breaking news
Narendra Modi
-
బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయం.. కదిలిన యంత్రాంగం
ఢిల్లీ : తన 37 ఏళ్ల క్రితం నాటి భూవివాదాన్ని పరిష్కరించాలని అస్గర్ అలీ వోహ్రా (81) తన బాల్య మిత్రుడు ప్రధాని మోదీని కోరారు. అందుకు ప్రధాని మోదీ అభయమిచ్చారు.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్లోని వద్నగర్లో ప్రధాని మోదీతో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోహ్రా తన భూ వివాదంపై జోక్యం చేసుకోవాలని ప్రధానిని అభ్యర్థించారు. మహారాష్ట్రలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ భూ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.మహారాష్ట్రలోని మీరా రోడ్ ప్రాంతానికి చెందిన అస్గర్ అలీ వోహ్రా (81) ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నేరుగా కలిశారు. 1989లో ముంబై భాయందర్ ఈస్ట్ పరిధిలోని నవ్ఘర్ ప్రాంతంలో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని తాను రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.అయితే 2011లో ‘స్వయం బిల్డర్స్’, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు చెందిన ‘సెవెన్ ఎలెవన్ కన్ స్ట్రక్షన్’ సంస్థలు తన భూమిని కబ్జా చేశాయని వోహ్రా ఆరోపించారు. అసలు యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమిని రెండు భాగాలుగా విభజించి ఆ రెండు సంస్థల పేరిట ఆక్రమించుకున్నారని ఆయన వాపోయారు.ఈ భూ వివాదానికి సంబంధించి 2015లోనే ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ, కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. దశాబ్దాలుగా రెవెన్యూ శాఖ, మున్సిపల్ అధికారులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో చివరికి ఆయన ప్రధాని మోదీని ఆశ్రయించారు. తన గోడు వెళ్లబోసుకున్న వోహ్రాకు ప్రధాని సానుకూలంగా స్పందించి అభయమిచ్చారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ విడుదల చేయగా, ప్రధాని తన బాల్య స్నేహితుడికి తగిన న్యాయం అందేలా చూస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రధాని కార్యాలయ జోక్యంతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం ఈ ఉదంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 16న ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక విచారణకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ‘సెవెన్ ఎలెవన్ కన్ స్ట్రక్షన్’, ‘స్వయం బిల్డర్స్’ ప్రతినిధులకు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. -
మోదీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. ఏం జరిగింది?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల సందర్భంగా షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక విందుకు మాత్రం హాజరుకాలేదు. శనివారం జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించిన జిన్పింగ్.. రాత్రి జరిగిన గాలా డిన్నర్కు దూరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.కాగా, ప్రధాని మోదీ శనివారం బ్రిక్స్ దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల కోసం విందును ఏర్పాటు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అయితే జిన్పింగ్ మాత్రం విందుకు రాలేదు. ఆయన ఎందుకు హాజరుకాలేదన్న దానిపై అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడికాలేదు. అయితే ఓ వర్గం సమాచారం ప్రకారం.. సదస్సు కార్యక్రమాల తర్వాత జిన్పింగ్ హోటల్కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ కూడా విందుకు హాజరుకాలేదు. అయితే ఆయన సదస్సు కార్యక్రమాల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వెళ్లారు. జిన్పింగ్ గైర్హాజరుపై కారణం స్పష్టత లేకపోవడంతో ఆయన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఏడేళ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టిన జిన్పింగ్.. మోదీతో డిన్నర్కు దూరంగా ఉండటం ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది కేవలం విశ్రాంతి కోసమేనా.. లేక మరేదైనా కారణమా అన్నది మాత్రం అధికారికంగా తేలాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. నిన్న (సెప్టెంబర్ 12) మోదీ-జిన్పింగ్ మధ్య సుమారు 50 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధానంగా సరిహద్దు వివాదం, వాణిజ్య లోటు, మార్కెట్ యాక్సెస్, సరఫరా చైన్, రవాణా-ప్రజల మధ్య సంబంధాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా సరిహద్దు విషయంలో న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పనిచేయాలని ఇద్దరూ అంగీకరించారు. మోదీ ఇప్పటికే ఉన్న సరిహద్దు ఒప్పందాలు, అవగాహనలను గౌరవించాలని స్పష్టం చేశారు. ఇక ఆర్థిక అంశాల్లో భారత్-చైనా మధ్య వాణిజ్య అసమతుల్యతను తగ్గించడం, మార్కెట్ యాక్సెస్ను సులభతరం చేయడం, సప్లై చెయిన్ సమస్యలను పరిష్కరించడంపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య విమానాలు, వీసాలు, కైలాస్ మానసరోవర్ యాత్ర వంటి సంబంధాలు కూడా క్రమంగా పునరుద్ధరిస్తున్నాయి.ఇదీ చదవండి: సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ! -
సభ్య దేశాల సహకారంతో ఉమ్మడి ప్రయోజనం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు రెండో రోజుకు చేరుకుంది. దీనిలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘బ్రిక్స్’లో గ్లోబల్ సౌత్ దేశాల స్వరం గట్టిగా వినిపిస్తోందని అన్నారు. భారత అధ్యక్షతన నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. సత్సీలత, నవకల్పన, సహకారం, సుస్థిరత అనే నాలుగు స్తంభాలపై కృషి చేశామని చెప్పారు. సభ్య దేశాల సహకారం, మద్దతుతో ఉమ్మడి ఆలోచనలను అందరికీ ప్రయోజనం చేకూర్చే సహకారంగా మార్చగలిగామని పేర్కొన్నారు.సరఫరా గొలుసులను మరింత విశ్వసనీయంగా, బలోపేతంగా మార్చేందుకు బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ సహకార ఫ్రేమ్వర్క్ దోహదపడుతుందని మోదీ తెలిపారు. బ్రిక్స్ ఇన్క్యుబేటర్ నెట్వర్క్ ద్వారా స్టార్టప్లు, ఇన్క్యుబేటర్లను అనుసంధానించనున్నట్లు చెప్పారు. విస్తృతంగా అమలు చేయగల కొత్త పరిష్కారాలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi receives President of Kazakhstan, Kassym-Jomart Tokayev, at Bharat Mandapam on Day 2 of the BRICS Summit 2026. (Source: DD News) https://t.co/NRkO6pDWBM— ANI (@ANI) September 13, 2026డిజిటల్ వ్యవసాయంపై బ్రిక్స్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని మోదీ అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), జియోస్పేషియల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా అనుసంధానించనున్నట్లు తెలిపారు. సాంకేతికత, కీలక ఖనిజాలను ఆయుధాలుగా ఉపయోగించడం ఉమ్మడి అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చని హెచ్చరించారు. సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో అందరినీ భాగస్వాములను చేసే విధానానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.తొలి రోజు సమావేశాల్లో సభ్య దేశాల నేతలు ‘న్యూఢిల్లీ ప్రకటన-2026’ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రపంచ పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్కు మరింత పెద్ద పాత్ర కల్పించాలన్న ఆకాంక్షలకు మద్దతు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతోపాటు ఏకపక్ష ఆంక్షలు, సుంకాలు, వాణిజ్య పరిమితులపై ఆందోళన వ్యక్తం చేశారు.రెండో రోజు సమావేశాల్లో భారత్ 2026 అధ్యక్షతన నిర్దేశించిన స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే నాలుగు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పాలనలో సంస్కరణలకు సంబంధించి పది ప్రతిపాదనలు చేశారు. ప్రపంచ దక్షిణాది దేశాలు కేవలం నిబంధనలు అనుసరించే స్థాయి నుంచి వాటి రూపకల్పనలో భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ సాంకేతికతలు, వాటికి సంబంధించిన నియమాల రూపకల్పనలో సమాన భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. సముద్ర రవాణా సిబ్బంది అత్యవసర సహాయానికి ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi, Russian President Vladimir Putin and other world leaders at Bharat Mandapam PM Modi has hosted gala dinner for global leaders and delegates here (Source: DD) https://t.co/lOlKp0W7Df— ANI (@ANI) September 12, 2026బ్రిక్స్ ప్రకటనలో పశ్చిమాసియా సంక్షోభంపై ఆందోళన వ్యక్తమైంది. పౌరులు, పౌర మౌలిక వసతుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రపంచ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన ప్రవాహం సజావుగా కొనసాగేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పేర్కొంది. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారమే మార్గమని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యారు. భారత్-చైనా సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నట్లు జిన్పింగ్ పేర్కొన్నారు. మరోవైపు, బ్రిక్స్ దేశాలు కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికత, డిజిటల్ మౌలిక వసతులు, స్టార్టప్లు, సరఫరా వ్యవస్థల వంటి రంగాల్లో సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించి, మూల దేశాలకు పురాతన వస్తువులు, ఆధ్యాత్మిక, చారిత్రక వస్తువులను తిరిగి అప్పగించేందుకు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. -
ప్రపంచ పరిపాలనకు రూల్స్ మనమే రూపొందించాలి.... బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
-
జిన్పింగ్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సుకు హాజరైన అగ్రనేతల గౌరవార్థం ప్రధాని మోదీ శనివారం రాత్రి ఇచ్చిన విందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరుకాలేదు. విందులో జిన్పింగ్ ఎందుకు హాజరుకాలేదనే విషయంలో అధికారికంగా ఎలాంటి కారణాలు వెల్లడికాలేదు. కానీ శిఖరాగ్ర సదస్సులో సుదీర్ఘంగా పాల్గొని అలసిపోయిన ఆయన తన హోటల్ గదికి విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిపోయారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రధాన సమావేశానికి హాజరైన అబూదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ సైతం వెంటనే స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. దీంతో ఈయన సైతం బ్రిక్స్ గాలా డిన్నర్కు గైర్హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇతర బ్రిక్స్ దేశాల అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విందులో పాల్గొన్నారు. విందులో అత్యంత రుచికరమైన గుజరాతీ చిరుతిండి అయిన ఖండ్వీ మిలే ఫియులే, కుంభ్ గలౌతీ కబాబ్, పనీర్ లబాబ్దార్, గుచ్చీ మారి్మక్, క్యారెట్–బీన్ పొరియల్, చిరుధాన్యాల పులావ్లను వడ్డించారు. పాత ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్, జిలేబీ, షతూత్ ఫిర్నీలనూ అందించారు. -
విభేదాలు వివాదాలుగా మారొద్దు
న్యూఢిల్లీ: భారత్–చైనా సంబంధాలు మరింత బలోపేతం కావాలంటే ఇరుదేశాల సరిహద్దు వద్ద శాంతియుత వాతావరణం నెలకొనడం అత్యవసరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు స్పష్టం చేశారు. సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత ఒప్పందాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ, జిన్పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానంగా భారత్, చైనా సంబంధాలపై చర్చించారు. వాణిజ్య లోటును తగ్గించడం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడం, బహుపాక్షిక వేదికలపై న్యాయమైన, పారదర్శక వాణిజ్యం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇరువురు నేతలు పునరుద్ఘాటించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని వారు పేర్కొన్నట్లు వెల్లడించింది. పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం వాణిజ్య అసమతుల్యత, సప్లై చైన్లు, మార్కెట్ ప్రవేశాన్ని సులభతరం చేయడం వంటి అంశాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ, జిన్పింగ్ నిర్ణయానికి వచ్చారు. సమగ్ర ద్వైపాక్షిక సంబంధాలు, ఇరుపక్షాల దీర్ఘకాలిక ప్రయోజనాల ఆధారంగా సరిహద్దు సమస్యకు న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. పరస్పర సంబంధాల విషయంలో భారత్, చైనాలు పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం అనే మూడు అంశాల ఆధారంగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు జిన్పింగ్ శనివారం ఢిల్లీకి చేరుకున్న కొద్ది గంటల తర్వాత ఈ సమావేశం జరిగింది. జిన్పింగ్ భారత్లో పర్యటిస్తుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఉమ్మడి కార్యాచరణ మరింత విస్తృతం గత ఏడాది ఆగస్టులో టియాంజిన్లో జరిగిన తమ చివరి సమావేశం తర్వాత భారత్–చైనా సంబంధాల్లో సాధిస్తున్న స్థిరమైన పురోగతిని మోదీ, జిన్పింగ్ స్వాగతించారని భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. రెండు దేశాలు తమ సంబంధాల పట్ల వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండాలని వారు పునరుద్ఘాటించినట్లు వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులే ప్రాతిపదికగా నిలుస్తాయని ప్రధాని మోదీ తేల్చిచెప్పారని ఉద్ఘాటించింది. సరిహద్దు సంబంధిత అంశాలపై ప్రస్తుతం అమల్లో ఒప్పందాలు, అవగాహనలను ఇరుపక్షాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారని పేర్కొంది. ప్రజల మధ్య సంబంధాల్లో సాధించిన పురోగతిని ఇద్దరు నేతలు గుర్తించారని, రెండు దేశాల మధ్య సాంస్కృతిక మారి్పడి, వాణిజ్య సంబంధాలు, రాకపోకలను మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని నిర్ణయానికి వచ్చారని తెలిపింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు వివిధ సవాళ్లను ఎదుర్కోవడంలో ఉమ్మడి కార్యాచరణను మరింత విస్తృతం చేయాలని మోదీ, జిన్పింగ్ నిర్ణయించినట్లు సమాచారం. భారత్ చేపట్టిన బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలకు చైనా అందించిన మద్దతును, కూటమి శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావడంలో చైనా చేసిన కృషిని ప్రధాని మోదీ అభినందించారు.భారత్, చైనాలపై పెద్ద బాధ్యత: జిన్పింగ్ భారత్–చైనా సంబంధాల అభివృద్ధిని బీజింగ్ ఎల్లప్పుడూ వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతోనే చూస్తోందని జిన్పింగ్ స్పష్టంచేశారు. మన రెండు దేశాల పరిస్థితులు వేర్వేరుగా ఉన్నప్పటికీ మనం ఒకరికొకరు అండగా నిలుస్తూ ఉమ్మడి అభివృద్ధి మార్గంలో పయనించవచ్చని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా, గ్లోబల్ సౌత్లో కీలక సభ్యులుగా భారత్, చైనాలు పెద్ద బాధ్యతలను కలిగి ఉన్నాయని వివరించారు. ఇరుపక్షాలు మానవాళి భవిష్యత్తును, తమ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. సహకారాన్ని పెంపొందించుకోవడానికి, సమ్మిళిత ఆర్థిక భవిష్యత్తు దిశగా మనం కలిసి పనిచేయాలని జిన్పింగ్ భారత్కు పిలుపునిచ్చారు. -
స్నేహగీతం..!
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో అత్యంత విశేషమైన ఘట్టం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన కుడివైపున రష్యా అధ్యక్షుడు పుతిన్తో, ఎడమ వైపున చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చేతులు కలిపి చిరునవ్వులు చిందించారు. ముగ్గురు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. తామంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నామని ప్రపంచానికి చాటిచెప్పారు. సరిహద్దు వివాదాలు, విభేదాలు ఉన్నప్పటికీ భారత్, చైనా మధ్య అనుబంధం చెక్కుచెదరలేదని మోదీ సంకేతాలిచ్చారు. శనివారం బ్రిక్స్ సదస్సు జరిగిన భారత్ మండపం వద్ద తీసిన ఈ చిత్రాన్ని ప్రధానమంత్రి ఇన్స్టా్రగామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు ‘కింగ్డమ్ బీజీఎం’అనే పాట నేపథ్య సంగీతంగా వినిపిస్తోంది. ముగ్గురు దేశాధినేతల స్నేహగీతం సదస్సు వేదిక వద్ద అందరినీ ఆకట్టుకుంది. ఆప్యాయతతో కూడిన ఈ క్షణం ప్రత్యేకంగా నిలిచింది. మోదీ సోషల్ మీడియాలో మరికొన్ని ఫొటోలను సైతం మోదీ పోస్ట్ చేశారు. పుతిన్, షీ జిన్పింగ్లతోపాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో దిగిన చిత్రాలున్నాయి. మరొక చిత్రంలో పుతిన్, షీ జిన్పింగ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోలతో మోదీ ఉత్సాహంగా చర్చిస్తూ కనిపించారు. -
చర్చలే శరణ్యం!
న్యూఢిల్లీ: సంఘర్షణలు, సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల్లోనే శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న భారతదేశం పిలుపును బ్రిక్స్ కూటమి దేశాల అధినేతలు సమరి్థంచారు. ఈ మేరకు శనివారం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇరాన్తోపాటు సౌదీ అరేబియా, యూఏఈ సైతం ఆమోదం తెలిపాయి. పశ్చిమాసియా యుద్ధంపై నెలకొన్న విభేదాలను పక్కనపెట్టి ఇరాన్, యూఏఈలు ఈ డిక్లరేషన్ విషయంలో ఒక్కటి కావడం విశేషం. భారతదేశానికి ఇది ముఖ్యమైన దౌత్యవిజయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయితే, ఈ ప్రకటనలో ఇరాన్పై అమెరికా దాడుల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని కూడా తప్పుపట్టలేదు. గాజాలో హింసాకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని, పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని తేల్చిచెప్పారు. ‘వర్తించే’అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్యం, సప్లై చైన్లు, ఇంధన సరఫరా సజావుగా కొనసాగానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని కూటమి నేతలు నొక్కిచెప్పారు. తొలుత ఇరాన్, యూఏఈలు తమ కఠిన వైఖరిని ప్రదర్శించడంతో ఈ డిక్లరేషన్ పాఠంపై చర్చలు చివరి నిమిషం వరకు కొనసాగాయి. బ్రిక్స్ అనేది ఏకాభిప్రాయం ఆధారంగా పనిచేసే కూటమి. ఏ ఒక్క సభ్య దేశం వ్యతిరేకించినా డిక్లరేషన్ ఆమోదం పొందదు. ఏకపక్ష ఆంక్షలు, బలవంతపు చర్యలు వద్దు విచక్షణారహిత సుంకాలు, నాన్–టారిఫ్ చర్యలు, సంరక్షణవాదం వంటి వాణిజ్య నిరోధక చర్యలపై బ్రిక్స్ దేశాలు తమ డిక్లరేషన్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇవి ప్రపంచ వాణిజ్యాన్ని మరింత తగ్గించి, సప్లై చైన్లకు అంతరాయం కలిగించి, ఇప్పటికే ఉన్న ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను పరోక్షంగా తప్పుపట్టాయి. అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమైన ఏకపక్ష ఆంక్షలు, బలవంతపు చర్యలను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాయి. బ్రిక్స్ సదస్సులో తొలి రోజు చర్చల ముగింపు సందర్భంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించినట్లు భారత ప్రధాని మోదీ ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామని డిక్లరేషన్ పేర్కొంది. గరిష్ట సంయమనం పాటించాలని, పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టంచేసింది. ఇతర దేశాల సార్వ¿ౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని తెలిపింది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా పౌరులు, పౌర మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించాలని వెల్లడించింది. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి, భద్రత, స్థిరత్వానికి దోహదపడే దీర్ఘకాలిక అవగాహన కోసం చర్చలు, దౌత్యం ద్వారా ప్రయత్నాలను ముమ్మరం చేయడాన్ని ప్రోత్సహిస్తున్నామని స్పష్టంచేసింది. ఉగ్రవాదులను కోర్టు ముందు నిలబెట్టాల్సిందే గత ఏడాది జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో 26 మందిని బలిగొన్న ఉగ్రవాద దాడిని బ్రిక్స్ కూటమి అత్యంత తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాసరే సహించడానికి వీల్లేదని, ఈ ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలన్న భారత్ పిలుపునకు పూర్తి మద్దతు తెలిపింది. ఉగ్రవాద సవాలును ఎదుర్కోవడంలో సమష్టి విధానాన్ని అవలంబించడానికి కూటమి నేతలు అంగీకరించారు. ‘‘సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఆశ్రయం కల్పించడం సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం’’అని డిక్లరేషన్లో తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని ఏ మతం, జాతీయత, నాగరికత, జాతి సమూహంతో ముడిపెట్టకూడదని ఉద్ఘాటించారు. -
రూల్స్ మనమే రూపొందించాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్లోబల్ సౌత్ దేశాలు ‘నియమాలను రూపొందించేవిగా’మారాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ప్రపంచ పాలనలో ప్రస్తుతం ఉన్న ‘విశేషాధికారాల పిరమిడ్’స్థానంలో ‘భాగస్వామ్య వేదిక’కావాలని తేల్చిచెప్పారు. రెండు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా మొదలైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. బ్రిక్స్ చట్రం కింద ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 పాయింట్ల రోడ్మ్యాప్ను ప్రతిపాదించారు. ప్రపంచ, ప్రాంతీయ సంక్షోభాల వల్ల అధిక ముప్పును ఎదుర్కొంటున్న నావికుల రక్షణ కోసం ‘సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్’ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, ఇండోనేసియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో, అబూదాబీ యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది బ్రిక్స్కు భారత్ నేతృత్వం వహిస్తోంది. కీలకమైన ప్రపంచ సంస్థగా బ్రిక్స్ బ్రిక్స్ కూటమి ఒక కీలకమైన ప్రపంచ సంస్థగా ఆవిర్భవించిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. తీవ్రమైన ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాబోయే 20 ఏళ్లలో కూటమికి ఒక నూతన, ప్రతిష్టాత్మక ఎజెండా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక పిరమిడ్ను పోలి ఉందని చెప్పారు. అధికారం, నిర్ణయాధికారం పైస్థాయిలో కేంద్రీకృతమై ఉండగా, కింది స్థాయిలోని దేశాలు ఆ నిర్ణయాల ప్రభావానికి లోనవుతున్నాయి తప్ప వాటిని ప్రభావితం చేయలేకపోతున్నాయని వెల్లడించారు. నేడు ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కోవడంలో ‘గ్లోబల్ సౌత్’ముందు వరుసలో ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుకంజలోనే ఉందన్నారు. అందుకే విశేషాధికారాల పిరమిడ్ స్థానంలో అన్ని దేశాలతో కూడిన భాగస్వామ్య వేదికను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికీ గళం వినిపించే అవకాశం ఉండాలన్నారు. ప్రతి ప్రయత్నానికీ మానవాళి అభివృద్ధే కేంద్ర బిందువుగా ఉండేలా చూడాలని తెలిపారు. ఉమ్మడిగా రోడ్మ్యాప్ మానవాళి సంక్షేమం కోసం బ్రిక్స్ కూటమి సంస్కరణ ప్రణాళికా చట్రం పరిధిలోనే ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 అంశాలతో కూడిన రోడ్మ్యాప్ను ఉమ్మడిగా రూపొందించాలని మోదీ ప్రతిపాదించారు. తదుపరి శిఖరాగ్ర సమావేశం నాటికి ఈ రోడ్మ్యాప్ను ఖరారు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో మనం మూడు కీలక అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘ప్రాతినిధ్యం, స్పందించే గుణం, నియమావళి రూపకల్పన’అవసరమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని, దీనికి సంబంధించిన చర్చలను ఒక నిర్దిష్ట కాలపరిమితితో స్పష్టమైన ఫలితాల దిశగా ముందుకు తీసుకెళ్లాలని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆర్థిక సంస్థల్లో ఓటింగ్ అధికారం, నాయకత్వ స్థానాలు, విధానపరమైన ప్రాధాన్యతలు నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే దేశాలు ప్రపంచ ఆర్థిక పాలనను తీర్చిదిద్దడంలోనూ తగిన పాత్ర పోషించాలని సూచించారు. భవిష్యత్తులో ప్రపంచ నియమాలను నిర్ణయించడంలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించడం అత్యంత కీలకమని తేల్చిచెప్పారు. కృత్రిమ మేధస్సు, సైబర్ స్పేస్, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కీలక సాంకేతికతల వంటి రంగాలు భవిష్యత్తు అవకాశాలను తీర్చిదిద్దడమే కాకుండా, భవిష్యత్తు నియమాలను కూడా నిర్దేశిస్తున్నాయన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు ఇక కేవలం నియమాలను పాటించేవారి స్థాయిలో ఉండడానికి వీల్లేదన్నారు. నియమాలను రూపొందించే స్థాయికి ఎదగాలని స్పష్టంచేశారు. ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ ఏడాది బ్రిక్స్ 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మానవ జీవితంలో 20 ఏళ్ల వయస్సు అనేది పరిపక్వత, బాధ్యతతో కూడిన ఒక కొత్త దశకు ఆరంభమని వ్యాఖ్యానించారు. బ్రిక్స్ కూడా పరిపక్వత సాధించే దశకు చేరుకుందని, ప్రపంచ వేదికపై క ప్రత్యేక గుర్తింపును సాధించిందని అన్నారు. తాము ఇతరుల ఆకాంక్షలను గౌరవిస్తామని, ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని వివరించారు. ఎవరినో వ్యతిరేకించడం ద్వారా కాకుండా అందరినీ కలుపుకొని వెళ్లడం ద్వారా పురోగతి సాధించడానికి కృషి చేస్తామన్నారు. కూటమిలో మనకున్న ఐక్యతను, ఏకాభిప్రాయాన్ని ప్రపంచ వేదికపై ప్రత్యక్ష ఫలితాలుగా మార్చుకోవాలని సూచించారు. రాబోయే 20 ఏళ్లకు సంబంధించిన బలమైన ఎజెండాపై మనం కృషి చేయాలన్నారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు ఏటా మారుతున్నప్పటికీ అది మన సంస్థాగత పురోగతికి ఆటంకం కలిగించకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’మన ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఈ తీర్మానాలను స్పష్టమైన ఫలితాలుగా మార్చడం మన బాధ్యత అని ఉద్బోధించారు. 10 పాయింట్ల రోడ్మ్యాప్ 1. నియమాలను పాటించేవారి నుంచి నియమాలను రూపొందించేవారిగా బ్రిక్స్ ఎదగడం 2. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు 3. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం బలోపేతం 4. కూటమి అధ్యక్షులు మారినప్పటికీ నిర్ణయాలు కొనసాగింపు 5. కూటమి నిర్ణయాల అమలుపై దృష్టి 6. వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడం 7. సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరింపజేసుకోవడం 8. అభివృద్ధి భాగస్వామ్యాలను బలోపేతం చేయడం 9. గ్లోబల్ సౌత్కు మరింత ప్రాధాన్యత ఇవ్వడం 10. ప్రపంచ వేదికపై బ్రిక్స్ను మరింత సమర్థవంతంగా మార్చడం -
చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ
ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు వివాదాలు, పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. భారత్తో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమన్నారు. అభివృద్ధి అంశాలపైన కలిసి పని చేయాలని.. తరచుగా సమావేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ప్రపంచ శాంతికి భారత్ చైనా సంబంధాల బలోపేతం అవసరం. ఇండియా, చైనా దీర్ఘకాలిక సంబంధాలపైన దృష్టి సారించాలి. ప్రపంచశాంతికి భారత్- చైనా సంబంధాల బలోపేతం అవసరం. మన దేశాల బలబలలు అందరికీ తెలుసునని జిన్పింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమన్నారు. విస్తృతమైన అంశాల పైన ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న మోదీ.. బ్రిక్స్ అధ్యక్షతకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.తొలి రోజు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఢిల్లీ డిక్లరేషన్ను “బ్రిక్స్” శిఖరాగ్ర సదస్సు ఆమోదించింది. శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నట్లు సంయుక్త ప్రకటన చేశాయి. యుద్ధాలు, ఘర్షణలు, సమస్యల మూలాలను పరిష్కరించాలన్న బ్రిక్స్ దేశాలు.. ఏకపక్షంగా సుంకాల విధింపు పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని బ్రిక్స్ దేశాల కూటమి పిలుపునిచ్చాయి.ఇదీ చదవండి: భారత్కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది? -
బ్రిక్స్ ప్రారంభోపన్యాసంలో మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: బ్రిక్స్ సదస్సులో తీసుకునే నిర్ణయాల అమలు కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్నే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో భరతమండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. వచ్చే 20ఏళ్ల కాలానికి అవసరమైన ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉందని నిర్ణీత గడువులోగా నిర్ణయాల అమలు కోసం వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.మోదీ మాట్లాడుతూ.. "ప్రస్తుతం గ్లోబల్ సౌత్ అనేక సమస్యలను ఎదుర్కొంటుందని ప్రజల మేలు కోసం దేశాలన్నీ కలిసి పని చేయాల్సి ఉంది ప్రపంచ పరిపాలన మరింత మెరుగుపడాల్సి ఉంది. పరస్పరం గౌరవం, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం" అని మోదీ అన్నారు. అయితే అంతకుముందు ప్రధాని మోదీ అబూదాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయద్ అలీ నహియాన్తో హైదరాబాద్ హౌస్లో సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతలు మలేషియా, ఇథీయోపియా దేశాధినేతలతో రక్షణ రంగంలో సహకారం అంశంపై చర్చలు జరిపారు.కాగా మరికోద్దిసేపట్లో సాయంత్రం 5:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా జిన్పింగ్ భారత్ లో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడితో ఆ దేశానికి చెందిన వ్యాపార ,అధికార ప్రతినిధి బృందంతో ఢిల్లీకి చేరుకుంది. గతంతో పోలిస్తే ఈ సారి పెద్ద మెుత్తంలో అధికార బృందం జిన్పింగ్తో ఉంది. భారత్తో ఆర్థిక వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని చైనా భావిస్తోన్నట్లు సమాచారం. -
ప్రపంచంలో అత్యధిక జీతం.. ఈ ప్రధానిదే!
సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్ వార్షిక వేతన ప్యాకేజీ భారీగా పెరగనుంది. జీతం, బోనస్లతో కలిపి ప్రస్తుతం ఉన్న 2.2 మిలియన్ సింగపూర్ డాలర్ల వార్షిక ప్యాకేజీ 3.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరనుంది. సవరించిన వేతన విధానం వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ప్రభుత్వాధినేతగా వాంగ్ స్థానమూ మరింత బలపడనుంది.ప్రజా సేవల వేతనాలపై స్వతంత్ర సమీక్ష కమిటీ చేసిన సిఫార్సులను అంగీకరించినట్లు వాంగ్ తెలిపారు. అయితే రాజకీయ నాయకుల జీతాలను పెంచడం సింగపూర్లో సున్నితమైన అంశంగా కొనసాగుతోంది. అధిక వేతనాలపై దేశంలో చాలాకాలంగా చర్చ, విమర్శలు ఉన్నాయి.తనకు పెరగనున్న వేతనంలో అదనపు మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని వాంగ్ ప్రకటించారు. తాను ప్రధాన మంత్రిగా కొనసాగినంతకాలం, రానున్న ఐదేళ్లలో వేతన పెంపు ద్వారా లభించే అదనపు మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు అందజేస్తానని చెప్పారు.పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడిన వాంగ్.. రాజకీయంగా క్లిష్టమైన అంశం అయినప్పటికీ దీనిని విస్మరించలేమన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన నాణ్యమైన రాజకీయ నాయకత్వాన్ని కొనసాగించడమే అసలు లక్ష్యమని పేర్కొన్నారు.మంత్రులు, ఉప ప్రధానికీ భారీ పెంపుకొత్త వేతన విధానంతో సింగపూర్ ఉప ప్రధాని, మంత్రుల జీతాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. ఉప ప్రధాని వార్షిక వేతన ప్యాకేజీ 1.8 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి దాదాపు 3 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరనుంది. క్యాబినెట్ మంత్రులకు వారి సీనియారిటీ, బాధ్యతలను బట్టి 1.8 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 2.8 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకు వార్షిక ప్యాకేజీ లభించనుంది. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టే వారికి కూడా వేతనం సుమారు 1.1 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 1.2 మిలియన్ సింగపూర్ డాలర్లకు పెరగవచ్చు.రాజకీయ నాయకుల వేతనాలను నిర్ణయించేందుకు సింగపూర్ ప్రభుత్వం దేశంలోని అత్యధికంగా సంపాదించే 1,000 మంది వ్యక్తుల ఆదాయ స్థాయిలను ఒక బెంచ్మార్క్గా పరిగణిస్తుంది. ప్రైవేట్ రంగం, సివిల్ సర్వీసుల్లో వేతనాలు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకుల వేతనాలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందని వాంగ్ తెలిపారు.ప్రతిభను ఆకర్షించడమే లక్ష్యంరాజకీయ నాయకులకు అధిక వేతనాలు చెల్లించడం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను రాజకీయాల్లోకి ఆకర్షించడం, అవినీతి ప్రమాదాన్ని తగ్గించడం అని సింగపూర్ ప్రభుత్వం చెబుతోంది. అయితే అధిక వేతనాల వల్ల ప్రజలు–రాజకీయ నాయకుల మధ్య ఆదాయ వ్యత్యాసం పెరుగుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి.సింగపూర్ 2012లో మంత్రివర్గ వేతనాలను భారీగా సవరించింది. అప్పట్లో ప్రజల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో రాజకీయ నాయకుల వేతనాలను 36 శాతం వరకు తగ్గించారు. 2017లో మరోసారి సమీక్ష చేపట్టినప్పటికీ అప్పట్లో వేతనాల్లో ఎలాంటి మార్పు చేయలేదు.ఇతర దేశాల నేతలతో పోలిస్తే..వాంగ్ కొత్త వార్షిక వేతన ప్యాకేజీ ప్రపంచంలోని పలువురు దేశాధినేతలతో పోలిస్తే చాలా ఎక్కువ. అమెరికా అధ్యక్షుడి వార్షిక అధికారిక వేతనం 4 లక్షల డాలర్లు కాగా, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వేతనం కూడా సింగపూర్ ప్రధాని ప్యాకేజీతో పోలిస్తే చాలా తక్కువ. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ వార్షిక వేతన ప్యాకేజీ సుమారు 7.19 లక్షల డాలర్లుగా ఉంది.భారత ప్రధాని మోదీ వేతనం ఎంతంటే?సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కొత్త వార్షిక వేతన ప్యాకేజీతో పోలిస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీకి లభించే వేతనం చాలా తక్కువ. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం భారత ప్రధానికి నెలకు సుమారు రూ.1.66 లక్షల వేతనం, అలవెన్సులు లభిస్తాయి. ఇందులో ప్రాథమిక వేతనం, నియోజకవర్గ భత్యం, రోజువారీ భత్యం, సమ్ప్చువరీ అలవెన్స్ వంటి అంశాలు ఉంటాయి. ఈ లెక్కన నగదు వేతనం, అలవెన్సులు కలిపి ఏడాదికి సుమారు రూ.19.2 లక్షలు అవుతాయి. అయితే ప్రధాని అధికారిక నివాసం, భద్రత, అధికారిక ప్రయాణం, సిబ్బంది వంటి ప్రభుత్వ సౌకర్యాలు వేరుగా ఉంటాయి.ఇదీ చదవండి: భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే! -
అడ్డంకులు అధిగమించి ముందడుగు
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యం అంతరాయాలు లేకుండా కొనసాగాలంటే నౌకాయాన స్వేచ్ఛ, సురక్షిత సముద్ర మార్గాలు, నావికుల భద్రత అత్యవసరమని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. పెరుగుతున్న ఆర్థిక బలాన్ని భారీ పెట్టుబడులుగా, నూతన వ్యాపార సంబంధాలుగా మార్చుకోవాలని బ్రిక్స్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ‘బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్’లో ఆయన ప్రసంగించారు. 10 ప్రధాన వాణిజ్య అవరోధాలను గుర్తించి తొలగించాలని చెప్పారు. ప్రతి సంవత్సరం 100 బ్రిక్స్ స్టార్టప్లను ఇతర సభ్య దేశాల మార్కెట్లలోకి విస్తరించాలని, అలాగే ఏటా 1,000 కొత్త వ్యాపార భాగస్వామ్యాలను నిర్మించాలని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలపై మన పురోగతిని ప్రతి ఏటా సమీక్షించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైన అడ్డంకులు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి అడ్డంకులను అధిగమిస్తూ మన ఆర్థిక శక్తిని నూతన వ్యాపార అవకాశాలుగా మార్చుకోవాలని స్పష్టంచేశారు. నౌకాయాన స్వేచ్ఛకు, నావికుల భద్రతకు భారత్ మద్దతిస్తోందని తెలిపారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ జీడీపీలో 40 శాతం మరియు ప్రపంచ వాణిజ్యంలో నాలుగో వంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ జీడీపీ సుమారు రెండున్నర రెట్లు వృద్ధి చెందగా, బ్రిక్స్ దేశాల ఉమ్మడి జీడీపీ మాత్రం నాలుగున్నర రెట్లు పెరిగిందని హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ప్రపంచ వ్యాపారాలకు భారతదేశం చేసే ప్రతిపాదనలో మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక సాంకేతికతలను ప్రధానాంశంగా మోదీ పేర్కొన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాల వేగవంతమైన విస్తరణతోపాటు నౌకా నిర్మాణం, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, కీలక ఖనిజాలు, బయోటెక్నాలజీ రంగాల్లో నూతన సామర్థ్యాలను ప్రస్తావించారు. ‘మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ వరల్డ్’అన్నారు. ప్రపంచ మార్కెట్లకు భారత్ ఒక తయారీ కేంద్రంగా, సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య మరింత లోతైన సహకారం కోసం భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. బ్రిక్స్ దేశాలు తమ సొంత మార్కెట్లకు అనువైన డిజిటల్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి భారతదేశ అనుభవాన్ని వాడుకోవచ్చని అన్నారు. ఇండియాలో 2 లక్షలకు పైగా స్టార్టప్లు, 120కి పైగా యూనికార్న్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి ఆవిష్కరణలను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లడంలో బ్రిక్స్ సహాయపడాలని కోరారు. వాణిజ్య అనుసంధానం అనేది మరో ప్రధాన అంశమని చెప్పారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, వ్యాపార అవకాశాలను విస్తరించడంపై బ్రిక్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి చెప్పారు. -
ఐరాస చీఫ్ గుటేరస్తో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్తో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, నౌకాయాన స్వేచ్ఛ, సుస్థిరాభివృద్ధి, మానవ కేంద్రీకృత కృత్రిమ మేధ(ఏఐ), ప్రపంచ ఆహార భద్రత వంటి పలు అంశాలపై చర్చించారు. బహుళ ధ్రువత్వం ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారు. సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ నాలుగోసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్నందుకు ప్రధాని మోదీకి ఆంటోనియా గుటేరస్ అభినందనలు తెలియజేశారు. గుటేరస్తో అద్భుతమైన సమావేశం జరిగిందని మోదీ ఎక్స్లో పోస్టుచేశారు. భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ కార్యకలాపాలు, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలపై చర్చించానని పేర్కొన్నారు. -
దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోండి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ప్రస్తుత నెలకొన్న సంక్షోభాన్ని చర్చలు, దౌత్య మార్గాల్లో ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్కు సూచించారు. శుక్రవారం ఇరువురు నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, ఇరాన్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొడానికి పెజెష్కియాన్ ఢిల్లీకి చేరుకున్న తర్వాత కొద్ది గంటల్లోనే ఈ భేటీ జరగింది. పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపైమోదీ, పెజెష్కియాన్ చర్చించారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న భారతదేశ స్థిరమైన వైఖరిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడం, నౌకాయాన స్వేచ్ఛ, వాణిజ్య కార్యకలాపాలు, నావికుల భద్రత, సంక్షేమాన్ని పరిరక్షించడం కోసం కృషి అవసరమని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్ప టికీ బ్రిక్స్ సమావేశాల్లో ఇరాన్ భాగస్వామ్యం వహిస్తున్నందుకు పెజెష్కియాన్కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఘర్షణను నివారించడానికి సహకరించాలని మోదీని ఇరాన్ అధ్యక్షుడు కోరారు. -
2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా సంఘర్షణను ముగించడానికి చేపట్టే ఏ శాంతి ప్రయత్నానికైనా మద్దతు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నల్ల సముద్రంలోని భారతీయ నావికుల తగిన భద్రతకు కల్పింంచాలని రష్యా అధినేత పుతిన్కు విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అస్థిరత నేపథ్యంలో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం భారత్ మండపంలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. 45 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. భారత్, రష్యా సంబంధాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను సైతం సమీక్షించారు. ప్రస్తుతం 65 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఈ సందర్భంగా భారత్, రష్యాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఈ ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్–రష్యా ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో వేగం పెంచాలని ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించింది. రెండు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర చర్చల కోసం రష్యాలో పర్యటించాలన్న పుతిన్ ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారని తెలియజేసింది. చర్చలు, దౌత్యమే సరైన మార్గం రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాలు, పౌర అణు శక్తి, ఎరువుల సరఫరా, ప్రజల మధ్య పరస్పర సంబంధాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలో సముద్ర వాణిజ్యం, భారతీయ నావికుల భద్రత సహా ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్య బదిలీ సహా ప్రజల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణ త్వరగా ముగిసిపోవాలని మోదీ ఆకాంక్షించినట్లు సమాచారం. సంఘర్షణల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని పుతిన్ దృష్టికి మరోసారి తీసుకెళ్లినట్లు తెలిసింది. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా సహకరిస్తుందని మోదీ అన్నారు. రష్యా మార్కెట్లో అవకాశాలు ఇప్పటికే బలంగా ఉన్న తమ రక్షణ సహకారాన్ని మరింత విస్తరించడంపైనా ఇరుపక్షాలు లోతుగా చర్చించాయి. ఇంధన రంగంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాయి. పౌర అణు ఇంధన రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి అంగీకరించాయి. అంతేకాకుండా పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడం, రైలు, సొరంగ మార్గాల నిర్మాణాల్లో కలిసి పనిచేయడం, ఉక్కు సప్లై చైన్లను అభివృద్ధి చేయడం, భారతీయ ఎగుమతిదారులకు రష్యా మార్కెట్లో అవకాశాలను పెంచడం వంటి అంశాలు కూడా ఈ చర్చల్లో చోటుచేసుకున్నాయి. మోదీ, పుతిన్ కలుసుకోవడం 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి. ఇటీవల కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత్ మండపంలో బిజినెస్ ఫోరమ్ వేదిక వద్దకు చేరుకోవడానికి మోదీ, పుతిన్ ఒకే కారులో ప్రయాణించారు. అంతకుముందు వారిద్దరూ భారత్ మండపంలో ‘ఇన్నోప్రోమ్ ఇండియా’ప్రదర్శనను సందర్శించారు. అందులో పాల్గొన్న వారితో సంభాషించారు. పరస్పర సహకారంపై చర్చించా: మోదీ మౌలిక సదుపాయాలు, ఇంధనం, సాంకేతికత, రక్షణ, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పర సహకారంపై పుతిన్తో చర్చించానని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ‘ఆర్థిక సహకార కార్యక్రమం–2030’అమలు సహా వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తాము చర్చించినట్లు పేర్కొన్నారు. పుతిన్కు ‘తిరుక్కురళ్’బహూకరణ ప్రఖ్యాత తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ రచించిన ప్రాచీన తమిళ కావ్య సంకలనం ‘తిరుక్కురళ్’రష్యన్ అనువాద గ్రంథాన్ని ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్కు బహూకరించారు. అనేక అంశాలపై జ్ఞానోపదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. భాషలు, సరిహద్దులకు అతీతంగా శాశ్వత జ్ఞానాన్ని అందించే తిరుక్కురళ్ రష్యన్ అనువాదాన్ని పుతిన్కు అందజేశానంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పుతిన్తో ఆప్యాయంగా కరచాలనం చేసిన దృశ్యాలతో కూడిన ఒక చిన్న వీడియో క్లిప్ను కూడా షేర్చేశారు. -
సమష్టి స్వరం సాధ్యమేనా!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఇరాన్తో అమెరికా లడాయి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధిస్తున్న సుంకాలు వగైరాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని ఊపిరాడకుండా చేస్తున్న తరుణంలో న్యూఢిల్లీలో శని, ఆదివారాల్లో బ్రిక్స్ దేశాల 18వ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ రాగా... చైనా అధ్య క్షుడు షీ జిన్పింగ్ శనివారం చేరుకుంటారు. ఆయన ఏడేళ్ల తర్వాత మన దేశం వస్తున్నారు. ఇక ఇరాన్ అధ్యక్షుడొకరు భారత్కొచ్చి ఎనిమిదేళ్లవుతుండగా, పెజెష్కియాన్ అడుగుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ ద్వైపాక్షిక సమావేశం జరగటం,ఆ వెంటనే పెజెష్కియాన్ కూడా ఆయనతో ద్వైపాక్షిక భేటీ కావటంతో పాటు, తదనంతరం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశంలో కూడా పాలుపంచుకోవటంతో దౌత్య సందడి ముందే మొదలైనట్టయింది. ఆవిర్భవించిననాడు బ్రిక్స్వి బుడి బుడి అడుగులే. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాల విదేశాంగమంత్రులు 2006లో తొలిసారి సమావేశమై కూటమిగా ఏర్పడాలని నిర్ణయించారు. 2009లో తొలి శిఖరాగ్ర సమావేశం జరిగింది. దక్షిణాఫ్రికా 2011లో చేరాక చివరిలో ‘ఎస్’ చేరి బ్రిక్స్ అయింది. అటుపై వరసగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇండొనేసియాలు వేర్వేరు సంవత్సరాల్లో చేతులు కలిపాయి. మొత్తంగా ఇది 20 దేశాల కూటమిగా రూపొందింది. ప్రపంచ జనాభాలో బ్రిక్స్ దేశాల వాటా 49.5 శాతం. ప్రపంచంలోని నాలుగోవంతు భూభాగం దీని సొంతం. ప్రపంచ జీడీపీలో దాదాపు 30 శాతం వాటా. వాణిజ్య ఎగుమతుల్లో 21.6 శాతం, దిగుమతుల్లో 17.3 శాతం వాటా ఈ దేశాలదే. ప్రపంచ ఇంధన ఉత్పత్తిలో బ్రిక్స్ వాటా 40 శాతం. కొనుగోలు శక్తిలో జీ7 దేశాలకన్నా బ్రిక్స్ దేశాలదే అధికం. ప్రపంచ బ్యాంకుకు ప్రత్యా మ్నాయంగా పేద దేశాలకు తోడ్పడే సుస్థిర పట్టణాభివృద్ధి ప్రణాళిక, మౌలిక సదుపాయా లపై సూచనలివ్వటం, వాటి వ్యయానికి నిధులు సమకూర్చటం తదితరాలను చైనాలోని షాంఘైలో ప్రధాన కార్యాలయం ఉన్న బ్రిక్స్కు చెందిన న్యూ డెవెలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) చూస్తోంది. సభ్యదేశాల జాతీయ కరెన్సీల్లో వాణిజ్యం నెరపుతూ డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవటం, చెల్లింపులకోసం స్విఫ్ట్ వంటి పేమెంట్ విధానంలోకాక ‘బ్రిక్స్ పే’ ద్వారా లావాదేవీలు జరపటం ఇప్పటికే మొదలయ్యాయి. ఇన్నివిధాల సహాయ సహకారాలు కొనసాగే బ్రిక్స్ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందా అనే సంశయం చాలా మందికి ఉంది. ఎందుకంటే ఈ కూటమిలోని దేశాలే వేరే కూటముల్లో ఉన్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ అమెరికా కనుసన్నల్లో నడుస్తాయి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు సహకరిస్తూ ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు సరేసరి. అయితే ఆగిపోవటం కన్నా అడుగు ముందుకేయటమే అందరికీ ప్రయోజనకరం. కలిసి పనిచేసే సంస్కృతి పెంపొందటంవల్ల అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. దగ్గరయ్యేందుకు వీలుంటుంది. సమష్టి కార్యా చరణ అవసరమైన రంగాలు చాలానే ఉన్నాయి. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, ఐక్యరాజ్యసమితిని బహుళ ప్రాతినిధ్య సంస్థగా చేయాలన్న డిమాండ్ వగైరాల్లో ఈ దేశాలు సమష్టిగా పనిచేయొచ్చు. వాతావరణం, విద్య, ఇంధనం, డిజిటల్ పేమెంట్ వేదికలు వగైరాల్లో సహకరించుకోవచ్చు. అలాగని కల్లోల కాలంలో కూటములు మనుగడ అంత సులభమేమీ కాదు. తమపై అమెరికా ప్రకటించిన దురాక్రమణ యుద్ధాన్ని బ్రిక్స్ ఖండించాలని ఇరాన్ బలంగా కోరుకుంటోంది. అదే సమయంలో తమపై ఇరాన్ సాగిస్తున్న దాడుల్ని కూడా వ్యతిరేకించాలని సౌదీ, యూఏఈ ఆశిస్తాయి. అందుకే బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన అంత సులభమేమీ కాదు. ఇటీవల బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు నేరుగా అమెరికానూ, ఇజ్రాయెల్నూ ప్రస్తావించకుండా ఇరాన్పై దాడిని ఖండించింది. అక్కడైతే సౌదీ, యూఏఈ సభ్యదేశాలు కాదు. ఇక్కడ పరిస్థితి వేరు. ఈ సమస్యను బ్రిక్స్ ఎలా పరిష్కరించుకుంటుందో చూడాల్సివుంది. ఆ దేశాలకూ, ఇరాన్కూ మధ్య ఏదోమేర సామరస్యం సాధించగలిగితే, సమష్టి స్వరం వినిపించగలిగితే బ్రిక్స్ బలం మరింత పెరుగుతుంది. -
ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాలదే: మోదీ
ఢిల్లీ: ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాలదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ఆయన ప్రసంగిస్తూ.. బ్రిక్స్ 4 దేశాలతో మొదలై 21 దేశాలకు చేరిందన్నారు. ప్రపంచ జనాభాలో 50 శాతం బ్రిక్స్ దేశాలదే. బ్రిక్స్ కూటమి ప్రపంచంలో సగం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుంది, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ పరిష్కారం చూపిస్తుందన్నారు.బ్రిక్స్ జీడీపీ 4.5 శాతం పెరిగింది. సుస్థిరాభివృద్ధి, సహకారం, ఇన్నోవేషన్స్కి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. రోడ్డు, రైళ్లు, ఎయిర్పోర్టుల వంటి మౌలిక సదుపాయాల్లో భారత్ వేగంగా విస్తరిస్తోందని మోదీ అన్నారు. -
‘ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపండి’.. పుతిన్తో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరిపిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ యుద్ధాన్ని తక్షణమే ఆపి, శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ తన వంతు సహాయసహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా ఇరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రష్యన్ భాషలోకి అనువదించిన ప్రముఖ తమిళ ప్రాచీన కావ్యమైన ‘తిరుక్కురళ్’ ప్రతిని పుతిన్కు ప్రత్యేక బహుమతిగా అందజేశారు. దాదాపు రెండు వేల ఏళ్ల నాటి ఈ గ్రంథంలోని మానవతా విలువలను మోదీ ఈ సందర్భంగా పుతిన్కు వివరించారు.రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష రంగాల బలోపేతంపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.రష్యాలో జరగబోయే 24వ ఇండో-రష్యా వార్షిక శిఖరాగ్ర సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా ఆహ్వానించగా.. ఆయన ఆ ఆహ్వానాన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన తుది తేదీలను దౌత్య అధికారులు త్వరలోనే ఖరారు చేయనున్నారు.👉ఇదీ చదవండి: ప్రధాని మోదీతో పుతిన్ భేటీ -
ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. భారత్ మండపంలో ఇవాళ(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ భేటీ అయ్యారు. భారత్, రష్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిపారు. కీలక రక్షణ ఒప్పందాలు, వ్యాపారం, వాణిజ్యం, భద్రత, ఎల్ఎన్జీ దిగుమతి, అధునాతన యుద్ధ విమానాల తయారీ సాంకేతికత బదిలీ తదితర అంశాలపై చర్చించారు. రెండు నెలల్లోనే రెండోసారి ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పుతిన్కు మోదీ కానుకద్వైపాక్షిక భేటీలో పుతిన్కు రష్యన్ భాషలో అనువదించిన ఓ పుస్తకాన్ని ప్రధాని మోదీ కానుకగా అందించారు. తమిళ కవి తిరువళ్లువరు రచించిన ‘తిరుక్కురళ్’ పుస్తకాన్ని అందజేశారు. పుతిన్ మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. కాగా, బ్రిక్స్ సదస్సుకు షీ జిన్పింగ్ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ నిర్ధారించింది.జిన్పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్లో భారత్లో పర్యటించారు. బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్ను సైతం షేర్ చేశారు.ఇదీ చదవండి:బ్రిక్స్తో మనకు లాభాలున్నాయండోయ్..! -
జిన్పింగ్ భారత్ పర్యటనపై సస్పెన్స్.. చైనా వ్యూహం ఇదేనా?
