మోదీకి ట్రంప్ ఫోన్.. పన్నులపై కీలక ప్రకటన | Trump praises India Gate | Sakshi
Sakshi News home page

మోదీకి ట్రంప్ ఫోన్.. పన్నులపై కీలక ప్రకటన

Feb 2 2026 10:07 PM | Updated on Feb 2 2026 11:39 PM

Trump praises India Gate

భారత్‌కు ట్రంప్  శుభవార్త చెప్పారు. పన్నులని  28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు చేస్తున్నట్లు తెలిపారు.  మోదీ తనకు గొప్ప స్నేహితుడని ట్రంప్ కొనియాడారు. అమెరికా వెనెజువెలా నుంచి చమురు కొనేందుకు భారత్ అంగీకరించందన్నారు. అయితే ట్రంప్ పన్నుల తగ్గింపుపై భారత ‍ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 140 కోట్ల భారతీయుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తన ప్రియమిత్రుడు ట్రంప్‌తో మాట్లాడడం చాలా సంతోషకరమన్నారు. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం కీలకం అన్నారు.

కాగా కొద్దిసేపటి క్రితమే  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీతో ఫోన్‌లో మాట్లాడారని స్టేటూన్‌ అంటూ అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తన అధికారిక ట్రూత్ ఖాతలో మోదీతో ఫోన్‌ మాట్లాడిన అంశాలను ట్రంప్ పోస్ట్ చేశారు. ఇందులో " ప్రధాని మోదీతో మాట్లాడడం బాగుంది. ఆయన నాకు మంచి మిత్రుడు. ఇండియాకి చాలా శక్తివంతమైన నాయకుడు. మేమిద్దరం ట్రేడ్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇలా చాలా విషయాల గురించి మాట్లాడాం అనంతరం ఆయన రష్యా నుంచి చమురు కొనడం ఆపేయాడానికి మోదీ అంగీకరించారు. ఇలా చేయడంతో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుంది. అదే విధంగా అమెరికా, వెనిజువెలా దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన చమురు కొనుగోలుకు మోదీ అంగీకరించారు.". అని ట్రంప్ పోస్టు చేశారు.  

అంతకుమందు భారత్‌లో ఉన్న ఇండియా గేట్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కట్టడం అత్యద్భుతమని పేర్కొంటూ తన సోషల్‌ మీడియా అకౌంట్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ఈ కట్టడం గ్రేటేస్ట్‌ ఆఫ్ ఆల్ అన్నారు. అంతకంటే గొప్ప కట్టడాన్ని అమెరికా వాషింగ్టన్‌ డీసీలో నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య సంబంధాలు అంత మెరుగ్గా లేవు.

ఆపరేషన్ సిందూర్ అనంతరం నుంచి ఇరుదేశాల మధ్య డిస్టెన్స్ కొంచెం పెరిగింది. ఇటీవల రష్యానుంచి చమురు కొనుగోలు చేయకూడదు అంటు ట్రంప్ భారత్‌ని హెచ్చరించారు. ఇండియా  కేర్ చేయకపోవడంతో భారత్‌ వస్తువులపై పన్నును 50 శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రస్తుతం అమెరికా భారత్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement