breaking news
Narendra Modi
-
‘రాబోయే కాలమంతా భారత్ది.. ఆ దేశ ప్రధానిది.. అటు తర్వాతే ఎవరైనా’
న్యూఢిల్లీ: రాబోయే కాలమంతా భారత్దే అంటున్నారు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్. ఈ 21 శతాబ్దం అనేది కచ్చితంగా భారత్దేనని అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కనీసం నాలుగు నుంచి ఐదు దశాబ్దాల పాటు ప్రపంచాన్ని భారత్ శాసిస్తుందన్నారు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్-2025లో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన టోనీ అబాట్.. మాట్లాడుతూ.. భారత్పై, ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. స్వేచ్ఛా ప్రపంచం అనే మాటకు భారత్ను సరైన నిర్వవచనంగా మారుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు నుంచి స్వేచ్ఛా ప్రపంచ నాయకుడు అనే బాధ్యతను భారత ప్రధాని తీసుకోవచ్చని అబోట్ అభిప్రాయపడ్డారు. ఈ 21వ శతాబ్దంలో చైనా ఎలాగైతే ఎదిగిందో అలాగే భారత్ కూడా ఎదుగుతుందన్నారు. కనీసం 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పాటు ప్రపంచాన్ని భారత్ శాసిస్తుందన్నారు. భారత్ సూపర్పవర్గా ఆవిష్కృతం కావడానికి ఎంతో సమయం పట్టదన్నారు. ప్రపంచంలో భారత్ సరికొత్త సూపర్పవర్ కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు బలమైన ప్రత్యర్థిగా, తమకు నమ్మకమైన భాగస్వామిగా భారత్ కీలక పాత్ర పోషించాలన్నారు. చైనాను ఆర్థికంగా, సైనిక పరంగా అధిగమించే క్రమంలో బారత్ మూడు అతిపెద్ద ప్రయోజాలను కల్గి ఉందన్నారు. అది భారతదేశంలో ప్రజాస్వామ్యం, చట్ట పాలన, ఇంగ్లిష్ అనే ఈ మూడు అంశాలు భారత్ వేగంగా ఎదగడానికి, చైనాను దాటిపోవడానికి కీలకం కాబోతున్నాయన్నారు.ఇదీ చదవండి:‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’ -
మేం ఫేక్ ఎమ్మెల్యేలం కాదు.. ఎల్లో మీడియా ఫేక్: విరూపాక్షి
-
తయారీ కేంద్రంగా భారత్, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే లక్ష్యం... కర్నూలు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడి
-
శ్రీశైల మల్లన్న సేవలో ప్రధాని మోదీ
శ్రీశైలం టెంపుల్: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. కర్నూలు నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్తో కలిసి సున్నిపెంట హెలిప్యాడ్కు.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలానికి చేరుకున్నారు. మల్లన్న దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు విచ్చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్లకు ఆలయ ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి విభూతి, తిలకధారణ చేశారు. దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ హరిజవహర్లాల్ పూలమాలలు వేసి స్వాగతం పలకగా.. స్వామి అమ్మవార్ల ఆలయాల ప్రధానార్చకులు వీరన్నస్వామి, వై. విజయకుమార్లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయ ప్రధాన ధ్వజస్తంభానికి ప్రధాని నమస్కరించారు. రత్నగర్భ గణపతి ఆలయం వద్ద గణపతి పూజ నిర్వహించారు. అనంతరం.. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, మహామంగళహారతి, నిర్వహించుకున్నారు. నందీశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ప్రధానికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆ తర్వాత మోదీ మల్లికాగుండం వద్ద స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు. భ్రమరాంబాదేవి ఆలయ ముఖమండపంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీచక్రానికి ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి, షోడశోపచార పూజ ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వచన మండపంలో ప్రధాని మోదీకి వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో చతుర్వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, శేషవ్రస్తాలను చంద్రబాబు, పవన్కళ్యాణ్ అందజేసి సత్కరించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రంలో.. ఇక ఆలయం నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకున్న ప్రధాని మోదీ శివాజీ దర్బార్హాల్ను సందర్శించారు. ఈ కేంద్రం నిర్వాహకులు నాగేశ్వరరావు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర విశేషాలు, జైత్రయాత్రలు, శివాజీ శ్రీశైలానికి వచ్చిన తీరును, ధ్యానం చేయగా అమ్మవారు ప్రత్యక్షమై ఖడ్గాన్ని బహూకరించిన విషయాన్ని ప్రధానికి వివరించారు. శివాజీ దర్బార్హాల్లో త్రీడి ఛాయాచిత్రాల్లో శివాజీ జీవితచర్రిత విశేషాలను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. అనంతరం.. శివాజీ ధ్యానమందిరాన్ని సందర్శించారు. అక్కడి నుంచి అతిథిగృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని రోడ్డుమార్గంలో సున్నిò³ంట చేరుకుని హెలికాప్టర్లో కర్నూలుకు తిరుగు పయనమయ్యారు. -
తయారీ కేంద్రంగా భారత్: ప్రధాని మోదీ
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘21వ శతాబ్దం భారత్ది.. 140 కోట్ల మంది భారతీయులది.. ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ను ఓ తయారీ కేంద్రంగా చూస్తోంది.. భారత దేశ సామర్థ్యాన్ని మొత్తం ప్రపంచం గమనిస్తోంది.. దేశాభివృద్ధికి పునాది పడింది ఆత్మ నిర్భర్ భారత్తోనే.. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాం. ఓకల్ ఫర్ లోకల్ పేరుతో ప్రజలు మన తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రతీ రంగంలో దేశం కొత్త రికార్డులు నెలకొల్పుతోంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద ఎన్డీఏ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వాహనం 16 నెలలుగా వేగంగా కదులుతోందని, డబుల్ ఇంజన్ సర్కారు వేగంగా నడుస్తోందని చెప్పారు. ఢిల్లీ, అమరావతి రెండూ వేగవంతంగా అభివృద్ధి వైపు పయనిస్తున్నాయన్నారు. రోడ్లు, విద్యుత్, రైల్వే, హైవే, వాణిజ్యం, పరిశ్రమలతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించి రూ.13,400 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం పరిశ్రమలకు ఊతమిచ్చి ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తోందని, ఈ ప్రాజెక్టులతో కర్నూలు, పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. 2047కు భారత్కు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లవుతుందని, అప్పటికి భారత్ ‘వికసిత్ భారత్’గా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభలో ప్రధాని ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..ఇంధన రంగంలో విప్లవాత్మక అభివృద్ధిఏదేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం. రూ.3 వేల కోట్ల విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభిస్తున్నాం. దీంతో దేశ ఇంధన సామర్థ్యం పెరగబోతోంది. వేగవంతమైన అభివృద్ధి మధ్య గతాన్ని మరవొద్దు. 11 ఏళ్ల కిందట కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు తలసరి విద్యుత్ వినియోగం (ఏటా) వెయ్యి యూనిట్లలోపు ఉండేది. అప్పుడు దేశం తరుచూ విద్యుత్ కోతలు, సవాళ్లు ఎదుర్కొంది. వేల గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా వేయలేని దుస్థితి. నేడు భారతదేశంలో క్లీన్ ఎనర్జీ నుంచి పూర్తి విద్యుత్ ఉత్పత్తి వరకూ ప్రతి రంగంలో దేశం కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ప్రతి గ్రామంలో విద్యుదీకరణ జరిగింది. తలసరి విద్యుత్ వినియోగం 1,400 యూనిట్లకు పెరిగింది. దేశంలో ఇంధన విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం. శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైపు లైన్ ప్రారంభించాం. దీంతో 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా అవుతోంది. చిత్తూరులో కూడా రోజుకు 20 వేల సిలిండర్లు నింపే సామర్థ్యంతో ఎల్పీజీ ప్రాజెక్టు నిర్మించాం. దీనివల్ల ప్రజలకు సేవలతో పాటు కొత్త ఉద్యోగాలు వస్తాయి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగంగా సాధించే మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. గ్రామాల నుంచి నగరాలు, నగరాల నుండి పోర్టుల వరకూ కనెక్టివిటీ చేశాం. విశాఖలో సబ్బవరం నుంచి షీలానగర్ వరకు కొత్త హైవే నిర్మాణంతో కనెక్టివిటీ మరింత మెరుగు పడుతుంది. కొత్త రైల్వే లైన్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి.కనెక్టివిటీ హబ్గా విశాఖఆంధ్రప్రదేశ్ యువత టెక్నాలజీలో చాలా ముందుంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఈ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాం. రెండు రోజుల కిందట గూగుల్ సంస్థ పెద్ద పెట్టుబడి ప్రకటించింది. గూగుల్ కంపెనీ యాజమాన్యం వారు నాతో మాట్లాడారు. ‘అమెరికా కాకుండా చాలా దేశాల్లో గూగుల్ పెట్టుబడులు ఉన్నాయి కానీ, అన్నింటి కంటే ఎక్కువ పెట్టుబడి ఆంధ్రలో పెడుతున్నామని చెప్పారు. ఈ కొత్త గూగుల్ ఏఐ హబ్లో శక్తివంతమైన ఏఐ సాంకేతిక పరిజ్ఞానం, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఉండబోతున్నాయి. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కొత్త అంతర్జాతీయ గేట్వే తయారవుతోంది. అంతర్జాతీయంగా తూర్పు తీరంలోని విశాఖ నగరం కనెక్టివిటీ హబ్గా, ప్రపంచానికే ఏఐ హబ్గా మారబోతోంది.దేశాభివృద్ధికి ఆంధ్ర.. ఆంధ్ర అభివృద్ధికి ‘సీమ’ కీలకందేశాభివృద్ధికి ఆంధ్ర అభివృద్ధి చాలా అవసరం. అలాగే ఆంధ్ర అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి అంతే ముఖ్యం. కర్నూలులో ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి. రాయలసీమ అభివృద్ధికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయి. ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక వాడల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ విజన్ సాధించడంలో ఆంధ్ర కీలకంగా మారబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికి నష్టాన్ని మిగిల్చాయి. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఆంధ్రప్రదేశ్కు ఉంటే, ఆంధ్ర మాత్రం సొంత అభివృద్ధి కోసం పోరాటం చేసుకునే పరిస్థితి నెలకొంది. ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారుతోంది. నిమ్మలూరులో అడ్వాన్స్ నైట్ విజన్ ఫ్యాక్టరీ ప్రారంభించాం. మన దేశ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర భారత్ సాధించడానికి ముందడుగు పడింది. ఈ ఫ్యాక్టరీ దేశ నైట్ విజన్ పరికరాలు, క్షిపణుల కోసం సెన్సార్లు, డ్రోన్ గార్డు వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచబోతోంది. ఇక్కడ తయారయ్యే పరికరాలు భారత దేశ రక్షణ ఎగుమతులను కొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు దోహదపడతాయి. భారత రక్షణ రంగం శక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్తో ప్రత్యక్షంగా చూశాం.దేశానికి డ్రోన్ హబ్గా కర్నూలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలును డ్రోన్ హబ్గా చేయాలని సంకల్పించడం సంతోషం. తద్వారా వచ్చే సాంకేతికతతో కర్నూలుతో పాటు ఆంధ్రప్రదేశ్లో అనేక కొత్త రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఆపరేషన్ సింధూర్లో మన డ్రోన్లు కూడా అద్భుతాలు సృష్టించాయి. ఆ అద్భుతాలు చూసి ప్రపంచం అబ్బుర పడింది. రాబోయే రోజుల్లో కర్నూలు దేశానికి డ్రోన్ హబ్గా మారుతుంది. మా ప్రభుత్వ లక్ష్యం ‘సిటిజన్ సెంట్రిక్ డెవలప్మెంట్’. ఈ లక్ష్యంతో కొత్త సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేయడం మా లక్ష్యం. దేశంలో రూ.12 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి పన్నులు లేకుండా చేసిన ప్రభుత్వం ఇది. తక్కువ ధరకే మందులు, మెరుగైన చికిత్స, ఆయుష్మాన్ భారత్ కార్డులతో ప్రజల జీవన విధానం సౌకర్యవంతంగా చేస్తూ కొత్త అధ్యాయాన్ని మనం ప్రారంభించాం.ఆత్మగౌరవానికి, గొప్ప సంస్కృతికి ఏపీ నిలయంఅహోబిలం లక్ష్మీ నరసింహస్వామి, మహానందీశ్వరుడు, మంత్రాలయం రాఘవేంద్రుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నా. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథ ఆలయం మొదటిదైతే, రెండోది శ్రీశైలం. సోమనాథుడు కొలువున్న గుజరాత్ భూమిపై జన్మించిన నాకు కాశీ విశ్వనాథుడికి సేవ చేసే అవకాశం లభించింది. ఇప్పుడు శ్రీశైల మల్లికార్జునుడి ఆశీస్సులు కూడా పొందాను. స్వామి దర్శనం తర్వాత ఛత్రపతి శివాజీ కేంద్రాన్ని సందర్శించి నివాళులు అర్పించాను. ఈ వేదికపై నుంచి కూడా మరోసారి శివాజీ మహారాజ్కు నివాళులు అర్పిస్తున్నా. మహా శివభక్తులైన అక్క మహాదేవుళ్లను స్మరించుకుంటున్నా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, హరిసర్వోత్తమరావు లాంటి స్వాతంత్య్ర సమరయోధులకు కూడా నా నివాళులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆత్మ గౌరవానికి, గొప్ప సంస్కృతికి, సైన్స్, పరిశోధనలకు నిలయం. ఇక్కడ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. యువతకు అపారశక్తి ఉంది. ఆంధ్రకు ఇంకా ఏదైనా అవసరం ఉందంటే అది సరైన నాయకత్వం మాత్రమే. ఇప్పుడు శక్తివంతమైన నాయకత్వం ఉంది. దీనికి తోడు ఆం్ర«ధాకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంది.స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించండి⇒ దసరా నవరాత్రుల మొదటి రోజు నుంచి ప్రజలపై జీఎస్టీ భారాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఆంధ్రలో జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. జీఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్లు ఆదా అవుతోందని తెలిసింది. ఈ పొదుపుతో పండుగ సీజన్ ఆనందాన్ని మరింత పెంచబోతోంది. ఓకల్ ఫర్ లోకల్ పేరుతో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని మీ అందరికీ నా అభ్యర్థన. వికసిత్ ఆంధ్రప్రదేశ్తోనే వికసిత్ భారత్ కల నెరవేరుతుంది.⇒ ఈ సభలో ఇద్దరు చిన్న పిల్లలు ఫొటోలను మోదీకి ఇవ్వాలని ప్రయత్నిస్తుండటం చూసిన మోదీ.. వాటిని తన వద్దకు చేర్చాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, బీసీ జనార్దన్రెడ్డి, కందుల దుర్గేశ్, పార్థసారథితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.భారత్ సూపర్ పవర్ మోదీ నాయకత్వంతోనే సాధ్యంసూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్తో భవిష్యత్లో మరిన్ని సంస్కరణలు చూడబోతున్నాం. 21వ శతాబ్ధ్దం మోదీది. దేశానికి మోదీ లాంటి నాయకుడి అవసరం చాలా ఉంది. ఇలాంటి నాయకుడిని నేను చూడలేదు. భారత్ ప్రపంచంలో సూపర్ పవర్గా అవతరించాలంటే మోదీ నాయకత్వంతోనే సాధ్యం. 11 ఏళ్ల కిందట 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్.. ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. 2028కి మూడో స్థానానికి వస్తాం. 2038కి రెండో ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి మోదీ. ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి రూ.15 వేలు ఆదాయం కలిగింది. యుద్ధాలు, టారిఫ్లు ప్రపంచ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమయంలో మోదీ చెప్పిన స్వదేశీ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం. కేంద్రం సహకారంతో అమరావతిని నిలబెట్టాం. పోలవరాన్ని గాడిన పెట్టాం. విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. ఏపీ యంగ్ స్టేట్. ఎక్కువ పెట్టుబడులు సాధిస్తోంది. గూగుల్, మిట్టల్.. బీపీసీఎల్, సెమీ కండక్టర్ యూనిట్, క్వాంటమ్ వ్యాలీతో సత్వర రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. కర్నూలుకు తొందర్లోనే హైకోర్టు బెంచ్ వస్తుంది. అన్ని ఎన్నికల్లో మోదీ గెలవాలి. అదే భారత్ విజయం. – చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రికనీసం మరో 15 ఏళ్లు కూటమి నిలబడాలిప్రధానమంత్రిని కర్మయోగి అని పిలుస్తా. ఏ ఫలితం ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆలోచిస్తూ ధర్మాన్ని పట్టుకుని దేశాన్ని నడిపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం మన అదృష్టం. మోదీ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు. పుట్టే బిడ్డలకు కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు. భారత్ను ప్రపంచ పటంలో నిలబెట్టారు. పన్నులు ఎప్పుడూ పెరగడమే కానీ తగ్గవు. మోదీ వచ్చాక జీఎస్టీ తగ్గించారు. తద్వారా అన్ని వర్గాలకు మేలు జరిగింది. రాష్ట్రంలో కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని నిలబడాలి. సమష్టిగా పని చేయాలి. – పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారుగుజరాత్ను పవర్ ఫుల్ స్టేట్గా మార్చింది నమో. దేశాన్ని సూపర్ పవర్గా మార్చింది నమో. గతంలో ఉగ్ర దాడి జరిగితే ఇతర దేశాల సాయం అడిగే ప్రభుత్వాలు ఉండేవి. కానీ మోదీ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. అమెరికా టాక్స్లు పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికి పోయాయి. కానీ మోదీ గుండె ధైర్యం ఆత్మ నిర్భర్ భారత్. ప్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు.. అని ధైర్యంగా నిలబడ్డారు. పేదరికం లేని దేశం నమో కల. కేంద్రంలో నమో.. రాష్ట్రంలో సీబీఎన్.. ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు. ప్రధాని మోదీ 16 నెలల్లో రాష్ట్రానికి 4 సార్లు వచ్చారు. ఆంధ్ర అంటే అపారమైన ప్రేమ. కోరిన కోర్కెలన్నీ తీరుస్తున్నారు.– నారా లోకేశ్, విద్యాశాఖ మంత్రి -
మోదీ మాటిచ్చారు..!
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడిచమురు కొనుగోలు చేస్తుండడం పట్ల చాలా రోజులుగా అసహనంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ తన మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని స్పష్టంచేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని నిలిపివేసే విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు అవుతుందని అన్నారు. చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని, తద్వారా ఉక్రెయిన్పై దండయాత్ర ఆగిపోతుందని ఉద్ఘాటించారు. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తుండడం తమకు ఎంతమాత్రం సంతోషం కలిగించడం లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి కొనుగోళ్ల వల్ల రష్యాకు ఆర్థికంగా మేలు జరుగుతోందని, అంతిమంగా ఆ సొమ్మంతా ఉక్రెయిన్పై యుద్ధానికే ఖర్చవుతోందని తెలిపారు. ఎవరైనా సరే రష్యాకు ఆర్థికంగా సాయం అందించడం మానుకోవడం మంచిదని హితవు పలికారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న మతిలేని యుద్ధంలో లక్షల మంది బలైపోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రష్యా నుంచి చమురు కొనడం నిలిపివేస్తామంటూ ఈరోజు తన మిత్రుడు మోదీ మాట ఇచ్చారని పేర్కొన్నారు. ఇక చైనా సైతం అదే దారిలో నడుస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలియజేశారు. చైనా ప్రభుత్వం రష్యా నుంచి చమురు దిగుమ తి చేసుకోవడం ఆపేస్తే మంచిదని సూచించారు. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ ప్రశంసించారు. తానంటే మోదీకి ఎంతో ప్రేమ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రేమ అనే పదాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. మోదీ రాజకీయ జీవితానికి ఇబ్బందులు సృష్టించాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘‘భారత్ను చాలా ఏళ్లుగా గమనిస్తున్నా. అదొక నమ్మశక్యంకాని దేశం. ప్రతి సంవత్సరం ఒక కొత్త నాయకుడు అధికారంలోకి వస్తుంటారు. కొందరైతే కొన్ని నెలలపాటే ఉండొచ్చు కూడా. కానీ, నా స్నేహితుడు మోదీ చాలాఏళ్లుగా వరుసగా అధికారంలో కొనసాగుతున్నారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ ఆయన నాకు మాట ఇచ్చారు. నిజంగా నాకు తెలియదు గానీ అదొక బ్రేకింగ్ స్టోరీ కావొచ్చు! మోదీ వెంటనే ఆ పని చేయకపోవచ్చు. నా అంచనా ప్రకారం కొంత సమయం పట్టొచ్చు. కానీ, త్వరలోనే ఆ ప్ర క్రియ పూర్తవుతుంది. ఉక్రెయిన్పై యుద్ధం ముగిసిన తర్వాత రష్యాతో వాణిజ్య సంబంధాలను భారత్ పునరుద్ధరించుకోవచ్చు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. పాక్ను అనబోయి..భారత్లో ఏడాదికొక పాలకుడు అధికారంలోకి వస్తాడంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ పరిస్థితిని ట్రంప్ పొరపాటున భారత్కు అన్వయించి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగతోంది. ట్రంప్ మానసిక ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయని జనం పోస్టులు చేస్తున్నారు. నిజానికి భారత్లో ఏడాదికొక ప్రధానమంత్రి మారిపోయిన సందర్భాలు లేవు. పాకిస్తాన్లోనే అలాంటి పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే.అంతా అబద్ధం‘మోదీ, ట్రంప్ ఫోన్ సంభాషణ జరగలేదు’ రష్యా చమురు విషయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ గురువారం ఖండించింది. బుధవారం మోదీ, ట్రంప్ మధ్య ఫోన్లో ఎలాంటి సంభాషణ జరగలేదని తేల్చిచెప్పింది. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేసింది. దేశ అవసరాలు, ప్రయోజనాల కోణంలోనే రష్యా నుంచి ముడిచమురు కొంటున్నామని, ఇందులో మరో మాటకు తావులేదని ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఇంధన విధాన నిర్ణయాలకు స్థిరమైన ధరలు, నిరంతరాయమైన సరఫరానే పతిప్రాదిక అని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన దిగుమతుల్లో మార్పులుచేర్పులు చేసుకుంటున్నామని ఉద్ఘాటించింది. ఇంధన వనరుల్లో వైవిధ్యం కొనసాగిస్తున్నామని విదేశాంగ శాఖ వివరించింది. ట్రంప్ను చూస్తే మోదీకి భయం: రాహుల్ న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కీలకమైన ప్రభుత్వ నిర్ణయాలను మోదీ అమెరికాకు ఔట్సోర్సింగ్కు ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ పాలనలో విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిందని మండిపడ్డారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ మిత్రుడు మోదీ మాట ఇచ్చారని ట్రంప్ ప్రకటించడంపై రాహుల్ గురువారం తీవ్రంగా స్పందించారు. రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం తరఫున నిర్ణయాలు తీసుకొని, ప్రకటనలు చేసే అధికారాన్ని ట్రంప్కు మోదీ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ వల్ల తరచుగా ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ అభినందన సందేశాలు పంపిస్తున్నారని ప్రధానమంత్రిపై ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. భారత ఆర్థిక శాఖ మంత్రి అమెరికా పర్యటనను ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించే విషయంలో ఈజిప్టులోని షెర్మ్ ఎల్–õÙక్లో జరిగిన భేటీకి ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందంటూ డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ ఎందుకు ఖండించడం లేదని రాహుల్ గాంధీ నిలదీశారు. -
‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’
న్యూఢిల్లీ: భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసినట్లు, ఇక రష్యా చమురు కొనుగోలు చేయమని ట్రంప్కు మోదీ హామీ ఇచ్చినట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని భారత కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయంలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ రూమర్లేనని, అందులో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. ‘నిన్న అసలు మోదీ-ట్రంప్ల మధ్య ఎటువంటి సంభాషణ జరగేలేదు. మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడలేదు. రష్యా చమురు నిలిపివేస్తామని ట్రంప్కు మోదీ హామీనూ ఇవ్వలేదు. వారి మధ్య ఎటువంటి టెలిఫోన్ సంభాషణ జరగనేలేదు. ఇదంతా అవాస్తవం’ అని విదేశాంగ మంత్రత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఇదీ విషయం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ.. @రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పా’. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తున్న సమయంలో భారత ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.ఇదీ చదవండి: మోదీ గొప్పోడే.. : ట్రంప్ చిత్రమైన వ్యాఖ్యలు -
కర్నూలులో రూ.2,880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్ మిషన్ కు శంకుస్థాపన
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై మోడీకి YSRCP నేతలు విజ్ఞప్తి
-
కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన..
-
ప్రైవేటీకరణ ఆపించండి.. ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, కర్నూలు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఆపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ని ఎయిర్పోర్టు వద్ద పలువురు నేతలు కలిశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ప్రధానిని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. అలాగే.. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలించాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రధాని మోదీని కలిసిన వాళ్ళలో ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్.. తదితరులు ఉన్నారు. -
ట్రంప్ ప్రకటన.. రాహుల్ విమర్శలు.. స్పందించిన కేంద్రం
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తోందని, ఇందుకుగానూ భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రంప్ను చూసి మోదీ భయపడ్డారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంధన దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ నోట్ రూపేణా స్పందించింది. అస్థిర పరిస్థితుల నడుమ.. వినియోగదారుల ప్రయోజనాలకే తమ ప్రాధాన్యం ఉంటుందని అందులో కేంద్రం స్పష్టం చేసింది(India Reacts On Trump Russia Oil Comments).మీడియా ప్రశ్నలకు బదులుగా.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తాజా పరిణామాలపై ఒక నోట్ విడుదల చేశారు. చమురు సంబంధిత దిగుమతులు భారత్కు ఎంతో కీలకం. మార్కెట్ అస్థిరతల మధ్య ఇక్కడి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం మా ప్రధాన ధ్యేయం. అందుకే దిగుమతుల విధానాలు ఆ దిశగా రూపొందించబడ్డాయి.... స్థిరమైన ఇంధన ధరలు, భద్రతతో కూడిన సరఫరా.. ఇవే మా ద్వంద్వ లక్ష్యాలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఇంధన వనరుల విస్తరణ, వివిధ దేశాల నుంచి సరఫరా పొందడం జరుగుతోంది అని అందులో పేర్కొన్నారాయన. అలాగే..Our response to media queries on comments on India’s energy sourcing⬇️🔗 https://t.co/BTFl2HQUab pic.twitter.com/r76rjJuC7A— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2025అమెరికాతో సంబంధం గురించి మాట్లాడుతూ.. గత దశాబ్దంగా ఇంధన సహకారం పెరుగుతోంది. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం భారత్తో సహకారం మరింతగా అభివృద్ధి చేయాలనే ఆసక్తి చూపుతోంది. చర్చలు కొనసాగుతున్నాయి అని జైస్వాల్ అందులో తెలిపారు. తద్వారా.. అంతర్జాతీయ ఒత్తిడులకు కాకుండా దేశ ప్రయోజనాల ఆధారంగా భారత్ ముందుకు వెళ్తుందని మరోసారి భారత్ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం(Ukraine Crisis) ముగింపు దిశగా కీలక అడుగు పడిందని, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయబోతోందని, మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనపై రాహుల్ గాంధీ భగ్గుమన్నారు. ట్రంప్ నుంచి సానుకూల స్పందన లేకపోయినా తరచూ అభినందన సందేశాలు ఎందుకంటూ మోదీని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ తరుణంలో కౌంటర్గా కేంద్రం నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.ఇదీ చదవండి: మోదీ నన్ను ప్రేమిస్తారు.. అంటే మరోలా కాదు! -
మోదీ గొప్పోడే.. : ట్రంప్ చిత్రమైన వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు గుప్పించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తామని మోదీ తనకు మాట ఇచ్చారని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ గొప్ప వ్యక్తి అంటూనే ట్రంప్ విచిత్రమైన వ్యాఖ్య ఒకటి చేశారు. మోదీ ఓ గొప్ప వ్యక్తి. భారత్ను ఎంతో కాలంగా నేను చూస్తున్నా. అది ఎంతో అద్భుతమైన దేశం. అలాంటి దేశానికి నా స్నేహితుడు అధినేతగా దీర్ఘకాలికంగా కొనసాగుతున్నారు. ఆయన ట్రంప్ను ఎంతో ప్రేమిస్తారు. ఇక్కడ ప్రేమంటే తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు అంటూ నవ్వుతూ అన్నారాయన. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని.. ఈ చర్యతో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్ అర్ధిక సహకారం అందిస్తోందని ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించారాయన. అయితే తాజాగా వైట్హౌజ్లో ఆయన మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ ఇక మీదట చమురు కొనదని మోదీ హామీ ఇచ్చారని ప్రకటించారు. ఇప్పటికప్పుడే కాకపోయినా.. త్వరలోనే ఈ నిర్ణయం అమలు చేస్తామని మోదీ తనతో చెప్పారని ట్రంప్ అన్నారు. అలాగే.. భారత్ నిర్ణయం ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు కీలక ముందడుగు అని అభివర్ణించారాయన. అలాగే తన తదుపరి లక్ష్యం చైనానే అని ప్రకటించారాయన. -
సుగాలి ప్రీతి తల్లి హౌజ్ అరెస్ట్
కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది. చంద్రబాబు, పవన్, అనితల వల్ల కాకపోవడంతో.. ప్రధాని మోదీ దృష్టికి ఈ కేసును తీసుకెళ్లాలని తల్లి పార్వతి, తండ్రి రాజునాయక్ ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకు పోలీసులు అడ్డుపడుతున్నారు. ప్రధాని కర్నూలు పర్యటన వేళ.. పోలీసులు ఆమెను హౌజ్ అరెస్ట్ చేశారు. మోదీని కలిసి తమకు న్యాయం చేయమని కోరాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె బుధవారం కర్నూలు కలక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టారు కూడా. అయితే మోదీ పర్యటన, సభకు సుగాలి ప్రీతి కుటుంబం అటంకం కలిగించవచ్చనే ఉద్దేశంతో.. భద్రతా కారణాలను చూపిస్తూ హౌజ్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఆమెతో పాటు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులందరినీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: పవన్.. ఏ ముఖం పెట్టుకుని కర్నూలు వస్తున్నావ్? -
కర్నూలు చేరుకున్న మోదీ
సాక్షి, కర్నూలు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi Kurnool tour) కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులోని నన్నూరు టోల్గేట్ సమీపంలో ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుంది. సభ వేదిక కోసం 450 ఎకరాల్లో ప్రాంగణం సిద్ధం చేశారు. పర్యటన సందర్బంగా ప్రధాని.. కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పర్యటన ఇలా.. 7.50 AM: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం10.20 AM: కర్నూలు ఎయిర్పోర్ట్10.25 AM: సున్నిపెంటకు హెలికాఫ్టర్11.10 AM: శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరిక11.45 AM: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం12.45 PM: భ్రమరాంబ గెస్ట్ హౌస్ తిరిగి చేరిక1.25 PM: సున్నిపెంటకు రోడ్డు మార్గంలో బయల్దేరి1.40 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక2.30 PM: రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు4.00 PM: బహిరంగ సభ4.15 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక4.40 PM: కర్నూలు ఎయిర్పోర్ట్కి బయల్దేరి7.15 PM: ఢిల్లీకి చేరి పర్యటన ముగింపుకర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులు..రూ.2,880 కోట్లతో కర్నూలు-3 పూలింగ్ స్టేషన్ను అనుసంధానించేలా ఏర్పాటుచేసిన ట్రాన్స్మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు ప్రధాని శంకుస్థాపన.రెండు కారిడార్లలో సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తాయన్న కేంద్రం.రెండు కారిడార్ల ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని ప్రకటించిన కేంద్రం.రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్లు ఆస్కారం కల్పిస్తాయన్న కేంద్రం.రూ.960 కోట్లతో సబ్బవరం-షీలానగర్ రహదారికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని.రూ.1,140 కోట్లతో పీలేరు-కాలురు నాలుగు వరుసల రహదారి విస్తరణకు శంకుస్థాపన.గుడివాడ-నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ. -
మోదీ నాకు మాటిచ్చారు.. పుతిన్ ఆటకు చెక్: ట్రంప్
వాషింగ్టన్: భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో రష్యా నుంచి భారత్(India) చమురు కొనుగోలుచేయదని ప్రధాని మోదీ(PM Modi) తనకు కీలక హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ.. రష్యా(Oil Buy From Russia) నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ ధ్రువీకరించలేదు.మరోవైపు.. రష్యా, చైనా అంశంపై కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ సందర్బంగా చైనా సైతం రష్యా ఆయిల్ను కొనకుండా చేస్తానని ఇక ఇదే మిగిలి ఉందన్నారు. భారత్, చైనా.. అమెరికాతో కలిసి వస్తే పుతిన్ చేస్తున్న యుద్ధానికి చెక్ పెట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఇంధన విధానంపై భారత్, అమెరికాల మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ యూఎస్కు భారత్ సన్నిహిత భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తనకు స్నేహితుడని చెప్పుకొచ్చారు. #WATCH | "Yeah, sure. He's (PM Narendra Modi) a friend of mine. We have a great relationship...I was not happy that India was buying oil. And he assured me today that they will not be buying oil from Russia. That's a big stop. Now we've got to get China to do the same thing..."… pic.twitter.com/xNehCBGomR— ANI (@ANI) October 15, 2025 -
పోస్టుకార్డులతో గిన్నిస్ బుక్ రికార్డు
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గుజరాత్ సహకార రంగానికి సంంధించిన ప్రజలు ఏకంగా 1.11 కోట్లకుపైగా లేఖలు రాశారు. పోస్టుకార్డులు పంపించారు. ఒకేసారి ఒకే వ్యక్తికి భారీసంఖ్యలో పోస్టుకార్డులు రాయడం గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులోకి చేరిందని అధికారులు బుధవారం చెప్పారు. జీఎస్టీ సంస్కరణతోపాటు ఇతర చర్యలు చేపట్టినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,11,75,000 పోస్టుకార్డులు పంపించడం గమనార్హం. ఈ అరుదైన ఘట్టాన్ని గిన్నిస్బుక్ ప్రపంచ రికార్డు ప్రతినిధులు గుర్తించారు. ఆయా పోస్టుకార్డులను లెక్కించారు. ప్రపంచ రికార్డు సృష్టించినట్లుగా సంబంధిత ధ్రువపత్రాన్ని మంగళవారం అధికారులకు అందజేశారు. ఇప్పటిదాకా 6,666 పోస్టుకార్డులే అతిపెద్ద రికార్డు. గతంలో స్విట్లర్లాండ్లో ఈ ఘనత సాధించారు. ఈ రికార్డును గుజరాత్ ప్రజలు తిరగరాశారు. -
నేడు కర్నూలుకు వస్తున్నా: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: గురువారం(నేడు) ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. ‘ఈనెల 16న నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తా. ఆ తర్వాత కర్నూలులో విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలు, తదితర రంగాలకు సంబంధించిన రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు నిర్వహించే శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాల్లో పాల్గొంటాను’ అని ప్రధాని తెలిపారు. -
సార్ను కాదు.. మీ సోదరుడిని
న్యూఢిల్లీ: మహిళా శక్తే దేశానికి బలం, రక్షణ కవచం, స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తనను సార్ అని పిలవొద్దని, సోదరుడిగా సంబోధించాలని బిహార్కు చెందిన బీజేపీ బూత్ స్థాయి మహిళా కార్యకర్తకు సూచించారు. బిహార్లో నవంబర్ 14న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయని, అదేరోజు ప్రజలు మరో దీపావళి నిర్వహించుకోబోతున్నారని స్పష్టంచేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. తమ కూటమి విజయంలో మహిళలే కీలకపాత్ర పోషించబోతున్నారని తెలిపారు. బిహార్ బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ బుధవారం వర్చువల్గా సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి నమో యాప్ ద్వారా వారితో సంభాషించారు. ప్రజాస్వామ్య వేడుకలో మహిళలంతా ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ గుంపులుగా వెళ్లి ఓటు వేయాలని, పాటలు పాడుతూ, థాలీలు(గిన్నెలు) మోగిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. బిహార్ ప్రజలకు ఈసారి డబుల్ దీపావళి వస్తోందని వ్యాఖ్యానించారు. సోదరీమణులు, ఆడబిడ్డల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని స్పష్టంచేశారు. నా తరఫున గ్యారంటీ ఇవ్వండి భాయి దూజ్ పండుగ సందర్భంగా ఈ నెల 23న సోదరీమణుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. లఖ్పతీ దీదీలను, డ్రోన్ దీదీలను గౌరవించుకోవాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియజేయాలని, వారికి అవగాహన కల్పించాలని కోరారు. ‘ఏక్జుట్ ఎన్డీఏ, ఏక్జుట్ బిహార్(ఐక్య ఎన్డీఏ, ఐక్య బిహార్)–ఇసే బనేగీ సుశాసన్ కీ సర్కార్’ అనే నినాదాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చారు. మరోసారి సుపరిపాలన అందిస్తామన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ఎన్నికల్లో కచ్చితంగా విజయం లభిస్తుందన్నారు. ప్రతి బూత్ స్థాయి కార్యకర్త ఒక మోదీయేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి తన తరఫున ప్రజలకు గ్యారంటీ ఇవ్వాలని సూచించారు. పథకాలకు సంబంధించిన వీడియోలను అందరికీ చూపించాలన్నారు. బిహార్లో గతంలో జంగిల్రాజ్ రాజ్యమేలిందని, అప్పటి పరిస్థితుల గురించి నేటి యువతకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్జేడీ పాలనపై విరుచుకుపడ్డారు. బిహార్లో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మళ్లీ నక్సలైట్ల చేతికి అప్పగించవద్దని ప్రజలను కోరారు. ఆర్జేడీ, కాంగ్రెస్ల నుంచి బిహార్ను రక్షించుకొనే బాధ్యత ప్రజలపైనే ఉందని మోదీ ఉద్ఘాటించారు. బిహార్లో నవంబర్ 6, 11న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
పిచ్చి పరాకాష్టకు అంటే ఇదే.. ప్రధాని మోదీ సభకు కమర్షియల్ టార్గెట్స్
-
‘మోదీకి మా బాధ తెలియాలి..’ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల ఆందోళన
సాక్షి, కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో వేళ.. న్యాయం కోరుతూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో, ఫ్లకార్డుతో నిరసన చేపట్టారు. మోదీకి తమ కుటుంబం పడుతున్న బాధేంటో తెలియజేసుకునే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వాళ్లు కోరుతున్నారు.సుగాలి ప్రీతిపై అఘత్యానికి పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించాలి(Sugali Preethi Case News). అసలు లోకేష్ రెడ్ బుక్లో వాళ్ల పేర్లు లేవా?. మా కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలి అంటూ ఫ్లకార్డలతో నినాదాలు చేశారు. మరోవైపు.. తమకు న్యాయం చేయాలని, తమ గోడను ప్రధాని మోదీకి వినిపించే అవకాశాన్ని కల్పించాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి వేడుకుంటున్నారు. 2017లో కర్నూలులోని ఓ స్కూల్లో అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతిబాయి మృతి చెందింది. అయితే.. స్కూల్ యజమాన్యమే అత్యాచారం చేసి, తన బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్ తల్లితండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల బెనిఫిట్స్ ప్రీతి కుటుంబానికి అందాయి. అలాగే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పటికీ.. ఆ అంశం ముందుకు కదల్లేదు. ఈలోపు ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఈ కేసు విపరీతమైన రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. అయితే తాజాగా బాధిత కుటుంబం కూటమి పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆందోళనకు దిగిన నేపథ్యంలో.. ప్రభుత్వం దిగి వచ్చి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఇదిలా ఉంటే.. న్యాయం చేస్తానని నమ్మించి పవన్ నమ్మక ద్రోహం చేశారని పార్వతి ఆరోపిస్తున్నారు(Sugali Preethi Mother Slams Pawan Kalyan). అంతేకాదు.. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. ఎనిమిదేళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాం. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రశ్నించాను అయినా మాకు న్యాయం జరగలేదు. ప్రీతికి న్యాయం జరగకపోతే.. చంద్రబాబు, పవన్, లోకేష్కు మా ఉసురు తగులుతుంది’’ అని వాపోయారామె. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ రేపు(అక్టోబర్ 16న) కర్నూలుకు రానున్నారు(PM Modi AP Kurnool Tour). ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ను మోదీ అప్పాయింట్మెంట్ ఇప్పించాలని పార్వతి విజ్ఞప్తి చేశారు. అయితే.. అవతలి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. ఇదీ చదవండి: న్యాయం గెలిచింది.. కూటమికి గట్టి దెబ్బ -
శ్రీగిరి అభివృద్ధికి ఆమోదీంచేనా!
శ్రీశైలంటెంపుల్: ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వరూపంలో కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగ స్వరూపుడు, శక్తిపీఠం కలగలసి వెలసి ఉన్న ఏకైక క్షేత్రం. అంతటి ప్రాశస్త్యం ఉన్న మహాక్షేత్రం అభివృద్ధికి దూరమవుతోంది. అరకొర సౌకర్యాలతో భక్తులు అవస్థలు పడుతున్నారు. క్షేత్రంలో ఏ చిన్న అభివృద్ధి చేయాలన్న అటవీశాఖ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. రహదారులు, వసతి సౌకర్యాలు భక్తులను వేధిస్తున్నాయి. గురువారం శ్రీశైలానికి భారత ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో క్షేత్ర అభివృద్ధిపై దృష్టి సారించి, శ్రీగిరిలో నెలకొన్న సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే అటు ఆంధ్రా నుంచి అయినా, ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి అయినా రైలు మార్గం లేదు. సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని మార్కాపురం రోడ్డు వరకు మాత్రమే రైలు మార్గం ఉంది. ఇటు తెలంగాణ నుంచి అయితే రైలు మార్గం అసలే లేదు. గతంలో పార్లమెంట్సభ్యులు శ్రీశైలానికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడంతో పరిశీలించాలని అధికారులకు ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో ప్రత్యేక కమిటీ సభ్యులు శ్రీశైలానికి రైలు మార్గానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. శ్రీగిరి చుట్టూ నల్లమల అభయారణ్యం కావడంతో మార్కాపురం రోడ్డు నుంచి దోర్నాల వరకు రైలు మార్గాన్ని విస్తరించవచ్చునని ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం. అయితే ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు శ్రీశైలానికి రైలు మార్గం బడ్జెట్లో ప్రస్తావనకు రావడం లేదు. క్షేత్రానికి రైలు మార్గం ఉంటే సామాన్య భక్తులు సైతం క్షేత్ర యాత్ర చేసుకునే అవకాశం ఉంటంది. ఐకానిక్ బ్రిడ్జికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేనా? శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు సున్నిపెంటగ్రామంలో సుమారు రూ.70 కోట్లతో స్టాఫ్ క్వాటర్స్ నిర్మించారు. సున్నిపెంట నుంచి శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరాన్ని తగ్గించాల నే ఉద్దేశంతో సున్నిపెంట నుంచి కృష్ణానదిపై శ్రీశైలం వరకు ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించారు. అలాగే తెలంగాణ నుంచి శ్రీశైలంకు సమీపంలో దూరాన్ని తగ్గించేలా తెలంగాణ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేసి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఏపీ, తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలి. ఐకానిక్ వంతెనను నిర్మిస్తే భక్తులకు శ్రీశైలం దూరం తగ్గడంతో పాటు ప్రయాణం సాఫీగా సాగుతుంది. భూ బదలాయింపు జరిగేనాగతంలో దేవదాయ, అటవీ, రెవెన్యూ శాఖల మంత్రులు, మూడు శాఖల ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ప్రాథమికంగా శ్రీశైల దేవస్థానానికి 5,302 ఎకరాల భూమి ఉందని నిర్ధారించారు. శ్రీశైల దేవస్థానానికి 1967 నవంబర్లో ఫుడ్ అండ్ అగ్రికల్చరేట్ డిపార్ట్మెంట్ ప్రకారం 5,302 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ మొత్తం భూమి 9 సర్వే నెంబర్లలో ఉంది. 5,302 ఎకరాల్లో 900 ఎకరాలు శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్లో ముంపు అయింది. బ్రిటీష్ కాలం నాటి జీవో, బ్రిటీష్ కాలం నాటి గెజిట్ ఎంట్రీ ద్వారా సర్వే చేయించి క్షేత్ర సరిహద్దులను గుర్తించారు. 4,400 ఎకరాలు శ్రీశైల మల్లన్న కు చెందిన భూమి అని గుర్తించి, అటవీశాఖ అంగీకరించింది. దీంతో ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవదాయశాఖకు భూమిని అప్పగించేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే డిపార్ట్మెంట్కు డీఎఫ్వో లేఖ రాశారు. అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఘాట్రోడ్డు విస్తరించేనాశ్రీశైల క్షేత్రానికి ఏపీ, అటు తెలంగాణ నుంచి చేరుకోవాలంటే సుమారు 100 కి.మీ దూరం ఘాట్రోడ్డులో రోడ్డు ప్రయాణం చేయాలి. ఏపీ వైపు శ్రీశైలం నుంచి ఆత్మకూరు వైపు సుమారు 100 కిలోమీటర్లు ఘాట్రోడ్డు సింగిల్ రోడ్డు మాత్రమే. వర్ష కాలంలో ఇరుకైన ఈ రోడ్డులో తరచూ భారీ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది. ఈ రోడ్డు నేషనల్ హైవే పరిధిలో ఉన్నప్పటికీ విస్తరించడం లేదు. ఆత్మకూరు నుంచి దోర్నాల, దోర్నాల నుంచి శ్రీశైలం నాలుగు లైన్లుగా విస్తరిస్తే క్షేత్రానికి భక్తుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే దోర్నాల–శ్రీశైలం నేషనల్ హైవే 765 పరిధిలో ఉంది. ఎన్హెచ్–765 రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3వేల కోట్లతో చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో అండర్పాస్, ఓవర్ పాస్ బ్రిడ్జిలు నిర్మిస్తే వన్యప్రాణులు, పులుల సంచారానికి ఆటంకం లేకుండా, వన్యప్రాణులు వాహనాల ప్రమాదానికి గురికాకుండా ఉంటుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే లింగాలగట్టు నుంచి శ్రీశైలానికి ఆంధ్రా–తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ సుమారు రూ.300కోట్లతో ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మల్లన్న క్షేత్రానికి ‘ప్రసాదం’ అందేనా..! శ్రీశైల క్షేత్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం రూ.43 కోట్లతో అభివృద్ధి చేసింది. శ్రీశైలక్షేత్రానికి రోజు రోజుకు పెరుగుతున్న భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం శ్రీశైలంలో కల్పించాల్సిన సౌకర్యాలపై 2017 లో అప్పటి ఈవో భరత్గుప్తా కేంద్ర పర్యటక శాఖ అధికారులకు వివరించి, డీపీఆర్ను సమర్పించారు. దీంతో కేంద్ర పర్యాటక శాఖ (పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) ప్రసాద్ పథకం కింద శ్రీశైల క్షేత్రంలో భక్తులకు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాల కోసం రూ.43 కోట్లు నిధులు మంజూరు చేసింది. మూడు విడతలుగా నిధులు మంజూరయ్యాయి. 2017లో శ్రీశైలంలో ప్రసాద్ పథకం ద్వారా పనులు ప్రారంభించారు. కేంద్రం మంజూరు చేసిన పనులను రాష్ట్ర పర్యాటక శాఖ, శ్రీశైల దేవస్థాన ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టారు. 2022 డిసెంబరు 26న రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆయా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మల్లన్న దర్శనానికి వస్తున్న మోదీ.. శ్రీగిరి అభివృద్ధికి వరాలు కురిపించాలని భక్తులు కోరుతున్నారు. -
మీ అభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి
న్యూఢిల్లీ: మంగోలియా దేశాభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నాలుగురోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నా(Khurelsukh Ukhnaa) ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఉఖ్నా భారత్కు రావడం ఇదే తొలిసారి. ఇరువురి ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, మంగోలియా బంధం కేవలం ద్వైపాక్షికం కాదు. అంతకుమించిన గాఢమైన, ఆత్మీయ, ఆధ్యాత్మిక బంధం. మన ఇరుదేశాల భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజల సత్సంబంధాల్లో ప్రతిబింబిస్తోంది.భారత్ అందించిన 1.7 బిలియన్ డాలర్ల ఆర్థికసాయంతో మంగోలియాలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం ప్రాజెక్ట్ ఆ దేశ ఇంధన రక్షణకు మరింత భద్రత చేకూరుస్తుంది. విదేశాల్లో భారత్ చేపట్టిన అతిపెద్ద అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్ట్ ఇదే. ఇందులో మంగోలియా సిబ్బందితోపాటు 2,500 మందికిపైగా భారతీయ నిపుణులు పనిచేస్తూ ఈ ప్రాజెక్ట్ను సుసాధ్యం చేస్తున్నారు. ఇది మాత్రమేకాకుండా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇండో–పసిఫిక్లో స్వేచ్ఛా, సులభతర, సమగ్రత వాణిజ్యానికి ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. గ్లోబల్ సౌత్ వాణిని గట్టిగా ఇరుదేశాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మంగోలియా పౌరులకు భారత్ ఉచితంగా ఈ–వీసాలను అందించనుంది’’ అని మోదీ చెప్పారు. పలు రంగాల్లో పరస్పర సహకారంఈ సందర్భంగా ఉఖ్నా భారత్ను పొగిడారు. ‘‘స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ అద్భుతంగా నాయకత్వ పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ సౌరకూటమిలోనూ భారత్ తనదైన కీలక భూమిక పోషిస్తోంది’’ అని శ్లాఘించారు. తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘బౌద్ధమతం విషయంలో ఇరుదేశాలు తోబుట్టువులే. గౌతమ బుద్దుడి ముఖ్య శిష్యులైన సరిపుత్ర, మౌద్గల్యయానల పవిత్ర అవశేషాలు వచ్చే ఏడాది మంగోలియాకు భారత్ అప్పగించనుంది. గందన్ బౌద్ధారామానికి భారత్ త్వరలో ఒక సాంస్కృతిక ఉపాధ్యాయుడిని పంపనుంది. ఆయన అక్కడి బౌద్ధ ప్రాచీన ప్రతులను అధ్యయనం చేయనున్నారు.మంగోలియాలో బౌద్ధమత వ్యాప్తికి నాటి బిహార్లోని పురాతన నలంద విశ్వవిద్యాలయం ఎంతగానో సాయపడింది. ఇప్పుడు అదే రీతిలో గందన్ మఠం, నలంద వర్సిటీల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాం ’’అని మోదీ చెప్పారు. ‘‘లద్దాఖ్ స్వయంప్రతిపత్తి పర్వతప్రాంత అభివృద్ధి మండలి, మంగోలియాలోని అర్ఖాంగాయ్ ప్రావిన్స్ల మధ్య సాంస్కృతిక బంధం బలపడేందుకు మంగళవారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. రక్షణ మొదలు భద్రత, ఇంధనం, గనులు, సమాచార సాంకేతికత, విద్య, ఆరోగ్యం, సంస్కృతిక సహకార రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యం, పరస్పర సహకారం మరింత బలపడింది’’ అని మోదీ అన్నారు. 1955లో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలయ్యాయి. -
మోదీకి ట్రంప్ ప్రశంస.. బిత్తరపోయిన పాక్ పీఎం.. వీడియోలు చూసేయండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బిత్తరపోయారు. భారత ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించిన ట్రంప్.. పాక్తో సంబంధాలపైనా వ్యాఖ్య చేసే సరికి షరీఫ్ నోటి వెంట మాట రాలేదు. అదే సమయంలో షరీఫ్ ప్రసంగించిన టైంలోనూ మరో ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్ గాజా శాంతి సదస్సులో ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈజిఫ్ట్ శర్మ్ ఎల్-షేక్ వేదికగా గాజా శాంతి సదస్సు Gaza Peace Summit 2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, అరబ్ దేశాల నేతలు 20 మంది దాకా పాల్గొన్నారు. ఆ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ గొప్ప దేశం. అక్కడ నా మంచి మిత్రుడు ఉన్నారు. ఆయన అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ కలిసి శాంతియుతంగా జీవించగలవు అని అన్నారు. ఆ వెంటనే.. పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ వైపు చూస్తూ ట్రంప్ ‘అంతే కదా?’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు నోట మాట పడిపోయిందేమో.. షరీఫ్ నవ్వుతూ ఏదో కవర్ చేసుకోబోయారు. అదే సమయంలో.. పక్కనున్న మిగతా దేశాల నేతలు చిన్నగా నవ్వుకున్నారు. మరోవైపు.. Trump: "I think Pakistan and India are gonna live very NICELY together"Turns to Shehbaz Sharif: ‘Right?’Look at Chatukar's big smile. He still thinks this Joker Trump can save him when Bharat goes for the DECISIVE one?Anyway, let both of them happy 'TILL THEN'! pic.twitter.com/qlhS55S3GY— BhikuMhatre (@MumbaichaDon) October 13, 2025 షెహ్బాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ట్రంప్ భజనకే పరిమితం అయ్యారు. ఇండియా, పాకిస్తాన్ రెండూ అణు శక్తులు. ఈ వ్యక్తి (ట్రంప్) మరియు ఆయన బృందం నాలుగు రోజుల పాటు మధ్యవర్తిత్వం చేయకపోయుంటే, యుద్ధం ఎవరికీ చెప్పుకోలేని స్థాయికి చేరిపోయేది అని అన్నారు. ఆయన ఇప్పటికే ఏడు యుద్ధాలు ఆపారని, ఇవాళ ఎనిమిదోది(గాజా సంక్షోభం గురించి) ఆపారని అన్నారు. అలాంటి వ్యక్తిని తాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నా అనడంతో.. వెనకాలే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తల పట్టుకుని.. రకరకాల హవభావాలతో ‘ఇవేం పొగడ్తలు’ అన్నట్లు ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. వెనుకనే నోటిమీద చేయి వేసుకొని చూస్తుండిపోయారామె. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Pakistan's Prime Minister Shehbaz Sharif calls for Donald Trump to receive the Nobel Peace Prize: "Mr. President, I would like to salute you for your exemplary leadership. Visionary leadership." "I think you are the man that this world needed most at this point in time. The… pic.twitter.com/QXVOxszZx7— Mary Margaret Olohan (@MaryMargOlohan) October 13, 2025మరోవైపు.. ట్రంప్ గాజా ప్లాన్ కుదరడంపై భారత ప్రధాని మోదీ.. ట్రంప్కు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో గాజా శాంతి సదస్సుకు భారత ప్రధాని మోదీని ట్రంప్ ఆహ్వానం అందించారు. అయితే మోదీ తరఫున ప్రత్యేక దూతగా విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ను కలిసి.. శాంతి ఒప్పందంపై భారత్ తరఫున సంతకం చేశారాయన. ఈ విషయాన్ని విదేశాంగ ప్రతినిధి రణ్దీర్ జైశ్వాల్ అధికారికంగా ధృవీకరించారు. తన చొరవ వల్లే పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలు చల్లారాయంటూ ట్రంప్ మే 10వ తేదీ నుంచి నిన్న ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రసంగంలోనూ ప్రస్తావించడం తెలిసిందే. -
బందీల విడుదలను స్వాగతిస్తున్నాం: మోదీ
న్యూఢిల్లీ: గాజాలో బందీలుగా ఉన్న మొత్తం 20 మందిని హమాస్ విడుదల చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు నిజాయితీతో సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ‘రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉన్న బందీలందరి విడుదలను స్వాగతిస్తున్నాం. వారి స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి, అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన శాంతి ప్రయత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ బలమైన సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది’అని ప్రధాని మోదీ సోమవారం ఎక్స్లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలకు తాము తోడుగా ఉంటామన్నారు. -
సంబంధాల బలోపేతానికి భారత్–కెనడా రోడ్మ్యాప్ ఖరారు
న్యూఢిల్లీ: వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్, కెనడాలు రోడ్ మ్యాప్ ఖరారు చేసుకున్నాయి. సోమవారం కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్లతో చర్చలు జరిపారు. 2023లో సిక్కు ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యానంతరం రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ఆమె భారత్కు రావడం తెల్సిందే. రెండు దేశాల వ్యూహాత్మక ప్రాముఖ్యతలు, ప్రపంచ ఆర్థిక పరిణామాల ఆధారంగా వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సాధ్యమైనంత త్వరగా మంత్రుల స్థాయి చర్చలు ప్రారంభించాలని జై శంకర్, అనితా ఆనంద్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కెనడా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటు వాదులు సాగిస్తున్న కార్యకలాపాలపై జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పక్షాలు పరస్పర ఆందోళనలు, సున్నితమైన అంశాలపై నిర్మాణాత్మక, సమతుల్య భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘భారత్, కెనడా ప్రధాన మంత్రులు నాలుగు నెలల క్రితం రెండు దేశాల సంబంధాల్లో కొత్త ఊపును తెచ్చేందుకు ప్రాధాన్యతలను నిర్దేశించారు. వాటికి అనుగుణంగా, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటూ పరస్పర గౌరవం ఆధారంగా కొత్త రోడ్మ్యాప్పై ఏకాభిప్రాయానికి చేరుకున్నాం’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా యురేనియం సరఫరాదారులతో భారత అణు ఇంధన సంస్థ అధికారులు జరుపుతున్న చర్చలను ఇద్దరు నేతలు స్వాగతించారు. అంతకు ముందు, అనితా ఆనంద్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధనం, వ్యవసాయం, ప్రజల మధ్య సహకారం పెంచుకునే అంశాలను మంత్రి అనితా ఆనంద్తో చర్చించినట్లు మోదీ ఎక్స్లో తెలిపారు. కెనడా ప్రధాని కార్నీతో చర్చలకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానన్నారు. -
మాటల్లో తెంపరితనం వద్దు!
‘‘వ్యూహాత్మకంగా మన శత్రువులందరినీ మనం తృణీకరించవచ్చు. కానీ, తార్కికంగా మనం వారందరినీ సీరియస్గా తీసుకుని తీరాలి.’’ మావో జెడాంగ్ 1957లో చేసిన ఈ వ్యాఖ్య లోతైనది. ‘‘ప్రభుత్వ సౌజన్యంతో సాగే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ కొనసాగిస్తే, భారత్ ఆపరేషన్ సిందూర్–1 సందర్భంగా చూపిన సంయమనాన్ని ఈసారి ప్రదర్శించకపోవచ్చు, ఈసారి మేం మరో అడుగు ముందుకేసి, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాం. అది ప్రపంచ పటంలో తాము కొనసాగాలో వద్దో పాక్ ఆలోచించుకొనేటట్లు చేస్తుంది’’ అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఇటీవల అన్న మాటలు విన్నవెంటనే మావో వ్యాఖ్య గుర్తుకు వచ్చింది.మొన్న మే నెలలో, స్వల్పకాలికమే అయినా నిర్ణయాత్మకమైన రీతిలో చేసిన పోరాటంలో పాక్ వైమానిక దళం ఎంతటి భారీ నష్టాన్ని చవిచూసిందీ భారత వైమానిక దళ చీఫ్ ఎ.పి.సింగ్ ఒక పత్రికా సమావేశంలో వివరించిన తర్వాత ద్వివేదీ నుంచి ఆ రకమైన ప్రకటన వెలువడింది. భారత్ వైపు చోటుచేసుకున్నట్లు చెబుతున్న నష్టాలను సింగ్ తోసిపుచ్చారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వారిద్దరి కేమీ తీసిపోనన్నట్లుగా మాట్లాడారు. వివాదాస్పద సర్ క్రీక్ ప్రాంతంలో పాక్ ఎటువంటి దుస్సాహసానికి దిగినా, భారత్ ఇచ్చే దీటైన జవాబు పాకిస్తాన్ ‘‘చరిత్రను, భౌగోళిక స్వరూపాన్ని రెండింటినీ’’ మార్చివేస్తుందని తన భుజ్ పర్యటనలో హెచ్చరించారు.తానేం తక్కువ తినలేదు!వీటిపై పాక్ అసాధారణమైన రీతిలో స్పందించింది. భారత దేశంలో ఏ మూలనైనా దాడి చేయగల సామర్థ్యం తమ సొంతమని ప్రకటించింది. ఒకవేళ అణ్వాయుధాలతో పాక్ను నిర్మూలించ దలిస్తే, అది పరస్పరమైనదిగా ఉంటుందని కుండబద్దలు కొట్టింది. అణ్వాయుధ సంపత్తి కలిగిన పాకిస్తాన్ విఫల రాజ్యమనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అది గత 40 ఏళ్ళుగా భారత్పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. చేబదుళ్ళు తెచ్చుకుంటూ రోజులు నెట్టు కొస్తోంది. అయినప్పటికీ, 6,60,000 బలగం కలిగిన పాక్ సైన్యాన్నీ, దాని అణ్వాయుధాలనూ భారత్ తేలిగ్గా తీసుకోవడానికి లేదు.ప్రపంచం పటం నుంచి తుడిచిపెట్టేస్తూంటే పాక్ అణ్వాయుధాలను ప్రయోగించకుండా కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంటుందను కోవడం అవివేకం. అంత తేలికేం కాలేదు!పాక్ విజయ తంత్రాలను 1965లో ఛేదించడంలో భారత్ సఫలమైన మాట నిజమే కానీ, ఆ యుద్ధం ఒక రకంగా డ్రాగా ముగిసింది. రెండు పక్షాలూ ప్రత్యర్థి భూభాగాల నుంచి చెరికొంత ప్రయోజనాలను మూటగట్టుకున్నాయి. ఇక, పాక్తో భారత్ 1947 – 48 యుద్ధాన్ని కొనసాగించి ఉంటే మొత్తం జమ్ము–కశ్మీర్ విముక్త మయ్యేదనే అభిప్రాయం చాలా మందిలో బలంగా ఉంది. దేశ విభజన రక్తపు చారికలు ఆరకముందే, ఒక దేశంగా ఇంకా పూర్తిగా పటిష్ఠం కాకముందే, ఆ యుద్ధం జరిగివుంటే మరింత వినాశకర పర్యవసానాలకు దారితీసి ఉండేది. మనం 1971లో తూర్పున చేసిన యుద్ధం బ్రహ్మాండంగా విజ యవంతమైంది. కానీ, అది మనం ఓటమికి అణువంత అవకాశం కూడా ఇవ్వకూడని యుద్ధమనే సంగతిని మరచిపోకూడదు. ఈ విషయమై పాశ్చాత్యుల కథనం మాత్రం వేరు. పాక్ ఆకాశంలో సత్తా చూపలేక, చతికిలపడి ఉండవచ్చు. కానీ, క్షేత్ర స్థాయిలో మనం గడించిన లాభాలు అంతంతమాత్రమే! పైగా మనం ఛంబ్ (పీఓకే)ను కోల్పోవలసి వచ్చింది.ఇక కార్గిల్ సంగతికొస్తే ఎత్తుగడ రీత్యా అది ఒక పరిమిత యుద్ధం. భారత్, పాక్ రెండూ అపుడు అణ్వాయుధ దేశాలు. భౌగో ళికపరంగా, తీవ్రత పరంగా యుద్ధాన్ని కొంత మేరకే పరిమితం చేయా లనే వ్యూహాన్ని న్యూఢిల్లీ అనుసరించింది. ఈ సందర్భంగా భారత్కు అంతర్జాతీయంగా లభించిన మద్దతు పెద్ద ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అమెరికా నుంచి లభించిన మద్దతు వల్ల కార్గిల్లోని మిగి లిన పర్వత శిఖరాల నుంచి పాక్ సేనలు తోక ముడవవలసి వచ్చింది. 2002లో నిర్వహించిన ‘ఆపరేషన్ పరాక్రమ్’ భారత్–పాక్ సేనల సమీకరణను చూసింది. కానీ, తొమ్మిది నెలల తర్వాత, తుది ఫలితం అనుకూలంగా వస్తుందనే పూచీ లేకపోవడం వల్ల, భారత్ దాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ముంబయ్పై 2008 దాడి నేపథ్యంలోనూ అదే రకమైన పరిణామం చోటుచేసుకుంది.‘ఆపరేషన్ పరాక్రమ్’ ఉపసంహరణ తర్వాత, ఆ సారాంశాన్ని పర్వేజ్ ముషారఫ్ బాగా వివరించారు. ‘‘వారు (భారత్) మాపై దాడికి దిగరని, రెండు సైనిక శక్తులనూ బేరీజు వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. దాడికి దిగే సేన విజయం సాధించేందుకు సైనికపరంగా ఒక నిర్దిష్ట నిష్పత్తి అవసరం. మేం నిర్వహిస్తూ వస్తున్న ఆ నిష్పత్తులు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆత్మరక్షణ చేసు కోవాల్సిన పక్షం తనను తాను కాపాడుకునేందుకు అవసరమైన దానికన్నా ఎక్కువ నిష్పత్తిలోనే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.ఇప్పుడేం మారిందని?పాక్పై భారత్ పదాతి దళాలతో దాడికి దిగితే విజయం ఖాయ మని సూచించేంతగా సంఖ్యలు, మోహరణలు, రక్షణ సామగ్రి పరంగా పరిస్థితిలో తేడా ఏమీ రాలేదు. మనం ఎంత చక్కగా సమా యత్తమై, ప్రేరణతో ఉన్నామో, అవతలి పక్షంవారు కూడా అలాగే ఉన్నారు. పైగా, వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సేనల మోహరింపును ఎదుర్కొనేందుకు గడచిన ఐదేళ్ళుగా భారత్ తన సేనల కదలికలను నిశితంగా మార్చుకోవాల్సి వస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో, పాకిస్తానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, ప్రధాని మోదీ నూతన మార్గదర్శక సూత్రాలను నిర్దేశించారు. పాక్ను శిక్షించేందుకు అణు, సంప్రదాయ ఘర్షణల మధ్య తేడాను మెరుగైన రీతిలో వినియోగించుకోవాల్సి ఉందని ఆ మార్గదర్శక సూత్రాలు డిమాండ్ చేస్తున్నాయి. నాశనమైపోతారు జాగ్రత్తంటూ ప్రత్యర్థులను హెచ్చరించే బదులు, ప్రధాని చెప్పినట్లు నడచుకునేందుకు తగిన వ్యూహాలను పన్నడంపై సైన్యాధికారులు దృష్టి కేంద్రీకరించాలి. మనోజ్ జోషీవ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్’లో విశిష్ట పరిశోధకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ప్రధాని మోదీకి ట్రంప్ ఆహ్వానం!
ఢిల్లీ: ఇజ్రాయెల్, గాజా శాంతి(Gaza Peace) ఒప్పందం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈజిప్టు వేదికగా సోమవారం జరగబోయే గాజా శాంతి ఒప్పందానికి హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీని (PM Narendra Modi)ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald Trump) ఆహ్వానించారు. ఈ మేరకు జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.వివరాల ప్రకారం.. ఈజిప్ట్ (Egypt) వేదికగా రేపు ఇజ్రాయెల్(Israel), గాజా మధ్య శాంతి ఒప్పందం జరుగబోతుంది. ఈ శాంతి ఒప్పందంలో ప్రధాని మోదీ హాజరు కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీకి ఆహ్వానం పంపించారు. మరోవైపు.. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి (Abdel Fattah al-Sisi) సైతం మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. చివరి నిమిషంలో ప్రధాని మోదీకి ఈ ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మోదీ హాజరుపై ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇరు పక్షాల అంగీకారం..ఇదిలా ఉండగా.. ఆకలి చావులతో రెండేళ్లుగా అల్లాడిపోతున్న కల్లోలిత గాజాలో శాంతి సాధనకు అడుగులుపడిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో మొదటి దశను వైరిపక్షాలైన ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేయబోతున్నాయి. రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం పూర్తిగా ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి దశ ఒప్పందం ప్రకారం.. గాజాలో దాడులు వెంటనే ఆపేయాలి. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను అతిత్వరలో హమాస్ మిలిటెంట్లు విడుదల చేయనున్నారు. అందుకు బదులుగా తమ నిర్బంధంలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం విముక్తి కల్పించనుంది. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోనుంది.రెండు కీలకమైన అంశాలపై రాని స్పష్టత..హమాస్ అధీనంలో 20 మంది బందీలు సజీవంగా ఉన్నట్లు అంచనా. భగవంతుడి దయతో వారందరినీ స్వదేశానికి తీసుకొస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హమాస్ సైతం స్పందించింది. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సేనలు వెనక్కి వెళ్లిపోవాలని, గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతించాలని పేర్కొంది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. అందుకు బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను తమకు అప్పగించాలని తేల్చిచెప్పింది. మరోవైపు రెండు కీలకమైన అంశాలపై స్పష్టత రాలేదు. ట్రంప్ ప్లాన్ ప్రకారం హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి. గాజా పరిపాలన బాధ్యతలను నిపుణులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా అథారిటీకి అప్పగించాలి. ఈ రెండింటిపై హమాస్ గానీ, ఇజ్రాయెల్ గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.ఇది కూడా చదవండి: మీరు భయపెడితే బెదిరిపోవాలా?.. ట్రంప్కు చైనా కౌంటర్ -
భారత్తో బంధానికి అత్యధిక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: భారత్తో సంబంధాలకు అమెరికా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని సెర్గియో గోర్ చెప్పారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. భారత్లో అమెరికా రాయబారిగా నిమితుడైన సెర్గియో గోర్ శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా సంతకం చేసిన చిత్రపటాన్ని మోదీకి బహూకరించారు. రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారంపై మోదీ, సెర్గియో చర్చించారు. ఆరు రోజుల పర్యటన నిమిత్తం సెర్గియో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోపాటు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మోదీని కలుసుకున్నారు. సెర్గియోతో మా ట్లాడడం సంతోషంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా రాయబారిగా ఆయన నేతృత్వంలో భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత ప్రధాని నరేంద్ర మో దీ గొప్ప నాయకుడు, మంచి మిత్రుడు అంటూ డొ నాల్డ్ ట్రంప్ తరచుగా ప్రశంసిస్తుంటారని సెర్గియో గోర్ గుర్తుచేశారు. మోదీతో కీలక అంశాలపై చర్చించానని తెలిపారు. వరుస భేటీల అనంతరం ఆయన మీడియా మాట్లాడారు. రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీ, ఖనిజాలు సహా ద్వైపాక్షిక వ్యవహారాలపై అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో భారత్–అమెరికాలు మరింత సన్నిహితంగా మారడం ఖాయమని అన్నారు. ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేయాలన్నదే తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. -
అన్నదాతకు అభయం
న్యూఢిల్లీ: దేశంలో తృణధాన్యాల ఉత్పత్తిని భారీగా పెంచడంతోపాటు దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో సాగును ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారు. రూ.24,000 కోట్లతో అమలు చేసే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన(పీఎం–డీడీకేవై)తోపాటు రూ.11,440 కోట్లతో అమలయ్యే ‘మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ ఇన్ పల్సెస్’ను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే వ్యవసాయం, పశు పోషణ, మత్స్య, ఆహార శుద్ధి రంగాలకు సంబంధించి రూ.5,450 కోట్ల విలువైన ప్రాజెక్టులు సైతం ప్రారంభించారు. రూ.815 కోట్ల విలువైన మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆహారం విషయంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవాలని, ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. గతంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ రంగం వెనుకంజలో ఉందని ఆరోపించారు. వ్యవసాయం, దాని బంధాల రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఏనాడూ ఒక వ్యూహం గానీ, లక్ష్యం గానీ లేవని మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్ల తలుపులు తట్టాలి పీఎం–డీడీకేవైతోపాటు తృణధాన్యాల మిషన్ అమలుకు రూ. 35,000 కోట్లకుపైగా ఖర్చు చేయబోతున్నామని, దీనివల్ల కోట్లాది మంది రైతన్నలకు లబ్ధి చేకూరుతుందని, వారి జీవితాల్లో మార్పులు వస్తాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ రెండు పథకాలను రాబోయే రబీ సీజన్ నుంచి 2030–31 దాకా అమలు చేస్తారు. 2047నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ సాధనలో అన్నదాతలదే కీలక పాత్ర అని తేల్చిచెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామంటే ఆ ఘనత రైతులదేనని ప్రశంసించారు. అదే స్ఫూర్తితో వికసిత్ భారత్ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మార్కెట్ల అవసరాలకు తగ్గట్టుగా ఆహారం ఉత్పత్తి చేయాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్ల తలుపులు తట్టాలని, విదేశాల్లోని డిమాండ్ను తీర్చే పంటలు పండిస్తే మనకు లాభదాయకమని పేర్కొన్నారు. ఆహార దిగుమతులు తగ్గించుకోవడం, ఎగుమతులు పెంచుకోవడం అనే రెండు కీలక లక్ష్యాలు కచ్చితంగా సాధించుకోవాలని వివరించారు. ఇందుకు నేడు ప్రారంభించిన రెండు కొత్త పథకాలు దోహదపడతాయని తెలిపారు. పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలి కేవలం వరి, గోధుమలే కాకుండా పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలని రైతులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ప్రొటీన్ భద్రత కల్పించడానికి తృణధాన్యాల సాగును పెంచాలని చెప్పారు. తృణధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచంలో మన దేశమే తొలిస్థానంలో ఉందన్నారు. అయినప్పటికీ మన అవసరాల కోసం విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘తృణధాన్యాల మిషన్’ కింద తృణధాన్యాల సాగును 2030 నాటికి 35 లక్షల హెక్టార్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏటా 252.38 లక్షల టన్నుల తృణధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయని, 2030–31 నాటికి దీన్ని 350 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. సాగులో సంస్కరణలకు పెద్దపీట ఇక పీఎం–డీడీకేవై కింద 100 జిల్లాలో పంటల సాగు పెంచబోతున్నామని, వేర్వేరు శాఖలకు సంబంధించిన 36 పథకాలను మిళితం చేయబోతున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పంటల ఉత్పత్తిని పెంచడం, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సాగునీరు సదుపాయం, పంటల నిల్వ సామర్థ్యం మెరుగుపర్చడం, రైతులకు రుణాలు ఇవ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల అధోగతి పాలైన వ్యవసాయ రంగాన్ని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గాడిలో పెట్టామని గుర్తుచేశారు. ఈ రంగంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెంచుతున్నామని, విత్తనాల నుంచి మార్కెట్ల దాకా సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. గత 11 ఏళ్లలో వ్యవసాయ బడ్జెట్ను ఆరు రెట్లు పెంచామని తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రెండు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు రూ.2 లక్షల కోట్లు అందజేశామని, ఇది చిన్న మొత్తం కాదని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక పదేళ్లలో రైతన్నల బాగు కోసం ఎరువులపై రూ.13 లక్షల కోట్ల రాయితీ ఇచ్చామన్నారు. తృణధాన్యాలు సాగు చేస్తున్న పలువురు రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా సంభాíÙంచారు. -
ఆ 4 జిల్లాలకు ధన్ధాన్య
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వెనుకబడిన జిల్లాలను ప్రగతి బాట పట్టించేందుకు కేంద్రం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై)(PMDDKY)ను అమల్లోకి తెచ్చింది. ఈ పథకానికి దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేయగా, తెలంగాణలో నాలుగు జిల్లాలకు చోటు దక్కింది. ఉమ్మడి పాలమూరులోని నాగర్కర్నూల్, నారాయణపేట, జోగుళాంబ గద్వాలతో పాటు ఉమ్మడి వరంగల్లోని జనగామను చేర్చడంతో ఆయా జిల్లాల్లోని రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శనివారం ఈ పథకాన్ని ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పథకం అమలు తీరు.. రైతులకు చేకూరనున్న ప్రయోజనాలపై ‘సాక్షి’ కథనం.ఒక్కో జిల్లాకు ఏటా రూ.240 కోట్లు తక్కువ వ్యవసాయ ఉత్పాదకత కలిగిన జిల్లాలను గుర్తించిన కేంద్రం ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి పెంచే లక్ష్యంతో పీఎండీడీకేవైకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వంద జిల్లాలకు ఏటా రూ.24 వేల కోట్లు కేటాయిస్తుంది. ఆరేళ్ల పాటు ఈ నిధులు విడుదలవుతాయి. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల పరిధిలోని 36 పథకాలను సమ్మిళితం చేసి పీఎండీడీకేవైని అమలు చేస్తారు. కేంద్ర పథకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అనుసంధానం.. ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో రైతులకు లబ్ధి చేకూరుతుంది. పర్యవేక్షణకు నోడల్ అధికారులు పీఎండీడీకేవై పర్యవేక్షణకు కేంద్రం పెద్దపీట వేసింది. ఎంపికైన జిల్లాలకు ఐఏఎస్ ఆఫీసర్లను నోడల్ అధికారులుగా నియమించింది. గద్వాల జిల్లాకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమిబసు, నాగర్కర్నూల్కు మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్ను నియమించింది. వీరిద్దరూ తెలంగాణ కేడర్ అధికారులే. నారాయణపేట జిల్లాకు బిహార్ కేడర్ ఐఏఎస్ అధికారి రమణకుమార్, జనగామ జిల్లాకు హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న ఏజీఎంయూటీ కేడర్ అధికారిణి సుష్మా చౌహాన్ నియమితులయ్యారు. జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో సమితులు.. పీఎండీడీకేవై అమలుకు జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో సమితులు ఏర్పాటుకానున్నాయి. జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్యర్యంలో జిల్లా ధన్ ధాన్య కృషి సమితిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర ధన్ ధాన్య కృషి సమితి, జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రి, కార్యదర్శి స్థాయిలో ఏర్పాటైన సమితులు పథకం అమలును పర్యవేక్షిస్తాయి. నేల, నీటి సంరక్షణ, సహజ, సేంద్రియ సాగు విస్తరణతోపాటు మొత్తంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో స్వయం సమృద్ధికి తగిన చర్యలు చేపడతారు. పండ్ల తోటలు, మత్స్య సంపద, తేనె టీగల పెంపకం, పశుపోషణ పెంపుతోపాటు పంట ఉత్పత్తుల మార్కెంటింగ్పై దృష్టి సారిస్తారు. యాక్షన్ ప్లాన్కు కసరత్తు.. మొదటగా జిల్లా స్థాయిలో ఏర్పాటైన సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహిస్తారు. ఏ ప్రాంతంలో ఉత్పాదక లోపాలు (దిగుబడి తక్కువ), వైవిధ్యీకరణ పాటించకపోవడం (ప్రతి ఏటా ఒకే రకమైన పంట వేయడం), నీటి వనరులు, మార్కెట్ పరంగా మౌలిక సదుపాయాలు, శీతల గిడ్డంగుల కొరత, రుణాల పరిస్థితి (సగటు కంటే తక్కువ రుణాలు అందుబాటులో ఉండడం)పై పూర్తిస్థాయిలో పరిశీలిస్తారు. ఇందుకనుగుణంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తారు. ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటి, రెండో వారంలోపు యాక్షన్ ప్లాన్ ఖరారు చేస్తారు. -
ప్రధాని మోదీని కలిసిన చరణ్-ఉపాసన.. కారణం ఏంటంటే?
ప్రధాని నరేంద్ర మోదీని మెగా హీరో రామ్ చరణ్ దంపతులు కలిశారు. ఆయనతో శనివారం భేటీ అయ్యారు. రీసెంట్గా ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. సదరు లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోదీని కలిసినట్లు చరణ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.'మన ప్రధానమంత్రిని కలవడం ఎంతో గౌరవంగా అనిపించింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వెనుకున్న విజన్ని పంచుకోవడం గర్వంగా ఉంది. విలువిద్య మన సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగం. ఏపీఎల్ ద్వారా దీన్ని తిరిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయాలన్నది మా ఆశయం. భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది, ఈ వేదిక వాళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడుతుంది' అని చరణ్ చెప్పుకొచ్చాడు.మన దేశంలో క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ తదితర గేమ్స్కి లీగ్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలిసారి ఆర్చరీ(విలువిద్య) లీగ్ పోటీలు నిర్వహించారు. మొత్తంగా ఆరు జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ పోటీ పడ్డాయి.చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'తో వచ్చాడు. కానీ ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' అనే సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యమవుతోంది. వేసవికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
Yojana scheme: రైతుల కోసం రెండు కొత్త పథకాలు
-
డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలోనే టాప్.. ఐఎంసీ-2025 (ఫొటోలు)
-
ట్రంప్, నెతన్యాహుకు మోదీ ఫోన్.. ఎందుకంటే?
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో(Donald Trump) పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి(Benjamin Netanyahu) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఫోన్ చేశారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయంపై ట్రంప్నకు మోదీ అభినందనలు తెలిపారు. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు నెతన్యాహుకు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మోదీ వెల్లడించారు.ఇక, అంతకంటే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కూడా ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. చరిత్రాత్మక గాజా(Gaza Peace) శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి కృషి చేసినందుకు ట్రంప్నకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వాణిజ్య చర్చల గురించి కూడా తాము సంభాషించుకున్నామని మోదీ వెల్లడించారు. రానున్న రోజుల్లో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు పరస్పరం అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాలను ట్విట్టర్ వేదికగా మోదీ చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) ప్రధాని మోదీ (PM Modi) ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన స్నేహితుడు మోదీతో మాట్లాడేందుకు కీలక సమావేశాన్ని కూడా నెతన్యాహు తాత్కాలికంగా ఆపేసుకున్నారు. హమాస్తో ఒప్పందానికి సంబంధించి చర్చించేందుకు ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ భేటీ అయ్యింది. ఇందులో నెతన్యాహుతో సహా పలు కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే భారత ప్రధాని మోదీ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో నెతన్యాహు వెంటనే సమావేశాన్ని తాత్కాలికంగా ఆపి మరీ మోదీతో మాట్లాడారు. బందీల విడుదలకు కుదిరిన ఒప్పందంపై నెతన్యాహును మోదీ అభినందించారని ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం తెలిపింది. -
యూకే ఒప్పందంతో ఎంఎస్ఎంఈలకు బూస్ట్
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంతో (సెటా) చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊతం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు. సెటా దన్నుతో 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యాన్ని సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి సీఈవోల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. రెండు పెద్ద దేశాల ఉమ్మడి పురోగతికి, ప్రజల శ్రేయస్సుకు సెటా తోడ్పడుతుందన్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పగలిగే రంగాలను గుర్తించాలని పరిశ్రమ వర్గాలకు సూచించారు. పాలసీపరంగా స్థిరత్వం, అంచనాలకు అనుగుణమైన నియంత్రణ విధానాలు, భారీ స్థాయి డిమాండ్ లాంటివి భారత్కు సానుకూలాంశాలని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఫార్మా, ఇన్ఫ్రా, ఎనర్జీ, ఫైనాన్స్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలని బ్రిటన్ కంపెనీలను ఆహ్వానించారు.ఇరు దేశాల బంధం బలోపేతం.. ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ సెటాతో భారత్–యూకే మధ్య బంధం మరింత పటిష్టమైందని ప్రధాని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం భారత్–యూకే ద్వైపాక్షిక వాణిజ్యం 56 బిలియన్ డాలర్లుగా ఉంది. నిర్దేశించుకున్న డెడ్లైన్ 2030 నాటికి దీన్ని రెట్టింపు చేసుకోగలమనే నమ్మకం ఉంది‘ అని చెప్పారు. ‘టెలికం, ఏఐ, బయోటెక్, క్వాంటమ్, సెమీకండక్టర్, సైబర్, స్పేస్ తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే కీలక లోహాలు, రేర్ ఎర్త్ మొదలైన విభాగాల్లోనూ నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలి. భారత్–యూకే ఉమ్మడిగా ప్రపంచంలో అగ్రగాములుగా నిల్చేందుకు అవకాశమున్న రంగాలను రెండు దేశాల వ్యాపార దిగ్గజాలు గుర్తించాలి. ఫిన్టెక్, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ లేదా స్టార్టప్లు.. ఇలా ఏ రంగంలోనైనా సరే ఇరు దేశాలు కలిసి అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పాలి‘ అని మోదీ పేర్కొన్నారు. యూకేకి చెందిన తొమ్మిది యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్లు ప్రారంభిస్తాయని ఆయన తెలిపారు.పరిశ్రమకు పూర్తి సహకారం: స్టార్మర్ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు తీసుకోతగిన చర్యలను సూచించాలని పరిశ్రమ దిగ్గజాలను స్టార్మర్ కోరారు. వాణిజ్య ఒప్పందం ప్రయోజనాలను పొందేందుకు పరిశ్రమకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన చెప్పారు. జూలైలో సెటాపై సంతకాలు జరిగినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య 6 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం, పెట్టుబడులు నమోదయ్యాయని పేర్కొన్నారు.భారత్లో ఇన్వెస్ట్ చేయండి..ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్లో పెట్టుబడులు పెట్టాలని గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను మోదీ ఆహ్వానించారు. తద్వారా భారత్ వృద్ధి గాథలో పాలుపంచుకోవాలని సూచించారు. బ్యాంకింగ్ వ్యవస్థ గతంలో కొందరికే పరిమితమై ఉండేదని, దాన్ని అందరికీ సాధికారత కల్పించే సాధనంగా డిజిటల్ టెక్నాలజీ మార్చిందన్నారు. జేఏఎం (జన్ధన్, ఆధార్, మొబైల్) వ్యూహం ఇందుకు ఉపయోగపడిందని చెప్పారు. ‘సాంకేతికత, ప్రజలు, భూమి.. ఇలా అన్నింటికీ ప్రయోజనం చేకూర్చగలిగే ఫిన్టెక్ ప్రపంచాన్ని సృష్టించాలి. ఇన్నోవేషన్ లక్ష్యమనేది వృద్ధి మాత్రమే కాకూడదు, మేలు చేసేదిగా ఉండాలి. ఫైనాన్స్ అంటే కేవలం అంకెలు కాదు.. మానవాళి పురోగతికి దోహదకారిగా ఉండాలి‘ అని ప్రధాని చెప్పారు. భారత్ విషయంలో ఏఐ అంటే సమ్మిళితత్వానికి సంక్షిప్త రూపమని చెప్పారు. -
భారత్పై ప్రశంస.. అమెరికా అధ్యక్షుడికి కౌంటర్ పడ్డట్లే!
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు గుప్పించారు. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆయన కౌంటర్ ఇచ్చారా? అనే చర్చ మొదలైంది. యూకే ప్రధాని హోదాలో కీర్ స్టార్మర్ తొలిసారిగా భారత్ పర్యటనకు వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు.Namaskar doston నమస్కారం మిత్రులారా.. అంటూ హిందీలో యూకే ప్రధాని స్టార్మర్ తన ప్రసంగం ప్రారంభించారు. 2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఇందుకుగానూ ప్రధాని నాయకత్వాన్ని అభినందిస్తున్నానని అన్నారాయన. అలాగే.. 2047 వికసిత్ భారత్ అనేది అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చడమేనని అన్నారాయన. ఇక్కడ నేను చూసిన ప్రతిదీ మీరు(మోదీని ఉద్దేశించి..) ఆ లక్ష్యాన్ని సాధించగలరన్న నమ్మకాన్ని నాకు కలిగించింది. ఆ ప్రయాణంలో మేము భాగస్వాములుగా ఉండాలనుకుంటున్నాం అని స్టార్మర్ (UK PM) ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. రష్యా ఆయిల్ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత ఎకానమీని డెడ్ అంటూ ట్రంప్ అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలు అందుకు కౌంటర్గా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో యూకే-భారత్ మధ్య ఆర్థిక సహకారం, టెక్నాలజీ, వాణిజ్యం, విద్య రంగాల్లో సహకారం ప్రధానంగా UK–India Free Trade Agreement (FTA)పై చర్చ జరిగింది. ఇదీ చదవండి: భారత్తో యుద్ధం తప్పదు! -
ఉపాధికి వరం ‘మహీంద్రా ఐటీఐ’.. ప్రారంభించిన ప్రధాని మోదీ
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మహీంద్రా ట్రాక్టర్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని వర్చువల్గా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కేంద్రం గ్రామీణ యువతకు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలలో శిక్షణ అందించడం, వారి నూతన అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. మహీంద్రా ట్రాక్టర్స్ వృత్తి విద్య, శిక్షణ విభాగం (డీవీఈటీ).. మహారాష్ట్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంఘం (ఎంఎస్ఎస్డీఎస్) భాగస్వామ్యంతో గడ్చిరోలిలోని ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్సిట్యూట్ (ఐటీఐ) కళాశాలలో ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది.గడ్చిరోలిలో ఏర్పాటు చేసిన ఈ ట్రాక్టర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మహీంద్రా సంస్థ ట్రాక్టర్, తరహా వ్యవసాయ యంత్రాల వినియోగంలో యువతకు నైపుణ్యాన్ని అందిస్తుంది. ఇందుకోసం అత్యుత్తమ నిపుణుల సేవలను వినియోగించుకోనుంది. ఈ కేంద్రం బహుళ కెరీర్ అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఫార్మ్ ఎక్విప్మెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా మీడియాతో మాట్లాడుతూ ‘గడ్చిరోలిలో మహీంద్రా ట్రాక్టర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. మహారాష్ట్ర కేవలం ఒక ప్రముఖ పారిశ్రామిక కేంద్రం మాత్రమే కాదు.. వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం. గ్రామీణ యువత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకోవడం మాకు గర్వకారణం’ అని అన్నారు.1963లో స్థాపితమైన మహీంద్రా ట్రాక్టర్స్ నాలుగు దశాబ్దాలుగా భారతదేశంలో నంబర్ వన్ ట్రాక్టర్ బ్రాండ్గా నిలిచింది. ఇటీవల 50కిపైగా దేశాలలో నాలుగు మిలియన్ ట్రాక్టర్లను విక్రయించి, మరో మైలురాయిని దాటింది. మహీంద్రా ట్రాక్టర్స్ మన్నిక, పనితీరు, విశ్వసనీయతకు పేరొందింది. ఈ ట్రాక్టర్లు వ్యవసాయ పనులకు అత్యుత్తమంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. నాణ్యత, తయారీ ప్రమాణాలలో అత్యుత్తమ ప్రతిభకు డెమింగ్ అవార్డును మహీంద్రా ట్రాక్టర్స్ అందుకుంది. 300కు మించిన ట్రాక్టర్ మోడళ్లతో, స్థిరమైన అమ్మకాలు కలిగి, అంతర్జాతీయంగానూ మహీంద్రా ట్రాక్టర్స్ పేరుగాంచింది. -
‘శాశ్వత శాంతికి మార్గం సుగమం’: ట్రంప్, నెతన్యాహులకు ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గాజా శాంతి ప్రణాళిక ప్రారంభ దశను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. శాశ్వత శాంతిపై ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘ సంఘర్షణల తర్వాత కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ప్రశంసించారు. దీనిలో బందీలను విడుదల చేయడం, మానవతా సహాయాన్ని పెంచడం అనేవి కీలకమైన దశలని ప్రదాని మోదీ పేర్కొన్నారు. ఈ పురోగతిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నాయకత్వాన్ని కూడా ప్రధాని మెచ్చుకున్నారు. We welcome the agreement on the first phase of President Trump's peace plan. This is also a reflection of the strong leadership of PM Netanyahu.We hope the release of hostages and enhanced humanitarian assistance to the people of Gaza will bring respite to them and pave the way…— Narendra Modi (@narendramodi) October 9, 2025అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక మొదటి దశపై ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతిస్తూ, దీనివెనుక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బలమైన నాయకత్వం ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ఎక్స్’లో ఇలా రాశారు ‘అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రణాళిక మొదటి దశపై ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది ప్రధాని నెతన్యాహు బలమైన నాయకత్వానికి ప్రతిబింబం. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయం లాంటివి బాధితులకు ఉపశమనాన్ని కలిగిస్తాయని, శాశ్వత శాంతికి మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.దీనికిమందు ‘ట్రూత్ సోషల్’లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. దీనిని బలమైన, శాశ్వత శాంతి వైపు మొదటి అడుగుగా అభివర్ణించారు. ‘ఇజ్రాయెల్- హమాస్ రెండూ మేము రూపొందించిన శాంతి ప్రణాళిక మొదటి దశపై సంతకం చేశాయని ప్రకటించడానికి చాలా సంతోషపడుతున్నాను. ఈ ఒప్పందం ప్రకారం బందీలు అతి త్వరలో విడుదలవుతారు. ఇజ్రాయెల్ దళాలు సైనిక చర్యలను ఉపసంహరించుకుంటాయి. ఇరువర్గాలు న్యాయబద్ధంగా వ్యవహరిస్తాయి. ఇది అరబ్, ముస్లిం దేశాలు, ఇజ్రాయెల్ ఆ చుట్టుపక్కలగల అన్ని దేశాలు , యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సుదినం. ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదరడానికి మాతో కలిసి పనిచేసిన ఖతార్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. శాంతిదూతలు ధన్యులు’ అని ట్రంప్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్ నిర్వాకాలతో భారీ మూల్యం
నవీ ముంబై: విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపర్చిందని మండిపడ్డారు. ముంబైలో 26/11 దాడులకు పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై సైనిక చర్య చేపట్టకుండా అడ్డుకున్నదెవరో దేశ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ను డిమాండ్ చేశారు. ఈ పార్టీ నిర్వాకాల వల్ల దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ముష్కరులపై సైనిక చర్యకు ఒక దేశం అడ్డుపడినట్లు కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ బుధవారం మహారాష్ట్రలో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ముంబై మెట్రో రైలు నెట్వర్క్లో ఆక్వా లైన్తోపాటు మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రాజధానిగా, గొప్ప మెట్రోనగరంగా ప్రఖ్యాతి గాంచిన ముంబైని ఉగ్రవాదులు ఎప్పటినుంచో టార్గెట్ చేశారని చెప్పారు. 2008లో భీకర దాడులు జరిగాయని అన్నారు. అప్పట్లో పాక్ ఉగ్రవాదుల భరతంపట్టాలని ప్రజలంతా కోరుకున్నారని, మన సైనిక దళాలు సైతం అందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. కానీ, మరో దేశం అడ్డుకోవడంతో సైనిక చర్య ఆగినట్లు కేంద్ర హోంమంత్రే చెప్పారని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యలను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయొద్దంటూ అప్పట్లో అమెరికా కోరుకుందని చిదంబరం పేర్కొన్నారు. పౌరుల భద్రతే ముఖ్యం ఉగ్రవాదంపై పోరాటాన్ని బలహీనపర్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను బలోపేతం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశ భద్రతపై రాజీపడిందని ఆక్షేపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఉగ్రవాద దాడులకు తగిన రీతిలో బదులిస్తున్నామని, ముష్కరుల భూభాగంలోకి చొరబడి మరీ బుద్ధి చెప్తున్నామని వివరించారు. దేశంతోపాటు పౌరుల భద్రత కంటే తమకు ఇంకేదీ ముఖ్యం కాదన్నారు. వికసిత్ భారత్కు ప్రతీక పద్మం ఆకారంలో నిర్మించిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వికసిత్ భారత్కు ఒక ప్రతీక అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రూ.19,650 కోట్లతో 1,160 హెక్టార్లలో ఈ ఎయిర్పోర్ట్ మొదటి దశను నిర్మించారు. దేశంలో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుగా ఇది రికార్డుకెక్కింది. డిసెంబర్లో ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాశ్రయ ప్రారం¿ోత్సవంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ముంబై మెట్రో లైన్–3 తుది దశను ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశమంతటా అభివృద్ధి జాడలు వికసిత్ భారత్కు గతి(వేగం), ప్రగతి(అభివృద్ధి) అత్యంత కీలకమని ప్రధాఉద్ఘాటించారు. గత 11 ఏళ్లుగా మన దేశం వికసిత్ని భారత్ దిశగా ప్రయాణం సాగిస్తోందన్నారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలియజేశారు. వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టామని, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును వేగవంతం చేశామని అన్నారు. జాతీయ రహదారులు, వంతెనలు, సొరంగాలు నిర్మించామని, నగరాలను అనుసంధానించామని వివరించారు. దేశంలో ఎక్కడ చూసినా అభివృద్ధి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో 2014లో 74 ఎయిర్పోర్టులు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 160కి చేరిందని చెప్పారు. ‘ఉడాన్’ పథకంతో గత పదేళ్లలో లక్షలాది మంది తొలిసారిగా విమాన ప్రయాణం చేశారని, కలలు నెరవేర్చుకున్నారని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ మనదేనని స్పష్టం చేశారు. మరికొన్నేళ్లలో మనదేశం విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్(ఎంఆర్ఓ) హబ్గా మారబోతోందని తేల్చిచెప్పారు. ముంబైలో చారిత్రక భవనాలు దెబ్బతినకుండా 33.5 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ మెట్రో మార్గం నిర్మించిన ఇంజనీర్లు, కార్మికులను ప్రధాని అభినందించారు. -
అమిత్ షా మరో మీర్ జాఫర్
కోల్కతా: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. అమిత్ షా చర్యలు ‘యాక్టింగ్ ప్రధానమంత్రి’లాగా ఉన్నాయని మండిపడ్డారు. ఆయనే అసలైన ప్రధానమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మమతా బెనర్జీ బుధవారం కోల్కతాలో మీడియాతో మాట్లాడారు. అమిత్ షా ఏదో ఒకనాడు మరో ‘మీర్ జాఫర్’ అయ్యే ప్రమాదం ఉందన్నారు. అమిత్ షాను అవసరానికి మించి విశ్వసించవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. 18వ శతాబ్దంలో ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లతో చేతులు కలిపి బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకు ద్రోహం చేసిన మీర్ జాఫర్ ఉదంతాన్ని ఆమె ప్రస్తావించారు. సిరాజుద్దౌలాను గద్దెదించిన తర్వాత బ్రిటిష్ వాళ్ల అండతో మీర్ జాఫర్ పాలకుడయ్యాడని గుర్తుచేశారు. అమిత్ షా సైతం అదేతరహాలో నరేంద్ర మోదీకి ద్రోహం చేసి, ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. అమిత్ షా పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకుల ఓట్లను తొలగించడానికి బీజేపీ అధిష్టానం కుట్రలు సాగిస్తోందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ముసుగులో లక్షలాది ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇదంతా అమిత్ షా ఆడుతున్న ఆట అంటూ ధ్వజమెత్తారు. దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. అధికారం శాశ్వతం కాదన్న సంగతి తెలుసుకోవాలని బీజేపీకి హితవు పలికారు. -
కప్పు టీ కన్నా చౌకగా డేటా!