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు బీజింగ్ చివరి నిమిషంలో అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అందరి చూపూ మోదీ-జిన్పింగ్ భేటీపై పడింది. అసలు ఇంత కీలకమైన పర్యటనను చైనా చివరి వరకు ఎందుకు సస్పెన్స్లో పెట్టింది? ఇదే ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.2019లో మహాబలిపురం అనధికారిక సమావేశం తర్వాత జిన్పింగ్ భారత్కు రావడం ఇదే తొలిసారి. గాల్వాన్ ఘర్షణ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలు ఇటీవల క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, జిన్పింగ్ పర్యటనకు కేవలం 48 గంటల ముందే అధికారిక ప్రకటన రావడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.చివరి నిమిషం వరకు ఎందుకు?జిన్పింగ్ పర్యటనను ఆలస్యంగా ప్రకటించడం వెనుక ఎలాంటి అనిశ్చితి లేదని.. ఇది చైనా అనుసరించే దౌత్య వ్యూహంలో భాగమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సదస్సుకు ముందు జరిగే చర్చల్లో తనకు గరిష్ఠ స్థాయి వెసులుబాటు ఉండేలా బీజింగ్ వ్యవహరించిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. బ్రిక్స్ డిక్లరేషన్, సదస్సు అజెండా, మోదీ-జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ వంటి కీలక అంశాలపై చివరి వరకు చర్చలు కొనసాగించేందుకు ఈ సస్పెన్స్ చైనాకు ఉపయోగపడిందనే విశ్లేషణలు ఉన్నాయి.NOW:🇨🇳🤝🇮🇳 Chinese President Xi Jinping is coming to India for the first time post Covid for BRICS summit. pic.twitter.com/8CkwJ8MeLu— RealWestern (@RealWestern2003) September 11, 2026భేటీలో ఏం జరుగుతుంది?అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మోదీ-జిన్పింగ్ భేటీలో సరిహద్దు పరిస్థితి, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గాల్వాన్ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా తొలగిపోలేదు. దీంతో ఈ సమావేశంలో ఇరువురు నేతలు ఇచ్చే సంకేతాలు అత్యంత కీలకం కానున్నాయి.బ్రిక్స్ వేదికగా చైనా మరో వ్యూహంబ్రిక్స్లో ఇప్పుడు 11 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ద్వారా గ్లోబల్ సౌత్లో తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా కీలక దేశాల నేతలు పాల్గొంటున్న నేపథ్యంలో జిన్పింగ్ హాజరు చైనా దౌత్యానికి కూడా కీలకమే. అందుకే చివరి నిమిషం వరకు సస్పెన్స్.. ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడినట్టు తెలుస్తోంది. జిన్పింగ్ భారత్ పర్యటన వెనుక అసలు ఫోకస్ బ్రిక్స్ సదస్సేనా? లేక మోదీతో కీలక ద్వైపాక్షిక డీల్కు రంగం సిద్ధమైందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: భారత్లో అడుగుపెట్టిన పుతిన్ -
#80sTrend: హద్దులు దాటిన మీమ్ వార్
సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొత్తేమీ కాదు. కానీ ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘మీమ్ వార్’ మరో స్థాయికి చేరింది. తాజాగా రెట్రో ట్రెండ్ ఏఐ ద్వారా దేశాన్ని ఊపేస్తోంది. తమ ఫొటోలను 70, 80 కాలం నాటి ఫొటోల్లా మార్చేసుకుని మురిసిపోతున్నారు చాలామంది. అయితే ఈ ట్రెండ్ వెనుక సైబర్ నేరాలకు అవకాశం ఉందనే హెచ్చరికలూ జారీ చేస్తున్నారు నిపుణులు. ఆ సంగతి పక్కన పెడితే.. పొలిటికల్గా ఇది మరో టర్న్ తీసుకుంది. ఒక పార్టీ పాతకాలం నాటి ఫొటోతో సెటైర్ వేస్తే.. మరో పార్టీ దానికి అంతకుమించిన వ్యంగ్య చిత్రంతో కౌంటర్ ఇచ్చింది. చివరకు ఈ పోస్టుల వ్యవహారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ టార్గెట్ చేసే వరకు వెళ్లింది. దీంతో ఇరు పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.కాంగ్రెస్ పోస్టుతో మొదలు..ఈ వివాదానికి కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చేసిన ఓ పోస్టు కారణమైంది. ‘1980ల నాటి గుజరాత్ వీధి’ అంటూ ఓ చిత్రాన్ని పోస్టు చేసింది. దీన్ని బీజేపీ తెలంగాణ కౌంటర్ చేసింది. 1970ల నాటి తరహాలో ఉన్న ఓ మహిళ బార్ కౌంటర్పై డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించే చిత్రాన్ని ‘లుసియానా, ఇటలీ’ అనే క్యాప్షన్తో పోస్టు చేసింది. ఇక్కడితో ఆగని బీజేపీ కేరళ విభాగం మరో బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చింది. పాతకాలం నాటి రాజకీయ పార్టీ కార్యాలయాన్ని తలపించేలా ఉన్న ఈ చిత్రంతో కాంగ్రెస్పై సెటైర్ వేసింది.అయితే ‘లుసియానా’ ప్రస్తావనతో పాటు వరుస పోస్టులను పరిశీలించిన పలువురు.. ఈ వ్యంగ్యానికి అసలు లక్ష్యం సోనియా గాంధీనేనని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఇటలీలోని లుసియానాలో జన్మించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ గుజరాత్ ఖాతా నుంచి చేసిన ఓ పోస్టును తర్వాత తొలగించినట్లు సమాచారం. దీంతో వివాదం మరింత ముదిరింది.దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పేజీలు గుజరాత్ గజదొంగ, చాయ్ పేరిట రైల్వే స్టేషన్లో చోరుడు, మొసలిని పట్టుకున్న మొనగాడు అంటూ రెట్రో స్టైల్లోనే పలు పోస్టులు చేసింది. దీంతో ఇది నరేంద్ర మోదీని ఉద్దేశించేనంటూ బీజేపీ భగ్గుమంది. ఇలా ఇరు పార్టీలు ఈ ట్రెండ్ను తమ మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు వేదికగా మార్చేశాయి.రెండు పార్టీల మధ్య మాటల యుద్ధంపోస్టులపై ఇరు పార్టీల మద్దతుదారులు తీవ్రంగా స్పందించారు. బీజేపీ పోస్టుల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిని వ్యక్తిగత దూషణ, వ్యక్తిత్వాన్ని కించపర్చడంగా అభివర్ణించాయి. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సైతం ఈ విషయంలో బీజేపీపై మండిపడ్డారు. అయితే బీజేపీ మద్దతుదారులు తమ పోస్టులను రాజకీయ వ్యంగ్యంగా సమర్థిస్తూ.. ప్రత్యర్థి పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో కొందరు మాత్రం ‘రెండు పార్టీలు బురదలో కొట్టుకుంటున్నట్లుగా ఉంది’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. రాజకీయ అంశాలపై చర్చించాల్సిన సోషల్ మీడియా వేదికలు.. ఇలా పాత ఫొటోలు, మీమ్స్, వ్యక్తిగత విమర్శలకు వేదికలుగా మారడంపై కూడా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.వైరల్ ట్రెండ్.. రాజకీయ పోరుకు ఆయుధంఇటీవల సోషల్ మీడియాలో పాతకాలం నాటి ఫొటోలు, మీమ్స్ను కొత్త క్యాప్షన్లతో వైరల్ చేయడం ట్రెండ్గా మారింది. రాజకీయ పార్టీలు కూడా ఇదే ట్రెండ్ను తమ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి. ఈ ఘటనలోనూ ఓ పార్టీ పోస్టుకు మరో పార్టీ కౌంటర్ ఇవ్వడంతో మొదలైన వ్యవహారం.. చివరకు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. దీంతో రాజకీయాల్లో సోషల్ మీడియా మీమ్ సంస్కృతి ఎంతగా ప్రభావం చూపుతోందన్న చర్చ మరోసారి మొదలైంది.ఇదీ చదవండి: కోతులు అలా చేయడానికి మనమే కారణమా? -
భారత్లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో ఆయన భారత్ పర్యటన సాగుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈసారి బ్రిక్స్ సదస్సులో కీలకంగా మారనున్నాయి.మోదీ–పుతిన్ భేటీలో కీలక అంశాలుపుతిన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఔషధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీలో ప్రధానంగా ఉండనుంది.President Putin arrives in New Delhi:Government Il-96 landed at the base of the air force of the Republic of Palam.(3:54 am, Delhi time)NEW DELHI, September 11. /TASS/. Russian President Vladimir Putin arrived in India, in the capital of which New Delhi the BRICS summit… https://t.co/K9ZBz6ZsHk pic.twitter.com/tnM4Q7pHIM— ⏳Towhee 🌏☮️ (@amborin) September 10, 2026రక్షణ రంగంలో బ్రహ్మోస్ క్షిపణి ఆధునికీకరణపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్కు మిగిలిన ఎస్–400 వ్యవస్థల సరఫరా, సు–57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరాపైనా చర్చలు జరగనున్నాయి. భారత్లో కొత్త సివిల్ న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం.ఏడేళ్ల తర్వాత భారత్కు జిన్పింగ్పుతిన్ మాత్రమే కాదు బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా హాజరుకానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జిన్పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ఇరు దేశాల సంబంధాలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది.పశ్చిమాసియా సంక్షోభం.. బ్రిక్స్కు సవాల్ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బ్రిక్స్ సదస్సుకు కీలక సవాల్గా మారాయి. ముఖ్యంగా ఇరాన్, యూఏఈ మధ్య విభేదాల నేపథ్యంలో కూటమి ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం అంతర్జాతీయ చమురు వాణిజ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్ నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో అమెరికా వాణిజ్య, సుంకాల విధానాలు కూడా బ్రిక్స్ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ పాలనలో బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై భారత్ తన అధ్యక్ష హోదాలో దృష్టి పెట్టనుంది.విస్తరించిన బ్రిక్స్.. పెరిగిన ప్రాధాన్యంబ్రిక్స్లో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉండేవి. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, హైటెక్నాలజీతోపాటు ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారం, ఇంధనం, విపత్తుల నిర్వహణ, సరఫరా వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాలో ఉంది.రెండు రోజులపాటు కీలక భేటీలుభారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు సదస్సు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రిక్స్ నేతలు రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక, మానవతా సంబంధాలపై చర్చిస్తారు. ఆదివారం విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను విడుదల చేయడంతో సదస్సు ముగియనుంది.బ్రిక్స్ వేదికపై అధికారిక సమావేశాలతోపాటు నేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనా ఆసక్తి నెలకొంది. పుతిన్తో మోదీ భేటీ, ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చిన జిన్పింగ్తో మోదీ సమావేశం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో మోదీ చర్చలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా.. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ పరిణామాలు, వాణిజ్య యుద్ధాల ప్రభావం వంటి కీలక అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పుతిన్–మోదీ భేటీతోపాటు భారత్ వేదికగా జరిగే ఇతర ద్వైపాక్షిక చర్చలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: మిస్టర్ సింగ్.. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ల్యాండ్ -
‘ఇస్రో’తో ప్రపంచానికి లబ్ధి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండే సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పారదర్శకత, సమగ్రతతో కూడిన శాస్త్రీయ సమాచారం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలని స్పష్టంచేశారు. గురువారం ఫ్రాన్స్లో జరిగిన తొలి అంతర్జాతీయ అంతరిక్ష శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ వర్చువల్గా ప్రసంగించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సాంకేతికతలు, భాగస్వామ్యాలు భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నాయని వెల్లడించారు. సువిశాల అంతరిక్షం శతాబ్దాలుగా ప్రజల ఊహాశక్తిని ప్రేరేపిస్తూనే ఉందని తెలిపారు. వాతావరణం, పంటల నుంచి సముద్రాలు, సమాజాల వరకు భూమిపై జీవనాన్ని అంతరిక్షమే నిర్దేశిస్తోందని పేర్కొన్నారు. అంతరిక్షం ఇవ్వగల శక్తి అనంతమైనదని వ్యాఖ్యానించారు. అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఘర్షణకు బదులుగా సహకారం, స్వల్పకాలిక లాభానికి బదులుగా సుస్థిరత అవసరమని అన్నారు. భారతదేశ విధానం వసుధైక కుటుంబం(ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు) అనే భావనలో ఇమిడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూగోళం దాటి విస్తరించాలని మోదీ ఆకాంక్షించారు. అంతరిక్షంలోకి 34 దేశాల ఉపగ్రహాలు భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఇస్రో’తన అత్యుత్తమ పనితీరు, తక్కువ వ్యయంతో కూడిన ప్రయోగాల ద్వారా ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇస్రో సామర్థ్యాలు రైతులకు, మత్స్యకారులకు, వాతావరణ అంచనాకు, విపత్తు నిర్వహణకు, నౌకాయానానికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. 34 దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలు భారతీయ రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లాయని తెలిపారు. ఇస్రోతో ఎన్నో దేశాలు ప్రయోజనం పొందుతున్నాయని వివరించారు. ఈ విజయం వెనుక భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు తరాల తరబడి సాగించిన అంకితభావం, కృషి ఉన్నాయని ఉద్ఘాటించారు. వారు పగలు రాత్రి అవిశ్రాంతంగా పనిచేస్తూ ఇస్రోకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టారని కొనియాడారు. అంతరిక్షయాన దేశాల సరసన భారతదేశానికి గరి్వంచదగిన స్థానాన్ని కల్పించారని ప్రశంసించారు. 2040 నాటికిచంద్రుడిపైకి భారతీయుడు చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ చెప్పారు. ఆదిత్య–ఎల్1 మిషన్ సూర్యుడి రహస్యాలను వెలికితీస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది ఒక భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చాడని గుర్తుచేశారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. వీటి ప్రయోజనాలు మొత్తం మానవాళికి అందాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టంచేశారు. భారత్లో ఇస్రోతోపాటు ప్రైవేట్ అంతరిక్ష రంగం కూడా పురోగమిస్తోందని అన్నారు. ఇస్రో సాధించిన అత్యుత్తమ నైపుణ్యానికి పారిశ్రామిక ఉత్సాహం తోడవుతోందని తెలియజేశారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో ఫ్రాన్స్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతోందని తెలిపారు. భారతదేశపు తదుపరి అంతరిక్ష ప్రస్థానంలో భాగస్వాములుగా చేరాలని ఫ్రాన్స్ను, ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తొలి అంతర్జాతీయ అంతరిక్ష శిఖరాగ్ర సదస్సుకు తనను ఆహ్వానించినందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్త మానవాళి కోసం, భావి తరాల కోసం మనమంతా కలిసి అంతరిక్షాన్ని అన్వేషిద్దామని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు చేద్దామని, అంతరిక్షాన్ని పరిరక్షించుకుందామని సూచించారు. -
ప్రధాని మోదీతో ప్రిన్స్ ఆగా ఖాన్ భేటీ
న్యూఢిల్లీ: ఇస్మాయిలీ ముస్లింల 50వ ఇమామ్ ప్రిన్స్ రహీం ఆగా ఖాన్–5 గురువారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాల్లో ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్(ఏకేడీఎన్)తో భారత్ భాగస్వామ్యంపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. అనంతరం ప్రధాని మోదీ ఎక్స్లో.. ప్రిన్స్ రహీం ఆగా ఖాన్ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన తండ్రి, దివంగత ఆగా ఖాన్–4 జ్ఞాపకాలను, భారత్ అభివృద్ధి కోసం ఆయన అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నాం. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారిత వంటి రంగాల్లో ఏకేడీఎన్తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు గల మార్గాలపై చర్చించాం’అని పేర్కొన్నారు. భారత్ సమ్మిళిత వృద్ధి, సామాజిక పురోగతికి ఏకేడీఎన్ కట్టుబడి ఉందని ఆగా ఖాన్ పునరుద్ఘాటించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానంపై పర్యటనకు వచ్చిన ఆగాఖాన్ ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు భారత్లో ఉంటారు. ఏకేడీఎన్ చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించేందుకు అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలను ఆగా ఖాన్ సందర్శించనున్నారు. ఇస్మాయిలీ వర్గం 50వ ఇమామ్గా గతేడాది బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. -
స్పేస్ పరిశోధనల్లో భారత్తో చేతులు కలపండి.. ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ : అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, భవిష్యత్ పరిశోధనల్లో భారత్కు సహ ప్రయాణికులుగా మారాలని ఫ్రాన్స్,ఇతర దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పారిస్లో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును (ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్) ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భూమిపై మానవ జీవితానికి అంతరిక్షం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. శతాబ్దాలుగా అంతరిక్షం మానవ ఊహాశక్తిని ప్రేరేపిస్తోందని, నేడు అది వాతావరణం, వ్యవసాయం, సముద్రాలు, సమాజాల అభివృద్ధిని ప్రభావితం చేస్తోందని తెలిపారు.అంతరిక్ష కక్ష్యలు రద్దీగా మారుతున్న తరుణంలో.. ఘర్షణల కంటే సహకారానికి, స్వల్పకాలిక లాభాల కంటే సుస్థిరతకు, మినహాయింపుల కంటే సమ్మిళిత విధానానికి మన ఎంపికలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని స్పష్టం చేశారు. 1960ల నుంచి భారత్, ఫ్రాన్స్లు అంతరిక్ష రంగంలో నమ్మకమైన భాగస్వాములుగా ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సాంకేతికతను అందించడంలో ఇస్రో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ప్రశంసించారు. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలను భారతీయ రాకెట్లు అంతరిక్షంలోకి విజయవంతంగా చేరవేశాయని తెలిపారు.రైతులు, మత్స్యకారులకు సహాయం చేయడం నుంచి వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ, నావిగేషన్ వరకు ఇస్రో సాంకేతికతలు కేవలం భారత్కే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాలు, చర్చలు, సహకారంతో సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగాన్ని రూపొందించడానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. -
12న మోదీ-జిన్పింగ్ భేటీ!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సెప్టెంబరు 12న న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సు సందర్భంగా భేటీ జరిగే అవకాశముంది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖిగా ద్వైపాక్షిక చర్చలు జరపడం ఇదే తొలిసారి కానుంది. అయితే ఈ భేటీపై భారత్, చైనా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబరు 12, 13 తేదీల్లో భారత్ ఆతిథ్యంలో జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు జిన్పింగ్ శనివారం న్యూఢిల్లీకి రానున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇటీవల కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో మోదీ, జిన్పింగ్ కలుసుకుని కరచాలనం చేసినప్పటికీ, అధికారిక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించలేదు.జిన్పింగ్ పర్యటనకు ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) సమావేశం కూడా జరిగింది. అనంతరం సరిహద్దు అంశంపై ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధులు చర్చించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పలు ఘర్షణ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణతో సంబంధాల్లో క్రమంగా స్థిరత్వం కనిపిస్తోంది.2020 జూన్లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. చైనా తన నలుగురు సైనికులు మరణించినట్లు తర్వాత వెల్లడించింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య సైనిక ప్రతిష్ఠంభన, రాజకీయ, ఆర్థిక, దౌత్య సంబంధాల్లో తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. సైనిక, దౌత్య చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ విస్తృత సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాలేదు.అరుణాచల్ప్రదేశ్ అంశం కూడా ఇరు దేశాల మధ్య కీలక వివాదంగా కొనసాగుతోంది. మొత్తం అరుణాచల్ను చైనా ‘జాంగ్నాన్’ లేదా దక్షిణ టిబెట్గా పేర్కొంటూ హక్కు కోరుతోంది. భారత్ ఆ వాదనను తిరస్కరిస్తూ అరుణాచల్ప్రదేశ్ దేశంలో అంతర్భాగమని స్పష్టం చేస్తోంది. ఇటీవల అప్పర్ సుబన్సిరి ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు, దూకుడు వైఖరిపై వచ్చిన నివేదికలు ఆందోళన పెంచాయి.మోదీ-జిన్పింగ్ భేటీలో సరిహద్దు సమస్య, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు, ఎల్ఏసీ వెంబడి మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు చర్చకు వచ్చే అవకాశముంది. బ్రిక్స్ సహా బహుపాక్షిక వేదికల్లో సహకారం పెంపుపైనా ఇరువురు నేతలు దృష్టి సారించే అవకాశం ఉంది. -
తెలుగు రాష్ట్రాల్లో రెండు రైల్వే ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) దేశవ్యాప్తంగా రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో ఐదు మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 17 జిల్లాల మీదుగా ఐదు ప్రాజెక్టులు నిర్మించనున్నారు.ఇందులో భాగంగా ఏపీ పరిధిలో రేణిగుంట–అరక్కోణం మార్గంలో 77 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైను పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పనులను 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద రూపొందించారు. తద్వారా ప్రజల రాకపోకలతో పాటు సరుకు రవాణా అత్యంత సులభతరం కానుంది. పనులు పూర్తయితే రైల్వే నెట్వర్క్ సామర్థ్యం పెరిగి రైళ్ల రద్దీ తగ్గుతుంది. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు మహర్దశ ఈ రైల్వే లైన్ల విస్తరణ పనులతో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడనుంది. ఏపీలోని తిరుపతి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాలకు, తెలంగాణలోని యాదగిరి గుట్ట ఆలయానికి ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. మొత్తంగా ఐదు ప్రాజెక్టుల వల్ల సరుకు రవాణా సామర్థ్యం పెరగడంతోపాటు, ఇంధన ఆదాతో పాటు పర్యావరణానికి భారీ ప్రయోజనం కలగనుంది. వాతావరణంలోకి 42 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని, ఇది సుమారు 2 కోట్ల చెట్లను నాటడంతో సమానమని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
మోదీకి ఊహించని షాక్.. భారత్కు ముయిజ్జు వెన్నుపోటు?
ఒకప్పుడు ‘ఇండియా ఔట్’ అంటూ భారత్ను మాల్దీవుల నుంచి దూరం చేయాలని ప్రయత్నించిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు.. ఇటీవలే న్యూఢిల్లీతో స్నేహగీతం ఆలపించారు. భారత్ సాయంతో నిర్మిస్తున్న థిలమాలే బ్రిడ్జిని ఇరు దేశాల శాశ్వత స్నేహానికి ప్రతీకగా కొనియాడారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతలోనే భారత్కు షాకిస్తూ.. వ్యూహాత్మకంగా కీలకమైన థిలాఫుషి పోర్ట్ ప్రాజెక్టును చైనా కంపెనీకి అప్పగించిన విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ముయిజ్జు భారత్కు వెన్నుపోటు పొడిచారా? అన్న చర్చ మొదలైంది.మాల్దీవుల ప్రభుత్వ ఆధీనంలోని మాల్దీవ్స్ పోర్ట్స్ లిమిటెడ్.. థిలాఫుషి పోర్ట్ అభివృద్ధి తొలి దశ పనులను చైనా హార్బర్ ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించింది. ప్రస్తుతం మాలేలోని పోర్టులపై ఉన్న రద్దీని తగ్గించి.. దేశ వాణిజ్య కార్యకలాపాల్లో కీలక భాగాన్ని థిలాఫుషికి తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అంటే భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన వాణిజ్య నౌకాశ్రయాల్లో ఒకటిగా థిలాఫుషి మారబోతోంది. ఇక్కడే భారత్కు అసలు ట్విస్ట్ ఎదురవుతోంది. అదే థిలాఫుషికి భారత్ భారీ కనెక్టివిటీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు కింద మాలే, విలిమాలే, గుల్హిఫాల్హు, థిలాఫుషిలను అనుసంధానించే 6.7 కిలోమీటర్ల బ్రిడ్జిలు, రహదారులు, కాజ్వేలను భారత్ నిర్మిస్తోంది. 400 మిలియన్ డాలర్ల రుణం, మరో 100 మిలియన్ డాలర్ల గ్రాంట్తో ఈ ప్రాజెక్టుకు భారత్ మద్దతు ఇస్తోంది.అంటే.. థిలాఫుషికి చేరుకునే కనెక్టివిటీని భారత్ నిర్మిస్తుంటే.. అక్కడి కీలక పోర్టును చైనా అభివృద్ధి చేయబోతోంది. హిందూ మహాసముద్రంలో కీలకమైన సముద్ర మార్గాలకు సమీపంలో ఉన్న మాల్దీవుల విషయంలో ఈ పరిణామం సాధారణ నిర్మాణ ఒప్పందంగా చూడలేని పరిస్థితి. మౌలిక వసతుల వెనుక భౌగోళిక, వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ముడిపడి ఉంటాయి.భారత్కు నమ్మకద్రోహం..ఇక, ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తీరు చూస్తే ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. 2023లో ‘ఇండియా ఔట్’ ప్రచారంతో అధికారంలోకి వచ్చిన ఆయన.. తొలుత చైనాతో సంబంధాలను బలోపేతం చేశారు. తన తొలి విదేశీ పర్యటనను కూడా చైనాలోనే చేపట్టారు. భారత్ సైనిక సిబ్బందిని వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఆర్థిక సంక్షోభం ముయిజ్జును మళ్లీ భారత్వైపు చూసేలా చేసింది. భారీ రుణభారం, ఆర్థిక ఒత్తిళ్ల సమయంలో భారత్.. మాల్దీవులకు ఆర్థిక సహాయం అందించింది. 400 మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ సదుపాయంతో పాటు రూ.3,000 కోట్ల మేర సహకారం అందించింది. దీంతో ముయిజ్జు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇటీవల థిలమాలే బ్రిడ్జిని ప్రశంసించడం, మోదీకి కృతజ్ఞతలు చెప్పడం కూడా ఈ మార్పులో భాగమే. దీంతో మాల్దీవులు పూర్తిగా భారత్ వైపు వచ్చేశాయని భావించిన సమయంలోనే.. చైనాకు థిలాఫుషి పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడం కొత్త ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.అయితే, మాల్దీవులకు ఆర్థికంగా భారత్ అవసరం.. మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో చైనా కూడా కీలక భాగస్వామే. అందుకే మాలే ఒకరిని ఎంచుకోవడం కంటే ఇద్దరితోనూ సంబంధాలు కొనసాగించాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, భారత్కు మాత్రం థిలాఫుషి పరిణామం కీలక హెచ్చరిక. భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీకి అనుసంధానంగా ఉన్న కీలక పోర్టు చైనా చేతుల్లోకి వెళ్లడం.. హిందూ మహాసముద్రంలో బీజింగ్ ప్రభావం పెరగడానికి మరో అవకాశమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.భారత్కు నష్టం ఎక్కడ?మొదటిది.. వ్యూహాత్మక ప్రభావం. భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీ చివరకు చైనా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కీలక వాణిజ్య పోర్టుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే భారత్ నిర్మించిన మౌలిక వసతులు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడటంతో పాటు.. చైనా ప్రభావం ఉన్న పోర్టు ప్రాంతానికి యాక్సెస్ను మరింత సులభం చేయవచ్చు.రెండోది.. చైనా ప్రభావం పెరిగే అవకాశం. థిలాఫుషి భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన కార్గో హబ్గా మారనుంది. అక్కడ చైనా కంపెనీకి నిర్మాణపరమైన కీలక పాత్ర లభించడం వల్ల బీజింగ్కు మాల్దీవుల సముద్ర వాణిజ్య మౌలిక వసతుల్లో మరింత పట్టు ఏర్పడే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రంలో ఇది భారత్కు సున్నితమైన అంశం.మూడోది.. భారత్ ప్రభావానికి సవాలు. 2024లో భారత్, మాల్దీవులు థిలాఫుషిలో ఆధునిక వాణిజ్య పోర్టు అభివృద్ధిపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇప్పుడు చైనా సంస్థకు కీలకమైన పనులు వెళ్లడం.. మాలే తన మౌలిక వసతుల భాగస్వామ్యాలను భారత్తో మాత్రమే పరిమితం చేయడం లేదని స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ఇజ్రాయెల్లో సంచలన నివేదిక.. నెతన్యాహు ఇరుక్కున్నారా? -
భారీగా జీతం పెంచుకున్న సింగపూర్ ప్రధాని
ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ప్రభుత్వాధినేత ఎవరో తెలుసా?. చాలా దేశాలు అధికారికంగా ఆ విషయం బయటకు చెబుతున్నా.. కొన్ని దేశాల్లో మాత్రం అలవెన్స్, ఎగస్ట్రాల రూపంలో అడ్డగోలుగా అందుకుంటున్నారు. ఇక చైనా, ఉత్తర కొరియా, రష్యా లాంటి కొన్ని దేశాధినేతల జీతాలపై క్లారిటీ అంటూ లేకుండా పోయింది. అయితే ఈ విషయంలో ఇప్పుడు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సంచలనం సృష్టించారు. ప్రపంచంలోనే అత్యధిక జీతం అందుకుంటున్న ప్రధానిగా ఆయన రికార్డు నెలకొల్పారు.తాజాగా.. సింగపూర్ పార్లమెంట్లో చట్ట సభ్యుల జీతాల సవరణ జరిగింది. అందులో ప్రధాని లారెన్స్ వాంగ్(Lawrence Wong) వార్షిక వేతన ప్యాకేజీని ఏకంగా 64 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన జీతం 3.6 మిలియన్ డాలర్లకు చేరనుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.25 కోట్లకు పైగా. ఈ కొత్త వేతన విధానం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది.ఒకేసారి అంతా..!!లారెన్స్ వాంగ్ ప్రస్తుత వార్షిక వేతన ప్యాకేజీ 2.2 మిలియన్ సింగపూర్ డాలర్లు కాగా.. కొత్త విధానంతో అది 3.6 మిలియన్ డాలర్లకు పెరగబోతోంది. అంటే.. అదనంగా 1.4 మిలియన్ సింగపూర్ డాలర్ల అదనపు ఆదాయం. సింగపూర్ రాజకీయ నాయకులకు ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక వేతనాలు ఉన్నాయి. అధిక జీతాల వల్ల ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను రాజకీయాల్లోకి ఆకర్షించడంతోపాటు అవినీతికి దూరంగా పాలన సాగించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.మరోవైపు సాధారణ పౌరుల ఆదాయంతో పోలిస్తే రాజకీయ నాయకుల వేతనాలు భారీగా ఉండటంపై దేశంలో విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ పెంపు మొత్తాన్ని తన పదవీకాలంలో వచ్చే ఐదేళ్ల పాటు మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని వాంగ్ ప్రకటించారు.మంత్రుల జీతాలూ పెంపుదాదాపు 15 ఏళ్ల తర్వాత సింగపూర్ రాజకీయ వేతనాల వ్యవస్థలో ఈ మార్పులు చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుల నెలవారీ అలవెన్స్ను కూడా 13,750 సింగపూర్ డాలర్ల నుంచి 18,500 డాలర్లకు పెంచనున్నారు. ప్రధాని మాత్రమే కాకుండా ఇతర రాజకీయ పదవుల వేతనాల్లోనూ మార్పులు చేయనున్నారు. డిప్యూటీ ప్రధాని బెంచ్మార్క్ వార్షిక వేతనం 1.87 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 3.06 మిలియన్ డాలర్లకు పెరగనుంది. మంత్రుల వేతనాలు వారి హోదా, బాధ్యతలను బట్టి 1.80 మిలియన్ నుంచి 2.88 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకు ఉండేలా కొత్త బెంచ్మార్క్ను నిర్ణయించారు.అయితే మంత్రులందరికీ వెంటనే కొత్త బెంచ్మార్క్ వేతనం అందదు. ప్రస్తుత పదవీదారులకు అక్టోబర్ 15 నుంచి గరిష్ఠంగా 9 శాతం వరకు ఒకేసారి పెంపు ఇవ్వనున్నారు. ఆ తర్వాత వేతన మార్పులు వ్యక్తిగత పనితీరు, బాధ్యతల ఆధారంగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.ప్రపంచంలో అత్యధిక వేతనాలు! వీళ్లే..అంతర్జాతీయ రాజకీయ నేతల వేతనాలను పోల్చే (PoliticalSalaries) డేటా ప్రకారం, 2025లో టాప్-10లో ప్రధానంగా సింగపూర్, స్విట్జర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల నేతలు ఉన్నారు. ఈ జాబితాలో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మొదటి స్థానంలో ఉన్నారు.1. లారెన్స్ వాంగ్ – సింగపూర్ ప్రధాని2. కరీన్ కెల్లర్-సట్టర్ – స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు3. డొనాల్డ్ ట్రంప్ – అమెరికా అధ్యక్షుడు4. ఫ్రెడ్రిక్ మెర్జ్ – జర్మనీ ఛాన్సలర్5. ఆంటోనీ అల్బనీస్ – ఆస్ట్రేలియా ప్రధాని6. క్రిస్టియన్ స్టాకర్ – ఆస్ట్రియా ఛాన్సలర్7. బార్ట్ డి వెవర్ – బెల్జియం ప్రధాని8. క్రిస్టోఫర్ లక్సన్ – న్యూజిలాండ్ ప్రధాని9. మార్క్ కార్నీ – కెనడా ప్రధాని10. లూక్ ఫ్రైడెన్ – లక్సెంబర్గ్ ప్రధానిమరి మోదీ స్థానం ఎంత?ప్రధాని నరేంద్ర మోదీ టాప్-10లో లేరు. ఆయన అధికారిక వార్షిక వేతనం అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే చాలా తక్కువ. సుమారు అమెరికా 30 వేల డాలర్ల పరిధిలో ఉన్నట్లు గత అంతర్జాతీయ వేతనాల డేటాలో నమోదైంది. అయితే కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం జీతం, నియోజకవర్గం, విధి నిర్వహణకు సంబంధించిన రోజువారీ భత్యాలను కలిపి చూస్తే మోదీ వార్షిక మొత్తం సుమారు రూ.25-26 లక్షల పరిధిలో ఉంటుంది.ఇదీ చదవండి: సీఎం గొంతుతో మిమిక్రీ చేసి భారీ కుంభకోణం! -
11న మోదీ, పుతిన్ భేటీ
న్యూఢిల్లీ: బ్రెజిల్, చైనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండియా, ఇండోనేసియా, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన ‘బ్రిక్స్’శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏడాది సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 12, 13న ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే సమావేశానికి కూటమి దేశాల అధినేతలు హాజరుకాబోతున్నాయి. సదస్సు కంటే ఒక రోజు ముందు ఈ నెల 11న భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ విషయాన్ని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారం నిర్ధారించారు. ఆయన భారత జర్నలిస్టులతో ఆన్లైన్లో సంభాషించారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు దృష్టి పెట్టునున్నట్లు పేర్కొన్నారు. ఇరువురు నేతల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. అత్యంత సున్నితమైన అంశాలపై బహిరంగంగా, నిర్మాణాత్మకంగా చర్చించేలా మోదీ, పుతిన్ ఆచరణాత్మక దృక్పథం, చిత్తశుద్ధి కలిగి ఉన్నారని పెస్కోవ్ వివరించారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితులను మోదీకి వివరించడానికి పుతిన్కు ఇది మరో అవకాశం కానుందని అభిప్రాయపడ్డారు. రష్యా మార్కెట్లో విస్తరణ చర్యలు చేపట్టడానికి, రష్యా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడానికి భారతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ఆయా కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలియజేశారు. ఉక్రెయిన్–రష్యా ఘర్షణను ముగించడానికి భారత్ చేసే ఎలాంటి శాంతి ప్రయత్నాలనైనా తాము స్వాగతిస్తామని స్పష్టంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కారం సాధించాలన్న భారత్ వైఖరికి రష్యా వ్యూహం చాలా దగ్గరగా ఉందని వ్యాఖ్యానించారు. -
అభివృద్ధిని చూడలేని నారాజ్ మామ
వడోదర: ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ విషయంలో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నా చూడలేక విమర్శకులు నిత్యం అసంతృప్తి చెందుతూ అలిగిన మామ(నారాజ్ ఫుఫా) లాగా ఫిర్యాదులు చేస్తూ, లేనిపోని సమస్యలను సృష్టిస్తారని అన్నారు. అలాగే ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగిస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. రాహుల్ నిర్వహిస్తున్న ఛాత్రోంకీ గూంజ్(విద్యార్థుల ప్రతిధ్వని) సభలను ఝూట్ కీ గూంజ్(అబద్ధాల ప్రతిధ్వని)గా కొట్టిపారేశారు. మోదీ మంగళవారం గుజరాత్లో పర్యటించారు. వడోదరలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.35,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. నవీ ముంబై, ఉత్తరప్రదేశ్లోని దాద్రీని అనుసంధానించే వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని మూడు కీలక సెక్షన్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వేగంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు నత్తనడకలా సాగేవని ఆక్షేపించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. తప్పులు వెతకడమే వారి పని ‘‘తప్పులు వెతకడమే ప్రతిపక్షాల పనిగా మారింది. కొత్తగా ప్రారంభించిన ఫ్రైట్ కారిడార్ వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ ఎల్లప్పుడూ తప్పులు వెతుకుతారు. ముంబై ఓడరేవు నుంచి వడోదరకు ఇటీవల డబుల్–స్టాక్ కంటైనర్ సరుకు రవాణా రైలును నడిపించాం. దీనివల్ల ఒకే ప్రయాణంలో 250కి పైగా ట్రక్కులకు సమానమైన సరుకును ఆ రెండు నగరాల మధ్య రవాణా చేయగలిగాం. ఇప్పుడు నారాజ్ ఫుఫాజీ (అలిగిన మామగారు) నోటికి పని చెబుతారు. డబుల్–స్టాక్ కంటైనర్ రైళ్లు వస్తే ట్రక్ డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ట్రక్కులు ఎక్కడికి వెళ్తాయి? ప్రజలు కొనుగోలు చేసిన ట్రక్కుల మాటేంటి? అని ప్రశ్నిస్తారు. విమర్శలు చేయడానికి ఫుఫాజీకి ఇప్పుడు కొత్త విషయం దొరికింది. రవాణా కారిడార్పైనా వారికి సందేహాలు వస్తాయి. దేశ పురోగతికి వ్యతిరేకంగా విమర్శలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకైనా వెళ్తాయి. ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి వారికి ఏదో ఒక సాకు కావాలి. ప్రతిపక్షాలు విసిరే వలకు చిక్కొద్దు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్తో పోలిస్తే ఎన్డీయే పదేళ్ల పాలనలో ఆధునీకరణ వేగంగా జరిగింది. 2014 తర్వాత 50,000 ఆధునిక రైలు బోగీలను నిర్మించాం. గత ప్రభుత్వం పదేళ్లలో కనీసం 50,000 మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయింది. రాజకీయ ప్రసంగాల కంటే వాస్తవికతకే యువత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిపక్షాలు విసిరే వలకు చిక్కొద్దు. రాజకీయ తప్పుదారి పట్టించే చర్యలకు గురికావొద్దు. అబద్ధాలతో అడుగడుగునా తప్పుదోవ పట్టించేవారు కనిపిస్తారు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. నేటి యువత సత్యం వైపే నిలబడుతుంది. సౌర, పవన, జల, అణు శక్తి వంటి రంగాల్లో ప్రభుత్వం ఎంతటి చిత్తశుద్ధితో పనిచేస్తోందో యువతకు తెలుసు’’ అని మోదీ అన్నారు.ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ‘‘దేశంలో లక్షలాది మంది యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ప్రతి ఏటా మన కుటుంబాల ఆదాయంలో చాలాభాగం కోచింగ్ల కోసమే ఖర్చవుతోంది. అందుకే పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే మా లక్ష్యం’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘నమో కమలం’ ప్రారంభం దక్షిణ గుజరాత్లోని నవసారి పట్టణంలో బీజేపీ నూతన కార్యాలయం ‘నమో కమలం’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అధికార పార్టీకి ఉన్న అధికారం, పదవులు, సంస్థాగత బలం పూర్తిగా ప్రజాసేవ కోసమేనని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. బీజేపీలో సాధారణ క్షేత్రస్థాయి కార్యకర్త కూడా ఎప్పుడూ అధికార మదంతో విర్రవీగలేదని అన్నారు. తమ కార్యకర్తలు ప్రజాసేవకు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. తమ దృష్టిలో అధికారం కేవలం సేవాభావం కోసమేనని తెలిపారు. -
‘ధురంధర్’లా మోదీ ఎంట్రీ.. ‘ఆరీ ఆరీ’ పాటతో గ్రాండ్ వెల్కమ్
గాంధీనగర్: గుజరాత్లోని వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఆయన వడోదరలోని మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయంలో జరిగిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీ కార్యక్రమ ప్రాంగణంలోకి అడుగుపెట్టే సమయంలో ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరీ ఆరీ’ పాట వినిపించింది. అంతకుముందు క్వీన్ బృందానికి చెందిన ‘వీ విల్ రాక్ యూ’ పాటను కూడా వినిపించారు. యువత పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో మోదీ వారిని ఉద్దేశించి చేతులు ఊపుతూ ముందుకు సాగారు. ‘ఆరీ ఆరీ’ (Aari Aari) అనేది రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ ది రివెంజ్' సినిమాలోని సూపర్హిట్ పాట.#WATCH | Gujarat | PM Modi receives an enthusiastic welcome from the crowd attending the 'NaMo for Viksit Bharat' event in Vadodara(Video source: ANI/DD) pic.twitter.com/klrHAJri9T— ANI (@ANI) September 8, 2026 మోదీ రాక సందర్భంగా ప్రత్యేకంగా ‘వై’ ఆకారంలో వేదికను ఏర్పాటు చేశారు. దాని చుట్టూ యువత కూర్చొని ఉండగా, మోదీ ఆ వేదికపై నడుస్తూ వారిని పలకరించారు. వడోదర పర్యటనలో మోదీ రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. రైల్వే, రహదారులకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.ఈ సందర్భంగా మోదీ సరుకు రవాణా రైలు సేవలను, టాండా రోడ్ నుంచి వడోదరలోని ప్రతాప్నగర్కు అనుసంధానించే కొత్త ప్రయాణికుల రైలును ప్రారంభించారు. పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా మార్గంలోని 3 కీలక విభాగాలు, రైల్వే, రహదారి మౌలిక వసతులతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. -
ప్రధాని మోదీ పర్యటనకు ముందు కలకలం
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటన సందర్భంగా తీవ్ర కలకలం చెలరేగింది. ప్రధాని పాల్గొనాల్సిన కార్యక్రమంలో ఇద్దరు అగంతకులు చొరబడ్డారు. పీఎంవో అధికారులమంటూ అనుమానాస్పదంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకితో పాటు ఫేక్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వేదికగా ‘గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026’ సదస్సు జరగాల్సి ఉంది. ఈ సదస్సును ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రావాల్సి ఉంది. అంతకంటే ముందే రోహన్ పరేఖ్ తాను ప్రధాన మంత్రి కార్యాలయ అధికారినంటూ ఆ ఈవెంట్కు వచ్చారు. తనిఖీల్లో భాగంగా అతని వద్ద నకిలీ పీఎంవో ఐడీ కార్డుతో పాటు తుపాకీ లభించడంతో భద్రతా బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అతనితో పాటు ఉన్న సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన తీవ్రత దృష్ట్యా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లు, గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు.తుపాకులతో, నకిలీ ఐడీలతో నేరుగా ప్రధాని మోదీ హాజరు కావాల్సిన కార్యక్రమానికి ఎందుకు వచ్చారనే అంశంపై లోతుగా విచారణ జరుపుతున్నారు.అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక ఫిన్టెక్ సదస్సులలో ఒకటైన ‘గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026’ను ముంబైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన వేళ జరిగిన ఈ భద్రతా లోపం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. -
ప్రధాని మోదీ సభకు భారీ క్రేజ్.. బేజారెత్తిన బుక్మైషో!
వడోదరా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) గుజరాత్లోని వడోదరాలో పాల్గొననున్న ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఉచితంగా అందుబాటులో ఉంచిన బుక్మైషోలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన గంటలోపే పూర్తయ్యాయి. మరోవైపు 42 వేల మందికి పైగా వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వడోదరాలోని మహారాజా సయాజీరావు యూనివర్సిటీ (ఎంఎస్యూ) పావిలియన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగనుంది.వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) రిజిస్ట్రేషన్ల కోసం ప్రైవేటు టికెటింగ్ వేదికను వినియోగిస్తోంది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు నమోదు చేసుకున్న వారికి వారి బుక్మైషో ఖాతాల ద్వారా ఎం-టికెట్ అందుతుంది. అందులోని లైవ్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ప్రవేశం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ, ప్రవేశం, సీటింగ్ మొత్తం డిజిటల్ విధానంలోనే నిర్వహించనున్నారు.ప్రధాని మోదీ వడోదరా పర్యటనలో రూ.35 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాలు చేపట్టనున్నారు. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని మూడు విభాగాలను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 326 రూట్ కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గాలను రూ.20,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. న్యూ సనంద్ (నార్త్)-న్యూ మకర్పురా, న్యూ ఉమర్గావ్-న్యూ సఫాలే, న్యూ సఫాలే-న్యూ జేఎన్పీటీ మార్గాలు ఇందులో ఉన్నాయి.జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీతో కొత్త రైలు అనుసంధానం ఎగుమతి, దిగుమతి సరుకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు పారిశ్రామిక కేంద్రాలు, నౌకాశ్రయాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గడంతోపాటు ముంబై రైల్వే నెట్వర్క్పై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.న్యూ సనంద్ (నార్త్), న్యూ మకర్పురా, న్యూ ఉమర్గావ్, న్యూ జేఎన్పీటీ నుంచి సరుకు రవాణా రైలు సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. టాండా రోడ్-వడోదరా ప్రతాప్నగర్ మధ్య రైలును కూడా ప్రారంభిస్తారు. అలాగే ఛోటా ఉదేపూర్-ధర్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జోబట్-టాండా రోడ్ కొత్త రైల్వే లైన్ను జాతికి అంకితం చేయనున్నారు. దీంతో అలీరాజ్పూర్లోని మారుమూల, గిరిజన ప్రాంతాలు విస్తృత రైల్వే నెట్వర్క్తో అనుసంధానమవుతాయి.మోదీ పర్యటనకు ఒక రోజు ముందు సోమవారం సాయంత్రం గుజరాత్ ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ఆధ్వర్యంలో వడోదరాలో ‘వికసిత్ భారత్ పాదయాత్ర’ నిర్వహించారు. డాండియా బజార్లోని ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ప్రారంభమైన యాత్ర కీర్తి స్తంభం మీదుగా సాగి సూరసాగర్ సరస్సు వద్ద ముగిసింది. మోదీ పర్యటనకు వచ్చిన స్పందనకు అందుబాటులో ఉన్న సామర్థ్యానికి దాదాపు మూడు రెట్లు రిజిస్ట్రేషన్ల డిమాండ్ ఉందని సంఘవి తెలిపారు. ప్రధాన వేదికలో సీట్లు లభించని వారి కోసం ప్రత్యేక ఫ్యాన్ జోన్లను కూడా ఏర్పాటు చేశారు.ఇది కూడా చదవండి: ఏఐ మరో సంచలనం.. జంతువుల భాష డీకోడ్ చేస్తూ.. -
బుక్ మై షో ద్వారా ప్రధాని ఈవెంట్
వడొదర: గుజరాత్లోని వడోదరలో మంగళవారం జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమ నిర్వహణ మొదటిసారిగా ‘బుక్ మై షో’ద్వారా జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉద్దేశించిన ఉచిత రిజి్రస్టేషన్కు భారీ స్పందన కూడా లభించింది. ప్రారంభించిన గంటలోనే టిక్కెట్లు మొత్తం బుక్ అయిపోయాయి. మంగళవారం నాటి కార్యక్రమాల్లో ప్రధాని సుమారు 35 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. దీంతోపాటే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వడోదర మున్సిపల్ కార్పొరేషన్ మొట్ట మొదటిసారి ప్రైవేట్ డిజిటల్ ప్లాట్ఫామ్ బుక్ మై షో ద్వారా రిజి్రస్టేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రారంభించిన గంటలోనే సుమారు 42,000 మంది వెయిటింగ్ లిస్ట్లోకి చేరడంతో బుక్ మై షో తదుపరి రిజి్రస్టేషన్ను నిలిపివేసింది. ప్రధాని కార్యక్రమంలో ప్రవేశానికి కూడా పూర్తిస్థాయి డిజిటట్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. బుక్ మై షో ద్వారా రిజి్రస్టేషన్ చేసుకున్న వారికి వారి అకౌంట్ ద్వారా డిజి టల్ ఎం–టికెట్ లభిస్తుంది. ఇందులోని క్యూ ఆర్ కోడ్ను ఉపయోగించి కార్యక్రమం జరిగే ప్రాంగణంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. రి జి్రస్టేషన్ మొదలుకొని సీటింగ్ ఏర్పాట్ల వర కూ అన్నీ డిజిటల్ పద్ధతిలోనే జరగనున్నాయి. -
మోదీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్!
