భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. మోదీ ఘన స్వాగతం | Russia President Putin Arrived To India | Sakshi
Sakshi News home page

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. మోదీ ఘన స్వాగతం

Dec 4 2025 6:51 PM | Updated on Dec 4 2025 7:10 PM

Russia President Putin Arrived To India

ఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ చేరుకున్నారు.  ఈ మేరకు ఢిల్లీ చేరుకున్న పుతిన్‌కు పాలం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీ ఘన ‍స్వాగతం పలికారు. గురువారం సాయంత్ర పుతిన్‌.. భారత్‌కు చేరుకున్నారు. పుతిన్‌ రెండు రోజుల భారత్‌లో పర్యటనలో పలు ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు. 

కేవలం దౌత్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహపడనుంది. ఈ అధికారిక చర్చలకు ముందు, ప్రధాని మోదీ తన నివాసంలో పుతిన్‌కు ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా పుతిన్ సమావేశం కానున్నారు. 

 

ఈ శిఖరాగ్ర సమావేశం అజెండా విభిన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక సహకారం, పారిశ్రామిక సహకారం, వినూత్న సాంకేతికతల బదిలీ వంటి అంశాలపై  చర్చలు జరగనున్నాయి.  శాంతియుత అంతరిక్ష అన్వేషణ, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ, కార్మిక వలస కార్యక్రమాలలో కొత్త 'ఆశాజనక ప్రాజెక్టులు' కూడా చర్చల జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఉన్నప్పటికీ, ఈ పర్యటన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంచడానికి ఒక వేదికగా ఉపయోగపడనుంది.

2021, డిసెంబర్ 6న భారతదేశాన్ని సందర్శించిన పుతిన్‌.. ఇదే ఆయనకు తొలి పర్యటన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement