధం ఆపకపోతే రష్యాపై మరిన్ని అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు. అందుకు జూన్ దాకా గడువు విధించారు. ఆలోపు పుతిన్ వైఖరి మారేనా? యుద్ధానికి తెర దించేందుకు అంగీకరిస్తారా? బదులుగా ఉక్రెయిన్లోని కీలక డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు వదులుకునేందుకు అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తారా? ఇవి ప్రస్తుతానికి ట్రిలియన్ డాలర్ల ప్రశ్నలుగానే మిగిలాయి.2022 ఫిబ్రవరి 24న మొదలు... 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకున్నాక కూడా రష్యా దురాక్రమణ దాహం తీరలేదు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై ఏకపక్షంగా దండెత్తింది. నాటి నుంచీ పోరాడుతున్నా ఉక్రెయిన్ నుంచి 20 శాతం భూభాగాన్ని మాత్రం ఆక్రమించుకోగలిగింది. ఈ క్రమంలో ఇరువైపులా ఏకంగా 20 లక్షల మంది సైనికులు చనిపోయారని వార్తలొచ్చాయి! అయితే 3,25,000 మంది రష్యా సైనికులు చనిపోయారని, మొత్తంగా 12 లక్షల మంది గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ ప్రకటించింది.ఉక్రెయిన్ వైపు 140,000 మంది సైనికులు చనిపోయారని, 6 లక్షల మంది గాయపడ్డారని తెలిపింది. రష్యా ఆక్రమణ వేగం నత్త కన్నా మెల్లగా ఉందని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే ఎద్దేవా చేశారు. ఐరోపా దేశాల ఆయుధ, ఆర్థికబలంతో రష్యాపై ఉక్రెయిన్ భీకరంగా పోరాడుతోంది. అందుకే నాలుగేళ్లలో డోనెట్స్క్ ప్రాంతంలో రష్యా కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే ముందుకు రాగలిగిందని అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇటీవల తాము ఆక్రమించిన నాలుగు ప్రాంతాలపై ఉక్రెయిన్ హక్కులు వదలుకోవాలని, ముఖ్యంగా కీలక డోన్బాస్ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. అందుకు జెలెన్స్కీ ససేమిరా అంటున్నారు. -
రష్యా-ఉక్రెయిన్: ఐరాసలో భారత్ తటస్థం
న్యూయార్క్: ఐదేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంక్షోభంలో శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (UNGA)లో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. రష్యా దళాలు తక్షణమే ఉక్రెయిన్ నుంచి తప్పుకోవాలని, తద్వారా శాశ్వత శాంతికి మార్గం సుగమం చేయాలంటూ ఉక్రెయిన్ ప్రతిపాదించిన ‘సపోర్టింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ ఇన్ ఉక్రెయిన్’ తీర్మానంపై మంగళవారం జరిగిన ఓటింగ్లో భారత్ తటస్థ వైఖరిని అవలంబించింది.మొత్తం 107 దేశాలు ఈ తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా, 12 దేశాలు దీనిని వ్యతిరేకించాయి. భారత్తో పాటు చైనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యూఏఈ, అమెరికా తదితర 50 దేశాలు ఓటింగ్లో పాల్గొనకుండా దూరంగా ఉండటం గమనార్హం. కాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఈ ఏడాది ఫిబ్రవరితో ఐదో ఏట అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ తీర్మానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్.. ఈ పోరాటాన్ని సామూహిక మనస్సాక్షిపై ఒక మచ్చగా అభివర్ణించారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి, ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ శాంతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.2025లో పౌర మరణాలు గరిష్ట స్థాయికి చేరడంపై గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని పట్టుబట్టారు. మరోవైపు ఈ తీర్మానానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్మానం ఆమోదం పొందడం శాశ్వత శాంతికి అవసరమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురైనప్పటికీ, లొంగిపోయే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. జూన్ నాటికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అమెరికా గడువు విధించిన నేపథ్యంలో, తదుపరి దశ చర్చలు మయామిలో జరిగే అవకాశం ఉందని సమాచారం. తాజాగా మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయడం, ఫలితంగా రష్యాలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేయడం లాంటి పరిణామాలు ఉద్రిక్తతలను మరింతగా పెంచుతున్నాయి.ఇది కూడా చదవండి: సీబీఎస్ఈ వార్నింగ్: విశ్లేషకులపై కఠిన చర్యలు -
సుంకాలకు ముకుతాడు పడేనా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపు ఒక ప్రహసనంగా పరిణమించింది. భౌగోళిక రాజకీయ సంబంధాలను, ప్రపంచ ఆర్థిక గతిశీలతలను చిందరవందర చేయడానికి ట్రంప్ చూపించిన మొగ్గుదల వినాశకర పర్యవసానాలకు దారితీసింది. అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు దీనికే అద్దం పట్టింది. అనేక దేశాలతో అమెరికా వాణిజ్యంలో భారీ లోటు, అసమతూకం చోటుచేసుకున్నాయి. వాటిని సరిదిద్దాలన్న నిస్పృహే ట్రంప్ సుంకాల బెదిరింపులలో వ్యక్తమవుతూ వచ్చింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో సహా 11 దేశాలతో కూడిన ‘బ్రిక్స్’ కూటమి అమెరికా ప్రయోజనాలకు వ్యతి రేకంగా పనిచేస్తోందని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. కూటమి లోని దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడి ఆవేశం, మాటల తీవ్రత చూసిన వారికి ఆయన ‘అహంకారం’తో వ్యవహరిస్తున్నారని అనిపించడంలో తప్పు లేదు. ప్రపంచ మార్కెట్లపై అమెరికా ఆధిపత్యాన్ని స్థిరపరచాలన్న ప్రయ త్నాలే ఆయన ధోరణిలో ప్రస్ఫుటమయ్యాయి. అమెరికా ఆధిప త్యాన్ని చాటడమే నిజంగా ట్రంప్ ఉద్దేశమైతే, ఆయన ఆ ప్రయ త్నాన్ని విరమించుకుని, బహుశా ఎవరెస్టు శిఖరారోహణకు యత్నించినా సఫలమై ఉండేవారనిపిస్తుంది. తీరని వాణిజ్య లోటుఅమెరికాకు, దాని భాగస్వామ్య దేశాలు చాలా వాటితో ఉన్న వాణిజ్య లోటు ఈనాటిది కాదు. కొన్నేళ్ళుగా అది పెరిగిపోతూ వచ్చి, దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమించింది. అమెరికా వాణిజ్య లోటు 2024 నాటికి ఏకంగా 1.2 ట్రిలియన్ డాలర్ల మేరకు ఉంది. దాని దిగుమతులు దాదాపు 3.5 ట్రిలియన్ డాలర్ల మేరకు ఉండగా, ఎగుమతులు 2 ట్రిలియన్ డాలర్లకు కొద్ది పైచిలుకు మాత్రమే. ఈ విపరీతమైన వ్యత్యాసం సుంకాల పెంచినంత మాత్రాన తగ్గేది కాదు. దిద్దుబాటు చర్యకు ఉపక్రమించడానికి అధ్యక్షుడు ట్రంప్ బుద్ధి కుశలతతో కూడిన విధానాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ఉండాల్సింది. వాణిజ్య సమీకరణాలలో సమతూకానికి అది కొంత దోహదపడి ఉండేది. సుంకాల పెంపుదలలు ప్రతికూల ఫలితాలకే దారితీస్తాయి. ప్రతిగా వాణిజ్య సంబంధాలపై ‘అంతకు అంత ప్రభావం–పర్యవసానాలు’ ఉంటాయని ట్రంప్కు తెలియకుండా ఉంటుందని అనుకోలేం. భారత్, చైనాలతో సహా అనేక దేశాలతో అమెరికా వాణిజ్యంలో అసమతూకమే ఉంది. అమెరికా మొత్తం వాణిజ్య లోటులో ఈ రెండు దేశాల వాటాయే దాదాపు 33 శాతం. అమెరికా వాణిజ్య లోటు 2024లో సుమారు 368 బిలియన్ డాలర్లు ఉంటే, అందులో చైనాది సింహ భాగంగా 319 బిలియన్ డాలర్ల మేరకు ఉంది. భారత దేశంతో వాణిజ్య లోటు సుమారుగా 49 బిలియన్ డాలర్లు.డిమాండ్ను బట్టే వ్యాపారంభారత్ ద్వైపాక్షిక వాణిజ్య దృక్పథం నుంచి చూస్తే, అమెరికాకు మన దేశ మొత్తం ఎగుమతులు 2024లో 91 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. అమెరికా నుంచి మన దిగుమతులు దాదాపు 42 బిలియన్ డాలర్ల మేరకు ఉన్నాయి. భారతదేశ మొత్తం దిగుమతుల విలువ 700 బిలియన్ డాలర్లకు కొద్ది పైచిలుకు ఉంటే, దానిలో అమెరికా వాటా దాదాపు 6 శాతంగా ఉంది. అమెరికాకు వెళ్ళే భారత్ ఎగుమతులలో సహజ ముత్యాలు, శాస్త్రీయంగా పెంచిన ముత్యాలు, విలువైన రత్నాలు, పాక్షికంగా విలువైన రత్నాలు ఎక్కువ భాగం ఆక్రమిస్తున్నాయి. వాటి విలువ సుమారు 12 బిలియన్ డాలర్ల మేరకు ఉంటుంది. తర్వాతి వాటా ఔషధాలది (సుమారు 9 బిలియన్ డాలర్లు) కాగా, 6 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎలక్ట్రికల్ మెషినరీ, పరికరాలు కూడా ఎగుమతి అవుతున్నాయి. అమెరికా నుంచి మనం ఖనిజ ఇంధ నాలు, ఖనిజ నూనెలు (12 బిలియన్ డాలర్లు), న్యూక్లియర్ రియా క్టర్లు, బాయిలర్లు, యంత్ర పరికరాలు (3.2 బిలియన్ డాలర్లు) దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వాటిలో ఖనిజ చమురు (220 బిలియన్ డాలర్లు), శాస్త్రీయంగా పెంచిన ముత్యాలు (83 బిలియన్ డాలర్లు), న్యూక్లియర్ రియాక్టర్లు (61 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. వంట నూనెలకు భారత్ పెద్ద దిగు మతిదారుగా ఉంది. భారత్ దిగుమతి చేసుకుంటున్న పశు, వెజిట బుల్ లేదా మైక్రోబయల్ ఫ్యాట్లు, నూనెల విలువ 17 బిలియన్ డాలర్లుగా ఉంది. అందులో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది కేవలం 45 మిలియన్ డాలర్ల విలువైనది మాత్రమే. ఈ ఉత్పత్తికి సంబంధించి అమెరికా మొత్తం ఎగుమతుల విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు. ఈ ఉత్పత్తులలో గణనీయమైన భాగాన్ని మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని ట్రంప్ ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ, డిమాండ్, సరఫరా, అవసరాలు, నాణ్యత, ధరలు వంటి ప్రధాన అంశాలు ప్రపంచ మార్కెట్లను నడిపిస్తాయి. ప్రతీకార సుంకాల పెంపు ఎగుమతి చేస్తున్న, దిగుమతి చేసుకుంటున్న రెండు దేశాలకూ పరస్పర వినాశకర ఆయుధంగా పరిణమిస్తుందని ఆయన తెలుసుకుంటే మంచిది. ట్రంప్ అల్టిమేటం (ఒకవేళ సఫలమైతే) అంతిమ ప్రభావం దిగుమతి చేసుకుంటున్న దేశంలోని వినియోగ దారులపైనే ఉంటుంది. ప్రస్తుత సందర్భంలో అది అమెరికన్ వినియోగదారులపైనే ఉంటుందని గ్రహించాలి. అమెరికా సుప్రీంకోర్టు ఈ వాస్తవాన్ని విపులీకరించింది. తదనుగుణంగా, నిరంకుశ సుంకాల పెంపుదలలకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్ స్వయం విధ్వంసకర మీటను నొక్కకుండా అమెరికా సుప్రీం కోర్టు తీర్పు నిరోధిస్తుందేమో చూడాలి. ట్రంప్ మాత్రం రూటు మార్చి కొత్త ట్యారిఫ్లతో ముందుకొచ్చి, తగ్గేదేలే అంటున్నారు.– సత్యపాల్ మీనన్సీనియర్ జర్నలిస్ట్, జర్నలిజం అధ్యాపకులు -
ప్రజల ఒత్తిడే యుద్ధాల్ని ఆపగలదు!
నేటితో ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసి, నాలుగేళ్లు పూర్తవుతున్నాయి. ఉక్రెయిన్ వరకూ చూస్తే – లక్ష మందికి పైగా సైనికులు చనిపోయారు. మూడు లక్షల మందికి పైగా గాయపడ్డారు. 15 వేల మందికి పైగా పౌరుల ప్రాణాలు పోయాయి. 40 వేల మందికి పైగా గాయపడ్డారు. రష్యా సైన్యంలో లక్షకు పైగా మరణాలు జరిగి ఉండవచ్చనీ, గాయపడిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సమాచారాన్ని ఆ యా ప్రభుత్వాలు చెప్పవు. ఐక్యరాజ్య సమితి, ఇనిస్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్, బ్రోకింగ్స్ ఇనిస్టిట్యూషన్ వంటి పరిశోధనా సంస్థల ద్వారా బైటకొచ్చిన సమాచారం ఇది. ‘ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం తీసుకోకూడదు! క్రిమియా, డొనెత్స్క్, లుహాన్స్క్, జపోర్జియా, ఖెర్సాన్ వంటి ప్రాంతాలను రష్యాకి చెందినవిగా ఉక్రెయిన్ అంగీకరించాలి! పెద్ద పెద్ద ఆయుధాల్ని, అలాగే పాశ్చాత్య దేశాల మద్దతుని తగ్గించాలి’ లాంటి రష్యా పెట్టే షరతులకు తలొగ్గడానికి ఉక్రెయిన్ సిద్ధంగా లేదు. ఆ షరతులకు తలొగ్గనిదే దిగిరావడానికి రష్యా సిద్ధంగా లేదు.అమెరికా ఒక పక్కన ఇరాక్, సిరియా, యెమెన్ లాంటి మధ్య ప్రాచ్య దేశాల పైన దాడులు చేస్తూ... ‘రష్యా దాడి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన’ అనడమూ; ‘ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతను కాపాడాలి’ అనడమూ హాస్యాస్పదం. ఉక్రెయిన్కు ఇప్పటివరకు అమెరికా నుంచి సైనిక, ఆర్థిక సహాయం 100 బిలియన్ డాలర్లు పొందింది. 500 బిలియన్ డాలర్ల (దాదాపు 45 లక్షల కోట్లు) దాకా అమెరికాలో ఆయుధ వ్యాపారం జరిగి ఉంటుందని అంచనా. ఇవి ‘స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, డిఫెన్స్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఏజెన్సీ, యూ.ఎస్. డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ లాంటి సంస్థలు ప్రకటించిన సంగతులే! ఇంక భారత దేశానికి వస్తే, ‘సమతుల్య తటస్థత’ అనే ఎత్తుగడని పాటిస్తూ, చాలా సందర్భాల్లో ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన వోటింగ్లో పాల్గొనకుండా, రష్యాను ఖండించే తీర్మానాలపైన కూడా ఓటు వేయలేదు. భారత ప్రధాని మోదీ 2022లో రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిసినప్పుడు ‘ఇది యుద్ధ కాలం కాదు’ అని ఒక వ్యాఖ్యానం చేసి మౌన వ్రతాన్ని పాటించారు. ఇండియాకు రష్యా నుండి చౌకగా క్రూడ్ ఆయిల్ కావాలి. అలాగే రక్షణ రంగంలో సహకారం కావాలి. అందుకోసం దానితో స్నేహం తప్పదు. అలాగే పాశ్చాత్య దేశాలతో కూడా దానికి కొన్ని అవసరాలు ఉన్నాయి అంటే; ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, చైనా ప్రభావాన్ని పరోక్షంగా సమతుల్యం చేయడం, టెక్నాలజీ, వ్యాక్సిన్లు, సరఫరా వంటి అంశాల్లో సహకారం కావాలి. దానికోసమే క్వాడ్ (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి) వంటి వేదికల్లో పాల్గొనడం. వీటన్నిటికీ మించి చైనాతో ఇండియాకు 76 ఏళ్ళ పోరు ఉంది. అంతర్జాతీయ సంస్థలు కూడా యుద్ధాన్ని ఆపడానికి నిజాయితీగా ఏ ప్రయత్నాలూ చేయడం లేదు. పౌర ప్రాణాలకన్నా ఏదీ ముఖ్యం కాదు కాబట్టి, ముందైతే ‘కాల్పుల విరమణ’ జరగాలి. అది జరగాలి అంటే ఆయా దేశాల ప్రభుత్వాల మీద ప్రజల ఒత్తిడి పెరగాలి. అది మాత్రమే యుద్ధాన్ని ఆపగలదు. – నన్నూరి వేణుగోపాల్ ‘ మానవ హక్కుల కార్యకర్త (రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి నేటితో నాలుగేళ్లు) -
ముడవప్రపంచ యుద్ధం.. జెలెన్స్కీ ఏమన్నారంటే?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడవ ప్రపంచ యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రారంభించారన్నారు. మాస్కో దండయాత్రను అడ్డుకోవడం ద్యారా ఉక్రెయిన్ పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.ఉక్రెయన్- రష్యా యుద్ధం ప్రారంభమై ఇటీవలే నాలుగు సంవత్సరాలు పూర్తైంది. 2022లో ప్రారంభమైన ఈ యుద్ధం మూలంగా ఇప్పటికే పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని నిరోధించడానికి పెద్ద ఎత్తున యత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి జెలెన్స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు.యుద్ధం ముగించడానికి అమెరికా అధ్యక్షుని నుంచి స్పష్టమైన హామీలు ఆశిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. కేవలం అధ్యక్షుని మాట పూర్వక హామీ కాకుండా దానికి రాజ్యాంగ పరమైన అనుమతి ఉండాలని కోరారు. 1991లో ఉక్రెయిన్ స్వాతంత్రం పొందినప్పుడు ఉన్న సరిహద్దులే తమ అంతిమ లక్షమని అయితే ఇప్పుడు రష్యా సైనిక పరంగా ఎంతో బలంగా ఉన్నందున అది సాధ్యం కాదని జెలెన్స్కీ ఒప్పుకున్నారు.అయితే రష్యా తమ భూభాగం నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని విషయం తనకు తెలుసన్నారు. తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని రష్యా విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని జెలెన్స్కీ తన అభిప్రాయాలు ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
ఉక్రెయిన్ డ్రోన్ దాడులు, నాలుగు విమానాశ్రయాలపై ప్రభావం
రష్యా రాజధాని మాస్కో తో సహా రష్యన్ భూభాగంపై కైవ్ డ్రోన్ దాడుల నేపథ్యంలో ఆదివారం మాస్కోలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ల దాడి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రష్యా పౌర విమానయాన సంస్థ ఈ భద్రతా చర్యలు చేపట్టింది. దాదాపు 11 ఉక్రేనియన్ డ్రోన్లను రష్యా వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఈ దీంతో డోమోడెడోవో, వ్నుకోవో, జుకోవ్స్కీ ,షెరెమెటియేవో విమానాశ్రయాలపై ప్రభావం చూపింది .డ్రోన్ దాడులపై విమానయాన నియంత్రణ సంస్థ రోసావియాట్సియా విధించిన సస్పెన్షన్ల తర్వాత అధికారులతో సంప్రదించిమాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలు రాకపోకలకు తెరిచి ఉన్నాయని రోసావియాట్సియా ప్రకటించింది.ఆదివారం మధ్యాహ్నం నాటికి మరో మానవరహిత వైమానిక వాహనాన్ని అడ్డగించినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ సోషల్ మీడియాలో ధృవీకరించారు. దీనితో కూలిపోయిన డ్రోన్ల మొత్తం సంఖ్య 11కి చేరుకుంది. 'వైమానిక రక్షణ దళాలు మరో UAVని అడ్డుకున్నాయి' అని సోబ్యానిన్ పోస్ట్ చేశారు, కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడంలో నగరం, విమాన నిరోధక వ్యవస్థల ప్రభావాన్ని నొక్కి చెప్పారు.కైవ్పై ఉక్రెయిన్ దాడులుతాజా డ్రోన్ సంఘటనలు ఉక్రెయిన్ రాజధాని కైవ్ను లక్ష్యంగా చేసుకుని రష్యా రాత్రిపూట భారీ దాడి తర్వాత జరిగాయి. రష్యన్ దళాలు 297 డ్రోన్లు,వివిధ రకాల 50 క్షిపణులను ప్రయోగించాయని ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. వీటిలో, 274 డ్రోన్లు , 33 క్షిపణులను అడ్డగించాయి లేదా నాశనం చేశాయి. దీంతోఒకరు చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. మూడు క్షిపణులు ఇంకా గుర్తించలేదు. నాలుగేళ్లయినా రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ఇంకా తెరపడలేదు. ఉక్రెయిన్ వివిధ ప్రాంతాలపై, ముఖ్యంగా రాజధాని మాస్కోపై డ్రోన్ దాడులకు పాల్పడుతోందని రష్యా ఆరోపిస్తోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్పై క్షిపణి, డ్రోన్ దాడులను కొనసాగిస్తోంది. మాస్కోలో తాజా డ్రోన్ కూల్చివేతలు ఆధునిక యుద్ధంలో మానవరహిత వైమానిక వ్యవస్థల వినియోగం, వైమానిక ముప్పుల నుండి పౌరులను రక్షించడంలో సవాళ్లు చర్చనీయాంశ మవుతున్నాయి. -
ఆఫ్రికాలో రష్యా రహస్య ఆపరేషన్
మాస్కో: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రష్యా ప్రైవేట్ సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’.. ఆఫ్రికాలో సాగిస్తున్న కార్యకలాపాలపై పట్టు బిగించేందుకు రష్యా అధ్యక్షుని అధికారిక కార్యాలయం ‘క్రెమ్లిన్’ దృష్టి సారించింది. వాగ్నర్ వ్యవస్థాపకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ మరణం తర్వాత ఆ సంస్థ నిర్వహించిన భారీ ‘షాడో ఎంపైర్’ను రష్యా విదేశీ నిఘా సంస్థ ‘ఎస్వీఆర్’ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆఫ్రికా దేశాల్లో రాజకీయాలను ప్రభావితం చేయడం, తప్పుడు సమాచార ప్రచారం ద్వారా అస్థిరత సృష్టించడం లాంటి కీలక బాధ్యతలను ఇప్పుడు ఎస్వీఆర్ నేరుగా పర్యవేక్షిస్తోంది.ప్రిగోజిన్ మరణానంతరం వాగ్నర్ గ్రూప్ నిర్వహించిన ప్రభావశీల కార్యకలాపాలను రష్యా విదేశీ నిఘా సంస్థ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. సుమారు 100 మంది కన్సల్టెంట్లతో నడుస్తున్న ఈ విభాగం ద్వారా ఆఫ్రికా దేశాల అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోంది. లిబియా, మాలి, సూడాన్ నుంచి మొదలుకొని దాదాపు 15కు పైగా ఆఫ్రికా దేశాల్లో ఈ నెట్వర్క్ విస్తరించింది. 2024లో కేవలం 10 నెలల కాలానికి సుమారు 7.3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 60 కోట్లు) నిధులను ఈ కార్యకలాపాల కోసం కేటాయించినట్లు సమాచారం.ఫోర్బిడెన్ స్టోరీస్, ఆల్ ఐస్ ఆన్ వాగ్నర్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల కన్సార్టియం జరిపిన పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రష్యాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించిన తర్వాత, వాగ్నర్ గ్రూప్ యొక్క ‘ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్’ను ఎస్వీఆర్ దక్కించుకుంది. ఆఫ్రికాలో రష్యా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం, పాశ్చాత్య దేశాల పోటీని తొలగించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది.దాదాపు 1,400 పేజీల రష్యన్ అంతర్గత పత్రాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం, ఎస్వీఆర్ కేవలం సైనిక సహకారం అందించడమే కాకుండా, వ్యూహాత్మక స్థానాల్లో తమ ఏజెంట్లను నియమించడం, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం లాంటి పనులు చేస్తోంది. ముఖ్యంగా మాలి, బుర్కినా ఫాసో, నైజర్ వంటి దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా ప్రభావం తగ్గించేందుకు ఎస్వీఆర్ పావులు కదుపుతోంది.ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆఫ్రికాలో పట్టు కోసం రష్యా రక్షణ శాఖ- ఎస్వీఆర్ మధ్య అప్పుడప్పుడు పోటీ ఏర్పడుతోంది. రక్షణ శాఖ 'ఆఫ్రికా కార్ప్స్' పేరుతో సైనిక కార్యకలాపాలను సమన్వయం చేస్తుండగా, ఎస్వీఆర్ మాత్రం రాజకీయ ప్రభావాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వంటి దేశాల్లో ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం కోసం ఎస్వీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రష్యా భారీగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు పొందలేకపోతోంది. ఆఫ్రికా దేశాలతో అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నా, అవి ఆదాయం తెచ్చిపెట్టే వ్యాపారాలుగా మారడం లేదని పరిశోధన పేర్కొంది. అయినప్పటికీ, ఆఫ్రికాలో తన ఉనికిని చాటుకునేందుకు రష్యా ఈ ‘దీర్ఘకాలిక వ్యూహాన్ని’కొనసాగిస్తున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: ట్రంప్పై ఇండో అమెరికన్ల వ్యతిరేకత: సర్వేలో వెల్లడి -
బైకాల్ సరస్సులో మునిగిన బస్సు.. ఏడుగురు చైనా పర్యాటకుల మృతి
రష్యాలోని ప్రసిద్ధ బైకాల్ సరస్సు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గడ్డకట్టిన సరస్సుపై పర్యాటకులతో వెళ్తున్న బస్సు, మంచు పలకలు పగలడంతో నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన ఏడుగురు పర్యాటకులు మరణించారు. ఈ విషయాన్ని రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.వీరితో పాటు రష్యాకు చెందిన డ్రైవర్ కూడా మృతి చెందినట్లు సమాచారం. అయితే ఒక్క పర్యాటకుడు మాత్రమే బస్సు మునిగిపోయేలోపు కిటికీలోంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రష్యా అత్యవసర సేవల విభాగం రంగంలోకి దిగింది. బస్సు సుమారు 18 మీటర్ల లోతులో ఉన్నట్లు అండర్ వాటర్ కెమెరాల సహాయంతో గుర్తించారు. అయితే భద్రతా నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా సైబీరియాలో ఉన్న బైకాల్ సరస్సు ప్రపంచంలోనే అత్యంత లోతైన మంచి నీటి సరస్సు. శీతాకాలంలో ఇది పూర్తిగా గడ్డకట్టి, వాహనాలు వెళ్లడానికి వీలుగా మారుతుంది. అయితే ఈ మధ్య అక్కడ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మంచు పలకలు బలహీనపడ్డాయి. అధికారులు పర్యాటక తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారు అనుమతించిన సురక్షిత మార్గంలోనే వాహనాలు ప్రయాణించాలి. ఈ చైనా టూరిస్ట్లు ఉన్న బస్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించినట్లు సమాచారం. -
అమెరికా డబుల్ గేమ్.. రష్యాతో చీకటి ఒప్పందం
-
భారతీయుడి మోసానికి రష్యా మహిళ విలవిల.. వీడియో వైరల్
ఓ భారతీయుడి నమ్మి.. ప్రేమించి.. అతడిని పెళ్లి చేసుకున్న పాపానికి తాను నరకం అనుభవిస్తున్నానని రష్యా మహిళ బోరున విలపించింది. ఇంతటి నమ్మక ద్రోహాన్ని తాను ఎక్కడా చూడలేదని.. తన జీవితంలో మరోసారి భారతీయులను నమ్మను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో తాను స్వదేశానికి(రష్యా) వెళ్లిడానికి భారత్లో వీసా విషయంలో ఉన్న లోపాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో, బాధితురాలి పోస్టుపై స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. రష్యాకు చెందిన ఒల్గా 2015లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం భారత్కి వచ్చింది. ఈ సమయంలో భారత్కు చెందిన వ్యక్తిని(భర్త పేరు చెప్పలేదు) ప్రేమించింది. వారిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు. అనంతరం, ఆమె భారత్లో శాశ్వత నివాసం ఉండాలని నిర్ణయం తీసుకుంది. అయితే, కొద్దిరోజుల తర్వాత వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో, ఒల్గా.. 2023 నవంబరులో స్పౌసల్ వీసా(భారతీయ పౌరుడు లేదా OCI కార్డ్ హోల్డర్ను వివాహం చేసుకున్న విదేశీయులకు Spousal Visa (X Visa లేదా Entry Visa) మంజూరు చేస్తారు) కోసం దరఖాస్తు చేసినప్పుడు తన భర్త ఇంటర్వ్యూకి హాజరుకాలేదు. ఈ పరిణామాలతో వారి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఒల్గా.. రష్యా వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. ఇంతలో 2024 జనవరిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన భర్త అదృశ్యమయ్యాడు. దీంతో, ఆందోళన చెందిన ఒల్గా.. పోలీసులను సంప్రదించి. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఆరు నెలలు అయినా తన భర్త ఆచూకీ తెలియకపోవడంతో అతను చనిపోయినట్టు భావించి భయంతో కాలం వెల్లదీసింది. కుటుంబం లేకుండా, డబ్బు లేకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. వీసా సమస్యల వల్ల రష్యాకు వెళ్లలేకపోయినట్టు చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay)అయితే, ఒక రోజు ఇన్స్టాగ్రామ్లో జపాన్ పర్యాటకుడి పోస్ట్లో తన భర్త.. ఒల్గాకు కనిపించాడు. వారణాసిలో సన్యాసిలా మారిపోయి కనిపించడంతో ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. దీంతో, అతడిని కలిసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భర్త మరో స్టోరీ అల్లాడు.. ఒల్గాకు క్షమాపణలు చెప్పి, తనను ప్రేమిస్తున్నట్టు నటించి నమ్మించాడు. మరోసారి ఇలా చేయనని చెప్పడంతో.. అతడి మాటలను ఒల్గా నమ్మి మళ్లీ సంబంధాన్ని కొనసాగించింది. దీంతో, ఒల్గా.. హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగం చేస్తూ, భర్తకు ఆర్థికంగా సహాయం చేసింది. ఇంతలో.. తన భర్త చేసిన మరో మోసాన్ని ఆమె తెలుసుకుంది. ఆయన మరో మహిళతో 15 కి.మీ దూరంలో సంబంధం పెట్టుకుని ఉంటున్నాడని గుర్తించింది. ఈ క్రమంలో అతడిని ప్రశ్నించలేక.. చేసేదేమీ లేక ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు రష్యాకు వెళ్లేందుకు ప్రయత్నించింది. రష్యా వెళ్తున్న సమయంలో తన భర్త ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ కారణంగా ఆమెను విమానం నుండి దింపివేశారు. ప్రస్తుతం ఆమె వీసా సమస్యలు పరిష్కరించుకోవడానికి న్యాయ సహాయం కోరుతున్నట్టు పోస్టులో వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఆమె పోస్టులపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా మంది ఆమెకు మద్దతు తెలుపుతూ, ధైర్యంగా నిలబడమని ప్రోత్సహించారు. కొంతమంది ఆమె భర్త ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా భారత వీసా చట్టాలు, విదేశీయుల హక్కులు, భార్యాభర్తల మధ్య న్యాయ పరిరక్షణలపై చర్చలు జరిగాయి. -
రష్యాలో 'దోసకాయల' సెగ.. కిలో ఎంతో తెలుసా?
మూడేళ్లగా ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, పడిపోతున్న చమురు ఆదాయం, భారీ సైనిక వ్యయం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అధిక ద్రవ్యోల్బణం, కార్మికుల కొరత రోజురోజుకు పెరిగిపోతుంది.దీంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రష్యాలో దోసకాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. రష్యన్స్ దోసకాయలను న్యూ గోల్డ్గా పిలుచుకుంటున్నారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నాటికి దోసకాయల ధరలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం కిలో దోసకాయల సగటు ధర 300 రూబిళ్లు (భారత కరెన్సీలో సుమారు 356) పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇది అంతకంటే ఎక్కువగా ఉంది. ఫోర్బ్స్ రష్యా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఒక కిలో దోసకాయల ధర, ఒక కిలో చికెన్ ధరతో సమానంగా ఉంది. మరికొన్ని చోట్ల అరటిపండ్లు వంటి విదేశీ పండ్ల కంటే కూడా దోసకాయలే ఖరీదైనవిగా మారాయి. దోసకాయల ధరలపై సోషల్ మీడియాలో అక్కడి ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు దోసకాయలే మా బంగారు ఆభరణాలు" అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరి కొందరు దోసకాయలతో ఫోటోలు దిగి వాటిని ఖరీదైన లగ్జరీ వస్తువుల్లా చూపిస్తూ రష్యా ఆర్థిక పరిస్థితిని ఎగతాళి చేస్తున్నారు. ధరల పెరుగుదల కారణంగా సైబీరియాలోని కొన్ని సూపర్ మార్కెట్లు ఒక్కో కస్టమర్ తక్కువ పరిమాణంలోనే దోసకాయలు కొనాలని నిబంధనలు కూడా విధించాయి.దోసకాయ ధరలు పెరగడానికి కారణాలు ఇవే..ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దిగుమతులపై ఆంక్షలు పెరగడం, సప్లై చైన్ దెబ్బతినడం ప్రధాన కారణం. అదేవిధంగా రష్యాలో విద్యుత్ సంక్షోబం కూడా నెలకొంది. విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దీంతో దోసకాయల వంటి సీజనల్ పంటలు పండించడానికి అవసరమయ్యే విద్యుత్ ఖర్చును రైతులు భరించలేకపోతున్నారు. కాగా భారత్లో ప్రస్తుతం కిలో దోసకాయ ధర రూ.50గా ఉంది. -
రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం..
గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్న అమెరికన్ డాలర్ స్థానాన్ని మార్చేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగాయి. అంతర్జాతీయంగా రష్యా-అమెరికా మధ్య జరుగుతున్న ఈ కరెన్సీ గేమ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీగా ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు, కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం రష్యా అమెరికా డాలర్లలో వ్యాపారం సాగిస్తుందనే వార్తలొస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే అంతర్జాతీయంగా, భారత్పై ఎలాంటి ప్రభావం పడనుందో తెలుసుకుందాం.డాలర్ వైపు రష్యా మొగ్గు ఎందుకు?2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యాను స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి బహిష్కరించాయి. దీంతో రష్యా తన చమురు, గ్యాస్ వ్యాపారాలను డాలర్లకు బదులు రూబుల్స్, యువాన్, రూపాయిల్లోకి మార్చింది. అయితే, 2026 ప్రారంభంలో వచ్చిన కొన్ని రిపోర్టుల ప్రకారం రష్యా తిరిగి అమెరికన్ డాలర్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలోకి రావడానికి ఆసక్తి చూపుతోంది.ఇందుకు కారణాలుఅమెరికాలో ట్రంప్ మరోసారి అధ్యక్షడయ్యాక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రష్యాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా చర్చలు జరుపుతోంది. ఇంధన రంగాలు, ఖనిజాల వ్యాపారంలో తిరిగి డాలర్లను అనుమతించడం ద్వారా ఆంక్షల నుంచి ఉపశమనం పొందాలని రష్యా భావిస్తోంది. చైనా యువాన్ లేదా ఇతర కరెన్సీల కంటే డాలర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆమోదం కలిగి ఉండటం రష్యాకు అంతర్జాతీయ మార్కెట్లో లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఇది కూడా రష్యా డాలర్లలో వ్యాపారం కొనసాగించాలనుకోవడానికి ఒక కారణంగా ఉంది.ప్రపంచ వాణిజ్యంపై ప్రభావంరష్యా వంటి అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు తిరిగి డాలర్ జోన్లోకి వస్తే అది ‘డీ-డాలరైజేషన్’ ప్రక్రియకు బ్రేక్ వేస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా డాలర్ డిమాండ్ మళ్లీ పెరుగుతుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తుంది. డాలర్కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని తీసుకురావాలనుకుంటున్న బ్రిక్స్ దేశాల ప్రయత్నాలకు ఇది విఘాతం కలిగించవచ్చు. అయితే, చమురు వ్యాపారం తిరిగి డాలర్లలో జరిగితే ధరల్లో అనిశ్చితి తగ్గి గ్లోబల్ మార్కెట్ స్థిరపడే అవకాశం ఉంది.భారత్పై ప్రభావమెంత?రష్యా-అమెరికా మధ్య మారుతున్న ఈ ఆర్థిక సమీకరణాలు భారతదేశంపై మిశ్రమ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు దిగుమతుల విషయానికి వస్తే ఇప్పటివరకు రష్యా నుంచి రూపాయిల్లో చమురు కొనుగోలు చేస్తూ భారత్ కొంత లబ్ధి పొందింది. అయితే, రష్యా తిరిగి డాలర్ల వైపు మళ్లితే భారత్పై అమెరికా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తాజా ట్రేడ్ డీల్స్ ప్రకారం భవిష్యత్తులో భారత్ రష్యా నుంచి చేసే దిగుమతులను తగ్గించి అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తిరిగి పట్టు సాధిస్తే అది భారత కరెన్సీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడటం వల్ల రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇది దిగుమతుల వ్యయాన్ని పెంచి దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు.రష్యా తీసుకునే ఈ నిర్ణయం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, భౌగోళిక రాజకీయ వ్యూహంతో కూడుకున్నది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల దెబ్బతిన్న తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించుకోవడానికి పుతిన్ డాలర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది అధికారికంగా అమలైతే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లు, పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని గమనించాలి. బంగారం, ఎగుమతుల రంగంలో ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో కింద తెలియజేశాం.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
రష్యా చమురు కొనబోమని భారత్ హామీ: రూబియో
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని అమెరికా పునరుద్ఘాటించింది. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరుదేశాల నడుమ జరిగిన చర్చల్లో భారత్ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. శనివారం మ్యూనిక్లో సెక్యూరిటీ సదస్సు సందర్భంగా ఆయన ఈ మేరకు పేర్కొన్నట్టు రష్యా వార్తా సంస్థ టాస్ తెలిపింది. అయితే, చమురుతో సహా అన్ని అంశాల్లోనూ భారత్ ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలే తీసుకుంటుందని అదే సదస్సు వేదికగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొనడం విశేషం. ‘‘ప్రపంచ చమురు మార్కెట్లు అతి సంక్లిష్టమైనవి. కనుక చమురు కంపెనీలు చాలా అంశాలను మదింపు చేసిన మీదట తమ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతాయి’’ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగాక ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. అందుకు నిరసనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25 శాతం అదనపు టారిఫ్లు విధించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు పడ్డ నేపథ్యంలో వాటిని తాజాగా రద్దు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తానని భారత్ స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆ సందర్భంగా ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. రష్యా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతూ వచ్చింది. కొనుగోళ్లు నిలిపేస్తామంటూ భారత్ తమకు అధికారికంగా వర్తమానం ఇవ్వలేదని పలుమార్లు స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ విషయంలో మొదటినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
రష్యాతో రక్షణ ఒప్పందం.. ఇక శత్రు దేశాలకు చుక్కలే..
న్యూఢిల్లీ: భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) రష్యా నుండి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు ‘యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ’ (ఏఓఎన్) కింద పచ్చజెండా ఊపింది. సుమారు 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ కొనుగోళ్లలో 120 స్వల్ప శ్రేణి, 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణులు ఉన్నాయి. గత ఏడాది మే నెలలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో వినియోగించిన క్షిపణుల నిల్వలను పునరుద్ధరించడంతో పాటు, వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ఒప్పందపు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియను ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ (ఎఫ్టీపీ) ద్వారా వేగవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించారు.గత ఏడాది పాకిస్తాన్తో తలెత్తిన ఉద్రిక్తతల (ఆపరేషన్ సిందూర్) సమయంలో ఎస్-400 వ్యవస్థ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. పంజాబ్ సరిహద్దు నుంచి ఏకంగా 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేసి రికార్డు సృష్టించింది. ఆదంపూర్, భుజ్ సెక్టార్లలో మోహరించిన ఈ వ్యవస్థకు భయపడి పాక్ తన యుద్ధ విమానాలను అఫ్గానిస్థాన్, ఇరాన్ సరిహద్దులకు తరలించాల్సి వచ్చింది. తాజాగా కొనుగోలు చేయబోయే 400 కి.మీ, 200 కి.మీ, 150 కి.మీ, 40 కి.మీ శ్రేణి క్షిపణులు భవిష్యత్తులో డ్రోన్ దాడులను, శత్రు విమానాలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి సహకరించనున్నాయి.భారత వైమానిక దళం క్షిపణి రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉన్న ఎస్-400 వ్యవస్థలతో పాటు, రష్యాకు చెందిన 'పాంత్సిర్' (Pantsir) స్వల్ప శ్రేణి వ్యవస్థలను కూడా అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. ఈ రెండు వ్యవస్థల కలయికతో సరిహద్దుల్లో 'టూ-లేయర్' రక్షణ కవచం ఏర్పడనుంది. ఇది ముఖ్యంగా కామికాజ్ డ్రోన్లు, ఇతర వైమానిక దాడుల నుండి భారత గగనతలాన్ని కాపాడుతుంది. ఈ ఏడాది జూన్, నవంబర్ నెలల్లో భారత్ కు మరిన్ని ఎస్-400 వ్యవస్థలు అందనున్నట్లు సమాచారం.కేవలం క్షిపణులే కాకుండా, త్రివిధ దళాల ఆధునీకరణ కోసం మొత్తం 3.60 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా వైమానిక దళం కోసం మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంఆర్ఎఫ్ఏ), రాఫెల్ యుద్ధ విమానాలు, హై-ఆల్టిట్యూడ్ శాటిలైట్లను కొనుగోలు చేయనున్నారు. వీటిలో మెజారిటీ యుద్ధ విమానాలను ‘మేక్ ఇన్ ఇండియా’ కింద భారత్లోనే తయారు చేయనున్నారు. అదేవిధంగా నౌకాదళం కోసం పి-8ఐ విమానాలు, ఆర్మీ కోసం విభవ్ యాంటీ-ట్యాంక్ మైన్లు, టీ-72 ట్యాంకుల ఆధునీకరణకు కూడా నిధులు కేటాయించారు.ఇది కూడా చదవండి: ‘ప్రేమ’ ఎంత మధురం.. ‘వ్యాపారం’ అంత కపటం! -
‘స్టార్ట్’కి చెదలు!
అడిగేవారు లేకపోతే, జవాబుదారీతనం కొరవడితే... ఎక్కడైనా ఇష్టారాజ్యం తప్పదు. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలు అలాగే వ్యవహరిస్తున్నాయి. ఎవరేమనుకుంటే ఏమిటన్నట్టు రెచ్చిపోతున్నాయి. అణ్వాయుధాల వల్ల భూగోళానికి పెను ముప్పు ఏర్పడుతుందని ప్రపంచ ప్రజానీకం దశాబ్దాల పాటు ఒత్తిళ్లు తెచ్చిన పర్యవసానంగా ఆ రెండింటి మధ్యా 1991లో మొదటిసారి వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు(స్టార్ట్)–1 ఒప్పందం కుదిరింది. దాని స్థానంలో 2010లో ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం సాకారం కాగా, దానికి ఈనెల 5తో నూకలు చెల్లాయి. ఆ విషయంలో మళ్లీ చర్చలు మొదలెట్టాలని, సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి రావాలని రెండేళ్లుగా పలువురు నిపుణులు, ప్రపంచ శాంతిని కాంక్షించేవారు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. కానీ అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. ఆయన స్థానంలో నిరుడు జనవరిలో వచ్చిన డోనాల్డ్ ట్రంప్కు సైతం ఈ సంగతి తెలుసు. దాన్ని గురించి మీడియా ప్రశ్నిస్తే ‘ముగిసిపోతుందా...పోనీయండి. దాని స్థానంలో మరొకటి కుదుర్చుకుంటాం’ అన్నారే తప్ప ఇంతవరకూ ఆ దిశగా చర్చల కోసం చేసిందేమీ లేదు. కొత్త ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అడపా దడపా చెప్పకపోలేదు. కానీ ఉక్రెయిన్లో ఆయన సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ఆ మాటల్లోని చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేసింది. అమెరికా పోకడలూ దానికి భిన్నంగా ఏమీలేవు. ‘న్యూ స్టార్ట్’ ముగియటంతో ఇరుపక్షాలనూ కట్టిపడేసే అంతర్జాతీయ ఒప్పందమేదీ ఉనికిలో లేకుండా పోయింది. ఇకపై రెండు అగ్రరాజ్యాలూ ఆయుధాలు పోగేసుకున్నా, పరస్పరం కయ్యానికి కాలు దువ్వుకున్నా, అణ్వాయుధాల్ని ప్రయోగించే సాహసం చేసినా... ప్రపంచమంతా నిస్సహాయంగా చూస్తూ ఉండక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాలకూ, వాటిని సమర్థిస్తున్నవాటికీ జవాబుదారీతనం, భయభక్తులు, వెరపు వంటివి మాయ మయ్యాయి. ఒకప్పుడు ప్రపంచం ఇంతకన్నా కాస్తయినా మెరుగ్గా ఉండేదనటానికి వ్యూహాత్మక ఆయుధాల పరిమితి ఒప్పందం(సాల్ట్) గురించిన చర్చలే ఉదాహరణ. ఆ ఒప్పందం సాకారం కాలేదు. ఒకవేళ అలా అయినా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే ఇరు దేశాలూ పోగేసుకున్న ఆయుధాలు ఇక పెరగకుండా చూడటం తప్ప ఆ చర్చలు సాధించేది పెద్దగా ఏమీ ఉండేదికాదు. కానీ అంతకన్నా మెరుగైన ‘స్టార్ట్–1’ కుదిరింది. అణ్వాయుధం, లేదా వేరే బాంబును మోసుకేళ్లే సామర్థ్యమున్న క్షిపణులను (వార్హెడ్లను) 6,000కు తగ్గించటం, వాటి లాంచర్ల (వాహనాల) సంఖ్యను 1,600కు కుదించటం అది సాధించిన ఘనవిజయం. 2010లో కుదిరిన ‘న్యూ స్టార్ట్’ కూడా చెప్పుకోదగ్గ ముందడుగు. దానివల్ల వార్హెడ్ల సంఖ్య 1,550కి, లాంచర్ల సంఖ్య 700కు తగ్గాయి. పరస్పరం డేటా మార్పిడి, నోటిఫికేషన్ల విడుదల, క్షిపణుల్ని మోహరించిన ప్రాంతాల తనిఖీలకు అనుమతించటం అందులో ఉన్నాయి. నిజానికి ఈరెండింటికీ మధ్య 1993లో ‘స్టార్ట్–2’ గురించి చర్చలు సాగాయి. బహుళ సంఖ్యలో వార్హెడ్లను ప్రయోగించగల క్షిపణులను నిషేధించాలన్నది ఈ చర్చల ఆంతర్యం. కానీ ఎలాంటి ఫలితమూ లేకుండా ముగిసిపోయాయి. ఇప్పటికే అమెరికా, రష్యాల మధ్య చడీచప్పుడూ లేకుండా ఆయుధ పోటీ సాగుతోంది. తమదగ్గరున్న అణ్వాయుధాలకు కృత్రిమ మేధ(ఏఐ)ను జతచేసి, వాటి శక్తిని అనేక రెట్లు పెంచుకుంటున్నాయి. గంటకు 6,437 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల రకరకాల క్షిపణులు వచ్చేశాయి. వాటిని విడివిడిగా గురిచూసి కొట్టడం అసాధ్యమని తేలాకే ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’ పేరుతో కొత్త పాట అందుకున్నారు. ఆ ‘బంగారు గుమ్మటం’ అమెరికాను ఎంతవరకూ రక్షిస్తుందో నిజంగా ఏమైనా జరిగితే తప్ప ఎవరికీ తెలియదు. మొత్తానికి ఇద్దరి వద్దా అటూ ఇటూగా చెరో 5,000 అణ్వాయుధాలున్నాయి. మిగతా దేశాలన్నిటి వద్దా అందులో సగం కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ ప్రజానీకం, ముఖ్యంగా ఆ రెండు దేశాల్లోని ప్రజలూ తీవ్రంగా ఒత్తిళ్లు తీసుకురావాలి. లేనట్టయితే ప్రపంచం క్షణక్షణ గండంగా బతుకీడ్చక తప్పదు. -
చమురు కొనకుండా భారత్ను అడ్డుకుంటోంది
మాస్కో: ప్రపంచ దేశాలపై ఆర్థికపరమైన ఆధిపత్యం సాధించేందుకు అమెరికా టారిఫ్లు, ఆంక్షలు, ప్రత్యక్ష నిషేధాల వంటి అనేక రకాల అక్రమ విధానాలను అమలు చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. అదేవిధంగా, భారత్ తదితర దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా అమెరికాయే అడ్డుకుంటోందన్నారు. రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించడం ద్వారా పోటీ లేకుండా చేయడం వంటి అక్రమ విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సోమవారం టీవీ బ్రిక్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లావ్రోవ్ అమెరికా వైఖరిని ఎండగట్టారు. భారత్, ఇతర బ్రిక్స్ సభ్య దేశాలు, కీలక వ్యూహాత్మక భాగస్వాములతో మాకున్న వాణిజ్యం, పెట్టుబడి సహకారం, సైనిక, సాంకేతిక సంబంధాలను నియంత్రించడానికి అమెరికా ప్రయతి్నస్తోందని ఆరోపించారు. గతంలో చలాయించిన ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇప్పటికీ పాశ్చాత్య దేశాలు ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక ప్రత్యర్థులను అణచివేసే చర్యలు మరింత బాహాటంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇంధన సరఫరా మార్గాలపై పెత్తనం గతేడాది రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య అలాస్కాలో జరిగిన చర్చలను లావ్రోవ్ ప్రస్తావించారు. ‘ఉక్రెయిన్ సమస్య పరిష్కారం తప్పనిసరని అమెరికా తెలిపింది. మేం కోరుకున్నదీ అదే. అందుకే ఆ దేశం అందజేసిన ప్రతిపాదనలకు వెనువెంటనే ఆమోదం తెలిపాం’అన్నారు. ‘అయితే, జరిగింది వేరుగా ఉంది. అలాస్కా చర్చల తర్వాత మాపై మరిన్ని ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ జలాల గుండా వెళ్లే మా ఆయిల్ ట్యాంకర్లపై దాడులు పెంచారు. మా చమురు కొనుగోలు చేసే భారత్, తదితర దేశాలపై ఒత్తిడులను తీవ్రతరం చేశారు. తక్కువ ధరకు మేం సరఫరా చేసే చమురు, గ్యాస్లను కాదని, అమెరికా నుంచి అత్యధిక ధరకు సహజవాయువును యూరప్ దేశాలు కొనుక్కుంటున్నాయి.ఆ విధంగా, అమెరికా తన ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించుకుంది’అని లావ్రోవ్ వివరించారు. నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్లు, ఉక్రెయిన్ గ్యాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, టర్క్ స్ట్రీమ్ పైప్లైన్ తదితర అన్ని ఖండాల్లోని ఇంధన సరఫరా మార్గాలను చెప్పుచేతల్లో పెట్టుకోవాలన్నదే అమెరికా లక్ష్యమని తెలిపారు. ‘ఆర్థికపరమైన ఆధిపత్యం కోసం అమెరికా ప్రభుత్వం ఆంక్షలు, టారిఫ్లు, ప్రత్యేక నిషేధాలు, కొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థలపై పరిమితులు సైతం విధిస్తోంది. వీటన్నిటినీ మనం గమనంలోకి తీసుకోవాలి’అని లావ్రోవ్ చెప్పారు.‘భారత్, ఇండోనేసియా, బ్రెజిల్ మాదిరిగా మేం కూడా అన్ని దేశాలతో సహకార భావనతో వ్యవహరిస్తున్నాం. ఆ మాటకొస్తే అమెరికాతోనూ సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నాం. అమెరికా మాత్రం అవరోధాలను సృష్టిస్తూనే ఉంది’అని విమర్శించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించినందునే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు గత వారం ట్రంప్ ప్రకటించడం తెల్సిందే. ఆయిల్ను రష్యా నుంచి కొంటున్నట్లు తెలిస్తే మళ్లీ టారిఫ్లను విధిస్తామని కూడా ఆయన హెచ్చరికలు చేశారు. -
అమెరికా అడ్డుపడుతుంది: రష్యా
కీవ్: డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్పై అమెరికా విధిస్తున్న అధిక సుంకాలు తగ్గించారు. దానికి ప్రతీగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం నిలిపివేసిందన్నారు. అయితే భారత్ దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గియో లవ్రోవ్ తొలిసారిగా ట్రంప్ వైఖరిపై స్పందించారు.ఇటీవలే ట్రంప్ తిరిగి భారత్కు స్నేహహస్తం అందిస్తున్నారు. ఇంతకాలం భారత్ను తన అంగబలం ఆర్థికబలంతో గుప్పిట్లో పెట్టుకుందామనుకున్న ట్రంప్ అది కుదరదనే తెలిసాక తిరిగి రాజీ బాట పట్టారు. భారత్ ఎగుమతులపై అమెరికా పెంచిన అధిక పన్నులను తగ్గిస్తున్నామని ప్రకటించారు. భారత్ సైతం దీనికి సానూకూలంగా స్పందించి ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ సమయంలో ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిందని అన్నారు. అయితే ఈ స్టేట్మెంట్పై భారత్ స్పందించలేదు. తాజా రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ వ్రోవ్ ఈ అంశంపై స్పందించారు.సెర్గీయో లవ్రోవ్ మాట్లాడుతూ" ఉక్రెయిన్ సమస్య పరిష్కరించాలని వారు మాకు చెబుతున్నారు. మేము అమెరికా ప్రతిపాదనను అంగీకరించాము. అమెరికా స్థానం మాకు ముఖ్యమైనది. అయితే వారేమో కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. సముద్ర చట్టాలపై ఉన్న UN కన్వెన్షన్ను ఉల్లంఘిస్తూ బహిరంగ సముద్రంలో ట్యాంకర్లపై యుద్ధం జరుపుతున్నారు. భారత్, ఇతర భాగస్వాములు చౌకైన రష్యన్ ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా నిషేధం విధిస్తున్నారు. అధిక ధరలకు US, LNG సహజ వాయువు కొనుగోలు చేయమని వారిని బలవంతం చేస్తున్నారు ” అని సెర్గీ లవ్రోవ్ అన్నారు.డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఆర్థికంగా అధిపత్యం సాధించేందుకు ప్రపంచ దేశాలపై పన్నుల ఆంక్షలతో విరుచుకపడుతున్నారని తెలిపారు. అయితే భారత్, చైనా, కెనడా వంటి దేశాలతో సహాకారం అందిస్తూనే మనం ఈ అమెరికా అడ్డంకులను ఎదుర్కోవాలని సెర్గియో లవ్రోవ్ పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారని అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని సెర్గియో లవ్రోవ్ అన్నారు. అధిక ధరలకు చమురు కొనుగోలు చేస్తే ప్రజలపై భారం పడుతుంది కనుక దేశప్రజల ప్రయోజనాలే ఆ దేశానికి ప్రథమంగా ఉండాలని రష్యా విదేశాంగశాఖ మంత్రి తెలిపారు. -
పుతిన్తో భేటీకి ఎప్స్టీన్ తహతహ? షాకిస్తున్న తాజా పత్రాలు..
న్యూఢిల్లీ: అమెరికా గూఢచారిగా ముద్రపడిన జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించి తాజాగా వెల్లడైన మరో విషయం చర్చనీయాంశంగా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సహా పలువురు ఉన్నత స్థాయి రష్యా అధికారులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎప్స్టీన్ ప్రయత్నించినట్లు అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన తాజా పత్రాలు వెల్లడిస్తున్నాయి.సీఎన్ఎన్ కథనం ప్రకారం ఎప్స్టీన్ న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి రష్యా రాయబారి విటాలీ చుర్కిన్తో తరచూ సమావేశమయ్యేవారు. చుర్కిన్ కుమారుడు మాగ్జిమ్కు న్యూయార్క్లోని ఒక వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలో ఉద్యోగం ఇప్పించేందుకు కూడా ఎప్స్టీన్ ప్రతిపాదించినట్లు ఈ పత్రాల్లో వెల్లడయ్యింది. 2017లో రాయబారి విటాలీ చుర్కిన్ ఆకస్మిక మరణం తర్వాత, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సంబంధాలు పెంచుకోవడానికి ఎప్స్టీన్ ప్రయత్నించారు. 2018 జూన్ 24న నోర్వే రాజకీయ నేత థోర్బ్జోర్న్ జగ్ల్యాండ్కు పంపిన ఈమెయిల్లో, ‘నాతో మాట్లాడటం ద్వారా పలు కీలక విషయాలు తెలుసుకోవచ్చని మీరు పుతిన్కు సూచించవచ్చు’ అని ఎప్స్టీన్ పేర్కొన్నారు.రష్యాలో పాశ్చాత్య దేశాల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రణాళికలను వివరించే నెపంతో పుతిన్ను కలవాలని ఎప్స్టీన్ భావించారు. 2013లో మాజీ ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ బరాక్కు రాసిన ఈమెయిల్లో నార్వే నేత ఒకరు జగ్ల్యాండ్ సోచిలో పుతిన్ను కలవబోతున్నారని, ఆ సమయంలో తన గురించి ప్రస్తావించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. తాను బిల్ గేట్స్ లాంటి ప్రముఖులకు సలహాదారునని, పుతిన్తో కనీసం రెండు మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు ఎప్స్టీన్ విన్నవించారు. అయితే సెయింట్ పీటర్స్బర్గ్ ఆర్థిక సదస్సులో పుతిన్ కోరిన భేటీని తానే తిరస్కరించానని ఎప్స్టీన్ చెప్పుకున్నప్పటికీ, దానికి సరైన ఆధారాలు లేవు.ఎప్స్టీన్ వ్యవహారంపై పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ స్పందించారు. ఈ లైంగిక వేధింపుల కుంభకోణాన్ని రష్యా నిఘా సంస్థలే వ్యవస్థీకృతం చేసి ఉండవచ్చనే అనుమానంతో తమ దేశం దర్యాప్తు చేపడుతుందని ప్రకటించారు. ప్రపంచ దేశాల నేతలను బ్లాక్ మెయిల్ చేసేందుకు రష్యా వద్ద కీలక సమాచారం ఉండే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేసింది. ఎప్స్టీన్ రష్యా గూఢచారి అనే దానిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని, అటువంటి నిరాధారమైన విషయాలపై సమయం వృథా చేయవద్దని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ‘నో ఫోన్ ఛాలెంజ్’.. రెండు వారాల్లో అనూహ్య మార్పు! -
పాక్కు పుతిన్ మెసేజ్..భారత్కు దూరం కానున్న రష్యా?
భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ రష్యాకు కోపం తెచ్చిందా?. భారత్కు ఎల్లవేళలా అపన్న హస్తం అందించే చిరకాల మిత్రుడు ఇప్పుడు ఇండియాకి దూరం కానున్నారా? ఈ రెండు దేశాల మధ్య డిస్టెన్స్ ఇప్పుడు మాస్కోని పాకిస్థాన్కు చేరువచేస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ని ఇంతకాలం పక్కకు పెట్టిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఆ దేశంలో బాంబు దాడి జరిగితే స్వయంగా స్పందించారు.రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. "రష్యా సుఖ-దుఃఖ కాలంలో భారత్కు సహాయకారిగా ఉండే గొప్ప మిత్రుడు" అని భారత ప్రధాని మోదీ అన్నారంటే ఇరుదేశాల మధ్య మైత్రి ఎంతగొప్పదో అర్థం చేసుకోవచ్చు. భారత్ సైతం రష్యాకు ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించింది. ఈయూతో పాటు ఇతర దేశాలు రష్యాతో ఆర్థిక బంధాలు తెంచుకున్న సమయంలో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది.అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇంతకాలం చిరకాల మిత్రులుగా ఉన్న దేశాలను దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల భారత్పై అధిక పన్నులు తగ్గించారు. ఫలితంగా భారత్ రష్యానుంచి చమురు కొనుగోలు చేయదని మాటిచ్చిందన్నారు. అయితే ఇక్కడ తుంటరి ట్రంప్ మాటలను నమ్మేవారు అధికంగా లేకున్నా.. ఇండియా ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. పైగా ట్రంప్ని ప్రశంసిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై రష్యా సైతం సానుకూలంగా స్పందించింది. భారత్ ఎవరి నుంచైనా చమురు కొనుగోలు చేయచ్చని దానిలో పెద్ద ఆశ్చర్యమేమి లేదని తెలిపింది.ఇదిలా ఉండగా రష్యా పాక్తో దగ్గరయ్యే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం రష్యా పాకిస్థాన్ను పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశంలో సైతం పాక్ ప్రధాని షెహబాజ్, పుతిన్ కోసం 40 నిమిషాలు ఎదురుచూసి అసహనానికి గురయ్యారు. కాగా ఇప్పుడు రష్యా పాక్తో మైత్రికి చేయి చాపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఇస్లామాబాద్లో బాంబుదాడి జరిగి 36 మంది మృతిచెందారు. దాని పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానికి మెసేజ్ పెట్టారు.పుతిన్ మెసేజ్లో.. మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపడం ఉగ్రవాదుల క్రూరమైన, అమానవీయమైన మనస్థత్వాన్ని తెలియజేస్తుందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహాబాజ్ షరీప్లకు సంతాప సందేశం పంపారు. అంతే కాకుండా భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాక్తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అని తెలిపారు. దీంతో పాకిస్తాన్తో కలిసి పుతిన్ కొత్త కూటమి ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రష్యానుంచి చమురు కొనుగోలు భారత్ ఆపేసిందని ట్రంప్ ప్రకటనలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ నిజంగా అలా చేస్తే మాత్రం ఎల్లవేళలా అండగా ఉన్న గొప్పమిత్రున్ని భారత్ దూరం చేసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రష్యాలో భారతీయ విద్యార్థులపై దాడి
-
కత్తిపోట్ల కలకలం.. రష్యాలో భారతీయ విద్యార్థులపై దాడి
రష్యాలో కత్తిపోట్లు హడలెత్తించాయి. ఇందులో నలుగురు భారత విద్యార్థులు గాయపడ్డారు. అరెస్ట్ చేసే క్రమంలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అయింది. దీని గురంచి రష్యాలోని భారత ఎంబసీ ట్వీట్ కూడా చేసింది.అసలేం జరిగిందంటే?బాష్కోరోస్థాన్ రిపబ్లిక్లో ఉన్న స్టేట్ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్లోకి కత్తితో ప్రవేశించిన యువకుడు.. అక్కడున్న విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. అరెస్ట్ చేయాలని ప్రయత్నించిన పోలీసులపై కూడా తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా తనని తాను కూడా గాయపరుచుకున్నాడు. ఈ విషయాల్ని అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. క్షతగాత్రులతో పాటు సదరు యువకుడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.ఈ సంఘటనపై స్పందించిన రష్యాలోని భారత ఎంబసీ కార్యాలయం.. బాధితుల్లో నలుగురు భారత విద్యార్థులు ఉన్నట్లు ట్విటర్లో క్లారిటీ ఇచ్చింది. స్థానిక అధికారులతో టచ్లో ఉన్నామని తెలిపింది. కజాన్లోని భారత కాన్సులేట్ అధికారులు.. విశ్వవిద్యాలయానికి బయలుదేరారని, బాధిత విద్యార్థులకు సహకారం అందిస్తారని తెలియజేసింది.An unfortunate incident of attack has occurred in Ufa. Several persons including four Indian students have been injured. The Embassy is in touch with the authorities and the officials from the Consulate in Kazan are on their way to Ufa to provide assistance to the injured…— India in Russia (@IndEmbMoscow) February 7, 2026 -
ఇది భారత్ వ్యూహాత్మక ముందడుగేనా?
ఎట్టకేలకు భారత్ మరో ముందడుగు వేసింది. ఎప్పట్నంచో అమెరికాతో ఏర్పడిన సందిగ్థతకు ఓ ముగింపు ఇచ్చింది. భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన అదనపు 25 శాతం సుంకాలను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం వెనుక భారత్ వ్యూహాత్మక ముందడుగు వేసింది. రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిన నేపథ్యంలో అమెరికా సుంకాల ఆంక్షలను తగ్గించింది. మరి ఇది రష్యాతో వాణిజ్య స్నేహంపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అనేది ఇప్పుటు హాట్ టాపిక్గా మారింది. రష్యాతో స్నేహంపై ప్రభావం ఎంత?రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి భారత్పై విధించిన ఆంక్షల నడుమే ట్రంప్ సుంకాలను తగ్గించారు. అయితే ఇది రష్యాతో సంబంధాలపై ఎంతవరకూ ప్రభావం చూపుతుందనే అనుమానం కూడా మరొకవైపు మొదలైంది. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలకు భారత్ కట్టుబడటంతో ఓ డైలమా ఏర్పడింది. ఇక రష్యాతో భారత్ సంబంధాలు చెడిపోయినట్లేనా అనే వాదన తెరపైకి వచ్చింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా చమురు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తుందని కూడా చెప్పకొచ్చారు. అయితే ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితుల్లో రష్యా చమురును చేయడం కష్టమేనా? అంటే అవుననక తప్పదు. అయితే కేవలం చమురు అంశమే భారత్-రష్యాల స్నేహంపై ప్రభావం చూపదని విశ్లేషకులు అంటున్నారు. రష్యాతో భారత్కు చాలా వాణిజ్య ఒప్పందాలున్నాయని, కేవలం చమురు అంశం పక్కకు వెళ్లిపోయినంత మాత్రాన ఈ ఇరు దేశాల సుదీర్ఘ స్నేహ బంధం ఎక్కడికి పోదని అంటున్నారు. భారత్కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుభారత్కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారు అనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. భారత్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో రష్యా ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంది. ఇప్పుడు భారత్పై అమెరికా ఆంక్షలు చమురుపై మాత్రమే. అంటే చమురును మాత్రమే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయదన్నమాట. భారత్కు ఫైటర్ జెట్లు, ట్యాంకులు, మిసైల్ సిస్టమ్స్ వంటి పరికరాల్లో రష్యా కీలక భాగస్వామి. భారత్ స్వదేశీ ఉత్పత్తి పెంచుతున్నప్పటికీ, రష్యా టెక్నాలజీపై ఆధారపడటం కొనసాగుతూనే ఉంది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులు వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం పెంపు దిశగా సాగుతున్నాయి. జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్కు రష్యా ఎరువు, లోహాలు సరఫరా కూడా చేస్తోంది. ఇలా అమెరికా, యూరప్ ఒత్తిళ్ల మధ్య భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటూ, రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాతో కుదిరిన డీల్ భారత్ వ్యూహాత్మక ముందడుగానే చెప్పుకోవచ్చనేది విశ్లేషకుల అంచనా. ఇది సమతుల్య వ్యూహమేనని వారు అంటున్నారు.పూర్తిగా ఆపిసినట్లేనా..?రష్యా నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చమురు కొనుగోలు చేయకూడదనేది అమెరికా ఆంక్షలు. అంటే సాంక్షన్డ్ ఎంటిటీస్( ఆంక్షలు ఉన్న సంస్థలు), నాన్ -సాంక్షన్డ్ ఎంటిటీస్(ఎటువంటి ఆంక్షలు లేని సంస్థలు) అనే వాదన కూడా ఇక్కడ తెరపైకి వచ్చింది. రష్యాలోని ఆంక్షలున్న సంస్థల నుంచి మాత్రమే చమురు కొనుగోల చేయకూడదా.. లేక ఎటువంంటి ఆంక్షలు లేని సంస్థల నుంచి కూడా చమురు కొనుగోలు చేయకూడదా అనేది ప్రస్తుతం కాస్త డైలమాలోనే ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నప్పుడు ఈ రెండింటి కింద కూడా చమురు కొనుగోలు చేయకూడదనే విషయం అర్థమవుతున్నా ఇక్కడ పూర్తిగా క్లారిటీ లేదు. ఇదిలా ఉంచితే, భారత్-రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలు చారిత్రాత్మకంగా బలంగా ఉన్నప్పటికీ, గత రెండు మూడేళ్లుగా ప్రాపంచిక పరిస్థితుల కారణంగా కొంత అనిశ్చితి ఏర్పడింది. అయితే 2025 చివర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించిన నేపథ్యంలో సంబంధాలు మళ్లీ చురుకుగా మారాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అమెరికా ఆంక్షలతో రష్యా చమురును భారత్ కొనుగోలు చేయకుండా ట్రంప్ చేసినప్పటికీ, రష్యాతో ఉన్న పలు వాణిజ్య సంబంధాలపై ఇది ఎటువంటి ప్రభావం చూపదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది భారత్ అమలు చేస్తున్న వ్యూహాత్మక ముందడుగుగానే చూడాలని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అమెరికాతో ఎంత వరకూ అవసరముందో అంతవరకూ, రష్యాతో ఏమి అవసరమో వాటిని మాత్రమే పటిష్టం చేసుకునేలా భారత్ సమతుల్య వాణిజ్యాన్ని కొనసాగించడానికి వేసిన ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.ఇదీ చదవండి:ట్రంప్ సుంకాలు.. భారత్కు భారీ ఊరట -
న్యూస్టార్ట్ చర్చలకు అమెరికా, రష్యా ఓకే
మాస్కో: ఆయుధాల నియంత్రణకు సంబంధించిన న్యూస్టార్ట్ ఒప్పందంపై చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని అమెరికా, రష్యాలు అంగీకారానికి వచ్చాయి. రష్యా, ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య యూఏఈలోని దుబాయ్లో జరుగుతున్న శాంతి చర్చల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచి్చనట్లు శుక్రవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. అదేవిధంగా, రెండు దేశాల మిలటరీ మధ్య 2021 నుంచి నిలిచిపోయిన ప్రత్యక్ష సంబంధాలను తిరిగి నెలకొల్పుకునేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయని వివరించారు. బాధ్యతాయుతమైన రెండు దేశాలు స్టార్ట్ చర్చలపై ఆసక్తితో ఉన్నాయన్నారు. అమెరికా, రష్యాల మధ్య చిట్టచివరి వ్యూహాత్మక ఆయుధాల నియంత్రణ ఒప్పందం(స్టార్ట్) గడువు గురువారంతో ముగిసిపోయింది. దీంతో, అత్యధికంగా అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాలకు ఇప్పుడు ఇక ఎటువంటి పరిమితులు లేవు. స్టార్ట్ ఒప్పందం విధించిన పరిమితులకు కట్టుబడి ఉండేందుకు తాము సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ప్రకటించగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టించుకోలేదు. చైనా కూడా ఈ ఒప్పందంలో చేరాలని పిలుపునిచ్చారు. చైనా మాత్రం ససేమిరా అంటోంది. -
రష్యా సైనిక నిఘా అధికారిపై కాల్పులు
మాస్కో: రష్యాలో కీలక సైనికాధికారులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇందుకు ఉక్రెయిన్ కారణమని రష్యా ఆరోపిస్తోంది. శుక్రవారం రష్యా సైనిక నిఘా సంస్థ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ అలెక్సేయెవ్(64)పై గుర్తు తెలియని దుండగుడు పలురౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో అలెక్సేయెవ్ తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ఈ కాల్పులు జరగడం కలకలం సృష్టించింది. అలెక్సేయెవ్ ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇంట్లో ఉండగా డెలివరీ బాయ్ రూపంలో వచి్చన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన వెనుక సూత్రధారులు ఎవరన్నది అధికారులు ఇంకా గుర్తించలేదు. 2011 నుంచి రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘జీఆర్యూ’డిప్యూటీ చీఫ్గా అలెక్సేయెవ్ సేవలందిస్తున్నారు. సిరియాలో రష్యా సైనిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు ‘హీరో ఆఫ్ రష్యా’మెడల్ కూడా అందుకున్నారు. ఇదిలా ఉండగా, అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబీలో రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండు రోజులపాటు జరిగిన చర్చలు శుక్రవారమే ముగిశాయి. అదేరోజు రష్యాలో సైనికాధికారిపై కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చల్లో అలెక్సేయేవ్ పై అధికారి అయిన మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అడ్మిరల్ ఇగోర్ కోస్టియుకోవ్ రష్యా తరఫున పాల్గొన్నారు. అలెక్సేయెవ్పై కాల్పుల గురించి అధికారులు రష్యా అధినేత పుతిన్కు సమాచారం అందించారు. ఈ దాడి గురించి ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. అలెక్సేయెవ్పై కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. శాంతి చర్చలను పక్కదారి పట్టించడానికి ఉక్రెయిన్ ప్రభుత్వం ఉగ్రవాదులను పురిగొలి్ప, ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. -
న్యూస్టార్ట్ ముగింపు.. తీవ్ర ఒత్తిడిలో భారత్!
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల పోటీ మళ్లీ పెరగనుందా?. అమెరికా-రష్యా మధ్య న్యూస్టార్ట్ ఒప్పందం ముగియడం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే అదనుగా.. ఇటు పాక్-చైనాలు పరస్పర అణు సహకారంతో భారత్కు సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. అయితే.. ఇదంతా ఇండియా మంచికే అంటున్నారు నిపుణులు. అమెరికా–రష్యా మధ్య ఉన్న New START అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు 2026 ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసింది. ఒప్పందం పునరుద్ధరణ ప్రస్తావనే లేకపోవడంతో.. ఈ రెండు దేశాల మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేకుండా పోయాయి. ఇప్పుడు అమెరికా, రష్యా తమ అణు శక్తిని ఇష్టానుసారం పెంచుకునే అవకాశం పొందాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న అణు శక్తి దేశాలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది. అమెరికా–రష్యా పరిమితులు తొలగిపోవడంతో కొత్త ఆయుధ పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. పెద్ద శక్తులే ఆయుధాలను పెంచుకుంటే.. మనం ఎందుకు నియంత్రించుకోవాలి? అని ఇతర దేశాలు భావించొచ్చు. ఇదే అదనుగా.. తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయవచ్చు. అదే గనుక జరిగితే.. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించడానికి 1970లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ ఒప్పందం ఎన్పీటీ (Non-Proliferation Treaty) కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎన్పీటీ అంటే.. • కొత్త దేశాలు అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించడం.• ఇప్పటికే అణు శక్తి కలిగిన దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్) ఆయుధాలను తగ్గించడం.• అణు శక్తిని శాంతి ప్రయోజనాల కోసం (ఉదా: విద్యుత్ ఉత్పత్తి) ఉపయోగించడానికి సహకారం అందించడం.భారత్పై ప్రత్యక్ష ప్రభావంభారత్ ఇప్పటిదాకా క్రెడిబుల్ మినిమమ్ డిటర్రెన్స్ అనే అణు వ్యూహాన్ని పాటిస్తోంది. దీని ప్రకారం.. శత్రువు దాడి చేయకుండా నిరోధించడానికి, భారత్ వద్ద ఉన్న అణు శక్తి నమ్మదగినది (credible)గా ఉండాలి. అది శత్రువుకు నమ్మదగిన నిరోధక శక్తిగా (deterrent) పనిచేయాలి. అవసరానికి మించి పెద్ద అణు నిల్వలు కాకుండా.. తన భద్రతకు అవసరమైన కనీస అణు ఆయుధ శక్తిని మాత్రమే కలిగి ఉంటే చాలూ(Minimum). అలాగే.. భారత్ అణు ఆయుధాలను మొదటగా వాడకూడదు(No First Use-NFU). కానీ దాడి జరిగితే తప్పనిసరిగా ప్రతిదాడి చేయొచ్చు. శత్రువు మొదట దాడి చేసినా, భారత్ వద్ద ప్రతిదాడి చేసే సామర్థ్యం ఉండాలి( Second Strike Capability). 1999లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ‘‘డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్ట్రైన్’’లో సీడీఎం అనే సూత్రాన్ని ప్రకటించింది. ఆపై 2003లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఏర్పాటుతో ఎన్ఎఫ్యూలో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం.. బయోలాజికల్ లేదంటే కెమికల్ దాడి జరిగినా అణు ప్రతిదాడి చేసే అవకాశం కల్పించారు. మొత్తంగా భారత అణువిధానం.. అణ్వాయుధాలను రక్షణ కోసం మాత్రమే దాడి కోసం కాదు అని పాటిస్తూ వస్తోంది. అయితే.. భారమే అయినా..న్యూస్టార్ట్స్ గడువు ముగిసింది. అణ్వాయుధ పోటీలో భాగంగా చైనా తన అణు శక్తిని పెంచే అవకాశం లేకపోలేదు. అలాగే పాకిస్తాన్తో అణు సహకారం పెంచుకోవచ్చు కూడా. అణ్వాయుధ పోటీ వల్ల ఈ రెండు దేశాలు మరింత శక్తివంతమైన వ్యూహాలను అవలంబించే అవకాశం ఉంది. అదే జరిగితే.. భారత్ కూడా తన నిరోధక శక్తిని పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. భారత్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, సబ్మేరిన్ ఆధారిత అణు నిరోధక శక్తిను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అణు ఆయుధాల అభివృద్ధి, నిర్వహణ ఖర్చులు భారత్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచొచ్చు. అలాగే.. రక్షణ బడ్జెట్లో మరింత పెంపు అవసరం పడుతుంది. అంటే ఆర్థిక, భద్రతా, రాజనీతిక సవాళ్లు పెరుగుతాయన్నమాట. మరోవైపు.. అమెరికా–రష్యా పోటీ వల్ల కొత్త మల్టిలేటరల్ చర్చలు అవసరం అవుతాయి. జీ20, బ్రిక్స్ సదస్సులతో పాటు ఐక్యరాజ్య సమితి లాంటివి అందుకు వేదికలు అవుతాయి. ఇందులో భారత్కు కచ్చితంగా ప్రాధాన్యత లభించవచ్చు. ఎన్పీటీలో సభ్యత్వం లేని భారత్ ఇదే అదనుగా అంతర్జాతీయ వేదికలపై పారదర్శకత, నియంత్రణ చర్యలు కోరవచ్చు. ఇది భారత్కు గ్లోబల్ లీడర్షిప్ అవకాశాన్ని కలిగిస్తుంది. నో ఫస్ట్ యూజ్ విధానం కొనసాగిస్తున్న భారత్.. తన నైతిక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఏంటీ న్యూస్టార్ట్? న్యూస్టార్ట్ (New Strategic Arms Reduction Treaty) అనేది.. అమెరికా–రష్యా మధ్య 2010లో కుదిరిన అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం. పూర్తి పేరు: Treaty between the United States of America and the Russian Federation on Measures for the Further Reduction and Limitation of Strategic Offensive Arms. దీని ప్రధాన ఉద్దేశ్యం రెండు దేశాల వద్ద ఉన్న వ్యూహాత్మక అణు ఆయుధాలను పరిమితం చేసి, ప్రపంచ భద్రతను బలోపేతం చేయడం.కోల్డ్ వార్ తర్వాత అమెరికా, రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధ ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో 2010 ఏప్రిల్ 8న, ప్రాగ్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ సంతకం చేశారు. 2011 ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాత 2021లో 5 సంవత్సరాలు పొడిగించబడింది. ఇందులో భాగంగా.. అణు ఆయుధాల విషయంలో ప్రపంచంలో శక్తివంతమైన దేశాలైన అమెరికా, రష్యాలు పరిమితంగా ఉండాలి. ఒకదానికొకటి లెక్కలు చెప్పుకోవాలి. అలాగే అణు ఆయుధాల నియంత్రణ ద్వారా ఇతర దేశాలకు కూడా భద్రతా హామీ ఇవ్వాలి. కానీ, 2026 ఫిబ్రవరి 5న గడువు ముగిసింది. ఇప్పుడు అమెరికా–రష్యా మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేవు.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
భారత్కు ఆ స్వేచ్ఛ ఉంది..
మాస్కో: ముడి చమురు కొనుగోళ్లకు సంబంధించి ఏ సంస్థ నుంచి చమురును దిగుమతి చేసుకోవాలనే పూర్తిస్వేచ్ఛ భారత్కు ఉందని రష్యా ప్రకటించింది. ‘‘మేము సైతం అంతర్జాతీయ ఇంధన నిపుణుల బాటలోనే నడుస్తున్నాం. భారత్కు ఒక్క రష్యాయే కాదు ఎన్నో దేశాలు తమ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.ఎవరి నుంచి ఏం కొనాలనే స్వేచ్ఛ భారత్కు మొదట్నుంచీ ఉంది. ఇందులో కొత్తేమీ లేదు’’అని రష్యా అధ్యక్షభవనం అధికార ప్రతినిది దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి మోదీ సర్కార్ రష్యా నుంచి పూర్తిగా ముడిచమురు కొనుగోళ్లను ఆపేసిందన్న వార్తలపై మీ స్పందన ఏంటని మీడియా ప్రశ్నించగా పెస్కోవ్ పై విధంగా సమాధానం ఇచ్చారు. అయితే రష్యా హైడ్రోకార్బన్లను భారత్ కొనుగోలుచేయడం ఉభయతారకమని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా అన్నారు.భారత్పై 50 శాతం టారిఫ్లను ఏకంగా 18 శాతానికి తగ్గిస్తున్నట్టు సోమవారం ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీన్ని భారత్ సాధించిన ఘన విజయంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో తొలినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గకుండా, మాటల యుద్ధానికి బదులివ్వకుండా సంయమనం పాటిస్తూనే చివరికి మౌనంగానే ఆయన మెడలు వంచారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది చదవండి: ట్రంప్నే బెంబేలెత్తించింది.. భారత్ విజయ రహస్యం ఇదే!కాగా, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పారు. మన దేశ ఆహార, వ్యవసాయ రంగాలకు ఈ ఒప్పందంలో పూర్తి రక్షణలు ఉన్నట్లు తెలిపారు. ఆయన బుధవారం తొలుత లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. మన దేశ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని అన్నారు.అమెరికాతో ఒప్పందం వల్ల మనకు లాభం చేకూరుతుందని ప్రకటించారు. అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువులకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఎగుమతుల విషయంలో మన పోటీ సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని వివరించారు. ఈ ఒప్పందం హఠాత్తుగా కుదిరిందని కాదని, భారత్, అమెరికా మధ్య పలు దఫాల చర్చల తర్వాతే తుదిరూపు వచ్చిందని స్పష్టంచేశారు. ఇది సమతుల్య, పరస్పర ప్రయోజనాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందమని పేర్కొన్నారు. -
ట్రంప్నే బెంబేలెత్తించింది.. భారత్ విజయ రహస్యం ఇదే!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే అక్కసుతో భారత్పై భారీగా సుంకాలు మోపిన అమెరికా.. ఉన్నఫళంగా ఎందుకు దిగివచ్చింది? ఏకపక్షంగా సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా భారత్తో డీల్ కుదిరిందని, ట్యాక్స్లను 18 శాతానికి తగ్గించామని ఎందుకు ప్రకటించారు?? బెదిరింపులతో లొంగదీసుకుందామని ట్రంప్ భావిస్తే.. ఏకు మేకై కూర్చుంటామంటూ పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం అమెరికా తల వంచిందా?ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛాయుత వాణిజ్యంపై భారత్ కుదుర్చుకున్న డీల్ ఇప్పుడు ట్రంప్ మెడలను వంచిందా? బంగారం ధరలు మొదలు.. పలు దేశాల షేర్ మార్కెట్లను మాటలతో శాసిస్తున్న ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి?? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే..! అహింసామార్గంలో.. శాంతియుతంగా ఎదుటివారి మెడలు వంచేలా చేయడం భారత్ నైజం..!! ఈ విషయంలో భారత్ వ్యూహాత్మక అడుగులు.. వాటి ఫలితాలను గురించి వివరంగా తెలుసుకోవాలంటే.. చదవాల్సిందే👉అది అనుకున్నంత ఈజీ కాకపోగా..ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దేశాన్ని ఓడించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు..! బాలిస్టిక్ మిసైల్స్.. యుద్ధ విమానాలతో విరుచుకుపడాల్సిన పని లేదు..! ఆంక్షల ఛట్రంలో ఆ దేశాన్ని బంధించి, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు రద్దయ్యేలా చేస్తే చాలు..! ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే దశలో ఆ దేశాలను దారికి తెచ్చుకోవచ్చు..! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే..! ఇదే మైండ్ గేమ్తో ఎన్నో దేశాలను దారికి తెచ్చుకున్నాడు. భారత్ను కూడా అదే గాడిన కట్టాలనుకున్నాడు. భారత్ ఆత్మగౌరవం ముందు ఓడిపోయాడు. అది అనుకున్నంత ఈజీ కాకపోగా.. అమెరికన్లకే ధరాఘాతంతో శాపంగా మారుతోంది. దీంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల మెట్లు దిగిరాక తప్పలేదు..!👉ఆ మౌనమే ట్రంప్ను బెంబేలెత్తించింది..భారత్ను దారికి తెచ్చుకోవాలనే తపనతో ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి భారత్ నుంచి ప్రకటనలు లేకున్నా.. తానే భారతీయుల తరఫున ప్రకటనలు చేసుకున్నారు. రష్యా చమురును భారత్ కొనబోదని.. అమెరికా నుంచే కొంటుందని ప్రకటించేసుకున్నారు. అలాంటి ప్రకటనలకు భారత్ తొందరపడి ఏమాత్రం స్పందించలేదు. ‘నో కామెంట్’ అంటూ దాటవేయలేదు. చేసిందల్లా.. మౌనంగా ఉండడమే..! ఆ మౌనమే ఇప్పుడు ట్రంప్ను బెంబేలెత్తించింది. వెనక్కి తగ్గేలా చేసింది. మౌనంగానే భారత్ విజయం సాధించింది.👉జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు..సాధారణంగా మౌనం అర్ధాంగీకారం అంటారు. కానీ, జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు. ఒక పాలసీని అమలు చేయడానికి ముందు.. దానికి సమ్మతిని ఇవ్వడానికి ముందు చేసే ఆలోచనలు, కసరత్తుకు నిదర్శనమే మౌనం అంటారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. 1988లో అమెరికన్ ఆలోచనాపరుడు నోమ్ చోమ్స్కీతోపాటు.. ఆర్థికవేత్త ఎడ్వర్డ్.ఎస్.హెర్మాన్ తమ పుస్తకం ‘ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ద మాస్ మీడియా’లో ఇదే అంశాన్ని నొక్కి వక్కాణించారు. ఆంక్షలు, లేదా యుద్ధాలకు ముందు.. నిరసనను వ్యక్తం చేయకుండా.. విధానాలను సాధారణీకరించేందుకు మౌనం దాల్చడం ఓ రాజనీతి అంటారు. అమెరికా సుంకాల విషయంలో భారత్ పాటించిన మౌనం దీనికి చక్కటి ఉదాహరణ..!👉కన్జూమర్ సైకాలజీ అంటే ఇదే..కొనుగోలుదారులు ఎవరైనా తమకు కావాల్సిన వస్తువు ఎక్కడ చౌకగా దొరుకుతుందో అక్కడే కొంటారు. అది కన్జూమర్ సైకాలజీ. ఈ బేసిక్ నాలెడ్జ్ని కూడా మరిచిపోయిన ట్రంప్ చమురు విషయలో భారత్పై ఒత్తడి తేవాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇక రాజనీతి విషయానికి వస్తే.. అగ్రదేశాలు అంతగా జియోపాలిటిక్స్ను వంటబట్టించుకోని రోజుల్లోనే మనదేశంలో ద్వాపరయుగంలో విదురనీతి.. ఆధునిక యుగంలో చాణక్యనీతి అమల్లో ఉన్నాయి. భారత్కు రష్యా ముందు నుంచి మిత్ర దేశం. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఆంక్షల ఛట్రంలో రష్యా కూరుకుపోయింది.👉భారత్ను దెబ్బతీయాలనుకున్నారు కానీ...ఈ క్రమంలో చౌకగా చమురు అమ్మేందుకు రష్యా సిద్ధమైనా.. అభివృద్ధి చెందుతున్న దేశాలేవీ కొనేందుకు ముందుకు రాలేదు. ఐరోపా దేశాలే రష్యా చమురు కొంటున్న తరుణంలో భారత్ కూడా రష్యాకు అతిపెద్ద వినియోగదారుగా మారింది. ఈ చర్య అటు రష్యాకు, ఇటు భారత్కు లబ్ధి చేకూర్చింది. దీన్ని జీర్ణించుకోలేని ట్రంప్.. సుంకాలతో భారత్ను దెబ్బతీయాలనుకున్నారు. భారత్ తన ప్లాన్-బీని అమలు చేసింది.👉ఊహించని పరిణామం..అంతే.. కొత్త వినియోగదారులను సొంతం చేసుకుంది. ఐరోపా సమాఖ్యతో 19ఏళ్లుగా కలగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకు ముందే.. చైనాకు దగ్గరైంది. ఉప్పు-నిప్పుగా ఉండే తాలిబాన్లను అక్కున చేర్చుకుంది. ఇరాన్తోనూ వాణిజ్య ఒప్పందాలకు సిద్ధమైంది. జీయోపాలిటిక్స్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఊహించని ఈ పరిణామం అమెరికా మార్కెట్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో.. ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేయాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.👉భారత్ స్వరం మార్చింది..దౌత్యం విషయంలో భారత వ్యూహాలు మునుపటిలా లేవు. గడిచిన దశాబ్దన్నర కాలంగా వ్యూహప్రతివ్యూహాలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంతా భగవతేచ్ఛ.. అని భావించే భారత్.. ఇప్పుడు స్వరం మార్చింది. ప్రేమిస్తే.. ప్రాణమిస్తాం.. వంచిస్తే.. కాలరాస్తాం.. ఎక్కడా తగ్గేదే లే.. అని చాటిచెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ఈ విషయం స్పష్టమైంది. ఏరంగంలోనైనా శత్రువు ఢీ-అంటే ఢీకొడతామని తేల్చిచెప్పింది.👉ఇంకా చెప్పాలంటే..ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే.. 2019లో ఆంక్షల పేరుతో ఇరాన్, వెనిజెవెలా, భారత్ నుంచి చమురు దిగుమతులను నిలివేశారు. ఆ సమయంలో ఐక్య రాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీతో రాయబారాలు నెరిపారు. అప్పటి నుంచే.. భారత్-అమెరికా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు భారత్ ఆత్మనిర్భరతతో ఉందనే విషయాన్ని అమెరికాకు చాటి చెప్పింది. అమెరికా సాధారణంగా తన దారికి తెచ్చుకోవాలనుకునే దేశాలపై ప్రయోగించే సామ, దాన, బేధ, దండోపాయాలకు తాము అతీతమని భారత్ నిరూపించింది. ట్రంప్ మాదిరిగా.. దావోస్లాంటి వేదికను బెదిరింపులకు వినియోగించుకోకుండా.. అసందర్భ ప్రేలాపనలకు పోకుండా.. మౌనం వహించింది. విజయం సాధించింది. -
గ్రేట్ ట్రేడ్ డీల్.. అయినా ష్ గప్చుప్
అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ దాదాపుగా కుదిరినట్లే!. ఇరు దేశాల మధ్య ర్చలు ఓ కొలిక్కి వచ్చాయని.. తన మిత్రుడు మోదీతో ఫోన్లో సంప్రదింపులు జరిపానని.. అన్నింటికి ఆయన ఒప్పుకున్నారని.. అందుకే భారత్పై సుంకాలను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటు ఈ డీల్ను గ్రేట్గా అభివర్ణిస్తూ భారత ప్రజల తరఫున ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు కూడా. అయితే.. ఇక్కడే ఓ మెలిక ఉంది. భారత్ నుంచి ప్రస్తుతం అమెరికా 50 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇందులో 25 శాతం ప్రతీకార సుంకాలు కాగా.. మరో 25 శాతం పెనాలిటీ టారిఫ్ ఉంది. టారిఫ్లు 18 శాతానికి తగ్గిస్తున్నామని.. వీటిని సున్నాకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తామని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలో రష్యా నుంచి పూర్తిగా చమురు కొనుగోలును ఆపేందుకు భారత్ అంగీకరించిందని చెప్పారు. అయితే సుంకాల తగ్గింపుపై థ్యాంక్స్ మెసేజ్లో మోదీ ఈ అంశాన్ని ఏమాత్రం ప్రస్తావించలేదు. అలాగే అమెరికా ఉత్పత్తులను భారీ మొత్తంలో భారత్ కొనుగోలు చేస్తుందన్న ట్రంప్ స్టేట్మెంట్పైనా స్పందించలేదు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ ఇలా ప్రకటనలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇలా చార్లు ఆయన బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనతో ఆయా సందర్భాల్లో భారత ప్రభుత్వం బహిరంగంగా విబేధించింది. అలాంటిదేం ఉండబోదని.. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గమని.. జాతి ప్రయోజనాల మేరకు తమ నిర్ణయం ఉంటుందని ప్రకటించింది. అయితే ఈసారి మాత్రం ఇంక ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనిని వ్యూహాత్మక మౌనమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా, రష్యాలతో సంబంధాల నేపథ్యంలోనే ఇలా వ్యవహరిస్తుందని అంచనా వేస్తున్నారు. రష్యా ఆయిల్ కొనుగోలు ఆపివేతపై టారిఫ్ల తగ్గింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన ఇస్తుందో చూడాలి. అలాగే టారిఫ్లు 50 నుంచి 18కి తగ్గాయా? లేదంటే 25 శాతం నుంచే 18కి చేరాయా? అనేదానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అటు.. రష్యా సైతం ట్రంప్ తాజా ప్రకటనపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. గతంలో మాత్రం.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకంగా చూస్తూ, తమ చమురు మార్కెట్పై ప్రభావం ఉంటుందని సూచించింది. అలాగే భారత్ తమకు మిత్ర దేశమని.. ఇతర దేశాల ఒత్తిళ్లకు తలొగ్గే అవకాశమే ఉండబోదని ధీమా వ్యక్తం చేసింది. ఒకవేళ భారత్ రష్యా చమురు దిగుమతులను ఆపితే, రష్యా ఆసియా మార్కెట్లో తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా చమురు ఆగిందా?ట్రంప్ చెబుతున్నట్లు.. భారత్ రష్యా చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోలేదు. 2024లో రష్యా నుంచి భారత్ సుమారు 52.7 బిలియన్ డాలర్ల విలువైన చమురు దిగుమతి చేసింది. 2025 చివరలో ఈ తగ్గుదల కనిపించినా.. 2026 జనవరిలో కూడా మూడు కంపెనీలు (IOCL, BPCL, Nayara Energy) రష్యా చమురు కొనుగోలు కొనసాగించాయి. ఇక..ఒకప్పుడు రష్యా నుంచి భారత్ కేవలం 2 శాతం మాత్రమే చమురు దిగుమతి చేసుకునేది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా చమురు కొనుగోలు పెంచింది. ఎందుకంటే ఆ సమయంలో డిస్కౌంట్ ధరలు లభించాయి కాబట్టి. అలా.. 2024లో సుమారు US$52.7 బిలియన్ విలువైన చమురును దిగుమతి చేసుకుంది. 2025లో.. అమెరికా సుంకాల-ఆంక్షల బెదిరింపులు.. ట్రంప్ ఒత్తిడి, రష్యా నుంచి వచ్చే డిస్కౌంట్ తగ్గిపోవడం, మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరా పెరగడం.. తదితర కారణాలతో చమురు దిగుమతులు తగ్గినట్లు అనిపించాయి. డిసెంబర్ 2025లో భారత్ మొత్తం చమురు దిగుమతులు 21.6 మిలియన్ టన్నులకు చేరాయి, అయితే.. గత 9 నెలల్లో ఇదే అత్యధికం. ఇక.. జనవరి 2026లో రష్యా చమురు దిగుమతులు నవంబర్తో పోలిస్తే 35% తగ్గాయి. రిలయన్స్ వంటి పెద్ద ప్రైవేట్ కంపెనీలు రష్యా చమురు కొనుగోలు తగ్గించాయి, కానీ IOCL, BPCL, Nayara Energy మాత్రం కొనుగోలు కొనసాస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.సూటిగా మూడు పాయింట్లలో.. భారత్: ట్రంప్ సుంకాల తగ్గింపును స్వాగతించింది. కానీ రష్యా చమురు అంశంపై మౌనం పాటిస్తోందిఅమెరికా: భారత్ రష్యా చమురు ఆపివేస్తుందని ధృవీకరించిందిరష్యా: ఆసియా మార్కెట్ దెబ్బ తినే అవకాశంతో.. ట్రంప్ ప్రకటనను ఖండించే చాన్స్ -
ఉక్రెయిన్ బస్సుపై డ్రోన్ దాడి.. మైనర్లతో సహా భారీగా మృతులు
రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో రష్యా మరోసారి ఉక్రెయిన్పై దాడి చేసింది. ఆ దేశంలోని వివిధ ప్రాంతాలపై డ్రోన్లతో విరుచుకపడింది. ఈ దాడుల్లో 15 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎంతకీ కొలిక్కి రావడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని ఆపాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అయితే యుద్ధాన్ని ముగించడం కోసం ఇరు దేశాలు చర్చలు జరిపినా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అయితే రెండు దేశాల మధ్య త్వరలో మూడోసారి చర్చలు జరగనున్నాయి. అంతేకాకుండా ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా చర్చలకోసం మాస్కోకి ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఇకనైనా యుద్ధానికి ముగింపు దొరుకుతుందా అని అంతా అనుకున్నారు. అయితే మరోసారి సీన్ రివర్స్ అయ్యింది. తాజాగా రష్యా, ఉక్రెయిన్పై మరోసారి డ్రోన్లతో విరుచుకపడింది.ఉక్రెయిన్లోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ డీటీఈకే టార్గెట్గా డ్రోన్ దాడులు జరిపిందని అధికారులు తెలిపారు. కార్మికులు ఫ్యాక్టరీలో పనులు ముగించుకొని బస్సులో తిరిగి వెళుతుండగా బస్సుపై డ్రోన్ దాడి జరిపిందన్నారు. ఈ దాడిలో 15 మంది అక్కడికక్కడే మరణించారని పేర్కొన్నారు. మరణించిన వారిలో మైనర్లు ఉన్నారన్నారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాలలో దాదాపు 90 కిపైగా డ్రోన్లతో తమ దేశంపై దాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడులను రష్యా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయతే రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయని జెలెన్స్కీ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. -
మళ్లీ బతకాలన్న ఆశతో..
మరణం అనేది జీవనానికి చివరి అంకమే. అయితే ఆధునిక సాంకేతికతపై అపారమైన నమ్మకం ఉన్న కొంతమంది ఈ భావనకే సవాల్ విసురుతున్నారు. ‘ఈరోజు కాకపోయినా వందల వేల ఏళ్ల తర్వాతైనా సైన్స్ మళ్లీ బ్రతికించగలదన్న ఆశతో’ తమ శరీరాలను భద్రపర్చుకుంటున్నారు. ఈ విధానమే క్రయోజెనిక్స్. సాధారణంగా ఎవరైనా చనిపోయాక అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరికొంతమంది వైద్య పరిశోధనల కోసం తమ దేహాలను దానం చేస్తారు. కానీ, ప్రపంచంలోని కొంతమంది అత్యంత ధనవంతులు మాత్రం మరణించిన తర్వాత తమ శరీరాలను లేదా మెదడును అత్యాధునిక క్రయోజెనిక్స్ చాంబర్లలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డకట్టించి భద్రపర్చుకుంటూ భవిష్యత్పై ఆశలు పెంచుకుంటున్నారు. ఖర్చు ఘనం.. క్రయోజెనిక్స్ అనేది శాస్త్రీయ ప్రక్రియ. మరణించిన వెంటనే, శరీరాన్ని అత్యంత వేగంగా మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో (లిక్విడ్ నైట్రోజన్) గడ్డకట్టిస్తారు.ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటే, కణజాలంలో ఎలాంటి రసాయన మార్పులూ జరగవు. ఈ ప్రక్రియలో రక్తాన్ని పూర్తిగా బయటకు తీసి దాని స్థానంలో క్రయోప్రొటెక్టెంట్ అనే ద్రవాన్ని ప్రవేశపెడతారు. కణాలు దెబ్బతినకుండా, శరీరం లేదా మెదడును ‘కాలం నిలిపిన’ స్థితిలో భద్రపరుస్తారు. లిక్విడ్ నైట్రోజన్లో ఉన్న శరీరానికి కాలంతో సంబంధం ఉండదు. కణజాలం పాడయ్యే ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది. ఇలా వందల, వేల ఏళ్లు భద్రపరచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి శరీరం భద్రపర్చాలంటే భారతీయ కరెన్సీలో రూ.1.60 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు, మెదడు మాత్రమే భద్రపర్చాలంటే రూ.కోటిన్నరకు పైగా ఖర్చవుతుందని అంచనా. అమెరికా, రష్యా దేశాల్లో ఇందుకోసం ఇన్సూ్యరెన్స్ కంపెనీలు కవరేజ్ కూడా కల్పిస్తుండటం విశేషం. ఇప్పటికే 500 మందికి పైగా మరణానంతరం తమ శరీరాలు, మెదడును ఈ క్రయోజెనిక్స్ చాంబర్స్లో భద్రపర్చుకున్నారు. అధ్యయనాల్లో భిన్నాభిప్రాయాలు.. క్రయోజెనిక్స్ అంశంపై ఇటీవల కాలంలో ప్రపంచంలోని ప్రముఖ వర్సిటీలు, వైద్య పరిశోధన సంస్థలు అనేక అధ్యయనాలు చేస్తున్నాయి. అమెరికాలో ఆల్కార్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ (ఆరిజోనా), క్రయోజనిక్స్ ఇన్స్టిట్యూట్ (మిచిగావ్)ల్లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (యూకే) జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్–2023తో పాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్ (యూఎస్ఏ) తమ బ్రిటిష్ మెడికల్ జర్నల్–2023లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో ఈ క్రయోజెనిక్స్పై ప్రత్యేకంగా ప్రస్తావించాయి. అయితే కాలిఫోర్నియా వర్సిటీ న్యూరో సైన్స్పై జరిపిన అధ్యయనంలో మెదడును గడ్డకట్టిన తర్వాత జ్ఞాపకాలు, నాడి సంబంధాలు పూర్తిస్థాయిలో తిరిగి పనిచేయడం అత్యంత క్లిష్టమని పేర్కొంది. మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ (జర్మనీ) తమ క్రియో బయోలజీ జర్నల్–2024లో కణజాలాన్ని గడ్డకట్టే ప్రక్రియలోనే సూక్ష్మస్థాయిలో నష్టం జరుగుతుందని పేర్కొంది. చిన్న అవయవాల పునరుద్ధరణ వరకే విజయం సాధ్యమైందని, పూర్తి మానవశరీర పునరుద్ధరణ ఇంకా సాధ్యం కాలేదని తెలిపింది. ఏ దేశాల్లో ముందున్నాయి.. క్రయోజెనిక్స్ రంగంలో అమెరికా, రష్యా దేశాలు ముందున్నాయి. చైనా ఇటీవలే ఈ అంశంపై పరిశోధనలు సాగిస్తోంది. కెనడా, యూరప్,జర్మనీ, స్విట్జర్లాండ్, యూకేల్లో పరిమిత స్థాయిలో పరిశోధనలు జరుగుతుండగా, ఆ్రస్టేలియాలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా క్రయోజెనిక్ పేషెంట్లు (మరణానంతరం) ఉన్న దేశంగా అమెరికా రికార్డుల్లోకెక్కింది. ఆ తర్వాత రష్యా కూడా ఈ తరహా సదుపాయాలను కల్పించింది. రష్యాలోని క్రియోరుస్ అనే సంస్థ పూర్తి శరీరం, మెదడు భద్రపరిచే సదుపాయం కలిగి ఉంది. సైన్స్పై అతి నమ్మకం, డబ్బు ఇచ్చే ధైర్యం..కోల్పోయేదేముందన్న భావన ఈ తరహా ప్రయోగాలకు పురిగొల్పుతుందంటున్నారు. :::సాక్షి ప్రత్యేక కథనం -
ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో 20 లక్షల మంది మృతి
కీవ్: ఉక్రెయిన్పై దురాక్రమణ జెండా ఎగరేసి రష్యా యుద్ధం మొదలెట్టాక రెండు దేశాల్లో మొత్తంగా 20 లక్షల మంది చనిపోయారని ‘సెంటర్ ఫర్ స్ట్రాటిజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్(సీఎస్ఐఎస్)’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ‘‘ఉక్రెయిన్ ప్రతిదాడిలో రష్యాలో కనీసం 12 లక్షల మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 3,25,000 మంది సైనికులు ఉన్నారు. తక్కువ సైన్యంతో రష్యాతో పోరాడిన ఉక్రెయిన్ బలగాల్లో 1,40,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడటం, జాడ తెలీకుండా పోవడం, శత్రుదేశ సైన్యానికి చిక్కి బందీలుగా రష్యాకు బలవంతంగా తరలిపోయిన కేటగిరీలో 6,00,000 మంది ఉన్నారు. కొద్దిపాటి భూభాగం, విలువైన ఖనిజ నిల్వలపై ఆధిపత్యం పొందే క్రమంలో రష్యా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా వంటి అగ్రరాజ్యం ఇంతటి ప్రాణనష్టాన్ని చవిచూడడం చరిత్రలో ఇదే తొలిసారి’’ అని నివేదిక పేర్కొంది. -
సొంత సైనికులకు.. రష్యా చిత్ర హింసలు
కీవ్: ఈ చిత్రాలు చూస్తున్నారు కదా? మైనస్ డిగ్రీల చలిలో నగ్నంగా.. అర్ధనగ్నంగా.. తలకిందులుగా చెట్లకు కట్టేసిన ఈ యువకులు ఏదో ఘరానా నేరం చేసిన వారు కాదు. వారు రష్యన్ సైనికులు. వారిని దండిస్తోంది కూడా రష్యన్ సైన్యమే..! కారణం చాలా చిన్నది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో పాల్గొనేందుకు వీరు నిరాకరించారు. దీన్ని తీవ్ర ధిక్కరణగా భావించిన పుతిన్ సర్కారు.. కఠిన చర్యలకు ఆదేశించింది. అంతే.. రష్యన్ సైన్యం అమానవీయంగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య పలువురు సైనికుల బట్టలను విప్పి.. చెట్లకు కట్టేసి.. నోట్లో మంచు ముక్కలను పెట్టి.. చిత్ర హింసలకు గురిచేస్తోంది. ఇలా హింసతో సైనికులను తమ దారికి తెచ్చుకుంటోంది పుతిన్ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.A Russian commander is “teaching” his subordinates military discipline in the Russian armyThis time, new recruits were tied upside down to a tree as punishment for abandoning their combat positions out of fear of being killed. pic.twitter.com/RDSmCqBn9M— Visegrád 24 (@visegrad24) January 26, 2026వెలుగులోకి వచ్చిన వీడియోల్లో రష్యా సైన్యంలో జరుగుతున్న కఠిన శిక్షా విధానాలు బయటపడ్డాయి. కమాండర్లు తమ సైనికులను అర్ధనగ్నంగా చెట్లకు కట్టేసి, మంచు తినమని బలవంతం చేస్తున్న వీడియోలు బయటకు రావడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో, రష్యా సైన్యంలో అంతర్గత పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో రష్యా కమాండర్లు తమ సైనికులను అర్ధనగ్నంగా చెట్లకు కట్టేసి, శిక్షగా మంచు తినమని బలవంతం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోలు రష్యా సైన్యంలో ఉన్న కఠినమైన శిక్షా విధానాలను బయటపెడుతున్నాయి.ఈ ఘటనలు రష్యా సైన్యంలో క్రమశిక్షణ పేరుతో జరుగుతున్నాయని సమాచారం. సైనికులు ఆదేశాలను పాటించకపోవడం, లేదా చిన్న తప్పులు చేసినా ఇలాంటి శిక్షలు విధిస్తున్నారని తెలుస్తోంది. చెట్లకు కట్టేసిన సైనికులు తీవ్ర చలిలో వణికిపోతూ, మంచు తినడం ద్వారా అవమానకర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.ఈ వీడియోలు బయటకు రావడంతో, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులు కూడా మానవులేనని, వారికి ఇలాంటి అమానుష శిక్షలు విధించడం మానవ హక్కుల ఉల్లంఘన అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా సైన్యంలో ఒత్తిడి పెరిగినప్పటికీ, ఇలాంటి శిక్షలు సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. సైనికులను శిక్షించడానికి ఇలాంటి అమానుష పద్ధతులు ఉపయోగించడం, రష్యా సైన్యంలో ఉన్న అంతర్గత సమస్యలను బహిర్గతం చేస్తోంది.ఈ వీడియోలు బయటకు రావడంతో, రష్యా సైన్యం అంతర్జాతీయ స్థాయిలో విమర్శల పాలవుతోంది. యుద్ధం కొనసాగుతున్న సమయంలో, సైనికులపై ఇలాంటి శిక్షలు విధించడం రష్యా సైన్యం యొక్క కఠినమైన, క్రూరమైన వైఖరిని చూపిస్తున్నాయి. -
సడలిన అమెరికా వైఖరి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న టీం సభ్యులు సైతం అచ్చం ఆయన తరహాలోనే రోజుకో రీతిన మాట్లాడటంలో ఆరితేరారు. అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్ చేస్తున్న ప్రకటనలు దాన్నే నిరూపిస్తున్నాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరబోతున్నదని, తమ షరతులన్నిటికీ తలొగ్గటానికి ఆ దేశం సిద్ధపడిందని పలుమార్లు ఏకపక్షంగా ప్రకటించటం, అంతలోనే ఏదో సాకుతో అదనపు సుంకాలు విధించటం ట్రంప్ అలవాటు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయనందు వల్ల భారత్పై విధించే సుంకాలు 500 శాతానికి కూడా చేరుకోవచ్చని పదిరోజులనాడు కూడా ట్రంప్ బెదిరించారు. స్కాట్ బిసెంట్ సైతం ఆ తోవనే పోయారు. కానీ ఇప్పుడు బెదిరింపుల పర్వం ఉపశమించినట్టు కనబడుతోంది. భారత్పై విధించిన అదనపు సుంకాల్లో 25 శాతాన్ని తగ్గించబోతున్నామని బిసెంట్ ప్రకటించారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లు పడిపోయినందు వల్ల ఈ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. చమురు కొనుగోళ్లు తగ్గిన మాట వాస్తవమే అయినా, దాన్ని అసలు గుర్తించనట్టు ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లు పెట్టడం అలవాటు చేసుకున్న అమెరికా వైఖరి మార్చుకోవటం వెనక వేరే మతలబు ఉంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో మన దేశం రేపో మాపో వాణిజ్య ఒప్పందం కుదురుతుండటమే ఇందుకు కారణం. ఉక్రెయిన్పై 2022లో రష్యా దాడి తర్వాత అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆదేశంతో సంబంధాలు తెంచుకున్నాయి. అటు తర్వాత మన రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు పెరిగాయి. ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో మనం రెండో స్థానంలో ఉన్నాం. ప్రపంచం మునుపటిలా లేదు. ఏకపక్షంగా, అనాలోచితంగా ఆంక్షలు విధిస్తే స్వీయ నష్టాలు కూడా తప్పవు. ప్రపంచ దేశాలపై విధించిన ఆంక్షల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో పడింది. తాజాగా డాలర్ విలువ నాలుగు నెలల కనిష్ఠస్థాయికి పడి పోయింది. అమెరికా బెదిరింపులకు దిగిన మొదట్లో మన దేశానికి చెందిన ప్రైవేటు సంస్థలు రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు తగ్గించిన మాట వాస్తవం. అప్పటికి రోజూ సగటున 17 లక్షల బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేస్తుండగా, మొన్న డిసెంబర్ నాటికి అది 12 లక్షల బ్యారెళ్లకు తగ్గింది. అమెరికా సంస్థలతో లావాదేవీలున్న కొన్ని భారత్ కంపెనీలు ఆంక్షలకు తలొగ్గటమే మంచిదని నిర్ణయించుకోవటం ఇందుకు కారణం. కానీ రష్యా ప్రముఖ చమురు కంపెనీలైన రోజ్నెఫ్ట్, లుకోయిల్ నుంచి చమురు కొనుగోలు చేయరాదన్నది అమెరికా పెట్టిన ఆంక్షల్లో ఒకటి. దానికి విరుగుడుగా రష్యా వేరే కంపెనీలను రంగంలోకి దించి వాటిద్వారా భారత్కు ముడి చమురు ఎగుమతులు మొదలుపెట్టింది. వీటి ప్రభావం ఒకటి రెండు నెలల్లో కనబడుతుందనీ, అటుతర్వాత రష్యా నుంచి వచ్చే ముడిచమురు కొనుగోళ్లు యథాప్రకారం ఉంటాయని నిపుణుల అంచనా. చవగ్గా వచ్చే రష్యా ముడి చమురును వదులుకోవటం ఎవరికైనా అంత సులభం కాదు. రష్యా చమురుకూ, సౌదీ అరేబియా నుంచి కొనే చమురుకూ మధ్య బ్యారెల్కు దాదాపు 10 డాలర్ల వ్యత్యాసం కనబడుతున్నప్పుడు ఆంక్షలకు తలొగ్గాలని ఎవరూ అనుకోలేరు. తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుపరంగా మార్పుచేసిన ఆహారధాన్యాలనూ భారత్ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నందు వల్లే వాణిజ్య ఒప్పందం కుదరటంలో ఆలస్యం అవుతోంది. ఏదో వంకతో ఆంక్షలు విధిస్తే భారత్ దారికొస్తుందని అమెరికా భావన. ఈలోగా ఈయూ–భారత్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదిరే అవకాశాలు కనబడటం అమెరికా జీర్ణించు కోలేకపోతోంది. అందుకే ఒకపక్క ఎఫ్టీఏను దృష్టిలో పెట్టుకున్నందు వల్లే భారత్ పట్ల ఈయూ మెతకవైఖరి ప్రదర్శించిందని విమర్శిస్తూనే, తాను విధించిన అదనపు సుంకాల్లో కోతకు సిద్ధపడుతోంది. అమెరికాతో ఒప్పందం కుదరటం మాటెలావున్నా, ప్రపంచ దేశాలన్నిటితో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునే ప్రస్తుత విధానాన్ని మన దేశం కొనసాగించటమే ఉత్తమం. ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే ధోరణి ఎప్పుడూ ప్రమాదకరమే! -
మంచు ‘దుప్పట్లో’
మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా తెల్లగా మెరిసిపోతూ కన్పిస్తున్న ఈ భవనం ఏమిటో తెలుసా? రష్యా రాజధాని మాస్కోలోకెల్లా ఎత్తైన ప్రఖ్యాత ఒస్టాంకినో టవర్. దీని ఎత్తు అర కిలోమీటరు పైనే. అంటే 540 మీటర్లు! అంతటి టవర్ కూడా విపరీతమైన చలి దెబ్బకు ఇలా నిలువెల్లా ‘తెల్లబోయింది’! ఆద్యంతం మంచుమయంగా మారిపోయింది. ప్రస్తుతం రష్యాను అతలాకుతలం చేస్తున్న అతి శీతల వాతావరణ తీవ్రతకు అద్దం పడుతున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాస్కో, పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 28 డిగ్రీ సెల్సియస్కు పడిపోయాయి. ధ్రువ సుడిగుండం (పోలార్ వెర్టెక్స్) కారణంగా ప్రస్తుతం రష్యాను విపరీతమైన చలిగాలులు వణికించేస్తున్నాయి. ఈ ఆర్కిటిక్ అతి శీతల గాలుల దెబ్బకు ఉత్తరార్ధ గోళమంతా అతలాకుతలం అవుతోంది. ఏ దేశంలో చూసినా ఊళ్లూ, పట్టణాలు తెల్లగా పరుచుకున్న మంచులో మునిగి తేలుతున్నాయి. ఏమిటీ ధ్రువ సుడిగుండం ఇది ధ్రువ ప్రాంతాల సమీపంలో నిత్యం కొనసాగే స్థిర అల్పపీడన వాతావరణం. దాంతో అక్కడి గాలులు సర్వాన్నీ గడ్డకట్టించేంత చల్లగా వణికిస్తూ ఉంటాయి. అయితే అన్నివైపుల నుంచీ ధ్రువాలకు వీచే బలమైన గాలుల వల్ల ఈ అతి శీతల పరిస్థితి సాధారణంగా అక్కడికే పరిమితమై ఉంటుంది. ఆ గాలులు బలహీనపడటం వంటివి జరిగినప్పుడు ధ్రువ సుడిగుండం భారీ కుదుపుకు లోనై అతి శీతల గాలులు బయటికి తోసుకొచ్చి దక్షిణాన సుదూరాల దాకా విరుచుకుపడతాయి. దాంతో ఉత్తర అమెరికా, యూరప్ మొదలుకుని ఆసియాలోని పలు దేశాలు చలి గుప్పెట్లోకి వెళ్లిపోతాయి. ప్రస్తుతం అదే జరుగుతోందని నేషనల్ ఓషియానిక్ అండ్ అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్తో పాటు నాసా సేకరించిన డేటా చెబుతోంది. ఇది ప్రస్తుతం చాలా చురుగ్గా ఉన్నట్టు ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా దూకుడుకు నాటో అడ్డుకట్ట..! సరిహద్దుల్లో "స్మార్ట్ వాల్"
రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నాటో ఒక చారిత్రక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. యూరోపియన్ సరిహద్దుల వెంబడి సైనికులతో పనిలేకుండా, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రోబోటిక్ "ఆటోమేటెడ్ జోన్"ను నాటో ఏర్పాటు చేయబోతుంది.ఈ విషయాన్ని నాటో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ థామస్ లోవిన్ శనివారం వెల్లడించారు. ఈ ఆటోమేటెడ్ జోన్ ఒక రక్షణ గోడలా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ ఆటోమేటెడ్ జోన్లోకి శత్రు సైన్యం ప్రవేశిస్తే గుర్తించడానికి డ్రోన్లు, సెమీ-అటానమస్ యుద్ధ వాహనాలు, భూమిపై నడిచే రోబోలు, ఆటోమేటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అత్యాధునిక సెన్సార్లు ఉంటాయి.ఇవి శత్రువుల కదలికలను సెకన్లలో పసిగడతాయి. వెంటనే నాటోదేశాలకు సమాచారం అందుతుంది. అయితే ప్రాణాంతకమైన ఆయుధాలను ప్రయోగించాలా వద్దా అనే నిర్ణయం మాత్రం మనిషి చేతుల్లోనే చేతుల్లోనే ఉంటుందని వెల్ట్ ఆమ్ సోన్టాగ్ అనే జర్మన్ వార్తాపత్రికతో లోవిన్ పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ సాంకేతికతను పోలాండ్ మరియు రోమేనియా దేశాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. 2027 చివరి నాటికి ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నాటో లక్ష్యంగా పెట్టుకుంది. -
‘రష్యా సుంకం’ రద్దు?
వాషింగ్టన్: అమెరికా విధించిన భారీ టారిఫ్ల విషయంలో భారత్కు సగానికి సగం ఊరట లభించే అవకాశం కని్పస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు విధించిన 25 శాతం టారిఫ్లను రద్దు చేసే అవకాశమున్నట్టు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ కొద్ది నెలలుగా భారీగా తగ్గించుకుంది. కనుక 25 శాతం సుంకాలను రద్దు చేసే అంశాన్ని మా ప్రభుత్వం పరిశీలించే అవకాశముంది’’అని ఆయన చెప్పారు. శుక్రవారం అమెరికా వార్తా సంస్థ పొలిటికో ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. ‘‘భారత్పై మేం విధించిన 25 శాతం చమురు టారిఫ్ బ్రహా్మండంగా పని చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు దాదాపుగా ఆగిపోయాయి. కనుక వాటిని వెనక్కు తీసుకునే ప్రక్రియ మొదలవుతుందనే భావిస్తున్నా’’అని వివరించారు. టారిఫ్ల వల్లే రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లు భారీగా తగ్గాయని ఇటీవల దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా కూడా బెసెంట్ చెప్పుకొచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్, అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో ముందడుగు పడుతుందని భావిస్తున్నారు. అయితే, భారత్ నుంచి శుద్ధి చేసిన చమురు తదితరాలను యూరప్ కొనుగోలు చేయడంపై బెసెంట్ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘యూరప్ది నిజంగా మూర్ఖపు చర్యే. భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని యూరప్ అంగలారుస్తోంది. అందుకే రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఆ దేశంపై అధిక సుంకాలు విధించలేదు’’అంటూ నిందించారు. ఆగస్టు నుంచీ రగడ భారీ వాణిజ్య అసమతుల్యతను సరిచేసే పేరిట భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఆగస్టులో తొలుత 25 శాతం టారిఫ్ విధించడం తెలిసిందే. రష్యా చమురు దిగుమతులను సాకుగా చూపుతూ కొంతకాలానికే మరో 25 శాతం మేరకు బాదారు. అంతేగాక, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే, దాన్ని తిరిగి విక్రయించే దేశాలపై ఏకంగా 500 శాతం టారిఫ్ విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవల అమెరికా సెనేట్లో ప్రవేశపెట్టారు కూడా! రష్యా తన చమురు కొనుగోళ్ల నిధులను ఉక్రెయిన్పై యుద్ధానికి వెచ్చిస్తోందని అమెరికా ఆరోపిస్తుండటం తెలిసిందే. అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్, రష్యా నుంచి అధిక మెుత్తంలో చమురు దిగుమతి చేసుకుంటుంది. కాగా మెుత్తంగా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దారుగా ఉంది. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్ పడుతుందా?
నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక అడుగు పడింది. యూఏఈ రాజధాని అబుదాబిలో ఉక్రెయిన్, రష్యా, అమెరికా ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. అమెరికా మధ్యవర్తిత్వంలో ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు నేరుగా ఒకే వేదికపై చర్చలు జరపడం ఇదే మొదటిసారి.దీంతో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధాన్ని వెంటనే ముగించాలని పట్టుబడుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ప్రత్యేక రాయబారులను ఈ చర్చలకు పంపారు. ఈ భేటీలో యుద్ధ విరమణ, భూభాగాల వివాదాల గురుంచి చర్చించారు. శనివారం(జనవరి 24) కూడా ఈ చర్చలు జరగనున్నాయి.కాగా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. శాంతి ఒప్పందం "దాదాపు సిద్ధమైందని" ప్రకటించారు. అయితే భూభాగాల మార్పిడి విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోందని ఆయన తెలిపారు. రష్యా ఆక్రమించిన ప్రాంతాల విషయంలో ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. -
త్రైపాక్షిక చర్చలు మొదలెడతాం
దావోస్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగింపు దిశగా కీలక ముందడుగు వేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో గురువారం జెలెన్స్కీ ప్రసంగించారు. ‘‘యుద్ధం ముగింపే లక్ష్యంగా శుక్రవారం నుంచి రెండ్రోజులపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉక్రెయిన్, రష్యా, అమెరికాల మధ్య త్రైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి. అంతకుముందు గురువారమే అమెరికా ప్రతినిధి బృందంతో మేం మంతనాలు జరుపుతాం. మా చర్చల పురోగతిని రష్యాకు వివరించేందుకు మరో అమెరికా బృందం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఆ తర్వాత రష్యా బృందంతో కలిసి అమెరికా, ఉక్రెయిన్ బృందాలు యునైటెడ్ అరబ్ ఎమిర్సేట్లో త్రైపాక్షిక చర్చలు జరుపుతాయి. యుద్ధం పరిసమాప్తి కోసం ఉక్రెయిన్ మాత్రమేకాదు రష్యా సైతం కొన్నిసార్లు త్యాగాలుచేయాల్సి ఉంటుంది. అందుకు రష్యా సిద్ధపడాలి. చర్చలనేవే లేకుండా ఉండటం కంటే ఏదోరకమైన చర్చలకు ప్రయత్నించడం మంచిదే కదా. యుద్ధం ముగిసిపోయేలా మాకు దేవుడి దీవెనలు ఉంటాయని ఆశిస్తున్నా’’ అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ‘‘ గత ఏడాది ఇదే వేదికపై ఐరోపా సాయం కోసం వేడుకున్నా. ఆనాడు ఏం మాట్లాడానో అవే మాట్లాడాల్సి వస్తోంది. అప్పటికి ఇప్పటికి పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. ‘గ్రౌండ్హాగ్ డే’ సినిమాలో పాత్రలాగా ఒకే రోజు మళ్లీ మళ్లీ పునరావృతమవుతోంది’’ అని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తంచేశారు.ట్రంప్తో జెలెన్స్కీ కీలక చర్చలువరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జెలెన్స్కీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తర్వాత జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు. ‘‘ ట్రంప్తో భేటీ ఉక్రెయిన్కు లబ్ధి చేకూరేలా సాగింది. మేమిద్దరం నేడో, రేపో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమవుతాం. ఆ తర్వాతే త్రైపాక్షిక భేటీ జరగనుంది’’ అని అన్నారు. ట్రంప్, జెలెన్స్కీ భేటీ వివరాలను పుతిన్కు వివరించేందుకు ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ మాస్కోకు వెళ్లనున్నారు. పుతిన్తో అమెరికా బృందం భేటీని ట్రంప్ సైతం ్ర«ధువీకరించారు. ఎలాగైనాసరే ఈసారి చర్చలు విజయవంతంచేసి యుద్ధాన్ని ఆపేస్తామని ట్రంప్ ధీమా వ్యక్తంచేశారు. మరోవైపు దావోస్ పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన ట్రంప్కు ప్రతికూల వాతావరణం సమస్యగా మారింది. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ట్రంప్ హెలికాప్టర్ ఎగరలేకపోయింది. దాంతో రోడ్డు మార్గంలో ట్రంప్ జ్యూరిచ్కు చేరుకుని అక్కడి నుంచి ఎయిర్ఫోర్స్వన్ విమానంలో అమెరికాకు తిరుగుపయనమైనట్లు తెలుస్తోంది. -
రష్యా నుంచి భారత్ చమురు కొనట్లేదు
దావోస్: రష్యా నుంచి ముడి చమురును కొనే దేశాలపై తాము 25 శాతం అదనపు టారిఫ్ను విధించడం మొదలెట్టాక రష్యా నుంచి భారత్ క్రూడ్ఆయిల్ కొనుగోళ్లు ఆగిపోయాయని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బీసెంట్ ప్రకటించారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు చేరుకున్న బీసెంట్ అక్కడ ఫాక్స్ బిజినెస్ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘‘ ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలయ్యాకే రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇటీవల మేం పాతికశాతం అదనపు టారిఫ్ విధిండంతో తాజాగా ఆ కొనుగోళ్లు ఆగిపోయాయి. ఇంకా చమురు కొని ఇతర దేశాలకు తిరిగి విక్రయిస్తున్న దేశాలపై 500 శాతం టారిఫ్ వేయాలనే బిల్లును సెనేటర్ లిండ్సే గ్రాహమ్ సెనేట్లో ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో వేచిచూడాలి. రష్యా చమురును యూరప్ దేశాలు కొంటే రష్యాకు ఆర్థిక లాభాల పంట పండిస్తున్నాయి. ఇలా పరోక్షంగా యూరప్ దేశాలు తమపైనే రష్యా యుద్ధానికి ఆర్థికసాయం చేస్తున్నాయి’’ అని బీసెంట్ అన్నారు. -
ట్రంప్ పన్నులపై భగ్గుమన్న నాటోదేశాలు
గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలపై ట్రంప్ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై తాజాగా ఈయూ ఫారెన్ పాలసీ చీఫ్ ఖాజా కల్లాస్ స్పందించారు. మిత్ర దేశాల మధ్య వైరం వల్ల పరోక్షంగా రష్యా-చైనాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని తెలిపారు.డెన్మార్క్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఎనిమిది దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 10 శాతం పన్నులు విధించారు. అయితే ఈ అధిక పన్నులను ఆ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దీనిపై మాట్లాడుతూ ట్రంప్ బెదిరింపులు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ అంశంపై ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ ఖాజా కల్లాస్ ఎక్స్లో స్పందించారు. ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ "మిత్రులమధ్య వైరం వల్ల చైనా, రష్యాలు లబ్ధిపొందే అవకాశం ఉంది. గ్రీన్లాండ్ భద్రత ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. దానిని నాటోలో అంతర్గతంగా చర్చించుకోవాలి. ఈ అధిక పన్నుల వల్ల యూరప్ దేశాలతో పాటు అమెరికా పేదదేశంగా మారే అవకాశం ఉంది". అని ఆమె అన్నారు. అదేవిధంగా ఈ అంశం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో సహయాన్ని పక్కదారి పట్టించేదిగా ఉండకూడదన్నారు.అయితే గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఎనిమిది దేశాలు, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలపై ట్రంప్ 10 శాతం పన్నులు విధించారు. ఫిబ్రవరి 10 నుంచి అది అమలులోకి వస్తుందని తెలిపారు. దీనిపై ఆ దేశాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. -
అమెరికాలో భారతీయుడికి జైలు శిక్ష
అమెరికా నుంచి రష్యాకు నిషేధిత విమానయాన పరికరాలను అక్రమంగా ఎగుమతి చేయడానికి కుట్ర పన్నినందుకు సంజయ్ కౌశిక్ అనే 58 ఏళ్ల భారత జాతీయుడికి రెండున్నరేళ్ల జైలు శిక్ష పడింది. ఈ వారం ప్రారంభంలో ఈ తీర్పు వెలువడగా, సంజయ్ కౌశిక్ చర్యలు “ఉద్దేశపూర్వకం, దురాశతో కూడివని ఒరెగాన్ యు.ఎస్. అటార్నీ స్కాట్ బ్రాడ్ఫోర్డ్ పేర్కొన్నారు.ఢిల్లీకి చెందిన కౌశిక్ 2023 సెప్టెంబర్లో ఇతరులతో కలిసి రష్యన్ సంస్థల కోసం అమెరికా నుండి ఏరోస్పేస్ వస్తువులు, సాంకేతికతను చట్టవిరుద్ధంగా పొందడానికి కుట్ర పన్నాడు. కౌశిక్, అతని సహచరులు ఒరెగాన్లోని సరఫరాదారు నుండి విమానాల కోసం నావిగేషన్, ఫ్లైట్ కంట్రోల్ డేటా అందించే పరికరం ‘యాటిట్యూడ్ అండ్ హెడింగ్ రిఫరెన్స్ సిస్టమ్’(AHRS)కొనుగోలు చేశారు.వాణిజ్య శాఖ అనుమతి లేకుండా ఇటువంటి పరికరాలను రష్యా వంటి కొన్ని దేశాలకు ఎగుమతి చేయడం చట్టవిరుద్ధం. లైసెన్స్ పొందేందుకు, కౌశిక్ తన భారతీయ కంపెనీ తుది కొనుగోలుదారు అని, పరికరాన్ని పౌర హెలికాప్టర్లలో ఉపయోగిస్తారని తప్పుడు వాదనలు చేశారు.కౌశిక్, అతని సహచరులు ఏహెచ్ఆర్ఎస్ పరికరాన్ని కొనుగోలు చేసిన తర్వాత, దాన్ని ఎగుమతి చేయకముందే అధికారులు పట్టుకున్నారు. 2024 అక్టోబర్లో మయామిలో కౌశిక్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుండి కస్టడీలో ఉన్నారు. -
అందుకేనా నాటోకు దూరం.. రష్యాతో వైరం..?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో లేనిరోజు లేదు. ఇందులో దాదాపు అన్ని వివాదాలే. ఏదొక దేశాన్ని గిల్లడం, లేకపోతే కవ్వించడం, హెచ్చరించడం, ఇవే ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత కనిపిస్తున్న పరిణామాలు. ఇటీవల కాలంలో ట్రంప్ దూకుడు మరింత ఎక్కువైంది. వెనెజువెలా అధ్యక్షుడిని బంధించడం, అటు తర్వాత ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అని ప్రకటించుకోవడం.. డెన్మార్క్ దేశంలో ఉన్న గ్రీన్లాండ్ను ఏదో రకంగా స్వాధీనం చేసుకోవాలనే పన్నాగం, క్యూబాకు వార్నింగ్.. ఇరాన్పై కాలుదువ్వడం వంటి జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నింటి కంటే కూడా నాటోను దాదాపు దూరం పెట్టడం.. రష్యాను రెచ్చగొట్టడం అయితే ట్రంప్ పోకడలకు మరో మెట్ట అని చెప్పాలి. రష్యాకు చెందిన రెండు ఓడలను ట్రంప్ సీజ్ చేయడం చూస్తే మాత్రం యుద్ధానికి కాలుదువ్వడం గానే కన్పించింది. ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు ఆపానని చెప్పుకునే ట్రంప్.. ఇప్పుడు పలు దేశాలతో కయ్యానికి సై అంటున్నాడు. అందులో సైనిక పరంగా బలంగా ఉన్న రష్యా, ఇరాన్ల విషయంలో కూడా ట్రంప్ వ్యవహరిస్తున్న శైలి అయోమయంలో పడేస్తుంది. రష్యాను టెస్టు చేస్తున్నాడా?రష్యా ఆర్థిక శక్తి తగ్గిందనే గణాంకాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు దానిపై దృష్టి పెట్టాడు. అసలు రష్యా పవర్ ఎంత ఉంది అనే దానిని టెస్ట్ చేయడం కోసం ట్రంప్ సన్నాయి నొక్కులు ప్రారంభించాడు. అయితే సైనిక పరంగా చూస్తే రష్యా ఇప్పటికే టాప్-2లో ఉంది. అసాధారణ సైనిక శక్తి కల్గిన దేశాల్లో రష్యాది రెండో స్థానం. 3,570,000 మంది మిలటరీ సిబ్బంది, 5, 750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కల్గి ఉంది రష్యా. అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల రష్యా ఆయిల్ షిప్లను సీజ్ చేసి.. ఆ దేశాన్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నాడు ట్రంప్. రష్యా.. తమతో పోరుకు ఎంతవరకూ వస్తుందని టెస్ట్ చేస్తన్నట్లే ఉంది ట్రంప్ వైఖరి. మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ట్రంప్ చర్యలని గమనిస్తూనే ఉన్నాడు. పరిస్థితి శ్రుతి మించితే మాత్రం రష్యా వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. తన సహనాన్ని ట్రంప్ పరిక్షీస్తున్నారనే విషయం పుతిన్ ఈపాటికే అర్థం చేసుకునే ఉంటారు. ఒకవేళ అమెరికా ఏమైనా సైనిక చర్యలకు పాల్పడితే మాత్రం దాన్నితిప్పి కొట్టే సామర్థ్యం రష్యాకు ఉంది.. కానీ ఆ దేశ ఆర్థిక పరిస్థితే ఇప్పుడు పుతిన్ను కలవర పెడుతోంది. తమ దేశానికి చెందిన రెండు చమురు షిప్లను అమెరికా సీజ్ చేసినా.. పుతిన్ నియంత్రణ కోల్పోకుండా ఆచితూచి అడుగులు వేయడానికి కారణం ఆ దేశ ఆర్థిక పరిస్థితి. బలహీన పడ్డ రష్యా ఆర్థిక వ్యవస్థ2022లో ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమయ్యాక.. సైన్యంలో నియామకాలు, ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ వంటి కిరాయి సేనల కోసం డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. ఒక సంవత్సరం వరకు పరిస్థితులను నియంత్రించుకుంటూ.. ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందనిపించినా.. 2023 నుంచి నియంత్రణ కోల్పోయి.. 2024 వచ్చే సరికి అది కాస్తా ముదిరి పాకాన పడింది. చమురు ఎగుమతులపై ఆశలు పెట్టుకున్నా.. ధరలు పడిపోయాయి. అమెరికా ఆంక్షలతో పలు దేశాలు రష్యా చమురు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నాయి. ఇలా రష్యా ఇరకాటంలో పడింది.వాహనాలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు.. చివరకు వోడ్కాపైనా పన్నులను పెంచుతూ పరిస్థితిని నియంత్రించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి. భారత్పై ఆంక్షలు కూడా అందుకేనా?రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి దేశాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. అత్యధిక చమురును భారత్.. రష్యా నుంచే కొనుగోలు చేస్తూ వస్తుంది. కానీ ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలును కాస్త తగ్గించింది. ఇలా రష్యా చమురును కొనుగోలు చేయకుండా పలు దేశాలపై ఆంక్షలు విధిస్తే ట్రంప్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రష్యాను ఆర్థికంగా మరింత ఇరకాటంలో పడేయాలనేది ట్రంప్ చర్యలను బట్టి తెలుస్తోంది, నాటో దేశాలు అంత బలంగా లేవా?ఇటీవల నాటోపై తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్. ప్రధానంగా నాటో రక్షణ వ్యయానికి సంబంధించి ఖర్చును అమెరికానే భరించాల్సి వస్తుందని, తమకు ఇక పని లేదని తేల్చిచెప్పేశాడు. అంటే నాటోలో బలమైన దేశాలు లేవనేది ట్రంప్ ఉద్దేశం. నాటోతో ఉన్నా లేకపోయినా తమకు ఏమీ ప్రయోజనం లేదనే భావనకు వచ్చేశాడు ట్రంప్..దాంతో నాటోకు టాటా-బైబై చెప్పేశాడు. నాటోలో యూరప్ దేశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే రష్యా చర్యలను ఎక్కువగా వ్యతిరేకించింది నాటో. ఇప్పుడు నాటోక అమెరికా దూరం అయిపోతే.. మరి వారి పరిస్థితి ఏమిటి.? చెప్పుకోవడానికే 32 దేశాలు.. అందులో 30 యూరప్ దేశాలు.. మిగతా రెండు అమెరికా, కెనడా. ఇప్పుడు అమెరికా దూరం జరగడంతో ఆ సంఖ్య 31కు వచ్చింది. నాటో ఉన్న యూరప్ దేశాలన్ని ఆర్థికంగా సైనిక పరంగా అంతగా బలంగా లేవనే విషయం ట్రంప్ కటీఫ్తోనే అర్థమైంది. ట్రంప్ వ్యూహంలో భాగమా..?అమెరికా అండ లేకపోవడంతో రష్యా ఏదొక సమయంలో నాటోపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఉక్రెయిన్తో యుద్ధాన్ని నాటో దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రష్యాతో యుద్ధం నేపథ్యంలోనే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి కారణమైంది. ఇవన్నీ కూడా పుతిన్కు ఆగ్రహం తెప్పించాయి. తనకు నాటో అడ్డుపడింది అనే భావనలో ఉన్నాడు ట్రంప్. ఈ పరిణామాలతో రష్యా-నాటో దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అత్యంత స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ట్రంప్.. ముందుగా నాటో దేశాలు-రష్యా కొట్టుకుంటే చూద్దామనే ప్లాన్లో భాగంగానే నాటోకి బైబై చెప్పడం, రష్యాను గిల్లడం చేస్తున్నాడని నిపుణులు అంటున్నారు. తన చర్యలతో ముందు నాటో-రష్యాలను అంచనావేసే ముందస్తు వ్యూహంలో భాగంగానే ట్రంప్ ఇలా చేశారనేది విశ్లేషకులు అభిప్రాయంగా ఉంది. -
పుతిన్ ఎఫెక్ట్? భారత్కు మరో దేశాధినేత
ఢిల్లీ: ప్రస్తుతం రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. గతేడాది ఆదేశ అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పరస్పరం పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం రానున్నట్లు ఆ దేశ రాయబారి తెలిపారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలో భారత్లో పర్యటించనున్నట్లు భారత్లోని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్చుక్ అధికారికంగా ప్రకటించారు. గుజరాత్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పోలిష్చుక్ ఈ వివరాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలను మరింత బలోపేతం చేయడానికే జెలెన్స్కీ భారత్లో పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. పర్యాటకం, మెడిసిన్, ఇండస్ట్రీయల్ వస్తువులు, పోర్టులు తదితర రంగాలలో పరస్పర సహాకారం ఉండనున్నట్లు తెలిపారు.2024లో మోదీ ఉక్రెయిన్లో పర్యటించినప్పుడు జెలెన్స్కీ ఇండియా వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు పోలిష్చుక్ తెలిపారు. జెలెన్స్కీ పర్యటన ఆ రోజే ఖరారైందన్నారు. ఉక్రెయిన్ కష్టాల్లో ఉన్న సమయంలో ఆ దేశంలో పర్యటించిన అతి కొద్దిమంది ప్రపంచ నాయకులలో మోదీ ఒకరని భారత ప్రధానిని కొనియాడారు. తమ దేశంలో శాంతి నెలకొనాలని గుజరాత్లోని ద్వారకా మందిరంలో పూజలు చేసినట్లు పోలిష్చుక్ తెలిపారు.అయితే ఇంతకాలం భారత్ను పన్నులతో ఇబ్బందులు పెడదామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో ఇటీవలే ఆ దేశ రాయబారి భారత్ను ప్రశంసిస్తూ మాట్లాడారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్లో పర్యటిస్తారని తెలిపారు. ఒకరోజైనా గడవకముందు ఉక్రెయిన్ సైతం అదే విధంగా మాట్లాడింది. ఈ పర్యటనల వెనక ఏమైనా అంతర్యముందా అని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. -
మరో టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్
ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఆ దేశంతో వ్యాపారాలు చేసే దేశాలన్నింటిపైనా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని.. ఇదే తుది నిర్ణయమని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటించారు.ట్రేడింగ్ ఎకనమిక్ డాటా బేస్ ప్రకారం.. చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్లు ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. పొరుగున ఉండడంతో పాటు చమురు నేపథ్యంలో ఇవి భారీగా వాణిజ్యం చేస్తున్నాయి. అలాగే.. భారత్, రష్యా, ఈయూలు కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకే సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.ఇక భారత్ కూడా ఇరాన్కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామే. 2025లో ఇరాన్ ఎగుమతుల్లో సుమారు 7% (5.1 బిలియన్ డాలర్లు) భారతదేశానికి వచ్చాయి. దీంతో భారత్ కూడా మూల్యం చెల్లించుకోవాలసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారత్పై 50 శాతం సుంకాలు అమలవుతున్న సంగతి తెలిసిందే.ఇరాన్పై ఇప్పటికే.. అణ్వాయుధాల నేపథ్యంతో ఇరాన్ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతులను పరిమితం చేయడం, ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ సహా ఇతర ప్రధాన బ్యాంకులపై ఆంక్షలు విధించడం.. తద్వారా అంతర్జాతీయ లావాదేవీలకు అవాంతరాలను కల్పించడం.. అలాగే.. ఇరాన్ షిప్పింగ్ కంపెనీలు, పోర్టులు, ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలను అమలు చేస్తోంది. అలాగే.. ఇరాన్ మిలిటరీ, డ్రోన్, మిసైల్ ప్రోగ్రామ్లకు సంబంధించిన సంస్థలపై నిషేధాలు విధించింది. ఇరాన్ ప్రభుత్వ అధికారులు, రెవల్యూషనరీ గార్డ్ (IRGC) సభ్యులు, ఆ దేశం తరఫున మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యులైన వ్యక్తులకు సంబంధించి అమెరికాలో ఉన్న ఆస్తులను ఫ్రీజ్ చేయడం, వాళ్లు అగ్రరాజ్యానికి రాకుండా నిషేధం విధించడం లాంటి నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పుడు ఆర్థికంగా మరింత దెబ్బ తీయడానికే.. వాణిజ్య దేశాలపై సుంకాలను విధించినట్లు స్పష్టమవుతోంది.చల్లారని జ్వాలలుఆర్థిక సంక్షోభం, ఇతరత్రా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమైన సంగతి తెలిసిందే. అయితే వాటిని అణచివేసేందుకు కూడా అక్కడి ప్రభుత్వం అంతే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో.. వందల మంది మరణించగా(646 మంది అని తాజా సమాచారం).. వేల మందిని అక్రమంగా అరెస్టులు చేశారు. ఉరి తీతలకు కూడా సిద్ధమైంది. అయితే ఈ అణచివేతను చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ అంటున్నారు.చర్చలంటూనే..ఇరాన్పై సైనిక చర్య చేపట్టేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే పబ్లిక్గా ట్రంప్ కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ.. వ్యక్తిగతంగా ఇరాన్ను వేరే రీతిలో డీల్ చేస్తన్నారని వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెబుతున్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ జరిపే అంశం కూడా అమెరికా పరిశీలనలో ఉంది. కానీ, అదే సమయంలో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ద్వారా దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని అన్నారామె. ఈ తరుణంలో ట్రంప్ ఒక్కసారిగా టారిఫ్ బాంబ్ పేల్చడం గమనార్హం. -
మేము దాడి చేయకుంటే వాళ్లు చేస్తారు: ట్రంప్
గత కొంతకాలంగా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటానంటూ డెన్మార్క్ను రెచ్చగొడుతున్న ట్రంప్ తాజాగా ఆ అంశంపై మరోసారి మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవాల్సిందేనన్నారు లేకుంటే చైనా, రష్యాలు ఆ పని చేస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.వెనిజువెలా అధ్యక్షున్ని బంధించి ఆ దేశ పాలనను హస్తగతం చేసుకున్న ట్రంప్ తన తదుపరి టార్గెట్ గ్రీన్లాండ్ అని ప్రకటించారు. అరుదైన ఖనిజాలు, చమురు, సహజవాయువులు పుష్కలంగా ఉండడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆ ద్వీపంపై అమెరికా అధ్యక్షుడి కన్ను పడింది. దీంతో ఎలాగైనా ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేస్తామని దాని రక్షణ బాధ్యత తమపై ఉందని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే దీనిపై గ్రీన్లాండ్ ప్రజలు నిరాసక్తి చూపిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో అమెరికాలో కలిసేది లేదని తాము స్వతంత్రంగా ఉండదలుచుకుంటున్నామని తమ దేశ పార్లమెంటులో తీర్మానం సైతం చేశారు.అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోవడం లేదు తాజాగా గ్రీన్లాండ్ వ్యవహారంపై మరోసారి స్పందించారు. "గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. లేకపోతే చైనా, రష్యా దాన్ని స్వాధీన పరచుకుంటాయి. ఎట్టిపరిస్థితుల్లో అది నేను జరగనివ్వను". అని ట్రంప్ అన్నారు. గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్తో ఒప్పందం చేసుకుంటాం. లేదా ఎలాగైనా స్వాధీనం చేసుకుంటాం అని పేర్కొన్నారు.రష్యా, చైనా దేశాల సైనిక బలం ఏమిటో మీకు తెలుసు వారికి ప్రతిచోట సబ్మెరైన్లు, డిస్ట్రాయర్లు ఉన్నాయి. వారి సైనిక శక్తిని మీరు తట్టుకోలేరు అని డెన్మార్క్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే గ్రీన్లాండ్పై ట్రంప్ వ్యాఖ్యలనను డెన్మార్క్ ప్రధాని ఖండించారు. ఒకవేళ గ్రీన్లాండ్పై అమెరికా దాడి చేస్తే అది 80 సంవత్సరాల ట్రాన్స్ అట్లాంటిక్ ఒప్పందానికి భంగం కలిగించడమేనన్నారు. -
గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాల్సిందే
వాషింగ్టన్: అరుదైన ఖనిజాలు, చమురు, సహజ వాయువు నిల్వలతో కూడిన గ్రీన్లాండ్ను సాధ్యమైనంత త్వరగా అమెరికాలో విలీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు. గ్రీన్లాండ్ను రష్యా, చైనాలు ఆక్రమించుకోక ముందే సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికన్లకు ఆయన తేల్చిచెప్పారు. ట్రంప్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గ్రీన్లాండ్ విషయంలో తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. వీలైతే సులభమైన మార్గంలో.. లేకపోతే కఠినమైన మార్గంలో ఆ ప్రాంతాన్ని అమెరికాలో కలిపేయక తప్పదని ఉద్ఘాటించారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాము అనుకున్నది చేసి తీరుతామన్నారు. త్వరలో ఏదో ఒకటి చేయక తప్పదని వెల్లడించారు. గ్రీన్లాండ్ రక్షణ బాధ్యత తమపై ఉందన్నారు. లీజుకు తీసుకున్న ప్రాంతంపై యాజమాన్య హక్కుందని ఎలా అంటారని డెన్మార్క్పై అసహనం వ్యక్తంచేశారు. లీజు ఒప్పందాలతో ఎలాంటి ఉపయోగం ఉండదని, చట్టబద్ధంగా యాజమాన్య హక్కులు ఉండాలని వ్యాఖ్యానించారు. విలీనాన్ని ఎవరూ ఆపలేరు చైనా ప్రజలను, రష్యా ప్రజలను తాను చాలా అభిమానిస్తానని.. కానీ, వారు గ్రీన్లాండ్లో అమెరికాకు పొరుగువారిగా ఉండిపోవడం తమకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. అలా జరగనివ్వబోనని పేర్కొన్నారు. ఈ విషయం అర్థం చేసుకోవాలని నాటోకు సూచించారు. మొత్తానికి గ్రీన్లాండ్ అనేది అమెరికాలో అంతర్భాగం కావడం తథ్యమని, అలా జరగడం ఎవరూ ఆపలేరని ట్రంప్ పరోక్షంగా స్పష్టంచేశారు. అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ అత్యంత కీలకమని ట్రంప్ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ రష్యా, చైనా నౌకలు పాగా వేస్తున్నాయని, అది తమ భద్రతకు విఘాతం కలిగిస్తోందని అంటున్నారు. గ్రీన్లాండ్ వాయవ్య భాగంలో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది ఏర్పాటయ్యింది. ప్రస్తుతం అక్కడ 100 మందికిపైగా అమెరికా జవాన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మకానికి లేదు గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్లో భాగంగా కొనసాగుతోంది. పాక్షికంగా స్వయం ప్రతిపత్తి హోదాను అనుభవిస్తోంది. ఇక్కడి ప్రజలకు డెన్మార్క్ పౌరసత్వం ఉంది. డెన్మార్క్ నుంచి ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు. గ్రీన్లాండ్ను డబ్బుతో కొనాలన్న ఆలోచన ఉన్నట్లు అమెరికా శ్వేతసౌధం అధికారులు ఇటీవలే ప్రకటించారు. ఆ ప్రయత్నం విఫలమైతే బలప్రయోగం తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. సైన్యాన్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని వెల్లడించారు. అమెరికా దురాక్రమణ ప్రయత్నాల పట్ల డెన్మార్క్, గ్రీన్లాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, డబ్బుతో కొనేయాలన్న ఆలోచన ఉంటే మానుకోవాలని డెన్మార్క్ నేతలు తేల్చిచెప్పారు. ఒకవేళ అమెరికా గనుక సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘నాటో’అంతమవుతుందని అన్నారు. పార్లమెంట్లో తీర్మానం అమెరికాలో తాము అంతర్భాగంగా మారే ప్రసక్తే లేదంటూ గ్రీన్లాండ్ పార్లమెంట్లో శుక్రవారం తీర్మానం చేశారు. పార్లమెంట్లోని అన్ని పారీ్టలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నాయి. గ్రీన్లాండ్ ఎప్పటికీ గ్రీన్లాండర్స్దే గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్తోపాటు అధికార, ప్రతిపక్ష నాయకులు శుక్రవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అమెరికా పౌరులుగా లేదా డెన్మార్క్ పౌరులుగా మారాలన్న కోరిక తమకు లేదని తేల్చిచెప్పారు. తమ దేశాన్ని స్వాహా చేయాలన్న ప్రయత్నాన్ని పక్కనపెట్టాలని అమెరికాను కోరారు. ఎప్పటికీ గ్రీన్లాండ్ పౌరులుగానే ఉంటామని, అందులో మరో మాటకు తావులేదని వెల్లడించారు. విలీనం వెనుక ఎన్నో సవాళ్లు బల ప్రయోగంతో గ్రీన్లాండ్ను విలీనం చేసుకోవాలన్న ఆరాటం ట్రంప్లో ఉన్నప్పటికీ అది అనుకున్నంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెబుతున్నారు. సైనిక చర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించే అవకాశం ఉంది. అమెరికాతో సంబంధాల విషయంలో విదేశాలు పునరాలోచించుకోవచ్చు. మొదట ‘నాటో’కూటమిలో సంక్షోభం తలెత్తుతుంది. కూటమి విచి్ఛన్నమైనా ఆశ్చర్యం లేదు. కొన్ని దేశాలు గ్రీన్లాండ్ రక్షణ కోసం ముందుకు రావొచ్చు. గ్రీన్లాండ్ సమీపంలో ఇప్పటికే రష్యా, చైనాల జలాంతర్గాములు, నౌకలు ఉన్నాయి. ఉమ్మడిగా సైనిక విన్యాసాలు కూడా నిర్వహిస్తున్నాయి. గ్రీన్లాండ్కు మద్దతుగా ఆ రెండు దేశాలు అమెరికాతో తలపడే అవకాశాలు లేకపోలేదు. అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం వినాశనానికి దారితీయవచ్చు. మొదట కాల్పులు, తర్వాతే మాటలు గ్రీన్లాండ్పై ఎవరైనా దండయాత్ర చేస్తే కచి్చతంగా తిప్పికొడతామని డెన్మార్క్ హెచ్చరించారు. దురాక్రమణదారులపై తొలుత కాల్పులు జరుపుతామని, ఆ తర్వాతే చర్చిస్తామని పేర్కొంది. ఈ మేరకు డెన్మార్క్ ప్రభుత్వం తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా దూకుడుగా ముందుకెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, అమెరికాను ఢీకొట్టగల శక్తి డెన్మార్క్కు లేదు. వెనెజువెలా తరహా సైనిక ఆపరేషన్ను తట్టుకొనే బలం కూడా లేదు. అమెరికా భూభాగంలో డెన్మార్క్ పరిమాణం 0.44 శాతమే. సైనిక శక్తి అంతంతమాత్రమే. సైనిక సిబ్బంది వేల సంఖ్యలోనే ఉన్నారు. కానీ, నాటో సభ్యదేశాలపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. -
స్వీపర్గా నెలకు రూ.లక్ష : ఇండియన్ టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీ
ఇండియాలో ఐటీ ఉద్యోగులకు కష్టాలు. రష్యాలో కార్మికులకు కొరత. ముఖ్యంగామునిసిపల్ మరియు ప్రజా నిర్వహణ సేవల రంగంలో రష్యా తీవ్ర కార్మిక కొరతను ఎదుర్కొంటోంది. అందుకే భారతదేశానికి చెందిన కొంతమంది పొట్టచేత పట్టుకొని అక్కడికి వాలిపోయారు. ఏం చేశామన్నది కాదు ముఖ్యం, గౌరవంగా ఎలా బతుకున్నామనేదే ముఖ్యం అని చాటి చెప్పారు. వీరిలో రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులుతోపాటుఒక టెకీ కూడా ఉండటం విశేషం. వీరంతా రష్యాలో వీధులను శుభ్రం చేసే ఉద్యోగంలో చేరారు. నెలకు జీతం ఎంతో తెలుసా?రష్యన్ మీడియా సంస్థ ఫోంటాంకా ప్రకారం భారతదేశానికి చెందిన 26 ఏళ్ల ముఖేష్ మండల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వృత్తిరీత్యా నిపుణుడే. కానీ ఇక్కడ ఉద్యోగం లేదు. అందుకే సెయింట్ పీటర్స్బర్గ్లో వీధులను శుభ్రం చేసే పని కోసం కొన్ని నెలల క్రితం రష్యాకు వెళ్లిన 17 మంది భారతీయుల బృందంలో అతనూ ఒకడిగా మారిపోయాడు. ఇలా వెళ్లిన వారి వయస్సు 19 నుండి 43 సంవత్సరాల మధ్య .గత కొన్ని వారాలుగా, ముఖేష్ మండల్, ఇతర భారతీయ కార్మికులు నగరంలో పారిశుధ్య పనులకు బాధ్యత వహించే కొలోమ్యాజ్స్కోయ్అనే రహదారి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నగర రహదారులను శుభ్రం చేస్తున్నారు. వీరికి ఆహారం, దుస్తులు వసతి, రవాణాను ఖర్చులు భరిస్తుంది. ప్రతీ కార్మికుడికి నెలకు సుమారు 100,000 రూబుళ్లు సుమారుగా రూ. 1.1 లక్షల వేతనం. ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్వీరంతా భారతదేశంలో విభిన్న వృత్తిపరమైన నేపథ్యాల నుండి వచ్చారు. కొందరు రైతులు కాగా, మరికొందరు తమ సొంత చిన్న వ్యాపారాలను నడిపినవారు. ఈ బృందంలో మాజీ వెడ్డింగ్ ప్లానర్లు, డ్రైవర్లు , ఆర్కిటెక్ట్లు కూడా ఉన్నట్లు సమాచారం. తన ప్రస్తుత పాత్ర గురించి ఫోంటాంకాతో మాట్లాడుతూ, మండల్ తనకు టెక్నాలజీ రంగంలో పనిచేసిన అనుభవం ఉందని ముఖేష్ చెప్పాడు.మండల్ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేశారా లేదా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలను ఉపయోగించే సంస్థలలో పనిచేశాడా చేస్తే ఎంతకాలం పనిచేశాడు అనేదానిపై క్లారిటీ లేదు. స్థానిక మీడియాతో తన నిర్ణయం దీర్ఘకాలిక కెరీర్ ప్లాన్స్కంటే ఆర్థిక అవసరాల వల్లే తీసుకున్నానని మండల్ వెల్లడించారు వీధులను శుభ్రపరిచే పనిని చేపట్టడం గురించి అడిగినప్పుడు, “నేను భారతీయుడిని, ఒక భారతీయుడికి ఉద్యోగం ముఖ్యం కాదు. పనే దైవం. మీరు ఎక్కడైనా పని చేయవచ్చు, మరుగుదొడ్డిలో, వీధిలో, ఎక్కడైనా. ఇది నా ఉద్యోగం, నా కర్తవ్యం ,బాధ్యత, దీనిని సాధ్యమైనంత గొప్పగా చేయడమే’’ అని చెప్పాడు. అంతేకాదు తనకు తా రష్యాలో శాశ్వతంగా స్థిరపడాలనే ఉద్దేశ్యం లేదని కూడా చెప్పాడు. ఏడాది కాలం రష్యాలో ఉండి, కొంత డబ్బు సంపాదించి, ఆపై స్వదేశానికి తిరిగి వెడతాను అని వివరించారు. ఇదీ చదవండి: 498 ఏ, పొరిగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా? టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి -
"దొంగా.. మా నౌకలనే ఆపుతావా.." అమెరికాపై రష్యా ఆగ్రహం
-
సీఐఏ డబుల్ ఏజెంట్ జీవితం...అలా జైల్లోనే తెల్లారిపోయింది!