న్యూఢిల్లీ: డిజిటల్ రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఓ కప్పు టీ రేటు కన్నా 1 జీబీ డేటా చౌకగా లభిస్తుండటం దీనికి నిదర్శనమని తెలిపారు. ఒకప్పుడు 2జీ టెలికం సర్వీసుల లభ్యత కూడా కష్టంగా ఉండేదని, ప్రస్తుతం దానికి అనేక రెట్లు మెరుగైన 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ లభిస్తున్నాయని పేర్కొన్నారు. డేటా వినియోగంలో ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోందని తెలిపారు. డిజిటల్ మౌలికసదుపాయాల కల్పనపై ప్రభుత్వానికి గల చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ని ప్రారంభించిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విధానాలు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు మొదలైన అంశాల దన్నుతో భారత్.. పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తోందని ప్రధాని చెప్పారు. సంస్కరణలను మరింత వేగవంతం చేస్తున్నామన్నారు. సెమీకండక్టర్లు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటి తయారీకి భారత్లో అపార అవకాశాలు ఉన్నాయని మోదీ వివరించారు. మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. దీన్ని అందిపుచ్చుకునేందుకు పరిశ్రమలు, ఆవిష్కర్తలు, స్టార్టప్లు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘తయారీ కార్యకలాపాలు మొదలుకుని సెమీకండక్టర్లు, మొబైల్స్, ఎల్రక్టానిక్స్ వరకు అన్నింటా దేశం పురోగమిస్తోంది. వివిధ రంగాల్లో స్టార్టప్ల సందడితో దేశీయంగా పరిస్థితులు చాలా ఆశావహంగా ఉన్నాయి. భారత్లో తయారీ కార్యకలాపాలకు, పెట్టుబడులు పెట్టేందుకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు ఇదే సరైన సమయం’’ అని ఆయన చెప్పారు. రూ. 900 కోట్లతో శాట్కామ్ పర్యవేక్షణ వ్యవస్థ: సింధియా దేశ స్పెక్ట్రం అసెట్స్ను, డేటా వనరులను పరిరక్షించే దిశగా నేషనల్ శాట్కామ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ. 900 కోట్లు కేటాయించిందని టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. టెలికం, బ్రాడ్కాస్టింగ్ కలిపి భారతీయ శాట్కామ్ మార్కెట్ గతేడాది 4.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2033 నాటికి 14.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు చెప్పారు. 6జీ పేటెంట్లకు సంబంధించి 10 శాతం వాటా దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు సింధియా వివరించారు. పేమెంట్ యాప్లతో రూ. 200 కోట్ల మోసాల నివారణ టెలికం శాఖ రూపొందించిన ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ) ప్లాట్ఫాంని ఉపయోగించి అనుమానాస్పద లావాదేవీలని బ్లాక్ చేయడం ద్వారా ఫోన్పే, పేటీఎంలాంటి పేమెంట్ యాప్లు సుమారు రూ. 200 కోట్ల ఆర్థిక మోసాలను నివారించాయి. ఎఫ్ఆర్ఐ డేటా ప్రకారం ఈ రెండు సంస్థలు 10 లక్షలకు పైగా ఖాతాలు, వాలెట్లను ఫ్రీజ్ చేశాయి. ఫోన్పే సహ వ్యవస్థాపకుడు రాహుల్ చారి ఈ విషయాలు తెలిపారు. త్వరలో శాట్కామ్ సర్వీసులు..: మిట్టల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులను ప్రారంభించడంపై యూటెల్శాట్ వన్వెబ్ కసరత్తు చేస్తోందని భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సర్వీసులు మొదలవుతాయని పేర్కొన్నారు. మరోవైపు, సురక్షితమైన విధంగా అత్యంత నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడంపై ఆసక్తిగా ఉన్నట్లు స్టార్లింక్ ఇండియా మార్కెట్ యాక్సెస్ డైరెక్టర్ పరి్నల్ ఊర్ధ్వరేషే తెలిపారు. ఈ విషయంలో టెలికం శాఖతో పాటు విభాగాలన్నీ చక్కటి సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. అటు, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతూ, డిజిటల్ విప్లవంలో భారత్ను అగ్రగామిగా నిలబెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పారు.స్టార్టప్ వ్యవస్థకు దన్ను .. టెలికం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్, డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇన్నోవేషన్స్ స్క్వేర్ మొదలైన వాటితో స్టార్టప్ వ్యవస్థకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని ప్రధాని చెప్పారు. అలాగే 5జీ, 6జీ, అధునాతన ఆప్టికల్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఉపయోగపడే టెస్ట్ బెడ్స్కి నిధులు కూడా సమకూరుస్తోందన్నారు. సైబర్ సెక్యూరిటీకి గణనీయంగా ప్రాధాన్యం ఇస్తున్నామని, సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు కఠినతరమైన చట్టాలు చేశామని ప్రధాని చెప్పారు. మొబైల్, టెలికం, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ వ్యవస్థలవ్యాప్తంగా నెలకొన్న సరఫరా సమస్యలకి తగిన పరిష్కారాలను అందించేందుకు మన ముందు చక్కని అవకాశం ఉందని తెలిపారు. సెమీకండక్టర్ల తయారీలాంటి విభాగాల్లో భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటోందని ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 సెమీకండక్టర్ తయారీ యూనిట్ల పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఎల్రక్టానిక్స్ తయారీ విషయంలో గ్లోబల్ కంపెనీలు భారీ స్థాయిలో విశ్వసనీయంగా, భారీ స్థాయిలో సరఫరా చేయగలిగే భాగస్వాముల కోసం అన్వేíÙస్తున్నాయని .. ఆ అవకాశాలను భారతీయ కంపెనీలు అందిపుచ్చుకోవాలని సూచించారు. చిప్సెట్లు, బ్యాటరీలు, డిస్ప్లేలు, సెన్సార్లను దేశీయంగానే మరింతగా తయారు చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరు రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ ఇరవై ఎనిమిది రెట్లు, ఎగుమతులు 127 రెట్లు పెరిగాయని ప్రధాని చెప్పారు. గత దశాబ్దకాలంలో మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో భారీ స్థాయిలో ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించిందన్నారు. డేటా ప్రకారం ఓ దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీకి అవసరమైన ఉత్పత్తులను 45 భారతీయ సంస్థలు సరఫరా చేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ఒక్క కంపెనీతో దాదాపు 3.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. -
‘అమెరికా’ ఒత్తిళ్లకు తలొగ్గామని మీరే అన్నారు కదా? ప్రధాని మోదీ ధ్వజం
నవీ ముంబై: 2008 ముంబైలో జరిగిన విధ్వంసకర ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై యుద్ధానికి దిగాలనే ఆలోచన ఉన్నప్పటికీ, అమెరికా ఒత్తిడి వల్ల దాన్ని విరమించుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్తాన్పై యుద్ధాన్ని విరమించుకున్నది మీరు కాదా? అంటూ చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు మోదీ. నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి బుదవారం(అక్టోబర్ 8) హాజరైన ప్రధాని మోదీ.. కాంగ్రెస్పై మండిపడ్డారు. ఇక్కడ ఎవరి పేరు ప్రస్తావన తేకుండానే కాంగ్రెస్ తీరును తూర్పారబట్టారు. ‘ 2008లో దేశ వాణిజ్య రాజధాని ముంబైపై ఉగ్రవాదులు భీకర దాడికి దిగితే కాంగ్రెస్ ఏం చేసింది?. వారి బలహీనతను నిరూపించుకుంది. టెర్రరిజం ముందు మోకరిల్లింది’ ఇదే విషయాన్ని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడే చెప్పారు’ అంటూ విమర్శలు గుప్పించారు, ‘26/11 అనేది దేశంపై జరిగిన అత్యంత జుగుప్సాకరమైన ఉగ్రదాడి. ఈ దాడి ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయినా ఆ దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకోలేదు. ఆ సమయంలో హోంమంత్రిగా ఉన్న ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఈ విషయాన్ని చెప్పారు. మన దేశానికి మరొక దేశం యుద్ధం వద్దని హితబోధ చేయడంతో పాక్తో యుద్ధానికి బలగాల్ని పంపలేదంట. ఇది కదా వేరే దేశ ఒత్తిడికి లొంగడమంటే?’ అని మోదీ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఏడాది జూలై నెలలో చిదంబరం మాట్లాడుతూ.. 2008లో అంతటి ఉగ్రదాడి జరిగిన దానికి కారణమైన పాకిస్తాన్తో యుద్ధాన్ని ఎందుకు వద్దనుకున్నారో చెప్పారు. తాను హోంమంత్రిగా ఉన్న ఆ సమయంలో అమెరికా ఒత్తిడి కారణంగానే దేశంలో అంతటి విధ్వంసాన్ని ఉగ్రవాదులు సృష్టించినా పాక్పై యుద్ధాన్ని వద్దనుకున్నామన్నారు ఓ కాంగ్రెస్ నేత. ఇది ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. చిదంబరం చేసిన వ్యాఖ్యలను సమయం వచ్చినప్పుడల్లా బీజేపీ ఎండగడుతూనే ఉంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించదనేది చిదంబరం వ్యాఖ్యలతో నిరూపితమైందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. మూడు నెలల క్రితం చిదంబరం వ్యాఖ్యలను లేవనెత్తుతూ కాంగ్రెస్ వైఖరిపై ధ్వజమెత్తారు. ఇదీ చదవండి:నవీ ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే.. -
నవీ ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మోదీ లాంటి నాయకుడుండటం మన భాగ్యం : తెగ పొగిడేసిన ఆకాశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. డిజిటల్ విప్లవాన్ని నడిపించే నాయకుడిని కలిగి ఉండటం భారతదేశ అదృష్టమంటూ కొనియాడారు.బుధవారం న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2025)కు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ, భారతి గ్రూప్ సునీల్ భారతి మిట్టల్ ఇతర కార్పొరేట్ పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆకాష్ అంబానీ పీఎం మోదీ నాయకత్వాన్ని, దార్శనికతను ప్రశంసించారు, మోదీ లాంటి నాయకుడిని కలిగి ఉండటం ఇండియా అదృష్టమన్నారు, మోదీ విజన్ గత పాతికేళ్లుగా దేశ సాంకేతిక , ఆర్థిక ప్రయాణాన్ని నిర్దేశించిందనీ, భారతదేశ డిజిటల్ విప్లవంలో ఆయన పాత్ర కీలకమైనదని అభివర్ణించారు.#WATCH | Delhi: On PM Modi's 25 years of serving as head of a government, Chairman of Reliance Jio Infocomm Limited, Akash Ambani says, "It has been an absolutely revolutionary mode for India and we are lucky to have a leader like him." pic.twitter.com/R8i5gdwddx— ANI (@ANI) October 8, 2025అలాగే స్టార్టప్లు, విద్యావేత్తలు మరియు పరిశ్రమ నాయకుల సంయుక్త ప్రయత్నాల ద్వారా ప్రపంచ ఆవిష్కరణ కేంద్రంగా మారే దిశగా దేశం పురోగతిని ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రదర్శిస్తుందని అంబానీ అన్నారు. చిప్ తయారీ నుండి ఫ్రాడ్ మేనేజ్ మెంట్ సిస్టం, తదుపరి తరం వైర్లెస్ కనెక్టివిటీ వరకు, తాము పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని గమనించామని పేర్కొన్నారు. ఇది భారతదేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థకుగర్వకారణమైన క్షణం, దేశం ప్రపంచ డిజిటల్ విప్లవంలో ముందంజలో ఉండ బోతోందన్నారు.ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులుసెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ SP కొచ్చర్ మాట్లాడుతూ, ఐఎంసీ భారతదేశం అధునాతన కనెక్టివిటీ, డిజిటల్ ప్రయాణంలో ఒక కొత్త దశ అన్నారు. దేశీయ సాంకేతిక పురోగతి సమర్థుల చేతుల్లో ఉందనీ మెరుగైన కనెక్టివిటీ మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం ,భద్రత, ఆవిష్కరణ, సహకారంపై నిరంతర దృష్టి కారణంగా దేశం చాలా వేగంగా గ్లోబల్ డిజిటల్-ఫస్ట్ ఎకానమీగా అవతరించనుందన్నారు.చదవండి: నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్ చేస్తే -
నవీ ముంబై విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలివే..
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మహారాష్ట్రలోని నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ నూతన ఎయిర్పోర్టును పరిశీలించారు. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) కింద ఈ భారీ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ను నిర్మించారు. ఈ విమానాశ్రయం ఈ ఏడాది డిసెంబర్లో దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలకు అందుబాటులోకి రానుంది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్ఎంఐఏ) మొదటి దశను రూ. 19,650 కోట్ల వ్యయంతో నిర్మించారు. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్ట్ ఇదే. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ)కు అనుసంధానంగా ఇది పనిచేస్తుంది. సీఎస్ఎంఐఏలో ఏర్పడే రద్దీని తగ్గిస్తుంది.ఇప్పుడు బహుళ విమానాశ్రయాలు కలిగిన ప్రపంచ నగరాల్లో ముంబైకి ప్రత్యేక స్థానం దక్కింది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఈ విమానయాన సౌకర్యం పూర్తిగా అందుబాటులోకి వచ్చాక ఏడాదికి తొమ్మిది కోట్ల మంది ప్రయాణికుల సామర్ధ్యాన్ని కలిగివుంటుంది. 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేస్తుంది. విమానాశ్రయ కార్యకలాపాల ప్రారంభ దశలో ఏడాదికి రెండు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించనుంది.నవీ ముంబైలోని కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంతపు సామర్థ్య పరిమితులను అధిగమిస్తుందని, కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అందిస్తుందని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ)పేర్కొంది. కాగా విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) గత సెప్టెంబర్ 30న విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ను మంజూరు చేసింది. టెర్మినల్లో 66 చెక్-ఇన్ పాయింట్లు, 22 స్వీయ-సేవ సామాను డ్రాప్ స్టేషన్లు, 29 ప్రయాణీకుల బోర్డింగ్ వంతెనలు, బస్సు బోర్డింగ్ కోసం 10 గేట్లు తదితర సౌకర్యాలు ఉన్నాయి.ఈ విమానాశ్రయ కార్యకలాపాలు సాంకేతికంగా అధునాతనంగా ఉంటాయి. 5జీ నెట్వర్క్లు, పర్యవేక్షణ కోసం అధునాతన సెన్సార్లు, ఆటోమేటెడ్ లగేజ్ సిస్టమ్లు, మెరుగైన సౌలభ్యం కోసం డీజీ యాత్ర ద్వారా కాంటాక్ట్లెస్ ప్రాసెసింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్గో సౌకర్యం పూర్తి ఆటోమేషన్తో పనిచేస్తుంది. డిజిటల్ కన్సైన్మెంట్ ట్రాకింగ్, డిజిటల్ లావాదేవీలు, మందులు , పాడైపోయే వస్తువుల కోసం ప్రత్యేక నియంత్రిత విభాగాలు అందుబాటులో ఉంటాయి. -
ప్రధాని నరేంద్ర మోదీకి YS జగన్ మోహన్ రెడ్డి అభినందనలు
-
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు(YS Jagan Congratulate PM Modi). పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయన్ని అభినందిస్తూ ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారాయన. పాలనాధిపతిగా విశిష్ట సేవలందిస్తూ.. 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు నరేంద్ర మోదీకి అభినందనలు, దేశ సేవలో ఆయన అంకితభావం, పట్టుదల, నిబద్ధతను ప్రతిబింబించే గొప్ప మైలురాయి ఇది. ఈ సందర్భంగా.. ఆయనకు మరింత శక్తి కలగాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ సందేశం ఉంచారు.Congratulations to Shri @narendramodi ji on entering the 25th year of distinguished service in heading governance. A remarkable milestone reflecting dedication, perseverance, and commitment in service to the Nation. Wishing you continued strength and success.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 8, 2025నరేంద్ర దామోదరదాస్ మోదీ.. 2001 అక్టోబరు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 2014 మే 22 వరకు ఆ పదవిలో కొనసాగారు. అటుపై సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించగా.. మే 26వ తేదీన తొలిసారిగా భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అలా.. 11 ఏళ్లకు పైబడి మూడు పర్యాయాలు వరుసగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ మైలురాయి సందర్భంగా.. భారత ప్రజలకు కృతజ్ఞుడిని అంటూ మంగళవారం మోదీ(Modi On 25 Years Governance) ఓ ప్రకటన విడుదల చేశారు.ఇదీ చదవండి: ఇందిరా గాంధీ రికార్డు బద్ధలు కొట్టిన ప్రధాని మోదీ -
ప్రజల జీవితాల్లో మార్పే లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వాధినేతగా 24 సంవత్సరాలు పూర్తిచేసుకొని మంగళవారం 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 2001 అక్టోబర్ 7న ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 12 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. దేశంలో ఓటమి ఎరుగని ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు సృష్టించారు.ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఎక్స్లో వరుస పోస్టులు పెట్టారు. ఈ గొప్ప దేశానికి సేవ చేసే అవకాశం రావటం తన అదృష్టమని పేర్కొన్నారు. ‘నా తోటి భారతీయులు నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. ప్రభుత్వాధినేతగా నేను 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు స్థిర చిత్తంతో గట్టి ప్రయత్నం చేశాను. ఈ గొప్ప దేశ ప్రగతికి నా వంతు కృషి చేశాను’అని పేర్కొన్నారు.నిరాశ నుంచి గొప్ప స్థాయికి పయనం తాను 2014లో దేశ ప్రధాని పదవి చేపట్టేనాటికి దేశంలో అవినీతి, ప్రజల్లో నిరాశ, నిస్పృహ నెలకొని ఉన్నాయని.. తన 11 ఏళ్ల పదవీ కాలంలో దేశం ఆ పరిస్థితి నుంచి బయటపడి.. ఎంతో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని ప్రధాని తెలిపారు. ‘2014 సార్వత్రిక ఎన్నికల కోసం 2013లో నన్ను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొనే నాటికి యూపీఏ ప్రభుత్వం అవినీతి, కుటిలతత్వం, విధాన వైఫల్యాలకు పర్యాయపదంగా ఉంది. అంతర్జాతీయంగా బలహీన సంబంధాలు కలిగి ఉంది. కానీ, విజు్ఞలైన భారతీయులు మా కూటమికి, మా పారీ్టకి ఎన్నికల్లో అద్భుత మెజారిటీ ఇచ్చారు.గత 11 ఏళ్లలో మనమంతా కలిసి ఎంతో మార్పు తీసుకొచ్చాం. ముఖ్యంగా మన మహిళా శక్తి, యువశక్తి, అన్నదాతలు ఎంతో స్వయంసమృద్ధి సాధించారు. 25 కోట్ల మంది పేదరికం కోరల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ అద్భుత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ పరిగణించబడుతోంది’అని ప్రధాని పేర్కొన్నారు.సవాళ్లే నన్ను బలంగా మార్చాయి ప్రభుత్వాధినేతగా మొదట్లో తాను ఎదుర్కొన్న సవాళ్లే తనను శక్తిమంతంగా మార్చాయని ప్రధాని మోదీ తెలిపారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదట అధికారం చేపట్టేనాటికి భారీ భూకంపం, తీవ్రమైన తుఫాన్, వరుస కరువులతో రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. బలమైన సంకల్పంతో ప్రజలకు సేవ చేసేందుకు, గుజరాత్ను పునరి్నరి్మంచేందుకు ఆ సవాళ్లు నన్ను శక్తిమంతుడిని చేశాయి. నాడు గుజరాత్ను ఇక బాగు చేయలేం అన్నారు. కానీ, అందరం కలిసికట్టుగా కష్టపడి సుపరిపాలనకు గుజరాత్ను పవర్హౌస్గా మార్చాం’అని చెప్పారు.తన తల్లి చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని మోదీ గుర్తుచేసుకున్నారు. ‘సీఎంగా ప్రమాణం చేసే సమయంలో మా అమ్మ నాకు ఒక మాట చెప్పారు. నీ పని ఏమిటో నాకు సరిగా తెలియదు కానీ.. రెండు విషయాలు మాత్రం మర్చిపోవద్దు. ఒకటి.. నువ్వు ఎప్పుడూ పేదల బాగు కోసమే పనిచేయాలి. రెండు.. లంచం తీసుకోవద్దు అని చెప్పారు. నేను కూడా ప్రజలకు అదే చెప్తాను. అవసరంలో ఉన్న చివరి వ్యక్తికి కూడా సేవ చేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలి. -
రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్.. ఎందుకంటే?
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పుతిన్కు 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-రష్యా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ను స్వాగతించడానికి ఎదురు చూస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాలను మోదీకి పుతిన్ వివరించారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కావాలన్న భారత స్థిరమైన వైఖరిని మోదీ గుర్తు చేశారు.పుతిన్ ఈ ఏడాది డిసెంబర్ ఐదారు తేదీలలో భారత్కు వచ్చి.. ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉందని సమాచారం. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా న్యూఢిల్లీపై శిక్షాత్మక సుంకాలను విధించిన దరిమిలా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో పుతిన్, ప్రధాని మోదీల భేటీ కీలకంగా మారనుంది. రష్యా అధ్యక్షుడు ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీని కలుసుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు, భారత్తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు అధినేత పుతిన్ ఇటీవల స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులను భారీగా పెంచుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని రష్యా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గిపోయి, వాణిజ్యంలో సమతూకం ఏర్పడేలా చర్యలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతులు పెంచాలని నిర్ణయించారు. గురువారం(అక్టోబర్ 2) వాల్డాయ్ ప్లీనరీలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించబోతున్నానని, ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నానని వెల్లడించారు.ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సమతూకం కలిగిన, తెలివైన నాయకుడు అని కొనియాడారు. భారతదేశ ప్రయోజనాల కోసం మోదీ నిరంతరం శ్రమిస్తుంటారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందన్నారు. మోదీతో సమావేశమైనప్పుడు తాను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు సహకరించడం మానుకోవాలని అమెరికాను పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. -
Bihar Elections : 40 ఏళ్ల తర్వాత రెండు దశలు.. మరిన్ని ఆసక్తికర సంగతులు
న్యూఢిల్లీ: రాబోయే 38 రోజుల్లో దేశంలోని అందరి దృష్టి బీహార్పైనే ఉండనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సోమవారం ప్రకటించారు. మొదటి దశలో బీహార్లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్లో 40 ఏళ్ల తర్వాత రెండు దశల్లో పోలింగ్ జరగబోతోంది.ఆపరేషన్ సిందూర్, జీఎస్టీ సంస్కరణలు, ఓటు చోరీ లాంటి ప్రతిపక్షాల ఉద్యమాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బీహార్లో ఎన్నికల ఏర్పాట్ల విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బూత్కు 1,200 కు మించి ఓటర్లు ఉండరు. పోలింగ్ బూత్లలో 100 శాతం వెబ్కాస్ట్ చేయనున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయి. ఓటర్లు తన మొబైల్ ఫోన్లను బూత్కు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.పోలింగ్ ఏజెంట్లు బూత్ సెంటర్ నుండి 100 మీటర్ల దూరంలో ఉండేందుకు అనుమతిస్తారు. బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు బోల్డ్ అక్షరాలతో ఉంటాయి. ఓటర్ స్లిప్లలో బూత్ నంబర్ కూడా బోల్డ్ అక్షరాలతోనే ఉంటుంది. ఫారమ్ 17సీ, ఈవీఎం డేటా అందుబాటులో లేకపోతే వీవీపాట్ లెక్కింపు తప్పనిసరి. ప్రతి రెండు గంటలకు రియల్-టైమ్ ఓటరు ఓటింగ్ను అప్డేట్ చేస్తారు.ఎవరి సంగతి ఏమిటి?నితీష్ కుమార్.. రికార్డు స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం.తేజస్వి యాదవ్.. 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేందుకు మరో అవకాశం.రాహుల్ గాంధీ .. తన ఓటు చోరీ నినాదానికి ప్రజల ఆమోదం పొందే ఛాన్స్ప్రశాంత్ కిషోర్.. ఓట్లు చీలుస్తారా? కింగ్ మేకర్ అవుతారా? అనేది తేలనుంది.చిరాగ్ పాస్వాన్.. బీహార్లో తన పార్టీ ఉనికిని బలోపేతం చేసేందుకు అవకాశం.ఒవైసీ.. అనుకున్న స్థాయిలో ముస్లిం ఓట్లను పొందగలరా? అనేది తేలనుంది.నితీష్కు నిజమైన పరీక్షఫలితాల సమయంలో అందరి దృష్టి నితీష్ కుమార్ పైనే ఉండనుంది. తేజస్వి యాదవ్ తరచూ నితీష్ కుమార్ ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.లాలూ కుటుంబంలో అంతర్గత పోరులాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అతని సోదరి రోహిణి ఆచార్య తన సోదరునిపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.మహిళల చేతుల్లో ఫలితాలు?బీహార్ ఎన్నికల ఫలితాలను మహిళలే నిర్ణయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని లక్షలాది మహిళల ఖాతాలలో నితీష్ కుమార్ ఇప్పటికే ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున జమచేశారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.2,500 అందించాలనే ప్రతిపక్షాల ప్రయత్నాన్న ఇది గండికొట్టనున్నదని పలువురు అంటున్నారు. ఇన్ని అంశాల మధ్య రాబోయే 11 రోజులు బీహార్కు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. అక్టోబర్ 17 మొదటి దశ నామినేషన్లకు చివరి తేదీ. ఈ లోపునే, సీట్ల కేటాయింపు, పార్టీల సమీకరణలు స్పష్టం కానున్నాయి. -
Bihar Elections-2025: ‘ఎవరికెన్ని?’.. మొదలైన లెక్కల నినాదాలు
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించడంతో అటు రాజకీయ నేతలు, ఇటు పార్టీలలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6,11 తేదీలలో ఓటింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న వెల్లడికానున్నాయి. ఎన్నికల తేదీల ప్రకటన దరిమిలా అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ), ప్రతిపక్ష మహా కూటమి మధ్య ‘ఎవరికెన్ని?’ నినాదాల యుద్ధం ఊపందుకుంది.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ‘25 నుంచి 30.. మా ఇద్దరు సోదరులు.. నరేంద్ర మోదీ, నితీష్లకు’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా, మహా కూటమి (ఆర్జేడీ) నేత లాలూ ప్రసాద్ యాదవ్ రంగంలోకి దిగి, తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ ఖాతాలో ‘ఆరు- పదకొండు, ఎన్డీఏకి ‘నౌ దో గ్యారహ్’ అని పేర్కొన్నారు. (ఈ హిందీ సామెతకు ఓటమి అని అర్థం). విజయ్ కుమార్ సిన్హా -లాలూ యాదవ్ మధ్య నినాద యుద్ధానికి ముందు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) ‘25 నుండి 30.. మళ్లీ నితీష్’ అనే నినాదాన్ని వినిపించారు. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ సీఎం అవుతారనే సందేశాన్ని జేడీయూ ఇంతకుముందే వినిపించింది. छह और ग्यारह NDA नौ दो ग्यारह!— Lalu Prasad Yadav (@laluprasadrjd) October 7, 2025ఎన్నికల కమిషన్ బృందంతో జరిగిన సమావేశంలో జేడీయూ, బీజేపీలతో పాటు పలు రాజకీయ పార్టీలు ఛత్ పూజ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థించాయి. సూర్య ఆరాధన ఉత్పవంగా పేరొందిన ఛత్ వ్రతం అక్టోబర్ 25 నుండి 28 వరకు జరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల కమిషన్ నవంబర్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో బీహార్లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. किसानों को रुलाने वाली 20 सालों की निर्दयी एनडीए सरकार को बदलने का वक्त आ गया है। #LaluYadav #Bihar #RJD #बिहार pic.twitter.com/LPTH7MUiIc— Lalu Prasad Yadav (@laluprasadrjd) September 26, 2025 -
16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన
కర్నూలు కల్చరల్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనెల 16న ప్రధాని మోదీ పర్యటించనున్నారని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్రెడ్డి, టీజీ భరత్ తెలిపారు. సోమవారం కర్నూలులోని స్టేట్ గెస్ట్హౌస్లో జిల్లాలో ప్రధాని పర్యటనపై వీరు సమీక్ష చేపట్టారు.3 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సభ ఏర్పాటుకు అనుగుణంగా ఉండే ప్రదేశాలను ఈ సందర్భంగా మంత్రులు గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. -
సీజేఐపై దాడికి యత్నం.. ప్రధాని మోదీ ఆగ్రహం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai)పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సీజేఐపై దాడికి యత్నించిన ఘటనను మోదీ ఖండించారు. ఈ మేరకు సోమవారం (అక్టోబర్6న) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్తో మాట్లాడాను. ఈ రోజు సుప్రీం కోర్ట్ ప్రాంగణంలో జరిగిన ఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇలాంటి దారుణమైన చర్యలకు స్థానం లేదు. ఇది పూర్తిగా ఖండించదగిన చర్య. ఈ పరిస్థితిలో న్యాయమూర్తి గవాయ్ చూపిన శాంత స్వభావాన్ని నేను అభినందిస్తున్నాను. ఇది న్యాయ విలువల పట్ల ఆయన నిబద్ధతను, అలాగే మన రాజ్యాంగాన్ని బలపరిచేందుకు చేసిన ఆయన కృషిని ప్రతిబింబిస్తుంది’ అని పేర్కొన్నారు.Spoke to Chief Justice of India, Justice BR Gavai Ji. The attack on him earlier today in the Supreme Court premises has angered every Indian. There is no place for such reprehensible acts in our society. It is utterly condemnable. I appreciated the calm displayed by Justice…— Narendra Modi (@narendramodi) October 6, 2025 -
8న బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ రాక
న్యూఢిల్లీ: బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్లో పర్యటించబోతున్నారు. ఈ నెల 9న ముంబైలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశమవుతారు. విజన్–2035 రోడ్మ్యాప్లో భాగంగా భారత్, యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి చేపట్టిన చర్యల పురోగతిని వారు సమీక్షిస్తారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చిస్తారు. ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో స్టార్మర్ ప్రసంగిస్తారు. స్టార్మర్ గత ఏడాది జూలైలో బ్రిటిష్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆయన భారత్లో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. -
అందరూ కాలేరు జన నాయక్లు
న్యూఢిల్లీ: విజ్ఞానం, నైపుణ్యాలకు మన దేశంలో లోటు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. మేధో సంపత్తి మన విలువైన ఆస్తి అని ఉద్ఘాటించారు. విజ్ఞానం, నైపుణ్యాలను దేశ ప్రగతికి ఉపయోగించుకోవాలని చెప్పారు. 21వ శతాబ్దంలో స్థానిక నైపుణ్యాలు, వనరులు, ప్రతిభ, విజ్ఞానానికి డిమాండ్ నానాటికీ పెరుగుతోందని అన్నారు. శనివారం రూ.62,000 కోట్లకుపైగా విలువైన యువత కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని మోదీ ఢిల్లీలో వర్చువల్గా ప్రారంభించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్కు అనుసంధానమైన పథకాలు ఇందులో ఉన్నాయి. అలాగే రూ.60,000 కోట్లతో అమలు చేసే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ‘పీఎం–సేతు’ పథకానికి శ్రీకారం చుట్టారు. బిహార్ రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ మోడల్గా అభివృద్ధి చేయబోతున్నారు. బిహార్లో జన నాయక్ కర్పూరీ ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని సైతం మోదీ ప్రారంభించారు. బిహార్లో రా్రïÙ్టయ జనతాదళ్(ఆర్జేడీ) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యావ్యవస్థ దిగజారిందని, వలసలు పెరిగిపోయాయని మండిపడ్డారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రశంసించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని ఆ పార్టీ కార్యకర్తలు ‘జన నాయక్’ అని పిలుస్తుండడాన్ని ప్రధానమంత్రి తప్పుపట్టారు. ఓబీసీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ మాత్రమే ‘జన నాయక్’ అని తేల్చిచెప్పారు. ఆ గౌరవాన్ని దొంగిలించే కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని బిహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. అందరూ జన నాయకులు కాలేరని రాహుల్ను ఎద్దేవా చేశారు. ఐటీఐలపై ప్రత్యేక దృష్టి ‘‘పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లు పారిశ్రామిక విద్యకు అత్యంత కీలకం. ఇవి ఆత్మనిర్భర్ భారత్కు వర్క్షాప్లుగా పని చేస్తున్నాయి. ఐటీఐల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. 2014 వరకు దేశంలో 10,000 ఐటీఐలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 15,000కు చేరుకుంది. పారిశ్రామిక నైపుణ్య అవసరాలను తీర్చేలా, రాబోయే పదేళ్లలో డిమాండ్ను తట్టుకొనేలా ఐటీఐ నెట్వర్క్ ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు. ప్రతి గ్రామంలోనూ పాఠశాల ‘‘బిహార్ పురోభివృద్ధి కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోంది. యువతకు గత 20 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల కంటే రాబోయే ఐదేళ్లలో అంతకు రెట్టింపు ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. వేర్లకు చెదలు పట్టి ఎండిపోయిన చెట్టును బతికించడం కష్టం. ఇతర పార్టీల పాలనలో బిహార్ పరిస్థితి ఇలాగే ఉండేది. నితీశ్ కుమార్ పట్ల బిహార్ ప్రజలు విశ్వాసం ప్రదర్శించారు. ఆయన నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం బిహార్ను మళ్లీ దారిలో పెట్టడానికి ఉమ్మడిగా కృషి చేస్తోంది. రెండున్నర దశాబ్దాల క్రితంలో బిహార్లో విద్యా వ్యవస్థ ఎలా ఉండేదో ఇప్పటి తరానికి తెలియదు. తమ బిడ్డలు స్థానికంగానే చదువుకొని, ఉద్యోగం సంపాదించుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, విపక్షాల పాలనలో లక్షలాది మంది బిహార్ను విడిచిపెట్టి బనారస్, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు వలసవెళ్లారు. వలసలకు అప్పడే బీజం పడింది. ఎన్డీయే సర్కార్ వచ్చిన తర్వాత బిహార్ ప్రజలు సొంత రాష్ట్రానికి తిరిగి రావడం ఆరంభమైంది’’ అని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. -
మోదీ చనిపోతే? ఎమ్మెల్యే భూపతి రెడ్డి వివాదాస్పద కామెంట్స్
-
Gaza Issue: డొనాల్డ్ ట్రంప్పై ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ: గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి కోసం 20 సూత్రాల ప్రణాళికకు హమాస్ ఒప్పుకోవడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారన్నారు. ‘గాజా వివాదాన్ని అంతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను మేము స్వాగతిస్తున్నాము. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు, అలాగే విస్తృత పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతలు ఏర్పడటానికి , ఇది ఆ దేశాల అభివృద్ధికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తుంది’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవకు సంబంధిత వారందరూ కలిసి వస్తారని, ఏళ్ల తరబడి సాగుబడి సాగుతున్న సంఘర్షణను అంతం చేయడానికి, శాంతిని స్థాపించే ఈ ప్రయత్నానికి మద్దతు ఇస్తారని మేము ఆశిస్తున్నాము’ అని మోదీ తన పోస్ట్లో పేర్కొన్నారు. We welcome President Donald J. Trump’s announcement of a comprehensive plan to end the Gaza conflict. It provides a viable pathway to long term and sustainable peace, security and development for the Palestinian and Israeli people, as also for the larger West Asian region. We…— Narendra Modi (@narendramodi) September 30, 2025 కాగా, గాజాలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన గడువులోగా ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు. హమాస్కు ఆదివారం వరకూ గడువు ఇవ్వగా, వారు ముందుగానే ఒప్పుకోవడం గమనార్హం.ట్రంప్ ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు -
యువశక్తికి రూ.62,000 కోట్ల బూస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో యువత విద్య, నైపుణ్యా భివృద్ధి, వ్యవస్థాపకతకు ఊతం ఇచ్చే దిశగా రూ.62 వేల కోట్లకు పైగా విలువైన పలు యువత– కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. శనివారం ఉద యం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్’లో ఆయన పాల్గొంటారు. దేశ వ్యాప్తంగా పారిశ్రామిక శిక్షణా సంస్థల(ఐటీఐ) నుంచి ఆల్ ఇండియా టాపర్లుగా నిలిచిన 46 మందిని ప్రధాని మోదీ సత్కరించనున్నారు.ఈ కార్యక్రమాల్లో అత్యంత కీలకమైనది ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐలు’ (పీఎం–సేతు). కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన దీనికోసం రూ.60 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను ‘హబ్ అండ్ స్పోక్’ నమూనాలో ఆధునీకరించనున్నారు. ఇందులో 200 ఐటీఐలు ‘హబ్’లుగా, 800 ఐటీఐలు ‘స్పోక్’లుగా పనిచేస్తాయి. ప్రతి హబ్కు సగటున నాలుగు స్పోక్లు అనుసంధానమై ఉంటాయి. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 400 నవోదయ విద్యాల యాలు, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 1,200 వృత్తి నైపుణ్య ల్యాబ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. మారుమూల, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు సైతం ఐటీ, ఆటోమోటివ్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, టూరిజం వంటి 12 కీలక రంగాల్లో ప్రత్యక్ష శిక్షణ అందించడమే ఈ ల్యాబ్స్ లక్ష్యం. జాతీయ విద్యా విధానం–2020కి అనుగు ణంగా 1,200 మంది వృత్తి విద్యా ఉపాధ్యా యులకు శిక్షణ ఇచ్చారు. బిహార్కు సంబంధించిన పలు పథకాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. -
మెలోని గారి మన్ కీ బాత్
బాగా ఇష్టమైన ఇల్లు కాలి బూడిదైతే... ఆ బూడిదను చూస్తూ ఏడుస్తూ కూర్చోలేము. ఒక్కో ఇటుక పేరుస్తూ కొత్త ఇంటికి సిద్ధం అవుతాము. జార్జియా మెలోని అలాగే చేసింది. కుటుంబ కల్లోలాన్ని మనసుపైకి రానివ్వకుండా తిరుగులేని నాయకురాలిగా ఎదిగింది. ఇటలీ తొలి మహిళా ప్రధాని అయింది. ఆమె ఆత్మకథ ‘ఐయామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్ (ఇండియన్ ఎడిషన్)కు ప్రధాని నరేంద్ర మోదీ ముందుమాట రాశారు.కొన్ని నెలల క్రితం అల్బేనియాలో జరిగిన ఒక సదస్సులో వివిధ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి అల్బేనియా అధ్యక్షుడు స్వాగతం పలికిన తీరు వైరల్ అయింది. కారు దిగి వస్తున్న మెలోనికి వర్షంలో మోకాళ్లపై కూర్చొని నమస్కారం చెబుతూ ఆయన స్వాగతం పలికిన తీరు ప్రపంచాన్ని ఆకట్టుకుంది.న్యూయార్క్లో జరిగిన ఒక అవార్డ్ల కార్యక్రమంలో... ‘మెలోని నిజాయితీపరురాలు. ఆమె మనసు అందమైనది’ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇటలీలో జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీని ‘నమస్తే’ అంటూ మెలోని స్వాగతం పలకడం వైరల్గా మారింది.ఒక్క మాటలో చె ప్పాలంటే... జార్జియా మెలోని అనేది ‘ప్రధాన ఆకర్షణ’కు మరో పేరు.అయితే ఆమె ప్రస్థానం నల్లేరు మీద నడక కాదు. ఒక్కో అడుగు వేస్తూ ప్రయాణం ప్రారంభించింది. ఆ ప్రయాణంలో ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్లింది.‘ఐయామ్ జార్జియా–మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ను ఒక అధ్యక్షురాలి ఆత్మకథగా మాత్రమే చూడనక్కర్లేదు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇటలీ తొలి మహిళా అధ్యక్షురాలి స్థాయికి ఎదగడం అనేది సామాన్య విషయమేమీ కాదు. ధైర్యంలో, ఆత్మవిశ్వాసంలో, సానుకూల శక్తి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది మెలోని.రోమ్లో పుట్టి గార్బటెల్లా జిల్లాలో పెరిగింది మెలోని. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మెలోని తండ్రి, కుటుంబాన్ని విడిచి కానరీ దీవులకు వెళ్లాడు. అక్కడ మరో వివాహం చేసుకున్నాడు. మెలోనికి పదిహేడేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు.తండ్రి దూరం అయ్యాడు. తమకు ఇష్టమైన ఇల్లు అగ్నిప్రమాదంలో నాశనం అయింది. బాల్యం, కుటుంబ విచ్ఛిన్నం తన రాజకీయ దృక్పథాన్ని ప్రభావితం చేశాయని తన ఆత్మకథలో రాసుకుంది మెలోని. పొలిటికల్ పార్టీ ఇటాలియన్ సోషల్ మూమెంట్ (ఎంఎస్ఐ) యువ విభాగం ‘యూత్ ఫ్రంట్’లో చేరడంతో మెలోని రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో ‘స్టూడెంట్ మూవ్మెంట్’ నేషనల్ లీడర్గా ఎదిగింది. ప్రావిన్స్ ఆఫ్ రోమ్’ కౌన్సిలర్గా పనిచేసింది. ‘యూత్ యాక్షన్’ అధ్యక్షురాలిగా ఎంపికైంది... ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇటలీ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించింది.మోదీ ముందుమాట‘దేశభక్తి ఉట్టిపడే అత్యత్తమ నాయకురాలు’ అని ‘ఐయామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ పుస్తకానికి రాసిన ముందు మాటలో మన ప్రధాని నరేంద్ర మోదీ మెలోనిని కొనియాడారు. ఆమె వ్యక్తిగత, రాజకీయ ప్రయాణం గురించి వివరించారు. మెలోని ఆత్మకథను ‘మన్కీ బాత్’లో చె ప్పారు. ‘‘ఇటలీ ప్రధాన మంత్రి మెలోనిపై అభిమానం, స్నేహంతో ఈ ముందుమాట రాశాను. దీన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఆమె స్ఫూర్తిదాయకమైన, చారిత్రక ప్రయాణం భారత్లో ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది’’ అని తన ముందు మాటలో రాశారు మోదీ. గతంలో రెండు పుస్తకాలకు మాత్రమే మోదీ ముందు మాట రాశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనందీబెన్ పటేల్కు అంకితం ఇచ్చిన పుస్తకానికీ, ప్రముఖ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని ఆత్మకథకు గతంలో ముందుమాట రాశారు. -
భారత్తో వాణిజ్య సమతూకం!
మాస్కో: భారత్తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు అధినేత పుతిన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులను భారీగా పెంచుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని రష్యా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గిపోయి, వాణిజ్యంలో సమతూకం ఏర్పడేలా చర్యలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతులు పెంచాలని నిర్ణయించారు. గురువారం వాల్డాయ్ ప్లీనరీలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించబోతున్నానని, ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నానని వెల్లడించారు. ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సమతూకం కలిగిన, తెలివైన నాయకుడు అని కొనియాడారు. భారతదేశ ప్రయోజనాల కోసం మోదీ నిరంతరం శ్రమిస్తుంటారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందన్నారు. మోదీతో సమావేశమైనప్పుడు తాను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు సహకరించడం మానుకోవాలని అమెరికాను పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. #BREAKING: Russian President Putin at Valdai Club in Sochi on Trump Tariffs, says, “Indian people will look at what decisions are made by their political leadership. Indian people will never accept any humiliation. I know PM Modi, he will never take any steps of the kind.” pic.twitter.com/2GYqoVK1PO— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 2, 2025స్వప్రయోజనాలు దెబ్బతింటే భారత్ సహించదుభారతదేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా టారిఫ్లు విధించడాన్ని పుతిన్ తప్పుపట్టారు. దేశ స్వప్రయోజనాలు, ప్రాధాన్యతల కోణంలోనే భారతీయులు నిర్ణయాలు తీసుకుంటారని, వాటిని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారు సహించబోరని తేల్చిచెప్పారు. అమెరికా విధిస్తున్న టారిఫ్ల కారణంగా వాటిల్లుతున్న నష్టాన్ని రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్ భర్తీ చేసుకుంటోందని అన్నారు. అదేసమయంలో ఒక సార్వ¿ౌమ దేశంగా ప్రతిష్టను కాపాడుకుంటోందని ప్రశంసించారు. భారత్ నుంచి దిగుమతులు పెంచుకుంటామని, వ్యవసాయ ఉత్పత్తులతోపాటు ఔషధ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ అధికంగా కొనుగోలు చేస్తామని ఉద్ఘాటించారు. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. ఫైనాన్సింగ్, లాజిస్టిక్స్తోపాటు చెల్లింపుల్లో కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. భారత్, రష్యాలు ఏనాడూ ఘర్షణ పడలేదని, భవిష్యత్తులోనూ అలాంటిది తలెత్తే అవకాశమే లేదని పుతిన్ తేల్చిచెప్పారు. భారతీయ సినిమాలంటే ఇష్టం భారతీయ సినిమాలు వీక్షించడం తనకు ఎంతో ఇష్టమని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ సినిమాలకు రష్యాలో విశేషమైన ఆదరణ లభిస్తోందని చెప్పారు. భారతీయ సినిమాలను రోజంతా ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ చానల్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు దేశాల నడుమ రాజకీయ, దౌత్య సంబంధాలే కాకుండా సాంస్కృతిక, మానవీయ బంధాలు కూడా బలంగా ఉన్నాయని గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి అంటే రష్యన్లకు ఎంతో అభిమానం అని వ్యాఖ్యానించారు. చాలామంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుకుంటున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: పాక్ పరువు.. మళ్లీ పాయే! -
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘‘నేను ఖర్గేతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారుకాగా, మల్లికార్జున ఖర్గేకు బుధవారం రాత్రి బెంగళూరు ఆస్పత్రి వైద్యులు పేస్మేకర్ను అమర్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెంగళూరు వచ్చిన ఆయన శ్వాసలో ఇబ్బంది, జ్వరం రావడంతో మంగళవారం సాయంత్రం ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు.Spoke to Kharge Ji. Enquired about his health and wished him a speedy recovery. Praying for his continued well-being and long life.@kharge— Narendra Modi (@narendramodi) October 2, 2025తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే సోషల్ మీడియా లో..‘వయో సంబంధ సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలతో ఖర్గే ఇబ్బంది పడుతున్నారు. వీటిని సరిచేసేందుకు పేస్మేకర్ అమర్చాలని వైద్యులు సలహా ఇచ్చారు’అని తెలిపారు. ఖర్గేకు బుధవారం రాత్రి వైద్యులు స్వల్ప శస్త్రచికిత్స జరిపి పేస్మేకర్ను విజయవంతంగా అమర్చారు. ఆయన ఆరోగ్యం బాగుందని, గురువారం డిశ్చార్జి అవుతారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. -
మహాత్మునికి, లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోదీ నివాళులు (ఫొటోలు)
-
అనాదిగా ధర్మానిదే విజయం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: గురువారం విజయ దశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనాదిగా చెడుపై ధర్మానిదే విజయమనే సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. విజయ దశమి రోజు ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. మంచి, ధర్మం అనేవి ఎల్లప్పుడూ చెడు, మోసాలను అధిగమిస్తాయన్నారు. ఈ పండుగ.. ధైర్యం, జ్ఞానం, భక్తి మొదలైనవాటిని జీవితంలో మార్గదర్శక శక్తులుగా స్వీకరించడానికి ప్రేరణనిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. विजयादशमी बुराई और असत्य पर अच्छाई और सत्य की विजय का प्रतीक है। मेरी कामना है कि इस पावन अवसर पर हर किसी को साहस, बुद्धि और भक्ति के मार्ग पर निरंतर अग्रसर रहने की प्रेरणा मिले। देशभर के मेरे परिवारजनों को विजयादशमी की बहुत-बहुत शुभकामनाएं।— Narendra Modi (@narendramodi) October 2, 2025ఈ పవిత్ర దినం మనల్ని సత్యం, ధర్మ మార్గంలో స్థిరంగా నిలిచేందుకు ప్రోత్సహిస్తుందని ప్రధాని అన్నారు. దసరా అంటే రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడమే కాకుండా, ప్రతికూలతలను జయించి న్యాయం, ధర్మాన్ని నిలబెట్టడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భారతీయులంతా ఒక పెద్ద జాతీయ కుటుంబంలోని సభ్యులుగా అభివర్ణించారు. ఇటువంటి పండుగలు ఐక్యతను బలోపేతం చేస్తాయని, ప్రజలను దగ్గర చేస్తాయని, దేశ సాంస్కృతిక స్ఫూర్తిని వ్యాపింపజేస్తాయని ప్రధాని పేర్కొన్నారు.గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ పోస్టులో ఆయన.. ధైర్యం, సరళత అనేవి మనిషి మార్పునకు సాధనాలుగా ఎలా మారుతాయనేది గాంధీ చూపారని పేర్కొన్నారు. ప్రజలకు సాధికారత కల్పించడానికి సేవ, కరుణ ముఖ్యమైన సాధనాలని అన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్లో ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమగ్రత, వినయం, దృఢ సంకల్పాల బలంతో భారతదేశాన్ని బలోపేతం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడిగా ఆయనను ప్రధాని మోదీ ప్రశంసించారు. -
మహాత్మునికి, శాస్త్రిజీకి ప్రధాని మోదీ నివాళులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని మార్చాయని ప్రధాని పేర్కొన్నారు. Gandhi Jayanti is about paying homage to the extraordinary life of beloved Bapu, whose ideals transformed the course of human history. He demonstrated how courage and simplicity could become instruments of great change. He believed in the power of service and compassion as… pic.twitter.com/LjvtFauWIr— Narendra Modi (@narendramodi) October 2, 2025సోషల్ మీడియా ‘ఎక్స్’ పోస్టులో ఆయన.. ధైర్యం, సరళత అనేవి మనిషి మార్పునకు సాధనాలుగా ఎలా మారుతాయనేది గాంధీ చూపారని పేర్కొన్నారు. ప్రజలకు సాధికారత కల్పించడానికి సేవ, కరుణ ముఖ్యమైన సాధనాలని అన్నారు. వీక్షిత భారత్ను నిర్మించాలనే మా ఆశయంలో మేము ఆయన మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays tribute to former PM Lal Bahadur Shastri at Vijay Ghat on his birth anniversary.(Source: DD) pic.twitter.com/OnrZU1aAdY— ANI (@ANI) October 2, 2025మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్లో ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమగ్రత, వినయం, దృఢ సంకల్పాల బలంతో భారతదేశాన్ని బలోపేతం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడిగా ఆయనను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆయన ఆదర్శప్రాయమైన నాయకత్వం, మహోన్నత వ్యక్తిత్వం, ఆయన ఇచ్చిన ‘జై జవాన్ జై కిసాన్’ నినాదం ప్రజల్లో దేశభక్తిని రగిలించాయన్నారు. స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించే ప్రయత్నంలో ఆయన మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
గాయకుడు ఛన్నులాల్ మరణం బాధించింది: మోదీ
ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, పద్మ విభూషణ్ ఛన్నులాల్ మిశ్రా (chhannulal mishra) అనారోగ్యంతో మరణించారు. ఉత్తర్ప్రదేశ్లోని తన కుమార్తె నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయసురీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఛన్నులాల్ మరణం తనను బాధించిందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందంటూ సంతాపం తెలిపారు.హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఎలనలేని గుర్తింపు పొందిన ఛన్నులాల్ ఉత్తరప్రదేశ్లో 1936లో జన్మించారు. భారతీయ కళ, సంస్కృతి కోసం ఆయన చేసిన సేవకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ (2010), పద్మ విభూషణ్ (2020)తో గౌరవించింది. -
‘సంఘ్పై పటేల్ ఏమన్నారో మోదీకి తెలుసా?’
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్పై(RSS) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రశంసల వర్షం కురిపించడం పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్(Jai Ram Ramesh) అభ్యంతరం వ్యక్తంచేశారు. సంఘ్ గురించి అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్భాయి పటేల్ ఏమన్నారో మోదీకి తెలుసా? అని ప్రశ్నించారు. 1948 జూలై 18న డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీకి పటేల్ రాసిన లేఖను ప్రస్తావించారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో జైరామ్ రమేశ్ పోస్టుచేశారు.ఈ సందర్భంగా జైరామ్ రమేశ్.. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల వల్ల దేశంలో భయానక వాతావరణం ఏర్పడిందని, అది అంతిమంగా మహాత్మాగాంధీ హత్యకు దారితీసినట్లు ఆ లేఖలో పటేల్ పేర్కొన్నారని గుర్తుచేశారు. సంఘ్తోపాటు హిందూ మహాసభ తీరును వ్యతిరేకిస్తూ పటేల్ ఆ లేఖలో రాశారని వెల్లడించారు. ముఖ్యంగా సంఘ్ కార్యకలాపాలు దేశ భద్రతకు, ప్రభుత్వానికి ముప్పుగా మారాయని పటేల్ తెలిపినట్లు గుర్తుచేశారు. 1948 డిసెంబర్ 19న జైపూర్ సభలో పటేల్ మాట్లాడుతూ సంఘ్ తీరుపై నిప్పులు చెరిగారని జైరామ్ రమేశ్ వెల్లడించారు. ఈ నిజాలను ప్రధాని మోదీ ఇకనైనా తెలుసుకోవాలని హితవు పలికారు. ఇది కూడా చదవండి: ‘దేశ నిర్మాణమే సంఘ్ ధ్యేయం’ -
త్వరలో ట్రంప్, మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెలాఖరులో మలేసియాలో భేటీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కౌలాలంపూర్లో ఈ నెల 26, 27వ తేదీల్లో జరిగే 47వ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) శిఖరాగ్రానికి ఇద్దరు నేతలు హాజరుకా నున్నారు. ఈ సందర్భంగా వీరు సమావేశమవుతారని విశ్వసనీయవర్గాల సమా చారం. సమావేశానికి రావాలంటూ మలేసియా ఇప్పటికే ఇద్దరు నేతలకు ఆహ్వానం పంపించింది. ట్రంప్ పర్యటన ఖరారైన పక్షంలో, అమెరికా భారత్పై 50 శాతం టారిఫ్లను విధించిన తర్వాత ఇద్దరు నేతలు కలుసుకునే మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం అవుతుంది. -
దేశ నిర్మాణమే సంఘ్ ధ్యేయం
న్యూఢిల్లీ: దేశ నిర్మాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అద్వితీయమైన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో కార్యాచరణ కొనసాగిస్తోందని అన్నారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన సంఘ్పై ఇప్పటిదాకా ఎన్నో దాడులు జరిగాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ఏనాడూ ఎవరిపైనా విద్వేషం ప్రదర్శించలేదని, అందరినీ అక్కున చేర్చుకుందని కొనియాడారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సంఘ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కులం, జాతి అనే అడ్డుగోడలను తొలగించి, సమాజంలో ప్రజల మధ్య సామరస్యం, సోదరభావం పెంపొందించడమే లక్ష్యంగా దేశంలో నలుమూలలకూ సంఘ్ విస్తరించిందని చెప్పారు. సమీకృత సమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తోందని ఉద్ఘాటించారు. బ్రిటిషర్ల పాలనలో జరిగిన అకృత్యాలపై ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు స్వయంసేవకులు ఆశ్రయం ఇచ్చారని, స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది సంఘ్ నాయకులు అరెస్టయ్యి జైలుశిక్ష అనుభవించారని చెప్పారు. దేశాన్ని ప్రేమించడమే ఆర్ఎస్ఎస్ విధానమని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... విశ్వాసం, గౌరవమే సంఘ్ బలం ‘‘ఆర్ఎస్ఎస్ ఆశయాలను అణచివేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు. తప్పుడు కేసులు పెట్టారు. సంఘ్ను శాశ్వతంగా నిషేధించే ప్రయత్నాలు కూడా చేశారు. లెక్కలేనన్ని సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ సంఘ్ ఏనాడూ వెనక్కి తగ్గలేదు. మహా మర్రివృక్షంగా స్థిరంగా నిలిచింది. ఎవరినీ ద్వేషించలేదు. ఎందుకంటే మనమంతా ఈ సమాజంలో భాగమే. ఇక్కడ మంచితోపాటు చెడును కూడా స్వీకరించాల్సిందే. సంఘ్ అధినేత గురూజీ గోల్వాల్కర్పై తప్పుడు కేసు నమోదుచేసి, జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచి్చన తర్వాత ఆయన విజ్ఞత ప్రదర్శించారు. జనాభా స్థితిగతుల్లో మార్పులు ఆందోళనకరం ఆర్ఎస్ఎస్కు వందేళ్లు పూర్తవుతున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలను బతికించుకోవాలన్న ఉద్దేశంతో సరిగ్గా వందేళ్ల క్రితం విజయ దశమి రోజున సంఘ్ స్థాపన జరిగింది. అప్పటి నుంచి దేశ ప్రగతికి కృషి చేస్తూనే ఉంది. దేశ భక్తి, ప్రజాసేవకు పర్యాయపదం ఆర్ఎస్ఎస్. ‘ఒకే భారత్, మహోన్నత భారత్’ అనే సిద్ధాంతాన్ని సంఘ్ విశ్వసిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వమే మనదేశ ఆత్మ. అది విచ్ఛిన్నమైతే దేశం బలహీనపడుతుంది. దేశంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తుండడం ఆందోళనకరం. ఈ పరిణామం దేశ భద్రతకు, సామాజిక సామరస్యానికి ప్రమాదకరం. బాహ్య శక్తులు మన దేశంలోకి చొరబడి వేర్పాటువాద సిద్ధాంతాలను నూరిపోస్తున్నాయి. చొరబాటుదారుల నుంచి మన పౌరులను కాపాడేందుకు ‘డెమొగ్రఫిక్ మిషన్’ను ప్రకటించాం. వాటి నుంచి సమాజానికి విముక్తి కల్పించాలి 1962లో యుద్ధం సమయంలో, 1971 నాటి సంక్షోభంలో, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో వారు విశేషమైన సేవలందించారు. బాధితులను ఆదుకున్నారు. సంఘ్ సేవలను మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ కూడా ప్రశంసించారు. వార్ధాలోని సంఘ్ క్యాంప్ను మహాత్మాగాంధీ సందర్శించారు. సంఘ్ సిద్ధాంతాలను కొనియాడారు. ప్రస్తుత సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ సమాజం ముందు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రజలందరికీ ‘ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశాన వాటిక’ అని చెబుతున్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి ఉండాలని బోధిస్తున్నారు. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వివక్ష, విభజన, అసమ్మతి నుంచి సమాజానికి విముక్తి కల్పించాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పోస్టల్ స్టాంప్, నాణెం ఆవిష్కరణ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్, స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. రూ.100 విలువ కలిగిన ఈ నాణెంపై ఒక వైపు భరతమాత చిత్రం, మరోవైపు జాతీయ చిహ్నం ఉంది. సింహంతోపాటు వరద ముద్రతో భరతమాత చిత్రం ఆకట్టుకుంటోంది. స్వయం సేవకులు ఆమెకు వందనం సమర్పిస్తున్నట్లుగా ఈ నాణెం ముద్రించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన కరెన్సీపై భరతమాత చిత్రాన్ని ముద్రించడం ఇదే మొట్టమొదటిసారి అని ప్రధాని మోదీ చెప్పారు. ఇది చరిత్రాత్మకమని, మనకు గర్వకారణమని అన్నారు. నాణెంపై ఆర్ఎస్ఎస్ మోటో ‘రాష్ట్రాయ స్వాహా, ఇదం రాష్ట్రాయ, ఇదం న మమ’ కూడా ముద్రించారు. ‘ఏదీ నాది కాదు.. అంతా దేశానికే అంకితం’ అని దీని అర్థం. ఇక పోస్టల్ స్టాంప్పై 1963 రిపబ్లిక్ డే పరేడ్లో స్వయంసేవకులు పాల్గొన్న చిత్రం ముద్రించారు. ‘పంచ పరివర్తన్’ ఎజెండా ప్రజల మద్దతుతోనే సంఘ్ వందేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే చెప్పారు. శతాబ్ది వేడుకల్లో ఆయన మాట్లాడారు. దేశంలో నేడు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా మారిందని, దీని వెనుక ఎన్నో సవాళ్లు, కష్టాలు ఉన్నాయని తెలిపారు. సంఘ్పై ప్రత్యేక పోస్టల్ స్టాంప్, నాణెం విడుదల చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘ్ నిస్వార్థ సేవలకు ఇది చక్కటి గుర్తింపు అని పేర్కొన్నారు. మన దేశ ప్రగతి కోసం స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట వేయాలని ప్రజలను కోరారు. దేశం స్వయం సమృద్ధి సాధించడానికి అందరూ కృషి చేయాలన్నారు. శతాబ్ది వేడుకలను పురస్కరించుకొని సంఘ్ నాయకత్వం ‘పంచ పరివర్తన్’ ఎజెండాను రూపొందించింది. భారతీయ విలువలు, సరైన కుటుంబ విలువలు, సామాజిక సామరస్యం, పర్యావరణహిత జీవనశైలితోపాటు పౌర విధులు సక్రమంగా నిర్వర్తించేలా ప్రజలను ప్రోత్సహించాలన్నదే ఈ ఎజెండా లక్ష్యం. -
వంద సంవత్సరాల దేశసేవ
ఓ శతాబ్దం కిందట విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆవిర్భవించింది. అయితే, ఇది కొత్తగా సృష్టించినదేమీ కాదు... ప్రాచీన సంప్రదాయానికి నవ్య వ్యక్తీకరణ మాత్రమే. భారత నిరంతర జాతీయ చైతన్యం కాలానుగుణంగా భిన్న రూపాల్లో, విభిన్న సవా ళ్లను ఎదుర్కొంటూ ఇలా అవతరించింది. ఆ కాలాతీత జాతీయ చైతన్యానికి మన కాలపు ప్రతిరూపమే ఈ సంఘ్. ఇటువంటి సంఘ్ శతాబ్ది వేడు కలలో భాగస్వాములం కావడం మన తరం స్వయంసేవకుల అదృష్టం. దేశానికి, ప్రజలకు సేవ దిశగా ప్రతినబూని, అంకిత భావంతో ముందుకు సాగుతున్న అసంఖ్యాక స్వయం సేవకులకు ఈ చారిత్రక సందర్భంలో నా శుభాకాంక్షలు. సంఘ్ స్థాపకుడు, మనందరి మార్గదర్శకుడు అయిన డాక్టర్ హెడ్గేవార్జీకి నా సగౌరవ ప్రణామాలు అర్పిస్తున్నాను. వందేళ్ల ఈ అద్భుత పురోగమనాన్ని స్మరించుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లతో పాటు స్మారక నాణాన్ని కూడా ఆవిష్కరించింది.వ్యక్తి వికాసం.. దేశ పురోగమనంమానవ నాగరికతలన్నీ గొప్ప నదీ తీరాల్లోనే పరిఢవిల్లాయి. అదే తరహాలో సంఘ్ ప్రభావంతో లెక్కలేనన్ని జీవితాలు చరితార్థ మయ్యాయి. ఒక నది తాను తడిపిన ప్రతి అంగుళం నేలనూ సుసంపన్నం చేస్తుంది. అదే విధంగా సంఘ్ కూడా దేశంలోని ప్రతి మూలనూ, సమాజంలో ప్రతి రంగాన్నీ పెంచి పోషించింది. ఒక నదీ ప్రవాహం పలు విధాలుగా చీలి తన ప్రభావాన్ని మరింతగా విస్తరింపజేస్తుంది. సంఘ్ ప్రయాణం కూడా ఇలాంటిదే. వివిధ అనుబంధ సంస్థల ద్వారా విద్య, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహిళా సాధికారత సహా జీవితంలోని అనేక రంగాల్లో సంఘ్ తన సేవానిరతిని రుజువు చేసుకుంది. ‘‘వ్యక్తి వికాసం నుంచి దేశ వికాసం, వ్యక్తిత్వ నిర్మాణంతో దేశ పురోగమనం’’... ఇదీ సంఘ్ అనుసరించిన పంథా! దేశభక్తికి మారుపేరుఆవిర్భవించిన మరుక్షణం నుంచే దేశ ప్రాధాన్యాన్నే తన ప్రాథమ్యంగా సంఘ్ పరిగణించింది. డాక్టర్ హెడ్గేవార్ సహా అనేకమంది స్వయంసేవకులు స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా అనేకసార్లు జైలుకు వెళ్లారు. పలువురు స్వాతంత్య్ర సమరయోధులకు సంఘ్ మద్దతునిస్తూ రక్షణగానూ నిలిచింది. స్వాతంత్య్రం తర్వాత కూడా దేశం కోసం తన వంతు కృషిని కొనసాగించింది. దేశభక్తికి, సేవకు మారుపేరుగా ‘సంఘ్’ నిలిచింది. దేశ విభజన సమయంలో లక్షలాది కుటుంబాలు ఆశ్రయం కోల్పోయిన వేళ... స్వయంసేవ కులు ముందుకొచ్చి శరణార్థులకు సేవలందించారు. పరిమిత వనరులే ఉన్నప్పటికీ... ప్రతి విపత్తు సమయంలోనూ ఆపన్న హస్తం అందించే వారిలో స్వయంసేవకులు ముందుంటారు. వారి దృష్టిలో ఇవి ఉపశమన చర్యలు మాత్రమే కాదు... దేశ చేతనను బలోపేతం చేయడం కూడా! వివక్షకు వ్యతిరేకంగా పోరాటంశతాబ్ద కాలపు ప్రయాణంలో సమాజంలోని వివిధ వర్గాల్లో స్వచేతననూ, ఆత్మవిశ్వాసాన్నీ సంఘ్ జాగృతం చేసింది. దశాబ్దా లుగా గిరిజన వర్గాల సంప్రదాయాలు, ఆచారాలు, విలువలను పరిరక్షించి, పెంపొందించడానికి అంకితమైంది. నేడు సేవా భారతి, విద్యా భారతి, ఏకల్ విద్యాలయాలు, వనవాసీ కల్యాణ్ ఆశ్రమ్ వంటి సంస్థలు గిరిజన వర్గాల సాధికారతకు మూలస్తంభాలుగా నిలిచాయి. కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు శతాబ్దాలుగా హిందూ సమాజానికి సవాళ్లుగా ఉన్నాయి. డాక్టర్ హెడ్గేవార్జీ కాలం నుంచి నేటి వరకు.. ప్రతీ స్వయం సేవక్, ప్రతీ సర్ సంఘ్ చాలక్ ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ‘‘అంట రానితనం తప్పు కాకపోతే, ప్రపంచంలో మరేదీ తప్పు కాదు’’ అని పూజ్య బాలసాహెబ్ దేవరస్జీ ప్రకటించారు. అనంతరం పూజ్య రజ్జు భయ్యాజీ, పూజ్య సుదర్శన్జీ కూడా ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ‘అందరికీ ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశానవాటిక’ ఉండాలంటూ ప్రస్తుత సర్ సంఘ్చాలక్ గౌరవ మోహన్ భాగవత్జీ ఐక్యత దిశగా స్పష్టంగా పిలుపునిచ్చారు. శతాబ్దం కిందట సంఘ్ ఏర్పడిన వేళ నాటి అవసరాలు, సవాళ్లు నేటి కాలానికి భిన్నంగా ఉన్నాయి. నేడు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పురోగమిస్తున్న కొద్దీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. మన ఐక్యతను భగ్నం చేసే కుట్రలు, చొరబాట్లు, ఇంకా ఎన్నింటినో ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. వీటిని సమర్థంగా ఎదుర్కోవడం కోసం ఆర్ఎస్ఎస్ కూడా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయడం సంతోషదాయకం.తదుపరి శతాబ్దికి సమాయత్తంసంఘ్ ప్రవచిస్తున్న ‘పంచ పరివర్తన్’... నేటి సవాళ్లను అధిగమించే మార్గాన్ని ప్రతి స్వయం సేవకుడికీ నిర్దేశిస్తుంది.అవి: 1. స్వబోధ: వలసవాద మనస్తత్వం నుంచి విముక్తుల మయ్యేలా, మన వారసత్వ ఘనతను గర్వంగా ప్రకటించు కునేలా, స్వదేశీ సూత్రాన్ని పురోగమింపజేసేలా ఈ ‘స్వీయ అవగాహన’ దోహదపడుతుంది. 2. సామాజిక సామరస్యం: అణగారిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చి సామాజిక న్యాయంపై భరోసా కల్పించడం ద్వారా సామాజిక సామరస్యం సాకార మవుతుంది. మన సామాజిక సామరస్యానికి పెనుసవాలుగా పరిణమించిన చొరబాట్ల సమస్యను పరిష్కరించడం కోసం ఉన్నత స్థాయి జనాభా మిషన్ (హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్)ను ప్రభుత్వం ప్రకటించింది. 3. కుటుంబ ప్రబోధన్: మన సంస్కృతికి పునాది అయిన కుటుంబ వ్యవస్థను కుటుంబ విలువలు బలోపేతం చేస్తాయి. 4. నాగరిక్ శిష్టాచార్: సామా జిక స్పృహ, బాధ్యతా భావం ప్రతి పౌరుడి లోనూ జాగృతం కావాలి. 5. పర్యావరణ్: రాబోయే తరాల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం కోసం పర్యావరణ సంరక్షణ అత్యంత ముఖ్యమైనది. ఈ ఐదు సంకల్పాల నిర్దేశంలో... తదుపరి శతాబ్ది లోకి ప్రయాణాన్ని ‘సంఘ్’ నేడు ప్రారంభించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో సంఘ్ కృషి కీలకం. మరోసారి ప్రతి స్వయంసేవకుడికీ నా శుభాకాంక్షలు. నరేంద్ర మోదీభారత ప్రధాని -
ఆర్ఎస్ఎస్ అంటే విజయం: శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తన వందేళ్ల ఘన చరిత్రతో ఎన్నో మైలు రాళ్లను చూసిందని, ఆర్ఎస్ఎస్ అంటే విజయం అని, నేషన్ ఫస్ట్ అనేది సంఘ్ విధానమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుధవారం జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. దేశానికి ఆర్ఎస్ఎస్ అందించిన సేవలకు గుర్తుగా ప్రత్యేకంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్లను, నాణేన్ని విడుదల చేశారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో భారతమాత చిత్రాన్ని నాణెంపై రూపొందించడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ నాణెంపై ఆర్ఎస్ఎస్ నినాదం రాష్ట్రే స్వాహా, ఇదం రాష్ట్రాయ, ఇదం న మమ’ అని ఉందని, దీని అర్థం ప్రతిదీ దేశానికి అంకితం.. ప్రతిదీ దేశానికే.. ఏదీ నాది కాదని ప్రధాని వివరించారు. రేపు విజయదశమి, చెడుపై మంచి సాధించిన విజయం. అన్యాయంపై న్యాయానికి దక్కిన విజయం. అబద్ధాలపై సత్యం సాధించిన విజయం. చీకటిపై వెలుగు సాధించిన విజయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. राष्ट्रीय स्वयंसेवक संघ की 100 वर्षों की गौरवशाली यात्रा त्याग, निःस्वार्थ सेवा, राष्ट्र निर्माण और अनुशासन की अद्भुत मिसाल है। RSS के शताब्दी समारोह का हिस्सा बनकर अत्यंत गौरवान्वित अनुभव कर रहा हूं।https://t.co/S4gxc0X3IE— Narendra Modi (@narendramodi) October 1, 2025వందేళ్ల క్రితం దసరా నాడు జరిగిన ఆర్ఎస్ఎస్ స్థాపన అనేది వేల ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయ పునరుత్థానమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాలను చూసే అదృష్టం మనకు దక్కిందన్నారు. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న పలు సంస్థలు సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను తీరుస్తున్నాయని ప్రధాని అన్నారు. ఆర్ఎస్ఎస్లో విభిన్న విభాగాలు ఉన్నప్పటికీ అవి ఎప్పుడూ ఘర్షణ పడలేదని, ఎందుకంటే సంస్థ లక్ష్యం కోసం అవన్నీ పనిచేస్తున్నాయని, ‘దేశం మొదట’ అనే దిశగా ఆర్ఎస్ఎస్ ముందుకు నడుస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రస్థానం1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. పౌరులలో సాంస్కృతిక అవగాహన, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడానికి ఏర్పడిన స్వచ్ఛంద సేవా సంస్థగా ఇది ప్రారంభమైంది. గత వందేళ్లలో ఆర్ఎస్ఎస్ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన సామాజిక-సాంస్కృతిక సంస్థలలో ఒకటిగా నిలిచింది. వరదలు, భూకంపాలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం అందించడంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. -
‘బీజేపీతో దోస్తీ కన్నా.. సీఎం పదవి వదిలేయడం నయం’
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో దోస్తి కట్టడం కంటే.. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటమే తనకు ఇష్టమని స్పష్టంచేశారు. తన ప్రభుత్వంలోకి బీజేపీని భాగస్వామిగా చేర్చుకుంటే.. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ ఆ పని చేయటం తనకు ఇష్టం లేదని ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.అనంత్నాగ్ జిల్లాలోని అచబల్లో మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘మీరు (ప్రజలను ఉద్దేశించి) సిద్ధమైతే చెప్పండి.. ఈ వ్యాపారం (బీజేపీతో పొత్తు) చేయటం నాకు ఇష్టంలేదు. బీజేపీని ప్రభుత్వంలోకి తీసుకోవటం అవసరమని మీరు అనుకుంటే ముందు నా రాజీనామాను ఆమోదించండి. మరో ఎమ్మెల్యే సీఎం అయ్యి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. బీజేపీతో పొత్తుకు నేను మాత్రం సిద్ధంగా లేను. మన ప్రభుత్వంలోకి బీజేపీని తీసుకొంటే మనకు ఒక బహుమతి లభించవచ్చు. వాళ్లు (కేంద్రం) మనకు త్వరలోనే రాష్ట్ర హోదా ప్రకటించవచ్చు’ అని పేర్కొన్నారు.ప్రభుత్వంలో కశ్మీర్కు మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్న వాదనను ఒమర్ అబ్దుల్లా తిరస్కరించారు. ‘ప్రభుత్వంలో పిర్పంజాల్కు ప్రాతినిధ్యం ఉంది. దిగువ జమ్ము ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం ఉంది. జమ్మూ నుంచి ఉపముఖ్యమంత్రి ఉన్నారు’ అని తెలిపారు. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను శాంతియుత, ప్రజాస్వామ్యయుత పోరాటాలతోనే సాధించుకుంటామని స్పష్టంచేశారు. -
నేడు ఆర్ఎస్ఎస్ శత వసంతాల వేడుక
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయవాద భావజాల వ్యాప్తి లక్ష్యంగా వందేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్రీ్టయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ 1న ఢిల్లీలో ఘనంగా జరగనున్నాయి. ఈ చరిత్రాత్మక వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని, ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానానికి గుర్తుగా తపాలా బిళ్ల, నాణేన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తారు. బ్రిటిష్ పాలనలో దేశ ప్రజల్లో జాతీయ భావాలను, క్రమశిక్షణను పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ 1925లో మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. -
గాజా ఘర్షణల అంతానికి పిలుపు.. ట్రంప్కు ప్రధాని మోదీ మద్దతు
న్యూఢిల్లీ: గాజా ఘర్షణలను అంతం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమగ్ర ప్రణాళిక ప్రకటించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. అధ్యక్షుడు ట్రంప్ చూపిన చొరవకు అందరూ మందుకువస్తారని, గాజాలో ఘర్షణలను అంతం చేసేందుకు, శాంతిని నెలకొల్పేందుకు మద్దతు పలుకుతారని తాను ఆశిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. We welcome President Donald J. Trump’s announcement of a comprehensive plan to end the Gaza conflict. It provides a viable pathway to long term and sustainable peace, security and development for the Palestinian and Israeli people, as also for the larger West Asian region. We…— Narendra Modi (@narendramodi) September 30, 2025ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పాటు గాజా ఘర్షణలను అంతం చేసేందుకు ట్రంప్ రూపొందించిన ప్రణాళికను వైట్ హౌస్ విడుదల చేసిన కొన్ని గంటలకు ప్రధాని మోదీ నుండి ఈ ప్రకటన విడుదలయ్యింది. అయితే అమెరికా ప్రభుత్వం రూపొందించిన ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ లేదా హమాస్ అంగీకరించాయా లేదా అనే దానిపై ఇప్పటివరూ సమచారమేదీ లేదు. అయితే ఇంతలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో యుద్ధాన్ని ముగించే ప్రణాళికకు అంగీకారం తెలిపారని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. కానీ హమాస్ ఈ నిబంధనలను అంగీకరిస్తుందా లేదా అనేది తెలియరాలేదు.ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల ముగింపునకు ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. బ్రిటిష్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్తో సారధ్యంలో యుద్ధ-బాధిత పాలస్తీనా భూభాగంలో తాత్కాలిక పాలక మండలిని ఏర్పాటు చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. ఈ ప్రణాళిక ప్రకారం ప్రజలు గాజాను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇరు వైపులా పరస్పర అంగీకారంతో యుద్ధాన్ని వెంటనే ముగించాలని ట్రంప్ ఆ ప్రణాళికలో పిలుపునిచ్చారు. ఈ ప్రణాళికను అంగీకరించిన 72 గంటల్లోపు హమాస్ తమ దగ్గరున్న ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయాలని కూడా ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించకపోతే ఇజ్రాయెల్కు యునైటెడ్ స్టేట్స్ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ హామీనిచ్చారు. పాలస్తీనా ప్రజలు వారి విధికి బాధ్యత వహించాలని, తమ శాంతి ప్రతిపాదనను స్వీకరించాలని కోరారు. -
నూతన సుపరిపాలన
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొట్టిపారేశారు. ప్రతిరోజూ అబద్ధాలు చెబుతూ, తమపై రాళ్లు విసురుతూ కాలం గడపడం తప్ప విపక్షాలకు ఇంకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఈ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ పాలనలో రూ.లక్ష ఖర్చు చేస్తే అందులో పన్నుల కింద రూ.25000 చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. అంటే ప్రతి రూ.లక్ష ఖర్చుపై రూ.20,000 చొప్పున ఆదా అయినట్లేనని స్పష్టంచేశారు.సుపరిపాలనలో నూతన మోడల్కు శ్రీకారం చుట్టామని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ సోమవారం ఢిల్లీ బీజేపీ శాఖ నూతన ప్రధాన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రజలకు చేరేలా చూడాలని బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ పాలనలోని హిమాచల్ ప్రదేశ్లో ధరలు తగ్గించడం లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రూ.2 లక్షల దాకా ఆదాయంపై పన్ను ఉండేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.12 లక్షల దాకా ఆదాయంపై పన్ను తొలగించామని, జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చామని, దీనివల్ల దేశ ప్రజలకు ప్రతిఏటా రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయని పునరుద్ఘాటించారు. కుంభకోణాల రహిత భారత్ ఎన్డీయే ప్రభుత్వం దేశానికి నూతన ‘సుశాసన్ మోడల్’ను ఇచి్చందని ప్రధాని మోదీ వివరించారు. అభివృద్ధితోపాటు దేశ రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కుంభకోణాల నుంచి దేశానికి విముక్తి కలి్పంచామని, అవినీతిపై నిర్ణయాత్మక యుద్ధం చేసేలా ఆత్మవిశ్వాసం పెంచామని వెల్లడించారు. స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యతను మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వదేశీ ఉత్పత్తులను విక్రయించేలా, కొనుగోలు చేసి ఉపయోగించుకొనేలా వ్యాపారులను, ప్రజలను ప్రోత్సహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యాలయాలు మాకు దేవాలయాలు బీజేపీకి అధికారం ముఖ్యం కాదని, ప్రజాసేవే పరమావధి అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయాలు తమకు దేవాలయాలతో సమానమని చెప్పారు. ఇక్కడికి వచ్చే ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ప్రజలను, వారి ఆకాంక్షలను అనుసంధానించే వేదికలుగా బీజేపీ ఆఫీసులు పనిచేస్తాయని పేర్కొన్నారు.దక్షిణ భారత శైలిలో బీజేపీ ఆఫీసుఢిల్లీలోని డీడీయూ మార్గ్లో ఐదు అంతుస్తుల భవనంలో బీజేపీ నగర నూతన కార్యాలయం ఏర్పాటైంది. దక్షిణ భారత శైలిలో ఆధునిక వసతులతో నిర్మించారు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ఆఫీసు పండిట్ పంత్ మార్గ్లో ఉంది. దీపావళి నాటికి కొత్త భవనంలోకి మారనుంది. 825 చదరపు మీటర్ల స్థలంలో పర్యావరణ హితంగా ఈ బిల్డింగ్ నిర్మించారు. ఇందులో 200 మంది కూర్చోవడానికి వీలైన ఆడిటోరియంతోపాటు గ్రంథాలయం కూడా ఉంది. శాశ్వత భవనం లేకపోవడంతో ఢిల్లీ బీజేపీ విభాగం చాలా భవనాల్లోకి మారాల్చి వచి్చంది. అనే ప్రయత్నాల తర్వాత శాశ్వత భవనం సమకూరడం పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేశారు. -
ఇది ఆమె "మన్ కీ బాత్"..! నారీ శక్తికి నిలువెత్తు నిదర్శనం..
భారత్, ఇటలీ ప్రధానులు నరేంద్రమోదీ, జార్జియా మెలోనీ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆమె ఆత్మకతకు ముందు మాట రాశారు. అందులో ఇటలీ ప్రధాని మెలోని జీవితం ఎప్పుడూ రాజకీయాలు, అధికారం గురించి కాదు అంటూ పలు ఆసక్తి కర విషయాలు వెల్లండించారు. ఒకరి ఆత్మకథలో ముందుమాట ఇంత అద్భుతంగా ఉంటుందా అనేలా..మెలోని గురించి చాలా చక్కగా వివరించారు ప్రధాని మోదీ. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..!‘ఐ యామ్ జార్జియా: మై రూట్స్, మై ప్రిన్సిపల్స్(I Am Giorgia — My Roots, My Principles)’ పేరిట రాసిన మెలోనీ ఆత్మకథ ఇండియన్ ఎడిషన్ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనిని ‘హర్ మన్కీ బాత్’ అని అభివర్ణించిన ప్రధాని మోదీ.. ముందుమాట రాశారు. అది తనకు దక్కిన గొప్ప గౌరవం అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘పీఎం మెలోనీ జీవితం, నాయకత్వం అధికారం గురించి కాదని అన్నారు. నిశితంగా చూస్తే అడగడుగున ధైర్యం దృఢనిశ్చయం ప్రజాసేవ పట్ల నిబద్ధత ప్రస్పుటంగా కనిపిస్తాయని చెప్పారు. నాయకురాలిగా ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం, చారిత్రాత్మకమైనదని అన్నారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడూ కూడా రాజకీయ విశ్లేషకులు సందేహాస్పదంగా ఉన్నారు. అయితే ఆమె నాయకురాలిగా తన బలం, స్థిరత్వాన్ని అందించారన్నారు. అంతేగాదు ఎల్లప్పుడూ ప్రపంచ వేదికపై ఇటలీ ప్రయోజనాలను అద్భుతమైన స్పష్టతతో వినిపించింది. ఆమె ఎదుగుదల, నాయకత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి చాలా మార్గాలు ఉన్నాయన్నారు. అయితే తాను భారతీయ సంప్రదాయంలో అనే రూపాల్లో గౌరవించబడుతున్న దైవిక స్త్రీ శక్తి, నారీ శక్తి భావనలతో సరిపోలుస్తానన్నారు. ప్రధాని మెలోనీ ప్రపంచం వేదికపై తన దేశాన్ని నడిపిస్తూ..తన మూలలను మరవలేదు. అందుకే ఆమె రాజకీయ ప్రస్థానం భారతదేశంతో లోతుగా ప్రతిధ్వనిస్తుందని అన్నారు. రోమ్లోని ఓ సాదాసీదా పొరుగు ప్రాంతం నుంచి ఇటలీ అత్యున్నత రాజకీయ పదవిని అధిరోహించేంత వరకు సాగిన రాజకీయ ప్రస్థానం...ఆమె శక్తిని హైలెట్ చేస్తోంది. అంతేగాదు మాతృత్వం, జాతీయ గుర్తింపు, సంప్రదాయాన్ని రక్షించాలనే ఉద్దేశ్యం తదితరాలు భారత పాఠకులతో ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. అలాగే ప్రపంచంతో నిమగ్నమవుతూనే సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించుకోవడానికి పడుతున్న ఆరాటం, తపన.. ఆమె వ్యక్తిగత నమ్మకాలు, విలువలకు నిదర్శనమని అన్నారు. పైగా ఆమెకు ప్రజల పట్ల ఉన్న అపారమైన కరుణ, బాధ్యత తోపాటు శాంతిమార్గంలో నడిపించాలనే ఆలోచనలు ఈ పుస్తకం అంతటా ప్రతిధ్వనిస్తాయి అని రాసుకొచ్చారు మోదీ.వాస్తవానికి ఈ బుక్ అసలు వెర్షన్ 2021లోనే పబ్లిష్ అయి, బెస్ట్ సెల్లర్గా నిలిచింది. అప్పుడు మెలోనీ (Giorgia Meloni) విపక్షంలో ఉన్నారు. 2025, జూన్లో దీనిని అమెరికాలో విడుదల చేశారు. అప్పుడు దానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ముందుమాట రాశారు. కాగా.. మోదీ, మెలోనీలు దిగిన ఫొటోలు ఎప్పుడూ నెట్టింట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్న సంగతి తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్ 28’ సదస్సు సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని మెలోని ఎక్స్లో షేర్ చేశారు. దానికి మెలోడీ (ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా) అనే హ్యాష్ట్యాగ్ను జత చేశారు. అప్పటినుంచి ఈ #Melodi పదం ట్రెండ్ అయ్యింది.(చదవండి: వండర్ బామ్మ..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్) -
ప్రధాని మోదీ ట్వీట్ పై PCB చీఫ్ మోషిన్ నఖ్వీ అక్కసు
-
పాకిస్తాన్పై భారత్ విజయం.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
ఢిల్లీ: ఆసియా కప్ ఫైనల్ (Asia Cup Final 2025)లో దాయాది పాకిస్తాన్ను భారత్ (Team India) మరోసారి మట్టికరిపించింది. ఫైనల్ అద్భుతంగా ఆడి.. టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొమ్మిదోసారి ఆసియా కప్ను సొంతం చేసుకుంది. భారత్ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. భారత క్రికెటర్లపై ప్రశంసలు కురిపించారు.ఆసియా కప్లో భారత్ విజయంపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒక్కటే ఫలితం అని పేర్కొన్నారు. మైదానంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. భారత్ మళ్లీ గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు అని పోస్టు చేశారు.#OperationSindoor on the games field. Outcome is the same - India wins!Congrats to our cricketers.— Narendra Modi (@narendramodi) September 28, 2025ఇక, పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్(India vs Pakistan) ఫైనల్ ఉత్కంఠ పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించడంతో భారతీయులు సంబురాలు చేసుకున్నారు. భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. భారత క్రికెటర్ తిలక్ వర్మ.. ‘ఆపరేషన్ తిలక్’తో దాయాదిని చిత్తు చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. After Operation Sindoor... it was Operation Tilak 🇮🇳Battlefield or cricket field - India’s victory over Pakistan comes every time... pic.twitter.com/zGu4vkZMcN— PoliticsSolitics (@IamPolSol) September 28, 2025 -
పండుగలకు స్వదేశీ శోభ
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ ఉత్పత్తులతో పండుగలకు కొత్త శోభ తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వదేశీ స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని, స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేసి ‘వోకల్ ఫర్ లోకల్’ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 126వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. రానున్న పండుగల వేళ స్వదేశీ వస్తువులనే ఉపయోగించుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర సమరయోధుడు షహీద్ భగత్ సింగ్, గానకోకిల లతా మంగేష్కర్లకు వారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సేవలను ప్రధానమంత్రి కొనియాడారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘వోకల్ ఫర్ లోకల్’కు పెద్దపీట అన్ని రంగాల్లో మనం స్వయం సమృద్ధి సాధించాలి. ఆత్మనిర్భరతే మన మంత్రం. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క ఖాదీ ఉత్పత్తి అయినా కొనుగోలు చేసి ధరించాలి. ఇది స్వదేశీ ఉత్పత్తి అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలి. గత 11 ఏళ్లలో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరగడం మన ఆత్మనిర్భరతకు నిదర్శనం. యువ పారిశ్రామికవేత్తలు సంప్రదాయ నైపుణ్యాలకు ఆధునికతను జోడించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఛట్ మహాపర్వ్కు అంతర్జాతీయ గుర్తింపు! రాబోయే ఛట్ పూజ, విజయదశమి, దీపావళి పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కోల్కతా దుర్గా పూజ మాదిరిగా ఛట్ మహాపర్వ్ను కూడా యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్పించేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. తద్వారా ఈ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. పండుగల సమయంలో ప్రతి ఒక్కరూ కేవలం స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలి. తద్వారా స్థానిక చేతివృత్తుల వారికి, పారిశ్రామికవేత్తలకు చేయూతనివ్వాలి. భగత్సింగ్, లతా మంగేష్కర్కు నివాళులు ఈ రోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతి. ఒకరు షహీద్ భగత్ సింగ్, మరొకరు మనందరి ప్రియమైన లతా దీదీ. భగత్ సింగ్ గుండెనిబ్బరం, ధైర్యసాహసాలు, దేశభక్తి మన యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఉరిశిక్షకు ముందు కూడా తనను, తన సహచరులను యుద్ధ ఖైదీలుగా పరిగణించి, తుపాకీతో కాల్చి చంపాలని బ్రిటిష్ వారికి లేఖ రాయడం భగత్సింగ్ అకుంఠిత ధైర్యానికి నిదర్శనం. లతా మంగేష్కర్ పాటలు భారతీయ సంస్కృతి, సంగీతానికి జీవనాడి. దేశభక్తి గీతాలతో ప్రజల్లో ఆమె ఎంతో స్ఫూర్తిని రగిలించారు. సంఘ్ వందేళ్ల ప్రయాణం స్ఫూర్తిదాయకం రానున్న విజయదశమి నాటికి రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను స్థాపించి 100 ఏళ్లు పూర్తి కానుండడం చాలా ప్రత్యేకం. నిస్వార్థ సేవ, క్రమశిక్షణ సంఘ్ అసలైన బలాలు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు దేశమే ప్రథమం. దేశ సేవకే వారు తొలి ప్రాధాన్యం ఇస్తారు. సంఘ్ వందేళ్ల ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. Sharing this month's #MannKiBaat. Do hear!https://t.co/oKMc16cIzt— Narendra Modi (@narendramodi) September 28, 2025సాహస నారీమణుల సముద్ర యానం భారత నౌకాదళానికి చెందిన ఇద్దరు సాహస మహిళా ఆఫీసర్లతో ప్రధానమంత్రి ఫోన్లో మాట్లాడారు. లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూప.. వీరిద్దరూ తెరచాప పడవపై సముద్రంలో ఎనిమిది నెలల పాటు ఏకధాటిగా 47,500 కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచాన్ని చుట్టివచ్చారు. ‘నావిక సాగర్ పరిక్రమ’ యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. ‘‘ఈ యాత్ర మా జీవితాలను మార్చేసింది. 238 రోజుల పాటు మేమిద్దరమే పడవలో ఉన్నాం. మూడు అంతస్తుల భవనం అంత ఎత్తున ఎగసిపడే అలలను, అంటార్కిటికా వద్ద 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను, గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకున్నాం’’ అని వారు తమ అనుభవాలను మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు. వారి సాహసాన్ని, టీమ్వర్క్ను ప్రధానమంత్రి అభినందించారు. -
రూ.1,243 కోట్లతో తిరుపతి ఐఐటీ అభివృద్ధి
ఏర్పేడు: తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్లో రూ.1,243 కోట్లతో చేపట్టిన ఫేజ్–బి అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్గా ప్రారంభించారు. మొత్తం రూ.60 వేల కోట్లతో ఎనిమిది ఐఐటీలతోపాటు, వివిధ రాష్ట్రాల అభివృద్ధి పనులకు ఒడిశా రాష్ట్రం ఝార్సుగూడ నుంచి ఆయన వర్చువల్గా శ్రీకారం చుట్టారు. తిరుపతిలో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి హాజరై ఐఐటీ యాజమాన్యం, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఐఐటీల్లో తిరుపతి ఐఐటీ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సెమీకండక్టర్లు, శక్తి నిల్వ వంటి రంగాలలో జరుగుతున్న ముఖ్యమైన పరిశోధన కార్యకలాపాల గురించి వివరించారు. ఇక్కడ భవన నిర్మాణాలు మాత్రమే జరగటంలేదని, యువత ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం జరుగుతోందన్నారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఐఐటీ కేంద్ర బిందువుగా మారుతుందన్నారు. రెండో దశలో 2,500 మందికి పైగా విద్యార్థులకు ఇక్కడ ఉన్నతస్థాయి వసతులు సమకూరుతాయన్నారు.ఈ ప్రాంత రైతుల పంట ఉత్పత్తులకు ప్రోత్సాహకంగా తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పడం సంతోషకరమన్నారు. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ దార్శనికతతో తిరుపతి ఐఐటీ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఫేజ్–బిలో కలి్పంచే సదుపాయాలివే..తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. రూ.1,243 కోట్ల ఫేజ్–బి నిధులతో ఈ ఐఐటీలో మూడు అకడమిక్ బ్లాక్స్, ఒక మెగా ఇండోర్ ఆడిటోరియం, ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ సదుపాయాలు రాబోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ క్యాంపస్లో 1,800 మందికి వసతి సదుపాయం ఉందని, ఈ ఫేజ్–బి పనులు 2029కల్లా పూర్తిచేయగలిగితే మరో 2,650 మంది విద్యార్థులకు వసతి కలగనుందని తెలిపారు. ఐఐటీ ఇన్చార్జి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీన్ ఎ. మురళీకృష్ణ పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిర్మాణ ప్లానింగ్ను వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీడబ్ల్యూసీ ఈడీ, ప్రాజెక్టు ఇన్చార్జి బీఎస్ రెడ్డి, బ్రిగేడియర్ డాక్టర్ కృష్ణకుమార్, ఐఐటీ రిజి్రస్టార్లు తదితరులు పాల్గొన్నారు. -
విజయ్ సభలో తొక్కిసలాట ఘటన.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటనగా పేర్కొన్న మోదీ.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు. The unfortunate incident during a political rally in Karur, Tamil Nadu, is deeply saddening. My thoughts are with the families who have lost their loved ones. Wishing strength to them in this difficult time. Praying for a swift recovery to all those injured.— Narendra Modi (@narendramodi) September 27, 2025 తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఘటనపై కరూర్ కలెక్టర్తో సీఎం స్టాలిన్ మాట్లాడారు. రేపు బాధిత కుటుంబాలను స్టాలిన్ పరామర్శించనున్నారు. కాగా, విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరూర్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. విజయ్ సభలో తీవ్ర తోపులాట చోటుచేసుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కరూర్లో నిర్వహించిన విజయ్ ప్రచార సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. 10వేల మందికి మాత్రమే అనుమతి తీసుకున్న విజయ్ సభకు భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. -
ఆదా.. ఆదాయం డబుల్
ఝార్సుగూడ: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా లూటీ జరిగిందని, జనం సొమ్మును ఆ పార్టీ దోచుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. తక్కువ ఆదాయం కలిగిన వర్గాల నుంచి కూడా భారీగా పన్నులు వసూలు చేసిందని ఆరోపించారు. లూటీ సంస్కృతి నుంచి దేశాన్ని బీజేపీ కాపాడుతోందని అన్నారు. ప్రధాని మోదీ శనివారం ఒడిశాలో పర్యటించారు. రూ.50 వేల కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ‘అంత్యోదయ గృహ యోజన’ కింద 50 వేల మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ఝార్సుగూడ్లో ‘నమో యువ సమావేశ్’లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను తొలగించడంతోపాటు జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు డబుల్ బచత్(ఆదా), డబుల్ కమాయి(ఆదాయం) కల్పించడానికి బీజేపీ చర్యలు చేపట్టిందని వివరించారు. కాంగ్రెస్ పాలనలో రూ.2 లక్షల ఆదాయంపైనా పన్ను విధించారని గుర్తుచేశారు. అప్పటి పన్నుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించామని చెప్పారు. ఆదాయం పెంచుకొని, డబ్బులు ఆదాయ చేసుకొనే కొత్త శకం ఇప్పుడు ఆరంభమైందన్నారు. గతంలో రూ.లక్ష ఖర్చు చేస్తే అందులో రూ.25 వేల పన్నులే ఉండేవని, ఇప్పుడు ఆ పన్నులు రూ.5 వేలకు పడిపోయాయని తెలిపారు. అంటే ప్రజలకు రూ.20 వేలు ఆదా అయినట్లేనని స్పష్టంచేశారు. VIDEO | Odisha: Addressing a public gathering in Jharsuguda, Prime Minister Narendra Modi (@narendramodi) says, "From today, we will witness a new avatar of BSNL with the launch of its Swadeshi 4G services. The expansion of IITs in different parts of the country has also begun… pic.twitter.com/VeWwbdAYlp— Press Trust of India (@PTI_News) September 27, 2025చిప్ నుంచి షిప్ దాకా... తమ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో రైతులు ఎంతగానో లబ్ధి పొందుతున్నారని ప్రధానమంత్రి ఆనందం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో ట్రాక్టర్ కొంటే పన్ను కింద రూ.70 వేలు చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు కేవలం రూ.40 వేలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. వ్యవసాయ పరికారాల ధరలు భారీగా తగ్గిపోయానని గుర్తుచేశారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. వారి జీవితాలను మరింత మెరుగుపర్చాలన్నదే తమ ధ్యేయమని ప్రకటించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావడంతో ఒడిశా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా పేదరికానికి మారుపేరైన ఒడిశా ఇప్పుడు సౌభాగ్యవంతంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఆవశ్యకతను ప్రధానమంత్రి వివరించారు. చిప్ నుంచి షిప్ దాకా అన్నింటికా మనం స్వయం సమృద్ధి సాధించాలని, అదే మన సంకల్పమని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 📡LIVE Now 📡Prime Minister @narendramodi lays foundation stone, inaugurates development works in Jharsuguda, #OdishaWatch on #PIB's 📺➡️Facebook: https://t.co/ykJcYlNrjj➡️YouTube: https://t.co/RPPyBdj887https://t.co/kXZ9QMhxdE— PIB India (@PIB_India) September 27, 2025రూ.11 వేల కోట్లతో 8 ఐఐటీల విస్తరణ ఒడిశాలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇందులో టెలికమ్యూనికేషన్లు, రైల్వేలు, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ గృహ నిర్మాణం తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. రూ.11 వేల కోట్లతో ఎనిమిది ఐఐటీల విస్తరణకు మోదీ శంకుస్థాపన చేశారు. ఐఐటీ–భువనేశ్వర్ భాగస్వామ్యంతో సెమీకండక్టర్ పార్కు నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో నాణ్యత పెంచడానికి ‘మెరిట్’ పథకాన్ని ప్రారంభించారు. ఒడిశా నుంచి గుజరాత్కు ప్రయాణించే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపారు. -
వర్చువల్ గా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మహిళా సాధికారతకు కృషి
పట్నా: బిహార్లో మహిళా సాధికారత కోసం ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శుక్రవారం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ పథకం 75 లక్షల మంది పేద మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున బదిలీ చేశారు. రూ.7,500 కోట్లతో ఈ పథకానికి బిహార్లోని ఎన్డీయే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 75 లక్షల మంది లబి్ధదారులకు త్వరలో అదనంగా రూ.2 లక్షల చొప్పున అందజేయబోతున్నామని ప్రధాని వెల్లడించారు. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. వారు స్వయం ఉపాధి పొందవచ్చని సూచించారు. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. బిహార్ మహిళల ప్రగతి కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలకమైన అడుగు ముందుకు వేసిందని అన్నారు. మన అక్కచెల్లెమ్మలు, ఆడబిడ్డలు ఉద్యోగాలు సంపాదిస్తే, స్వయం ఉపాధి పొందితే వారి కలలకు రెక్కలొచ్చినట్లేనని చెప్పారు. సమాజంలో వారి గౌరవం మరింత పెరుగుతుందని ఉద్ఘాటించారు. 11 ఏళ్ల క్రితం తాము తీసుకున్న ‘జన్ధన్ ఖాతాల’ సంకల్పం వల్లే ఈరోజు 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైందని వివరించారు. మహిళలకు ఇద్దరు సోదరులు బిహార్ మహిళలకు నితీశ్ కుమార్, నరేంద్ర మోదీ అనే ఇద్దరు సోదరులు ఉన్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తమ సోదరీమణుల బాగు కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకాన్ని ఈ రోజు ప్రారంభించడం పట్ల గరి్వస్తున్నానని స్పష్టంచేశారు. ఇటీవలే ప్రారంభించిన ‘జీవిక నిధి సఖ్ సహకారి సంఘ్’ను ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనతో అనుసంధానిస్తామని ప్రకటించారు. పీఎం ఉజ్వల యోజన, ఉచిత రేషన్ సరుకుల పంపిణీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో 8.5 కోట్ల మంది బిహారీల జీవితాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను లఖ్పతీ దీదీలుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఇప్పటికే 2 కోట్ల మందికిపైగా మహిళలు లఖ్పతీ దీదీలుగా మారారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. -
నాటో చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా వ్యూహం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధినేత పుతిన్కు ఫోన్చేసి ఆరా తీశారంటూ నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ రుటే చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం ఖండించారు. రుటే వ్యాఖ్యలు ఆధారరహితం అని తేల్చిచెప్పారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహం పట్ల మోదీ ఆసక్తి కనబర్చారని, ఇటీవల పుతిన్కు ఫోన్ చేసి ఆరా తీశారని మార్క్ రుటే చెప్పడం సంచలనం సృష్టించింది. జరగని సంభాషణ జరిగినట్లు మార్క్ రుటే ప్రకటించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రణ«దీర్ జైస్వాల్ అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని రుటేకు హితవు పలికారు. ఉక్రెయిన్పై రష్యా వ్యూహం గురించి మోదీ తెలుసుకోలేదని స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు కొంటూనే ఉంటామని ఉద్ఘాటించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వద్దని సూచించారు. రష్యా నుంచి పశ్చిమ దేశాలు కూడా ముడి చమురు కొంటున్నాయని రణ«దీర్ జైస్వాల్ పరోక్షంగా గుర్తుచేశారు. -
ప్రధాని మోదీకి సాదర స్వాగతం : ఎవరీ ఐఏఎస్ అధికారి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారం అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా సివిల్ సర్వీస్ అధికారి విశాఖా యాదవ్ (Vishakha Yadav) ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రంలోని పాపుమ్ పరే జిల్లాలో పర్యటన ఐఏఎస్ అధికారి విశాఖా యాదవ్ప్రధాని మోదీకి స్వాగతం పలికిన దృశ్యాలు నెట్టింటసందడిగా మారాయి. దీంతో ఆ ఆఫీసర్ ఎవరు? ఏంటి? అనే ఆసక్తి మొదలైంది.అరుణాచల్లోని పాపుమ్ పరే జిల్లాలో డిప్యూటీ కమీషనర్గా పనిచేస్తున్నారు విశాఖా యాదవ్. ప్రధాని మోదీకి గ్రీటింగ్స్ చెబుతున్న ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మోదీకి వెల్కమ్ చెప్పడం గర్వంగా ఉందంటూ తన పోస్ట్లో పేర్కొన్నారు.ఎవరీ విశాఖా యాదవ్?విశాఖ యాదవ్ ఢిల్లీ నివాసి. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU)లో ఇంజనీరింగ్ చదివిన తర్వాత, ఆమె బెంగళూరులోని సిస్కోలో పనిచేశారు.కానీ ఆమె కల IAS అధికారిణి కావడమే. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారిణి. ప్రస్తుతం ఆమె అరుణాచల్ ప్రదేశ్లోని పాపుం పరే జిల్లాలో డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. తన కలను సాకారం చేసుకునేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) పరీక్షకు సిద్ధం కావడానికి విశాఖ యాదవ్ లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఎలాంటి కోచింగ్ లేకుండా సివిల్ సర్వీసెస్ పరీక్షలో సాధించారు. మూడో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో ఆరవ ర్యాంకును సాధించారు.UPSC పరీక్షలో 2,025 మార్కులకు 1,046 మార్కులు సాధించారు. 1994లో ఢిల్లీలో జన్మించిన ఆమె తండ్రి రాజ్కుమార్ యాదవ్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ కాగా, ఆమె తల్లి గృహిణి. -
ట్రంప్ ఎఫెక్ట్.. పుతిన్తో మోదీ చర్చలు: నాటో అధికారి కీలక వ్యాఖ్యలు
వాష్టింగన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) విధిస్తున్న టారిఫ్ల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్తో రష్యా యుద్దం విషయమై పుతిన్తో భారత ప్రధాని మోదీ(Narendra Modi) చర్చలు జరిపారని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటె వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల ఎఫెక్ట్ వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చారు.న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నాటో(NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ..‘భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. పుతిన్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహాన్ని వివరించాలని మోదీ కోరారు. రెండు దేశాల మధ్య యుద్ధం గురించి ఆరా తీశారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్పై సుంకాల భారం పడటంతో పుతిన్తో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి అడిగి తెలుసుకున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే, ఆయన వ్యాఖ్యలపై భారత్ స్పందించలేదు. "Delhi is on phone with Vladimir Putin in Moscow, & Narendra Modi asking, hey I support you but could you explain to me the strategy bcz I have been hit with 50% tariffs. Prez Trump is implementing what he says"NATO Secretary-General Mark Ruttepic.twitter.com/63cEh4CxNZ— Sidhant Sibal (@sidhant) September 26, 2025ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు(Impose New Tariffs). బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్లు విధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ చర్యలు అమెరికాలో తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా ట్రంప్ పేర్కొన్నారు. అప్హోస్టర్డ్ ఫర్నిచర్పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రాండెడ్ , పేటెంటెడ్ డ్రగ్స్పై(pharmaceutical products) ఏకంగా 100 శాతం విధిస్తామని స్పష్టం చేశారు. అయితే.. అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించదన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ తెలిపారు. -
జీఎస్టీ సంస్కరణలు ఆగవు..!