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. యువత, విద్యార్థుల సమస్యలపై మాట్లాడాల్సిన వేదికపై.. ప్రశ్నించే యువతను ‘దిమాగీ నక్సల్స్’ అంటూ ముద్ర వేయడం ఏమిటంటూ సీజేపీ తీవ్రంగా మండిపడింది. విద్య, ఉద్యోగాలు, విద్యార్థుల సంక్షేమంపై ప్రధాని మాట్లాడాల్సిందిపోయి.. విమర్శకులను టార్గెట్ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శించారు.ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రముఖ కళాశాలల్లో ఒకటైన SRCCలో యువతను ‘దిమాగీ నక్సల్స్’గా పేర్కొనడం ప్రధానమంత్రి చేయగలిగే అత్యంత అవమానకరమైన పని అంటూ విమర్శించారు. ప్రధాని యువతకు ఆశలు కల్పించాలి.. ప్రశ్నలు అడుగుతున్నందుకు వారిని నిందించకూడదు అని దాస్ వ్యాఖ్యానించారు. టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. SRCCలోనే ఉపాధ్యాయులు మెడికల్, చైల్డ్కేర్ లీవ్ వంటి అంశాలపై ఆందోళన చేయాల్సి వస్తోందని.. కళాశాలలో మౌలిక వసతుల పరిస్థితి, విద్యార్థులపై పెరుగుతున్న పోటీ ఒత్తిడి వంటి అంశాలను ప్రధాని ప్రస్తావించాల్సిందని విమర్శించారు.మరోవైపు.. ఆశుతోష్ రంకా కూడా ప్రధాని ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. SRCC శతాబ్ది వేడుకల వంటి వేదికపై విద్య, ఉపాధి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే 20 ఏళ్లలో భారత్ ప్రపంచంలో తన స్థానాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలన్న అంశాలపై ప్రధాని మాట్లాడాల్సిందని అన్నారు. కానీ అందుకు బదులుగా ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలకు దిగారని ఆరోపించారు.Wow. Going to one of India’s premier colleges and once again branding a young, questioning generation as “Dimagi Naxals” has got to be among the most shameful things a Prime Minister can do. And on Teacher’s Day.He could have spoken about why SRCC’s own teachers have had to… https://t.co/U8EMRtikcu— Saurav Das (@SauravDassss) September 5, 2026అసలు మోదీ ఏం అన్నారు?SRCC శతాబ్ది వేడుకల్లో దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని మోదీ.. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తాను ప్రస్తావించిన ‘దిమాగీ నక్సల్స్’ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. తాను ‘దిమాగీ నక్సల్’ అంటూ చేసిన వ్యాఖ్యల తర్వాత.. ఆ భావజాలానికి మద్దతిస్తున్నవారు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారని మోదీ అన్నారు. తన వ్యాఖ్యలను విమర్శిస్తున్నవారి తీరును ఉద్దేశిస్తూ.. ప్రజలు కూడా వారి అసలు రంగును గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సీజేపీ విమర్శలకు కారణమయ్యాయి. అయితే మోదీ ప్రసంగంలోని ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా హాట్టాపిక్గా మారాయి. విద్యార్థుల సమస్యలపై చర్చ జరగాల్సిన SRCC వేదిక.. మోదీ-విమర్శకుల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారడం చర్చనీయాంశంగా మారింది. -
ఇస్రోలో ఏం జరుగుతోంది?.. కేంద్రంపై ఉద్యోగుల ఆగ్రహం
ఆరు ఏళ్ల క్రితం అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు కేంద్రం తలుపులు తెరిచింది. ఇప్పుడు అదే నిర్ణయం ఇస్రోలో కొత్త చర్చకు తెరతీసింది. రాకెట్ల తయారీ, ఉపగ్రహాల నిర్మాణం, లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ వంటి కీలక బాధ్యతలు క్రమంగా ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు బదిలీ కానున్నాయన్న వార్తల నేపథ్యంలో.. ఇస్రోకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు తొలిసారి సమష్టిగా గళం విప్పాయి. అసలు కేంద్ర ప్రభుత్వ విధానం ఏంటి? ఇస్రో భవిష్యత్ పాత్ర ఏమిటి? తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలతో ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి వి. నారాయణన్కు లేఖ రాశాయి. ప్రైవేటీకరణ విధానం, ఇస్రో భవిష్యత్ పాత్ర, ప్రస్తుత ఉద్యోగుల పరిస్థితి, భవిష్యత్ నియామకాలపై అధికారిక వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.సెప్టెంబర్ 4న ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి నారాయణన్కు ఉద్యోగ సంఘాలు లేఖ రాశాయి. ఇటీవల ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ఛైర్మన్ పవన్ కుమార్ గోయెంకా చేసిన వ్యాఖ్యలను వారు ప్రస్తావించారు. భవిష్యత్లో ఇస్రో స్వయంగా లాంచ్ వెహికల్స్ తయారు చేయదని.. వాటి తయారీ మొత్తం ప్రైవేటు రంగం లేదా ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లోకి వెళ్తుందని గోయెంకా పేర్కొన్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ మార్పు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV)తో ప్రారంభమైందని.. భవిష్యత్లో PSLV, LVM3 వంటి కీలక రాకెట్ల తయారీకి కూడా విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందా?లాంచ్ వెహికల్స్ తయారీ, సాధారణ ఉపగ్రహాల ఉత్పత్తిని ఇస్రో నుంచి బయటకు తరలించడం, కులశేఖరపట్నంలో ప్రతిపాదిత స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ వంటి కొత్త మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలకు తెరవడంపై కూడా ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పటికే ఇస్రోకు చెందిన దాదాపు 120 సాంకేతికతలను ప్రైవేటు రంగానికి బదిలీ చేసినట్లు లేఖలో పేర్కొన్నాయి. ఈ పరిణామాలపై అధికారిక విధాన పత్రం లేకపోవడం ఉద్యోగుల్లో, వారి కుటుంబాల్లో ఆందోళనకు కారణమవుతోందని సంఘాలు తెలిపాయి. ఇస్రోలో అంతర్గత పనులు తగ్గిపోతే ఉద్యోగుల సంఖ్యపై కోత పడే అవకాశం ఉందని, ప్రమోషన్లు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కూడా దెబ్బతినవచ్చని పేర్కొన్నాయి.‘ఇది కేవలం తయారీ కాంట్రాక్ట్ కాదు’లాంచ్ వెహికల్ డిజైన్, తయారీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగాలు.. ఇవి కేవలం తయారీ కాంట్రాక్టులు కాదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఇవే ఇస్రోకు ఉన్న ప్రధాన సాంకేతిక సామర్థ్యం, దశాబ్దాలుగా ఏర్పడిన సంస్థాగత అనుభవం, వ్యూహాత్మక సామర్థ్యమని పేర్కొన్నాయి. అయితే ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి తాము వ్యతిరేకం కాదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. NSIL ద్వారా నిర్ణీత విధానంలో వాణిజ్య కార్యకలాపాలు, ప్రైవేటు భాగస్వామ్యాన్ని స్వాగతిస్తామని తెలిపాయి. అయితే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, ఇస్రో సొంత తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా తొలగించడం మధ్య స్పష్టమైన గీత ఉండాలని డిమాండ్ చేశాయి.నారాయణన్కు కీలక ప్రశ్నలుఇదే ఇప్పుడు ఉద్యోగ సంఘాల ప్రధాన ఆందోళన. రాకెట్ డిజైన్ చేయడం మాత్రమే కాదు.. దాని తయారీ, అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగం వరకు మొత్తం ప్రక్రియలో ఇస్రోకు దశాబ్దాల అనుభవం ఉంది. ఈ పనులు బయటకు వెళ్లిపోతే ఇస్రో కేవలం పరిశోధన, డిజైన్ సంస్థగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గోయెంకా వ్యాఖ్యలు నిజంగా కేంద్ర ప్రభుత్వ విధానమేనా? లేక వ్యక్తిగత అభిప్రాయమా? PSLV, LVM3, SSLVతో పాటు భవిష్యత్ లాంచ్ వెహికల్స్ డిజైన్, అభివృద్ధి, తయారీ, ఇంటిగ్రేషన్, పరీక్షలు, ప్రయోగ బాధ్యతలు ఇస్రో వద్దే కొనసాగుతాయా? అనే అంశాలపై అధికారిక స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. మొత్తంగా, అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తరించే కేంద్రం విధానంపై ఇస్రో ఉద్యోగుల్లోనే ప్రశ్నలు తలెత్తడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కేంద్రం విధానం ఏంటి?కేంద్రం తీసుకున్న దిశ మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది. 2023 స్పేస్ పాలసీ ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు మరింత పెద్ద పాత్ర కల్పించింది. NSIL వాణిజ్యీకరణ, పరిశ్రమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుండగా.. IN-SPACe ప్రైవేటు సంస్థలకు అనుమతులు, ప్రోత్సాహం, పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. 2025-26లో IN-SPACe, NSIL, ISRO కలిసి 100 టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందాలు పూర్తి చేశాయని కేంద్రం తెలిపింది. SSLV టెక్నాలజీని HALకు బదిలీ చేయడం ఇందులో అత్యంత కీలకమైన ఉదాహరణగా నిలిచింది. PSLV, LVM3 టెక్నాలజీ బదిలీకి కూడా ప్రక్రియ మొదలైంది. అయితే ఇస్రో పూర్తిగా రాకెట్ల తయారీ నుంచి వైదొలగుతుందా? అన్న అంశంపై ఇప్పటివరకు ఉద్యోగ సంఘాలు కోరుతున్న స్థాయిలో స్పష్టమైన అధికారిక వివరణ వెలువడలేదనే అంశమే ప్రస్తుత వివాదానికి కేంద్రంగా ఉంది.ఇదీ చదవండి: గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి -
పిల్లల బాల్యాన్ని కాపాడాలి
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వ్యసనం పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. పిల్లలను క్రీడలు, శారీరక వ్యాయామం, సృజనాత్మక కార్యకలాపాల వైపు ప్రోత్సహించాలని, తద్వారా వారు సెల్ఫోన్లతో ఎక్కువ సమయం వృథా చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ఉత్తమ ఉపాధ్యాయులుగా జాతీయ అవార్డుకు ఎంపికైన వారితో ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ వీడియోను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి సంభాషించారు. పిల్లల బాల్యాన్ని కాపాడాలని, వారిలో సహజ కుతూహలాన్ని పెంపొందించాలని చెప్పారు. తరగతి గది అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా మార్చడానికి సృజనాత్మక పద్ధతులను ఎంచుకోవాలని అన్నారు. చదువులు మాత్రమే కాకుండా పిల్లల ప్రవర్తన, దైనందిన జీవితం పట్ల కూడా శ్రద్ధ వహించాలని స్పష్టంచేశారు. ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్న తరుణంలో విద్యార్థుల జీవితాల్లో టీచర్లు మరింత కీలక పాత్ర పోషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వారికి సరైన మార్గనిర్దేశం చేస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు ముందుకు నడిపించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. విద్యార్థుల్లోనూ డ్రగ్స్ వ్యసనం పెరిగిపోతుండడం పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. పెద్ద నగరాలు, విశ్వవిద్యాలయాల్లో ఎవరు ఎవరికి ఏమి ఇస్తున్నారో తెలియడం లేదని, దీనివల్ల డ్రగ్స్ బారిన పడిన వారిని గుర్తించడం కష్టమని అన్నారు. అందుకే విద్యార్థుల్లో డ్రగ్స్ ముప్పుపై తగిన అవగాహన కల్పించడానికి టీచర్లే చొరవ తీసుకోవాలని చె ప్పారు. డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు గుర్తిస్తే వారి ని ఆ వ్యసనం నుంచి దూరం చేయాలని పే ర్కొన్నారు. వారి జీవితాల్లో బాల్యాన్ని సజీవంగా ఉంచడం ద్వారా ఉపాధ్యాయులు గొప్ప సహకారాన్ని అందించగలరని వెల్లడించారు.నిజ జీవిత నైపుణ్యాలతో అనుసంధానించాలి విద్యార్థుల్లో స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం ఒక ప్రధాన సమస్యగా మారిందని ప్రధానమంత్రి చెప్పారు. పిల్లలు స్క్రీన్పై ఎంత సమయం గడుపుతున్నారు? రాత్రిపూట మొబైల్ ఫోన్లు ఎన్ని గంటలు వాడుతున్నారు? అనేదానిపై వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని ఉపాధ్యాయులకు సూచించారు. క్రీడలు, శారీరక శ్రమతో కూడిన ఆటలు, సృజనాత్మక కార్యకలాపాలు, కళలపై ఆసక్తిని పెంపొందించుకోవడం ద్వారా స్క్రీన్ సమయాన్ని సహజంగా తగ్గించవచ్చని స్పష్టంచేశారు. -
విశ్వాసం పెంచిన ఆర్థిక వృద్ధి
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వృద్ధి, స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలపై ఆరోపణలు చేస్తున్నవారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చినవారే.. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడాన్ని అంగీకరించలేకపోతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. శనివారం ఢిల్లీలో శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ వందేళ్ల వేడుకలో ప్రదానమంత్రి పాల్గొన్నారు. ఆయన ఈ కళాశాలకు రావడం 2013 తర్వాత ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమాసియా యుద్ధంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు, వాణిజ్యానికి అంతరాయాలు ఉన్నప్పటికీ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధి సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. ఈ వృద్ధి దేశ విశ్వాసాన్ని పెంచిందన్నారు. మన దేశాన్ని అత్యంత బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థల(ఫ్రాౖజైల్ ఫైవ్) జాబితాలోకి నెట్టి అపఖ్యాతి పాలైన వారికి నేడు ఈ గణాంకాలను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఎద్దేవా చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2013లో తాను ఈ కాలేజీలో చేసిన ప్రసంగం అప్పట్లో ఒక అలజడిని సృష్టించిందని, 13–14 ఏళ్లు గడిచినప్పటికీ దాని ప్రభావం నేటికీ చెక్కుచెదరలేదని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఒక దార్శనికతను(విజన్) ఆవిష్కరించానని అన్నారు. అప్పుడు చెప్పిన ప్రతి మాటా తన దృఢ విశ్వాసానికి నిదర్శనమని, ఆ మాటలకు అనుగుణంగానే ఎప్పుడూ జీవించానని ఉద్ఘాటించారు. నక్సలిజం నడ్డి విరిగింది 2013 నాటి ఆర్థిక పరిస్థితులను ప్రధానమంత్రి గుర్తుచేశారు. అప్పట్లో బలహీనమైన రూపా యి, దాదాపు 10 శాతం ద్రవ్యోల్బణం, రికార్డు స్థాయి కరెంట్ అకౌంట్ లోటు, మందగించిన పారిశ్రామిక వృద్ధి, పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడాన్ని ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉందన్నారు. ప్రపంచం భారత్ను ఫ్రాౖజైల్ ఫైవ్లో ఒకటిగా పిలిచేదని చెప్పారు. అప్పట్లో కుంభకోణాలు తారస్థాయికి చేరాయని, అవినీతిపరులు నిర్భయంగా తిరిగేవారని వెల్లడించారు. ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని, పాకిస్తాన్పై నియంత్రణ తప్పిందని విమర్శించారు. కానీ, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారు నేడు చిత్తుగా ఓడిపోయారని, పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే భారత సైన్యం వారి గడ్డపైకే వెళ్లి దాడులు చేస్తోందని తెలిపారు. నక్సలిజం నడ్డి విరిగిందన్నారు. విధానపరమైన స్తబ్దత నుంచి చైతన్యవంతమైన విధానాల అమలు వరకు భారత్ ఎంతో పురోగతి సాధించిందని స్పష్టంచేశారు. ఈ రోజు భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడాన్ని ప్రపంచం చూస్తోందని వెల్లడించారు. తాజా జీడీపీ గణాంకాలు దేశ ఆ ర్థిక బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలియజేశారు. దేశం వృద్ధి చెందడమే కాకుండా నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు. దేశం ఇప్పుడు ఆర్థికంగా, సామాజికంగా చాలా సురక్షితంగా ఉందని చెప్పారు. ఇది చూసిన తర్వాత కొందరిలో అసహనం పెరుగుతోందన్నారు. అలాంటి దిమాగీ నక్సలైట్లకు ఎర్రకోట(స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం) నుంచే హోమియోపతి మందు ఇచ్చానని వ్యాఖ్యానించారు. దిమాగీ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్న వారి నిజ స్వరూపాన్ని ప్రజలు ఇప్పుడు చూస్తున్నారని చెప్పారు. ప్రాథమిక సేవలు, అవకాశాల కోసం సామాన్య పౌరులు మాయి–బాప్(తల్లి–తండ్రి) సంస్కృతిపై ఆధారపడి ఉండాలని కొందరు కోరుకుంటున్నారని, అందుకే ఆర్థిక సమ్మిళితాన్ని వ్యతిరేకిస్తున్నారని మోదీ ఆరోపించారు. ‘మాయి–బాప్’ సంస్కృతిని సమర్థించేవారికి ఎదురుగా తాను ఒక బండరాయిలా నిలబడతానని ప్రధాన మంత్రి తేల్చిచెప్పారు. యువతను ఆకట్టుకొనే యత్నం ‘జెన్ జెడ్’ను ఆకట్టుకొనేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. నేటి తరం యువ తకు బాగా తెలిసిన ‘ఓజీ’ వంటి పదాలను తన ప్రసంగంలో చేర్చారు. ‘దురంధర్’ అనే సినిమా ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. శ్రీరామ్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఓజీలు(అసలైన దిగ్గజాలు) అని ప్రశంసించారు. వారు దురంధర్లు కాకపోయినా ఎన్నో సంచలనాలు సృష్టించారని చెప్పారు. సత్య గర్జన ముందు అబద్ధాల ప్రతిధ్వని నిలవదు కొందరు వ్యక్తులు దేశ పురోగతి పట్ల నిరాశావాదంతో ఉన్నారని మోదీ విమర్శించారు. ‘సగం నిండిన గ్లాసు’ ఉపమానాన్ని ప్రస్తావించారు. కొందరు గ్లాసును సగం నిండినట్లుగా, మరికొందరు సగం ఖాళీగా ఉన్నట్లుగా చూస్తారని చెప్పారు. అయితే, తాను మాత్రం గ్లాసు పూర్తిగా నిండినట్లుగా, అందులో సగ భాగం నీరు, సగ భాగం గాలి ఉన్నట్లుగా భావిస్తానని వివరించారు. 2013లో గ్లాసు సగం ఖాళీగా ఉందని భావించినవారు ఇప్పటికీ దేశాన్ని అదే దృక్పథంతో చూస్తున్నారని ఆక్షేపించారు. వారి దృష్టిలో గ్లాసు ఎప్పుడూ సగం ఖాళీగానే ఉంటుందన్నారు. తాను కేవలం గ్లాసు గురించే మాట్లాడుతున్నానని, ఖాళీగా ఉండే మరో దాని గురించి కాదని ప్రతిపక్షాలపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. తన ప్రసంగాన్ని ‘రిపోర్ట్ కార్డు’గా మోదీ అభివరి్ణంచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీపై పరోక్షంగా విమర్శలు చేశారు. సత్య గర్జన ముందు అబద్ధాల ప్రతిధ్వని నిలవలేదని తేల్చిచెప్పారు. -
ధురంధర్, ధూమ్ మచాయీ హై అంటూ.. మోదీ అదిరిపోయే స్పీచ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జెన్ జీని ఆకట్టుకునేలా ప్రసంగించారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్సీసీ) శతాబ్ది వేడుకల్లో శనివారం మోదీ పాల్గొని మాట్లాడారు. “ధురంధర్ కాకపోయినా, ధూమ్ మాత్రం మచాయీ హై” అని అన్నారు. ప్రతి రంగంలోనూ ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు.“ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థులు కూడా చాలా ప్రత్యేకమైనవారు. మీ భాషలో చెప్పాలంటే, ఇక్కడి పూర్వ విద్యార్థులు ఒరిజినల్ గ్యాంగ్ సభ్యులు. వారు ఎస్ఆర్సీసీ పేరును ప్రపంచవ్యాప్తంగా చాటారు. వివిధ రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మన అరుణ్ జైట్లీ జీ ఇక్కడ చదువుకున్నారు. ఆయనతో జరిగిన సమావేశాల్లో బహుశా ఎస్ఆర్సీసీ రోజులకు సంబంధించిన ఒక సంఘటనను చెప్పని సమావేశం ఉండేది కాదు. కొన్నిసార్లు నాకు విసుగు వచ్చేది. ఎందుకంటే ఆయన అదే సంఘటనను పదేపదే చెప్పేవారు. ఇప్పటికీ నా బృందంలో ఉన్న సంజీవ్ సన్యాల్ ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థే. ఇక్కడ చదువుకున్న మరెంతో మంది సహచరులు మనతో ఉన్నారు. ఎస్ఆర్సీసీ నుంచి ఆర్థిక రంగానికి చెందినవారు మాత్రమే వచ్చినట్లు కాదు. కళాకారుల నుంచి రాజకీయ నాయకులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల వరకు ప్రతి రంగానికి చెందినవారు ఇక్కడి నుంచి వెలుగులోకి వచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా నా 2013 ప్రసంగం గురించి మాట్లాడుకున్నారు. ప్రజలు దానిని గుర్తు చేసుకున్నారు, మళ్లీ విన్నారు, మళ్లీ చదివారు. కొత్త తరానికి చెందినవారు కూడా దానిని మరోసారి చూసి ఉండవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే, ఆ ప్రసంగం ఒక అలను సృష్టించింది. ఒక అల ఉప్పొంగి వెళ్లింది. ఇప్పటికీ, 13-14 ఏళ్ల తర్వాత కూడా, ఆ సమావేశం, ఆ ప్రసంగం ప్రభావం కొనసాగుతోంది” అని అన్నారు.2013లో అలా ఉండేది.. మీకు తెలియదుగతంలోని విషయాలను నరేంద్ర మోదీ చెప్పారు. “2013లో మీ సీనియర్లు ఇక్కడ కూర్చున్నారు. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. అయితే దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలో సభ్యుడిగా కూడా ఉన్నాను. అప్పటి కేంద్ర ప్రభుత్వంపై సుదీర్ఘంగా, తీవ్రంగా దాడి చేస్తానని, ఆరోపణల వర్షం కురిపిస్తానని బహుశా ప్రజలు ఆశించి ఉంటారు. కానీ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించినప్పటికీ, ఆ వేదికను ఆ ఉద్దేశం కోసం ఉపయోగించలేదు. ఒక దార్శనికతను వివరించాను. సానుకూలంగా మాట్లాడాను. అప్పుడు నేను చెప్పినదంతా నా నమ్మకం. ఆ ఆలోచనలు, కలలను నేను ఎప్పుడూ ఆచరణలో పెట్టాను. ఆ మార్గంలోనే కొనసాగాను. దేశానికి నా సంపూర్ణ అంకితభావాన్ని కొనసాగించాను. దేశం కోసం జీవించాలనే తపనను కలిగి ఉన్నాను. ఆ సమయంలో మీలో చాలామంది పాఠశాలలో ఉండి ఉండవచ్చు. కానీ ఈ రోజు మీరు ఇంటర్నెట్లోకి వెళ్లి 2013లో, ఆ కాలానికి సమీపంలోని రోజుల్లో వచ్చిన వార్తలను చదివితే, అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో మీకు అర్థమవుతుంది” అని అన్నారు.పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే.. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నవారు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారని మోదీ అన్నారు. ‘‘పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, భారత సాయుధ దళాలు వారి భూభాగంలోకి ప్రవేశించి దాడి చేస్తున్నాయి. జమ్మూకశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పెరిగింది. మావోయిస్టు ఉగ్రవాదం, నక్సలిజం వెన్ను విరిచాం. ఒకప్పుడు భారత విధాన స్తబ్ధత గురించి ఆందోళన చెందిన ప్రపంచం.. ఈ రోజు భారత విధాన చైతన్యం గురించి మాట్లాడుతోంది” అని అన్నారు. -
మోదీ ‘గేర్’కు వరద బ్రేక్.. డ్రీమ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సెటైర్లు
‘గేర్ మార్చే’ ఎక్స్ప్రెస్వే.. వరద నీటిలో ఎందుకు మునిగింది? ఢిల్లీలో కురిసిన భారీ వర్షం ఇప్పుడు ప్రకృతితో పాటు రాజకీయ తుఫాన్నూ రేపింది. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ద్వారకా ఎక్స్ప్రెస్వే టన్నెల్లోనే వరద నీరు చేరడంతో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన టన్నెల్లో గంటపాటు తాను చిక్కుకుపోయానంటూ కాంగ్రెస్ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ వీడియో విడుదల చేయడం.. ఇప్పుడు మోదీ సర్కార్కు కొత్త తలనొప్పిగా మారింది.ఈ సందర్భంగా ‘ప్రజల జీవితాల్లో గేర్ మారుస్తుంది’ అన్న ప్రాజెక్టు.. భారీ వర్షం పడగానే నీటిలోనే ఆగిపోయిందంటూ కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. అసలు రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ టన్నెల్లో నీరు ఎందుకు నిలిచింది? మౌలిక వసతులపై ప్రభుత్వ గొప్పలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంత భిన్నంగా ఎందుకున్నాయన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి.मैं जिस टनल में एक घण्टे से फँसा हूँ इसे मोदी सरकार ने प्रति किलोमीटर 250 करोड़ रुपये खर्च करके बनाया है। यह उसी Dwarka Expressway का टनल है जिसके उद्घाटन को प्रधानमंत्री मोदी ने लोगों के जीवन का गियर बदलना बताया था। pic.twitter.com/dl5kjSHSkz— Brijendra Singh (@BrijendraSpeaks) September 4, 2026దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షాలతో ఢిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే, 2024లో ద్వారకా ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన సమయంలో ప్రధాని మోదీ.. ఈ ప్రాజెక్టు ఢిల్లీ-హర్యానా మధ్య ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తుందని, వాహనాలే కాకుండా ఈ ప్రాంత ప్రజల జీవితాల్లోనూ ‘గేర్ మారుతుందని’ పేర్కొన్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టులోని టన్నెల్ భారీ వర్షాలకు నీటమునగడంతో కాంగ్రెస్ ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది.మరోవైపు.. భారీ వర్షం కారణంగా ఢిల్లీ ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. భారీ వర్షాల ప్రభావం ఢిల్లీ విమానాశ్రయంపైనా పడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలో సామాన్లతో ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. శుక్రవారం సాయంత్రం 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్య కనీసం తొమ్మిది విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. అటు గురుగ్రామ్లోని సైబర్ సిటీ, శంకర్ చౌక్, శీత్లా మాతా రోడ్ ప్రాంతాల్లోనూ భారీగా నీరు నిలిచింది. ఇక వర్షాలపై భారత వాతావరణ శాఖ ఢిల్లీకి తొలుత ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. పరిస్థితి తీవ్రతరం కావడంతో రెడ్ అలర్ట్కు పెంచింది. ఉరుములు, మెరుపులతో పాటు మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒకవైపు భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు రాజకీయ విమర్శలకు దారితీశాయి. The tunnel is part of the most expensive road ever built in India at INR 250 crs per kilometre (against 20 ) i.e. Dwarka e-way in NCR and opened less than 2 yrs ago.This e-way was actually inaugurated twice in the last two years. Yesterday’s drizzle of a receding monsoon and… pic.twitter.com/jmq2xc6Vf6— Ankur Bisen (@AnkurBisen1) September 5, 2026 -
ఇటలీ ప్రధానిగా 1,413 రోజులు మెలోనీకి మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ ప్రధాని పదవిలో దీర్ఘకాలం కొనసాగిన జార్జియా మెలోనీ(49)కి ప్రధాని మోదీ శుక్రవారం అభినందనలు తెలిపారు. 2022 అక్టోబర్ 22వ తేదీన ఇటలీ ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. మొట్టమొదటి మహిళా ప్రధానిగాను ఆమె రికార్డు నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశ ప్రధాని పదవిలో ఏకబిగిన 1,413 రోజులు కొనసాగిన ఏకైక ప్రధానిగా ఆమె నిలిచారు. ఇటలీ ప్రజలు మెలోనీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి, నమ్మకానికి ఇది నిదర్శనమని ప్రధాని మోదీ శుక్రవారం ఎక్స్లో పేర్కొన్నారు. ‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా కొనసాగిన నేత నా మిత్రురాలు, ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు. ఈ చరిత్రాత్మక మైలురాయి ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనం’అని ప్రధాని మోదీ తెలిపారు. స్పందించిన మెలోనీ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రియమైన మోదీ.. మీ సందేశానికి, మీ స్నేహానికి ధన్యవాదాలు. భారత్–ఇటలీ సంబంధాలు మునుపెన్నడూ లేనంత దృఢంగా ఉన్నాయి’అని తెలిపారు. -
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
ప్రపంచ రాజకీయాల్లో ఈ జంట కనిపిస్తే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇద్దరి సరదా సంభాషణలు, ఆప్యాయ పలకరింపులు ఇప్పటికే ‘మెలోడీ’ పేరుతో వైరల్గా మారాయి. తాజాగా మెలోనీకి మోదీ చేసిన ఓ ప్రత్యేక విషెస్ ఈ స్నేహాన్ని మరోసారి చర్చలోకి తెచ్చింది.ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నేతగా ఆమె తాజాగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. మెలోనీని తన స్నేహితురాలిగా పేర్కొంటూ.. ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఘనత నిదర్శనమని అన్నారు.“నా స్నేహితురాలు ప్రధాని మెలోనీకి అభినందనలు. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రధానిగా ఆమె నిలిచారు” అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్ట్ చేశారు. మెలోనీ నాయకత్వంలో భారత్–ఇటలీ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం మెలోనీతో కలిసి మరింత సన్నిహితంగా పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.Mi congratulo con la mia amica, il Primo Ministro Meloni, per essere diventata il Primo Ministro con il mandato più lungo nella storia del dopoguerra italiano. Questo traguardo riflette la fiducia che il popolo italiano ripone nella sua leadership. La sua amicizia è stata…— Narendra Modi (@narendramodi) September 4, 2026అలా ప్రధానిగా..1977లో రోమ్లో జన్మించిన జార్జియా మెలోనీ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో యువజన రాజకీయ ఉద్యమంలో చేరిన ఆమె.. ఆ తర్వాత ఇటలీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2008లో అప్పటి ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ ప్రభుత్వంలో యువజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2012లో ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీని స్థాపించి, 2014లో దాని అధ్యక్షురాలయ్యారు. 2022 సాధారణ ఎన్నికల్లో ఆమె పార్టీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించడంతో.. అదే ఏడాది అక్టోబర్ 22న ఇటలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఇటలీ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా మెలోనీ రికార్డు సృష్టించారు. తాజా రికార్డుపై ఇటు తన సోషల్ మీడియాలో మెలోనీ సైతం ఓ పోస్ట్ చేశారు.Oggi il nostro Governo diventa il più longevo della storia della Repubblica italiana.È un dato che accolgo con gratitudine e con un forte senso di responsabilità. Perché la stabilità non è un record da esibire, ma la condizione che consente a una Nazione di programmare,… pic.twitter.com/EpdHe35vJa— Giorgia Meloni (@GiorgiaMeloni) September 4, 2026మెలోనీ కంటే ముందు..ఇటలీ రిపబ్లిక్ ఏర్పడిన 1946 తర్వాత ఎంతోమంది ప్రధానులు మారారు. మెలోనీకి ముందు సుదీర్ఘకాలం నిరంతరంగా ప్రధానిగా కొనసాగిన రికార్డు సిల్వియో బెర్లుస్కోనీ పేరిట ఉండేది. 2001లో ప్రారంభమైన ఆయన రెండో ప్రభుత్వం 1,412 రోజులు కొనసాగింది. 2022 అక్టోబర్ 22న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మెలోనీ తాజాగా ఆ రికార్డును అధిగమించారు.‘మెలోడీ’గా ఫేమస్..మోదీ, మెలోనీ మధ్య స్నేహం అంతర్జాతీయ వేదికలపైనా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఇద్దరి సమావేశాలు, సంభాషణలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ‘మెలోడీ’ అనే హ్యాష్ట్యాగ్ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. మెలోనీ కూడా గతంలో మోదీతో తన స్నేహాన్ని సానుకూలంగా ప్రస్తావించారు. ఆఖరికి ఈ బంధం మెలోడీ చాక్లెట్లు పంచుకునే సరదా స్థాయి దాకా వెళ్లింది. అయితే ఈ బంధం గురించి ఇటు ఇండియాలో రాజకీయ దుమారం రేపిన సందర్భమూ ఉంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇక్కడ మోదీ రికార్డేఇటలీలో మెలోనీ సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ రికార్డు నెలకొల్పిన వేళ.. భారత్లోనూ ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2019, 2024లో వరుసగా ఎన్నికై మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతల జాబితాలో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. భారత్లో నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు ఎన్నికై ప్రధానిగా కొనసాగుతున్న నేతగా మోదీ నిలిచారు. ఇటలీలో మెలోనీ, భారత్లో మోదీ.. ఇద్దరూ తమ తమ దేశాల్లో సుదీర్ఘ రాజకీయ ప్రయాణంతో ప్రత్యేక ముద్ర వేశారు.మరింత బలపడనున్న బంధంఇటలీతో భారత్ సంబంధాలు మోదీ ప్రధాని అయ్యాకే క్రమక్రమంగా బలపడుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మెలోనీ స్నేహం కీలకంగా ఉందని మోదీనే చాలాసార్లు పేర్కొన్నారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులోనూ ఈ సంబంధాలు మరింత విస్తరించనున్నాయని మోదీ సంకేతమిచ్చారు.ఇదీ చదవండి: మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా? -
భారత ఆర్థిక వృద్ధితో కొత్త అవకాశాలు
న్యూఢిల్లీ: వాణిజ్యం, రక్షణ, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, టెక్నాలజీ సహా కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, బెల్జియం నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వేవెర్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రక్షణ సంబంధాలను పెంపొందించుకోవడం, పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారం సహా ఇతర అంశాలకు సంబంధించి ఐదు ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. రాబోయే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని రెట్టింపు చేయాలన్ని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అనంతరం మోదీ, వేవెర్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. గత త్రైమాసికంలో భారత్ సాధించిన 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశం ఎదుగుదలను ప్రపంచ విశ్వాసానికి, కొత్త అవకాశాలకు మూలకారణంగా అభివరి్ణంచారు. నేడు ప్రపంచం సంక్షోభ కాలాన్ని ఎదుర్కొంటోందని గుర్తుచేశారు. అనేక ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయని, అనిశ్చితి వల్ల ఆహారం, ఇంధనం, సప్లై చైన్లు సహా ప్రతి రంగం ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ పరుగు ఎక్కడా ఆగడం లేదన్నారు. గత త్రైమాసికంలో ఏకంగా 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం ప్రశంసనీయమని ఉద్ఘాటించారు. భారత్, బెల్జియం మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని మొత్తం సంబంధాలకు మూలస్తంభంగా మోదీ అభివరి్ణంచారు. రెండు దేశాల మధ్య సైనిక మారి్పడులు, శిక్షణా సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంగీకరించామని చెప్పారు. ఇరుదేశాల ప్రభుత్వాలు, రక్షణ పరిశ్రమల మధ్య కుదిరిన ఒప్పందాలు రక్షణ సహ–అభివృద్ధి, సహ–ఉత్పత్తికి కొత్త అవకాశాలను తెరుస్తాయని స్పష్టంచేశారు. నేరాల నిర్మూలనలో రెండు దేశాల ఏజెన్సీల మధ్య నిఘా సమాచార మారి్పడి, సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. భారత్, బెల్జియం ప్రజల మధ్య సంబంధాలే ఇరుదేశాల బంధానికి అతిపెద్ద బలం అని ప్రధానమంత్రి వెల్లడించారు. స్టార్టప్ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, మారిటైమ్ రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని తెలిపారు. విశ్వవిద్యాలయ, పరిశోధన సహకారాన్ని కూడా బలోపేతం చేస్తామన్నారు. ప్రతిభావంతుల బదిలీని సులభతరం చేయడానికి, త్వరలో ‘వలస, బదిలీ భాగస్వామ్య ఒప్పందం’కుదుర్చుకుంటామని తెలియజేశారు. చట్టబద్ధ పాలన, సంప్రదింపులు, దౌత్యంపై భారత్, బెల్జియం దేశాలకు ఎనలేని విశ్వాసం ఉందన్నారు. పునరుత్పాదక ఇంధనంపై నేడు కుదిరిన అవగాహన ఒప్పందం మన సుస్థిరత సహకారానికి కొత్త ఊపునిస్తుందని మోదీ వివరించారు.గతంలో కంటే విస్తృతమైన సంబంధాలు: వేవెర్ భారత్–యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల బెల్జియం ప్రధానమంత్రి వేవెర్ హర్షం వ్యక్తంచేశారు. ఇదొక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. అలాగే భారత్, బెల్జియం దేశాలు గతంలో కంటే విస్తృతమైన, మరింత వ్యూహాత్మకమైన సంబంధాలను నిర్మించుకుంటున్నాయని వివరించారు. -
వికసిత భారత్కు వాహన రంగం దన్ను!
న్యూఢిల్లీ: నిరంతర ఆవిష్కరణలు, అత్యుత్తమ ఉత్పత్తులను అందిస్తూ 2047 నాటికి వికసిత (అభివృద్ధి చెందిన) భారత్ సాకారం దిశగా సాహసోపేతమైన మార్గాన్ని రూపొందించుకోవాలని భారత వాహన పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గురువారమిక్కడ జరిగిన భారతీయ వాహన తయారీదారుల సంఘం (సియామ్) 2026 వార్షిక సదస్సుకు అందించిన సందేశంలో, ఇటీవలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో అంతర్జాతీయ మార్కెట్లలో మన వాహన రంగం దూసుకెళ్లేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన పరిశ్రమ మరింతగా విస్తరించేందుకు ఈ ఒప్పందాలు దోహదం చేస్తాయని చెప్పారు. సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర ప్రధాని సందేశాన్ని చదివి వినిపించారు. ‘వికసిత భారత్ జర్నీలో వాహన రంగానికి కొంగొత్త అవకాశాలు లభిస్తాయి. భారీగా వృద్ధి చెందుతుంది. దేశాభివృద్ధిలో కీలక మూల స్తంభంగా రవాణా రంగం పాత్ర బలోపేతమవుతుంది. గడిచిన దశాబ్దకాలంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది. ఎకానమీ ప్రగతితో పాటు వాహనాలకు డిమాండ్ కూడా పుంజుకుంటుంది. హైవేలు, ఇతర మౌలిక సదుపాయాల విస్తరణ జోరుతో మన ఆటోమొబైల్ పరిశ్రమకు మరిన్ని కొత్త అవకాశాలు దక్కుతున్నాయి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈవీలు రయ్... దేశంలో చార్జింగ్ సదుపాయాల విస్తరణ జోరందుకోవడంతో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయని.. ఇది ఆవిష్కరణల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. నవతరం మొబిలిటీ దిశగా భారత్ దూసుకెళ్తున్న నేపథ్యంలో భారతీయ వాహన తయారీ సామర్థ్యాలను సరికొత్త శిఖరాలను తీసుకెళ్లడంలో సియామ్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. సంస్కరణలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీమ్ల వంటి చర్యలతో వాహన పరిశ్రమ తయారీ సామర్థ్యాలు మరింత బలోపేతమయ్యాయని వివరించారు. ఆర్థిక వృద్ధికి కీలక చోదకం: సియామ్ ప్రెసిడెంట్ భారత్ ఆర్థిక ప్రగతికి ఆటోమొబైల్ పరిశ్రమ కీలక చోదకంగా నిలుస్తుందని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. పర్యావరణహితమైన, కాలుష్యరహిత, సురక్షిత రవాణా విషయంలో ప్రపంచవ్యాప్త, జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానం చేయడంలో గణనీయమైన పాత్ర పోషిస్తోందన్నారు. దేశ ఎకానమీలో వాహన పరిశ్రమ వాటా రూ.22.75 లక్షల కోట్లను అధిగమించిందని, జీఎస్టీ వసూళ్లలో ఈ రంగం నుంచి దాదాపు 15% లభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్ల మందికి ఆటో పరిశ్రమ ఉపాధి కల్పిందని చెప్పారు. 2025–26లో 46 లక్షల విక్రయాలు.. 7.6% వృద్ధితో ప్యాసింజర్ వాహన విభాగం రికార్డు సృష్టించిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 25 లక్షల ఈవీలు (24.7% వృద్ధి) అమ్ముడయ్యాయని ఆయన తెలిపారు. పెట్రోలు, డీజిల్ కార్లపై మరిన్ని నియంత్రణలు... దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత పెంచేందుకు వాహన రంగం చర్యలు తీసుకోవాలని ప్రధాని సలహాదారు తరుణ్ కపూర్ పరిశ్రమను కోరారు. దేశీయంగా బ్యాటరీ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్ను సంబంధిత మార్పులను ప్రవేశపెట్టడంపై దృష్టి సారించిందని కూడా ఆయన పేర్కొన్నారు. మరోపక్క, రానున్న కాలంలో పెట్రోలు, డీజిల్ వాహనాలు.. ముఖ్యంగా కార్ల విషయంలో ప్రభుత్వం మరిన్ని నియంత్రణలను అమలు చేసే అవకాశం ఉందని.. పరిశ్రమ దీనికి సిద్ధంగా ఉండాలన్నారు. సీఎన్జీ వాహనాలపై దృష్టి సారించినట్లే... రానున్న కాలంలో ఈవీలపై ఫోకస్ మరింత పెంచాలని ఆటోమొబైల్ కంపెనీలకు సూచించారు. మరోపక్క, మరికొన్నేళ్లలో ఈవీలపై ప్రభుత్వం సబ్సిడీలను ఆపేయవచ్చని, పరిశ్రమ ఈ సవాలుకు రెడీగా ఉండాని భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కమ్రాన్ రిజ్వీ పేర్కొన్నారు.2027 అక్టోబర్ నుంచి భారత్ ఎన్సీఏపీ 2.0: గడ్కరీ దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే చర్యల్లో భాగంగా వాహనాల్లో పూర్తిస్థాయి భద్రతా వ్యవస్థను అంచనా వేసే భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) 2.0ను వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అలాగే, రేర్ ఎమిషన్ కంట్రోల్ పరికరం వల్ల కాలుష్యం భారీగా తగ్గుతుందని, దీనిపై పరీక్షలు కూడా పూర్తయినట్లు వెల్లడించారు. ఒక్కో డివైజ్కు రూ.4,000–5,000 ఖర్చవుతుందన్నారు. బీఎస్4 వాహనాల్లో దీన్ని అమర్చిన తర్వాత వెలువడే ఉద్గారాలు బీఎస్6 వాహనాల మాదిరిగానే ఉంటాయన్నారు. త్వరలో దీనికి సంబంధించి కొత్త స్కీమ్ను ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. అందుబాటు ధర కీలకం: మారుతీ సీఈఓ నియంత్రణలు, అందుబాటు ధరల మధ్య సరైన సమతుల్యత కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ హిసాషి టకేచి పేర్కొన్నారు. దీనివల్ల భారతీయ కొనుగోలుదారులకుసురక్షితమైన, పర్యావరణహిత రవాణా అందుబాటులో ఉంటుందన్నారు. దేశంలో పశువుల పేడ, బయోమాస్, వ్యవసాయ వ్యర్థాలు పుష్కలంగా లభ్యమవుతున్నందున, కంప్రె‹స్డ్ బయోగ్యాస్కు భారీ అవకాశాలున్నాయని, దీన్ని స్వచ్ఛమైన వాహన ఇంధనంగా మార్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నియంత్రణపరమైన వ్యయాలు పెరిగిపోవడంతో తొలిసారి కారు కొనుగోలు చేసేవారికి భారంగా మారింది. దీంతో గత కొన్నేళ్లుగా చిన్న కార్ల విభాగంలో అమ్మకాలు పడిపోయాయి. లక్షలాది భారతీయ కుటుంబాలకు కారు కొనుగోలు ఇప్పటికీ పెద్ద కల. మరింత రక్షణతో పాటు సౌలభ్యం, సౌకర్యాన్ని కల్పిస్తుంది. అందుకే అందుబాటు ధర చాలా ముఖ్యం’ అని టకేచి పేర్కొన్నారు. ఇటీవలి జీఎస్టీ సంస్కరణలతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెల్లలోనే చిన్న కార్ల (18 శాతం లోపు జీఎస్టీ శ్లాబ్లో ఉన్నవి) అమ్మకాలు ఏకంగా 30 శాతం మేర ఎగబాకడాన్ని ఆయన ఉదహరించారు. మరీ ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ కార్లలో ఏకంగా 100 శాతం వృద్ధి నమోదైందని, అందుబాటు ధరకున్న మహిమకు ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. -
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చేందుకు బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ సిద్ధం చేసిన వినూత్న కానుక.. భారత్కు చేరకముందే కరిగిపోయింది. అత్యుత్తమ బెల్జియన్ చాక్లెట్లతో ప్రత్యేకంగా తయారు చేసిన ఢిల్లీ ఇండియా గేట్ ప్రతిబింబించే చాక్లెట్ను గిఫ్ట్గా ఇద్దామనుకున్నట్లు బార్ట్ వెల్లడించారు. అయితే, భారత్కు దాన్ని తీసుకురాలేకపోయానని తెలిపారు. బహుమతి.. ప్రయాణంలో కరిగిపోవడంతో భారత్కు చేరుకోలేకపోయింది. అయితే, మరో ప్రతిరూపాన్ని బెల్జియంలో సిద్ధంగా ఉంచామని.. దాన్ని ఈసారి మోదీకి ‘ఒక్క ముక్కలో’ అందజేస్తానంటూ డి వెవర్ చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి."మా ఉమ్మడి చరిత్ర, భవిష్యత్ భాగస్వామ్యానికి ప్రతీకగా మేము ఇండియా గేట్ను ఎంచుకున్నాము. ఎందుకంటే ఇండియా గేట్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్లాండర్స్ ఫీల్డ్స్లో పోరాడి ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికులను స్మరించే శాసనంపై ఉన్న భాగాన్ని ఈ చాక్లెట్ శిల్పంపై పెద్దదిగా రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఒక శతాబ్దానికి పైగా భారతీయ సైనికులు వేల మైళ్ళు ప్రయాణించి బెల్జియం గడ్డపై పోరాడారు. వారి త్యాగాన్ని మేము మరిచిపోలేదు. వారి ధైర్యాన్ని, త్యాగాన్ని మేం ఎప్పటికీ మరువలేమన్నారు.బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ భారత్ పర్యటనలో భాగంగా ఇవాళ (గురువారం) ప్రధాని నరేంద్ర మోదీతో విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 2027 నాటికి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 80 ఏళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, సెమీకండక్టర్లు, ఫిన్టెక్, క్రిటికల్ మినరల్స్, ప్రజల మధ్య సంబంధాలు, విద్యా-పరిశోధనా సహకారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మోదీ, వెవర్ ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు.ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం - బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్చలు జరిపారు. భారత్-బెల్జియం ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రజల మధ్య సంబంధాలే అత్యంత కీలకమైన బలంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
అవకాడోకి పెరుగుతున్న క్రేజ్..ఆరోగ్యానికి మంచిదేనా? ప్రధాని మోదీ ఏమన్నారంటే..
అవకాడో ఒకప్పుడు అంతగా పరిచయం లేని పండుగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి భోజనాల్లో ప్రముఖంగా మారింది. దాన్ని వివిధ స్మూతీలు, సలాడ్ల వరకు విరివిగా ఉయోగిస్తూ..ఆధునిక ఆహారంలో అత్యంత ముఖ్యమైనవిగా మారిపోయాయి. దీని గురించి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడారు. మరి ఆయన ఏం అన్నారంటే..భారత్లో ఈ పండు పట్ల పెరుగుతున్న ఆదరణ, ఆరోగ్య ప్రయోజనల గురించి చెప్పారు. ఇంతకుముందుక అంతగా ఎవ్వరికీ తెలియని ఈ పండుకి ప్రస్తుతం డిమాండ్, క్రేజ్ ఎక్కువయ్యాయి. ప్రతి డైనింగ్ టేబుల్పై తప్పనిసరిగా ఇది కనిపిస్తోంది. అంతేగదు మన అన్నదాత రైతన్నకి కూడా ఇష్టమైన పండుగా మారింది అంటూ ఆంధ్రప్రదేశ్ రైదు కర్ప వరదరాజు గురించి ప్రస్తావించారు. వరదరాజ్ తన స్నేహితుడు పొలంలో అవకాడో పండుని చూసి యూట్యూబ్ ద్వారా ఆ పంట పెంపకం గురించి నేర్చుకుని మరి పండించడం ప్రారంభించాడు. మోదీ ప్రకారం..వరదరాజ్ ఇప్పుడు సుమారు నాలుగు టన్నుల అవకాడోలను ఉత్పత్తి చేసి, వాటిని నేరుగా దుకాణాల్లో విక్రయిస్తున్నాడు. నగరాల్లోని తీని గురించి ఎక్కువగా వింటుంటాం. అలాంటి దాంతో రైతులు వినూత్నంగా సంపాదించే మార్గాన్ని కనుగొన్నారు. మన దేశపు అవకాడోల రుచి పెరగడమే కాదు, రైతుల ఆదాయం కూడా పెరిగింది అంటూ తన సంభాషణను ముగించారు. అవకాడోల వల్ల కలిగే లాభాలు..వీటిలో ఆరోగ్యకరమైన మోనోఅన్శాచురేటెడ్ ఒలిక్ యాసిడ్, అధిక డైటరీ ఫైబర్తో నిండిన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కొవ్వులో కగిగే విటమిన్లు శోషణను పెంచడంలో సమర్థవంతంగా ఉంటాయి.వయసు సంబంధిత కీళ్ల సమస్యలు, దృష్టిని మెరుగుపరిచేలా ల్యూటిన్, జీక్సాంథిన్ వంటి యాక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఎముకల సాంద్రతను బలోపేతం చేసే విటమిన్ కె కూడా ఉంటుంది. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) (చదవండి: మీనాక్షి దేవతను తలపించేలా నికితా పోర్వాల్ అద్భుత నృత్యం..!) -
ప్రధాని మోదీతో ‘అయోధ్య’ తొలి సీఈవో.. పాత వీడియో వైరల్!
న్యూఢిల్లీ: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ పాలకమండలి పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. మొత్తం 5,585 దరఖాస్తులను పరిశీలించిన ఉన్నత స్థాయి కమిటీ ముగ్గురి పేర్లను ఖరారు చేయగా, ట్రస్ట్ సమావేశంలో జితేంద్ర మిశ్రా పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం గత ఏడాది పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన కలిసి ఉన్న పాత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది.ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాకు చెందిన జితేంద్ర మిశ్రా భారత వాయుసేన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్గా సేవలందించారు. ‘ఆపరేషన్ సిందూర్’ వ్యూహరచనలో కీలకపాత్ర పోషించిన ఆయనకు సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్ లభించింది. 43 ఏళ్లపాటు వైమానిక దళంలో దేశసేవ చేసిన తనకు, శ్రీరామచంద్రుడికి, భక్తులకు సేవలందించే గొప్ప అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతమని మిశ్రా పేర్కొన్నారు. Fact-check for Pakistan.PM @narendramodi Ji interacted with our brave Jawans.🇮🇳 📍Adampur Air Base, Punjab pic.twitter.com/UPkph1TlSB— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 13, 2025నూతన సీఈవో నియామకంతో పాటు పాలకమండలిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు కోశాధికారిగా ఉన్న గోవింద్ దేవ్ గిరిని ప్రధాన కార్యదర్శిగా, ఆయన స్థానంలో మహేష్ భాగ్ చంద్ కాను నూతన కోశాధికారిగా నియమించారు. అలాగే మదన్ మోహన్ పాండే, మహేష్ భాగ్ చంద్ కా, డాక్టర్ నిర్మలా యాదవ్లు కొత్త ట్రస్టీలుగా బాధ్యతలు స్వీకరించారు. ట్రస్ట్లో మహిళకు ప్రాతినిధ్యం కల్పించడం ఇదే తొలిసారి. -
5న శ్రీరామ్ కాలేజీకి ప్రధానమంత్రి మోదీ
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఐదో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హస్తినలోని ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రముఖ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్(ఎస్ఆర్సీసీ)ని సందర్శించనున్నారు. అదే రోజు జరిగే కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. యువతతో మమేకం కావాలన్న బీజేపీ లక్ష్యానికి చేరుక కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని మోదీ ఈ శనివారం కాలేజీ విద్యార్థులనుద్దేశించి మాట్లాడతారని తెలుస్తోంది. చివరిసారిగా 13 సంవత్సరాల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఈ కాలేజీని మోదీ సందర్శించారు. -
నీటి సంరక్షణ సాంకేతికతలపై దృష్టిసారించాలి
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రతరంకాకుండా జల సంరక్షణ సాంకేతికతలను మరింతగా అమల్లోకి తేవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జలంపై కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన జాతీయస్థాయి రెండు రోజుల కార్యక్రమం ముగింపు వేడుకలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘పట్టణీకరణతో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. వీళ్ల అవసరాలు తీర్చేలా పట్టణ పురపాలికలు నీటి సంరక్షణపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ మేరకు నీటి సంరక్షణ సాంకేతికతల అమలుపై బాగా దృష్టిసారించాలి. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అత్యుత్తమ నీటి సంరక్షణ విధానాలు,సాంకేతికతలను నగర, పట్టణ కార్పోరేషన్లలో అమలుచేయాలి. ఈ సాంకేతికతలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలా, సంబంధిత ఉపకరణాలను స్థానికంగా తయారుచేసేలా భారతీయ పరిశ్రమలకు అవకాశాలను మెరుగుపరచాలి. జల సంరక్షణలో ప్రజా భాగస్వామ్యాన్నీ విపరీతంగా పెంచాలి. పౌరుల్లో నీటిపై, నీటి వృథాను అరికట్టడంపై, నీటిని పొదుపుగా వాడుకోవడంపై మరింతగా అవగాహన పెంచేలా జల్ఉత్సవ్ వంటి కార్యక్రమాలను నిర్వహించాలి. పట్టణ ప్రాంతాల్లోని చెరువులు, కాలువలు, రిజర్వాయర్లలో చెత్త, వ్యర్థ్యాల పూడిక తీసే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపట్టాలి. భూగర్భ జలాలు పెరిగేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషిచేయాలి. ఈ సదస్సును ఒకసారి చేపట్టేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలి. జల సంరక్షణ విజయవంతంగా చేపడుతున్న ప్రాంతాలను ఉన్నతాధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు రాష్ట్రాలకతీతంగా సందర్శించి అవగాహన పెంచుకోవాలి. జల వనరులను ఎలా సంరక్షించుకోవాలో, సది్వనియోగం చేయాలనే దాని కోసం జల గణాంకాలను కృత్రిమ మేథ సాయంతో మేళవించి మెరుగైన పరిష్కారాలను కనుగొనాలి’’అని మోదీ సూచించారు. -
బంగారం ఎందుకు కొనొద్దు? విదేశీ పర్యటనలు ఎందుకు వద్దు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే భారతీయులు అనవసర బంగారం కొనుగోళ్లను తగ్గించాలని, విదేశీ పర్యటనలకు బదులుగా దేశంలోనే పర్యటించాలని, విదేశాల్లో వివాహాలు నిర్వహించకుండా భారత్లోనే వివాహాలు చేసుకోవాలని సూచించారు. ఆయన ఎందుకు ఈ సూచనలు చేశారో, దాని వల్ల భారత్కు ఏయే ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసా?బంగారం కొనుగోళ్లు ఎందుకు తగ్గించాలి?భారత్ బంగారం అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. బంగారం కొనుగోళ్లు పెరిగితే విదేశీ మారకద్రవ్య వ్యయం పెరుగుతుంది. దీనివల్ల వాణిజ్య లోటుపై ప్రభావం పడటంతో పాటు రూపాయి విలువపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో బంగారం దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 32% కంటే ఎక్కువ పెరిగినట్లు వార్త పేర్కొంది.విదేశీ పర్యటనలు ఎందుకు వద్దంటున్నారు?విదేశీ పర్యటనల విషయంలోనూ ఇదే ఆలోచనను ప్రధాని ముందుకు తెచ్చారు. విదేశాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, వినోదం కోసం భారతీయులు చేసే ఖర్చు విదేశీ వ్యాపారాలకు చేరుతుంది. విదేశాల్లో వివాహాలు నిర్వహిస్తే వేదికలు, వసతి, ఆహారం, ప్రయాణం వంటి వాటిపై మరింత విదేశీ వ్యయం జరుగుతుంది. ఆ ఖర్చులో కొంత భాగాన్ని భారత్లోనే పెట్టడం ద్వారా దేశీయ వ్యాపారాలు, ఉపాధికి ప్రయోజనం కలుగుతుందని ప్రధాని పేర్కొన్నారు.భారత్ ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసినా, అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశానికి ముప్పు కొనసాగుతోందని ప్రధాని తెలిపారు. భారత్ ముడి చమురు అవసరాల్లో 88% కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, హార్మూజ్ జలసంధిపై అనిశ్చితి కారణంగా ఇంధన మార్కెట్లలో మరిన్ని అంతరాయాల ప్రమాదం ఉంది.స్వదేశీ విధానందేశంలో తయారయ్యే వస్తువులు, దేశీయ సేవలు, స్థానిక వ్యాపారాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ తాజా సూచన కూడా దేశీయ వినియోగం, స్వయం సమృద్ధిని పెంచే విస్తృత స్వదేశీ విధానంలో భాగమే. దేశీయ వినియోగాన్ని పెంచడం, స్వయం సమృద్ధిని ప్రోత్సహించడం కోసం ప్రధాని మోదీ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగమే ఈ ప్రకటన. “మనం స్వదేశీకి ఎంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామో, స్వయం సమృద్ధికి అంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లే” అని ఆయన అన్నారు. భారత్ తన అభివృద్ధి వేగాన్ని కొనసాగించగలదని, స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశ అవసరాలను దేశీయ ఉత్పత్తులు, వనరులు, సేవల ద్వారా ఎక్కువగా తీర్చుకునే సామర్థ్యాన్ని భారత్ పెంచుకోవాలి. -
పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బట్టబయలు!