వాషింగ్టన్: అతనో గూఢచారి. పని చేసింది అలాంటిలాంటి సంస్థలో కాదు. అగ్ర రాజ్యం అమెరికా అత్యంత గర్వంగా చెప్పుకునే నిఘా సంస్థ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)లో. అంతటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేస్తూ సొంత దేశపు రహస్యాలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రత్యర్థి దేశం రష్యాకు చేరవే స్తూ వచ్చాడు. కర్మ కాలి ఓ దుర్దినాన దొరికి పోయాడు. సాక్ష్యాలన్నీ స్పష్టంగా ఉండటంతో విచారణ కూడా అవసరం లేదంటూ నేరాలన్నీ తనే ఒప్పేసుకున్నాడు. అతని పేరు ఆల్డ్రిచ్ ఏమ్స్. అలా 1994 నుంచీ ఆజన్మ ఖైదు అనుభవిస్తున్న ఆ సీఐఏ డబుల్ ఏజెంట్ 84 ఏళ్ల వయసులో మేరీలాండ్ జైల్లో ఇటీ వలే కన్నుమూశాడు. బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ సోమవారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.ఖతర్నాక్ ఖిలాడీఆల్డ్రిచ్ సీఐఏలో చిన్నాచితకా ఏజెంటు కాదు. ఏకంగా 31 ఏళ్లపాటు సంస్థలో ‘నమ్మకంగా’పని చేశాడు. ఏళ్ల తరబడి ఇటలీ తదితర దేశాల్లో సీఐఏ నిఘా కార్యకలాపాల్లో కీలకంగా కూడా వ్యవహ రించాడు. అలాంటివాడు తీవ్రంగా అప్పులపాలై, ఆ ఊబి నుంచి బయటపడేందుకు కిందా మీదా అవుతున్న రోజుల్లో, అంటే 1985లో సోవియట్ యూనియన్ గూఢచార సంస్థ కేజీబీ అతన్ని అప్రోచ్ అయింది. ఎందుకంటే అప్పుడతను పని చేస్తున్నది వర్జీనియాలోని సీఐఏ ప్రధాన కార్యాలయంలో సోవియట్/తూర్పు యూరప్ విభాగంలోనే! డబ్బుల కోసం మనవాడు వెంటనే అమ్ముడుపోయాడు. అవి ప్రచ్ఛన్న యుద్ధం రోజులు కావడంతో నిఘా సమాచారానికి అత్యంత ప్రధాన్యత ఉండేది. దాంతో ఆల్డ్రిచ్కు సోవియట్ ఏకంగా 25 లక్షల డాలర్లు ముట్టజెప్పిందట. అలా స్వదేశం అమెరికాకు అతను చేసిన నష్టం అంతా ఇంతా కాదు. అతనిచ్చిన సమాచారంతో రష్యా తమ దేశంలోని సీఐఏ ఏజెంట్లను చాలావరకు ఏరిపారేసింది. అంతేగాక సీఐఏ దశాబ్దాల తరబడి కష్టించి మరీ తమ దేశంలో ఏర్పాటు చేసుకున్న సమాచార తదితర వ్యవస్థలను కూడా చాలావరకు తుంచేయగలిగింది. ఇదంతా ఎలా జరుగుతోందో అర్థం కాక విస్తుపోవడం అమెరికా వంతుగా మారింది. అంతేకాదు, సీఏఐకు సమాచారం చేరవేస్తున్న 10 మంది రష్యా డబుల్ ఏజెంట్ల గురించి కూడా ఉప్పందించి వారి మరణాలకు కారకుడయ్యాడు ఆల్డ్రిచ్. అంతేగాక రష్యాకు వ్యతిరేకంగా అమెరికా తలపెట్టిన మరెన్నో ఉపగ్రహ నిఘా ఆపరేషన్లు తదితరాల గురించి కూడా ఎప్పటికప్పుడు సమాచారమిచ్చేవాడు. 1985 నుంచి 1994లో పట్టుబడేదాకా, అంటే ఏకంగా తొమ్మిదేళ్లపాటు మనవాడి వ్యవహారం నిర్నిరోధంగా సాగిపోయింది. ఇంతా చేసి, తనవల్ల అమెరికాకు పెద్దగా నష్టమంటూ ఏమీ జరగలేదంటూ వాషింగ్టన్ పోస్ట్కు ఆల్డ్రిచ్ ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం రేపింది. సొంత దేశంపై అతడి నిఘా కార్యకలాపాలకు సహకరించిన భార్య రొసారియో కూడా కటకటాలపాలైంది. -
అమెరికా, రష్యా నడుమ.. చమురు మంటలు!
వాషింగ్టన్: ఉరుముల్లేని పిడుగులా అమెరికా, రష్యా మధ్య ఉన్నట్టుండి నిప్పు రాజుకుంది. చమురే ఇందుకు నిమిత్తంగా మారడం విశేషం. వెనెజువెలాకు చెందినవిగా భావిస్తున్న రెండు నిషేధిత చమురు నౌకలను అమెరికా బుధవారం దిగ్బంధించింది. వీటిలో ఒకదానిని ఉత్తర అట్లాంటిక్, మరోదాన్ని కరీబియన్ సముద్ర జలాల్లో పట్టుకున్నట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. అయితే అవి తమవేనని రష్యా పేర్కొనడం సంచలనం రేపింది. తొలుత వాటిలో ఒక ట్యాంకరే తమదని రష్యా చెప్పినట్టు వార్తలొచ్చినా, రెండూ తమవేనని కాసేపటికే రష్యా పేర్కొంది. ‘‘అమెరికా ఓ సముద్రపు దొంగ. నిబంధనలను ఉల్లంఘిస్తూ మా నౌకలను దిగ్బంధించింది’’ అంటూ మండిపడింది. అంతేగాక వాటి రక్షణ నిమిత్తం రష్యా హుటాహుటిన జలాంతర్గాములను తరలిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇది ఎటు తిరిగి చివరికి ఎలా పరిణమిస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా పట్టుకున్న రెండు నౌకల్లో ఒకటి బెల్లా1, రెండోది సోఫియా. బెల్లా1ను అమెరికా నిషేధాంక్షలను ఉల్లంఘించి తిరుగుతోందనే అభియోగాలపై నెల రోజులుగా అమెరికా నావికా దళం వెంటాడుతూ వస్తోంది. దాన్ని ఎట్టకేలకు ఉత్తర అట్లాంటిక్ జలాల్లో అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. అందుకు బ్రిటన్ నావికా దళం సాయపడటం గమనార్హం. గగనతల నిఘా సాయం అందించడమే గాక బెల్లా1ను పట్టుకునేందుకు తమ యుద్ధ నౌకను బ్రిటన్ పంపింది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ ధ్రువీకరించారు. దానిని ఒక ‘ధూర్త నౌక’గా ఆయన అభివరి్ణంచారు. సోఫియాను కరీబియన్ జలాల్లో పట్టుకున్నట్టు హోంలాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు. ఈ రెండు చమురు నౌకలూ చివరిసారిగా వెనెజువెలాలోనే లంగరు వేశాయని చెప్పుకొచ్చారు. అవి ఆ దేశానికి చెందినవి కాకుండాపోయే ఆస్కారమే లేదన్నారు. హెజ్బొల్లా ఉగ్రముఠాకు చెందిన సరుకును రవాణా చేస్తోందంటూ బెల్లా1పై 2024లోనే అమెరికా నిషేధాంక్షలు విధించింది. ‘‘గత డిసెంబర్లోనే కరేబియన్ దీవుల్లో దాన్ని నిలువరించేందుకు అమెరికా తీరరక్షక దళం ప్రయతి్నంచింది. కానీ ఒడ్డుకు చేరేందుకు బెల్లా1 నిరాకరించి ముందుకు సాగింది. అనంతరం మారినెరా అని పేరు మార్చుకోవడమే గాక డాక్యార్డుపై రష్యా జెండాను ఎగురవేసింది.ముందు భాగానికి రష్యా పతాకపు రంగులు పూసుకుంది’’ అని హోంలాండ్ విభాగం అధికారులు తెలిపారు. మరోవైపు రష్యా మాత్రం బెల్లా1 అనేది తమ చమురు నౌకేనని చెబుతుండటం విశేషం. అమెరికా జలాలకు ఏకంగా 4,000 కి.మీ.ల దూరంలో ఆ దేశ తీరరక్షక దళం తమ నౌకను అక్రమంగా నిర్బంధించిందని ఆరోపించింది. తర్వాత కాసేపటికే సోఫియా కూడా తమ నౌకేనని రష్యా పేర్కొంది. అమెరికా చర్య పట్ల తీవ్ర ఆగ్రహం వెలిబుచి్చంది. ‘‘1982 నాటి ఐరాస ఒప్పందం మేరకు అంతర్జాతీయ జలాలు స్వేచ్ఛాయుత నౌకాయానానికి నెలవు. ఇతర దేశాల్లో నమోదైన నౌకల్ని దిగ్బంధించే అధికారం ఎవరికీ లేదు’’ అంటూ రష్యా రవాణా శాఖ ఘాటు పదజాలంతో ప్రకటన జారీ చేసింది. నౌకల రక్షణ నిమిత్తం జలాంతర్గాములను కూడా రష్యా రంగంలోకి దించినట్టు చెబుతున్నారు. తమ నౌకను అమెరికా నావికా దళం అనవసరంగా లక్ష్యంగా చేసుకుని వెంటాడుతోందని మంగళవారం సాయంత్రమే రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. అయితే యూరప్ దేశాలు మాత్రం అమెరికా చర్యను స్వాగతిస్తుండటం విశేషం. -
వెనెజువెలా సంక్షోభం.. రంగంలోకి రష్యా
అదొక పాతబడిన.. తుప్పుబట్టిన ఖాళీ డొక్కు ఆయిల్ ట్యాంకర్. అట్లాంటిక్లో అమెరికా కోస్ట్గార్డ్ దానిని వెంబడించింది. విషయం తెలిసి రష్యా అప్రమత్తమైంది. దాని రక్షణ కోసం ఓ సబ్ మెరీన్ను, ఇతర నావికాదళ నౌకలు పంపింది. అయినా కూడా అమెరికా కనుసన్నల నుంచి అది తప్పించుకోలేకపోయింది. ఫలితంగా.. సీజ్ అయ్యింది. ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటున్న వెనెజువెలా తీరంలో జరిగిన ఈ నాటకీయ పరిణామాలు ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.బెల్లా-1 ఒక పెద్ద క్రూడ్ ఆయిల్ ట్యాంకర్. తొలినాళ్లలో వెనిజువెలా, ఆ తర్వాత ఇరాన్.. ప్రస్తుతం రష్యా ఆధీనంలో చమురు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. అయితే.. గత రెండు వారాలుగా ఇది వెనెజువెలా తీరంలో దీని డాక్కు అనుమతి లభించడం లేదు. ఇందుకు అమెరికా ఆంక్షలే ప్రధాన కారణం. ఆంక్షల కింద ఉన్న ఆయిల్ ట్యాంకర్లను వెనెజువెలా తీరంలో అమెరికా కోస్ట్గార్డ్ అడ్డుకుంటోంది. ఆ లిస్ట్లో బెల్లా కూడా ఉండడమే ఇందుకు ప్రధాన కారణమైంది. డిసెంబర్ 21వ తేదీన కరేబియన్ తీరంలో రష్యా జెండాతో కనిపించిన బెల్లా.. అమెరికా ఛేజ్తో దిశ మార్చుకుని గ్రీన్లాండ్ లేదంటే ఐస్ల్యాండ్ తీరానికి చేరొచ్చని భావించారు. అయితే అనూహ్యంగా అమెరికా కోస్ట్గార్డ్ దానిని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. బెల్లా ఎందుకు ప్రత్యేకం.. బెల్లా 1 అనేది 2002లో నిర్మించబడిన ఒక పెద్ద క్రూడ్ ఆయిల్ టాంకర్. ఇది గతంలో వెనిజులా, ఇరాన్తో పాటు మరికొన్ని దేశాల ఆయిల్ రవాణాలో ఉపయోగించబడింది. ప్రస్తుతం ఇది రష్యా జెండా కింద నడుస్తోంది. అయితే తమ ఆంక్షలకు వ్యతిరేకంగా ఇది "షాడో ఫ్లీట్"లో భాగమైందని అమెరికా ఆరోపిస్తోంది. 2024 నుంచి దీనిని నిషేధిత జాబితాలో చేర్చింది. అందుకే అమెరికా ప్రతిస్పందనకు భయపడి వెనిజులా పోర్ట్లు కూడా డాక్ అనుమతిని ఇవ్వలేదు.Wall Street Journal నివేదిక ప్రకారం.. రష్యా నడిపే బ్లాక్ మార్కెట్ ఆయిల్ వాణిజ్యాన్ని అడ్డుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే మిడిల్ ఈస్ట్ రీజియన్లోని సంపన్న దేశాలు మాత్రం రష్యా ఆయిల్ వాణిజ్యానికి మద్దతు ఇస్తూ.. పాశ్చాత్య దేశాల ఆంక్షలకు సవాలు విసురుతున్నాయి. షాడో ప్లీట్ అంటే..షాడో ఫ్లీట్” (Shadow Fleet) అనేది రష్యా, ఇరాన్, వెనెజువెలా వంటి ఆంక్షలున్న ఎదుర్కొంటున్న దేశాలు ఆయిల్ను రహస్యంగా రవాణా చేయడానికి ఉపయోగించే ట్యాంకర్ల నెట్వర్క్. ఇందుకోసం పాత నౌకలను వినియోగించడం.. నకిలీ రిజిస్ట్రేషన్లు, జీపీఎస్ ట్రాకింగ్ను ఆఫ్ చేయడం లాంటివి చేస్తారు. షాడో ఫ్లీట్ ద్వారానే రష్యా.. చైనా, ఇండియా, టర్కీ వంటి దేశాలకు ఆయిల్ సరఫరా చేస్తోంది, ఈ నెట్వర్క్కు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయిన యూఏఈ, సౌదీ అరేబియాలు ఫైనాన్షియల్ ఛానెల్స్ అందిస్తున్నాయి. అయితే..ఈ నెట్వర్క్ ప్రపంచ ఆయిల్ మార్కెట్పై గణనీయమైన ప్రభావం చూపుతోంది. దీనివల్ల చమురు ధరల స్థిరత్వం దెబ్బతింటోంది. ఆంక్షల అమలు కష్టతరమవుతోంది. వీటికి తోడు ప్రపంచ రాజకీయాల్లోనూ మార్పులు సంభవిస్తున్నాయి. 2025 నాటికి.. ఈ ఫ్లీట్లో 978 టాంకర్లు ఉన్నట్లు ఓ లెక్క. ఇది ప్రపంచ ఆయిల్ టాంకర్ సామర్థ్యంలో దాదాపు 19శాతం.అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్పై ప్రభావం ఎంతంటే.. ధరల స్థిరత్వం దెబ్బతినడం.. G7 దేశాలు రష్యా ఆయిల్పై ధర పరిమితి (price cap) విధించాయి. కానీ షాడో ఫ్లీట్ ద్వారా ఈ పరిమితిని తప్పించుకుని, మార్కెట్లో తక్కువ ధరలకు ఆయిల్ విక్రయిస్తోంది. ఫలితంగా, అధికారిక మార్కెట్ ధరలు, బ్లాక్ మార్కెట్ ధరలు మధ్య వ్యత్యాసం పెరుగుతోంది.అయితే.. పాత, రిజిస్ట్రేషన్ లేని నౌకలు సముద్రంలో ప్రమాదకరంగా మారుతున్నాయని, పైగా పర్యావరణానికి (oil spills), సముద్ర రవాణా భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని పాశ్చాత్య దేశాలు అంటున్నాయి.సవాల్కు ప్రతి సవాల్షాడో ఫ్లీట్ లిస్ట్లో ఉందని చెబుతున్న బెల్లా-1 ద్వారా అమెరికా ఆంక్షలను తప్పించుకుని ఆయిల్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనేది అమెరికా ఆరోపణ. అందుకే రష్యా దీన్ని సవాలుగా తీసుకుని రక్షణ కల్పించింది. రక్షణ ఇవ్వడం ద్వారా వెనిజులాకు ఆర్థిక, రాజకీయ మద్దతు చూపించినట్లయ్యింది. అంతేకాదు “మా మిత్రదేశాల ఆయిల్ రవాణాను మీరు అడ్డుకోలేరు.” అనే సందేశాన్ని పంపించింది. అయితే ఈ సవాల్ను స్వీకరించిన అమెరికా.. దానిని విజయవంతంగా అడ్డుకున్నట్లు స్పష్టమవుతోంది. అలాగని అమెరికా షాడో ప్లీట్లను అడ్డుకోవడం ఇదే తొలిసారేం కాదు. వెనెజువెలాకు చమురు ఆదాయం కోత పెట్టే ఉద్దేశంతో ట్రంప్ సర్కార్ ఈ తరహా ట్యాంకర్లను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో డిసెంబర్ 10వ తేదీన స్కిప్పర్, సెంచురీస్ అనే రెండు ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో.. తాజా పరిణామాలు రాబోయే రోజుల్లో.. రష్యా–US మధ్య సముద్రం వేదికగా కొత్త ఉద్రిక్తతలకు దారితీయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఇరాన్లో మరింత ఉధృతమైన ఆందోళనలు
‘‘ఇజ్రాయెల్తో 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగినప్పుడు కూడా ఖమేనీ ఎక్కడికి పారిపోలేదు. అలాంటి సొంత దేశంలో.. అదీ అక్కడక్కడా జరిగే నిరసనలు చూసి పారిపోతారా?..’’ అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ దేశం విడిచిపోతారన్న కథనాలను ఇరాన్ వర్గాలు ఖండిస్తున్నాయి. కానీ, పరిస్థితులు మాత్రం ఆ ప్రచారంలో కాస్తో కూస్తో వాస్తవం లేకపోలేదని చెబుతున్నాయి. ఇరాన్లో ప్రజా నిరసనల వేళ.. అయతొల్లా అలీ ఖమేనీ అడ్రస్ లేకుండా పోయారు. ఆఖరికి.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా కూడా ఆయన స్పందించడం లేదు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయారని ప్రచారం జోరందుకుంది. కానీ, ఇరాన్ వర్గాలు ఆ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. అయితే మారుతున్న సమీకరణాలు.. పరిస్థితులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఖమేనీ నెక్ట్స్ స్టెప్ గురించి ది టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్లో చెలరేగిన ఆందోళనలను ‘ఫ్లాన్ ఏ’ ద్వారా అణచివేసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే.. వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య నేపథ్యంలో ఖమేనీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రజా ఉద్యమం చల్లారకపోయినా.. ఒకవేళ ట్రంప్ జోక్యం చేసుకున్నా.. తక్షణమే దేశం విడిచిపోవాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సదరు కథనం పేర్కొంది. 86 ఏళ్ల ఖమేనీకి, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో తన వారసుడిగా భావిస్తున్న కుమారుడు ముజ్తబా సహా సుమారు 20 మంది బృందంతో ఖమేనీ టెహ్రాన్ విడిచి వెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు ప్లాన్ బీ సిద్ధమైనట్లు ది టైమ్స్ పత్రిక సదరు ఇంటెలిజెన్స్ నివేదిక సారాంశాన్ని కథనంగా ఇచ్చింది. ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు 78 నగరాలకు విస్తరించాయి. కనీసం 35 మంది మరణించగా, 1200 మందికి పైగా అరెస్టయ్యారు. అయితే.. భద్రతా బలగాల కాల్పుల్లో పసికందులు కూడా బలయ్యారని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. విదేశీ జోక్యం దాకా పరిస్థితి వస్తే ఆయన తప్పకుండా దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి తరలి పోవచ్చనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అలాంటి ఇలాంటి సంక్షోభం కాదుఇరాన్ కరెన్సీ రియాల్ విలువ 2025 డిసెంబర్లో డాలర్కు 42 వేల రియాల్కు చేరుకుంది. దీంతో ఆహార ధరలు (72%) ఔషధాల రేట్లు(50%) ఆకాశాన్నంటాయి. 2026 బడ్జెట్లో పన్నులు 62% పెంచే ప్రతిపాదన జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అంతర్జాతీయ ప్రతిస్పందనఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరసనకారులపై దాడులు జరిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్లో ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని సూచించింది.బలహీనంగా ‘ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’.ఇరాన్ మిత్ర బలగాలైన హమాస్, హిజ్బుల్లా, హౌతి తిరుగుబాటుదారులు, సిరియా ప్రభుత్వం గత కొన్నేళ్లలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో అమెరికా–ఇజ్రాయెల్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూటమి క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోంది. ఇరాన్పై వెనెజువెలా తరహా సైనిక చర్య జరిగితే ఇవి ఎంత వరకు మద్దతుగా నిలుస్తాయనేదానిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.ఖమేనీ పాలనప్రముఖ మత గురువు అయిన ఖమేనీ.. 1979 ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించారు. 1981లో అధ్యక్షుడిగా, 1989లో సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అంటే గత 35 ఏళ్లుగా ఆయన ఇరాన్లో అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. ఆర్థిక సంక్షోభం, ప్రజా అసంతృప్తి, అంతర్జాతీయ ఒత్తిడి మధ్య ఖమేనీ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. -
రష్యా డ్రోన్ దాడిలో.. 24 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్లోని ఖేర్సన్ రీజియన్లో ఉన్న ఓ కేఫ్ అండ్ హోటల్పై భారీ డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 24 మంది చనిపోయారు. కొత్త సంవత్సర వేడుకల్లో పౌరులు ఉండగా ఈ దాడి చోటుచేసుకున్నట్లు ఖేర్సన్ గవర్నర్ తెలిపారు.ఖోర్లీ గ్రామంలో ఉన్న ఆ హోటల్పై మూడు డ్రోన్లతో దాడి జరిగింది. ఘటనలో 24 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారని అధికారులు టెలిగ్రామ్ చానెల్ ద్వారా వెల్లడించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అంటున్నారు.ఒకవైపు ట్రంప్ తన మధ్యవర్తిత్వంతో ఈ యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుతిన్తో ఓసారి.. జెలెన్స్కీతో మూడుసార్లు భేటీ అయ్యారు. తాజాగా 90 శాతం శాంతి ప్రణాళిక ఖరారైనట్లేనని, ఏక్షణమైనా యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు కూడా. అయితే.. శాంతి చర్చల వేళ ఇరు దేశాలు మాత్రం డ్రోన్లతో పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి.. తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరగ్గా.. సైన్యం దానిని తిప్పి కొట్టింది. ఇది ఉక్రెయిన్ పనేనని మాస్కో ఆరోపిస్తుండగా.. కీవ్ మాత్రం అవి ఆరోపణలేనని తోసిపుచ్చింది. ఈ క్రమంలో.. ఆధారాలంటూ కొన్ని వీడియోలను బయటపెట్టింది రష్యా. -
పుతిన్ ఇంటికే గురిపెట్టారుగా!
ఉక్రెయిన్ సంక్షోభం ఈ ఫిబ్రవరితో నాలుగేళ్లు పూర్తి కానుంది. ఒకవైపు యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నా.. మరోవైపు ఇరుదేశాల కవ్వింపు చర్యలు మాత్రం ఆగడం లేదు. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపైనే డ్రోన్ దాడి జరగడం కలకలం రేపగా.. అమెరికా సహా పలు దేశాల అనుమానాల నేపథ్యంలో ఆ దాడులకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరిగిందనే.. ఇది ఉక్రెయిన్ సైన్యం పనేనని రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. ఆ దాడి తమ పని కాదని.. ఇది రష్యా ఆడుతున్న నాటకమని.. అసలు అలాంటి దాడేం జరగలేదని.. శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకే ఇలాంటి ఆరోపణలకు దిగింది అని ఉక్రెయిన్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. రష్యా అధినేత నివాసంపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అదే సమయంలో అలాంటి దాడి జరగకపోయి ఉండొచ్చంటూ అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. అనూహ్యంగా.. మాస్కోతో పాటు క్రిమియాలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగాయంటూ రష్యా కొన్ని వీడియోలను రిలీజ్ చేసింది. అందులో.. క్రెమ్లిన్(రష్యా అధ్యక్ష కార్యాలయం) సమీపంలో నిర్వీర్యం చేసిన ఓ డ్రోన్కు ఆరు కేజీల పేలుడు పదార్థాలు అమర్చి ఉన్నాయి. దీంతో 24 గంటల్లో దాడికి సంబంధించిన ఆధారాలు చూపించాలన్న ఉక్రెయిన్కు గట్టి కౌంటర్ ఇచ్చినట్లైంది. Downed UAV with a 6kg explosive charge — Russian MOD publishes VIDEO PROOF of Ukrainian attack on Putin’s residenceThe attempt was carried out on the night of December 28 to 29WATCH report by the unit who took down 41 of the 91 drones sent by Kiev https://t.co/J9Tgd8yAJx pic.twitter.com/b7Yv55OlxP— RT (@RT_com) December 31, 2025ఈ వీడియోలు వెలుగులోకి రాకముందే.. పుతిన్ ఇంటిపై జరిగిన డ్రోన్ దాడుల్ని పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘‘శాంతి స్థాపనకు కొనసాగుతున్న ప్రయత్నాలకు భంగం కలిగించవద్దు’’ అంటూ రష్యా-ఉక్రెయిన్లను కోరారు. ఒక్క ఫ్రాన్స్ మాత్రం సరైన ఆధారాల్లేకుండా ఉక్రెయిన్ను నిందించడానికి వీల్లేదంటూ మద్దతు ప్రకటించింది. అయితే.. తాజా దాడుల వీడియోలపై కీవ్ వర్గాలు, జెలెన్స్కీ.. అసలు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సుమారు 91 డ్రోన్లు.. నోవ్గోరోడ్ రీజియన్లోని పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చాయని.. అయితే మాస్కో-సెయింట్ పీటర్స్బర్గ్లో వాటిని తమ సైన్యం నేల్చకూల్చిందని రష్యా విదేశాంగ మంతరి సెర్గె లావ్రోవ్ ప్రకటించారు. అయితే.. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ పనేనని ఆరోపిస్తున్నారాయన. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్పై దాడులను రష్యా ఆపడం లేదు. తాజాగా దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెసా నగరంపై తాజాగా డ్రోన్లతో మాస్కో విరుచుకుపడింది. ఈ దాడిలో అనేక అపార్ట్మెంట్లు, విద్యుత్ గ్రిడ్లు ధ్వంసమయ్యాయి. ఓ శిశువు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు. శాంతి చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయని భావించేలోపే.. రష్యా ఉక్రెయిన్పై దీర్ఘశ్రేణి దాడుల్ని తీవ్రం చేయడం గమనార్హం. -
రష్యా సైన్యంలో ‘నేరాలు- ఘోరాలు’.. ‘సాక్ష్యం’ తెచ్చిన పంజాబీ?
జలంధర్: ఉపాధి కోసం రష్యా వెళ్లిన భారత యువకుల విషాదాంతం వెలుగు చూసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతూ 10 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని పంజాబ్కు చెందిన ఓ యువకుడు వెల్లడించడం సంచలనంగా మారింది. తన సోదరుని ఆచూకీ కోసం రష్యా వెళ్లిన పంజాబ్లోని జలంధర్ జిల్లా గోరయాకు జగదీప్ కుమార్ ఈ వివరాలను మీడియా ముందు వెల్లడించారు.జగదీప్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం రష్యాలో మరణించిన 10 మందిలో ముగ్గురు పంజాబ్కు చెందిన వారు కాగా, మిగిలిన ఏడుగురు ఉత్తరప్రదేశ్, జమ్మూ ప్రాంతాలకు చెందిన వారు. రష్యా సైన్యం అందించిన అధికారిక పత్రాల ఆధారంగా వీరి మరణాలను జగదీప్ కుమార్ ధృవీకరించారు. అయితే ఈ అంశంపై భారత ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా రష్యా సైన్యం జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాలను జగదీప్ కుమార్ రాజ్యసభ సభ్యుడు సంత్ బల్బీర్ సింగ్ సీచేవాల్ కార్యాలయానికి అందజేశారు. మరణించిన వారితో పాటు మరో నలుగురు భారతీయులు కూడా రష్యాలో గల్లంతయ్యారని ఆయన పేర్కొన్నారు.జగదీప్ సోదరుడు మన్ దీప్ కుమార్ గత ఏడాది రష్యాకు వెళ్లారు. ఒక ట్రావెల్ ఏజెంట్ మోసం కారణంగా ఆయన రష్యా సైన్యంలో చేరాల్సి వచ్చింది. 2024, మార్చి నుంచి కుటుంబ సభ్యులకు మన్ దీప్ నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. కాగా తన సోదరునితో పాటు అక్కడ చిక్కుకున్న ఇతర భారతీయులను రక్షించాలని కోరుతూ జగదీప్ జూన్ 29, 2024న రాజ్యసభ సభ్యుడు సీచేవాల్ను కలిశారు. అనంతరం తన సోదరుని ఆచూకీ కోసం జగదీప్ స్వయంగా రెండుసార్లు రష్యాలో పర్యటించారు. మొదటిసారి 21 రోజులు, రెండోసారి రెండు నెలల పాటు అక్కడే ఉండి సమాచారాన్ని సేకరించారు.భాషా సమస్యలతో పాటు ఇతర అడ్డంకులు ఎదురైనప్పటికీ, రష్యా సైనిక అధికారుల ద్వారా తన సోదరుడితో సహా ఇతర భారతీయ యువకుల స్థితిగతులపై ఆయన పలు కీలక పత్రాలను సేకరించగలిగారు. ఈ ఘటనపై ఎంపీ బల్బీర్ సింగ్ సీచేవాల్ స్పందిస్తూ విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. రష్యాలో మృతిచెందిన భారతీయ యువకుల మృతదేహాలను వారి స్వగ్రామాలకు తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అమాయక యువకులను మోసం చేసి, యుద్ధ భూమికి పంపుతున్న ట్రావెల్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భారత యువకులు రష్యా సైన్యంలో చేరకుండా దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఇది కూడా చదవండి: Delhi Blast: దర్యాప్తులో వేగం.. పరిహారంలో లేదా? -
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు దిశగా కీలక అడుగు పడింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం విషయంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో జరిపిన భేటీ ఫలవంతంగా ముగిసింది. తుది ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. ఇద్దరు దేశాధినేతలు చర్చలు కీలక దశకు చేరుకున్నాయనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. కానీ..ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో నివాసంలో సుమారు మూడు గంటలపాటు ట్రంప్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు. శాంతి ఒప్పందానికి 90-95 శాతం ఆమోదం లభించిందని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే కీలకమైన సరిహద్దు అంశంపైనే ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని ఇద్దరి మాటల్లో వెల్లడి అయ్యింది.ఉక్రెయిన్కు భద్రత కల్పించే అంశాలపై 95 శాతం చర్చలు పూర్తయ్యాయని ట్రంప్ అన్నారు. అయితే.. తూర్పు భాగంలోని సరిహద్దుల అంశమే ఎటూ తేలడం లేదని మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చాలా అంశాలపై చర్చించాం. దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే అనుకోవచ్చు. గతంతో పోలిస్తే ఇది ఎంతో మెరుగైన ఫలితం. మరికొన్ని వారాల్లోనే ఈ యుద్ధం ముగిసే అవకాశం ఉంది. అయితే ఈ చర్చలకు డెడ్లైన్ అంటూ ఏదీ లేదని గమనించాలి. కాబట్టి సరైన సమయంలో.. అదీ అమెరికా సమక్షంలో రష్యా-ఉక్రెయిన్లు ఈ యుధ్దానికి ముగింపు పలుకుతాయి’’ అని అన్నారాయన. ఇక ట్రంప్కు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసిన జెలెన్స్కీ.. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో ఇరువైపులా సంబంధించిన అంశాలను పొందుపరిచారని.. ఇందులో 90 శాతం ఆమోదయోగ్యంగానే ఉన్నాయన్నారు. అయితే అంతిమంగా.. శాశ్వత శాంతి సాధనలో భద్రతా హామీలే కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. మిగిలిన అంశాలపై యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతామని.. జనవరిలో వాషింగ్టన్లో మరిన్ని చర్చలు జరుగుతాయని.. త్వరలోనే ట్రంప్ పీస్ ప్లాన్కు తుది రూపం ఇవ్వనున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ యుద్ధానికి తాత్కాలికంగా ఆపేందుకు సుముఖంగా లేరు. అందుకే ఆయన కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఉక్రెయిన్లో పర్యటించాలని, అక్కడి పార్లమెంట్లో ప్రసంగించాలని తాను కోరుకుంటున్నప్పటికీ.. ముందుగా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావాలని జెలెన్స్కీ ఆకాంక్షిస్తున్నారని, ఆ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తాను అని అన్నారు.అసలు చిక్కల్లా అక్కడే.. డోన్బాస్ (Donbas) అనేది తూర్పు ఉక్రెయిన్లోని ఒక చారిత్రక.. ఆర్థిక ప్రాంతం. డొనెట్స్క్ (Donetsk), లుహాన్స్క్ (Luhansk) ప్రాంతాల కలయిక. అందుకే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కేంద్ర బిందువుగా మారింది. రష్యా అనుకూల వేర్పాటువాదులకు, ఉక్రెయిన్కు మధ్య ఈ ప్రాంతంపై పట్టు కోసం తీవ్ర పోరాటం జరుగుతోంది. వ్యూహాత్మకంగా భావిస్తుండడంతో.. రష్యా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుంటోంది. అందుకే శాంతి చర్చలలో కీలక అంశంగా మారింది. అయితే.. ఈ అంశంపైనా చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని ట్రంప్ ఇప్పుడు చెబుతుండగా, డోన్బాస్పై ఉక్రెయిన్ వైఖరి స్పష్టంగా ఉందని.. అది రష్యా అభిప్రాయానికి భిన్నమని వ్యాఖ్యానించడం కొసమెరుపు. భేటీకి ముందు.. జెలెన్స్కీతో భేటీకి ముందు మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. తుది గడువు ఏమీ లేదని, యుద్ధం ముగింపుపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. దౌత్య ప్రయత్నాలు తుది దశకు వచ్చినట్లు పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ ఫోన్లో మాట్లాడానని.. ఆయనతో ఫలితం సాధించే దిశగా చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు.‘‘రష్యా, ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటున్నాయి. నేను జెలెన్స్కీతో జరుపుతున్న సమావేశంపై పుతిన్ చిత్తశుద్ధితో ఉన్నారు. తుది గడువు ఏమీ లేదు.. యుద్ధం ముగింపుపైనే దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులపై పుతిన్, జెలెన్స్కీ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా మంది చనిపోయారు. ఇప్పటికే 8 యుద్ధాలు ఆపాను.. ఇదీ చాలా క్టిష్టమైనది. ఫ్లోరిడాలో సమావేశం కోసం జెలెన్స్కీ చాలా కృషి చేశారు. ఆయన, ఉక్రెయిన్ ప్రజలు చాలా ధైర్యవంతులు. రష్యా, ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చలు కొనసాగిస్తుంటాం. చర్చలు చివరి దశలో ఉన్నాయి.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ట్రంప్ అన్నారు.ట్రంప్తో జరిగే సమావేశంలో ఉక్రెయిన్కు కల్పించాల్సిన భద్రతా హామీల అంశాన్ని లేవనెత్తనున్నట్లు ఇది వరకే జెలెన్స్కీ వెల్లడించారు. ముఖ్యంగా 20సూత్రాల ప్రణాళికపై చర్చిస్తామని, ఇది దాదాపుగా(90 శాతం) సిద్ధమైందని తెలిపారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్, అమెరికా మాత్రమే కాకుండా యూరప్ దేశాలూ పాలుపంచుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. -
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ముగింపుకు ట్రంప్ పిలుపు
వాష్టింగన్: కొనసాగుతున్న ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆపాలని, అందుకు సమయం వృదా చేయాల్సిన అవసరం లేదని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో జరిగిన భేటీలో ట్రంప్ పైవిధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రధానంగా ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధానికి శాంతి పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారించింది. ట్రంప్ తన శైలిలో యుద్ధాన్ని త్వరగా ముగించగలమని నమ్మకం వ్యక్తం చేయగా.. జెలెన్ స్కీ అమెరికా మద్దతు ఉక్రెయిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ఈ చర్చల్లో సైనిక సహాయం, ఆర్థిక మద్దతు, రాజకీయ వ్యూహాలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. జెలెన్ స్కీ ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి, అమెరికా సహాయం కొనసాగాలని కోరారు. ట్రంప్, తన పదవీకాలంలో ప్రత్యేక శాంతి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.యూరోపియన్ నాయకులు, ట్రంప్- జెలెన్స్కీల మధ్య చర్చలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కొత్త మార్గం చూపవచ్చని భావిస్తున్నారు. అయితే, విశ్లేషకులు ట్రంప్ ప్రతిపాదించే శాంతి ప్రణాళికలో రష్యా పాత్ర ఎలా ఉంటుందనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, ఈ సమావేశం ఉక్రెయిన్ భవిష్యత్తుకు కీలక మలుపు కావచ్చు. ట్రంప్ త్వరిత పరిష్కారం వాగ్దానం చేస్తున్నప్పటికీ జెలెన్ స్కీ మాత్రం ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, భూభాగ సమగ్రతపై రాజీ పడరాదని స్పష్టం చేస్తున్నారు. -
ఉక్రెయిన్కు పుతిన్ సంచలన హెచ్చరిక
మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు శాంతి చర్చల వేళ అధ్యక్షుడు పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య శాంతియుత మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి ఉక్రెయిన్ ముందుకు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. లేని పక్షంలో సైనిక మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని పుతిన్ చెప్పుకొచ్చారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా ఆ దేశ మిలిటరీ కమాండ్ పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరిసిమోవ్, రష్యన్ దళాలతో పుతిన్ చర్చలు జరిపారు. అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చలపై ఉక్రెయిన్ అధికారులకు పెద్దగా ఆసక్తి లేనట్లుగా ఉంది. సమస్య పరిష్కారానికి వాళ్లు తొందరపడటం లేదు. ఒక వేళ ఉక్రెయిన్ అధికారులు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇష్టపడకపోతే.. ప్రత్యేక సైనిక చర్యతో మా లక్ష్యాలను సాధిస్తాం. రష్యా దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.రష్యా దాడులు.. మరోవైపు.. శాంతి చర్చల వేళ ఉక్రెయిన్పై రష్యా దళాలు విరుచుకుపడ్డాయి. కీవ్పై లాంగ్ రేంజ్ ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలతో భారీ దాడి చేసింది. ఈ దాడులను జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ దౌత్యపరమైన మార్గాలకు కట్టుబడి ఉందని.. మాస్కోనే యుద్ధం పొడిగించాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రష్యా దాడుల్లో ఉక్రెయిన్లో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అంతేకాకుండా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిసింది. JUST IN:🇷🇺 Putin in full military uniform:" If Kiev does not want peace, Russia will achieve all Special Military Operation goals by MILITARY means" pic.twitter.com/CCMLzoA1GB— Megatron (@Megatron_ron) December 27, 2025 -
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఇంధన వనరులు, సైనిక మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా శనివారం వేకువజాము నుంచి మరోమారు భారీ దాడులకు తెరతీసింది. కింఝాల్ హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లను పెద్ద సంఖ్యలో ప్రయోగించింది. బాంబు మోతలతో కీవ్ కొన్ని గంటలపాటు ప్రతిధ్వనించింది. వివిధ ఘటనల్లో కనీసం ఒకరు చనిపోయారు. 32 మంది గాయపడ్డారు.కాగా, ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ఓవైపు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నా, రష్యా మాత్రం తన దాడులను ఆపడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలవనున్న నేపథ్యంలోనే ఈ భారీ దాడి జరగడం గమనార్హం. చర్చల్లో ప్రధానంగా భద్రతా హామీలపైనే పట్టుబడతామని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. శాంతి చర్చలకు ముందు జరిగిన ఈ దాడి పుతిన్ మనస్తత్వాన్ని తెలియజేస్తుందని అన్నారు.BREAKING: Russia launched a massive attack on Kyiv and across Ukraine, firing roughly 500 drones and 40 missiles, hitting residential areas and knocking out power and heat in parts of the capital, ahead of President Zelenskyy’s meeting with Donald Trump in Florida on Sunday. pic.twitter.com/N1aSuRxJO9— Republicans against Trump (@RpsAgainstTrump) December 27, 2025ఇక, రష్యా మాత్రం.. భూమి, వాయు, సముద్ర మార్గాల్లో కీవ్పై లాంగ్ రేంజ్ ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలతో భారీ దాడి చేపట్టినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ పేర్కొంది. మొత్తం 519 డ్రోన్లు, 40 వరకు క్షిపణులను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. దాడుల ఫలితంగా కీవ్లోని చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా బంద్ అయినట్లు వెల్లడించింది. దాడుల్లో పది వరకు బహుళ అంతస్తుల నివాస భవనాలు దెబ్బతిన్నాయని, కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయని వివరించింది. మరోవైపు.. తాము ఉక్రెయిన్ ఇంధన, మిలిటరీ సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేపట్టామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కీవ్ తమ దేశంలోని జనావాసాలపై చేసిన దాడులకిది ప్రతీకారమని తెలిపింది.500 drones & 40 missiles were used by russia this night and morning. Most of them targeted Kyiv.Energy, critical civilian infrastructure & residential areas were under attack.Many households in Kyiv & the region are left without power & heat.It's subzero temperature in Ukraine pic.twitter.com/51V2uqUn3V— Ania_In_UA (@Ania_In_UA) December 27, 2025 -
భారత్లో రష్యా వైన్ను ఎగబడి తాగుతున్నారు!
ఢిల్లీ: ఇండియన్ మార్కెట్లో రష్యన్ వైన్కి ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు యూరోపియన్ దేశాల వైన్ను సేవించే భారతీయులు ఇప్పుడు రష్యా వైన్ కోసం క్యూకడుతున్నట్లు పలు గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల విడుదలైన ఈ ఏడాది పది నెలల్లో వచ్చిన గణాంకాలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. వైన్ దిగుమతులలో రష్యా వాటా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో, హై-ఎండ్ రెస్టారెంట్లు, లగ్జరీ హోటళ్లలో రష్యన్ వైన్ వినియోగం పెరుగుతోంది. భారత యువతలో వైన్ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో, కొత్త రకాల రష్యన్ బ్రాండ్లు మార్కెట్లోకి ప్రవేశించడం ఈ వృద్ధికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు వచ్చిన డేటా ప్రకారం, రష్యన్ వైన్ దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల వైన్లతో పోటీ పడుతూ, రష్యన్ వైన్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. భారత మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్లో రష్యన్ వైన్కి మంచి డిమాండ్ ఉంది. ధరలు తక్కువగా ఉండటం, కొత్త రుచులు అందించడం,మార్కెటింగ్తో పాటు ఇతర కారణాల వల్ల వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు.రష్యన్ వైన్కి భారత మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ వాణిజ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా–భారత్ మధ్య ఇప్పటికే ఎనర్జీ, డిఫెన్స్ రంగాల్లో ఉన్న సహకారం ఇప్పుడు ఫుడ్ అండ్ బేవరేజీస్ రంగంలో కూడా విస్తరిస్తోంది. ఈ వృద్ధి కేవలం వాణిజ్య పరిమితి కాకుండా, రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను కూడా బలపరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
'భారత్ చాలా నేర్పించింది'..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్
చాలామంది విదేశీయలు మన మాతృగడ్డపై మమకారం పెంచుకుని ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ఫిదా అంటూ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. పైగా వాళ్ల సతంతి కూడా ఇక్కడ పెరిగితేనే మంచిదని భావిస్తుండటం విశేషం. ఆ కోవలోకి తాజాగా మరో రష్యన్ తల్లి వచ్చి చేరింది. ఆ పిల్లల తల్లి పోస్ట్లో పేర్కొన్న విషయాలు వింటుంటే మన గడ్డపై మమకారం, ప్రేమ రెట్టింపు అవవ్వడమే కాదు భారతీయులుగా గర్వం ఉప్పొంగుతుంది కూడా. మరి ఇంతకీ ఆమె ఆ పోస్ట్లో ఏం చెప్పుకొచ్చిందంటే..బెంగళూరులో నివశిస్తున్న ఈ రష్యన్ మహిళ తాను తన భర్త భారతదేశాన్ని కేవలం పర్యాటక ప్రదేశంగా కాకుండా శాశ్వత నివాసంగా ఎందుకు మార్చుకున్నామో వెల్లడించింది పోస్ట్లో. ఈ గడ్డపై ఉంటేనే తన పిల్లలు మంచిగా పెరుగుతారని, ఇది పిల్లల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణమని, విశాల దృక్పథంతో వ్యవహరించడం అలవడుతుందని అటోంది. ఈ భారతదేశం తమ కుటుంబానికి ఎన్నో నేర్పించిందంటూ ఇలా వివరించింది. వేగాన్ని తగ్గించడం దగ్గర నుంచి తొందరపడకుండా ఉండటం, మాటకు స్పదించడం, శ్రద్ధగా వినడం వంటివి తమ కుటుంబం నేర్చుకుందని తెలిపింది. అలాగే తాము ఇక్కడ భారతీయులను తాము ఎంతగానో ప్రేమిస్తున్నామని, వారి కపటం లేని మనసు, దయ, ప్రతిఫలాప్రేక్ష లేని హెల్పింగ్ నేచర్ మమ్మల్ని ఎంతగానో కట్టిపడేశాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పొరుగువారితో సత్సంబంధాలు చాలా బాగుంటాయని, ఇక్కడ చిరునవ్వే అందరి కామన్భాష అని అంటోంది. అందువల్లే తన పిల్లలను ఇక్కడే పెంచాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యానంటోంది ఈ తల్లి. ఈ బహుళ సంస్కృతి, బహుభాషా వాతావరణంలో ఎన్నో నేర్చుకోగలరు, ముఖ్యంగా గౌరవించడం, చిన్న చిన్న వాటికి ప్రశంసించడం వంటివి నేర్చుకుంటారని చెబుతోంది. ఈ వెచ్చని వాతావరణం ఎంజాయ్ చేయడం ఓ థ్రిల్, అలాగే ఏడాది పొడవునా కాలానుగుణ తాజా పండ్లను ఆస్వాదించడంలో ఓ మజా ఉందంటోంది. అందువల్లే తాము భారతదేశాన్ని తమ నివాస స్థలంగా మార్చుకున్నామంటూ పోస్ట్ని ముగించింది. అయితే నెటిజన్లు స్పందిస్తూ..మా భారత్కి స్వాగతం, మా మృతృభూమి చాలా అందమైనది, ఎవరినైనా తనలో ఇట్టే కలిపేసుకుంటుంది అని ఆమెకు సాదారంగా ఆహ్వానం పలుకుతూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Lifestyle (@yana.in.india) (చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్ఆర్ఐ పోస్ట్) -
ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?
యావత్తు ప్రపంచం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగతో సందడిగా ఉంటే..ఈ దేశాల్లో ఆ సందడి కానరాదు. ఒకవైపు ప్రపంచం మొత్తం ఒకరికొకరు గిఫ్ట్లు, స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేషన్ వేడుకల్లో మునిగితేలుతుంటే..ఆయా దేశాలు నిశబ్దంతో నిండి ఉంటాయి. కానీ ఆ దేశాలు కూడా క్రిస్మస్ని ఘనంగానే జరుపుకుంటుంది కానీ ఈ డిసెంబర్ 25 మాత్రం కాదట. మరి ఇంతకీ ఏరోజున క్రీస్తూ పుట్టిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారంటే..ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు, క్రిస్మస్ డిసెంబర్ 25. రష్యా వంటి కొన్ని దేశాల్లో మాత్రం దాదాపు రెండు వారాల తర్వాత, జనవరి 7న వస్తుంది. ఆ రోజు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. చెప్పాలంటే అక్కడ ఆరోజు ఓ విరామం లేదా విశ్రాంతి రోజులా మారిపోతుంది చుట్టూ వాతావరణం. పూర్వం మొత్తం దేశాలన్ని జూలియన్ క్యాలెండర్ అనుసరించేవి. అయితే 1582లో యూరప్లో ఎక్కువ భాగం కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్ను స్వీకరించింది. లీప్ ఇయర్ని జోడించడంతో రెండు క్యాలెండర్లలో రోజులు, తేదీల అమరికలు తేడాలు వచ్చాయి. అయితే కొన్ని దేశాలు మతపరమైన ఆచారాల నిమిత్తం పాత క్యాలెండర్నే అనుసరించాలనే నిబంధనను ఏర్పరుచుకున్నాయి. దాంతో ఈరెండు క్యాలెండర్ల మధ్య మతపరమైన వేడుకలు జరుపుకునే వ్యత్యాసం ఏకంగా 13 రోజులకుపైనే ఉంటుంది. కాబట్టి కొత్త క్యాలెండర్ని స్వీకరించిన దేశాలు డిసెంబర్25న క్రిస్మస్ జరుపుకుంటే..పాత క్యాలెండర్ని అనుసరించేవారు జనవరి 7న జరుపుకుంటారు. అలా రష్యా డిసెంబర్ 25న ఎలాంటి వేడుకలు నిర్వహించదు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ తోపాటు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటుంది. ఆయా దేశాలన్నీ అధికారికంగా రోజువారీ వ్యవహారాలకు గ్రెగోరియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తుండగా, మత పరమైన వేడుకలకు జూలియన్ క్యాలెండర్ని అనుసరించడం విశేషం. అంతేగాదండోయ్ రష్యా వంటి దేశాల ప్రజలు ఆరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రంలో ఆకాశంలో నక్షత్రాన్ని చూసి మాంసాహారంతో విందు ఆస్వాదిస్తారట.ఏసుక్రీస్తు పుట్టుకను ఈస్టర్న్ ఆర్థడాక్స్ (Eastern Orthodox) దేశాలు డిసెంబర్ 25వ తేదీన జరుపుకోవు. ఇక్కడ ఈస్టర్న్ ఆర్థడాక్స్ అంటే క్రైస్తవ మతంలోని ఒక ప్రధాన శాఖ, ఇది బైజాంటైన్ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది.ఆ దేశాల జాబితా ఇదే:రష్యా (Russia)ఉక్రెయిన్ (Ukraine) - కొన్ని చర్చిలుసెర్బియా (Serbia)జార్జియా (Georgia)బెలారస్ (Belarus)మోల్డోవా (Moldova)మాంటెనెగ్రో (Montenegro)ఉత్తర మాసిడోనియా (North Macedonia)ఎథియోపియా (Ethiopia)ఎరిట్రియా (Eritrea)(చదవండి: క్రిస్మస్ పండుగ ఆరునెలల పాటు నిర్వహించే దేశం ఏది? ఎందుకు?) -
రష్యా పెను సంచలనం
చంద్రుడిపై అన్వేషణలో భాగంగా పలు దేశాలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ముందడుగు వేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. జాబిల్లిపై వచ్చే పదేళ్లలో విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాము చేపడుతోన్న లూనార్ ప్రొగ్రామ్తో పాటు రష్యా-చైనా ఉమ్మడి పరిశోధన కేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించింది.చంద్రుడిపై 2036 నాటికి విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించినట్లు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్కాస్మస్ వెల్లడించింది. ఇందుకోసం ఏరోస్పేస్ కంపెనీ లావొచ్కిన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. రోవర్లు, అబ్జర్వేటరీ, రష్యా-చైనా సంయుక్త పరిశోధనా కేంద్రంతో పాటు తమ సొంత లూనార్ ప్రోగ్రామ్కు విద్యుత్ను అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని పేర్కొంది. అయితే, అది అణువిద్యుత్ కేంద్రమేనని వార్తలు వస్తున్నప్పటికీ.. రష్యా సంస్థ నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.అంతరిక్ష పరిశోధనల్లో ముందున్న రష్యా.. తమ వ్యోమగామి యూరి గగారిన్ను 1961లోనే అంతరిక్షంలోకి పంపించింది. కానీ, కొన్ని దశాబ్దాలుగా అమెరికా, చైనాల కంటే కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. ఇటీవల (2023 ఆగస్టులో) రష్యా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లూనా-25 జాబిల్లిపై అడుగుపెట్టడానికి ముందే కూలిపోయింది. మరోవైపు అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న ఎలాన్ మస్క్ కూడా తీవ్ర పోటీని ఇస్తున్న విషయం తెలిసిందే. -
లగ్జరీ హోటల్లో ఫ్లైట్ అటెండెంట్ దారుణ హత్య, మాజీ భర్త అరెస్ట్
దుబాయ్లోని లగ్జరీ హోటల్లో యువతి దారుణ హత్య కలకలం రేపింది. ఫ్లైట్ అటెండెంట్గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువతిని మాజీ భర్తే కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం దేశం విడిచి పారి పోయాడు.పోలీసులు సమాచారం ప్రచారం రష్యన్ విమానసేవల సంస్థ పోబెడా ఎయిర్ లైన్స్లో క్రూ మెంబర్గా పనిచేస్తున్న అనస్తాసియా దుబాయ్లోని లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్లో శవమై తేలింది. దుబాయ్లోని జుమేరా లేక్స్ టవర్స్ ప్రాంతంలోని వోకోబోనింగ్టన్ హోటల్లోని ఒక గదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడ, మొండెం, అవయవాలపై 15 కత్తి పోట్లున్నాయని, దర్యాప్తు అధికారులు తెలిపారు. దర్యాప్తు అనంతరం రష్యాలో ఆమె మాజీ భర్తను అరెస్టు చేశారు.ప్రధాన నిందితుడుగా రష్యన్ జాతీయుడు అనస్తాసియా మాజీ భర్త అయిన 41 ఏళ్ల ఆల్బర్ట్ మోర్గాన్ గా గుర్తించారు. యుఎఇ చట్ట అమలు సంస్థల అభ్యర్థన మేరకు, డిసెంబర్ 20న దుబాయ్ నుండి రష్యాలో దిగిన కొద్దిసేపటికే మోర్గాన్ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ హత్య డిసెంబర్ 17-18 మధ్య హత్య జరిగిందని భావిస్తున్నారు. హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుబాయ్ పోలీసులు నిందితుడిని గుర్తించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే దేశం విడిచి పారిపోయాడని భావిస్తున్నారు. మోర్గాన్ను అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగా, ఫిబ్రవరి 18 వరకు కనీసం రెండు నెలల పాటు కస్టడీలో ఉంచాలని రష్యన్ కోర్టు ఆదేశించింది.అనస్తాసియా మోర్గాన్ మధ్య విభేదాలు తలెల్తాయి. నిరంతరం ఆమెను అనుమానంతో వేధించేవాడు. దీంతో దాదాపు రెండేళ్ల నుంచీ వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం నిందితుడు దుబాయయ్లో ఉంటున్నాడు. అయితే నిర్భయంగా ఆమె జీవిస్తున్న తీరుపై అసూయ, అనుమానంతో రగిలిపోయి చివరకు ఈ దారుణానికి ఒడిగట్టాడు భర్త. మరోవైపు ప్రభుత్వ సంస్థ ఏరోఫ్లాట్ యాజమాన్యంలోని పోబెడా ఎయిర్లైన్స్ ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది... శివాజీపై నెటిజన్లు ఫైర్ -
మోదీ ప్రభుత్వమే నన్ను కాపాడాలి
మోర్బి: రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని ఉక్రెయిన్ బలగాలకు చిక్కిన గుజరాత్ వాసి తనను కాపాడాలంటూ భారత పభ్రుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఈ మేరకు అతడు తన కుటుంబసభ్యులకు ఒక వీడియో పంపించాడు. గుజరాత్లోని మోర్బి పట్టణానికి చెందిన సాహిల్ మహ్మద్ హుస్సేన్ మజోతి(22) రష్యాలో చదువుకునేందుకు వెళ్లాడు. అక్కడ అతడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత రష్యా సైన్యంలో చేరి, ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లాడు. అక్కడ ఉక్రెయిన్ సేనలకు లొంగిపోయాడు. ప్రస్తుతం ఉక్రెయిన్లో నిర్బంధంలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం మోర్బిలో ఉంటున్న తన తల్లి హసీనా బెన్ సెల్ఫోన్కు ఒక వీడియో పంపాడు. అందులో తను పడుతున్న కష్టాలను వివరించాడు. తనే తప్పూ చేయకున్నా రష్యా అధికారులు తనను అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో ఇరికించారని వాపోయాడు. జైలు పాలు చేసి, ఆపై మాయమాటలు చెప్పి, సైన్యంలో చేరేలా కాంటాక్ట్రు ఒప్పందంపై సంతకం చేయించారని చెప్పాడు. యుద్ధానికి వెళ్లి ఉక్రెయిన్ బలగాలకు లొంగిపోయినట్లు ఆ వీడియోలో వివరించాడు. చదువుకునేందుకు రష్యా వచ్చే భారతీయ యువకులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. తనను ఈ చెర నుంచి విడిపించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. కుటుంబంతో తిరిగి కలుసుకునే అవకాశం కల్పించాలని వేడుకున్నాడు. తన కుమారుడి నిర్బంధంపై స్థానిక రాజ్యసభ ఎంపీ కేసరీదేవసిన్హ్ ఝలాకు తెలిపామని హసీనాబెన్ తెలిపారు. మోదీ ప్రభుత్వం తన కుమారుడిని సురక్షితంగా వెనక్కి తీసుకువస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సాహిల్ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్తో మాట్లాడినట్లు ఎంపీ చెప్పారు. దేశాల మధ్య వ్యవహారం అయినందున కొంత సమయం పడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి సాధించామని చెప్పారు. -
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం.. భారతీయుల పరిస్థితి విషమం
ఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా సైన్యంలో చేరిన భారతీయుల పరిస్థితి మరింత విషమంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం 50 మంది భారతీయులు రష్యా సైన్యంలో చిక్కుకుని ఉన్నారు.వారిలో ఇప్పటి వరకు 26 మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు అదృశ్యమైనట్లు సమాచారం. వారి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అధికారులు తెలిపారు. మొత్తం మీద, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 200 మందికి పైగా భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది.ప్రభుత్వ చర్యలుభారత ప్రభుత్వం రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. రష్యా సైన్యంలో చేరిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొంతమందిని రప్పించగలిగామని, కానీ ఇంకా 50 మంది చిక్కుకుని ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.కుటుంబాల ఆందోళనయుద్ధంలో చిక్కుకున్న యువకుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ప్రాణాలు రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులు తమ పిల్లలు మోసపూరిత వాగ్దానాలతో రష్యా సైన్యంలో చేరారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన దక్షిణాసియా దేశాల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడం వల్ల చిక్కుకున్న భారతీయుల భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితి భారత విదేశాంగానికి పెద్ద సవాలుగా మారింది.ముగింపురష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నంత కాలం, రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ప్రాణాలు రక్షించేందుకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కుటుంబాలు కోరుతున్నాయి. -
స్టార్లింక్ శాటిలైట్లకు రష్యా ముప్పు
పారిస్: ప్రొపల్షన్ సిస్టమ్ సమస్యతో ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ కూటమిలోంచి కృత్రిమ ఉప గ్రహం ‘35956’ అదుపుతప్పి భూమి దిశగా కదులుతూ కొత్త ముప్పుమోసుకొస్తుంటే అంతకుమించి పెను ముప్పు రష్యా రూపంలో పొంచి ఉందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు ఆందోళనవ్యక్తంచేశాయి. అంతరిక్షంలో కక్షలో తిరిగే వందలాది కృత్రిమ ఉపగ్రహాలను పిట్టల్లా రాల్చేసే అధునాతన ఆయుధాన్ని తయారు చేయడంలో రష్యా తలమునకలైందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు నిఘా సమాచారంతో ది అసోసియేటెట్ ప్రెస్ వార్తాసంస్థ ఒక కథనాన్ని వెలువర్చింది.దాని పేరు జీరో ఎఫెక్ట్అంతరిక్షంలోని ఉపగ్రహాలపైకి అత్యంత సాంద్రతతో తయారుచేసిన సూక్ష్మ పెల్లెట్లను ప్రయోగించి వాటికి తీవ్ర నష్టం కలిగేలా చేయడమే రష్యా ఆయుధం అసలు లక్ష్యం. ఈ ఆయుధానికి ‘జీరో ఎఫెక్ట్’ అని పేరుపెట్టినట్లు తెలుస్తోంది. వందలాది పెల్లెట్లను ఒకేసారి ప్రయోగించడంతో వాటి ధాటికి ఒకేసారి పెద్ద సంఖ్యలో శాటిౖలైట్లును సర్వనాశనం అవుతాయి. ఇవి చిన్నచిన్న ముక్కలుగా శకలాలుగా చెల్లాచెదురుగా పడడంతో సమీప కక్ష్యల్లోని ఇతర ఉపగ్రహాలకు సైతం దెబ్బతింటాయి. దీంతో వినాశనం ఊహించనంత పెద్దదిగా ఉంటుంది. ఇంతటి పెనువినాశనం సృష్టించగల ఆయుధాన్ని రష్యా సృష్టించకుండా ఉంటుందని తాము భావించట్లేమని అమెరికాలోని ప్రభుత్వేతర ‘ సెక్యూర్ వరల్డ్ ఫౌండేషన్’లోని అంతరిక్ష భద్రతా నిపుణుడు విక్టోరియా సామ్సన్, కెనడా సైన్యంలోని అంతరిక్ష విభాగ బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ వ్యాఖ్యానించారు. జీరో ఎఫెక్ట్ ఆయుధ తయారీ మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ డొంకతిరుగుడు సమాధానం చెప్పారు. ‘‘ కక్షలో తిరగగలిగే సామర్థ్యమున్న ఆయుధాల ప్రయోగాలను శత్రుదేశాలు ఆపేలా ఐరాస చొరవచూపాలి. అయినా అణ్వస్త్ర సామర్థ్యమున్న అంతరిక్ష ఆయుధాలను మొహరించబోమని పుతిన్ గతంలోనే చెప్పారు’’ అని పెస్కోవ్ వ్యాఖ్యానించారు. తక్కువ ఎత్తులో తిరిగే స్టార్లింక్ ఉపగ్రహాలు రష్యా గగనతలంపై నిఘా పెట్టి ఉక్రెయిన్ దిశలో రష్యా సేనల జాడను గుర్తించి ఉక్రెయిన్కు అందిస్తున్నాయి. దీంతో స్టార్లింక్ ఉపగ్రహాలు తమ సార్వభౌమత్వం, భద్రతకు ముప్పుగా వాటిల్లాయని వీటిని నాశనంచేయాలని రష్యా భావిస్తోందని పశ్చిమాసియా నిఘా వర్గాలు నిర్ధారించాయి.పొడవు మిల్లీమీటర్!‘‘హఠాత్తుగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ల వంటి వాటినే గుర్తించగలం. కేవలం మిల్లీమీటర్ పొడవుండే సూక్ష్మ పెల్లెట్లను భూతల, గగనతల నిఘా వ్యవస్థలు గుర్తించలేవు. వీటితో ఉపగ్రహాలపై దాడి చేస్తే నష్టనివారణ అసాధ్యం. పెల్లెట్ల దెబ్బకు ఒక కక్షలోని ఉపగ్రహాలన్నీ నాశనంఅవుతాయి. అదీకాకుండా దాడి చేసింది రష్యానే అని నిరూపించడం కూడా చాలా కష్టం. మిల్లీమీటర్ పొడవు పెల్లెట్లతో ఉపగ్రహాలకు మరణశాసనం రాయొచ్చు. చైనా ఉదంతమే ఇందుకు చక్కటి ఉదాహరణ. నవంబర్లో సూక్ష్మస్థాయి అంతరిక్ష శకలం తగిలి చైనా వ్యోమనౌక దెబ్బతింది. దాంతో చైనా సొంత అంతరిక్ష కేంద్రం నుంచి అది బయల్దేరలేక అక్కడే ఉండిపోయింది. దాంతో దాని ద్వారా భూమి మీదకు రావాల్సిన చైనా వ్యోమగాములు సైతం అక్కడే చిక్కుకుపోయారు’’ అని బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ఉపగ్రహాల ఉపరితలాల్లో అధిక ప్రాంతాన్ని ఆక్రమించేవి సౌర ఫలకాలే. పెల్లెట్ల ఉరవడికి ఇవన్నీ బద్దలవుతాయి. అప్పుడు ఉపగ్రహం మనుగడ ప్రశ్నార్థకమవుతుంది’’ అని వాషింగ్టన్లోని ‘సెంటర్ ఫర్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో అంతరిక్ష భద్రత, ఆయుధాల నిపుణుడు క్లేటన్ స్వాప్ చెప్పారు. స్టార్లింక్ ఉపగ్రహాలు భూమి నుంచి ఆకాశంలో 500 కిలోమీటర్ల ఎత్తులో సంచరిస్తున్నాయి. వీటి కింది కక్షల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనా వారి తియాంగ్ స్పేస్ స్టేషన్ తిరుగుతున్నాయి. రష్యా దాడి చేస్తే ఉపగ్రహాలు శకలాలుగా ఛిద్రమై అవి ఐఎస్ఎస్, తియాంగ్ స్పేస్స్టేషన్లనూ నాశనంచేసే ఆస్కారముంది. -
పేరుకే ‘మిల్లీమీటర్’.. ఎలాన్ మస్క్ను టార్గెట్ చేస్తున్న పుతిన్
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొత్త మలుపు తిరగనున్నట్లు నాటో ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్కు మద్దతు అందిస్తున్న ఎలాన్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్లను నిర్వీర్యం చేసేందుకు రష్యా మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే పెల్లెట్లను తయారు చేస్తోందని, రానున్న రోజుల్లో ఈ శాటిలైట్లను కూల్చే ప్రయత్నం చేయనున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.నాటోకు చెందిన రెండు దేశాల గూఢచారి సంస్థలు రష్యా కొత్త యాంటీ శాటిలైట్ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందని అనుమానం వ్యక్తం చేశాయి. ఈ ఆయుధం ఎలాన్ మస్క్ స్టార్లింక్ ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ‘జోన్ ఎఫెక్ట్’గా పేర్కొంటున్న ఈ విధానం కక్ష్యలో మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్న లోహపు కణాలను భారీగా విడుదల చేసి, ఉపగ్రహాలను ఢీకొట్టేలా చేస్తుంది. దీంతో ఒకేసారి అనేక ఉపగ్రహాలు నిర్వీర్యం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో రష్యా, చైనా వంటి దేశాల ఉపగ్రహాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.ప్రస్తుతం లో-ఎర్త్ ఆర్బిట్లో ఉన్న ఉపగ్రహాలలో స్టార్లింక్ వాటా చాలా గణనీయమైనది. ఉక్రెయిన్ యుద్ధంలో కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలు, సైనిక ఆపరేషన్లకు ఇవి కీలకంగా ఉపయోగపడుతున్నాయి. స్టార్లింక్ను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరిగితే అంతరిక్షంలో గందరగోళం పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ వ్యవస్థలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా. ఈ కారణంగా రష్యా దీన్ని ప్రయోగించే అవకాశాలు తక్కువగా ఉండొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.రష్యా అభివృద్ధి చేస్తోందని అనుమానిస్తున్న ఈ యాంటీ శాటిలైట్ విధానం అంతరిక్ష భద్రతకు పెద్ద సవాలుగా మారవచ్చని, స్టార్లింక్పై దృష్టి పెట్టడం ద్వారా పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని తగ్గించాలన్న ఉద్దేశం ఉన్నట్టుగా నాటో ఇంటెలిజెన్స్ సూచిస్తోంది. -
రష్యా సైన్యంలో భారత విద్యార్థి బందీ.. డ్రగ్స్ కేసుతో బ్లాక్మెయిల్
మాస్కో: చదువుకునేందుకు రష్యాకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు అక్కడ నరకం కనిపిస్తోంది. గుజరాత్లోని మోర్బికి చెందిన సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ అనే విద్యార్థి తనకు రష్యాలో ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తనపై తప్పుడు డ్రగ్స్ కేసు మోపి, సైన్యంలో చేరకపోతే జైలుకు పంపుతామని అక్కడి పోలీసులు బ్లాక్మెయిల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.సాహిల్ మొహమ్మద్ హుస్సేన్కు కేవలం 15 రోజుల శిక్షణ ఇచ్చి, నేరుగా ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి తరలించడంతో మరో గత్యంతరం లేక, ప్రాణభయంతో అతను ఉక్రెయిన్ సైన్యానికి లొంగిపోయాడు. ప్రస్తుతం అక్కడ బందీగా ఉన్న సాహిల్, ఒక వీడియో సందేశం పంపి ‘నన్ను కాపాడండి మోదీ’ అంటూ కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా ఈ ఘటనతో డ్రగ్స్ మాఫియా, రష్యన్ సైన్యం మధ్య జరుగుతున్న దారుణాలు బయటపడుతున్నాయి.'झूठे ड्रग्स केस में फंसा कर रूसी सेना में शामिल कराया'गुजरात के एक युवक का वीडियो इन दिनों सोशल मीडिया पर जमकर वायरल हो रहा है. ये वीडियो रूस-यूक्रेन युद्ध के बीच वायरल हुआ है. इस वीडियो में ये शख्स लोगों से अपील कर रहा है कि वो किसी भी परिस्थिति में रूसी सेना में ना शामिल… pic.twitter.com/yDVW2Ef1ZR— NDTV India (@ndtvindia) December 21, 2025ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భారతీయ యువకులను టార్గెట్ చేస్తూ, స్కామర్లు వారిపై తప్పుడు కేసులు మోపుతున్నారని, కనీసం 700 మంది భారతీయులను ఇలాగే జైలు పాలు చేసి, సైన్యంలో చేరితేనే విడుదల చేస్తామని వేధిస్తున్నారని సాహిల్ ఆ వీడియోలో వెల్లడించాడు. ఆలివ్ గ్రీన్ జాకెట్ ధరించి ఉక్రెయిన్ కస్టడీలో ఉన్న ఈ విద్యార్థి వీడియో చూస్తుంటే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఈ హృదయ విదారక ఘటనపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ రష్యన్ సైన్యంలో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రధాని మోదీ స్వయంగా పుతిన్తో చర్చలు జరిపారని తెలిపారు. ఇప్పటికే చాలా మందిని రక్షించామని, మిగిలిన వారిని కూడా స్వదేశానికి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. సాహిల్ తల్లి కూడా తన కొడుకు కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని ఎదురుచూస్తున్నారు.కాగా విదేశాలకు వెళ్లే యువతకు సాహిల్ ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు వైరల్ అవుతోంది. "రష్యాలో ఉద్యోగాల పేరుతో లేదా చదువు పేరుతో వస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ స్కామర్లు మిమ్మల్ని డ్రగ్స్ కేసుల్లో ఇరికించి, యుద్ధంలోకి నెట్టేస్తారు" అని అతను హెచ్చరించాడు. రష్యన్ సాయుధ దళాల్లో చేరమని వచ్చే ఎటువంటి ఆఫర్లను నమ్మవద్దని ప్రభుత్వం కూడా మరోసారి స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: అందుకే.. పట్టాలపై గజరాజుల మృత్యుఘోష! -
ఎంత ధైర్యం?.. పుతిన్ ముందే అలా చేస్తావా?
ప్రపంచంలో శక్తివంతమైన నేతల్లో వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. ఆయన అలవాట్లు.. మేనరిజం.. ప్రోటోకాల్.. అన్నీ ఎంతో ప్రత్యేకంగానే ఉంటాయి. అలాంటిది ఆయన సమక్షంలో ఓ యువకుడు.. తన ప్రియురాలికి ప్రపోజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఆ ప్రపోజల్కు ఆ యువతి ఏం చేసింది.. దానికి పుతిన్ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా?.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 ఏడాది ముగింపు నేపథ్యంతో.. విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రిపోర్టర్లు పలు ప్రశ్నలు అడగ్గా.. దానికి పుతిన్ బదులిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కిరిల్ బజానోవ్ అనే 23 ఏళ్ల యువ జర్నలిస్టు వంతు వచ్చింది. ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని ప్లకార్డును పట్టుకున్న అతను.. పుతిన్ ముందే తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ‘నా స్నేహితురాలు దీన్ని చూస్తోంది. ఓల్గా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో.. నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా’ అని అన్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు. వెంటనే ఆ ప్రాంగణంలోని వారంతా చప్పట్లు కొట్టారు. ‘Vladimir Vladimirovich, Breaking News’ — host interrupted Putin‘She said yes’ — Kirill Bazhenov’s girlfriend accepted the proposalPreviously journalist proposed in the middle of the live Q&A pic.twitter.com/WI1PMftowG— RT (@RT_com) December 19, 2025అనంతరం అతడు.. రష్యాలో జీవన వ్యయం పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశాడు. తాను, తన స్నేహితురాలు ఎనిమిదేళ్లుగా కలిసి ఉంటున్నామని అయితే, విస్తృత ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు పుతిన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇక, సమావేశం కొనసాగుతుండగా.. ప్రోగ్రామ్ హోస్ట్ కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టు కిరిల్ బజానోవ్ ప్రపోజల్ను అతడి స్నేహితురాలు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో పుతిన్తో సహా అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తంచేస్తూ చప్పట్లు కొట్టారు. అయితే కిరిల్ లాంటి యువ కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్.. విరాళాల రూపంలో అయినా ఇలాంటి పెళ్లిళ్లకు సాయం అందించాలని పిలుపు ఇచ్చారు. ఈ సమయంలో తమ పెళ్లికి రావాలంటూ కిరిల్ రష్యా అధినేతను ఆహ్వానించగా.. ఆయన నుంచి ఎలాంటి బదులు రాలేదు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
ఉక్రెయిన్పై పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్లో ఆశించిన సైనిక లక్ష్యాలను సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధక్షేత్రంలో ముందుకు సాగుతున్నాయని ఆయన ప్రకటించారు. ఇప్పటికే వ్యూహాత్మకంగా పైచేయి సాధించాయని, ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని ప్రాంతాలను కైవసం చేసుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పైకి దండెత్తి దాదాపు నాలుగేళ్లవుతున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం ఆయన వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఫోన్కాల్స్కు సైతం నేరుగా లైవ్లో సమాధానాలిచ్చారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధానికి ముగింపు పలికేలా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న వేళ పుతిన్ ఏం మాట్లాడుతారా అని పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022 ఆరంభంలో పెద్ద ఎత్తున దండెత్తి వచ్చిన రష్యా బలగాలను చాలా చిన్నదైన ఉక్రెయిన్ ఆర్మీ సమర్ధంగా తిప్పికొట్టగలిగినప్పటికీ, రాన్రానూ అత్యంత భారీ రష్యా ఆర్మీ, అధునాతన ఆయుధ సంపత్తి ముందు తలొంచక తప్పలేదు. రష్యా బలగాలు యుద్ధ క్షేత్రంలో మెరుపు వేగంతో చొచ్చుకుపోలేకున్నా, క్రమంగా పైచేయి సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘మా బలగాలు యుద్ధక్షేత్రమంతటా ముందుకు వెళ్తున్నాయి. ఒక్కో చోట వేగంగా, మరోచోట నెమ్మదిగా వెళ్తున్నాయి. మొత్తమ్మీద శత్రువు వెనక్కి మరలుతున్నాడు’అని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించేందుకు శాంతియుతమైన ఒప్పందం కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల్ని విక్రయించి, ఆ సొమ్మును ఉక్రెయిన్కు సాయంగా ఇవ్వాలంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ తప్పుబట్టారు. దీనిని పశ్చిమ దేశాలు సాగిస్తున్న దోపిడీగా అభివర్ణించారు. యూరోజోన్పై వ్యాపార, పారిశ్రామికవేత్తలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఉక్రెయిన్కు 90 బిలియన్ యూరోల సాయం ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్కు సైనిక, ఆర్థిక అవసరాల కోసం వడ్డీలేని రుణాన్ని అందించడానికి యురోపియన్ యూనియన్ (ఈయూ) నాయకులు అంగీకరించారు. 2026–27 సంవత్సరానికి ఉక్రెయిన్కు 90 బిలియన్ యూరోల సాయం చేసేందుకు ఈయూ కట్టుబడి ఉందని కౌన్సిల్ అధ్మయక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్లో వెల్లడించారు. ఈ ఒప్పందానికి రావడానికి ఈయూ నాయకులు తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఈయూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం ముందున్న బడ్జెట్ లోటును ఇది పూడుస్తుందని, తమ దేశ రక్షణను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. -
రష్యా భూభాగంపై జిత్తులమారి చైనా కన్ను!
పొరుగు దేశాల భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపించే జిత్తుల మారి చైనా ఇప్పుడు రష్యాపై కన్నేసింది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చి.. మ్యాపులు విడుదల చేసే డ్రాగన్ దేశం ఇప్పుడు రష్యా-చైనా సరిహద్దుల్లోని ఓ ద్వీపం తమదేనని వాదిస్తోంది. దీనిపై రష్యా నిఘా వర్గాలు ఇది నిజమేనంటూ నివేదికలు అందజేశాయి. అసలు ఆ ద్వీపం కథేంటి? శతాబ్దన్నర క్రితం చైనా ఆ ద్వీపాన్ని కోల్పోవడానికి కారణాలేంటి? దీనిపై సాక్షి డిజిటల్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ కథనం ఇది..రష్యాలోని సైబీరియా ప్రాంతంలో.. ఉస్సూరీ-అమూర్ నదుల సంగమం వద్ద అతిపెద్ద ద్వీపం ఉంది. దీన్ని బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్గా పిలుస్తారు. 150 ఏళ్లుగా ఇది రష్యాలో అంతర్భాగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ ద్వీపంపై చైనా కన్నేసింది. ఈ ద్వీపాన్ని ఆక్రమించాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇటీవల రష్యా నిఘా సంస్థ ఎఫ్ఎస్బీ 8 పేజీల నివేదికను అందజేసింది. ఆ నివేదికలో చైనాను శత్రువుగా పేర్కొంది. అమెరికా మ్యాగజైన్ ‘న్యూస్ వీక్’.. అదేవిధంగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక దీనిపై కథనాలను ప్రచురించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2023లో చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మ్యాపుల్లో ఈ ఐల్యాండ్ పూర్తిగా చైనాదేనని పేర్కొనడమే కాకుండా.. ఆ దీవి పేరును మార్చివేసింది. అంతేకాదు.. రష్యాలోని తూర్పు నగరం వ్లాడివోస్టోక్ కూడా తమ భూభాగమేనని చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ మ్యాప్ స్పష్టం చేస్తోంది.బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ ఒకప్పుడు చైనాలో భాగమే..! కానీ, 150 ఏళ్ల క్రితం.. అంటే.. 19వ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం బలహీనపడింది. ఆ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైంది. భద్రత దృష్ట్యా ఈ దీవిని రష్యాకు అప్పగించింది. రష్యాకు కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ఈ దీవి అప్పట్లో అవసరంగా మారింది. 1958లో జరిగిన ఒప్పందం ప్రకారం అమూర్ నదికి ఉత్తరాన ఉన్న విశాలమైన ప్రాంతాన్ని రష్యాకు అప్పటించింది. 1860లో మరో యుద్ధంలో చైనా ఓడిపోవడం.. పాశ్చాత్య దేశాలకు రష్యా సహకరిస్తుందనే భయంతో ‘పెకింగ్ ఒప్పందం’ చేసుకుంది. ఈ రెండు ఒప్పందాల ప్రకారం ఈ దీవితోపాటు.. సువిశాలమైన భూభాగం రష్యా సొంతమైంది. ఆ వెంటనే రష్యా ఇక్కడ వ్లాదివోస్తోక్ నగరాన్ని నిర్మించింది.ఐదు దశాబ్దాల క్రితం నుంచి చైనా సంస్కరణల బాటలో దూసుకుపోతున్నది. రెండు దశాబ్దాలుగా ఆర్థికంగా బలోపేతమవుతుండడంతో.. క్రమంగా ఈ ప్రాంతాలపై వివాదాలు రాజుకున్నాయి. రష్యా-చైనా మధ్య 4,200 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సరిహద్దు ఉంది. 60వ దశకంలో కూడా ఈ సరిహద్దు వెంబడి ఇరుదేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. 1990-2000 మధ్యకాలంలో ఈ వివాదం మరింత ముదిరింది. దాంతో.. పలు ఒప్పందాలు కుదిరాయి. అయినా డ్రాగన్ తన కవ్వింపు చర్యలకు ఫుల్స్టాప్ పెట్టకపోవడంతో 2008లో రష్యా కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్లో కొంత భాగం చైనాకు చెందుతుంది.ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఈ యుద్ధంతో రష్యా ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో చిక్కకుపోయింది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో అతలాకుతలమమయ్యింది. దీంతో డ్రాగన్ మరోమారు కుయుక్తులకు తెరతీసింది. ఓ వైపు రష్యాను మిత్రదేశంగా పేర్కొంటునే.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను కాదని రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించింది. మరోవైపు బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ని హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఒకవేళ చైనా తన చర్యలను మరింత ముమ్మరం చేస్తే.. రష్యా దానిని ఎదుర్కోగలదా? ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైతే.. అది ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -హెచ్.కమలాపతి రావు -
కోర్–5 సూపర్ క్లబ్
వరల్డ్ ఆర్డర్. ఒక్క వాక్యంలో చెప్పాలంటే బలం, సామర్థ్యం ఆధారంగా వరుస క్రమంలో దేశాల అమరిక. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలే శాసించే ఈ వరల్డ్ ఆర్డర్ త్వరలో పెను మార్పులను చవిచూడనుందా? ఇప్పటిదాకా అత్యంత బలోపేతమైన కూటమిగా ఉన్న జీ7 వైభవం గతించనుందా? దాన్ని తోసిరాజనేలా అతి శక్తిమంతమైన సరికొత్త కూటమి ఒకటి శరవేగంగా పురుడు పోసుకుంటోందా? అన్ని రంగాల్లోనూ నిర్నిరోధంగా దూసుకుపోతున్న నయా భారత్ ది అందులో అతి కీలక పాత్ర కానుందా? అంటే, అవుననే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ముఖ్యంగా కొద్దిరోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు, చేతలు, చాప కింద నీరులా ఆయన చకచకా సాగిస్తున్న ప్రయత్నాలు ఇందుకు ప్రబల సంకేతాలేనని చెబుతున్నారు. కోర్–5 పేరిట కొత్త కూటమికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత డిజిటల్ వార్తా పత్రిక పొలిటికో రాసి కథనం అంతర్జాతీయంగా పెను సంచలనమే సృష్టిస్తోంది. అమెరికా, భారత్, మరో రెండు ఆసియా దిగ్గజాలైన చైనా, జపాన్ తో పాటు ఆశ్చర్యకరంగా రష్యా కూడా ఇందులో భాగస్వామి కానుందని పొలిటికో కథనం సారాంశం. అమెరికాకు సంబంధించిన రక్షణ, జాతీయ భద్రతా వ్యవహారాలను అత్యంత కచి్చతత్వంతో నివేదించే డిఫెన్స్ వన్ సైట్ ను ఉటంకిస్తూ అది ఈ మేరకు పేర్కొంది. ఈ కోర్ గ్రూప్నకు ముద్దుగా ’సీ5 సూపర్ క్లబ్’ గా నామకరణం కూడా చేసింది! నిజంగా గనుక అదే జరిగితే చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి ఇదే అవుతుందని అంతర్జాతీయ నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలో ప్రచురించకుండా రహస్యంగా ఉంచిన భాగంలో సీ5 గురించి వివరంగా ఉన్నట్టు వాషింగ్టన్, వైట్ హౌస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి! ట్రంప్ తీసుకువస్తున్న సరికొత్త సీ 5 ప్రతిపాదనలపై భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, జపాన్ ప్రధాని తకాయిచీ స్పందనలేమిటో తెలియాల్సి ఉంది. యూరప్ దేశాలకు చెక్? జీ7 కూటమిలో అమెరికా, కెనడా , జపాన్ ను మినహాయిస్తే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ రూపంలో నాలుగు యూరప్ దేశాలే ఉన్నాయి. పలు అంశాల్లో వాటి దూకుడు పట్ల ట్రంప్ కొద్దికాలం గుర్రుగా ఉన్నారు. చీటికిమాటికి అన్ని విషయాల్లోనూ తమ మాటే నెగ్గాలనే ఒంటెత్తు పోకడతో అవి శిరోభారంగా మారాయని భావిస్తున్నారు. వాటికి చెక్ పెట్టేందుకే ఈ కొత్త కూటమికి ఆయన తెర తీస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికా విదేశాంగ విధానంలోనే ఇది పెను మార్పు కానుంది! అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టిన గత 80 ఏళ్లలో నిత్యం యూరప్ ను తన అతి సన్నిహిత భాగస్వామిగానే పరిగణిస్తూ రావడం తెలిసిందే.ట్రంప్ సంకేతాలు సీ 5 గ్రూప్ గురించి నిజానికి ట్రంప్ కొంతకాలంగా స్పష్టమైన సంకేతాలే ఇస్తూ వస్తున్నారు. గత జూన్ లో జరిగిన జీ7 శిఖరాగ్రాన్నే ఇందుకు ఆయన వేదికగా మలచుకోవడం విశేషం. జీ7 కూటమిలో రష్యా కొనసాగి ఉండాల్సిందని, ఆ మాటకొస్తే చైనాకూ ఎన్నడో చోటు దక్కాల్సిందని ఆయన కుండబద్ధ్దలు కొట్టారు. తొలుత జీ8గా ఉన్న ఈ కూటమి కాస్తా, 2014లో క్రిమియాను ఆక్రమించిన కారణంగా రష్యాకు ఉద్వాసన పలకడంతో జీ7గా మారింది. ‘నిజానికి అతి పెద్ద తప్పిదమది. అలా చేయకుంటే నేడు ఇంత భారీ యుద్ధమే జరుగుతుండేది కాదు‘ అని ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఉదేశించి జీ7 వేదికగానే ట్రంప్ కుండబద్ధ్దలు కొట్టారు. సి5 మరీ సత్యదూరం ఏమీ కాకపోవచ్చని బైడెన్ హయాంలో అమెరికా జాతీయ భద్రతా మండలిలో కీలకపాత్ర పోషించిన టోరీ తౌసిగ్ చెప్పడం విశేషం. ‘ట్రంప్ కు సిద్ధాంతాలపై పెద్దగా నమ్మకం లేదు. తన ఆలోచనలకు, వ్యూహాలకు, ప్రణాళికలకు ఏది పనికొస్తే అదే అప్పటికి ఆయన సిద్ధాంతం! ఆ లెక్కన కొంతకాలంగా తనకు శిరోభారంగానే గాక అమెరికాకు ఆర్థికంగానూ, ఇతరత్రా కూడా భారంగానే పరిణమిస్తున్న యూరప్ దేశాలను వదిలించుకునేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు.అప్పుడే ఎజెండా రెడీ? అవుననే అంటోంది పొలిటికో. జీ7 మాదిరిగా తర చూ భేటీ కావాలని, అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించాలని ట్రంప్ భావిస్తున్నట్టు అది వివరించింది. అంతేకాదు, పశ్చిమాసియా భద్రతే సీ5 తొలి ఎజెండా అని కూడా డిఫెన్స్ వన్ ను ఉటంకిస్తూ చెప్పేసింది! ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య ఉప్పూ నిప్పుగా ఉన్న సంబంధాలను సరిదిద్దడం సీ5 ’తొలి అసైన్ మెంట్’ అని చెప్పుకొచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
రెండున్నరేళ్ల క్రితం ఉక్రెయిన్తో యుద్ధం మొదలు పెట్టిన రష్యా ఇప్పుడు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినట్లుంది. ఈ నేపధ్యంలో రష్యా ముందున్న ఒకేఒక్క ఆశాదీపం భారతదేశమేనని, అందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల భారత్లో పర్యటించారనే వాదన వినిపిస్తోంది. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? యుద్ధం ప్రారంభమైన రెండేళ్ల వరకు జీడీపీలో ఎలాంటి తరుగుదల లేకుండా.. పైపైకి దూసుకుపోయిన రష్యాకు ఇప్పుడేమైంది?అది 2022 ఫిబ్రవరి 24. రష్యా దళాలు బెలారస్ మీదుగా ఉక్రెయిన్పై దురాక్రమణను ప్రారంభించాయి. క్రమంగా ఉక్రెయిన్కు సముద్రమార్గంతో సంబంధాలు లేకుండా ఈ ఆక్రమణ కొనసాగింది. అంటే.. దక్షిణ ఉక్రెయిన్లో ఉండే ప్రధాన పోర్టులు ఒడెస్సా, మైకొలైవ్తోపాటు.. మారియుపూల్ వరకు రష్యా కబ్జా చేసేసింది. అంతేకాదు.. నల్లసముద్రంతో సంబంధం లేకుండా.. అతిపెద్ద ప్రావిన్స్ అయిన జాపొరిజియా దక్షిణ భాగాన్ని ఆక్రమించి.. అక్కడి పౌరులకు రష్యా పౌరసత్వాన్ని ఇవ్వడం ప్రారంభించింది. తూర్పున డోనెట్స్క్, లుహాన్స్క్పై పట్టుసాధించింది. అంటే.. 2014లో ఆక్రమించిన క్రిమియా నుంచి రష్యాలోని బెల్గోల్ట్ వరకు రోడ్డు మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ పరిణామాలతో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు ఉక్రెయిన్ సముద్రంపై ఆధారపడకుండా చేసినట్లైంది.2020లో కొవిడ్ కల్లోలం తర్వాత అమెరికా సహా.. దాదాపుగా అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. రష్యా సొంతంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను తయారు చేసినా.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైనా.. కారిమకుల జీతాలను పెంచిన పుతిన్ సర్కారు ద్రవ్యోల్బణ ప్రమాదం నుంచి గట్టెక్కింది. 2022లో యుద్ధం ప్రారంభమయ్యాక.. సైన్యంలో నియామకాలు, ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ వంటి కిరాయి సేనల కోసం డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. ఒక సంవత్సరం వరకు పరిస్థితులను నియంత్రించుకుంటూ.. ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందనిపించినా.. 2023 నుంచి నియంత్రణ కోల్పోయింది. 2024లో ముదిరి పాకాన పడే పరిస్థితులు నెలకొన్నాయి.యుద్ధం మూడున్నరేళ్లుగా నడుస్తుండడంతో.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం రష్యాకు తలకు మించిన భారమవుతోంది. చమురు ఎగుమతులపై ఆశలు పెట్టుకున్నా.. ధరలు పడిపోయాయి. అమెరికా ఆంక్షలతో పలు దేశాలు రష్యా చమురు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నాయి. దీంతో.. గత త్రైమాసికంలో జీడీపీ నేలముఖం చూడడం ప్రారంభించింది. 2023, 2024 సంవత్సరాల్లో 3-4% వృద్ధి నమోదైనా.. ఇప్పుడు మాత్రం పరిస్థితి చేయి దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు.. చివరకు వోడ్కాపైనా పన్నులను పెంచుతూ పరిస్థితిని నియంత్రించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి. ఈ పరిస్థితుల్లో రష్యా ముందు ఆశాదీపంగా కనిపిస్తున్న ఒకే ఒక్క దేశం భారత్..! అందుకే.. 2022 నుంచే రష్యా మన దేశానికి మరింత దగ్గరవ్వడం మొదలుపెట్టింది.నిజానికి రష్యా-భారత్ల మైత్రి చారిత్రకమైనది. ఓల్గా నుంచి గంగా వరకు స్నేహం ఫరిడవిల్లిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. అయితే.. చమురు కోసం ఇరాక్, సౌదీలపై ఆధారపడే భారత్కు కూడా ఇప్పుడు తక్కువ ధరకే చమురును అందించే రష్యా ఓ ఆశాజ్యోతిగా మారింది. రష్యా అత్యధికంగా చమురు ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిపోయింది. యుద్ధం ప్రారంభానికి ముందు రష్యా నుంచి రోజుకు లక్ష బ్యారెళ్లలోపు చమురు మాత్రమే భారత్కు దిగుమతి అయ్యేది. ఇప్పుడు ఆ దిగుమతి ఏకంగా రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు పెరిగిపోయింది. అందుకే ట్రంప్ కూడా పదేపదే రష్యాను ఆర్థికంగా ఆదుకుంటున్నది భారతదేశమేనని వ్యాఖ్యానాలు చేస్తుంటారు. 38% రష్యా చమురు భారత్కే వెళ్తోందని, ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా భారత్ ఆజ్యం పోస్తోందంటూ కారాలుమిరియాలు నూరుతున్న విషయం తెలిసిందే..!ఇప్పుడున్న పరిస్థితుల్లో.. భారత్ ఏమాత్రం చమురు దిగుమతులను తగ్గించినా.. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. రష్యా చమురును భారత్ కొనడం ఆపేయనుందని ట్రంప్ ఒకట్రెండు సార్లు ప్రకటనలు చేసిందే దరిమిలా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. భారత్కు కావాల్సిన రక్షణపరమైన అవసరాలను తీర్చేందుకు తాము సిద్ధమంటూ కీలక ఒప్పందాలు చేసుకున్నారు. చమురు కొనుగోళ్లను కొనసాగించేలా భారత్ను కోరారు. అవును.. ఇప్పుడు రష్యాకు పెద్దదిక్కు భారతే..! ఉక్రెయిన్లోని కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా భారత్ గనక రష్యా చమురు కొనుగోళ్లను కనీసం 20% తగ్గించినా.. రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందంటూ నివేదిక ఇచ్చింది. ఓ వైపు భారత్ను నమ్ముకుంటూనే.. రష్యా తమ ప్రజలపై పన్నుల భారం వేస్తోంది. రష్యాలో అధిక డిమాండ్ ఉండే వోడ్కాపై అదనంగా 5% పన్ను విధిస్తోంది. ఇక వ్యాట్ను 10శాతం నుంచి 11శాతానికి పెంచింది. అదనంగా పెరిగిన ఒక శాతం వ్యాట్ విలువ ఒక ట్రిలియన్ రూబిల్స్గా ఉంటుంది. అంటే.. 1,304 బిలియన్ డాలర్లన్నమాట. అంతేకాదు. ఇంతకాలం రష్యాలో చిరువ్యాపారులపై వ్యాట్ లేదు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే వంకతో.. వారిపైనా దశలవారీగా పన్ను విధించేందుకు సిద్ధమైంది. రష్యాలో రెపోరేటు బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ వడ్డీ రేట్లు 15శాతానికి పైగా ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షల కారణంగా విదేశాల నుంచి అప్పు పుట్టే అవకాశాలు లేకుండా పోయాయి. అమెరికా, ఐరోపాలో ఉండే రష్యా ఆస్తులు, రష్యన్ల బ్యాంకు ఖాతాలు స్తంభించిపోయాయి.ఆర్థికపరంగా రష్యాకు ఇప్పుడు భారత్ అత్యంత కీలకమైన మిత్రదేశం. అదే సమయంలో భారత్కు కూడా రక్షణపరంగా రష్యా ఆప్తమిత్రుడు. పాకిస్థాన్ దాడులను భారత్ సమర్థంగా ఎదుర్కొనేందుకు దోహదపడ్డ ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు మనకు రష్యా నుంచి వచ్చినవే. మిగ్ విమానాలు కూడా రష్యా సరఫరానే. నిజానికి భారత్ తన రక్షణ వ్యవస్థల అవసరాలను ‘మేకిన్ ఇండియా’లో భాగంగా తీర్చుకోవాలని నిర్ణయించినప్పటికీ.. ఇప్పుడు రష్యా అధునాతన ఆయుధాలను విక్రయించేందుకు సిద్ధమవ్వడంతో.. దిగుమతుల వాటా 36శాతానికి పెరిగింది. నిజానికి దశాబ్దాలుగా భారత రక్షణ వ్యవస్థ బలోపేతానికి సహకరిస్తూ వచ్చిన ప్రధాన దేశం రష్యానే..! ఈ నేపథ్యంలో చమురు కొనుగోళ్ల ద్వారా మిత్రదేశం రష్యాను ఆదుకుంటూనే.. భారత్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశలో అడుగులు వేస్తోంది. భారత్ ఈ నిర్ణయం గనక తీసుకోకపోయి ఉంటే.. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు..!-హెచ్.కమలాపతి రావు -
డొనాల్డ్ ట్రంప్లో అసహనం..
