breaking news
Donald Trump
-
ట్రంప్ మరో హెచ్చరిక: ఇక ‘కార్టెల్స్’పై ఉచ్చు బిగిస్తాం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండవ దఫా అధికారం చేపట్టినది మొదలు తన పాలనలో వినూత్న మార్పులు తీసుకువస్తున్నారు. తాజాగా వెనిజులా నుండి మాదకద్రవ్యాలను తీసుకువెళుతున్నట్లు భావిస్తున్న పడవను లక్ష్యంగా చేసుకుని, అమెరికా సైన్యం దాడి చేసిందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆ నౌకలో ముగ్గురు మృతిచెందారని, ఈ తరహా‘కార్టెల్స్’ను లక్ష్యంగా చేసుకుని సైనిక దాడులు మరింతగా విస్తరిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉగ్రవాదులు అంతర్జాతీయ జలాల్లో అక్రమ మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నప్పుడు ఈ దాడి జరిగిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఏర్పడిన ‘కార్టెల్స్’ అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానం, కీలకమైన అమెరికా ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తున్నాయన్నారు. ఇటీవల అమెరికా సైన్యం వెనిజులా నుండి మాదకద్రవ్యాలను తీసుకువెళుతున్న స్పీడ్బోట్పై దాడి చేసింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ తమ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ తాజా ‘కార్టెల్స్’ దాడికి సంబంధించిన ఫుటేజ్ చూపించినట్లు తెలిపారు.ఆ నౌకలో మాదకద్రవ్యాలున్నాయని అమెరికా దగ్గర ఎలాంటి రుజువు ఉందని విలేకరులు అడగగా ట్రంప్ ‘మా దగ్గర రుజువు ఉంది. మీరు చేయాల్సిందల్లా సముద్రం అంతటా చెల్లాచెదురుగా ఉన్న సరుకును గమనించడమే.. పెద్ద సంచుల కొకైన్, ఫెంటానిల్ అక్రమ రవాణా జరుగుతోంది. సముద్రంలో మాదకద్రవ్యాల స్మగ్లర్లపై ఎలా దాడులు జరుగుతున్నాయో అవి భూభాగంపైన కూడా కొనసాగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. -
టిక్టాక్పై డీల్ కుదిరింది
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ సోషల్మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్ భవితవ్యంపై డీల్ కుదిరినట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా వెల్లడించారు. సోమవారం ఆయన తన సోషల్మీడియా ఖాతా లో దీనికి సంబంధించి సంస్థ పేరు చెప్పకుండా వివరాలు వెల్లడించారు. ‘అమెరికా, చైనా అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా సాగాయి. అమెరికా యువత అత్యధికంగా కోరుకుంటున్న ఒక కంపెనీ విషయంలో ఒప్పందం కుదిరింది. దీనిపై వచ్చే శుక్రవా రం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడుతా’అని ప్రకటించారు. ఆయన పేరు చెప్పకపోయినా ఆ కంపెనీ టిక్టాక్ అని భావిస్తున్నారు. చైనా కంపెనీ బైట్డ్యాన్స్ సృష్టించిన టిక్టాక్ యాప్ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం
వలసదారులపై మొదటి నుంచే కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించారు. అంతే కాకుండా.. అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు, తాత్కాలికంగా తమ నిపుణులను తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ చర్య విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి.. సంక్లిష్ట ఉత్పత్తుల తయారీలో అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.ఓడలు, కంప్యూటర్లు, రైళ్లు, సెమీకండక్టర్లు వంటి క్లిష్టమైన ఉత్పత్తులను నిర్మించే విదేశీ కంపెనీలు.. అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి సొంత దేశాల నుంచి నిపుణులను తీసుకురావాలని ట్రంప్ అన్నారు. మనం ఇలా చేయకపోతే.. భారీ పెట్టుబడులను అమెరికా కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికఇతర దేశీయలను.. అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. మేము కంపెనీలను మాత్రమే కాకుండా.. వారి ఉద్యోగులను కూడా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. క్లిష్టమైన రంగాల్లో కూడా మన దేశం రాణిస్తుంది. ఇది దేశ భవిష్యత్ కూడా అని పేర్కొన్నారు. -
భారతీయుడు నాగమల్లయ్య దారుణ హత్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
‘ఆ పప్పులు ఉడకవు.. శభాష్ భారత్’
రష్యా చమురు, ఆయుధ కొనుగోళ్ల విషయంలో భారత్పై ట్రంప్ కోపం ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఈయూ, జీ7, నాటో సహా పలు దేశాలపైనా ఆయన ఒత్తిడి చేస్తుండడం చూస్తున్నాం. అమెరికాలాగే ఆ దేశాలకు భారతీయ వస్తువులపై సుంకాల మోత మోగించాలంటూ సూచిస్తున్నారాయన. అయితే ఈ విషయంలో ఆయనకు చేదు అనుభవమే ఎదురవుతోంది!. తాజాగా ఈ పరిణామంపై రష్యా స్పందించింది. భారత్తో తమ సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్నాయని.. ఇరు దేశాల సంబంధాలను దెబ్బ తీయాలనే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో ఫలించబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అమెరికాకు మెత్తగా మొట్టికాయలు వేసింది. ‘‘ఇండియా-రష్యా సంబంధాలు స్థిరంగా, ధైర్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ బంధాన్ని భంగం చేయాలనే ప్రయత్నాలు విఫలం కాక తప్పదు. అమెరికా, నాటో దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు ఇండియాను అభినందించాల్సిందే. బాహ్య బెదిరింపులు, విమర్శలు ఉన్నా, ఇండియా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం అని రష్యా విదేశాంగ శాఖ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. ఇండియా వైఖరి.. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇండియా-రష్యా స్నేహబంధం స్ఫూర్తి, సంప్రదాయాలపై ఆధారపడి ఉంది. ఇది అంతర్జాతీయ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వయం ఇండియా నిర్ణయాన్ని ప్రతిబింబిస్తోంది. ఇరు దేశాలు మిలిటరీ ఉత్పత్తులు, అంతరిక్ష మిషన్లు, అణు శక్తి, రష్యన్ చమురు పరిశోధనలో భారత పెట్టుబడులు వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. నూతన చెల్లింపు వ్యవస్థలు, జాతీయ కరెన్సీల వినియోగం, పరస్పర రవాణా మార్గాల అభివృద్ధి వంటి అంశాల్లో కూడా సహకారం కొనసాగుతోంది అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత ఉత్పత్తులపై తొలుత 25% ప్రతీకార సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అటుపై రష్యా చమురు, రక్షణ సామాగ్రి కొనుగోళ్ల నేపథ్యంతో పెనాల్టీ కింద మరో 25% శాతం విధించారు. ఈ టారిఫ్లను భారత్ అన్యాయంగా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం జాతీయ ప్రయోజనాల, మార్కెట్ అవసరాల ఆధారంగా జరుగుతోందని భారత్ స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో.. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రష్యా భారత్ ఆర్థిక వ్యవస్థలు డెడ్.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదంటూ సంచలన కామెంట్ చేశారు. అయినప్పటికీ.. అమెరికా ఒత్తిడికి తలవంచే ప్రసక్తే లేదని, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు తమ దేశానికి ఉందని భారత్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగానే ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా అలస్కాలో పుతిన్తో భేటీ తర్వాత ట్రంప్ స్వరం కాస్త తగ్గింది. ఉక్రెయిన్ డీల్ కుదిరితే భారత సుంకాల విషయంలో ఆలోచన చేయొచ్చని అన్నారాయన. అయితే.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరాలంటే.. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై రాయితీలు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టేసింది. ఈ క్రమంలో.. ఈ రంగాలను రెడ్ లైన్స్గా red linesగా అభివర్ణించింది. మరోవైపు.. ఎగుమతిదారులపై ప్రభావం తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఆర్థిక మద్దతు ప్యాకేజీలు ప్రకటించే అవకాశముందనే విశ్లేషణ నడిచింది. ఈలోపు ట్రంప్-మోదీల పరస్పర సోషల్ మీడియా సంభాషణతో ఈ చర్చలు ముందుకు సాగవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. -
భారతీయుడి హత్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
టెక్సాస్లోని డల్లాస్లో చోటుచేసుకున్న భారతీయుడి దారుణ హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన పర్యవేక్షణలో వలస నేరస్తుల విషయంలో తమ యంత్రాంగం మృదువుగా వ్యవహరించదని తెగేసి చెప్పారు. అమెరికాను సురక్షిత ప్రాంతంగా మారుస్తామని పేర్కొన్నారు.టెక్సాస్లోని డల్లాస్ చంద్ర నాగమల్లయ్య హత్యకు సంబంధించిన భయంకరమైన రిపోర్టులను చూశానని, ఆయనను అతని భార్య, కుమారుని ముందు, క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు దారుణంగా తల నరికి చంపాడని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ పోస్ట్లో పేర్కొన్నారు.నిందితుడు కోబో మార్టినెజ్పై పిల్లలపై లైంగిక వేధింపులు, గ్రాండ్ తెఫ్ట్ ఆటో, తప్పుడు జైలు శిక్ష తదితర నేరాలకు గతంలో అరెస్టు చేశారన్నారు. అలాంటి నేరస్తుడిని క్యూబా తమ దేశంలో ఉండాలని కోరుకోలేదన్నారు. అయితే గత అసమర్థ జో బైడెన్ పాలనలో నేరస్తుడు కోబో మార్టినెజ్ అమెరికాలో తలదాచుకున్నాడన్నారు.ఇలాంటి అక్రమ వలస నేరస్తుల విషయంలో మృదువుగా ఉండాల్సిన సమయం ఇక ముగిసిందని, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్, అటార్నీ జనరల్ పామ్ బోండి, బోర్డర్ జార్ టామ్ హోమన్ తదితర అధికారులు అమెరికాను మళ్లీ సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన కృషి చేస్తున్నారన్నారు. అమెరికా అదుపులో ఉన్న నేరస్తుడ్ని చట్ట అమలు సంస్థలు పూర్తి స్థాయిలో విచారిస్తాయని ట్రంప్ పేర్కొన్నారు.కర్ణాటకకు చెందిన నాగమల్లయ్య(50) ఓ మోటల్లో మేనేజర్గా పని చేస్తున్నారు. అదే చోట మార్టినెజ్(37) సిబ్బందిగా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం పాడైన క్లీనింగ్ మెషిన్ విషయంలో నాగమల్లయ్య, మార్టినెజ్ మధ్య చిన్నగొడవ జరిగింది. అయితే ఆ మందలింపును భరించలేక తన బ్యాగులో ఉన్న కత్తితో వెంటాడి మరీ మల్లయ్యను మార్టినెజ్ దారుణంగా హతమార్చాడు. ఈ క్రమంలో నాగమల్లయ్య కొడుకు(18), భార్య అడ్డుకోవాలని ప్రయత్నించినా.. వారిద్దరినీ నెట్టేసి మరీ కిరాతకంగా హతమార్చాడు. ఆపై తల నరికి కాలితో తన్ని మరీ దానిని అక్కడి చెత్త బుట్టలో పడేశారు. అనంతరం పోలీసులు హత్యా నేరం కింద అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అతనిది నేరస్వభావమని, గతంలోనూ పలు నేరాలు చేశాడని, క్యూబా అతన్ని స్వీకరించేందుకు నిరాకరించడంతో ఇక్కడే అమెరికాలోనే ఉండిపోయాడని, ఈ ఏడాది జనవరిలో నిబంధనల ప్రకారం విడుదల చేయాల్సి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపార. ఈ ఘటనపై భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది. మరోవైపు భారతీయ కమ్యూనిటీ ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరించి నాగమల్లయ్య కుటుంబానికి అందజేసింది. సెప్టెంబర్ 13వ తేదీ నాగమల్లయ్యకు అక్కడే అంత్యక్రియలు జరిగాయి. -
రష్యాతో దోస్తీపై చైనాకు ట్రంప్ హెచ్చరిక.. డ్రాగన్ కౌంటర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా విషయంలో దూకుడు పెంచుతూ నాటో దేశాలు, చైనాలను హెచ్చరించారు. చమురు కొనుగోలును వెంటనే నిలిపేయాలని.. లేదంటే చైనాపై 100 శాతం పన్నులు విధిస్తానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది.అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రి స్పందించారు. స్లోవేనియా పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ..‘యుద్ధం సమస్యలను పరిష్కరించలేదు. ఇదే సమయంలో పలు దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయి. ప్రస్తుతం చైనా ఎలాంటి యుద్దం చేయడం లేదు.. యుద్ధంలో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు. అయితే, చైనాపై ట్రంప్ టారిఫ్ల ప్రకటన చేసిన కొద్దిసేపటికే వాంగ్ యి ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం.అంతకుముందు ట్రంప్.. చైనాపై భారీ సంఖ్యలో సుంకాలు విధిస్తేనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. యుద్ధాన్ని నిలువరించేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో 100 శాతం కన్నా ఎంతో తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే పన్నులు విధిస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు. లేదంటే తన సమయంతోపాటు అమెరికా డబ్బునూ వృథా చేస్తున్నట్లేనని అన్నారు.China hits back at Trump's 100% tariff call.Chinese Foreign Minister Wang Yi said that war cannot solve problems and sanctions only complicate them— CivilBuzz (@NetiNeti24) September 14, 2025అంతటితో ఆగకుండా.. రష్యాపై బీజింగ్ పట్టు సాధించిందని.. సుంకాలు విధించడం ద్వారా దీన్ని బలహీనపరచవచ్చని అన్నారు. ఈ యుద్ధానికి బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలే కారణమని మరోసారి ఆరోపించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్లు విధించాలని ఈయూ, జీ7 దేశాలకు విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. -
'నేను చెప్పినట్లు చేయండి.. లేకుంటే': ట్రంప్ పోస్ట్ వైరల్
డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా.. నాటో దేశాలు రష్యా చమురు కొనుగోలును ఆపివేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రష్యా నుంచి పెట్రోలియం కొనుగోలు చేసినందుకు చైనాపై 50-100 శాతం సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు.అన్ని నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపివేసినప్పుడు.. నేను రష్యాపై ప్రధాన ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నాను. నాటో సభ్యులు రష్యా చమురు కొనుగోలు చేయడం షాకింగ్గా ఉంది. యుద్ధంలో గెలవడానికి వారి నిబద్ధత 100% కంటే చాలా తక్కువగా ఉందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో వెల్లడించారు.రష్యా ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశం చైనా, తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. నాటో సభ్యదేశమైన టర్కీ మూడవ స్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే 32 దేశాల కూటమిలో హంగరీ, స్లోవేకియా కూడా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.రష్యా చమురుపై నాటో నిషేధం, చైనాపై సుంకాలు ఇవన్నీ కూడా యుద్ధాన్ని ముగించడంలో గొప్ప సహాయకారిగా ఉంటాయి. చైనాకు రష్యాపై బలమైన నియంత్రణ, పట్టు ఉన్నాయి. తానూ విధిస్తున్న సుంకాలు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం జరగడానికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అని అన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజో బైడెన్ అధ్యక్షుదిగా ఉన్న సమయంలో.. నేను అధ్యక్షుడినై ఉండి ఉంటే, ఈ యుద్ధమే ప్రారంభమయ్యేది కాదు. ఇది బైడెన్, జెలెన్స్కీల యుద్ధం అని ట్రంప్ అన్నారు. నేను చెప్పినట్లుగా చేస్తే.. యుద్ధం త్వరగా ముగుస్తుంది, ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే.. మీరు నా సమయాన్ని, దేశ సమయాన్ని, శక్తిని, డబ్బును వృధా చేస్తున్నవారు అవుతారని ఆయన స్పష్టం చేశారు. -
‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను’.. చార్లీ కిర్క్ భార్య భావోద్వేగ ప్రసంగం..
వాషింగ్టన్: ‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను..ఈ దేశం ఇప్పటివరకు చూడని గొప్ప విషయంగా దానిని మారుస్తాను’ అంటూ డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తన భర్తను గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో అన్నారు. బుధవారం యుటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమానికి హాజరైన రైట్ వింగ్ కార్యకర్త, డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. చార్లీ కిర్క్ హత్య అనంతరం అతని భార్య ఎరికా కిర్క్ తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు.తన భర్త పాడ్కాస్ట్ను హోస్ట్ చేసే కార్యాలయం నుండి ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. తాను అమెరికాను, ఇక్కడి ప్రకృతిని, చికాగో కబ్స్ను అమితంగా ప్రేమిస్తున్నానని అన్నారు. తన భర్త చార్లీ తనను, పిల్లలను హృదయపూర్వకంగా ప్రేమించారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన భర్తను హత్య చేసినవారిని పట్టుకున్న చట్ట అమలు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడు టైలర్ రాబిన్సన్ ను ఉద్దేశిస్తూ ఆమె ‘నాలో రగులుతున్న అగ్ని గురించి నీకు తెలియదు. ఈ వితంతువు రోదనలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ నాదాలుగా ప్రతిధ్వనిస్తాయి’ అంటూ ఎరికా కిర్క్ కన్నీరు పెట్టుకున్నారు.ఎరికా 2021లో చార్లీ కిర్క్ను వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. తన భర్త ట్రంప్ను అమితంగా ఇష్టపడేవారని, తన భర్త అందించిన రేడియో షో, పాడ్కాస్ట్ను కొనసాగిస్తూ, తన భర్త ఆశయాలను సజీవంగా ఉంచుతానని ఆమె పేర్కొంటూ, ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఆయనకు అండగా నిలిచారు. ఆయన కూడా మీ కోసం పనిచేశారు అని ఎరిక్ అధ్యక్షుడు ట్రంప్తో అన్నారు. -
భారత్పై సుంకాలు.. అతి పెద్ద సవాల్ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్పై సుంకాల విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై 50 శాతం సుంకం విధించడం అంత తేలికైన విషయం కాదని చెప్పుకొచ్చారు. ఈ అతి పెద్ద చర్య కారణంగానే భారత్, అమెరికా మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కొత్త చర్చ ప్రారంభమైంది. భారత్పై సుంకాలను తగ్గిస్తారా? అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యాకు భారత్ అతి పెద్ద చమురు వినియోగదారు. రెండు దేశాల మధ్య ఎంతో మిత్రుత్వం ఉంది. రష్యాపై చర్య తీసుకునేందుకు భారత్తో విభేదానికి మేము సిద్ధమయ్యాం. రష్యా నుంచి చమురు కొంటున్నారు అనే కారణంతోనే భారత్పై నేను భారత్పై 50 శాతం సుంకం విధించాను. అది చాలా పెద్ద చర్య. దీంతో భారత్తో విభేదాలు వచ్చాయి. అయినా నేనా చర్య తీసుకున్నాను. ఇలాంటి ఎన్నో పనులు చేశాను. కేవలం ఇది మాకు మాత్రమే సమస్య కాదు. యూరప్కు సైతం ఇదే ప్రధాన సమస్యే’ అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో పాత పాటే మళ్లీ పాడారు. తాను అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్-పాక్ ఘర్షణ సహా ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఏడు యుద్ధాలను తాను నివారించినట్టు ట్రంప్ తెలిపారు. కాంగో, రువాండా మధ్య గత 31ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని తానే పరిష్కరించానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పరిష్కరించలేని యుద్ధాలను నేను పరిష్కరిస్తాను ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
టారిఫ్ల వల్లే విభేదాలు: ట్రంప్
న్యూయార్క్: భారత్పై విధించిన టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు విధించాల్సి వచ్చిందని, ఇది సాధారణ విషయం కాదని అన్నారు. ఈ సుంకాల కారణంగా భారత్తో విభేదాలు ఏర్పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. శుక్రవారం ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. రష్యా చమురుకు భారత్ అతిపెద్ద కస్టమర్గా మారిందని ఆక్షేపించారు. దానికారణంగానే 50 శాతం టారిఫ్లు విధించక తప్పలేదని పునరుద్ఘాటించారు. నిజానికి అది చాలా పెద్ద నిర్ణయమని, దాన్ని మామూలు విషయంగా భావించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్పై మొండిగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యా అధినేత పుతిన్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా.. రష్యా మిత్రదేశమైన భారత్పై భారీగా సుంకాలు విధించడం ద్వారా ఒకరకంగా చర్యలు తీసుకున్నట్లేనని వివరించారు. -
విద్వేషాలను పెంచే హత్య
ఆయనేమీ అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి నిర్వహిస్తున్నవాడు కాదు. కనీసం రాజకీయ నాయకుడు కూడా కాదు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు సైద్ధాంతిక ఉపకరణాలు అందిస్తున్నవారిలో... ‘అమెరికాను మళ్లీ మహోత్కృష్టంగా మారుద్దాం’ (మాగా) ఉద్యమానికి తోడ్పడుతున్నవారిలో అతి ముఖ్యుడు. మూడు పదుల వయసు లోని మితవాద క్రియాశీల కార్యకర్త చార్లీ కిర్క్ను యూటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో బుధవారం దుండగుడు కాల్చి చంపిన వైనం ఇప్పుడు అమెరికాను ఊపిరాడకుండా చేస్తోంది. ప్రముఖులను, ఉన్న పదవుల్లోని వారినీ భౌతికంగా నిర్మూలించాలని చూసే సంస్కృతి అమెరికాకు కొత్తగాదు. కానీ ఈమధ్య అది పెరిగింది. ట్రంప్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయనపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. మిన్నెసోటా ప్రతినిధుల సభ స్పీకర్ ఎమెరిటా మెలిసానూ, ఆమె భర్తనూ ఇటీవలే కాల్చి చంపారు. అమెరికాలో తుపాకుల పరిశ్రమ పలుకుబడి అధికం. తుపాకి సంస్కృతిని రద్దుచేయటం మాట అటుంచి, కనీసం పరిమితులు విధించాలని చూసినా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తుపాకి కలిగివుండటం పౌరుల హక్కని, దాన్ని రద్దు చేయటమంటే జీవించే హక్కును కాలరాయటమేనని వాదిస్తారు. రిపబ్లికన్ పార్టీలో ఇలాంటివారు ఎక్కువున్నా, డెమాక్రటిక్ పార్టీలో కూడా తక్కువేం లేరు. కిర్క్ తుపాకులకు అనుకూలం. దానిపై ఒక విద్యార్థి ప్రశ్నకు జవాబు చెబుతుండగానే ఆయన హత్యకు గురయ్యారు. అమెరికాలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా అసహనం పెరిగింది. ఒక అంశంపై వాదం, ప్రతివాదం సంస్కృతి కనుమరుగవుతోంది. వినాలన్న యోచన లేదు. ఉన్నా వాదనకు జవాబు చెప్పలేక, అతనికి/ఆమెకు దురుద్దేశాలు అంటగట్టడం, అభాండాలేయటం, దౌర్జన్యానికి దిగటం పెరిగింది. ఏకీభవించకున్నా ఆ వాదనను గౌరవించాలన్న స్పృహ కొరవడింది.ఒక విశ్వాసాన్ని కలిగివున్న వ్యక్తిని హతమార్చినంత మాత్రాన ఆ విశ్వాసాన్ని నిర్మూలించటం అసాధ్యం. కానీ దురదృష్టవశాత్తూ దీన్ని నమ్ముకునే ధోరణి ప్రబలుతోంది. కిర్క్ డ్రాపౌట్ అన్న మాటేగానీ అసాధారణ ప్రతిభావంతుడు. కేవలం 18 యేళ్ల వయసులోనే ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ సంస్థ నెలకొల్పి తన మితవాద భావాలను బలంగా చెప్పగలిగే ఉపన్యాసకుడిగా రూపొందాడు. ఖజానా బాధ్యతాయుత నిర్వహణ, స్వేచ్ఛాయుత మార్కెట్లు, పరిమిత పాలనా వ్యవస్థ తదితర అంశాలపై విద్యాసంస్థల్లో ఉపన్యాసాలిచ్చాడు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడే 22 ఏళ్ల వయసులో ‘మాగా’ ఉద్యమానికి అంకితమై పనిచేశాడు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదై రిపబ్లికన్లకు ఓటేయటం వెనక కిర్క్ కృషిని గురించి చెబుతారు. అరిజోనా వంటి డెమాక్రటిక్ ప్రభావిత ప్రాంతం రిపబ్లికన్ల వైపు మొగ్గటంలో అతనిపాత్ర ప్రధానమైనది. మహిళలు, గర్భస్రావాలు, ట్రాన్స్జెండర్లు తదితర అంశాల్లోఅతని వైఖరిని చాలామంది జీర్ణించుకోలేరు. జాతి, మత, వర్ణ, లింగ వివక్షను నిషేధించే 1964 నాటి పౌర హక్కుల చట్టం పెద్ద తప్పిదమని కిర్క్ భావన. భారతీయులకు కిర్క్ తీవ్ర వ్యతిరేకి. ‘శ్వేత జాతీయులకు ఉద్యోగాలు రావాలి... మీరంతా ఖాళీ చేసి పొండి’ అని పిలుపునిచ్చాడు.తన భావాలపై ప్రశ్నించవచ్చంటూ కాలేజీలు, వర్సిటీల సందర్శన మొదలు పెట్టాడు. ఆ భావాలను పూర్వపక్షం చేస్తే అతని వాదన బలహీనపడుతుంది. కానీ భౌతిక దాడికి దిగటం వల్ల కిర్క్ భావాల బలం పెరుగుతుంది. ఈ మరణం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో సామాజిక మాధ్యమాల్లోని వ్యాఖ్యలే చెబుతాయి. ‘మనది యుద్ధం. కిర్క్ నేలకొరిగిన యుద్ధ వీరుడు. వ్యక్తిగత భేదాలు పక్కనబెట్టి ఒక్కటై పోరాడాలి’ అని మితవాద వ్యూహకర్త స్టీవ్ బేనన్ పిలుపునిచ్చారు. ‘మనల్ని ప్రశాంతంగా బతకనీయకపోతే మనకున్న ప్రత్యామ్నాయాలు రెండే– పోరాడటం లేదా మరణించటం’ అని ఎలాన్ మస్క్ అన్నారు. ‘వామపక్షవాదులారా... మనం సంభాషించుకుందాం లేదా యుద్ధానికి దిగుదాం. మీ నుంచి మరో బుల్లెట్ బయటికొస్తే ఇక ఆఎంపిక మిగలదు’ అని నటుడు జేమ్స్ వుడ్స్ హెచ్చరించారు. ఏదేమైనా ఈ వాతావరణంలో అక్కడివారే కాదు... వలసపోయినవారూ అప్రమత్తంగా ఉండక తప్పదు. -
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసు.. నిందితుడి మగ్షాట్ విడుదల
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్(31) హత్య కేసులో ఎఫ్బీఐ అధికారులు పురోగతి సాధించారు. 48గంటల్లో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఎఫ్బీఐ నిందితుడు టైలర్ రాబిన్సన్ మగ్షాట్ (అరెస్టు సమయంలో తీసిన ఫోటో)ను విడుదల చేసింది. టైలర్ రాబిన్సన్ అనే 22 ఏళ్ల యువకుడు. యుటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో చార్లీ కిర్క్ను కాల్చి చంపాడు.ఈ ఘటన పట్టపగలు 3వేల మంది ప్రజల సమక్షంలో జరిగింది. రాబిన్సన్ అరెస్ట్ అనంతరం, అతని ఫోటోను ఎఫ్బీఐ అధికారికంగా విడుదల చేయడం ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వడమే కాకుండా,కేసు విచారణలో పారదర్శకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఎఫ్బీఐ స్థానిక పోలీసు శాఖలతో కలిసి ఈ కేసును విచారిస్తోంది. చార్లీ కిర్క్ను హత్య చేయడానికి నిందితుడి మోటివ్, తుపాకీని ఎక్కడి నుంచి సేకరించారు. సంఘటనకు ముందు జరిగిన పరిణామాలపై దృష్టి పెట్టారు. రాబిన్సన్ను ఇప్పటికే విచారిస్తున్నట్లు సమాచారం. -
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ ప్రాణం తీసిన నిందితుడు దొరికాడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) ప్రాణాలు తీసిన నిందితుడు దొరికాడు. నిందితుడికి చాలా దగ్గర వ్యక్తులే అతడిని పట్టించినట్లు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ట్రంప్కు సన్నిహితుడిగా, సంప్రదాయవాదిగా పేరుగాంచిన చార్లీ కిర్క్(31) దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు.నిందితుడు కాల్పులు జరపడంతో కూర్చొని ప్రసంగిస్తున్న చార్లీ కిర్క్ మెడ భాగంలో తూటా దిగింది. తీవ్ర గాయం కావడంతో చార్లీ నేలకొరిగాడు. చార్లీ కిర్క్ బుధవారం యుటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులు, అనుచరులతో మాట్లాడుతున్న సమయంలో హత్యకు గురయ్యాడు. యుటా వ్యాలీ యూనివర్సిటీ పోలీస్ అధికారి చార్లీకిర్క్ హత్య అనంతరం మీడియాతో మాట్లాడారు.చార్లీ ఈవెంట్లో మూడువేల మందిచార్లీ కిర్క్ ఈవెంట్లో సుమారు 3వేలమంది పాల్గొన్నారు. మాటీంలో ఆరుగురు సభ్యులు ఈవెంట్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. చార్లీకి సెక్యూరిటీగా తన వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. ఈవెంట్ జరిగే సమయంలో చార్లీ క్యాంపస్లో లోతట్టు ప్రదేశంలో ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో నిందితుడు చార్లీ కూర్చున్న ప్రదేశం నుంచి సుమారు 200 అడుగుల దూరంలో ఉన్న బిల్డింగ్ పైకప్పు నుంచి కాల్పులకు తెగబడ్డారని అన్నారు. లక్ష డాలర్ల రివార్డుకాల్పుల ఘటనపై అప్రమత్తమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు 48 గంటల్లో నిందితుణ్ని అదుపులోకి తీసుకుంది. ఇందుకోసం సుమారు 20కిపైగా ఏజెన్సీలు,వందల మంది వందలాది మంది అధికారులు.. 7వేల మందికి పైగా ప్రజల సహాయంతో రంగంలోకి దిగారు.నిందితుణ్ని అరెస్ట్ చేశారు.నిందితుడి ఆచూకీ, అరెస్ట్ చేసేలా సమాచారం ఇచ్చిన వారికి లక్ష డాలర్ల రివార్డు ఇస్తామని ఎఫ్బీఐ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. The FBI is offering a reward of up to $100,000 for information leading to the identification and arrest of the individual(s) responsible for the murder of Charlie Kirk on September 10, 2025, at Utah Valley University in Orem, Utah. Contact 1-800-CALL-FBI and submit photos and… pic.twitter.com/ReuzFhdm0H— FBI (@FBI) September 11, 2025 -
ట్రంప్ సన్నిహితుడి హత్య.. వెలుగులోకి సంచలన వీడియో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితుడు చార్లీ కిర్క్పై జరిగిన కాల్పుల ఘటనలో మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితుడు కాలేజీ భవనం పైకప్పు నుంచి దూకి పరారైన దృశ్యాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తాజాగా విడుదల చేసింది. కిర్క్ను చంపడానికి దుండగుడు ఉపయోగించిన బోల్డ్–యాక్షన్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్బీఐ ప్రకటించింది.దానిపై వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం ల్యాబ్లో పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. దుండగుడి ఆచూకీ ఇంకా లభించలేదని, గాలింపు కొనసాగుతోందని వెల్లడించింది. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు. ఒకే ఒక్క తూటాకు చార్లీ కిర్క్ అక్కడికక్కడే నేలకొరిగాడు. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల తరహాలోనే ఈ కాల్పులు జరగడం గమనార్హం.యూనివర్సిటీ ప్రాంగణంలో తెల్లరంగు టెంట్ మధ్యలో కూర్చొని విద్యార్థుల ప్రశ్నలకు మైక్రోఫోన్లో సమాధానం చెబుతుండగా హఠాత్తుగా బుల్లెట్ దూసుకొచ్చింది. రాజకీయ యువజన సంఘం ‘టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో గత పదేళ్లలో అమెరికాలో తుపాకీ హింసాకాండలో ట్రాన్స్జెండర్ల పాత్ర ఎంతవరకు ఉందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వెంటనే బుల్లెట్ ఆయన మెడను చీలుస్తూ దూసుకెళ్లింది. మెడ ఎడమభాగం నుంచి రక్తం బయటకు చిమ్మింది. తీవ్రంగా గాయపడిన కిర్క్ అక్కడే ప్రాణాలు వదిలాడు.చార్లీ కిర్క్ అలియాస్ చార్లెస్ జేమ్స్ కిర్క్ 1993 అక్టోబర్ 14న ఇల్లినాయిస్లో జన్మించాడు. రాజకీయాల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 2012లో 18 ఏళ్ల వయసులో షికాగోలో టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ అనే సంస్థను మరో వ్యక్తితో కలిసి స్థాపించాడు. ఆయనకు భార్య ఎరికా లేన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రంప్ పెద్ద కుమారుడైన డొనాల్ట్ ట్రంప్ జూనియర్కు కిర్క్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అంతేకాదు రచయితగా, రేడియో వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందాడు. మీడియా రంగంలోనూ అడుగుపెట్టాడు. టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలుస్తున్నారు. భారతీయులకు అమెరికా వీసాలు ఇవ్వడాన్ని కిర్క్ పలు సందర్భాల్లో వ్యతిరేకించాడు. అమెరికన్ కార్మికుల స్థానాన్ని భారతీయులు ఆక్రమించుకున్నారని, వారికి ఇక వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాడు. -
భారత్–అమెరికా చర్చల్లో పురోగతి
ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై భారత్–అమెరికా మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో ముందుకు సాగుతున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గురువారం ప్రకటించారు. చర్చల్లో పురోగతి పట్ల రెండు దేశాలు సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) చర్చలను 2025 నవంబర్ నాటికి ముగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశ వాణిజ్య మంత్రులకు సూచించినట్టు తెలిపారు. వాణిజ్య ఒప్పందం విషయమై అమెరికాతో భారత్ చురుగ్గా చర్చలు నిర్వహిస్తున్నట్టు మంత్రి గోయల్ బుధవారం సైతం ప్రకటించడం గమనార్హం.రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విజయవంతంగా పూర్తయ్యేందుకు ఎలాంటి అడ్డంకుల్లేవని, తన మంచి స్నేహితుడైన ప్రధాని నరేంద్ర మోదీతో రానున్న వారాల్లో మాట్లాడేందుకు వేచి చూస్తున్నానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సాకారమవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సైతం వెంటనే సానుకూలంగా స్పందించారు.అమెరికా, భారత్ సహజ భాగస్వాములంటూ.. వీలైనంత ముందుగా వాణిజ్య చర్చలను ముగించేందుకు రెండు దేశాలు చురుగ్గా పనిచేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్పై చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. వాస్తవానికి భారత్–అమెరికా మధ్య పలు విడతల చర్చలు జరిగినప్పటికీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదరకపోవడం తెలిసిందే.ఇదీ చదవండి: నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు కొత్త ఫోన్ -
ఆయన్ని పట్టించుకోకండి.. ట్రంప్-మోదీ మధ్యే గొడవలు పెట్టబోయాడు
టారిఫ్ వార్తో మొదలైన అమెరికా-భారత్ ఉద్రిక్తతలు.. ట్రంప్-మోదీ పరస్పర సోషల్ మీడియా స్నేహపూర్వక సందేశాలతో కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. ఈ తరుణంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్(John Bolton) కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత.. సోషల్ మీడియా విమర్శలు పక్కనపెట్టి వాస్తవిక వ్యూహాత్మక చర్చలు జరగాలని ఇరు దేశాలకు సూచించారాయన.అంతేకాదు.. ట్రంప్ వాణిజ్యసలహాదారు పీటర్ నవారో(Peter Navarro) వల్లే భారత్, అమెరికా మధ్య సంబంధాలు చెడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని బోల్టన్ అంటున్నారు. తాజాగా భారత్కు చెందిన ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలే వెల్లడించారు.పీటర్ నవారో అనే వ్యక్తి ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య సలహాదారుగా ఉన్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య గొడవను ప్రేరేపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నవారో అనే వ్యక్తి ఎలాంటి వారంటే.. ఒక గదిలో ఆయన్ని మాత్రమే ఉంచండి. ఓ గంట తర్వాత వచ్చి చూడండి. ఆయనతో ఆయనే గొడవ పడుతుంటాడు.. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. అయితే..భారత్పై నవారో చేస్తున్న ఆరోపణలు తీవ్రతతో కూడుకున్నవే అయినప్పటికీ.. ప్రాధాన్యత లేని అంశంగా ఇరు దేశాలు భావించాలి. అసలు వాణిజ్య చర్చలు ప్రామాణిక ప్రతినిధుల మధ్య జరగాలి. అలాగే.. భారత్ సోషల్ మీడియా తరఫున బెదిరింపులు, గందరగోళం లాంటివి లేకుండా ఉంటే మరీ మంచిది. అప్పుడే.. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణంలో ఒప్పందానికి అవకాశం ఉంటుంది.అలాగని ఈ సమస్యలు తేలికగా.. త్వరగా పరిష్కారమవుతాయన్నది నేను అనుకోవడం లేదు. కానీ రెండు పక్షాల్లోనూ మంచి నమ్మకం ఉంటుందని.. అదే మార్గం ద్వారా పరిష్కారం సాధ్యమవుతుంది అని భావిస్తున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అంతర్జాతీయ సంబంధాలను తన వ్యక్తిగత సంబంధాలతో పోల్చుకుంటారు. ఉదాహరణకు.. ట్రంప్ మోదీ(modi) మధ్య మంచి సంబంధం ఉంటే.. ఆయన దృష్టిలో భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉన్నట్లే అని బోల్టన్ చెప్పారు. కాబట్టి ఇరు దేశాధినేతల మధ్య ప్రజాస్వామ్యానికి హాని కలిగించే గొడవలు కాకుండా.. నిజమైన వ్యూహాత్మక చర్చలు జరగాలని బోల్టన్ ఆశించారు.ఇదిలా ఉంటే.. భారత ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ టారిఫ్లను కొందరు అమెరికా విశ్లేషకులు తప్పుపట్టగా.. పీటర్ నవారో, బెసెంట్ వంటి వారు మాత్రం భారత్ను ఉద్దేశిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని నవారో ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆయన మాటలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.అయినప్పటికీ రష్యాతో భారత్ కొనసాగిస్తున్న విధానాలపై ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో పదే పదే నోరుపారేసుకుంటున్నారు. భారత్ను టారిఫ్ మహారాజా అని పిలుస్తూ.. రష్యా చమురు కొనుగోలుపై బ్లడ్ మనీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన ఆరోపణలు అబద్ధమని ఎక్స్ తన ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పికొట్టింది. అయినప్పటికీ.. నవారో తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. అంతేకాదు.. భారతీయ సోషల్ మీడియా యూజర్లను కీబోర్డ్ మినియన్స్(తెలివి తక్కువ, పనికి మాలిన అని నానార్థాలు వస్తాయి) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొందరు భారతీయులు నవారోని టార్గెట్ చేస్తూ పోస్టులతో తిట్టిపోస్తున్నారు. -
భారత్, అమెరికా వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం
-
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య
-
Charlie Kirk: ట్రంప్ మిత్రుడు చార్లీ కిర్క్ దారుణ హత్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితుడిగా, సంప్రదాయవాదిగా పేరుగాంచిన చార్లీ కిర్క్(31) దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు. ఒకే ఒక్క తూటాకు చార్లీ కిర్క్ అక్కడికక్కడే నేలకొరిగాడు. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల తరహాలోనే ఈ కాల్పులు జరగడం గమనార్హం. యూనివర్సిటీ ప్రాంగణంలో తెల్లరంగు టెంట్ మధ్యలో కూర్చొని విద్యార్థుల ప్రశ్నలకు మైక్రోఫోన్లో సమాధానం చెబుతుండగా హఠాత్తుగా బుల్లెట్ దూసుకొచ్చింది. రాజకీయ యువజన సంఘం ‘టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో గత పదేళ్లలో అమెరికాలో తుపాకీ హింసాకాండలో ట్రాన్స్జెండర్ల పాత్ర ఎంతవరకు ఉందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వెంటనే బుల్లెట్ ఆయన మెడను చీలుస్తూ దూసుకెళ్లింది. మెడ ఎడమభాగం నుంచి రక్తం బయటకు చిమ్మింది. తీవ్రంగా గాయపడిన కిర్క్ అక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని యూటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ కాక్స్ తేల్చిచెప్పారు. కిర్క్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. తమ రాష్ట్రానికి ఇదొక చీకటి రోజు, దేశానికి విషాదభరిత దినమని అని చెప్పారు. హంతకుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అతడికి మరణశిక్ష తప్పదని పేర్కొన్నారు. తొక్కిసలాట.. విషాద ఛాయలు కిర్క్ హత్య తర్వాత యూనివర్సిటీలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. బుల్లెట్ పేలిన శబ్దం వినిపించడం, వెంటనే కిర్క్ కింద పడిపోవడం చూసి విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. స్వల్పంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు పడిపోయారు. ఆ సమయంలో అక్కడ దాదాపు 3,000 మంది ఉన్నారు. అరుపులు, రోదనలతో విషాదం అలుముకుంది. ఈ గందరగోళం మధ్యే నల్లరంగు దుస్తుల్లో ఉన్న హంతకుడు అందరి కళ్లుగప్పి సులభంగా తప్పించుకున్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, ఈ ఘటనతో వారికి సంబంధం లేదని తేలింది. అనంతరం వారిని వదిలేశారు. హత్యకు సంబంధించి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. యూనివర్సిటీ పోలీసు డిపార్టుమెంట్కు చెందిన ఆరుగురు అధికారులతోపాటు కిర్క్ సొంత భద్రతా సిబ్బంది ఘటనా స్థలంలోనే విధుల్లో ఉన్నా వేలాది మంది సమక్షంలో హత్య జరగడం గమనార్హం. మహోన్నత వ్యక్తి: ట్రంప్ తన మద్దతుదారుడైన చార్లీ కిర్క్ మృతిపట్ల డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అతడొక మహోన్నత వ్యక్తి అని శ్లాఘించారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియాలో ఒక పోస్టుచేశారు. వైట్హౌస్ నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. సత్యం, స్వేచ్ఛ కోసం కిర్క్ అమరుడయ్యాడని కొనియాడారు. కిర్క్ హత్యకు విప్లవæ వామపక్షవాదులే కారణమని ఆరోపించారు. కిర్క్కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ను ట్రంప్ గురువారం ప్రకటించారు.ఎవరీ కిర్క్? చార్లీ కిర్క్ అలియాస్ చార్లెస్ జేమ్స్ కిర్క్ 1993 అక్టోబర్ 14న ఇల్లినాయిస్లో జన్మించాడు. రాజకీయాల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 2012లో 18 ఏళ్ల వయసులో షికాగోలో టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ అనే సంస్థను మరో వ్యక్తితో కలిసి స్థాపించాడు. ఆయనకు భార్య ఎరికా లేన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రంప్ పెద్ద కుమారుడైన డొనాల్ట్ ట్రంప్ జూనియర్కు కిర్క్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అంతేకాదు రచయితగా, రేడియో వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందాడు. మీడియా రంగంలోనూ అడుగుపెట్టాడు. టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలుస్తున్నారు. భారతీయులకు అమెరికా వీసాలు ఇవ్వడాన్ని కిర్క్ పలు సందర్భాల్లో వ్యతిరేకించాడు. అమెరికన్ కారి్మకుల స్థానాన్ని భారతీయులు ఆక్రమించుకున్నారని, వారికి ఇక వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాడు.ఇదీ చదవండి: ఆయనతో జాగ్రత్త.. ట్రంప్ మనవరాలికి నెటిజన్ల సూచనతుపాకీ స్వాదీనం కిర్క్కు చంపడానికి దుండగుడు ఉపయోగించిన బోల్డ్–యాక్షన్ రైఫిల్ను స్వా«దీనం చేసుకున్నట్లు ఎఫ్బీఐ గురువారం ప్రకటించింది. దానిపై వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం ల్యాబ్లో పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. దుండగుడి ఆచూకీ ఇంకా లభించలేదని, గాలింపు కొనసాగుతోందని వెల్లడించింది. అతడు కాలేజీ విద్యార్థి కావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలియజేసింది. -
మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా..
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా మంచి మిత్రుడని, ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రాబోయే కొన్ని వారాల్లోనే మోదీతో సంభాషిస్తానని తెలిపారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు చురుగ్గా కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు. ఈ చర్చలు విజయవంతం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. చర్చలను సానుకూలమైన ముగింపునకు తీసుకురావడంలో ఇబ్బందులేవీ లేవని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. భారత్తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నానని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్, అమెరికా నడుమ వాణిజ్యపరమైన అవరోధాలు కచ్చితంగా తొలగించుకుంటామని పేర్కొన్నారు. భారత్తో సంబంధాలను బలహీనపర్చుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదని ట్రంప్ తన చర్యల ద్వారా సంకేతాలిస్తున్నారు. ‘‘మోదీ గొప్ప ప్రధానమంత్రి. ఆయన నాకు ఎప్పటికీ మంచి మిత్రుడే. మేము ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉంటాం’’ అని ట్రంప్ శుక్రవారం వైట్హౌస్లో వ్యాఖ్యానించారు. -
ట్రంప్ పోస్ట్ను రీట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Trump: అశ్వత్థామ హతః.. కుంజరః!
కురుక్షేత్ర యుద్ధంలో.. అశ్వత్థామ అనే ఏనుగు మరణిస్తుంది. అయితే.. ద్రోణాచార్యుడిని మట్టుబెట్టడానికి ఇదే మంచి తరుణమని శ్రీకృష్ణుడు భావిస్తాడు. ఆయన సూచన మేరకు అశ్వత్థామః హతః అని గట్టిగా.. కుంజరః(ఏనుగు)అని ధర్మరాజు నెమ్మదిగా విలపిస్తాడు. తన కుమారుడే చనిపోయాడని భావించి యుద్ధాన్ని వదిలిపెట్టి ధ్యానంలోకి వెళ్తాడు ద్రోణుడు. అదను కోసం ఎదురు చూస్తున్న ధృష్టద్యుమ్నుడు (ద్రుపదరాజు కొడుకు) ద్రోణుడ్ని హతమారుస్తాడు. అమెరికా మిత్రదేశం ఖతార్ విషయంలోనూ ట్రంప్ ఇదే తరహా స్ట్రాటజీ ఫాలో అయ్యారా? అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు.. 2025 సెప్టెంబర్ 9న.. ఇజ్రాయెల్ సైన్యం ఖతార్ రాజధాని దోహాపై వైమానిక దాడులు జరిపింది. హమాస్ నేతలే లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు స్పష్టమైన ప్రకటన చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది అనుకోకుండా జరిగిన దురదృష్టకరమైన ఘటన అని అభివర్ణించారు. ఈ క్రమంలోనే ఆ రెండు దేశాల డబుల్ గేమ్ బయటపడింది.గాజా కాల్పుల విమరణ ఒప్పందం ప్రతిపాదనల్లో భాగంగా.. ట్రంప్ హమాస్కు చివరి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో హమాస్ అగ్రనేతలు హుటాహుటిన దోహాలో భేటీ అయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే దాడి జరిగింది. ఫలితంగా.. హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. అయితే ఈ దాడికి సంబంధించి అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ.. ఖతార్కు దాన్ని చెప్పడంలో ఆలస్యం చేసిందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు.. దాడి గురించి అమెరికాకు ముందే సమాచారం ఇచ్చాం: టెల్అవీవ్(ఇజ్రాయెల్ రాజధాని) వర్గాలుఅవును.. ఇజ్రాయెల్ సమాచారం అందించిన వెంటనే.. దాడి గురించి ఖతార్(Qatar)కు సమాచారం ఇచ్చాం: అమెరికాదాడులు మొదలైన 10 నిమిషాల తర్వాత యూఎస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పేలుళ్లు కొనసాగుతుండగానే అమెరికా అధికారి ఒకరు ఆ సమాచారం అందించారు: ఖతార్ విదేశాంగ శాఖ అధికారిఅమెరికా- ఖతార్ల మధ్య బంధం ఇటీవల బలపడింది. అధ్యక్ష హోదాలో తొలిసారి గల్ఫ్ దేశంలో పర్యటించిన ట్రంప్.. 400 మిలియన్ డాలర్ల విలువ చేసే విలాసవంతమైన విమానాన్ని ఖతార్ నుంచి బహుమతిగా అందుకున్నారు. ప్రతిగా.. ఆ దేశ పర్యటనలో 243 బిలియన్ డాలర్ల కీలక ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. పైగా ట్రంప్ కొడుకు ఎరిక్ కూడా అక్కడ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటునకు ఒప్పందం చేసుకున్నాడు. పైగా ఇరాన్కు ఖతార్ మిత్రదేశం కావడంతో.. టెహ్రాన్ బ్యాక్ చానెల్ కమ్యూనికేషన్లాగా ట్రంప్ పరిగణిస్తున్నారు. వీటన్నింటికి తోడు.. పశ్చిమాసియాలో తన దౌత్య ప్రయత్నాలకు ఈ గల్ఫ్ దేశం కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటప్పుడు.. ఖతార్పై ఇజ్రాయెల్ దాడి చేయడం, శాంతిదూత ట్రంప్ దానిని చూస్తూ ఉండిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో.. ఈ దాడులకు సంబంధించి అమెరికా నుంచి గందరగోళమైన ప్రకటనలు వెలువడ్డాయి. దాడి గురించి తాము సమాచారం ఇచ్చామని.. తమకు సమాచారం అందిందని చెప్పిన ఇజ్రాయెల్, అమెరికాకు కొద్దిగంటలకే మాట మార్చాయి. వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ దాడి గురించి తెలియజేయాలని పశ్చిమాసియా రాయబారి విట్కాఫ్ను ట్రంప్ ఆదేశించారని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. దాడి గురించి ముందే చెప్పామంటూ హడావుడిగా వివరణ ఇచ్చారు. అనంతరం దాడికి సంబంధించిన నిర్ణయం తాను తీసుకోలేదని.. మరోసారి ఇలాంటి దాడులు జరగవని హామీ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇక.. ఈ దాడి పూర్తిగా తమ చర్యేనని, ఇందులో యూఎస్ ప్రమేయం లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాటమార్చారు.మెహ్దీ హసన్ అనే జర్నలిస్టు.. ‘ట్రంప్ ఖతార్ నుంచి విమానం తీసుకున్న తర్వాత అదే దేశంపై బాంబింగ్కు అంగీకారం ఇచ్చాడా?’’ అంటూ విమర్శించారు. డాక్టర్ అండ్రెస్ క్రెయిగ్ అనే విశ్లేషకుడు: ‘‘ఖతార్కు ముందుగా సమాచారం ఇచ్చినట్లైతే, ప్రాణనష్టం జరగకుండా చూసుకునేవారు’’ అని ట్వీట్ చేశారు.ఏది ఏమైనా.. ఈ దాడి నేపథ్యంలో అరబ్ దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఖతార్పై జరిగిన దాడుల్ని ముక్తకంఠంతో ఖండించాయి. ఇది అమెరికాకు ఒకరకంగా మింగుడు పడని విషయమే. మరోవైపు.. ఖతార్లో గాజా చర్చల కోసం హమాస్ నేతలు భేటీ అయినప్పుడే ఈ దాడి జరిగింది. దీంతో.. శాంతి చర్చలు నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. -
భారత్ పట్ల ట్రంప్ మరో ట్విస్ట్.. 100 శాతం సుంకాలు విధించాలని..
వాషింగ్టన్: భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఒకవైపు ప్రధాని మోదీ తనకు మిత్రుడు.. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్పై 100 శాతం సుంకం విధించాలని ఈయూ దేశాలకు సూచించినట్లు తెలుస్తోంది.కాగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రష్యా నుంచి వాణిజ్యం చేస్తున్న పలు దేశాలను ట్రంప్ చేశారు. భారత్, చైనాలపై సుంకాల భారాన్ని పెంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నారు. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈయూ అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్, చైనాలపై 100 శాతం సుంకం విధించాలని సూచించినట్లు తెలుస్తోంది. చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్లను కొనసాగించాలన్నారు. ‘మేము ఇలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, యూరోపియన్ భాగస్వాములతో కలిసి ముందుకువస్తేనే దీన్ని అమలుచేద్దాం’ అని యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా సూచనలు అమలుచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఈయూ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్లో త్వరగా శాంతి నెలకొల్పాలని ఈయూ కూడా భావిస్తుంది. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి తెస్తేనే అది సాధ్యమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో యూరోపియన్ నేతలు కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారు.మరోవైపు.. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్పదేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. -
ద్వైపాక్షిక ఒప్పందానికి కృషి
న్యూఢిల్లీ: భారత్, అమెరికాలు సహజ భాగస్వామ్య దేశాలు అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చలను సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇరుపక్షాలు ఆ దిశగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్యపరమైన అవరోధాలను తొలగించడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై మోదీ ప్రతిస్పందించారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ ప్రకటనను పరోక్షంగా స్వాగతించారు. India and the US are close friends and natural partners. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward… pic.twitter.com/3K9hlJxWcl— Narendra Modi (@narendramodi) September 10, 2025 భారత్, అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్పష్టంచేశారు. రెండు మిత్ర దేశాల నడుమ భాగస్వామ్యానికి సంబంధించిన పూర్తి శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి వాణిజ్య చర్చలు దోహదపడతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల పౌరులకు మేలు జరిగేలా, ఉజ్వల భవిష్యత్తు ఉండేలా తాము కలిసికట్టుగా పనిచేస్తామని తేల్చిచెప్పారు. మోదీ–ట్రంప్ మధ్య సోషల్ మీడియాలో అనుసంధానం గత నాలుగో రోజుల్లో ఇది రెండోసారి కావడం విశేషం. భారత్–అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ చెప్పగా, అందుకు మోదీ ఈ నెల 6న హర్షం వ్యక్తంచేశారు. రెండు దేశాల బంధంపై ట్రంప్ అభిప్రాయాన్ని ప్రశంసించారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఇటీవల ఒత్తిడికి లోనవుతున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత్పై ట్రంప్ సర్కార్ మండిపడుతోంది. భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్రంప్ సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సంబంధాలను మళ్లీ యథాతథ స్థితికి తీసుకురావాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్, అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం త్వరలో ఇండియాకు రానుంది. అమెరికా నుంచి భారత నావికాదళం పీ–8ఐ లాంగ్ రేంజ్, మల్టిమిషన్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్లు కొనుగోలు చేస్తోంది. దీనిపై త్వరలో ఇరుపక్షాల మధ్య తుది చర్చలు జరుగనున్నాయి. -
మోదీతో మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నా.. దెబ్బకు దిగొచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన దరిమిలా ఇరుదేశాల సంబంధాలు బీటలు వారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించుకునేందుకు అమెరికా- భారత్లు తిరిగి చర్చలు ప్రారంభిస్తాయన్నారు.తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్లో ‘భారత్- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు, ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై అదనంగా 25 శాతం జరిమానాతో పాటు భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాన్ని విధించిన కొన్ని వారాల దరిమిలా ఈ ప్రకటన రావడం గమనార్హం. దీనికిముందు అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లో ఒక ప్రకటన చేస్తూ, భారత్-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు. తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని ధృవీకరించారు. ఆందోళన చెందేందుకు ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ప్రదాని మోదీ తీరుపై అసంతృప్తి ఉందని కూడా కామెంట్ చేశారు.ప్రస్తుత సమయంలో భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అని ఏఎన్ఐఐ అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను మోదీకి ఎప్పటికీ స్నేహితుడినే. ఆయన గొప్ప ప్రధానమంత్రి. అయితే ఈ నిర్దిష్ట సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. కానీ భారత్- అమెరికా మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధం ఉందన్నారు. -
జీన్ కరోల్ పరువు నష్టం కేసు.. ట్రంప్కు ఎదురు దెబ్బ
కాలమిస్ట్ ఈ. జీన్ కరోల్ వేసిన పరువు నష్టం కేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ 8.33 కోట్ల డాలర్లు(సుమారు రూ.733 కోట్లు) చెల్లించాలంటూ సివిల్ జ్యూరీ ఇచ్చిన తీర్పును న్యూయార్క్లోని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. ట్రంప్ చేసిన అప్పీల్ను తోసిపుచ్చింది. జ్యూరీ పేర్కొన్న పరిహారం సహేతుకంగానే ఉందని సోమవారం రూలింగ్ వెలువరించింది.అధ్యక్షుడిగా తనకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపిందని, పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ట్రంప్ చేసిన వాదనను తిరస్కరించింది. 1996లో మన్హట్టన్ డిపార్టుమెంట్ స్టోర్లో జీన్ కరోల్పై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై కోర్టు ఆయనకు 5 మిలియన్ డాలర్ల(రూ.400 కోట్ల) జరిమానా విధించింది. గత డిసెంబర్లో అప్పీల్స్ కోర్టు ఈ తీర్పును సమర్థించింది కూడా.అయితే, సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పదేపదే జీన్ కరోల్ లక్ష్యంగా ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై ఆమె పరువు నష్టం కేసు వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం రూ.733 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. -
ట్రంప్ తీరుతో ఇబ్బందిపడ్డ మనవరాలు!
యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. న్యూయార్క్ క్వీన్స్ వేదిక వద్దకు ట్రంప్ రాక సందర్భంగా భద్రతా తనిఖీలతో అభిమానులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో.. అర్థర్ యాష్ స్టేడియం రోల్స్ బాక్స్ వద్దకు వచ్చి అభివాదం చేసిన ఆయనకు.. చీర్స్తో పాటు బూస్(నిరసనగా చేసే నినాదాలు) స్వాగతం పలికాయి. తమను ఇబ్బందిపెట్టినందుకు టెన్నిస్ అభిమానులు ఆయన్ని తిట్టిపోశారు. ఈ క్రమంలో.. మరో ఆసక్తికరమైన అంశమూ తెర మీదకు వచ్చింది.ట్రంప్ మనవరాలు అరబెల్లా కుష్నర్(18) ఆయన తీరుతో ఇబ్బందిపడినట్లుగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ట్రంప్ మొదటి భార్య ఇవానా కూతురు ఇవాంకా. ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్ కాగా.. వీళ్లిద్దరికి ముగ్గురు సంతానం. అందులో పెద్ద కూతురు అరబెల్లా. ట్రంప్ కుటుంబంతో తరచూ ఈమె మీడియా కంట కనిపిస్తుంటుంది. ఈ క్రమంలో యూఎస్ ఓపెన్ పురుషుల ఫైనల్ మ్యాచ్ కోసం ట్రంప్ అల్లుడిని, మనవరాలిని, వైట్హౌజ్ సిబ్బందినీ వెంటపెట్టుకుని వచ్చారు. ఆ సమయంలో అరబెల్లా ఆందోళనగా కనిపించగా.. ట్రంప్ ఆమెతో ఏదో అన్నారు. దీంతో ఆమె ముఖం చిన్నబోయింది. ఆపై ట్రంప్ పక్కన నిల్చునేందుకు కూడా ఆమె అయిష్టంగా కనిపించింది. అప్పటి నుంచి ఈవెంట్ అయ్యేదాకా ఆమె ముభావంగా ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. లిప్ రీడర్ నికోలా హిక్లింగ్ చెబుతోంది ఏంటంటే.. అరబెల్లా తన బ్యాగ్, ఫోన్ కోసం ఆందోళన వ్యక్తం చేసింది. Where is my bag?(నా బ్యాగ్ ఎక్కడ?) అని అడిగింది. దానికి ఆమె తండ్రి కుష్నర్ I don’t have it(నాకు తెలియదు) అని సమాధానమిచ్చారు. ఈలోపు.. తాత ట్రంప్ను తనకు దారి ఇవ్వమని కోరగా.. ఆయన నువ్వు అక్కడే ఉండు అని చెప్పారు. దీంతో ఆమె అయిష్టంగా అలా నిలబడి పోయారు. ఇదిలా ఉంటే.. యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ట్రంప్ అక్కడ ఉన్న సమయంలో జరిగిన పరిణామాలను టెలికాస్ట్ చేయొద్దని బ్రాడ్కాస్టర్లకు సూచించింది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ప్రెసిడెంట్ ట్రంప్నకు తగిలిన నిరసన సెగ, అంతకుమించి అరబెల్లా వైరల్ వీడియో బయటకు వచ్చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు ట్రంప్ కుటుంబ సంబంధాలపై చర్చ ప్రారంభించారు. ఆమె ముఖంలో ఆందోళన, అసౌకర్యం స్పష్టంగా కనిపించిందని.. పాపం అంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు. అరబెల్లాకు ట్రంప్ పక్కన నిలబడడానికి ఇష్టపడలేదని.. అందుకే తండ్రి చెంతకు చేరిందని కొందరు అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరలో ట్రంప్ కుటుంబం నుంచి ఆమె బయటకు రావడం ఖాయమంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. Arabella Kushner aged 13 in the green dress does not want to stand next to the pedophile. pic.twitter.com/seJ35nY1SB— KT "Special MI6 Operation" (@KremlinTrolls) September 7, 2025 -
భారత్పై జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేసే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమే అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్టు అయ్యింది.భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీపై అడిగిన ప్రశ్నకు జెలెన్స్కీ సమాధానం ఇస్తూ.. రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్లు విధించడం సరైన చర్యే. రష్యాను కట్టడి చేయాలంటే సుంకాలు అవసరం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీకి ఉక్రెయిన్కు ఆహ్వానించకపోవడం విచారకరమని కామెంట్స్ చేశారు. అయితే, మాస్కో-కీవ్ మధ్య సంధి కుదిర్చేందుకు భారత్ దౌత్య యత్నాలు చేస్తున్నా ఆయన నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.కాగా.. ఇటీవల కాలంలో ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించాలని భారత్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ అటు పుతిన్, ఇటు జెలెన్స్కీతో చర్చలు జరుపుతున్నారు. గత నెల రెండో వారంలో పుతిన్తో భేటీకి ముందు ఉక్రెయిన్ అధినేతతో మాట్లాడారు. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా, శాంతియుతంగా పరిష్కరించడంపై భారత్ స్థిరమైన వైఖరి గురించి తెలియజేశారు. యుద్ధం ముగింపు విషయంలో సాధ్యమైన సహకారాన్ని అందించేందుకు, ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఇలాంటి సమయంలో నుంచి భారత్పై ప్రతికూల ప్రకటన వెలువడటం గమనార్హం.ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్దం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలస్కాలో ట్రంప్-పుతిన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో సహకరించే వారిపై ఆంక్షలు అమలయ్యేలా చూసే బాధ్యత తమదే అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. -
మోదీజీ.. ట్రంప్ అవమానాలు మర్చిపోయారా?: శశిథరూర్
ఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త మాటల మర్మమేమిటో తెలుసుకోవాలన్నారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తతోనే స్వాగతించాలని.. ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలా ఉన్నాయని ప్రధాని మోదీకి సూచించారు. ఇదే సమయంలో రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు చేయాల్సిన తీవ్రమైన మరమ్మతులు మిగిలి ఉన్నాయని గుర్తు చేశారు.భారత్, అమెరికా సంబంధాలపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడగానే ప్రధాని మోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ట్రంప్ పాదరస స్వభావం కలిగిన వ్యక్తి. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. భారత్ అనుకూల వ్యాఖ్యలపై ప్రధాని మోదీ చాలా త్వరగా స్పందించారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నాను. భారతీయులు ఎదుర్కొన్న వాస్తవ పరిణామాలు చాలా ఉన్నాయి. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనే ప్రాథమిక సంబంధం గురించి విదేశాంగ మంత్రి కూడా నొక్కి చెప్పారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. అదే మనం ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం.రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు కలిసి పరిష్కరించుకోవాల్సిన తీవ్రమైన అంశాలు కొన్ని ఉన్నాయని నేను భావిస్తున్నాను. కాబట్టి అంత త్వరగా క్షమించలేరు. ఆ పరిణామాలను అధిగమించాల్సి ఉంది. భారతీయులు ఎదుర్కొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ వల్ల కలిగిన బాధ, అవమానాన్ని త్వరగా మర్చిపోలేం అని కీలక వ్యాఖ్యలు చేశారు.#WATCH | Thiruvananthapuram: On PM Modi's response to US President Donald Trump speaking positively on India-US relationship, Congress MP Shashi Tharoor says, "The Prime Minister was very quick to respond, and the Foreign Minister has also underscored the importance of the basic… pic.twitter.com/Iju3uZUkzl— ANI (@ANI) September 7, 2025ఇదిలా ఉండగా.. భారత్పైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఉన్నట్టుండి ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ‘భారత్తో అమెరికాకు ప్రత్యేక బంధం ఉంది. ముఖ్యంగా మోదీ ఓ అద్భుతమైన ప్రధాని. ఓ గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో నాకు గొప్ప స్నేహ బంధముంది. అదెప్పటికీ కొనసాగుతుంది’ అని చెప్పుకొచ్చారు. దీనిపై మోదీ వెంటనే స్పందిస్తూ.. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని ఎంతగానో అభినందిస్తున్నా. భారత-అమెరికా భాగస్వామ్యంపై ఆయన సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల ప్రత్యేక బంధాన్ని అభినందించిన తీరు ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. ట్రంప్ మీడియా భేటీ తర్వాత కొద్ది గంటలకే ఈ మేరకు ఎక్స్లో ప్రధాని పోస్టు పెట్టారు. -
ట్రంప్కు టెన్షన్.. అదే జరిగితే వసూలు చేసిందంతా కక్కాల్సిందే!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై పన్నులు విధిస్తూ ఎంజాయ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. సుంకాల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే.. ఇప్పటి వరకు వచ్చిన బిలియన్ డాలర్ల ఆదాయం రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తాజాగా మీట్ ది ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల విషయమై సుప్రీంకోర్టులో తీర్పు రావాల్సి ఉంది. కోర్టు తీర్పును ట్రంప్కు అనుకూలంగా వస్తే మంచిదే. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం.. మేము దాదాపు సగం సుంకాలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది అమెరికా ట్రెజరీకి భయంకరంగా మారుతుంది. తిరిగి చెల్లింపులను జారీ చేయడానికి పరిపాలన సిద్ధంగా ఉందా లేదా? అనేది తేలాలి. అదే జరిగితే పలు దేశాల నుంచి ముక్కు పిండి వసూలు చేసిందంతా అమెరికా కక్కాల్సి ఉంటుంది. అయితే, సుప్రీంకోర్టులో ట్రంప్ అనుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక, 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్కు భారీ సుంకాలను విధించే అధికారం లేదని రెండు ఫెడరల్ కోర్టులు తేల్చిన తర్వాత బెసెంట్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇదిలా ఉండగా.. ప్రపంచ దేశాలపై పన్నులు విధించేందుకు బ్రేకులు పడుతుండటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫెడరల్ చట్టం ప్రకారం అధ్యక్షుడికి దిగుమతులపై సుంకాలు విధించే హక్కు ఉందని పేర్కొంటూ ఈ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని కోరింది. ఎమర్జెన్సీ అధికార చట్టం ప్రకారం ట్రంప్ సుంకాలు విధించారని ఇటీవల అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆ సుంకాలు చట్టవిరుద్ధమని పేర్కొనడంతో ట్రంప్ యంత్రాంగం సుప్రీం తలుపుతట్టింది.నవంబర్ ప్రారంభంలోనే ఈ కేసుపై వాదనలు వినాలని సొలిసిటర్ జనరల్ డి.జాన్ సావర్ న్యాయమూర్తిని కోరారు. ‘అప్పీల్స్ కోర్టు నిర్ణయం అధ్యక్షుడు ఐదు నెలలుగా విదేశాలతో కొనసాగిస్తున్న చర్చలను అనిశ్చితిలోకి నెడుతుంది. ఇప్పటికే పూర్తయిన చర్చలను, జరగబోయే చర్చలను ప్రమాదంలో పడేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వాదనను లిబర్టీ జస్టిస్ సెంటర్ వ్యాజ్య డైరెక్టర్, సీనియర్ న్యాయవాది జెఫ్రీ ష్వాబ్ తోసిపుచ్చారు. ‘చట్టవిరుద్ధమైన సుంకాలు చిన్న వ్యాపారాలకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. వాటి మనుగడ ప్రమాదంలో పడుతోంది. ఈ కేసులో మా క్లయింట్లకు సత్వరం పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై వ్యాపార వర్గాలు ఇప్పటికే రెండు న్యాయస్థానాల్లో పైచేయి సాధించాయి. -
‘బందీ ఒప్పందం’పై హమాస్కు ట్రంప్ తుది హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హమాస్కు తుది హెచ్చరిక జారీ చేశారు. గాజా నుండి బందీలను విడుదల చేయడానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ట్రంప్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ను కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ ఏడున ‘ఇజ్రాయెల్ ప్రజలు నా నిబంధనలను అంగీకరించారు. హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ పోస్ట్లో రాశారు.‘ఒప్పందాన్ని అంగీకరించకపోతే వచ్చే పరిణామాల గురించి ఇప్పటికే హమాస్ను హెచ్చరించాను. ఇది నా తుది హెచ్చరిక, మరొకటి ఉండదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదేవిధంగా విలేకరులతో మాట్లాడిన ఆయన గాజా ఒప్పందానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ‘గాజాపై మనం త్వరలోనే ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. బందీల తిరిగి తెచ్చుకుంటామని ఆశిస్తున్నాను. గాజా యుద్ధం మేము పరిష్కరించాలనుకుంటున్న పెద్ద సమస్య’ అని ట్రంప్ అన్నారు. .@POTUS: "I think we're going to have a deal on Gaza very soon. It's a hell of a problem... I think we're going to get [all the hostages]." pic.twitter.com/KZmYAEFLQn— Rapid Response 47 (@RapidResponse47) September 7, 2025గాజాలో మిగిలిన బందీల గురించి ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం 23వ నెలలోకి అడుగుపెడుతున్నందున అక్కడ మిగిలిన బందీల సంఖ్య 20 కంటే తక్కువగా ఉండవచ్చన్నారు. వారిలో చాలామంది చనిపోయి ఉండవచ్చన్నారు. కాగా ఈ ఒప్పందం ప్రకారం హమాస్ దగ్గర మిగిలిన 48 మంది బందీలను ఇజ్రాయెల్ జైలులో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా కాల్పుల విరమణ మొదటి రోజునే విడుదల చేయాలి. కాల్పుల విరమణ సమయంలో యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపాలి. కాగా ట్రంప్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ పరిశీలిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ అన్నారు. హమాస్ బందీలను విడుదల చేసి, ఆయుధాలను వదిలివేస్తే గాజాలో యుద్ధం ముగించవచ్చన్నారు. -
షికాగోపై ట్రంప్... రణన్నినాదం!
వాషింగ్టన్/షికాగో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదం చివరికి సొంత దేశాన్ని కూడా వదలడం లేదు. అమెరికాలో మూడో అతి పెద్ద నగరమైన షికాగోపై ఆయన అక్షరాలా యుద్ధమే ప్రకటించారు! విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆధిపత్యమున్న షికాగో నుంచి వలసదార్లను వెళ్లగొట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అమెరికా రక్షణ శాఖ పేరునే ఏకంగా యుద్ధ శాఖగా మారుస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. 1979లో వియత్నాం యుద్ధం సమయంలో తెరకెక్కించిన ‘అపోకలిప్స్ నౌ’ చిత్రం పోస్టర్ను అనుకరిస్తూ ‘షిపోకలిప్స్ నౌ’ పేరిట ఓ చిత్రాన్ని సోషల్ మీడియాలో ట్రంప్ స్వయానా పోస్టు చేశారు. షికాగోపై ఎగురుతున్న హెలికాప్టర్లు, నీటిపై ప్రజ్వరిల్లుతున్న మంటలు అందులో కనిపిస్తున్నాయి. ఆ సినిమాలో యుద్ధోన్మాది అయిన లెఫ్టినెంట్ కల్నల్ కిల్గోర్ పాత్రలో ట్రంప్ దర్శనిమిస్తున్నారు. అందులోని ఫేమస్ డైలాగ్ను గుర్తుకు తెస్తూ ‘ఈ ఉదయం డిపోర్టేషన్ల వాసనను ఆస్వాదిస్తున్నా’ అంటూ పోస్టు చేశారు. ‘డిపార్టుమెంట్ ఆఫ్ వార్ అని ఎందుకు అంటున్నామో షికాగో తెలుసుకోనుంది’ అని పేర్కొన్నారు. బాల్టిమోర్, న్యూ ఆర్లీన్స్కు సైతం ఇలాంటి ట్రీట్మెంట్ తప్పదంటూ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. పోర్ట్ల్యాండ్, ఒరెగాన్పైనా గురిపెట్టారు. షికాగోకు నేషనల్ గార్డ్ దళాలు, ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను కూడా పంపించబోతున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ విపక్ష డెమొక్రటిక్ పార్టీకి బలమున్న ప్రాంతాలే కావడం గమనార్హం. లాస్ ఏంజెలెస్లో ఇ్పటికే నేషనల్ గార్డ్ దళాలను రంగంలోకి దించడం తెలిసిందే. ఇప్పుడు షికాగోలో వాటితో పాటు ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించబోతున్నారు.భయం గుప్పెట్లో షికాగో ట్రంప్ హెచ్చరికలతో షికాగోలోని విదేశీయులు, ప్రధానంగా లాటిన్ మూలాలున్న వాళ్లు ఆందోళన చెందుతున్నారు. కొందరు తమ పౌరసత్వాన్ని ధ్రువీకరించుకోవడానికి అమెరికా పాస్పోర్టులను నిత్యం దగ్గరే ఉంచుకుంటున్నారు. ట్రంప్ తీరును నిరసిస్తూ నగరవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో జనం కదం తొక్కుతున్నారు. ఉడుత ఊపులకు బెదరం: ప్రిట్జ్కెర్ ట్రంప్ తీరును ఇల్లినాయిస్ గవర్నర్ జె.బి.ప్రిట్జ్కెర్ తప్పుపట్టారు. ఆయన నియంతగా మారజూస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘సొంత దేశంలోని నగరంపై యుద్ధోన్మాదం ప్రదర్శిస్తున్నారు. ఇది జోక్ కాదు. సాధారణ విషయం అంతకన్నా కాదు. ట్రంప్ బలమైన నాయకుడు కాదు. పిరికి వ్యక్తి అలాంటి వాళ్ల బెదిరింపులకు ఎవరూ భయపడబోరు’’ అని తేల్చిచెప్పారు. -
శ్రుతి మించుతున్న ట్రంప్... వెనెజువెలాపై యుద్ధం!
వాషింగ్టన్: ఆసియా, యూరప్ అనంతరం అమెరికా ఖండాన్ని సైతం యుద్ధ మేఘాలు వేగంగా కమ్ముకుంటున్నాయి. తమకు చిరకాలంగా కొరకరాని కొయ్యగా మారిన పొరుగు దేశం వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. వెనెజులాలో డ్రగ్స్ కార్టెళ్ల విధ్వంసం ముసుగులో అక్కడి అపార చమురు నిక్షేపాలను చేజిక్కించుకునే దిశగా డొనాల్డ్ ట్రంప్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. అమెరికా సైన్యం ఇప్పటికే వందల సంఖ్యలో భీకర, భారీ క్షిపణులను వెనెజువెలాపైకి ఎక్కుపెట్టింది. ట్రంప్ ఊ అన్న మరుక్షణమే విరుచుకుపడేందుకు అమెరికా యుద్ధనౌకలు, అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఈ బాహుబలి దాడిని కాచుకునేందుకు నిరుపేద వెనెజువెలా కాలూ చేయీ కూడదీసుకుంటోంది. యుద్ధాలను ఆపేస్తానంటూ ఆదర్శాలు వల్లించి రెండోసారి గద్దెనెక్కిన ట్రంప్ ఈ ఎనిమిది నెలల్లో ఏ యుద్ధాన్నీ ఆపలేకపోగా ఇలా పొరుగు ఖండంలోనే స్వయంగా రణన్నినాదాలకు దిగుతుండడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.8 యుద్ధ నౌకలు, 10 యుద్ధ విమానాలు మాదకద్రవ్యాలను తమ దేశంలోకి అక్రమంగా సరఫరా చేస్తున్న వెనెజువెలా డ్రగ్స్ ముఠాల ధ్వంసానికి సైనిక చర్యకూ వెనుకాడబోమని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అన్నట్టుగానే వెనెజువెలాను సముద్ర మార్గాన చుట్టుముట్టాల్సిందిగా నేవీని ఆదేశించారు. దాంతో అత్యాధునిక యుద్ధ నౌకలు యూఎస్ఎస్ గ్రేవ్లీ, యూఎస్ఎస్ జాసన్ డన్హమ్ ఆగమేఘాలపై దక్షిణ కరేబియన్ సముద్రంలోకి ప్రవేశించి వెనెజువెలాపైకి గైడెడ్ మిసైల్స్ ఎక్కుపెట్టాయి. అప్పటికే అక్కడున్న డి్రస్టాయర్ నౌక యూఎస్ఎస్ సామ్సన్ వాటికి తోడైంది. ఇవి చాలవన్నట్టు పసిఫిక్ మహా సముద్రం నుంచి యూఎస్ఎస్ లేక్ ఏరీ నౌకను రప్పిస్తున్నారు. యూఎస్ఎస్ ఇవో జిమా, యూఎస్ఎస్ సాన్ ఆంటోనియో, యూఎస్ఎస్ ఫోర్ట్ లాడెర్డేల్ వంటి యుద్ధ నౌకలూ యుద్ధ ప్రాతిపదికన వచ్చి చేరుతున్నాయి. ఇలా 8 అత్యాధునిక యుద్ధ నౌకలు వెనెజువెలా తీరం వెంబడి అంతర్జాతీయ జలాలను అష్టదిగ్బంధనం చేశాయి. 4,000 మంది సెయిలర్లు, మెరైన్ కమెండోలు సిద్ధంగా ఉన్నారు. వెనెజువెలా డ్రగ్స్ ముఠాలపై ఆకాశ మార్గంలో కూడా విరుచుకుపడేందుకు 10 అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలను కూడా అమెరికా శనివారమే ప్యూర్టోరికోకు తరలించి ఉంచింది!వెనెజువెలా ‘తగ్గేదే లే’! సైనికపరంగా అమెరికాతో వెనెజువెలా ఏమాత్రం తూగలేదు. అమెరికా, యూరప్ కఠిన ఆంక్షల దెబ్బకు నికొలాస్ మదురో సారథ్యంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అత్యాధునిక ఆయుధ, సైనిక సంపత్తిని సమకూర్చుకోలేకపోయింది. ఉన్నవల్లా కాలం చెల్లిన పాతకాలపు ఎఫ్–16 యుద్ధ విమానాలే! సైన్యం కూడా 1.5 లక్షల కన్నా లేదు. అన్ని విభాగాలూ కలిపినా 3.5 లక్షల లోపే! అయినా సరే, అమెరికా వంటి తిరుగులేని సైనిక శక్తిని యథాశక్తి ప్రతిఘటించి తీరతామని మదురో ఇటీవలే ప్రకటించారు. అతి త్వరగా ఏకంగా 50 లక్షల సైన్యాన్ని సిద్ధం చేస్తానని చెప్పారు! చమురు నిక్షేపాలపై కన్ను పేద దేశమైనా ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలకు వెనెజువెలా కేంద్రం. దేశంలో దాదాపు 48 వేల మిలియన్ టన్నుల చమురు నిల్వలున్నట్లు గుర్తించారు. అమెరికా కఠిన ఆంక్షల వల్ల వాటిని వెలికితీయటం సాధ్యపడటం లేదు. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడే ఆ చమురు నిల్వలపై కన్నేశారు. వెనెజువెలా చమురంతా అమెరికాకే దక్కాలని అప్పట్లోనే బహిరంగ ప్రకటనలు చేశారు. అందుకోసం అవసరమైతే అక్కడి చమురు క్షేత్రాలను ఆక్రమించుకుంటామన్నారు! మరోవైపు కమ్యూనిస్టు నాయకుడైన అధ్యక్షుడు మదురో అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. ట్రంప్ మద్దతుదారులైన ప్రతిపక్ష నేతలను తీవ్రంగా అణచివేశారు. దాంతో మదురోను పట్టించినవారికి రూ.450 కోట్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. వెనెజువెలాలో చైనా భారీ పెట్టుబడులు పెట్టడంతోపాటు 90 శాతం చమురు కొనుగోలు చేస్తోంది. ఇది అమెరికాకు కంటగింపుగా ఉంది. -
‘మోదీజీ దేశం మొత్తం మీ వెనకే ఉంది.. మీ దమ్మేంటో ట్రంప్కు చూపించండి’
న్యూఢిల్లీ: ‘మోదీజీ..ట్రంప్కు మీ దమ్మేంటో చూపించండి. యావత్దేశం మొత్తం మీ వెంట ఉంది’అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్కు మీ దమ్మేంటో చూపించండి. దేశం మొత్తం మీ వెనుక ఉంది. అమెరికా మన ఎగుమతులపై 50 శాతం సుంకం విధిస్తోంది. మీరు అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి. ట్రంప్ తలవంచుతాడో లేదో చూడండి’అని అన్నారు.ఈ సందర్భంగా..కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమెరికా పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం మినహాయింపు ఇచ్చిన నిర్ణయాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. అమెరికా పత్తి దిగుమతి వల్ల మన రైతులకు మార్కెట్లో రూ.900 కన్నా తక్కువ ధర వస్తుంది. అమెరికా రైతులు ధనవంతులు అవుతారు, గుజరాత్ రైతులు బీదవుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పత్తి పంట చేతికొచ్చే సమయం అక్టోబర్-నవంబర్లో ఉండటంతో మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు అప్పుల బారిన పడతారని, చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి అప్పులు తీసుకున్నారు. ఇప్పుడు వారు అప్పు ఎలా తీర్చాలి?’అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వానికి దాసోహమైందని ఆరోపించిన కేజ్రీవాల్ .. ట్రంప్కు మోదీ తలవంచారు. ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. మోదీ 100 శాతం సుంకం విధించాలని సూచించారు. -
‘నోబెల్ బహుమతి కావాలంట’.. ట్రంప్పై విరుచుకుపడ్డ సల్మాన్ ఖాన్!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బిగ్బాస్ 19వ (Bigg Boss 19) సీజన్ తొలి వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్గా వ్యవహరిస్తున్న సల్మాన్.. హౌస్లో ఉన్న కంటెస్ట్ల తీరును ప్రశ్నించారు. కొంతమంది కంటెస్టులు వివాదాలకు ఆజ్యం పోస్తుంటారు.పైకి మాత్రం శాంతిదూతలుగా నటిస్తుంటారని అని మండిపడ్డారు. కానీ అసలు విషయం ఏంటంటే? ఈ ప్రపంచంలో ఎక్కువగా సమస్యలు సృష్టిస్తున్న వారే తమకు నోబెల్ శాంతి బహుమతి కావాలని కోరుకుంటుంటారు’అని ఎద్దేవా చేశారు.ఇంతకీ ఏం జరిగిందంటే?సల్మాన్ ఖాన్ కంటెస్టెంట్ ఫర్హానా భట్ గురించి మాట్లాడారు.‘తనను తాను శాంతి దూతగా చెప్పుకునే ఫర్హానా.. అందుకు అనుగుణంగా లేదు. ఆమె తరచుగా కంటెస్టెంట్ల మధ్య తగాదాలను ప్రేరేపించడం,అనవసరమైన సమస్యలను సృష్టిస్తుంది. అంటూ (‘యే హో క్యా రహా హై? పూరీ దునియా మే జో సబ్సే జ్యాదా ట్రబుల్ ఫైలా రహే హైం, ఉంకో హై శాంతి బహుమతి చాహియే’). శాంతి దూతలని చెప్పుకునే తిరేవారు గొడవలు పరిష్కరించి,ప్రజలను కలిపే వ్యక్తి కావాలి. కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా?. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సమస్యలు సృష్టించే వాళ్లే శాంతి బహుమతులు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ పేరును సల్మాన్ ప్రస్తావించనప్పటికీ.. అమెరికా అధ్యక్షుడిపైనే ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Megastar #SalmanKhan trolling Donald Trump 😂😭 #BiggBoss19"Is Dunia me jo sabse jyada trouble faila rahe h, unhe hi peace prize chahiye" pic.twitter.com/Z4SfUNm1Lb— MASS (@Freak4Salman) September 7, 2025 నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ ఆశలపై భారత్ నీళ్లు చల్లింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ల మధ్య ఘర్షణను ఆపేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించారు. అందుకు భారత్ ఒప్పుకోలేదు. ఫలితంగా తనకు దక్కాల్సిన నోబెల్ ఫ్రైజ్ భారత్ వల్లే దూరమైందనే అక్కుసతో భారత్పై టారిఫ్లు మోపుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నా అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో భారత్పై ట్రంప్ చేస్తున్న కుట్ర వెలుగులోకి వచ్చింది. ట్రంప్ తన వ్యక్తిగత స్వార్ధం కోసమే భారత్పై టారిఫ్లు విధిస్తున్నారని,ఇందులో దేశ ప్రయోజనాలే లేవని హైలెట్ చేసింది. -
సుంకాల వివాదం.. రంగంలోకి భారత్ తరపున జాసన్ మిల్లర్
వాషింగ్టన్: భారత్- అమెరికా మధ్య సుంకాల వివాదం నడుస్తున్న తరుణంలో భారత అనుసంధానకర్త జాసన్ మిల్లర్ వాషింగ్టన్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు పలువురు అధికారులను కలుసుకున్నారు. ట్రంప్ యంత్రాంగంతో దౌత్యపరమైన సంబంధాలను నెరవేర్చేందుకు భారత్ కొన్ని నెలల క్రితం జాసన్ మిల్లర్ను అనధికారిక అనుసంధానకర్తగా నియమించుకుంది.అధ్యక్షుడు ట్రంప్ను కలుసుకున్న మిల్లర్ ‘ఎక్స్’లో ఒక ఫోటోను షేర్ చేస్తూ, వాషింగ్టన్లో అధ్యక్షుడు ట్రంప్ను కలుసుకునే అవకాశం లభించింది. పలువురు అధికారులను కూడా కలుసుకున్నాను. గొప్ప పనికి ఇది నాంది కానుంది’ అని రాశారు. ఈ సమావేశానికి సంబంధించిన అధికారిక ఎజెండాను మిల్లర్ వెల్లడించనప్పటికీ, అమెరికా-భారత ద్వైపాక్షిక ఆర్థిక వ్యూహాలు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. అలాగే ట్రంప్, మిల్లర్ల భేటీ కీలకంగా మారింది. ట్రంప్కు సన్నిహితుడైన మిల్లర్ భారత్కు దౌత్యపరమైన అనుసంధాన కర్తగా వ్యవహరిస్తున్నారు. Fantastic week in Washington with so many friends being in town, topped off of course by having the opportunity to stop in and see our President in-action!Keep up the great work, @POTUS @realDonaldTrump! pic.twitter.com/G28hsKTUgd— Jason Miller (@JasonMiller) September 6, 2025రాజకీయ వ్యూహకర్త, జాసన్ మిల్లర్ 2016, 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో డోనాల్డ్ ట్రంప్కు సీనియర్ సలహాదారుగా పనిచేశారు. కాగా పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఈ పరిణామాల గురించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) మిల్లర్కు పరిస్థితి గురించి నిశితంగా వివరించింది. మిల్లర్ ఈ పరిణామాలను అమెరికా అధికారులకు తెలియజేశారు. ఈ నేపధ్యంలో అమెరికా కాంగ్రెస్లోని 100 మందికి పైగా సభ్యులు భారతదేశానికి మద్దతు ప్రకటించారు. -
భారత్కు ‘ఎలాన్ మస్క్’ మద్దతు.. నవారో అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్
వాష్టింగన్: ఇటీవలి కాలంలో భారత్ను టార్గెట్ చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు, యూఎస్కు చెందిన పలువురు నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు విషయంలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాట్లాడుతున్న వారి లిస్టులో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మొదటి స్థానంలో ఉన్నారు. భారత్పై నవాలో పదే పదే నోరుపారేసుకుంటున్నారు. అయితే.. తాజాగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. నవారో ఆరోపణలు అబద్ధమని ‘ఎక్స్’ తన ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పికొట్టింది. దీంతో, నవారోకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. కొద్దిరోజుల క్రితమ నవారో ట్విట్టర్(ఎక్స్) వేదికగా..‘భారత్ అత్యధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి. లాభం కోసమే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్తో మాస్కో చేస్తున్న యుద్ధాన్ని పోషిస్తోంది. యుద్ధంలో ఇరుదేశాల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అని పోస్టు పెట్టారు. అంతటితో ఆగకుండా.. ‘రష్యాకు భారత్ లాండ్రోమ్యాట్లా పనిచేస్తోంది. మీకు తెలుసా.. ఓ వర్గం లబ్ధి పొందేందుకు భారత ప్రజలను పణంగా పెడుతోంది. మనం దానిని అడ్డుకోవాలి. అది ఉక్రెయిన్ వాసులను చంపుతోంది. మనం (అమెరికన్లు) చెల్లింపుదారులుగా ఏం చేయాలో అది చేయాలి’ అంటూ ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.Trump aide Peter Navarro lashes out at India over Russian oil, accuses it of “profiteering” & fueling Moscow’s war machine. Musk’s X fact-checks him, calling out US double standards. Navarro fumes: “Elon is letting propaganda in.” https://t.co/0Bq0SIgPGm via @indiatoday pic.twitter.com/r4jCnATbBm— Ashok Upadhyay (@ashoupadhyay) September 7, 2025ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఆ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది ఇంధన భద్రత కోసమేనని పేర్కొంది. ఆ దేశం ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడంలేదని స్పష్టం చేసింది. అమెరికా కూడా రష్యా నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్నీ ప్రస్తావించింది. నవారో వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని తేల్చింది. అనంతరం, ఈ ఫ్యాక్ట్ చెక్పై నవారో భగ్గుమన్నారు. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ ఒక చెత్తగా అభివర్ణించారు. భారత్ లాభపేక్ష కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ తన ఆరోపణలను సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని మాస్కో ఆక్రమించక ముందు.. ఈ కొనుగోళ్లు జరగలేదన్నారు.ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రజలను చంపడం, అమెరికన్ల ఉద్యోగాలు తీసుకోవడం ఆపాలంటూ పిచ్చి ప్రేలాపణలు చేశారు. దీనిపై కూడా ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ సొంత నిర్ణయమని, అది ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్పై ఒత్తిడి తెస్తూనే.. అమెరికా రష్యా నుంచి యురేనియం వంటి వాటిని దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. యూఎస్ ద్వంద్వ ప్రమాణాలకు ఇది అద్దంపడుతోందని మండిపడింది. ఇక, భారత ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. -
మోదీ నేను భాయీ భాయీ..! ప్లేట్ మార్చిన ట్రంప్
-
భారత్ దెబ్బకు భయంతో వణికిపోతున్న బ్లాక్ మెయిల్ ట్రంప్!
-
త్వరలో దక్షిణ కొరియాకు ట్రంప్.. జిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్లో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణ కొరియాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశంలో చర్చలు జరిపే అవకాశాలున్నాయిని, ట్రంప్ పరిపాలనా యంత్రాంగం తెలిపింది. 🚨#BREAKING | US President Donald Trump is planning a visit to South Korea for the APEC summit in October, with a potential high-stakes meeting with China's Xi Jinping being discussed.Details Here: https://t.co/6mmh7wwhNa#DonaldTrump #SouthKorea #XiJinping #China— The Headliner (@TheHeadliner_in) September 7, 2025అక్టోబర్ చివరి నుండి నవంబర్ ప్రారంభం వరకూ జియోంగ్జు నగరంలో జరగనున్న ఈ శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ తో పాటు ఆయన అగ్ర సలహాదారులు కూడా హాజరుకానున్నారు. గత నెలలో ఈ ఇద్దరు అధినేతల మధ్య ఫోనులో సంభాషణ జరిగింది. ఈ నేపధ్యంలో ట్రంప్, అతని భార్య మెలానియాలను జిన్పింగ్ చైనా సందర్శనకు ఆహ్వానించారు. అయితే ఈ పర్యటన అక్టోబర్లో జరగనున్నప్పటికీ తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అలాగే ఈ విదేశీ పర్యటనను ముగించే ముందు ఇతర దేశాలు వెళతారా లేదా అనేది కూడా ఇంకా వెల్లడికాలేదు.ట్రంప్ తన విదేశీ పర్యటన సందర్భంగా అమెరికాకు మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని యోచిస్తున్నారు. ట్రంప్ ఇటీవల సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సహా పలు దేశాలలో పర్యటించినప్పుడు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు.మరోవైపు జిన్పింగ్ ఇటీవల కిమ్, వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆతిథ్యం ఇచ్చారు. దీనిని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. -
‘ట్రంప్కు అభినందనలు’.. దోస్తీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ రియాక్షన్
న్యూఢిల్లీ: అమెరికా- భారత్ల సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాను, ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ భావాలను తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని, ఆయనకు పూర్తిగా మద్దతు ఇస్తున్నానని అన్నారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ ‘మా బంధం గురించి అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తపరిచిన భావాలను, ఆయన సానుకూల అభిప్రాయాలను నేను అభినందిస్తున్నాను. భారత్- అమెరికాలు సానుకూల, దార్శనిక, సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి’ అని అన్నారు. సుంకాల విషయంలో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు ఈ విధంగా స్పందించడం ఆసక్తకరంగా మారింది. Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF— Narendra Modi (@narendramodi) September 6, 2025దీనికిముందు ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవని అనడమే కాకుండా, తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామన్నారు. అయితే భారత్ రష్యన్ చమురు దిగుమతులను ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ ప్రస్తుతం చేస్తున్న దానిపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశంతో వాణిజ్య చర్చలు చక్కగా జరుగుతున్నాయని కూడా అమెరికా అధ్యక్షుడు అన్నారు. కాగా భారత్ ఎగుమతులపై అమెరికా సుంకాలు ఇప్పుడు 50 శాతానికి మించి ఉన్నాయి. భారతదేశం ఈ చర్యను ఖండించింది. దీనిని అన్యాయం, అసమంజసమైనదని పేర్కొంది. -
దోస్త్ మేరా దోస్త్!
న్యూయార్క్/వాషింగ్టన్: నాలుకకు నరం లేదని, తన చిత్తం క్షణక్షణానికీ మారుతూ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు మరోసారి నిరూపించారు. రష్యా, చైనాతో పాటు భారత్పైనా ఒంటికాలిపై లేచి ఒక్కరోజైనా గడవకుండానే షరామామూలుగా ప్లేటు ఫిరాయించారు. భారత్పైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఉన్నట్టుండి ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘భారత్తో అమెరికాకు ‘ప్రత్యేక బంధ’ముంది. ముఖ్యంగా మోదీ ఓ అద్భుతమైన ప్రధాని. ఓ గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో నాకు గొప్ప స్నేహ బంధముంది. అదెప్పటికీ కొనసాగుతుంది కూడా’’ అని శుక్రవారం (అమెరికా కాలమానం ప్ర కారం) వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో మీడియా భేటీ సందర్భంగా మీడియా ప్రశ్నలకు బదులుగా చెప్పుకొచ్చారు. మోదీ కూడా అందుకు అత్యంత హుందాగా స్పందించారు. ‘‘అమెరికా అధ్యక్షుని తాలూకు ఈ మారిన వైఖరిని ఎంతగానో అభినందిస్తున్నా. భారత–అమెరికా భాగస్వామ్యంపై ఆయన సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల ప్రత్యేక బంధాన్ని అభినందించిన తీరు ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు. ట్రంప్ మీడియా భేటీ తర్వాత కొద్ది గంటలకే ఈ మేరకు ఎక్స్లో ప్రధాని పోస్టు పెట్టారు. భారత్, అమెరికాలది అత్యంత సానుకూల, ప్రగతి శీల, సమగ్ర వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వా మ్యం అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జూన్ 17 నాటి ఫోన్ సంభాషణల అనంతరం ట్రంప్, మోదీ పరస్పరం స్పందించడం ఇదే తొలిసారి. ప్రతీకార సుంకాల కారణంగా దిగజారిన ద్వైపాక్షిక బంధాల పునరుద్ధరణకు అమెరికా, భారత్ సంసిద్ధతకు ఇది నిదర్శనమని పరిశీలకులు భావిస్తున్నారు. నిమిషానికో మాట... భారత్, రష్యాలను దుష్ట చైనాకు కోల్పోయామంటూ సొంత సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ట్రూత్సోషల్’లో ట్రంప్ ఘాటుగా పోస్టు పెట్టడం తెలిసిందే. ఆ మూడింటి దోస్తీ సుదీర్ఘంగా వర్ధిల్లాలంటూ వ్యంగ్యోక్తులు కూడా విసిరారు. ‘యుద్ధమా, శాంతా అమెరికాయే తేల్చుకోవా’లన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హెచ్చరికలకు స్పందనగా ట్రంప్ పెట్టిన ఆ పోస్టు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆయన ఒంటెత్తు పోకడల కారణంగా అమెరికాతో భారత సంబంధాలు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా దిగజారిపోవడం తెలిసిందే. వాటిని పూర్తిస్థాయిలో చక్కదిద్దేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ ట్రంప్ను విలేకరులు ప్రశ్నించారు. అందుకాయన రకరకాలుగా స్పందించారు. ‘‘ఇరుదేశాల సంబంధాల విషయంలో ఆందోళన పడాల్సిందేమీ లేదు. ఏదో, అప్పుడప్పుడూ అలా జరుగుతూ ఉంటుంది’ అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. ‘‘మోదీతో నేను చాలా చనువుగా ఉంటా తెలుసా! ఆయన చాలా గొప్ప వ్యక్తి. రెండు నెలల క్రితమే అమెరికాలో పర్యటించారు కదా!’’ అంటూ ప్రధానిపై మరోసారి పొగడ్తలు కురిపించారు. ‘‘ఆ సందర్భంగా మేమిద్దరం కలిసి రోజ్ గార్డెన్లో వ్యాహ్యాళికి వెళ్లాం. అక్కడి గడ్డి చెప్పలేనంత తడిగా ఉంది. మీడియా కాన్ఫరెన్స్కు అస్సలు సరైన ప్రదేశం కాదది. అలాంటి చోట ప్రెస్మీట్ పెట్టడం నాకదే చివరిసారి’’ అని చెప్పుకున్నారు. అంతలోకే, ‘మోదీ ప్రస్తుతం చేస్తున్న పనే నాకస్సలు నచ్చడం లేదు’ అంటూ రష్యా, చైనాలతో భారత మైత్రిపై తన ఆగ్రహాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ‘అయినా సరే, భారత్తో అమెరికాకు అత్యంత ప్రత్యేక బంధముంది’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘అంతలోకే, రష్యా నుంచి భారత్ అంతంత భారీగా చమురు కొనేస్తుండటం నాకస్సలు నచ్చడం లేదు. ఇది నన్నెంతో నిరాశకు గురి చేస్తోంది’’ అంటూ మళ్లీ అక్కసు వెళ్లగక్కారు. ‘‘ఈ విషయం వాళ్లు తెలుసుకోవాలి. అందుకేగా భారత్పై అతి భారీగా 50 శాతం సుంకాలు విధించా!’’ అని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే మోదీపై మళ్లీ ప్రశంసలు కురిపించారు. భారత్ను చైనాకు కోల్పోయామంటూ మీరు చేసిన పోస్టు నిజమేనా అని మీడియా ప్రశ్నించగా, అలా జరిగిందని తాను అనుకోవడం లేదని ట్రంప్ చెప్పడం విశేషం!వాణిజ్య చర్చలు సూపర్ భారత్తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని మీడియా ప్రశ్నకు బదులుగా ట్రంప్ చెప్పారు. ‘‘అన్ని దేశాలతోనూ చర్చలు బాగా జరుగుతున్నాయి. కాకపోతే గూగుల్ తదితర అతి పెద్ద అమెరికా టెక్ దిగ్గజాల పట్ల యూరోపియన్ యూనియన్ వైఖరి విషయంలోనే బాగా నిరాశకు లోనయ్యాం’’ అని బదులిచ్చారు.మళ్లీ నవరో నోటిదురుసు! భారత్ పట్ల విద్వేషానికి పెట్టింది పేరుగా మారిన ట్రంప్ సలహా బృందం సీనియర్ సభ్యుడు పీటర్ నవరో మరోసారి నోరు పారేసుకున్నారు. రష్యా నుంచి భారత్ కొంటున్న చమురు ద్వారా సమకూరుతున్న ఆర్థిక వనరులే ఉక్రెయిన్పై యుద్ధానికి ఆదరువుగా మారాయంటూ మరోసారి ప్రేలాపనలకు దిగారు. -
డోనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు) రాయని డైరీ
అందంలోనే వికారం కలిసి ఉంటుంది! ఇది సృష్టి వైరుద్ధ్యమా, లేక మానవ మనో వైకల్యమా అని రెండు రోజులుగా వైట్ హౌస్ నుండి బయటికి రాకుండా టీవీ ముందే కూర్చొని ఆలోచిస్తున్నాను.విజ్ఞులు వికారాన్ని చూడొద్దని అంటారు. అందాన్ని వేరు చేసి చూడమంటారు! అందం, వికారం పక్కపక్కనే ఉంటే వేరు చెయ్యొచ్చు. పైనొకటి, కిందొకటి ఉంటే వేరు చెయ్యొచ్చు. ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటే ఎలా వేరు చేయటం?నేను టీవీ చూస్తుంటానని తెలిసి,జిన్పింగ్ నాకోసం బీజింగ్లోని తియానన్మెన్లో చేయించిన మిలిటరీ పరేడ్; తియాంజిన్లో పుతిన్, మోదీలతో కలిసి జిన్పింగ్ కలిసి చేసిన చిరునవ్వుల ప్రదర్శన (అది కూడా నేను టీవీ చూస్తుంటానని తెలిసే) రెండూ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి. మిలిటరీ పరేడా, లేక చిరునవ్వుల ప్రదర్శనా... ఏది ఆ రెండింటిలో బ్యూటిఫుల్గా ఉందంటే మాత్రం, చిరునవ్వుల ప్రదర్శనే అంటాన్నేను. చిరునవ్వుల్లో కేవలం చిరునవ్వులే ఉండవు. చేతులు కలుపుకోవడం ఉంటుంది. భుజాలు తాకించుకోవటం ఉంటుంది. హత్తుకోవటం ఉంటుంది. ఆలింగనం చేసుకోవటం ఉంటుంది. అదోలా చూసు కోవటం ఉంటుంది. ఏదైనా ఇచ్చిపుచ్చు కోవటం ఉంటుంది. కలిసి నాలుగు అడుగులు వేయటం ఉంటుంది. పరవశం కలిగించే చిన్న మాట ఉంటుంది. పెద్దపెట్టున నవ్వేయటం ఉంటుంది. లోకం దృష్టిలో పడాలన్న తహతహ ఉంటుంది. ఆ లోకంలో మళ్లీ పర్టిక్యులర్గా ఫలానా వ్యక్తి కంట పడుతున్నామా లేదా అనే దొంగచూపు ఉంటుంది. ఇన్ని ఉంటాయి చిరునవ్వుల్లో! గర్జించే శతఘ్నులను మించిన మారణాయుధాలు ఈ చిరునవ్వులు. వావ్!! చిరునవ్వుల మారణాయుధాలు! వండర్ ఫుల్ థాట్. నోబెల్ను పెద్ద పెద్ద పనులకే ఇవ్వక్కర్లేదు. నాకొచ్చే ఇలాంటి చిన్న చిన్న థాట్స్కు కూడా ఇవ్వొచ్చు.జిన్పింగ్ నన్ను టీవీలోంచి దొంగ చూపులు చూడటం నేను గమనించాను. తనేంటో నాకు చూపించుకోవటం అది. నా దగ్గర పుతిన్ ఉన్నారు, మోదీ ఉన్నారు, కిమ్ జోంగ్ ఉన్ ఉన్నారు అని చెప్పుకోవటం! ఏం మనిషి అతను?! చైనాకు జపాన్ లొంగిపోయి 80 ఏళ్లయిందని బీజింగ్లో పరేడ్ చేయించి ఆ పరేడ్కు అమెరికాను పిలవలేదు! పరేడ్ అందంగా ఉంది. జిన్పింగ్ మైండే... వికారంగా ఉంది.అమెరికా బెదిరిస్తేనే కదా జపాన్ వెళ్లి చైనాకు లొంగిపోయింది! ఫారిన్ గవర్నమెంట్స్కి థ్యాంక్స్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్కి థ్యాంక్స్ అంటారే గానీ, అమెరికాకు థ్యాంక్స్ చెప్పటానికి ఏమైంది జిన్పింగ్కి! చరిత్రను మరిచిపోయారా లేక, చేసిన మేలునే మరిచిపోయారా? చూస్తుంటే రష్యా, ఇండియాలు కూడా అమెరికాను మర్చిపోయేలా చేసేలా ఉన్నారు జిన్పింగ్! ఇలాంటప్పుడే నాకు మరింతగా ఎవరికైనా, ఏదైనా చేయాలనిపిస్తుంది. కాల్ బటన్ నొక్కి, ‘‘పీటర్ కెంట్... మనం ఇండియా మీద ఎంత వేశాం, రష్యా మీద ఎంత వేశాం, చైనా మీద ఎంత వేశాం?’’ అని అడిగాను. నా ట్రేడ్ అడ్వైజర్ ఆయన. ‘‘ఎస్, మిస్టర్ ప్రెసిడెంట్. ఇండియా మీద 50, చైనా మీద 30, రష్యా మీద 10’’ అని గుర్తు చేశారు పీటర్ కెంట్.‘‘వెల్, మిస్టర్ కెంట్. ఇండియా మీద ఇంకో 25 వేస్తే ఎలా ఉంటుంది? మొత్తం కలిపి 75’’ అన్నాను. ‘‘గుడ్ ఐడియా మిస్టర్ ప్రెసిడెంట్. మైండ్–బ్లోయింగ్’’ అన్నారు పీటర్ కెంట్. ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆత్మీయులే కదా ముందుగా మనకు గుర్తుకొస్తారు. మోదీతో నేను బాగా కలిసిపోతాను. ఫిబ్రవరిలో ఆయన ఇక్కడే ఉన్నారు! మళ్లీ సెప్టెంబర్ 23న యూఎన్ఓ సమావేశానికి ఇక్కడే ఉంటారు. -
డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!