-
ఉగ్రవాద పోషకులను సహించడానికి వీల్లేదు
బిష్కెక్: ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుంటున్న దేశాలను సహించడానికి వీల్లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాద మూకలను ఒక సాధనంగా వాడుకుంటున్నాయని పరోక్షంగా పాకిస్తాన్పై మండిపడ్డారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సామూహిక పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. మంగళవారం కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సహా వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాద వ్యవస్థను పూర్తిగా పెకిలించివేయడానికి ఎస్సీఓ కూటమి ఐక్యంగా పని చేయాలని, నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని మోదీ సూచించారు. ఉగ్రవాదాన్ని ఒక విధానపరమైన సాధనంగా వాడుకుంటున్న దేశాలకు గట్టి హెచ్చరిక జారీ చేయాలని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎవరికీ ఎప్పటికీ ‘వ్యూహాత్మక ఆస్తి’కాజాలదని స్పష్టంచేశారు. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమాన్ని(బీఆర్ఐ) పరోక్షంగా ప్రస్తావించారు. ఎస్సీఓ చార్టర్ మౌలిక స్ఫూర్తి ప్రకారం.. ఇలాంటి అనుసంధాన ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేలా ఉండాలని స్పష్టంచేశారు. ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే.. పరిష్కారం యుద్ధ భూమిలో కాదు ‘‘ఉగ్రవాద భూతం మొత్తం మానవాళికి తీవ్ర సవాలుగా మారింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో మనం కేవలం చర్య–ప్రతిచర్య విధానానికే పరిమితం కాకూడదు. ఉగ్రవాదానికి నిధుల సమకూర్చడం, నియామకాలు, ఉగ్రవాద భావజాల వ్యాప్తి, ముష్కరుల సురక్షిత స్థావరాలకు సంబంధించిన మొత్తం వ్యవస్థను నిర్మూలించాలి. మనం ఒకే గళం వినిపించాలి. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని స్పష్టం చేయాలి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలకు తగిన బుద్ధి చెప్పాలి. నేడు పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో ఒక ప్రాంతంలో తలెత్తే సంఘర్షణ కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తోంది. ఇది ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల గ్లోబల్ సౌత్ దేశాలు అత్యధికంగా నష్టపోతున్నాయి. ఉద్రిక్తతలు, సంఘర్షణలను యుద్ధభూమిలో కాకుండా చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని భారతదేశం నిరంతరం పిలుపునిస్తోంది. శాంతి, స్థిరత్వంలో కూడిన యురేషియా(యూరప్–ఆసియా) మన ఉమ్మడి ఆకాంక్ష. ఇది అప్గానిస్తాన్లోని శాంతి, స్థిరత్వంతో కూడా ముడిపడి ఉంది. అఫ్గానిస్తాన్ ప్రజల అభివృద్ధికి భారత్ తోడ్పాటు అందిస్తూ వస్తోంది. ఇకపైనా అందిస్తూనే ఉంటుంది. అన్ని ప్రయత్నాలకూ భారత్ మద్దతు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. మా ర్కెట్లను అనుసంధానించే, వాణిజ్యాన్ని సులభతరం చేసే, అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకూ భారత్ మద్దతు ఇస్తోంది. అయితే, అటువంటి ప్రయత్నాలు అన్ని దేశాల సార్వబౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం కూడా అంతే అవసరం. భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే మూడు ప్రధాన అంశాలపై మనం దృష్టి పెట్టాలి. ఈ మూడు మూలస్తంభాలను కేవలం ఆశయాలకే పరిమితం చేయకుండా.. వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది’’అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మోదీ, పుతిన్, జిన్పింగ్ ఆత్మియ సంభాషణ ఎస్సీఓ సదస్సు సందర్భంగా అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. చాలాకాలం తర్వాత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్పింగ్ కలుసుకున్నారు. ముగ్గురు నేతలు వేదికపై కరచాలనం చేసుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ కొద్దిసేపు ఆత్మియంగా సంభాషించుకున్నారు. జిన్పింగ్, పుతిన్లతో మోదీ ఒకేసారి కరచాలనం చేశారు. పాక్ ప్రధాని కార్యాలయం వక్రబుద్ధిన్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. కిర్గిజిస్తాన్లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా 10 దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలంతా కలిసి ఆనవాయితీ ప్రకారం గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోలను ఆయాన దేశాల ప్రభుత్వాలు సోషల్ మీడియాలో పోస్టు చేశాయి. పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం ఈ ఫొటోలో నరేంద్ర మోదీని తొలగించి, తమ అధికారిక ఖాతాలో పోస్టుచేసింది. షెహబాజ్ షరీఫ్, పుతిన్, జిన్పింగ్లతోపాటు మోదీ కనిపించకుండా జాగ్రత్తపడింది. ఇందులో పుతిన్, జిన్పింగ్, షెహబాజ్ షరీఫ్ కనిపిస్తున్నారు. మోదీతోపాటు మరికొందరు దేశాధినేతలు లేరు. ఎస్సీఓ సదస్సు గ్రూప్ ఫొటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో పాక్ ప్రధాని షరీఫ్ సహా దేశాధినేతలందరూ కనిపిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ నీచ బుద్ధిపై భారతీయులు మండిపడ్డారు. -
ఎస్సీవో వేదికగా పాక్కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
బిష్కెక్ (కిర్గిజిస్థాన్): ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక వనరులు, రిక్రూట్మెంట్లు, మత ఛాందసవాదం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సురక్షిత స్థావరాలు వంటి యావత్ ఉగ్ర వ్యవస్థను పూర్తిగా సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ ఒకే గొంతుకతో మాట్లాడాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. యుద్ధభూమిలో ఎలాంటి సమస్యలకు పరిష్కారం దొరకదని, ఏ వివాదమైనా చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కారం కావాలని అన్నారు. అంతకుముందు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ అంశాన్ని ప్రస్తావించారు. శాంతి స్థాపన కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రతి యుద్ధ దినం మానవాళిని వెనక్కి నెడుతుందని, శాంతి వైపు వేసే ప్రతి అడుగు కొత్త ఆశను నింపుతుందని పేర్కొన్నారు.అంతం లేని యుద్ధాల నుంచి బయటపడి శాంతి దిశగా పయనించాల్సిన అవసరం ఉందని, గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత గడ్డ శాంతి సందేశాన్నే ప్రపంచానికి అందిస్తుందని మోదీ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో మోదీ-పుతిన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 2001లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్లతో ప్రారంభమైన ఎస్సీవోలో భారత్, పాకిస్థాన్లు 2017లో, ఇరాన్ 2023లో, బెలారస్ 2024లో పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరాయి.ఇది కూడా చదవండి: ఒకే ఫ్రేమ్లో మోదీ, జిన్పింగ్, పుతిన్, షరీఫ్ -
బంగారం కొనుగోలుపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఒకే ఫ్రేమ్లో మోదీ, జిన్పింగ్, పుతిన్, షరీఫ్
బిష్కెక్: కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో మంగళవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఎస్సీఓ అధికారిక గ్రూప్ ఫొటోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్లు ఒకే ఫ్రేమ్లో కనిపించారు. బిష్కెక్లోని ఇరిస్ ఓర్డో కాంగ్రెస్ హాల్లో జరిగిన సంప్రదాయ ‘ఫ్యామిలీ ఫొటోగ్రఫీ’ కార్యక్రమంలో నేతలందరూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. షీ జిన్పింగ్, పుతిన్లతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆతిథ్య దేశ అధ్యక్షుడు సాదిర్ జాపరోవ్ నేతృత్వంలో రౌండ్టేబుల్ చర్చలు జరిగాయి. మోదీ, జిన్పింగ్, పుతిన్, షరీఫ్లతో పాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిమ్-జోమార్ట్ తొకాయేవ్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్, తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మోన్లు హాజరయ్యారు. #WATCH | Bishkek, Kyrgyzstan: Prime Minister Narendra Modi interacts with Chinese President Xi Jinping as they participate in the 26th SCO Summit. (Source: Host Broadcaster via Reuters) pic.twitter.com/0I1khkxtum— ANI (@ANI) September 1, 2026సదస్సు నేపథ్యంలో సోమవారం ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ రంగాలపై సమీక్షించారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించాలని పుతిన్కు విజ్ఞప్తి చేసిన మోదీ.. ‘అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు అడుగులు పడాలి’ అని అన్నారు. పుతిన్ స్పందిస్తూ తాము ఆ దిశగానే సాగుతున్నామని పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత రెండేళ్లలో వీరిద్దరి మధ్య ఇది తొలి భేటీ. ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటా కలిగిన 10 దేశాల ఎస్సీఓ కూటమి.. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సహకారాన్ని బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తోంది. -
టూర్లు.. పెళ్లిళ్లు.. బంగారం: మోదీ కీలక పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి వృద్ధి రేటు నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ భారత్ శర వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ‘స్వదేశీ.. వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పరోక్షంగా చురకలంటించారు.కిర్గిజిస్థాన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరైన మోదీ.. మంగళవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘7.8 శాతం వృద్ధి దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. ఇది ప్రజల సంకల్ప బలం, కష్టపడి పనిచేసే తత్వానికి ప్రతిబింబం’’ అని అన్నారు.‘ప్రపంచం యుద్ధంలో ఉంది’ప్రస్తుతం ప్రపంచం యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతోందని మోదీ పేర్కొన్నారు. కొవిడ్ కాలం 2020 నుంచి ఇప్పటివరకు ఎక్కడా పూర్తి స్థాయిలో స్థిరత్వం కనిపించలేదని, సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.విదేశీ టూర్లు వద్దు.. ‘వెడ్ ఇన్ ఇండియా’ఈ నేపథ్యంలో ప్రజలు దేశీయ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని కోరారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్లు అసలే నిర్వహించవద్దని సూచించారు. పెళ్లిళ్లను దేశంలోనే నిర్వహిస్తూ ‘వెడ్ ఇన్ ఇండియా’ నినాదాన్ని పాటించాలని అన్నారు. అలాగే అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులు, సేవలను ఎంత ఎక్కువగా ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా బలోపేతమవుతుందని చెప్పారు.‘అబద్ధాల ప్రతిధ్వని’పై వ్యాఖ్యలుఇదే సమయంలో దేశంలో కొందరు నిరాశావాదంతో ‘జూట్ కీ గూంజ్’ (అబద్ధాల ప్రతిధ్వని) వ్యాప్తి చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి విమర్శలు, నిరాశావాద ప్రచారాలను అధిగమిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. ‘‘దేశంలోనే కొందరు తీవ్ర నిరాశలో మునిగిపోయి అబద్ధాల ప్రతిధ్వనిని వ్యాప్తి చేస్తున్నారు. వాటన్నింటినీ అధిగమించి దేశం 7.8 శాతం వృద్ధిని సాధించింది. ఈ వేగాన్ని కొనసాగించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.మోదీ చెప్పిన ‘జూట్ కీ గూంజ్’ పదప్రయోగం ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ప్రచారంపై కొనసాగుతున్న రాజకీయ విమర్శలకు సంబంధించి చేసిన వ్యాఖ్యగా భావిస్తున్నారు. రాహుల్గాంధీ వివిధ కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసింది. ఆయన నాలుగు కార్యక్రమాల్లో చేసిన 40 ప్రకటనల్లో 29 అవాస్తవమైనవని, మరో 11 తప్పుదారి పట్టించేలా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే మోదీ ‘అబద్ధాల ప్రతిధ్వని’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.7.8 శాతం వృద్ధిసోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు త్రైమాసికంలోని 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి కొంత తగ్గినప్పటికీ.. అంచనాలను మాత్రం అధిగమించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వంటి సవాళ్ల మధ్య ఈ వృద్ధి నమోదైంది.భారత్ స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘విధానం సరైనది.. సంకల్పం స్పష్టంగా ఉంది.. 140 కోట్ల మంది భారతీయుల ఐక్య శక్తితో దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం’’ అని తాజా వీడియో సందేశంలో ఉద్ఘాటించారు.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ? విజయ్?? పీఎం అభ్యర్థి ఎవరసలు! -
యుద్ధాల నడుమ 7.8 శాతం జీడీపీ: ప్రధాని మోదీ
బిష్కెక్: షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 25వ వార్షికోత్సవం సందర్భంగా కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో మంగళవారం నిర్వహించిన 26వ ఎస్సీఓ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అంతర్జాతీయంగా సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించిందని, ప్రజల కృషితోనే ఇది సాధ్యమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలు విదేశీ పర్యటనలు, విదేశాల్లో పెళ్లిళ్లను తగ్గించి ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. దేశం సాధించిన 7.8 శాతం ఆర్థిక వృద్ధి భారతీయుల సమష్టి కృషికి, సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు అభినందనలు తెలుపుతూనే, ‘అబద్ధాల ప్రతిధ్వనుల’ (ఝూఠ్ కీ గూంజ్) తో నిరాశను వ్యాప్తి చేసేవారిపై విమర్శలు గుప్పించారు. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వివాహాలు, అనవసర బంగారు కొనుగోళ్లను తగ్గించి, స్వదేశీ విధానాన్ని బలోపేతం చేయాలని ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో పిలుపునిచ్చారు.‘2020 కొవిడ్ సమయం నుంచి ప్రపంచంలో ఎక్కడా స్థిరత్వం కనిపించలేదు. కానీ భారత్ వేగంగా పురోగమిస్తోంది’ అని తెలిపారు. దేశంలో నిరాశలో మునిగిపోయిన కొందరు అబద్ధాల ద్వారా ప్రతికూలతను వ్యాప్తి చేస్తున్నారని, వాటన్నింటినీ అధిగమించి దేశం 7.8 శాతం వృద్ధి నమోదు చేసిందని వ్యాఖ్యానించారు. ఈ వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి ఆత్మనిర్భర భారత్, ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రం అత్యంత కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. స్వదేశీకి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్వాతంత్ర్య శతాబ్ది నాటికి యువతకు ‘వికసిత భారత్’ను అందించవచ్చని పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయుల సమష్టి సంకల్పంతో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. నాలుగు రోజుల మధ్య ఆసియా పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్తాన్లో ద్వైపాక్షిక చర్చలు ముగించుకుని ఆయన బిష్కెక్ చేరుకున్నారు. ప్రాంతీయ భద్రత, అనుసంధానత, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సహా పలువురు యురేషియా నేతలతో చర్చలు జరిపారు.PM Shri @narendramodi Ji congratulates citizens on India’s impressive 7.8% GDP growth, crediting the collective strength, hard work and determination of 140 crore Indians.#GDP#NewIndia pic.twitter.com/oFF8bijrfr— BJP Mahila Morcha (@BJPMahilaMorcha) September 1, 2026 -
పుతిన్తో మోదీ భేటీ... యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
బిష్కెక్: ప్రస్తుత కాలంలో యుద్ధం వల్ల ముందుకు వెళ్లలేమని భారత ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అంతులేని యుద్ధం నుండి బయిటపడి యుద్ధానికి ముగింపు పలికే దిశగా మందుకు సాగాలని కోరారు. భారత్ ఎల్లప్పుడూ శాంతికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ రోజు(సోమవారం) కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నాలుగేళ్లు పూర్తయింది. అయినప్పటికీ యుద్ధం ఇంకా ఉద్రిక్తంగానే సాగుతుంది. ఈ నేపథ్యంలో మోదీ,పుతిన్ మధ్య కీలక భేటీ జరిగింది. పుతిన్తో సమావేశంలో మోదీ మాట్లాడుతూ, “మనం అంతులేని యుద్ధం నుంచి బయటపడి, యుద్ధానికి ముగింపు పలికే దిశగా ముందుకు సాగాలి. ఇది మానవాళి సంక్షేమానికి ఎంతో అవసరం. అన్ని సమస్యలకు వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం లభించాలి. ఇదే మానవాళి ఆకాంక్ష, ఇదే భారతదేశ సందేశం” అని అన్నారు.భారత్ శాంతి సంప్రదాయాన్ని కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. “గాంధీ పుట్టిన నేల, బుద్ధుని నేల — ఈ రెండు నేలలు ఒకే సందేశాన్ని పంచుకుంటాయి. ఆ సందేశం శాంతి మార్గం” అని ఆయన అన్నారు. అంటే మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుల బోధనలు రెండూ కూడా హింసకు బదులుగా శాంతి, సామరస్యం, సమస్యలకు శాంతియుత పరిష్కారం వైపు నడిపిస్తాయని పుతిన్కు పరోక్షంగా సూచించారు. భారత్ శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తుందని కూడా మోదీ స్పష్టం చేశారు.యుద్ధమనేది మానవాళిని ప్రతిరోజూ వెనక్కి నెడుతుంది. అదే సమయంలో శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది” అని ఆయన పేర్కొన్నారు. కాగా గతేడాది పుతిన్ భారత పర్యటన తర్వాత మోదీ, పుతిన్లు ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భం ఇదే. ఈ సందర్భంగా సమావేశానికి ముందు ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.తాజా సమావేశంలో మోదీ పుతిన్ను భారత్లో జరగనున్న BRICS సదస్సుకు కూడా ఆహ్వానించారు. భారత్ కొన్ని రోజుల్లో BRICS సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుందని, పుతిన్తో పాటు ఆయన ప్రతినిధి బృందానికి స్వాగతం పలకడానికి భారతీయులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మోదీ చెప్పారు. -
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
బిష్కెక్: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. కిర్గిస్థాన్లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ సదస్సు సందర్భంగా వారిద్దరు భేటీ అయ్యారు. రెండేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి. మోదీ-పెజెష్కియాన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.సోమవారం సాయంత్రం రష్యా అధ్యకక్షుడు పుతిన్తో కూడా మోదీ సమావేశం కానున్నారు. కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభ వేడుకలో పుతిన్ పాల్గొంటారు.అర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్తో కూడా మోదీ సమావేశమయ్యారు. ''బిష్కెక్లో జరుగుతున్న ఎస్సీఓ సదస్సు సందర్భంగా అర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్తో సమావేశం జరిగింది. రక్షణ, ఐటీ, అంతరిక్షం, విద్య, ఔషధాలు తదితర రంగాల్లో భారత్–అర్మేనియా సహకారం మరింత పెరగనుంది. రానున్న రోజుల్లో వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని కూడా మేము విశ్వసిస్తున్నాం'' అని మోదీ తెలిపారు.కాగా, కిర్గిజిస్థాన్ రక్షణ అధికారులు, కిర్గిజ్ రిపబ్లిక్ మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయాన్ని మీడియాకు తెలిపారు. భారత్–కిర్గిజిస్థాన్ మధ్య పెరుగుతున్న రక్షణ సంబంధాలను అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కిర్గిజిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కెప్టెన్ తాలైబెక్ మాట్లాడుతూ.. “ప్రధాని మోదీని కలవడం మాకు జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం. ఆయన ఇక్కడ కిర్గిజిస్థాన్కు రావడం గొప్ప విషయం” అని అన్నారు. -
‘మోదీజీ.. నా జీవితాన్ని నరకం చేశారు’
జంతర్ మంతర్ నిరసనల సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తీవ్ర దుమారం రేగడంతో ఆమె క్షమాపణలు చెప్పడం, బాలిక తల్లి కూడా ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేయడం.. ఆయన క్షమించేయడం.. పోలీసులు ఉండదని చెప్పడంతో ఈ వ్యవహారం ఇంతటితో సమసిపోయిందని అంతా భావించారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన మరో వీడియో నెట్టింటకు చేరింది.తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో.. ‘మోదీజీ.. మీరు నా జీవితాన్ని నరకం చేశారు’ అంటూ ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. ఘటన తర్వాత తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పినట్లు ఉంది. ‘‘మీరు నన్ను ఎంతగా వెంటాడారంటే.. ప్రతిచోటా వేధింపులకు గురయ్యాను. ఎక్కడికెళ్లినా ముఖం దాచుకోవాల్సి వస్తోంది’’ అని ఆమె అందులో చెప్పినట్లు ఉంది. ఈసారి తాను వెనక్కి తగ్గబోనని, కోల్పోవడానికి తన వద్ద ఏమీ లేదని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో స్పష్టత లేదు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ దీనిని తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాల్లో షేర్ చేశాయి. బాలికను బెదిరించి, క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేశారని ఇరు పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు.. బాలిక తరఫు న్యాయవాది మాత్రం ఆ వీడియో ఏఐ జనరేటెడ్ కాదని, అందులో ఉందని ఆమెనేనని వ్యాఖ్యానించారు. కానీ, ఆ వీడియో ఎప్పుడు తీశారనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.జులై 23న జంతర్ మంతర్ నీట్ నిరసనల సమయంలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సదరు బాలిక తిట్టిపోసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చాందెల్ ఫిర్యాదు చేయడంతో జూలై 29న నోయిడాలోని ఎక్స్ప్రెస్వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం కేసును దర్యాప్తు కోసం ఢిల్లీకి బదిలీ చేశారు. తొలుత ఆమె వయసును పోలీసులు ఎఫ్ఐఆర్లో తప్పుగా పేర్కొన్నారు. అయితే.. తన వయసు 15 ఏళ్లేనని.. కొందరు రెచ్చగొట్టి అలా మాట్లాడించారని ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పింది.మకాం మార్చేసి..జంతర్ మంతర్ ఘటన వివాదం, కేసు భయంతో ఆమె కుటుంబం ఆందోళనకు గురైంది. తమకు వేధింపులు వస్తున్నాయని, తన బిడ్డ చేసిన తప్పును పెద్ద మనుసుతో మన్నించాలని తల్లి, ప్రధాని మోదీని వేడుకుంది. ఆ తర్వాత నోయిడాలోని నివాసాన్ని ఖాళీ చేసి ప్రస్తుతం హరియాణాలో తల్లిదండ్రులతో ఉంటున్నట్లు తెలిసింది.‘యువతకు మరో అవకాశం ఇవ్వాలి’ఈ వివాదంపై స్పందించిన ప్రధాని మోదీ.. ఈ ఘటనలో పాల్గొన్న యువతపై కఠిన చర్యలకు బదులుగా వారిని క్షమించి మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. దీంతో వివాదం క్రమంగా సద్దుమణిగినట్లు కనిపించింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో ఈ వ్యవహారం మళ్లీ రాజకీయ చర్చకు వచ్చింది. ఇదీ చదవండి: డింపుల్.. మామూలు దూకుడు కాదది! -
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ!
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే మూడు శక్తులు.. వారి భేటీపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా సోమవారం ప్రారంభమయ్యే షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపైకి రానుండటంతో.. సరిహద్దు ఉద్రిక్తతల నుంచి ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వరకు కీలక అంశాలపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మోదీ-జిన్పింగ్ భేటీపై అందరి చూపూ నిలిచింది.బిష్కెక్ వేదికగా సోమవారం 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు పలువురు దేశాధినేతలు హాజరుకానున్నారు. ఎస్సీవో ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సదస్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలు వంటి అంశాలతో పాటు వాణిజ్యం, ఇంధనం, రవాణా అనుసంధానం, డిజిటల్ సహకారంపై నేతలు చర్చించనున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ యుద్ధం, ఇతర ప్రాంతీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.బిష్కెక్కు చేరుకున్న మోదీఉజ్బెకిస్థాన్లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఆదివారం బిష్కెక్ చేరుకున్నారు. కిర్గిజిస్థాన్ క్యాబినెట్ మంత్రుల మండలి చైర్మన్ అడిల్బెక్ కసిమలియేవ్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శనతో మోదీకి ఘన స్వాగతం లభించింది.కీలక నేతలతో ద్వైపాక్షిక భేటీలుఈ సదస్సు సందర్భంగా మోదీ కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు జపరోవ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు ఇతర ఎస్సీవో దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్.. జిన్పింగ్, పెజెష్కియాన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. -
ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
తాష్కెంట్: ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఉజ్బెకిస్తాన్ దేశ అత్యున్నత పురస్కారమైన " ఆర్డర్ ఆఫ్ ఒలియ్ దురజాలీ దోస్త్లిక్" ను మోదీకి ప్రధానం చేశారు. దేశ అధ్యక్షుడు మిర్జియో స్వయంగా ఈ పురస్కారాన్ని మోదీకి అందజేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ పురస్కారాన్ని భారత్- ఉజ్బెకిస్తాన్ శాశ్వత బంధానికి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.కాగా రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ చేరుకున్నారు. తాష్కెంట్లో ‘యోగా ఫెడరేషన్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్’ నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. ఉజ్బెకిస్థాన్లో యోగాకు విశేష ఆదరణ లభిస్తోందని, ప్రజలను యోగాతో అనుసంధానం చేసినందుకు అక్కడి అధ్యక్షుడికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. యోగా ద్వారా ఇరు దేశాల సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుకుంటాయని, ప్రజల మధ్య స్నేహం మరింత బలపడుతుందని అన్నారు.అంతకుముందు తాష్కెంట్ విమానాశ్రయంలో ప్రధానికి ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా అధ్యక్ష భవనంలో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్యారంగాల్లో సహకారాన్ని ఇరు దేశాధినేతలు సమీక్షించనున్నారు. ‘వికసిత్ భారత్ 2047’, ‘ఉజ్బెకిస్థాన్-2030’ అభివృద్ధి లక్ష్యాలపై సమాలోచనలు జరుపుతారు. అలాగే తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారకం, మహాత్మా గాంధీ కేంద్రాన్ని సైతం ప్రధాని సందర్శించనున్నారు.మోదీ రాక సందర్భంగా తాష్కెంట్లోని ప్రముఖ హోటల్ హిల్టన్తో పాటు చారిత్రక కట్టడాలను భారత త్రివర్ణ పతాక కాంతులతో ముస్తాబు చేశారు. అక్కడి 16 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు, ప్రవాసులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఉజ్బెకిస్థాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ కిర్గిజ్ రిపబ్లిక్లోని బిష్కెక్కు వెళ్లి 26వ ఎస్సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. -
ఉజ్బెకిస్థాన్లో ప్రధాని మోదీ యోగా సందడి
తాష్కెంట్: రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్థాన్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, తాష్కెంట్లో ‘యోగా ఫెడరేషన్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్’ నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. ఉజ్బెకిస్థాన్లో యోగాకు విశేష ఆదరణ లభిస్తోందని, ప్రజలను యోగాతో అనుసంధానం చేసినందుకు అక్కడి అధ్యక్షుడికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. యోగా ద్వారా ఇరు దేశాల సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుకుంటాయని, ప్రజల మధ్య స్నేహం మరింత బలపడుతుందని అన్నారు.అంతకుముందు తాష్కెంట్ విమానాశ్రయంలో ప్రధానికి ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా అధ్యక్ష భవనంలో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్యారంగాల్లో సహకారాన్ని ఇరు దేశాధినేతలు సమీక్షించనున్నారు. ‘వికసిత్ భారత్ 2047’, ‘ఉజ్బెకిస్థాన్-2030’ అభివృద్ధి లక్ష్యాలపై సమాలోచనలు జరుపుతారు. అలాగే తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారకం, మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు.మోదీ రాక సందర్భంగా తాష్కెంట్లోని ప్రముఖ హోటల్ హిల్టన్తో పాటు చారిత్రక కట్టడాలను భారత త్రివర్ణ పతాక కాంతులతో ముస్తాబు చేశారు. అక్కడి 16 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు, ప్రవాసులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఉజ్బెకిస్థాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ కిర్గిజ్ రిపబ్లిక్లోని బిష్కెక్కు వెళ్లి 26వ ఎస్సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. Uzbekistan loves Yoga! pic.twitter.com/1AtlHCN0kF— Narendra Modi (@narendramodi) August 30, 2026 -
డ్రగ్స్ రహిత దేశమే లక్ష్యం: ‘మన్ కీ బాత్’లో మోదీ
న్యూఢిల్లీ: భారతదేశం ‘వికసిత భారత్’గా మారాలంటే దేశం మాదకద్రవ్య రహితంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. యువతను మత్తుపదార్థాలకు దూరంగా ఉంచడం, దేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ దిశగా చేపట్టిన మత్తు పదార్థాల విముక్తి ప్రచారంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత చురుగ్గా పాల్గొంటున్నారని ప్రశంసించారు. మాదకద్రవ్యాల బారిన పడితే కుటుంబాలు, సమాజం తీవ్రంగా దెబ్బతింటాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా వినూత్న నినాదాలు, పాటలు, లఘు నాటకాల ద్వారా వివిధ భాషల్లో విస్తృత అవగాహన కల్పించాలని కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు.ఆగస్టు నెలలో జాతీయ చేనేత దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం వంటి సందర్భాలు దేశభక్తి భావనను మరింత పెంచాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో ప్రత్యేకమని, ‘సూర్యపథ్ తిరంగా’ ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించిందని గుర్తుచేశారు. ‘పీఎం స్వనిధి’ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకోగలిగారని చెప్పారు.అమర్నాథ్ యాత్రలో వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమించారని, యాత్రలో గుర్రాలు, కంచరగాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ‘స్వచ్ఛ జ్యోతి’ను వెలిగించారని ప్రస్తావించారు. రాబోయే పండుగల సీజన్లో ‘ఓకల్ ఫర్ లోకల్’కు ప్రాధాన్యమిస్తూ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఇది కూడా చదవండి: నేపాల్ వరదలు: 734కు చేరిన మృతుల సంఖ్య -
ఉజ్బెకిస్తాన్లో మోదీకి ఘన స్వాగతం
తాష్కెంట్: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉజ్బెకిస్తాన్ చేరుకున్నారు. తాష్కెంట్ విమానాశ్రయంలో మోదీకి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయేవ్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తుండడం ఇది నాలుగోసారి. భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఆయన దిశగా కృషి చేయనున్నారు. అధ్యక్షుడు మిర్జియోయేవ్తో ప్రతినిధుల స్థాయి చర్చలు నిర్వహించబోతున్నారు. ఉజ్బెకిస్తాన్లో అడుగు పెట్టిన తర్వాత రాజధాని తాష్కెంట్లోని యాంగీ ఉజ్బెకిస్తాన్ పార్కును మోదీ సందర్శించారు. స్వాతంత్య్ర స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా ఆయన వెంట అధ్యక్షుడు మిర్జియోయేవ్ కూడా ఉన్నారు. వారిద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. -
రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మనుస్మృతికి, డా. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు.ఆర్ఎస్ఎస్, బీజేపీ మనుస్మృతిని అనుసరిస్తున్నాయి. మనుస్మృతి ఆధారంగానే దళితులపై వివక్ష కొనసాగుతోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభలను వాళ్లు శుద్ధీకరణ చేస్తున్నారు. ఈ ఘటనే వాళ్ల వివక్షకు నిదర్శనం. అంటరాని తనం పాటిస్తున్నారు.. అది నేరం. దేశంలో దళితులపై అనాదిగా కొనసాగుతున్న అణచివేతకు ఇప్పటికీ పూర్తిగా తెరపడలేదని రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో దళిత విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించడం, ‘శుద్ధీకరణ’ పేరుతో వివక్ష చూపడం వంటి ఘటనలు అంటరానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కులాలకు చెందిన వాడినని ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ.. బీజేపీ నేతలు మాత్రం పాత కుల వివక్ష విధానాలనే కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి కొత్త సంస్థలు, కొత్త పేర్లు, కొత్త విభాగం వచ్చినా.. దాని విధానాలు మాత్రం మారలేదని విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వం, హక్కులను కాపాడటం కోసమే తమ పోరాటమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారుLIVE: Special Congress Party Briefing by LoP Shri @RahulGandhi at AICC HQ, New Delhi https://t.co/f6sL6o2vHX— Congress (@INCIndia) August 29, 2026 ఇదీ చదవండి: సోనియా బుక్.. అందుకే బీజేపీ భయపడుతోందా? -
దేశ క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారుల అంకితభావం, పట్టుదలను ప్రశంసిస్తూ.. యువతను ప్రేరేపించడంలో క్రీడల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. క్రీడాభిమానుల అభిరుచి దేశం గర్వించేలా చేస్తుందని అన్నారు.ఈ సందర్భంగా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు నివాళులర్పించారు. ధ్యాన్చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తోందని తెలిపారు. కాగా, ప్రతి ఏడాది ఆగస్టు 29న మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే.క్రీడలు గెలుపు కోసం మాత్రమే కాదు..!జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా దేశ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.క్రీడలు కేవలం గెలుపు కోసం మాత్రమే కాదని ఆయన అన్నారు. కలలు కనడం, కష్టపడి పనిచేయడం, వైఫల్యాలను ఎదుర్కోవడం, వాటిని అధిగమించి ముందుకు సాగడం వంటి జీవిత పాఠాలను క్రీడలు నేర్పుతాయని చెప్పారు. ఎక్కువ మంది యువత క్రీడల్లో పాల్గొనాలని ధవన్ పిలుపునిచ్చారు.చదవండి: టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా -
నేటి నుంచి ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నుంచి ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్లలో నాలుగు రోజుల పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడంతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆగస్టు 29 నుంచి 30 వరకు ఉజ్బెకిస్థాన్లో పర్యటిస్తారు.అనంతరం ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు ఆగస్టు 31న బిష్కెక్కు చేరుకుంటారు. ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని సమావేశం కానున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. భారత్-రష్యా సంబంధాల సమగ్ర సమీక్ష ఈ భేటీలో ప్రధానాంశంగా ఉండనుంది. 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఎస్సీవో సదస్సు ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై ప్రధానంగా దృష్టి సారించనుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితర నేతలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.సదస్సు ప్రసంగంలో భద్రత, అనుసంధానత, అవకాశాలు (సెక్యూరిటీ, కనెక్టివిటీ, అపార్చునిటీ) వంటి భారత ప్రాధాన్యతలను మోదీ వివరించనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలను ఎదుర్కోవడమే ఎస్సీవో ప్రధాన లక్ష్యమని విదేశాంగ శాఖ కార్యదర్శి (వెస్ట్) సిబి జార్జ్ తెలిపారు. భారత్ 2017లో ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరింది. కిర్గిజిస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీ ఆరో ‘వరల్డ్ నోమాడ్ గేమ్స్’ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఉజ్బెకిస్థాన్కు ప్రధాని వెళ్లడం ఇది నాలుగోసారి. ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య తదితర రంగాల సహకారాన్ని ఇరు దేశాల నేతలు సమీక్షించనున్నారు. తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారకార్థం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని, తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు.ఇది కూడా చదవండి: మ్యూజియంలో భారీ చోరీ.. 200 క్యారెట్ల వజ్రాల హారం మాయం -
సాటిలేని ప్రభావం చూపిన జన్ధన్ యోజన
న్యూఢిల్లీ: ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు ఇవ్వాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన(పీఎంజేడీవై)కు 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పథకం అపూర్వమైన ప్రభావాన్ని, గొప్ప ఫలితాలను సాధించిందని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. జన్ధన్ యోజన సాటిలేని ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అలాగే జన్ధన్ యోజనపై ప్రభుత్వం చేసిన పోస్టును షేర్ చేశారు. పథకం ఘనతలను ప్రస్తావించారు. పీఎంజేడీవైని ప్రధాని మోదీ 2014 ఆగస్టు 28న ప్రారంభించారు.ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులకు నాంది పలికింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితానికి దిక్సూచిగా నిలిచింది. భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. బ్యాంకు సేవలు అందుబాటులో లేని ప్రతి వయోజనునికి, ఎలాంటి కనీస నిల్వ అవసరం లేకుండా, నిర్వహణ రుసుముల భారం లేకుండా ఈ పథకం ద్వారా ప్రాథమిక బ్యాంకు ఖాతా లభిస్తుంది. ప్రతి ఖాతాతోపాటు ఉచితంగా రూపే డెబిట్ కార్డు కూడా పొందవచ్చు. రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఖాతాదారులు రూ.10,000 వరకు ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు. ఇది అత్యవసర సమయాల్లో రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. 33 కోట్ల మంది మహిళలకు ఖాతాలు బ్యాంకు ఖాతా అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదని.. ఒక ఆర్థిక గుర్తింపుగా నిలుస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. 2015లో 14.7 కోట్లుగా ఉన్న జన్ధన్ ఖాతాల సంఖ్య 2026 నాటికి 59 కోట్లకు చేరుకున్నాయి. తద్వారా కోట్లాది మంది ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి చేరారు. అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం విస్తరించింది. నేడు దాదాపు 33 కోట్ల మంది మహిళలు జన్ధన్ ఖాతాలను కలిగి ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇది మొత్తం జన్ధన్ ఖాతాదారులలో 56 శాతం కావడం విశేషం.అధికారిక బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడం వల్ల ఎక్కువ మంది మహిళలు ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములవుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 46 కోట్ల జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. ఇవి మొత్తం జన్ధన్ ఖాతాల్లో 78 శాతం. కోట్లాది జన్ధన్ ఖాతాలు, గ్రామీణ ప్రాంతాలకు సేవల విస్తరణ, మహిళల భాగస్వామ్యం, చివరి వ్యక్తి వరకు బ్యాంకింగ్ సేవలు చేరడం వంటివి నేడు భారతదేశ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రతీకగా నిలుస్తున్నాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. -
జెన్ ఆల్ఫాతో మోదీ రాఖీ వేడుక.. హై-ఫైవ్లు ఇస్తూ
ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు హై-ఫైవ్లు ఇస్తూ, వారితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ మోదీ రాఖీ సంబరాలు జరుపుకున్నారు. మోదీకి చిన్నారులు రాఖీ కట్టారు.కాగా, రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య పవిత్ర బంధానికి ప్రతీకగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం ప్రజలు ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయ ఆచారాలతో రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు సామాజిక మాధ్యమాల ద్వారా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.“రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ మీ అందరి జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆప్యాయత, అనురాగం, పరస్పర విశ్వాసంతో కూడిన బంధాలు ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండాలి” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు.లోక్సభ స్పీకర్ సందేశంకుటుంబ విలువలు, సంస్కృతికి ప్రతీకగా రాఖీ పౌర్ణమిని అభివర్ణించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. ఈ పండుగ కేవలం పవిత్రమైన దారాన్ని కట్టే వేడుక మాత్రమే కాదని అన్నారు. విశ్వాసం, గౌరవం, ప్రేమ, జీవితాంతం కలిసి ఉండాలనే ప్రతిజ్ఞకు ఇది ప్రతీక అని తెలిపారు.ఇదీ చదవండి: యశ్ ‘టాక్సిక్’కు అన్నామలై రివ్యూమహిళల గౌరవం, ఆత్మగౌరవం, హక్కులు, కలలతో రక్షణ అనే భావన కూడా ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుమార్తె, ప్రతి సోదరి సురక్షితంగా, గౌరవంగా ఉన్నప్పుడే దేశం మరింత బలంగా మారుతుందని ఆయన అన్నారు. -
రాఖీ పండుగ సెలబ్రేషన్స్ లో ప్రముఖులు (ఫొటోలు)
-
విజయ్ మరో సంచలనం.. మోదీ, రాహుల్ తర్వాత ప్లేస్!
తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ జాతీయ రాజకీయాల్లోనూ తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాత.. తదుపరి ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా టుడే–సీ ఓటర్ నిర్వహించిన తాజా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) సర్వేలో ఈ ఆసక్తికరమైన ఫలితం వెల్లడైంది.ప్రధాని పదవికి తదుపరి ఎంపికగా ఎవరిని కోరుకుంటున్నారని ప్రశ్నించగా.. నరేంద్ర మోదీకి 48.7 శాతం మంది, రాహుల్ గాంధీకి 27.1 శాతం మంది మద్దతు తెలిపారు. అనూహ్యంగా విజయ్కు ఏకంగా 9.2 శాతం మంది మద్దతు పలికారు. దీంతో ఆయన మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి రెండేళ్లు కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థిగా విజయ్ పేరు వినిపించడం చర్చనీయాంశంగా మారింది.విజయ్ తర్వాత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 2 శాతంతో, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ 1.7 శాతంతో, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే 1.3 శాతంతో, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 1.2 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఆ రకంగానూ విజయ్కు ఆదరణేప్రధాని ఎంపిక ప్రశ్నతో పాటు.. ప్రస్తుత ప్రతిపక్ష నేతల్లో కూటమికి నాయకత్వం వహించేందుకు ఎవరు సమర్థులని అడిగినప్పుడు కూడా విజయ్ మంచి స్థానంలో నిలిచారు. ఈ విభాగంలో రాహుల్ గాంధీ 29 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. విజయ్ 12.2 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. మమతా బెనర్జీ 8.5 శాతం, కేజ్రీవాల్ 7.5 శాతం, అఖిలేశ్ యాదవ్ 6.9 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.రెండేళ్లలోనే సీఎం.. ఇప్పుడేమోవిజయ్ 2024లో టీవీకేను స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత రెండేళ్లలోనే జరిగిన తొలి ఎన్నికల్లో టీవీకే విజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారించారు. తొలి ఏడాది పాలన కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ఆయన పేరు ప్రధాని అభ్యర్థుల జాబితాలో వినిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఇటీవల టీవీకే నేతలు కూడా విజయ్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలను బహిరంగంగానే ప్రారంభించారు. 2029 లోక్సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే సంకేతాలు ఇస్తున్నారు.‘దక్షిణం నుంచి ప్రధాని రావాలి’విజయ్ ప్రధాని అభ్యర్థిత్వంపై టీవీకే నేతల వ్యాఖ్యలు కూడా ఇటీవల జోరందుకున్నాయి. ఆగస్టు 18న తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడిన టీవీకే మంత్రి శరత్కుమార్.. విజయ్ భవిష్యత్ ప్రధాని అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు.అంతకుముందు టీవీకే నేత, తమిళనాడు ప్రజా పనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున కూడా దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావడం ఖాయమని, అలాంటి నాయకుడు తమిళనాడు నుంచి ఎదగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా వెలువడిన ఇండియాటుడే సర్వే ఫలితాలు టీవీకే వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది.25 వేల మందితో తాజా సర్వేఇండియా టుడే గ్రూప్ దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో భాగంగా తాజా సర్వేను సీ ఓటర్ నిర్వహించింది. జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. దీనికి అదనంగా గత ఆరు నెలల్లో సీ ఓటర్ నిర్వహించిన సాధారణ ట్రాకింగ్ సర్వేలలోని 91,795 ఇంటర్వ్యూలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.అయితే 2029 లోక్సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సర్వేలో వ్యక్తమైన ప్రజాదరణను దేశవ్యాప్తంగా ఓట్లుగా, కూటమిగా మార్చుకోవడం విజయ్కు పెద్ద సవాలే. అయినప్పటికీ.. తమిళనాడు రాజకీయాలకే పరిమితమైన నాయకుడిగా కాకుండా, జాతీయ స్థాయిలో ప్రధాని రేసులో పేరు వినిపించే స్థాయికి విజయ్ చేరుకోవడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: దటీజ్ విజయ్.. తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త సంప్రదాయం -
మోదీ హవా తగ్గిందా? లేదా?.. తాజా సర్వేలో షాకింగ్ లెక్కలు
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా నిజంగా తగ్గిందా?.. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పరిస్థితి ఏంటి?.. జెన్జీ ఎఫెక్ట్ను తట్టుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతుందా?. అయితే ఆ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇండియా టుడే–సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) సర్వే వెల్లడించింది.మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కాస్త సర్ప్రైజింగ్ విషయాలే కనిపించాయి. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఏకంగా 326 సీట్లు వస్తాయని తెలిపింది. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి 261 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుని 106 సీట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. అయితే ఇదే పోల్ ఏజెన్సీ ఈ ఏడాది జనవరిలో జరిపిన సర్వే కంటే ఎన్డీయేకు ఇప్పుడు కాస్త ప్రతికూలతే కనిపిస్తోంది. జనవరి సర్వేతో పోలిస్తే ఎన్డీయే కూటమి బలం 26 సీట్లు తగ్గడం గమనార్హం. ఆ టైంలో ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని ఇదే సర్వే అంచనా వేసింది. ఇందులో బీజేపీకి పార్టీకి 287 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఆ సంఖ్య ఇప్పుడు 26 సీట్లు తగ్గినట్లైంది. అయినప్పటికీ.. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒరిజినల్గా బీజేపీ సాధించిన 240 సీట్ల కంటే తాజా అంచనా కూడా ఎక్కువగా ఉండటం విశేషం.మరోవైపు కాంగ్రెస్ బలం గణనీయంగా పెరిగే అవకాశముందని సర్వే తెలిపింది. కాంగ్రెస్కు 106 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జనవరి సర్వేతో పోలిస్తే ఇది 26 సీట్ల పెరుగుదల. అప్పట్లో కాంగ్రెస్కు 80 సీట్లు వస్తాయని అంచనా వేశారు.ఇండియా కూటమికి 185మొత్తం 543 లోక్సభ స్థానాల్లో.. ఎన్డీయే కూటమికి 326 సీట్లు వస్తాయని చెప్పగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 185 సీట్లు వస్తాయని తాజా ఎంవోటీఎన్ సర్వే అంచనా వేసింది. జనవరి సర్వేతో పోలిస్తే ఇది స్వల్పంగా మాత్రమే పెరిగింది. అప్పట్లో ఇండియా కూటమికి 182 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఈ కూటమి వాస్తవంగా.. 234 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.ఎన్డీయే ఓటు షేర్ 45.1 శాతంఓటు శాతం పరంగానూ ఎన్డీయే ముందంజలోనే ఉంది. తాజా సర్వే ప్రకారం ఎన్డీయేకు 45.1 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. జనవరి సర్వేలో ఇది 47 శాతంగా ఉంది. మరోవైపు ఇండియా కూటమి ఓటు షేర్ స్వల్పంగా పెరిగి 39.1 శాతానికి చేరుతుందని అంచనా. జనవరిలో ఇది 39 శాతంగా ఉంది.400 పార్కు దూరమే..!ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఇప్పటికీ ఓటర్లలో గట్టి మద్దతు ఉందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే 2024 ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన ‘400 పార్’ నినాదానికి ఈ అంచనా చాలా దూరంలో ఉంది. ముఖ్యంగా యువత, విద్యార్థులకు సంబంధించిన అంశాలు బీజేపీకి సవాలుగా మారుతున్నాయని సర్వే విశ్లేషణ పేర్కొంది.పరీక్ష పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అవకతవకలు వంటి అంశాలపై యువతలో అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపింది. అదే సమయంలో రాహుల్గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పలు కీలక అంశాలపై బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం ఆ పార్టీకి కొంత మేర రాజకీయంగా కలిసొస్తున్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి.ఇండియా టుడే గ్రూప్ దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో భాగంగా ఈ తాజా అంచనాలను రూపొందించారు. సీ ఓటర్ నిర్వహించిన ఈ సర్వేలో జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. దీనికి అదనంగా గత ఆరు నెలల్లో సీ ఓటర్ నిర్వహించిన రెగ్యులర్ ట్రాకింగ్లో భాగంగా సేకరించిన 91,795 ఇంటర్వ్యూలను కూడా విశ్లేషణలో పరిగణనలోకి తీసుకున్నారు.ఇదీ చదవండి: విదేశీ పర్యటనకు మోదీ.. పుతిన్ భేటీకి ఛాన్స్? -
రూ.36,000 కోట్ల చక్కెర కుంభకోణం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ పాలనలో రూ.36,000 కోట్ల చక్కెర కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా గురువారం ఆరోపించారు. పండుగ సీజన్లో చక్కెర ధరలు పెరగడం వల్ల అక్రమ నిల్వదారులు, బ్లాక్ మార్కెట్ వ్యాపారులు లాభపడేలా మోదీ సర్కార్ సహరిస్తోందని విమర్శించారు. దేశంలో చక్కెర కొరత గురించి ఏప్రిల్ నెలలోనే ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకుండా మౌనంగా ఉండిపోయిందని ఆక్షేపించారు. దీనివల్ల చక్కెర ధర కిలోకు రూ.40 నుంచి రూ.75కు పెరిగిందని పేర్కొన్నారు. ఆగస్టు, నవంబర్ మధ్య సుమారు 12 మిలియన్ టన్నుల చక్కెర వినియోగం జరుగుతుందని, ప్రజలు కిలోకు అదనంగా రూ.30 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దసరా, దీపావళి పండుగల సమయంలో ప్రజలు చక్కెర ధరల పెరుగుదల భారాన్ని మోయాల్సి ఉంటుందన్నారు. ఈ సొమ్మంతా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుందన్నారు. బ్లాక్ మార్కెట్ వ్యాపారుల ద్వారా ప్రజలను బహిరంగంగా దోచుకోవడానికి ఇది మోదీ ప్రభుత్వం వేసిన కొత్త ఎత్తుగడ అని ధ్వజమెత్తారు. మధుమేహాన్ని(డయాబెటిస్) తరిమికొట్టేందుకే ప్రధాని మోదీ చక్కెర ధరను పెంచి, దానిని పెట్రోల్లో కలిపారంటూ బీజేపీ నాయకులు ప్రజలకు జ్ఞానోదయం కలిగిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
రేపటి నుంచి మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్లో ఆయన నాలుగు రోజులపాటు పర్యటిస్తారు. కిర్గిజిస్తాన్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) వార్షిక సదస్సుకు హాజరవుతారు. తొలుత ఈ నెల 28, 29న ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేర్వేరు కీలక రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయెవ్తో సమావేశమై ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహిస్తారు. తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని, తాషె్కంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా మోదీ సందర్శించనున్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటన పూర్తయిన తర్వాత కిర్గిజిస్తాన్ రాజధాని బిషె్కక్కు చేరుకుంటారు. ఎస్సీఓ సదస్సులో ప్రసంగిస్తారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. ఎస్సీఓలో భారత్కు 2017 నుండి పూర్తి స్థాయి సభ్యత్వం ఉంది. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఎస్సీఓ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఆయన ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్లు సమాచారం. అలాగే మధ్య ఆసియా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన ఆరో ‘వరల్డ్ నోమాడ్ గేమ్స్’ ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. -
ఒలింపిక్స్లో మన భాగస్వామ్యం పెరగాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఖేలో ఇండియా డైలాగ్’ను ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడలంటే కేవలం పతకాలు సాధించడమే కాదని, వాటిని దేశ నిర్మాణ ప్రక్రియలో అంతర్భాగం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ‘ఒలింపిక్స్లో ఎన్నో రకాల క్రీడలు ఉన్నాయి. కానీ అందులో సగం విభాగాల్లో కూడా భారత జట్లు కనీసం పాల్గొనడం లేదు’ అని మోదీ వ్యాఖ్యానిస్తూ, దీనిని ఒక ‘చేదు నిజం’గా అభివర్ణించారు. 2024 పారిస్ ఒలింపిక్స్లో మొత్తం 32 క్రీడలు ఉండగా, భారత్ కేవలం 16 విభాగాల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించింది. పతకాల పట్టికలో అధిక సంఖ్యలో ఉండే విభాగాల్లో మనం అసలు పోటీకే వెళ్లడం లేదు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాలు ఆయా క్రీడల్లో పతకాలు సాధిస్తుంటే, మనం మాత్రం కనీస ప్రాతినిధ్యం కూడా చూపలేకపోతున్నాం. మన పతకాల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాలంటే, ఆయా క్రీడా విభాగాల్లోనూ పట్టు సాధించాల్సిన అవసరం ఉంది అని ప్రధాని వివరించారు.ఒలింపిక్స్లో దేశ భాగస్వామ్యాన్ని మెరుగుపరిచే దిశగా 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల బాలబాలికల్లోని ప్రతిభను వెలికితీసేందుకు దేశవ్యాప్త టాలెంట్ హంట్ను చేపడుతున్నట్లు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఎర్రకోట వేదికగా ఆగస్టు 15న దేశ క్రీడా ముఖచిత్రంపై ఒక స్పష్టమైన దృక్పథాన్ని ఆవిష్కరించాను. క్రీడలంటే కేవలం పతకాలకే పరిమితం కాదు. వికసిత భారత్ నిర్మాణంలో దేశ క్రీడా శక్తిని, యువశక్తిని ఏకం చేసే ఒక మహా యజ్ఞం ఇది’ అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. యువత దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు. దీనిలో ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోని రెండు కళాశాలల నుంచి యువత భాగస్వాములయ్యారు. క్రీడలను కేవలం ప్రతిభను వెలికితీయడానికే కాకుండా, యువజన నాయకత్వం, పౌర బాధ్యత, దేశ నిర్మాణంలో కీలక సాధనంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య లక్ష్యంతో పాటు ‘వికసిత్ భారత్’ దిశగా యువతను నడిపించేందుకు ఈ వేదిక దోహదపడనుంది. ఈ కార్యక్రమంలో ‘యువ సంవాద్’ పేరుతో అత్యాధునిక వసతులు, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్ ద్వారా దేశీయ క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. -
ఆకాశమే హద్దు అభద్రత వద్దు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింథ్వారా అనే మారుమూల గ్రామం నుంచి వచ్చిన పాయల్ అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా గేమింగ్ ఇన్ ఫ్లుయెన్సర్లలో ఒకరు. ‘పాయల్ గేమింగ్’ పేరుతో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్లలో లక్షలాదిగా అభిమానులను సంపాదించుకున్నారు. మన దేశంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ–స్పోర్ట్స్, గేమింగ్ రంగంలో దేశవ్యాప్త పాపులారిటీతోపాటు మొబైల్స్ అవార్డ్స్ జెడ్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్నూ, గేమింగ్ క్రియేటర్ అండ్ ఫిమేల్ ఆఫ్ ది ఇయర్ గా జాతీయ స్థాయి గుర్తింపునూ దక్కించుకున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా జరిగిన గేమింగ్ ఇంటరాక్షన్, రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొనడం ద్వారా వార్తల్లో నిలిచారు. హైదరాబాద్లో తాజాగా నిర్వహించిన సంగీత–సాంకేతిక–గేమింగ్ ఉత్సవం రాయల్స్టాగ్ బూమ్బాక్స్లో పాల్గొన్న సందర్భంగా ఈ భారతీయ అగ్రగామి గేమర్... పాయల్ ధారే ‘సాక్షి’కి ఇచ్చినప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే..అమ్మ సంకోచం.. నాన్న సరే...సోషల్ మీడియా అమ్మాయిలకు మంచిది కాదనే అపనమ్మకాల మధ్య ఆన్ లైన్ గేమింగ్, యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేస్తానని చెప్పినప్పుడు మా అమ్మ అంగీకరించలేదు. అయితే నాన్న మాత్రం నా పట్టుదల గమనించాక నాకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత నిదానంగా అమ్మను కూడా ఒప్పించగలిగాను. వ్యతిరేకతను ఎదుర్కొన్నా...గేమింగ్ ప్రయాణం ప్రారంభించిన కొత్తలో చాలా వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొన్నాను. నా చుట్టూ వచ్చిన నెగెటివిటీ, ముఖ్యంగా మగవారి నుంచి వచ్చిన విమర్శలకు తొలిదశలో తడబడినా, ఆ తర్వాత పట్టించుకోకుండా ముందుకు సాగాను. గేమింగ్ అంటే కేవలం పోటీ మాత్రమే కాదు. ఎంటర్టైన్ చేయవచ్చు, క్యాజువల్ గేమింగ్ చేయవచ్చు, ముఖ్యంగా మనలా మనం ఉండొచ్చు.. అదే నాకు స్ఫూర్తిని ఇచ్చింది. లక్షలాది మందికి నన్ను చేరువ చేసింది. ప్రధానితో భేటీ.. ప్రయాణంలో మేటి...నా గేమింగ్ ప్రయాణంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం అత్యంత ముఖ్యమైన మైలురాయి. ఆయనను వ్యక్తిగతంగా కలిసి దాదాపు రెండు గంటల పాటు మాట్లాడటం కలలో కూడా ఊహించని గొప్ప అనుభవం. గేమింగ్, గేమింగ్ పరిశ్రమ, ఈ–స్పోర్ట్స్తో పాటు భారత్లో గేమ్ డెవలప్మెంట్ గురించి ఆయన నాతో చర్చించారు. ఆ సంభాషణలోని ప్రతిమాటా జీవితంలో మరచిపోలేను.కెరీర్గా బెస్ట్... బ్యాకప్ ఫస్ట్...ప్రపంచవ్యాప్తంగా చూస్తే గేమింగ్ రంగంలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. మన దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అయితే గేమింగ్ను కెరీర్గా ఎంచుకోవాలనుకునే యువత ముందుగా తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. అదే సమయంలో చదువును వదిలిపెట్టకూడదు. నేను గేమింగ్ ప్రారంభించినప్పటికీ కొద్దికొద్దిగా పేరు ప్రఖ్యాతులు రావడం మొదలైనప్పటికీ కూడా చదువు కొనసాగిస్తూనే ఉన్నా. ఈ ఆటల పోటీ ప్రపంచంలో ఈ రోజు మీరు బాగా ఆడొచ్చు, రేపు మీకంటే మెరుగైన ఆటగాడు రావచ్చు. అందుకే గేమింగ్తోపాటు ఒక బ్యాకప్ ఆప్షన్ తప్పనిసరి. గేమింగ్ను సెకండరీగా తీసుకుని ముందుకెళ్లాలి. ఆన్ స్క్రీన్... ఆఫ్ స్క్రీన్... ఒకటే నేను‘పాయల్ గేమింగ్’గా అందరికీ తెలిసిన నాకు వ్యక్తిగత జీవితంలోని నాకు పెద్దగా తేడా ఉండదు. నా సహజమైన స్వభావాన్ని దాచుకోవాలనో, మార్చుకోవాలనో అనుకోను. ఇటీవల నేను పాల్గొన్న అలయెన్స్ రియాలిటీ షోలో చాలా మంది నా స్వభావాన్ని గమనించారు. నేను ఎప్పుడూ ఇలాగే అందరితో మాట్లాడతా. సరదాగా ఉంటానని అందరికీ అర్ధమైంది. అమ్మాయిలూ... అలా చేయండిఅమ్మాయిలకి నా సలహా ఒకటే...‘మీకు నచ్చిన పని మనస్ఫూర్తిగా చేయండి. చుట్టూ ఉన్నవాళ్లు చేసే విమర్శలు, మాటలను బట్టి అపోహలు, అభధ్రతా భావం పెంచుకోకండి. మీరు మీలా ఉండండి. మీరు ఎంచుకున్నది మీకు నచ్చినది ఒకటే అయినప్పుడు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అభిమానుల ప్రేమే.. ఆశీర్వాదం..దేశంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరైనా వచ్చి ‘మీరు పాయల్ గేమింగ్ కదా.. మీరంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పడం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నాకు అత్యుత్తమ అనుభూతి. నాకు లభిస్తున్న ప్రేమ ఒక ఆశీర్వాదం. కుటుంబంతో ఉన్నప్పుడు అభిమానులు ఫొటో కోసం వస్తే మా వాళ్లు కూడా గర్వంగా ఫీలవుతారు. అందుకే పాపులారిటీ వల్ల ప్రైవసీ కోల్పోయానని అనుకోవడం లేదు. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను.– సత్యబాబు, సాక్షి -
నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోనులో మాట్లాడిన మోదీ
ఢిల్లీ: నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. నేపాల్లో ఆకస్మిక వరదలపై మోదీ ఆరా తీశారు. నేపాల్కు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.Spoke to Prime Minister Balendra Shah and conveyed condolences on the loss of lives due to the floods in Nepal. The people of India stand in solidarity with their sisters and brothers in Nepal at this difficult time. India is ready to provide all possible humanitarian…— Narendra Modi (@narendramodi) August 26, 202688 మందిని రక్షించిన నేపాల్ సైన్యంనేపాల్ సైన్యం ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 88 మందిని రక్షించిందని ఆ దేశ సైన్యం ప్రతినిధి తెలిపారు. మైలుంగ్ గ్రామంలో మరో 115 మందిని రక్షించేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గాలింపు, సహాయక చర్యల కోసం 15 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. తిమురే, స్యాబ్రుబేసి, బేత్రావతిలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందిందని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. వరదల కారణంగా త్రిశూలీ జలవిద్యుత్ ప్రాజెక్టు దెబ్బతిందని, పలు ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయాయని పేర్కొంది.ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే కారును కడగడానికి ఏ నీటిని వాడారంటే?ఇప్పటివరకు ఏం జరిగింది?నేపాల్ రాజధాని కాఠ్మాండుకు ఉత్తరంగా ఉన్న రసువాలో బుధవారం తెల్లవారుజామున వరదలు సంభవించాయి.పోలీసుల ప్రకారం రసువాలో ఒకరు, నువాకోట్లో ఏడుగురు, ధాదింగ్లో ఆరుగురు, గోర్ఖాలో నలుగురు మృతి చెందారు.దేశ పర్యాటక బోర్డు ప్రకారం 291 మంది విదేశీయులతో సహా దాదాపు 400 మంది గల్లంతైన ప్రయాణికులను గుర్తించారు.చైనా అధీనంలోని టిబెట్లో భారీ ప్రాణనష్టం జరిగినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ కూడా నివేదించింది.భూకంపం కారణంగా మంచు చరియ విరిగిపడటంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోందని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.రసువాలో తీవ్ర వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారని నేపాల్లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. కోశీ, త్రిశూలీ, నారాయణీ నదుల పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. -
చేపల మార్కెట్కు మోదీ పేరు.. రచ్చరచ్చ!
గాంధీనగర్: గుజరాత్లోని సూరత్ నగరపాలక సంస్థ (ఎస్ఎంసీ) ఆధ్వర్యంలో నిర్మించిన హోల్సేల్ చేపల మార్కెట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టడం వివాదానికి దారితీసింది. నాన్పురా ప్రాంతంలోని లక్కడ్కోట్లో నూతనంగా నిర్మించిన ఈ మార్కెట్ ప్రవేశద్వారం వద్ద ‘శ్రీ నరేంద్ర మోదీ హోల్సేల్ ఫిష్ మార్కెట్’ అని రాసి ఉన్న భారీ బోర్డును ది సూరత్ ఫిష్ మర్చంట్ అసోసియేషన్ (ఎస్ఎఫ్ఎంఏ) ఏర్పాటు చేసింది. ఆ బోర్డుపై ప్రధాని చిత్రపటాన్ని కూడా ముద్రించారు.అయితే ప్రధాని మోదీ పూర్తిగా శాకాహారి అని, జీవితంలో ఎన్నడూ మాంసాహారం ముట్టని ఆయన పేరును చేపల మార్కెట్కు పెట్టడం సరికాదని కొందరు వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎస్ఎంసీ సెంట్రల్ జోన్ అధికారులు.. ఈ పేరుకు ఇంకా అధికారిక అనుమతి లభించలేదని, ఎలాంటి తీర్మానం లేకుండానే బోర్డు పెట్టారని స్పష్టం చేశారు. ఆ బోర్డును వెంటనే తొలగిస్తామని వ్యాపార సంఘం హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ₹3 కోట్ల నిధులతో మార్కెట్ నిర్మాణం జరిగిందని, అందుకే ప్రధాని పేరు పెట్టామని అసోసియేషన్ తెలిపింది.దేశ రాజకీయాల్లో చేపల చుట్టూ వివాదాలు చెలరేగడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే శ్రావణ మాసంలో యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ స్వాగత సభలో చేపల వంటకాలు వడ్డించడం వివాదాస్పదమైంది. అంతకుముందు నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా వండే చేప శాకాహారమేనని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో నవరాత్రుల వేళ తేజస్వీ యాదవ్ హెలికాప్టర్లో చేపలు తింటున్న వీడియో కూడా రాజకీయ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.ఇది కూడా చదవండి: జపాన్లో అద్భుతం: 396 టన్నుల భారీ కోటను కదిలించిన వెయ్యిమంది జనం! -
మోదీ న్యూ కేబినెట్.. BJP కొత్త టీమ్
-
కులగణనలో ఓపెన్ ఫార్మాట్ వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జనాభా లెక్కల సేకరణలో కులాల వివరాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓపెన్ ఫార్మాట్ (స్వేచ్ఛగా కులం పేరును నమోదు చేసే) విధానంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పద్ధతి వల్ల కచ్చితమైన వివరాలు నమోదు కాకపోగా, కులగణన అసలు లక్ష్యమే నీరుగారిపోతుందని రాజ్యసభ, లోక్సభ ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రశ్నావళిని తక్షణమే రద్దు చేయాలని, రాజకీయ పక్షాలు, నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే కొత్త విధానాన్ని ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఖర్గే, రాహుల్ సంయుక్తంగా లేఖ రాశారు. తప్పుడు డేటాకు ఆస్కారం జనాభా లెక్కల్లో కులాల నమోదు కోసం ఎలాంటి కచ్చితమైన ముందస్తు జాబితా లేకుండా ‘ఓపెన్–ఎండెడ్’ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిద్వారా పౌరులు తమ కులం పేరును ఇష్టం వచ్చిన రీతిలో చెప్పుకునే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకే కులానికి వేర్వేరు పేర్లు, ఉప కులాలు, భిన్నమైన స్పెల్లింగ్లు వాడుకలో ఉన్నాయని ఖర్గే, రాహుల్ తమ లేఖలో ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధానం వల్ల ఒకే కులం వేలాది వేర్వేరు పేర్లతో నమోదయ్యే ప్రమాదం ఉందని వివరించారు. దానివల్ల దేశంలో కులాల సంఖ్య లక్షల్లో ఉన్నట్లుగా తప్పుడు డేటా వస్తుందని, ఫలితంగా మొత్తం కులగణన ప్రక్రియే నిరుపయోగంగా మారుతుందని తేల్చిచెప్పారు. ‘డ్రాప్–డౌన్’ జాబితాయే పరిష్కారం ఈ గందరగోళాన్ని నివారించడానికి ఓపెన్ ఫార్మాట్ బదులుగా ‘డ్రాప్–డౌన్’జాబితా పద్ధతిని అమలు చేయాలని ఖర్గే, రాహుల్ సూచించారు. జనాభా లెక్కల సేకరణ సిబ్బంది వద్ద ముందుగానే పొందుపరిచిన కులాల జాబితా ఉంటే కచ్చితమైన సమాచారం నమోదు చేయడానికి వీలుంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల జన గణనకు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(ఎస్ఈబీసీ) జాబితా, ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ఆధారంగా ఈ డ్రాప్–డౌన్ జాబితాను సులభంగా తయారు చేయవచ్చని సూచించారు. తెలంగాణ (2024), బిహార్ (2022) రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనల్లో ఈ డ్రాప్–డౌన్ విధానాన్నే అనుసరించారని వెల్లడించారు. ఆయా రాష్ట్రాల కులాల జాబితా కాపీలను ప్రధానికి రాసిన లేఖకు జతచేశారు. ప్రశ్నావళిలో ‘వెనుకబడిన తరగతి’ పదం ఏదీ? కేంద్రం తీసుకొచ్చిన తాజా ప్రశ్నావళిలో కనీసం ’వెనుకబడిన తరగతి’అనే పదం కూడా లేకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కులగణనలో సరైన గణాంకాలు రాకపోతే అత్యంత నష్టపోయేది ఓబీసీలు, ఇతర అట్టడుగు వర్గాలేనని స్పష్టం చేశారు. దీనివల్ల విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, ప్రభుత్వ పథకాల రూపకల్పన వంటి కీలక అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. గణాంకాలు చెబుతున్న వాస్తవాలివే..కులగణన కచ్చితంగా జరగాల్సిన అవసరాన్ని పలు గణాంకాలతో సహా ఖర్గే, రాహుల్ వివరించారు. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ఓబీసీ జాబితాలో 2,479 కులాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో మండల్ కమిషన్ దేశంలో 3,743 వర్గాలను ఓబీసీలుగా గుర్తించింది. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) అంచనాల ప్రకారం దేశ జనాభాలో ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 9 శాతం, ఓబీసీలు 42 శాతం, ఇతరులు 27 శాతం ఉన్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్)–2025 అంచనాల ప్రకారం ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 9 శాతం, ఓబీసీలు 46 శాతం, ఇతరులు 24 శాతం వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఓపెన్ ఫార్మాట్’విధానాన్ని అమలు చేస్తే ఈ వాస్తవ గణాంకాలన్నీ తప్పులతడకగా మారిపోయే ముప్పు ఉందని ఖర్గే, రాహుల్ తమ లేఖలో ఉద్ఘాటించారు. ఈ పరిస్థితిని నివారించి, కుల గణన ద్వారా కచ్చితమైన సమాచారం రాబట్టేలా పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. -
ఏఐ నుంచి సైబర్ సేఫ్టీ వరకు.. మోదీ కీలక ఆదేశాలు!
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రగతి 53వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు కీలక ప్రాజెక్టులు, వాటి పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా.. రోడ్లు, రైల్వేలు, విద్యుత్ రంగాలకు చెందిన ఆరు భారీ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. తొమ్మిది రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.30 వేల కోట్లకు పైగానే ఉంది.ఆలస్యం అయితే నష్టం ప్రజలకేప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల కేవలం ఖర్చు పెరగడం మాత్రమే కాదని ప్రధాని మోదీ అన్నారు. పనులు ఆలస్యం అయితే వాటి ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు అందాల్సిన ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతాయని చెప్పారు. అందుకే ప్రతి ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.ఒక్కో రోడ్డు, ఒక్కో రైల్వే లైన్ లేదా ఒక్కో ప్యాకేజీ పనిని విడివిడిగా చూడకుండా.. మొత్తం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది?, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?, అనే కోణంలో పనులను పర్యవేక్షించాలని ప్రధాని స్పష్టం చేశారు.కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంపెద్ద ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కేంద్ర శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని మోదీ అన్నారు. ఒక చిన్న సమస్య కూడా మొత్తం ప్రాజెక్టును ఆలస్యం చేసే పరిస్థితి రావచ్చు. కాబట్టి దాన్ని ముందుగానే గుర్తించి పరిష్కరించాలని సూచించారు. ప్రాజెక్టుల అమలులో ప్రతి స్థాయిలో అధికారులు బాధ్యత తీసుకోవాలని, సమస్యలు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే వాటిని గుర్తించి పరిష్కరించే విధంగా పనిచేయాలని ప్రధాని సూచించారు.ఒకే కారిడార్లో అన్ని..భవిష్యత్లో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టేటప్పుడు కామన్ యుటిలిటీ కారిడార్ల ఏర్పాటుపై కూడా ఆలోచించాలని ప్రధాని సూచించారు. సాధ్యమైన చోట రోడ్లు, రవాణా ప్రాజెక్టులతో పాటు విద్యుత్, ఇతర యుటిలిటీ సదుపాయాలను సమగ్రంగా ప్లాన్ చేస్తే భవిష్యత్లో మళ్లీ మళ్లీ రోడ్లను తవ్వాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు. అయితే.. ఇలాంటి ప్రణాళికలను చేపట్టే ముందు సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యమా లేదా అన్నది పరిశీలించాలని స్పష్టం చేశారు.వేగంతో పాటు.. నాణ్యత కూడాప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పనుల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు ప్రతి దశలో నాణ్యతను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తవ్వడం ఎంత ముఖ్యమో.. అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండటం కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.వ్యవసాయంలో ఏఐసమావేశంలో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్ మీద కూడా ప్రధాని సమీక్షించారు. వ్యవసాయానికి సంబంధించిన డేటాను కేవలం సేకరించడానికే పరిమితం కాకుండా.. దాన్ని రైతులకు ఉపయోగపడేలా వినియోగించాలని సూచించారు.Rs. 30,000 crore worth of projects across 9 states covering railways, roads and power sectors…this is what we reviewed during today’s PRAGATI session. Focus areas remain - better connectivity, higher growth, better public services and lesser delays. Here are the details……— Narendra Modi (@narendramodi) August 25, 2026ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి వ్యవసాయ రంగంలో మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అన్నారు. విత్తనాలు, ఎరువుల ప్రణాళిక నుంచి పంటల ప్రాసెసింగ్ వరకు మొత్తం వ్యవసాయ రంగంలో డేటాను సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు. దీంతో రైతులకు అవసరమైన సహాయం సరైన సమయంలో, సరైన వ్యక్తికి అందించడంతో పాటు వ్యవసాయ రంగంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.డిజిటల్ అరెస్టులపై అవగాహనసైబర్ మోసాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై కూడా ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. ఇలాంటి మోసాలను అరికట్టాలంటే ప్రజల్లో అవగాహన పెంచడం చాలా అవసరమని అన్నారు.వృద్ధులు, యువత, సైబర్ మోసాలకు సులభంగా టార్గెట్ అయ్యే వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మోసగాళ్లు ఎలా మాట్లాడతారు, ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. అదే సమయంలో సైబర్ నేరాలను ఎదుర్కొనే సిబ్బందికి కూడా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని ప్రధాని సూచించారు. కొత్తగా వస్తున్న మోసాలను వేగంగా గుర్తించి, వెంటనే చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. -
యూపీఐ పేమెంట్స్.. పదేళ్లలో ఊహించని వృద్ధి..
-
యూపీఐకి పదేళ్లు.. మీ అనుభవమేంటో చెప్పండి: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి బాటలు వేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఇదొక కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ తరుణంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆసక్తికరమైన పిలుపు ఇచ్చారాయన.‘‘యూపీఐ ప్రారంభమై పదేళ్లు పూర్తయ్యాయి#10YearsOfUPI. దాని స్థాయి, విస్తృతి ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన విషయం’’ అని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. యూపీఐతో తమకు ఎదురైన అనుభవాలను, అది తమ జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను పంచుకోవాలని ప్రజలను కోరారు. #10YearsOfUPI హ్యాష్ట్యాగ్తో తన సందేశాన్ని పంచుకున్నారు.చిన్నగా మొదలై.. భారీ విప్లవంగా2016 ఏప్రిల్ 11న 21 బ్యాంకులతో యూపీఐ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. అదే ఏడాది ఆగస్టు 25 నుంచి యూపీఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అప్పటినుంచి యూపీఐ వినియోగం అనూహ్యంగా పెరిగింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.78 కోట్ల వార్షిక లావాదేవీలు ఉండగా.. 2025–26లో ఏకంగా 24,162 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. లావాదేవీల విలువ కూడా తొలి ఏడాదిలో రూ.0.07 లక్షల కోట్ల నుంచి 2025–26లో సుమారు రూ.314 లక్షల కోట్లకు చేరింది.ప్రపంచంలోనే అగ్రస్థానంలో..యూపీఐ ఇప్పుడు భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా మారింది. 700కు పైగా బ్యాంకులు యూపీఐతో అనుసంధానమై ఉండగా.. ప్రపంచ రియల్టైమ్ చెల్లింపుల్లో దాదాపు 49 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.A decade ago, UPI was rolled out, marking a major turning point in India’s digital payments journey.The sheer scale and reach of UPI are something every Indian must be proud of. Tell me about your UPI experience and how it impacted your life... #10YearsOfUPI pic.twitter.com/Xtto6V6gpU— Narendra Modi (@narendramodi) August 25, 2026టీ దుకాణం నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు.. స్నేహితులకు డబ్బులు పంపడం నుంచి బిల్లులు చెల్లించడం వరకు యూపీఐ రోజువారీ జీవితంలో భాగమైపోయింది. నగదు అవసరం లేకుండా స్మార్ట్ఫోన్తో క్షణాల్లో చెల్లింపులు చేసే సౌలభ్యం డిజిటల్ లావాదేవీలను సామాన్యులకు మరింత చేరువ చేసింది.‘మీ అనుభవం చెప్పండి’యూపీఐ పదేళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ మోదీ.. ఈ వ్యవస్థ తమ జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో ప్రజలు చెప్పాలని కోరడం ఆసక్తికరంగా మారింది. యూపీఐ కేవలం చెల్లింపుల విధానాన్ని మార్చడమే కాకుండా.. భారత్ డిజిటల్ మౌలిక వసతుల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిన విజయగాథగా నిలిచిందని కేంద్రం పేర్కొంటోంది.పదేళ్లలో 1.78 కోట్ల నుంచి 24 వేల కోట్లకు పైగా లావాదేవీల స్థాయికి చేరిన యూపీఐ.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఎంతటి మార్పు తీసుకొచ్చిందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.ఇదీ చదవండి: UPI సృష్టికర్త ఎవరో తెలుసా? -
సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటండి
న్యూఢిల్లీ: మన సాంస్కృతిక ఔన్నత్యాన్ని, సాంకేతికత, ఆవిష్కరణలతో కలగలిపి, ప్రపంచ పటంలో భారత్ స్థాయిని ఇనుమడింప జేయాలని ట్రెయినీ ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్)అధికారులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2025 బ్యాచ్లోని 50 మంది ఐఎఫ్ఎస్ అధికారులు సోమవారం సేవాతీర్థ్ లో ప్రధాని మోదీని కలిశారు. యువ దౌత్యవేత్తలు దేశ గొప్ప నాగరికత, సాంకేతికత, ఆవిష్కరణలు, సమర్థవంతమైన సమాచార మార్పిడిని మిళితం చేస్తూ దేశ గౌరవాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ కొనసాగించే ఆర్థిక సంబంధాలకు ఉ్రత్పేరక ఏజెంట్లుగా వ్యవహరించాలని వారిని కోరారు. ‘మీరు పనిచేసే దేశాల్లో స్థానిక వర్గాలతో భారత్ సంబంధాలను లోతుగా పెంచేలా ప్రాథమిక స్థాయిలో అనుబంధాన్ని పెంపొందించుకోండి. సంప్రదాయ దౌత్య పరిధికి మించి విస్తరించి, ప్రజల స్థాయిలో సంబంధాలను నెలకొల్పుకునేందుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. భారతీయ మిషన్లు కేవలం ప్రభుత్వాలు, సంస్థలతోనే కాకుండా ప్రజలతో కూడా అర్థవంతమైన సంబంధాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని మోదీ వారికి చెప్పారు. ‘భారతీయ మిషన్లలో డిజిటల్ సాంకేతికత వినియోగాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ప్రభుత్వ సేవలు, ఇతర కాన్సులర్ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు సాంకేతికత ఉపయోగపడుతుంది. ప్రజలు ఏదైనా ఒక సంస్థతో సంప్రదింపులు జరిపేందుకు వెబ్సైట్ మొదటి ద్వారంగా ఉంటుంది’అని ప్రధాని పేర్కొన్నారు. మన నాగరికత, సాంస్కృతిక, భౌగోళిక విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పడం ద్వారా దేశాన్ని మరింత ఆకర్షణీయమైన ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని ట్రెయినీలను ప్రధాని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో మనదేశంపై ఆసక్తిని పెంచేందుకు ‘భారత్ను తెలుసుకోండి’క్విజ్ను సది్వనియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్లను సాధనాలుగా వాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా ట్రెయినీ ఐఎఫ్ఎస్లు తమ శిక్షణ, భారత్ దర్శన్ నుంచి పొందిన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. -
భారత్... ప్రశ్నలు వద్దంది
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో నిర్వహించిన విలేకరుల సమవేశంలో ప్రశ్నలేవీ రాకుండా చూసుకోవాలని భారత్ తమని ప్రత్యేకంగా కోరిందని భారత్లో అమెరికా రాయబారి సెర్గీ గోర్ వ్యాఖ్యానించారు. మొదట ట్రంప్ ఇందుకు అంగీకరించినప్పటికీ, ఆ తరువాత మరచిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్లో ‘‘ఏమైనా ప్రశ్నలున్నాయా’’అని విలేకరులను అడిగారని, దీంతో 45 నిమిషాలపాటు ప్రశ్నోత్తరాలు కొనసాగాయని ఆయన చెప్పారు. ఫ్రాన్స్లో ఈ ఏడాది జీ–7 సమావేశాల సందర్భంగా మోదీ, ట్రంప్లు జూన్ 17వ తేదీ సమావేశమైనప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన ఒక వార్తా పత్రిక నిర్వహించని సదస్సులో రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి. సున్నితమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ... ఢిల్లీకి వచ్చిన ప్రత్యేక అతిథుల విషయంలో అనుసరించే నిబంధనలను పాటించాల్సిందిగా మాత్రమే తాము అమెరికన్ ప్రతినిధులకు చెప్పామని తెలిపాయి. నేతల సమవేశాల సందర్భంగా ఇలాంటి చర్చలు సహజమని తెలిపారు. ‘‘మేము స్టేజీ వెనుక ఉన్నాం. ఒక దశలో నేను, అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే ఉండగా.. ఇండియన్స్ ఏ అంశాలను లేవనెత్తాలనుకుంటున్నారు అని అడిగారు. ఆ తరువాత ఆయా అంశాలపై మేము మాట్లాడాము’’అని గోర్ ఆ నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ చెప్పారు. ఇందుకు సమాధానంగా తాను ప్రశ్నలేవీ వద్దని భారత్ కోరుకుంటోందని నేరుగానే ట్రంప్కు చెప్పానని, ఆయన కూడా సరే అన్నాడని సెర్గీ గోర్ వివరించారు. ఆ తరువాత సుమారు యాభై వీడియో కెమెరాలు, విలేకరుల ముందు సమావేశం ప్రారంభమైందని, ట్రంప్, మోదీలు పక్కపక్కన కూర్చుని ప్రారంభ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ట్రంప్ తన వ్యాఖ్యలు పూర్తవగానే కెమెరాలవైపు తిరిగి ‘‘ఎనీ క్వశ్చన్స్?’’అని అడిగారని ఇది కాస్తా పూర్తిస్థాయి సంభాషణకు దారితీసిందని తెలిపారు. -
తెలంగాణకు అవమానం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం.. వ్యక్తిగా రేవంత్రెడ్డికి అనుమతి నిరాకరించడం కాదు.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం, తిరస్కరణ. దీనికి కారణం గుజరాత్ ఆధిపత్యం. దేశ ప్రధాని మోదీ ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధాని అన్న విషయ విజ్ఞానంతో వ్యవహరించడం లేదు. ఇది తెలంగాణకు జరిగిన అవమానం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రేవంత్ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం హోదాలో అభివృద్ధి కోసం చేసే పర్యటనను అడ్డుకుని తెలంగాణ పట్ల కేంద్రం స్పష్టమైన వివక్ష ప్రదర్శించింది. ఈ అంశాన్ని మా నాయకులు రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులంతా పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇది ఆషామాషిగా తీసుకునే విషయం కాదు’ అని సీఎం మండిపడ్డారు. ‘తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంతో వెళ్తున్నామని గతంలో నేను, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్లేటప్పుడు పెట్టిన విధానంలోనే దరఖాస్తు పెట్టాం. రాజకీయ కోణంలో అనుమతిని తిరస్కరిస్తున్నట్టు విదేశాంగ శాఖ జవాబు ఇచ్చింది. రాజకీయ కారణం ఏమిటని మోదీని ప్రశ్నిస్తున్నా. మీరు (మోదీ) ఎన్నో దేశాల పర్యటనకు వెళ్లారు. మీ సొంత రాష్ట్రం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు 8 రోజుల పాటు అమెరికా, కెనడాలో పర్యటించి వైబ్రెంట్ గుజరాత్ అనే పాలసీని ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేసి, పెట్టుబడులు పెట్టాలని కోరడానికి అనుమతిచ్చారు. అదే తెలంగాణ రైజింగ్–2047 పాలసీలో భాగంగా విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం సీఎంగా అమెరికా పర్యటనకు వెళ్తానంటే నిరాకరిస్తారు. ఇంగ్లండ్, అమెరికా రెండింటికీ ఒకే విధానం, ఒకే అంశాలతో విదేశీ పర్యటన తలపెట్టాను. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదనకుంటే ఇంగ్లండ్కు అనుమతి ఎందుకు ఇచ్చారు? అమెరికా పర్యటనకు ఎందుకు తిరస్కరించారు?’ అని రేవంత్ కేంద్రంపై మండిపడ్డారు. మోదీకి బానిసలుగా ఉంటారా? ‘అమెరికా పర్యటనకు అనుమతి తిరస్కరిస్తూ కేంద్రం రాజకీయ కారణాలను అపాదించడాన్ని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. గుజరాత్ను సమర్థించి మోదీ, గుజరాత్ చేతుల్లో కట్టుబానిసలుగా బతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటదలుచుకున్నారా? అని బీజేపీ తెలంగాణ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నా. తెలంగాణకు పెట్టుబడులు వస్తే గుజరాత్కు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే కుట్రతో నా పర్యటనను అడ్డుకున్నారు. దీనిపై నేను స్పందించి విదేశీ వేదికపై నుంచి మాట్లాడి ఉంటే.. చూసినవా, దేశ ద్రోహి, విదేశాల్లో భారత దేశ గౌరవానికి భంగం కలిగించిండు అని విమర్శిస్తారనే ఇక్కడికి వచ్చాక ఖండిస్తున్నం. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’ అని సీఎం అన్నారు. లక్ష్యాన్ని ఆపలేరు.. ‘ఇంగ్లండ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లే వారు ఒక బృందాన్ని హైదరాబాద్కు పంపించి ఇక్కడ తమ క్యాంపస్ ప్రారంభించడానికి పరిస్థితులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్తే ఎంసీఆర్హెచ్ఆర్డీలో స్వల్పకాలిక కోర్సులు, భారత్ ఫ్యూచర్ సిటీలో ఆక్స్ఫర్డ్ క్యాంపస్ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబద్లో తమ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకరించారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో మాట్లాడితే షార్ట్ టర్మ్ కోర్సులను ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రారంభిస్తామన్నారు. అమెరికాలో సైతం బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, ఎంఐటీ క్యాంపస్, నార్త్ ఈస్టర్న్ క్యాంపస్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ వెళ్లాల్సి ఉండే. సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఐవీ లీగ్లోని టాప్ –10 వర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలన్నది నా లక్ష్యం. మీరు నా పర్యటనను అడ్డుకున్నారు.. కానీ నా లక్ష్యాన్ని ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకు పంపించా. ఆక్స్ఫర్డ్తో అధికారులు ఒప్పందం చేసుకోబోతున్నరు. ఇతర వర్సిటీల ముందు మన ప్రతిపాదనలు ముందుపెట్టబోతున్నారు’ అని సీఎం పేర్కొన్నారు. ప్రధానికి తెలియకుండా జరగలేదు... ‘మేం దరఖాస్తులో వివరాలు ఇవ్వలేదని బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించారు. ఏ అధికారిక పర్యటనను అయినా భారత రాయబార కార్యాలయ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. విమానాశ్రయంలో మేము దిగే నాటి నుంచి మళ్లీ తిరిగి వెళ్లే వరకు భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఇది చాటుమాటుగా పర్యటన కాదు. గతంలో విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు ఈ విషయాలన్నీ తెలుసు. తెలంగాణ సీఎం పర్యటనకు అనుమతిని సమీక్షించకుండా, ప్రధాని దృష్టిలో లేకుండా తిరస్కరించడం జరుగుతుందా? తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారిని శిక్షిస్తామని ప్రపంచానికి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్, మెట్రో రైలు ఇతర విషయాల్లో తెలంగాణకు సహకరించడం లేదు’ అని రేవంత్ మండిపడ్డారు. అనుమతి నిరాకరణపై విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బీజేపీలో చేరాలని ఎద్దేవాచేశారు. మోదీ అన్ని దేశాలు తిరగొచ్చు.. ‘న్యూయార్క్ మేయర్ మమ్దానీ అసాంఘిక శక్తి కాదు. మేయర్, అమెరికా ఉపాధ్యక్షుడి అపాయింట్మెంట్ అధికారికంగా ఖరారు కాకుంటే ఏ కార్యక్రమం జరగదు. మమ్దానీ ఏమైనా మన గల్లీలో ఉన్న కౌన్సిలరా? పోతాపోతా ఇంట్లోకి వెళ్లికూర్చుని మాట్లాడడానికి? కేటీఆర్ అమెరికా, హరీశ్ లండన్ వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. నాకు అమెరికా నుంచి ఆహ్వానం ఉంది. హార్వర్డ్లో విద్యార్థిగా చదివా. గతంలో మోదీపై తీవ్రమైన ఆరోపణలున్నాయని అమెరికాకు రానీయలేదు. మోదీ ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయాణం చేయొచ్చు.. ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటట్టు ఉండు’ అని సీఎం పేర్కొన్నారు. కిషన్రెడ్డి జన్మలో సీఎం కాగలడా? ‘కిషన్రెడ్డి ఎప్పుడు సీఎం అయ్యారు? ఆయన జన్మలో సీఎం కాగలరా? దేశంలో పీఎం, సీఎం, డీఎంలకు ఇతరులతో వేరే హోదా కలిగి ఉంటారు. కిషన్రెడ్డి ఏ హోదాలో అనుమతి కోరితే ఆయనకు అనుమతి నిరాకరించారో నాకు తెలియదు. సీఎంగా నేను విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం వెళ్తే మార్గమధ్యంలో తిరిగి రమ్మని చెప్పడంలో మతలబు ఏమిటి? ప్రొఫెసర్లు మాయా టుడోర్, దేవ్జీ యూకేలో ఉన్నారు. అనుమతి ఇచ్చారుగా? ఇందిరా హయాంలో 1975–76 మధ్య ఎమర్జెన్సీ కాలంలో, ఆ తర్వాత 2014లో మోదీ పీఎం అయ్యాక దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని మాయా ఓ జర్నల్కు వ్యాసం రాశారు. 56 ఇంచీల ఛాతీ అని చెప్పుకునే మీరు ఇతర దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంటే ఈ అభిప్రాయాన్ని ఎందుకు మార్చలేరు? మోదీ ప్రధాని అయ్యాక పాకిస్తాన్కు ఎవరిని అడిగి వెళ్లారు? మీరు పాక్ వెళ్లి వారి ప్రధానిని అలింగనం చేసుకుని బిర్యానీ తినవచ్చు. అధికార పర్యటనకు సీఎం వెళ్లలేడు? అందుకే ఆమె ప్రజాస్వామ్యం క్షీణిస్తుందని రాశారు. నేనూ ఏకీభవిస్తున్నా. ఇది నియంతృత్వ నిర్ణయం’ అని సీఎం రేవంత్ అన్నారు. -
అంతరిక్ష రంగంలో అగ్రస్థానానికి భారత్
న్యూఢిల్లీ: అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’సందర్భంగా ప్రధాని మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని పెద్ద కలలు కంటూ, మరింత పెద్ద ఆవిష్కరణలు చేస్తూ, సరికొత్త సరిహద్దులకు విస్తరిద్దామని పిలుపునిచ్చారు. 2023 ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ను చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దించిన చంద్రయాన్–3 మిషన్ను స్మరించుకోవడానికి ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 20 అంతరిక్ష రంగ అంకుర సంస్థల వ్యవస్థాపకులు, సీఈఓలతో ప్రధాని మోదీ శుక్రవారం నాటి భేటీ పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదలచేసింది. ‘‘విస్తారమైన మన ప్రతిభావంతుల సమూహం, రిస్క్ తీసుకునే సామర్థ్యం మన బలం. వీటితో ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ అగ్రస్థానానికి చేరుకోగలదు. ప్రపంచం ఇప్పుడు భారతీయ స్టార్టప్ల వైపు ఆసక్తి చూస్తోంది. ఎప్పుడైతే ఒక పురోగతి జరుగుతుందో, ప్రజల దృష్టి వెంటనే అటువైపు మళ్లుతుంది. మన అంతరిక్ష పరిశ్రమలోకి ప్రైవేట్ సంస్థలకు ద్వారాలు తెరిచిన తర్వాత సానుకూల ధోరణి కనిపించింది’’అని అన్నారు. -
బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రధానిగా 12 ఏళ్లు అందించిన సుపరిపాలన, అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజెప్పడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కమిటీ సమావేశానికి కొనసాగింపుగా.. ఆదివారం పదాధికారుల విస్తృతస్థాయి సంస్థాగత సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి నితిన్ నబీన్ అధ్యక్షత వహించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్తో సహా ఏడు రాష్ట్రాల్లో జరగనున్న అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు పలు సంస్థాగత అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులపాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ను ఒక మహత్తర ప్రజా ఉద్యమంగా చేపట్టాలని బీజేపీ శ్రేణులకు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ హయాంలో పెను మార్పులు సాధించిన ‘నయా భారత్’రూపురేఖలను, వాస్తవాలను, గణాంకాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని సూచించారు. పేదల జీవితాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు, వేగంగా విస్తరించిన మౌలిక సదుపాయాలు, పేదరికం నుంచి కోట్లాది మంది బయటపడిన తీరు, ప్రపంచ వేదికపై భారత్కు దక్కుతున్న ప్రాధాన్యతను యువతకు తెలియజెప్పేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని స్పష్టం చేశారు. ‘సేవా సంకల్ప్ అభియాన్’స్ఫూర్తిని దేశంలోని అన్ని మూలలకు, అన్ని సామాజిక వర్గాలకు చేరవేసేలా సమగ్ర కార్యాచరణను ఖరారు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బి.ఎల్.సంతోష్, జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్ఛార్జ్లు, కొత్తగా నియమితులైన ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు. -
జాతీయ నేతలు కూడా దేశద్రోహులేనా?
కలబురిగి: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి జాతీయ నేతలు నిర్ణయించిన వందేమాతరం వెర్షన్నే కాంగ్రెస్ అనుసరిస్తోందని చెప్పారు. వందేమాతరం సంక్షిప్త రూపంపై నిర్ణయం తీసుకున్న జాతీయ నేతలు కూడా దేశద్రోహులేనా? అని ప్రశ్నించారు. వందేమాతరం గీతాన్ని కేవలం రెండు చరణాలు మాత్రమే పాడాలన్న నిర్ణయం దేశ వ్యతిరేకమైనదని, చట్టాన్ని ధిక్కరించి ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు. శనివారం కర్ణాటకలోని కలబురిగిలో మీడియాతో మాట్లాడారు. చరిత్ర చదవాలని అమిత్ షాకు సూచించారు. పండిట్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ తదితరులు కలిసి వందేమాతరం గీతాన్ని ఆరు చరణాల నుండి రెండు చరణాలకు తగ్గించాలని 1937లో నిర్ణయించారని తెలిపారు. మనమంతా గత 90 ఏళ్లుగా రెండు చరణాలు ఆలపిస్తున్నామని చెప్పారు. 90 ఏళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఆరు చరణాలు ఎందుకు ఆలపించలేదని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇన్నాళ్లూ ఈ విషయం ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. అవసరమైనప్పుడల్లా కొత్త సమస్యలను తెరపైకి తేవడమే బీజేపీ విధానమని ధ్వజమెత్తారు.దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి వందేమాతరం గీతాన్ని ఆలపించడానికి కాంగ్రెస్ ఎన్నడూ వ్యతిరేకం కాదని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. జనగణమన గేయాన్ని ఆలపించినట్లే తమ పార్టీ, సేవాదళ్ ఎన్నో ఏళ్లుగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్నాయని గుర్తుచేశారు. జనగణమన కూడా ఐదు చరణాలతో దీర్ఘంగా ఉండేదని, నేడు ఒక చరణాన్ని మాత్రమే పాడుతున్నారని తెలియజేశారు. దీనిని గేయ రచయిత రవీంద్రనాథ్ టాగోర్ కూడా ఆమోదించారని చెప్పారు. వందేమాతరంలో రెండు చరణాలు, జన గణ మనలో ఒక చరణం ఉన్నాయని, రెండింటికీ ఒకే సమయం పడుతుందని స్పష్టంచేశారు. జాతీయ నేతలు నిర్ణయించిన దానినే మనం ఈరోజు పాడుతున్నామని, వారు చెప్పినట్లు మనం పాడితే మనం దేశద్రోహులమా? అని ప్రశ్నించారు. -
పండుగల వేళ ‘షుగర్’ షాక్.. కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: పండుగల సీజన్ మొదలు కాకముందే దేశంలో చక్కెర ధరలు పెరుగుతుండటంపై రాజకీయ దుమారం రేగుతోంది. పెరుగుతున్న ధరలు, తక్కువగా ఉన్న చక్కెర నిల్వలు, ఇథనాల్ ఉత్పత్తి విధానాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అదే సమయంలో దేశంలో చక్కెర కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.చక్కెర నిల్వలు తగ్గడం, ధరలు పెరగడం, ఇథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లించడం వంటి అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించింది. కేంద్రం చెబుతున్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు ప్రస్తుత పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయని ప్రశ్నించింది. ముఖ్యంగా పండుగల సీజన్కు ముందు ధరలు పెరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రతిపక్షం నిలదీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. పండుగల సీజన్ ప్రారంభానికి ముందే చక్కెర ధరలు పెరగడం, దేశంలో చక్కెర నిల్వలు తగ్గిపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ విధానాల చేదు.. చక్కెర తీపిలోకి కూడా చేరింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకును మళ్లించడం వల్ల చక్కెర ఉత్పత్తి, నిల్వలు ప్రభావితమయ్యాయా? దేశంలో చక్కెర నిల్వలు తొమ్మిదేళ్ల కనిష్ఠానికి చేరాయా? ధరలు పెరుగుతున్న వేళ చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇదేనా ఆత్మనిర్భర్ భారత్? అంటూ కేంద్ర విధానాలపై విమర్శలు గుప్పించారు.ఇది కూడా చదవండి: రేవంత్ ఒక్కడే కాదు.. కేంద్రం ‘నో’ చెప్పిన సీఎంలు వీరే!అయితే ఖర్గే ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కారణం కాదని స్పష్టం చేసింది. 2022-23లో ఇథనాల్కు మళ్లించిన చక్కెర వాటా సుమారు 12 శాతం ఉండగా.. 2025-26లో అది దాదాపు 9 శాతానికి తగ్గిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల పెరుగుదలకు తక్కువ దేశీయ ఉత్పత్తి, వాతావరణ ప్రభావం, పండుగల డిమాండ్, ఊహాజనిత ట్రేడింగ్, నిల్వ దాచడం వంటి కారణాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్రం అక్టోబర్ 31 వరకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. అలాగే హోర్డింగ్ను అరికట్టేందుకు స్టాక్ పరిమితులను కూడా కఠినతరం చేసింది. మొత్తానికి పండుగల వేళ చక్కెర ధరలు పెరగడం, దేశీయ నిల్వలు, ఇథనాల్ ఉత్పత్తి, దిగుమతులు.. ఈ నాలుగు అంశాలు ఇప్పుడు కేంద్రం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. పండుగల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చక్కెర ధరలు ఎలా ఉంటాయన్నదే వినియోగదారుల్లో ఆసక్తిని రేపుతోంది. -
సంస్కరణలే ప్రభుత్వ లక్ష్యం
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ సంస్కరణలు చేపట్టడం తన ప్రభుత్వ లక్ష్యమని, వృద్ధి వేగాన్ని నిలకడగా కొనసాగించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశంలో రాజకీయ స్థిరత్వం, ప్రభుత్వ విధానాల్లో కొనసాగింపు ఉన్నాయని చెప్పారు. ప్రపంచం భారత్ను ఒక ఆశాకిరణంగా చూస్తోందని పేర్కొన్నారు. వనరులను ఆయుధాలుగా మారుస్తుండటంతో వృద్ధికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అనేక ఆందోళనలు ఉన్నప్పటికీ, భారత్ మాత్రం వృద్ధికి సంబంధించి ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందని స్పష్టంచేశారు. సంస్కరణల విషయంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఒక స్పష్టమైన రోడ్మ్యాప్ ఉందన్నారు. తమ ప్రభుత్వం అధిక ఉత్పత్తికి ప్రోత్సాహకాలతో తగిన గుర్తింపునిస్తోందని వివరించారు. ప్రజలను కొరతలో ఉంచి, కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వం ముందు వేడుకునేలా చేయడం గత ప్రభుత్వాల విధానమని నరేంద్ర మోదీ ఆరోపించారు. గత ప్రభుత్వాల లైసెన్స్ రాజ్ విధానం నిరుద్యోగ భారాన్ని పెంచేదిగా ఉండేదని గుర్తుచేశారు. కానీ తన ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానంతో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని వెల్లడించారు. తాము కేవలం నిబంధనలను మాత్రమే మార్చడం లేదని, నిబంధనలకు సంబంధించిన మొత్తం విధానాన్నే మారుస్తున్నామని వివరించారు. -
అంతరిక్ష స్టార్టప్లకు అండదండలు
న్యూఢిల్లీ: స్పేస్ స్టార్టప్లకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆయా స్టార్టప్లను నిర్వహించే యువ పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తామని ప్రకటించారు. వ్యవసాయం, పశుసంపద, పాడి, పర్యావ రణం, ప్రజల దైనందిన జీవితాలను ప్రభా వితం చేసే రంగాల్లో అంతరిక్ష సాంకేతికతను ఎలా ఉపయోగించాలన్న దానిపై అన్వేషణ సాగించాలని వారిని కోరారు. 20 స్పేస్ స్టార్టప్ల వ్యవస్థాపకులు, సీఈఓలతో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమ య్యారు. అంతరిక్ష స్టార్టప్ల వంటి నూతన, సవాలుతో కూడిన రంగంలోకి ప్రవేశించి, రిస్కులు తీసుకుని, ప్రభుత్వ సంస్కరణల ప్రక్రియను విశ్వసించి, ప్రయత్నాలను నిలకడగా కొనసాగిస్తున్నందుకు వారిని ప్రశంసించారు. ఈ రంగంలో విజయాలు సాధించడానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే, అంతరిక్ష సాంకేతికతల వినియోగాన్ని విస్తరించేందుకు అంతరిక్ష రంగ సంస్థలు, ఇతర రంగాల్లోని సంస్థల మధ్య మరింత సహకారం ఉండాలని అభిప్రా యపడ్డారు. అంతరిక్ష రంగంలో ప్రపంచానికి ఒక బలమైన, వినూత్నమైన, వాణిజ్యపరంగా ఆచరణీయమైన నమూనాను భారత్ అందించగలదని మోదీ స్పష్టంచేశారు. అంతరిక్షం నుంచి వచ్చే శిథిలాలపై పరిశో« దిస్తున్న కంపెనీలు తమ సాంకేతికతలను విస్తరించడానికి పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేయవచ్చని ప్రధానమంత్రి సూచించారు. వ్యవసాయ రంగంతో కలిసి పని చేస్తున్న స్పేస్ టెక్నాలజీ కంపెనీలు వ్యవ సాయ విశ్వవిద్యాలయాలు, విభాగాలతో సమన్వయం చేసుకోవచ్చని అన్నారు. తద్వారా రైతులు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి , వారి ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు. స్టార్టప్లు తమ కార్యకలాపాలపై అర్థవంతమైన ప్రజెంటేషన్లు ఇచ్చాయని, అలాగే ప్రభుత్వం చేపట్టిన అంతరిక్ష రంగ సంస్కరణలను, ఆ రంగం వృద్ధికి కల్పించిన అవకాశాలను అవి ప్రశంసించాయని ప్రధానమంత్రి పేర్కొ న్నారు. యువ పారిశ్రామికవేత్తల కృషి వల్ల అంతరిక్ష రంగంలో భారత్ ఎన్నో ఘనతలు సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. -
సోషల్ మీడియాలో మోదీ హవా.. కేంద్ర మంత్రులకు ర్యాంకింగ్స్
-
దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలి
న్యూఢిల్లీ: విధాన రూపకల్పనలో నూతన అంశాలను జోడించడానికి ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మరింత సమన్వయం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. అదే సమయంలో మానవ మేధస్సు, విచక్షణను విస్మరించకూడదని అన్నారు. దేశ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనే దానిపై దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. డేటాను జాతీయ సంపదగా అభివర్ణించారు. వివిధ ప్రయోజనాల కోసం డేటాను సేకరించి, నిర్వహించే విధానాలలో తేడాలు ఉన్నాయని తెలిపారు. అలాగే, డేటా మధ్య మరింత అనుసంధానతను, దాని సమర్థవంతమైన వినియోగాన్ని సాధ్యం చేసే పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. విడివిడిగా పనిచేయడం అనేది కేవలం సంస్థాగత సమస్య మాత్రమే కాదని, అది ఒక ఆలోచనా విధాన సమస్య అని అన్నారు. అధికారులు ఐకమత్య స్ఫూర్తితో పనిచేయాలని ప్రధాని స్పష్టం చేశారు. జట్టు స్ఫూర్తిని పెంపొందించుకోవడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన, ప్రపంచ స్థాయిలో దానిని మరింత పోటీతత్వంతో కూడినదిగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. -
సోషల్ మీడియాలో మంత్రుల పనితీరు ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ: సభలు, దంచికొట్టే ప్రసంగాల కాలం నుంచి రాజకీయాలు, రాజకీయ చర్చలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికలపైకి మారుతున్నాయి. యువతతో పార్టీ, ప్రభుత్వ సంబంధాలను బలోపేతం చేసుకోవాలంటే సోషల్ మీడియానే అత్యంత ప్రధానమని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా వేదికల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాని సహా కేంద్ర మంత్రులందరూ ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ‘ఎక్స్’అనే 4 ప్రధాన వేదికల ద్వారా ప్రజలతో మమేకం కావాలని, ఎల్లప్పుడూ అప్డేట్స్ ఇస్తూ సోషల్మీడియాలో క్రియాశీలకంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సోషల్ మీడియా మాధ్యమాల్లో కేంద్ర మంత్రుల పనితీరు, క్రియాశీలత ఎలా ఉందనే దానిపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక అధ్యయనం చేయించింది. నివేదికను సిద్ధం చేసింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ ఈ నివేదికలను సీల్డ్ కవర్లలో మంత్రులకు వ్యక్తిగతంగా అందజేశారు. సమగ్ర విశ్లేషణతో తుది నివేదిక.. ఈ రిపోర్టులో మే 1 నుంచి ఆగస్టు 15 వరకు మంత్రులు సోషల్ మీడియాలోని నాలుగు వేదికలపై చూపిన క్రియాశీలతను సమగ్రంగా విశ్లేషించారు. మంత్రులు పెట్టిన పోస్టులు, వివిధ అంశాలపై వారి వైఖరి, కామెంట్లు, స్పందనలను ఇందులో లెక్కగట్టారు. తోటి మంత్రులతో పోలిస్తే, అలాగే ప్రతిపక్ష నేతలతో పోలిస్తే సదరు మంత్రి ఏ స్థాయిలో యాక్టివ్గా ఉన్నారు? అనే దానికి సంబంధించిన నిష్పాక్షికమైన, పోల్చదగిన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయం రూపొందించినట్లు సమాచారం. ఆధునిక ప్రచార సాధనాలపై ప్రధాని దిశానిర్దేశం.. ఈ రిపోర్టును మంత్రులంతా తీవ్రంగా, బాధ్యతగా తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలిసింది. ఆధునిక సమాచార వ్యవస్థలైన ఈ సోషల్ మీడియా వేదికలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాయో మంత్రులకు ప్రధాని మరోసారి సుదీర్ఘంగా వివరించారు. ఈ డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వాడుకోవాలన్నారు. సోషల్ మీడియా ప్రచారంతోపాటు, యాక్టివ్గా ఉండటంలోనూ ప్రధాని మోదీ స్వయంగా ఆదర్శంగా నిలిచారు. పీఎంఓ రూపొందించిన ఈ ‘పర్ఫార్మెన్స్ రిపోర్ట్’ర్యాంకింగ్లో ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ముందు వరుసలో నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారని తెలిసింది. -
చైనాతో సంబంధాలు మెరుగయ్యేనా?