ఇటీవల కాలంలో పలు దేశాల మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నాయకుల మధ్య మాటల దాడి హెచ్చుమీరుతోంది. ఈ పరిణామాలను చూస్తే గతంలోనే వరల్డ్ వార్-3 వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావించారు. దేశాల మధ్య సఖ్యత చెదిరి, యుద్ధాలకు దారి తీస్తున్న పరిస్థితులే వీటన్నంటికీ కారణం. అటు రష్యా-ఉక్రెయిన్ వార్ మొదలుకొని నేటి పాకిస్తాన్-ఆఫ్గాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితుల్ని చూస్తే ఏదో ఉపధ్రవం రాబోతుందా? అని పగటు ప్రజానీకం ఉలిక్కిపడిన సందర్భాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.ట్రంప్లో అసహనం.. మరొకవైపు ‘శాంతి-శాంతి’ అని చెప్పుకునే అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో వరల్డ్ వార్-3 అంటూ వ్యాఖ్యానించారు కూడా. మళ్లీ తాజాగా ట్రంప్ అదే హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయన్ల మధ్య యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ యుద్ధం కారణంగా గత నెలలోనే సుమారు 25 వేల మంది వరకూ మృత్యువాత పడ్డారని, అందులో ప్రజలు, సైనికులు కూడా ఉన్నారన్నారు.ఆ యుద్ధాన్ని తక్షణమే ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా అది కారణం కావొచ్చని హెచ్చరించారు. ఆ ఇర దేశాల నేతాలకు ఎన్నిసార్లు చెప్పినా యుద్ధాన్ని ఏదొక రూపంలో ముందుకు తీసుకెళుతున్నారే కానీ దాన్ని ముగించాలనే ఆలోచన చేయడం లేదంటూ వైట్హౌస్ వేదికగా మీడియా సమక్షంలో అసహనం వ్యక్తం చేశారు. ఈ సంర్భంగా ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు ట్రంప్.ఇక మాటల్లేవ్.. అంతా యాక్షనే..!అంతకుముందు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ల యుద్ధంపై ట్రంప్ చాలా ఆందోళనగా ఉన్నారన్నారు. అది ట్రంప్కు విపరీతమైన చిరాకు తెప్పిస్తుందన్నారు. ఇరుదేశాలు ఒక సఖ్యతకు వచ్చి యుద్ధం ఆపకపోతే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందన్నారు. ఇక రష్యా- ఉక్రెయిన్లతో మాట్లాడాలని ట్రంప్ అనుకోవడం లేదని, ఇక కేవలం చర్యలతోనే ఇరు దేశాలకు సరైన సమాధానం చెప్పాలని ట్రంప్ భావిస్తున్నారన్నారు. భారత టూరిస్టులకు షాకిచ్చిన ట్రంప్.. -
దిక్కుతోచని ఉక్రెయిన్
నెలలు గడుస్తున్నా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విరమణకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అసహనం కట్టలు తెంచుకున్నట్టు కనబడుతోంది. మధ్యవర్తిగా తన ప్రతిపాదనలకు ససేమిరా అంటున్న ఉక్రెయిన్తోపాటు, దానికి దన్నుగా నిలబడిన యూరప్ దేశాలను కూడా ఆయన తూర్పార బడుతున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతున్నదనీ, యూరప్ దేశాలు బలహీనంగా మారి క్షీణదశకు చేరుకున్నాయనీ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. వైరి పక్షాలు ఎటూ నువ్వా నేనా అన్నట్టు ఉంటాయి. మధ్యవర్తిత్వం వహించే దేశం ఓపిగ్గా వాస్తవ పరిస్థితులను అర్థం చేయించి ఏదోమేరకు తగ్గేలా చేయటం అవసరం. కానీ అలా చేయాలంటే మధ్యవర్తిత్వం వహించే దేశానికి విశ్వసనీయత, ప్రతిష్ఠ ఉండాలి. ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాకు ఆ రెండూ తగ్గాయి. ఏ విషయంలోనూ ఆయన నిలకడగా లేకపోవటం, ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తూ అయోమయాన్ని సృష్టించటం కారణం. జో బైడెన్ హయాంలో అమెరికా ప్రాపకంతోనే యూరప్ దేశాలు ఉక్రెయిన్ను రష్యాపైకి ఉసిగొల్పాయి. కానీ ట్రంప్ వచ్చాక అంతా తలకిందులయి యూరప్ దేశాలకు దిక్కుతోచడం లేదు. అంతేకాదు, ఇటీవల జాతీయ భద్రతా వ్యూహం పేరిట అమెరికా విడుదల చేసిన విధాన పత్రం కూడా వాటికి మింగుడుపడటం లేదు. అట్లాస్ మాదిరిగా ఒంటరిగా భూగోళాన్ని మోయటం ఇకపై ఉండబోదనీ, యూరప్ స్వీయరక్షణ బాధ్యత చూసుకోవాలనీ ఆ పత్రం స్పష్టం చేసింది. ప్రపంచాధిపత్యం కోసం పోటీపడటం పర్యవసానంగా అమెరికా బలహీనపడిందనీ, అందుకే పాత విధానానికి అవసరమైన దిద్దుబాట్లు తప్పనిసరనీ తేల్చింది. ఇప్పటికి ఎనిమిది యుద్ధాలు ఆపానని తరచు చెప్పే ట్రంప్ జాబితాలో నిజానికి ఇప్పటికైతే ఉక్రెయిన్ లేదు. కానీ ఆయన అధికార పగ్గాలు చేపట్టిననాడే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని శపథం చేశారు. 2014కు ముందున్న సరిహద్దుల సంగతి ఉక్రెయిన్ మర్చిపోవాలని చెబుతూ వచ్చారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ భూభాగాన్ని వదులుకోవటానికి ససేమిరా అంటున్నారు. నిజానికి 2022లో ఉక్రెయిన్కూ, ఆయనకు మద్దతునిస్తున్న యూరప్ దేశాలకూ బంగారం లాంటి అవకాశం వచ్చింది. టర్కీ మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో రష్యా తనకు తానే రాజీకి సిద్ధపడింది. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటాననీ, నాటోలో చేరబోననీ హామీ ఇస్తే దురాక్రమించిన భూభాగం నుంచి వైదొలగుతామని రష్యా ప్రతినిధి బృందం ప్రతిపాదించింది. యూరప్ నుంచి కూడా దీనిపై హామీ కావాలని కోరింది. అప్పటికి రష్యా పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టి కొన్ని నెలలు మాత్రమే అయింది. కానీ బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటీన ఉక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి రాజీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని నచ్చజెప్పారు. నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాతోనే జాన్సన్ ఈ సైంధవపాత్ర పోషించారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ మొండికేస్తున్నారు. ఆయనకు శాంతియుత పరిష్కారం ఆలోచనే లేదు. ఆధిపత్య స్థాపనే లక్ష్యం. భారత్ వచ్చేముందు ఈ సంగతి నిర్మొహమాటంగా చెప్పారు. ‘ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వైదొలగితే సరే... లేదా దాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటాం’ అని ఆయన ప్రకటించారు. వైరిపక్షాలు చర్చలంటూ మొదలుపెడితే వాటి వైఖరులు ఏదోమేరకు చల్లారుతాయి. కానీ ఆ చర్చలు ఫలించాలంటే తొలుత కాల్పుల విరమణ పాటించాలి. రష్యా, ఉక్రెయిన్ రెండూ అందుకు సిద్ధపడటం లేదు. యుద్ధ వాతావరణంలో చర్చలు ప్రశాంతంగా సాగబోవన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి రష్యా ప్రతిపాదనలకు అంగీకరించమంటూ ఉక్రెయిన్పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో అమెరికాతో నేరుగా మాట్లాడే ధైర్యంలేని యూరప్ దేశాలు... ట్రంప్ను ఖాతరు చేయొద్దని ఉక్రెయిన్కు నూరిపోస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు కాలదన్నుకుంటే, అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారితే ఏమవుతుందో ఉక్రెయిన్ ఈ దశలోనైనా గుర్తెరగాలి. దీన్నుంచి బయటపడాలంటే సొంత గొంతు వినిపించటం ప్రారంభించాలి. -
ఎక్కడ చమురు కొనాలనేది భారత్ ఇష్టం
మాస్కో: అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇతర దేశాలకు ముడిచమరును విక్రయించుకునేందుకు అవరోధాలను ఎదుర్కొంటున్న రష్యా.. భారత్ను చమురుకొనుగోళ్ల విషయంలో ఆకర్షిస్తోందన్న ఆరోపణలపై రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సోమవారం మాస్కోలో మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్ ఎల్లప్పుడూ సార్వభౌమ దేశమే. విదేశీ వాణిజ్య విధానాలు, నచ్చిన దేశం నుంచి చమురు వనరుల కొనుగోలు కార్యకలాపాల్లో భారత్ పూర్తిగా స్వీయనిర్ణయాలనే తీసుకుంటుంది. అందులో రష్యా వంటి మిత్రదేశాల పాత్ర ఉండబోదు. భారత్ తనకు లాభదాయకమైన చోటే ఇంధన కొనుగోళ్లు కొనసాగిస్తుంది. ఆ స్వేచ్ఛ భారత్ ఎప్పుడూ ఉంటుంది’’అని పెస్కోవ్ అన్నారు. మీ వద్ద చమురు కొనుగోళ్లను పూర్తిగా తగ్గించుకోవాలంటూ భారత్పై అమెరికా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లుచేస్తున్న నేపథ్యంలో భారతవైఖరి మారిందా? అన్న ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిచ్చారు. ‘‘భారత్ అనేది తన ఆర్థిక ప్రయోజనాలకే మొదట్నుంచీ పెద్దపీట వేస్తోంది. ఇకమీదట సైతం భారత్లోని మా చమురుభాగస్వాములు అదే బాటలో పయనిస్తారని భావిస్తున్నాం’’అని అన్నారు. వద్దని వారించినా రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడిచమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 50 శాతం దిగుమతి సుంకాల భారం పడేసిన విషయం విదితమే. 2022లో మొదలైన ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి అత్యధిక స్థాయిలో క్రూడ్ఆయిల్ను కొంటున్న దేశాల్లో భారత్ సైతం ఒకటిగా నిలిచిన విషయం తెల్సిందే. అయితే ఇటీవలకాలంలో పశ్చిమదేశాల ఒత్తిడితో రష్యా నుంచి కొనుగోళ్లలో తగ్గుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మీడియాలో ఇప్పటికే కథనలు వెలువడ్డాయి. ‘‘మాకు అమెరికా ఆంక్షలను సమర్థవంతంగా ఎదుర్కొన్న చరిత్ర ఉంది. మా నుంచే భారత్ కొనుగోళ్లు చేయాలనుకుంటే ఆంక్షల ఛత్రం నుంచి ఒడుపుగా తప్పించుకుంటూనే భారత్కు ఆయిల్ సరఫరాచేసే నైపుణ్యాలు మాకు ఉన్నాయి’’అని క్రెమ్లిన్ ఆర్థిక సలహాదారు మాక్సిమ్ ఒరెష్కిన్ ‘ఛానల్1’ఇంటర్వ్యూలో చెప్పారు. -
జెలెన్స్కీపై ట్రంప్ అసహనం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలను జెలెన్స్కీ పూర్తిగా చదవలేదని ట్రంప్ మండిపడ్డారు. ఇదే సమయంలో 10 నెలల కాలంలో తాను ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కెన్నెడీ సెంటర్ ఆనర్స్ రెడ్ కార్పెట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం మేము అధ్యక్షుడు పుతిన్, జెలెన్ స్కీ సహా ఉక్రెయిన్ నాయకులతో మాట్లాడుతున్నాం. శాంతి కోసం మేము తయారు చేసిన ప్రతిపాదనలను జెలెన్ స్కీ చదవలేదు. ఆయన తీరు పట్ల నేను కొంచెం నిరాశ చెందాను. ప్రతిపాదనలను అంగీకరించేందుకు జెలెన్ స్కీ సిద్దంగా లేరు. మరోవైపు.. అమెరికా ప్రతిపాదన పట్ల రష్యా రెస్పాన్స్ బాగుంది. జెలెన్ స్కీ నిర్ణయాలను ఉక్రెయిన్ ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. ఎనిమిది యుద్ధాలు ఆపిన నాకు రష్యాతో ఎలా యుద్దం ముగించాలో తెలియదా? అంటూ’ అని ఘాటు విమర్శలు చేశారు.BREAKING: Trump on the US peace plan for Ukraine🕊️:- Discussed with Ukraine & Russia leaders- Russia is fine with it [the proposal]- Zelensky people “love it,” but he hasn’t read it yet“I'm a little bit disappointed that President Zelensky hasn't yet read the proposal.” 👇 pic.twitter.com/wjBwU7hnJp— Kirill Dmitriev (@kadmitriev) December 8, 2025పురోగతి లేని చర్చలు.. మరోవైపు.. అమెరికా–ఉక్రెయిన్ ప్రతినిధులు మియామిలో వరుసగా మూడు రోజుల పాటు చర్చలు జరిపారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ సందర్భంగా అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రణాళికను రష్యా కొన్ని భాగాల్లో అంగీకరించినట్లు అమెరికా పేర్కొంటోంది. కానీ ఉక్రెయిన్ ఇంకా పూర్తిగా అంగీకరించలేదు. చర్చలు కొనసాగుతున్నప్పటికీ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉండటం కీలకం అని అమెరికా, ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఈ చర్చల్లో అమెరికా తరఫున స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొనగా.. ఉక్రెయిన్ తరఫున రుస్తెమ్ ఉమెరోవ్, ఆండ్రి హ్నాటోవ్ ఉన్నారు.. అలాగే, జెలెన్ స్కీ కూడా వీడియో కాల్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు. కాగా, అమెరికా ప్రతిపాదనలోని కొన్నిఅంశాలను రష్యా తిరస్కరించినట్టు తెలిసింది.రష్యా దాడులు..ఇదిలా ఉండగా.. శాంతి స్థాపన కోసం ఒకవైపు ఉక్రెయిన్తో అమెరికా చర్చలు జరుపుతుండగా.. మరోవైపు వాటిని పట్టించుకోకుండా రష్యా దాడులు చేస్తూనే ఉంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ ఉక్రెయిన్పై చేసిన దాడుల్లో మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. సెంట్రల్ సిటీ క్రెమెన్చుక్లోని మౌలిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. దీంతో విద్యుత్తు, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. క్రెమెన్చుక్ నగరం.. అతి పెద్ద చమురు రిఫైనరీలకు, పరిశ్రమలకు కేంద్రం. ఉత్తర ప్రాంతంలోని చెర్నివ్లో జరిగిన దాడిలో ఒకరు మరణించారు. -
ఉన్నత శిఖరాలకు మన బంధం. ఇండియా-రష్యా సదస్సులో సంయుక్త ప్రకటన చేసిన మోదీ, పుతిన్
-
మురుకులు,ములక్కాయ చారుతో మొదలై..
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఇష్టంగా లాగించే ములక్కాయ చారును పుతిన్ రుచిచూశారు. పుతిన్కు గౌరవార్థం రాష్ట్రపతి ముర్ము శుక్రవారం రాత్రి రాష్ట్రపతిభవన్లో ఇచి్చన విందులో పలు భారతీయ వంటకాలను ఆయనకు వడ్డించారు. సూప్ల కేటగిరీలో మెనూ కార్డులో మొట్టమొదట ములక్కాయ చారు పేరును చేర్చారు. ఆకలిని పెంచే అపిటైజర్ల జాబితాలో కశీ్మరీ స్టైల్లో వాల్నట్లను కలిపిన గుచ్చీ డూన్ చెటిన్, మినప వడలను, కూరగాయలతో నింపిన జోల్ మోమోలును పుతిన్కు వడ్డించారు. ఇక మెయిన్ కోర్స్లో జాఫ్రానీ పనీర్, పాలకూర మెంతికూర పచి్చబఠానీల కూరలతోపాటు పెరుగు, మసాలా దట్టించిన తందూరీ భార్వాన్ ఆలూ, చిన్న వంకాయలతో చేసిన ఆఛారీ బైగన్లనూ పుతిన్కు వడ్డించారు.టమాట, ఉల్లిగడ్డ కలబోతగా వండిన కందిపప్పు కూర సైతం వడ్డించారు. గోంగూర పచ్చడి, మామిడి పచ్చళ్లను సైతం పుతిన్ రుచిచూశారు. డ్రై ఫ్రూట్స్ వేసిన సాఫ్రాన్ పులావ్ను పుతిన్ రుచిచూశారు. లచ్ఛా పరంఠా, మగజ్ నాన్, సతనాజ్ రోటీ, మిస్సీ రోటీ, బిస్కటీ రోటీలను ప్రత్యేకంగా వడ్డించారు. బాదం హల్వా, కేసర్ పిస్తా కులీ్ఫలనూ విడిగా అందించారు.తొలుత అగ్రనేతలతో పిచ్ఛాపాటీగా మాట్లాడేటప్పుడు తెలుగు ప్రజలు ఇష్టంగా తినే మురుకులతోపాటు బెంగాళీ గురు సందేశ్ మిఠాయిని పుతిన్కు ఇచ్చారు. దానిమ్మ, బత్తాయి, క్యారెట్ జ్యూస్లను సిద్ధంగా ఉంచారు. బీట్రూట్, ఖామన్ ఖాక్డీ, కామ్రాక్ బూందీ రైతా కలిపిన షర్కార్కండీ పాపడీ చాట్, అరటి చిప్స్ను అందించారు. సమీపంలో భారతీయ, రష్యన్ వాద్య పరికరాలతో సంగీత విభావరి నిర్వహించారు. సరోద్, సారంగి, తబ్లాలతో రాష్ట్రపతిభవన్ నేవీ వాద్య బృందం అద్బుత ప్రదర్శన ఇచ్చింది. పుతిన్ను పొగిడిన ముర్ము భారత్–రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి పాతికేళ్లు పూర్తవుతున్న వేళ పుతిన్ భారత్లో పర్యటించడం సంతోషదాయకమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. విందు సందర్భంగా ముర్ము కొద్దిసేపు మాట్లాడారు. ‘‘శాంతి, సుస్థిరత, సామాజిక, ఆర్థిక, సాంకేతిక పురోగతే లక్ష్యంగా ఇరుదేశాల భాగస్వామ్యం ముందుకు సాగుతోంది. ఇరుదేశాల బహుముఖ భాగస్వామ్య వాణిజ్యం, ఆర్థిక, రక్షణ, పౌర అణు సహకారం, అంతరిక్షం, శా్రస్తాసాంకేతిక, విద్య, సాంస్కృతి సంబంధాల్లో మరింత ఫలవంతమవుతోంది’’అని ముర్ము అన్నారు. రష్యాకు బయల్దేరిన పుతిన్ రాష్ట్రపతిభవన్లో విందు తర్వాత పుతిన్ తన రెండ్రోజుల భారత పర్యటనను ముగించుకుని రష్యాకు బయల్దేరి వెళ్లారు. రాష్ట్రపతిభవన్ నుంచి నేరుగా ఢిల్లీ లోని పాలం ఎయిర్పోర్ట్కు చేరుకుని సొంత విమానంలో రష్యాకు పయనమయ్యారు. మంత్రి ఎస్.జైశంకర్ పుతిన్కు ఎయిర్పోర్ట్లో వీడ్కోలు పలికారు. -
బలీయ బంధమే ధ్యేయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 23వ ఇండియా–రష్యా సదస్సులో శుక్రవారం కీలక అంశాలపై చర్చించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్తోపాటు ఇరుదేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయానికొచ్చారు. రెండు దేశాల నడుమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించి ఈ ఏడాది అక్టోబర్ నాటికి 25 ఏళ్లు పూర్తికావడం విశేషం. సదస్సు అనంతరం మోదీ, పుతిన్ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.భారత్, రష్యా సంబంధాలకు పరస్పర విశ్వాసం, జాతీయ ప్రయోజనాల పట్ల పరస్పర గౌరవమే పునాది అని ఉద్ఘాటించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వానికి రెండు దేశాల భాగస్వామ్యం దోహదపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, కొన్ని ప్రాంతాల్లో ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాల బంధానికి మరింత ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు. రష్యాలోని యెకటెరిన్బర్గ్, కజన్ నగరాల్లో భారత కాన్సులేట్లు ప్రారంభం కావడాన్ని మోదీ, పుతిన్ స్వాగతించారు. ఉమ్మడి ప్రకటనలోని ముఖ్యాంశాలివీ.. ⇒ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమతుల్యంగా, సుస్థిరమైన రీతిలో పెంపొందించుకోవాలి. భారత్ నుంచి రష్యాకు ఎగమతులు భారీగా పెంచాలి. పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. కొత్తగా సాంకేతికత, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాలి. ఆధునిక రంగాల్లో కలిసి పని చేయడానికి నూతన అవకాశాలను అన్వేíÙంచాలి. 2030 నాటికి ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలి. ⇒ భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇంధన రంగమే మూలస్తంభం. అందుకే ఈ రంగంలో సహకారాన్ని విస్తరింపజేసుకోవాలి. ఇంధన రంగంలో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. కొత్త పెట్టుబడులను ప్రోత్సహించాలి. ⇒ రెండు దేశాల నడుమ స్థిరమైన, ప్రభావవంతమైన రవాణా కారిడార్ల నిర్మాణానికి సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. సరుకు రవాణా వ్యవస్థను, ఇరుదేశాల అనుసంధానాన్ని మెరుగుపర్చాలి. మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని ఇంకా పెంచాలి. ⇒ రష్యన్ ఫెడరేషన్లోని దూర ప్రాచ్యం, ఆర్కిటిక్ జోన్లలో వాణిజ్యం, పెట్టుబడుల సహకారాన్ని పెంచుకోవాలి. ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి తరచుగా ద్వైపాక్షిక సంప్రదింపులు జరపాలి. ఆర్కిటిక్ కౌన్సిల్లో పరిశీలక దేశం హోదా పాత్ర పోషించడానికి భారత్ సంసిద్ధత. ⇒ అణు ఇంధన రంగంలో సహకారం బలోపేతం కావాలి. న్యూక్లియర్ ఎనర్జీని శాంతియుత ప్రయోజనాల కోసమే వాడుకోవాలి. రెండు దేశాలు అందుకు మద్దతివ్వాలి. అణు విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు సహకరించుకోవాలి. అలాగే అంతరిక్ష రంగంలోనూ సహకారం బలపడాలి. మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలు, శాటిలైట్ నావిగేషన్, ప్లానెటరీ ప్రయోగాల్లో పరిజ్ఞానాన్ని పంచుకోవాలి. రాకెట్ ఇంజన్ల అభివృద్ధి, ఉత్పత్తిలో పరస్పరం ప్రయోజనం పొందేలా కలిసి పనిచేయాలి. ⇒ సైనిక, సైనిక సాంకేతిక సహకారాన్ని కూడా పెంపొందించుకోవాలి. సైనిక సామగ్రి విడిభాగాలను భారత్లో తయారు చేయాలి. ఇందుకు రష్యా సహకరిస్తుంది. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి రష్యా తోడ్పాటు లభిస్తుంది. భారత సైనిక దళాల అవసరాలు తీర్చేలా ఉమ్మడి వెంచర్లు ఏర్పాటు చేయాలి. మిత్రదేశాలకు భారత్ నుంచి సైనిక సామగ్రి, ఆయుధాలను ఎగుమతి చేయాలి. ⇒ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలి. ఇరుదేశాల ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేసేలా ప్రోత్సహించాలి. అరుదైన ఖనిజాల అన్వేషణ, వెలికితీత, శుద్ధి, రీసైక్లింగ్కు ఉమ్మడి కృషి అవసరం. సైన్స్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణల్లో ఉమ్మడి పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డిజిటల్ టెక్నాలజీలో సహకారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇరుదేశాల విద్యాసంస్థలు, శాస్త్రీయ సంస్థల మధ్య భాగస్వామ్యం బలపడాలి. ⇒ భారత్, రష్యా స్నేహ సంబంధాలకు సంస్కృతుల అనుసంధానం, ప్రజల అనుసంధానం అత్యంత కీలకం. మరింత లోతైన సంబంధాల కోసం రెండు దేశాల్లో సాంస్కృతిక వేడుకలు, పుస్తక ప్రదర్శనలు, పండుగలు, కళాత్మక పోటీలు నిర్వహించాలి. ఇందులో ప్రజలను భాగస్వాములను చేయాలి. ఒక దేశం సంస్కృతి సంప్రదాయాల గురించి మరో దేశంలోని ప్రజలు తెలుసుకోవాలి. దీంతో వారి మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. సినీ పరిశ్రమ విషయంలోనూ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఉమ్మడి ఫిలిం ప్రొడక్షన్ను అభివృద్ధి చేయాలి. అలాగే పర్యటనలను ప్రోత్సహించాలి. ఇందుకోసం వీసా నిబంధనలు సరళతరం చేయాలి. రెండు దేశాలు ఈ–వీసా విధానం తీసుకురావాలి. అలాగే భారత్, రష్యాలకు చెందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం బలోపేతమయ్యేలా చర్యలు చేపట్టాలి.⇒ ఐక్యరాజ్యసమితిలో కీలక అంశాలపై ఉన్నతస్థాయి రాజకీయ దౌత్యం, సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలి. యూఎన్ చార్టర్ను గౌరవించాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సమగ్ర సంస్కరణలు చేపట్టేలా ఉమ్మడిగా కృషి చేయాలి. అంతర్జాతీయ శాంతి, భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేలా మండలిని ప్రభావవంతంగా తీర్చిదిద్దాలి. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలి. ఇందుకు రష్యా సహకరిస్తుంది. జీ20 కూటమిలోనూ భారత్, రష్యా కలిసి పనిచేయాలి. అంతేకాకుండా ‘బ్రిక్స్’లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. అణు సరఫరాదారుల గ్రూప్లో భారత్కు సభ్యత్వం కలి్పంచడానికి రష్యా సహకారం అందజేస్తుంది. ⇒ ఉగ్రవాదం పెను ముప్పుగా మారింది. ఇదొక ఉమ్మడి సవాలు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిందే. తీవ్రవాదం, సంస్థాగత నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చే ముఠాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై పోరాటం కొనసాగించాలి. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే అంతం చేయాలి. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల్లో తీర్మానం చేసేలా ఒత్తిడి పెంచాలి. -
శిఖరాగ్ర బంధం!.. రష్యాతో అనుబంధం
సంక్లిష్ట సమయాల్లో సైతం నమ్మకమైన నేస్తంగా నిరూపించుకున్న రష్యాతో అనుబంధం మరింత దృఢతరమైంది. గురువారం భారత పర్యటన కోసం వచ్చిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జరిపిన శిఖరాగ్ర సమావేశమైనా, ఆపై ఇరు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాలైనా ఈ సంగతిని నిరూపిస్తున్నాయి. వర్తమాన ప్రపంచ స్థితిగతులు సజావుగా ఏమీ లేవు. ఉక్రెయిన్తో రష్యా నాలుగేళ్లుగా యుద్ధంలో తలమునకలైంది.గడియకో మాట మాట్లాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంగతెలా ఉన్నా యూరప్ దేశాలు ఈ విషయంలో రష్యాపై కత్తులు నూరుతున్నాయి. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించటానికి మధ్యమధ్యలో ట్రంప్ ప్రయత్నిస్తున్నా యూరప్ దేశాలు... ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఎట్లాగైనా రష్యా మెడలు వంచాలని చూస్తున్నాయి. పుతిన్ భారత పర్యటనకు ముందు ‘మా భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి’ అంటూ భారత్లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) రాయబారి హెర్వ్ డెల్ఫిన్ మనకు చెప్పటం గమనించదగ్గది.రష్యా చమురు కొంటున్నందకు ఇప్పటికే అమెరికా ఆగ్రహించి, మనపై 25 శాతం అదనపు సుంకాలు విధించింది. ఇతరత్రా వాణిజ్య ఒప్పందాలకు బ్రేక్ వేయాలంటూ ఒత్తిళ్లు తెస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానంగా నాలుగేళ్ల నుంచి రష్యాకు పాశ్చాత్య బ్యాంకింగ్ వ్యవస్థతో లింక్ తెగిపోయింది. వాణిజ్య సంబంధాలూ అంతే. ఇదే సమయంలో మనతో రష్యా ఆర్థిక సంబంధాలు మెరుగయ్యాయి. మన దేశం నిరుడు 5,600 కోట్ల డాలర్ల విలువైన ముడిచమురు కొనుగోలు చేసింది. అమెరికా ఒత్తిడి పర్యవసానంగా ఇటీవల ఆ కొనుగోళ్లు తగ్గినా ఇరు దేశాల వార్షిక వాణిజ్యం 6,870 కోట్ల డాలర్లకు చేరుకుంది. దీన్ని 10,000 కోట్ల డాలర్లకు చేర్చాలని ఇరుదేశాల లక్ష్యం. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక పుతిన్ ఒక దేశంలో అధికారిక పర్యటనకు రావటం ఇదే తొలిసారి.ఈసారి సైనిక సామగ్రి, ఆయుధాలకు సంబంధించికాక ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలపైనే ఇరు దేశాలూ కేంద్రీకరించాయి. ఇరు దేశాధినేతల సమక్షంలో సంతకాలైన ఆర్థిక సహకార ఒప్పందం 2030 వరకూ షిప్పింగ్, కెమికల్స్, ఆరోగ్యం వగైరారంగాల్లో పరస్పర సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా కలిసి పనిచేయాలని కూడా ఇరు దేశాలూ నిర్ణయించాయి. అయిదో తరం సుఖోయ్ ఎస్యూ–57 యుద్ధ విమానాల అమ్మకానికి రష్యా సుముఖత చూపడమేకాక, వాటిని భారత్లోనే ఉత్పత్తి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే రష్యా రియాక్టర్లతో రెండో అణువిద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పే అవకాశాన్ని పరిశీలించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. ఈ సమావేశం కోసం మోదీ, పుతిన్లిద్దరూ ఈ ఏడాది అయిదుసార్లు ఫోన్లలో సంభాషించుకోవటంతోపాటు చైనాలోని తియాన్జిన్లో మొన్న సెప్టెంబర్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్రం సందర్భంగా కలుసుకున్నారు. ఈ పర్యటనలో కుదరబోయే ఒప్పందాలపైనా, ప్రస్తావనకు రాబోయే భిన్న అంశాలపైనా గత ఆర్నెల్లుగా రెండు దేశాలమధ్యా ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. మొన్న ఆగస్టులో విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాను సందర్శించి పుతిన్ను కలిశారు. అంత క్రితం మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్లారు. ఇవన్నీ శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావటానికి దోహద పడ్డాయి.ఎవరితోనైనా తాము కుదుర్చుకునే ద్వైపాక్షిక ఒప్పందాలు మూడో దేశానికి వ్యతిరేకం కాదని మన దేశం మొదటినుంచీ చెబుతోంది. రష్యాతో సంబంధాల విషయంలో అమెరికా, యూరప్ దేశాల ఒత్తిళ్లు పనిచేయబోవని ఈ శిఖరాగ్ర సమావేశం నిరూపించింది. చైనా–రష్యా సంబంధాలు ప్రస్తుతానికి బాగున్నా, ఆసియాలో తన ప్రయోజనాలను విడనాడుకోవటానికి రష్యా సిద్ధంగా లేదు. అలాగే అమెరికా–చైనా సన్నిహితమవుతున్న తీరును కూడా రష్యా గమనించకపోలేదు. ఎవరెవరితో కలుస్తారో, ఏ కూటములు ఎన్నాళ్లు మనుగడలో ఉంటాయో తెలియని అయోమయ స్థితిలో స్వతంత్ర విదేశాంగ విధానమే సర్వవిధాలా మేలైనదని మన దేశం చాటిచెప్పింది. -
30 దేశాల పౌరులపై నిషేధానికి అమెరికా సన్నాహాలు
అమెరికా తమ దేశంలోకి అడుగు పెట్టకుండా మరికొన్ని దేశాల పౌరులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా పౌరుల భద్రత పేరుతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. అమెరికా తమ పౌరుల భద్రత పేరుతో పలు దేశాలను, ఆ దేశాలకు చెందిన పౌరులను నిషేధించాలని నిర్ణయించింది. తాజాగా ఫాక్స్ న్యూస్ ప్రోగ్రామ్ ‘ది ఇంగ్రహం యాంగిల్’లో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే అమెరికా 19 దేశాలకు చెందిన పౌరులపై ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. అంటే.. ఈ దేశాలకు చెందిన పౌరులకు అన్నిరకాల ఇమ్మిగ్రేషన్లను నిలిపివేయనుంది. అదేవిధంగా పౌరసత్వం, గ్రీన్కార్డు దరఖాస్తులకు సైతం ఆయా దేశాల పౌరులను అనర్హులుగా ప్రకటించింది. అదేవిధంగా ఆయా దేశాలకు తమ పౌరులు వెళ్లకూడదంటూ ట్రంప్ ట్రావెల్ అలెర్ట్ జారీ చేశారు. ఇప్పటికే నిషేధం అమలవుతున్న దేశాలు ఏవి? గత నెల వైట్హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్స్పై ఆఫ్ఘన్ శరణార్థి కాల్పులు జరిపిన ఉదంతం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఆఫ్ఘనిస్థాన్తోపాటు.. కాంగో, క్యూబా, ఇరాన్, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్, తుర్కెమెనిస్థాన్, వెనిజులా, యెమన్తోపాటు.. మొత్తం 19 దేశాలపై నిషేధం విధించారు. తాజాగా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ చెప్పిన దాని ప్రకారం ఈ జాబితాలో మరో 11 దేశాలు చేరనున్నట్లు స్పష్టమవుతోంది. ట్రంప్ నిర్ణయాన్ని రివర్స్ మైగ్రేషన్ అనవచ్చా?అవును ఇది కచ్చితంగా రివర్స్ మైగ్రేషనే. ట్రంప్ నిషేధం విధించిన దేశాలకు చెందిన వారిని అమెరికా నుంచి డీపోర్ట్ చేస్తారు. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ తాజాగా ఫాక్స్ న్యూస్తో మాట్లాడినప్పుడు.. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా పౌరుల భద్రత పెరుగుతుందని, తమ దేశంలో నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఆ మేరకు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం భారీ కసరత్తే చేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయంలో సమస్యాత్మక జనాబా తగ్గుతుందని, అంతకు మించితే సామాజిక సమస్యలు ఏమీ ఉండవని అభిప్రాయపడ్డారు. మరో 11 లేదా అంతకంటే ఎక్కువ దేశాలపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ జాబితాలో ఏయే దేశాలున్నాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. -
పుతిన్ ఇష్టపడే వంటకాలివే..!
భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, అధికారిక విందులో ఆయ ఇష్టంగా ఆస్వాదించే వంటకాలేవి, ముఖ్యంగా ఇలాంటి పర్యాటనలలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు తదితరాల గురించి సవివరంగా తెలుసకుందామా..!.పుతిన్ భారత్ వంటకాలను రుచి చూస్తారేమోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ పుతిన్ క్రమశిక్షణ, కఠినమైన భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడిగా పేరుగాంచిన వ్యక్తి. ఆయన ఆహారానికి సంబంధించి.. ఫుల్ సెక్యూరిటీ మధ్య సైనిక పర్యవేక్షణలో నిర్వహిస్తారు. సాధారణంగా హోటల్ లేదా ఇతర దేశాల ఆతిథ్యంలో తయారు చేసిన భోజనాన్ని చాలా అరుదుగా తీసుకుంటారట పుతిన్. మాములుగా అయితే శిక్షణ పొందిన రష్యన్ చెఫ్లు, సహాయక సిబ్బంది పుతిన్ వెంట వస్తుంటారు. కాబట్టి వారే ఆయన భోజనం గురించి స్వయంగా చూసుకుంటారు. అందువల్ల ఆయన ఎలాంటి ఆహారం తీసుకుంటారనేది చాలా సీక్రెట్గా ఉంది. అంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం..ఆయన ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధ్యానత ఇస్తారట. ప్రతి ఉదయం తేనె లేదా గంజితో ట్వోరోగ్(రష్యన్ కాటేజ్ చీజ్)తో ప్రారంభమవుతుందట. తాజా జ్యూస్, కౌజు పిట్ట గుడ్లతో చేసిన ఆమ్లెట్, తక్కువ చక్కెర కలిగిన ఆహారాలు వంటి వాటినే తీసుకుంటారట.ఆయన ఎర్ర మాంసం కంటే తాజా చేపలు అది కూడా కాల్చినవి ఇష్టంగా తింటారట. లేత గొర్రెపిల్ల మాంసం కూడా అప్పడప్పుడూ తీసుకుంటారట. ఇక ఆయన భోజనంలో ఎక్కువుగా టమోటాలు, దోసకాయలు, ఇతర ప్రాథమిక కూరగాయల సలాడ్లు తప్పనిసరిగా ఉంటుందట.ఇక జ్యూస్లలో కూడా మూలికా పానీయాలు, కేఫీర్, బీట్రూట్-ముల్లంగి జ్యూస్ వంటివి తీసుకుంటారట. ఇక పుతిన్కు పిస్తా ఐస్ క్రీం మహా ఫేవరెట్ డిజర్ట్ అట. చివరగా ఆయన క్రమశిక్షణతో కూడిన సంప్రదాయ ఆహారానికే కట్టుబడి ఉంటారట. చాలామటుకు ప్రోటీన్ కంటెంట ఉన్నవి, పోషకాహారానికి ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు పుతిన్ సన్నిహితులు.(చదవండి: అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..) -
టిట్ ఫర్ టాట్ పడిందా?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన దగ్గర్నుంచీ అన్ని వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్.. ప్రధానంగా ప్రతీదేశం తమ అదీనంలో ఉండాలని ఆకాంక్ష ట్రంప్లో బలంగా నాటుకుపోయినట్లుంది. అందుకే ఆ దేశం, ఈ దేశం అని లేదు.. అన్ని దేశాలను తన చర్యలతో భయపెడుతున్నారు. తమది అగ్రరాజ్యమనే అహంకార భావనలో ఉన్న ట్రంప్ చేస్తున్న చేష్టలు కొన్ని దేశాలకు విసుగుతెప్పిస్తూనే ఉంది.అలా ట్రంప్ చర్యలతో ఎక్కువగా విసుగుపోయిన దేశాలలో రష్యా ఒకటి, భారత్ మరొకటి. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు. అదే సమయంలో భారత్కు ఆంక్షలు కూడా విధించారు. ‘ మీరు రష్యా ఆయిల్ కొనడానికి వీల్లేదనే హుకుం జారీ చేశారు. ఇది రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపడానికని శాంతి ప్రవచనాలు కూడా చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని ఎంతవరకూ నియంత్రించారో తెలీదు కానీ, రష్యా మాత్రం మళ్లీ భారత్కు చమురు సరఫరా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. భారత్కు చమురు కొనసాగిస్తాం.. : పుతిన్ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. మీడియా సాక్షిగా భారత్కు అన్ని రకాల చమురు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అమెరికా భయపెడితే భయపడిపోవడానికి తామేమీ చిన్న పిల్లలం(చిన్న దేశం) కాదనే సంకేతం ఇచ్చారు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న పుతిన్.. ఇరు దేశాల మధ్య ఒప్పందాల గురించి వివరించే క్రమంలో చమురును భారత్కు యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.అసలే పుతిన్ భారత్ పర్యటనపై ఫుల్ ఫోకస్ పెట్టిన ట్రంప్.. ఈ మాట అనేసరికి నోట్లో వెలక్కాయపడినట్లు అవ్వడం ఖాయం. పుతిన్-మోదీలు ఏం చెబుతారా అనే ఆసక్తిగా గమనిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. పుతిన్ మాటలకు చిర్రెత్తుకొచ్చినట్లు అయ్యి ఉంటుంది. గతంలో వైట్హౌస్ వేదికగా పుతిన్-ట్రంప్ల మధ్య భేటీ జరిగింది. ఆ భేటీ కూడా సజావుగా సాగలేదు. తమ ఆంక్షలకు కట్టుబడి ఉండాలనే ఒత్తిడితో ఆ భేటీ సఫలం కాలేదు. ‘శాంతి’ చర్యలు అంటూ పలు దేశాలకు తలనొప్పివేరే దేశాన్ని నియంత్రించాలని అనుకోవడం ఎంతవరకూ సబబు అనేదే ఇక్కడ ప్రశ్న. ఎంతటి అగ్రజుడు అయినా తమ అధీనంలో అంతా ఉండాలని అనుకోవడం అవివేకం. వీటికి ఎన్నో కథలు, ఉదాహారణలు, సామెతలు కూడా ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసినవే. ఇప్పటి వరకూ ట్రంప్ చేసింది ఏదైనా ఉందంటే అది తన ‘శాంతి’ చర్యలతో మిగతా దేశాలని నొప్పించడమే జరుగుతుంది. ఇక్కడ తమ మాట వింటే ఒక రకంగా, మాట వినకపోతే మరో రకంగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ‘కశ్మీర్’ అంశాన్ని తాను పరిష్కరిస్తానని ట్రంప్ చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు గుర్తే. ఆ మాటలకు భారత ప్రధాని మోదీ కూడా స్ట్రాంగ్గానే సమాధానం ఇచ్చారు. తమ సమస్యను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చిచెప్పారు. తమ సమస్యను పరిష్కరించుకునే సత్తా తమకు ఉందని ట్రంప్ను పరోక్షంగా హెచ్చరించారు. అంటే పుతిన్-మోదీలిద్దరూ ట్రంప్ను అంతగా పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నారు. స్నేహ ధర్మంలో హద్దులు దాటి ‘సరిహద్దులు’ వరకూ వస్తే ఊరుకోమని సంకేతాలు పంపుతూనే ఉన్నారు. అందుకే మోదీ-పుతిన్ల భేటీపై ట్రంప్ సీరియస్ లుక్ వేసి ఉంచారు. ప్రస్తుతం పుతిన్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్కు వినబడ్డాయా.. లేదా అనే రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇదీ చదవండి:పాక్తో ఇంకా సంబంధాలెందుకు?: అమెరికా ఎంపీల డిమాండ్ -
భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
ఢిల్లీ: భారత్-రష్యాలమధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. వివిద రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సహకారం వలస విధానంపై ఒప్పందంతో పాటు, ఆహార భద్రత, వైద్య, ఆరోగ్య రంగాలపై ఒప్పందం, కెమికల్ ఫెర్టిలైజర్స్ సరఫరాపై ఇరు దేశాల మధ్య ఒప్పందం, సముద్ర ఆహార ఉత్పత్తులపైనా ఒప్పందాలు జరిగాయి.దీనిలో భాగంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ-రష్యా అధ్యక్షడు పుతిన్ల సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందాలపై కీలక సంతకాలు జరిగాయన్నారు. ‘పుతిన్ నేతృత్వంలో భారత్-రష్యాల సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. గత ఎనిమిది దశాబ్దాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం.భారత్-రష్యాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుంది. రష్యా ఎప్పట్నుంచో మనకు మిత్రదేశం. 2030 వరకూ ఇరు దేశాల మధ్య అనేక ఆర్థిక సహకార ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు శిఖరాగ్రానికి చేరతాయి’ అని స్పష్టం చేశారు.అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. ‘ నాకు అపూర్వ స్వాగతం పలికిన భారతీయులందరికీ కృతజ్ఞతలు. భారత ఆతిథ్యం సంతోషాన్ని ఇచ్చింది. భారత్-రష్యాల మధ్య సహృద్భావ వాతావరణం. నేను మోదీతో అంతర్జాతీయ అంశాలను షేర్ చేసుకున్నా. ఆర్థిక, భద్రత తదితర అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాం. అనేక అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.. మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. భారత్, రష్యాల మధ్య రవాణా అనుసంధానం పెంచడం మా లక్ష్యం. మేకిన్ ఇండియాకు మా మద్యతు ఉంటుంది. భారత్కు చముర సరఫరాను కొనసాగిస్తాం’ అని తేల్చి చెప్పారు పుతిన్. -
భారత్కు అండగా రష్యా.. పుతిన్పై ట్రంప్ ఫుల్ ఫోకస్?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో ఉన్నారు. 2021 తర్వాత భారత పర్యటనకు పుతిన్ రావడం ఇదే తొలిసారి. అలాగే, 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత పర్యటనకు పుతిన్ వచ్చిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యత చోటుచేసుకుంది. కాగా, పుతిన్ పర్యటనలో భాగంగా భారత్, రష్యా మధ్య వాణిజ్య, రక్షణ రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే, పుతిన్ భారత పర్యటనలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణంగా భారత్కు రష్యా మిత్ర దేశం కావడమే.రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలు దేశాల్లో అనేకమంది పాలకులు మారారు. దాదాపు పాతికేళ్లుగా పుతిన్ అధికారంలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో అమెరికాలో ఐదుగురు అధ్యక్షులు మారారు. భారత్ ముగ్గురు ప్రధానులను చూసింది. పుతిన్ తప్ప మరో అధ్యక్షుడి పేరు తెలియని యువ ఓటర్లు రష్యాలో చాలా మందే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పుతిన్ హయాంలో భారత్, రష్యా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. రష్యా నేతలు భారత్ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేశారని గతంలో ఒకసారి పుతిన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా పుతిన్ తొలి భారత పర్యటన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో జరిగింది. ఆ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి బాటలు వేసింది. ఇప్పుడు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి.ఆయుధాలు రష్యావే.. భారత్ రష్యా రక్షణ పరిశ్రమకు పెద్ద మార్కెట్గా ఉంది. భారత సాయుధ దళాలు వినియోగించే ఆయుధాల్లో 36 శాతం రష్యావే. రక్షణ సహకారం, లాజిస్టిక్స్ ఒప్పందాల్లో భాగంగా మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు ఐదోతరం సుఖోయ్-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు, ఒప్పందాలు ఎజెండాలో ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్లో పాక్ దాడుల నుంచి భారత్కు రక్షణ కవచంలా నిలిచిన S-400కు అప్డేటెడ్ వర్షనైన S-500 గగనతల రక్షణ వ్యవస్థ అమ్మకాలపై ఇరుదేశాలు ఓ అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక, మిగ్–29, బ్రహ్మోస్ క్షిపణులు, అణు జలాంతర్గాములు వంటి కీలక వ్యవస్థలు రష్యా సహకారంతోనే నడిచాయి. మరోవైపు.. చైనా సైతం భారత్-రష్యా సంబంధాలు అత్యంత వ్యూహాత్మకమైనవి, ప్రపంచ రాజకీయ ఒత్తిళ్లకు లోబడనిది అని పేర్కొంది.కీలక ఒప్పందాలు ఇలా.. 1. RELOS ఒప్పందం (Reciprocal Exchange of Logistic Support)- రష్యా పార్లమెంట్ 2025లో ఆమోదించిన కీలక ఒప్పందం.- రెండు దేశాల సైన్యాలు ఒకరి నౌకాదళ, వైమానిక స్థావరాలు, లాజిస్టిక్ సదుపాయాలు ఉపయోగించుకోవచ్చు.2. 2021–2031 సైనిక-సాంకేతిక సహకార కార్యక్రమం- 2021లో 2+2లో సంతకం.- పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ వంటి విభాగాల్లో దీర్ఘకాలిక సహకారం.3. సుఖోయ్–30 MKI ఒప్పందం- 1996లో మొదటి ఒప్పందం.- 50 విమానాల కొనుగోలు, 140 విమానాల HALలో లైసెన్స్ ఉత్పత్తి.4. బ్రహ్మోస్ క్షిపణి సంయుక్త ప్రాజెక్ట్- భారత్-రష్యా సంయుక్త సంస్థ (BrahMos Aerospace).- ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ వ్యవస్థ.5. మిగ్–29 అప్గ్రేడ్, కొనుగోలు ఒప్పందాలు- పలు దశల్లో మిగ్–29 విమానాల కొనుగోలు, అప్గ్రేడ్.6. అణు జలాంతర్గామి (INS Chakra) లీజ్ ఒప్పందాలు- రష్యా నుండి అణు శక్తితో నడిచే జలాంతర్గాముల లీజ్.7. S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒప్పందం- 2018లో సంతకం.- ఐదు రెజిమెంట్ల కొనుగోలు.8. కా-226T హెలికాప్టర్ సంయుక్త ఉత్పత్తి ఒప్పందం- భారత్లో తయారీకి ఒప్పందం (Make in India).9. AK-203 అసాల్ట్ రైఫిల్ ఉత్పత్తి ఒప్పందం- ఉత్తరప్రదేశ్లో సంయుక్త ఉత్పత్తి.10. పది అంతర్ ప్రభుత్వ ఒప్పందాలు, 15 వాణిజ్య ఒప్పందాలు (2025)- పుతిన్ పర్యటనలో సంతకం చేయడానికి సిద్ధం చేసిన ప్యాకేజ్.11. సంయుక్త సైనిక విన్యాసాలు- ఇండ్రా (INDRA)- అవియాడ్రిల్- నౌకాదళ, వైమానిక, భూసేనల సంయుక్త వ్యాయామాలు.12. అంతరిక్ష–రక్షణ సహకారం- గగనయాన్ వ్యోమగాముల శిక్షణలో రష్యా పాత్ర.- అంతరిక్ష–రక్షణ రంగంలో కొత్త ఒప్పందాలు పుతిన్ పర్యటనలో చర్చించబడ్డాయి.రష్యా-ఉక్రెయిన్ అంశం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి భారత్ ఎంతో సంయమనం పాటించింది. రెండు దేశాల శాంతి కోసమే ప్రయత్నాలు చేసింది. ఓవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరుపుతూనే.. రష్యా దూరం కాకుండా ముందుకు సాగింది. రష్యా నుంచి చమురు విషయంలోనూ భారత్ ప్లాన్ ప్రకారం నడుచుకుంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోలా ఉంది. 50 శాతం దిగుమతి సుంకాలతో భారత్ను లొంగదీసుకోవచ్చని ఆయన భావించారు. కానీ అది జరగలేదు. అమెరికాకు అనుకూలమా? వ్యతిరేకమా? ఏదో ఒకటి చెప్పేయండి అంటూ భారత్కు ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. అయినా రష్యాతో స్నేహ బంధాన్ని భారత్ తెంచుకోలేదు. దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ఎక్కువని గతంలో భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. పుతిన్ పర్యటన వేళ కూడా ఇదే దిశగా ఒప్పందాలు, నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ వ్యవహారాల పరిశీలకులు అంచనా వేస్తున్నారు.రష్యాతో వాణిజ్యం.. 2024-25లో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 68.7 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ 4.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేయగా.. రష్యా నుంచి ఏకంగా 64 బిలియన్ డాలర్ల దిగుమతులను చేసుకుంది. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని ఇరుపక్షాలు ప్రకటించాయి. పుతిన్ పర్యటనలో ఇంధనం ప్రముఖంగా ప్రస్తావనకు రానుంది. భారత్కు తక్కువ ధరకే రష్యా ముడి చమురును సరఫరా చేస్తోంది. ఇది రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉన్న వేళ ఇంధన కొనుగోళ్లపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారత అణు పరిశ్రమలో రష్యా సహకారం మరవలేనిది. పుతిన్ పర్యటన వేళ.. పౌర అణు సహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. చిన్న రియాక్టర్లను ఉత్పత్తి చేయడంలో అపార అనుభవనం ఉన్న రష్యా.. వాటిని భారత్కు ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. కుడంకుళంలో అణుశక్తి ప్రాజెక్టు కొనసాగింపుపై చర్చించనున్నట్లు రష్యా అధికారులు తెలిపారు.ట్రంప్ రియాక్షన్? ఒకవేళ రష్యాతో చమురు అనుబంధాన్ని, రక్షణ రంగ సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంటే, అమెరికా సీరియస్గా స్పందించే ఛాన్స్ ఉంది. ట్రంప్ మరోసారి భారత్పై సుంకాలు విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాకు కోపాన్ని తెప్పించే నిర్ణయాలు, ఒప్పందాల దిశగా భారత్ ప్రస్తుతానికి అడుగులు వేయకపోవచ్చని వారు అంటున్నారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, ఆపద కాలంలో ఆదుకునే రష్యాతో చెలిమిని నిలుపుకునే దిశగా లౌక్యంగా భారత్ ముందుకు సాగుతుందని విశ్లేషిస్తున్నారు.డాలర్కు చెక్ పెట్టే ప్లాన్భారత్, రష్యాలు ప్రస్తుతం అమెరికా డాలరుతో పాటు తమ తమ దేశాల కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలు జరుపుతున్నాయి. రానున్న రోజుల్లో పూర్తిగా సొంత కరెన్సీల్లో వాణిజ్యం జరిపేలా వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే అంశంపై పుతిన్, మోదీ చర్చించనున్నారు. అందుకే పుతిన్ వెంట రష్యాకు చెందిన స్పర్ బ్యాంక్ సీఈఓ ఇవాన్ నోసోవ్ కూడా వచ్చారు. వాణిజ్య లావాదేవీల ద్వారా రష్యాకు పెద్దమొత్తంలో భారత రూపాయలు చేరాయి. వాటితో భారత్లోని మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని స్పర్ బ్యాంక్ యోచిస్తోంది. భారత్తో వాణిజ్య లావాదేవీలు జరిపే క్రమంలో రష్యా వ్యాపారులకు రూపాయి విలువ కలిగిన లెటర్ ఆఫ్ క్రెడిట్ను జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ఈ బ్యాంకు ప్రారంభించింది. ఒకవేళ దీనిపై భారత్-రష్యాలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రష్యా, భారత్పై ట్రంప్ మరోసారి కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. -
India Tour : పాలెం ఎయిర్ పోర్టులో పుతిన్ ల్యాండింగ్
-
పుతిన్కు ఘన స్వాగతం