గ్రేటర్ నోయిడా/న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో సంస్కరణలు ఇకపైనా కొనసాగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రజలపై పన్నుల భారం మరింత తగ్గుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటుందని అన్నారు. జీఎస్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక రంగానికి కొత్త రెక్కలు తొడుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సంస్కరణల విషయంలో బలమైన సంకల్ప శక్తి మనకు ఉందని ఉద్ఘాటించారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజకీయ స్థిరత్వం కొనసాగుతుండడం సానుకూల అంశాలని వివరించారు.గురువారం ఉత్తరప్రదేశ్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో–2025ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ ప్రభుత్వం పన్నుల భారాన్ని క్రమంగా తగ్గిస్తోందని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తోందని అన్నారు. జీఓస్టీలో ఇటీవలే కొత్త సంస్కరణలు తీసుకొచ్చామని, దీనివల్ల దేశ ప్రజలకు ఈ ఏడాది రూ.రెండున్నర లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు. నేడు దేశమంతా ‘జీఎస్టీ ఆదా ఉత్సవాన్ని’ గర్వంగా నిర్వహించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇది ఇక్కడితో ఆగదని, ప్రజల ఆశీస్సులతో జీఎస్టీలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... అవరోధాలే మనకు కొత్త దారులు ‘‘గత ప్రభుత్వాలు పాలనలో విఫలమయ్యాయి. అప్పటి నిర్వాకాలను కప్పిపుచ్చుకోవడానికి మా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో సామాన్య ప్రజలపై విపరీతంగా పన్నులు విధించారు. ట్యాక్స్ లూటీ జరిగింది. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 2047 నాటికి ‘పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్’ మన లక్ష్యం. ఆ దిశగానే దేశం పరుగులు తీస్తోంది. అంతర్జాతీయంగా పలు సవాళ్లు, అవరోధాలు ఉన్నప్పటికీ మన దేశం ఆకర్శణీయమైన ప్రగతి సాధిస్తోంది. అవరోధాలు మనకు అడ్డంకి కాదు. అవే మనకు కొత్త దారులు చూపిస్తున్నాయి.రాబోయే దశాబ్దాల కోసం ఇప్పుడే బలమైన పునాది వేస్తున్నాం. మన సంకల్పం ఆత్మనిర్భర్ భారత్. మన అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడడం కంటే నిస్సహాయత ఇంకేమైనా ఉంటుందా? రోజురోజుకీ మారుతున్న నేటి ప్రపంచంలో ఇతర దేశాలపై ఆధారపడితే అభివృద్ధి విషయంలో మనం రాజీపడాల్సి వస్తుంది. అందుకే మనం స్వయం సమృద్ధి సాధించాలి. మనం వాడుకొనే ప్రతి వస్తువూ ఇక్కడే తయారు కావాలి. మేడ్ ఇన్ ఇండియా సరుకులే మనం కొనుగోలు చేయాలి. రష్యాతో స్నేహబంధం బలోపేతం రష్యాతో మన స్నేహబంధం కాలపరీక్షకు నిలిచింది. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం అవిచి్ఛన్నంగా కొనసాగుతోంది. ఈసారి ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో రష్యా సైతం భాగస్వామి. ఈ కార్యక్రమం ద్వారా రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటాం. రష్యా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో ఏకే–203 రైఫిళ్ల తయారీ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఉత్తరప్రదేశ్లో డిఫెన్స్ కారిడార్ను అభివృద్ధి చేస్తున్నాం.ఇక్కడ బ్రహ్మోస్ క్షిపణులు, ఆయుధ వ్యవస్థల తయారీ ఇప్పటికే ప్రారంభమైంది. దేశంలో స్వావలంబనను బలోపేతం చేసే విధానాలు రూపొందించాలని వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను కోరుతున్నా. సైనిక దళాలకు అవసరమైన ఆయుధాలు, రక్షణ వ్యవస్థల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలి. మనకు కావాల్సినవి మన దేశంలోనే తయారు చేసుకుందాం. సైన్యం వాడుకొనే వస్తువులు, ఆయుధాలపై మేడ్ ఇన్ ఇండియా ముద్ర ఉండాల్సిందే’’ అని ప్రధాని మోదీ వివరించారు. ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టండిభారత ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టా లని అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు మోదీ చెప్పారు. దేశంలో ఈ రంగంలో వ్యాపారాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గత పదేళ్లుగా తమ ప్రభుత్వం ఆహార శుద్ధి రంగాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తి అనుసంధాన పథకాలు ప్రవేశపెట్టామని, మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటివల్ల ఆహార శుద్ధి సామర్థ్యం 20 రెట్లు పెరిగిందని, ఎగుమతులు రెండు రెట్లు పెరిగాయని ఉద్ఘాటించారు. గురువారం ఢిల్లీలో ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ నాలుగో ఎడిషన్ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. శుద్ధి చేసిన ఆహారాన్ని నిల్వ చేయడానికి పర్యావరణహిత బయో డిగ్రేడబుల్ ప్యాకేజింగ్ తయారీలో సైతం పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. విద్యుత్ ఉత్పత్తి అత్యవసరం విద్యుత్ ఉత్పత్తి ప్రాధాన్యతను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. 21వ శతాబ్దంలో ఏ దేశమైనా వేగంగా ప్రగతి సాధించాలంటే విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడం అత్యవసరమని స్పష్టంచేశారు. గురువారం రాజస్తాన్లోని బనస్వర జిల్లాలో ఆయన పర్యటించారు. రూ.1.22 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.42,000 కోట్లతో నిర్మించనున్న అణు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ సందర్భంగా బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.కాంగ్రెస్ పాలనలో విచ్చలవిడిగా విద్యుత్ ఉండేదని, గ్రామాల్లో కనీసం ఐదు గంటలు కూడా కరెంటు సరఫరా అయ్యేది కాదని చెప్పారు. తగినంత విద్యుత్ లేకపోవడంతో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాలేదన్నారు. తమ ప్రభుత్వం వచి్చన తర్వాత విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. నేడు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికీ విద్యుత్ సరఫరా అవుతోందని, ప్రజల జీవనం సులభతరంగా మారిందని అన్నారు. క్లీన్ ఎనర్జీలో ముందంజలో ఉన్న దేశాలు విజయవంతమైన దేశాలుగా కీర్తినందుకుంటాయని స్పష్టంచేశారు. బనస్వర జిల్లాలో ‘పీఎం–కుసుమ్’ పథకం లబ్ధిదారులతో ప్రధాని మోదీ సంభాషించారు. రైతుల అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. నేడు బిహార్ పథకం ప్రారంభం బిహార్కు సంబంధించిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ను మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున బదిలీ చేస్తారు. మొత్తం రూ.7,500 కోట్లు విడుదల చేయబోతున్నారు. మహిళల సాధికారత, స్వావలంబనే లక్ష్యమని బిహార్ ప్రభుత్వం వెల్లడించింది. -
దోపిడీని అరికట్టామనే కాంగ్రెస్కు కోపం: ప్రధాని మోదీ
బన్స్వారా: ‘11 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు ఎలా ఉండేవో మీకు తెలుసు. పౌరులను దోపిడీ చేయడంలో కాంగ్రెస్ బిజీగా ఉండేది. వారు దేశ ప్రజలను దోచుకున్నారు. నాటి రోజుల్లో పన్నులు, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ దోపిడీని అడ్డుకుంది. వారి కోపానికి కారణం కూడా ఇదే. 2017లో మేము జీఎస్టీని తీసుకువచ్చాం. దేశాన్ని పన్నులు, టోల్ సంకెళ్ల నుండి విముక్తి చేశాం. ఇప్పుడు, నవరాత్రి తొలి రోజున జీఎస్టీ సంస్కరణలు అమలయ్యాయి. దేశం ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ జరుపుకుంటోంది’ అని ప్రధాని మోదీ రాజస్థాన్లోని బన్స్వారాలో జరిగిన బహిరంగ ర్యాలీలో పేర్కొన్నారు.గురువారం రాజస్థాన్లో పర్యటించిన ప్రధానిమోదీ రూ.1,22,100 విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. బన్స్వారాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘విద్యుత్ ప్రాముఖ్యతను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదు. 2014లో నాకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు, దేశంలో 2.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేదు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా, 18 వేల గ్రామాలలో ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్లు లేవు. ప్రధాన నగరాలు గంటల తరబడి విద్యుత్ కోతలను ఎదుర్కొన్నాయి. గ్రామాల్లో 4-5 గంటల విద్యుత్ సరఫరాతో రోజు గడిచేది. 2014లో మా ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకుంది. భారతదేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ అందించాం. మేము 2.5 కోట్ల ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. నవరాత్రులలోని 4వ రోజున మాతా త్రిపుర సుందరి భూమి అయిన బన్స్వరానికి వచ్చే అవకాశం లభించింది. అమ్మవారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను’ అని అన్నారు. #WATCH | Rajasthan | Addressing a public rally in Banswara, PM Modi says, "... 2014 ke pehle ki baat kar raha hoon. Yeh jo Bayaan-bahadur bhanti bhanti ke jhooth phaila rahe hain. Congress Sarkar 100 rupay ki khareed pa 31 rupay tax leti thi...""You may remember, 11 years ago,… pic.twitter.com/69UqdS0P4W— ANI (@ANI) September 25, 2025ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో జరిగే ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 25 నుండి 29 వరకు జరగనుంది. దీనిలో ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక, వ్యవసాయ, సాంస్కృతిక, ఆవిష్కరణలు ప్రదర్శితం కానున్నాయి. అనంతరం ప్రధాని మోదీ రాజస్థాన్ను సందర్శించి, బన్స్వారాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. పీఎం కుసుమ్ లబ్ధిదారులతో కూడా ఆయన సంభాషించారు. రూ.42,000 కోట్ల విలువైన అణుశక్తి విద్యుత్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది దేశంలోని భారీ అణు విద్యుత్ కేంద్రాలలో ఒకటిగా నలిచిపోనుంది. -
జీఎస్టీ ఇంకా తగ్గిస్తాం: యూపీ వేదికపై మోదీ ప్రకటన
జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో నిత్యావసర వస్తువులు, ఔషధాల ధరలు మాత్రమే కాకుండా.. కార్లు, ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా తగ్గాయి. ఈ పన్నులు భవిష్యత్తులో మరింత తగ్గుతాయని దేశ ప్రధాని వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2025 కార్యక్రమంలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2025కు రష్యా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో నరేంద్ర మోదీ.. రష్యా, భారత్ బంధం గురించి కూడా ప్రస్తావించారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తిని పెంచడంలో ఉత్తరప్రదేశ్ గణనీయమైన పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. రష్యా సహకారంతో ఏర్పాటు చేసిన కర్మాగారంలో ఏకే-203 రైఫిల్స్ ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు.భారతదేశ స్వయం సమృద్ధిలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా ఉంది. దేశంలో తయారవుతున్న మొత్తం ఫోన్లలో 50 శాతం కంటే ఎక్కువ యూపీ నుంచే వస్తున్నాయి. అంతే కాకుండా మన దేశంలోనే అన్నింటిని ఉత్పత్తి చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లో ఒక రక్షణ కారిడార్ను అభివృద్ధి చేస్తున్నామని, అక్కడ బ్రహ్మోస్ క్షిపణులు, ఇతర ఆయుధ వ్యవస్థల తయారీ ఇప్పటికే ప్రారంభమైందని మోదీ వెల్లడించారు.ఇదీ చదవండి: 'జీఎస్టీ తగ్గినా.. ధరలు తగ్గలేదు': ఫిర్యాదులపై స్పందించిన కేంద్రంపన్నులను తగ్గిస్తూనే ఉంటాముజీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను కూడా ఈ సందర్భంగా మోదీ హైలైట్ చేశారు. కొత్త జీఎస్టీ అమలులోకి రావడంతో.. సాధారణ కుటుంబాలు ప్రతినెలా కొంత ఎక్కువ పొదుపు చేసుకోగలుగుతారని అన్నారు. కాగా జీఎస్టీ సంస్కరణల ప్రచారంపై కాంగ్రెస్ విమర్శలు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే.. పన్నులను తగ్గిస్తూనే ఉంటాము. జీఎస్టీ సంస్కరణల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన అన్నారు. -
ముస్లింల స్థలాలను లాక్కోవడానికే వక్ఫ్ చట్టం: ఒవైసీ
కిషన్గంజ్ (బిహార్): ముస్లింల మసీదులు, ఇతర పవిత్ర స్థలాలను లాక్కునేందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన ’సీమాంచల్ న్యాయ యాత్ర’ను ప్రారంభించారు. రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. రాష్ట్రంలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో తన పార్టీ విజయావకాశాలను పెంచుకునే లక్ష్యంతో మూడు రోజుల సుడిగాలి పర్యటనకు ఒవైసీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కోచధమన్ అసెంబ్లీ సెగ్మెంట్లో నిర్వహించిన ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ.. మసీదులు, ఈద్గాలు, ఖబరస్తాన్లను లాక్కోవడానికే ప్రధాని నరేంద్ర మోదీ వక్ఫ్ బిల్లును తీసుకొచ్చారని, సదుద్దేశంతో కాదని స్పష్టం చేశారు. ఈ ఆస్తులు అల్లాహ్కు చెందినవని మోదీ గ్రహించలేదని విమర్శించారు. మోదీ తన దురుద్దేశపూర్వక ఆలోచనలతో ఎప్పటికీ విజయం సాధించలేరని చెప్పారు. ప్రపంచం ఉన్నంత వరకు ముస్లింలు తమ మసీదులలో ప్రార్థనలు చేస్తూనే ఉంటారని, అల్లాహ్ను విశ్వసించేవారి పవిత్రమైన స్థలాలు బీజేపీ–ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్లవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒవైసీ.. బిహార్లో ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పారీ్టలపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రం వచి్చనప్పటినుంచి దేశ ముస్లింలు లౌకిక పారీ్టగా చెప్పుకొంటున్న పారీ్టకి మద్దతు ఇస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు.. చాలా కాలంగా ముస్లింల ఓట్లు కోరుకున్నారని, కానీ, కూలీల్లా ఈ భారాన్ని ఎప్పటికీ మోయలేమని గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ‘ఒంటరిగా మిగిలిపోతున్న మన యువతపై శ్రద్ధ వహించాలి. మన శ్రేయస్సుకు అవసరమైనవి చేయాలి. కొన్ని పారీ్టలు.. అధికారాన్ని అనుభవించేందుకు ఇకపై మన ఆకాంక్షలను త్యాగం చేయరాదు’.. అని ఒవైసీ పిలుపునిచ్చారు. -
బిహార్ నుంచే మోదీ సర్కార్ పతనం
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలే కేంద్రంలోని మోదీ ప్రభుత్వ అవినీతి పాలన పతనానికి నాంది పలుకుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బిహార్ సీఎం నితీశ్కుమార్ను భారంగా భావిస్తున్న బీజేపీ ఆయనను మానసికంగా రిటైర్ చేసిందని చెప్పారు. బుధవారం పట్నాలో సీడబ్ల్యూసీ భేటీలో ఖర్గే మాట్లాడారు. బిహార్ను ఒక ఉదాహరణగా చూపించి లక్షలాది మంది ఓట్లను తొలగించడానికి దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఓటరు జాబితాను తారుమారు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని, ఈ సమయంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మనమంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. మన దేశం అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సమస్యలకు మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విఫలమవడం కావడమే కారణమని ఆరోపించారు. మోదీ గొప్పగా చెప్పుకుంటున్న స్నేహితులే భారత్ను సమస్యల వలయంలోకి నెట్టారని మండిపడ్డారు. ఒకవైపు స్వదేశీ అని చెబుతున్న మోదీ మరోవైపు చైనాకు బహిరంగంగా ఎర్ర తివాచీ పరుస్తున్నారని ఖర్గే ధ్వజమెత్తారు. ఈబీసీల రక్షణకు చట్టం: రాహుల్ బిహార్లో తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రక్షణ చట్టం తరహాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ)ను వేధింపుల నుంచి రక్షించడానికి చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈబీసీలకు న్యాయం చేయడానికి 10 సంకల్పాలను ప్రకటించారు. స్థానిక సంస్థల్లో ఈబీసీల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 30 శాతానికి పెంచుతామన్నారు. రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, ఈబీసీలకు కలిపి 50 శాతం కోటా కలి్పస్తామన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈబీసీలు ప్రవేశాలు కలి్పస్తామని తెలిపారు. అంతేకాకుండా ఉచితంగా భూమి పంపిణీ చేస్తామన్నారు. విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నత స్థాయి రిజర్వేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేస్తామని రాహుల్ ప్రకటించారు. ఓట్ల చోరీపై త్వరలో హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నానని స్పష్టంచేశారు. -
కుప్పకూలిన విదేశాంగ విధానం
పట్నా: నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం అత్యంత దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆరోపించింది. విదేశాల అధినేతలకు ప్రధాని మోదీ ఇచ్చిన కౌగిలింతలు మనకే ఎదురు తిరుగుతున్నాయని(బ్యాక్ఫైర్) మండిపడింది. మోదీ నిర్వాకాల వల్ల విదేశాంగ విధానం కుప్పకూలిందని, దౌత్యపరంగా మన దేశం ఒంటరిగా మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేసింది. దేశ ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం కాపాడలేకపోతోందని విమర్శించింది. మరోవైపు ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, కోట్లాది మంది పేదరికంలోకి జారుకుంటున్నారని, ప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో బుధవారం బిహార్ రాజధాని పట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో పలు తీర్మానాలు ఆమోదించారు. స్వాతంత్య్రం తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మన దేశ ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేశాయని సీడబ్ల్యూసీ వెల్లడించింది. నరేంద్ర మోదీ మాత్రం మతిలేని చర్యలతో దేశ ప్రయోజనాలను బలి చేస్తున్నారని ఒక తీర్మానంలో ఆక్షేపించింది. ఒకవైపు అమెరికాను బుజ్జగిస్తూ, మరోవైపు చైనాకు దగ్గరవుతూ ఒక స్పష్టమైన విధానం లేకుండా గుడ్డిగా ముందుకెళ్తున్నారని తప్పుపట్టింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా మోదీ ప్రభుత్వం నిజాయితీగా ఖండించడం లేదని పేర్కొంది. భారత ఉత్పత్తులపై ట్రంప్ భారీగా టారిఫ్లు విధించడంతో మన పరిశ్రమలు మూతపడుతున్నాయని, లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారని గుర్తుచేసింది. అమెరికా నుంచి భారతీయులను అవమానకర రీతిలో బయటకు తరిమేసినా మోదీ స్పందించలేదని విమర్శించింది. రాజ్యాంగంపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ దాడి దేశ ఆర్థికవ్యవస్థ అద్భుతంగా ఉందని చెప్పుకోవడానికి మోదీ ప్రభుత్వం తంటాలు పడుతున్నట్లు సీడబ్ల్యూసీ విమర్శించింది. గణాంకాలను తారుమారు చేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోతాయా? అని ప్రశ్నించింది. ఎన్డీయే మినహా ఇతర పారీ్టలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నట్లు ఆరోపించింది. జీఎస్టీ పరిహారం ఇవ్వకుండా నిలిపివేసిందని వెల్లడించింది. రాజ్యాంగంపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని, ప్రజాస్వామ్యంలో కీలకమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాన్ని క్రమంగా ధ్వంసం చేస్తున్నాయని ఆక్షేపించింది. అవినీతి, నేరాలే రెండు ఇంజిన్లు బిహార్లో బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వ అసలు రంగు ప్రజలకు తెలిసిపోయిందని సీడబ్ల్యూసీ వెల్లడించింది. అవినీతి, నేరాలే ఆ రెండు ఇంజిన్లు అని ఎద్దేవా చేసింది. రాష్ట్రంలో ఎన్డీయే సర్కార్ ‘నోటు చోరీ’కి పాల్పడుతోందని, జనం సొమ్ము విచ్చలవిడిగా దోచుకుంటోందని ఆరోపించింది. బిహార్ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తుచేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచి్చంది. రెండు తీర్మానాలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించారు. ఒక రాజకీయ తీర్మానం కాగా, మరొకటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లను కోరుతూ మరో తీర్మానం చేశారు. ఓట్ల చోరీతోపాటు ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న అవకతవకలను రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీని ప్రశంసించారు. ఓట్ల చోరీ అంటే రాజ్యాంగంపై, ఆర్థిక వ్యవస్థపై, సామాజిక న్యాయంపై, దేశ భద్రతపై దాడేనని ఉద్ఘాటించారు. గాజాపై మౌనం సిగ్గుచేటు గాజాలో జరుగుతున్న మారణహోమం పట్ల మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తూ ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం సిగ్గుచేటు అని సీడబ్ల్యూసీ మండిపడింది. సాధారణ పాలస్తీనా ప్రజలపై కొనసాగుతున్న దాడులు, మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. -
Diwali Gift: రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల సందర్భంగా 10,91,146 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు రూ. 1,865.68 కోట్ల ఉత్పాదకత సంబంధిత బోనస్ (PLB) చెల్లింపునకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించారు. దీనిని దీపావళి కానుకగా రైల్వే ఉద్యోగులకు అందించనున్నారు.ఇది భారతీయ రైల్వేలోని 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఇందుకోసం 2024-25 సంవత్సరానికి రూ. 1,866 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోయనుంది. కేంద్ర మంత్రివర్గం గత ఏడాది అక్టోబర్ మూడున 11.72 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత-సంబంధిత బోనస్ చెల్లింపును ఆమోదించింది. రైల్వే సిబ్బంది పనితీరుకు గుర్తింపుగా 10,91,146 మంది ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్ (పీఎల్బీ) రూ.1,865.68 కోట్ల చెల్లింపునకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.అర్హులైన రైల్వే ఉద్యోగులకు (Railway Employees) ఏటా దుర్గా పూజ/దసరా సెలవులకు ముందు పీఎల్బీని చెల్లిస్తారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 10.91 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్బీ మొత్తాన్ని చెల్లించనున్నారు. రైల్వేల పనితీరు మెరుగుపడేలా కృషి చేసిన ఉద్యోగులకు ప్రేరణనిచ్చే ప్రోత్సాహకంగా పీఎల్బీ ఉపయోగపడనుంది. అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్బీ కింద చెల్లించే గరిష్ట మొత్తం రూ.17,951. ఈ మొత్తాన్ని ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, సాంకేతిక నిపుణులు, సహాయకులు, పాయింట్స్ మన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్- సి సిబ్బంది వంటి వివిధ కేటగిరీల్లోని రైల్వే సిబ్బందికి చెల్లిస్తారు. 2024-25లో రైల్వేలు రికార్డు స్థాయిలో 1,614.90 మిలియన్ టన్నుల సరుకును లోడ్ చేయడంతోపాటు దాదాపు 7.3 బిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.వీటికి కూడా క్యాబినెట్ ఆమోదంపరిశోధనల ప్రోత్సాహానికి 2,277 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సిఎస్ఐఆర్ (CSIR) పథకం కింద మానవ వనరుల అభివృద్ధికి ప్రోత్సాహం కల్పించనున్నట్లు ప్రకటించింది. రీసెర్చ్ ఫెలోషిప్ లకు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపింది. అత్యుత్తమ పరిశోధనలకు గుర్తింపు, ప్రమోషన్ అందించేలా క్యాబినెట్ ఒక పథకానికి రూపకల్పన చేసింది. -
మోదీపై వీడియో.. పన్నూకు బిగ్ షాక్
ఖలిస్థానీ ఉగ్రవాది, 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)కు మరో షాక్ తగిలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఉపా చట్టం (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం) కింద అతనిపై తాజాగా ఓ కేసు నమోదు చేసింది. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పన్నూ చేసిన వీడియో ప్రకటనే ఇందుకు కారణంగా తెలుస్తోంది.పంద్రాగస్టు సందర్భంగా.. ఎర్రకోటలో దేశ ప్రధాని జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వేడుకల్లో మోదీని జెండా ఎగరేయకుండా అడ్డుకున్న వాళ్లకు భారీ నజరానా ప్రకటించాడు సిక్స్ ఫర్ జస్టిస్ ప్రధాన న్యాయ సలహాదారు గురుపత్వంత్ సింగ్. ఈ పరిణామాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్ఐఏ.. UAPA (Unlawful Activities Prevention Act) కింద కేసు నమోదు చేసింది.ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేసిన ఆ వీడియోలో.. సిక్కు సైనికుల్లో ఎవరైనా సరే ప్రధాని మోదీని జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండా అడ్డుకోవాలని, అలా చేస్తే రూ.11 కోట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. అంతటి ఆగకుండా.. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలిపి "కొత్త ఖలిస్తాన్" అనే పటాన్ని కూడా విడుదల చేశాడు.ఈ చర్యలను భారత దేశ భద్రత, భౌగోళిక సమగ్రతను భంగపరిచే ప్రయత్నంగా భావిస్తూ.. ఎన్ఐఏ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. సిక్కు సమాజంలో అసంతృప్తిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, తీవ్ర వాద భావజాలాన్ని వ్యాప్తి చెందిస్తున్నాడని ఇదివరకే అతనిపై అభియోగాల కింద పలు కేసులు నమోదు అయ్యాయి. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను 2007లో స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకడు. ఈ సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. పన్నూకు అగ్రరాజ్యంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది.ఇదీ చదవండి: బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యమంటున్న భీమవారం వాసి! -
ప్రజారోగ్య విప్లవం ఆయుష్మాన్ భారత్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకానికి ఏడేళ్లు పూర్తయ్యాయి. ప్రజారోగ్య రంగంలో ఈ పథకం ఒక విప్లవం అని ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. భవిష్యత్తు అవసరాలను ముందే ఊహించి ఆయుష్మాన్ భారత్ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య చికిత్సలను చౌకగా అందించడమే లక్ష్యమని వివరించారు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతోందని, ఎంతో వెసులుబాటు లభిస్తోందని అన్నారు. దేశ పౌరులు గౌరవప్రదమైన జీవితం కొనసాగించడానికి ఆయుష్మాన్ భారత్ తోడ్పడుతున్నట్లు హర్షం వ్యక్తంచేశారు. నిధుల వ్యయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానంతో మానవాభివృద్ధిలో మనం సాధిస్తున్న ప్రగతికి ఇదొక ప్రతీక అని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా 55 కోట్ల మందికిపైగా ప్రజలు ఈ పథకం పరిధిలోకి వచ్చారని తెలిపారు. ఇప్పటిదాకా 42 కోట్లకుపైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా మారిందని స్పష్టంచేశారు. ఆయుష్మాన్ భారత్ అమలుతో ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 29 శాతం నుంచి 48 శాతానికి పెరిగిందని వెల్లడించారు. అదేసమయంలో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజలు చేస్తున్న 63 శాతం నుంచి 39 శాతానికి తగ్గిపోయినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. ఆర్థిక భారం నుంచి లక్షలాది కుటుంబాలకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. అనారోగ్యం పాలైతే ఆయుష్మాన్ భారత్ ఆదుకుంటోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం 2018 సెపె్టంబర్ 23న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద పేదలతోపాటు 70 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.5 లక్షల వార్షిక ఆరోగ్య బీమాను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో ప్రతిఏటా ఆ రు కోట్లకుపైగా కుటుంబాలు పేదరికంలోకి జారిపోకుండా లబ్ధి పొందుతున్నాయని కేంద్రం వెల్లడించింది. -
రేపటి నుంచి వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్
న్యూఢిల్లీ: నాలుగో విడత వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెపె్టంబర్ 25న (రేపు) ప్రారంభించనున్నారు. దేశీయంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్గా భారత్ను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ మెగా ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో రష్యన్ ఫెడరేషన్ ఉప ప్రధాని దిమిత్రీ ప్యాట్రిòÙవ్తో పాటు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గోనున్నారు. న్యూజిలాండ్, సౌదీ అరేబియా భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 21 దేశాలు పాల్గొంటున్నాయి. 2023లో నిర్వహించిన ఈవెంట్లో రూ. 33,000 కోట్ల విలువ చేసే అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరాయి. 2024లో ప్రధానంగా టెక్నాలజీ బదలాయింపు ఒప్పందాలపై దృష్టి పెట్టారు. గత ఎడిషన్ల దన్నుతో ఈసారి మరింత భారీగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు పాశ్వాన్ తెలిపారు. ప్రాసెస్డ్ ఆహారం వల్ల స్థూలకాయం, ఇతరత్రా అనారోగ్యాలు వస్తాయనే అపోహలను పారద్రోలేందుకు ఉద్దేశించిన బుక్లెట్ను ఆవిష్కరించారు. -
‘కొత్త జీఎస్టీ ద్వారా ప్రధాని మోదీ నవరాత్రి బహుమతి ఇచ్చారు’
నిజామాబాద్: కొత్త జీఎస్టీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ.. భారతీయులకు నవరాత్రి బహుమతి ఇచ్చారన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ‘ సమాజంలోని అన్ని వర్గాలకు కొత్త జీఎస్టీ విధానం మేలు చేస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ సామగ్రి పై 18 శాతం నుండి 5 శాతానికి జిఎస్టీ తగ్గించారు. ద్విచక్ర వాహనాలపై 28 శాతం నుండి 18 శాతానికి జీఎస్టీ తగ్గింది. లైఫ్,హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కొత్త జీఎస్టీ రీఫామ్ ద్వారా దేశ జీడీపీ 1 శాతం పెరిగే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వం లో టాక్స్ ట్రాన్స్పెరెన్స్ విధానం అవుతుంది. రూ. 7 వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము ప్రజలకు ఇస్తున్నామని మేము సంతోషిస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి ఆదాయం తగ్గిందని ఏడుస్తున్నారు. ఇదే బీజేపీ-కాంగ్రెస్ నాయకుల మద్యన వ్యత్యాసం’ అని ఎద్దేవా చేశారు అరవింద్.ఇదీ చదవండి: అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: కవిత -
'స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్
దేవి నవరాత్రులతో యావత్తు దేశం ఆధ్యాత్మిక వాతవరణంతో అలరారుతోంది. ఎటు చూసిన దుర్గామాత నామస్మరణతో మారు మ్రోగిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ భారతదేశ ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా పోస్ట్లో..శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వచ్ఛ భక్తికి నెలవు ఈ తొమ్మిది రాత్రులు అని అన్నారు. పైగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎవరితోచినట్లుగా వారు తమ భక్తి కొలదీ అమ్మను కొలుచుకుంటారు. అయితే వాటితోపాటు ఈ కీర్తనను కూడా వినండి అంటూ భక్తును ప్రోత్సహించారు. దీంతో ఒక్కసారిగా ఆ పాట నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఈ నవరాత్రులు ఏడాదికి రెండుసార్లు జరుపుకోవడం ఆచారం. ఒకటి చైత్రమాసంలో జరుపుకునే శారద నవరాత్రులు కాగా, మరొకటి ఆశ్వీయుజ మాసంలో జరుపుకునే దుర్గా నవరాత్రులు. అయితే ఈసారి దుర్గమ్మను కొలుచుకునేందుకు సంగీతాన్ని కూడా జోడించండి అని భక్తులకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అంతేగాదు పండిట్ జస్రాజ్ పాటను షేర్ చేస్తూ ఈ తొమ్మిది రోజులు ఈ పాట వింటూ..అమ్మవారికి కృపకు పాత్రులకండి అంటూ సోషల్మీడియా పోస్ట్ ఎక్స్లో పేర్కొన్నారు. नवरात्रि पर देवी मां की आराधना मन को असीम शांति से भर देती है। माता को समर्पित पंडित भीमसेन जोशी जी का यह भावपूर्ण भजन मंत्रमुग्ध कर देने वाला है…https://t.co/bMydkzyjPp— Narendra Modi (@narendramodi) April 1, 2025 కాగా, మోదీ కూడా ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి దుర్గమ్మ వారిని ధ్యానిస్తానని గతంలో చెప్పారు. అలా చేయడం వల్ల తనలోని శక్తి మరింతగా జాగృతమై మంచి ఆలోచనలకు శ్రీకారం చుట్టడానికి వీలవుతుందని కూడా అన్నారు. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు కూడా భక్తిభావాన్ని పెంపొందించే ఇలాంటి పోస్టులనే మరిన్ని చేయమని మోదీని పోస్ట్లో కోరారు. ఇక పండిట్ పండిట్ జస్రాజ్ దుర్గమ్మపై పాడిన అందమైన పాట ఏంటంటే యాదేవి సర్వభూతేషు.. అంటూ సాగే రమ్యమైన పాట. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై క్లిక్ చేసి ఆస్వాదించండి మరి..!. కీర్తనలు భగవంతునికి చేరువయ్యేలా చేస్తాయా?కీర్తనలు భక్తి మార్గాన్ని చేరుకోవడంలో హెల్ప్ అవుతాయనేది పురాణ వచనం. నవవిధ భక్తుల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్నాయి పురాణాలు. అందుకే మోదీజీ ఈ శరన్నవరాత్రులను కీర్తనలు, భజనల సాయంతో అమ్మవారిని కొలుచుకుందామని పిలుపునిచ్చారు. రామదాసు, అన్నమయ్య, కబీర్ దాస్, మీరాబాయి వీరంతా కీర్తనలతో ఆ భగవంతుడుని వశం చేసుకోవడమే కాదు ఆయనకు ప్రీతీపాత్రులైన భక్తులుగా మారిపోయారు. అంతేగాదు ఆధ్యాత్మికత శక్తికి నెలవైనే ఈ భారతవని..ఎందరో విదేశీయులను తనవైపుకి తిప్పుకుని భక్తిమార్గంలో నడిచేలా చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి కూడా. (చదవండి: భారత్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంతలా మారిపోయిందా..? విస్తుపోతున్న ఉక్రెయిన్ మహిళ) -
కష్టమైన పనులను గాలికొదిలేసింది
ఈటానగర్/అగర్తలా: ఈశాన్య భారతంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపించారు. ఈశాన్యభారతంలో పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని త్రిపుర, అరుణాచల్ప్రదేశ్లలో రూ.5,100 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటానగర్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘అరుణాచల్ప్రదేశ్లో కేవలం రెండు లోక్సభ స్థానాలే ఉన్నాయి. రాజకీయంగా ఈ రెండు సీట్లతో తమకు ఎలాంటి ప్రయోజనంలేదని కాంగ్రెస్ ఎప్పుడో భావించింది. ఈశాన్యభారతంలో కష్టమనిపించిన ఏ అభివృద్ధి ప్రాజెక్టు, పనినీ కాంగ్రెస్ భుజాలకెత్తుకోలేదు. కొండలు, అటవీప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం సవాళ్లతో కూడిన పని. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నాయి. అభివృద్ధి పనులను వదిలేసే కాంగ్రెస్ ని్రష్కియాపర్వం కారణంగా ఈశాన్యభారతం అభివృద్ధికి అస్సలు నోచుకోలేదు. ఇలా పనులను గాలికొదిలేయడం కాంగ్రెస్కు వారసత్వంగా వచ్చిన దురలవాటు. కాంగ్రెస్ కారణంగా నిర్లక్ష్యానికి గురైన అరుణాచల్ప్రదేశ్ను ఢిల్లీలో కూర్చుని పరిపాలిస్తే సరిపోదని నాకు అర్థమైంది. అందుకే రాష్ట్రానికి తరచూ కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను పంపించా. నేను కూడా ఈశాన్యభారతంలో ఇప్పటిదాకా 70 సార్లకుపైగా పర్యటించా. దశాబ్దకాలంలో చూస్తే మంత్రులు, అధికారులు 800 సార్లు పర్యటించారు. రహదారులు నిర్మించడం అసాధ్యమని కాంగ్రెస్ భావించిన అదే చోట్ల ఇప్పుడు ఆధునిక రహదారులను నిర్మించాం. సేతు టన్నెల్నే తీసుకోండి. ఒకప్పుడు అది సాధ్యమని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు ఇది అరుణాచల్ప్రదేశ్ గౌరవ గుర్తింపుగా నిలిచింది. హోలోంగి ఎయిర్పోర్ట్ సైతం కొత్త టరి్మనల్తో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి విమానసర్వీసులు ఉన్నాయి. ఈ అనుసంధాన ప్రాజెక్టులు ప్రయాణాలను సులభతరం చేశాయి. రైతులు తమ ఉత్పత్తులను పెద్ద మార్కెట్లకు తరలించగల్గుతున్నారు’’ అని మోదీ అన్నారు. ఆ ఆలోచనను మార్చాలనుకున్నా ‘‘2014లో తొలిసారిగా ప్రధానిగా దేశ సేవచేసే అవకాశం వచ్చినప్పుడు ఒక్కటే అనుకున్నా. కాంగ్రెస్ భావజాల సుడిగుండం నుంచి దేశాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్నా. ఏ రాష్ట్రంలోనైనా మా మార్గదర్శకం ఓట్లు, సీట్లు్ల కావు. దేశమే ముఖ్యం అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఎవరి గురించి అయితే ఎవరూ పట్టించుకోలేదో వాళ్లనే మోదీ పట్టించుకుంటాడు. అదే అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రం. అందుకే 2014 నుంచి అభివృద్ధికి కొత్త కేంద్రంగా అరుణాచల్ప్రదేశ్ను మలిచా. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలుంటే కలిగే డబుల్ ప్రయోజనాలకు అరుణాచల్ ఒక మచ్చుతునక. ఈరోజు ప్రకటించిన పలు విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయ్యాక రాష్ట్రం ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా భాసిల్లుతుంది. రూ.1,750 కోట్ల వ్యయంతో 80.2 కోట్ల యూనిట్ల వార్షిక విద్యత్ ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన టాటో–1 ప్రాజెక్ట్ పూర్తయితే వేలాది మందికి ఉపాధితోపాటు సరసమైన ధరలో విద్యుత్ అందుబాటులో ఉంటుంది’’అని మోదీ అన్నారు. షియో మీ జిల్లాలో యార్జేప్ నదిపై రెండు భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. అలిగిన కూటమి పార్టీ త్రిపురలో మోదీ పాల్గొన్న కార్యక్రమాల్లో కనీసం తమకు ఆహ్వానం అందలేదని త్రిపుర రాష్ట్రంలో కూటమి సర్కార్లో భాగస్వామి అయిన ‘ది తిప్రా మోథా’ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ టీఎంపీ సీనియర్ ఎమ్మెల్యే రంజిత్ దేవ్వర్మ ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘ త్రిపురేశ్వరీ ఆలయం ప్రాంగణంలో మోదీ చేపట్టిన పునరుద్ధరణ భవనాల ప్రారం¿ోత్సవాలు, పూజా కార్యక్రమాల్లో మా టీఎంపీ పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దేవ్వర్మను ఆహ్వానించలేదు. కూటమి సర్కార్లో సభ్యులై ఉండికూడా పార్టీ ఎమ్మెల్యేలను పిలవలేదు. ఆలయాన్ని కట్టించిన మహారాజ ధన్య మాణిక్య రాజవంశానికే చెందిన రాజమాత విభూ కుమారి దేవికి సైతం ఆహ్వానం అందలేదు’’ అని దేవ్వర్మ అసహనం వ్యక్తంచేశారు. 1949 సెపె్టంబర్లో నాటి భారత సర్కార్, రాణి కంచన్ ప్రవదేవీల మధ్య ఒడంబడిక కుదిరేనాటికి ఈ ఆలయం ఈ వంశస్తుల అధీనంలోనే ఉందని దేవ్వర్మ గుర్తుచేశారు. మాకూ ఆహ్వానం అందలేదని మరో కూటమి పార్టీ ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో మాటామంతీ అరుణాచల్ రాజధాని ఇటానగర్లో ఇందిరాగాంధీ పార్క్లో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్నూ మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి స్వయంసహాయక సంఘాల ప్రతినిధులు, స్థానిక వ్యాపారులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తగ్గిన జీఎస్టీతో మీకు ఎలాంటి ప్రయోజనాలు దక్కనున్నాయో వాళ్లను మోదీ స్వయంగా అడిగి తెల్సుకున్నారు. ‘‘ స్థానిక వ్యాపార వర్గాలతో నేరుగా సంభాషించడం ద్వారా వాళ్లలో ఉత్సాహాన్ని పెంచడంతోపాటు వ్యాపారాన్ని మరింత అభివృద్ధిచేయాలని వాళ్లను ప్రోత్సహించా. ఇలాంటి చర్యలు క్షేత్రస్థాయి నుంచి వ్యాపారమూలాలను మరింత బలోపేతం చేస్తాయి’’అని మోదీ ఆ తర్వాత అన్నారు. జీఎస్టీ ద్వారా ఒకే దేశం, ఒకే పన్ను భావనను తీసుకొచ్చి పాత పలురకాల పన్నులకు ప్రధాని మోదీ చరమగీతం పాడారని అక్కడి స్థానిక వ్యాపారులు గుర్తుచేసుకున్నారు. జీఎస్టీ తగ్గడంతో నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుందని, దీంతో గృహనిర్మాణ ఖర్చులు కలిసొస్తాయని స్థానిక వ్యాపారులు మోదీతో చెప్పారు. ముడిసరుకులు తక్కువ ధరకు లభిస్తాయని, దీంతో స్థానిక ఉత్పత్తుల తయారీ వ్యయం తగ్గనుందని ఆదాయం పెరిగే అవకాశముందని వాళ్లు మోదీతో అన్నారు. వికసిత్ భారత్ సుసాధ్యం కావాలంటే మీరంతా స్వదేశీ వస్తువులనే వినియోగించాలని, స్వదేశీ వస్తువులనే అమ్మాలని వాళ్లకు మోదీ సూచించారు.త్రిపురేశ్వరీ ఆలయంలో పూజలు త్రిపురలో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ గోమతీ జిల్లాలోని ప్రఖ్యాత త్రిపురేశ్వరీ ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీర్థయాత్ర కాయకల్ప, అభివృద్ధి(ప్రసాద్) పథకంలో భాగంగా రూ.52 కోట్లతో చేపట్టిన త్రిపురేశ్వరీ ఆలయ మరమ్మతు పనులు పూర్తయిన సందర్భంగా మోదీ గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ‘మహారాజా’ ధన్య మాణిక్య 1501 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 500 సంవత్సరాల ఘనచరిత గల ఈ ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటిగా భక్తులు కొలుస్తారు. సోమవారం ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు కలియతిరిగారు. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, ముఖ్యమంత్రి మాణిక్సాహా, సీనియర్ ఉన్నతాధికారులు మోదీకి ఆలయ విశిష్టతను వివరించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆలయ ప్రత్యేకతను చాటే ఎగ్జిబిషన్నూ మోదీ సందర్శించారు. మండే ఎండలోనూ మోదీని చూసేందుకు జనం ఎగబడ్డారు. గత 11 సంవత్సరాల్లో త్రిపురకు మోదీ రావడం ఇది 11వ సారి కావడం విశేషం. ‘11 ఏళ్లలో మోదీ 11 సార్లు త్రిపురకు వచ్చారు. నవరాత్రి తొలిరోజున భక్తిశ్రద్ధలతో మోదీ సంప్రదాయ ధోతీలో మాతా త్రిపురసుందరిని దర్శించుకున్నారు’ అని ఎంపీ బిప్లవ్ కుమార్ వెల్లడించారు. ప్రసాద్ పథకంలో భాగంగా ఆలయ కాంప్లెక్స్లో భక్తులు సేదతీరేందుకు పెద్ద హాల్, వేచి ఉండే గది, ధ్యానం హాల్, పూజారి గది, మ్యూజియంలను నిర్మించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక గది ఏర్పాటుచేశారు. ఒకేసారి రెండు లక్షల మంది భక్తులు సందర్శించినా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా 30,000 చదరపు అడుగుల్లో ఏర్పాట్లు చేశారు. దీపావళి రోజున ఈ ఆలయానికి భక్తుల తాకిడి మరీ విపరీతంగా ఉంటుంది. -