'డొనాల్డ్ ట్రంప్' శుక్రవారం.. సుంకాల నుంచి గ్రాఫైట్, టంగ్స్టన్, యురేనియం, బంగారు కడ్డీలు, ఇతర లోహాలను మినహాయించాలని, సిలికాన్ ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త మార్పు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా అధికారుల సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడి ఉత్తర్వులో పేర్కొన్నారు.ఈ ప్రకటన తరువాత విమాన భాగాలు, జెనరిక్ ఔషధాలు, దేశీయంగా పండించలేని, తవ్వలేని లేదా సహజంగా ఉత్పత్తి చేయలేని కొన్ని ఉత్పత్తులు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలు, కాఫీ వంటి వాటికి కూడా భవిష్యత్తులో సుంకాల నుంచి విముక్తి కలిగించే అవకాశం ఉంటుందని సమాచారం.కొన్ని రోజుల క్రితం యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ తీర్పు వ్యాపారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బులియన్ దిగుమతి పన్నులకు లోబడి ఉంటుందని సూచించడం కొంత గందరగోళానికి గురిచేసింది. ఆ తరువాత బంగారు కడ్డీలను సుంకాల నుంచి మినహాయించాలనే ఆలోచన తెరమీదకు వచ్చింది.ఇదీ చదవండి: టిమ్.. యాపిల్ పెట్టుబడి ఎంత?: సీఈఓల మధ్య ట్రంప్ ప్రశ్నసుంకాలు మాత్రమే కాకుండా.. కొన్ని ఒప్పందాల విషయంలో కూడా ట్రంప్ సంచనలం సృష్టించారు. ఇవి దేశంలోని కీలకమైన మార్కెట్లకు అంతరాయం కలిగించవచ్చని, అమెరికాలో పండించలేని లేదా ఉత్పత్తి చేయలేని వస్తువుల ధరలను పెంచుతాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ట్రంప్.. అంతరిక్షం, కొన్ని ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో ఉపయోగించే కీలకమైన పదార్థాలతో సహా అనేక ఖనిజాలపై పరస్పర సుంకాలను ఎత్తివేయడం మొదలుపెట్టారు.సూడోఎఫెడ్రిన్, యాంటీబయాటిక్స్, ఇతర ఔషధాల వంటి ఫార్మాస్యూటికల్స్ వంటివన్నీ.. ఇప్పటికే వాణిజ్య శాఖ దర్యాప్తుకు లోబడి ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా సుంకాల నుంచి ఉపసమయం పొందుతున్నాయి. అయితే.. సిలికాన్ ఉత్పత్తులతో పాటు, రెసిన్, అల్యూమినియం హైడ్రాక్సైడ్లపై సుంకాలను విధిస్తున్నారు. -
ట్రంప్ వ్యాఖ్యలను అభినందించిన మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ న్యూస్ఏజెన్సీ ప్రచురించిన కథనంపై మోదీ తన ఎక్స్ ఖాతా నుంచి స్పందించడం గమనార్హం. తనను గొప్ప ప్రధాని అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. అంతకు ముందు.. భారత్, రష్యాలు అమెరికాకు దూరం అవుతున్నట్లు అనిపిస్తోందంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే కొన్నిగంటలకే ఆయన ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ అలాంటిదేం లేదంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. భారత్తో తిరిగి సంబంధాలు మెరుగుపడతాయా? అని రిపోర్టర్ల నుంచి ఎదురైన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘‘భారత్, అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉంది.. ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదిస్తాయి. నేను ఎప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటాను. మోదీ గొప్ప ప్రధాని. కానీ ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చలేదు’’ అన్నారు. ఈ నేపథ్యంలో ఐరాస కీలక సమావేశానికి మోదీ గైర్జారు అవుతారనే విషయం తెరపైకి వచ్చింది. దీంతో ట్రంప్ వైఖరికి నిరసనగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం నడుస్తుండగా.. మోదీ తాజా ట్వీట్తో ఇరు దేశాధినేతల మధ్య గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారానికి పుల్స్టాప్ పడినట్లయ్యింది. Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF— Narendra Modi (@narendramodi) September 6, 2025 -
ట్రంప్ కామెంట్లు.. మోదీ కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ గొప్ప ప్రధాన మంత్రి అని, తనకు మంచి స్నేహితుడని, అయినా ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పనులు ఎందుకనో నచ్చడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ప్రధాని మోదీ తీసుకున్న ఓ కీలక నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ(UNGA) వార్షికోత్సవ హైలెవల్ సెషన్కు హాజరై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉంది. అయితే తాజాగా విడుదలైన ప్రసంగ కర్తల జాబితాలో ఆయన పేరు లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ పేరును చేర్చారు. దీంతో మోదీ ఉద్దేశపూర్వకంగానే ఆ పర్యటన నుంచి తప్పుకున్నారనే చర్చ జోరందుకుంది.సెప్టెంబర్ 9వ తేదీన ఐరాస సాధారణ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభం కానుంది. ‘‘ఒక్కటిగా ఉన్నప్పుడు మెరుగ్గా ఉంటుంది.. శాంతి, అభివృద్ధి & మానవ హక్కుల కోసం 80 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ’’(Better together: 80 years and more for peace, development and human rights )అనే థీమ్తో ఈ ఏడాది సెషన్ జరగనుంది. ఇక.. హైలెవల్ జనరల్ డిబేట్ సెప్టెంబర్ 23-29 తేదీల మధ్య జరగనుంది. ఆనవాయితీ ప్రకారం బ్రెజిల్ ఈ డిబేట్లో మొదట ప్రసంగించనుంది. అటుపై యూఎన్జీఏ పొడియంలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. రెండో దఫా అధ్యక్షుడు అయ్యాక ఐరాస నుంచి ఆయన ప్రసంగించడం ఇదే తొలిసారి కానుంది. జులైలో విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్ట్లో భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.. సెప్టెంబర్ 26వ తేదీన ప్రసంగిస్తారని ఉంది. అయితే తాజా లిస్ట్లో ఆయన పేరుకు బదులు జైశంకర్ పేరు చేరింది. సెప్టెంబర్ 27వ తేదీన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగించనున్నారు. అంతకు ఒక్కరోజు ముందుగానే.. ఇజ్రాయెల్, చైనా, పాక్, బంగ్లాదేశ్ అధినేతలు ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. అయితే.. 50 శాతం సుంకాల విధింపు తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారింది. రష్యా చమురు, ఆయుధాల కొనుగోలు నేపథ్యంతో ట్రంప్ భారత్పై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే కొనుగోళ్లు ఆపాలంటూ అల్టిమేటం జారీ చేశారు. కానీ.. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధమని మోదీ ప్రకటించారు. తాజా షాంగై సదస్సులో పుతిన్, జిన్పింగ్తో మోదీ దోస్తీపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, రష్యాలు అమెరికాకు దూరమై.. కుటిలమైన చైనాకు దగ్గరవుతున్నారనే ఆరోపణ గుప్పించారు. అయితే కొన్నిగంటలకే మాటమార్చా.. అలాంటిదేం లేదన్నారు. భారత్తో బంధం ప్రత్యేకమైందన్నారు.అదే సమయంలో.. భారత్-పాక్ ఉద్రిక్తతలను తానే ఫోన్ కాల్ చేసి చల్లార్చానంటూ ట్రంప్ ప్రకటించుకుంటూ వస్తుండగా.. భారత్ ఆ వాదనను తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ వ్యవహారం భారత్లో రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. ఈ క్రమంలోనే కెనడాలో జరిగిన జీ7 సదస్సు నుంచి ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి.. ప్రధాని మోదీ భారత్కు తిరిగి రావాల్సి వచ్చింది. ఇక కొత్త రక్షణ ఒప్పందం కోసం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. ఇప్పుడు ఐరాస కార్యక్రమానికి మోదీ గైర్హాజరు అవుతుండడం ట్రంప్ వైఖరికి నిరసనగానే అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. -
మోదీ గొప్పే.. కానీ పనులే నచ్చడం లేదు: ట్రంప్
భారత్తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ను కోల్పోయామని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా నాలుక మడతేసేశారు. నిజంగా అలాంటిదేమీ జరగలేదని భావిస్తున్నాను అంటూ ట్రంప్ గత వ్యాఖ్యలను తిరస్కరించారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం రక్షణశాఖ పేరును యుద్ధశాఖగా మారస్తూ అధికారిక ఉత్తర్వులపై ఆయన సంతకాలు చేశారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేనెప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటా. మోదీ గొప్ప ప్రధానమంత్రి. కానీ, ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. భారత్తో మాకు ప్రత్యేక బంధం ఉంది.. ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదించాయి’’ అని ట్రంప్ అన్నారు. భారత్ రష్యా నుండి భారీగా చమురు కొనుగోలు చేస్తుండటం నన్ను నిరాశపరిచింది. నేను వారికి ఇది తెలియజేశాను అని అన్నారు. ఈ క్రమంలోనే అమెరికా భారత్పై 50 శాతం టారిఫ్ విధించినట్లు ట్రంప్ తెలిపారు. అయినా కూడా ప్రధాని మోదీతో తన సంబంధాలు మంచి స్థాయిలో ఉన్నాయన్నారు. ఇదిలా ఉంటే.. చైనా టియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో భారత్, రష్యా, చైనా అధినేతలు కలిసికట్టుగా కనిపించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో ‘‘భారత్, రష్యాలను చైనాకు కోల్పోయాం’’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ట్రంప్ సీనియర్ కౌన్సిలర్ పీటర్ నవారో భారత్పై విమర్శలు చేశారు. రష్యా చమురు కొనుగోలుతో లాభాలు పొందుతున్నదని, భారత టారిఫ్లు అమెరికన్ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తున్నాయని ఆరోపించారు. ఇంకోవైపు.. అమెరికా వైట్హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ కూడా భారత్ రష్యా చమురు కొనుగోలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్య సంబంధిత అంశమని భావిస్తున్నాం. త్వరలో సానుకూల పరిణామాలు కనిపిస్తాయని ఆశిస్తున్నాం’’ అని పేరొన్నారు. అయితే.. తాజాగా తన వ్యాఖ్యలను ట్రంపే తోసిపుచ్చడం గమనార్హం. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యలపై నేరుగా స్పందించడం లేదు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య అంశాలపై భారత్ చర్చలు కొనసాగిస్తోందని స్పష్టం చేసింది. భారత్-రష్యా సంబంధాలను మూడో దేశం దృష్టికోణంలో చూడకూడదని భారత ప్రభుత్వం అంటోంది. -
జార్జియాలో నిర్బంధంలోకి 475 మంది విదేశీయులు
వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నవారి కోసం వేట కొనసాగుతోంది. చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిని గుర్తించి, వెనక్కి పంపించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అమెరికాలోని జార్జియాలో 475 మంది అక్రమవలసదార్లను నిర్బంధించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి స్టీవెన్ ష్రాంక్ శుక్రవారం వెల్లడించారు. జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ కంపెనీ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తుంటారు. ఇందులో దక్షిణ కొరియా పౌరులు అక్రమంగా పని చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. తాజాగా నిర్బంధంలోకి తీసుకున్నవారి అక్రమ వలసదార్లతో ఎక్కువ మంది దక్షిణ కొరియా పౌరులే ఉన్నట్లు స్టీవెన్ ష్రాంక్ తెలిపారు. జార్జియాలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు స్థానికులకు దక్కాలి తప్ప అక్రమంగా వలసవచ్చినవారు సొంతం చేసుకోవడం సరైంది కాదని అన్నారు. ఒకేచోట 475 మంది అదుపులోకి తీసుకోవడం హోంల్యాండ్ సెక్యూరిటీ ఆపరేషన్ల చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అమెరికాలో తమపౌరులను అక్కడి అధికారులు నిర్బంధించినట్లు దక్షిణ కొరియా విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది. అయితే, ఎంతమంది అనే విషయం బయటపెట్టలేదు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు సోదాలు ముమ్మరంచేశారు. ప్రధానంగా విదేశీయులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. -
డేంజరస్ చైనాతో.. దోస్తీయా?
చైనాకు రష్యా, భారత్ సన్నిహితం కావటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భగ్గుమంటున్నారు. దుష్ట చైనాతో చేతులు కలుపుతారా? అంటూ రుసరుసలాడుతున్నారు. చైనా అంధకారంలోకి మీరూ పడిపోతున్నారంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశంలో మోదీ, పుతిన్, జిన్పింగ్ కలిసి ఉన్న ఫొటోను సోషల్మీడియాలో షేర్చేస్తూ అక్కసు వెళ్లగక్కారు. మరోవైపు అమెరికాకు దీటుగా చైనా తన సైనిక, ఆయుధ శక్తిని ప్రదర్శిస్తుంటే.. ఉక్రెయిన్లోకి ఏ ఇతర దేశం బలగాలు వచ్చినా దాడి చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులు.. ధీటుగా చైనా, రష్యా సవాళ్లతో ప్రపంచం ఉద్రిక్తంగా మారుతోంది. మధ్యేమార్గం అనేది మాయమై.. ప్రపంచం రెండు ముక్కలుగా చీలుతోంది. అమెరికా బెదిరింపులకు గురైనవారిని తాను కాపాడుతాను అన్నట్లుగా చైనా తన సైనిక బలాన్ని ప్రదర్శించటంతో రెండు ప్రపంచ మహాశక్తులు యుద్ధానికి ఎదురెదురుగా నిలబడినట్లయ్యింది.ఈ అసాధారణ పరిణామానికి ఈసారి భారత్ కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల చైనాలో నిర్వహించిన షాంఘై సహకార సమాఖ్య (ఎస్సీఓ) సమావేశంలో కనిపించిన ఒకే ఒక్క దృశ్యం ఇప్పుడు ప్రపంచ దృక్పథాన్ని మార్చివేస్తోంది. ట్రంప్ నిష్టూరాలు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను లొంగదీసుకునేందుకు భారత్ను వాడుకోవాలని భంగపడి.. సుంకాల పేరుతో బెదిరింపులకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎస్సీఓ సమావేశంపై భయపడుతూనే నిషూ్టరాలు ఆడారు. ఆ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోను తన సొంత సోషల్మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్లో షేర్ చేస్తూ భారత్, రష్యాను తాము కోల్పోయామని రాసుకొచ్చారు.‘చూడబోతే మేము అంధకార అగాధమైన చైనాకు భారత్, రష్యాలను కోల్పోయినట్లు కనిపిస్తోంది. వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. దుష్ట చైనాతో చేతులు కలిపితే అంధకారంలోకి వెళ్లినట్లేనని భావాత్మకంగా చెప్పారు. అదే సమయంలో తన దారికి తెచ్చుకోవాలనుకున్న రష్యా, భారత్లు తన ప్రత్యర్థి అయిన చైనా వైపు వెళ్లిపోయాయన్న భయం కూడా ఆయన మాటల్లో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. యుద్ధమా? శాంతా? ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి ముగింపు పలికే సుముహూర్తం ఇదేనని చైనా భావిస్తోంది. ఈ నెల 3న ఆ దేశం విక్టరీ పరేడ్లో చేసిన బలప్రదర్శన ప్రపంచానికి ఈ అంశంలో స్పష్టమైన సందేశం ఇచ్చింది. అమెరికా పేరు ప్రస్తావించకుండానే ‘శాంతియా? యుద్ధమా?’తేల్చుకోవాలని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టమైన హెచ్చరిక జారీచేశారు. ఆ సమావేశానికి అమెరికా ఆగర్భ శత్రువులైన ఉత్తరకొరియా, ఇరాన్ దేశాల అధినేతలు కూడా హాజరయ్యారు. అమెరికా బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, కాపాడేందుకు తాను ఉన్నానన్న భావన జిన్పింగ్ ప్రకటనలో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు.జిన్పింగ్ ప్రకటనకు కొనసాగింపు అన్నట్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అలాంటి ప్రకటనే చేశారు. ఉక్రెయిన్తో ఏ దేశం తన బలగాలను మోహరించినా వాటిపై దాడులు చేస్తామని శుక్రవారం హెచ్చరిక జారీచేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం యూరోపియన్ దేశాధినేతలతో సమావేశమై సైనిక మద్దతు కోరిన నేపథ్యంలో పుతిన్ ప్రకటన సంచలనంగా మారింది.ఎందుకంటే అమెరికాతోపాటు దాదాపు యూరప్ దేశాలన్నీ నాటోలో భాగస్వాములుగా ఉన్నాయి. ఒకవేళ నాటో బలగాలు ఉక్రెయిన్లోని అడుగుపెడితే.. వాటితో ముఖాముఖి యుద్ధానికి సిద్ధమని పుతిన్ తేల్చి చెప్పారు. దీంతో ప్రాంతీయ ఘర్షణలన్నీ కలిసి నిర్ణయాత్మక ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. భారతే కీలకం దశాబ్దాలుగా మధ్యేవాద విధానంతో ప్రపంచ ప్రధాన శక్తులన్నింటితో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తున్న భారత్.. ప్రస్తుతం ఎటో ఒకవైపు మొగ్గాల్సిన సంకట స్థితిలో పడింది. తన ప్రమేయం లేకుండానే అమెరికా– చైనా శక్తుల మధ్య కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. భారత్ జోక్యం చేసుకుంటేనే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే వాదిస్తున్నారు. అందుకు భారత్ స్పందించకపోవటంతో భారత వస్తువులపై 50 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో అనివార్యంగానే మనదేశం.. చైనా, రష్యాకు మరింత దగ్గర కావాల్సి వస్తోందనే అంచనాలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు అమెరికాను దెబ్బకొట్టాలంటే చైనా, రష్యాలకు కూడా భారతే కీలకంగా మారింది. ఎస్సీఓ సమావేశానికి 10 సభ్య దేశాధినేతలు, మరికొన్ని ఆహా్వనిత దేశాల నేతలు విచ్చేసినా.. అందరి దృష్టి భారత ప్రధాని నరేంద్రమోదీపైనే కేంద్రీకృతమైంది. ఈ సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై సొంత దేశంలో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. భారత్ను అనవసరంగా దూరం చేసుకున్నామన్న బాధ ఆ విమర్శల్లో కనిపిస్తోంది.అయితే, చైనాతో భారత సంబంధాలు తక్షణం గొప్పస్థాయికి వెళ్తాయన్న నమ్మకం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సరిహద్దు సమస్యే భారత్–చైనా దైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాన అడ్డంకి అన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ జనరల్ అనిల్ చౌహాన్ మాటలను గుర్తుచేస్తున్నారు. -
ట్రంప్ విందులో టెస్లా బాస్ మిస్: స్పందించిన మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో టెక్ కంపెనీల అధిపతులకు, సీఈఓల బృందాలకు ఆతిథ్యం ఇచ్చారు. కానీ ఈ విందులో ట్రంప్ సన్నిహితుడు.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' మిస్ అయ్యారు. ఈ విందుకు ట్రంప్ మస్క్ను పిలవడం మరిచారా?, లేక పిలిచినా మస్క్ పట్టించుకోలేదా? అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ట్రంప్ విందుకు బిల్గేట్స్ను ఆహ్వానించారు, కానీ ఎలాన్ మస్క్ను పిలవలేదంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన మస్క్.. ''నన్ను ట్రంప్ విందుకు ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు నేను హాజరు కాలేకపోయారు. నా ప్రతినిధి ఒకరు అక్కడ ఉన్నారు'' అని అన్నారు. కానీ ఈ కార్యక్రమానికి మస్క్.. ప్రతినిధి ఎవరైనా హాజరయ్యారా లేదా అనేది వెల్లడికాలేదు.ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తరువాత.. కొంత కాలంపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) అధిపతిగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల దానికి రాజీనామా ఇచ్చారు. ఇటీవల ట్రంప్తో మస్క్ సంబంధాలను తెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.I was invited, but unfortunately could not attend. A representative of mine will be there.— Elon Musk (@elonmusk) September 4, 2025ట్రంప్ విందుకు హాజరైన సీఈవోలుట్రంప్ విందుకు.. సుందర్ పిచాయ్ (గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ), సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ), వివేక్ రణదివే (టిబ్కో సాఫ్ట్వేర్ ఛైర్మన్), శ్యామ్ శంకర్ (పాలంటీర్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్), బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు), టిమ్ కుక్ (యాపిల్ సీఈఓ), మార్క్ జుకర్బర్గ్ (మెటా సీఈఓ), సెర్గీ బ్రిన్ (గూగుల్ సహ వ్యవస్థాపకుడు), సామ్ ఆల్ట్ మన్ (ఓపెన్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు), గ్రెగ్ బ్రోక్ మన్ (ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు), సఫ్రా కాట్జ్ (ఒరాకిల్ సీఈఓ), డేవిడ్ లింప్ (బ్లూ ఆరిజిన్ సీఈఓ), అలెగ్జాండర్ వాంగ్ (స్కేల్ ఏఐ సీఈఓ), జారెడ్ ఐజాక్ మన్ (షిఫ్ట్ 4 పేమెంట్స్ సీఈఓ) హాజరయ్యారు. -
పడవలో తెగిపడిన తలలు యుద్ధం ఆరంభం
-
ఈసారి ఆ ముగ్గురి ఫోటో.. ట్రంప్లో వణుకు మొదలైంది..!
డొనాల్డ్ ట్రంప్.. నిన్న, మొన్నటి వరకూ ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేశారు. సుంకాల విధింపుతో పలు దేశాలకు నిద్ర లేకుండా చేసిన ట్రంప్కు ఇప్పుడు నిద్ర కరువైనట్లుంది. చైనా వేదికగా జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సు తర్వాత ట్రంప్ నోటి మాటలు కచ్చితంగా రావడం లేదు.. వెన్నులో వణుకు పుట్టిన మనిషి ఎలా బాధ పడతాడో అలా వ్యవహరిస్తున్నారు ట్రంప్.చైనా, భారత్, రష్యాల మైత్రిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నారంటే.. ఆ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగవచ్చు అంటూనే, తాము భారత్, రష్యాలను కోల్పోయామన్నారు. అదే సమయంలో కుట్ర పూరిత చైనాతో భారత్, రష్యాలు జట్టు కట్టడం విచారకమరన్నారు. తమతో దాదాపు ఆ రెండు దేశాల సత్సంబంధాలు తెగిపోయినట్లేనని మరొకవైపు విచారం వ్యక్తం చేశారు. చైనా వేదికగా జరిగిన షాంఘై సదస్సు, ఆ దేశం నిర్వహించిన అతిపెద్ద.. శక్తివంతమైన సైనిక పరేడ్పైనే ట్రంప్ ప్రధానంగా దృష్టి సారించారు. చైనా సైనిక పరేడ్కు పుతిన్తో పాటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హాజరు కావడం కూడా ట్రంప్ నోటిలో ఎలక్కాయ పడ్టట్లు అయ్యింది. నోటి మాట రాక, తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్’ వేదికగా వరుస పోస్ట్లు పెడుతున్నారు ట్రంప్. ముందుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఫోటోలు పెట్టి.. తన అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. మళ్లీ గంటల వ్యవధిలోనే చైనా అధ్యక్షుడు, భారత్ ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షులతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా సైట్లో పెట్టి మూడు దేశాల మైత్రిపై స్పందించారు. ఆ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగుతుందంటూనే ఎక్కడో తెలియని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక భారత్, రష్యాలు తమతో లేవనే బాధను కక్కలేక మింగలేక అన్న చందంగా పంచుకున్నారు. ట్రంప్పై వ్యతిరేక స్వరంఇక అమెరికాలో ట్రంప్పై వ్యతిరేక స్వరం ఎక్కువైంది. ట్రంప్ వ్యతిరేక వర్గం ప్రత్యేకంగా ఆయన చర్యలను తప్పుబడుతోంది. చైనాతో భారత్, రష్యాలు జట్టు కట్టడం కచ్చితంగా ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకు పుట్టిస్తుందంటూ ఆ దేశ రాజకీయ విశ్లేషకుడు వేన్ జోన్స్ అభిప్రాయపడ్డారు. చైనాలో జరిగిన షాంఘై సదస్సు మూడు దేశాల(చైనా, రష్యా, భారత్)ల మధ్య జరిగిన చారిత్రాత్మక సదస్సుగా అభివర్ణించారు. ‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ మూడు దేశాలు భారీ ఒప్పందాల దిశగా అడుగులు వేశాయి. మోదీ, పుతిన్, జిన్పింగ్ కలిసి దిగిన ఫోటోలే అందుకు నిదర్శనం. ఇక్కడ ఇరాన్, నార్త్ కొరియాలు కూడా కలిశాయి. ఇది ప్రతీ అమెరికన్కు వెన్నులో వణుకుపుట్టించే అంశం’ అంటూ ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా సెటైర్లు వేశారు వేన్ జోన్స్ట్రంప్లో అది పశ్చాత్తాపమేనా?ఈసారి జరిగిన షాంషై సదస్సు ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకే పుట్టించేది అన్న వేన్ జోన్స్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ట్రంప్ పదే పదే పోస్టులు పెట్టడం ఇప్పుడు ఆయనకు వెన్నులో వణుకు మొదలైందనడానికి సంకేతంగా చెప్పొచ్చు. అటు భారత్పై కాలు దువ్వి, ఇటు రష్యాపై కూడా నువ్వెంత అన్నట్లుగా వ్యవహరించిన ట్రంప్.. ఇప్పుడు తాను చేసిన తప్పుకు కాస్త పశ్చాత్తాపడుతున్నట్లే ఉన్నారు. తాము లేకపోతే ప్రపంచమే లేదు అన్నట్లు వ్యవహరించిన ట్రంప్కు చైనా, భారత్, రష్యాలు గట్టి షాక్ ఇవ్వడంతో ‘ వాట్ నెక్స్ట్’ అనే ఆలోచనలో పడ్డారాయన. అద్భుతమంటూనే సెటైర్ వేసిన ట్రంప్! -
టిమ్.. యాపిల్ పెట్టుబడి ఎంత?: సీఈఓల మధ్య ట్రంప్ ప్రశ్న
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్హౌస్లో టెక్ కంపెనీల అధిపతులకు, సీఈఓలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం బయట పెట్టుబడులు పెట్టడం ఆపాలని, ఇక్కడే (అమెరికా) ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సమక్షంలో జరిగిన సంభాషణలో.. ట్రంప్ కుక్ను, "టిమ్, యాపిల్ అమెరికాలో ఎంత డబ్బు పెట్టుబడి పెడుతుంది? అని అడిగారు. దీనికి స్పందించిన టిమ్ కుక్ 600 బిలియన్ డాలర్లు అని అన్నారు. అంతే కాకుండా.. అమెరికాలో యాపిల్ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడిని కూడా ప్రశంసించారు.ఇతర సీఈఓలను కూడా ట్రంప్ ఇదే ప్రశ్న అడిగారు. దీనికి జుకర్బర్గ్ 600 బిలియన్ డాలర్లు అని చెప్పగా.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రాబోయే రెండేళ్లలో 200 బిలియన్ల పెట్టుబడి పెడుతున్నట్లు వివరించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల బదులిస్తూ.. మేము 75 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లు అని అన్నారు. వీరందరికీ ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.డొనాల్డ్ ట్రంప్ విందుకు దేశంలోని దాదాపు దిగ్గజాలందరూ హాజరయ్యారు. కానీ అమెరికా అధ్యక్షునికి అత్యంత సన్నిహితుడు, టెస్లా బాస్ మాత్రం హాజరు కాలేదు. ఈ విందుకు ట్రంప్ మస్క్ను పిలవడం మరిచారా?, లేక పిలిచినా మస్క్ పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది..@Apple CEO @tim_cook: "I want to thank you for setting the tone such that we could make a major [$600 billion] investment in the United States... That says a lot about your focus and your leadership and your focus on innovation." pic.twitter.com/289vkiB6vy— Rapid Response 47 (@RapidResponse47) September 5, 2025 -
‘చమురు కొనుగోళ్లు వెంటనే ఆపేయాలి’
రష్యా చమురు కొనుగోళ్లను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ నేతలను కోరారు. రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగించడం ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని వాదించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యమిచ్చిన పారిస్ సదస్సు అనంతరం ఉక్రెయిన్కు మద్దతిస్తున్న మిత్రదేశాల కూటమి ‘కొలిషన్ ఆఫ్ ది విల్లింగ్’తో వీడియో కాల్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్పై సుంకాలు, యూరప్పై ఒత్తిడిట్రంప్ ప్రభుత్వం ఇటీవల భారత ఎగుమతులపై అదనంగా 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో సుంకాల భారం 50%కు రెట్టింపు అయింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈమేరకు సుంకాలు విధించినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో యూరప్ కూడా భారీగానే రష్యా చమురు దిగుమతి చేసుకుంటుందని ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆ దేశపు చమురు కొంటూ యూరోపియన్ దేశాలు నిధులు సమకూరుస్తున్నాయన్నారు.యూరప్ తీరుపై అసహనంయూరప్ ఓ వైపు యుద్ధం ఆపాలంటూ, మరో వైపు చమురు కొనుగోళ్ల రూపంలో రష్యాకు నిధులు సమకూర్చడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో గత ఏడాది కాలంలో ఇంధన అమ్మకాల ద్వారా ఈయూ 1.1 బిలియన్ యూరోలను రష్యాకు ముట్టజెప్పిందని అంతర్గత డేటాను ట్రంప్ ఉదహరించారు. అయితే కొన్ని ఈయూ దేశాలు 2022లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను, 2023 నాటికి శుద్ధి చేసిన ఇంధనాన్ని నిలిపివేయగా హంగేరి, స్లొవేకియా పరిమిత దిగుమతులను కొనసాగిస్తున్నాయి.ఇదీ చదవండి: వైట్హౌజ్లో టెక్ సీఈఓలకు ట్రంప్ విందు -
వైట్హౌజ్లో టెక్ సీఈఓలకు ట్రంప్ విందు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి వైట్హౌజ్లో ప్రముఖ టెక్ కంపెనీ సీఈఓలతో హైప్రొఫైల్ విందును నిర్వహించారు. రోజ్ గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా ప్రతిష్టాత్మక కంపెనీ అధినేతల సరసన అక్కడి సంస్థలకు సారథ్యం వహిస్తున్న భారత సంతతి సీఈఓలు సైతం పాల్గొన్నారు.విందుకు హాజరైన భారత సంతతి సీఈవోలుసుందర్ పిచాయ్ - గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓసత్య నాదెళ్ల - మైక్రోసాఫ్ట్ సీఈఓసంజయ్ మెహ్రోత్రా - మైక్రాన్ టెక్నాలజీ సీఈఓవివేక్ రణదివే - టిబ్కో సాఫ్ట్వేర్ ఛైర్మన్శ్యామ్ శంకర్ - పాలంటీర్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ఈ విందుకు సంబంధించిన పూర్తి అజెండాను వైట్ హౌజ్ విడుదల చేయనప్పటికీ కింది కీలక అంశాలపై చర్చించినట్లు అంచనాలు వెలువడుతున్నాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జాతీయ భద్రతసెమీకండక్టర్, చిప్ తయారీలో అమెరికా పోటీతత్వంఇమ్మిగ్రేషన్ సంస్కరణలు, హైస్కిల్డ్ వీసాలు (హెచ్1-బీ)సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యతయూఎస్-ఇండియా టెక్ సహకారం, సరఫరా గొలుసులపై ప్రభావంఅతిథుల జాబితాలోని ప్రముఖ కంపెనీ సీఈవోలుపేరుకంపెనీబిల్ గేట్స్మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడుటిమ్ కుక్యాపిల్ సీఈఓమార్క్ జుకర్బర్గ్మెటా సీఈఓసెర్గీ బ్రిన్గూగుల్ సహ వ్యవస్థాపకుడుసామ్ ఆల్ట్ మన్ఓపెన్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడుగ్రెగ్ బ్రోక్ మన్ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడుసఫ్రా కాట్జ్ఒరాకిల్ సీఈఓడేవిడ్ లింప్బ్లూ ఆరిజిన్ సీఈఓఅలెగ్జాండర్ వాంగ్స్కేల్ ఏఐ సీఈఓజారెడ్ ఐజాక్ మన్షిఫ్ట్ 4 పేమెంట్స్ సీఈఓ ఎలాన్ మస్క్ గైర్హాజరుటెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ విందుకు గైర్హాజరయ్యారు. ఒకప్పుడు ట్రంప్తో సన్నిహితంగా మెలిగిన మస్క్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొద్దికాలంపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) అధిపతిగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల దానికి రాజీనామా ఇచ్చారు. ఇటీవల ట్రంప్తో మస్క్ సంబంధాలను తెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఇటీవల అమెరికా దిగ్గజ కంపెనీలకు ట్రంప్ దేశీయంగా పెట్టుబడులు పెంచాలని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇతర దేశాల్లో కాకుండా యూఎస్ చేసే పెట్టుబడులు, మూలధన వ్యయాలు పెంచాలని సూచించారు. అందుకు ఇతర దేశాల్లో కార్యకలాపాలు విస్తరించాలనుకునే కొన్ని కంపెనీలు వెనక్కి తగ్గి యూఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలా కంపెనీల సీఈఓలకు విందు ఏర్పాటు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: శాశ్వత నివాసం కోసం ఐర్లాండ్ ఆకర్షణీయ మార్గం -
అద్భుతమంటూనే సెటైర్ వేసిన ట్రంప్!
పుతిన్, కిమ్ సహా 26 దేశాధినేతల సమక్షంలో చైనా నిర్వహించిన అతిపెద్ద.. శక్తివంతమైన సైనిక పరేడ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అద్భుతంగా ఉంది అంటూనే అది తన దృష్టిని ఆకర్షించేందుకు రూపొందించిన నాటకీయ ప్రదర్శన మాత్రమేనని సెటైర్ వేశారు. ఓవల్ ఆఫీస్లో మీడియాతో ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నాకు తెలిసి అది అందమైన.. అత్యంత అద్భుతమైన కార్యక్రమం. కానీ, వాళ్లు అలా ఎందుకు చేశారో నేను అర్థం చేసుకోగలను. నేను చూస్తున్నాననే వాళ్లు అనుకుని ఉంటారు’’ అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆధ్వర్యంలో తియానన్మెన్ స్క్వేర్ వద్ద రెండో ప్రపంచ యుద్ధ విక్టరీ పరేడ్ జరిగింది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ సహా 26 దేశాల అధినేతలు హాజరయ్యారు. దాదాపు 50 వేల మందికి పైగా వీక్షకులు హాజరైన ఈ పరేడ్లో శక్తివంతమైన క్షిపణులనూ చైనా ప్రదర్శనకు ఉంచింది. అయితే.. తన ప్రసంగంలో జిన్పింగ్ అమెరికాను ప్రస్తావించకపోవడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ను ఓడించడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందని చైనాకు గుర్తు చేశారాయన. షీ(జిన్పింగ్) స్నేహితుడే. కానీ, ఆయన అమెరికా పేరును ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చైనాకు స్వాతంత్రం దక్కడంలో మా సాయం కూడా ఉంది. అలాంటిది క్రెడిట్ కోరుకోవడం తప్పేం కాదు కదా అని ట్రంప్ అన్నారు.అంతకు ముందు.. ఈ ముగ్గురు దేశాధినేతల కలయికపై ట్రంప్ Truth Socialలో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జాంగ్ ఉన్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అమెరికా వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని అనిపిస్తోంది అంటూ పోస్ట్ చేశారాయన. అయితే.. అయితే, వైట్హౌస్లో జరిగిన ప్రెస్మీట్లో మాత్రం స్వరాన్ని మార్చారాయన. వాళ్లతో తన సంబంధం బాగానే ఉందని.. వచ్చే రెండు వారాల్లో అది ఎలా ఉంటుందో తెలుస్తుందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అదే సమయంలో.. బీజింగ్ పరేడ్కు ఆహ్వానం రాకపోవడంపై ట్రంప్కు ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన.. ఆ విషయం గురించి ఇప్పటివరకు ఆలోచించలేదు. నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని బదులిచ్చారు. అంతేకాదు.. త్వరలో షీ జిన్పింగ్ను కలిసే అవకాశం ఉందని బదులిచ్చారాయన. -
‘డిఫెన్స్ కాదు.. ఇకపై యుద్ధమే’.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలనలో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణ శాఖను ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’గా నామకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో ఎగ్గిక్యూటీవ్ ఆర్డర్ను పాస్ చేయనున్నారు. అనంతరం, ప్రస్తుతం రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ మినిస్టర్గా పిలిపించుకోనున్నారు. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం.. ట్రంప్ త్వరలోనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయనున్నారు. తద్వారా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించేందుకు అనుమతి లభిస్తుంది. దీంతో పాటు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా పేరొందిన పెంటగాన్ (Pentagon) రక్షణ కార్యాలయం అధికారిక పోర్టల్స్, సైన్య సంబంధిత బోర్డులు, మీడియా రూమ్లు కూడా ఈ మార్పుకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాస్తా.. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్, రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ మీడియాతో మాట్లాడారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పేరుతో అమెరికా గతంలో ప్రపంచ యుద్ధాల్లో విజయాలు సాధించింది. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్’ అనే పేరు మారిన తర్వాత ఆ పోరాట స్పూర్తి తగ్గిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హెగ్సెత్ కూడా ఈ మార్పును సాంస్కృతిక మార్పుగా అభివర్ణించారు. మేము కేవలం రక్షణ మాత్రమే కాదు.. దాడులు కూడా చేస్తాం. వాటికి అనుగుణంగా పేర్లు ఉండటం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు.పేరు మార్పు దేనికి సంకేతం1949 వరకు అమెరికా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పేరుతోనే సైనిక వ్యవహారాలను నిర్వహించేది. తరువాత నేషనల్ సెక్యూరిటీ చట్టం ద్వారా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్’గా మార్పు జరిగింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం మళ్లీ ఆ చారిత్రక పేరును తిరిగి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మార్పు అమెరికా రాజకీయాల్లో, సైనిక విధానాల్లో కొత్త దిశకు సంకేతమా? అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.ట్రంప్ వ్యూహమారక్షణ శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్) పేరును యుద్ద శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ వార్)గా మార్చడంలో ట్రంప్ వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్లో ‘వార్’ అనే పదం రక్షణ కంటే దాడి, శక్తి సూచిస్తుంది. అదే సమయంలో ప్రపంచదేశాల ఎదుట తమ దేశ యుద్ధ సామర్థ్యాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నట్లేనని భావించవచ్చు. ఈ పేరు మార్పు రాజకీయ నాయకుడిగా దేశ భద్రతపై అతని దృష్టిని ప్రతిబింబించవచ్చు. ట్రంప్ ఈ మార్పును ప్రతిపాదించినప్పుడు, ఆయన ఉద్దేశం అమెరికా సైన్యానికి మరింత దృఢత్వాన్ని ఇవ్వడమే అని చెప్పారు. మరికొందరు మాత్రం.. ట్రంప్ యుద్ధాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగమేనంటూ పెదవి విరుస్తున్నారు. -
ట్రంప్, మోదీ బంధం.. ఇది అందరికీ గుణపాఠం: బోల్టన్ సంచలన వ్యాఖ్యలు
వాష్టింగన్: భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. నేతలు మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వ్యక్తిగతంగా ఉన్న మంచి అనుబంధం ఇప్పుడు మాయమైపోయిందని యూఎస్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తెలిపారు. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘భారత ప్రధాని మోదీతో అధ్యక్షుడు ట్రంప్నకు మంచి అనుబంధం ఉండేది. ఇప్పుడు అది కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో భారత్ తీసుకున్న కొన్ని చర్యలే ఇందుకు కారణం కావచ్చు. అమెరికా-భారత్ సంబంధాలను వైట్ హౌస్ దశాబ్దాల వెనక్కి నెట్టింది. మోదీని రష్యా, చైనాకు చేరువ చేసింది. అమెరికా, ట్రంప్నకు ప్రత్యామ్నాయంగా బీజింగ్ తనను తాను ప్రదర్శించుకుంది.అయితే, ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను ఆయా నేతలతో తనకున్న వ్యక్తిగత అనుబంధాల కోణంలో చూస్తారు. ఒకవేళ ఆయనకు పుతిన్తో సత్సంబంధాలు ఉంటే.. అమెరికా, రష్యాల మధ్య అనుబంధం ఉంటుంది. కానీ.. వాస్తవానికి ఇది అసాధ్యం. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే. సత్సంబంధాలు కొన్నిసార్లు సాయపడొచ్చు.. కానీ, అన్ని వేళలా రక్షించవు. ప్రస్తుతం భారత్ విషయంలో ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరించాలని అనుకుంటున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, అమెరికా- భారత్ల మధ్య సుంకాల వివాదం వేళ బోల్టన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాన్ బోల్టన్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. అయితే.. ట్రంప్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో రాజీనామా చేశారు. రహస్య పత్రాల దుర్వినియోగం ఆరోపణలపై విచారణలో భాగంగా బోల్టన్కు చెందిన నివాసం, వాషింగ్టన్ కార్యాలయంలో ఎఫ్బీఐ ఇటీవల సోదాలు నిర్వహించింది. -
యుద్ధం ఆగాలంటే భారత్పై టారిఫ్ల మోత తప్పదు!
న్యూయార్క్/వాషింగ్టన్: టారిఫ్ల బూచి చూపి పలు దేశాలను భయపెడుతున్న ట్రంప్ సర్కార్ చివరకు యూఎస్ సుప్రీంకోర్టును సైతం టారిఫ్లు తగ్గిస్తే అమెరికా వాణిజ్యలోటు సంక్షోభంలో కూరుకుపోతుందని భయపెట్టే దుస్సాహసానికి ఒడిగట్టింది. ఉక్రెయిన్లో శాంతిస్థాపనే జరగాలంటే భారత్పై టారిఫ్ల మోత మోగాల్సిందేనని ట్రంప్ ప్రభుత్వం గురువారం అమెరికా సుప్రీంకోర్టులో వితండవాదానికి దిగింది. భారత్సహా ఇతర దేశాలపై అధిక టారిఫ్ల భారం మోపకపోతే ఆర్థికలోటు సుడిగుండంలో అమెరికా చిక్కుకోక తప్పదని ట్రంప్ సర్కార్ అనవసరంగా ఆందోళన వ్యక్తంచేసింది. అప్పీళ్ల కోర్టులో తమకు వ్యతిరేకంగా ఉత్తర్వులు రావడంతో ఇతర దేశాలతో టారిఫ్ల చర్చల్లో ప్రతిష్ఠంబన నెలకొందని, అందుకే కేసును వీలైనంత త్వరగా తేల్చాలని యూఎస్ సుప్రీంకోర్టులో గురువారం డిమాండ్చేసింది. ఈ మేరకే ఏకంగా 251 పేజీల అఫిడవిట్ను కోర్టుకు ట్రంప్ సర్కార్ సమరి్పంచింది. ‘‘ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగడంతో ప్రత్యక్షంగా అమెరికాలో జాతీయ అత్యయిక పరిస్థితి ఏర్పడింది. దీనిని పరిష్కరించేందుకే భారత్పై టారిఫ్ల మోత మోగించాల్సి వచ్చింది. ఇందుకోసం అధ్యక్షుడు తన ‘1977 అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ను ప్రయోగించారు. అధిక టారిఫ్లతో భారత్పై ఆర్థికపరంగా ఒత్తిడి తెస్తేనే భారత్ మరో గత్యంతరంలేక చివరకు రష్యా యుద్ధవిరామం చేసేలా ఒప్పించగల్గుతుంది. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు, అమెరికా ఆర్థికవ్యవస్థ పటిష్టతకు భారత్పై 50 శాతం టారిఫ్ అవశ్యం’’అని ట్రంప్ ప్రభుత్వం వాదించింది. ‘‘టారిఫ్ల విధింపును కోర్టులు అడ్డుకుంటే, అన్ని దేశాలపై టారిఫ్లు విధించే అసాధారణ అధికారం అధ్యక్షుడికి లేదని మీరు తేలిస్తే వాణిజ్యలోటు కష్టాల నుంచి అమెరికా బయటపడటం చాలా కష్టమవుతుంది. చివరకు అమెరికా ఆర్థికవినాశనం సంభవిస్తుంది’’అంటూ తమకు వ్యతిరేక తీర్పు రావొద్దనే ధోరణిలో ఏకంగా యూఎస్ సుప్రీంకోర్టునే భయపెట్టేలా ట్రంప్ సర్కార్ దుస్సాహసానికి ఒడిగట్టింది. ఆరు కీలక దేశాలు దారికొచ్చాయి ‘‘టారిఫ్ల కొరడా ఝుళిపించడంతో ప్రపంచంలోనే ఆరు ప్రధాన ఆర్థికవ్యవస్థలు(దేశాలు) మా దారికొచ్చాయి. అమెరికాతో 27 సభ్యదేశాలున్న ఐరోపా సమాఖ్యసైతం టారిఫ్ల ఒప్పందంచేసుకుంది. ఈ ఒప్పందం అమెరికాకు భారీగా మేలు చేకూర్చేదే. దీంతోపాటు 2 ట్రిలియన్ డాలర్ల కొనుగోళ్లు, అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి భారీ పెట్టుబడులు సాధ్యంకానున్నాయి. ఆయా దేశాలపై మేం విధించే టారిఫ్లు అనేవి అమెరికా మరింతగా 1.2 ట్రిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యలోటు అగాధంలో పడకుండా కాపాడే రక్షారేకులు. టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి ఉండదన్న ‘అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ కోర్టు’అభిప్రాయాన్ని పట్టించుకోకండి. ఇతర దేశాలపై అధిక టారిఫ్లు మోపితేనే అమెరికా సంపన్న దేశంగా కొనసాగుతుంది. లేదంటే పేదదేశంగా పతనమవుతుంది. ట్రంప్ అధికారంలోకి రాకమునుపు అమెరికా ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా ఉండిపోయింది. ఇప్పుడు అధిక టారిఫ్లతో బిలియన్ల కొద్దీ డబ్బు వచ్చిపడుతోంది. ఇప్పుడు అమెరికా మళ్లీ బలపడుతోంది. ఆర్థికంగా పటిష్టమవుతూ విశ్వవ్యాప్తంగా గౌరవమర్యాదలను పొందుతోంది’’అని ట్రంప్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ డి. జాన్ సాయెర్ వాదించారు. నవంబర్లోపు కేసులో వాదోపవాదనలను ముగించి తీర్పు చెప్పాలని కోర్టును సాయెర్ కోరారు. -
‘భారత్తో రష్యాకు భారీ డ్యామేజ్.. అది చాలదా?’
రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంతోనే భారత్పై ద్వితీయశ్రేణి ఆంక్షలు విధించాల్సి(పెనాల్టీ సుంకాలు) వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నొక్కి చెప్పారు. అయితే ఇది ఇక్కడితోనే అయిపోలేదని అంటున్నారాయన. భారత్ వల్లే రష్యాకు భారీ డ్యామేజ్ కూడా జరిగిందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బుధవారం పోలాండ్ అద్యక్షుడు కరోల్ నావ్రోకితో వైట్హౌజ్లోని తన ఓవల్ ఆఫీస్ ఆఫీస్లో జరిగిన జాయింట్ ప్రెస్మీట్లో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. రష్యాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఓ పోలాండ్కు చెందిన విలేకరి ప్రశ్నించారు. ఇండియాపై ద్వితీయ శ్రేణి సుంకాలు విధించాను. చైనా తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసే పెద్ద దేశం ఇండియానే. ఇది రష్యాకు వందల బిలియన్ల డాలర్ల నష్టం కలిగించింది. మీరు దీన్ని చర్య కాదు అంటారా?.. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 సుంకాలు మిగిలే ఉన్నాయి. మీరేమో చర్య లేదు అంటున్నారు. బహుశా.. మీకు కొత్త ఉద్యోగం అవసరం అంటూ రిపోర్టర్ను ఉద్దేశించి ట్రంప్ అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇండియాకు పెద్ద సమస్యలు వస్తాయి అని రెండు వారాల క్రితమే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుడు అదే జరిగిందని గుర్తు చేశారు. భారత్ తమకు మిత్రదేశమంటూ జులై 30వ తేదీన ట్రంప్ తొలుత 25 శాతం సుంకాలు(ప్రతీకార సుంకాలు) ప్రకటించారు. ఆ సమయంలో రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్రంగా ఆక్షేపించారు. ఇక ఆగస్టు 6వ తేదీన రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్పై పెనాల్టీగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా ఉక్రెయిన్ యుద్దానికి భారత్ ప్రత్యక్షంగా ఫండింగ్ చేస్తోందని ఆరోపించారాయన. దీంతో ఆగస్టు 27వ తేదీ నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్అదే సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన భారత్ను అత్యధిక సుంకాలు విధించే దేశంగా పేర్కొంటూ.. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్ అంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా వస్తువులపై ఆ దేశం అత్యధికంగా సుంకాలు విధిస్తోందని.. అందువల్లే అమెరికన్ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో పోటీ పడలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే.. ఇండియా ఇప్పుడు నో టారిఫ్ ఒప్పందానికి దిగి వచ్చిందన్న ఆయన.. అది ఆలస్యంగా జరిగిందంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇండియా రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తోందని, అమెరికా నుంచి చాలా తక్కువగా కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. తన సుంకాల వల్లే భారత్ ఇప్పుడు టారిఫ్లు తగ్గించేందుకు సిద్ధమైంది అని అన్నారు.నిజంగానే చమురు ఆగిందా?ఇదిలా ఉంటే.. తన సుంకాల వల్లే భారత్ దిగొచ్చిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసిందంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తుండడం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సింది. రష్యా ఈ విషయంపై అధికారికంగా ఏం స్పందించలేదు. జాతి ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్తామని, ఆర్థిక లాభదాయకత ఆధారంగా తమ వ్యూహాం ఉంటుందని ఇటు భారత్ చెబుతూ వస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ.. రైతులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలపై రాజీ పడం. ఒత్తిడి పెరిగినా తట్టుకుంటాం అని సుంకాలపై స్పందించారు. మరోవైపు.. చమురు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడి నుంచే కొనుగోలు చేస్తాం అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తిగా ఆపలేదు. కానీ కొంతమేర తగ్గించిన సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన 50% సుంకాలు (25% రెసిప్రోకల్ టారిఫ్ + 25% పెనాల్టీ టారిఫ్) ప్రభావంతో జూలై, ఆగస్టు నెలల్లో రష్యా చమురు దిగుమతులు తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావం తక్షణమే పూర్తిగా కనిపించక పోవచ్చని.. ఎందుకంటే చమురు కొనుగోలు ఒప్పందాలు వారాల ముందే కుదురుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్తో అలా మాట్లాడాల్సింది కాదుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. చైనా పర్యటన ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఇండియా, చైనాలాంటి దేశాలతో అలా వ్యవహారించడం సరికాదని అమెరికా వైఖరిని తప్పుబట్టారు. అమెరికా భారత్పై 50% సుంకాలు విధించడం.. ఆర్థిక శిక్షగా అభివర్ణిస్తూనే ఇది అంతర్జాతీయ సమతుల్యతను దెబ్బతీసే ప్రయత్నంగా పేర్కొన్నారు.ఇండియా, చైనా వంటి దేశాలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. ఇండియా 1.5 బిలియన్ జనాభా కలిగిన దేశం. వీరి చరిత్ర, రాజకీయ వ్యవస్థలు గౌరవించాల్సినవి. వీటి నాయకత్వాన్ని బలహీనపరచాలనుకోవడం పొరపాటు. శిక్షించేందుకు ప్రయత్నించడం, సుంకాలు విధించడం అనేవి ఆర్థిక బలప్రయోగం. ఇది కాలనీల యుగం కాదు. భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని అమెరికా వైఖరిని పరోక్షంగా విమర్శించారు. -
ఆంక్షలతో లొంగదీసుకోలేరు
మాస్కో: భారత్, చైనాలపై అమెరికా విధిస్తున్న టారిఫ్లు, ఆంక్షలను రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుపట్టారు. ఆ రెండు దేశాలను ఆంక్షల కొరడాతో లొంగదీసుకోవాలని చూడడం సరైంది కాదని తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనాలతో మాట్లాడే విధానమే సరిగ్గా లేదని, వలసవాద పాలన కాలం నాటి మాటలను ట్రంప్ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పుతిన్ తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా సర్కార్ వైఖరిపై ఘాటుగా స్పందించారు. ఆసియాలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచి, దారికి తెచ్చుకోవాలని చూస్తే అది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అంశాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. భారత్, చైనాలు చక్కటి భాగస్వామ్య దేశాలని పుతిన్ గుర్తుచేశారు. అమెరికా విధిస్తున్న టారిఫ్లను ఆ రెండు దేశాల్లో నాయకత్వాన్ని బలహీనపర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా అభివర్ణించారు. భారత్, చైనాలు కలిసి అమెరికాను శిక్షిస్తాయని ఎవరైనా చెబితే ఆ విషయం సీరియస్గా ఆలోచించాల్సిందేనని ట్రంప్ ప్రభుత్వానికి సూచించారు. 140 కోట్లకుపైగా జనాభా ఉన్న ఇండియాను, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాను బలహీన దేశాలుగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. వలసవాద ప్రభుత్వాల హయాం ఎప్పుడో ముగిసిపోయిందని, భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు అప్పుటి పదజాలం ఉపయోగిస్తామంటే కుదరదని, ఈ విషయం అమెరికా తెలుసుకోవాలని హితవు పలికారు. అమెరికా, భారత్, చైనాల మధ్య మళ్లీ సాధారణ సంబంధాలు నెలకొంటాయన్న నమ్మకం తనకు ఉందని పుతిన్ స్పష్టంచేశారు. 🚨🇷🇺 'YOU CANNOT TALK TO INDIA OR CHINA LIKE THAT:' Putin on economic pressure against partners"Attempting to weaken their leadership, built through difficult histories, is a mistake." pic.twitter.com/GsiU3K3mnZ— Sputnik India (@Sputnik_India) September 3, 2025కారులో మోదీతో సంభాషణ రహస్యం కాదు చైనాలో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. కారులోనే 45 నిమిషాలకుపైగా మాట్లాడుకున్నారు. దీనిపై వస్తున్న ఊహాగానాలపై పుతిన్ స్పందించారు. మోదీతో కారులో సంభాషించడం వెనుక రహస్యం ఏమీ లేదన్నారు. అది రహస్య సంభాషణ కాదని స్పష్టంచేశారు. అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన భేటీ విశేషాలను మోదీకి వివరించానని చెప్పారు. -
దశాబ్దాల కృషిని ట్రంప్ నాశనం చేశారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై భారతీయ అమెరికన్, కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా విమర్శలు గుప్పించారు. భారత్పై భారీ సుంకాలు విధించి దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నాశనం చేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు చేసిన కృషి ఒక్క సుంకాల వల్ల తుడిచి పెట్టుకుపోయిందన్నారు. అరుదైన అత్యవసర పరిస్థితి అంటూ హెచ్చరించారు. పాకిస్తాన్ చేసినట్లుగా, తనను నోబెల్ శాంతి బహుమతికి భారత్ నామినేట్ చేయనందునే ట్రంప్ అలా చేస్తున్నారని ఆరోపించారు. ‘నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేయడానికి మోదీ నిరాకరించారు. దీంతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి చేసిన 30 ఏళ్ల కృషిని నాశనం చేశారు. చైనా కంటే భారతదేశంపై ఆయన 50% ఎక్కువ సుంకాలను విధించారు. ఇవి బ్రెజిల్, చైనా కంటే ఎక్కువ’ అని ఖన్నా పేర్కొన్నారు. ట్రంప్ విధానాలు భారత్ను చైనా, రష్యాల వైపు నడిపిస్తున్నాయనే అనేక మంది మాజీ దౌత్యవేత్తలు, అధికారుల ఆందోళనను ఆయన పునరుద్ఘాటించారు. సుంకాలు అమెరికాలోకి భారత తోలు, వస్త్ర ఎగుమతులను, అలాగే అమెరికన్ తయారీదారుల నుంచి భారత్లోకి ఎగుమతులను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ అమెరికన్లు స్పందించాలి... రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం వల్లే భారత్పై సుంకాలు విధించినట్టు ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. సుంకాలకు నోబెల్ కోణమే ప్రధానమని భావిస్తున్నారు. భారత్తో సంబంధాన్ని నాశనం చేసే ట్రంప్ అహంకారాన్ని అమెరికా అనుమతించబోదని, భారతీయ అమెరికన్లు అతనికి వ్యతిరేకంగా మాట్లాడాలని పిలుపునిచ్చారు. ట్రంప్కు ఓటు వేసిన భారతీయ అమెరికన్లందరూ ఇప్పుడు ఆయనను ప్రశ్నించాలని సూచించారు. ట్రంప్కు తాను ఓటు వేయలేదని ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త వినోద్ ఖోస్లా చేసిన పోస్ట్ను కూడా షేర్ చేస్తూ ఖన్నా తన వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ఆయనకు నోబెల్ వస్తే ఆ తరువాత నోబెల్ ఎవరికిచ్చినా నేను పట్టించుకోను. ఎందుకంటే అది అపవిత్రం అవుతుంది’ అని వినోద్ ఖోస్లా తన పోస్ట్లో పేర్కొన్నారు. -
టారిఫ్లతో చంపుతోంది
వాషింగ్టన్: భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. భారత్ అత్యధిక టారిఫ్లతో అమెరికాను చంపుతోందని మండిపడ్డారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియాతోపాటు చైనా, బ్రెజిల్లు భారీగా టారిఫ్లు విధిస్తున్నాయని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం ఇండియా అని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన తాజాగా స్కాట్ జెన్సింగ్స్ రేడియో కార్యక్రమంలో మాట్లాడారు. అమెరికా ఉత్పత్తులపై ఇకపై ఎలాంటి టారిఫ్లు విధించబోమంటూ ఇండియా తమకు ఆఫర్ ఇచి్చందని అన్నారు. భారతదేశ ఉత్పత్తులపై తాము టారిఫ్లు భారీగా పెంచాం కాబట్టి అలాంటి ఆఫర్ వచ్చిందని, లేకపోతే వచ్చేదేకాదని తేలి్చచెప్పారు. కాబట్టి ఇండియాపై టారిఫ్లు వేయడంలో అన్యాయం ఏమీ లేదని పరోక్షంగా స్పష్టంచేశారు. తమ చర్యల వల్లే ఇతర దేశాలతో బేరమాడే శక్తి పెరిగిందని పేర్కొన్నారు. భారత్–అమెరికా బంధం ఏకపక్షమే భారత వాణిజ్య విధానాలను ట్రంప్ మరోసారి తప్పుపట్టారు. భారత్–అమెరికాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సంబంధాలన్నీ ఏకపక్ష బంధంగా అభివరి్ణంచారు. ఆయన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం వైట్హౌస్ ఓవల్ ఆఫీస్ నుంచి మీడియాతో మాట్లాడారు. ‘‘మేము ఇండియాతో చాలా బాగా కలిసి పోయాం. కానీ, మా బంధం చాలా ఏళ్లుగా ఏకపక్ష బంధంగానే ఉంది. భారత్ అపారమైన సుంకాలను వసూలు చేస్తోంది. మా ఉత్పత్తులపై వందశాతం సుంకాలు విధించింది. అందుకే ఇండియా నుంచి దిగుమతులు ఆపేశాం. వాణిజ్యం చేయడం లేదు. కానీ, ఇండియాకు అమెరికాలో భారీగా మార్కెట్ ఉంది. ఎందుకంటే ఇండియా నుంచి మేము మూర్ఖంగా సుంకాలు వసూలు చేయడం లేదు. వారు తయారు చేసిన ప్రతి వస్తువును అమెరికాకు పంపగలుగుతున్నారు. వారి ఉత్పత్తులను విక్రయించుకోగలుగుతున్నారు. భారత్ వాణిజ్య విధానాలు అమెరికాలోని తయారీదారులకు భారీ నష్టాన్ని కలిగించాయి’’ అని ట్రంప్ ఆరోపించారు. హార్లీ–డేవిడ్సన్ బైక్లు అమ్మలేకపోయాంఅమెరికాలో అత్యంత గుర్తింపు పొందిన మోటార్సైకిల్ బ్రాండ్లలో ఒకటైన హార్లీ–డేవిడ్సన్ భారత్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ట్రంప్ ప్రస్తావించారు. ‘హార్లీ–డేవిడ్సన్ బైక్లను భారత్లో అమ్మలేకపోయాం. మోటార్ సైకిల్పై 200 శాతం సుంకం విధించారు. దాంతో సుంకాలను తప్పించుకోవడానికి హార్లీ–డేవిడ్సన్ సంస్థ భారత్లోనే ప్లాంట్ నిర్మించాల్సి వచి్చంది. ఈ అన్యాయమైన సుంకాల వల్ల కంపెనీలు తమ ఉత్పత్తులను అమెరికా వెలుపల చేస్తున్నాయి. నేను అధికారంలోకి వచ్చాక ఈ వాణిజ్య విధానాలను తిప్పికొట్టడం ప్రారంభించా. అందులో భాగమే ఈ పరస్పర సుంకాలు’’ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమెరికా వైపే మొగ్గు తమ నూతన విధానాలతో అనేక సంస్థలు అమెరికాలో కంపెనీలను, ప్లాంట్లను స్థాపించడానికి ముందుకు వస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. ‘‘మా వాణిజ్య విధానాల వల్ల కార్ల కంపెనీలు, ఏఐ సంస్థలు ఇప్పుడు అమెరికా వైపు మొగ్గుచూపుతున్నాయి. చైనా, మెక్సికో, కెనడా నుంచి మేము దిగుమతి చేసుకుంటున్న అనేక కార్ల కంపెనీలు ఇప్పుడు మా దేశంలోనే ఏర్పాటవుతున్నాయి. దానివల్ల ఆయా కంపెనీలపై సుంకాల మోత తప్పుతోంది. వాటికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతోంది’’ అని ట్రంప్ తెలిపారు. ఏడు యుద్ధాలను ఆపేశా.. ప్రపంచ యుద్ధాలను ఆపానంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన ట్రంప్ మరోమారు అదే విషయం చెప్పారు. తన వాణిజ్య విధానాలతో ఏడు యుద్ధాలను పరిష్కరించానని స్పష్టంచేశారు. ‘‘సుంకాల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థకే కాకుండా ఏడు యుద్ధాలను పరిష్కరించడానికి సహాయపడింది. అమెరికా చాలా శక్తివంతమైన దేశం. అమెరికా లేకపోతే ప్రపంచంలో ఏదీ లేదు. టారిఫ్లు మా దేశాన్ని ఆర్థికంగా అత్యంత శక్తివంతంగా మార్చాయి. ఈ టారిఫ్లతోనే ఏడు యుద్ధాలను ఆపాను’’ అని వ్యాఖ్యానించారు.అవన్నీవదంతులు..తన అనారోగ్యంపై వస్తున్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు. ‘‘మీరు చనిపోయారంటూ వార్తలు మీ దృష్టికి వచ్చాయా?’’ అని ఓ విలేకరి ప్రశ్నించగా ట్రంప్ స్పందించారు. తన ఆరోగ్యంపై వదంతులు వచ్చాయని మాత్రమే విన్నానని తెలిపారు. అవి కూడా పుకార్లేనని ఖండించారు. తాను చాలా చురుగ్గా ఉన్నానని, ముందే చెప్పినట్టుగా ఇప్పుడున్నంత ఆరోగ్యంగా మరెప్పుడూ లేనని స్పష్టం చేశారు. -