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో అధికారిక పర్యటనకు శ్రీకారం చుట్టారు. రష్యా నుంచి గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న పుతిన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. భారత్, రష్యా మధ్య దశాబ్దాల స్నేహ సంబంధాలకు ప్రతీకగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచి్చన పుతిన్ను చిన్నారులు సంప్రదాయనృత్యాలతో స్వాగతించారు. పుతిన్, మోదీ చప్పట్లతో వారిని అభినందించారు. అనంతరం ఇరువురూ ఒకే కారులో మోదీ అధికారిక నివాసానికి చేరుకున్నారు. అక్కడ పుతిన్కు ప్రధానమంత్రి ప్రైవేట్ విందు ఇచ్చారు. పుతిన్, మోదీ ఒకే కారులో ప్రయాణించడం మూడు నెలల్లో ఇది రెండోసారి. చైనాలోని తియాంజిన్ సిటీలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా వారిద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయాలు, వివిధ దేశాల మధ్య ఘర్షణలు, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో పుతిన్ చిరకాల మిత్రదేశమైన ఇండియాలో పర్యటిస్తుండడం విశేషమైన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రోటోకాల్ను పక్కనపెట్టి మరీ పుతిన్ కోసం ఎయిర్పోర్టుకు స్వయంగా రావడం విశేషం. తన మిత్రుడు పుతిన్కు స్వాగతం పలకడం ఆనందంగా ఉందంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయనతో చర్చల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్–రష్యా బంధం ఇరుదేశాల ప్రజలకు ప్రయోజనం కలిగిస్తూ కాల పరీక్షకు నిలిచిందని ఉద్ఘాటించారు. మోదీ నివాసంలో విందు సమావేశం దాదాపు మూడు గంటలపాటు జరిగింది. అనంతరం పుతిన్ ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. రాత్రి ఆయన అక్కడే బస చేశారు. నేడు వరుస భేటీలు వరుస భేటీతో పుతిన్ షెడ్యూల్ శుక్రవారం బిజీబిజీగా సాగిపోనుంది. పుతిన్కు ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద భారత త్రివిధ దళాలు లాంఛనంగా స్వాగతం పలుకుతాయి. అనంతరం ఆయన రాజ్ఘాట్ను సందర్శించి, మహాత్మాగాం«దీకి నివాళులరి్పంచబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్లో జరిగే 23వ ఇండియా–రష్యా సదస్సులో పాల్గొంటారు. ఇదే భవనంలో పుతిన్కు, ఆయన ప్రతినిధి బృందానికి మోదీ విందు ఇవ్వబోతున్నారు. సదస్సు తర్వాత ఇద్దరు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నారు. అలాగే రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని న్యూ ఇండియా చానల్ను పుతిన్ ప్రారంభిస్తారు. భారత్ మండపంలో ఫిక్కి, రాస్కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాపార సదస్సులో మోదీ, పుతిన్ పాల్గొంటారు. అనంతరం పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పుతిన్ ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్తారు. కీలక ఒప్పందాలు? ఇండియా–రష్యా సదస్సులో ముఖ్యమైన అంశాలపై చర్చించబోతున్నారు. ఈ సందర్భంగా వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, రక్షణ రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు జరుగనున్నాయి. #WATCH | Russian President Vladimir Putin lands in Delhi; Prime Minister Narendra Modi receives him at the airportPresident Putin is on a two-day State visit to India. He will hold the 23rd India-Russia Annual Summit with PM Narendra Modi in Delhi on December 5(Source: DD) pic.twitter.com/wFcL9of7Eg— ANI (@ANI) December 4, 2025 TWITTER HAS UPDATED THE ❤️ LIKE BUTTONTO CELEBRATE PRESIDENT VLADIMIR PUTIN’S VISIT TO INDIA!Heartfelt thanks for the grand welcome of President Putin in India.#PutinInIndia #VladimirPutin #IndiaRussia #ModiPutinSummit 🇮🇳🇷🇺 pic.twitter.com/lVVkXTkDWI— LOKESH YOGI (@YKumar_Lokesh) December 4, 2025కారు పూలింగ్ ఆలోచన నాదే: పుతిన్ చైనాలోని తియాంజిన్లో సెపె్టంబర్ 1న భారత ప్రధాని మోదీతో కలిసి ఒకే కారులో ప్రయాణించాలన్న ఆలోచన తనదేనని పుతిన్ తెలిపారు. ఇది తమ స్నేహానికి గుర్తు అని వివరించారు. ఇండియా టుడే వార్తా సంస్థకు ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది ముందస్తు ప్రణాళికతో జరిగిన ఘటన కాదని అన్నారు. సదస్సు వేదిక నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ తన కారు సిద్ధంగా ఉందని, కలిసి వెళ్దామని తాను కోరడంతో మోదీ అంగీకరించారని చెప్పారు. షాంఘై సహకార సదస్సు ఎజెండాతోపాటు ఇతర అంశాలపై మాట్లాడుకున్నామని వెల్లడించారు. పుతిన్కు భగవద్గీత బహూకరణ ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీత ప్రతిని బహూకరించారు. భగవద్గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
స్మార్ట్ఫోన్ ముట్టని పుతిన్.. షాకిచ్చే కారణం
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నాయకుల్లో ఒకరు. ఆయన ప్రతి కదలికలోనూ నిరంతర నిఘా ఉంటుంది. ఆయన చుట్టూ ఉండే ‘భద్రతా వలయం’ ఎప్పుడూ చర్చనీయాంశమే. డిసెంబర్ 4, 5 తేదీల్లో పుతిన్ భారతదేశ పర్యటనకు రానున్న నేపథ్యంలో, ఆయన భద్రతా ఏర్పాట్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఇంతటి పటిష్టమైన భద్రత మధ్య, ఆధునిక సాంకేతికతకు దూరంగా ఉండే పుతిన్ నిజంగా స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తారా? అనే ప్రశ్న ఆసక్తి కలిగిస్తుంది.పుతిన్ స్మార్ట్ఫోన్కు దూరంగా ఉంటారని ఏఎఫ్పీ న్యూస్ నివేదించింది. 2018లో శాస్త్రవేత్తలతో జరిగిన ఒక సమావేశంలో అందరి జేబుల్లో స్మార్ట్ఫోన్లు ఉన్నాయని ఒక ప్రతినిధి ప్రస్తావించగా పుతిన్ వెంటనే స్పందిస్తూ, ‘నా దగ్గర స్మార్ట్ఫోన్ లేదు’ అని స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కూడా ధృవీకరించారు. ‘స్మార్ట్ఫోన్ను ఉపయోగించడం అనేది ఆ వ్యక్తి గోప్యత, భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. ఇది ముఖ్యంగా ఉన్నత స్థాయి నేతలకు గొప్ప ప్రమాదాన్ని కలిగిస్తుంది’ అని పెస్కోవ్ స్పష్టం చేశారు. పుతిన్ తన అధికారిక నివాసమైన క్రెమ్లిన్ లోపల మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించారని కూడా చెబుతారు. ఆయన ఎవరితోనైనా సంభాషించాలంటే అధికారిక (సురక్షితమైన) ఫోన్ లైన్ను ఉపయోగిస్తారు.పుతిన్ ఆధునిక సాంకేతికతపై అనాసక్తిని చాలాసార్లు వ్యక్తం చేశారు. 2017లో పాఠశాల పిల్లలతో మాట్లాడినప్పుడు, తాను ఇంటర్నెట్ను చాలా అరుదుగా ఉపయోగిస్తానని తెలిపారు. అంతేకాదు ఆయన ఇంటర్నెట్ను విమర్శిస్తూ, అది ‘సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన ప్రత్యేక ప్రాజెక్ట్. అందులో సగం అశ్లీలత ఉంటుందని వ్యాఖ్యానించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇంటర్నెట్కు అనుసంధానించే ఎలాంటి పరికరాలను లేదా గాడ్జెట్లను పుతిన్ విశ్వసించరు. మొబైల్ ఫోన్లకు ఆయన దూరంగా ఉండటమే కాకుండా, ఎప్పుడైనా అలాంటి పరికరాలు తనదగ్గరకు తీసుకువస్తే వాటిని దూరం పెట్టాలని ఆదేశిస్తారు. ఈ చర్యలన్నీ ఆయన తన భద్రత, సమాచార గోప్యతకు ఇచ్చే అత్యున్నత ప్రాధాన్యతను స్పష్టం చేస్తాయి.పుతిన్ విదేశాలకు పర్యటించినప్పుడు, ఆయన భద్రతా బృందం తీసుకునే జాగ్రత్తలు మరింత పటిష్టంగా ఉంటాయి. ఆయన బస చేసే హోటల్, తినే ఆహారం వరకు ప్రతి ఒక్కటి ముందుగానే క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. విషప్రయోగం లేదా కలుషితం కాకుండా నిరోధించడానికి, ఆయనకు వడ్డించే ఆహారాన్ని ప్రత్యేకంగా పరీక్షిస్తారు. అంతేకాకుండా ఆయన బస చేసే ప్రాంతాలను కూడా భద్రతా సిబ్బంది పూర్తిగా శానిటైజ్ చేసి శుభ్రం చేస్తారు. ఈ అంశాలు సాంకేతికంగా వెనుకబాటును చూపుతున్నప్పటికీ, అత్యున్నత స్థాయి నేత భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో తెలియజేస్తున్నాయి.ఇది కూడా చదవండి: పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే! -
అస్థిర ప్రపంచంలో సుస్థిర బంధం
ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సు నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ రాక ఒక పాత సంగతిని గుర్తుకు తెస్తోంది. దాదాపు ఐదు న్నర దశాబ్దాల క్రితం భారతదేశంతో ‘స్నేహ ఒడంబడిక’ కోసం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో చేతులు కలిపేందుకు అప్పటి సోవియట్ యూనియన్ నాయకులు ఇలాగే ఢిల్లీ వచ్చారు. తూర్పు పాకిస్తాన్లో మారణ హోమాన్ని అంత మొందించే ప్రత్యక్ష ప్రమేయానికి ముందు అది జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచం రెండు అగ్ర రాజ్యాల మధ్యన చీలిపోయింది. కానీ, ఇపుడు అంతర్జాతీయ వ్యవస్థ ఏ దిశగా సాగుతోందో తెలియని ఒక కొత్త స్థితిలోకి జారు కుంది. అమెరికా శక్తిమంతమైనదిగానే కొనసాగుతోంది కానీ, దాన్ని అంతగా నమ్మడానికి లేదనే అభిప్రాయం పాదుకుంది. చైనా శిఖరా రోహణ ఇతర ప్రవర్ధమాన దేశాలలో ఆందోళనను పెంచుతోంది. ఐరోపా మరింత స్వయం ప్రతిపత్తిని చాటుకునేందుకు తారట్లాడు తోంది. గాలివాటుగా ఉన్న భారత–రష్యాలు అవసరార్థమే అయిన ప్పటికీ, వ్యూహాత్మక పొందికను పునరుద్ధరించుకుంటున్నాయి. ఒకరికొకరు నిలబడి...అమెరికా నిలకడలేనితనంతో దానిపై చాలా దేశాలకు నమ్మకం కొరవడింది. దానికి తోడు అది ఎక్కడెక్కడో సుదీర్ఘ కాలం యుద్ధా లను కొనసాగించి, చివరకు అక్కడ పరిస్థితులు కుదుటపడక పోయినా నిష్క్రమిస్తూ వచ్చింది. అమెరికా లోపల కూడా పరి స్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. తాజాగా, సుంకాల విష యంలో అది అనుసరిస్తున్న తలతిక్క ధోరణి అందుకు ఉదాహరణ. ఇదంతా ప్రపంచంలో ఒక అస్థిర వాతావర ణానికి దారితీసింది. చైనా తన వంతు ఆకర్షణలను, భయాలను రెండింటినీ సృష్టించు కుంది. క్రమేపీ అది దృఢ వైఖరిని చాటడం పెరగడంతో, దాని ప్రత్య ర్థులు, మిత్రులు కూడా దానిపై చిరకాల అభిప్రాయాలను పునరా లోచించుకోవడం ప్రారంభించాయి. ఉక్రెయిన్పై యుద్ధం మొదలెట్టిన తర్వాత, చైనాతో రష్యా వ్యూహాత్మక ఏకీకరణ బలపడిందికానీ, సంబంధాలు అసమంగానే ఉన్నాయి. మాస్కో వ్యూహాత్మక ఆలోచనల ప్రకారం, దీర్ఘకాలంలో తనకు బెడదగా పరిణమించగల శక్తి అమెరికా కన్నా చైనాకే ఉంది. మధ్య ఆసియాలో తన ప్రభావాన్ని కనబరచేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు, సైబీరియాకు సంబంధించి రష్యా పడుతున్న ఆందోళన, చైనాకు తాను జూనియర్ భాగస్వామిగా మారవలసి వస్తుందే మోననే భయం క్రెమ్లిన్ను మరోసారి భారతదేశానికి సన్నిహితం చేస్తున్నాయి. అయితే, చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నిలుస్తుందని కాదు. చైనాపై తాను ఎక్కువ ఆధారపడకుండా భారత్ తనకొక రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని రష్యా ఆలోచన. స్నేహమే కాదు, వ్యూహాత్మకం కూడా!సోవియట్ యూనియన్ చీలికలు పీలికలైన తర్వాత కూడా భారత్తో రష్యా స్నేహ సంబంధాలు నిలదొక్కుకుంటూ వచ్చాయి. కశ్మీర్పై భారత్ ఇరకాటంలో పడకుండా ఐరాసలో రష్యా తన వీటో గొడుగు పడుతోంది. దానికి తగ్గట్లుగానే, ఉక్రెయిన్పై యుద్ధం పర్యవసానంగా రష్యాపై ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలు పదేపదే కోరినా భారత్ తలొగ్గలేదు. ఈ విషయమై అమెరికా విధిస్తానన్న సుంకాల బెదిరింపును కూడా భారత్ ఖాతరు చేయలేదు. దీనికి రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకంతో కూడిన స్నేహ సంబంధం ఒక్కటే కారణం కాదు. ఈ బంధాన్ని నిలబెట్టుకునేందుకు రెండు దేశాలకు తమవైన వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి.దానికి తోడు, కొన్నేళ్ళుగా ఎన్నడూ చూడనంత అస్థిర పరిస్థి తులు ప్రపంచంలో తాండవిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఏ ఒక్క దేశమూ పరిస్థితులను శాసించగలిగిన స్థితిలో లేదు. అగ్ర రాజ్యంగా నిలవాలని కలలు కంటున్న దేశపు అడుగులకు మడుగు లొత్తడానికి ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలలో చాలా మధ్య స్థాయి దేశాలు సిద్ధంగా లేవు. తమ వ్యూహాత్మక స్వయం ప్రతి పత్తిని కాపాడుకోవాలని గాఢంగా కోరుకుంటున్న భారత – రష్యాలకు ఆ సెంటిమెంట్లో ఒక ఉమ్మడి ప్రయోజనం కనిపిస్తోంది. పరస్పర రక్షణభారత్–రష్యాల మధ్య స్నేహ సంబంధాలకు రక్షణ అంశమే ఇప్పటికీ వెన్నెముకగా ఉంది. లాజిస్టిక్స్ విషయంలో పరస్పర సహ కారానికి సంబంధించిన ఒప్పందం కుదరబోతోంది. అది కార్య రూపం ధరిస్తే ఇరు దేశాలు సైనిక స్థావరాలను, రేవులను, వైమానిక క్షేత్రాలను పరస్పరం వినియోగించుకోవచ్చు. దీంతో ఇండో–పసిఫిక్ నుంచి ఆర్కిటిక్ వరకు కార్యకలాపాలు నిర్వహించగలిగినదిగా భారత్ తయారవుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో రష్యా భౌతికంగా కాలు మోపేందుకు వీలు చిక్కుతుంది. ప్రపంచంలో సగం వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ ప్రాంతమే జీవనాడి. భారత–రష్యా అధికారులు అత్యంత ఆశావహమైన సైనిక– సాంకేతిక ప్యాకేజీకి రూపుదిద్దుతున్నారు. దీనివల్ల ఎస్–400 గగన రక్షణ వ్యవస్థలను మరిన్ని చోట్ల ఏర్పాట్లు చేయవచ్చు. సు–30 ఎంకెఐ యుద్ధ విమానాలను భారత్ చాలా ఎక్కువగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మరింత దూరం వెళ్ళగలిగినవిగా బ్రహ్మోస్ క్షిపణు లను ఉన్నతీకరించుకునే అవకాశాలు మెరుగుపడతాయి. సు–57ఇ స్టెల్త్ యుద్ధ విమాన టెక్నాలజీ బదిలీకి సంబంధించి తాత్కాలిక చర్చలైనా మొదలయ్యేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇక భారత్–రష్యా స్నేహంలో అణు సహకారం మరో అంశం. బృహత్తర వీవీఈఆర్–1200 రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికలతో రోసాటమ్, భారత అణు శక్తి సంస్థలు ముందుకు ఉరకాలని చూస్తున్నాయి. అలాగే, కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ల అన్వేషణ రెండు దేశాల మధ్య సంబంధాలను గుణాత్మకంగా మార్చివేయవచ్చు. వీటి అంత ర్జాతీయ సరఫరాలో చైనాదే పైచేయిగా ఉంది. ఖనిజాలు సుసంపన్నంగా ఉన్న రష్యా తూర్పు దూర ప్రాంతాలలో సంయుక్త రంగంలో పనులు సాగించాలని భారత్ ఎదురు చూస్తోంది. భారత వైజ్ఞానిక సంస్థలు, రష్యా పరిశోధన కేంద్రాల మధ్య భాగస్వామ్యాలు ఏర్పడితే దేశీయంగా రేర్–ఎర్త్ ప్రాసెసింగ్కు, పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీకి రంగం సిద్ధమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, అత్యున్నత ఎలక్ట్రానిక్స్, అధునాతన ఆయుధ వ్యవస్థల వాల్యూ చైన్ను నియంత్రించగల పరిశ్రమలు రెండు దేశాలకు సొంతమవుతాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం సుమారు 65–66 బిలియన్ డాలర్లుంది. 2030 నాటికి దీన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యంతో ఉన్నాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో వ్యక్తమయ్యేది కేవలం పొత్తు కాదు. స్నేహ సంబంధాలు ఏవీ దెబ్బతిని లేవు కనుక ఇండో–సోవియట్ మైత్రి పునరుద్ధరణ అనడానికి కూడా లేదు. ఇది మరింత ఆచితూచి వేస్తున్న అడుగు కాబోతోంది. మరింత ఆచరణాత్మక దృక్పథం కన పడబోతోంది. అధికార కేంద్రాలు మసకబారి, సమీకరణాలు అను క్షణం మారిపోతున్న వర్తమాన ప్రపంచంలో అంతకన్నా ఇంకేం కావాలి!జయంత రాయ్ చౌధురీవ్యాసకర్త పీటీఐ వార్తా సంస్థ తూర్పు ప్రాంత మాజీ అధిపతి -
పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ నాలుగు, ఐదు తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కల్పించే భద్రతా ఏర్పాట్లు ప్రపంచ స్థాయిలో అత్యంత ఉన్నతమైనవిగా ఉండనున్నాయి. ఇప్పటికే రష్యాకు చెందిన ప్రత్యేక భద్రతా సంస్థ అధికారులు భారత్కు చేరుకొని, అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షిస్తున్నారు. పుతిన్ ప్రపంచంలోనే అత్యంత భారీ భద్రత కలిగిన నేతలలో ఒకరిగా పేరొందారు. 2012లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దాడి తర్వాత పుతిన్కు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఆహారానికి ల్యాబ్లో పరీక్షలుపుతిన్ భద్రతా వలయంలో ‘అదృశ్య భద్రతా బృందం’ ఒక కీలకమైన అంశం. ది మాస్కో టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ ప్రత్యేక బృందం అధ్యక్షుడు పర్యటించే ప్రాంతానికి ఆయన కంటే ముందే చేరుకుంటుంది. స్థానికులతో ఎంతగా కలిసిపోతుందంటే, వారిని ఎవరూ గుర్తించలేరు. రష్యా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా, ఆయన భద్రతా బృందం ఒక పోర్టబుల్ ల్యాబ్ను తీసుకువెళ్తుంది. దీని ప్రధాన ఉద్దేశం.. ఆయన తీసుకునే ఆహారం, నీటిలో ఎలాంటి విషాలు లేదా హానికరమైన పదార్థాలు లేవని నిర్ధారించడం. ల్యాబ్ పరీక్ష లేకుండా ఆయనకు ఆహారం వడ్డించరు. పుతిన్ తాగే నీరు కూడా విదేశాల నుండి కాకుండా, రష్యా నుండే వస్తుంది.‘దాపరికానికి’ పోర్టబుల్ టాయిలెట్పుతిన్ ఆహారం విషయంలో అత్యంత కఠినమైన ప్రోటోకాల్లను అనుసరిస్తారు. ఆయన వ్యక్తిగత చెఫ్, వంట సిబ్బంది ఎల్లప్పుడూ ఆయనతో పాటు ప్రయాణిస్తారు. విదేశీ పర్యటనల్లో ఆయన హోటళ్లలో లేదా ఆతిథ్య దేశంలోని ఆహారాన్ని తీసుకోరు. ఆయన తన సొంత వంటగదిలో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తింటారు. అయినప్పటికీ భద్రతా తనిఖీలు తప్పనిసరి. మరింత గోప్యత కోసం పుతిన్ విదేశీ పర్యటనల సమయంలో తన వ్యక్తిగత పోర్టబుల్ టాయిలెట్ను కూడా వెంట తీసుకువెళ్లడం గమనార్హం. దీనికి కారణం ఏ దేశం లేదా ఏజెన్సీ తన ఆరోగ్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని (జీవసంబంధమైన నమూనాలు) పొందకుండా నిరోధించడమే.పటిష్టమైన కాన్వాయ్రష్యా అధ్యక్షుడి కాన్వాయ్ అభేద్యంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేక ఆర్మర్డ్ కారుతో పాటు, మెడికేర్ వ్యాన్, ఆహార పరీక్ష కోసం పోర్టబుల్ ల్యాబ్, కమాండ్ కంట్రోల్ వాహనం, స్నిపర్ బృందం, సైబర్ సెక్యూరిటీ యూనిట్, శాటిలైట్ కమ్యూనికేషన్ యూనిట్ ఉంటాయి. పుతిన్ భారత పర్యటన సందర్భంగా, దేశీయ ఎస్పీజీ, ఎన్ఎస్జీ దళాలు.. రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్ఓ)ఏజెన్సీతో కలిసి పనిచేస్తూ, అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తాయి.ఉమ్మడి భద్రతా వలయంపుతిన్ పర్యటన సందర్భంగా భారతదేశంలో భద్రతా ప్రోటోకాల్లు అత్యంత కట్టుదిట్టంగా ఉండనున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్ హౌస్ చుట్టూ నో-ఫ్లై, నో-డ్రోన్ జోన్లుగా ప్రకటిస్తారు. అధ్యక్షుడి రాకపోకల కోసం ప్రత్యేక వీఐపీ భద్రతా కారిడార్, ట్రాఫిక్ లాక్డౌన్ జోన్ అమలు చేస్తారు. జామర్లు, యాంటీ-డ్రోన్లు, స్నిపర్ల ద్వారా నిరంతర తనిఖీలు చేపడతారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, రష్యన్ ఏజెన్సీల ఉమ్మడి భద్రతా వలయం ఈ పర్యటనను మరింత పటిష్టం చేయనుంది.భారత్కు సదవకాశంఈ పర్యటన భారతదేశానికి ఒక ప్రధాన అవకాశంగా మారనుంది. వ్యూహాత్మక, రక్షణ, ఆర్థిక సహకారంతో పాటు, కార్మిక, సామాజిక సహకారంపై గణనీయమైన చర్చలకు అవకాశం ఏర్పడనుంది. రష్యన్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో పెరుగుతున్న కార్మిక కొరతను తీర్చడానికి 2030 నాటికి సుమారు 31 లక్షల మంది కార్మికులు అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రష్యా కనీసం పది లక్షల మంది విదేశీ కార్మికులను నియమించుకోవాలని భావిస్తోంది. ఈ విషయంలో భారతదేశం ప్రధాన వనరుగా మారే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, భారత యువతకు రష్యాలో చట్టబద్ధమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భారతదేశ విదేశీ మారకం పెరుగుతుంది, రెండు దేశాల మధ్య సామాజిక, ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.ఇది కూడా చదవండి: బిహార్ ఎఫెక్ట్: జార్ఖండ్లో సోరెన్-బీజేపీ కొత్త సర్కారు? -
ఈయూ కోరుకుంటే యుద్ధానికైనా సిద్ధం
మాస్కో: నాలుగేళ్ల యుద్ధానికి ఇకనైనా ముగిద్దామని భావిస్తుంటే యురోపియన్ యూనియన్ సభ్యదేశాలు అడ్డు తగులుతున్నాయని రష్యా( Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్, ఆ దేశ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ల ప్రతినిధి బృందం మంగళవారం రష్యా అధ్యక్షభవనం క్రిమ్లిన్లో పుతిన్తో భేటీ అయింది. ఆ తర్వాత పుతిన్ మాట్లాడారు. ‘‘ శాంతి ఒప్పందం విషయంలో ట్రంప్కు, యురోపియన్ యూనియన్ దేశాలకు మధ్య సఖ్యత లేదనుకుంటా. నిజానికి ఉక్రెయిన్(Ukraine)లో శాంతి కపోతాలు ఎగరడం ఈయూ దేశాలకు ఇష్టం లేదనుకుంటా. శాంతి చర్చలకు ఈ దేశాలే విఘాతం కల్గిస్తున్నాయి. నిజానికి ఈయూ దేశాలతో యుద్ధానికి దిగడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. కానీ వాళ్లు యుద్ధానికే మొగ్గుచూపితే రణరంగంలోకి దూకేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఈయూ దేశాలకు స్పష్టమైన శాంతి అజెండా లేదు. చూస్తుంటే వాళ్లు యుద్ధానికే మొగ్గుచూపుతున్నట్లు కని్పస్తోంది. వాళ్లు చేసిన శాంతి ఒప్పంద ప్రతిపాదనలు రష్యాకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈ ప్రతిపాదనలు మొత్తం శాంతి ప్రక్రియను స్తంభింపజేసేలా ఉన్నాయి. అదే వాళ్ల లక్ష్యం అనుకుంటా’’ అని పుతిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
Virat: మే డే.. మే డే.. సాయం కావాలి
రష్యాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ‘విరాట్’పై నల్లసముద్రంలో దాడి జరిగింది. అందులో ఉన్న సిబ్బంది అత్యవసర సందేశాలు పంపిన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ అందులో సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. ఈ దాడి తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించుకుంది.‘‘ఇది విరాట్. సాయం కావాలి! డ్రోన్ దాడి! మేడే!’’ అని సిబ్బంది అంటున్న ఆడియో రికార్డు అయింది. అంతకుముందు శుక్రవారం రాత్రి కూడా ఈ నౌకపై దాడులు జరిగాయి. అందులోని సిబ్బంది ‘డ్రోన్ దాడి’ అంటూ రేడియోలో అత్యవసర సందేశం పంపారు. ఇటు టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.‘విరాట్’కు స్వల్ప నష్టమే జరిగిందని సమాచారం. ఆ నౌక ప్రస్తుతం స్థిరంగానే ఉందని.. సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. నల్ల సముద్ర తీరం నుంచి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. రష్యా ‘షాడో ఫ్లీట్’Shadow Fleet ట్యాంకర్లపై జరిగిన ఈ దాడి తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ నౌకల వల్లే యుద్ధం చేయడానికి రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతోందని ఆరోపించింది. అందుకే వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. సీ బేబీ (Sea Baby) డ్రోన్ల ద్వారా ఈ దాడులు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. విరాట్ అనేది రష్యా షాడో ఫ్లీట్ లో భాగమైన ఆయిల్ ట్యాంకర్. షాడో ఫ్లీట్ అనేవి పాశ్చాత్య ఆంక్షలను తప్పించుకుని రష్యా చమురు రవాణా చేసే నౌకలు.అయితే వీటిపై దాడుల వల్ల నల్ల సముద్రంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఇక సీ బేబీ (Sea Baby) డ్రోన్లు అనేవి ఉక్రెయిన్ అభివృద్ధి చేసిన అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్స్ (USVs). మనుషులు లేకుండా సముద్రంపై నడిచే చిన్న బోట్ల రూపంలో ఉండే డ్రోన్లు. ఇవి ప్రధానంగా కమికాజే దాడులు (తమను తాము పేల్చుకునే దాడులు) చేయడానికి ఉపయోగిస్తారు.Ukrainians attack two tankers of the Russian shadow fleet.According to sources, SBU Sea Baby naval drones attacked the two sanctioned oil tankers KAIRO and VIRAT in the Black Sea. It was a joint operation between the SBU's 13th Main Directorate for Military Counterintelligence… pic.twitter.com/U82scXaM5r— Jürgen Nauditt 🇩🇪🇺🇦 (@jurgen_nauditt) November 29, 2025 -
భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనుండడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలపై చర్చ జరుగుతోంది. సంప్రదాయంగా బలమైన మిత్ర దేశాలైన భారత్, రష్యాల మధ్య ఈ పర్యటనలో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు.తగ్గిన చమురు కొనుగోళ్లు..రష్యా-ఉక్రెయిన్ వివాదం తరువాత అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా భారత్కు చౌకగా ముడి చమురును అందించింది. దీంతో భారత్ చమురు దిగుమతుల్లో రష్యా ప్రధాన సరఫరాదారుగా అవతరించింది. అయితే, ఇటీవల కాలంలో ధర పరిమితుల సమస్యలు, చెల్లింపుల విధానాల్లోని క్లిష్టత, దేశీయ అవసరాల సర్దుబాటు కారణంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొంతమేరకు తగ్గించుకుంది. దాంతోపాటు భారత్పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు కొనుగోళ్లు తగ్గాయి.భారత్-రష్యా స్నేహానికి ఆర్థిక మూలస్తంభంగా ఉన్న ఈ కొనుగోళ్ల తగ్గింపు రష్యాకు కొంత ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ సమయంలో పుతిన్ పర్యటన జరగడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ పర్యటన కేవలం రక్షణ లేదా ఎనర్జీ రంగాలకే పరిమితం కాకుండా రష్యాకు వివిధ మార్గాల్లో చేదోడుగా నిలిచే కొత్త ఆర్థిక, వ్యూహాత్మక ఒప్పందాలను అన్వేషించేందుకు ఉపయోగపడనుంది.కీలక ఒప్పందాలపై అంచనా..భారత్కు రష్యా అతిపెద్ద రక్షణ భాగస్వామి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఒప్పందాలు ఈ రంగంలోనే కుదిరే అవకాశం ఉంది. S-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ డెలివరీలు, దాని భవిష్యత్తు నిర్వహణపై డీల్స్ కుదిరే అవకాశం ఉంది. AK-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీకి సంబంధించిన వెంచర్లపై ఒప్పందం. అత్యాధునిక రక్షణ సాంకేతికత అభివృద్ధిలో సంయుక్త పరిశోధన, అభివృద్ధి డీల్స్ జరిగే అవకాశం ఉంది.చమురు, రక్షణ పరికరాల కొనుగోళ్ల విషయంలో డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడం ఇరు దేశాల లక్ష్యం. దీని కోసం దేశీయ కరెన్సీలైన రూపాయి, రూబుల్ ద్వారా చెల్లింపులు జరిపే సుస్థిర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇది రష్యాపై ఉన్న అంతర్జాతీయ చెల్లింపుల ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.అంతరిక్ష, అణు శక్తి సహకారంభారతదేశంలో రష్యన్ సాంకేతికతతో నిర్మిస్తున్న కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ తదుపరి యూనిట్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఒప్పందాలు. గగన్యాన్ వంటి భారత అంతరిక్ష కార్యక్రమాలకు రష్యా సహకారం, సంయుక్త ఉపగ్రహ నిర్మాణ ప్రాజెక్టులపై చర్చలు జరిగే అవకాశం ఉంది.కొత్త డీల్స్చమురు కొనుగోళ్లు తగ్గిన నేపథ్యంలో రష్యా భారత్ నుంచి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ప్రయోజనం పొందేందుకు కొన్ని కొత్త రకాల డీల్స్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఆంక్షల ప్రభావం తక్కువగా ఉన్న రంగాలపై దృష్టి సారిస్తూ భారత్ నుంచి రష్యాకు వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ (ముఖ్యంగా జెనరిక్ మందులు), ఐటీ సేవలను పెద్ద ఎత్తున ఎగుమతి చేసుకునేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. రష్యా ఈ రంగాల్లో భారత్ను సుస్థిర సరఫరాదారుగా గుర్తించడానికి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.రవాణా కారిడార్లుఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్ఫోర్ట్ కారిడార్ కార్యకలాపాలను వేగవంతం చేయడంపై ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ముంబైని రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్తో కలుపుతూ ఇరాన్ మీదుగా సాగే ఈ కారిడార్ పశ్చిమ దేశాల ద్వారా కాకుండా, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాన్ని అందిస్తుంది. ఇది రష్యా తన వస్తువులను ఇతర దేశాలకు తరలించడానికి కీలక వ్యూహాత్మక ప్రత్యామ్నాయం అవుతుంది.సహజ వాయువుచమురు కొనుగోళ్లు తగ్గినప్పటికీ రష్యా తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) అమ్మకాలను భారత్లో పెంచేందుకు ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతంలోని ఇంధన ప్రాజెక్టుల్లో భారత పెట్టుబడులు పెంచేందుకు ఒప్పందాలు కుదరవచ్చు. ఈ డీల్స్ దీర్ఘకాలికంగా భారత్కు ఎనర్జీ సెక్యూరిటీను, రష్యాకు స్థిరమైన నిధులను అందిస్తాయి.ఇదీ చదవండి: వెండికి హాల్మార్కింగ్.. వజ్రాభరణాలపై ఫ్రేమ్వర్క్ -
పుతిన్-మోదీ దోస్తీ.. టెన్షన్లో ట్రంప్!
ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో రష్యాపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ చమురు విషయంలో భారత్పై సుంకాల యుద్ధమే చేశారు. రెండు దఫాలుగా 50 శాతం అన్యాయంగా పన్నులు విధించారు. అయితే ఏకపక్ష నిర్ణయాలకు తాము తలొగ్గబోమని.. జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని భారత్ కుండబద్ధలు కొట్టింది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన పలు ప్రకటనలనూ (పాక్-భారత్ ఉద్రిక్తతలను ఆపానంటూ చేసినవి కూడా) ఖండించింది కూడా. ఈలోపు.. షాంగై సదస్సులో పుతిన్-మోదీ ఒకే కారులో ప్రయాణించడం, ప్రత్యేకంగా భేటీ కావడంలాంటివి ట్రంప్కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆ రెండు దేశాలవి డెడ్ ఎకానమీలని.. అవి ఎలా పోయినా తనకు సంబంధం లేదంటూ ఆ సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆయన స్వరం మారింది. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించబోతోందని.. ప్రధాని మోదీ మాట మీద తనకు నమ్మకం ఉందని.. భారత్తో అమెరికా అనుబంధం కొనసాగుతుందంటూ స్వరం మార్చారు. అఫ్కోర్స్ భారత్ వాటిని ఖండించింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత్కు రానున్నారు. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాస్తవంగా ఈ ఇద్దరు శక్తివంతమైన నేతల భేటీపై గత ఆరు నెలలుగా ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వీళ్ల కలయిక అంటే ఏమాత్రం మిండుగు పడని ట్రంప్ ఎలా స్పందిస్తారో ? అనేదే అందుకు ప్రధాన కారణం. వాస్తవానికి రష్యా చమురును భారత్కు దూరం చేయాలని ట్రంప్ చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే ఆ పాచికలేవీ పారలేదు. సరికదా ట్రంప్ నుంచి రష్యా చమురు సరఫరాదారులైన ఆంక్షల ప్రకటన వెలువడగానే భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ మాస్కోకు వెళ్లి పుతిన్తో సమావేశం అయ్యారు. అటుపై పుతిన్ సన్నిహితుడైన నికోలాయ్ పెత్రుషెవ్తో ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడేమో డిసెంబరు 4, 5 తేదీల్లో పుతిన్ భారత్లో పర్యటిస్తారనే ప్రకటన వెలువడింది. పుతిన్ ఢిల్లీలో జరగబోయే 23వ రష్యా-భారత్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొంటారు. అయితే భారత్తో భారీ ఎత్తున ఒప్పందాల ఎజెండాతోనే రష్యా అధ్యక్షుడు భారత్కు వస్తున్నారా?.. ఉక్రెయిన్ సంక్షోభం ముగించేందుకు మోదీ మధ్యవర్తిత్వాన్ని పుతిన్ కోరనున్నారా? రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ మాటల్ని పట్టించుకోకూడదని చెబుతారా? అసలు ఇవేవీ కావు.. సైనికపరమైన సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నారా?.. పుతిన్ భారత్కు ఎందుకొస్తున్నారనే ప్రశ్నలపై చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతో పాక్ క్షిపణులను తుక్కు చేసి ప్రపంచానికి సత్తా చాటిన భారత్ ఇప్పుడు రష్యా ఆయుధ సంపత్తిపై ఆసక్తి ప్రదర్శిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా మేక్ ఇన్ ఇండియానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితుల్లో అది కష్టతరమేనన్న అభిప్రాయమూ రక్షణ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే అమెరికా ఆంక్షలను లెక్కచేయని తరుణంలో పుతిన్ భారత్తో మరో కోణంలోనూ ఒప్పందాలు చేసుకునే అవకాశం లేకపోలేదు. అందులో.. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్తు ప్లాంట్లో కొత్త మాడ్యులర్ రియాక్టర్ల నిర్మాణంలో రష్యా భాగస్వామిగా మారే అవకాశం బలంగానే కనిపిస్తోంది. ఎస్సీవో శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సుదీర్ఘంగా భేటీ అయిన పుతిన్.. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు రావడం ట్రంప్ను ఒత్తిడికి గురిచేసే అంశమే. అందుకే వీళ్ల దోస్తీపై ఆయన పగబట్టారు. అదీగాక అమెరికా, యూరప్ దేశాలకు వ్యతిరేకంగా పుతిన్ ఆసియా దేశాలతో ఓ బలమైన కూటమిగా ఎదిగేతే గనుక.. అందులో భారత్ ప్రధాన భూమిక అవకాశాలను తోసిపుచ్చలేం. అందుకే భారత్తో మరింత దగ్గరైతే రష్యా మళ్లీ సూపర్ పవర్గా ఎదుగుతుందనే భయం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.:::వెబ్డెస్క్ స్పెషల్ -
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కొత్త బ్యాచ్
మాస్కో: ముగ్గురు సభ్యులతో కూడిన అమెరికా–రష్యా వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తమ ప్రయాణం మొదలెట్టి విజయవంతంగా పూర్తిచేసింది. షెడ్యూల్లో భాగంగా ఐఎస్ఎస్కు గురువారం నాసా వ్యోమగామి క్రిస్ విలియమ్స్, రష్యా క్రూమేట్స్ సెర్గీ మికాయెవ్, సెర్గీ కుద్స్వెర్చ్కోవ్ చేరుకున్నారు. అంతకుముందు కజక్స్థాన్లోని బైకనూర్ ప్రయోగకేంద్రం నుంచి వ్యోమగాములతో కూడిన సోయూజ్ ఎంఎస్–28 వ్యోమనౌకను సోయూజ్ బూస్టర్ రాకెట్ స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 2.27 గంటలకు నింగిలోకి పంపించింది. ఐఎస్ఎస్లో ఈ ముగ్గురు ఎనిమిది నెలలపాటు గడపనున్నారు. -
వింటర్ ఎగ్ @ 236 కోట్లు!
లండన్: రష్యా జార్ చక్రవర్తుల రాజరిక ఠీవీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే అత్యంత అరుదైన వింటర్ఎగ్ ఒకటి ఇప్పుడు వేలంపాటలో రికార్డ్ల మోత మోగించేందుకు సిద్ధమైంది. రష్యా జార్ చక్రవర్తి నికోలస్–2 తన తల్లి, రాజమాత మారియా ఫియోడోరోవ్నాకు వందేళ్ల క్రితం ఈస్టర్ కానుకగా బహూకరించిన విలువైన వింటర్ ఎగ్ గురించే ఇప్పుడా చర్చ అంతా. డిసెంబర్ రెండో తేదీన క్రిస్టీస్ వేలంపాట సంస్థ తమ లండన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే వేలంపాటలో ఈ స్ఫటిక ఫ్యాబెర్జీ వింటర్ ఎగ్ ఏకంగా రూ.236 కోట్లకుపైగా ధర పలకవచ్చన్న అంచనాలు ఎక్కువయ్యాయి. దీనిని ప్రఖ్యాత వజ్రాభరణాల సంస్థ ఫ్యాబెర్జీ తయారుచేసింది. 1913 సంవత్సరంలో రాజు నికోలస్ దీనిని తన తల్లికి బహూకరించారు. రష్యా ప్రభుత్వ అధీనంలోకాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ఏడింటిలో ఇదీ ఒకటని వేలంసంస్థ పేర్కొంది.ఎన్నెన్నో ప్రత్యేకతలుదవళవర్ణంలో ధగధగా మెరిసేపోయే ఈ వింటర్ ఎగ్ ఎత్తు 10 సెంటీమీటర్లు. లీలగా చూస్తే పూర్తి గుడ్డులాగా కనిపించినా దానిని రెండుభాగాలుగా తెరవొచ్చు. చలికాలంలో ఆరుబయట పెడితే మంచుబిందువులు పడి ఘనీభవించినట్లు స్ఫురించేలా దీనిని డిజైన్చేశారు. ప్లాటినమ్ లోహపు బుల్లి బుట్టలో అనిమోనిస్ పుష్పాలను గుదిగుచ్చి చూడచక్కటి పుష్పగుచ్ఛా న్ని తయారుచేసి లోపల పెట్టారు. గుడ్డు అంతర్గ తంగా మొత్తంగా ఏకంగా 4,500 చిన్న చిన్న వజ్రా లను పొదిగారు. అనిమో నిస్ పుష్పాలను క్వార్జ్తో తయారుచేశారు. ఆకుల ను పచ్చలతో రూ పొందించారు. శీతాకాల చలిని చీల్చుకుంటూ వసంత రుతువులోకి కాలం అడుగుపెట్టేవేళ అనిమో నిస్ పుష్పాలు వికసిస్తా యి. కష్టకాలాన్ని దాటి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు గుర్తుగా రష్యాలో ఈ పుష్పాలను బహుమతిగా ఇస్తారు. ఫ్యాబెర్జీ వజ్రాభరణాల సంస్థలోని ఏకైక కళాకృతి కళాకారిణి ఆల్మా పిహల్ దీనిని డిజైన్ చేశారు. స్వర్ణకారులైన ఆల్బర్ట్ హల్మ్స్ట్రోమ్, పిహల్ బంధువు దీనిని తయారు చేశారు. ‘‘అద్భుతమైన చేతి పనితనం, ఆకర్షణీ యమైన డిజైన్లకు ఈ వింటర్ ఎగ్ పెట్టింది పేరు. అలంకరణ కళల్లో ఈ ఎగ్ ఒకరకంగా మోనాలిసా పెయింటింగ్లాంటిది’’ అని క్రీస్టిస్ వేలంసంస్థలో రష్యా కళారూపాల విభాగ అధిపతి మార్గో ఒగానేసియన్ వ్యాఖ్యానించారు. పీటర్ కార్ల్ ఫ్యాబెర్జీ సారథ్యంలోని వజ్రా భరణాల సంస్థ 1885 నుంచి దాదాపు పాతికేళ్ల పాటు రష్యా రాజకుటుంబాల కోసం దాదాపు 50 స్మారక ఎగ్లను తయారు చేసి ఇచ్చింది. జార్ చక్రవర్తి అలెగ్జాండర్–3 తన సతీమణికి ప్రతి ఈస్టర్కు ఒక ఈస్టర్ ఎగ్ ను బహూకరించి ఇలా ఎగ్ల బహూకరణ పర్వానికి తెరలేపారు. దీనిని నికోలస్–2 కొనసా గించారు. -
జంక్ఫుడ్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఆ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్..
జంక్ఫుడ్ ప్రమాదకరమని నిపుణులు హెచ్చిరిస్తుంటే..పెడచెవిన పెట్టిన వాళ్లెందరో. అంతెందుకు చీట్మీల్ పేరుతో బర్గర్లు, పీజాలు లాగించేసేవాళ్లు కోకొల్లలు. అలాంటి వాళ్లందరికీ ఈ ఘటన ఓ కనువిప్పు. మారథాన్ ఛాలెంజ్లో భాగంగా తిన్న జంకఫుడ్ ఓ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాలనే హరించేసింది. ఎవ్వరూ ఇలాంటి ఛాలెంజ్స్లో పాల్గొనేందుకు జంకేలా చేసింది కూడా.అసలేం జరిగిందంటే..రష్యన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ 30 ఏళ్ల డిమిత్రి నుయాన్జిన్, బరువు తగ్గించే కార్యక్రమాన్ని ప్రోత్సహించే నిమిత్తం ఈటింగ్ ఛాలెంజ్లో పాల్గొన్నాడు. ఆయన సదుద్దేశ్యంతో చేస్తే..ఆ ప్రయోగం అతడి ప్రాణమే పోయింది. అదికూడా నిద్దురలోనే ప్రాణం పోవడం బాధకరం. అధిక బరువు ఎంత పెద్ద సమస్య అని అవగాహన కల్పించే నిమిత్తం డిమిత్రి 25 కిలోలు బరువు పెరగాలన్న లక్ష్యం పెట్టుకున్నాడు. ఈ మేరకు మారథాన్లొ భాగంగా అతిగా తినే ఛాలెంజ్లో పాల్గొన్నాడు. తన క్లయింట్లు తనలా బరువు తగ్గేలా ప్రేరణనివ్వాలని ఈ ఛాలెంజ్ పాల్గొన్నాడు. ఆ నేఫథ్యంలోనే రోజుకు దాదాపు 10 వేల కేలరీలకు పైగా జంక్ఫుడ్ తిన్నాడు. అనుకున్నట్లుగా బరువు పెరిగాడు..తన ఫాలోవర్స్కి కూడా తనలోని ఆ ఛేంజ్ని బహిర్గతం చేయడమే కాకుండా ఆ అధిక బరువుని తగ్గించుకునేలా కూడా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు కూడా. అయితే అనూహ్యంగా చనిపోవడానికి ఒక రోజు ముందు తను చేసే వర్కౌట్ల సెషన్ను రద్దు చేసుకున్నాడు కూడా. తాను ఆరోగ్యంగా ఉన్నానని, వైద్యుడుని సంప్రదించాలను చూస్తున్నట్లు నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు కూడా. అయితే అదే చివరి మాట అవుతుందని అనుకోలేదు అతడి అభిమానులు, ఫాలోవర్లు. అతడి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అతడి గుండె నిద్దురలోనే ఆగిపోయిందని, అవే అతడి చివరి మాటలయ్యాయనని బాధగా చెబుతున్నారు. అంతేగాదు డిమిత్రి గత నవంబర్ 18న చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో లేస్ ప్యాక్ తినడం తోపాటు తాను 105 కిలోలు బరువు పెరిగినట్లు కూడా వెల్లడించాడు. అంతేగాదు నెలలో కనీసం 13 కిలోలు పెరిగినట్లు తెలిపాడు. నెటిజన్లు డిమిత్రి మృతికి స్పందిస్తూ..అతడి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అలాగే ఇలాంటి ఈటింగ్ ఛాలెంజ్ల్లో పాల్గొనేవాళ్లకు ఈ సంఘటన ఓ గొప్ప పాఠం అంటూ పోస్టులు పెట్టారు. కాగా, డిమిత్రీ ఈ ఈటింగ్ ఛాలెంజ్లో భాగంగా రోజు వారీ ఆహారంలో పేస్ట్రీలు, కేక్లు, మయోన్నెస్లో ఉడికించిన డంపింగ్స్, రాత్రి భోజనంలో రెండు పిజ్జాలు తప్పనిసరిగా తిన్నట్లు తెలిపాడు. అధిక బరువుని తగ్గించడం ఎలా అనేదానిపై ప్రేరణ కలిగించేలా బరువు పెరగాలనుకుంటే..అది అతడి ఉసురే తీసేసింది. డిమిత్రీ సెయింట్ పీటర్స్బర్గ్లోని ఓరెన్బర్గ్ ఒలింపిక్ రిజర్వ్ స్కూల్ అండ్ నేషనల్ ఫిట్నెస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, పైగా ఒక దశాబ్దం పాటు ఉన్నత రష్యన్లకు వ్యక్తిగత కోచ్ కూడా ఆయన. అలాంటి వ్యక్తి జంక్ ఫుడ్ ఎంత ప్రమాదకరం అనేది చూపిద్దామనుకుంటే అతడి ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. నిజంగానే ఇంత ప్రమాదమా అంటే..జంక్ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు.ఎందుకంటే ఇందులో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనకు అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనిని తరచుగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.(చదవండి: ఇంజనీర్ కమ్ డాక్టర్..! విజయవంతమైన స్టార్టప్ ఇంజనీర్ కానీ..) -
రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు
అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే నవంబర్ నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి ముడి చమురు సరఫరాలను భారీగా పెంచాయి. దీని ఫలితంగా నవంబర్ 2025లో రష్యా నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతులు రోజుకు సగటున 1.9 మిలియన్ బ్యారెల్స్తో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.గ్లోబల్ రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ప్రొవైడర్ కెప్లెర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 2025లో రష్యా అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారుగా భారత్ నిలిచింది. ఈ నెలలో ఇప్పటివరకు కార్గోలు సగటున రోజుకు 1.886 మిలియన్ బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకున్నాయి.గణనీయ పెరుగుదలనవంబర్ 2025లో చమురు దిగుమతులు అంతకుముందు నెలతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. 2024లో ఇదే నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం అధికమయ్యాయి. అలాగే 2023లో ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయని కెప్లర్ డేటా వెల్లడించింది. నవంబర్ 21లోపు కొనుగోళ్లు పెరగడంతో భారతదేశానికి రష్యన్ క్రూడ్ దిగుమతి 5 నెలల గరిష్టానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, నవంబర్ 21 నుంచే రోస్నెఫ్ట్(Rosneft), లుకోయిల్ (Lukoil)పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతకుముందే భారీగా క్రూడ్ను దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తుంది.తగ్గుముఖం పట్టే అవకాశంనవంబర్ 21 తర్వాత రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తాత్కాలికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సరఫరా గొలుసులను పునర్వ్యవస్థీకరించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం.. -
Russia-Ukraine: యుద్ధం విధ్వంసం నెత్తురోడుతున్న ఉక్రెయిన్
-
భారత్కు రష్యా బంపరాఫర్..
న్యూఢిల్లీ: భారత్కు రష్యా బంపరాఫర్ ప్రకటించింది. రోస్నెఫ్ట్, లుకోయిల్ వంటి ప్రధాన రష్యన్ చమురు సంస్థలపై అమెరికా గత వారం ఆంక్షలు విధించడంతో, రష్యా తన ముడి చమురును రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ధరలకు భారత్కు అందించేందుకు సిద్ధమైంది.భారత రిఫైనర్లకు యురల్స్ ధర డెలివరీ ప్రాతిపదికన డేటెడ్ బ్రెంట్తో పోలిస్తే బ్యారెల్పై ఏడుడాలర్ల వరకు తగ్గించింది. ఈ ఆఫర్ డిసెంబర్లో లోడ్ అయ్యే, జనవరిలో భారత్కు చేరే కార్గోలపై వర్తించనుంది.అమెరికా ఆంక్షలకు ముందు యురల్స్ బ్యారెల్కు మూడు డాలర్ల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. రోస్నెఫ్ట్, లుకోయిల్పై ఆంక్షలు అమలులోకి వచ్చిన తర్వాత భారత రిఫైనర్లు రష్యన్ చమురు ఆర్డర్లు తగ్గించాయి. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత భారత్ చౌకైన చమురును విస్తృతంగా దిగుమతి చేసుకుంది. కానీ ఆంక్షల కారణంగా దిగుమతి నిలిపివేసింది. రోస్నెఫ్ట్, లుకోయిల్తో పాటు గాజ్ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్నెఫ్టెగాస్పై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భారత రిఫైనర్లు మధ్యప్రాచ్యం సహా ఇతర ప్రాంతాల నుండి ఎక్కువ ముడి చమురును కొనుగోలు చేస్తున్నారు. రష్యా చమురు ధరలు తగ్గడం భారత్కు తాత్కాలిక లాభం కలిగించవచ్చు. కానీ ఆంక్షల కారణంగా సరఫరా స్థిరత్వం అనిశ్చితంగా మారింది. రిఫైనర్లు తక్కువ ధరల ఆకర్షణతో రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నా, దీర్ఘకాలంలో అమెరికా ఆంక్షలు వాణిజ్యాన్ని మరింత క్లిష్టం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
యూఎస్ శాంతి ప్రణాళికపై జెనీవాలో చర్చలు
జెనీవా: రష్యా దురాక్రమణకు పుల్స్టాప్ పెట్టేందుకు ఉద్దేశించిన అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఆదివారం చర్చలు జరిపారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ జాతీయ భద్రతా సలహాదారులతో మొదటి దఫా చర్చలు ముగిశాయని ఉక్రెయిన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న అధ్యక్షభవనం చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యర్మాక్ ఎక్స్లో వెల్లడించారు. ప్రతిపాదిత 28 పాయింట్ల ఒప్పందం పొరుగుదేశంపై దురాక్రమణకు పాల్పడిన రష్యాకే అనుకూలంగా ఉండటంపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదనలను సమీక్షించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్ను అవి కోరుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ కూడా పాలుపంచుకున్నారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొనే దిశగా అమెరికా బృందంతో నిర్మాణాత్మకంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని యర్మాక్ తెలిపారు. ఈ ఒప్పందంతో దేశ సార్వభౌమత్వమా? అమెరికా మద్దతును నిలుపుకోవడమా? తేలిపోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించడం తెల్సిందే. ఇప్పటికే కనీసం డజను సార్లు తిరస్కరించిన రష్యా డిమాండ్లనే ఈ ఒప్పందంతో ఆమోదించాల్సి రావడం జెలెన్స్కీకి మింగుడు పడటం లేదు. ఉక్రెయిన్ పారిశ్రామిక రంగానికి ఎంతో కీలకమైన డోన్బాస్ను రష్యాకు వదిలేయడం, సైన్యాన్ని పరిమితం చేసుకోవడం వంటివి ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇవి తుది ప్రతిపాదనలు కావని, ఎలాగైనా యుద్ధాన్ని ఆపడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. అయితే, గురువారం కల్లా ఒక స్పష్టతకు రావాలని ఆయన శనివారం ఉక్రెయిన్కు గడువు విధించారు. కాగా, నల్ల సముద్రంపై ఉక్రెయిన్ స్వేచ్ఛగా ధాన్యం రవాణా చేసేందుకు ఉద్దేశించిన గత ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేలా రష్యా అధ్యక్షుడు పుతిన్తో సోమవారం మాట్లాడుతానని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు. -
ట్రంప్ హెచ్చరిక.. ఉక్రెయిన్కు టెన్షన్?