జీఎస్టీ పొదుపు ఉత్సవం మొదలైంది
న్యూఢిల్లీ: తగ్గిన జీఎస్టీ పన్నుల కారణంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు మొదలు ఇంటి ముంగిళ్ల దాకా ప్రజలకు ఖర్చులు తగ్గి పొదుపు ఉత్సవం మొదలైందని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తంచేశారు. నగదు ఆదా ఉత్సవం ప్రతి ఒక్కరి ఇంట్లో పండుగ శోభను మోసుకొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. శరన్నవరాత్రి ఉత్సవాల తొలి రోజునే జీఎస్టీ తగ్గుముఖం పట్టిందని, ఇది శుభసూచకమంటూ దేశ ప్రజలకు మోదీ సోమవారం బహిరంగ లేఖ రాశారు. ‘‘షాపింగ్ చేసే వాళ్లకు ఇది నిజంగా పండుగే. అన్ని మార్కెట్లలో, అందరి ఇళ్లలో నగదు ఆదా ఉత్సవం ఆరంభమైంది. నవ శకం జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. సెపె్టంబర్ 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు పొదుపు పెంచడంతోపాటు రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్య తరగతి, వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దాకా సమాజంలోని ప్రతి ఒక్క వర్గానికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఈ శుభతరుణంలో అందరం ఆత్మ నిర్భరత పథంలో కలిసి నడుద్దాం. 2047 ఏడాదికల్లా వికసిత్ భారత్ ఉమ్మడి లక్ష్యాన్ని సాధిద్దాం. ఈ సంవత్సరం పండుగల సీజన్ కొత్త సంతోషాలను మోసుకొచ్చింది. తగ్గిన జీఎస్టీతో ప్రజలు డబుల్ బొనాంజాను ఒడిసిపట్టారు. జీఎస్టీ సంస్కరణలు అద్భుతమైన ప్రగతికి, పెట్టుబడులకు బాటలు వేయనున్నాయి. దీంతో దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోనుంది’’ అని మోదీ ఆ లేఖలో అభిలషించారు. పన్ను రహితం లేదా 5 శాతం ‘‘ఆహారం, ఔషధాలు, సబ్బులు, టూత్పేస్ట్, బీమా ఇలా మరెన్నో వస్తూత్పత్తులు ఇప్పుడు పన్నురహితంగా లేదా కేవలం 5 శాతం జీఎస్టీ శ్లాబులో అందుబాటులోకి వచ్చాయి. గతంలో 12 శాతం శ్లాబులో ఉన్న ఎన్నో ఉత్పత్తులు ఇప్పుడు 5 శాతం శ్లాబులోకి దిగొచ్చాయి. ఇవి ‘శ్లాబులు మారడానికి ముందు, ఆ తర్వాత రేట్లు’ అంటూ వ్యాపారులు తమ దుకాణాల ముందు బోర్డ్లు తగిలించడం చూస్తుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. రూ.12 లక్షల వార్షికాదాయంపై సున్నా పన్నును అమలుచేసి మధ్యతరగతి ప్రజల చేతుల్లో నగదు నిలిచేలా చేశాం. ఇప్పుడు తగ్గిన జీఎస్టీ రేట్లు, అమలవుతున్న జీరో ఐటీ ట్యాక్స్తో ప్రజలకు రూ.2.5 లక్షల కోట్ల సొమ్ము ఆదా అయింది. దీంతో చిన్న ఇల్లు కట్టుకోవడం, కొత్త వాహనం కొనుక్కోవడం, గృహోపకరణాలు కొనుగోలుచేయడం, కుటుంబంతో కలిసి సరదాగా బయట భోజనం చేయడం వంటి ఆనందాలెన్నో సాకారమవుతున్నాయి’’ అని మోదీ ఆనందం వ్యక్తంచేశారు. This festive season, let's celebrate the 'GST Bachat Utsav'! Lower GST rates mean more savings for every household and greater ease for businesses. pic.twitter.com/QOUGWXrC3d— Narendra Modi (@narendramodi) September 22, 2025‘చిరు’వ్యాపారుల పెద్ద పండుగ ‘‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు జీఎస్టీ తగ్గింపుతో పండుగ కాంతుల్లో వెలిగిపోతున్నాయి. సులభతర వ్యాపారానికి అనువైన వాతావరణం నెలకొంది. తక్కువ ట్యాక్స్లు, తక్కువ ధరలు, అనువైన నిబంధనల కారణంగా వ్యాపారం ఊపందుకోనుంది. వ్యాపారాభివృద్ధి అవకాశాలు మెరుగయ్యాయి. స్థానిక ఉత్పత్తుల విస్తృతి పెరగనుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా పెద్ద అడుగు’’ అని అన్నారు. కవరేజీ కమాల్ తగ్గిన జీఎస్టీతో ప్రజల కొనుగోళ్లు పెరగనున్నాయని, పౌరుల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయంటూ సోమవారం పలు ప్రధాన హిందీ, ఇంగ్లిష్ దినపత్రికల్లో వచ్చిన కథనాలు, ప్రధాన వార్తలను ప్రధాని ప్రస్తావించారు. ‘తక్కువ ధరలు, ఎక్కువ ఆనందాలు’ అనే క్యాప్షన్ పెట్టి మోదీ పలు న్యూస్పేపర్ల ఫ్రంట్ పేజీలను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. తగ్గిన జీఎస్టీతో వినియోగదారులకు భారీ ప్రయోజనం చేకూరనుందంటూ దైనిక్ భాస్కర్, దైనిక్ జాగరణ్, ఎన్బీటీ, హిందుస్తాన్, హరిభూమి, రాష్ట్రీయ సహారా సహా పలు ప్రధాన ఆంగ్ల పత్రికల తొలి పేజీ క్లిప్పింగ్లను మోదీ షేర్ చేశారు. -
ట్రంప్ ఎన్నడూ ప్రధాని మోదీని వ్యతిరేకించలేదు: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ లాంటి ప్రపంచ అగ్రనేతలతో వ్యక్తిగత స్నేహం ఉందని, అందుకే ప్రధానిమోదీకి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సత్తా ఉందని నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార యంత్రాంగం భారత్పై భారీ వాణిజ్య సుంకాలను విధించినప్పటికీ, భారత్-అమెరికా సంబంధాలలో ఎటువంటి విఘాతం ఏర్పడబోదని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ల స్నేహాన్ని ఉదహరిస్తూ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తన తొలి బహిరంగా సమావేశంలో పేర్కొన్నారు.భారతదేశంపై అమెరికా 50 శాతం సుంకం విధించినప్పటికీ ట్రంప్ .. మోదీ తనకు గొప్ప స్నేహితుడని చెబుతూనే ఉన్నారని, ట్రంప్ ఎన్నడూ తాను మోదీని వ్యతిరేకిస్తున్నానని చెప్పలేదని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మోదీకి ట్రంప్, పుతిన్, జిన్పింగ్ మంచి స్నేహితులేనని అందుకే ఆయన(మోదీ) అసాధ్యాలను సుసాధ్యం చేయగలరన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాల ఆధారంగా రూపొందించిన నాలుగు పుస్తకాలను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. సందర్భంగా ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని కొనియాడారు.సమస్యల పట్ల మోదీ వైఖరిని చాలా లోతుగా ఉంటుందని, ప్రజల మనోభావాలను విస్మరించని నేత ప్రధాని మోదీ అని, ఆయన ప్రసంగాలు ఎంతో అర్థవంతమైనవని అన్నారు. ప్రపంచ శక్తిగా ఎదగాలనే మన ఆకాంక్ష ఆధిపత్యం ద్వారా సాధ్యంకాదని, ప్రపంచ సంక్షేమం అనే ఆలోచన ద్వారా సమకూరుతుందని భారతదేశం నిరూపించిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మాట్లాడుతూ మన అతిపెద్ద సమస్య..ఇతర దేశాలపై ఆధారపడటమేనన్నారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని చెప్పారన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దార్శనికత, లక్ష్యాన్ని ప్రధాని మోదీ కలిగివుండి, ఆ దిశగా దేశాన్ని నడిపిస్తున్నారన్నారు. -
కాంగ్రెస్ మనస్తత్వంతోనే ఈశాన్యానికి హాని: ప్రధాని మోదీ
ఇటానగర్: ‘సూర్యకిరణాలు ముందుగా పడే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అయినప్పటికీ, వేగవంతమైన అభివృద్ధి కిరణాలు ఇక్కడికి చేరుకోవడానికి చాలా దశాబ్దాలు పట్టింది. ఆ సమయంలో ఢిల్లీ నుంచి దేశాన్ని నడిపిన వారు అరుణాచల్ అభివృద్ధిని విస్మరించారు. కాంగ్రెస్ లాంటి పార్టీలు.. ఇక్కడ కేవలం రెండు లోక్సభ సీట్లు మాత్రమే ఉన్నాయని..అలాంటప్పుడు అరుణాచల్పై ఎందుకు దృష్టి పెట్టాలి? అని భావించాయని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ మనస్తత్వం కారణంగానే అరుణాచల్తో పాటు ఈశాన్య ప్రాంతాలకు తీవ్రమైన హాని జరిగిందన్నారు. సోమవారం ఇటానగర్లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ‘2014లో నాకు దేశానికి సేవ చేసే అవకాశం కలిగినప్పుడు, దేశాన్ని కాంగ్రెస్ మనస్తత్వం నుండి విముక్తి చేయాలని నిర్ణయించుకున్నాను. మా మార్గదర్శక సూత్రం.. ఏ రాష్ట్రంలోనైనా ఓట్ల సంఖ్య లేదా సీట్ల సంఖ్య కాదు.. ‘తొలుత దేశం’. మా ఏకైక మంత్రం నాగరిక్ దేవో భవ (పౌరుడే దేవుడు). కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన అరుణాచల్ ప్రదేశ్ 2014 నుండి తమ పాలనలో అభివృద్ధి ప్రాధాన్యతా కేంద్రంగా మారింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా అరుణాచల్ ప్రదేశ్లో రూ. 5,125.37 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. VIDEO | Arunachal Pradesh: PM Modi (@narendramodi) says, “When I was given the opportunity to serve the nation in 2014, I resolved to free the country from the mindset of Congress. Our guiding principle is not the number of votes or seats in any state, but ‘Nation First’. Our… pic.twitter.com/V1Tq40eTyl— Press Trust of India (@PTI_News) September 22, 2025ఇటానగర్లోని ఇందిరా గాంధీ పార్క్లో జరిగిన కార్యక్రమంలో రెండు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టులకు, తవాంగ్లోని ఒక కన్వెన్షన్ సెంటర్కు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. యార్జెప్ నదిపై అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టులు.. అరుణాచల్ ప్రదేశ్ జలవిద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించనున్నాయని, ప్రాంతీయ ఇంధన భద్రతకు గణనీయంగా దోహదపడనున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. కనెక్టివిటీ, ఆరోగ్యం, అగ్నిమాపక భద్రతతో సహా వివిధ రంగాలకు సంబంధించిన రూ. 1,290 కోట్లకు పైగా విలువైన అనేక ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో గవర్నర్ కేటీ పర్నాయక్, ముఖ్యమంత్రి పెమా ఖండు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తదితరులు పాల్గొన్నారు. The North East is fast emerging as India's powerhouse. Speaking at the launch of projects related to energy, connectivity and healthcare in Itanagar, Arunachal Pradesh. https://t.co/SIrXM5eumI— Narendra Modi (@narendramodi) September 22, 2025 -
ఉన్ని ముకుందన్ బర్త్డే.. 'మా వందే' నుంచి పోస్టర్ రిలీజ్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతమవుతోంది. 'మా వందే' (Maa Vande Movie) పేరిట ఆయన బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ మూవీలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan).. మోదీగా నటించనున్నారు. క్రాంతి కుమార్ సీహెచ్ దర్శకత్వం వహిస్తుండగా వీర్ రెడ్డి.ఎం నిర్మిస్తున్నారు. ఇటీవల (సెప్టెంబర్ 17న) మోదీ బర్త్డే సందర్భంగా మా వందే ప్రాజెక్ట్ ప్రకటించారు. నేడు (సెప్టెంబర్ 22) ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.మోదీ బయోపిక్..ఇందులో మోదీ జనం ఎదుట స్టేజీపై నడుస్తున్నట్లుగా ఉంది. అతడి ఆశయాన్ని, సంకల్పాన్ని తల్లి ఆశీర్వదిస్తున్నట్లుగా పోస్టర్లో చూపించారు. ఈ మూవీలో మోదీ బాల్యం నుంచి నేటి వరకు జరిగిన ఎన్నో అంశాలను చూపించనున్నారు. వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ ప్రపంచనాయకుడిగా ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ప్రేరణ ఎంతో ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని.. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఇవ్వనున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.From Maa’s blessing to the nation’s anthem… ✨Team #MaaVande wishes @Iamunnimukundan a very Happy Birthday! ❤️🤗#HBDUnniMukundan@silvercast_prod @sannajaji @veerreddy_m @DOPSenthilKumar @RaviBasrur @Sreekar_Prasad @sabucyril @SolomonStunts @GangadharNS1 @MaaVandeMovie pic.twitter.com/rb6JsF30yp— Maa Vande (@MaaVandeMovie) September 22, 2025చదవండి: హౌస్లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై మనీష్ బిగ్బాంబ్ -
శ్రావ్యమైన కీర్తనతో నవరాత్రులకు ప్రధాని మోదీ స్వాగతం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (సోమవారం) నుంచి ప్రారంభమైన శారదా నవరాత్రులను ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ పాడిన భక్తి భజన కీర్తనతో స్వాగతించారు. ఈ సందర్బంగా ప్రధాని తన సందేశంలో.. పండుగ వాతావరణంలో సంగీతం అందించే ఆధ్యాత్మిక ఆనందాన్ని అందరితో పాటు పంచుకోవాలని. దేశ ప్రజలు తమకు ఇష్టమైన భజనలతో పునీతులు కావాలన్నారు. నవరాత్రి అంటే స్వచ్ఛమైన భక్తి అని, చాలా మంది ఇటువంటి భక్తిని సంగీతం ద్వారా సంగ్రహించారన్నారు. పండిట్ జస్రాజ్ శృతి చేసిన అలాంటి ఒక ఆత్మీయమైన పాటను మీతో పంచుకుంటున్నాను అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. Navratri is about pure devotion. So many people have encapsulated this devotion through music. Sharing one such soulful rendition by Pandit Jasraj ji. If you have sung a Bhajan or have a favourite one, please share it with me. I will be posting some of them in the coming days!…— Narendra Modi (@narendramodi) September 22, 2025భజన కీర్తనల ఆలాపనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, ఆయన ప్రజల నుంచి వారి సొంత భజన పాటలను తనకు పంపాలని లేదా వారికి ఇష్టమైన వాటిని తనతో షేర్ చేసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో వాటిని అందరికీ షేర్ చేస్తానని ప్రధాని తెలిపారు. నవరాత్రుల తొలి రోజున దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. భక్తి, ధైర్యం, దృఢ సంకల్పంతో నిండిన ఈ పవిత్ర ఉత్సవం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త బలాన్ని కొత్త విశ్వాసాన్ని పెంపొందించాలి.. జై మాతా ది!" అని ప్రధాని మోదీ రాశారు.आप सभी को नवरात्रि की अनंत शुभकामनाएं। साहस, संयम और संकल्प के भक्ति-भाव से भरा यह पावन पर्व हर किसी के जीवन में नई शक्ति और नया विश्वास लेकर आए। जय माता दी!— Narendra Modi (@narendramodi) September 22, 2025మరో పోస్ట్లో ఆయన తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజున పూజలందుకునే మా శైలపుత్రిని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ‘ఈ రోజు నవరాత్రులలో శైలపుత్రి పూజలకు ప్రత్యేకమైన రోజు. అమ్మవారి ఆప్యాయత, ఆశీర్వాదాలతో, ప్రతి ఒక్కరి జీవితం మంచి ఆరోగ్యంతో నిండాలని అభిలషిస్తున్నానని’ ఆయన అన్నారు. సెప్టెంబర్ 22 నుంచి దేశం అంతటా శారదీయ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. భక్తులు ఆలయాల్లో అమ్మవారికి పూజలు చేస్తున్నారు. పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. -
GST 2.0 షురూ.. వన్ నేషన్ వన్ టాక్స్
-
మోదీ రిటైర్మెంట్ అప్పుడే.. రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ(75) ఇంకెంత కాలం రాజకీయాల్లో కొనసాగుతారు? అనే సూటి ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. బీజేపీలో ఒక వయసు దాటాక సీనియర్లను పక్కన పెడుతుండడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. అయితే.. మోదీ(Modi Retirement) విషయంలో మాత్రం బీజేపీ, దాని మాతృ సంస్థ ఆరెస్సెస్ ఆ పనిని ఎందుకు చేయకపోతున్నాయంటూ ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు మోదీ సైతం తన రిటైర్మెంట్పై ఏనాడూ పెదవి విప్పింది లేదు. ఈ తరుణంలో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం లేకపోలేదు.ఆఫ్రికా దేశం మొరాకోలో పర్యటించిన తొలి భారత రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ తరుణంలో ఆ పర్యటనలో ఉన్న ఆయన.. ఓ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. ఆ సమయంలో మోదీ భారత ప్రధానిగా ఇంకెంత కాలం రాజకీయాల్లో కొనసాగుతారు? అని రాజ్నాథ్ సింగ్ను యాంకర్ ప్రశ్నించింది. దానికి ఆయన బదులిస్తూ.. ‘‘2029, 2034, 2039, ఆపై 2044లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా నరేంద్ర మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థి అని, 2047లో వికసిత్ భారత్(Viksit Bharat 2047) లక్ష్యాన్ని సాధించిన తర్వాతే విరమణ తీసుకుంటారు’’ అని బదులిచ్చారు. మోదీ ఒక వ్యక్తి మాత్రమే కాదు భారత అభివృద్ధి లక్ష్యానికి ప్రతీక. ఆయన నాయకత్వంలో భారత్ శాంతి, శక్తి.. ఈ రెండింటికీ ప్రతినిధిగా మారింది. ఆయన సారథ్యంలోనే.. భారత తయారీ సామర్థ్యం ప్రపంచ స్థాయికి చేరింది. వికసిత్ భారత్ను మోదీ వ్యక్తిగత లక్ష్యంగా తీసుకున్నారు. కాబట్టి ఆయన సాధించేవరకు నాయకత్వం వదలబోరు. 2047లో మన దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తవుతుంది. వికసిత్ బారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. అప్పుడే ఆయన రిటైర్ అవుతారు అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. తద్వారా.. మోదీ విషయంలో బీజేపీ అసాధారణ మినహాయింపులు ఇచ్చిందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించారాయన. 🚨 BIG STATEMENT 🚨RM Rajnath Singh: “PM Narendra Modi will be BJP’s PM candidate in 2029, 2034, 2039 & even 2044.” 🎯“He will retire only after achieving the goal of a Viksit Bharat by 2047.” 🇮🇳 pic.twitter.com/f2xHicpnzB— Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2025మొరాకా పర్యటనలో ఉన్న రాజ్నాథ్ సింగ్.. ఆఫ్రికా ఖండంలోనే భారత్ తరఫున మొదటి రక్షణ తయారీ కేంద్రం ప్రారంభించారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మొరాక్ పేరిట.. ఇరు దేశాల మధ్య రక్షణ పరిశ్రమ, శిక్షణ, సాంకేతిక మార్పిడి అంశాల్లో ఎంవోయూ కుదిరింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్-మహమ్మద్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కలిపి ఈ కేంద్రాన్ని రూపొందించాయి. దీని ద్వారా ఏటా 100 యుద్ధ వాహనాలను(WhAP 8x8) తయారు చేయబోతున్నారు.ఇదీ చదవండి: రాజకీయాలు వదిలేశాక ఆ పని చేస్తా-అమిత్ షా -
నేటి నుంచే కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి... 375 రకాల ఉత్పత్తులపై తగ్గనున్న ధరలు
-
క్రెడిట్ కొట్టేయడానికి మోదీ ఆరాటం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్నులో నరేంద్ర మోదీ సర్కార్ చేపట్టిన మార్పులు లోతైన గాయాలకు కేవలం బ్యాండ్–ఎయిడ్ వేసి వదిలేసినట్లుగా ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. కొన్ని రకాల నిత్యావసరాలపై అధికంగా జీఎస్టీ విధించారని, ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు.ఈ క్రమంలో ఖర్గే.. 900 ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లిందన్న సామెత తీరుగా ప్రధాని నరేంద్ర మోదీ తీరు ఉందని ధ్వజమెత్తారు. మోదీ సర్కార్ ఇప్పటిదాకా 9 రకాల పన్నుల శ్లాబ్లతో గబ్బర్సింగ్ ట్యాక్స్ వసూలు చేసిందని ఆరోపించారు. ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.55 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు. కానీ, ఇప్పుడు ప్రజలకు రూ.2.5 లక్ష కోట్లు కోసం ఆదా చేశామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఖర్గే దుయ్యబట్టారు.జీఎస్టీ సంస్కరణల విషయంలో మొత్తం క్రెడిట్ కొట్టేయడానికి ప్రధాని మోదీ ఆరాటపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. నిజానికి జీఎస్టీలో ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలు ఏమాత్రం సరిపోవని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలన్న డిమాండ్ను కేంద్రం విస్మరించిందని ఆక్షేపించారు. జీఎస్టీ 2.0 తీసుకురావాలని తాము 2017 జూలై నుంచే డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. జీఎస్టీలో సంస్కరణలను మరింత విస్తరింపజేయాలని కేంద్రానికి సూచించారు. -
‘హెచ్1బీ’ని యుద్ధప్రాతిపదికన పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: హెచ్1బీ వీసాల వార్షిక రుసుమును లక్ష డాలర్ల (రూ. 88 లక్షలు)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు టెక్ నిపుణులు సహా అక్కడి భారతీయ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా తోడ్పడుతున్న భారతీయ టెక్ నిపుణుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించకపోతే భారతీయ నిపుణులు ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తదుపరి తరం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలతో దేశవ్యాప్తంగా అభివృద్ధి వేగం పుంజుకోనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధన దిశగా ఇది అతిపెద్ద, కీలకమైన అడుగు అని అభివర్ణించారు. దేశ సౌభాగ్యం కోసం స్వదేశీ ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచే అమల్లోకి రాబోతున్నాయని, నిత్యావసరాల ధరలు తగ్గుతాయని, పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. నవరాత్రులను పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘స్వదేశీ’ ఉద్యమం దేశ స్వాతంత్య్ర పోరాటానికి కొత్త శక్తిని ఇచి్చందని గుర్తుచేశారు. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులు ఉపయోగించుకుంటే దేశ ఆర్థిక ప్రగతికి నూతన బలం చేకూరుతుందని వెల్లడించారు. దేశంలో ప్రతి ఇంటినీ స్వదేశీకి ప్రతీకగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి దుకాణాన్నీ స్వదేశీ వస్తువులతో అలంకరించాలని పిలుపునిచ్చారు. రూ.12 లక్షల దాకా ఆదాయంపై ఇప్పటికే పన్ను మినహాయింపు ఇచ్చామని, ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చామని, ఈ రెండూ దేశ పౌరులకు ‘డబుల్ బోనాంజా’ అని స్పష్టంచేశారు. దీనివల్ల ఖర్చులు తగ్గి, డబ్బులు ఆదా చేయడం పెరుగుతుందని, తద్వారా ప్రజలు వారి కలలు నిజం చేసుకోవడానికి అవకాశం దక్కుతుందని వ్యాఖ్యానించారు. రెండు కీలక నిర్ణయాల వల్ల ప్రజలకు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..నాగరిక్ దేవో భవ ‘‘మన దేశం స్వావలంబన సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్రాలు కల్పించాలి. తయారీ రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలి. ప్రజలు ‘మేన్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులు విస్తృతంగా ఉపయోగించాలి. స్వదేశీ ఉత్పతుల కొనుగోలు, విక్రయం మన ధ్యేయం కావాలి. మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులే వాడుకుంటున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలి. అప్పుడు మన దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. నాగరిక్ దేవో భవ(ప్రజలే దేవుళ్లు) అనేదే మా విధానం. ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతోనే జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఈ నిర్ణయంతో కీలకమైన నిత్యావసర వస్తువులు, సేవల ధరలు తగ్గుతాయి. నిర్మాణం, ఆరోగ్య రంగంలోనూ ఖర్చులు తగ్గిపోతాయి. సోమవారం నుంచి ‘జీఎస్టీ సేవింగ్స్ ఫెస్టివల్’ ప్రారంభం కానుంది. ప్రతి కుటుంబానికీ సంతోషం తీసుకొస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ కోసం ఈ నవరాత్రుల్లో తొలి రోజు దేశం కీలకమైన అడుగు వేయబోతోంది. మీకు ఇష్టమైన వస్తువులు తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. పేదలు, మధ్య తరగతి, యువత, రైతులు, మహిళలు, వ్యాపారులు, దుకాణదారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతారు. దేశంలో సులభతర వాణిజ్యం ఊపందుకుంటుంది. భారీగా పెట్టుబడులు వస్తాయి’’ అని మోదీ చెప్పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు.. ‘‘2017లో జీఎస్టీ సంస్కరణలు ఆరంభించాం. చరిత్ర లిఖించడానికి అప్పుడే అడుగు పడింది. ఒకే దేశం–ఒకే పన్ను అనే స్వప్నాన్ని జీఎస్టీ నిజం చేసింది. గతంలో రకరకాల పన్నులు, సుంకాల వల్ల వ్యాపారులకు, వినియోగదారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. పన్నుల భారాన్ని వ్యాపారులు జనంపైనే వేసేవారు. జీఎస్టీతో ఆ కష్టాలకు చరమగీతం పాడేశాం. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓ విదేశీ పత్రికలో వార్త చదివా. బెంగళూరు నుంచి 570 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్కు సరుకులు చేరవేయడం ఓ కంపెనీకి పెద్ద సవాలుగా మారిందని అందులో రాశారు. పలు రకాల పన్నులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. దానికి బదులు తొలుత యూరప్కు, అక్కడి నుంచి హైదరాబాద్కు చేర్చడమే సులభమని ప్రస్తావించారు. అందుకే పన్నులపరంగా అవరోధాలు తొలగించాలని నిర్ణయించాం. అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్య పక్షాలతో చర్చించి, జీఎస్టీని తీసుకొచ్చాం’’ అని ప్రధాన మంత్రి ‘మోదీ వివరించారు. ఇకనుంచి 5, 18% శ్లాబ్లే.. ‘సంస్కరణలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) సైతం ప్రయోజనం పొందుతాయి. మేన్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలని ఎంఎస్ఎంఈలను కోరుతున్నా. స్వావలంబన భారత్ నిర్మాణంలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర. సాధ్యమైనంత ఎక్కువగా మన దేశంలోనే వస్తువులు ఉత్పత్తి చేయాలి. మనం ఉపయోగించుకుంటున్న వస్తువు ఎక్కడ తయారైందో ప్రజలు తెలుసుకోవాలి. నిత్యం వాడుతున్న దువ్వెన ఎక్కడ తయారు చేశారో కూడా చాలామందికి తెలియదు. విదేశీ వస్తువులకు ప్రాధాన్యం వేయడం సరైంది కాదు. ఇకపై స్వదేశీ ఉత్పత్తులకే పెద్దపీట వేద్దాం. తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనం ప్రజలకు దక్కేలా పరిశ్రమ వర్గాలు చొరవ చూపుతుండడం సంతోషంగా ఉంది. ఇకనుంచి 5 శాతం, 18 శాతం ట్యాక్స్ శ్లాబ్లే ఉంటాయి. గతంలో 12 శాతం పన్ను శ్లాబ్లో ఉన్న 99 శాతం వస్తువులను 5 శాతం పన్ను శ్లాబ్లోకి తీసుకొచ్చాం. ఫలితంగా వాటి ధరలు గణనీయంగా తగ్గిపోతాయి’ అని మోదీ అన్నారు. -
మిడిల్ క్లాస్కు మెలోడీ!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వివిధ వస్తువులపై సవరించిన కొత్త పన్ను రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ... జీఎస్టీ 2.0గా పేర్కొంటున్న ఈ సవరణలతో చాలా వస్తువుల ధరలు మారబోతున్నాయి. మధ్యతరగతి భారతావనికి ఈ పన్నుల మార్పు ఎంతో మేలు చేస్తుందని, చాలా వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ సైతం ఇదే చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు జీఎస్టీ మండలి చేసిన సవరణల వల్ల ఎవరికి లాభం? ధరల్లో హెచ్చుతగ్గులు ఏ రకమైన ప్రభావం చూపబోతున్నాయి? దీనిపై ‘సాక్షి’ సమగ్ర కథనమిది.. ఇక 12 శాతం; 28 శాతం ఉండవు... సేల్స్ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ సహా పలు రకాల పరోక్ష పన్నులన్నిటినీ తొలగిస్తూ 2017 జూలై నుంచీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. తక్కువ పన్నురేట్లుండాలని మొదట లకి‡్ష్యంచినా సాధ్యం కాలేదు. తాజా సవరణలతో అది సాధ్యమై జీఎస్టీ శ్లాబ్లు 3కు తగ్గాయి. తక్కువ శ్లాబ్లుంటే పాలన, ధరల నిర్ణయం, బిల్లింగ్ సులువవుతుంది. పన్ను అధికారులపైనా భారం తగ్గుతుంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత ప్రధానమైనది.. 12 శాతం, 28 శాతం పన్ను రేట్లను పూర్తిగా తొలగించటం. కొన్ని విలాస, అనారోగ్య (సిన్) వస్తువుల కోసం 40 శాతం పన్ను రేటును చేర్చటం. వాస్తవంగా చూస్తే చాలావరకూ ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ 5% పరిధిలోకి వచ్చాయి. కొన్నింటిపై పన్నే లేకుండా చేశారు. గతంలో వీటిపై 12, 28 శాతం పన్ను రేట్లుండేవి. ఇది అత్యధికులకు ఊరటే. ఇక కొన్ని విలాస వస్తువులు, కూల్డ్రింక్స్, టొబాకో ఉత్పత్తులు, పాన్ మసాలా వంటివి మాత్రం 28 శాతం పన్ను పరిధిలో ఉండగా ఇపుడు 40 శాతం శ్లాబ్లోకి వెళ్లాయి. తగ్గింపు ప్రయోజనాలు ఎక్కువే... ముఖ్యంగా ప్రాణాధార ఔషధాలపై పన్ను భారం తొలగిపోనుంది. మరెన్నో ఔషధాలు, వైద్య పరికరాలు, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులైన టూత్బ్రష్, టూత్పేస్ట్, సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్, టాల్కమ్ పౌడర్, షేవింగ్ క్రీమ్తో పాటు నెయ్యి, పన్నీరు, బటర్, నమ్కీన్, కెచప్, డ్రై ఫ్రూట్స్, కాఫీ దగ్గర్నుంచి.. పెద్ద సైజు టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, కార్ల వరకు మొత్తం 375 ఉత్పత్తుల ధరలు గతంతో పోల్చితే తగ్గనున్నాయి. ఈ తగ్గింపు వల్ల జనం చేతుల్లో మరికొంత డబ్బు మిగులుతుంది కనక ఇది సేవింగ్స్లోకి, స్టాక్ మార్కెట్లోకి మళ్లే అవకాశం ఉందనేది ప్రభుత్వం అంచనా. అంతిమంగా ఇది ఆర్థిక వృద్ధికి దారితీయాలనేది లక్ష్యం. అయితే అదే తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు తగ్గిపోకూడదు కనక విలాస, అనారోగ్య వస్తువులపై ఏకంగా పన్ను శాతం 40కి పెంచారు. ధర పెరిగే వస్తువులివీ.. ⇒ బీడీ మినహా సిగరెట్లు, సిగార్లు, గుట్కా, పాన్ మసాలా, నికొటిన్ ఉత్పత్తులు గతంలో ఉన్న 28 శాతం నుంచి 40 శాతానికి చేరాయి. అయితే ఈ పెంపు ప్రస్తుతానికి అమల్లోకి రాదు. బీడీలపై పన్నును మాత్రం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. బిహార్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో సిగరెట్లు తాగేవారికన్నా బీడీలు కాల్చేవారు దాదాపు మూడురెట్లు ఎక్కువనేది గమనార్హం. ⇒ కార్బొనేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కెఫైన్ ఆధారిత పానీయాలను 28 నుంచి 40 శాతంలోకి చేర్చారు. ⇒ లాటరీ టికెట్లు, కేసినో సేవలు, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారాలపై పన్ను రేటు 40 శాతంగా నిర్ణయించారు. ⇒ 1,500 సీసీకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న ఎస్యూవీలు, హై–ఎండ్ కార్లపై ఇకపై 40 శాతం జీఎస్టీ అమలవుతుంది. ⇒ ఫ్యాట్స్, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ కూడా ఇకపై 40 శాతం శ్లాబ్లోకి వస్తాయి. మధ్యతరగతిపై ప్రభావమెంత? మధ్య తరగతి ప్రజలకు ఈ సవరణల్లో ఎక్కువ లాభం తెచ్చేవి ఏవైనా ఉన్నాయంటే అవి కిరాణా సరుకులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులే. చాలా వస్తువులు 18, 12 శాతాల నుంచి 5 శాతం పరిధిలోకి రావటమే ఇందుకు కారణం. ఇక ఔషధాలు, బీమా రూపేణా కలిసొచ్చేది ఎక్కువే. అందుకే ప్రతినెలా కొంత కచ్చితంగా ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. పట్టణ మధ్య తరగతి కుటుంబాల్లో ఈ నెలవారీ ఆదా మందులను కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ.1700 నుంచి రూ.2200 వరకూ ఉండవచ్చనేది నిపుణుల అంచనా. పైపెచ్చు ఈ జీఎస్టీ సవరణల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఏ వస్తువుపై ఎంత తగ్గిందనేది ప్రతి తయారీదారూ కచ్చితంగా ప్రకటించాలనే నియమాన్ని పెట్టింది. ఈ మేరకు తయారీదారులు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం కల్పిస్తోంది. పైపెచ్చు ఉత్పత్తిదారులు తగ్గించినా రిటైల్ అమ్మకందారులు తగ్గించకపోతే పన్ను తగ్గింపు ప్రయోజనం జనానికి చేరదు కనక ఈ అమలు తీరును 6 నెలల పాటు నిశితంగా పర్యవేక్షించనుంది కూడా.ఏవి చౌకగా లభిస్తాయంటే..⇒ వెన్న, నెయ్యి, చీజ్, కండెన్స్డ్ మిల్్క, యూహెచ్టీ మిల్క్ వంటివి గతంలో 12, 5 శాతాల్లో ఉండగా ఇపుడు 5, సున్నా శాతాల్లోకి వచ్చాయి. ⇒ బిస్కెట్లు, కేక్లు, పాస్తా, ఓట్స్, కార్న్ఫ్లేక్స్ వంటి బ్రేక్ఫాస్ట్ సిరెల్స్, చీజ్ పఫ్లు, పలు రకాల కన్ఫెక్షనరీ ఉత్పత్తులు గతంలో ఉన్న 18 నుంచి 5 శాతానికి దిగివస్తాయి. ⇒ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులైన షాంపూలు, తల నూనె, టూత్పేస్ట్, సబ్బులు చాలావరకూ గతంలో 18 శాతంలో ఉండగా ఇపుడు 5 శాతం పరిధిలోకి వచ్చాయి. ⇒ ఆహార దినుసులతో పాటు శీతల పానీయాల పరిధిలోకి రాని జ్యూస్లు, మొక్కల ఆధారిత మిల్క్ డ్రింక్లు, పలురకాల డ్రైఫ్రూట్స్ గతంలో 12, 28 శాతాల్లో ఉండగా ఇపుడు 5 శాతానికి వచ్చాయి. ⇒ చిన్న, మిడ్సైజ్ కార్లపై గతంలో ఉన్న 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గించారు. వాహనాల ధర ఎక్కువ కనక ఈ పన్ను తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలూ జీఎస్టీ సవరణకు అనుగుణంగా తమ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ⇒ 32 అంగుళాలకు మించి ఉన్న టీవీలపై ఇప్పటి వరకు ఉన్న 28 శాతం జీఎస్టీ కాస్తా 18 శాతం కిందకు వచ్చింది. దీంతో వాటి మోడళ్ల ఆధారంగా రూ.2,500 నుంచి రూ.85,000 వరకు ధరలు తగ్గాయి. ప్రముఖ కంపెనీలు సోనీ, ఎల్జీ, ప్యానాసోనిక్ ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించాయి. ఏసీలు, కొన్ని రకాల వాషింగ్ మెషీన్లపైనా జీఎస్టీ 28% నుంచి 18 శాతానికి తగ్గింది. ⇒ నిర్మాణంలోకి వినియోగించే సిమెంట్, ఇతర బిల్డింగ్ మెటీరియల్స్పైనా జీఎస్టీ తగ్గించడమనేది ఇళ్ల మార్కెట్కు అనుకూలించనుంది.ముందు వరుసలో కార్ల కంపెనీలు... ⇒ మారుతి సుజుకీలో ప్రారంభ శ్రేణి కార్లు అయిన ఎస్ప్రెస్సోపై రూ.1,29,600, ఆల్టో కే10పై రూ.1,07,600 వరకు ధర తగ్గింది. గ్రాంట్ విటారాపై రూ.1.07 లక్షలు, ఎక్స్ఎల్ 6పై రూ.52,000, ఎర్టిగాపై రూ.46,400 వరకు ధర తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇతర అన్ని మోడళ్లపైనా ధరలు తగ్గాయి. ⇒ టాటా మోటార్స్ తన పంచ్ ఎస్యూవీపై రూ. 85,000, నెక్సాన్పై రూ.1.55 లక్షల వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కర్వ్పై రూ.65,000, హ్యారియ ర్, సఫారీ ధరలు రూ.1.45 లక్షల వరకు తగ్గాయి. ⇒ మహీంద్రా అండ్ మహీంద్రా తన మోడళ్ల ధరలను గరిష్ఠంగా రూ.1.56 లక్షల వరకు తగ్గించింది. ఇందులో పాపులర్ మోడల్ బొలెరో ధర రూ.1.27 లక్షలు తగ్గింది. థార్ డీజిల్ వేరియంట్లపై రూ.1.35 లక్షల వరకు తగ్గింది. ⇒ కియా కార్ల ధరలు రూ.4.48 లక్షల వరకు చౌక అవుతున్నాయి. మెర్సెడెస్ బెంజ్ తన విలాస కార్లు ఏ–క్లాస్పై రూ.2 లక్షల వరకు, ఎస్–క్లాస్పై రూ.10 లక్షల వరకు ధరలు తగ్గించింది. బీఎండబ్ల్యూ కార్ల ధరలు రూ.13.6 లక్షల మేర తగ్గాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహన ధరలు రూ.4.5–30.4 లక్షల మధ్య తగ్గాయి. హీరో మోటోకార్ప్ బైక్లు, స్కూటర్ల ధరలు రూ.15,743 వర కు, హోండా మోటార్ సైకిల్ వాహన ధరలు 350 సీసీలోపు ఉన్న వాటిపై రూ.18,800 వరకు తగ్గాయి.వీటిపై ఇక నో జీఎస్టీ జీవిత బీమా, ఆరోగ్య బీమాపై ఇప్పటి వరకు 18 శాతం జీఎస్టీ అమల్లో ఉండగా, పూర్తి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఈ మేరకు పాలసీ ప్రీమియం ధరలు తగ్గుతాయి. జీవిత బీమా పాలసీల్లోనూ ఎన్నో రకాలున్నాయి. వీటిపై భిన్నమైన జీఎస్టీ అమలవుతోంది. టర్మ్ ఇన్సూరెన్స్పై 18 శాతం... ఎండోమెంట్ ప్లాన్లపై మొదటి ఏడాది 4.5 శాతం.. రెండో ఏడాది నుంచి 2.25 శాతం చొప్పున కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియంపై జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. సింగిల్ ప్రీమియం పాలసీలపై 1.8 శాతం, యులిప్ ప్లాన్లపై (పెట్టుబడి భాగం కాకుండా, బీమా రక్షణ చార్జీలపైనే) 18 శాతం అమల్లో ఉంది. వీటన్నింటిపై జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. ఇకపై ఈ మేరకు ప్రీమియం భారం తగ్గుతుంది. కేన్సర్, జన్యు సంబంధిత, అరుదైన వ్యాధులు, గుండె జబ్బులకు వినియోగించే 33 ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించారు. వీటికి తోడు 12 శాతం పరిధిలో ఉన్న పలు ఔషధాలను 5 శాతం శ్లాబుకు మార్చడంతో ఈ మేరకు ఉపశమనం లభించనుంది. గ్లూకో మీటర్లు, డయాగ్నోస్టిక్స్ కిట్లు కూడా 5 శాతం కిందకు మారాయి. ఈ మేరకు ఎంఆర్పీలను సవరించాలని, లేదంటే పాత ఎంఆర్పీ రేట్లపై తగ్గించి విక్రయించాలని (సెపె్టంబర్ 22 నుంచి) ఔషధ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. -
‘మన టాలెంట్ చూసి భయపడుతున్నట్లున్నారు’
న్యూఢిల్లీ: అమెరికా హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు రుసుము భారీ పెంచిన నేపథ్యంలో ఒకవైపు ఆందోళన నెలకొంది. యూఎస్ వెళ్లాలనుకునే భారతీయుల ఆశలకు దాదాపు గండిపడింది. సుమారు లక్ష అమెరికన్ డాలర్ల(రూ. 83 లక్షలు) రుసుము చెల్లిస్తే కానీ కొత్తగా హెచ్ 1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిక అవకాశం ఉండదు. అంటే తమ దేశానికి రావొద్దని పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చేశారు. తమ దేశ సంపదను భారతీయులు కొల్లగొట్టేస్తున్నారనే భయం ట్రంప్లో మొదలైనట్లుంది.భారతీయుల్లో టాలెంట్కు కొదవ లేకపోవడంతో అమెరికాలోని అవకాశాలను ఇట్టే అందిపుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుము పెంపుతో దీనిని అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ తన అసూయను బయటపెట్టేసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేశారు. దీనిపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘ మన దేశంలోని యువత ప్రతిభకు అమెరికా భయపడినట్లుంది’ అంటూ చమత్కరించారు. ఇదే విషయంపై ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయల్ మాట్లాడారు. రేపు(సోమవారం, సెప్టెంబర్ 22వ తేదీ) వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు గోయల్. అయితే ముందుగానే అమెరికా విధించిన హెచ్ 1 బీ వీసా రుసుముకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు గోయల్ స్పందించారు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. టాలెంట్ పరంగా చూస్తే మనవాళ్లు మేటి అని, దాన్ని చూసే అమెరికా హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుమును అమాంతం పెంచేసిందంటూ నవ్వుతూ సెటైర్లు వేశారు. ‘మన ప్రతిభను చూసి వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు. దానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని చమత్కరించారు. పలు దేశాలు భారత్తో వాణిజ్య ఒప్పందాలకు ఎదురుచూస్తున్నాయని, భారత్తో సంబంధాలను మెరుగుపరుచకోవడానికి చాలా దేశాలు ముందు వరుసలో ఉన్నాయన్నారు. Bharat is a winner, come what may! pic.twitter.com/5MXtih8Cnr— Piyush Goyal (@PiyushGoyal) September 20, 2025 కాగా, నేటి(ఆదివారం, సెప్టెంబర్ 21వ తేదీ) నుంచి హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి లక్ష డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసే విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. ఇప్పటికే హెచ్1-బీ వీసా ఉన్నవారికి తాజా పెంపు వర్తించదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు తాజాగా విడుదల చేసిన ‘ప్రోక్లమేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్ఇమ్మిగ్రెంట్ వర్కర్స్’ ప్రకటన ప్రకారం హెచ్ 1బీ వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదిలా ఉంచితే, పీయూష్ గోయల్ భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 22న అమెరికాకు పయనం కానున్నారు. సెప్టెంబర్ 16న ఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ బృందం.. భారత ప్రతినిధి రాజేష్ అగర్వాల్ తో జరిపిన ఏడు గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన సుంకాలను తగ్గించడం ఈ చర్చల్లో ఒక కీలక అంశం కానుంది. -
జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రేపటి (సెప్టెంబర్ 22) నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమల్లోకి రానున్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం మిగులుతుందన్నారు ప్రధాని మోదీ. జీఎస్టీ 2.0పై ఆదివారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.మోదీ తన ప్రసంగంలో ‘రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలవుతున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఆదాయం మిగులుతుంది. జీఎస్టీ సంస్కరణలతో దేశంలో అందరికి మేలు జరుగుతోంది. జీఎస్టీ సంస్కరణలో భారత వృద్ధి రేటు మరింత పెరుగుతోంది. 2017లో జీఎస్టీ అద్యాయం మొదలైంది. అంతకుముందు ఎన్నోరకాల పన్నులు ఉండేవి.అంతకుముందు ఎన్నోరకాల పన్నులు ఉండేవి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా పన్నులు కట్టాల్సి వచ్చేది. గతంలో బెంగళూరులో వస్తువులు హైదరాబాద్కు వచ్చి అమ్ముకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. గతంలో టోల్,ట్యాక్స్లతో కంపెనీలు ఇబ్బంది పడేవి. ఆ ప్రభావం వినియోగదారులపై పడేది.2024లో గెలిచిన తర్వాత జీఎస్టీలపై ప్రాధాన్యం ఇచ్చాం. జీఎస్టీ సంస్కరణలతో అన్నీ వర్గాలతో మాట్లాడాం. వన్ నేషన్ - వన్ ట్యాక్స్ కలలను సాకారం చేశాం. జీఎస్టీ సంస్కరణలతో దేశం మరింత బలపడుతుంది. రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాం.ఈ చర్యలతో మధ్య తరగతి జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. అన్నీ రంగాల్లో సంస్కరణలు వస్తుంటాయి. కొత్త జీఎస్టీతో వస్తువుల ధరలు మరింత తగ్గుతాయి. కొన్నింటిపై పూర్తి మినహాయింపు ఉంటుంది. కొత్తజీఎస్టీతో పేద మధ్య తరగతి ప్రజలకు డబుల్ బోనంజా. నాగరిక దేవోభవన అనే నినాదంలో ముందుకు వెళ్తున్నాం. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం. టీవీ,ఫ్రిజ్,ఇంటి నిర్మాణంపై ఖర్చు తగ్గుతుంది’అని తెలిపారు. My address to the nation. https://t.co/OmgbHSmhsi— Narendra Modi (@narendramodi) September 21, 2025 -
నేడు ప్రధాని మోదీ ప్రసంగం.. జీఎస్టీపై కీలక వ్యాఖ్యలు!