భారత్కు ట్రంప్ మరోసారి భారీ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు మరో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ఉత్పత్తుల విభాగంలో 50శాతం టారిఫ్ను విధించారు. ఇప్పుడు అదే బాటలో సేవల విభాగంపై టారిఫ్లు విధించేందుకు సిద్ధమైంది. వాణిజ్య పరంగా భారత్పై మరింత ఒత్తిడి తెచ్చేలా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు భారత ఐటీ సేవలు, విదేశీ రిమోట్ వర్కర్లపై సుంకాలు విధింనుంది. అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా ట్రేడ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సలహాదారు పీటర్ నవారూ.. అన్ని ఔట్సోర్సింగ్ సేవలపై టారిఫ్ విధించాలి’ అనే అభిప్రాయం వ్యక్తం చేయడం అందుకు బలం చేకూర్చుతోంది. దీంతో విదేశీ సేవలపై కూడా వస్తువుల్లాగే టారిఫ్ విధించాలి అనే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విధానాలు అమలైతే అమెరికా కంపెనీలు ఔట్సోర్సింగ్ ఖర్చులు పెరగడంతో.. భారత్ సంబంధిత కంపెనీలతో కుదుర్చుకునే కాంట్రాక్ట్ల విషయంలో వెనక్కితగ్గుతాయి. ప్రాజెక్టుల ఆలస్యం, లాభాల తగ్గుదల, సరఫరా గొలుసుల అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భారత ఐటీ కంపెనీలు అమెరికా ఆధారిత వ్యాపారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఇంజినీర్లు, కోడర్లు, ఐటీ కన్సల్టెంట్లు, విద్యార్థులు ఎక్కువ మంది వెళుతుంటారు. ఇన్ఫోసిస్,టీసీఎస్,విప్రో,హెచ్సీఎల్ వంటి సంస్థలు హెచ్1బీ వీసాల ప్రధాన స్పాన్సర్లు. ఈ వీసాల ద్వారా అమెరికాలో పనిచేసే అవకాశం లభిస్తుంది. కానీ ఇప్పుడు..హెచ్1బీ వీసా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.ఈ పరిణామాలు భారత్ తన ఐటీ రంగాన్ని విస్తరించేందుకు,వివిధ దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచేందుకు, అమెరికా ఆధారాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ట్రంప్ పాలనలో భారత ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్య దృశ్యాన్ని మలుపు తిప్పే అవకాశం కలిగి ఉన్నాయి. -
భారత్పై మళ్లీ బురద జల్లిన ట్రంప్.. సుంకాలపై అసంబద్ధ వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోమారుతీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారతదేశంతో చాలా బాగానే కలిసిపోతుంది.. కానీ న్యూఢిల్లీ వాషింగ్టన్ నుండి విపరీతమైన సుంకాలు వసూలు చేస్తున్నందున చాలా ఏళ్లుగా ఇరుదేశాల సంబంధం ఏకపక్షంగా ఉందని వ్యాఖ్యానించారు.వైట్హౌస్లో భారతదేశంపై విధించిన కొన్ని సుంకాలను తొలగించాలని ఆలోచిస్తున్నారా? అని మీడియా అడినప్పుడు.. తాము భారత్తో బాగానే కలిసిపోతామని, కొన్నేళ్లుగా భారత్- అమెరికా మధ్య సంబంధం ఏకపక్షంగా ఉందని పేర్కొన్నారు. అయితే తాను పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు అది మారిందని వ్యాఖ్యానించారు. భారత్ తమ నుండి అపారమైన సుంకాలను వసూలు చేస్తోందని, అది ప్రపంచంలోనే అత్యధికమని అని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే అమెరికా.. భారత్తో పెద్దగా వ్యాపారం చేయడం లేదన్నారు.అయితే తాము వారి నుండి భారీ సుంకాలు వసూలు చేయడం లేదు కాబట్టే వారు మాతో వ్యాపారం చేస్తున్నారు. వారిలా మూర్ఖంగా మేము వసూలు చేయడం లేదన్నారు. ఇక్కడ తయారవని ఉత్పత్తులను భారతదేశం యూఎస్లోకి ‘తరలిస్తోందని’ ట్రంప్ ఆరోపించారు.వారు తమ నుండి 100 శాతం సుంకాలను వసూలు చేస్తున్నందున తాము ఏమీ పంపడం లేదని పేర్కొన్నారు. ఇందుకు హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లే ఉదాహరణ అన్నారు. మోటార్ సైకిళ్లపై 200 శాతం సుంకం ఉన్నందున భారతదేశంలో వీటిని విక్రయించలేమన్నారు.అయితే ఇప్పుడు హార్లే డేవిడ్సన్ భారతదేశానికి వెళ్లి అక్కడ మోటార్ సైకిల్ ప్లాంట్ నిర్మించింది. ఇప్పుడు వారు మన మాదిరిగా సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ఏకాకిని చేయడమే ట్రంప్ లక్ష్యం
కొన్నాళ్ళుగా మన కళ్ళెదుట నిలుస్తున్న ఒక ప్రశ్నకు జవాబు కనుగొనవలసిన సమయం ఆసన్నమైంది. భారతదేశం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్ష సాధింపు వైఖరిని అవలంబిస్తున్నారా? మన దేశం రోగం కుదిర్చానని ఆయన అనుకుంటు న్నారా? ఔనన్నదే దానికి జవాబు అయితే, మనం భావిస్తున్న దానికన్నా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్లే లెక్క. రష్యన్ చమురును దిగుమతి చేసు కుంటున్నందుకు భారత్పై 25 శాతం సెకండరీ సుంకాలు విధించి నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రకటించారు. రష్యాను దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ‘సమరశీల ఆర్థిక లివ రేజి’ కింద ఆ సుంకాలు మోపుతున్నట్లు చెప్పుకొన్నారు. భారత దేశానికి ఆనుషంగిక నష్టం వాటిల్లుతోందనీ, మన దేశానికి ఏం జరిగినా ట్రంప్ పట్టించుకోదలచుకోలేదనీ అది సూచించడం లేదా?ఒకవేళ, రష్యాపై ‘సమరశీల ఆర్థిక లివరేజి’యే లక్ష్యమైతే, భారతదేశం కన్నా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న చైనాపై సెకండరీ సుంకాలు విధించలేదు ఎందుకని? పైగా, ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను చైనా కొనసాగించడం మంచిదే. అది అంతర్జాతీయ ఇంధన ధరలలో ద్రవ్యోల్బణం రాకుండా నివారిస్తుం’’దని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్యానించారు. ఇవి ద్వంద్వ ప్రమాణాలు కావా? చైనాకు ఒక న్యాయం, భారతదేశానికైతే మరో న్యాయమా?ఇది ప్రతీకారం కాదా?ఇంకా విడ్డూరం ఏమిటంటే, ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్ ద్వారానే నిధులు అందుతున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించడం. భారత్పై ఆంక్షలు విధించాలని యూరప్ను బిసెంట్ కోరారు. రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు వాటిల్లజేస్తోందనీ, ‘‘భారతదేశానికి ఏది ఎక్కువ నష్టదాయకమో అక్కడే దెబ్బ కొట్టడం’’ తమ అభిమతమనీ ట్రంప్కు వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆయన ఇపుడు ‘‘మోదీ చేస్తున్న యుద్ధం’’గా అభివర్ణించారు. ‘‘శాంతికి రహ దారి న్యూఢిల్లీ గుండానే పడుతుంది’’ అంటున్నారు. భారతదేశపు ‘‘మృతప్రాయ’’ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను పట్టించుకో నని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇది కక్ష సాధింపునూ, ప్రతీకా రాన్నీ సూచించడం లేదా?భారత్పై 50 శాతం సుంకాలు విధించడంలో, చైనాకు ట్రంప్ ఇవ్వదలచుకున్న సందేశం ఇమిడి ఉందనీ, అది కూడా భారతదేశా నికి ఆనుషంగిక నష్టం వాటిల్లజేసేదేననీ స్ట్రాట్ఫర్ సంస్థ మాజీ చైర్మన్ జార్జ్ ఫ్రైడ్మ్యాన్ ఇటీవల ఒక పాడ్కాస్ట్లో చెప్పారు.చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ తహతహలాడు తున్నారు. చైనాకు వ్యతిరేకంగా తాము భారత్ పక్షాన చేర బోమనే ట్రంప్ సందేశంలోని ఆంతర్యమని ఫ్రైడ్మ్యాన్ చెప్పారు. ట్రంప్ మనసులో ఉన్న విస్తృత భౌగోళిక రాజకీయ తంత్రంలో, రష్యా, చైనాలకు ప్రాధాన్యం ఉంది. అందుకే భారతదేశాన్ని ‘‘విడిచి పెట్టేయవచ్చు’’.ఫ్రైడ్మ్యాన్ మాటలే నిజమైతే, రష్యాను హెచ్చరించేందుకు, చైనాకు పూర్తిగా వేరే రకమైన సందేశం పంపేందుకు భారతదేశాన్ని వాడుకున్నారు. రెండిందాలా భారతదేశానికే నష్టం. ట్రంప్ లెక్క లేనట్లే వ్యవహరిస్తున్నారు. ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము!అయితే, సుంకాలు, చమురు, భౌగోళిక–రాజకీయాలను మించిన సంకట స్థితినే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం. భారత –అమెరికాల మధ్య సంబంధాలకు పునాది అయిన రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలను ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. హెచ్1బి వీసా విధానంలో మార్పు తేదలచినట్లు అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లట్నిక్ ప్రకటించారు. దాని ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 70 శాతం మంది భారతీయులే కనుక, అది మనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యార్థుల వీసాలను నాలుగేళ్ళ కాలానికి మాత్రమే పరిమితం చేయాలని అమెరికా ఆంతరంగిక భద్రతా శాఖ యోచిస్తోంది. అది భారతీయ విద్యార్థుల సంఖ్యను కుంచింపజేస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థులలో భారతీయులు పెద్ద వర్గంగానే ఉన్నారు. మరోవైపు ఇపుడున్న సంఖ్య కన్నా దాదాపు మూడింతలు ఎక్కువగా 6,00,000 మంది చైనా విద్యార్థులకు ప్రవేశం కల్పించే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, భారతదేశంలో అమెరికా కొత్త రాయ బారిగా సెర్గియో గోర్ నియామకాన్ని మనం ఎలా అర్థం చేసుకో వాల్సి ఉంటుంది? ఆయన ట్రంప్కు చాలా సన్నిహితుడు. కానీ ఆయనకు దౌత్యపరమైన అనుభవం గానీ, భారతదేశం పట్ల ముందస్తు అవగాహన గానీ లేవు. హెచ్చరించే విరామం తీసుకోకుండా, లేదా ప్రత్యామ్నాయాలను సూచించకుండా ట్రంప్ ఎంచుకున్న బాటలో సెర్గియో పరుగులు పెడతారని చాలామంది భయ పడుతున్నారు. అది మనకు శుభ సూచకం ఏమీ కాదు. ఆయన బాధ్యత అంతటితో తీరిపోవడం లేదు. దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా కూడా సెర్గియోను నియమించారు. ఈ అసాధారణ చర్య దేన్ని సూచిస్తోంది? భారతదేశానికి ఇష్టం లేని పనిని బలవంతంగా ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావించాలా? సూటిగా చెప్పాలంటే, భారత–పాకిస్తాన్ల మధ్య తమ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోవాల్సిందేనని చెప్పడమా?ఇది దాడి చేయడమేననే భయం నాలో మొదలైంది. అనేక స్థాయులలో, అనేక విధాలుగా భారతదేశంపై గురిపెడుతున్నారు. ట్రంప్కు ఇక మనం ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము. అంచ నాలు తలకిందులవడంతో ఆయన ఖంగు తిన్నట్లున్నారు. మనపై కోపానికి కూడా లోనై ఉంటారు.సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారని ట్రంప్కు ధైర్యంగా చెప్ప గలిగినవారు, భారతదేశం పక్షాన నిలిచేందుకు సుముఖంగా ఉన్న వారు అమెరికాలో ఎవరైనా ఉన్నారా? డెమొక్రాటిక్ పార్టీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సందేహం లేదు! కానీ, అమెరికాను మళ్ళీ గొప్పదిగా చేయడమనే(మాగా) వర్గంలోని వారి నుంచి గొంతుక వినిపించడం లేదు. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల గొంతు పెగలకపోవడం మరింత కలవరపరుస్తోంది. మనల్ని క్లిష్ట పరిస్థితుల్లో వదిలేయాలని ట్రంప్ చూస్తున్నారా? నా వద్ద స్పష్టమైన జవాబు లేదు. కానీ, అలానే అనిపించడం లేదా?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అసహనంలో అమెరికా.. భారత్కు రష్యా బంపరాఫర్!
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు అనంతరం, భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు రష్యా బంపరాఫ్ ఇచ్చింది. ముడి చమురుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి, అక్టోబర్లో లోడ్ అయ్యే ఉరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్కు 3నుంచి 4 డాలర్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది.ఎస్సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ, దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం, రష్యా భారత్కు చమురు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం.మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 50శాతం టారిఫ్ విధించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్..ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్ మద్దతిస్తుందని అక్కసు వెళ్లగక్కారు. అయితే,భారత్ మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను సమర్థిస్తోంది. చమురు ఎక్కడ తక్కవ దొరికితే అక్కడ నుంచి కొనుగోలు చేస్తామని కుండబద్దలు కొట్టి చెప్పింది. అమెరికా విధించిన టారిఫ్లను భారత్ వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాలు భారత్ అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాల్లో కీలక మలుపు తిరగనుంది. చమురు వ్యాపారం కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయంగా పలుదేశాల్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనమని నిపుణులు అభివర్ణిస్తున్నారు. Always a delight to meet President Putin! pic.twitter.com/XtDSyWEmtw— Narendra Modi (@narendramodi) September 1, 2025 -
రష్యాతో కాదు.. భారత్ ఉండాల్సింది మాతోనే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చెందిన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో..మరోసారి భారత్పై నోరు పారేసుకున్నారు. భారత్-రష్యా సంబంధాలపై తాజాగా విమర్శలు గుప్పించారు. భారత్ ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కాదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తియాంజిన్ (Tianjin) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ దరిమిలా ఈ భేటీని సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ.. పీటర్ నవారో తీవ్ర విమర్శలు చేశారు.వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో నవారో మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీ.. పుతిన్, షీ జిన్పింగ్లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ, భారత్ కలిసి ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కానేకాదు అని అన్నారు.అమెరికా విధించిన టారిఫ్లపై భారత్ స్పందించిన తీరు.. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు కొనసాగించడాన్ని నవారో తీవ్రంగా విమర్శించారు. భారత్ ముడి చమురు కొనుగోలు ద్వారా పుతిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతోంది అని మరోసారి ఆరోపించారు. భారత్ను సుంకాల మహరాజుగా అభివర్ణించిన ఆయన.. రష్యా చమురు కొనుగోలు విషయంలో వాస్తవాల్ని దాచిపెడుతోందని అన్నారు. తాజాగా.. భారత్లో కుల వ్యవస్థను ప్రస్తావిస్తూ.. ఓ వర్గం సాధారణ ప్రజల ఖర్చుతో లాభపడుతోంది అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఇండియన్ రిఫైనరీలు రష్యా రాయితీ ధరకు ముడి చమురును ప్రాసెస్ చేసి, అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నాయని, ఇది "క్రెమ్లిన్ లాండ్రోమాట్"లా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రెమ్లిన్ లాండ్రోమాట్ ఆరోపణకు అర్థం ఏంటంటే.. భారత రిఫైనరీలు రష్యా డబ్బును "శుభ్రం" చేసి, ప్రపంచ మార్కెట్లో తిరిగి ప్రవేశపెడుతున్నాయి అని. తద్వారా రష్యా చమురు అమ్మకాలు కొనసాగుతాయని, పుతిన్కు ఆర్థిక లాభం కలుగుతుందని, ఇది ప్రత్యక్షంగా రష్యా యుద్ధ వ్యయానికి నిధులు సమకూర్చే మార్గంగా మారుతుందని ఆయన అభిప్రాయం.అయితే.. భారత్ మాత్రం తన చమురు కొనుగోలు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై ధర పరిమితి విధించాయి. ఈ నేపథ్యంలో భారత్ రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. మిగతా దేశాల్లాగే జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని, దేశీయ మార్కెట్ను స్థిరంగా ఉంచేందుకు ఇది అవసరమని భారత్ అంటోంది. ఈ క్రమంలోనే అమెరికా విధించిన 50 శాతం సుంకాలను అన్యాయమని భారత్ అభిప్రాయపడుతోంది. -
యుద్ధం ముగింపునకు ట్రంప్తో అంగీకారం: పుతిన్
మాస్కో: గత నెలలో అలాస్కాలో అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిగిన భేటీలో ఉక్రెయి న్తో యుద్ధానికి ముగింపు పలికే విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ వెల్లడించారు. ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో ఉక్రెయిన్లో శాంతి నెలకొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెడెన్ స్కీతో శాంతి చర్చలకు అంగీక దించారా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధా సమివ్వలేదు. ఈ విషయమై మధ్యవర్తిత్వం వహిస్తున్న ట్రంప్ సోమవారం కల్లా. జెలెన సీతో శాంతి చర్చలకు అంగీకరించేదీ లేనిదీ స్పష్టత ఇవ్వాలంటూ పుతిన్కు గడువు ఇవ్వడం తెల్సిందే. చైనాలోని తియాంజిన్లో ఎస్సీవో శిఖరాగ్రానికి యాత్రను ఈ సందర్భంగా మ యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని నిందించారు. -
సుంకాలను భారత్ పూర్తిగా ఎత్తేస్తామంది!
న్యూయార్క్/వాషింగ్టన్: బాధ్యతారహిత వ్యాఖ్యలు, పిల్లచేష్టలతో ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు నిత్యం నవ్వులపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మిగిలి ఉన్న కాస్త పరువూ పూర్తిగా పోగొట్టుకునేలా ప్రవర్తిస్తున్నారు. అమెరికాపై టారిఫ్లను పూర్తిగా ఎత్తేస్తామంటూ భారత్ ప్రతిపాదించిందని సోమవారం మరో మతిలేని ప్రకటన చేశారాయన. పైగా, ‘అది చాలా ఆలస్యంగా వచ్చిన ప్రకటన! ఎందుకంటే పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయింది’ అంటూ మేకపోతు గాంభీర్యం కూడా ప్రదర్శించారు. భారత్ తన రక్షణ, సైనిక, చమురు అవసరాల్లో అత్యధికం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది తప్ప అమెరికా నుంచి పెద్దగా కొనడమే లేదంటూ మరోసారి అక్కసు ప్రదర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన కొద్ది గంటలకే సొంత సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్సోషల్లో ఇలాంటి అర్థం పర్థం లేని కామెంట్లకు దిగారు. ‘‘భారత్ మాతో భారీగా వర్తక వ్యాపారాలు జరుపుతోంది. వాళ్లకు అతి పెద్ద క్లయింట్లం మేమే. కానీ భారత్తో మేం చేసే వ్యాపారం మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే మాపై అంత భారీ సుంకాలు విధించింది. మాకు అత్యంత నష్టదాయకమైన ఈ ఏకపక్ష ఉత్పాతపు పోకడ దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవమిది’’ అంటూ వాపోయారు. ‘‘ఇప్పుడు తీరిగ్గా ‘జీరో టారిఫ్’ ప్రతిపాదన చేసి ఏం లాభం? ఆ పని ఏళ్లక్రితమే చేయాల్సింది. ఇదంతా కామన్సెన్స్’’ అంటూ సోషల్ మీడియాలోనే భారత్కు తీరిగ్గా క్లాసు కూడా పీకారు. ట్రంప్ పోస్టులను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెంటనే షేర్ చేసి మద్దతుగా నిలిచారు. అయితే ఇలా భారత్ సున్నా సుంకాల ప్రతిపాదన చేసిందంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ట్రంప్కు ఇది కొత్తేమీ కాదు. వాటిని అప్పట్లోనే విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా ఖండించింది. కాక పుట్టించిన ‘షాంఘై భేటీ’! : తాజా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం తెలిసిందే. పలు అంశాలపై ఇద్దరు నేతలతో ఆయన లోతుగా చర్చలు జరిపారు. ఈ పరిణామాన్ని అమెరికా కర్రపెత్తనానికి శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా పడిన అతి కీలక అడుగుగా పరిశీలకులు ఇప్పటికే అభివరి్ణస్తున్నారు. ఈ పరిణామంతో చిర్రెత్తుకొచ్చి ట్రంప్ ఇలా బాధ్యతారహిత వ్యాఖ్యలకు దిగుతున్నారని వారంటున్నారు. భారత్పై సుంకాలను ఆయన ఇప్పటికే భారీగా 25 శాతానికి పెంచడం తెలిసిందే. దానికి తోడు రష్యా నుంచి భారత్ కొనే చమురుపై మరో 25 శాతం అదనపు సుంకాలు బాదుతున్నట్టు ప్రకటించారు. దాంతో మనపై సుంకాలు ఏకంగా 50 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. -
భారత్ మూడంచెల ప్లాన్..
భారతీయ ఎగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి వ్యూహాత్మక ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టారిఫ్ల వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక ఉపశమనం కోసం దేశ ఎగుమతి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి మూడంచెల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తున్నందుకు భారత్పై అమెరికా తీసుకున్న ఈ టారిఫ్ చర్య 60 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, లెదర్, రసాయనాలు వంటి కార్మిక ఆధారిత రంగాలపై ప్రభావం చూపుతుంది. వీటిలో చాలా వరకు ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్) పరిధిలోకి రానివే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.స్వల్పకాలిక చర్యలు..చాలా సంస్థలకు వడ్డీ రాయితీ పథకాలు అందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు లేని రుణాలను సులభతరం చేయాలని యోచిస్తోంది. సెజ్ యూనిట్ల ఆర్డర్ వాల్యూమ్లను నిర్వహించడానికి, ఉద్యోగాలను రక్షించడంలో సహాయపడటానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బ్రాండింగ్, ప్యాకేజింగ్, వేర్హౌజింగ్, లాజిస్టిక్స్పై పట్టుసాధించేందుకు సాయం అందించాలని చూస్తోంది. టెక్స్టైల్స్, హస్తకళల్లో చిన్న ఎగుమతిదారులకు లిక్విడిటీ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా ఉంది. ఈ సమస్య పరిష్కరించేందుకు స్వల్పకాలిక చర్యలు కీలకం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.మీడియం స్ట్రాటజీరాబోయే 12-24 నెలల్లో అమెరికాకు చేసే ఎగుమతులను వైవిధ్య పరచాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను పొందేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఇప్పటికే చర్చలు వేగవంతం చేసింది. ఎగుమతి వ్యాపారాన్ని సులభతరం చేయడానికి పన్ను రిఫండ్లను క్రమబద్ధీకరించడం, ఖర్చులను తగ్గించేలా చర్యలు తీసుకుంటోంది. యూరప్, ఆఫ్రికా వంటి కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడానికి ట్రేడ్ ఫెయిర్లను ఏర్పాటు చేస్తుంది.దీర్ఘకాలిక దృష్టిఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎగుమతి ప్రోత్సాహక మిషన్ను ప్రారంభించింది. దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్లను వైవిధ్య పరిచేందుకు చర్యలు తీసుకుంటుంది. సరళీకృత లాజిస్టిక్స్, కస్టమ్స్ క్లియరెన్స్, జీఎస్టీ రిఫండ్ విధానాలతో డిజిటల్ వాణిజ్యంలో ఎంఎస్ఎంఈలకు మరింత అవకాశాన్ని కల్పించాలని చూస్తుంది. భారతీయ ఎగుమతులకు గ్లోబల్ బ్రాండ్ విశ్వసనీయతను పెంచడానికి స్కిల్లింగ్, ఆర్ అండ్ డీ, క్వాలిటీ సర్టిఫికేషన్లో పెట్టుబడులు పెంచాలని చూస్తుంది.ఇదీ చదవండి: రూ.50 లక్షలు ఆదాయం ఉన్నా స్కూల్ ఫీజు భారం! -
ట్రంప్, మోదీ మధ్య క్షీణిస్తున్న సంబంధాలు
-
మరణం, అనారోగ్య వార్తల వేళ.. ట్రంప్ పోస్ట్ వైరల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్య వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా ట్రంప్ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ‘మిస్సింగ్’ అంటూ ప్రచారం జరిగింది. అనంతరం, ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తన ఆరోగ్యంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియా ట్రుత్ వేదికగా ట్రంప్.. తన జీవితంలో ఎన్నడూ ఇంత బెటర్గా అనిపించలేదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, సోషల్ మీడియా వార్తలకు చెక్ పడినట్టు అయ్యింది.ఇక, అంతకుముందు.. ట్రంప్ మద్దతుదారుడు, ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డీసీ డ్రైనో ట్రంప్ ఆరోగ్యంపై ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా డైసీ.. ‘అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వారాల పాటు ప్రజల ముందుకు రాకుండా ఉంటారు. కానీ మీడియా ఆయన 'చురుగ్గా' ఉన్నారు.. ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెబుతారు. ఇలాగే ఆయన డైపర్లు ధరించి నిద్రపోతున్నారు. అయినా ఇదేమీ పెద్ద సమస్య కాదు. కానీ ట్రంప్ 24 గంటలు కనిపించకపోతే మీడియా గగ్గోలు పెడుతోంది. ఇది హాస్యాస్పదమైన ద్వంద్వ ప్రమాణం. అమెరికా చరిత్రలోనే అందరి అధ్యక్షుల కంటే ట్రంప్ ఎక్కువ సమయం ప్రజా పనుల్లో గడిపారు అని వివరించారు. దీనికి స్పందించిన ట్రంప్.. ‘నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను’ అని సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేతులు, కాళ్లపై గాయాలు ఉండడం, వాటిని కవర్ చేసేందుకు ట్రంప్ మేకప్ వేసుకుని మీడియాకు దొరికిపోవడంతో.. అంతా ఆయన ఏదో అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారని భావించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ట్రంప్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా దీనిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ.. ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. కానీ ఏదైనా అనుకోని భయంకరమైన విషాదం జరిగితే తానే అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపడతానని ప్రకటించారు. దీంతో, ట్రంప్ ఆరోగ్యంపై మరింత అనుమానం పెరిగింది. -
Editor Comments: ట్రంప్ టారిఫ్ పై రిచర్డ్ వోల్ఫ్ సంచలన విశ్లేషణ
-
పాక్ తో స్నేహం భారత్ తో గొడవ.. టారిఫ్ వార్ తో అమెరికాకు నష్టం..!