వచ్చే నెల సెప్టెంబర్లో భారత్లో జరుగనున్న బ్రిక్స్ దేశాధినేతల సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరవుతాడా అని విశ్లేషకులు ఆసక్తితో ఎదురు చూస్తు న్నారు. భారత్–చైనా దేశాధినేతల భేటీ నేపథ్యంలో రెండు దేశాల సంబంధాలకు దిశానిర్దేశం జరుగుతుందని జియో పొలిటికల్ సర్కిల్స్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. భారత్–చైనా సంబంధాలలో స్థిరత్వం ఆసియా ఖండానికే కాకుండా ప్రపంచ శాంతికి కూడా కీలకం. 2020 గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో సుమారు నాలుగు సంవ త్సరాలు సంబంధాలలో స్తబ్ధత చోటు చేసుకున్నది. 2024లో రష్యాలో కజాన్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ–జిన్పింగ్ సమావేశం, సరిహద్దు గస్తీ ఒప్పందం ఇరుదేశాల సంబంధాలలో ఘర్షణను కొంతవరకు తగ్గించాయి. కానీ మొత్తంగా సంబంధాలు సాధారణ స్థితికి చేరటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. 1962 యుద్ధం తరువాత 1988లో రాజీవ్ గాంధీ బీజింగ్ పర్యటనతో మళ్లీ రెండు దేశాల సంబంధాలు గాడిన పడ్డాయి. 44 సంవత్సరాల తరువాత 2006లో నాథూ లా కనుమ మళ్లీ తెరుచు కున్నది. కానీ ఇరుదేశాల మధ్య పీటముడిలా ఉన్న సరిహద్దు సమస్యకు పరిష్కారం సమీప భవిష్యత్తులో లేనట్లే లెక్క.అయినా... వాణిజ్యం పెరిగింది!సరిహద్దు సమస్య సంక్లిష్టత నేపథ్యంలో ఇరు దేశాలు వాస్తవిక దృష్టితో గత రెండు దశాబ్దాలుగా వ్యాపార–వాణిజ్య సంబంధాలపై దృష్టి పెట్టాయి. 2000 సంవత్సరంలో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం, 2025కల్లా 128 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. గత 25 సంవత్సరాలలో సరిహద్దుల మీద ఎన్ని ఘర్షణలు చోటు చేసుకున్నా అవి ఇరు దేశాల వాణిజ్యానికి నష్టం కలిగించలేదు. కానీ జూన్ 2020 గల్వాన్ దుస్సాహసం రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించింది. 2024 నుండి మరమ్మత్తు చర్యలు చేపట్టినప్పటికీ, అవి ఢిల్లీ–బీజింగ్ మధ్య విశ్వసనీయతలో లోటును పూరించలేక పోయాయి. గత రెండున్నర దశాబ్దాలుగా చైనాతో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు వ్యాపార వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటూనే, మరొకవైపు సరిహద్దులలో మన సైనిక శక్తిని మెరుగుపరచుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ యవనికపై పర్యావరణం, వాతావరణంలో మార్పులు, శక్తి, అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల విషయంలో చైనాతో చేతులు కలిపాము. ఇరుదేశాల మధ్య వాణిజ్యం విçస్తృతంగా వృద్ధి చెంది నప్పటికీ వాణిజ్య లోటు పెద్ద సమస్యగా మారింది. 2020లో 44 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2026కల్లా 112 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. చైనా దిగుమతులపై మన ఆర్థిక వ్యవస్థ విపరీతంగా ఆధారపడతున్నది. ఈ రకమైన వాణిజ్య సంబంధాలు దీర్ఘకాలంలో మనకు నష్టం కలిగించటం ఖాయం.చైనా గ్రే జోన్ యుద్ధతంత్రం1962 తర్వాత భారత్పై చైనా మళ్లీ యుద్ధం చేసే పరిస్థితి, ప్రమాదం లేకపోయినప్పటికీ... సరిహద్దు సమస్య శాశ్వత పరిష్కా రానికి మనస్ఫూర్తిగా, మిత్రత్వ ధోరణితో చైనా ముందుకు రావటం లేదు. పైపెచ్చు వరుసగా సరిహద్దులలో కవ్వింపు ధోరణిని అమలు పరుస్తున్నది. వ్యూహాత్మకంగా ‘గ్రే జోన్ ’ యుద్ధతంత్రాన్ని అమలు పరుస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఒకవైపు సరిహద్దులలో భారత్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ... మరొకవైపు పరోక్షంగా భారత్ అభివృద్ధిని అడ్డుకొని బలహీనపరచే కుతంత్రాన్ని చైనా అమలుపరుస్తున్నది. దీనితో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెచ్చించాల్సిన కీలక నిధులను భారత ప్రభుత్వంచే సైనిక వ్యయంవైపు మళ్లింప చేయటంతో చైనా కృత కృత్యురాలయింది. సరిహద్దులను ఒకవైపు అస్థిరం చేస్తూనే మరొక వైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవు లతో జతకట్టి ఇండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈశాన్య భారతంలో ఉగ్రవాద ముఠాలకు వత్తాసు పలుకుతూ దేశాన్ని అస్థిరం చేయటానికి ప్రయత్నిస్తున్నది. వాణిజ్యంలో కూడా కీలకమైన వస్తువులను, ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధిస్తున్నది. మనకు అత్యంత అవసరమైన టన్నెల్ బోరింగ్ యంత్రాలు, సీఎన్ సీ లేథ్ యంత్రాలు, యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్లు, క్రిటికల్ మినరల్స్ మనకు అందకుండా వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నది. సామాజిక మాధ్యమాలలో భారత్కు వ్యతి రేకంగా పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నది.భారత్ ఏం చేయ్యాలి?గత రెండు దశాబ్దాలలో భారత్ ఎడల చైనా ప్రవర్తన, దృక్పథంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. 2000 సంవత్సరం వరకు భారత్ను చైనా ఒక సహ ప్రత్యర్థిగా చూసింది. 2025కల్లా అంతర్జాతీయంగా చైనా ఆర్థిక శక్తిగానే కాకుండా టెక్నాలజీ పవర్ హౌస్గా ఏర్పడింది. సహజంగానే భారత్ ఎడల ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నది. అమెరికా బలహీనపడటం చైనాకు కలిసి వచ్చింది. భారత్–చైనా సంబంధాలలో యూఎస్ఏ, పాకిస్తాన్ పాత్రను మనం కాదనలేము. ఇటీవల బీజింగ్ పర్యటన సందర్భంగా ట్రంప్ యూఎస్ఏ, చైనాలను జీ2గా అభివర్ణించాడు. అంటే యూఎస్ఏ, చైనాలే అగ్రరాజ్యాలని ప్రకటించాడు. అయితే, చైనాను ప్రాంతీయంగా బలహీన పరచటానికి అమెరికా భారత్ను సమర్థిస్తుందనీ, అమెరికాను ఎదుర్కోవటానికి చైనా భారత్తో చేతులు కలుపుతుందనీ మరొక వాదన. చైనాతో సంబంధాల విషయంలో భారత్ ఈ వాదనల ఆధారంగా సిద్ధాంత రూపకల్పన చేయటం అవివేకం. చైనాతో సంబంధాల విధాన రూపకల్పన అమెరికన్ సిద్ధాంతాల ఆధారంగా కాకుండా మన దేశ శక్తి, సామర్థ్యాలు, స్థిరత్వం, అభివృద్ధి అవసరాల ఆధారంగానే జరగాలి.భారత్కు కొన్ని ముఖ్యమైన అంశాల్లో స్పష్టత అవసరం. మన లక్ష్యం ప్రాంతీయ హోదానా? సరిహద్దు సమస్య పరిష్కారమా? సరి హద్దులలో ప్రశాంతతనా? అంతర్జాతీయంగా చైనాను బలహీనపర చటమా? ఏ అంశాల విషయంలో భారత్ రాజీపడదనే విషయంలో చైనాకు భారత్ స్పష్టతనివ్వాలి. కవ్వింపు చర్యలు, పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భూభాగాల నుండి భారత్ను అస్థిరపరచే కుట్రల విషయంలో భారత్ రాజీ పడదు. ద్వైపాక్షిక సంబంధాలలో భారత్ను సమవుజ్జీగా పరిగణించాలి. అయితే, చైనా ధోరణి ఎప్పటికైనా మన బలంపైనే ఆధారపడి ఉంటుంది. బలమైన భారత్ మాత్రమే చైనాకు సరైన సమాధానం. ముఖ్యంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ చైనాకు కంటగింపుగా ఉన్నది. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. చైనా పెట్టు బడులకు మళ్లీ పచ్చజెండా ఊపాలంటే వాణిజ్య లోటును పరిగణన లోనికి తీసుకోవాల్సిందే. భారత జెనరిక్ ఔషధాలు, ఐటీ సేవలను ఎగుమతి చేయటానికి చైనాపై ఒత్తిడి తేవాలి. 21వ శతాబ్దం చైనా శతాబ్దం కాకూడదు, అది ఆసియా శతాబ్దమవ్వాలి!గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
వన్ డే.. వన్ వర్సిటీ!
న్యూఢిల్లీ: దేశంలో పరీక్ష పత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలే ప్రధానాంశాలుగా విద్యార్థి, యువత కొనసాగిస్తున్న వరుస ఆందోళనల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జన్ జెడ్కు చేరువయ్యే ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందుకోసం ‘వన్ డే, వన్ యూనివర్సిటీ’ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు ప్రతి రోజూ ఒక యూనివర్సిటీకి వెళ్లి, అక్కడి యువతతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడంతోపాటు వారిని అర్థం చేసుకునేందుకు ప్రయతి్నస్తారు. విద్యార్థులు, యువత కోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను వారికి వివరిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి వర్సిటీలతోపాటు, మంత్రుల పర్యటనల సమన్వయ బాధ్యతలను ప్రభుత్వం విద్యా మంత్రి ప్రల్హాద్ జోషి, యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయలకు అప్పగించింది. ‘వన్ డే, వన్ యూనివర్సిటీ’ కార్యక్రమంపై బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలో జరిగిన కేబినెట్ భేటీలోనూ చర్చించారు. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వర్సిటీలతోపాటు డీమ్డ్ వర్సిటీలు కలిపి 1,300 వరకు ఉన్నట్లు అంచనా. -
భారత్ ఎన్నికలపై ట్రంప్ ఫోకస్..! అమెరికాలో కొత్త రూల్స్ కు పిలుపు
-
మోదీ కోసం పోలీస్ ఉద్యోగానికి రాజీనామా..2029 వరకు చెప్పులు వేసుకోనని శపథం!
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విధానాలకు మద్దతుగా గుజరాత్లో ఓ పోలీసు ఉద్యోగి తన పదవికి రాజీనామా చేశారు. తూర్పు కచ్లోని అడేసార్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రామ్గర్ మోహన్గర్ గోసాయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టడానికి, ప్రధాని మోదీ దేశంలోని యువత కోసం చేపడుతున్న విధానాలకు మద్దతుగా నిలవడమే తన నైతిక బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో ఈ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి నేను ఎంతో కష్టపడ్డాను. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా.. నేరుగా రంగంలోకి దిగి మోదీ ప్రభుత్వానికి, ఆర్ఎస్ఎస్కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. ఎలాంటి లాభాపేక్ష లేకుండా దేశ సేవకు అంకితమైన ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ఇకపై పూర్తిగా భాగస్వామి అవుతాను’ అని వెల్లడించారు. అంతేకాకుండా, 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిచి, ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు తాను ఎలాంటి చెప్పులు ధరించనని శపథం చేయడం గమనార్హం. કચ્છમાં પોલીસ કોન્સ્ટેબલનું રાજીનામું!આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રામગર ગુસાઈએ 2019થી પોલીસ સેવામાં રહ્યા બાદ રાજીનામું આપ્યું. RSSમાં સેવા આપવા માટે નોકરી છોડ્યાનો દાવો.રામગર ગુસાઈનું નિવેદન: “2029માં મોદી સરકાર અને સંઘ સરકાર નહીં બને ત્યાં સુધી પગમાં પગરખાં… pic.twitter.com/kIrk6Kezgq— Benefit News 24 (@BenefitNews24) August 15, 2026 -
మోదీగారూ.. చూడండి ఏం జరిగిందో!
న్యూఢిల్లీ: యూజీసీ-నెట్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. వాటిని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వైఫల్యాల భారాన్ని విద్యార్థులపై మోపుతున్నారని ఆరోపించారు. ‘‘మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.‘‘ఏళ్ల తరబడి చదివిన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దరఖాస్తులు, ఫీజులు, దూర ప్రాంతాలకు ప్రయాణాలు.. అన్నీ మరోసారి చేయాల్సి వస్తోంది. తప్పు చేసింది ఎన్టీఏ.. కానీ శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. జూన్ 22 నుంచి 30 వరకు జరిగిన యూజీసీ-నెట్ పరీక్షలను దాదాపు రెండు నెలల తర్వాత రద్దు చేయడంపై ఆయన ప్రశ్నించారు. పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా? అనే అసలు ప్రశ్నకు NTA సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు.Modi ji, look at what your NTA has just done.UGC-NET exams for Sociology, English and Commerce were held between 22 and 30 June. Nearly two months later, NTA has cancelled all three because it set faulty papers and repeated old questions.Thousands of candidates who prepared… https://t.co/TUMhhMhjvL— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2026‘విద్యా వ్యవస్థ కాదు.. వసూళ్ల యంత్రం’దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది ఇక విద్యా వ్యవస్థ కాదు.. ఒక ఎక్స్ట్రాక్షన్ మెషీన్గా మారింది. ఇది విద్యార్థుల డబ్బు, సమయం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుంటోంది. కానీ తిరిగి ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు’’ అని విమర్శించారు. పేపర్ లీక్ వ్యవహారాలపై బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం తొలి అడుగు మాత్రమేనని.. NTA నాయకత్వంపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.సెప్టెంబర్లో రీటెస్ట్NTA ప్రకారం.. ఇంగ్లిష్, కామర్స్ అభ్యర్థులకు సెప్టెంబర్ 9న, సోషియాలజీ పరీక్షకు సెప్టెంబర్ 10న రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు అదనపు ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు షెడ్యూల్ ప్రకారమే విడుదల చేస్తామని తెలిపింది. నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న NTAపై తాజాగా యూజీసీ-నెట్ రీటెస్ట్ నిర్ణయం మరింత ఒత్తిడి పెంచింది. -
దిమాగీ నక్సల్సైపై పొలిటికల్ దుమారం
-
ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్కు బాబా రామ్దేవ్ హెచ్చరిక
హరిద్వార్: భారతీయ జనతాపార్టీకి వీర విధేయుడుగా భావించే యోగా గురు బాబా రామ్దేవ్ తాజా వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. విద్యా, నియామక పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు రామ్దేవ్ మద్దతుగా నిలవడమేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం విశేషం. కేంద్రం త్వరగా ఈ 'ఘప్లా' ( స్కాంలను)ను సరిదిద్దకపోతే, ఈ ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చవచ్చని, ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హితవుపలికారు. లేకపోతే తాను కూడా నిరసన చేపట్టాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హరిద్వార్లోని పతంజలి యోగపీఠ్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, నీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కొరతపై విద్యార్థులు నిరసన గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియపై అవినీతి, ధనబలం ప్రభావం చూపుతున్నాయని కూడా ఆ సందర్భంగా ఆయన ఆరోపించారు.దేశంలో అంతటా గందరగోళం నెలకొని ఉంది. తమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని పిల్లలు ఫిర్యాదు చేస్తున్నారు. విద్యుత్, నీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కొరవడ్డాయి. కొన్నిచోట్ల మోసాలు విచ్చలవిడిగా జరుగుతుండగా, మరికొన్నిచోట్ల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ఇంటర్వ్యూలలో అవినీతి 99 శాతం వరకు ఉంది. కుల, మత ప్రాతిపదికన ఎంపికలు జరుగుతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం, అత్యంత అభ్యంతరకరమైనదని రామ్దేవ్ మండిపడ్డారు.వారికి సిగ్గుండాలిభారత పౌరులమని చెప్పుకుంటూనే, రాజకీయ కారణాలతో లేదా కులం పేరుతో ఒకరిపై ఒకరు ద్వేషం, కక్ష పెంచుకునే వారిని ఖండిస్తున్నా అన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, దళితులు, ఆదివాసీలు, అటవీ ప్రాంత వాసులు, అలాగే హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు... ఇలా ఒకరి రక్తం కోసం మరొకరు తహతహలాడుతున్నట్లుగా, పరస్పర శత్రుభావంతో నిలబడటం ఎంత దారుణంమని ఆవేదన వ్యక్తంచేశారు.ఒకవైపు 'సత్యమేవ జయతే', 'యతో ధర్మస్తాతో జయః' అని బోధిస్తూనే, మరోవైపు కోటి రూపాయల లంచం తీసుకున్న తర్వాతే నియామకాలు జరుగుతుండటంపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అందరూ నిరసనలు ప్రారంభిస్తే దేశం ఎలా నడుస్తుంది? అందుకే, ఇకనైనా పద్ధతులను మార్చుకోండి; లేకపోతే, ఆందోళన మరింత తీవ్రమవుతుందని మోదీ సర్కార్ను హెచ్చరించారు.అలాగే నిరసనలు హింసాత్మకంగా కాకుండా, రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని చెబుతూ, హింసకు, అరాచకానికి దూరంగా ఉండాలని జెన్ జెడ్ నిరసనకారులను రామ్దేవ్ కోరారు. స్కాములు జరుగుతున్నాయనేది కాదనలేని సత్యమన్నారు. భారతీయుల మధ్య పెరుగుతున్న శత్రుత్వాన్ని కూడా రామ్దేవ్ ఖండించారు. వివిధ కులాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబడటం ప్రారంభించారని ఆయన అన్నారు. యువత తమ హక్కుల కోసం పోరాడేటప్పుడు చట్టాన్ని, రాజ్యాంగాన్ని అనుసరించాలని, హింసను విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా 2011లో ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో తాను చేసిన అవినీతి వ్యతిరేక నిరసనను ఆ యోగా గురువు ప్రస్తావించారు. ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం -
24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం
దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రభంజనం కొనసాగుతుండగానే ‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ ’ అనే పేరుతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు సంచలనంగా మారాయి. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఒక్క రోజులోనే 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ అకౌంట్కు 62 పోస్ట్లను పోస్ట్ చేయగా, సుమారు 35 మందిని ఫాలో అవుతోంది. దీంతో సీజేపీ తరహాలోనే దిమాగీ నక్సల్ పార్టీ కూడా ఇప్పుడో ఉద్యమంగా మారుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దిమాగీ నక్సల్స్పై హెచ్చరికల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇప్పుడు దిమాగీ నక్సల్ పార్టీ, దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ వెలుగులోకి రావడం విశేషం. మావోయిస్టులపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో సాధించిన విజయాలు ,నీడలా పొంచి ఉన్న ప్రమాదాల గురించి ప్రస్తావిస్తూ, దేశానికి సమస్యగా మారిన నక్సల్స్ ను ఏరిపారేశామని, ఇపుడిక దిమాగీ నక్సల్స్ను పని పడతామని తన ప్రసంగంలో మోదీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది.🇮🇳 DIMAAGI NAXAL JANTA PARTY — DJP 🇮🇳🚨🚨 01. NATION RE-BUILDING • ECONOMIC CONSTRUCTION🏗️ BUILD THE NATION. REBUILD THE ECONOMY.🇮🇳 $10 TRILLION ECONOMY BY 2035📈 Required nominal growth: ~10.5% CAGR⚙️ ECONOMIC RECONSTRUCTION🏭 Manufacturing: ~17% → 25% of GDP📈… pic.twitter.com/36APNRh3ua— Dimaagi Naxal Janta Party 🧠 (@DJPforINDIA) August 16, 2026 అయితే, ఈ దిమాగీ నక్సల్ జనతా పార్టీ ఖాతాను ఖచ్చితంగా ఎవరు నిర్వహిస్తున్నారనే దాని గురించి ఎలాంటి సమాచారం వెలుగులోకి రాలేదు. మరోవైపు "తెలివిగా ఉండండి.. మూర్ఖంగా ఉండకండి. ప్రశ్నలు అడగండి.. బానిసలా ఉండకండి" అంటూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఒక పోస్ట్ను 'దిమాగీ నక్సల్ జనతా పార్టీ' ఖాతా రీట్వీట్ చేసింది. ఇది ఇలా ఉండగా ప్రధానమంత్రి వ్యాఖ్యలపై రాజకీయ వివాదం చెలరేగగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరం, "నేను 'దిమాగీ నక్సల్' అయినందుకు గర్వపడుతున్నాను" అని స్పందించడం ఈ వివాదానికి మరింత అగ్గి రాజేసింది.కిరణ్ రిజుజు వివరణఈ వివాదం నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి ప్రకటనపై స్పష్టతనిచ్చారు. "ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులను నేరుగా 'మైండ్-మేడ్ నక్సల్స్' అని పిలవలేదని, మావోయిస్టులకు మద్దతు ఇచ్చేవారు, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచేవారు, వేర్పాటువాదులకు మద్దతిచ్చేవారు లేదా ఈశాన్య భారతదేశాన్ని మిగిలిన భారతదేశం నుండి వేరుచేసే 'చికెన్ నెక్' ప్రాంతం దిగ్బంధనానికి మద్దతు ఇచ్చేవారిని ఉద్దేశించి ఈ పదాన్ని ఉపయోగించాదని పేర్కొన్నారు. కాగా దేశ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన బొద్దింకల వ్యాఖ్యలకు నిరసనగా పుట్టకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. దీనికి సోషల్ మీడియాలో జెన్జీ నుంచి భారీ ఆదరణ లభించింది. అంతేకాదు నీట్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతికబాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఉద్యమం, కేంద్రమంత్రి రాజీనామా దాకా కొనసాగిన సంగతి తెలిసిందే. -
నేడు బీజేపీ కొత్త టీమ్ ప్రకటన.. జాతీయ కార్యవర్గంపై ఉత్కంఠ
సాక్షి, ఢిల్లీ: బీజేపీలో కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నేడు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త టీమ్ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ పదాధికారులతో పాటు కీలకమైన పార్టీ కమిటీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కొత్త కార్యవర్గంలో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు కూడా చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్టానం కొత్త టీమ్ను రూపొందించినట్లు తెలుస్తోంది.అదే సమయంలో పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, మార్గదర్శక మండలి వంటి కీలక సంస్థల్లో కూడా మార్పులు, కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, మణిపూర్, హిమాచల్ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, యువతకు అవకాశం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త టీమ్కు తుది రూపు ఇచ్చినట్లు సమాచారం.నెల రోజులుగా కసరత్తు..జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ సంస్థాగత వ్యవహారాల కీలక నేత బీఎల్ సంతోష్ నెల రోజుల క్రితమే కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ కార్యక్రమాలు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం నేపథ్యంలో కొత్త కార్యవర్గం ప్రకటన కొంత ఆలస్యమైనట్లు తెలుస్తోంది.కేంద్ర కేబినెట్లో మార్పులు?బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన తర్వాత కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన కూడా జరిగే అవకాశం ఉందనే చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొత్త పార్టీ టీమ్, కేంద్ర కేబినెట్లో మార్పులు.. రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త కార్యవర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది? కీలక పదవుల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి? కేంద్ర మంత్రుల్లో ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు? అన్నదానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
దిమాగీ నక్సల్స్ పై పొలిటికల్ దుమారం
-
నా మిత్రులకు ఆహారం తినిపించా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు బయలుదేరే ముందు, దినచర్యలో భాగంగా ఆవులు, నెమళ్లకు మేత తినిపించిన వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఉదయాన్నే నా మిత్రులకు మేత వేయడం నా దినచర్యలో ఒక భాగం. నిన్న ఉదయాన్నే నేను బయటకు వెళ్తున్నానని నా మిత్రులు గ్రహించినట్లున్నాయి. అందుకే ముందుగానే నా వద్దకు వచ్చాయి. ఎప్పటిలాగే ఇది చాలా ప్రత్యేకమైనది’ అని ఇన్స్టా గ్రామ్లో పేర్కొన్నారు. ఎర్రకోట వేడుకల కోసం సంప్రదాయ దుస్తులు ధరించి, లోక్ కల్యాణ్ మార్గ్లోని ఏడో నంబర్ నివాసంలో ఆవులకు గడ్డి, నెమళ్లకు ధాన్యపు గింజలు అందిస్తూ అందులో ప్రధాని కనిపించారు. ఆ తర్వాత ఆయన ఎర్రకోటకు చేరుకున్నారు. -
‘దిమాగీ’పై దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మావోయిస్టు తీవ్రవాదం అంతమైనప్పటికీ దిమాగీ నక్సల్స్(మేధో నక్సలైట్లు) మాత్రం సమాజానికి ముప్పుగా మారారని, వారిని గుర్తించి, ఏకాకులని చేయాలని, పూర్తిగా పక్కనపెట్టాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు పట్ల అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మోదీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అసమ్మతిని అణచివేయడానికే విపక్షాలపై దిమాగీ నక్సలైట్ అంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలను అధికార బీజేపీ నాయకులు సమర్థించారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుల గురించి కాకుండా.. కేవలం మావోయిస్టులకు, వేర్పాటువాదులకు మద్దతునిస్తూ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వ్యక్తుల గురించి మాత్రమే ప్రధానమంత్రి మాట్లాడారని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను దిమాగీ నక్సల్స్ అనలేదు. 1.మావోయిస్టులకు మద్దతు ఇస్తూ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారు. 2.వేర్పాటువాదులతో అండగా నిలుస్తూ ఆరి్టకల్ 370కి మద్దతిచ్చే వారు. 4.భారతదేశం నుంచి ఈశాన్య ప్రాంతాన్ని వేరు చేయడానికి కోడి మెడ(చికెన్ నెక్)ను కత్తిరించాలని కుట్రలు సాగించేవారు మాత్రమే దిమాగీ నక్సల్స్’’ అని కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు. 3 వస్తుంది, 4 కాదు: పవన్ ఖేరా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్పై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా ‘ఎక్స్’లో వ్యంగ్యంగా స్పందించారు. ‘‘సోదరా కిరణ్ రిజిజు.. ముందు మీ లెక్కింపును సరిచేసుకోండి. అప్పుడు మేము సమాధానం ఇస్తాము. 1, 2 తర్వాత 3 వస్తుంది, 4 కాదు’’ అని పోస్టుచేశారు. పవన్ ఖేరా ట్వీట్పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత జైరామ్ రమేశ్ ప్రతిస్పందించారు. ‘‘సమస్త రాజకీయ శాస్త్రపు అద్భుతం’’ అని పేర్కొన్నారు. ‘‘నేను దిమాగీ నక్సలైట్ అయినందుకు గర్విస్తున్నాను’’ అంటూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సైతం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. చిదంబరంపై బీజేపీ నేతల ఆగ్రహం పి.చిదంబరం పోస్టుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి.ఎల్.సంతోష్ విమర్శలు గుప్పించారు. ‘‘ఇందులో ఆశ్చర్యం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చిదంబరం కాషాయ ఉగ్రవాదానికి ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశారు’’ అని పోస్టుచేశారు. చిదంబరం తీరుపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆగ్రహం వ్యక్తంచేశారు. అణ్వాయుధాల అవసరంపై దేశంలోనూ, పార్లమెంట్లోనూ పూర్తి స్థాయి, సరైన చర్చ జరిగేంత వరకు వాటిని సమకూర్చుకోవడాన్ని, భారత సాయుధ దళాలలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ చిదంబరం మాట్లాడినట్లుగా ఉన్న ఒక పాత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘నేటి ప్రపంచ పరిస్థితులను గమనిస్తే సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పారీ్టకి చెందిన చిదంబరం చేసిన ఈ వ్యాఖ్య దిమాగీ నక్సల్ వ్యాఖ్య అవునా కాదా.. మీరే చెప్పండి?’’ అని దూబే పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సైతం చిదంబరంపై తీరుపై మండిపడ్డారు. ఆయన దిమాగీ నక్సల్ అనే బిరుదు తగిలించుకోవడం ఆలస్యమైనా, అది మంచి పరిణామమేనని అన్నారు. ‘‘చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు, యూపీఏ ప్రభుత్వ హయాంలో నక్సలిజం ఎందుకు బలపడిందో ఇప్పుడు అర్థమైంది. 2004–2014 మధ్య నక్సలిజంపై పోరాడుతూ దాదాపు 2,000 మంది పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఎందుకు ప్రాణాలు కోల్పోయారో ఇప్పుడు మాకు తెలిసింది. యూపీఏ ప్రభుత్వ పాలనలో నక్సల్స్ దాడుల వల్ల 5,000 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. చిదంబరం హోం మంత్రిగా ఉన్నప్పుడు పోలీసు ఆయుధాగారాల నుంచి నక్సలైట్లు ఆయుధాలు దోచుకుపోవడానికి అనుమతించారు’’ అని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ చెప్పిన ‘దిమాగీ నక్సల్స్’ అంటే ఢిల్లీ, ముంబై, పట్నా, కోల్కతాల్లోని ఏసీ గదుల్లో కూర్చుని మావోయిస్టు భావజాలాన్ని పోషించే వ్యక్తులని అర్థమని బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘‘వారు (నక్సలైట్లు) ఉద్యమానికి నిధులు, మద్దతు సమకూర్చుకోవడానికి తమ నెట్వర్క్లను ఉపయోగించుకుంటారు. మావోయిస్టుల దురాగతాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నప్పుడు, దిమాగీ నక్సల్స్ వారిని సమర్థిస్తూ ఆంగ్ల వార్తాపత్రికలలో వ్యాసాలు రాస్తారు’’ అని ఆరోపించారు. -
ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి పొన్నం లేఖ
హైదరాబాద్: 2027 జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు పొన్నం. ‘ ఓబీసీ, ఎస్ఈబీసీల సమగ్ర కులగణకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు ప్రశ్నావళిలో ప్రత్యేక కేటగిరి చేర్చాలి. ప్రతి కులం, సముదాయానికి డిజిటల్ కోడ్లు కేటాయించాలి. కులగణనలో బీసీల సమాచారాన్ని సేకరించాలి. బీసీల లెక్కలు తేలితేనే సామాజిక న్యాయం జరుగుతుంది. SECC-2011లో ఎదురైన కులపేర్ల సమస్యలు 2027 జనాభా లెక్కల్లో పునరావృతం కాకూడదు. రాష్ట్రాల వారీగా మాస్టర్ కుల డైరెక్టరీ.. ప్రతి కులం, సముదాయానికి డిజిటల్ కోడ్లు ఇవ్వాలి. స్థానిక, వివాదాస్పద కులపేర్ల నమోదుకు ప్రత్యేక ధృవీకరణ విధానం ఉండాలి. వ్యక్తి స్వయంగా ప్రకటించిన కులం, అధికారిక వర్గీకరణ రెండింటినీ డేటాలో భద్రపరచాలి. తెలంగాణ SEEPC సర్వే అనుభవాలను 2027 జనాభా లెక్కల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. -
"భూమి, ఆకాశం, పాతాళం" ఆపరేషన్ సిందూర్పై అజిత్ దోవల్
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ఈ పేరు చెబితే చాలు ప్రతి భారతీయుడు హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. దాయాది పాకిస్థాన్ దేశానికి చెందిన ముష్కరులను వారి సొంత దేశంలోకే చొరబడి తుదముట్టించారు. భారత్ జోలికోస్తే ఎక్కడున్నా వదిలేది లేదంటూ ప్రపంచానికి భారత్ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా దీనిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఈ ఘటనపై మాట్లాడుతూ..“ ఈ దాడి జరిగిన తర్వాత విమానాశ్రయంలోనే ప్రధాని మోదీతో మాకు సమావేశం జరిగింది. మొదట, ఆయన వాస్తవాలన్నీ తెలుసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత నన్ను అడిగిన మొదటి ప్రశ్న, ‘ఇది ఎవరు చేశారు?’ "మేము వారిని వెంబడిస్తాము. వారు భూమిపై ఉన్నా, ఆకాశంలో ఉన్నా, పాతాళంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే... మేము వారిని క్షమించము," అని మోదీ తనతో ఆగ్రహంగా అన్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గూడఛార సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. వారు అద్భుతంగా పనిచేశారు. తక్కువ సమయంలోనే మనం నిందితులను గుర్తించి, కచ్చితత్వంతో చర్యలు తీసుకోగలిగామన్నారు. భారతదేశం చూపే ఉదారత లేదా సహనాన్ని ఎవరూ బలహీనతగా భావించకూడదని ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చామని తెలిపారు. పహల్గామ్ దాడికి కారణమైన శత్రువుల ఉగ్రవాద శిబిరాలను ముఖ్యంగా ధ్వంసం చేయడమే ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పరిణామాలతో సంబంధం లేకుండా భారతదేశం ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనగలదని, శత్రువులపై తీవ్రంగా ఎదురుదాడి చేయగలదని ఆయన స్పష్టం చేశారు.2025 ఏప్రిల్ 22న జరిగిన ఘోరమైన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న 'ఆపరేషన్ సింధూర్' ప్రారంభమైంది. పాకిస్తాన్ డ్రోన్ దాడులను తిప్పికొడుతూ, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి కీలక నేతలను అంతమెుందించింది. -
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
-
అణచి వేయడానికే ‘దిమాగీ’ మాట
న్యూఢిల్లీ: దేశంలో దిమాగీ నక్సలైట్లు అశాంతి, అరాచకాలకు సృష్టించడానికి కుట్రలు సాగిస్తున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అసమ్మతిని అణచివేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డాయి. నక్సలిజాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, మావోయిస్టుల విషయంలో మోదీ ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఆరోపించారు. దిమాగీ నక్సలైట్లుఅంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమేనని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నవారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం, పాకిస్తాన్కు వెళ్లాలని అనడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అరెస్టయిన మావోయిస్టుల పట్ల మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉగ్రవాద చర్యలను తలపిస్తోందని ఆరోపించారు. కొందరిపై చట్టపరమైన విచారణ జరపకుండా, కస్టడీలోనే కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా మోదీ అసమ్మతివాదులను టార్గెట్ చేశారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆక్షేపించరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కళంకం వేయడానికి దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మర్చిపోయి, అసమ్మతివాదులను లక్ష్యంగా చేసుకోవడానికి సమయం, అవకాశం వెతుక్కుంటున్నారని రాజా తప్పుపట్టారు. ఇది కేవలం భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భయపెట్టడానికి చేసే ప్రయత్నం మాత్రమేనని తేల్చిచెప్పారు. విద్య, ఉపాధికి సంబంధించి విద్యార్థులు, యువత లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించాలని ప్రధాన మోదీకి డి.రాజా సూచించారు. రాజకీయ శాస్త్రంలో మోదీ ‘ఎంఏ’ ‘‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రత్యర్థులను దిమాగీ నక్సల్స్ అని పిలుస్తూ చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటు. విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉపయోగించుకోవడం సరైంది కాదు. మోదీ ఇకనైనా అహంకారం వదిలించుకోవాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సాకేత్ గోఖలే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘ప్రధానమంత్రి మొదట తన ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ అని విమర్శించారు. ఇప్పుడు వారిని దిమాగీ నక్సల్స్ అని పిలుస్తున్నారు. ఇది మోదీ నిస్సహాయతకు స్పష్టమైన సంకేతం. ఇతరులపై నిందలు వేయడంతో మోదీ ఆరితేరిపోయారు. మొత్తం రాజకీయ శాస్త్రంలోనే ఆయన మాస్టర్ అబ్యూజర్(ఎంఏ). కాబట్టి ప్రధానమంత్రికి ఎంఏ డిగ్రీ ఉండటంలో ఆశ్చర్యం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ‘ఎక్స్’లో తేల్చిచెప్పారు. -
యువతకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్
న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఉచిత ఆన్లైన్ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రకటించారు. అలాగే కోటి మంది యువతకు కృత్రిమ మేధ(ఏఐ) శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడుతూ.. కోచింగ్ తరగతులు పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నాయని చెప్పారు. అందుకే వివిధ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించబోతున్నట్లు తెలిపారు. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపించడం తల్లిదండ్రులకు నేడు ఒక ప్రతిష్టగా మారిపోయిందని గుర్తుచేశారు. కోచింగ్పై వెచ్చించే వేల కోట్ల రూపాయలను ఉచిత ఆన్లైన్ శిక్షణతో ఆదా చేసుకోవచ్చని, పిల్లలకు దగ్గరగా ఉంటూ వారిని జాగ్రత్తగా చూసుకోవచ్చని అన్నారు. మనకు డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అద్భుతమైన ప్రతిభ, చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ వనరులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా యువతకు ఉచిత కోచింగ్ అందించేందుకు పూర్తిస్థాయి నెట్వర్క్ను నిర్మించబోతున్నామని స్పష్టంచేశారు. -
‘ఉర్దూమే తిరంగా పెహనాహై’
న్యూఢిల్లీ: స్వాతంత్య్రోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ కోటు జేబులోని ఒక వస్త్ర విశేషం శనివారం సామాజిక మాధ్యమంలో పెద్ద దుమారమే రేపింది. మూడు రంగులున్న ఈ పాకెట్ స్క్వెర్పై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. జాతీయ జెండా రంగుల్లోనే ఉన్నప్పటికీ వాటి క్రమం తిరగేసి ఉండటం విమర్శలకు కారణమైంది. ఆ పాకెట్ స్క్వెర్ భారత జాతీయ జెండాలా లేదని, ఐర్లాండ్ పతాకంలా ఉందని కాంగ్రెస్ నేతలు కొందరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే... ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ‘‘లగ్తా హై సాహిబ్ నే ఉర్దూ మే తిరంగా పెహనా హై. యా ఫిర్ భారత్ కి జగా ఐర్లాండ్గా ఇండిపెండెన్స్ డే మనా రహా హై’’(బహుశా ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఉర్దూలో ధరించినట్లు ఉన్నారు. లేదంటే ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్నారేమో) అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ఉర్దూ భాషను కుడి నుంచి ఎడమకు రాస్తారన్న విషయం తెలిసిందే. పవన్ ఖేరా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేథ్ సమర్థించడమే కాకుండా... ఆ పాకెట్ స్క్వెర్లోని రంగులు కాషాయం, తెలుపు, పచ్చలుగా కాకుండా తిరగేసి ఉన్నాయని ఎత్తి చూపారు. ‘‘ఇది ఏ శైలి త్రివర్ణ పతాకం. తిరగేసి ఉంది. భారతదేశానిది కాకుండా ఐర్లాండ్దిలా ఉంది’’అని ఆమె ఎక్స్ పోస్టులో తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు కాంగ్రెస్ను విమర్శిస్తే మరికొందరు మోదీ జాతీయ పతాకాన్ని వేసుకుని తిరగడం లేదని అశోక చక్రం లేని విషయాన్ని ఎత్తి చూపారు. మరికొందరు జాతీయ జెండాకు సంబంధించిన నిబంధనలు పాటించి ఉండాల్సిందని సలహా ఇచ్చారు. ఇంకొందరైతే త్రివర్ణం ధరించడం వెనుక ఉద్దేశాన్ని చూడాలని దీన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. -
సప్తధారతో వికసిత భారతం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సిద్ధికి వందేళ్లు నిండేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. పన్నెండేళ్లలో సాధించిన పురోగతిని వివరిస్తూనే.. 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించేందుకు ఒక్కొక్కరూ కంకణం కట్టుకుని తమవంతు తోడ్పాటు, కృషి చేయాలని ఆయన ఎర్రకోట వేదికగా శనివారం జరిగిన 80వ స్వాతంత్య్రోత్సవ వేడుకల్లో కోరారు. ఏడు రకాల శక్తులు కలిస్తే (సప్త ధార) ఇది అసాధ్యం కానేకాదని భరోసానిచ్చిన మోదీ.. లక్ష్యసాధనకు సాధించాల్సిన ప్రగతిపై కూడా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించారు. దేశీ కంపెనీల్లో కనీసం యాభై ఫార్చ్యూన్ 500 జాబితాలో చోటు సంపాదించుకోవాలని, అంతర్జాతీయంగా టాప్ 5 బ్యాంకుల్లో ఒకటైనా భారత్ది అయి ఉండాలని స్పష్టం చేశారు. ప్రపంచ భవిష్యత్తును శాసించనున్న కృత్రిమ మేధ రంగంలో అగ్రస్థానంలో నిలిచే లక్ష్యంతో వచ్చే ఏడాది కోటి మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ప్రకటించారు. శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు విభేదాలు మరచి రాజకీయ పార్టీలన్నీ ముందుకు రావాలని కోరారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో యువత నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో సాయుధ నక్సలిజం లేకుండా పోయినా ‘దిమాగీ నక్సల్స్’ఇంకా ఉన్నారని హెచ్చరించారు. దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాజధాని ఢిల్లీలో ఘనంగా మొదలయ్యాయి. శనివారం ఉదయం 6.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మాగాం«దీకి నివాళులు అర్పించి ఎర్రకోటకు చేరుకున్నారు. రక్షణశాఖ కార్యదర్శి, గార్డ్ ఆఫ్ హానర్ కమాండర్ సుమారు 7.15 గంటల ప్రాంతంలో ప్రధానిని ఆహ్వానించారు. ఆ తరువాత ప్రధాని గార్డ్ ఆఫ్ హానర్ను అందుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని చిరస్మరణీయం చేస్తూ ఆర్మీబ్యాండ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మొదటిసారి దీన్ని ఆలపించడం, ఆ తరువాత 21 తుపాకులతో ‘రాష్ట్రీయ సెల్యూట్’, జాతీయ గీతాలాపన జరిగాయి. ఇదే సమయంలో భారతీయ వాయుసేనకు చెందిన రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు వేదికపై పుష్ఫవర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ జాతీయ పతాకాన్ని, మరోటి ‘వందే మాతరం’అని రాసి ఉన్న జెండాను మోసుకెళుతూ కనిపించాయి. అనంతరం 7.40 గంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం భారతీయులు అందరి లక్ష్యం కావాలని నిర్దేశించిన ప్రధాని మోదీ ఎర్రకోటపై తొలిసారి వందేమాతరం పాడటంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి దేశం దన్నుగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రధాని గత పన్నెండేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని సోదాహరణంగా వివరించారు. అనంతరం వికసిత భారత లక్ష్యాన్ని అందుకునేందుకు సాయం చేయగల సప్తధార శక్తులను ప్రకటించారు. అంతేకాకుండా దేశం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేందుకు వేయాల్సిన ముందడుగులను వివరించారు. యువత ఉన్నత శిఖరాలను అందుకునేందుకు దేశం అండగా ఉంటుందని చెప్పిన ప్రధాని మత్తుమందుల మహమ్మారిని పారదోలే లక్ష్యంతో వలంటీర్లు, ఎన్జీవోలు, సామాజిక, సాంస్కృతిక సంస్థలు, ఆధ్యాతి్మక నాయకులతో కలిసి వంద వారాల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. పురోగతి బాటలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో గత పన్నెండేళ్లలో దేశం సాధించిన పురోగతిని ఇలా వివరించారు... → రక్షణ రంగ ఉత్పత్తులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. → ఖాదీ, గ్రామీణ పరిశ్రమల్లో పురోగతి ఐదు రెట్లు → ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల తయారీలో పెరుగుదల ఏడు రెట్లు. → ఆధునిక రైల్వే కోచ్ల ఉత్పత్తి 21 రెట్లు పెరిగింది. → మొబైల్ ఫోన్ల తయారీలో పెరుగుదల 33 రెట్లు ఎక్కువైంది. → ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువైంది. → పేటెంట్లు కూడా 4 రెట్లు ఎక్కువయ్యాయి. → డిజిటల్ లావాదేవీలు దాదాపు 100 రెట్లు పెరిగాయి. → నల్లాల ద్వారా తాగునీటి కనెక్షన్లు గతం కంటే 15 రెట్లు వేగంగా అందిస్తున్నాం. → గ్యాస్ కనెక్షన్లు అందించే వేగం కూడా ఆరు రెట్లు ఎక్కువైంది. → స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం నాలుగు రెట్లు వేగంగా జరుగుతోంది. → పీఎం ఆవాస్ యోజన కింద పేదల కోసం ఇళ్ల నిర్మాణ వేగం మూడు రెట్లు పుంజుకుంది. → పేదరికం నుంచి బయటపడ్డ వారి సంఖ్య 25 కోట్లు. → ‘‘ఫ్రాజైల్ ఫైవ్’’నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుదల → దేశం మొత్తమ్మీద 2.5 లక్షలకు పైగా స్టార్టప్లు → 650 కొత్త యూనివర్సిటీల స్థాపనలక్ష్య నిర్దేశం 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు భారతీయ సంస్థలు, బ్రాండ్లు పలు లక్ష్యాలను సాధించాలి. ఫార్చ్యూన్ 500లో 50 భారతీయ కంపెనీలు ఉండాలి. బ్యాంకులు, ఫార్మా, లాఫర్మ్లు, రేటింగ్ ఏజెన్సీలు, ఐటీ, కన్సల్టింగ్, అకౌంటింగ్ సంస్థలు కూడా ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరాలి. భారతీయ బ్రాండ్లు విశ్వాసానికి ప్రతీకలుగా మారాలి. దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలన్నీ కలిసికట్టుగా పని చేయాలి. భారతీయ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కంపెనీలు కొత్త ఉపాధి అవకాశాలకు దారులు తెరుస్తోంది. 2036 ఒలింపిక్స్, 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు దేశం సిద్ధం. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా సెమీకండక్టర్లు, క్రిటికల్ మినరల్స్, శక్తి భద్రతపై దృష్టి సారించాలి మూడు సెమీకండక్టర్ ప్లాంట్లలో ఉత్పత్తి మొదలైంది. వచ్చే ఏడు, ఎనిమిదేళ్లలో మరో ఎనిమిది ప్లాంట్ల స్థాపన. 2047 నాటికి వంద గిగావాట్ల అణు శక్తి లక్ష్యం. ఈ దశాబ్దంలో ఐదు కొత్త అణు రియాక్టర్లు ప్రారంభం. సౌర శక్తి సామర్థ్యం రెండు గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు వృద్ధి. పీఎం సూర్య ఘర్ పథకం కింద 50 లక్షలకు పైగా రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లు. యువత, క్రీడలు, మహిళా సాధికారత దేశంలో 2.5 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయి. రూ.లక్ష కోట్లతో ఇన్నోవేషన్ ఫండ్. డ్రగ్–ఫ్రీ ఇండియా జాతీయ మిషన్గా మారాలి.సప్తధార: ఏడు శక్తి ప్రవాహాలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ‘‘సప్తధార’’అనే ఏడు శక్తి ప్రవాహాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రానున్న ఐదు, ఏడేళ్లు చాలా కీలకమని, ప్రజలు పని సంస్కృతి తోపాటు మైండ్సెట్నూ మార్చుకుని దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలిని అన్నారు. ప్రధాని వివరించిన సప్తధారల వివరాలు... → తయారీ శక్తి: డిజైన్ నుంచి తయారీ వరకు మొత్తం అన్ని దశలూ భారత్లోనే పూర్తవ్వాలి. నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి కేంద్రంగా మారాలి. ఖర్చు, నాణ్యతల పరంగా భారతీయ పరిశ్రమలు ప్రపంచ దేశాలతో పోటీపడాలి. నమ్మదగ్గ, యూజర్ ఫ్రెండ్లీ, ఆకర్శణీయమైన ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా పనిచేయాలి. → వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్: చిరుధాన్యాలు, మసాలా దినుసులు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహారాలను ప్రపంచ బ్రాండ్లుగా మార్చాలి. రసాయన–రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల కారణంగా అందుబాటులోకి వచ్చిన ప్రపంచ మార్కెట్లను రైతులు సది్వనియోగం చేసుకోవాలి. పొలాల నుంచి నేరుగా ఎగుమతులు జరగాలి → టెక్నాలజీ, ఇన్నొవేషన్: ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష ప్రయోగాలు, రోబోటిక్స్, డేటా సెంటర్లలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేలా ఎదగాలి యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ప్రపంచానికి మార్గదర్శకం కావాలి. 6జీ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేయాలి. → గతి శక్తి: హై–స్పీడ్ రైలు, ఆధునిక హైవేలు, అంతర్గత జలమార్గాలు, ప్రపంచ స్థాయి విమానాశ్రయాలు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ వ్యవస్థల ద్వారా నగరాలను అనుసంధానించాలి. పోర్టులను పోర్ట్–ఆధారిత అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలి. → రక్షణ శక్తి: రక్షణ రంగంలో దేశం స్వావలంబన సాధించడంతోపాటు ప్రపంచదేశాలకు రక్షణ ఉత్పత్తులను సరఫరా చేసేదిగా ఎదగాలి. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్లతోపాటు హైపర్ సోనిక్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. సైబర్ సెక్యూరిటీ రంగంలో భారత యువత కీలక పాత్ర పోషించాలి. → గ్రీన్, బ్లూ ఎకానమీ: గ్రీన్ హైడ్రోజన్, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇంధన నిల్వ, పర్యావరణ హితమైన రవాణా, తయారీల కోసం కృషి జరగాలి. మత్స్య, తీరప్రాంత పర్యాటకం, ఓషన్ టెక్నాలజీల సాయంతో దేశం బ్లూ ఎకానమీలోనూ అగ్రస్థానానికి చేరవచ్చు. దేశ సంపదైన సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉపాధి, ఆర్థిక వృద్ధికి అవకాశాలు సృష్టికి అనుకూలం. → సాఫ్ట్ పవర్: భారతదేశ సాఫ్ట్ పవర్కు యోగా, ఆయుర్వేదం, ఆధ్యాతి్మకత, ఆరోగ్య సంరక్షణ, హస్తకళలు, సంస్కృతి, సినిమా, వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్లు నిదర్శనాలు. యువతకు అపార అవకాశాలు కల్పించగల సత్తా వీటికి ఉంది. హెల్త్ టూరిజమ్ ప్రోత్సాహానికి ‘హీల్ ఇన్ ఇండియా’ఉపయోగపడుతుంది. వేవ్స్ సమ్మిట్ దేశ సృజనాత్మక, వినోద పరిశ్రమల సత్తాను చాటింది. వందకు పైగా ఉన్న జాతీయ పార్కులతోపాటు వన్యప్రాణి సంపద పర్యాటక రంగాన్ని ఆకర్శించేందుకు సాయపడుతుంది. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు, కచేరీలు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించగలవు. -
అభివృద్ధి చెందిన భారత్ కోసం.. 'సప్తధార' సూత్రం!
2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక దిశానిర్దేశం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఎర్రకోట నుంచి జాతి ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశ ప్రగతికి ఏడు ప్రధాన శక్తులు అవసరమని పేర్కొన్నారు. వీటినే 'సప్తధార'గా అభివర్ణించారు.ఉత్పాదక శక్తి (Manufacturing power)మోదీ 'సప్తధార'లో మొదటి స్థానాన్ని తయారీ రంగానికి ఇచ్చారు. చిన్న వస్తువుల నుంచి భారీ పరిశ్రమల వరకు సాధ్యమైనంత ఎక్కువగా భారత్లోనే తయారు చేయాలి అనేది ప్రధాని ఆలోచన. కేవలం ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా.. డిజైన్, తయారీ, నాణ్యత, సరఫరా వంటి మొత్తం విలువ గొలుసును దేశంలోనే అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచ దేశాలకు భారత్ ఒక నమ్మకమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలు ధరతో పాటు నాణ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై కూడా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.వ్యవసాయం, ఆహార ఉత్పత్తి (Agriculture and food production)రెండో శక్తిగా వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ప్రధాని ప్రస్తావించారు. మన రైతులు కేవలం దేశీయ మార్కెట్పైనే ఆధారపడకుండా.. ప్రపంచ మార్కెట్ను కూడా లక్ష్యంగా చేసుకోవాలని ఆయన అన్నారు. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహార పదార్థాలు, రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంటే.. పొలంలో పంట పండించడం దగ్గరే ప్రక్రియ ఆగిపోకూడదు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఎగుమతుల వరకు పూర్తి వ్యవస్థను అభివృద్ధి చేయాలి చెప్పారు.టెక్నాలజీ, ఆవిష్కరణ (Technology and innovation)మూడో శక్తిగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ను ప్రధాని ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీ, అంతరిక్ష రంగం, రోబోటిక్స్, డేటా సెంటర్లు వంటి భవిష్యత్ రంగాల్లో భారత్ మరింత ముందుకు వెళ్లాలని అన్నారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా దేశం నాయకత్వం వహించాలని చెప్పారు. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా 6జీను ప్రపంచానికి అందించే స్థాయికి భారత్ ఎదగడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.గతి శక్తి (Gati Shakti)నాలుగో శక్తిగా గతిశక్తిని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో రవాణా, కనెక్టివిటీ మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. హైస్పీడ్ రైళ్లు, కొత్త పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు వంటి మౌలిక వసతులను విస్తరించడంతో పాటు.. దేశంలోని నగరాలు, పరిశ్రమలు, పోర్టులు పరస్పరం మెరుగ్గా అనుసంధానమయ్యేలా చూడాలని సూచించారు. పోర్టులను కేవలం సరుకులు ఎగుమతి, దిగుమతి చేసే ప్రాంతాలుగా కాకుండా.. ఆర్థిక అభివృద్ధికి కేంద్రాలుగా మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.రక్షణ శక్తి (Raksha Shakti)ఐదో శక్తిగా రక్షణ రంగం గురించి పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్ మరింత ఆత్మనిర్భర్గా మారాలని ప్రధాని చెప్పారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, హైపర్సోనిక్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో భారత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. భారత్ కేవలం ప్రపంచ దేశాలకు మార్కెట్గా ఉండకుండా.. అత్యాధునిక రక్షణ సాంకేతికతను తయారు చేసి ఇతర దేశాలకు అందించే స్థాయికి ఎదగాలన్నది లక్ష్యం.గ్రీన్, బ్లూ ఎకానమీ (Green economy and blue economy)ఆరవ శక్తిగా గ్రీన్, బ్లూ ఎకానమీలను ప్రధాని ప్రస్తావించారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, పర్యావరణహిత తయారీ వంటి రంగాల్లో భారత్ భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.అదే సమయంలో.. దేశానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని కూడా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. మత్స్య పరిశ్రమ, సముద్ర సాంకేతికత, తీర ప్రాంత పర్యాటకం వంటి రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా బ్లూ ఎకానమీకి మరింత ఊతమివ్వాలని అన్నారు.యువశక్తి, సాఫ్ట్ పవర్ (India’s soft power)'సప్తధార'లో చివరి శక్తిగా యువశక్తి, భారత సాఫ్ట్ పవర్ను ప్రధాని వివరించారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, హస్తకళలు వంటి సంప్రదాయ రంగాలతో పాటు సినిమాలు, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ వంటి ఆధునిక సృజనాత్మక రంగాల్లో కూడా భారత్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని పెంచుకోవాలని అన్నారు.అంతే కాకుండా.. వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం, భారతదేశంలోని ప్రకృతి అందాలు, జాతీయ పార్కులు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయడం ద్వారా దేశ సాఫ్ట్ పవర్ను పెంచుకోవాలని సూచించారు.'సప్తధార'లో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడు రంగాలను వేర్వేరుగా చూడకూడదని ప్రధాని స్పష్టం చేయడం. ఉదాహరణకు తయారీ రంగానికి టెక్నాలజీ అవసరం. వ్యవసాయానికి ఫుడ్ ప్రాసెసింగ్ అవసరం. ఎగుమతులకు మెరుగైన లాజిస్టిక్స్ అవసరం. రక్షణ రంగానికి ఆవిష్కరణలు అవసరం. గ్రీన్ ఎకానమీకి యువత, టెక్నాలజీ అవసరం. అంటే.. ఒక రంగం అభివృద్ధి చెందితే దాని ప్రభావం మరో రంగంపైనా పడుతుంది. ఈ రంగాలన్నింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లడమే 'సప్తధార' ఆలోచనలోని అసలు ఉద్దేశం.వికసిత్ భారత్ లక్ష్యానికి.. సప్తధార!మన దేశం స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకునే 2047 నాటికి వికసిత్ భారత్గా మారాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం ఒకటి రెండు రంగాలు అభివృద్ధి చెందితే సరిపోదు. తయారీ నుంచి వ్యవసాయం వరకు, టెక్నాలజీ నుంచి రక్షణ వరకు, గ్రీన్ ఎకానమీ నుంచి యువశక్తి వరకు అన్ని రంగాలు కలిసి ముందుకు సాగాలి.ఇదీ చదవండి: 80 ఏళ్లలో 1711 రెట్లు పెరిగిన బంగారం! -
దేశంలో ‘‘స్వచ్ఛంద సేవకుల దళం’’ ఏర్పాటు? అంటే ఏంటి?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. ‘‘వైబ్రంట్ సివిల్ డిఫెన్స్ నెట్వర్క్’’తో పాటు ‘‘భారీ, ఆధునిక పౌర రక్షణ స్వచ్ఛంద సేవకుల దళాన్ని’’ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆధునిక భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు పౌరులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 2025 మేలో ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్తో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులను రంగంలోకి దింపి దేశవ్యాప్తంగా కృత్రిమ విన్యాసాలు నిర్వహించారు. అసలు ఈ దళం అంటే ఏమిటి? జాతీయ భద్రత కోసం పౌర స్వచ్ఛంద సేవకుల దళాన్ని భారత్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారా?ఈ ప్రతిపాదిత దళం భారత్లో తొలి పౌర స్వచ్ఛంద సంస్థ కాదు. వాస్తవానికి 1968 సివిల్ డిఫెన్స్ చట్టం కింద భారత్లో ఇప్పటికే చట్టబద్ధమైన సివిల్ డిఫెన్స్ దళం ఉంది. సివిల్ డిఫెన్స్ దళాల ఏర్పాటు, శిక్షణ లేదా సివిల్ డిఫెన్స్ విధులకు పిలిచే పౌర స్వచ్ఛంద సేవకుల నియామకానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. 1968 సివిల్ డిఫెన్స్ నిబంధనల్లో ప్రజలను తరలించడం, కీలక మౌలిక వసతులకు రక్షణ కల్పించడం, అగ్నిప్రమాదాల నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడం, శత్రు దాడుల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు వంటి చర్యలు ఉన్నాయి. అందువల్ల సివిల్ డిఫెన్స్ అంటే యుద్ధ సమయంలో పోరాటానికి మాత్రమే పరిమితం కాదు. అత్యవసర పరిస్థితుల్లో పౌరులు, కీలక సేవలను రక్షించడం దీని ప్రధాన ఉద్దేశం.స్వచ్ఛంద సేవకులు ఏం చేయవచ్చు?సాంప్రదాయ సివిల్ డిఫెన్స్ విధుల్లో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సహాయపడటం, కీలక సేవలకు రక్షణ కల్పించడం, అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడం, అత్యవసర సూచనలను ప్రజలకు చేరవేయడం ఉన్నాయి. ఆధునికీకరించిన వ్యవస్థలో ప్రథమ చికిత్స, గాలింపు, రక్షణ చర్యలు, అత్యవసర సమాచార వ్యవస్థలు, ప్రజల తరలింపు నిర్వహణ, ఆశ్రయ కేంద్రాల నిర్వహణ, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి రంగాలకు ఈ బాధ్యతలు విస్తరించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మరిన్ని వివరాలు వెల్లడించే వరకు ఇవి మోదీ ప్రతిపాదించిన దళంలో ఖరారైన విధులుగా కాకుండా సాధ్యమైన విధులుగా మాత్రమే చూడాలి.ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏం జరిగింది?పాకిస్థాన్తో ఘర్షణల నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులను రంగంలోకి దించారు. ఆరోగ్యం, అగ్నిమాపక, అత్యవసర సేవలు, పశుసంపద నిర్వహణ, నిత్యావసర వస్తువుల సరఫరాలో 2,818 మంది స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2025 మే 7న 244 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ కృత్రిమ విన్యాసాలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు, విద్యుత్ దీపాల ఆర్పివేత, ప్రజల తరలింపు, అగ్నిమాపక చర్యలు, గాలింపు, రక్షణ చర్యలు, క్షతగాత్రుల తరలింపు, అత్యవసర వైద్య ఏర్పాట్లను ఈ విన్యాసాల్లో పరీక్షించారు.ఇది ఎన్సీసీకి ఎలా భిన్నం?జాతీయ సేవలో పౌరులు లేదా స్వచ్ఛంద సేవకులను భాగస్వాములను చేసే సంస్థలు భారత్లో ఇప్పటికే ఉన్నాయి. అయితే వాటి ఉద్దేశాలు వేర్వేరుగా ఉంటాయి. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) ప్రధానంగా యువతకు సంబంధించిన సంస్థ. 1948 ఎన్సీసీ చట్టం కింద ఏర్పాటైన ఈ సంస్థ విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవా భావాన్ని పెంపొందించే శిక్షణ అందిస్తుంది.ఎన్సీసీ క్యాడెట్లు సామాజిక సేవ, విపత్తు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అయితే ఎన్సీసీ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే దళం కాదు. యువత అభివృద్ధి, శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుంది. మరోవైపు సివిల్ డిఫెన్స్ ను ప్రత్యేకంగా పౌరుల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత కోసం రూపొందించారు.హోమ్ గార్డులు, టెరిటోరియల్ ఆర్మీ సంగతేంటి?పోలీసులకు సహాయం చేసేందుకు హోమ్ గార్డులను 1946లో తొలిసారిగా స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటు చేశారు. 1962 భారత్-చైనా యుద్ధం తరువాత మరింత ఏకరీతి హోమ్ గార్డుల వ్యవస్థను అభివృద్ధి చేయాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహించింది. వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, తుపాన్లు వంటి అత్యవసర పరిస్థితుల్లో హోమ్ గార్డులు పోలీసులకు సహాయం చేయడంతో పాటు అధికారులకు తోడ్పడవచ్చు. వారు సివిల్ డిఫెన్స్ విధులను కూడా నిర్వహించవచ్చు.హోమ్ గార్డులు ప్రధానంగా పోలీసులకు సహాయక దళంగా పనిచేస్తారు. సివిల్ డిఫెన్స్ మాత్రం పౌరుల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధతపై దృష్టి పెడుతుంది. అలాగే హోమ్ గార్డులు వేతనం పొందే స్వచ్ఛంద సేవకుల దళం. అయితే విధులకు పిలిచిన రోజులకు మాత్రమే గౌరవ వేతనం లేదా కూలీ అందుతుంది.టెరిటోరియల్ ఆర్మీ కూడా పౌరులు స్వచ్ఛందంగా జాతీయ భద్రతా బాధ్యతలు చేపట్టే మరో ఉదాహరణ. అయితే ఇది సివిల్ డిఫెన్స్కు పూర్తిగా భిన్నమైనది. టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది సాధారణంగా తమ తమ వృత్తుల్లో పౌరులుగా ఉంటారు. అయితే వారు సైనిక శిక్షణ పొందుతారు. సైనిక సేవకు పిలిచినప్పుడు విధులు నిర్వర్తించవచ్చు. వారు సైనిక రిజర్వ్ వ్యవస్థలో భాగంగా ఉంటారు. అవసరమైనప్పుడు సాధారణ సైన్యానికి సహాయం చేయవచ్చు. టెరిటోరియల్ ఆర్మీ సిబ్బందికి నెలవారీ స్థిర వేతనం ఉండదు. అయితే శిక్షణ సమయంలో, విధుల్లో ఉన్నప్పుడు అదే హోదాలోని సైనిక అధికారికి లభించే వేతనం, భత్యాల స్థాయిలో చెల్లింపులు అందుతాయి. దీనికి భిన్నంగా సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులు సైనికులు కాదు. అలాగే వారు హోమ్ గార్డులకు పూర్తిగా సమానమైన వారు కూడా కాదు.కొత్త స్వచ్ఛంద సేవకులకు ఆయుధాలు ఇస్తారా?ప్రతిపాదిత సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులకు ఆయుధాలు ఇస్తారని మోదీ ప్రకటనలో ఎలాంటి సూచన లేదు. సివిల్ డిఫెన్స్ ఉద్దేశం పౌరులను రక్షించడం, అత్యవసర సేవలకు సహాయం చేయడం, సంక్షోభ సమయంలో కీలక సేవలను కొనసాగించడం. ఇది మరో సాయుధ దళం కాదు. అమెరికా దీనికి ఉదాహరణ. అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ఆయుధాలను కలిగి ఉండే, ధరించే హక్కును రక్షిస్తూ “క్రమబద్ధమైన మిలీషియా” గురించి ప్రస్తావిస్తుంది. ఆ మిలీషియా ప్రస్తావన తొలినాటి అమెరికాలోని పౌర సైనిక దళాల వ్యవస్థను ప్రతిబింబించింది. తరువాత వ్యక్తిగతంగా తుపాకులు కలిగి ఉండే హక్కుపై అమెరికాలో జరుగుతున్న రాజ్యాంగపరమైన చర్చలో ఈ నిబంధన కీలకంగా మారింది.మొత్తానికి సివిల్ డిఫెన్స్ అంటే యుద్ధం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో పౌరులను రక్షించడం, అత్యవసర సేవలకు సహాయం చేయడం, ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ముందస్తు సన్నద్ధత కల్పించే వ్యవస్థ. -
ఎవరీ కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్? స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీకి..
భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించారు. ఈ ఏడాది ‘వందే మాతరం’ 150 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తొలిసారిగా జాతీయ గేయం ‘వందే మాతరం’ను పూర్తిస్థాయిలో ఆలపించారు. ఈ కార్యక్రమంలో జెండా ఎగురవేసే సమయంలో ప్రధాని మోదీకి సమీపంలో నిలబడిన ఒక మహిళా సైనికాధికారి ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఇంతకీ ఎవరామె అంటే..ఆ ఆధికారిణి కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్. ఆమె భారత సైన్యంలో ఒక కమిషన్డ్ అధికారిణి. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో, ఎర్రకోట ప్రాకారాలపై ప్రధాన మంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తున్నప్పుడు ఆయనకు సహాయపడే ఒక నిర్దిష్ట లాంఛనప్రాయ బాధ్యతను ఆమెకు అప్పగించారు.ఎర్రకోటలో ఆమె పాత్ర ఏంటంటే..ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైనిక నియమావళి ప్రకారం జరుగుతాయి. ఇందులో గౌరవ వందనంగా(గార్డ్ ఆఫ్ ఆనర్) నుంచి జాతీయ పతాక వందనం (నేషనల్ ఫ్లాగ్ గార్డ్) వరకు ప్రతిదానికీ కేటాయించిన అధికారులు బాధ్యత వహిస్తారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం, జెండాను ఎగురవేసే క్షణంలో నేరుగా సహాయం చేయడమే కెప్టెన్ చౌహాన్ పని. ఈ కార్యక్రమం, స్వదేశీ 105mm లైట్ ఫీల్డ్ గన్లను ఉపయోగించి 1721 ఫీల్డ్ బ్యాటరీ కాల్చిన 21-గన్ సెల్యూట్తో నిర్వహిస్తారు.అందరి దృష్టిని ఆకర్షించడానికీ రీజన్..జెండా ఎగురవేసే సమయంలో ప్రధాని మోదీ పక్కనే కనిపించడంతో అందరి దృష్టిని ఆమె అమితంగా ఆకర్షించింది. పైగా ఈ దృశ్యం నారీ శక్తి లేదా మహిళా సాధికారతపై భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలిచింది. అలాగే ఇటీవల సంవత్సరాలలో భారత సాయుధ దళాలలో, పోరాట విధుల నుంచి భారతదేశపు అత్యంత ఎత్తైన పర్వత సరిహద్దులలోని పోస్టింగ్ల వరకు మహిళా అధికారుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న ధోరణికి అనుగుణంగా ఉంది. View this post on Instagram A post shared by ᴅᴇꜰᴇɴᴄᴇ ʟᴏᴠᴇʀꜱ (@defence_lovers121) (చదవండి: Independence Day 2026: ఎర్రకోటపై మోదీ ‘బంధనీ’ సఫా.. చుక్కల వెనుక వేల ఏళ్ల భారతీయ చరిత్ర!) -
మోదీ ప్రసంగం.. దద్దరిల్లిన ఎర్రకోట
-
ఎర్రకోటపై మోదీ ‘బంధనీ’ సఫా.. చుక్కల వెనుక వేల ఏళ్ల భారతీయ చరిత్ర!
ప్రధాని నరేంద్ర మోదీ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన వేళ.. ఆయన ధరించిన మరూన్ రంగు బంధనీ సఫా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పసుపు, తెలుపు రంగుల చిన్నచిన్న చుక్కలతో కనిపించిన ఆ సఫా కేవలం అలంకరణ కాదు.. శతాబ్దాల నాటి భారతీయ వస్త్ర సంప్రదాయానికి ప్రతీక.బంధనీ లేదా బంధేజ్ అనేది వస్త్రాన్ని కట్టి, రంగు అద్దే ప్రత్యేకమైన టై-డై కళ. ఇందులో కనిపించే చిన్నచిన్న చుక్కలు వస్త్రంపై ముద్రించేవి కావు. కళాకారులు వస్త్రంలోని అతి చిన్న భాగాలను చేతితో తీసుకుని, దారంతో గట్టిగా కట్టి, ఆ తర్వాత రంగులో ముంచుతారు. కట్టిన భాగాలకు రంగు అంటకపోవడంతో ఆ ప్రాంతాల్లో తెల్లటి లేదా ఇతర రంగుల చుక్కలు, ఆకృతులు ఏర్పడతాయి. ‘బంధనీ’ అనే పేరు సంస్కృతంలోని ‘బంధ్’ అంటే కట్టడం అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. గుజరాత్లో దీనిని బంధేజ్గా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో బంధనీ లేదా బంధ్నీగా పిలుస్తారు.చుక్కల వెనుక శతాబ్దాల చరిత్రభారతదేశంలో టై-డై వస్త్ర సంప్రదాయాలకు ఎంతో పురాతన చరిత్ర ఉంది. అజంతా చిత్రాల్లో కనిపించే చుక్కలతో కూడిన వస్త్రాలను ఈ సంప్రదాయానికి సంబంధించిన ఆధారాలుగా కొందరు పరిశోధకులు పేర్కొంటారు. అయితే నేటి బంధనీ కళను నేరుగా వేల సంవత్సరాల క్రితం నాటి సంప్రదాయంతో అనుసంధానించడం మాత్రం అంత సులభం కాదు. తరువాతి కాలంలో గుజరాత్, రాజస్థాన్ బంధనీ కళకు ప్రధాన కేంద్రాలుగా ఎదిగాయి. ముఖ్యంగా గుజరాత్లోని ఖత్రి కళాకారులు ఈ కళను అభివృద్ధి చేసి తరతరాలకు అందించారు. జామ్నగర్, కచ్ ప్రాంతాలు నేటికీ బంధనీకి ప్రసిద్ధి చెందాయి. చిన్న చుక్కల నుంచి పూలు, రేఖాగణిత ఆకృతులు, సంక్లిష్టమైన డిజైన్ల వరకు బంధనీలో ఎన్నో రకాల నమూనాలు కనిపిస్తాయి. చీరలకే పరిమితం కాకుండా ఓఢ్నీలు, ఘాగ్రాలు, తలపాగాలు, సఫాలు వంటి వాటిలోనూ ఈ వస్త్రాన్ని ఉపయోగించారు.రాజవంశాల నుంచి ఎర్రకోట వరకు..బంధనీ వస్త్రానికి రాజకుటుంబాల వస్త్రధారణలోనూ ప్రత్యేక స్థానం ఉంది. రాజస్థాన్ రాజకుటుంబాలకు చెందిన మహిళలు, పురుషుల సంప్రదాయ వస్త్రాల్లోనూ ఇది కనిపించేది. అందుకే ఎర్రకోటపై మోదీ ధరించిన బంధనీ సఫా కేవలం రంగురంగుల తలపాగా కాదు. భారతీయ చేనేత, ప్రాంతీయ సంస్కృతి, కళాకారుల నైపుణ్యం, సంప్రదాయ వస్త్ర వైభవాన్ని జాతీయ వేదికపై ప్రదర్శించిన ఒక ప్రతీకగా నిలిచింది. చిన్నచిన్న చుక్కలతో కనిపించే ఆ సఫా వెనుక.. భారతీయ వస్త్రకళకు చెందిన పెద్ద చరిత్ర దాగి ఉంది.(చదవండి: తొలి స్వాతంత్ర్య దినోత్సవం రోజున వందేమాతరం ఆలపించింది ఎవరో తెలుసా..!) -
ఎర్రకోటపై మువ్వన్నెల జెండా.. 13వ సారి జెండా ఎగరేసిన మోదీ
-
నక్సలిజంపై మోదీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో కొత్త తరహా శత్రువుగా ‘మానసిక నక్సల్స్’ ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీలోని ఎర్రకోట పై నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన ఆయన.. అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో ఇలాంటి భావజాలం ఉన్న వారు పాతుకుపోయారని తెలిపారు. వారిని గుర్తించి, ఒంటరి చేయాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు.ఎర్రకోట వేదికగా నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘‘ఎన్నో ఏళ్లుగా మావోయిస్టు భావజాలం ఉన్న కొందరు దేశంలోని అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో పాతుకుపోయారు. ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగా వ్యవహరిస్తూ విధానాలపై ఆ భావజాల ప్రభావాన్ని చూపిస్తున్నారు. అయితే సాయుధ నక్సల్స్ అంతరించినప్పటికీ.. ‘మానసిక నక్సల్స్’ మాత్రం ఇంకా ఉన్నారు ఈ భావజాలాన్ని కలిగి ఉన్నవారు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. హింస, సామాజిక విభేదాలకు మార్గం సుగమం చేస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేందుకు వారు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తున్నారు" అని మోదీ అన్నారు.అయితే అడవుల్లో ఉన్న సాయుధ నక్సల్స్ను నిర్మూలించడంలో దేశం విజయం సాధించిందని, తద్వారా ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేశామని చెప్పారు. ఇప్పుడు మనం ఈ మానసిక నక్సల్స్ను గుర్తించాలి, వారిని ఒంటరి చేయాలి. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో యువతను ప్రధాన స్రవంతి కృషితో అనుసంధానం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ యువతను సరైన దిశలో నడిపిస్తూ, అభివృద్ధి లక్ష్యాల వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రధాని స్పష్టం చేశారు.ఎర్ర ఉగ్రవాదం తుపాకీ తూటాలతో దేశంలోని పలు ప్రాంతాలను సంవత్సరాల తరబడి బందీలుగా ఉంచిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలను రక్షించేందుకు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో 3,500 మందికి పైగా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. యుద్ధాల్లో మరణించే వారి సంఖ్య కంటే ఇది ఎక్కువని ఆయన పేర్కొన్నారు. 80 ఏళ్ల క్రితం భారత్ స్వాతంత్ర్యం సాధించగా, ఇప్పుడు నక్సలిజం పట్టు నుంచి దేశం మరోసారి విముక్తి పొందుతోందని అన్నారు. -
స్వాతంత్ర్య దినోత్సవం వేళ రూబియో కీలక సందేశం
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహపూర్వక సంబంధం ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని రూబియో అన్నారు.అమెరికా తరఫున భారత ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు రూబియో తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహం, కుటుంబ సంబంధాలే భారత్-అమెరికా భాగస్వామ్యానికి బలమైన పునాది అని ఆయన వివరించారు. రక్షణ, ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు (AI), అంతరిక్ష రంగం, వాణిజ్యం తదితర కీలక రంగాల్లో ఇరు దేశాల సహకారం కొనసాగుతోందని తెలిపారు. ఈ సహకారం భారత్, అమెరికాతో పాటు మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, బలంగా, సుసంపన్నంగా మార్చేందుకు దోహదపడుతోందని అన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి నిర్మించబోయే భాగస్వామ్యంపై అమెరికా ఆశాభావంతో ఉందని పేర్కొన్నారు.అమెరికాలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని పలు రాష్ట్రాలు ప్రత్యేక ప్రకటనలు జారీ చేశాయి. ఆగస్టు 15, 2026ను ‘ఇండియా డే’గా గుర్తిస్తూ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికాలోని భారతీయ ప్రవాసుల సేవలు, ఆ దేశ అభివృద్ధికి వారు అందిస్తున్న సహకారాన్ని పలువురు అమెరికన్ సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు కొనియాడారు. భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య బలపడుతున్న సంబంధాలు కూడా ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
సమయం.. అవసరం.. సంకల్పం మనది: ఎర్రకోటపై ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: మన దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని.. ఆ అభివృద్ధిని ఆపడం ఎవరి వల్ల కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రక ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఎగరేసిన అనంతరం.. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది వేడుకల్లో ‘వందేమాతరం’ 150 ఏళ్ల వారసత్వం, ‘యువశక్తి–వికసిత్ భారత్ 2047’ అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ప్రధాని.. వారి కలలు, ఆశయాల స్ఫూర్తితో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఇవాళ ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని.. ప్రతీ భారతీయుడి గుండెలో వందేమాతరం ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు. దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని, పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘‘సమయం.. అవసరం.. సంకల్పం మనది. సామర్థ్యం పెంచుకుని విజయం సాధిద్దాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.వికసిత్ భారత్ కోసం సప్తధార ప్రణాళికతయారీ శక్తిఫుడ్ ప్రొడక్షన్టెక్నాలజీగతిశక్తిరక్షణ రంగంగ్రీన్ ఎకానమీ.. బ్లూ ఎకానమీయువశక్తి25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారుతమ హయాంలో దేశ వికాసం కోసం కృషి చేశామని.. వివిధ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందినట్లు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడి తమ జీవితాలను మెరుగుపర్చుకున్నారని ప్రధాని తెలిపారు. రక్షణ ఉత్పత్తులు పెరిగాయని, అనేక రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కరోనా నుంచి యుద్ధాల వరకు సవాళ్లు ఎదుర్కొన్నాంగత 12 ఏళ్లలో భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని ప్రధాని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల మధ్య కూడా దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగిందన్నారు. యూపీఏ హయాంలో ప్రజలు భయాందోళనతో గడిపారని.. ఆ తర్వాత కూడా ప్రజల్ని భయపెట్టడమే పనిగా కొందరు పెట్టుకున్నారని అన్నారు. యుద్ధాలతో పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్లు దొరకవని జనాలకు భయపెట్టారని.. కానీ, అడ్డంకులు అధిగమించామని ప్రధాని అన్నారు. దేశ ప్రగతిని ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు.సంస్కరణలు మరింత వేగంగా..ఇక ఆగేదే లేదని.. తగ్గేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశాభివృద్ధికి ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేస్తామని ప్రధాని తెలిపారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతిక రంగంలో ముందంజ వేయడమే లక్ష్యమన్నారు. రైల్వే విద్యుద్దీకరణ, మెట్రో విస్తరణ, హైడ్రోజన్ రైలు, సెమీకండక్టర్ రంగం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇంధన భద్రతను అత్యవసర అంశంగా పరిగణించి.. దాని కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించాలని అభిప్రాయపడ్డారు.ఆత్మనిర్భర్ భారత్.. మేడిన్ ఇండియానే లక్ష్యంభారత్ స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో భారత్ ప్రపంచానికి కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ‘‘మన ఉత్పత్తుల ఆధారంగానే ప్రపంచంలో మనకు గుర్తింపు రావాలి. ప్రతి మార్కెట్కు భారత ఉత్పత్తులు చేరాలి’’ అని అన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భారత కంపెనీల సంఖ్య పెరగాలని, ప్రపంచ స్థాయి ఫార్మా సంస్థలు భారత్ నుంచి రావాలని లక్ష్యాలను వివరించారు.ఉగ్రవాదం, నక్సలిజంపై పోరాటం కొనసాగుతుందిదేశ భద్రతపై మాట్లాడుతూ.. సరిహద్దుల అవతల, ఇవతల భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం అనేక కుటుంబాలను నాశనం చేసిందని, నక్సలిజం వల్ల కూడా ఎంతో నష్టం జరిగిందని పేర్కొన్నారు. దేశాన్ని మావోయిజం నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.యువత తోడుంటేనే..దేశం ముందున్న అతిపెద్ద లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని స్పష్టం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలబెట్టాలంటే యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. యువతే దేశానికి వెన్నెముక అని పేర్కొన్న ప్రధాని.. ఏఐ, సాంకేతికత, క్రీడలు, ఆవిష్కరణల రంగాల్లో యువత సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువశక్తితోనే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందని చెప్పారు. అందుకోసం యువత తనకు మద్దతు నిలవాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనే మాటే వినిపించడం లేదని.. ప్రతీ దేశం దాని సంక్షోభాల మీదే దృష్టిసారిస్తున్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో భారత్ గ్లోబల్ లీడర్షిప్, సప్లై చైన్గా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తే ప్రపంచం మనవైపు చూస్తుందని అన్నారాయన. మహిళా బిల్లుకు ముందుకు రండిమహిళా సాధికారతపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వారి హక్కు అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాజకీయాలను పక్కన పెట్టి మహిళల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే క్రెడిట్ వారే తీసుకోవాలంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను ‘లక్పతి దీదీ’లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.తొలిసారి ఎర్రకోటపై వందేమాతరంఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ప్రత్యేకంగా నిలిచింది. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ తొలిసారి ఎర్రకోట అధికారిక కార్యక్రమంలో ఆలపించారు. ప్రతి భారతీయుడి హృదయం వందేమాతరం నినాదంతో మారుమోగుతోందని ప్రధాని అన్నారు. వేడుకలు ఇలా.. స్వాతంత్య్ర వేడుకలకు ముందు ప్రధాని మోదీ రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం 21 గన్ సెల్యూట్, సైనిక గౌరవ కార్యక్రమాలు జరిగాయి. ఎర్రకోట ప్రాంగణంలో పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత, మహిళలు, స్వయం సమృద్ధి, ఆవిష్కరణలే కీలకమని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా దేశానికి సందేశం ఇచ్చారు. -
అప్పట్లో మోదీ ఉండి ఉంటేనా...!!!
లక్నో: భారతదేశ విభజనకు బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, అప్పట్లో దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ఉండి ఉంటే దేశానికి ఎలాంటి నష్టమూ జరిగేది కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సర్దార్ వల్లభ్భాయ్పటేల్ లాంటి వ్యక్తి దేశ ప్రధానిగా ఉన్నా దేశం ముక్కలయ్యేది కాదని స్పష్టం చేశారు. 1948 నాటి దేశ విభజనపై శుక్రవారం లక్నోలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ విభజనతోపాటు తదనంతరం చెలరేగిన హింసకూ అసలు బాధ్యత కాంగ్రెస్దేనని పునరుద్ఘాటించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పుడు నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయిఉంటే భారత్కు ఎవరూ ఇసుమంత నష్టమూ చేయగలిగి ఉండేవారు కాదు’’అని చెప్పారు. కాంగ్రెస్ సభ్యుల పిరికితనానికి దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. సీఏఏ నిరసన ప్రదర్శనల సందర్భంగానూ కాంగ్రెస్ అలాంటి వ్యక్తిత్వాన్నే చూపిందని వ్యాఖ్యానించారు. విభజన, ఇతర చారిత్రక తప్పులకు భారతదేశం ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిజం, ఇతర అతివాద రూపాల రూపంలో ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని ఆదిత్యనాథ్ అన్నారు. విభజనను ‘‘మానవాళి చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం’’గా ఆయన అభివరి్ణంచారు. -
ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి
న్యూఢిల్లీ: ఇటలీతో భారత్కు బలమైన సంబంధాలు ఉన్నాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ శుక్రవారం స్పష్టంచేశారు. ఎవరైనా సరే బహిరంగ కార్యక్రమాల్లో మాట్లాడేటప్పుడు గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలని చెప్పారు. గౌరవం అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని అన్నారు. విదేశీ నేతలను ఆలింగనం చేసుకోవడమే ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానంగా మారిందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై రణ«దీర్ జైస్వాల్ పరోక్షంగా స్పందించారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీని ప్రధాని మోదీ ఆలింగనం చేసుకోవడం పెద్ద తప్పు అన్నట్టుగా రాహుల్ ఎద్దేవా చేయడాన్ని ఖండించారు. ఇటీవలి కాలంలో భారత్, ఇటలీ మధ్య సంబంధాలు మరింత విస్తరించాయని చెప్పారు. పరస్పర గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం దౌత్యపరమైన విధానంలో కీలకమైన అంశమని తెలిపారు. -
రాహుల్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ధ్వజం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత విదేశాంగ విధానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు చాలా చిల్లర వ్యాఖ్యలంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి నుండి అటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని రాజ్నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడి పదవి గౌరవాన్ని రాహుల్ దెబ్బతీస్తున్నారని, ఈ వ్యాఖ్యలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య చర్యకు ముప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘నిన్న ప్రధాని నరేంద్ర మోదీపై, భారత విదేశాంగ విధానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నీచమైనవి, ఖండించదగినవి. ఇది వ్యక్తిగతంగా నాకు కూడా బాధ కలిగిస్తోంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ ప్రతిపక్ష నాయకుడి నుండీ ఇంతటి అసభ్యకరమైన, ఊహించలేని ప్రవర్తనను నేను ఎన్నడూ చూడలేదు. ఇటువంటి ప్రవర్తన ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లడానికి తీవ్రమైన సంకేతం’ అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.కాగా, ప్రధాని మోదీ విదేశాంగ విధానం అంతా విదేశీ నాయకులను కౌగిలించుకోవడమేనని రాహుల్ గాంధీ ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలో జరిగిన రచనాత్మక కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ ప్రసంగిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తన అసలైన స్వభావాన్ని ఎప్పుడో కోల్పోయిందని, ప్రస్తుతం అది అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడిదారుల చేతిలో ఒక సాధనంగా మారిందని ఆరోపించారు. -
మానవ చరిత్రలో కన్నీటి అధ్యాయం.. మోదీ
సాక్షి, ఢిల్లీ: దేశ చరిత్రలో అత్యంత బాధాకరమైన అధ్యాయాలలో దేశ విభజన ఒకటని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ఆగస్టు 14 "విభజన భయానక స్మృతి దినం" సందర్భంగా ఎక్స్ ఖాతాలో విభజన దినోత్సవ విషాద స్మృతులను ఆయన పంచుకున్నారు. దేశ విభజన అంతులేని జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందని, కుటుంబాలను నిర్వాసితులను చేసిందని అపారమైన మానవ వేదనకు కారణమైందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.ప్రధాని ఎక్స్ ఖాతాలో "ఈరోజు మనం విభజన విషాధ స్మృతి దినాన్ని పాటిస్తున్నాము. విభజన కారణంగా ప్రభావితమైన ప్రతి ఒక్కరి ధైర్యాన్ని మనం గుర్తుచేసుకుంటున్నాము. ఇది అనేక జీవితాలను ఛిన్నభిన్నం చేసిన చారిత్రక క్షణం... కుటుంబాలు నిర్వాసితులయ్యాయి, ప్రియమైన వారిని కోల్పోయారు అపారమైన బాధను అనుభవించారు. " అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ఈ విషాదాన్ని తట్టుకుని నిలబడిన వారి పట్టుదలను ఆ సందర్భంగా ఆయన కొనియాడారు.ఊహించని కష్టాలు ఎదురైనప్పటికీ, చాలా మంది తమ జీవితాలను మళ్లీ నిర్మించుకుని దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. "వారి జీవిత ప్రయాణాలు మానవ ఆత్మ యొక్క బలాన్ని మనకు గుర్తుచేస్తాయి. మన దేశంలో ఐక్యతను, సౌభాత్రాన్ని కాపాడుకోవాలనే మన సంకల్పాన్ని ఈ రోజు మరింతగా బలోపేతం చేయాలి. ఒక వికసిత్ భారత్ను నిర్మించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం" అని ఆయన జోడించారు.కాగా విభజన బాధితులకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సైతం నివాళులర్పించారు. భారతదేశ విభజన వల్ల జరిగిన అపారమైన మానవ వేదనను ఆయన గుర్తుచేసుకున్నారు. ఎంతటి కష్టాలు ఎదురైనా తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్న ప్రజల ధైర్యాన్ని మరియు పట్టుదలను ఆయన ప్రశంసించారు.లక్షలో సంఖ్యలో మరణాలు1947లో జరిగిన దేశ విభజన మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద విషాదకరమైన వలసలలో ఒకటి. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ దేశాలుగా విడిపోయింది. ఆ సమయంలో దాదాపు 1 కోటి 50 లక్షల మంది ప్రజలు సరిహద్దులు దాటారు. విభజన రేఖల వల్ల రెండు వైపులా తీవ్రమైన మతకల్లోలాలు జరిగాయి. ప్రజలు తమ ఇళ్లు, భూములు, వ్యాపారాలను ఉన్నపళంగా వదిలి శరణార్థులుగా మారారు. రవాణాపై దాడులు శరణార్థులతో వెళ్తున్న రైళ్లు, బస్సులు నడిచి వెళ్తున్న కాన్వాయ్లపై దాడులు జరిగాయి. సుమారు 2 లక్షల నుండి 20 లక్షల మంది వరకు చనిపోయారని అంచనా. లక్షలాది మంది ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయి, ఏళ్ల తరబడి శరణార్థుల శిబిరాల్లో మగ్గిపోయారు. ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన ప్రజల త్యాగాల జ్ఞాపకార్థం 2021 నుండి ఏటా ఈ రోజును "విభజన భయానక స్మృతి దినం" గా జరుపుకుంటున్నారు. -
‘హగ్’ కామెంట్ రచ్చ.. షీలా వీడియోతో బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ నేతలతో కొనసాగించే సాన్నిహిత్యంపై విమర్శలు చేస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త మాటల యుద్ధానికి తెరలేపాయి. మరీ ముఖ్యంగా షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్పై బీజేపీ, మోదీ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గురువారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై విమర్శలు చేశారు. ‘‘మోదీకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వింత ఆలోచనలు వస్తుంటాయి. ఇదే విదేశాంగ విధానం అనుకుంటున్నారు’’ అంటూ వేదికపైనే కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను ఆలింగనం చేసుకున్నారు.RaGa is in full roast mode.🤣🔥Rahul Gandhi just gave the most savage demonstration of “hug diplomacy”.*Runs and hugs Sandeep Dikshit*The hall couldn’t stop laughing. This one will travel. pic.twitter.com/XodlA8MvS8— Rajat Jain (@RajatJain) August 13, 2026ఈ సమయంలో సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘నన్ను మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా?’’ అని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఘోల్లున నవ్వారు. దీనికి రాహుల్ గాంధీ.. ‘‘ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు’’ అంటూ బదులివ్వడంతో సభలో నవ్వులు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రాజకీయ దుమారం మొదలైంది.మోదీ ‘హగ్ డిప్లమసీ’పై రాహుల్ సెటైర్పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ కౌగిలించుకున్న సందర్భాలను ఉద్దేశించే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. విదేశాంగ విధానంలో దౌత్య సంబంధాల కంటే వ్యక్తిగత ఇమేజ్, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెస్ గతంలోనూ మోదీపై విమర్శలు చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రధాని స్థాయిని, అంతర్జాతీయ సంబంధాలను ఎగతాళి చేసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించింది. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడింది.బీజేపీ–ఆర్ఎస్ఎస్పై రాహుల్ విమర్శలుఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత పరిస్థితులపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తన అసలు స్వరూపాన్ని కోల్పోయిందని, పెద్ద పారిశ్రామిక వర్గాల ప్రభావంలోకి వెళ్లిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీ, అంబానీల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.‘‘మోదీ, అమిత్ షాకు నిద్ర లేకుండా చేస్తాం’’కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. అయితే తమ పోరాటం ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పారు.సందీప్ దీక్షిత్ నేపథ్యంసందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక అభివృద్ధి రంగంలో పనిచేసిన ఆయన.. ‘సంకేత్’ అనే సంస్థను నడిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగుతూ ఢిల్లీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. షీలా దీక్షిత్ ప్రస్తావనతో బీజేపీ కౌంటర్ఈ వివాదంలో బీజేపీ నేతలు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చారు. 2024లో ప్రధాని మోదీ.. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ షీలా దీక్షిత్ను గౌరవిస్తూ, ఆమెపై వచ్చిన ఆరోపణల తీరుపై బాధపడ్డానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇప్పుడు అదే మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ విమర్శిస్తోంది. మెలోనీ పేరును ప్రస్తావిస్తూ ఓ మహిళా దేశాధినేతను రాజకీయ వ్యంగ్యంలోకి లాగడం సరికాదని ఆరోపిస్తోంది. మరోవైపు.. పలువురు సీనియర్ జర్నలిస్టులు సైతం ఈ తరహా రాజకీయం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. In 2024, PM Modi publicly said he was PAINED by the way Sheila Dikshit was "INSULTED" with baseless Corruption allegations.Today her own son, Sandeep Dikshit, stands on stage with Rahul & mocks the same Prime Minister 💔> He reduces a diplomatic gesture to a cheap joke by… pic.twitter.com/tALdiFnJhd— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 13, 2026‘‘మెలోనీ పేరు ప్రస్తావించలేదు’’రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించింది. ఆయన ఎక్కడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రధాని మోదీ విదేశాంగ శైలిపై రాజకీయ విమర్శ మాత్రమే చేశారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతలు.. అంతర్జాతీయ దౌత్యంలో వ్యక్తిగత హావభావాలను ఎలా చూపిస్తున్నారనే అంశంపైనే రాహుల్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రధాని మోదీ విదేశీ నేతలతో చేసే కౌగిలింతలను కాంగ్రెస్ గతంలోనూ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు.ట్రెండింగ్లో మెలోనీప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఆ ట్రెండ్ను పసిగట్టిన ఇద్దరూ.. అందుకు తగ్గట్లే మెలోడీ పేరుతో సరదా పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలో యూరప్ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఆమెకు మెలోడీ చాక్లెట్లు బహుకరించడం గమనార్హం. అంతెందుకు కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతోనూ ఈ మధ్య నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. అయితే.. తాజా రాహుల్ గాంధీ హగ్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యంతరాల నేపథ్యంతో నెట్టింట మెలోనీ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చేశారు. -
జెన్జీలూ.. పార్లమెంట్కు రండి..!
బాలీవుడ్ నటుడు, ఎంపీ రవికిషన్ ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండింగ్గా మారారు. ఆయన చెప్పిన మాటలు, డ్యాన్స్ స్టెప్పులు యువతకు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జెన్జీలు ఆయన వీడియోలను వైరల్ చేస్తున్నారు.తాజాగా రవికిషన్ యువతపై ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జనరేషన్ జెడ్ సృజనాత్మకతకు సెల్యూట్ చేస్తున్నాను. మీరు చేస్తున్న సృజనాత్మక పనులు అద్భుతంగా ఉన్నాయి. నా మాటలు, నా పేరును మీ శైలిలో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒకప్పుడు గుర్తింపు లేకుండా ఉన్న నన్ను మళ్లీ ప్రజల్లోకి తీసుకొచ్చింది మీరే. జెన్జీలకు నా నమస్కారాలు’’ అంటూ యువతకు కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాకుండా యువతను పార్లమెంట్కు ఆహ్వానించారు. ‘దేశంలోనే అతిపెద్దది పంచాయతీ పార్లమెంట్. ఇక్కడికి మీ అందరికీ స్వాగతం. భారత భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దేశ జనాభాలో 65 శాతం మంది యువతే ఉన్నారు’ అని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా యువత అభిప్రాయాలను తెలుసుకుంటున్నారని రవికిషన్ చెప్పారు. దేశ అత్యున్నత వేదికలో యువత మాటలకు ప్రాధాన్యం పెరుగుతోందని వివరించారు. సినిమాల విషయానికి వస్తే.. రవికిషన్ ప్రస్తుతం ‘మిర్జాపూర్: ది మూవీ’, ‘ఖోస్లా కా ఘోస్లా 2’, ‘నాగ్జిల్లా’ చిత్రాల్లో నటిస్తున్నారు. -
రీల్స్ యుగంలో షార్ట్కట్లు వద్దు!
న్యూఢిల్లీ: యువత తాము ఆదర్శంగా తీసుకునే వ్యక్తుల ఆత్మకథలు చదవాలని, తద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల ప్రభావంతో పక్కదారి పట్టకుండా ఉండవచ్చునని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పరోక్షంగా వ్యాఖ్యానించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ‘‘ట్రైంఫ్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’’పేరుతో రాసిన ఆత్మకథను ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ‘‘ఈ రీల్స్ యుగం’లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మిమ్మల్ని కొన్ని దారుల్లోకి మళ్లించవచ్చు. ఓడించవచ్చు. షార్ట్కట్ల కాలంలో రైల్వేస్టేషన్లలో ప్రదర్శించే ఓ సందేశాన్ని గుర్తు చేసుకుందాం. ‘ఏ షార్ట్కట్ విల్ కట్ యూ షార్ట్’(దగ్గరి దారిలో వెళ్లాలనుకుంటే మీరు ఖతమైపోతారన్న అర్థం) అని ఎందుకు రాస్తారంటే కొంతమందికి రైల్వే బ్రిడ్జీలు ఎక్కి అవతలకు వెళ్లడం కాకుండా.. పట్టాలపై దూకి వెళ్లే అలవాటు ఉంటుంది. అయితే జీవితంలో ముందుకెళ్లేందుకు ఒక షార్ట్కట్ ఉందంటే అది మీరు ఆదర్శంగా తీసుకునే వ్యక్తుల ఆత్మకథలు చదవడం’’అని వ్యాఖ్యానించారు. ఆత్మకథలు ఆయా కాలాల పరిస్థితులను వారి జీవితానుభవాల దృష్టిలోంచి ఆవిష్కరిస్తాయి కాబట్టి యువత తాము ఆదర్శంగా భావించే నేతలు, వ్యక్తుల ఆత్మకథలు చదవడం అలవాటు చేసుకోవాలని కోరారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కృత నిశ్చయంతో ఒక వ్యక్తి ఎలా అత్యున్నత రాజ్యాంగ పదవి పొందవచ్చు తెలుసుకునేందుకు రామ్నాథ్ కోవింద్ ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. పదవీ విరమణ తరువాత కూడా కోవింద్ ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’’విషయంపై పనిచేస్తూ తన ప్రజా జీవితాన్ని కొనసాగిస్తూండటాన్ని ప్రధాని కొనియాడారు. ఈ జమిలీ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే అవకాశముందన్నారు. కోవింద్ ఆత్మకథ నుంచి నవతరం నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రధాని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత మంది యువకులు కోవింద్లా ఎదగాలని ఆకాంక్షించారు. పల్లెటూరి వాడిని: కోవింద్ ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ ‘‘కాన్పూర్ సమీపంలోని గ్రామీణ ప్రాంతపు పల్లెటూరి వాడిని నేను. గ్రామస్తుల నుంచే సహానుభూతి, ప్రేమలను నేర్చుకున్నా’’అని తెలిపారు. చిన్నప్పుడు వర్షాలొస్తే ఇల్లు మొత్తం కారిపోయేదని, వర్షం ఎప్పుడు ఆగుతుందా అని ఎదురు చూసే వారమని తన కష్టాలను గుర్తు చేసుకున్నారు. -
మోదీని ఆటపట్టించిన ఖర్గే.. సరదా సన్నివేశం
ఢిల్లీ: ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతల మధ్య ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ వేదిక వద్దకు రాగానే అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తదితరులు నిలబడి ఉన్నారు. ప్రధాని మోదీ మొదట రాహుల్ గాంధీకి కరచాలనం చేశారు.ఆ తర్వాత ప్రధాని మోదీ నమస్కరిస్తూ ప్రియాంకా గాంధీ వైపు దృష్టి సారించారు. ప్రియాంకా జీ ఎలా ఉన్నారంటూ ప్రధాని పలకరించారు. ‘‘నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?" అంటూ ప్రియాంక బదులిచ్చారు. ‘‘నేను అలాగే ఉన్నాను’’ అని ప్రధాని నవ్వుతూ ముందుకు నడిచారు. ఈ సంభాషణను గమనిస్తున్న మల్లికార్జున ఖర్గే వెంటనే జోక్యం చేసుకున్నారు. ‘‘అలా ఏమీ లేరు.. కాస్త మారారు’’ అని ఖర్గే చమత్కరించారు. ‘‘అవునా’’ అంటూ నవ్వుతూ ప్రధాని మోదీ.. ఖర్గే చేతిపై తట్టారు. చిరునవ్వుల మధ్య ఇద్దరు నేతలు ఒకరికొకరు హై-ఫైవ్ ఇచ్చుకున్నారు.ఢిల్లీలో సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే, నాగ్పూర్కు చెందిన పారిశ్రామికవేత్త సారంఘ్ లఖానీల వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ జంట జూన్లో ముంబైలో వివాహం చేసుకోగా.. ఢిల్లీలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్ జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, గజేంద్ర సింగ్ షెకావత్, రాందాస్ అథవాలే, చిరాగ్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు.मौका और दस्तूर यही होता है सुप्रिया सुले की बेटी के विवाह समारोह कार्यक्रम में कांग्रेस के वरिष्ठ नेता मल्लिकार्जुन खड़गे जी ने मोदी जी के मजे ले लिए।खड़गे जी - भाई साहब थोड़ा सा बदल गए हैं।नरेंद्र मोदी जी - अच्छाखड़गे जी ने अपने दिल की बात कह दी जो सदन में कहते नहीं बनता था। pic.twitter.com/dDgzLbWO3V— Krishnadev Yadav (@krishna_news) August 12, 2026 -
మళ్లీ పాత నోట్ల రద్దు? పాత, కొత్త నోట్ల మధ్య తేడా ఇదే
-
జెన్జీపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్ మీడియా, రీల్స్ యుగంలో పెరుగుతున్న యువతకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. జీవితంలో విజయాన్ని సాధించేందుకు షార్ట్కట్స్ వెతకవద్దని.. అది ఎంతో ప్రమాదమని.. కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.బుధవారం ఉదయం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలం సోషల్ మీడియా, రీల్స్ యుగంగా మారిందని ప్రధాని అన్నారు. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంటూ.. తక్షణ ఫలితాల కోసం ప్రయత్నించడం సరైన మార్గం కాదని చెప్పారు.“ఇది రీల్స్ కాలం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటారు. కానీ ఈ షార్ట్కట్ యుగంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. రైల్వే స్టేషన్లలో రాసి ఉంటుంది.. ‘షార్ట్కట్స్ విల్ కట్ యూ షార్ట్’” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే యువత తమకు నచ్చిన గొప్ప వ్యక్తుల ఆత్మకథలను చదవాలని సూచించారు. వారి ప్రయాణం, కష్టాలు, విజయాల నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు.ప్రధాని మోదీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించింది తెలిసిందే. జంతర్ మంతర్ నీట్ నిరసనల తర్వాత.. తొలిసారి సెల్ఫీ వీడియో సందేశం ఇచ్చారు ఆయన. ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వివిధ అంశాలపై వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యువతను ఆకట్టుకోవాలని మంత్రులకు, ఎంపీలకు సైతం ఆయన సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జెన్జీపైనా వివిధ కార్యక్రమాల్లో వరుసగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కోవింద్ జీవితం యువతకు స్ఫూర్తిఇవాళ్టి కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ కేవలం వ్యక్తిగత విజయాల కథ కాదని.. అది భారత ప్రజాస్వామ్యం, సమాజం అందించిన అవకాశాలకు ప్రతిబింబమని ప్రధాని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించారని గుర్తు చేశారు. ఆయన జీవితంలోని పోరాటాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.పదవి నుంచి దిగినా దేశ సేవ కొనసాగింపురాష్ట్రపతి పదవి ముగిసిన తర్వాత కూడా కోవింద్ విశ్రాంతి తీసుకోకుండా కీలక అంశాలపై పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’(వన్నేషన్.. వన్ ఎలక్షన్) అంశంపై ఆయన చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఈ అంశానికి పరిష్కారం లభిస్తే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని మోదీ అన్నారు.కోవింద్ వినయం.. భారత విలువలకు ప్రతీకమాజీ రాష్ట్రపతి వినయం, భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని కూడా ప్రధాని గుర్తు చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉన్న సమయంలోనూ ప్రోటోకాల్ను పక్కన పెట్టి తనను కారు వరకు వచ్చి సాగనంపేవారని చెప్పారు. అలాగే తన గ్రామం పర్యటనలో కోవింద్ తన గురువుల పాదాలకు నమస్కరించిన ఘటనను ప్రస్తావిస్తూ.. అది భారతీయ సంస్కృతి విలువలను ప్రపంచానికి చాటిందని అన్నారు.“విజయాలు వ్యక్తిగతం కాదు.. సమాజం భాగస్వామ్యం”ఒక వ్యక్తి విజయాలను తన సొంత ఘనతగా భావించడం సాధారణమని.. కానీ సమాజం అందించిన సహకారాన్ని గుర్తించే వ్యక్తులే గొప్పవారని మోదీ అన్నారు. కోవింద్ ఆత్మకథలో ఇదే భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. ఆయన పోరాటాలు వ్యక్తిగతమైనప్పటికీ.. వాటి నుంచి వచ్చిన విజయాలు భారత ప్రజాస్వామ్య విజయాలని అభివర్ణించారు.రీల్స్ వేగంలో జీవిత ప్రయాణాన్ని చిన్నదారిలో ముగించాలని చూస్తున్న యువతకు, మరీ ముఖ్యంగా జెన్జీకి.. అనుభవాల నుంచి నేర్చుకోవాలనే ప్రధాని మోదీ సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీకి బిగ్ షాక్.. ‘ఎయిర్పోర్టుకు పడవలు వస్తాయా?’