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రష్యాకు కొంత అనుకూలంగా ఉంటూ.. ఉక్రెయిన్కు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా జెలెన్స్కీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరు దేశాల మధ్య యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అమెరికా 28 అంశాల ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా వైట్హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ విషయంలో ఇది తన తుది ప్రతిపాదన కాదన్నారు. ఒకవేళ జెలెన్స్కీ ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే, ఆయన చివరి వరకు పోరాటం కొనసాగించవచ్చు. శాంతి స్థాపనే తమ లక్ష్యమని, ఎలాగైనా దాన్ని సాధిస్తామని అన్నారు. తాను 2022లో అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధమే జరిగేది కాదని పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో నవంబర్ 27లోగా అంగీకరించాలంటూ ఉక్రెయిన్పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇక, ఈ ప్రణాళికలో చాలా మార్పులు అవసరమని ఉక్రెయిన్ మిత్రదేశాల కూటమి జెలెన్స్కీకి తేల్చిచెప్పింది.Reporter “Is this your final offer to Ukraine”Trump: “No”Even Donald Trump he knows he went to far, he knows his treachery was too obvious. Even the doubters can see he is a Russian asset now and he’s risked his own presidency with what he has done. pic.twitter.com/xIXmWpTy5e— Bricktop_NAFO (@Bricktop_NAFO) November 22, 2025ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రణాళికపై మరో తీవ్రమైన ఆరోపణ బయటకు వచ్చింది. 28 పాయింట్లు ఉన్న ఈ పత్రం వాస్తవానికి రష్యా నుంచి వచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సెనేటర్లకు చెప్పినట్లు రిపబ్లికన్ సెనేటర్ మైక్ రౌండ్స్ వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించలేదు. దీంతో, ఈ ప్రతిపాదనకు మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది.జెలెన్స్కీ ఆందోళన.. మరోవైపు.. ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒప్పందంలోని చాలా అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని కీవ్ భావిస్తోంది. అంగీకరిస్తే దేశ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఒప్పుకోకపోతే ట్రంప్ ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. అమెరికాతో స్నేహాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన అల్టిమేటంతో.. ఆ దేశ జెలెన్స్కీ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది. అదే సమయంలో రాజకీయంగా, సైనికపరంగా కూడా ఆయన తీవ్ర ఇబ్బందుల్నే ఎదుర్కొంటున్నారు.ట్రంప్ శాంతి ప్రణాళిక.. ఈ శాంతి ప్రణాళిక ప్రకారం.. ఉక్రెయిన్ తన సైన్యాన్ని ఆరు లక్షలకు కుదించుకోవాలి. నాటోలోకి ఉక్రెయిన్ ఎప్పటికీ చేరకూడదు. అన్నింటికంటే కీలకం.. క్రిమియా, డాన్బాస్, లుహాన్స్క్తో పాటు.. ఖేర్సన్లో, జపోరిజియాలలో కొన్ని భూభాగాలను రష్యాకు అప్పగించాలి. ఈ ప్రతిపాదనను జెలెన్స్కీ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అయినా ఒప్పందంలో భూభాగాల అప్పగింత ప్రతిపాదనను ట్రంప్ చేయడం గమనార్హం.యుద్ధంలోనూ ఎదురుదెబ్బలుయుద్ధక్షేత్రంలోనూ ఉక్రెయిన్కు పరిస్థితులు ఆశాజనకంగా లేవు. చాలా ప్రాంతాల్లో ఆ దేశ సైన్యానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రష్యా నెమ్మదిగా కీలక ప్రాంతాలను ఆక్రమిస్తోంది. దొనెట్స్క్, ఖేర్సన్ ప్రాంతాల్లో ముందుకు కదులుతోంది. ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా భారీస్థాయిలో దాడులు చేస్తోంది. ఆయుధాల కొరత కూడా ఉక్రెయిన్ సైన్యాన్ని ఇబ్బంది పెడుతోంది. అమెరికా, ఇతర ఐరోపా దేశాల నుంచి సరఫరాలు అనుకున్నంత వేగంగా ఆ దేశానికి చేరడం లేదు. మానవ వనరుల కొరత కూడా వేధిస్తోంది. కొత్తగా సైన్యంలోకి ఎవరూ చేరడానికి ముందుకు రావడం లేదు. దీంతో సైన్యం నైతిక స్థైర్యమూ దెబ్బతింటోంది. -
ఆత్మ గౌరవమా.. కీలక మిత్రుడా..?: జెలెన్స్కీ టెన్షన్
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు తెచ్చిన శాంతి ప్రతిపాదనలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవమా లేక కీలకమైన మిత్రుడిని కోల్పోవడమా అనే ప్రశ్న ఇప్పుడు ఉక్రెయిన్ ముందుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఇది అత్యంత కష్ట కాలమని ఆయన తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్ ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పుడు చాలా కష్టమైన ఎంపికను ఎదుర్కోవాల్సి రావచ్చు. దీనివల్ల గౌరవాన్ని కోల్పోవడం లేదా కీలక భాగస్వామిని కోల్పోయే ప్రమాదం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. దురాక్రమణను ఆపాలంటే కీలకమైన పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్ను రష్యాకు వదిలివేయడం వంటి షరతులు ట్రంప్ ప్రతిపాదనల్లో ఉన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో జెలెన్స్కీ ఈ ప్రసంగం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. మూడేళ్లకు పైగా కొనసాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు 28 పాయింట్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్లాన్ సిద్ధం చేశారు. అందులో ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. ఆ ప్రతిపాదనలను అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా రూపొందించారు. ఇటీవల దానిని జెలెన్స్కీ ప్రభుత్వానికి అందించారు. ఆ ప్లాన్ ప్రకారం.. ఉక్రెయిన్ తూర్పు డాన్బాస్లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి. అలాగే ఆ దేశ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలకు అనుమతి ఉండకూడదు. రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్కు ఎవరూ అందించకూడదు. -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై దాదాపు 500 శాతం సుంకాలు విధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. రెండు దేశాల యుద్ధం ముగించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో భేటీ కూడా అయ్యారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అది సాధ్యం కాకపోవడంతో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ పెద్దమొత్తంలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా దాదాపు విఫలం కావడంతో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు సహకరిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్ప ప్రస్తుతం తమ దేశానికి వేరే మార్గం లేదని ట్రంప్ పేర్కొన్నారు.రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్లు విధిస్తానన్నారు. సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు తాజాగా ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ దేశాల జాబితాలో భారత్, చైనా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ను కూడా ఇందులో చేర్చనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తున్నామన్నారు. భారత్, చైనాలే ఆ దేశం నుంచి 70శాతం చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడనుంది. BREAKING:US president Trump approves bill allowing tariffs up to 500% on countries trading with Russia. pic.twitter.com/Lko3wXVuLU— Recon & surveillance (@Recon_surv) November 17, 2025 -
మళ్లీ అణ్వాయుధ పోటీ?
అణ్వాయుధాల పరీక్షలను తక్షణం పున రుద్ధరించవలసిందిగా రక్షణ (ఇప్పుడు ‘యుద్ధ విభాగం’గా పిలుస్తున్నారు) శాఖను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 29న ప్రకటించారు. ఇది ప్రపంచ అణు సుస్థిరత, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నియమావళులపై అక్షరాలా బాంబు వేయడమే! అమెరికా 1992 సెప్టెంబర్ తర్వాత, పూర్తి విస్ఫోటనాత్మక అణు పరీక్షను నిర్వహించలేదు. అయితే, 1998లో భారత్ అణు పరీక్షలను జరిపితే, ఆ వెంటనే పాకిస్తాన్ కూడా నిర్వహించింది. ఒక అణ్వాయుధాన్ని విస్ఫోటనం చెందించి చూడటం కడసారిగా 2017లో జరిగింది. భూగర్భంలో ఉత్తర కొరియా ఆ పరీక్షను నిర్వహించింది. అప్పటి నుంచి, అణు పాటవ పరీక్షలపై మారటోరియం అమలులో ఉంది. ఇప్పటివరకు అది ఉల్లంఘనకు గురి కాలేదు. ‘‘చాలా ఏళ్ళ క్రితం మేం దాన్ని నిలుపు చేశాం. కానీ, ఇతరులు పరీక్షలు చేస్తూండటంతో, మేం కూడా చేయడం సముచితమని నాకనిపించింది’’ అని ట్రంప్ అన్నారు. రష్యా పేరును ట్రంప్ ప్రస్తావించకపోయినా ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ మాటలన్నారన్నది స్పష్టం. రష్యా పుట్టిస్తున్న దడట్రంప్ ప్రకటనకు 10 రోజుల ముందు, మాస్కో అణ్వాయుధాలను మోసుకెళ్ళగల రెండు అధునాతన ప్రయోగ వ్యవస్థలను పరీ క్షించింది. బురైవెస్నిక్ (ఆకాశం నుంచి జారిపడే) క్రూజ్ క్షిపణిని... అక్టోబర్ 21న, అసాధారణ పొసైడాన్ జలగర్భ టార్పెడోను... అక్టో బర్ 28న పరీక్షించింది. అయితే, ఈ రెండూ అణ్వాయుధాలను మోసుకెళ్ళగల వాహకాలు మాత్రమే. వాటిని పరీక్షించడం అణు విస్ఫోట పరీక్షలతో సమానం కాదు. సాంకేతికంగా, అవి ప్రస్తుత ఆయుధ నియంత్రణ చట్రంలోకి రావు. ప్రయోగ వాహకాలను పరీ క్షించాంగానీ, అణ్వాయుధాలను కాదని రష్యా పునరుద్ఘాటించింది. కానీ అణ్వాయుధాలను కూడా పొదువుకుంటే, బురైవెస్నిక్, పొసైడాన్ ప్రాణాంతక ఆయుధాలుగా పరిణమిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అవి రష్యా వద్ద ఉన్నంతవరకూ దాని జోలికి వెళ్ళే సాహసం ఎవరూ చేయలేరు. రాడార్ దృష్టిలో పడకుండా బురైవెస్నిక్ 15 గంటల్లో 14,000 కిలోమీటర్ల దూరం పయనించినట్లు అక్టోబర్ 21 పరీక్షలో తేలింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన చోట మాత్రమే అది భూవాతావరణంలోకి ప్రవేశించగలదు. ప్రస్తుతమున్న క్షిపణి రక్షణ వ్యవస్థలు దాన్ని పసిగట్టలేవు. అదే అమెరికా ఆందోళనకు కారణం. ఇక పొసైడాన్... మానవ రహిత జలాంతర్గత అణ్వాయుధ వాహకం. ఇది 10,000 కిలోమీటర్ల దూరం పయనించగలదు. గరి ష్ఠంగా గంటకు 100 నాట్ల (185 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగ లదు. నీటిలో 1,000 మీటర్ల లోతు నుంచి సునాయాసంగా పని చేయగలదు. ఇది ఇప్పుడున్న జలాంతర్గామి నిరోధక రణతంత్ర సామర్థ్యాలకు అందనిది. అణ్వాయుధాన్ని కూడా తగిలించుకున్న పొసైడాన్ను యుద్ధంలో ప్రయోగిస్తే, అది భూగర్భ శిలా ఫలకాలను కదిలించే విధంగా అణుధార్మిక సునామీని రేకెత్తించగలదు. భూగోళానికి, మానవాళికి ఇది చూపించగల ప్రళయం మాటలకు అందనిది. ‘ఐరన్ డోమ్’తో మారిన పరిస్థితిప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 1972లో అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్లు బాలిస్టిక్ నిరోధక క్షిపణుల ఒడంబడిక (ఏబీఎం)కు వచ్చాయి. పరస్పరం ఆయుధాలను ప్రయోగించుకుంటే ఇద్దరమూ నాశనం కావడం ఖాయం అనే అవగాహన (మ్యాడ్)ను అది కల్పించింది. విధ్వంసాన్ని ఆధారం చేసుకున్న మనుగడ అనే ఆ సిద్ధాంతం అసంబద్ధమైనదిగా కనిపిస్తుంది. ఏబీఎం ఆనాటి పరిస్థితులను బట్టి కుదుర్చుకున్న సంక్లిష్టమైన,సాంకేతిక–వ్యూహాత్మక ఒడంబడిక. పోగుపడుతున్న సామూహిక విధ్వంసక ఆయుధాల (డబ్లు్య.ఎం.డి.)తో రెండు అగ్ర రాజ్యాల మధ్య అభద్రత నెలకొన్న నేపథ్యంలో కుదుర్చుకున్నది. అయితే, 2001 సెప్టెంబర్ 11 (9/11) పరిణామాల నేపథ్యంలో, అమెరికా 2002 జూన్లో, ఏకపక్షంగా ఆ ఒడంబడిక నుంచి ఉపసంహరించుకుంది. వైశాల్యం కుంచించుకుపోయి, ఆత్మ విశ్వాసం సన్నగిల్లిన పరిస్థితిలోనున్న రష్యాలో అది అభద్రత బీజాలను నాటింది. పొసైడాన్ 2015లో పురుడు పోసుకోవడం పుతిన్ కన్నుల్లో కాంతి రేఖను నింపింది. కడచిన దశాబ్దంలో అది వైఫల్యాలను చూసింది. సైంటిస్టులు ప్రమాదాల్లో హతులయ్యారు. కానీ, కార్యక్రమం కొన సాగింది. అక్టోబర్ 21న విజయవంతమైంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, చేసిన ప్రక టన బహుశా పుతిన్ను ఈ పరీక్షకు పురిగొల్పి ఉండవచ్చు. ‘అమె రికాకు ఐరన్ డోమ్ ఏర్పాటు’ శీర్షికతోనున్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై 2025 జనవరి 27న ట్రంప్ సంతకం చేశారు. ఇప్పుడా డోమ్కు ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. అది అమెరికా ప్రధాన భూభాగానికి అంతటికీ గొడుగులా పనిచేస్తుందనీ, బహుశా 2045 నాటికి పూర్తి కాగల ఈ కార్యక్రమానికి దాదాపు 3.6 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతాయనీ అంచనా. ఇందుకు సంబంధించి ఎలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’కు మొదటి విడత చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ‘స్టార్ వార్స్’ కార్యక్రమాన్నీ, ప్రచ్ఛన్న యుద్ధం అంతాన్నీ గుర్తుకు తెస్తోంది. ఈ కార్యక్రమాలు దీర్ఘకాలంలో అమెరికా, రష్యా రెండింటినీ దివాళా తీయిస్తాయా? నిరాయుధీకరణే దారిపాకిస్తాన్తో సహా ఇతర దేశాలు రహస్యంగా అణు పాటవ పరీ క్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ చెబుతున్నారు. అధునాతన అణ్వా యుధాలు డోమ్లో భాగం కావాలంటున్నారు. దానికి కొనసాగింపుగా, అమెరికా అణు పరీక్షలను పునరుద్ధరిస్తుందని అన్నారు. ‘‘సంయమనం, చర్చలు అవసరమైన సమయంలో అణు పాటవ పరీక్షలను పునరుద్ధరించడం అస్థిరతకు ద్వారాలు తెరుస్తుంది. మూడు దశాబ్దాలుగా అణ్వాయుధ పోటీని నిరోధిస్తూ వస్తున్న అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని బీటలు వారుస్తుంది’’ అని ఆసియా –పసిఫిక్ లీడర్షిప్ నెట్వర్క్ (ఏపీఎల్ఎన్) అనే ప్రాంతీయ బృందం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఆ ప్రకటనపై సంతకం చేసిన వారిలో ఈ వ్యాసకర్త కూడా ఉన్నారు. ట్రంప్ అణు సంయ మనాన్ని పాటిస్తారో, లేక పరీక్షల నిషేధ ‘రెడ్ లైన్’ను ఉల్లంఘిస్తారో చూడవలసి ఉంది. అంతర్జాతీయంగా అణు సంయమనం, నిరాయు ధీకరణకు ఎల్లప్పుడూ పోరాడే భారత్ తన గొంతును తప్పనిసరిగా వినిపించవలసి ఉంది. వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
వేదికపైనే కుప్ప కూలిన రోబో (వీడియో)
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలా దేశాల్లో ఇప్పటికే హ్యుమానాయిడ్ రోబోలు అందుబాటులో ఉన్నాయి. అయితే రష్యా ఇటీవల తన మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో నడిచే హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. కానీ ప్రారంభంలోనే విఘాతం అన్నట్టు.. రోబో కిందపడింది.రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.ఐడల్ రోబోట్ కిందికి పడగానే.. దానికి ఫిక్స్ చేసిన కొన్ని భాగాలు కూడా ఊడిపోయాయి. రష్యన్ రోబోటిక్స్ సంస్థ రూపొందించిన ఈ ఐడల్ ప్రస్తుతం ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ప్రజల సందర్శనార్థం దీనిని ప్రదర్శించాలనుకున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. కాగా ఇంజనీర్లు ఐడల్.. బ్యాలెన్స్ సిస్టమ్, కంట్రోల్ సాఫ్ట్వేర్ వంటి వాటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు.Russia unveils its first humanoid robot in Moscow. The AI-powered android took a few steps to ROCKY music, waved, and immediately faceplanted.The stage was quickly curtained, and the fallen “fighter” was carried backstage. @elonmusk knows how it feels. pic.twitter.com/EE57KR4T2d— Russian Market (@runews) November 11, 2025హ్యుమానాయిడ్ రోబోలుప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు హ్యుమానాయిడ్ రోబోలను రూపొందించే దిశలో వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ రంగంలో చైనా అగ్రస్థానంలో ఉండగా.. జపాన్, సౌత్ కొరియా, అమెరికా, జర్మనీ దేశాలు సైతం తమదైన రీతిలో పరిశోధనలు చేస్తున్నాయి, రోబోలను ఆవిష్కరిస్తున్నాయి.మన దేశం కూడా హ్యుమానాయిడ్ రోబోలను రూపొందించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ISRO తయారు చేసిన వ్యోమిత్రా (Vyommitra) హ్యూమనాయిడ్ రోబోట్, మానవ అనే 3D ప్రింటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రూపొందించిన మల్టీపర్పస్ హ్యూమనాయిడ్ రోబోట్ అల్ఫా1.0 వంటివి ఉన్నాయి. -
రష్యాకు 70 వేల మంది భారత కార్మికులు
మాస్కో: ఉక్రెయిన్తో నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా అర్హత కలిగిన, నిపుణులైన కార్మికుల కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రష్యా భారత్ వైపు చూస్తోంది. తమ సమస్య పరిష్కారానికి త్వరలోనే భారత్తో ఒప్పందం కుదుర్చుకోనుంది. కనీసం 70 వేల మంది భారతీ యులను ఈ ఏడాది చివరికల్లా రష్యాలోని వివిధ ప్రాంతాల్లోని నిర్మాణ, వస్త్ర, ఇంజనీరింగ్, ఎల క్ట్రానిక్స్ పరిశ్రమల్లో చేర్చుకోనుంది. వీరికి అవసరమైన ఏర్పాట్లను రష్యా కార్మిక శాఖ చేపట్టింది. డిసెంబర్ మొదటి వారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యట నకు రానున్నారు. ఆ సమయంలో ఇరు దేశాలు ఇందుకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఈ ఒప్పందం ఫలితంగా భారతీయ కార్మికులు, సిబ్బందికి రష్యాలో చట్ట పరమైన రక్షణలు లభిస్తాయి. ఈ పరిణామాన్ని మాస్కోలోని ఇండియన్ బిజినెస్ అలయెన్(ఐబీఏ) స్వాగతించింది. భారత్– రష్యా సంబంధాల్లో ఇదో వ్యూహాత్మక మైలురాయిగా మారనుందని ఐబీఏ ప్రెసిడెంట్ సమ్మీ మనోజ్ కొత్వానీ అభివర్ణించారు. భారతీయ నిపుణులకు సురక్షితమైన, గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తూనే, రష్యా ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవశక్తిని అందనుందన్నారు. భారతీయ సిబ్బందికి అవసరమైన రష్యన్ భాషా నైపుణ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వారి సంక్షేమానికి, భద్రతకు సంబంధించిన అంశాలపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉంటామన్నారు. -
మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..
ఒక వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అలాంటి క్షణం అత ఈజీగా మర్చిపోలేం కదూ..ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదూ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందింటే..శుభం గౌతమ్ అనే వ్యక్తి ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. "నా అమ్మ రష్యాలో సెలబ్రిటీ" అనే క్యాప్షన్తో షేర్ చేయడంతో మరింత వైరల్గా మారింది. ఆ వీడియోలో అతడు తన తల్లితో రష్యా వీధుల్లోకి రాగానే.. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆ తల్లిని చూసి రష్యన్ ప్రజలు ఆశ్చర్యపోవడమే కాదు..ఒక్క సెల్ఫీ అంటూ ఎగబెట్టారు. ఏదో సెలబ్రిటీ మాదిరిగా అంతా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతుంటే..మా అమ్మకు ఒక్కసారిగా ఎంత క్రేజ్ పెరిగిపోయిందో అంటూ మురిసిపోయాడు ఆమె కుమారుడు. విదేశాల్లో మన సంప్రదాయ దుస్తులో గనుక మనం కనిపిస్తే కచ్చితంగా ప్రత్యేకంగా నిలబడటమే గాక, అందరి దృష్టిని ఆకర్షిస్తాం..అందుకు ఈ తల్లే నిదర్శనం. అంతేగాదు ఆమె కొడుకు నా తల్లి రష్యాకు ఇష్టమైన సెలబ్రిటీ అని వీడియోలో చెబుతుండటం స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె కూడా అక్కడి వాళ్ల రియాక్షన్కు సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ వారితో సెల్ఫీలు దిగడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. భారతదేశం వెలుపల మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు దరిస్తే..అవి మనల్ని ప్రత్యేకంగా నిలబడేల చేయడమే గాక, రియల్ సెలబ్రిటీకి అర్థం చెప్పేలా మనల్ని నిలబెడతాయి కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడమే కాదు..ఆ తల్లి నిజంగా భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రేమగా పిలుస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Shubham Gautam (@samboyvlogs) (చదవండి: సాత్విక ఆహారంతో బరువు తగ్గగలమా..? నటి, గాయని షెహ్నాజ్ సైతం..) -
కళ్ళ ముందే కుప్పకూలిన రష్యన్ ఆర్మీ హెలికాప్టర్
-
రష్యాలో ఇండియా విద్యార్థి అదృశ్యం : విషాదాంతం
రష్యాలో గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన భారతీయ MBBS విద్యార్థి కథ విషాదాంతమైంది. రాజస్థాన్లోని అల్వార్కు చెందిన 22 అజిత్ సింగ్ చౌదరి మృతదేహం ఆనకట్టలో లభ్యమైంది. దీంతో బాధిత విద్యార్థి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.రష్యాలో దాదాపు మూడు వారాలుగా తప్పిపోయిన వైద్య విద్యార్థి అజిత్ సింగ్ చౌదరి మృతదేహాన్ని ఉఫా నగరంలోని ఆనకట్ట సమీపంలో గుర్తించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటన గురించి కుటుంబ సభ్యులకు , అల్వార్లోని స్థానిక ప్రతినిధులకు సమాచారం అందించింది.అజిత్ సింగ్ చౌదరి 2023 నుండి రష్యాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో M ఎంబీబీఎస్ డిగ్రీ చదువుతున్నాడు. అక్టోబర్ 19న ఉదయం 11 గంటల ప్రాంతంలో తన హాస్టల్ నుండి బయటకు వచ్చిన తర్వాత అజిత్ అదృశ్యమయ్యాడు. పాలు కొనుక్కుని అరగంటలోపు తిరిగి వస్తానని స్నేహితులకు చెప్పి వెళ్లిన అతను ఎంతకీ తిరిగిరాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.స్థానిక అధికారులు వైట్ నది సమీపంలో అతని బట్టలు, ఫోన్ ,బూట్లు కనుగొన్నారు. పంతొమ్మిది రోజుల తరువాత, అదే నదికి ఆనుకుని ఉన్న ఆనకట్ట వద్ద అజిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.తోటి విద్యార్థులు మృతదేహాన్ని గుర్తించారు పోస్ట్మార్టం అనంతరం అతని మృతదేహాన్ని ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాయబార కార్యాలయం, రష్యన్ అధికారుల మధ్య సమన్వయంతో స్వదేశానికి తిరిగి పంపే ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తి కావచ్చని అధికారులు తెలిపారు.చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం అజిత్ అనుమానాస్పద మరణంతో అజిత్ తల్లిదండ్రులు రూప్ సింగ్ ,సాంత్రా దేవి శోకానికి అంతులేకుండా పోయింది. వైద్యవిద్య కోసం మూడెకరాల భూమి అమ్మినట్టు బంధువులు తెలిపారు. ఎన్నో కలలతో అజిత్ను విదేశాలకు పంపించాం, కానీ మనిషినే కోల్పోతామని అనుకోలేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రవుతున్నారు. ఎలా చనిపోయాడనే దానిపై వివరణాత్మక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు అజిత్ గ్రామస్తులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్ అదృశ్యం పట్ల త్వరగా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని మృతదేహాన్ని త్వరగా తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమ్యూనిటీ సభ్యులు అల్వార్ జాట్ హాస్టల్లో సమావేశం నిర్వహించారు.దీనిపై కాంగ్రెస్ నాయకుడు జితేంద్ర సింగ్ అల్వార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏదో అనుమానాస్పదంగా అనిపిస్తోందంటూ ట్వీట్ చేశారు. మృతదేహాన్ని తరలించేలా ఏర్పాటు చేయాలనీ, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను కోరారు. ఇదీ చదవండి: Betting App Case: శిఖర్ ధావన్, రైనాపై సజ్జనార్ ఆగ్రహం -
రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు తగ్గుముఖం!
దేశీయ చమురు శుద్ధి కర్మాగారాలకు ప్రధాన ముడిచమురు సరఫరాదారుగా ఉన్న రష్యా నుంచి భారత్ దిగుమతులు ఇటీవలికాలంలో గణనీయంగా తగ్గాయి. సెప్టెంబర్ నెలలో రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు విలువ పరంగా 28.9 శాతం తగ్గి, 2024 సెప్టెంబర్లోని 4,675 మిలియన్ డాలర్ల నుంచి 3,322 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాల్యూమ్ పరంగా చూస్తే ఈ దిగుమతులు ఏకంగా 17 శాతం తగ్గి 6.6 మిలియన్ టన్నులకు చేరాయి.తగ్గుదలకు ప్రధాన కారణాలురష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా జులైలో ఇండియాపై 25 శాతం అదనపు టారిఫ్ను విధించింది. అంతకుముందు ఉన్న టారిఫ్లతో కలిపి ఇది మొత్తం సుమారు 50 శాతానికి చేరింది. ఈ అదనపు టారిఫ్ల వల్ల భారతీయ ఎగుమతులపై ముఖ్యంగా జౌళి (టెక్స్టైల్స్), ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అమెరికా మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులు ధరల పరంగా తమ పోటీతత్వాన్ని కోల్పోయాయి.దిగుమతులు తగ్గించుకుంటేనే..రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంటే ఈ టారిఫ్లను ఉపసంహరిస్తామని అమెరికా ప్రభుత్వం పరోక్షంగా ఒత్తిడి తీసుకొచ్చింది. దాంతో భారతీయ చమురు సంస్థలు (రిఫైనరీలు) ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించక తప్పలేదు.రష్యా చమురు సంస్థలపై ఆంక్షలుఅమెరికా ప్రభుత్వం ఇటీవల రష్యాకు చెందిన ప్రధాన చమురు సంస్థలు అయిన రోస్నెఫ్ట్(Rosneft), లుకోయిల్ (Lukoil) వంటి వాటిపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు కేవలం టారిఫ్లు వంటి ధరల పెరుగుదలకు మాత్రమే పరిమితం కాకుండా ఈ సంస్థలతో ఆర్థిక లావాదేవీలు జరపడం, బీమా (ఇన్సూరెన్స్), రవాణా (షిప్పింగ్) వంటి అంశాలలో భారీ నియంత్రణ సమస్యలను సృష్టిస్తున్నాయి. పాశ్చాత్య ఆంక్షలకు లోబడి పనిచేయడం రిఫైనరీలకు సంక్లిష్టంగా మారడంతో భవిష్యత్తులో సరఫరా భద్రత దృష్ట్యా కొన్ని భారతీయ రిఫైనరీలు (రిలయన్స్ ఇండస్ట్రీస్, మాంగళూరు రిఫైనరీ వంటివి) రష్యా నుంచి కొత్త కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది. దీన్ని కంపెనీలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.ఎనర్జీ సెక్యూరీటీ, జాతీయ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని వాదిస్తూ భారత్ రష్యా నుంచి చౌకగా లభించిన ముడిచమురును పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంది. అయినప్పటికీ అంతర్జాతీయ వాణిజ్యంపై అమెరికా విధించిన భారీ టారిఫ్లు, రష్యన్ సంస్థలపై ఆంక్షలు భారతీయ ఎగుమతి రంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో దేశీయ రిఫైనరీలు తమ చమురు వనరుల కోసం ప్రత్యామ్నాయ దేశాలైన అమెరికా, మధ్య ఆసియా దేశాల వైపు మళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది.ఇదీ చదవండి: వొడాఫోన్-ఐడియా బకాయిలపై మదింపు చేయవచ్చు.. సుప్రీంకోర్టు -
మళ్లీ భారత్ను టార్గెట్ చేసిన ట్రంప్
వాషింగ్టన్: రష్యా , ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్, చైనాలు కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరువైపులా అణ్వాయుధ ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నందున ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమని ‘సీబీఎస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అలాగే తాను అమెరికా దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సమర్థించుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సీబీఎస్’కు 60 నిమిషాలపాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 33 ఏళ్ల నిషేధం తర్వాత అమెరికన్ దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ తాను ఆదేశాలు జారీ చేశానన్నారు. చైనా, పాకిస్తాన్ ఇప్పటికే రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అన్నారు. అయితే ఆ దేశాలు ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదని, తాము అందుకు భిన్నమని అన్నారు. ఉత్తర కొరియా, పాకిస్తాన్ పరీక్షలు చేస్తున్నాయనే సమాచారం తమవద్ద ఉందన్నారు. భారత్, పాక్లు గత మే నెలలో అణు యుద్ధం అంచునకు చేరాయని, అయితే తాను వాణిజ్యం, సుంకాలతో దానిని అడ్డుకున్నానని అన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోకపోతే లక్షలాది మంది చనిపోయేవారని ట్రంప్ పేర్కొన్నారు.ఆ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు భూగర్భంలో పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ పరీక్షలతో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అయితే కంపనం అనుభూతి మాత్రం కలుగుతుంది. గ్లోబల్ మానిటరింగ్ స్టేషన్లు భూగర్భ అణు పేలుళ్ల వల్ల కలిగే భూకంపం లాంటి కంపనాలను గుర్తిస్తాయి. అటువంటి పరీక్షలను రహస్యంగా నిర్వహించవచ్చని, వాటిని గుర్తించలేమని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ చైనా, పాకిస్తాన్లు అణ్వాయుధాలను పరీక్షిస్తుంటే, అది భారతదేశాన్ని మరింత అస్థిరంగా మారుస్తుందని ట్రంప్ పరోక్షంగా పేర్కొన్నారు. -
యుద్ధంలోకి అమెరికా?.. వణికిపోతున్న ప్రపంచం
చరిత్ర మళ్లీ తన రక్తపు పుటలను తిరగేస్తోంది. మరో యుద్ధం మన కళ్ల ముందు పుడుతోంది. ఈసారి ఇది చిన్న దేశాల మధ్య కాదు.. ఏకంగా అమెరికా యుద్ధరంగంలోకి అడుగుపెడుతోందన్న వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. వెనిజులా తీరప్రాంతాల్లో సముద్రం మంటల్లో కరిగిపోతున్న వేళ.. అమెరికా నౌకాదళం పేల్చిన బుల్లెట్లు ఆకాశాన్ని ఎర్రగా మార్చేశాయి. ఇది మాదకద్రవ్యాల నౌక అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. వెనిజులా మాత్రం ఇది తమ ప్రజల నౌక అని గట్టిగా చెబుతోంది. ఆ అగ్నిజ్వాలల మధ్య మానవ శరీరాలు ముక్కలై పోయాయి. ఇటు వెనిజులా డిక్టెటర్ నికోలాస్ మడూరో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాస్కో, బీజింగ్, టెహ్రాన్కి రహస్య పత్రాలు పంపించారు. ఆయుధాలు, క్షిపణులు పంపాలని రష్యా, చైనా, ఇరాన్ దేశాలను కోరారు. వెనిజులా కోసం రష్యా ఇప్పటికే రాడార్లను సిద్ధం చేస్తోందని సమాచారం.. ఇటు చైనా తన సాంకేతికతను పరిశీలిస్తుంటే.. అటు ఇరాన్ తన డ్రోన్లను గాల్లోకి ఎగరేస్తోంది. మరోవైపు ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఓ భారీ స్టేట్మెంట్ వదిలారు. మడూరో తన చివరి రోజులు లెక్కబెట్టుకుంటున్నారని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.యుద్ధ క్షేత్రంలా కరేబియన్ సముద్రంఇటు కరేబియన్ సముద్రం యుద్ధ క్షేత్రంలా మారిన సమయంలో.. అమెరికా నౌకలు వరుసగా కదులుతున్నాయి. ఆకాశంలో ఫైటర్ జెట్లు తిప్పుకుంటున్నాయి. ఈ మొత్తం పరిణామాలను ప్రపంచం ఊపిరిబిగపట్టి చూస్తోంది. ఒకవైపు అమెరికా శక్తి.. మరోవైపు రష్యా, చైనా, ఇరాన్ మిత్రబలగాలు...! ఏ క్షణానైనా మొదటి క్షిపణి ప్రయాణించే అవకాశం ఉంది. ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు అంచనా ప్రపంచాన్ని మళ్లీ అగ్నిగుండంలోకి నెట్టేసే ఛాన్స్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మరోసారి యుద్ధపు నీడలోకి జారిపోతోంది. దశాబ్దాల క్రితమే..నిజానికి అమెరికా-వెనిజులా మధ్య ఘర్షణ ఈరోజు పుట్టిన గొడవ కాదు. దశాబ్దాల క్రితమే ఈ మంటలు మొదలయ్యాయి. 1999లో హ్యుగో చావెజ్ అధికారంలోకి వచ్చారు. ఆయన అమెరికా ఆధిపత్యాన్ని బహిరంగంగా సవాలు చేశారు. వెనిజులా ఆయిల్ సంపదను ప్రజల కోసం ఉపయోగిస్తానని ప్రకటించడం.. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆ నాడు కుదిపేసింది. అప్పటి నుంచే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. చావెజ్ తర్వాత మడూరో బాధ్యతలు స్వీకరించగానే అమెరికా ఆంక్షల వర్షం కురిపించింది. ఇక 2019లో మడూరోను అధ్యక్షుడిగా అంగీకరించకుండా జువాన్ను వెనుజులా ప్రెసిడెంట్గా అమెరికా గుర్తించింది. అమెరికా ఆంక్షలతో ఒకప్పుడు బలంగా నిలిచిన దేశం.. ఆ తర్వాత ఆకలితో విలవిల్లాడే స్థితికి చేరింది. ఆయిల్ నిల్వలు ఉన్నా వాటిని అమ్మే దేశాలు లేకుండాపోయాయి. కరెన్సీ విలువ నేలమట్టమైన సమయంలో... దేశం ఆర్థికంగా కూలిపోయింది. అయితే మడూరో వెనక్కి తగ్గకుండా.. రష్యా, చైనా, ఇరాన్ వైపు తిరిగారు.సరిహద్దు సముద్రంలో పేలుళ్లుఇక 2025లో అమెరికా వెనిజులా మధ్య సరిహద్దు సముద్రంలో పేలుళ్లు మొదలయ్యాయి. అమెరికా సైన్యం వెనిజులా నౌకలపై అనేకసార్లు దాడుల చేసింది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో వెనుజులా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత మడూరో ప్రజల ముందు వచ్చి అమెరికాను నేరుగా హెచ్చరించారు. అదే సమయంలో రష్యా, చైనా, ఇరాన్ నాయకులతో అత్యవసర చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయి. వెనిజులాకు క్షిపణి వ్యవస్థలు అందించడానికి పుతిన్ సర్కార్ అంగీకరించింది. రాడార్ నెట్వర్క్ విస్తరణకు చైనా సహకరిస్తానని చెప్పగా.. ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీని అందిస్తానని ప్రకటించింది. ఈ చర్యలతో అమెరికా మరింత కఠినంగా మారింది. ఈ మూడు దేశాల చర్యలను నార్కో టెరరిజంగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అమెరికా నౌకాదళం.. కరేబియన్ సముద్రంలో తన సైనిక బలగాలను రెండింతలు పెంచింది. రహస్య గూఢచార వాహనాలు వెనిజులా గగనతలంలో ఇప్పటికే తిరుగుతున్నాయని సమాచారం.అమెరికా ఆధిపత్యానికి సవాలుఇక రష్యా, చైనా, ఇరాన్ ఈ ఘటనను అమెరికా ఆధిపత్యానికి సవాలుగా చూస్తున్నాయి. వెనిజులా తమకు వ్యూహాత్మక కేంద్రంగా మారుతుందని భావిస్తున్నాయి. రష్యా ఇప్పటికే నౌకాశ్రయ ఒప్పందం సిద్ధం చేసుకుంది. చైనా.. వెనిజులా ఆయిల్ బాకీలకు బదులుగా మిలిటరీ సదుపాయాలు కోరుతోంది. ఇరాన్.. వెనిజులాలోని గగనతల కేంద్రాలను డ్రోన్ నియంత్రణ స్థావరాలుగా మార్చే పనిలో ఉంది. ఇటు ఈ మొత్తం వ్యవహారంలో లాటిన్ అమెరికా అంతా ఆందోళనలో నిండిపోయింది. బ్రెజిల్, కొలంబియా, పెరూ దేశాలు భయంతో మౌనంగా ఉండిపోయాయి. ఇటు యూరప్తో పాటు యునైటెడ్ నేషన్స్ ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ..ట్రంప్ గారు వెనక్కి తగ్గేలా కనిపించడంలేదండి. ఇలా చూస్తే.. ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త యుద్ధం అంచున నిలబడి ఉందనే చెప్పవచ్చు. ఒకవైపు అమెరికా ఆధిపత్యం, మరోవైపు రష్యా-చైనా-ఇరాన్ కూటమి. ఎవరు వెనక్కి తగ్గినా అది ఓటమే అవుతుంది.. ఎవరు ముందుకు కదిలినా అది యుద్ధానికి ప్రారంభమవుతుంది..! మరి చూడాలి ఏ క్షణాన ఏం జరుగుతుందోననే టెన్షన్ మాత్రం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: రోజుకు 15 మందిని చంపేస్తున్న అతివేగం -
రష్యా నుంచి అధునాతన అణుజలాంతర్గామి
మాస్కో: ఇటీవల అణు ఇంధనంతో పనిచేసే బురేవేస్ట్నిక్ క్షిపణిని ప్రయోగించి ప్రపంచదేశాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన రష్యా ఆదివారం మరో ఆధునిక అస్త్రంతో ముందుకొచ్చింది. తీర ప్రాంత దేశాలపై భీకరస్థాయిలో దాడులు చేయగల పోసెడాన్ అణ్వస్త్ర డ్రోన్ను ప్రయోగించే సామర్థ్యమున్న ‘ఖబరోవ్స్క్’ జలాంతర్గామిని రష్యా ప్రారంభించింది. అత్యంత వినాశనం సృష్టించగల డ్రోన్ కాబట్టే పోసెడాన్ డ్రోన్ను ప్రళయకాల(డూమ్స్డే) క్షిపణి అని కూడా పిలుస్తారు. రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బలౌస్క్, నేవీ చీఫ్ అడ్మిరల్ అలెగ్జాండర్ మోసెయేవ్ సమక్షంలో ఈ కొత్త జలాంతర్గామిని సముద్రజలాల్లోకి ప్రవేశపెట్టారు. సెవెరోడ్విన్స్క్ నగరంలోని సేవ్మాష్ షిప్యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది. భారీగా ఉండే ఖబరోవ్స్క్ జలాంతర్గామి జలాంతర ఆయుధాలు, రోబోటిక్ వ్యవస్థల మేలు కలయిగా చెప్పొచ్చు. శత్రుదేశాల నిఘా నుంచి సునాయసంగా తప్పించుకోగలదు. ఎంతో వేగంగా ప్రయాణించగలదు. జాడ తెలీకుండా మరింత లోతులకు వెళ్లి దాక్కోగలదు. శత్రువులపై వ్యూహాత్మకంగా దాడిచేస్తుంది. -
కొనడం కన్నా మానడం మేలు
రష్యాకు చెందిన ‘రోస్నెఫ్ట్’, ‘ల్యూక్ ఆయిల్’ కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెడుతూ అక్టోబరు 22న అమెరికా తీసు కున్న నిర్ణయం రష్యానూ, రష్యా చమురు కొంటున్న దేశాలనూ ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. రష్యా ముడిచమురు ఆదాయంలో 57 శాతం ఈ రెండు దిగ్గజసంస్థల ద్వారానే సమకూరుతుంది. ఇతర చిన్నాచితకా కంపెనీల ద్వారా మిగిలిన 43 శాతం లభిస్తోంది. చిన్న కంపెనీల మీద ఎలాంటి ఆంక్షలు విధించనప్పటికీ, ఇండియా వంటి ప్రధాన చమురు దిగుమతి దేశాల మీద అమెరికా చర్య ప్రభావం గణనీయంగా ఉంటుంది. బ్లాక్ లిస్టెడ్ కంపెనీల నుంచి కొనుగోళ్లు చేయ బోమని ఇండియా చమురు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతులు ఒకప్పుడు కేవలం1 శాతం ఉండేవి అలాంటిది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అవి 38 శాతం గరిష్ఠ స్థాయికి పెరిగాయి. ఇండియా ఇలా రష్యా ముడి చమురు కొంటూ పుతిన్ యద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. చౌకగా లభిస్తున్నందువల్లే దేశ ప్రయోజనాల దృష్టిలో తాము రష్యా చమురు కొంటున్నామని భారత ప్రభుత్వం ఈ ఆరోపణను కొట్టివేసింది. ఇండియా సందిగ్ధంఅమెరికా తాజా నిర్ణయంతో ఇండియా సందిగ్ధంలో పడింది. ఏదో ఒక విధంగా రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగించడమా, లేదంటే రష్యా చమురుకు పూర్తిగా దూరం కావటమా అన్నది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. నిజానికి రెండు సర్వసత్తాక దేశాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం ఎలా జరగాలో శాసించే హక్కు అమెరికాకు లేదు. తమ కంపెనీలు రెండిటిని అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ, చమురు ఎగుమతులు నిలిపివేయాలని రష్యా భావించడం లేదు. కానీ బ్లాక్ లిస్టెడ్ కంపెనీలతో వ్యాపారం చేసే దేశాల మీద అమెరికా ద్వితీయ స్థాయి ఆంక్షలు విధించే అవకాశం ఉన్నందున, అంత రిస్కు తీసుకుని రష్యా చమురు కొనాలా వద్దా అనేది ఇండియా, చైనా వంటి దిగుమతిదారులు తమకు తాముగా తీసు కోవలసిన నిర్ణయం. ఇప్పుడు ఇండియా ముందు రెండు మార్గాలు ఉన్నాయి. అమె రికా ఆంక్షలు విధించినా సరే రష్యా చమురును ఇకమీదటా కొనడం వాటిలో ఒకటి. అమెరికా ఆంక్షలు వర్తించకుండా దళారుల ద్వారా సమకూర్చుకునే వీలుంది. రష్యా రహస్యంగా నడుపుతున్న రహస్య (షాడో) ట్యాంకర్ల ద్వారానూ తెప్పించుకోవచ్చు. ఏదో విధంగా చౌక ధరలకు రష్యా చమురు తెప్పించుకోవడం సాధ్యమే. అయితే ఈ చర్యలు ట్రంప్కు ఆగ్రహం కలిగిస్తాయి. చపల చిత్తుడైన ట్రంప్ఆంక్షలను ధిక్కరించడం తెలివైన పని అనిపించుకోదు. ట్రంప్తో ఢీకొనడం అంటే, తలను రాతి గోడకేసి కొట్టుకోవడమే. అమెరికాతో తలపడటంలో మన కంటే గట్టిదైన చైనా సైతం ఆ రెండు రష్యాకంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపి వేస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది.వాణిజ్య ఒప్పందమే ఆచరణీయంట్రంప్తో తల గోక్కోవడం కంటే, ఆచరణీయ వైఖరి అవలంబించాలి. విస్తృత వ్యూహాత్మక లక్ష్యాలకు ముప్పు వాటిల్లని రీతిలో, దౌత్య ఇంధన ఆర్థిక ప్రయోజనాలను సమతుల్యం చేసేట్లు ఈ వైఖరి ఉండాలి. ఇది రెండో మార్గం. మన చేతిలో ఉన్న ముక్కలతోనే మనం ఆడాలి. సమకాలీన భౌగోళిక రాజకీయాల్లో ఆచరణవాదమే నడుస్తోంది. ఇండియా భిన్నంగా వ్యవహరించలేదు. అమెరికా ఒత్తిడికి లొంగిపోతున్నామా అన్నది ముఖ్యం కాదు. దేశానికి గరిష్ఠ ప్రయోజనం దేనివల్ల సిద్ధిస్తుందో ఆ మార్గాన్ని ఎంచుకోవాలి.ఒకటి: ఆంక్షలకు గురికాని రష్యా ఇంధన కంపెనీల నుంచి కొను గోళ్లు చేసే అవకాశం ఇప్పటికీ ఉంది. రోస్నెఫ్ట్, ల్యూక్ఆయిల్ నుంచి కాకుండా మిగిలిన రష్యా కంపెనీల నుంచి కొంటే అమెరికా సెకండరీ ఆంక్షలు వర్తించవు. ఆంక్షలు ఆ రెండు కంపెనీల మీదే కానీ రష్యా ఆయిలు మీద కాదు. అయినా సరే ఇది అనుకున్నంత సులభం కాదు. రెండు: అమెరికా ఆంక్షలను ఇండియా తోసిరాజన గలదా, ఆ సాహసం ఫలితమిస్తుందా, అమెరికాతో ముడిపడి ఉండే విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మాత్రమే రష్యా చమురు కొనుగోళ్ల కొనసాగింపుపై ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది.ఇండియా వస్తువుల మీద ట్రంప్ తొలుత విధించిన 25 శాతం సుంకాలను వీలైనంత తగ్గించేలా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొను గోళ్లను నిలిపివేసినట్లయితే, తరువాత మోపిన 25 శాతం అదనపు సుంకాలను కూడా తగ్గించడానికి లేదా రద్దు చేయడానికి వీలు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికాతో సానుకూల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోడానికి అనువుగా రష్యా చమురుకు స్వస్తి పలికే అంశాన్ని పరిశీలించాలి. ప్రతిష్ఠ స్థానే ప్రయోజనాలుట్రంప్ ఏకపక్ష ఆంక్షలను తోసిరాజన్నట్లయితే, దేశ గౌరవం ఇనుమడిస్తుంది. కానీ దానివల్ల ఒనగూరే ప్రయోజనాలు పరిమిత మైనవి. వాటి కంటే మనం ఎదుర్కొనే రిస్కులు ఎక్కువ. కాబట్టి, అమెరికా విధానంలో మార్పు కోసం రష్యా నుంచి చమురు కొను గోళ్లను నిలిపివేసే ఆలోచన చేయాలి. తద్వారా, దక్షిణాసియాలోఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ అవలంబిస్తున్న ప్రతికూల భౌగో ళిక రాజకీయ వైఖరికి తెరపడుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ బలాబలాల సమతౌల్యాన్ని సానుకూల రీతిలో పునురు ద్ధరించుకునేందుకు అమెరికా సహకారం తీసుకుని తీరాలి. ప్రాంతీ యంగా వారి వ్యూహాత్మక ప్రయోజనాలకూ ఢోకా ఉండదన్న భరోసా ఇవ్వాలి. స్పష్టంగా చెప్పాలంటే, రష్యా చమురు కంపెనీల మీద అమెరికా ఆంక్షలు ధిక్కరించడానికి ఇండియాకు ఉన్న అవకాశాలు పరి మితం. ఈ తప్పనిసరి పరిస్థితి నుంచి ఎంతో కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేయాలి. కీలకమైన తన వ్యూహాత్మక ప్రయోజనాలు పరిరక్షించేట్లయితే, రష్యాపై ఆంక్షల పట్ల అభ్యంతరం లేదనిఇండియా ప్రతిపాదించాలి. జాతి గౌరవం, దేశ ప్రతిష్ఠ అంటూ అతిశయాలకు పోతే ప్రయోజనం ఉండదు. -వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రేటజిక్ డిఫెన్స్ అండ్రిసెర్చ్’ వ్యవస్థాపక డైరెక్టర్ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-హ్యాపీమాన్ జాకబ్ -
చమురు కొనుగోళ్లకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాం
న్యూఢిల్లీ: రష్యన్ చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్ తన ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు మరిన్ని కొత్త మార్గాలను అన్వేíషింంచనుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైస్వాల్ గురువారం ప్రకటించారు. రష్యాలో ప్రభుత్వరంగ అతిపెద్ద చమురు సంస్థ రోస్నెఫ్ట్తోపాటు అక్కడి అతిపెద్ద ప్రైవేట్ చమురు సంస్థ లక్ఆయిల్లపై ఆంక్షల కొరడా ఝలిపించామని దక్షిణకొరియాలో ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే భారత్ స్పందించడం గమనార్హం. అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ ఈ సంస్థల నుంచి తక్కువ ధరకు చమురుకొనే బదులు ఇదే రేట్లకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయగల అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది. రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకుంటూ అమెరికా పెట్రోలియం ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోబోందన్న వార్తల నడుమ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ స్పందించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ ఇంకా చర్చలు జరుపుతోందని గుర్తుచేశారు. అయితే గత నెలలతో పోలిస్తే తాజాగా రష్యన్ సంస్థల నుంచి భారత చమురు కొనుగోళ్లు తగ్గినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఛాబహార్ పోర్ట్ విషయంలో ఊరట ఇరాన్లోని కీలక ఛాబహార్ ఓడరేవు నుంచి అంతర్జాతీయ నౌకల రాకపోకలపై అమెరికా విధించిన ఆంక్షలను భారత్ కోసం కొద్దికాలం పక్కనబెట్టింది. ఆరు నెలలపాటు ఆంక్షల నుంచి భారత్ను మినహాయింపునిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మినహాయింపు అక్టోబర్ 29వ తేదీ నుంచి మొదలవుతుందని జైస్వాల్ చెప్పారు. అంతర్జాతీయంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటంతో తనకు ప్రతికూలంగా మారొద్దనే అక్కసుతో అమెరికా ఈ ఓడరేవుపై సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ఆంక్షలు విధించడం తెల్సిందే. అయితే భారత అభ్యర్థనతో ఆ ఆంక్షల అమలును నెలరోజులు వాయిదా వేశారు. తాజా చర్చలతో దానిని మరో ఆరునెలలు పొడిగించారు. ఛాబహర్ పోర్ట్ను అనుసంధానత, సత్సంబంధాలే లక్ష్యంగా భారత్, ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధిచేశాయి.