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. అయితే, దేశంలో రేపటి నుంచి(సెప్టెంబర్ 22వ తేదీ) జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రానున్న నేపథ్యంలో మోదీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.ఇదిలా ఉండగా.. జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులుగా రెండు శ్లాబులు చేసింది. ఇందులో ఒకటి 5% కాగా రెండోది 18%. దీని ప్రకారం 12%, 28% పన్ను శ్లాబులు ఇకపై ఉండవు. దీంతో.. చాలా వస్తువులు, వాహనాలు పలు వాటిపై ధరలు తగ్గే అవకాశం ఉంది. Prime Minister Narendra Modi will address the nation today at 5 pm. pic.twitter.com/YFJc7fLdVu— ANI (@ANI) September 21, 2025 -
H1B ఎఫెక్ట్.. బలహీన ప్రధాని అంటూ మోదీపై విమర్శలు
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల వార్షిక ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచినా మౌనంగా ఉండిపోయిన ప్రధాని మోదీ నిజంగానే బలహీన ప్రధాని అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్ తమ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాల్లో పోస్ట్లు పెట్టారు.‘నేను మరోసారి చెబుతున్నా. భారత్కు ఉన్నది కేవలం బలహీన ప్రధాని మాత్రమే’ అని రాహుల్ విమర్శించారు. ‘మోదీజీ.. పుట్టినరోజు నాడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ట్రంప్ నుంచి మీకు ఫోన్కాల్ వచ్చింది. కానీ రిటర్న్ గిఫ్ట్గా లక్ష డాలర్ల రుసుం భారం భారతీయులపై పడింది’ అని ఖర్గే అన్నారు. ‘‘నాడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తరఫున పాల్గొని ‘మరోసారి ట్రంప్ సర్కార్’ అని మీరే నినదించారు. అందుకే రిటర్న్ గిఫ్ట్గా లక్షడాలర్ల వార్షిక ఫీజు భారం భారతీయ టెక్ ఉద్యోగులపై పడింది. ఇప్పటికే 50 శాతం టారిఫ్ పడుతోంది. దీంతో 10 కీలక రంగాల్లో భారత్ రూ.2.17 లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోతోంది. ఇవి చాలవన్నట్లు భారత్పై 100 శాతం టారిఫ్ మోపాలని ఐరోపా సమాఖ్యను ట్రంప్ ఉసిగొల్పుతున్నారు.విదేశీ అగ్రనేతలు కనబడగానే గట్టిగా ఆలింగనాలు చేసుకోవడం, ప్రాసలు వినిపించేలా నినాదాలు ఇవ్వడం, పెద్ద సభలు ఏర్పాటుచేయడం, ఆ సభల్లో మోదీ, మోదీ అని బిగ్గరగా నినా దాలు ఇప్పించుకోవడం సరైన విదేశాంగ విధానం అనిపించుకోదు’ అని మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘భారతీయ ప్రతిభావంతులు, అత్యున్నత నైపుణ్యాలున్న సిబ్బంది భవిష్యత్తును అమెరికా ప్రభుత్వం నాశనం చేస్తోంది. ఇంతటి రుసుముల భారం మోపినా మోదీ మౌనంగా ఉండటం ఆయన బలహీనతను రుజువుచేస్తోంది’అని గౌరవ్ గొగోయ్ అన్నారు. ‘నేరుగా చర్చల వేళ హెచ్–1బీ వీసాల విషయంలో నాటి ట్రంప్ ప్రభుత్వం ఆనాడు మోదీకి ఎలాంటి హామీ ఇవ్వలేదని 2017లోనే రాహుల్గాంధీ బయటపెట్టారు. ఇప్పుడు అది నిజమని నిరూపితమైంది’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా అన్నారు. -
పరాదీనతే ప్రబల శత్రువు
భావ్నగర్(గుజరాత్): హెచ్–1బీ వీసాల దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయుల నెత్తిన భారీ పిడుగు పడేసిన నేపథ్యంలో భారత ప్రధాని మోదీ హితబోధ ధోరణిలో స్పందించారు. శనివారం గుజరాత్లోని భావ్నగర్లో రూ.34,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి తర్వాత ‘సముద్రం నుంచి సమృద్ధిదాకా’కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘విశ్వబంధు భావనతో భారత్ దూసుకుపోతోంది. అందరితో మిత్రత్వం, సత్సంబంధాలు కోరుకునే, కొనసాగించే భారత్కు ప్రపంచంలో ప్రత్యేకంగా శత్రువంటూ ఎవరూ లేరనే చెప్పాలి. కానీ ఇతర దేశాలపై ఆధారపడటం అనే వైఖరి మనకు పెద్ద శత్రువులా తయారైంది. ఇలా మనపై పైచేయి సాధిస్తున్న పరా«దీనతను మనందరం కలసికట్టుగా ఓడిద్దాం. విదేశాలపై అతిగా ఆధారపడితే అంతగా స్వదేశం విఫలమవుతుంది. విశ్వశాంతి, శ్రేయస్సు, సుస్థిరత కోసం పాటుపడే దేశం కచి్చతంగా స్వయంసమృద్ధిని సాధించాలి. స్వావలంబన సాధించకుండా ఇతర దేశాలపై ఆధారపడితే జాతీయ ఆత్మగౌరవం అనేది దెబ్బతింటుంది’’అని మోదీ అన్నారు. 140 కోట్ల ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టబోం ‘‘140 కోట్ల ప్రజల భవిష్యత్తును విదేశీ శక్తుల చేతుల్లో పెట్టబోం. విదేశీ పరా«దీనత అనేది మన జాతీయాభివృద్ధిని నిర్దేశిస్తుందంటే అస్సలు అంగీకరించబోం. మన భావితరాల భవిష్యత్తును ఇతరుల చేతికి అందించబోం. ఏకంగా 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఇతర దేశాలపై ఆధారపడితే జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లే లెక్క. ఒక సామెతలాగా చెప్పాలంటే 100 సమస్యలకు ఒకే పరిష్కారం ఉన్నట్లు.. భారత్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. అదే ఆత్మనిర్భరత’’అని మోదీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్పై మళ్లీ విమర్శల నిప్పులు పనిలోపనిగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీలపై, గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ‘‘భారత్లో నిగూఢంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసే ప్రయత్నాలు స్వాతంత్య్రం వచ్చాక ఆరేడు దశాబ్దాలదాకా జరగనేలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెంచిపోషించిన లైసెన్స్రాజ్ వ్యవస్థలో దేశాభివృద్ధి పడకేసింది. లైసెన్స్–కోటా రాజ్యంలో భారత్ విశ్వవిపణిలోకి అడుగుపెట్టలేక ఒంటరిగా మిగిలిపోయింది. ఆ తర్వాత ప్రపంచీకరణ శకం మొదలైనప్పుడు గత ప్రభుత్వాలు తప్పిదాలే చేశాయి. దేశావసరాలు తీర్చుకునేందుకు స్వావలంబన సాధించాల్సిందిపోయి కేవలం దిగుమతులపైనే దృష్టిపెట్టాయి. దీంతో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు సర్వసాధారణమయ్యాయి. తప్పుడు విధానపర నిర్ణయాల కారణంగా ప్రభ కోల్పోయిన రంగాల్లో నౌకల తయారీ పరిశ్రమ కీలకమైంది. గతంలో భారతీయ తయారీ నౌకలనే మనం ఉపయోగించేవాళ్లం. ఇప్పుడు విదేశాలపై ఆధారపడుతున్నాం. అప్పట్లో ఎగుమతిదిగుమతి సరుకుల్లో 40 శాతం భారతీయ నౌకల్లో జరిగేవి. ఇప్పుడు కేవలం 5 శాతం నౌకల్లో జరుగుతోంది. మిగతావన్నీ విదేశీ నౌకలే. అందుకే ఏటా ఏకంగా రూ.6 లక్షల కోట్లను వినియోగ ఖర్చుల కింద విదేశీ నౌకల కంపెనీలకు చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఏడు దశాబ్దాల్లో ఎంత చెల్లించామో లెక్కేసుకోండి. ఇంత సొమ్ము విదేశాలకు వెళ్లడంతో ఆయా దేశాల్లో ఉపాధి పెరిగింది. ఇదే సొమ్ములో కొంత అయినా దేశీయంగా పెట్టుబడిగా మార్చి ఉంటే ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగేవో ఊహించుకోండి. దేశీయ నౌకలనే వినియోగించి ఉంటే ఏటా భారత్ లక్షల కోట్ల ఆదాయాన్ని చవిచూసేది’’అని మోదీ వివరించారు. షిప్ అయినా చిప్ అయినా ఇక్కడిదై ఉండాలిచిప్(సెమీకండక్టర్) కావొచ్చు షిప్ కావొచ్చు. ఏదైనా భారత్లోనే తయారుకావాలి. వాటిని మనమే తయారుచేద్దాం. సముద్రవిపణిలో అగ్రగామిగా మారితే అంతర్జాతీయంగా పరపతి ఇనుమడిస్తుంది. ఇందుకు దేశీయనౌకాశ్రయాలే వెన్నుముక. దేశీయ సముద్రనౌకారంగం నవతరం సంస్కరణల దిశగా దూసుకుపోతోంది. పలు రకాల డాక్యుమెంట్లు, పత్రాల సమర్పణ, తనిఖీ వంటి సుదీర్ఘ ప్రక్రియకు దేశంలోని అన్ని ప్రధాన నౌకాశ్రయాల్లో చెల్లుచీటీ రాసేశాం. దీంతో ఒకే దేశం–ఒకే డాక్యుమెంట్, ఒకే దేశం–ఒకే నౌకాశ్రయం విధానంలో వాణిజ్యం, వ్యాపారం సులభతరమవుతుంది’’అని అన్నారు. రుణాలు ఇక సులువు ‘‘నౌకల తయారీ సంస్థలకు ఇప్పుడు సులభంగా రుణాలు లభిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంక్ల నుంచి రుణాలను పొందగల్గుతున్నాయి. మౌలికవసతుల ఫైనాన్సింగ్ సదుపాయం ఇప్పుడు అన్ని నౌకలతయారీ సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. మరో మూడు కీలక పథకాలపై ఎన్డీఏ సర్కార్ దృష్టిసారించింది. భారత్ను సముద్రయాన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. రుణలభ్యతతో నూతన సాంకేతికత, ఆధునిక డిజైన్, అత్యున్నత ప్రమాణాలను సంస్థలు అందిపుచ్చుకుంటాయి. త్వరలో ఈ రంగంలో ప్రభుత్వం రూ.70,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది’’అని మోదీ అన్నారు. కార్యక్రమాల్లో భాగంగా రూ.7,870 కోట్ల విలువైన సముద్రయానసంబంధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. వీటికితోడు గుజరాత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోయే రూ.26,354 కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ మోదీ పాల్గొన్నారు. అహ్మదాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలోని గ్రీన్ఫీల్డ్ పారిశ్రామికప్రాంతమైన ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో హెలికాప్టర్లో విహంగవీక్షణం చేశారు. అహ్మదాబాద్లోని లోథల్లో భారతీయ సముద్రయాన వారసత్వాన్ని చాటే నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మాణపనులనూ మోదీ పర్యవేక్షించారు. అంతకుముందు ఆయన భావ్నగర్కు చేరుకోగానే రోడ్షోలో పాల్గొన్నారు. -
H-1B Visa: కఠిన నిర్ణయంపై ట్రంప్ అలా.. మోదీ ఇలా!
హెచ్-1బీ వీసాల (H-1B visa applications) దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం లక్షలాది హెచ్1బీ వీసా ఉద్యోగులను కలవరపెడుతోంది. కంపెనీలు దరఖాస్తుల సంఖ్య తగ్గించవచ్చని.. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని.. ఇలా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్ 20న సంతకం చేసిన ప్రోక్లమేషన్(ప్రభుత్వ ప్రకటన) ప్రకారం.. హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులు.. కొత్తగా వీసా పొందేవారు.. వీసా పొడిగించుకునేవాళ్లు.. వీరందరూ ప్రతి సంవత్సరం 1,00,000 డాలర్లు చెల్లించాల్సిందే. గతంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కేవలం $1,500 డాలర్లు మాత్రమే ఉండేది..సెప్టెంబర్ 21 నుంచి, ఒక్కో హెచ్1బీ ఉద్యోగికి $100,000 (సుమారు ₹83 లక్షలు) చెల్లించని పక్షంలో అమెరికాలోకి ప్రవేశం నిషేధం విధించబడుతుంది. ఈ మార్పు ఆదివారం ఉదయం 12:01 AM EDT (భారత కాలమానం ప్రకారం 9:30 AM IST) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన 12 నెలల పాటు అమలులో ఉంటుంది, అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థల సిఫారసు మేరకు దీన్ని పొడిగించే అవకాశం ఉంది. అయితే.. H-1B వీసా నిషేధ అంశంలో కొన్ని మినహాయింపులకు అవకాశం లేకపోలేదు. కానీ, ఇవి సర్వసాధారణంగా అందరికీ వర్తించవు, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (Department of Homeland Security) తమ స్వంత నిర్ణయాధికారంలో మాత్రమే ఇవి వర్తిస్తాయని సమాచారం. మినహాయింపులు వీళ్లకే!అత్యవసర విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పని చేసేవారు.. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించని వాళ్లకు మినహాయింపు దక్కవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.. అలాగే.. అమెరికాలో కీలక రంగాల్లో పనిచేస్తున్న కంపెనీల ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(R&D), ఆరోగ్యం, టెక్నాలజీ, డిఫెన్స్ వంటి రంగాల్లో పనిచేసే సంస్థల ఉద్యోగులకు మినహాయింపు దక్కే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు జాతీయ ప్రయోజనాలకు అవసరమైన పరిశ్రమలు.. ఆరోగ్య సంరక్షణ, సైబర్ భద్రత, AI, బయోటెక్, ఎనర్జీ రంగాల విదేశీ ఉద్యోగులకూ ఆ మినహాయింపు ఉండొచ్చు.ఈ మినహాయింపులు సదరు సంస్థలు స్వయంగానో లేదంటే వాళ్లు వ్యక్తిగతంగానూ దరఖాస్తు చేసినా పరిశీలించే అవకాశం ఉంది. అయితే, అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ(హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ) నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.ట్రంప్ ఏమన్నారంటే..అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మోదీ ఏమన్నారంటే.. ట్రంప్ నిర్ణయంపై భారత ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, కానీ.. విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని ఇవాళ జరిగిన గుజరాత్ సభలో అన్నారు. ‘నేడు భారత్ ‘‘విశ్వబంధు’’ స్ఫూర్తితో ముందుకుసాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతరదేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడించాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే.. దేశ అభివృద్ధి విఫలమవుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్గా మారాలి. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేం’ అని మోదీ పేర్కొన్నారు.అంత ఫీజు చెల్లించకపోతే..హెచ్1బీ వీసా ఫీజు చెల్లించకపోతే.. అమెరికాలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తారు. ఎయిర్పోర్టులోనే ఆపేస్తారు. యూఎస్సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) వీసాను రద్దు చేయొచ్చు. కంపెనీలు గనుక ఆ ఫీజు చెల్లించలేకపోతే.. ఉద్యోగి అమెరికాలో కొనసాగలేరు. అంటే ఉద్యోగం పోతుందన్నమాట. దొడ్డిదారిన లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే.. అక్రమ వలసదారుడిగా పరిగణించబడే ప్రమాదం ఉంది. ఫీజు లేకుండా అమెరికాలో ఉండటం నేరంగా పరిగణించబడుతుంది. డిపోర్టేషన్ కూడా జరగొచ్చు. -
కాంగ్రెస్ విధానాలతో యువతకు హాని: ప్రధాని మోదీ
గాంధీనగర్: ‘భారతదేశంలో సామర్థ్యానికి ఎప్పుడూ కొరత లేదు. అయితే కాంగ్రెస్ దేశ సామర్థ్యాన్ని విస్మరించింది. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన ఆరు నుండి ఏడు దశాబ్దాల తర్వాత కూడా భారతదేశం నిజంగా దక్కించుకోవలసినది సాధించలేకపోయింది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.. చాలా కాలం పాటు కాంగ్రెస్ దేశాన్ని లైసెన్స్ రాజ్లో బంధించి, ప్రపంచ మార్కెట్ల నుండి ఒంటరిగా ఉంచింది. తరువాత.. ప్రపంచీకరణ యుగం ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్ కేవలం దిగుమతుల మార్గాన్ని అనుసరించింది. అప్పుడు కూడా వేల కోట్ల విలువైన కుంభకోణాలకు పాల్పడింది. ఇటువంటి విధానాలతో కాంగ్రెస్ మన దేశ యువతకు తీవ్ర హాని కలిగించింది’ అని ప్రధాని మోదీ అన్నారు. #WATCH | Gujarat | Addressing a public rally in Bhavnagar, PM Modi asks officials to collect the paintings prepared by children, brought for him as a gift (Source: ANI/DD) pic.twitter.com/lG733mAkVK— ANI (@ANI) September 20, 2025ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన సొంత రాష్ట్రం గుజరాత్లో ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్లో మౌలిక సదుపాయాలు, సముద్ర రంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టి రూ.34,200 కోట్లకు పైగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి భావ్నగర్లో జరిగిన సభలో ప్రసంగించారు. #WATCH | Gujarat | PM Modi addresses a public rally in Bhavnagar(Source: ANI/DD) pic.twitter.com/34Hv7AbNzG— ANI (@ANI) September 20, 2025‘నా పుట్టినరోజున శుభాకాంక్షలు పంపిన దేశవిదేశీయులందరికీ కృతజ్ఞతలు. విశ్వకర్మ జయంతి నుండి గాంధీ జయంతి వరకు, దేశవ్యాప్తంగా సేవా పఖ్వాడాను జరుపుకుంటున్నారు. గత మూడు రోజుల్లో సేవా పఖ్వాడా కింద పలు కార్యక్రమాలు జరిగాయి. గుజరాత్లో ఇప్పటివరకు రక్తదాన శిబిరాల్లో లక్ష మంది రక్తదానం చేశారు. అనేక నగరాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో 30 వేలకు మించిన ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. నవరాత్రి పండుగ ప్రారంభం కానున్న సమయంలో నేను భావ్నగర్కు వచ్చాను. ఈసారి జీఎస్టీ తగ్గింపు కారణంగా మార్కెట్లు మరింత ఉత్సాహంగా ఉంటాయని భావిస్తున్నాను. #WATCH | Bhavnagar, Gujarat | PM Modi inaugurates and lays the foundation stone of multiple development projects worth over Rs 34,200 crore, including 'Samudra Se Samriddhi'(Source: ANI/DD) pic.twitter.com/mu6eZ6lGDO— ANI (@ANI) September 20, 2025ఈ పండుగ వాతావరణంలోమనం ‘సముద్ర సే సమృద్ధి’ పండుగను జరుపుకుంటున్నాం. నేడు భారతదేశం ‘విశ్వబంధు’ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతర దేశాలపై ఆధారపడాల్సి రావడం. ఇదే మన అతిపెద్ద శత్రువు, ఈ శత్రువును మనం ఓడించాలి. విదేశాలపై ఆధారపడటం ఎంత ఎక్కువగా ఉంటే, దేశం అంతగా వైఫల్యం చెందుతుంది. . ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశం ఆత్మనిర్భర్ భారత్గా మారాలి’ అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
బ్రిటన్ రాజు కానుకగా ఇచ్చిన మొక్క నాటిన ప్రధాని
న్యూఢిల్లీ: బ్రిటన్ రాజు చార్లెస్–3 తనకు 75వ పుట్టిన రోజు సందర్భంగా కానుకగా పంపిన కదంబ మొక్కను శుక్రవారం ప్రధాని మోదీ అధికార నివాస ప్రాంగణంలో నాటారు. ‘తల్లి పేరుతో ఒక చెట్టు’ అన్న ప్రధాని మోదీ నినాదం ప్రేరణతోనే రాజు చార్లెస్ ఈ మొక్కను పంపారని ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయం తెలిపింది. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలంటూ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాని మోదీ, చార్లెస్–3 కట్టుబడి ఉన్నారనేందుకు ఈ కానుకే ఒక ఉదాహరణ అని తెలిపింది. ఈ నెల 17వ తేదీన ప్రధాని మోదీ తన నివాస ప్రాంగణంలో మొక్కను నాటుతున్నప్పటి వీడియోను బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయం శుక్రవారం ఆన్లైన్లో షేర్ చేసింది. ఇద్దరు నేతల మైత్రి, పర్యావరణ పరిరక్షణపై ఇద్దరి నిబద్ధతకు ఇది ప్రతీకని తెలిపింది. జూలైలో బ్రిటన్లో ప్రధాని మోదీ పర్యటన సమయంలో రాజు చార్లెస్–3 సొనొమా మొక్కను బహుమతిగా అందజేశారు. ‘కామన్వెల్త్, యూకే–భారత్ ఉమ్మడి భాగస్వామ్య విజన్–2035కు వాతావరణ, పరిశుభ్రమైన ఇంధన రంగాలే కీలకం’ అని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది. -
ప్రధాని మోదీకి సుశీలా కర్కి ఫోన్
కాఠ్మండు: నేపాల్ ఆపద్ధర్మ ప్రధానిగా ఇటీవల నియమితులైన సుశీలా కర్కి గురువారం ప్రధాని మోదీతో ఫోన్లో సంభాషించారు. ప్రాధాన్యతాంశాలను అమలు చేయడంలో ఆపద్ధర్మ ప్రభుత్వానికి తోడ్పాటునిస్తామని ఆమెకు మోదీ హామీ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టాక కర్కి ఒక విదేశీ ప్రభుత్వాధినేతకు చేసిన మొట్టమొదటి ఫోన్ కాల్ ఇదే కావడం గమనార్హం. సామాజిక మాధ్య మాలపై నిషేధంతోపాటు ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా యువత ఆధ్వర్యంలో జరిగిన జెన్ జడ్ నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంతో ప్రధాని కేపీ శర్మ ఓలి గద్దెదిగగా, కర్కి ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్య తలు చేపట్టడం తెల్సిందే. గురువారం ఫోన్ కాల్ సందర్భంగా నేపాల్కు మొట్టమొదటి మహిళా ప్రధాని గా బాధ్యతలు చేపట్టిన కర్కికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారని విదేశాంగ శాఖ తెలిపింది. ఎన్నికల నిర్వహణే తమ ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉంటుందని కర్కి తెలిపారు. -
ప్రధాని మోదీతో పెప్సికో గ్లోబల్ సీఈవో భేటీ
న్యూఢిల్లీ: పెప్సికో గ్లోబల్ సీఈవో, చైర్మన్ రామన్ లగుర్తా మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత మార్కెట్లో ధీర్ఘకాల వ్యాపార లక్ష్యాలు, పెట్టుబడులు, తయారీ, ఆవిష్కరణలు, పరస్పర అభివృద్ధి అవకాశాలపై మోదీతో చర్చించారు. లగుర్తాతో పాటు కంపెనీ భారత సీఈవో జాగృత్ కొటేచా, గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిరుతిళ్లు(స్నాక్స్) ఆహారోత్పత్తులపై జీఎస్టీ 12% నుంచి 5 శాతానికి తగ్గిన నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. జీఎస్టీ తగ్గింపుతో పెప్సికో కీలక బ్రాండులు లేస్, కుర్కురే, చీటోస్, క్వాకర్ ఓట్స్కు లబ్ధి చేకూరనుంది. అయితే శీతలపానియాలపై 40% పన్ను విధించారు. పెప్సికో భారత్ను ‘అత్యంత కీలక మార్కెట్’గా పరిగణిస్తూ అసోంలో ఫుడ్స్ ప్లాంట్, మధ్యప్రదేశ్లో ప్లేవర్ తయారీ కేంద్రం, ఉత్తరప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ ప్లాంట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. -
సాంకేతిక సమానత్వ యోధుడు
ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం పొందడమనే ఓ సుదీర్ఘ ప్రక్రియ మీకు గుర్తుందా? పదేపదే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, కొండవీటి చాంతాడులా బారులు తీరిన జనాలు, అడపాదడపా రుసుముల చెల్లింపులు... ఇప్పుడివన్నీ మాయమై, మీ అరచేతిలోని ఫోన్లో సాక్షాత్తూ ప్రపంచమే ఇమిడిపోయింది. ఇది ఎంతమాత్రం ఆకస్మిక పరిణామం కాదు.ప్రధానమంత్రి మోదీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశపు సమానత్వ ఆయుధంగా మలిచారు. కార్పొరేట్ ప్రపంచంలోని ఓ ఉన్నతాధికారి తరహాలో ముంబయిలోని ఒక వీధి వ్యాపారి కూడా నేడు అదే యూపీఐ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించగలడు. ఈ పరిణామం మోదీ అనుసరించే అంత్యోదయ సూత్రం కీలక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టే, వరుసలో చివరి వ్యక్తికీ సాంకేతికత చేరువైంది.బీజం పడింది అక్కడే!మోదీ ముఖ్యమంత్రి హోదాలో తొలుత సాంకేతికత, ఆవిష్క రణల వినియోగం ద్వారా గుజరాత్ రూపాంతరీకరణకు కృషి చేశారు. ‘జ్యోతిగ్రామ్’ పేరిట ఆయన 2003లో ప్రారంభించిన పథకం ‘ఫీడర్ సెపరేషన్ టెక్నాలజీ’ని విజయవంతంగా ఉపయో గించింది. తద్వారా నిర్దిష్ట సమయం ప్రకారం వ్యవసాయ విద్యుత్ సరఫరాతో భూగర్భ జల క్షీణత అదుపులోకి వచ్చింది. మరోవైపు 24 గంటల విద్యుత్ సౌకర్యం గ్రామీణ పరిశ్రమలకు ఉత్తేజమిచ్చింది. చిన్న వ్యాపారాల విస్తృతితో వలసలు తగ్గాయి. ఒక అధ్యయనం ప్రకారం ఈ పథకంపై పెట్టిన రూ.1,115 కోట్ల పెట్టుబడి కేవలం రెండున్నరేళ్లలో తిరిగి వచ్చింది.నర్మదా నది కాలువపై 2012లో సౌర ఫలకాల ఏర్పాటుకు ఆయన నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 16,000 ఇళ్లకు ఏటా 1.6 కోట్ల యూనిట్ల విద్యుదుత్పాదన సాధ్యమైంది. మరోవైపు కాలువలో నీరు ఆవిరయ్యే ప్రక్రియ మందగించి, రైతులకు నీటి లభ్యత పెరిగింది. సాంకేతికతపై మోదీ దార్శనికతకు ఈ జోడు ప్రయోజ నాల విధానమే నిదర్శం. ఇక ‘ఇ–ధర’ వ్యవస్థ ద్వారా భూ రికార్డుల డిజిటలీకరణ చేపట్టారు. ‘స్వాగత్’ పేరిట పౌరులకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముఖ్యమంత్రితో నేరుగా ముచ్చటించే వీలు కలిగింది. ఆన్లైన్ టెండర్లతో అవినీతి అంతమైంది.జాతీయ యవనికపై...గుజరాత్లో సముపార్జించిన అనుభవాన్ని, ఆచరణాత్మక విధా నాలను ఆయన 2014లో ఢిల్లీకి తెచ్చారు. అనతి కాలంలోనే డిజిటల్ సార్వజనీన మౌలిక సదుపాయాలతో ‘ఇండియా స్టాక్’ రూపు దిద్దుకుంది. జన్ధన్, ఆధార్, మొబైల్ త్రయమే వీటికి పునాది.దేశవ్యాప్తంగా 53 కోట్ల మందికిపైగా ప్రజలను జన్ధన్ ఖాతాలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తెచ్చాయి. వీధి వ్యాపారులు, రోజుకూలీలు సహా పూర్తిగా నగదు లావాదేవీలు నిర్వహించే గ్రామీణులకూ ఇవాళ బ్యాంకు ఖాతాలున్నాయి. ఆధార్ పౌరులకు డిజిటల్ గుర్తింపునిచ్చింది. ఇప్పటివరకు 142 కోట్ల ప్రజలు దానికింద నమోదు చేసుకున్నారు. ఆధార్ ద్వారా ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా మధ్యవర్తుల జోక్యం తొలగి, నిధులు పక్కదారి పట్టడం తగ్గింది. డీబీటీని అవలంబించడం ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది.యూపీఐ ద్వారా దేశంలో చెల్లింపుల తీరులో సమూల మార్పు లొచ్చాయి. ఇది ప్రారంభించినప్పటి నుంచి 55 కోట్లకు పైగా వినియోగదారులు లావాదేవీలు నిర్వహించారు. ఒక్క 2025 ఆగస్టులోనే 20 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ. 24.85 లక్షల కోట్లు. నేడు ప్రపంచవ్యాప్తంగా రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్లోనే జరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు నిర్వహించాల్సిందిగా కోవిడ్ సమయంలో ఆయన కోరిన వేళ, ఆర్థిక వ్యవ స్థలో ఆ దిశగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వీసా కన్నా యూపీఐ ఎక్కువ లావాదేవీ లను ప్రాసెస్ చేస్తోంది. ఇప్పుడొక చిన్న మొబైల్ ఫోనే ఓ బ్యాంకు. సాంకేతికత అందరిదీ!సాంకేతికత వల్ల వ్యవసాయం, ఆరోగ్య రక్షణ రంగాల్లో సమూ లమైన మార్పులు వచ్చాయి. హరియాణాలో ఉండే ఓ రైతు జగదేవ్ సింగ్ విషయమే తీసుకోండి! ఆయనిప్పుడు ఏఐ యాప్లను ఉపయోగించి పంట సంబంధిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని, భూసారా నికి సంబంధించిన డేటాను తన ఫోన్ లోనే తెలుసుకుంటున్నారు.పీఎం–కిసాన్ పథకం 11 కోట్ల రైతులకు డిజిటల్ పద్ధతిలో నేరుగా ఆర్థిక చేయూతను అందిస్తోంది. డిజి లాకర్కు ఇప్పుడు 57 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. 967 కోట్ల పత్రాలు అందులో డిజిటల్గా నిల్వ అయి ఉన్నాయి. మీ డ్రైవింగ్ లైసెన్సు, డిగ్రీ సర్టిఫికెట్లు, ఆధార్, ఇతర అధికారిక పత్రాలు భద్రంగా మీ ఫోన్ లోనే ఉంటాయి. ఇకపై రోడ్డు మీద పోలీసు తనిఖీల్లో భౌతిక పత్రాల కోసం తడబడాల్సిన అవసరం లేదు. డిజి లాకర్ నుంచి మీ డిజిటల్ లైసెన్సును చూపించండి చాలు. తక్షణ ఆధార్ ధ్రువీకరణ ద్వారా... ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సులభతరమైంది.అసాధ్యం అనిపించిన దానిని భారతదేశం సాధించింది. మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని... అది కూడా హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్తో చేరుకుంది. ప్రపంచ స్థాయి ఫలితాలను అందిస్తూ భారతీయ ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని నిరూ పించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ పై చేసిన వ్యయం రూ. 450 కోట్లు మాత్రమే. చంద్రయాన్–3 భూ ఉపగ్రహంపై దిగిన నాలుగో దేశంగా భారత్ను నిలబెట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కించింది. ఒకే మిషన్ లో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించింది. భారతదేశ రాకెట్లు ఇప్పుడు 34 దేశాల ఉపగ్ర హాలను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నాయి. ‘గగన్ యాన్’ మిషన్తో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతరిక్షంలోకి మాన వులను పంపిన నాలుగో దేశంగా కూడా భారత్ నిలవనుంది. పీఎం గతిశక్తి పోర్టల్ అపూర్వమైన స్థాయిలో జీఐఎస్ టెక్నా లజీని ఉపయోగిస్తోంది. ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టునూ డిజిటల్గా మ్యాప్ చేస్తారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడ రేవులన్నీ కలిసి సమన్వయ ప్రణాళికగా రూపొందిస్తారు. ఇకపై సమన్వయ లోపం వల్ల జరిగే ఆలస్యం ఉండదు.ఇండియా ఏఐ మిషన్ ద్వారా, 38,000 జీపీయూలు మూడింట ఒక వంతు ప్రపంచ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇది స్టార్టప్ లకు, పరిశోధకులకు, విద్యార్థులకు సిలికాన్ వ్యాలీ స్థాయి కంప్యూ టింగ్ను గంటకు సగటున రూ. 67 రేటుతో అందించింది.మానవ అనుసంధానంప్రధాని మోదీకి సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసు. కానీ ఆయన ప్రజలను మరింత బాగా అర్థం చేసుకున్నారు. అంత్యో దయకు సంబంధించి ఆయన దార్శనికత ప్రతి ఒక్క డిజిటల్ కార్య క్రమాన్నీ ముందుకు నడిపిస్తోంది. యూపీఐ బహుళ భాషల్లో అందు బాటులో ఉంది. అత్యంత ధనిక పారిశ్రామికవేత్తతో సమానమైన డిజిటల్ గుర్తింపును నిరుపేద రైతు కూడా కలిగి ఉన్నాడు.సింగపూర్ నుంచి ఫ్రాన్స్ వరకు ఎన్నో దేశాలు యూపీఐతో అనుసంధానమైనాయి. సమ్మిళిత వృద్ధికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ అవసరమని జీ20 ఆమోదించింది. దీనికి జపాన్ పేటెంట్ మంజూరు చేసింది. భారత్ పరిష్కారంగా ప్రారంభమైన యూపీఐ డిజిటల్ ప్రజాస్వామ్యానికి ప్రపంచ నమూనాగా మారింది.గుజరాత్లో మోదీ చేసిన ప్రారంభ ప్రయోగాల నుంచి డిజిటల్ ఇండియా వరకు... ఈ ప్రయాణం జీవితాలను మార్చే సాంకేతిక పరిజ్ఞాన శక్తిని ప్రదర్శిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన తన పాలన సారాంశంగా మార్చారు. పాలకులు మానవీయ కోణంలో సాంకేతికతను స్వీకరించినప్పుడు, మొత్తం దేశాలు భవిష్యత్తులోకి దూసుకెళ్లగలవని ఆయన నిరూపించారు.అశ్వినీ వైష్ణవ్వ్యాసకర్త కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార – ప్రసార శాఖ మంత్రి -
అబ్బాస్ ఎవరు? వాద్నగర్లో మోదీతో పాటు ఎందుకున్నారు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు వేడుకలను భారతీయ జనతా పార్టీ 15 రోజుల పాటు నిర్వహిస్తోంది. ఈ పక్షం రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. అటువంటి వాటిలో ఒకటే ప్రధాని మోదీ బాల్య స్నేహితుడు అబ్బాస్ రామ్సదా వృత్తాంతం. అతను చిన్నతనంలో మోదీ కుటుంబంతో కలిసి వాద్నగర్లో ఉన్నారు.2022లో ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరా బెన్ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్లోని వాద్నగర్లోని తన ఇంటికి వెళ్లారు. అప్పుడు ప్రధాని మోదీ బ్లాగ్లో తన తల్లి హీరాబెన్ పోరాట కథను చెప్పారు. ఈ బ్లాగ్లో అబ్బాస్ అనే ముస్లిం స్నేహితుని గురించి ప్రస్తావించారు. తన తండ్రి స్నేహితుడొకరు చనిపోవడంతో అతని కుమారుడు అబ్బాస్ను ఇంటికి తీసుకొచ్చారని మోదీ గుర్తు చేసుకున్నారు. అతను తమ దగ్గరే ఉంటూ చదువు పూర్తి చేశాడని, అన్నదమ్ములందరినీ అమ్మ ఎలా చూసుకునేదో అబ్బాస్ ని కూడా అలాగే చూసుకునేదన్నారు. ప్రతి సంవత్సరం ఈద్ రోజున అబ్బాస్ కోసం అతనికి ఇష్టమైన ప్రత్యేక వంటకాలు వండేవారని తెలిపారు.అబ్బాస్.. మోదీ కుటుంబంలోనే ఉంటూ మోదీ సోదరుడు పంకజ్ మోడీతో కలిసి ఒకే తరగతిలో చదువుకున్నారు. 1973-74లో అబ్బాస్ తన మెట్రిక్యులేషన్ పరీక్షలలో అద్భుతమైన గ్రేడ్ సాధించారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. అయితే అబ్బాస్ తన మెట్రిక్యులేషన్ పరీక్షకు హాజరయ్యే సమయానికి, మోదీ.. వాద్నగర్ నుండి అహ్మదాబాద్కు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా వెళ్లిపోయారు. ప్రధాని సోదరుడు పంకజ్ మోదీ , అబ్బాస్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ప్రధాని మోదీ సోదరులలో మరొకరైన ప్రహ్లాద్ మోదీ ఒకసారి అబ్బాస్ తమ ఇంట్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.2022లో అబ్బాస్ ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసి, తన చిన్న కుమారునితో పాటు ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లారు. అబ్బాస్ పెద్ద కుమారుడు ఇప్పటికీ గుజరాత్లోని మెహ్సానాలో నివసిస్తున్నారు. ప్రధాని మోదీపై అబ్బాస్ రాసిన పుస్తకంలో.. తనకు మోదీ కుటుంబం సుంచి లభించిన మద్దతు, ఆప్యాయత మరువలేనిదన్నారు. ముఖ్యంగా హీరాబెన్ ఎంతో ప్రేమ చూపేవారన్నారు. ఆమె తన సొంత పిల్లల కంటే తనను ఎక్కువగా చూసుకున్నారని ఆయన పేర్కొన్నారు. -
చొరబాటుదారుల కోసం కాంగ్రెస్ యాత్రలా?
న్యూఢిల్లీ: విపక్ష కాంగ్రెస్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. చొరబాటుదారులను రక్షించడమే లక్ష్యంగా ఆ పార్టీ యాత్రలు చేస్తోందని మండిపడ్డారు. చొరబాటుదారుల ఓట్లతో ఎన్నికల్లో నెగ్గాలని కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 ప్రజా సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. దేశ పౌరులపై కాంగ్రెస్కు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాం«దీకి ఏమాత్రం విశ్వాసం లేదని విమర్శించారు. అందుకే చొరబాటుదారులకు అండగా నిలుస్తున్నారని, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితాల్లో చొరబాటుదారులు ఎప్పటికీ ఉండాలన్నదే కాంగ్రెస్ విధానమని ఆక్షేపించారు. మనదేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి ఓట్లు హక్కు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో నెగ్గడానికి అక్రమ వలసదారులకు అండగా నిలుస్తారా? ఇదెక్కడి చోద్యం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ విజయాలను ప్రజలు మర్చిపోలేరుదేశంలో ఓటర్ల జాబితాల ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియకు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు అమిత్ షా స్పష్టంచేశారు. బిహార్లో కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రపై విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగిస్తే తప్పేమిటని అన్నారు. దేశ సరిహద్దులను మోదీ ప్రభుత్వం కాపాడుతోందని చెప్పారు. మన సరిహద్దులను అతిక్రమించాలని చూసిన శత్రువులపై సర్జికల్, వైమానిక దాడులు చేసినట్లు గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్కు తగిన గుణపాఠం నేర్పామని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో 2027 నాటికి మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్వవస్థగా మారడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. ఇకపై స్వదేశీ ఉత్పత్తులు ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎన్నో విజయాలు సాధించిందని, దేశ ప్రజలు వాటిని ఎప్పటికీ మర్చిపోలేరని వెల్లడించారు. మోదీ పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి లభించిందని గుర్తుచేశారు. -
నవ భారత్ బెదరదు!