నోయిడా: ఆకాశంలో ఎగరాల్సిన విమానాశ్రయం.. వర్షం పడితే నీట మునిగింది. ప్రారంభించి ఐదు నెలలు కూడా పూర్తికాకముందే రూ.11,200 కోట్లతో నిర్మించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీ వర్షానికి టెర్మినల్-పార్కింగ్ మార్గంలో నీరు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో ‘అభివృద్ధి మోడల్’గా ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది ఊహించని ఎదురుదెబ్బగా మారింది.మంగళవారం గ్రేటర్ నోయిడాలో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు జేవర్లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో టెర్మినల్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే మార్గం నీటితో నిండిపోయింది. ప్రయాణికులు, వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిని తొలగించేందుకు ఎయిర్పోర్టు సిబ్బంది రంగంలోకి దిగిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో రాజకీయ దుమారం మొదలైంది. భారీ పెట్టుబడులు, ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయంగా ప్రచారం పొందిన ప్రాజెక్టులో.. ఒక్క భారీ వర్షం పడితే నీరు నిలిచిపోవడమేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.Heavy rainfall today caused severe waterlogging at Noida International Airport in Uttar Pradesh, India. The airport was inaugurated by Prime Minister Narendra Modi on March 28, 2026. pic.twitter.com/mVu12u7B7Z— Weather Monitor (@WeatherMonitors) August 11, 2026విమర్శలకు తోడు రాజకీయ కౌంటర్లు కూడా మొదలయ్యాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నేరుగా బీజేపీపై సెటైర్ వేశారు. “ఇక విమానాశ్రయంలో పడవలు నడుస్తాయా?” అంటూ ఎక్స్లో ప్రశ్నించారు. బీజేపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అయితే ఎయిర్పోర్టు యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షపాతం నమోదవడంతో టెర్మినల్, పార్కింగ్ ప్రాంతాన్ని కలిపే మార్గంలోకి వర్షపు నీరు వచ్చిందని తెలిపింది. తమ సిబ్బంది వెంటనే స్పందించి 30 నిమిషాల్లోపే నీటిని తొలగించారని వెల్లడించింది.నీరు నిలిచిన సమయంలో ప్రయాణికులు, వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లించారు. ప్రయాణికులను నేరుగా కర్బ్ వద్ద పికప్, డ్రాప్ చేసుకునే అవకాశం కల్పించారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. విమానాలు ఆగిపోయాయా లేదా అన్నది ఒక విషయం.. నీరు ఎందుకు నిలిచింది అన్నది మరో విషయం. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంలో వర్షపు నీటి నిర్వహణ వ్యవస్థ ఎంత సమర్థంగా ఉంది? భవిష్యత్తులో ఇంతకంటే భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.మరోవైపు సోషల్ మీడియాలో కొందరు ఈ ఘటనను వ్యంగ్యంగా తీసుకున్నారు. “ఇది ఎయిర్పోర్టా.. స్విమ్మింగ్ పూలా?” అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం ఒక్క ఘటన ఆధారంగా మొత్తం ప్రాజెక్టును తప్పుబట్టడం సరికాదని అంటున్నారు. వాస్తవానికి ఎయిర్పోర్టు సిబ్బంది స్పందించి తక్కువ సమయంలోనే నీటిని తొలగించడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28, 2026న విమానాశ్రయాన్ని ప్రారంభించారు. తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.11,200 కోట్లు ఖర్చయ్యాయి. అయితే రెగ్యులర్ కమర్షియల్ విమాన కార్యకలాపాలు జూన్ 15 నుంచి ప్రారంభమయ్యాయి.Noida International Airport amidst Heavy rains today🚨 #DelhiRains pic.twitter.com/rp0Ur3jaed— Mumbai Nowcast (@s_r_khandelwal) August 11, 2026 -
‘ప్రశ్నించండి’ అంటున్న మోదీ.. ఏపీలో ప్రశ్నిస్తే కేసులా?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఉపన్యాసం చేస్తూ ప్రతి అంశంపైన ప్రశ్నించాలని యువతకు పిలుపు ఇచ్చారు. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. కొద్దికాలం క్రితం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పత్రాల లీక్కు సంబంధించి యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన నేపథ్యంలో జరిగిన పరిణామాలకు, ఆ తర్వాత మోదీలో వచ్చిన మార్పునకు ఇది దర్పణం పడుతుంది. ప్రధాని వ్యూహాత్మకంగా తన వైఖరి మార్చుకున్నారా? లేక దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించేతత్వాన్ని బలపరచడానికి చేశారా? అన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కాని మోదీ ప్రసంగాలలో ఇది కీలకమైన మార్పుగా చెప్పవచ్చు.కానీ, దీనికి ఆయన కట్టుబడి ఉండడమే కాదు. తన మిత్రపక్షాలు ప్రభుత్వం నడుపుతున్న రాష్ట్రాలలో కూడా అలాగే వాతావరణం ఏర్పడేలా ఆయన చర్య తీసుకుంటేనే యువతలో విశ్వాసం ఏర్పడుతుంది. ఏపీలో ప్రశ్నించే యువతను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పెద్దలు గంజాయి బ్యాచ్ అని, బ్లేడ్ బాచ్ అంటూ అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్ది పార్టీని గొడ్డలి పార్టీ అంటూ అనుచిత భాష వాడుతున్నారు. దేశంలో ఇలాంటి పెడ పోకడలను నియంత్రించాల్సిన అవసరాన్ని ప్రధాని గుర్తించాలి. అయితే కాక్రోచ్ ఆందోళన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్కు బీజేపీ ఎంపీలు పార్లమెంటులో పూలదండలతో స్వాగతం చెప్పిన తీరు కూడా అంత శోభ నివ్వదు. దీనిని మోదీ ఎందుకు అనుమతించారో తెలియదు.మరోవైపు ఏపీలో డీఎస్సీ అక్రమాలపై విపక్ష వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ అక్రమాల వల్ల నష్టపోయిన యువత బహిరంగంగా అవి ఎలా సాగాయో వెల్లడిస్తున్నారు. దీనిపై సీఐఐ దర్యాప్తును, మంత్రి లోకేష్ రాజీనామాను వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. నిజంగా ఇందులో ఏ అవకతవక జరగకపోతే నీట్ పరీక్షల గొడవపై సీబీఐ దర్యాప్తు వేసినట్లు ఏపీలో కూడా చేసి ఉండవచ్చు. అలా చేయకపోగా ప్రశ్నించేవారి గొంతు నులమడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్సార్సీపీ దీక్ష శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు దాడులు చేయడం వంటివి చేస్తున్నారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిందో అర్దం చేసుకోవచ్చు. ఇంత చేస్తున్నా ఆందోళనలు ఆగడం లేదన్న అసహనంతో పోటీ ర్యాలీలు చేయించడం ఆరంభించారు.ఢిల్లీలో యువత ఆందోళన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యూహాలను కొన్నిటిని అమలు చేయకపోలేదు. పోలీసులు పెల్లెట్ గన్లను ప్రయోగించడం, లాఠీలను ఝళిపించడం వంటివి చేశారు. దీనివల్ల బీజేపీకి బాగా నష్టం జరిగింది. ఆ డ్యామేజీని గుర్తించిన ప్రధాని ఆందోళనకారులను ఫ్రెండ్స్ అంటూ అడ్రస్ చేశారు. కానీ ఏపీలో మాత్రం గంజాయి బ్యాచ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ, ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. పైగా ప్రభుత్వం తలచుకుంటే రెండు నిమిషాలలో అణచివేస్తుందని కూడా బెదిరిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించి వచ్చిన ఆరోపణల మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలకు సిద్దపడింది. ఏపీలో మాత్రం అలా చేయడం లేదు.ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకాలను ప్రభుత్వం సాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. పంజాబ్లో ఇలాంటి ఆరోపణలు వస్తే అక్కడ బీజేపీకి చెందినవారు కూడా ఆందోళనలు చేస్తున్నారు. జార్ఖండ్లో ఉద్యమానికి అక్కడ అధికారంలో ఉన్న భాగస్వామి అయిన కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది. స్వయంగా రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రకటన చేశారు. కానీ ఏపీలో విచిత్రంగా కాంగ్రెస్, బీజేపీలు నోరు విప్పడం లేదు. జనసేన ఎటూ 15 ఏళ్ల పాటు చంద్రబాబుకు మద్దతు ఇస్తామని ఓపెన్ గానే చెబుతోంది. అంటే అంతకాలం చంద్రబాబు సర్కార్ ఏం చేసినా నోరు విప్పదనుకోవాలి. ఆ రకంగా ఈ పార్టీలన్నిటిని చంద్రబాబు తన కంట్రోల్లో పెట్టుకున్నారన్న భావన ఉంది. అయితే, ప్రధాని మోదీ తన ప్రసంగంలో యువత ప్రశ్నించడాన్ని స్వాగతిస్తున్నామని అంటున్నారు. ప్రతి అంశంపైనా ప్రశ్నించాలని, అందరూ ఆమోదించారని అక్కడితో ఆగిపోవద్దు అని ఆయన చెబుతున్నారు. ఇందులో ఎంత చిత్తశుద్ది ఉందన్నది భవిష్యత్ పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది.ఇదే సందర్భంలో అమెరికాలో ప్రజాస్వామ్యం బలోపేతం అయిన తీరుపై ప్రముఖ చరిత్రకారుడు మైకేల్ బిష్లోన్ చేసిన ఒక ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించింది. సాక్షి దినపత్రిక ఈ వ్యాసంలోని ముఖ్యాంశాలను ప్రచురించింది. ఆ ఉపన్యాసంలో ఆయా పూర్వ అధ్యక్షులు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చేసిన కృషిని, వారి ఉత్తేజపూరిత వ్యాఖ్యలను కూడా ఆయన ఉదహరించారు. ఇది భారత ప్రజాస్వామ్యం బలపడటానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అమెరికాలో గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందిన బెంజిమిన్ ఫ్రాంక్లిన్ ప్రతి పౌరుడి తొలి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడమే అని వ్యాఖ్యానించారు. మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ చెప్పిన మాట ఏమిటంటే, అమెరికాలో గొప్పహోదా మిస్టర్ ప్రెసిడెంట్ కాదు.. మిస్టర్ సిటిజన్.. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రజలు అధ్యక్షుడి కోసం పనిచేయరు. అధ్యక్షుడే ప్రజల కోసం పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.దేశాన్ని పొగిడేవారికే కాదు.. దేశంలోని లోపాలను నిర్మాణాత్మకంగా సమర్ధించేవారికి సమాన గౌరవం ఉండాలని కూడా అమెరికా గొప్ప నేతలు నమ్మారని మైఖేల్ వివరించారు. ఇంకో ప్రముఖుడు ధామస్ జపర్సన్ మరో మాట చెప్పారు. మిత వ్యయంతో, సమర్ధవంతంగా పనిచేసే రాజకీయ వ్యవస్థ ఏర్పడితే ఆ ప్రజాస్వామ్య స్పూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుందని అన్నారు. ఇదే వ్యాసంలో మైఖేల్ ఒక విషయం చెప్పారు. చరిత్రకారులు తమకు అనుకూలంగానే మాట్లాడాలని 2026లో వాషింగ్టన్ డీసీలోని కొందరు రాజకీయ నేతలు ఆశిస్తున్నారని, సర్కస్ లోని విదూషకుల మాదిరి ప్రవర్తించాలని కోరుకుంటున్నారని, అమెరికా వ్యవస్థాపకులు ఇలాంటి ఆలోచనను చూసి బాధపడేవారిని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అమెరికాలో కూడా గత విలువలు కొరవడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారన్న మాట.మైఖేల్ చెప్పిన మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది? అమెరికా కన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న విపరిణామాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు పెరుగుతున్నాయనే అనిపిస్తుంది కదా! దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రత్యేకించి ఏపీ వంటి రాష్ట్రాలలో రెడ్ బుక్ అంటూ అరాచకపు వ్యవస్థను సృష్టించడం ప్రజలను కలవరపరుస్తుంది. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ వంటి రాజ్యాంగ రూపకర్తలు, దేశ నిర్మాతలు భారత్ లో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించి ఉండరు. ప్రజాస్వామ్యంతో నిమిత్తం లేకుండా నియంతృత్వంగా అల్ప బుద్దితో వ్యవహరిస్తున్న నేతల తీరును గమనిస్తే వారి ఆత్మలు క్షోభిస్తాయి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సగర్వంగా, వైభవోపేతంగా స్వాతంత్య్ర దినోత్సవం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని సగర్వంగా, వైభవోపేతంగా నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘అభివృద్ధి చెందిన భారత్’కోసం ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార ఎన్డీయే కూటమి మంగళవారం నిర్వహించిన ‘మంగళ్ మిలన్’కు మోదీ హాజరయ్యారు. సమావేశ ప్రాంగణానికి మోదీ చేరుకున్నప్పుడు ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులు త్రివర్ణ పతాకాలు చేతబూని వందేమాతరం, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ దృశ్యాలతో కూడిన వీడియోను మోదీ ఇన్స్టాగ్రామ్లో పోస్టుచేశారు. మన స్వాతంత్య్ర సమరయోధులకు ఘనంగా నివాళులు అర్పిద్దామని, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు.‘‘హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా (ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం, ప్రతి హృదయంలో త్రివర్ణ పతాకం). అందరూ కలిసి రండి. ప్రతి ఇంట్లోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. భారత్ మాతా కీ జై, వందేమాతరం, వందేమాతరం, వందేమాతరం’’అని మోదీ ఈ వీడియోలో పిలుపునిచ్చారు. అంతకుముందు పార్లమెంట్ భవన సముదాయంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో మంగళ్ మిలన్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి స్వయంగా జాతీయ జెండాను చేతబూనారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, శివరాజ్సింగ్ చౌహాన్, ఎస్.జైశంకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జల్శక్తి మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతి మంగళవారం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. -
కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్
-
మరో వీడియో పోస్ట్ చేసిన మోదీ.. దేశ ప్రజలకు కీలక పిలుపు
న్యూఢిల్లీ: దేశ ప్రజలు ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగస్వాములు కావాలని, స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ప్రతి ఇంట్లో దాన్ని ఒక వేడుకగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పిలుపునిచ్చారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో మోదీ పోస్ట్ చేశారు. “రండి, #హర్ఘర్తిరంగా ప్రతి ఇంటి వేడుకగా మార్చుకుందాం” అని పోస్టు చేశారు. ఈ ప్రకటన ఆగస్టు 15న జరిగే 80వ స్వాతంత్య్ర వేడుక సందర్భంగా చేశారు.“రండి, ఆగస్టు 15ను గర్వంతో, గౌరవంతో జరుపుకుందాం. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిద్దాం. అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) నిర్మాణానికి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం, ప్రతి గృహంలో త్రివర్ణ పతాకం, ప్రతి హృదయంలో త్రివర్ణ పతాకం ఉండాలి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం” అని ప్రధాని అన్నారు. 2026 హర్ ఘర్ తిరంగా ప్రచారం ఆగస్టులో నిర్వహిస్తున్నారు. దేశ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశవ్యాప్త వేడుకల్లో పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా ప్రజలు త్రివర్ణ పతాకాన్ని తమ ఇళ్లకు తీసుకువచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని జరుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఎర్రకోట వద్ద ‘వందే మాతరం’ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతానికి ముందు ఎర్రకోట ప్రాకారాలపై నుంచి ‘వందే మాతరం’ను సామూహికంగా ఆలపించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం తెలిపారు. ఎక్స్లో చేసిన గుప్తా స్పందిస్తూ దీనిని “గౌరవప్రదమైన, చారిత్రాత్మక ఘట్టం”గా అభివర్ణించారు. జాతీయ గీతానికి ముందు ఎర్రకోట వద్ద సామూహికంగా ‘వందే మాతరం’ ఆలపించడం ఇదే తొలిసారి అని చెప్పారు.భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ‘వందే మాతరం’ ఒక “అమర జాతీయ మంత్రం”గా నిలిచిందని, అది విప్లవకారులకు స్ఫూర్తినిచ్చిందని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు స్వరంగా మారిందని గుప్తా పేర్కొన్నారు. ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవం, పార్లమెంట్లో ఆమోదించిన తీర్మానం, ప్రధాని మోదీ నాయకత్వాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇవన్నీ కలిసి భారత జాతీయ స్మృతి, సాంస్కృతిక గౌరవం, దేశభక్తికి గొప్ప ప్రకటనగా నిలుస్తాయని చెప్పారు. “వందే మాతరం. జై హింద్, భారత మాతాకీ జై!” అని గుప్తా తన పోస్టులో పేర్కొన్నారు.గోవాలో తిరంగా ర్యాలీహర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా గోవా రాజధాని పనాజీలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మిరామార్ సర్కిల్ నుంచి కాలా అకాడమీ మీదుగా ఆజాద్ మైదాన్ వరకు నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. కాలా అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్.. పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) -
ఒకే ఫ్రేమ్లో మోదీ–పవార్–షా..
ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒకే ఫ్రేమ్లో కనిపించిన ఫొటో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామం.. సాధారణ కుటుంబ వేడుకే అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.सुप्रिया सुळे यांची मुलगी रेवती सुळे आणि सारंग लखानी यांचा दिल्लीत रिसेप्शन सोहळा. यावेळी अमित शाह यांनी उपस्थित राहीले. रेवती आणि सारंग यांना आशिर्वाद दिले. #sharadpawar #amitshah pic.twitter.com/pSE3rg9UQL— Ramraje Shinde (@ramraje_shinde) August 10, 2026Prime Minister Modi ji attended the wedding reception of Sharad Pawar's granddaughter today. He blessed the newlyweds during the event. pic.twitter.com/0BVKo5YXZT— Avinash K S🇮🇳 (@AvinashKS14) August 10, 2026ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో కొనసాగుతున్న శరద్ పవార్ పార్టీ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మోదీ, పవార్, షా కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఈ వివాహ వేడుకకు కొందరు కాంగ్రెస్ పెద్దలు, ఎన్సీపీ-ఎస్పీ మిత్రపక్షాల నేతలు కొందరు దూరంగా ఉండడమూ ఇందుకు మరో ప్రధాన కారణమైంది. అయితే ఇది కేవలం కుటుంబ కార్యక్రమంలో భాగమైన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఎన్సీపీ (ఎస్పీ) వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం.. ఈ కలయికపై ఊహాగానాలు మొదలయ్యాయి.కొసమెరుపు: మోదీ విధానాలపై తరచూ విమర్శలు చేసే రోహిత్ పవార్.. అదే వేదికపై ప్రధాని మోదీతో కలిసి ఫొటోకు పోజివ్వడం కూడా చర్చకు దారితీసింది.If Sharad Pawar’s faction ever boards the NDA ship, Rohit Pawar will probably be the first passenger with his bags packed. 😂On social media, Rohit Pawar keeps claiming that he will never bow before the BJP. When it came to Delhi, he was among the first to meet PM Modi along…— Saffron Monk (@mangeshspa) August 11, 2026ఇక ఈ వివాహ వేడుకకు బీజేపీ అగ్రనేతలు హాజరు కావడం కంటే కొన్ని గంటల ముందే.. ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన లోక్సభ ఎంపీల బృందం ప్రధాని మోదీని కలిసింది. సుప్రియా సూలే నేతృత్వంలోని ఎనిమిది మంది ఎంపీలు మహారాష్ట్రకు సంబంధించిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితులు, సాగునీరు, నదుల అనుసంధానం, రైల్వే ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై వినతిపత్రం అందించారు. పుణె–నాశిక్ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, ఉల్లి ధరలు, చంద్రభాగా నది కాలుష్యం వంటి సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.రాజకీయ మార్పులపై ఊహాగానాలుమోదీతో పవార్ వర్గం వరుస భేటీలు, కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై పార్టీ వైఖరి వంటి పరిణామాలు కొత్త చర్చలకు కారణమయ్యాయి. డీలిమిటేషన్ విషయంలో తమ నిర్ణయం తుది బిల్లు వచ్చిన తర్వాతే తీసుకుంటామని సుప్రియా సూలే ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.ఇండియా కూటమిలో ఉంటూనే.. ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెబుతోంది. మహారాష్ట్ర సమస్యలు, ప్రజా ప్రయోజన అంశాలపైనే కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేస్తోంది. గతంలోనూ శరద్ పవార్, సుప్రియా సూలేలు ప్రధాని మోదీని కలిసి విద్యార్థుల సమస్యలు, నీటి నిర్వహణ, రైతుల అంశాలపై చర్చించారు.ఒక ఫొటో.. ఎన్నో ప్రశ్నలు!ప్రస్తుతం రేవతి సూలే వివాహ రిసెప్షన్లో తీసిన ఈ చిత్రం కేవలం ఓ కుటుంబ వేడుక జ్ఞాపకమే అయినప్పటికీ.. దాని వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీతో పవార్ సాన్నిహిత్యం పెరుగుతోందా? లేదంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ భేటీలా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫొటో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
ఆ పేరంటే ద్వేషం: బాక్సర్ మాటలకు మోదీ రియాక్షన్ వైరల్
కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ గెలిచిన 39 పతకాల్లో పది బాక్సింగ్లో వచ్చినవే. అంకుశ్ పంఘాల్, సచిన్ సివాచ్, జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్, సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి, ప్రియా ఘంఘాస్ స్వర్ణాలతో సత్తా చాటారు.మరోవైపు.. నరేందర్ బెర్వాల్, లవ్లీనా బొర్గొహెన్, జాదుమణి సింగ్ రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కాగా కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాక్సర్ నరేందర్ బెర్వాల్.. పాకిస్తాన్ బాక్సర్తో తనకు జరిగిన సంభాషణ గురించి ప్రధానితో పంచుకున్నాడు.ఆరోజు నేనే గెలిచాను‘‘పాకిస్తాన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి.. నాకొక విషయం గుర్తుకువచ్చింది సర్. 2015 వరల్డ్ మిలిటరీ గేమ్స్.. నా తొలి రౌండ్ మ్యాచ్ పాకిస్తాన్తోనే. అప్పుడు మన మిలిటరీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. పాకిస్తాన్ ప్రత్యర్థిపై అస్సలు ఓడిపోవద్దని చెప్పారు. ఆరోజు నేనే గెలిచాను. అయితే, నేను, నా ప్రత్యర్థి ఇద్దరం గాయాలపాలై ఆస్పత్రికి చేరుకున్నాం. ఇద్దరికీ కుట్లు పడ్డాయి. అప్పుడు ఆర్మీ కోచ్గా నరేందర్ రాణా ఉన్నారు. మీరు కూడా అప్పుడే తొలిసారి ప్రధాని అయ్యారు.ఈ పేరును ద్వేషించడం మొదలుపెట్టానుఆ సమయంలో ఆ పాక్ బాక్సర్ నాతో.. ‘సోదరా నీకో మాట చెప్పనా?’ అన్నాడు. సరే ఏమిటో చెప్పమన్నాను. అప్పుడు అతడు.. ‘నీ పేరు నరేందర్. మీ కోచ్ పేరు నరేందర్. మీ ప్రధాన మంత్రి పేరు నరేంద్ర. ఇప్పటి నుంచి ఈ పేరును నేను ద్వేషించడం మొదలుపెట్టాను’ అని అన్నాడు’’ అని నరేందర్ బెర్వాల్ ప్రధాని మోదీకి తెలిపాడు.మోదీ రియాక్షన్ వైరల్దీంతో ప్రధాని మోదీ నవ్వులు చిందించారు. బెర్వాల్తో పాటు అక్కడున్న అథ్లెట్లంతా కూడా నవ్వుకున్నారు. కాగా నరేందర్ బెర్వాల్ భారత సైన్యంలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్. ఆసియా చాంపియన్షిప్స్లో పతకాలు సాధించిన అతడు.. ఆసియా క్రీడలు-2023లో కాంస్యం గెలిచాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ అందుకున్నాడు.ఇదిలా ఉంటే.. పతక విజేతలతో ముచ్చటించిన ప్రధాని మోదీ.. వారందరినీ అభినందించారు. భారత క్రీడా ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు చేర్చారని.. క్రీడల పట్ల వారికున్న అంకిత భావాన్ని కొనియాడారు. కాగా గ్లాస్గోలో జరిగిన తాజా కామన్వెల్త్ గేమ్స్లో భారత్ మొత్తంగా 39 పతకాలు గెలిచింది. ఇందులో పదమూడు స్వర్ణాలు, పదిహేడు రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. అహ్మదాబాద్ ఇందుకు వేదిక. చదవండి: స్పిన్నర్లతో తలనొప్పి.. కుల్దీప్ యాదవ్కు నో ఛాన్స్?!#WATCH | "Pakistani boxer said to me 'Aapka naam Narender hai, aapke coach ka naam Narender hai, aapke Pradhan Mantri ka naam Narendra hai. Mujhe Narendra naam se nafrat ho gayi hai'..." says Heavyweight boxer and silver medallist Narender Berwal narrating his conversation with a… pic.twitter.com/qvmwO5D2sz— ANI (@ANI) August 10, 2026 -
రెబల్స్లో రెబల్స్.. బీజేపీతో బంధంపై చీలిక!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే అనామక పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాళ్లు ఎన్డీయే కూటమికి బయటి నుంచి మద్దతు ప్రకటించడం.. తాజాగా జరిగిన ఎన్డీయే ఎంపీల మీటింగ్లో ప్రధాని మోదీతో వాళ్లు భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. బీజేపీతో సాన్నిహిత్యంపై ఆ వర్గంలోనూ కొందరు అసంతృప్తితో తిరుగుబాటు బాట పట్టినట్లు తెలుస్తోంది. తమ వర్గం ఓట్ల నేపథ్యం కారణంగా.. బీజేపీతో కొనసాగడం ఏమాత్రం మంచిది కాదని వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీలు అబూ తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహ్మాన్, యూసుఫ్ పఠాన్(మాజీ క్రికెటర్)లు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో సన్నిహిత సంబంధాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ముగ్గురు ఇటీవల ఎన్డీఏ ఎంపీల సమావేశానికి దూరంగా ఉండడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.‘బీజేపీతో వెళ్లం’.. ఎంపీల స్పష్టీకరణబీజేపీతో పొత్తు తమ రాజకీయ భవిష్యత్కు నష్టం కలిగిస్తుందని ఈ ఎంపీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో తమ సంప్రదాయ ఓటర్లకు దూరమవుతామనే భయం వారిలో ఉన్నట్లు సమాచారం. ‘‘మేము బీజేపీతో కలిసి వెళ్లబోమని ఇప్పటికే స్పష్టం చేశాం. ఎన్డీయేలో భాగస్వాములం కాబోం’’ అని ఎంపీ అబూ తాహెర్ ఖాన్ ప్రకటించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజా ప్రయోజనాల కోసం సహకరిస్తామని మాత్రం ఆయన తెలిపారు.అదంతా డ్రామా?: మమత వర్గం ఫైర్ఎన్సీపీఐలో కొనసాగుతున్న ఈ పరిణామాలపై మమతా బెనర్జీ వర్గం తీవ్రంగా స్పందించింది. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తిరుగుబాటు ఎంపీలపై విమర్శలు గుప్పించారు. ‘‘వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్సీపీఐ అనేది ఎన్డీయేకు మిత్రపక్షమని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆరోపించారు.మరో తృణమూల్ నేత కునాల్ ఘోష్ కూడా విమర్శలు చేశారు. ‘‘బీజేపీకి బీ టీమ్గా మారిన వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు గెలిచింది మమతా బెనర్జీ పేరుతో, వ్యతిరేక ఓట్లతో’’ అని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో మోదీ, షాతో భేటీలు.. మరోవైపు దూరంఆశ్చర్యకరంగా, బీజేపీతో దూరంగా ఉంటామని చెబుతున్న ఈ ముగ్గురు ఎంపీలు ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధాని నివాసంలో జరిగిన అల్పాహార భేటీకి కూడా హాజరయ్యారు. అయితే ఎన్డీఏ ఎంపీల ‘మంగళ్ మిలన్’ సమావేశానికి మాత్రం గైర్హాజరయ్యారు. తిరిగి సొంత గూటికే?తిరుగుబాటు ఎంపీల్లో కొందరు తిరిగి మమతా బెనర్జీ వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారని తృణమూల్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎన్సీపీఐ నేతలు మాత్రం పార్టీలో ఎలాంటి చీలిక లేదని, అభివృద్ధి అంశాలపై మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు.మొత్తానికి.. తృణమూల్ నుంచి వలసలతో బలపడిన ఎన్సీపీఐలోనే ఇప్పుడు అసంతృప్తి స్వరాలు వినిపించడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. బీజేపీతో సంబంధాలే ఈ సంక్షోభానికి కారణమా? లేదంటే ఎంపీల రాజకీయ పునరాలోచనా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
‘విరాళాల గోల్మాల్’ : ప్రధాని నివాసానికి సాధువుల భారీ మార్చ్!
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాత విచారణ కోరుతూ దాదాపు 500 మంది సాధువులు, మతాచార్యులు సోమవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్నారు. ప్రకాశానంద గిరి మహారాజ్ నేతృత్వంలో ఈ నిరసన ప్రదర్శన జరుగుతోంది. మండి హౌస్ సమీపంలోని నేపాల్ రాయబార కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. విరాళాల కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధానికి సాధువులు వినతిపత్రం సమర్పించనున్నారు.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో పెద్దఎత్తున ఆర్థిక మోసాలు, నిధుల స్వాహా జరిగిందని నిర్వాహకులు ఆరోపించారు. సాధారణ సిబ్బందిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని కొనసాగిస్తున్న సిట్ విచారణ కేవలం కంటితుడుపు చర్యగా ఉందని, ఇందులో కీలక వ్యక్తులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మరోవైపు ఈరోజు రామమందిర విరాళాల గోల్మాల్పై సీబీఐ దర్యాప్తు కోరిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించనుంది. అలాగే లోక్సభలో ఈ అంశంపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో అత్యున్నత స్థాయి స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘జో ఖేలేగా... వో ఖిలేగా’
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. కాగా అథ్లెట్లతో భేటీ అయిన వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘జో ఖేలేగా... వో ఖిలేగా’ (ఆటలు ఆడేవాళ్లు వికసిస్తారు) అంటూ అథ్లెట్లను అభినందించిన ప్రధానమంత్రి... దేశం కోసం ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కామన్వెల్త్ క్రీడల మహిళల 51 కేజీల బాక్సింగ్ విభాగంలో పసిడి నెగ్గిన సాక్షి మాట్లాడుతూ... ‘పతకాలు సాధించిన ప్లేయర్లను ప్రధాని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ భేటీని మేమంతా ఎంతో ఆస్వాదించాం’ అని పేర్కొంది. 2030లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. -
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్.. కారణం ఇదే!
ఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం రాత్రి ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. కీలకమైన రంగాల్లో భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. అదేవిధంగా, వాన్స్, ఉష దంపతులకు ఇటీవల కుమారుడు పుట్టిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్లో వెల్లడించారు.తుర్కియే, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వాన్స్ మోదీతో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. పరస్పర రక్షణ ఒప్పందంపై తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్లు సంతకాలు చేసిన కొద్ది రోజులకే ప్రధాని మోదీకి వాన్స్ ఫోన్ చేయడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వర్తకం, రక్షణ, ఇంధన భద్రత రంగాలలో భారత్-అమెరికాల సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక సంబంధాలను విస్తరించడంపై కూడా చర్చించారు."అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కీలక రంగాల్లో భారత్-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై మేము చర్చించాం" అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారత అధికారిక ప్రకటన ప్రకారం.. భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని ప్రధాని మోదీ, వాన్స్ సమీక్షించారు.ఉన్నత స్థాయి చర్చల్లో కొనసాగుతున్న పురోగతిని వారు ప్రస్తావించారు. వర్తకం, రక్షణ, సంక్లిష్ట, వర్ధమాన సాంకేతికతలు, ఇంధన భద్రత, కీలక ఖనిజాల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతంపై చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారని ప్రకటన తెలిపింది. అయితే, ఈ సంభాషణకు సంబంధించి అమెరికా అధికారిక వర్గాల నుంచి ఇంకా ఎలాంటి వివరాలు వెలువడలేదు. భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం గురించి ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందో లేదో స్పష్టత రాలేదు. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరుతో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ఆ దేశాలు.. ఏ దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి. ఈ కీలక రక్షణ ఒప్పందంపై ఆ దేశాలు సంతకాలు చేశాయి.పెరుగుతున్న భద్రతా ఆందోళనల వేళ ఈ ఒప్పందం మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. అది మిగతా అన్ని దేశాలపై జరిగిన దాడిగానే పరిగణనలోకి తీసుకోనున్నాయి. మూడు దేశాలలో ఏ ఒక్క దానిపై సాయుధ దాడి జరిగినా.. అది మూడింటిపై జరిగిన దాడిగానే భావిస్తారు. అలాగే మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను మరింత పెంపొందించడానికి ఇది తోడ్పడుతుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. -
ప్రతి అంశంపైనా ప్రశ్నించాలి
న్యూఢిల్లీ: ఎలాంటి ఆలోచన లేకుండా అందరూ ఆమోదించే అంశాన్నయినా సరే మీరు ప్రశ్నించి తీరాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ అక్కడి వందలాది మంది విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఆ ధైర్యం ఉండాల్సిందే... ‘‘ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ప్రశ్నించడంతోనే ఆగిపోవద్దు. అందుకు పరిష్కారాలు వెతికే శక్తిసామర్థ్యాలు, ధైర్యాన్ని పెంపొందించుకోండి. మీరు కొత్త విషయాలు తెల్సుకోవాలన్న జిజ్ఞాస ఎప్పుడూ ఉండాలి. ఆ ఉత్సుకతను మీలో శాశ్వతంగా సజీవంగా ఉంచుకోండి. అది మీరు ఎల్లప్పుడూ నేర్చుకోవాలనే ఆశను సదా రేకెత్తిస్తుంది. దేశంలో యువత ఎంతగా సాధికారత సాధిస్తే దేశం అంతగా సాధికారతను సంతరించుకుంటుంది. దేశం ఇప్పుడు ప్రతిరంగంలో స్వావలంభనను సాధించేందుకు వడివడిగా అడుగులేస్తోంది. ఆర్థికరంగంలో స్వయంసమృద్ధి, సాంకేతికపరంగా స్వావలంభన, పారిశ్రామికంగానూ అదే పంథా. ఇది వికసిత్ భారత్కు పటిష్టమైన పునాదిగా మారుతుంది. ఈ స్నాతకోత్సవంలో ఎంతో లోతైన భావోద్వేగం నిండి ఉంది. విద్యార్థుల కలలు,ఆశయాలతో ఈ కళాశాల ప్రాంగణం నిండిపోయింది. మీకందరికీ శుభాకాంక్షలు కోర్సులను విజయవంతంగా పూర్తిచేసి డిగ్రీ పట్టాలు అందుకుంటున్న విద్యార్థులందరికీ, వాళ్ల కుటుంబసభ్యులకు సైతం నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ డిగ్రీ పట్టాలు చదువులను మాత్రమే ప్రతిబింబించవు. బాధ్యతాయుతంగా మీరు దేశానికి చేయబోయే సేవలను గుర్తుచేస్తాయి. మెడళ్లు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు. ఐఐటీ ఢిల్లీలో కొత్తగా కృత్రిమ మేధ(ఏఐ) సంబంధింత కోర్సులు అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఇక్కడ అందుకున్న డిగ్రీ పట్టాలతో దేశసేవ చేయాలన్న మీ కలను నిజం చేసుకోబోతున్నారు. కొత్తగా మీరు ఈ క్యాంపస్లోకి అడుగుపెట్టినప్పుడు ఓరియంటేషన్ పూర్తిచేసుకుని ఉంటారు. తర్వాత ఇప్పుడు స్నాతకోత్సవానికి చేరుకున్నారు. ఈ ఆశయాలకు పునాదులు వేసుకుంటూ కొందరు ఉద్యోగంలో చేరి తొలి వేతనం అందుకోబోతున్నారు. మరికొందరు కాబోయే పారిశ్రామికవేత్తలుగా అంకుర సంస్థలను ప్రారంభించబోతున్నారు. మరికొందరు ఉన్నత చదువులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ మొత్తం విద్యాయాత్రలో మీరెన్నో మధురానుభూతులను చవిచూసి ఉంటారు. కొత్త జీవితం ఆరంభించబోతున్నామనే ఉత్సాహం మీలో కని్పస్తోంది. అన్నీ మారుతున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అంశాలతోపాటు సాంకేతికత వేగంగా మారుతోంది. సాంకేతికతలో వస్తున్న పెనుమార్పులు ప్రపంచ పరిణామాలకు కారణభూతమవుతున్నాయి. పెనుమార్పుల యుగంలో అనూహ్య సవాళ్లతోపాటు ఎన్నో అవకాశాలు అందివస్తున్నాయి. ఈ మార్పుల శకంలో నా మాట ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నిరంతరం నేర్చుకు నే వ్యక్తే విజేతగా నిలుస్తాడు. ఐఐటీ డిగ్రీ అనేది కేవలం అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక గ్రేడ్ తెచ్చుకుని చక్కటి వేతనంతో ఉపాధి సాధించే అవకాశంగా కంటే వాస్తవిక ప్రపంచంలో సవాళ్లను వేగంగా పరిష్కరించే సత్తాను సంతరించుకోవడమే. అత్యంత క్లిష్టమైన సమస్యలను సైతం మీరు సాధించగలరు అని ఈ డిగ్రీ ప్రపంచానికి చాటిచెబుతుంది’’ అని మోదీ అన్నారు.గత తరం అలా.. మీరు ఇలా.. ‘‘భారత్లో గత తరం మొత్తం దేశ స్వాతంత్య్రసాధన అనే ఏకైక లక్ష్యం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎన్నో బాధలు, అవమానాలను భరించారు. లక్ష్యసాధన కోసం ఆ తరం చూపిన తెగువ, అకుంఠిత దీక్షను మీరూ వారసత్వంగా అందిపుచ్చుకోండి. వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్ సాధించాల్సిన అభివృద్ధిలో భాగస్వాములుకండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భారతదేశ పురోగతికి ఏ విధంగా సానుకూలమో ఆలోచించి ముందడుగువేయండి. యువతరం సాధికారత అనేది అభివృద్ధిచెందిన భారత్కు బలమైన పునాది అవుతుంది. ఇప్పుడు ఏఐ, డేటా సెంటర్లు, భూ అయస్కాంతాలు, సముద్ర గర్భ శోధన, క్వాంటం కంప్యూటింగ్, ఇంధన భద్రత రంగాలదే హవా. ఈ రంగాలు మీ పదునైన ఐడియాల కోసం వేచిచూస్తున్నాయి. సత్తా చాటి నాయకత్వాన్ని కైవసం చేసుకోండి’’ అని మోదీ హితవు పలికారు.సవాళ్లను ముక్కలుగా చేయండి ‘‘జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఒక్క ఉదుటుగా పరిష్కరించాలనే విధానాన్ని కాస్తంత మార్చుకోండి. సమస్యలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఒక్కోటి పరిష్కరించుకుంటూ వెళ్లండి. ల్యా»ొరేటరీలో ప్రయోగం మొత్తాన్నీ ఒకేసారి చేయనట్లుగా మీ సమస్యల్ని సైతం దశలవారీగా పరిష్కరించి విజయం సాధించండి. సమస్యల్ని సమస్యల్లాగా చూడక ండి. వాటిలోని అవకాశాలను ఒడిసిపట్టండి. సమస్యల్ని పరిష్కరించినప్పుడు అందులో ఒక సువర్ణావకాశం దాగి ఉన్న విషయం బోధపడుతుంది. అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. వర్సిటీలో సిలబస్ ప్రకారం చదువుతాం. అందులోంచే ప్రశ్నలొస్తాయి. జీవితం అ లా కాదు. సిలబస్లో లేని కఠిన సమస్యలే ఎక్కువశాతం ఎదురవుతాయి. ముందే కూర్చి న ప్రశ్నలకు సమాధానం చెప్పగలగడంకంటే సమాజం విసిరిన సవాళ్లను ఎదుర్కోవడంలో నే అసలైన విజయం దాగి ఉంది. చిక్కు ప్రశ్నలుగా ఎప్పట్నుంచో అందరూ వదిలేసిన వాటి ని పరిష్కరించిన వాళ్లే నేడు విజేతలుగా కీర్తిపొందుతున్నారు’’అని మోదీ వివరించారు. విద్యలో అమ్మాయిల భాగస్వామ్యం పెరగాలి‘‘ఈ స్నాతకోత్సవంలో అవార్డ్లు, మెడళ్లు తీసుకునే వాళ్లలో అమ్మాయిలు ఒకరిద్దరయినా ఉంటే బాగుణ్ణు అని అనుకుంటున్నారా? అది తప్పు. చాలా ఎక్కువ మంది ఆడబిడ్డలు ఈ జాబితాలో ఉండాల్సిందే. ఉన్నత విద్యలో మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో అమ్మాయిల భాగస్వామ్యం ఇంకా పెరగాలి’’అని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
సమస్య అనుకుంటే ప్రతిదీ సమస్యే. జెన్–జీ సమస్యే. పునర్విభజన బిల్లు సమస్యే. రామ మందిరంలో విరాళాల చోరీ సమస్యే. క్యాబినెట్ మార్పులూ సమస్యే. నిజంగా సమస్యలైనవి కొన్ని ఉంటాయి... అవసలు సమస్యలే కాదని ఎంత అనుకున్నా సమస్యలు కాకుండా పోనివి! ఆరెసెస్ను సంతోషంగా ఉంచటం నిరంతర సమస్య. ఒక్క ఏడాదైనా, ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు లేకుండా ఉండక పోవటం నిరవధిక సమస్య. ఆగస్టు 13తో వర్షాకాల సమావేశాలు ముగుస్తున్నాయి. సభ లోపల సమస్యలతో సమస్య లేదు. ఆ సంగతి స్పీకర్ ఓం బిర్లా చూసుకుంటారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు చూసుకుంటారు. స్పోక్స్ పర్సన్ సంవిత్ పాత్రా చూసుకుంటారు. మాటకు మాట చెప్పవలసి వస్తే ఎంపీ దినేష్ శర్మ చూసుకుంటారు. వీళ్ల కాక, చూసీ చూడనట్లు చూసుకునే ‘ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్’ రాజ్నాథ్ సింగ్, ‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ అమిత్ షా ఎటూ ఉంటారు. టీమ్ అంతా కలిసి సమస్యలు కానివాటిని, సమస్యలు కానివాటితో డీల్ చేస్తుంది. చివరికి వచ్చేసరికి ఏదీ సమస్య కాకుండా పోతుంది. ఏదీ సమస్య కానప్పుడు, పడుకున్న 8 సెకన్ల లోపే గాఢ నిద్ర పట్టేస్తుంది. ఒక దేశ ప్రధానికి పడుకున్న ఎనిమిది సెకన్లకే గాఢ నిద్ర పట్టేయటం దేశ సౌభాగ్యానికి సంకేతం. దేశ ఆర్థికాభివృద్ధికి సూచిక. ‘‘మా త్రివిధ దళాలు కళ్లు తెరిచే ఉన్నాయి’’ అని శత్రు దేశాలకు హెచ్చరిక. ‘‘దేశంలో శాంతి భద్రతలు లేవు’’ అని ఆరోపిస్తున్న ప్రతి పక్షాల నోటికి ఆనకట్ట. సభలో ఈ చివరి మూడు రోజులను కూడా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సాగనిచ్చేలా లేరు. వాళ్ల ఆందోళన, నిరసన, డిమాండ్ ఒక్కటే... కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రావటం లేదో చెప్పాలని! తరగతి గదిలో అల్లరి చేస్తున్న పిల్లల మధ్యలోంచి ఒక మంచి విద్యార్థి లేచివెళ్లి, తరగతి బయట కాస్త దూరంగా చెట్టుకింద కూర్చుని తన క్లాస్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉండటంలో జాతికి హితం కానిది ఏముంటుంది? వీళ్లు శీతాకాల సమావేశాలనైనా సజావుగా నడవనిస్తారా?! అప్పటికి ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై రిపోర్ట్ కూడా సిద్ధమై పార్లమెంటుకు వచ్చేస్తుంది. అదొస్తే, అందులోని ఏదో ఒక పాయింట్ను సపోర్ట్గా తీసుకుని పునర్విభజన బిల్లును మళ్లీ సభలో ప్రవేశపెట్టటానికి ఉంటుంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఇప్పుడున్నది బీజేపీ కనుక అక్కడ మళ్లీ బీజేపీనే వస్తుంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కనుక అక్కడ ఈసారి బీజేపీ వస్తుంది. ఎన్నికలు సమస్య కాదు. సభలో బిల్లులు సమస్య కాదు. ఖర్గే, రాహుల్ సమస్య కాదు. ఆరెసెస్ను సంతృప్తి పరచటం ఒక్కటే సమస్య ఇప్పుడు! ‘‘జెన్–జీ ఆందోళనలో న్యాయం ఉంది’’ అని అంటున్నారు ఆరెసెస్ చీఫ్ మోహన్ భాగవత్! ‘‘విద్యార్థులపై పోలీసు చర్య వెనుక అసలేం జరిగిందో నాకు తెలుసుకోవాలని ఉంది’’ అంటున్నారు! ‘‘జెన్–జీని నేను గుడ్డిగా నమ్ముతాను’’ అంటున్నారు! జెన్–జీ వాదనను ఓపికతో వినాలని, వాళ్ల డిమాండ్లను ప్రేమతో అర్థం చేసుకోవాలని అంటున్నారు!అంటే, చెట్టుకింద కూర్చుని క్లాస్ వర్క్ చేస్తున్న మంచి స్టూడెంట్ని మంత్రి వర్గం నుంచి డిబార్ చెయ్యాలని చెబుతున్నారా? జెన్–జీని ఇక్కడ ఎవరు మాత్రం గుడ్డిగా నమ్మటం లేదు?! జెన్–జీ వాదనను ఇక్కడ ఎవరు మాత్రం ఓపికతో వినటం లేదు?! అర్థం చేసుకోని వారికంటే కొన్నిసార్లు బాగా అర్థం చేసుకునేవారే సమస్యగా మారతారు. నిద్ర కూడా పట్టకుండా చేస్తారు. -
డీలిమిటేషన్ బిల్లుపై శిరోమణి అకాలీ దళ్ కీలక నిర్ణయం
చంఢీగఢ్: శిరోమణి అకాలీ దళ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్రం తీసుకవచ్చిన డీలిమిటేషన్ , మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు తమ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ భేటీ అయిన ఒక రోజు అనంతరమే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మద్దతుతో రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి–బీజేపీ కూటమి మళ్లీ ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయిసుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. "దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని అకాలీ దళ్ డిమాండ్ చేస్తోంది. అలాగే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు SAD మద్దతు ఇస్తుంది. ఈ మేరకు శిరోమణి అకాలీ దళ్.. చండీగఢ్లో జరిగిన పార్టీ సీనియర్ నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకుంది” అని బాదల్ ‘ఎక్స్’లో తెలిపారు.పార్లమెంట్ ముందున్న కీలక అంశాలపై సవివరంగా చర్చించిన అనంతరం.. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా న్యాయమైన, సమతుల్య డీలిమిటేషన్ జరగాలని శిరోమణి అకాలీ దళ్ డిమాండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు.గతంలో డీలీమిటేషన్కు వ్యతిరేకంగాఅయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఏప్రిల్లో డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అకాలీ దళ్ దానిని వ్యతిరేకించింది. ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఆ పార్టీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఆసమయంలో పంజాబ్కు ఈ బిల్లు వివక్ష చూపుతోందని అకాలీ దళ్ ఆరోపించింది. పంజాబ్కు సీట్ల సంఖ్యలో స్వల్ప పెరుగుదల మాత్రమే లభిస్తుండగా, పొరుగు రాష్ట్రాలు మరింత ఎక్కువ సీట్లు పొందే అవకాశం ఉందని పార్టీ పేర్కొంది.ఈ నేపథ్యంలో ఇటీవల మోదీతో భేటీ అయిన అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు తెలపడం విశేషం.2020లో తెగిపోయిన దాదాపు రెండున్నర దశాబ్దాల బంధంబీజేపీ–శిరోమణి అకాలీ దళ్ మధ్య దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కొనసాగిన పొత్తు 2020లో తెగిపోయింది. అప్పట్లో వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల నేపథ్యంలో అకాలీ దళ్.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