ధార్: అణ్వాయుధాలను బూచిగా చూపించి భారత్ను బెదిరిస్తామంటే ఎంతమాత్రం కుదరదని పాకిస్తాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా పాకిస్తాన్కు తేల్చిచెప్పారు. అణ్వ్రస్తాలకు నవ భారతదేశం(న్యూ ఇండియా) భయపడదని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కోలుకోలేని నష్టం జరిగిందని తెలిపారు. నష్టం జరిగినట్లు జైషే మొహమ్మద్ కమాండర్ స్వయంగా అంగీకరించాడని గుర్తుచేశారు. 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో పర్యటించారు. పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలకు శ్రీకారం చుట్టారు. భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే... మన సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది ‘‘పాకిస్తాన్ ఉగ్రవాదులు మన అక్కచెల్లెమ్మలు, కుమార్తెల సిందూరం తుడిచేశారు. ముష్కరులకు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాం. వారి స్థావరాలను ధ్వంసం చేశాం. అపూర్వమైన ధైర్య సాహసాలు కలిగిన మన సైనిక దళాలు కేవలం రెప్పపాటు కాలంలో పాకిస్తాన్ను మోకాళ్లపై నిల్చోబెట్టాయి. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ ఉగ్రవాద ముఠా నాయకులకు జరిగిన నష్టాన్ని నిన్ననే ఓ ముష్కరుడు రోదిస్తూ బయటపెట్టడం ప్రపంచమంతా చూసింది. ఇది నవ భారత్. అణు బాంబులతో మనల్ని ఎవరూ భయపెట్టలేరు. ఉగ్రవాదుల ఇళ్లలోకి ప్రవేశించి మరీ వారిని మట్టుబెట్టగలం. మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. మన మంత్రం స్వదేశీ ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలని మరోసారి కోరుతున్నా. పండుగల సీజన్ రాబోతోంది. స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెంచుకోవాలి. మీరు కొనేది, విక్రయించేది ఏదైనా సరే అది ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తి కావాలి. స్వాతంత్య్రం సాధించడానికి జాతిపిత మహాత్మా గాంధీ స్వదేశీని ఒక ఆయుధంగా ప్రయోగించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’కు స్వదేశీ ఉత్పత్తుల వాడకమే పునాది అని మర్చిపోవద్దు. మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులు ఉపయోగిస్తేనే దేశానికి లబ్ధి చేకూరుతుంది. ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. ప్రజలు స్వదేశీ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. మన ఉత్పత్తుల పట్ల మనం గరి్వంచాలి. అది చిన్న వస్తువైనా, పెద్ద వస్తువైనా మన దేశంలో తయారైన వస్తువునే కొనండి. పిల్లల బొమ్మలు, దీపావళి విగ్రహాలు, ఇంట్లో అలంకరణ సామగ్రి, మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు మన దగ్గర తయారవుతున్నాయి. వాటిని ఉపయోగించుకోండి. ఏదైనా కొనుగోలు చేసే ముందు అది ‘మేడ్ ఇన్ ఇండియా’ అవునో కాదో తనిఖీ చేసుకోండి. స్వదేశీ ఉత్పత్తులు కొంటే మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది. అది నేరుగా దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ సొమ్ముతో రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించవచ్చు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు. స్వదేశీ వస్తువుల విక్రయాలు పెరిగితే కంపెనీల్లో వాటి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. తద్వారా మన దగ్గర ఎంతోమందికి ఉద్యోగాలు లభిస్తాయి. తగ్గించిన జీఎస్టీ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. స్వదేశీ వస్తువులు కొని ఈ రేట్ల తగ్గింపు ప్రయోజనం పొందండి. విక్రయదారులు తమ దుకాణాల వల్ల ‘స్వదేశీ’ బోర్డులు గర్వంగా ఏర్పాటు చేసుకోండి. కోటికి చేరిన సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డులు ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. దీనివల్ల దేశంలో వస్త్ర పరిశ్రమకు నూతన బలం చేకూరుతుంది. యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు. అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఔషధాలు సైతం ఉచితంగా అందజేస్తారు. ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అవగాహన, వనరులు లేవన్న కారణంతో మహిళలు నష్టపోవడానికి వీల్లేదు. అందుకే ఈ కార్యక్రమం ప్రారంభించాం. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా వ్యాధిని అరికట్టడానికి 2023లో నేషనల్ మిషన్ను మధ్యప్రదేశ్లోనే ప్రారంభించాం. అప్పట్లో మొట్టమొదటి సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డు అందజేశాం. ఈరోజు కార్డుల సంఖ్య కోటికి చేరింది. దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికిపైగా ప్రజలు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలితాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు’’ అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. పీఎం మిత్రా పార్కు దేశంలో మొట్టమొదటి ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైట్ రీజియన్, అప్పారెల్(పీఎం మిత్రా)’ పార్కు నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్ను, రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఎం మిత్రా పార్కులో భాగంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ప్రపంచ స్థాయి టెక్స్టైల్ తయారీ కేంద్రాలను స్థాపించబోతున్నారు. రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమం కింద శిశు సంరక్షణ, విద్యతోపాటు స్థానికంగా లభించే పౌష్టికాహారాన్ని ప్రోత్సహిస్తారు. చక్కెర, వంటనూనెల వినియోగం తగ్గించుకోవాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తారు. సుమన్ సఖి చాట్బాట్ను సైతం మోదీ ప్రారంభించారు. తల్లి, శిశువుల ఆరోగ్యంపై అవగాహన పెంచబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు తగిన సమాచారం అందజేస్తారు. తన జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ స్వయం సహాయక సంఘం సభ్యురాలికి ఒక మొక్కను బహూకరించారు. -
మోదీ జీవితంతో మా వందే
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ వెండితెరకు రానుంది. ‘మా వందే’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించనున్నారు. క్రాంతికుమార్ సీహెచ్. రచన, దర్శకత్వంలో వీర్ రెడ్డి .ఎం నిర్మించనున్నారు. బుధవారం (సెప్టెంబరు 17) మోదీ పుట్టినరోజు సందర్భంగా ‘మా వందే’ప్రాజెక్ట్ని ప్రకటించారు. వీర్ రెడ్డి .ఎం మాట్లాడుతూ– ‘‘మోదీగారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ఘటనలు, విశేషాలను ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నాం. సమాజం కోసం ఎన్నో ఆకాంక్షలు గల బాలుడి నుంచి దేశ ప్రధానిగా మోదీ ఎదిగిన క్రమాన్ని చూపిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలు, సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్తో ‘మా వందే’ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లిష్లోనూ నిర్మిస్తాం. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఈ కథలో కీలకం. మోదీ ప్రపంచనాయకుడిగా ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ప్రేరణ ఎంతో ఉంది’’ అని చె΄్పారు. ఈ చిత్రానికి కెమెరా: కేకే సెంథిల్ కుమార్, సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: గంగాధర్ .ఎన్ ఎస్, వాణిశ్రీ .బి, లైన్ ప్రొడ్యూసర్: టీవీఎన్ రాజేశ్. -
ప్రధాని మోదీకి మెస్సీ జన్మదిన కానుక
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం (బుధవారం) సందర్భంగా క్రీడాలోకం శుభాకాంక్షలు తెలిపింది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా... అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ 2022 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జెర్సీని బహుమతిగా పంపించాడు. రెండు మూడు రోజుల్లో మెస్సీ అందించిన జెర్సీని ప్రధానికి బహుకరించనున్నట్లు ప్రమోటర్ సతాద్రు దత్తా వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్లో మెస్సీ భారత్లో పర్యటించనున్నాడు. ఇందులో భాగంగా కోల్కతా, ముంబై, ఢిల్లీలో అతడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. ‘మెస్సీని కలిసినప్పుడు ప్రధాని 75వ పుట్టిన రోజు రానుందని చెప్పాను. దీంతో అతడు వరల్డ్కప్ విన్నింగ్ జెర్సీపై తన ఆటోగ్రాఫ్ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాల్సిందిగా నాకు చెప్పాడు’ అని సతాద్రు దత్తా తెలిపారు. మెస్సీ పర్యటనలో భాగంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా–2025’ పేరిట మెస్సీ పర్యటన కోల్కతా నుంచి ప్రారంభం కానుంది. 2011లో చివరిసారిగా మెస్సీ భారత్లో పర్యటించాడు. వెనిజులాతో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు అర్జెంటీనా జట్టు అప్పట్లో కోల్కతాకు వచ్చింది. మరోవైపు ఈ ఏడాది నవంబర్లో అర్జెంటీనా జట్టు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు కేరళాలోపర్యటించనుందని... ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దురెహమాన్ వెల్లడించారు. -
మళ్లీ అమెరికాతో నెయ్యం
ఇది స్పీడ్ యుగం. కరచాలనాలైనా, కలహాలైనా ఎంత త్వరగా మొదలవుతాయో అంత త్వరగానూ కనుమరుగవుతాయి. భారత్–అమెరికాల సంబంధాల తీరు గమనిస్తే ఇది అర్థమవుతుంది. నెల్లాళ్ల క్రితం దాదాపు ఛిద్రమయ్యాయనుకున్న ఈ సంబంధాల్లో మళ్లీ సుహృద్భావం మొగ్గ తొడుగుతోంది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా సాకారం చేసుకోవాలని మంగళవారం న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య దూత బ్రెండాన్ లించ్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గంతో మన వాణిజ్య మంత్రిత్వ బృందం చర్చించాక అంగీకారం కుదిరింది. అంతేకాదు... ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ట్రంప్ ఆయనకు ఫోన్చేసి శుభాకాంక్షలు చెప్పటం, దాన్ని ఎక్స్లో మోదీ ప్రస్తావించి రష్యా–ఉక్రెయిన్ ఘర్షణలకు శాంతియుత పరిష్కారం కోసం ట్రంప్ చొరవ తీసుకోవటాన్ని ప్రశంసించటం గమనించదగ్గవి. సరిగ్గా నెల్లాళ్ల క్రితం పరిస్థితి వేరు. రష్యా దురాక్రమణ యుద్ధం కొనసాగటానికి భారత్ వైఖరే ప్రధాన కారణమంటూ ట్రంప్ నిందించారు. అంత క్రితం ఆగస్టు మొదటి వారంలో విధించిన 25 శాతం సుంకాలతో పాటు రష్యా ముడిచమురు కొంటున్నందుకు ఆ నెల చివరిలో మరో 25 శాతం అదనంగా వడ్డించి దాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. కేవలం భారత్పై విషం కక్కడం కోసం నియమితులైనట్టుగా వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మొదలుకొని వాణిజ్యమంత్రి హొవార్డ్ లుత్నిక్ వరకూ ఇష్టానుసారం మాట్లాడారు. వీరిలో నవారో మిగిలినవారికన్నా భిన్నం. ఆయన ఆశువుగా అబద్ధాలాడగలరు. ఆధారాలతోగానీ, ఇరు దేశాల చారిత్రక సంబంధ బాంధవ్యాలతో గానీ ఆయనకు పనిలేదు. ఫలానా కులానికి లబ్ధి చేకూర్చటం కోసం భారత ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతోందని వ్యాఖ్యానించగలరు. ఇరు దేశాల మధ్యా చర్చలు మొదలవుతున్న తరుణంలో కూడా భారత్ను ‘ట్యారిఫ్ల మహారాజు’ అనగలరు. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించగలరు. మన దేశం ఎంతో సంయమనం పాటించబట్టే అయిదో రౌండ్ తర్వాత ఆగిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. మధ్యలో అనవసరంగా పేచీకి దిగి విపరీతాలకు పోయింది అమెరికాయే!భారత్పై అదనపు సుంకాలు విధించటాన్ని సవాల్ చేస్తూ అమెరికా సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణలో భారత్ రష్యా చమురుకొనటాన్ని ట్రంప్ సర్కారు కారణంగా చూపింది. ఇప్పుడు సుంకాలను వెనక్కి తీసుకుంటే ఆ కేసు బలహీనపడుతుంది.ట్రంప్కు దౌత్యపరమైన మర్యాదలు తెలియవు. తన చర్యల వల్ల అవతలి దేశం స్థానికంగా ఎదుర్కొనక తప్పని ఒత్తిళ్లేమిటో అర్థం కావు. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే సుంకాల్లో 95 శాతం కోత పెట్టడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. కానీ 43 శాతం మంది గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్న సాగు రంగాన్ని పణంగా పెట్టడానికీ, చిన్న వ్యాపారుల, పాడిపరిశ్రమ రంగ ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలకూ తాము వ్యతిరేకమని మన ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. జన్యుపరంగా మార్పిడి చేసిన మొక్కజొన్న మాకొద్దని చెబుతోంది. ఈ విషయంలో భారత్ మనోభావాలను అర్థం చేసుకోకుండా ఒక ధూర్త వ్యాపారిలా ట్రంప్ ప్రవర్తించారు. ఇప్పుడు తామే వెనక్కి తగ్గక స్థితిని సృష్టించుకున్నారు.తమ దయా దాక్షిణ్యాలపై ఆధారపడే దక్షిణ కొరియా, జపాన్లు సాగిలపడటాన్ని చూసి అందరిపైనా ఆ వ్యూహమే పనికొస్తుందని ట్రంప్ భావించటమే ఇందుకు కారణం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో చెట్టపట్టాలేసుకున్నారు. ఆ దేశ ఆర్మీ చీఫ్ను నెత్తిన పెట్టుకున్నారు. ఈ పరిణామాలతో భారత్ బెంబేలు పడుతుందని భావించారు. కానీ షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సమావేశానికి మోదీ చైనా వెళ్లటం, అక్కడి పరిణామాలూ గమనించాక జరగబోయేదేమిటో ఆలస్యంగానైనా గ్రహించక తప్పలేదు. భారత్కు తాను తప్ప దిక్కులేదనుకోవటం ఘోర తప్పిదమని గ్రహించారు. పర్యవసానంగానే ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో వ్యాపారం తప్ప మరేం లేదన్న వైఖరిని ట్రంప్ విడనాడితేనే ప్రపంచంతో ఆయనకు సామరస్యం కుదురుతుంది. అలా కానట్టయితే నష్టపోయేది అమెరికాయే! -
ప్రధాని నరేంద్ర మోదీ బర్త్డే.. కీరవాణి స్పెషల్ సాంగ్
ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా స్పెషల్ సాంగ్ను రిలీజ్ చేశారు. పలు భాషల్లో రూపొందించిన ఈ పాటకు తెలుగులో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతమందించారు. మోదీ పుట్టిన రోజున విడుదలైన ప్రత్యేక గీతం అందరినీ ఆకట్టుకుంటోంది.నమో నమో ఆర్త బాంధవుడా.. అంటూ సాగే ఈ పాటను ఎం ఎం కీరవాణి, షగున్ సోధి, ఐరా ఉడిపి ఆలపించారు. మోదీ జీ @75 పేరుతో ఈ పాటను టీ సిరీస్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో మోదీ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులను ప్రస్తావించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ స్పెషల్ సాంగ్ను చూసేయండి.On the 75th birthday of Shri Narendra Modi Ji, we celebrate his spirit of service and vision for New India with “Modi Ji@75”. 🙏🇮🇳https://t.co/CGQ4AJtH9l#HappyBirthdayModiji @narendramodi@mmkeeravaani #ShagunSodhi #AiraaUdupi #Nadaan #Tseries pic.twitter.com/XimgRvVpR1— T-Series (@TSeries) September 17, 2025 -
సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్గా..ప్రధాని మోదీ డ్రెస్సింగ్ స్టైల్
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతేగాదు ఆ పార్టీ శ్రేణులు తమ ప్రియతమ నేత పుట్టినరోజుని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు కూడా. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్లోని థార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అక్కడ మోదీ వేదికపైకి రాగానే ఆ రాష్ట్ర సాంస్కృతికి అద్దం పట్టే గులాబీ రంగు తలపాగా(పగ్డి), జాకెట్ను బహుకరించారు. ఆ పగ్డిపై(తలపాగ) క్లిష్టమైన బంగారం, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేయడగా, బంజారా సమాజం శక్తిమంతమైన చేతి పనికి నిదర్శనం జాకెట్పై లంబానీ ఎంబ్రాయిడరీ ఉంది. వీటితోపాటు ధార్ జిల్లాకు చెందిన ప్రసిద్ధ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్త్రం పై సహజరంగులతో కూడిన రేఖాగణిత నమునాలు ఉన్న స్కార్ఫ్ను కూడా మోదీకి బహుకరించారు. ఇది ఆయన 75వ పుట్టినరోజు అయినప్పటికీ తన సిగ్నేచర్ శైలికే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రజలు ఇచ్చిన అభిమాన బహుమతులు, దుస్తుల కారణంగా మోదీ డ్రెస్సింగ్ స్టైల్ సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ముఖ్యంగా ఆ కానుకలతో మోదీ లుక్లో మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆయన ఈ పుట్టినరోజుని పీఎం మిత్ర పార్కుకి పునాది రాయి వేయడం, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ ఆరోగ్య పథకాల ప్రారంభంతో జరుపుకోవడం విశేషం. ఇక ఆ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..స్వావలంబన చర్య తీసుకోవాలనే పిలుపునిస్తూ ప్రసంగించారు. "ఇది పండుగల సమయం. మన స్వదేశీ ఉత్పత్తుల మంత్రాన్ని పునరావృతం చేస్తూ ఉండాలి. 140 మంది కోట్ల భారతీయులు ఏది కొనుగోలు చేసినా..అది మేడ్ ఇన్ ఇండియాగానే ఉండాలని అభ్యర్థిస్తున్నా. వికసిత్ భారత్కు మార్గం వేసి, ఆత్మనిర్బర్ భారత్గా ముందుకు సాగాలన్నారు. ఎప్పుడైతే మనం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామో, అప్పుడూ డబ్బు మన దేశంలోనే ఉంటుంది, పైగా ఆ డబ్బుని అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించవచ్చని అన్నారు. అలాగే మహేశ్వరి చీరలు, పీఎం మిత్రా పార్క్ ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ పట్టు, పత్తి లభ్యత, నాణ్యత తనిఖీలు, సులభమైన మార్కెట్ యాక్సెస్ వంటివి నిర్ధారిస్తారని అన్నారు. దాంతోపాటు స్పిన్నింగ్, డిజైనింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి అన్నీ ఒకే చోట జరుగుతాయని చెప్పారు. అదీగాక ఈ చీరలు, వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేస్తూ, దేవి అహల్యాబాయి హోల్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి..మన మాతృభూమిని ప్రపంచ మార్కెట్లో ప్రకాశవంతంగా మెరిసేలా చేయగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. .(చదవండి: ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్ మంత్రి..! ఎందుకోసం అంటే..) -
ప్రధాని మోదీకి దర్శకధీరుడు విషెస్.. వీడియో రిలీజ్
మనదేశ ప్రధాని నరేంద్రమోదీకి టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విషెస్ తెలిపారు. ఇవాళ మోదీ బర్త్ డే కావడంతో ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల వయసులోనూ మీరు 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. వరల్డ్వైడ్గా బలమైన స్థానంలో నిలబెట్టారని కొనియాడారు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, శక్తి, ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నానని వీడియోను పోస్ట్ చేశారు.టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సైతం ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ నిబద్ధత, జీవితం గురించి చూస్తే రాబోయే తరాలకు ఆదర్శమని కొనియాడారు. దేశం కోసం మీరు చేస్తున్న కృషి ప్రతి భారతీయుడని గర్వపడేలా చేసిందన్నారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని.. మీ నాయకత్వంతో మా అందరికీ స్ఫూర్తినిస్తూ కొనసాగాలని కోరుకుంటున్నాని వీడియో రిలీజ్ చేశారు.కాగా.. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.Happy Birthday to our honourable Prime Minister Shri @narendramodi Ji. May you always be blessed with good health, happiness and continue inspiring us all with your leadership. 🇮🇳 pic.twitter.com/hBKEnKGtVx— Mahesh Babu (@urstrulyMahesh) September 17, 2025 Wishing our Honourable Prime Minister Shri @narendramodi ji a very Happy Birthday. May you be blessed with good health, energy and happiness always. pic.twitter.com/fMftlzOeka— rajamouli ss (@ssrajamouli) September 17, 2025 -
PM Modi @75: మోదీకి ఆమె స్పెషల్ విషెస్
బీజేపీ అగ్రనేత, భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ, అభిమానులు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయంగా ఆయనకున్న పాపులారిటీ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వివిధ దేశాల అధినేతలు సైతం ఆయనకు విషెస్ తెలియజేశారు. అయితే.. అందులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సందేశం ప్రత్యేకంగా నిలిచింది. మీ శక్తి, సంకల్పం, నాయకత్వం లక్షలాది మందికి ప్రేరణ అంటూ మెలోనీ, మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు మంచి ఆరోగ్యం, శక్తి కలగాలని.. తద్వారా ఆయన భారత్ను ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు నడిపిస్తూ, మా రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచగలుగుతారు అని ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారామె. Buon 75° compleanno al Primo Ministro indiano @narendramodi.La sua forza, la sua determinazione e la sua capacità di guidare milioni di persone sono fonte di ispirazione.Con amicizia e stima gli auguro salute ed energia per continuare a guidare l’India verso un futuro luminoso… pic.twitter.com/OqXr1GFlc0— Giorgia Meloni (@GiorgiaMeloni) September 17, 2025మోదీ ప్రధాని అయ్యాక ఇటలీ-భారత్ మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. వాణిజ్యంతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో.. ఇరు దేశాల అధినేతల మధ్య స్నేహం గురించి కూడా సోషల్ మీడియా ప్రత్యేకంగా చర్చించుకుంటుంది. జీ7, జీ20, సీవోపీ28.. ఇలా ఏ సదస్సు, భేటీలో కలుసుకున్నా.. వెంటనే #Melodi (Meloni + Modi) అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యేది. చివరకు ఆ హ్యాష్ట్యాగ్తోనే మెలోనీ సైతం ట్వీట్లు చేయడం నెటిజన్స్ను మరింత ఆకర్షించింది. 2023లో సీవోపీ-28 సందర్భంగా.. “Melodi టీమ్ నుంచి హాయ్” అంటూ మెలోనీ పోస్ట్ చేయగా.. దానికి జై హో ఇండియా–ఇటలీ స్నేహం! అని మోదీ స్పందించారు. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీలు, హాస్యభరిత సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. జార్జియా మెలోనీ 1977 జనవరి 15న ఇటలీ రాజధాని రోమ్లో జన్మించారు. 2022 అక్టోబర్ 22న ఇటలీ అధ్యక్ష బాధత్యలు చేపట్టి.. ఆ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. మెలోనీకి వివాహం కాలేదు, కానీ 2015 నుంచి ఆండ్రియా జియాంబ్రూనో అనే టెలివిజన్ జర్నలిస్టుతో సహజీవనం చేశారు. వీళ్లకు ఓ పాప ఉంది. ఓ టీవీ షోలో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశాడనే కారణంతో 2023 అక్టోబర్లో జియాంబ్రూనోతో మెలోనీ విడిపోయారు. తన కుమార్తె భద్రత, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సమయంలో ఆమె ప్రకటించారు. -
మధ్యప్రదేశ్లోని ధార్ లో ప్రధాని మోదీ పర్యటన
-
అణు బెదిరింపులకు భయపడం: ప్రధాని మోదీ
ధార్: ‘ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్లోని ధార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరోక్షంగా పాకిస్తాన్ను ఉద్దేశిస్తూ హెచ్చరించారు.తన 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్కు ‘రిటర్న్ గిఫ్ట్’ను అందజేశారు. ధార్లోని మెగా టెక్స్టైల్ పార్క్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పార్క్ మూడు లక్షల మందికి ఉపాధి అందించనుంది. అలిగే లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా ధార్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధార్ చేరుకున్న ప్రధాని మోదీని ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్తోపాటు పలువురు సీనియర్ నాయకులు స్వాగతించారు. కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ప్రధాని మోదీని సాంప్రదాయ తలపాగా, శాలువా లతో సత్కరించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆయనకు జ్ఞాపికను అందజేశారు. प्रधानमंत्री श्री @narendramodi मध्य प्रदेश के धार में 'स्वस्थ नारी सशक्त परिवार' और 'आठवें राष्ट्रीय पोषण माह' अभियान का शुभारंभ कर रहे हैं। #SevaParv https://t.co/CFjDWloZLB— BJP (@BJP4India) September 17, 2025ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించారు. అమరవీరులైన సైనికులకు నివాళులర్పించారు. భారత సైనికుల ధైర్యం, పరాక్రమాలను ప్రశంసించారు. ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుందని పాక్ను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ ప్రజల శక్తి, కృషి సహకారాన్ని కూడా ప్రధాని మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ మోదీ నాయకత్వం భారతదేశాన్ని మార్చివేసిందని, పీఎం మిత్రా పార్క్ ద్వారా నిమార్ మాల్వా ప్రాంతంలో ఒక ప్రధాన మార్కెట్ ఏర్పడబోతున్నదని దీనికి ఈరోజు పునాది రాయి పడిందని అన్నారు. -
‘100 ఏళ్ల స్వాతంత్ర్య భారతానికి మోదీ సేవ చేస్తూనే ఉండాలి’
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులతోపాటు దేశంలోని వ్యాపార ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. స్వాతంత్ర్య భారతానికి 100 ఏళ్లు వచ్చే వరకు నరేంద్రమోదీ దేశానికి సేవ చేస్తూనే ఉండాలని అందులో తెలిపారు.‘ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని 145 కోట్ల మందికి ఇదో పండగ రోజు. భారతదేశంలోని మొత్తం వ్యాపార సమాజం తరఫున, రిలయన్స్, అంబానీ కుటుంబం తరఫున, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం అమృత్ కాల్లో మోదీ అమృత్ మహోత్సవ్ రావడం యాదృచ్ఛికం కాదు. స్వతంత్ర భారతదేశానికి 100 ఏళ్లు నిండిన నాటికి కూడా మోదీ భారతదేశానికి సేవ చేస్తూనే ఉండాలనేది కోరిక’ అని చెప్పారు.#WATCH | "It is my deepest wish that Modi ji should continue to serve India when independent India turns 100...", says Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani, on PM Modi's 75th birthdayHe says, "Today is a festive day for 1.45 billion… pic.twitter.com/u2NJSTMV3R— ANI (@ANI) September 17, 2025 -
మోదీ వీడియో.. కాంగ్రెస్కు ఝలక్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పాట్నా హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్పై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియోపై పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెంటనే ఏఐ వీడియోను తొలగించాలని కాంగ్రెస్ను ఆదేశించింది.వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్పై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బీహార్ యూనిట్ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీంతో, బీజేపీ నేతలు పలుచోట్ల కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే దీనిపై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు వాటిని వెంటనే తొలగించాలని కాంగ్రెస్ను ఆదేశించింది. ఈ సందర్బంగా చీఫ్ జస్టిస్ పీబీ బజంత్రి.. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి తొలగించాలని ఆదేశించారు.Bihar Congress posted this AI Generated Video about Narendra Modi and his mother.These people were screaming only a couple of weeks ago that they had nothing to do with abuse hurled at the Prime Minister's mother.Now they do this.Shocking behaviour. pic.twitter.com/rTsrZtpRFA— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 11, 2025బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శలకు దిగడం తీవ్ర కలకలం సృష్టించింది. బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
‘ఉపవాసంతో చురుకుదనం’.. ప్రధాని మోదీ హెల్త్ సీక్రెట్
ఈరోజు (సెప్టెంబర్ 17) ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే 75 ఏళ్ల వయసులో ప్రధాని నరేంద్ర మోదీ ఏం తింటుంటారు. ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంటుంది. కాగా ప్రధాని మోదీ రాబోయే నవరాత్రి రోజుల్లో కఠినమైన ఉపవాస దీక్షను అనుసరిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఆహారం తీసుకోకుండా, గోరువెచ్చని నీటిని మాత్రమే తాగుతారు.ఈ ఏడాది మొదట్లో లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రదాని మోదీ తన దినచర్యను తెలిపారు. ఉపవాసంతో తనకు కలిగిన అనుభవాలను ఆయన వివరించారు. ఆహారం మానేయడం, ఎక్కువసేపు నీటిని మాత్రమే తీసుకోవడం వల్ల ఇంద్రియ జ్ఞానం ఏ విధంగా పెరుగుతుందో ప్రధాని తెలియజెప్పారు. ఉపవాసం అందించే మానసిక స్పష్టత, పదునుపెట్లే ఆలోచన ప్రక్రియలను ఆయన వివరించారు. ఉపవాసం అనేది వినూత్న ఆలోచనలతోపాటు ప్రత్యేకమైన దృక్పథాన్ని పెంపొందిస్తుందని అన్నారు.ఉపవాసం అంటే కేవలం ఒక క్రమశిక్షణ మాత్రమే కాదని, అది పంచేంద్రియాలను మరింత చురుకుగా మారుస్తుందని మోదీ పేర్కొన్నారు. ఉపవాసం చేసే సమయంలో మన ఇంద్రియాలైన వాసన, స్పర్శ, రుచి వంటివి చాలా సున్నితంగా మారతాయి. అప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ అనుభవంలోని రాని వాసనను అనుభవించగలుగుతారు. ఒకరు టీ కప్పుతో వెళ్తున్నా దాని సువాసనను పసిగట్టగలుగుమని ప్రధాని మోదీ తెలిపారు.ఉపవాసం వల్ల ఆలోచనల్లో స్పష్టత, కొత్తదనం వస్తుందని, అది వినూత్నంగా ఆలోచించడానికి, భిన్నమైన కోణంలో విషయాలను చూడటానికి సహాయపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. సంవత్సరమంతా పలు రకాల ఉపవాస దీక్షలను మోదీ పాటిస్తారు.పురాతన భారతీయుల సంప్రదాయమైన 'చాతుర్మాస దీక్ష' ను ప్రధాని మోదీ పాటిస్తారు. మహావిష్ణువు యోగ నిద్రలో ఉండే కాలంగా దీనిని భావిస్తారు. దాదాపు నాలుగు నెలల పాటు ఈ ఉపవాస దీక్ష ఉంటుంది. ఈ సమయంలో తాను 24 గంటల్లో ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకుంటానని మోదీ తెలిపారు. వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుందని, అందుకే ఈ పద్ధతి ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది భావిస్తారన్నారు. ప్రధాని మోదీ సంవత్సరానికి రెండు సార్లు వచ్చే నవరాత్రులను చాలా కఠినంగా పాటిస్తారు.ఈ తొమ్మిది రోజులలో రోజుకు ఒకసారి, అదికూడా ఒకే రకం పండును మాత్రమే తింటానని మోదీ తెలిపారు. ఒకవేళ తాను బొప్పాయిని ఎంచుకుంటే, ఆ తొమ్మిది రోజులు బొప్పాయి తప్ప మరేమీ ముట్టుకోనని మోదీ తెలిపారు. శారదా నవరాత్రులలో ప్రధాని మోదీ పూర్తిగా ఆహారాన్ని నిలిపివేసి, 9 రోజుల పాటు కేవలం వేడి నీళ్లు మాత్రమే తాగుతారు. వేడి నీళ్లు తాగడం తన దినచర్యలో ఎప్పటి నుంచో భాగమని, కాలక్రమేణా తన జీవనశైలి కి అది అలవాటు అయిపోయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?
మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు ఆయన బయోపిక్ని ప్రకటించారు. 'మా వందే' పేరుతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దక్షిణాదికి చెందిన టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)మలయాళ హీరో ఉన్ని ముకుందన్.. ఈ సినిమాలో మోదీగా పాత్రలో కనిపించనున్నాడు. అలానే తెలుగు దర్శకుడు సీహెచ్.క్రాంతి కుమార్ తెరకెక్కిస్తున్నారు. 'కేజీఎఫ్' మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు పనిచేసిన సెంథిల్ కుమార్.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేయనున్నారు.ప్రస్తుతానికైతే ప్రీ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో 'ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది' అని రాసుకొచ్చారు. అంటే మదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ బయోపిక్ తీయబోతున్నారా అనిపిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తీస్తున్న ఈ చిత్రాన్ని బహుశా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ చేస్తారేమో? అయితే 2019లోనే 'పీఎం నరేంద్ర మోదీ' పేరుతో ఓ బయోపిక్ వచ్చింది. ఇప్పుడు ఇది రెండో బయోపిక్ అనమాట.(ఇదీ చదవండి: పిల్లల మీద ఒట్టు.. డబ్బులు ఎగ్గొట్టారు.. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు: మంచు లక్ష్మీ) -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
-
మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
-
15 రోజుల పాటు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర ఈరోజు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1950, సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహ్సానా జిల్లాలో జన్మించిన మోదీ.. ప్రధాని పదవిని అలంకరించక ముందు 2001 నుండి 2014 వరకు వరుసగా మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ‘సేవా పఖ్వారా’పేరుతో ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలను దేశవ్యాప్తంగా పక్షం రోజుల పాటు నిర్వహిస్తోంది.#WATCH | Uttar Pradesh: Ganga Aarti performed in Varanasi on the 75th birthday of Prime Minister Narendra Modi. pic.twitter.com/6YDtAY4IPV— ANI (@ANI) September 17, 2025రాజస్థాన్ బీజేపీ ప్రధాని మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని పరిశుభ్రతా కార్యక్రమాలను చేపట్టింది. రాజస్థాన బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోడ్ పార్టీ కార్యకర్తలతో కలిసి జైపూర్లోని ఐకానిక్ హవా మహల్లో పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్నారు.#WATCH | Ahmedabad | On the occasion of PM Narendra Modi's birthday, Gujarat Home Minister Harsh Sanghavi says, "On the occassion of PM Modi's birthday, everyone is performing one or the other act of service. This may be the first time that for the birthday celebration of a… pic.twitter.com/kk1uTBtT6U— ANI (@ANI) September 17, 2025రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ అసాధారణ నాయకత్వంతో దేశంలో గొప్ప లక్ష్యాలను సాధించే సంస్కృతిని పెంపొందించారని ఆమె కొనియాడారు.#WATCH | Delhi CM Rekha Gupta donates blood under the Seva Pakhwada campaign, a 15-day program beginning today on the occassion of PM Modi's birthday pic.twitter.com/fiVUDVJPXL— ANI (@ANI) September 17, 2025మధ్యప్రదేశ్లోని ధార్లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’, ‘8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్’ ప్రచారాలను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఈరోజు మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు.VIDEO | Delhi Minister Kapil Mishra (@KapilMishra_IND) extends birthday greetings to Prime Minister Narendra Modi.He says, "On the occasion of the Prime Minister’s birthday, we have come to Marghat Wale Hanuman Mandir to pray to Lord Hanuman for his long life and protection."… pic.twitter.com/zgybmW0nRE— Press Trust of India (@PTI_News) September 17, 2025ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున ఢిల్లీ అగ్నిమాపక దళం 24 క్విక్ రెస్పాన్స్ వాహనాలను (క్యూఆర్వీ) ప్రవేశపెట్టనుంది.VIDEO | Jaipur: Rajasthan BJP president Madan Rathore (@madanrrathore) along with other party workers participates in cleanliness drive at Hawa Mahal on the occasion of PM Modi's 75th birthday. He says, "We are celebrating our PM Narendra Modi's 75th birthday today. We pray for… pic.twitter.com/nhvAK9jVFF— Press Trust of India (@PTI_News) September 17, 2025ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయుల హృదయాలను శాసించే ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.भारत के प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। परिश्रम की पराकाष्ठा का उदाहरण प्रस्तुत करते हुए अपने असाधारण नेतृत्व से आपने देश में बड़े लक्ष्यों को प्राप्त करने की संस्कृति का संचार किया है। आज विश्व समुदाय भी आपके मार्गदर्शन में अपना…— President of India (@rashtrapatibhvn) September 17, 2025భారతదేశంలోని రష్యన్ రాయబారి డెనిస్ అలిపోవ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాజ్కోట్ విద్యార్థులు 75 రంగోలీలను రూపొందించారు.కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధాని నాయకత్వాన్ని అభినందించారు.VIDEO | Delhi CM Rekha Gupta (@gupta_rekha) extends birthday greetings to Prime Minister Narendra Modi.She says, "The Prime Minister of India, Narendra Modi, who rules the hearts of so many Indians, I, along with the people of Delhi, wish you a very happy birthday. May your… pic.twitter.com/YP0bOUdxl4— Press Trust of India (@PTI_News) September 17, 2025సూరత్వాసులు ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా, అహ్మదాబాద్లోని మణినగర్లో వేడుకలు జరిగాయి, పూలతో భారతదేశ మ్యాప్ను రూపొందించారు.भारत के माननीय प्रधानमंत्री श्री @narendramodi जी को उनके जन्मदिन पर हार्दिक बधाइयाँ और शुभकामनाएँ!रूस-भारत की दशकों पुरानी मैत्री को नई ऊँचाइयों तक ले जाने में उनके अमूल्य योगदान के लिए हम आभारी हैं।कामना है कि देश और दुनिया की भलाई करने वाले हर काम में उनको सफलता मिलती रहे।— Denis Alipov 🇷🇺 (@AmbRus_India) September 16, 2025మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో బీజేపీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది.ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరి బీచ్ ఒడ్డున ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.#WATCH | Surat, Gujarat | On the occasion of 75th birthday of Prime Minister Narendra Modi, people waved the biggest tricolor and made a huge poster of Prime Minister with a special fabricTricolor and poster maker Praveen Gupta says, "the Tiranga along with PM Modi's poster is… pic.twitter.com/EuWaxDPgSC— ANI (@ANI) September 16, 2025పీయూష్ గోయల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా, తరువాత ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందిస్తున్నారని కొనియాడారు.#WATCH | Gujarat | Eve of Prime Minister Narendra Modi's 75th birthday celebrated by making a map of India with flowers and playing Garba in Maninagar, Ahmedabad.BJP MLA Amul Bhatt and Councillor Karan Bhatt also participated in the event.BJP Amul Bhatt says, "We are… pic.twitter.com/zgJ7NzBYTH— ANI (@ANI) September 17, 2025అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. #WATCH | Puri, Odisha: Sand artist Sudarshan Patnaik creates sand art to mark PM Narendra Modi's 75th birthday. (16.09) pic.twitter.com/YoYgJQxzQm— ANI (@ANI) September 16, 2025 -
నేడు ప్రధాని మోదీ పుట్టినరోజు.. ఈ ఫొటోలు చూశారా..
-
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఉంటూ దేశ సేవలో మరింతగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ మేరకు పోస్టు చేశారు. Happy Birthday to Hon. PM Shri @narendramodi ji! Wishing you a long, healthy, and blessed life in service to the Nation.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2025 -
PM Modi Birthday: సన్యాసం కోసం ఇల్లు వదిలిన ‘నారియా’..
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన 1950, సెప్టెంబర్ 17న గుజరాత్లోని వాడ్ నగర్లో జన్మించారు. తండ్రి పేరు దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ. తల్లి పేరు హీరాబెన్. ప్రధాని మోదీకి ఐదుగురు తోబుట్టువులు. మోదీ జీవితం చాలా ఆసక్తికరంగా సాగింది. బాల్యంలో నరేంద్ర మోదీని ‘నారియా’ అని పిలిచేవారు. చిన్నప్పుడే ఆయన సన్యాసం స్వీకరించే ఉద్దేశంతో ఇంటిని విడిచిపెట్టారు. ప్రధాని మోదీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు.స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన మొదటి ప్రధానిదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లకు జన్మించిన మొదటి ప్రధాని నరేంద్ర మోదీ. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో ఆయన తొలిసారి ప్రధాని అయ్యారు.ప్రధాని చిన్నప్పటి పేరునరేంద్ర మోదీ తన ప్రాథమిక విద్యను వాద్నగర్లోని బీఎన్ హై స్కూల్ నుంచి పూర్తి చేశారు. ప్రధాని మోదీకి సంస్కృతం బోధించిన ఉపాధ్యాయుడు ప్రహ్లాద్ పటేల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నేను నరేంద్రుడిని ‘నారియా’ అని పిలిచేవాడిని. అతను నాతో మాట్లాడటానికి అతను ఎప్పుడూ భయపడలేదు. అల్లరి చేసేవాడు. ఉపాధ్యాయులను కూడా గౌరవించేవాడు’ అని అన్నారు.సన్యాసిగా మారాలని..పాఠశాల విద్య ముగియగానే మోదీ సన్యాసిగా మారేందుకు ఇంటి నుండి వెళ్లిపోయారు. పశ్చిమ బెంగాల్లోని రామకృష్ణ ఆశ్రమంతో సహా దేశంలోని అనేక ప్రదేశాల్లో తిరిగారు. హిమాలయాలలో ఋషులు, సాధువులతో గడిపారు. నాడు సాధువులు ఆయనతో సన్యాసిగా మారకుండానికి బదులు దేశానికి సేవ చేయాలని సూచించారు. దీంతో మోదీ సన్యాసిగా మారాలనే తన నిర్ణయాన్ని విరమించుకున్నారు.సైన్యంలో చేరాలనుకుని..నరేంద్ర మోదీ బాల్యంలో సన్యాసంలో చేరాలనుకున్నారు. నరేంద్ర మోదీ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఆయన తన బాల్యంలో జామ్నగర్లోని సైనిక్ స్కూల్లో చదువుకోవాలనుకున్నారు. కానీ డబ్బు లేకపోవడం వల్ల అది జరగలేదు. ఎనిమిదేళ్ల వయసులో, మోదీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు.నటన అంటే ఇష్టంప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా బాల్యంలో నటన అంటే ఎంతో ఇష్టం ఉండేది. 2013లో మోదీపై రాసిన ‘ది మ్యాన్ ఆఫ్ ది మూమెంట్: నరేంద్ర మోడీ’ పుస్తకం ప్రకారం, ఆయన తన 13-14 ఏళ్ల వయసులో పాఠశాల కోసం నిధులు సేకరించేందుకు పిల్లలతో కలిసి గుజరాతీ నాటకంలో పాల్గొన్నారు. దాని పేరు పిలు ఫూల్..అంటే పసుపు పువ్వు .అత్యవసర పరిస్థితుల్లో సర్దార్ అవతారందేశంలో 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు, మోదీ సంఘ్ వాలంటీర్గా ఉన్నారు. ఆ సమయంలో, పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఆయన సర్దార్ వేషాన్ని ధరించారు. రెండున్నరేళ్ల పాటు ఆయన పోలీసుల కన్నుగప్పి మెలిగారని చెబుతారు. -
ప్రధాని మోదీకి ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజును పురస్కరించుకుని తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ట్రంప్ మాదిరిగానే తానూ భారత్-అమెరికా భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో.. ‘నా స్నేహితుడు ప్రధాని మోదీతో ఇప్పుడే ఫోనులో మాట్లాడాను. ఆయనకి నేను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన ఎంతో అద్భుతంగా పని చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీరు అందించిన మద్దతుకు ధన్యవాదాలు' అని ట్రంప్ పేర్కొన్నారు.PM Modi posts, "Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful… pic.twitter.com/CQGdwOKiBH— Press Trust of India (@PTI_News) September 16, 2025దీనికి బదులుగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు చెబుతూ ‘ఎక్స్’లో ‘అధ్యక్షుడు ట్రంప్ నా 75వ పుట్టిన రోజు సందర్భంగా ఫోన్ చేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అందుకు నా మిత్రునికి ధన్యవాదాలు. మీ మాదిరిగానే నేను కూడా భారత్-అమెరికా సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నా. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేపట్టిన చర్యలకు మేం మద్దతు ఇస్తున్నాం' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 17 తర్వాత అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరగడం ఇదే తొలిసారి. రష్యా నుంచి భారత్ స్వల్ప ధరలకే చమురు దిగుమతి చేసుకొని భారీగా లాభాలు పొందుతోందని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే భారత్పై 50 శాతం అదనపు సుంకాలను విధించారు. అలాగే భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు చెప్పారు. దీనిని భారత్ పలుమార్లు ఖండించింది. ట్రంప్ సుంకాల విధింపు కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
దేశభద్రతలో ఆత్మనిర్భరత
కోల్కతా: దేశ భద్రత విషయంలో మరింత స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం సైనిక దళాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. సైన్యం, నేవీ, వైమానిక దళాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగాలని సూచించారు. కోల్కతాలో సోమవారం ఆయన 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ (సీసీసీ)ను ప్రారంభించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు కోసం మార్పు: సీసీసీలో సైనిక దళాల్లో గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన సంస్కరణలను ప్రధాని సమీక్షించారు. వచ్చే రెండు సంవత్సరాల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్లో సైనిక దళాలు చూపిన తెగువను ప్రధాని ప్రశంసించారు. ‘సంస్కరణల సంవత్సరం– భవిష్యత్తు కోసం మార్పు’ అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో సైనిక, ఆయుధ పరంగా స్వయంసమృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. భారత త్రివిధ దళాలు జాతి నిర్మాణంతోపాటు కల్లోల ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ప్రకృతి విపత్తుల సమయంలో దళాల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోవాలంటే దళాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని, సైనిక పరంగా స్వయంసమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. -
బిహార్ను బీడీతో పోలుస్తారా!
పుర్నియా: బిహార్ అభివృద్ధిబాటన సాగుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీలు ఓర్వలేని తనంతో చులకనగా మాట్లాడుతున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. అవమానించడమే ప్రతిపక్ష నాయకులు పనిగా పెట్టుకున్నారని ధ్వజమె త్తారు. మోదీ సోమవారం బిహార్లోని పుర్నియా లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బిహార్ అంటే బీడీ అంటూ ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బిహార్లో తయారైన రైలింజిన్లు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్, ఆర్జేడీ నేతలకు నచ్చడం లేదు. బిహార్లో అభివృద్ధి ఛాయలు కనిపించినప్పుడల్లా ఈ నేతలు చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఏకమై బిహార్ను బీడీతో పోలుస్తూ సోషల్ మీడియా వేదికలపై చెలరేగిపోతున్నారు’అని ఆయన అన్నారు. ‘ఈ రెండు పార్టీల నేతలు సొంత కుటుంబసభ్యుల గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. మీ కుటుంబం సంక్షేమం వారికి పట్టదు. కానీ, మోదీకి మీరందరూ కుటుంబ సభ్యులే. అందుకే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని మోదీ అంటున్నారు. మీ కుటుంబం, సంక్షేమం, మీ బాగోగుల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు’అని తెలిపారు. బిహార్, పశ్చిమబెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నా యని, వీటి తీరుతో ఆయా రా ష్ట్రాల జనాభాలో తీరుతెన్నుల్లో తీ వ్రమైన మార్పులు సంభవిస్తున్నా యని ఆయన హెచ్చరించారు. ఆయా రాష్ట్రాల్లోని వారు తమ తోబుట్టువులు, కుమార్తెల ఆత్మ గౌరవం గురించి ఆందోళన చెందుతున్నారని తెలిపారు.దేశ భద్రత, వనరులను ప్రతిపక్షాలు ఫణంగా పెడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. విదేశాల నుంచి అందుతున్న మద్దతుతో వలసదారులకు మద్దతుగా యాత్రలు నిర్వహిస్తూ నినాదాలు చేస్తూ నిస్సిగ్గుగా వ్యవహ రిస్తున్నారంటూ కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార యాత్రనుద్దేశిస్తూ నిప్పులు చెరిగారు. ప్రతి చొరబాటుదారునూ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ఎన్డీఏ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.40 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. పుర్నియా ఎయిర్పోర్టులో కొత్తగా అభివృద్ధి పర్చిన టెర్మినల్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. పుర్నియా–కోల్కతా మార్గంలో మొదటి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మఖానా రంగం అభివృద్ధికి నేషనల్ మఖానా బోర్డు ద్వారా రూ.475 కోట్లు వెచ్చిస్తా మని ప్రకటించారు. భాగల్పూర్లో రూ.25 వేల కోట్లతో నిర్మించే ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు, రూ.2,680 కోట్ల కోసి–మెచి ఇంట్రా స్టేట్ రివర్ లింకు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారు. -
మణిపూర్కు సాంత్వన!
మానవీయ స్పర్శ లేశమాత్రం లేని మానవాకార మృగాలు రోజుల తరబడి సృష్టించిన బీభత్సం పర్యవసానంగా అయినవారినీ, ఆవాసాలనూ మాత్రమే కాదు... జీవిక కోల్పోయి చెట్టుకొకరు పుట్టకొకరై 28 నెలల నుంచి అనాథలుగా బతుకీడుస్తున్న మణిపూర్ పౌరులకు ఆలస్యంగానైనా సాంత్వన లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తొలుత చురాచాంద్పూర్ బహిరంగ సభలో బాధితులనుద్దేశించి మాట్లాడాక, రాజధాని ఇంఫాల్లో ఉన్న కాంగ్లా ఫోర్ట్ వద్ద జరిగిన సభలో పాల్గొన్నారు. సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించటానికి చేయాల్సిందంతా చేస్తామని ఆయన హామీ ఇవ్వటంతో పాటు వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని ప్రారంభించటం, మరికొన్నిటికి శంకుస్థాపన చేయటం హర్షించదగ్గవి. ఇవన్నీ రాగల కాలంలో సామరస్య వాతావరణానికి దోహదపడే అవకాశం ఉన్న మాట నిజమే అయినా, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మెజారిటీగా ఉన్న మెయితీలకూ, కుకీ–జో తెగలకూ మధ్య తలెత్తిన ఘర్షణల పర్యవసానంగా మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఆ తెగల మధ్య పరస్పర అవిశ్వాసం, ఘర్షణలు ఈనాటివి కాదు. వీటిని చక్కదిద్దటానికి ఏ ప్రభుత్వమూ పెద్దగా ప్రయత్నించింది లేదు. బీరేన్సింగ్ నేతృత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వమైతే మెయితీల అనుకూలమన్న ముద్ర పడేలా వ్యవహరించి ఆ ఘర్షణ వాతావరణాన్ని పెంచింది. 2023 మే 3 మొదలుకొని సాగిన దారుణాలు సిగ్గు చేటైనవి. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మెయితీలకూ, కుకీ–జో తెగలకూ తలెత్తిన ఘర్షణల్లో మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా ఊరేగించి అత్యాచారాలకు తెగబడటం వంటివి చోటుచేసుకున్నాయి. చురాచాంద్పూర్లో కుకీ–జో తెగలవారికి సహాయక శిబిరాలు నెలకొల్పగా, మెయితీ బాధితులు ఇంఫాల్ రక్షణ శిబిరాల్లో ఉంటున్నారు. దురదృష్టమేమంటే కుకీ–జో తెగలవారు ఇంఫాల్లో అడుగుపెట్టలేరు. మెయితీలు కొండప్రాంత జిల్లాలకు పోలేరు. ఇదంతా ఇప్పట్లో చక్కబడే అవకాశం లేదు. కుకీ–జో తెగల మండలి ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో తమకు ప్రత్యేక పాలనాధికార వ్యవస్థ కావాలని కోరింది.అటు మెయితీలకు ప్రాతినిధ్యం వహించే మణిపూర్ సమగ్రతా సమన్వయ కమిటీ (కొకొమీ) అందుకు ససేమిరా అంటున్నది. ఆ వ్యవస్థ ఏర్పాటైతే రాష్ట్ర ప్రతిపత్తి దెబ్బతింటుందనీ, పౌరసత్వాన్ని తెగల వారీగా గుర్తించి, రాష్ట్రాన్ని విభజించినట్టవుతుందనీ దాని వాదన. ‘చట్ట విరుద్ధ’ వలసలను అరికట్టాలని డిమాండ్ చేస్తోంది. పైగా మెయితీలు ఏనాటి నుంచో ఎస్టీ ప్రతిపత్తి కోరుతున్నారు. ఇదే జరిగితే భూహక్కులు కోల్పోతామని కుకీ–జో తెగల భయం. ఈ వాదనలూ, భయాందోళనలూ వర్తమాన సంక్లిష్టతకు అద్దం పడతాయి. రాష్ట్రాన్ని ఆవరించిన కల్లోలం ‘మన పూర్వీకుల స్మృతికి కళంకం మాత్రమే కాదు... భవిష్యత్ తరాలకు అన్యాయం చేయటం కూడా’ అని మోదీ సరిగానే అన్నారు. దీన్ని చక్కదిద్దటానికి ఇంఫాల్ లోయకూ, కొండ ప్రాంత జిల్లాలకూ మధ్య పటిష్ఠమైన వారధులు నిర్మించాల్సి ఉందన్న ఆయన అభిప్రాయం కూడా సబబైనదే. ఇది జరగాలంటే వైషమ్యాలను పెంచి పోషిస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. వదంతుల వ్యాప్తిని సహించకూడదు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను ప్రచారంలో పెట్టడంతోనే సమస్య మొదలైందనీ, ప్రధాన స్రవంతి మీడియా ‘మెయితీ మీడియా’గా మారి వీటిని పెంచిపోషిందనీ ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ కమిటీ గతంలో ఆరోపించింది. ఇందుకు నాటి మణిపూర్ ప్రభుత్వం ఆగ్రహించి కేసులు కూడా పెట్టింది. మణిపూర్ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో మయన్మార్తో 352 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. నిరవధిక ఉద్రిక్త వాతావరణం ఎంతమాత్రమూ మంచిది కాదు. బీరేన్సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయటంతో సహా చాలా విషయాల్లో ఎంతో జాప్యం జరిగింది. ఇప్పటికైనా నిర్దిష్ట కాల వ్యవధిలో అమలయ్యేలా చర్యలుండాలి. అభివృద్ధి జరిగేలా, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా, జన జీవనం మళ్లీ పట్టాలెక్కేలా చూడాలి. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న అపవాదు కలగని రీతిలో పాలనను చక్కదిద్దాలి. -
నేడు బిహార్లో ప్రధాని పర్యటన
పట్నా: ప్రధాని మోదీ సోమవారం బిహార్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పుర్నియాలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రూ.36 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పుర్నియాలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయం టెరి్మనల్ను ఆయన ప్రారంభిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ మఖానా బోర్డును ప్రధాని ప్రారంభిస్తారు. మఖానాను సూపర్ఫుడ్గా పలుమార్లు ప్రధాని మోదీ పేర్కొనడం తెల్సిందే. దేశంలో ఉత్పత్తయ్యే మఖానాలో అత్యధికంగా 90 శాతం మేర బిహార్లో సాగవుతోంది. మరికొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీ బిహార్కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత 11 ఏళ్లలో బిహార్ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేశారని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర డెప్యూటీ సీఎం సమ్రాట్ చౌధరి తెలిపారు. తమ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలాలను అందుకుంటోందన్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లను భారీగా చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలను అధికారులు నిషేధించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పుర్నియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ రోగులతో మాట్లాడి, వారు పడుతున్న ఇబ్బందులపై ఒక వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాల కల్పనలో సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.