-
ముగ్గురు మొనగాళ్లు రెడీ.. ట్రంప్ కు మాస్టర్ స్కెచ్
-
ట్రంప్ వచ్చేశారు.. అదంతా ఫేక్ ప్రచారమే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చనిపోయారంటూ, కనిపించడం లేదంటూ వస్తున్న వార్తలకు తెర పడింది. ఎట్టకేలకు అధ్యక్షుడు ట్రంప్.. దర్శనమిచ్చారు. ఈ మేరకు వైట్హౌస్ కీలక ప్రకటన చేసింది. తాజాగా ట్రంప్ తన వర్జీనియా క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో వైట్హౌస్ షేర్ చేసింది. దీంతో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తకు క్లారిటీ వచ్చేసింది.ఇక, వైట్హౌస్ ఈ సందర్బంగా స్పందిస్తూ.. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన హుషారుగా గోల్ఫ్ కూడా ఆడుతున్నారని పేర్కొంది. ట్రంప్ తన మనుమరాలు కయి ట్రంప్, మనువడు ఫ్రెడరిక్ ట్రంప్తో కలిసి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని తెలిపింది. ఇక, ఫోటోలో ట్రంప్ తెల్లటి పోలో షర్ట్, రెడ్ కలర్ టోపీ, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి, అమెరికా గ్రేట్ క్యాప్ ధరించి కనిపించారు. కాగా, తెల్లవారు జామున ఉదయం 8.49 గంటలకు ట్రంప్ గోల్ఫ్ ఆడినట్టు టైం స్టాంప్ కనిపిస్తోంది. ఇక ట్రంప్ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ ఫేక్ అని తేల్చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ డెడ్ అంటూ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి రావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో, ట్రంప్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. మీమ్స్, వీడియోలు చక్కర్లు కొట్టాయి.#JUSTIN: Trump is aliveDonald Trump, accompanied by his granddaughter Kai, boarded the motorcade on the South Lawn of the White House on August 30, 2025, heading to Trump National Golf Club in Sterling, Virginia.#Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump… pic.twitter.com/rDvhVWgPXX— upuknews (@upuknews1) August 30, 2025 -
వాణిజ్య చర్చలపై వెనక్కి తగ్గిన భారత్: ట్రంప్ తీరుపై మాజీ ఆర్థిక కార్యదర్శి ఫైర్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు విధించడంతో ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, అందుకే భారత్.. అమెరికాతో వాణిజ్య చర్చల నుండి వెనక్కు తగ్గిందని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ వ్యాఖ్యానించారు.ఎన్డీటీవీతో సుభాష్ గార్గ్ మాట్లాడుతూ ట్రంప్ ఏకపక్ష సుంకాలు 50 శాతం వరకు ఉండటంతో న్యూఢిల్లీ ఇప్పటికే చర్చల నుండి సమర్థవంతంగా వైదొలిగిందన్నారు. భారత్ ముడి చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తూ, భారీగా లాభాలు పొందుతోందంటూ ట్రంప్ పదేపదే చేసిన వాదనలను సుభాష్ గార్గ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణ ఆర్థిక వాస్తవికత కాదని, ఇదొక రాజకీయ నాటకమని ఆయన పేర్కొన్నారు. రష్యా ముడి చమురు కొనుగోలు వలన భారత వాస్తవ పొదుపు సంవత్సరానికి 25 బిలియన్ అమెరికన్ డాలర్లు కాదని, 2.5 బిలియన్ అమెరికా డాలర్లకు దగ్గరగా ఉందని గార్గ్ అన్నారు.ఈ విధంగా తప్పుడు సంఖ్యను చెప్పవచ్చుగానీ, ట్రంప్ దీనిని భారతదేశాన్ని శిక్షించడానికి కత్తిగా ఉపయోగిస్తున్నారని గార్గ్ ఆరోపించారు. గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం షిప్పింగ్, భీమా, బ్లెండింగ్ ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నాక భారత్.. రష్యన్ బారెల్స్ నుంచి అందుతున్న డిస్కౌంట్ బ్యారెల్కు కేవలం మూడు నుంచి నాలుగు అమెరికన్ డాలర్లు మాత్రమేనని అన్నారు. భారత్ చమురు కొనుగోలు విషయంలో అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదని గార్గ్ స్పష్టం చేశారు.అమెరికా విధిస్తున్న సుంకాల స్థాయిలలో ఎవరూ వ్యాపారం చేయలేదని, అమెరికా ఒత్తిడిని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ప్రధాని మోదీ దేశంలోని రైతుల ప్రయోజనాల కోసం ఎప్పుడూ రాజీ పడనని ప్రతిజ్ఞ చేశారని గార్గ్ పేర్కొన్నారు. ట్రంప్ సుంకాలకు ప్రతీకారంగా అమెరికా వస్తువులను బహిష్కరించాలని వస్తున్న పిలుపులపై గార్గ్ మాట్లాడుతూ అది పిచ్చితనమని, అమెరికా- భారత్లు వస్తు వినియోగం, సేవారంగాలలో లోతుగా కలిసిపోయాయన్నారు. అందుకే అమెరికా వస్తు బహిష్కరణ సాధ్యం కాదన్నారు. -
అమెరికన్లపై ధరల పిడుగు
వాషింగ్టన్: అమెరికాను మళ్లీ గొప్పగా మార్చుతా(మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్) నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ తర్వాత అవలంభిస్తున్న వివాదాస్పద విదేశాంగ విధానాలతో సగటు అమెరికా పౌరుని జేబుకు భారీ చిల్లు పడుతోంది. దిగుమతి సుంకాలను ఎడాపెడా వాయించడంతో విదేశీ సరకులను అధిక ధరలకు కొనలేక అమెరికాలో సామాన్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ధరలను నేలకు దించుతానని బీరాలు పలికినట్రంప్ చివరకు ధరలను ఆకాశానికి ఎత్తేసి పలు రకాల సరకులను కొనలేని దుస్థితికి తీసుకొచ్చాడని దేశవ్యాప్తంగా అమెరికన్లు ట్రంప్పై కారాలు మిరియాలు నూరుతున్నారు. విదేశీ సరకులపై ఇలాగే అధిక టారిఫ్ల భారం కొనసాగితే అంతకు మించిన ధరల భారం శాశ్వతంగా మోయాల్సి వస్తుందన్న భయాందోళనలు స్థానికంగా అధికమయ్యాయి. మార్కెట్రంగ నిపుణులు సైతం ఇదే పాటపాడటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. తొలిరోజే తగ్గిస్తానని చెప్పి.. ‘అధికారంలోకి రాగానే తొలిరోజే ద్రవ్యోల్బణం తగ్గిస్తా. ధరలను కిందకు తీసుకొస్తా’’అని ఎన్నికల ప్రచారంవేళ 2024 ఆగస్ట్ర్యాలీలో ట్రంప్ చేసి వాగ్దానాలు నీటిమూటలేనని ఇటీవల ప్రజలకు స్పష్టంగా తెలిసొచ్చింది. ‘‘అమెరికా సరకులు అందుబాటు ధరల్లో’’అనే నినాదం కాస్తా ‘‘కొనలేనంత అధిక ధరలకు అమెరికా సరకులు’’అనే పరిస్థితి దాపురించింది. దీనికి తాజా గణాంకాలే తార్కాణంగా నిలుస్తున్నాయి. జనవరిలో ట్రంప్ అధికారపగ్గాలు చేపట్టినప్పటి నుంచి లెక్కిస్తే ఆర్థిక డేటా, నిపుణుల విశ్లేషణల ప్రకారం గృహోవస వస్తువులు మరీ ముఖ్యంగా నిత్యావసర సరకులు, విద్యుత్ ధరలు బాగా పెరిగిపోయాయి. ఇవి ఎప్పటికప్పుడు పెరుగుతూ లక్షలాది సగటు అమెరికన్లను మరింతగా ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఈ ధరల మోతకు పరోక్షంగా ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’సైతం ఆజ్యంపోసిందని కొందరు ఆర్థికనిపుణులు విశ్లేíÙస్తున్నారు. ఇవిగాక 800 డాలర్ల విలువైన సరకులను ఎలాంటి టారిఫ్, సుంకాలు, డ్యూటీలు, ఫీజులు లేకుండా దిగుమతి చేసుకునే ‘డీ మినిమిస్’నిబంధననూ ట్రంప్ సర్కార్ తొలగించింది. దీంతో హఠాత్తుగా డిమాండ్ పెరిగి, ఆన్లైన్లో దొరికే తక్కువ ధర ఉండే వస్తువుల రేట్లు సైతం పెరిగిపోయాయి.పోస్టల్ సేవల నిరాకరణతో రేట్లు పైపైకి.. అమెరికాకు డెలివరీ చేసేందుకు వస్తువుల ఆర్డర్లను తీసుకోవడం భారత్లో ‘ఇండియాపోస్ట్’ఆపేసింది. ఇండియాపోస్ట్ బాటలోనే 25 దేశాల్లోని పోస్టల్ సంస్థలు నడుస్తున్నాయి. దీంతో ఆయా దేశాల నుంచి పోస్టల్ ద్వారా అమెరికాకు డెలివరీ కావాల్సిన సరకుల భటా్వడా పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఆయా దేశాల్లోని సంస్థలు ఇతరత్రా కొత్త డెలివరీ సంస్థల సాయంతో అమెరికాలోకి వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. కొత్త సంస్థలు కావడంతో డెలివరీ చార్జీల మోత తప్పట్లేదు. ఈ పెరుగుదల చివరకు అమెరికా వినియోగదారునిపై పడుతోంది. పచారీ సామాను ధరలు.. అన్నింటికంటే ఎక్కువగా నిత్యావసర సరకుల ధరలు బాగా పెరిగాయి. జూన్–జులైలో అన్ని ఆహారాల వినియోగధరల సూచీ(సీపీఐ) కాస్తంత పెరిగింది. దీంతో రిటైల్ ధరలు అధికమయ్యాయి. గత 20 ఏళ్ల చరిత్రలో సగటున ఆహార ధరలు 2.9 శాతం పెరగ్గా తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరికల్లా ఇది 3.4 శాతానికి చేరుకోనుందని విశ్లేషకులు చెప్పారు. పెరుగుతున్న ధరలకు స్థానిక పరిస్థితులు సైతం తోడయ్యాయి. ఏవియాన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ దెబ్బకు కోళ్ల పరిశ్రమ కునారిల్లింది. దీంతో గుడ్ల ధరలు పెరిగాయి. గొడ్డుమాంసం ధర సైతం హెచ్చింది. తాజా సర్వే ప్రకారం పెరిగిన ధరలతో సతమతమవుతున్నామని 30వేల డాలర్ల వార్షికాదాయం ఉన్న 64 శాతం మంది కుటుంబాలు చెప్పాయి. కెనడా, మెక్సికో, చైనాలపై భారంతో.. చైనా, మెక్సికో, కెనడా ఆహారోత్పత్తులపై అమెరికన్లు బాగా ఆధారపడ్డారు. 2023లో 195.9 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయోత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకుంటే అందులో 44 శాతం దిగుమతులు కేవలం చైనా, కెనడా, మెక్సికో నుంచే వచ్చాయి. ఇప్పుడీ మూడు దేశాలపై అధిక టారిఫ్ మోపడంతో ఆమేరకు దిగుమతి సుంకాల రూపంలో ధరలు పెరిగి అమెరికన్ వినియోగదారుల చిల్లుకు పేద్ద చిల్లుపడుతోందని ‘యేల్ బడ్జెట్ ల్యాబ్’సంస్థ పేర్కొంది. హోల్సేల్, రిటైలర్లు ఈ టారిఫ్ భారాన్ని తాము భరించకుండా వినియోగదారులపై పడేయడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని 9ఐ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ కెవిన్ థాంప్సన్ అన్నారు. అమెరికాలో వినియోగించే రొయ్యల్లో 94 శాతం విదేశాల నుంచి రావాల్సిందే. ముఖ్యంగా భారత్, ఈక్వెడార్, ఇండోసేసియా, వియత్నాం ఈ రొయ్యలను ఎగుమతిచేస్తున్నాయి. 55 శాతం తాజా పండ్లు, 32 శాతం కూరగాయలు సైతం దిగుమతిచేసుకోవాల్సిందే. ఇవన్నీ ఇప్పుడు ధరలు పెరిగిపోయి వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. గ్వాటెమాలా నుంచి వచ్చే అరటిపండ్లు మొదలు విదేశాల నుంచి వచ్చే కాఫీ, చాక్లెట్, గింజలు, టెక్స్టైల్స్, కోకా, వెనిల్లా ధరలు సైతం పెరిగాయి. అదే బాటలో విద్యుత్ చార్జీలు విద్యుత్ చార్జీలు సైతం 2020 ఏడాది నుంచి చూస్తే 34 శాతం పెరిగాయి. 2024 మే నుంచి 2025 మే వరకు గృహవినియోగ విద్యుత్ చార్జీలు 6.5 శాతం పెంచేశారు. విద్యుత్రంగంలో వినియోగించే అల్యూమినియం, ఉక్కు, తదితరాలను అత్యధికంగా కెనడా, మెక్సికోల నుంచి దిగుమతిచేసుకుంటోంది. కొత్తగా వీటి దిగుమతి సుంకాలు పెంచేశారు. దీంతో విద్యుత్ గ్రిడ్లు, సబ్స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లలో వినియోగించే వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో పరోక్షంగా పెరిగిన ఆ ధరల షాక్ విద్యుత్ వినియోగదారులకు తగలనుంది. మరో ఐదేళ్లలో విద్యుత్ చార్జీలు 25 శాతం, మరో పదేళ్లలో 75 శాతం పెరుగుతాయని ఎనర్జీ ఇన్నోవేషన్ స్టడీస్ సంస్థ ఇప్పటికే అంచనావేసింది. ‘‘టారిఫ్ పెంచడమంటే అది అమెరికా వ్యాపారులు, వినియోగదారులపై పన్నులను పెంచడమే. అది తుదకు ధరల పెరుగుదలకు అంతిమంగా అధిక ద్రవ్యోల్బణంకు దారితీస్తుంది’’అని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, ప్రస్తుత టైమ్ మ్యాగజైన్ ఎడిటర్ రిచర్డ్ స్టెన్గెల్ శుక్రవారం ‘ఎక్స్’లో ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతికూల ప్రభావంచూపుతున్న ‘బ్యూటిఫుల్ బిల్’ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ద్వారా అమెరికన్లపై ఆదాయపన్ను భారాన్ని ట్రంప్ ప్రభుత్వం తగ్గించింది. తక్కువ పన్ను కట్టడం వల్ల పౌరుల వద్ద కొంత సొమ్ము ఆదా అవుతుంది. ఈ ఆదా అయిన సొమ్ముతో సరకుల్ని కొనగలరు అని ట్రంప్ వేసిన లెక్క తప్పు అని తాజా గణాంకాలు చాటుతున్నాయి. బ్యూటిఫుల్ బిల్లు అనేది అత్యధిక పన్నులు కట్టే వ్యాపారులు, సంపన్నులకు మాత్రమే లాభదాయకంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. సంపన్న కుటుంబాలు, పెద్ద కంపెనీల పన్ను తర్వాతి ఆదాయం ఈ బిల్లు తర్వాత 2–3 శాతం పెరిగింది. మధ్య, దిగువ తరగతి అమెరికన్లకు ఈ బిల్లుతో కేవలం 1 శాతం మాత్రమే లాభం చేకూరింది. ‘‘టారిఫ్లు, బ్యూటిఫుల్ బిల్లు కారణంగా నిర్మాణ రంగం, విద్యుత్ రంగంలో నిర్వహణ వ్యయాలు పెరిగాయి. ఇవి చివరకు వినియోగదారుల సొమ్మును లాగేసుకున్నాయి. డేటా సెంటర్ల నుంచి విద్యుత్ డిమాండ్ మరో మూడేళ్లలో మూడు రెట్లు పెరగనుంది. ఇది కూడా ధరల ర్యాలీని కొనసాగిస్తుంది’’అని బిజినెస్ మ్యాగజీన్ ‘ఫోర్బ్స్’తెలిపింది. -
ట్రంప్ భారత్కు వచ్చే అవకాశాల్లేవు
న్యూయార్క్: భారత్లో ఈ ఏడాది చివర్లో జరిగే క్వాడ్ శిఖరాగ్రానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే అవకాశాలు లేవని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. గత కొద్ది నెలలుగా ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య సంబంధాలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఆ పత్రిక ఓ కథనంలో ఈ మేరకు విశ్లేషించింది. దీనిపై అమెరికా, భారత్ అధికారులు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. నవంబర్లో భారత్ ఆతిథ్యంలో జరిగే శిఖరాగ్రంలో ఆ్రస్టేలియా, జపాన్, అమెరికా దేశాల నేతలు పాల్గొనాల్సి ఉంది. భారత్–పాకిస్తాన్ల మధ్య కొనసాగిన నాలుగు రోజుల సంక్షోభం తన జోక్యంతోనే ముగిసిందంటూ ట్రంప్ పదేపదే చెప్పుకోవడం, భారత్ ఖండించడాన్ని న్యూయార్క్టైమ్స్ కథనంలో ప్రస్తావించింది. దీనిపై ట్రంప్ విషయంలో మోదీ సహనం కోల్పోయారని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడాన్ని ప్రస్తావించిన ట్రంప్..భారత్ కూడా అలాగే చేయాలని ఆశించి భంగపడ్డారని విశ్లేషించింది. ఇదే ఇద్దరి మధ్య అంతరాన్ని పెంచేందుకు ఆజ్యం పోశాయని పేర్కొంది. వీటికి ప్రతీకారంగానే రష్యా ఆయిల్ కొనుగోలు సాకుతో భారత్పై విపరీతంగా టారిఫ్ల భారం మోపారని తెలిపింది. టారిఫ్లపై చర్చలు కొలిక్కి రాకపోయేసరికి విసుగెత్తిన ట్రంప్ పలుమార్లు మోదీకి ఫోన్ చేసినా ఆయన స్పందించలేదని పేర్కొంది. అందుకే, భారత్–అమెరికాల మధ్య సంబంధాలు దిగజారడానికి రష్యా ఆయిల్ కొనుగోలు చేయడానికి మించిన కారణాలున్నట్లు విశ్లేషకులు సైతం అంటున్నారని ఆ కథనం వివరించింది. -
టారిఫ్లు అక్రమం
వాషింగ్టన్: శత్రుదేశాలు, మిత్ర దేశాలు అనే తేడా లేకుండా ఎడాపెడా టారిఫ్ల వాతలు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అక్కడి అప్పీళ్ల కోర్టు షాక్ ఇచ్చింది. అధికారాలను మితిమీరి వాడేశారని, ఇలా టారిఫ్లు పెంచడం పూర్తిగా అక్రమమని వాషింగ్టన్లోని ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్’శుక్రవారం తీర్పు చెప్పింది. ‘‘ప్రపంచంలోని ప్రతి దేశంపై ఇష్టారీతిన అంతర్జాతీయ టారిఫ్లు పెంచేసే అధికారం, అర్హత అధ్యక్షుడికి లేవు’’అని జడ్జీలు 7–4 మెజారీ్టతో తీర్పు చెప్పారు. అధిక టారిఫ్లను తప్పుబడుతూ మేలో న్యూయార్క్లోని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును మేం సమర్థిస్తున్నామని మెజారిటీ జడ్జీలు తమ తీర్పులో అభిప్రాయపడ్డారు. అమెరికా అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) ప్రకారమే ఈ టారిఫ్లు పెంచామన్న ట్రంప్ ప్రభుత్వం చేసిన వాదనలను జడ్జీలు తోసిపుచ్చారు. ఐఈఈపీఏ చట్టానికి విరుద్దంగా అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకున్నారు. అధికారాలను మితిమీరి ఉపయోగించారు. ఇలా భూగోళం మీది ప్రతి ఒక్క దేశంపై టారిఫ్ మోపకూడదు. పెంచిన టారిఫ్లను తొలగిస్తే ఇప్పటికిప్పుడే అమెరికా ఆర్థికవ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. అందుకే అక్టోబర్ 14వ తేదీదాకా యథాతథ స్థితిని కొనసాగిస్తాం. ఆలోపు ఈ కేసును యూఎస్ సుప్రీంకోర్టు పరిశీలించాలని కోరుతున్నాం’’అని 127 పేజీల తీర్పులో అప్పీళ్ల కోర్టు తెలిపింది. తీర్పుపై దుమ్మెత్తిపోసిన ట్రంప్ తన నిర్ణయాలకు వ్యతిరేకంగా వెలువడిన కోర్టు తీర్పుపై వెంటనే ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆరోపణలు గుప్పించారు. ‘‘తీర్పు తర్వాత సైతం నేను విధించిన టారిఫ్లు ఇంకొన్ని రోజులు అమల్లోనే ఉండబోతున్నాయి. పక్షపాతధోరణితోనే అప్పీళ్ల కోర్టు టారిఫ్లను తప్పుబట్టింది. అప్పీళ్ల కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టులో గెలిచి తీరతాం. చివరకు గెలిచేది మేమే. ఒకవేళ టారిఫ్లను తొలగిస్తే దేశంలో వినాశనం తప్పదు. అది మన ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుంది. వాస్తవానికి మన వ్యవస్థ బలీయంగా ఉండాలి. శత్రువు, మిత్రుడు అనే తేడా లేకుండా మనపై విదేశాలు మోపిన టారి ఫ్ల భారాన్ని, వాణిజ్య లోటును అమెరికా సహించబోదు. విదేశాల విధానాలతో మన తయారీసంస్థలు, రైతులుసహా ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడుతున్నారు. మన కార్మికులతోపాటు కర్మాగారాలను పరిరక్షించాలంటే విదేశాలపై టారిఫ్లను పెంచడమే అత్యుత్తమ మార్గం’’అని ట్రంప్ అన్నారు.ఇప్పుడేం జరగొచ్చు? అప్పీళ్ల కోర్టులో కేసును ఓడిపోవడంతో ట్రంప్ వెంటనే యూఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. అక్కడే ట్రంప్ సర్కార్కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. యూఎస్ సుప్రీంకోర్టులోని 9 మంది జడ్జీల్లో ఆరుగురిని రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వాలే నియమించాయి. ఈ ఆరుగురిలో ముగ్గురిని స్వయంగా ట్రంప్ నియమించారు. వీరంతా ట్రంప్కు అనుకూలంగా తీర్పు చెప్పే అవకాశముంది. అయితే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన కేసులతో పోలిస్తే స్వయంగా అధ్యక్షుడు కలుగజేసుకున్న కేసులను యూఎస్ సుప్రీంకోర్టు మరింత నిశితంగా పరిశీలించే వీలుంది. అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)ను కాదని సొంతంగా తీసుకున్న నిర్ణయాలతో వెలువర్చిన కార్యనిర్వాహక ఉత్తర్వుల విషయంలో సుప్రీంకోర్టు పారదర్శకంగా వ్యవహరిస్తే ఈ కేసు ఫలితం ఎటువైపు రానుందో ఇప్పుడే చెప్పడం కష్టమే. ఒకవేళ సుప్రీంకోర్టు సైతం ట్రంప్ టారిఫ్లు చట్టవ్యతిరేకమని తేలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. అదనపు టారిఫ్ల కింద వసూలుచేసిన వందల బిలియన్ డాలర్లను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. -
ట్రంప్కేమైంది?
న్యూఢిల్లీ: ట్రంప్కేమైంది? ఆయన బాగున్నారా?అసలు బతికే ఉన్నారా? అమెరికా అధ్యక్షుడు మరణించారంటూ శనివారం ఉన్నట్టుండి పుకార్లు పుట్టా యి. చూస్తుండగానే ప్రపంచమంతటా కార్చిచ్చు వేగంతో వ్యాపించాయి. ఈ వైనమంతా ‘ట్రంప్ మరణించారు’ పేరిట ఇంటర్నెట్లో రోజంతా యమా ట్రెండింగ్గా మారింది. సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 60 వేలకు పైగా పోస్టులు పుట్టుకొచ్చాయి. గ్రోక్ తదితరాల్లోనైతే ఏకంగా 13 లక్షల మందికి పైగా ఈ విషయమై ఆరాలు తీశారు. నిజానికి 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం కొన్ని నెలలుగా అమెరికాలోనే గాక ప్రపంచమంతటా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత జూలైలో ఆయన చేతికి గాయం, కాళ్ల మడిమల వాపుతో కన్పించడంతో లెక్కలేనన్ని పుకార్లకు తెర లేచింది. ఆయన ఆరోగ్యం నిక్షేపంగా ఉందంటూ వైట్హౌస్ వర్గాలు వెంటనే వివరణ ఇచ్చినా అనుమానాలు మాత్రం నేటికీ ఆగలేదు. అందుకు తగ్గట్టే, ట్రంప్ తన గాయాలు, వాపులు తదితరాలను మేకప్తో మేనేజ్ చేస్తున్నారంటూ కొద్ది రోజుల క్రితం కూడా విపరీతంగా వార్తలు వెలువడ్డాయి. పైగా తాజా పుకార్లపై వైట్హౌస్ కూడా మౌనం పాటిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు ఇటీవల స్వయానా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (41) చేసిన వ్యాఖ్యలు వీటికి మరింత ఆజ్యం పోశాయి. ‘‘200 రోజులుగా (ఉపా ధ్యక్షునిగా) మంచి శిక్షణ పొందుతూ వస్తున్నా. పెను విషాదమేదైనా జరిగి తప్పనిసరైతే, ‘పెద్ద బాధ్యతలు’ స్వీకరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నా ’’ అని బుధవారం ఒక ఇంటర్వ్యూలో అన్నారాయ న! ఆ వెంటనే సర్దుకుని, ‘‘ట్రంప్ ఆరోగ్యం భేషుగ్గా ఉంది. ఈ వయసులో కూడా అర్ధరాత్రి దాటేదాకా పని చస్తున్నారు. మళ్లీ తెల్లవారుజామునే మేల్కొంటున్నారు’’ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే నాలుగు రోజులుగా బయటి ప్రపంచానికి కన్పించని ట్రంప్, శనివారం ఉదయమే తన మనవ రాలు కై తదితరులతో కలిసి వర్జీనియాలో గోల్ఫ్ క్లబ్కు వెళుతున్న ఫొటోలు బయటికొచ్చాయి.జనానికి దూరంగా... కొంతకాలంగా ట్రంప్ బయట కన్పించడం బాగా తగ్గింది. అలాగని బయటి ప్రపంచానికి ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారని చెప్పడానికి కూడా లేదు. సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ‘ట్రూత్ సోషల్’లో శనివారం తెల్లవారుజామున కూడా ఆయన ఖాతాలో ఒక మెసేజ్ దర్శనమిచ్చింది. ప్రపంచ దేశాలపై తాను విధించిన టారిఫ్లు ఇంకా అమల్లోనే ఉన్నాయని ట్రంప్ అందులో రాసుకొచ్చారు.ఆ గాయం వెనక... అప్పట్లో ఓవల్ ఆఫీసులో భేటీ సందర్భంగా గాయాలైన కుడి అరచేయిని ట్రంప్ వీలైనంతగా కప్పుకుంటూ మీడియా కంటబడ్డారు. దక్షిణ కొరియా అధ్యక్షునితో భేటీ సందర్భంగా కుడిచేయి వెనకవైపు గాయంతో కనిపిస్తున్న ట్రంప్ ఫొటోలు తాజాగా విపరీతంగా ట్రెండయ్యాయి. ఆయన దీర్ఘకాలంగా నరాల బలహీనతతో బాధపడుతున్నట్టు తాజాగా జరిపిన వార్షిక ఆరోగ్య పరీక్షల్లో తేలింది. 70 ఏళ్ల పైబడ్డ వారిలో ఇది సాధారణమేనని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లెవిట్ అప్పట్లో అన్నారు. ట్రంప్ నరాల సమస్య పెద్ద విషయమేమీ కాదంటూ ఆయన వ్యక్తిగత వైద్యుని పేరిట ఒక లేఖ నోట్ను కూడా ప్రభుత్వం హడావుడిగా విడుదల చేసింది. అంతకుముందు గత ఫిబ్రవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్తో భేటీ సందర్భంగా కూడా ట్రంప్ కుడి చేయి ఇలాగే వార్తల్లో నిలిచింది. దానికి కొట్టొచి్చనట్టుగా కన్పించే స్థాయిలో మేకప్ వేసుకున్న వైనాన్ని అంతా గమనించారు. -
ఏనుగుపై తొడగొట్టిన ఎలుక!
భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న దశ అనూహ్యంగా మొదలైంది. ఏనుగు కుంభస్థలంపై ఎలుక పిల్ల ఓ మొట్టికాయ వేసిందట! రెండు దేశాలను ఉద్దేశించి ఓ ఆర్థిక నిపుణుడు చేసిన వ్యాఖ్యానం ఇది. అయితే ఇందులో ఏనుగెవరు? ఎలుకెవరు? గత పాతికేళ్లుగా డాలర్ డ్రీమ్స్ను పలవరిస్తూ వస్తున్న మన మిడిల్ క్లాస్ కుటుంబ రావులు ఈ ప్రశ్నకు ఠకీమని సమాధానం చెప్పగలరు. అపారమైన ఆర్థిక – సైనిక బలం, అగ్రరాజ్య హోదా ఉన్న అమెరికా ఎలుకెట్లా అవుతుంది? లక్షల సంఖ్యలో మన వంశోద్ధారకుల్ని కూడా ఉద్ధరిస్తున్న అమెరికా దేశం ఏనుగు కాకుండా ఎలుకవుతుందా అనే సందేహం వారికి ఉంటుంది. మరి నూటా నలభై కోట్ల జనాభా, అందులో 90 కోట్ల మంది యువత ఉన్న భారత దేశాన్ని కూడా ఎలుకతో పోల్చడం సాధ్యంకాదు కదా!వాణిజ్య ట్యారిఫ్లను ఆయుధాలుగా మార్చుకొని కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు పాల్పడటం, తదనంతర ప్రపంచ పరిణామాల నేపథ్యంలో రిచర్డ్ ఓల్ఫ్ అనే అమెరికన్ ఆర్థికవేత్త చేసిన విశ్లేషణ సంచలనంగా మారింది. భారతదేశంపై ట్రంప్ చేసిన 50 శాతం సుంకాల ‘యుద్ధ ప్రకటన’పై ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యానాన్ని విస్తారమైన అర్థంలో చేశార నుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కలిగే దీని పర్యవసానాలను దృష్టిలో పెట్టుకొని ఏనుగుపై ఎలుక మొట్టికాయ వేసినట్టేనని అన్నారు. ప్రపంచ జనాభాలో నాలుగున్నర శాతం లేని దేశం 95 శాతం ప్రజలను ఆజ్ఞాపించాలని చూసే పెత్తందారీతనం బెడిసి కొడుతుందని ఆయన జోస్యం చెప్పారు.అమెరికా ట్యారిఫ్ కొరడా ప్రయోగం భారత్పై ప్రభావం చూపబోదని దాని అర్థం కాదు. తక్షణ ఫలితంగా భారత్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. మొత్తం అంత ర్జాతీయ వాణిజ్యంలో 90 బిలియన్ డాలర్ల పైచిలుకు లోటును భారత్ ఎదుర్కొంటున్నది. ఈ లోటులో సింహభాగం చైనా వాణిజ్యంలోనే! ‘మేకిన్ ఇండియా’ సత్ఫలితాలిస్తే తప్ప ఈ లోటును అధిగమించడం సాధ్యం కాదు. ఒక్క అమెరికా వాణిజ్యంలోనే భారత్ మిగులు భాగస్వామిగా ఉంటున్నది. అమెరికాకు 87 బిలియన్ డాలర్ల సరుకుల్ని ఎగుమతి చేస్తున్న మన దేశం అక్కడి నుంచి 45 బిలియన్ డాలర్ల కిమ్మత్తు చేసే సరుకుల్ని దిగుమతి చేసుకుంటున్నది. 50 శాతం ట్యారిఫ్ ప్రభావం 70 శాతం వ్యాపారంపై పడుతుందని, ఫలితంగా వెనువెంటనే 20 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోతామని ఎగుమతిదార్ల సంస్థలు చెబుతున్నాయి. వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. తిరుపూర్, నోయిడా, సూరత్ వంటి పట్టణాల్లో అప్పుడే ఉద్యోగాల కోత, ఫ్యాక్టరీల మూత మొదలైంది.అమెరికా కొరడా ఝుళిపిస్తుంటే భారత్ చేతులు ముడుచు కొని కూర్చుంటుందా? కూర్చోలేదు కూడా! ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకూ భారత నాయకత్వం పరిణతితో, ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించిందనే చెప్పాలి. భారత్ – పాక్ల మధ్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతల సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. యుద్ధం మొదలుకావడం, రెండు రోజుల్లోనే పాక్ను భారత్ దారుణంగా దెబ్బతీయడం, ఆ వెనువెంటనే కాల్పుల విరమణ ప్రకటన రావడం జరిగింది. భారత్ – పాక్లు ప్రకటించకముందే తన వల్లనే యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ ప్రకటించుకున్నారు. దీన్ని భారత్ అధికారికంగా ఖండించ లేదు. ట్రంప్కు మోదీ భయపడ్డారని, ఆయన ఆదేశించగానే కాల్పుల విరమణ అమలు చేశారనే ప్రచారం జరిగింది. చాలా మంది నమ్మారు. తదనంతర పరిణామాలను గమనిస్తే అప్పటి అభిప్రాయం కేవలం అపోహ మాత్రమే కావచ్చనిపిస్తున్నది. గతంలో విధించిన 25 శాతం ట్యారిఫ్కు అదనంగా మరో 25 శాతం విధించడానికి కారణం తాము ఆంక్షలు విధించిన రష్యా నుంచి భారీఎత్తున చమురు కొనుగోలు చేయడమేనని ఇప్పుడు అమెరికా చెబుతున్నది. అసలు కారణం అది కాదన్న సంగతి అందరికీ తెలుసు.అమెరికాలోని వ్యవసాయ, పాల ఉత్పత్తి రంగాలను చిరకాలంగా భారత మార్కెట్ ఊరిస్తున్నది. అవి భారత్లో ప్రవేశించగలిగితే ఇబ్బడిముబ్బడిగా అమెరికా విత్తన కంపెనీలు, పాల ఉత్పత్తుల కంపెనీలు లాభాలు పోగేసుకోగలుగుతాయి. జన్యుమార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్నలను దిగు మతి చేసుకోవాలని అమెరికా భారత్ను డిమాండ్ చేస్తున్నది. వ్యవసాయ రంగాన్ని పరాధీనం చేయగలిగే జీఎమ్ పంటలను ఒక విధానంగా భారత ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లానే పాల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని అమెరికా షరతు పెట్టింది. ఈ షరతు అంగీకరిస్తే దేశవాళీ పాడి పరిశ్రమ లక్ష కోట్లకు పైగా నష్టపోతుందని ఒక అంచనా. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న దేశం పాల ఉత్పత్తులను చౌక సుంకాలకు దిగుమతి చేసుకోవడం ఏమిటి? ఇప్పటికీ 40 శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడిన దేశం విషతుల్యమైన జీఎమ్ పంటలను దిగుమతి చేసుకో వలసిన అవసరమేమిటి? ట్రంప్ సర్కార్ కోరిన ఈ హిరణ్యాక్ష వరాలకు భారత్ తలాడించలేదు.ఆయన నోబెల్ బహుమతి పిచ్చికి భారత ప్రభుత్వం సహకరించలేదన్న దుగ్ధ కూడా అమెరికా అధ్యక్షుడిని వేధిస్తున్న దట! ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లనే కాల్పుల విరమణకు ఒప్పు కున్నామని భారత్ ఒక మాట అధికారికంగా చెబితే తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ట్రంప్ ఆశ. భారత్ – పాక్ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని చాలాకాలంగా భారత్ అంగీరించడం లేదు. ఒక దేశాధినేత నోబెల్ పిచ్చిని తీర్చడం కోసం తన దేశ సార్వభౌమాధికారంతో రాజీపడడానికి భారత్ అంగీకరించలేదు. ఇటువంటి రాజీ పట్ల పాక్కు ఎటు వంటి అభ్యంతరమూ లేదు. ట్రంప్ కోరుకుంటున్న ప్రకటనను పాక్ మిలిటరీ చీఫ్ అసీఫ్ మునీర్ చేశారు. దాంతో మునీర్ను పొగడ్తల్లో ముంచడమే గాక ఆయన్ను వైట్హౌస్లో భోజనానికి ప్రత్యేకంగా ట్రంప్ ఆహ్వానించారు.ఏకధ్రువ ప్రపంచం నుండి బహుధ్రువ ప్రపంచం వైపు మానవాళి అడుగులు వేస్తున్న కీలకమైన మలుపులో భారతదేశం తన ప్రయోజనాల కోసం అనుసరించవలసిన విదేశీ విధానంపై కేంద్ర సర్కార్కు ఇప్పటికే ఒక స్పష్టత ఉన్నది. అంతర్జాతీయ సంబంధాల్లో సిద్ధాంతాల పాత్ర ప్రచ్ఛన్న యుద్ధంతోపాటే కరిగిపోయింది. భౌగోళిక రాజకీయ అవరోధాలున్న సందర్భా ల్లోనూ ఉభయతారకంగా నెగ్గుకురావడానికి అవసరమైన వ్యూహాలకు మన విదేశాంగ విధానం పెద్దపీట వేస్తున్నది. విదేశాంగ మంత్రిగా ఉన్న జైశంకర్ దీర్ఘకాలం పాటు దౌత్యవేత్తగా పనిచేశారు. ఆ అనుభవ సారాన్ని రంగరించి, ప్రభుత్వ ఆలోచనల్ని కూడా కలబోసి ‘ది ఇండియా వే’ (భారత్ మార్గం : అనిశ్చిత ప్రపంచంలో అనుసరణీయ వ్యూహాలు) అనే పుస్తకాన్ని రాశారు. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అనుసరించదగిన వ్యూహాలపై అందులో చర్చించారు. భారత విదేశాంగ విధానం ఇప్పుడీ తాజా పంథాలోనే కొనసాగు తున్నట్టు కనిపిస్తున్నది.ఇంకెంతోకాలం అగ్రరాజ్యంగా అమెరికా మనలేదని, డాలర్ పెత్తనానికి కూడా రోజులు దగ్గరపడినట్టేనని పలువురు ఆర్థిక నిపుణులు జోస్యం చెబుతున్నారు. ట్రంప్ చర్యలు ఈ పరిణామాన్ని వేగవంతం చేయగలవని అంచనా వేస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని ‘జీ–7’ దేశాల పాశ్చాత్య కూటమిని ఆర్థిక రంగంలో ‘బ్రిక్స్’ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) ఇప్పటికే అధిగమించడాన్ని ఇందుకు రుజువుగా వారు చూపెడుతున్నారు. వచ్చే ఏడాది ‘బ్రిక్స్’ కూటమికి భారత్ నాయకత్వం వహించబోతున్నది. భౌగోళిక రాజకీయాలతోపాటు పలు అంశాలపై వైరుద్ధ్యాలున్న రెండు అతిపెద్ద దేశాలను (భారత్ – చైనా) వ్యూహాత్మక స్నేహం వైపు నడిపించిన ఘనత ట్రంప్దేనని అమెరికన్ నిపుణులే విమర్శి స్తున్నారు. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తర ణను అడ్డుకోవడానికి అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా లతో కలిసి ఏర్పడిన ‘క్వాడ్’ కూటమి తాజా పరిణామాలతో నిర్వీర్యమైనట్టే! గల్వాన్ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్యన ఏర్పడిన ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి అవసరమైన కొన్ని చర్య లను రెండు దేశాలూ ఇప్పటికే తీసుకోవడం ఆరంభించాయి. మన విదేశాంగ మంత్రి జైశంకర్ జిన్పింగ్ను కలిశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి వచ్చి మంతనాలు జరి పారు. భారత యాత్రికుల కోసం మానస సరోవరం మార్గాన్ని చైనా తెరిచింది. చైనాకు విమానయానాలను భారత్ పునరు ద్ధరించింది. చైనాలోని తియాంజిన్లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. శనివారం నాడాయనకు చైనాలో ఆత్మీయ స్వాగతం లభించింది. భారతదేశపు శాస్త్రీయ సంగీత నృత్యా లతో చైనా యువతీ యువకులు ఆయన్ను అలరించారు. అమె రికా పెత్తందారీతనానికి వ్యతిరేక వేదికను ఈ సదస్సు బలో పేతం చేసే అవకాశం ఉన్నది.ఆదివారం నాడు చైనా అధ్యక్షుడు షీ–జిన్పింగ్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ద్వైపాక్షిక సమస్యలు, సంబంధాలపై వారి మధ్య చర్చలు జరగవచ్చు. ఎస్సీఓ శిఖ రాగ్ర సభకు అమెరికా బద్ధ శత్రువైన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా హాజరవు తున్నారు. ఈ నేతలతో కూడా మోదీ చర్చలు జరిపే అవకాశం ఉన్నది. రష్యాతో మనది చెక్కుచెదరని దశాబ్దాల స్నేహబంధం. ఇరాన్తో మనకున్న అనుబంధానికి శతాబ్దాల చరిత్ర ఉన్నది. ట్రంప్ ట్యారిఫ్ల నేపథ్యంలో భారత్ కొత్త మార్కెట్లకు విస్తరించడం కోసం అందివచ్చిన వేదికలన్నిటినీ ఉపయోగించుకుంటుంది. ఈ ప్రయాణంలో భారత్ వైఖరి వేగిర పడిన చందంగా కాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఎస్సీఓ సమావేశం ముగిసిన తర్వాత బుధవారం నాడు బీజింగ్లో మరో భారీ ర్యాలీని చైనా నిర్వహిస్తున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాద శక్తులను (ముఖ్యంగా జపాన్ సామ్రాజ్యవాదం) ఓడించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైనా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఎస్సీఓ సభకు హాజరయ్యే దేశాలన్నీ ఈ ర్యాలీకి హాజరవుతున్నా భారత్ మాత్రం జపాన్ పట్ల స్నేహభావంతో హాజరు కావడం లేదు. పైగా తియాంజిన్ సదస్సుకు ముందు రెండు రోజులపాటు ప్రధాని మోదీ జపాన్లో పర్యటించారు. రెండు దేశాల మధ్య టెక్నాలజీ రంగంలో పలు ఒప్పందాలు కుదిరాయి. జపాన్ కూడా భారత ప్రధానికి ఘనమైన స్వాగతాన్నే ఏర్పాటు చేసింది. జపనీయులు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ ఆయనకు ఆహ్వానం పలికి ఆకట్టుకున్నారు.ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి, ఒక అభివృద్ధి చెందిన దేశం హోదా వైపు అడుగులు వేయడానికి ఆచరణా త్మకమైన, వివేకవంతమైన విదేశాంగ విధానం ఒక్కటే సరి పోతుందా? దేశీయంగా అందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామా? అనే విషయాలను సమీక్షించుకోవలసిన సమయమిది. జీఎస్టీ శ్లాబుల కుదింపు, స్వదేశీ వాడకం ఉద్యమానికి ప్రధాని పిలుపు నివ్వడం ట్రంప్ ట్యారిఫ్ల నేపథ్యంలో తీసుకున్న చర్యలే కావచ్చు. వాటివల్లనే స్వదేశీ మార్కెట్ బలపడుతుందా? మన దేశ ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉంటే అమెరికా, ఐరోపా దేశాల ఉమ్మడి బలంతో సమానంగా ఉంటుంది. అటువంటి వ్యవస్థను సృష్టించుకోగలగడమే చైనా విజయ రహస్యంగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. చైనా ఆర్థికాభివృద్ధి పంథా ఒక హైబ్రిడ్ మోడల్. అది పూర్తిస్థాయి పెట్టుబడిదారీ విధానం కాదు. సోషలిస్టు విధానమూ కాదు. ప్రభుత్వ నియంత్రణకు లోబడిన పెట్టుబడి పూర్తి లాభాపేక్షతో కాకుండా సామాజిక వృద్ధికి కట్టుబడి ఉంటుంది. ఈ ఆర్థిక విధానం ఫలితంగా కోట్లాది మంది పేదరికం సంకెళ్ళను తెంచుకొని ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోగలిగారు. మనం మాత్రం సమాజంలో తీవ్ర అసమానతలకూ,పేదరికానికీ ఒక ముఖ్య కారణ మైన ప్రైవేటీకరణ బాట వెంటనే ఇంకా పరుగులు తీస్తున్నాము. ఈ బాట ఇంకెంతమాత్రమూ పేదరికాన్ని నిర్మూలించలేదనీ, అసమానతల్ని పోగొట్టలేదనీ ఇప్పటికే రుజువైంది. దేశీయంగా బలమైన మార్కెట్ను నిర్మించుకోగలిగినప్పుడే రాచవీధిలో పట్టపుటేనుగు నడిచినంత ఠీవిగా అంతర్జాతీయ సంబంధాల్లో నడవగలం. ఎలుకల మొట్టికాయలు అప్పుడు ఏమీ చేయలేవు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ట్రంప్ నిజంగానే క్షేమమా? వైట్హౌజ్ గప్చుప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎక్కడ?.. నిత్యం తనదైన శైలి ప్రకటనలు, నిర్ణయాలు, సోషల్ మీడియాలో పోస్టింగులతో హడావిడి చేసే ట్రంప్ ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. పైగా 79 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంపై ఇటీవల వార్తలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అవసరమైతే తానే అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ ప్రకటన చేశారు. ఈ వరుస పరిణామాల నడుమ.. ట్రంప్ మిస్సింగ్పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గత 24 గంటలుగా సోషల్ మీడియా మామూలుగా ఊగిపోవడం లేదు. ఏకంగా ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ ఓ ట్రెండ్ సైతం నడుస్తోంది. పోను పోను ఆ ట్రెండ్ మరింత దారుణంగా మారింది. ట్రంప్ చనిపోయాడనే వార్త ధృవీకరించినవాళ్లకు డాలర్లు ఇస్తామంటూ పలువురు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. ట్రంప్ మీడియా ముందుకురాలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే తన ‘ట్రూత్’ ద్వారానే వెల్లడిస్తున్నారు. అయితే.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. JD Vance Says He’s Prepared to Assume Presidency if Trump...#Jdvance #vance #prepare #assume #office #president #donaldtrump #trump #health #wellbeing #transitions #rickwilson #conservative #strategist #maga #games #trending #viral #fyp #xviral #viralx pic.twitter.com/Jlt5BbvaZ6— FANmily TV (@FanmilyTV) August 30, 2025ట్రంప్ అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్మీడియాలో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు వైట్హౌజ్గానీ, ఆయన వ్యక్తిగత సిబ్బందిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకుంటే.. తన మనవరాలు కై మాడిసన్ ట్రంప్ (Kai Madison Trump) కలిసి వైట్హౌజ్ సౌత్ లాన్లో ఆయన గోల్ఫ్ ఆడినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. #JUSTIN Trump is alive Donald Trump, accompanied by his granddaughter Kai, boarded the motorcade on the South Lawn of the White House on August 30 #Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump #trumpdead #TrumpIsDead #TrumpisnotDead #TrumpisAlive #Kai #Virginia pic.twitter.com/fAUCijwwCR— ViralVolt🟦 (@ViralVolT1) August 30, 2025ఆ సమయంలో అక్కడికి వచ్చినవాళ్లకూ ఆయన కరచలనం చేస్తూ కనిపించినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అది తాజా వీడియోనేనా? అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. ‘‘గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’’ అని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్టు పెట్టడంతో ఈ వ్యవహారం మొదలైంది. #BREAKING: Trump makes an appearance at his golf club this morning, putting to rest swirling health rumors. #Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump #trumpdead #TrumpIsDead #TrumpisnotDead #TrumpisAlive pic.twitter.com/VfvOaGsVj0— Mukund Shahi (@Mukundshahi73) August 30, 2025మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. కుట్రపూరితంగానే ప్రచారం జరుగుతోందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని కారణాలుగా పలువురు చెబుతున్నారు.భారత్+రష్యా+చైనా = ట్రంప్నకు పీడకల అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. భవిష్యవాణిగా పేరొందిన సింప్సన్ కామిక్ సిరీస్ను ఉద్దేశించి.. ట్రంప్ ప్రాణాలతో లేకపోయి ఉండొచ్చు అని సెటైరిక్ మీమ్స్ వేస్తున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకు వేసి.. జేడీ వాన్స్, ఎలాన్ మస్క్లలో ఎవరు తదుపరి అధ్యక్షుడు అయితే బాగుంటుందంటూ పోల్ పెట్టారు కూడా.Simpsons predicted Donald Trump died of heart attack in 2025 in a forgotten episode & that's why Americans are searching "TRUMP IS DEAD", "TRUMP DIED" Trump#DonaldTrump #Trump #TrumpHealth #TrumpHealthCrisisCoverup #Simpsons #TrumpDead #TrumpDied pic.twitter.com/7vbANhE0wu— Marwdi Londa (@Marwdi45032) August 30, 2025Congratulations 🎉 Donal Trump Donald Trump is alive again after dying#donaldtrumpisdead #DonaldTrump pic.twitter.com/rfTwXSm0OL— Xi Jinping (@xijinpiing_) August 30, 2025 Elon Musk when he checks why Donald Trump is trending💀😂#DonaldTrump pic.twitter.com/Zvotz6n599— The Sarcastic Indian (@_Sarcasticindia) August 30, 2025🚨 Breaking: Senior official says Trump is perfectly fine and will go out to play golf today, according to Axios report.Now imagine after exploding the internet by trending “Trump is Dead” he suddenly appears👇🏻#trump | #trumpdead | #DonaldTrump | #TrumpIsDead pic.twitter.com/zgBLpv4gvK— GeoWireDaily (@geowiredaily) August 30, 2025if "TRUMP IS DEAD" i will give 1000 dollars to anyone who likes this tweet.#DonaldTrump#whereistrump #donaldtrumpisdead pic.twitter.com/enKe7zWGgt— GR Jaam k (@grjaam7) August 30, 2025ఈ మధ్యకాలంలో 79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్ వేసుకొని కనిపించారు. దీనిపై ట్రంప్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పందించారు. ఆ గాయం నిజమేనని అంగీకరించారు. తరచుగా కరచాలనం చేయడం వల్ల, ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా జరిగిందని వెల్లడించాడు. అయితే.. ట్రంప్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. గోల్ఫ్ ఆడిన వీడియో అధికారికమని ధృవీకరణ అయితే.. ఊహాగానాలకు తెర పడినట్లే!. -
‘శాశ్వత మిత్రత్వం కాదు.. ప్రయోజనం’.. రాజ్నాథ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, లేదా శత్రువులు ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ విధించిన సుంకాలు భారతదేశంతో సహా ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న తరుణంలో రాజ్నాథ్ సింగ్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.ఎన్డీటీవీ డిఫెన్స్ సమ్మిట్ -2025లో సింగ్ మాట్లాడుతూ నేడు ప్రపంచం చాలా వేగంగా మారుతోందని, ప్రతిరోజూ కొత్త సవాళ్లు ఉద్భవిస్తున్నాయన్నారు. స్వావలంబనకున్న ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, అది నేటి కాలంలో ఒక ఎంపిక కాదని, అది ఒక అవసరమని అన్నారు. మనం సవాళ్లతో నిండిన కూడిన యుగాన్ని ఎదుర్కొంటున్నామని, మహమ్మారి అయినా, ఉగ్రవాదం, ప్రాంతీయ సంఘర్షణలు అయినా, ప్రతి రంగంలోనూ సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. ఆగస్టు 10న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాల అంశాన్ని ప్రస్తావిస్తూ, కొంతమంది తాము అందరికీ బాస్ అని అనుకుంటారని ట్రంప్ను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. వారు భారతదేశ అభివృద్ధిని చూసి ఇష్టపడలేరన్నారు. -
అమెరికాలో టెన్షన్.. ట్రంప్కు ఏమైంది.. ఎక్కడ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. మూడు రోజులుగా ఆయన కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ‘మిస్సింగ్’ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వేర్ ఈజ్ ట్రంప్ (Where Is Donald Trump, TRUMP IS DEAD) అని ట్యాగ్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి.వివరాల ప్రకారం.. ట్రంప్ అనారోగ్యంపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అవుతున సంగతి తెలిసిందే. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత మూడు రోజులుగా ట్రంప్ బయట కనిపించలేదు.. మీడియా ముందుకు సైతం రాలేదు. ట్రంప్ ఏదైనా చెప్పాలనుకుంటే కేవలం తన ‘ట్రూత్’ ద్వారానే వెల్లడిస్తున్నారు. మరోవైపు.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో, ట్రంప్ విషయమై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.🚨 BREAKING: Curiosity is rising: Trump hasn’t been seen in 3 days.No public events. No appearances. Silence everywhere.Speculation about his health & power moves grows louder…Is it strategy or concern? 👀What do you think—is this calculated or "Where is Donald Trump" pic.twitter.com/4AvG7heGUw— RX (@TheReal_RX) August 30, 2025నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ..‘గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’ అని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్టు పెట్టారు. ఈ క్రమంలోనే వేర్ ఈజ్ ట్రంప్ (Where Is Donald Trump, TRUMP IS DEAD) అని ట్యాగ్స్ను ట్రెండింగ్లోకి తెచ్చారు. మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని చెబుతున్నారు.🚨MAJOR BREAKING: Whispers are traveling through the Washington press pool that Donald Trump has not been seen since Tuesday and has zero publicly planned events through the weekend. This clip is apparently one of the last times Trump was seen by the press. What’s going on? pic.twitter.com/sM4sd0PQMK— CALL TO ACTIVISM (@CalltoActivism) August 30, 2025🚨PRAY FOR PRESIDENT TRUMP 🇺🇸 🙏 Reports coming out of America suggest that Donald trump hasn't been seen publicly or privately since Tuesday Also, the White House website is seemingly out of order.This news is very worrying for MAGA after photos released last week of an… pic.twitter.com/wsM2MYtjrm— BRITAIN IS BROKEN 🇬🇧 (@BROKENBRITAIN0) August 30, 2025 -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ
-
అమెరికన్ బ్రాండ్ టాయిలెట్లో ఉంది.. యూఎస్ కీలక నేత సెటైర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల విషయంలో స్వదేశం నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రంప్ చర్యలను ఇప్పటికే పలువురు నేతలు తప్పుపట్టగా.. తాజాగా ఆ లిస్టులో అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా చేరిపోయారు. ట్రంప్ సుంకాల నిర్ణయాల కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్లో ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ చర్యలు అమెరికాకు తీరని నష్టం కలిగిస్తోంది. మిత్ర దేశాలతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు అమెరికాకు భాగస్వామిగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. పలు దేశాలు అమెరికాను తమకు విఘాతం కలిగించే దేశంగా చూస్తున్నారు. ట్రంప్ చర్యలు చైనాకు అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు చైనా వైపు చూస్తున్నాయి. ట్రంప్ తప్పుల కారణంగా భారత్ కూడా చైనా వైపు చూస్తోంది.అమెరికాకు మిత్ర దేశమైన భారత్పై పెద్ద మొత్తంలో సుంకాలు విధించడంతో.. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో, భారత్.. బీజింగ్తో భాగస్వామ్యం బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్లో ఉంది. భారత్పై ట్రంప్ భారీ వాణిజ్య దాడి చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా ఢిల్లీ ఇప్పుడు చైనాతో కలవాలని చూస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో.. భారత్పై ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. “The American brand globally is in the toilet. Look at India. Trump has executed a massive trade offensive against them. Now, India is thinking shit we have to go sit down with China to hedge against America,” says former US NSA Jake Sullivan on the Bulwark podcast pic.twitter.com/x6bHureqpk— Shashank Mattoo (@MattooShashank) August 29, 2025 -
సుంకాలు ఆపాల్సిందే.. ట్రంప్కు భారీ షాక్
వాషింగ్టన్: తన ఇష్టానుసారం అడ్డగోలుగా సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ విధించిన సుంకాల చాలా వరకు చట్ట విరుద్దమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో, ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక, ఫెడరల్ కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ను అమలులోకి తెచ్చారు. దీంతో అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీగా సుంకాలు విధించారు. పలు దేశాలను టార్గెట్ చేసిన ట్రంప్ ఇష్టానుసారం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలపై అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధమని తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్లను పెంచినట్లు పేర్కొంది. ఈ క్రమంలో 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు.ఇదే సమయంలో ట్రంప్ సర్కార్ భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి పెంచిన టారిఫ్లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో , ఈ నిర్ణయాన్ని యూఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.మరోవైపు.. కోర్టుపై తాజాగా ట్రంప్ స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందిస్తూ..‘కోర్టు తీర్పు అమెరికాకు ఎంతో నష్టం కలిగిస్తుంది. అమెరికా విధించిన సుంకాలు ప్రస్తుతం అన్ని దేశాలపై అమలులో ఉంది. ఒకవేళ ఈ టారిఫ్లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుంది. అమెరికా మరింత బలపడాలి. అమెరికా వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రక్రియలో చివరకు అమెరికా విజయం సాధిస్తుంది. కానీ, ఈ నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తుంది. వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి సుంకాలు ఇప్పటికీ అత్యుత్తమ మార్గం.మన తయారీదారులను, రైతులను అణగదొక్కేందుకు మిత్ర దేశాలైనా, శత్రుదేశాలైనా అనైతికంగా విధించే టారిఫ్లు, అపారమైన వాణిజ్య లోటు, వాణిజ్య అడ్డంకులను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఒక వేళ టారిఫ్లు ఎత్తివేస్తే ఈ నిర్ణయం అమెరికాను నాశనం చేస్తుంది. మన కార్మికులకు సహాయం చేయడానికి ఇదొక్కటే సరైన మార్గం అని గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఉత్పత్తులను తయారు చేస్తున్న మన కంపెనీలకు మద్దతుగా నిలబడాలి. చాలా ఏళ్లుగా మన రాజకీయ నాయకులు టారిఫ్లను మనకు వ్యతిరేకంగా ఉపయోగించారు. యూఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అమెరికాను బలమైన, ధనిక, శక్తివంతంగా మారుస్తాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఏనుగును ఎలుక ఢీకొడుతున్నట్టుగా ఉంది
వాషింగ్టన్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినందుకు భారత్ను శిక్షించాలనే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ఆ దేశానికే ఎసరు తెస్తున్నాయి. భారత్ పట్ల అమెరికా వైఖరిపై ట్రంప్ ప్రభుత్వం సొంత ఆర్థిక వేత్తలనుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. భారత్పై అమెరికా సుంకాల చర్యలు ఏనుగును ఎలుక పిడికిలితో ఢీకొట్టినట్టుగా ఉందని అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వ్యక్తిలా అమెరికా వ్యవహరిస్తోందని, కానీ తనను తానే దహించుకుంటోందని విచారం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు బ్రిక్స్ కూటమిని పోషిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. బ్రిక్స్ను విజయవంతమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా అమెరికా అభివృద్ధి చేస్తోందని గుర్తు చేశారు. కాగా, భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై రష్యా టుడేకు ఇచి్చన ఇంటర్వ్యూలో వోల్ఫ్ మాట్లాడారు. బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తోంది.. ‘భూమిపై అతిపెద్ద దేశం భారత్. సోవియట్ యూనియన్ కాలం నుంచే అమెరికాతో భారత్కు బలమైన సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ మర్చిపోతున్నారు. భారత్కు అమెరికా మార్కెట్ గేట్లు మూసేస్తే.. ఆ దేశం తన ఎగుమతులను విక్రయించడానికి ఇతర దేశాలను వెదుక్కుంటుంది. చమురును అమ్ముకునేందుకు రష్యా ఇతరత్రా మార్కెట్లను సిద్ధం చేసుకున్నట్లే.. భారత్ కూడా ఇతరత్రా మార్కెట్లను తయారు చేసుకోగలదు. ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ కూటమిలోని చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాల వాటా 35 శాతం దాకా ఉంది. జీ7 దేశాల జీడీపీ వాటా 28 శాతమే. ఈ నేపథ్యంలో అమెరికా చర్యలు బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తాయి. పశ్చిమ దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా మారుస్తాయి’అని వోల్ఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా దిగుమతిదారులకూ ప్రమాదం.. ‘ప్రస్తుతం భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో వస్తువులు, సేవలను చౌకగా పొందుతున్న కంపెనీలు అమెరికాకు తరలే అవకాశమే లేదు. అందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించవు. ఇప్పటికే అమెరికాలో కొత్త ఉద్యోగాలు లేవు. సుంకాల వల్ల అమెరికన్ ఎగుమతిదారులూ రిస్్కను ఎదుర్కొంటున్నారు. వాళ్లు విదేశీ మార్కెట్లను కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాకు ట్రిలియన్ డాలర్ల అప్పులున్నాయి. విదేశీ అప్పులపై అమెరికా ఇంకా ఎంతకాలం నిలువగలదనేది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా అప్పులపై వడ్డీల భారం పెరిగిపోతుంది. తద్వారా అమెరికా బలహీనపడుతుంది’అని వోల్ఫ్ విశ్లేషించారు. బ్రిక్స్ దేశాలకు బెదిరింపులు.. బ్రిక్స్ పది దేశాలతో కూడిన సమూహం. ఇందులో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యుదేశాలుగా ఉన్నాయి. ఈ కూటమి పాశ్చాత్య ఆర్థిక ఆధిపత్యాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. అయితే.. ట్రంప్ అనేక సందర్భాల్లో బ్రిక్స్ను వేగంగా అంతరించిపోతున్న ఒక చిన్న సమూహంగా తోసిపుచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరిలో ఏకంగా బ్రిక్స్ చచి్చపోయిందన్నారు. డాలర్ను కాదని ఉమ్మడి కరెన్సీని సృష్టించడానికి ప్రయతి్నస్తే.. సభ్య దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని బెదిరించారు. -
ఇగో పెంచిన పగ
రెండోసారి అమెరికా గద్దెనెక్కింది మొదలు, అన్ని దేశాలతోనూ గిల్లికజ్జాలతో తంపులమారిగా, ప్రపంచానికే పెను బెడదగా తయారయ్యారు ట్రంప్. మరీ ముఖ్యంగా భారత్ మీదనైతే మితిమీరిన ప్రతీకార ధోరణి ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్తో సంధి కుదిర్చే యత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించిందన్న కోపంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. అందుకోసం ఏకంగా తాను అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని అన్న వాస్తవాన్ని కూడా పక్కన పెట్టారు. అహంకార (ఇగో) ధోరణితో వ్యవహరిస్తున్నారు. అమెరికాకు అతి ముఖ్యమైన మిత్ర రాజ్యాల్లో ఏ దేశంపైనా లేనివిధంగా భారత్పై తాజాగా ఏకంగా 50 శాతం సుంకాలు విధించడం వ్యక్తిగత కసి తీర్చుకునే ప్రయత్నాల్లో భాగమే. – అమెరికా ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశానికే చెందిన ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ పలుగురాళ్లతో నలుగు పెట్టింది. భారత్ విషయంలో కొద్ది నెలలుగా ఆయన ప్రదర్శిస్తూ వస్తున్న కురచ బుద్ధిని తీవ్రస్థాయిలో తూర్పారబట్టింది. ‘‘ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్తో తలెత్తిన యుద్ధ పరిస్థితులను చల్లబరిచేందుకు మధ్యవర్తిత్వం చేస్తానంటే ససేమిరా అంటూ భారత్ తిరస్కరించడాన్ని ట్రంప్ నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. బతిమాలినా, బెదిరించినా, చివరికి పదేపదే బ్లాక్మెయిలింగ్కు దిగినా మోదీ సర్కారు దిగి రాలేదని, తనకు అణుమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదని ఆయనలో కడుపుమంట నానాటికీ పెరిగిపో తోంది. ఇరుదేశాల మధ్య చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరించి, తనను తాను శాంతిదూతగా చిత్రించుకుని చిరకాల స్వప్నమైన నోబెల్ శాంతి బహుమానం సాధించాలన్న కలలకు అడ్డంగా గండి కొడుతోందన్న ఆగ్రహం పూర్తిస్థాయిలో కట్టలు తెంచుకుంటోంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై భారత్ ఎంత ప్రముఖ దేశంగా వెలిగిపోతోందో తెలిసి కూడా ట్రంప్ ప్రదర్శిస్తున్న ప్రతీకార వైఖరి ఇరుదేశాల నడుమ పూడ్చలేనంతటి అగాధానికి దారి తీస్తోంది. అధ్యక్ష స్థానంలో ఉన్న నాయకుని వ్యక్తిగత ఇగో భారత్, అమెరికా ద్వైపాక్షిక బంధానికే పెను ముప్పుగా పరిణమిస్తోంది’’అంటూ తాజా నివేదికలో నిర్మొహమాటంగా కడిగిపారేసింది.భారత్ ‘తగ్గేదేలే’!ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో, తక్షణం కాల్పుల విరమణకు ఒప్పుకోకుంటే భారీగా సుంకాలు బాదుతానంటూ బెదిరించి భారత్, పాక్ నడుమ అణుయుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ కొద్ది నెలలుగా పదేపదే గొప్పలకు పోతుండటం, ఆ వ్యాఖ్యలను మోదీ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ద్వంద్వంగా ఖండిస్తూ వస్తుండటం తెలిసిందే. పాక్ పూర్తిగా కాళ్ల బేరానికి వచ్చి, స్వయానా మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి పదేపదే ప్రాధేయపడ్డ కారణంగానే ఆ దేశంతో కా ల్పుల విరమణకు అంగీకరించినట్టు కేంద్రం విస్పష్టంగా ప్రకటించింది కూడా. అలాగే కశ్మీర్ విషయంలో కూడా మధ్యవర్తిత్వానికి ట్రంప్ ఎంతగానో ఉబలాటపడ్డారు. తన సమక్షంలో చర్చలు జరపండంటూ భారత్, పాక్కు పదేపదే బాహాటంగా పిలుపులు కూడా ఇచ్చారు. ఈ విషయంలో మూడో శక్తి ప్రమేయాన్ని ఎన్నటికీ, ఏ విధంగానూ అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అందుకు ఒళ్లు మండి ట్రంప్ సుంకాలు బాదుతున్నా ‘తగ్గేదే లే’దంటోంది.మన ‘సాగు’పైనా గురి!వ్యవసాయ రంగంలో అమెరికా జోక్యానికి మోదీ సర్కారు ససేమిరా అంటుండటం ట్రంప్కు కొరుకుడు పడని మరో విషయమని జెఫ్రీస్ నివేదిక తేల్చింది. భారత వ్యవసాయ, పాడి మార్కెట్లలో పూర్తిస్థాయిలో కాలు పెట్టాలని అగ్ర రాజ్యం చాలాకాలంగా ఉవ్విళ్లూరుతోంది. ఆ ఆకాంక్షలకు కేంద్రం శాశ్వతంగా తలుపులు మూసేసింది. దీనిపై కూడా ట్రంప్ అగ్గి మీద గుగ్గిలంగా ఉన్నట్టు జెఫ్రీస్ వెల్లడించింది. అమెరికాతో భారత్ స్వేచ్ఛా వాణి జ్య చర్చలు మార్చి నుంచీ నానుతుండటం వెనక ఇది కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు కూడా భావిస్తు న్నారు. ‘‘రైతులు, కూలీలు కలిపి భారత్లో 25 కోట్ల మందికి వ్యవసా యమే జీవనాధారం! భారత శ్రామిక శక్తిలో ఇది ఏకంగా దాదాపు 40 శాతం!!’’అని జెఫ్రీస్ నివేదిక చెప్పుకొచ్చింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ వ్యాఖ్యలకు గట్టి సమాధానం!..అంచనాలు మించిన భారత్ జీడీపీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద ప్రతీకార సుంకాలను విధించడం మాత్రమే కాకుండా.. 'ఇండియా డెడ్ ఎకానమీ' అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి భారత్ గట్టి సమాధానం చెప్పింది. 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో జీడీపీ అంచనాలను అధిగమించి 7.8% వృద్ధిని నమోదు చేసింది. దీనిని నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ (NSO) శుక్రవారం విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది.కేంద్ర గణాంకాల విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్ధిక వ్యవస్థ 7.8 శాతంగా నమోదైంది. గత ఐదు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.2026 మొదటి త్రైమాసికంలో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందింది. ఇది జీడీపీ వృద్ధికి దోహదపడింది. అంతే కాకుండా.. మైనింగ్ రంగం, తయారీ, విద్యుత్ రంగాల వృద్ధి కూడా దేశ ఆర్ధిక వ్యవస్థకు బాగా దోహదపడ్డాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో.. భారత్ ముందు వరుసలో ఉంది అనడానికి.. తాజాగా విడుదలైన గణాంకాలే నిదర్శనం. దీన్నిబట్టి చూస్తే భారత్ మరింత వేగంగా వృద్ధి చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.Real #GDP has witnessed 7.8% growth rate in Q1 of FY 2025-26 over the growth rate of 6.5% during Q1 of FY 2024-25.@PMOIndia @Rao_InderjitS @PIB_India @_saurabhgarg@mygovindia @NITIAayog @PibMospi pic.twitter.com/nQw8Iwo9sG— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) August 29, 2025 -
ట్రంప్ ‘నోబెల్’ ఆశలపై నీళ్లు చల్లిన భారత్!!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం చేస్తున్న నిర్విరామ ప్రయత్నాలపై భారత్ నీళ్లు చల్లిందా? ఆ కోపంతోనే భారత్పై అత్యధిక సుంకాలు విధిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలు. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కుట్ర వెలుగులోకి వచ్చింది. ట్రంప్ తన వ్యక్తిగత స్వార్ధం కోసమే భారత్పై టారిఫ్లు విధిస్తున్నారని,ఇందులో దేశ ప్రయోజనాలే లేవంటూ అమెరికా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ ఓ నివేదికను విడుదల చేసింది.ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ల మధ్య ఘర్షణను ఆపేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించారు. అందుకు భారత్ ఒప్పుకోలేదు. ఫలితంగా తనకు దక్కాల్సిన నోబెల్ ఫ్రైజ్ భారత్ వల్లే దూరమైందన్న అక్కుసతో ఈ టారిఫ్లు విధించినట్లు జెఫరీస్ తన నివేదికలో హైలెట్ చేసింది.భారత్పై ట్రంప్కు వ్యక్తిగత కోపం ఉంది. కాబట్టే ప్రపంచంలోనే భారత్పై అత్యధికంగా 50శాతం సుంకాలు విధించినట్లు జెఫరీస్ నివేదిక పేర్కొంది. తద్వారా దీర్ఘకాలంగా అమెరికా-భారత్ల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయనే అభిప్రాయ వ్యక్తం చేసింది. భారత్-పాక్ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేలా మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్ ముందుకు రాగా.. అందుకు భారత్ ఒప్పు కోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ భారత్పై సుంకాలు విధిస్తున్న విషయాన్ని వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ చిన్న ఘర్షణ జరిగినా.. అక్కడ వాలిపోయి పంచాయితీలు చేస్తున్నారు.తనని తాను ప్రపంచానికి శాంతి దూతగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో తన శత్రువు బరాక్ ఒబామా.. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తొమ్మిది నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతి అందుకోగా లేనిది తన విషయంలో ఎందుకు సాధ్యం కాదని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. -
రూపాయిని గట్టి దెబ్బ కొట్టిన టారిఫ్లు.. ఆల్టైమ్ పతనం
భారత కరెన్సీ రూపాయి విలువపై అమెరికా టారిఫ్ల దెబ్బ గట్టిగా తగిలింది. భారత వస్తువులపై అమెరికా సుంకాల పెంపుపై ఇన్వెస్టర్ల ఆందోళనలతో శుక్రవారం డాలర్ తో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో 87.9650కు పడిపోయింది. భారత్ నుంచి వచ్చే వస్తువులపై ఇటీవల 25% సుంకాన్ని విధించిన అమెరికా ప్రభుత్వం ఆ మొత్తాన్ని 50% కు రెట్టింపు చేసింది. ఇది మార్కెట్ ప్రతిస్పందనను తీవ్రంగా ప్రేరేపించింది.టారిఫ్ల పెంపు ప్రభావం డాలర్- రూపాయి మారక విలువ క్షీణత వరకు ఆగిపోలేదు. ఇతర దేశాల కరెన్సీతో ఇండియన్ రూపాయి మారక విలువ పడిపోయింది. ఆఫ్షోర్ చైనీస్ యువాన్తో పోలిస్తే, రూపాయి విలువ మరింత క్షీణించి, 12.3307 ను తాకింది. ఇది వారంలోనే 1.2%, నెలలో 1.6% క్షీణతను సూచిస్తుంది. గత నాలుగు నెలలుగా రూపాయి మారకం విలువ యువాన్ తో పోలిస్తే దాదాపు 6 శాతం క్షీణించింది.డాలర్తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా 87.9650కి పడిపోవడం అమెరికా టారిఫ్ల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. డాలతో రూపాయి మారక విలువ ఏడాది కాలంలో 4.24% పడిపోయింది. అమెరికా విధించిన భారీ టారిఫ్ల వల్ల పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. -
అధ్యక్ష బాధ్యతలకు సిద్ధం: వాన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా భయంకరమైన విషాదం జరిగితే అమెరికా కమాండర్–ఇన్–చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే.. ట్రంప్ తన నాలుగు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసేంత ఆరోగ్యంగా ఉన్నారని ఆయన స్పష్టంచేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ.. జనవరిలో మొదటిసారి ఓవల్ ఆఫీసులో అడుగు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఆ గొప్పతనం, అద్భుతమైన చరిత్ర చూసి ముగ్ధుడినయ్యాను. అది నిజంగా అద్భుతమైన అనుభవం. అది శీతాకాలం. కర్టెన్లు మూసి ఉండటంతో చాలా చీకటిగా కనిపించింది. ప్రపంచ నాయకుడు పనిచేసే ప్రదేశం ఇలాగే ఉండకూడదు. అది కొంచెం వెలుగుతో, ఉత్సాహంగా ఉండాలనుకున్నా. ఆ తరువాత అధ్యక్షుడు చేసిన మార్పులు నాకు చాలా నచ్చాయి. JUST IN—VP JD Vance said he is prepared to step in if “a terrible tragedy” were to befall Trump, while emphasizing that Trump is “in incredibly good health” and brimming with “incredible energy.” Trump is sicker than we thought. pic.twitter.com/fX9uiauvtp— ADAM (@AdameMedia) August 28, 2025 వైట్హౌస్ను పునరుద్ధరించడంలో ట్రంప్ విలక్షణమైన శైలి నాకు బాగా నచ్చింది’ అని ప్రశంసించారు. అనంతరం 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం గురించి ఆందోళనలను ప్రస్తావించగా.. ‘ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయనకు అద్భుతమైన శక్తి ఉంది. ఆయనతో పనిచేస్తున్నవారు చాలామంది ఆయనకంటే చిన్న వయసువాళ్లే. అయినా వారందరికంటే చివరిగా నిద్రపోయేది, మొదటగా నిద్ర లేచేది ట్రంపే. ఆయన మిగిలిన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారన్న నమ్మకం నాకుంది. అమెరికన్ ప్రజలకోసం ఆయన ఇంకా ఎన్నో గొప్ప పనులు చేస్తారు’ అని వాన్స్ వ్యాఖ్యానించారు. పెద్ద విషాదం ఏదైనా జరిగి, అనుకోని పరిస్థితులు ఎదురైతే, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని వాన్స్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్తో జరిగిన సమావేశంలో ట్రంప్ చేతికి పెద్ద గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తాయి. 78 సంవత్సరాల ఏడు నెలల వయసులో ఈ ఏడాది జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో ట్రంప్ అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షుడాయన. అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ 2021లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన వయసు 78 సంవత్సరాల రెండు నెలలు. ఇక, ఈ నెల ప్రారంభంలో ట్రంప్ మాట్లాడుతూ వాన్స్ను తన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమానికి వారసుడిగా చెప్పుకొచ్చారు. కానీ వాన్స్ మాత్రం 2028 అధ్యక్ష ఎన్నికల ప్రణాళికల గురించి ఊహాగానాలను తోసిపుచ్చుతూనే ఉన్నారు. -
విద్యార్థి వీసా నాలుగేళ్లే!
వాషింగ్టన్: అమెరికాలో వీసాల గడువును పరిమితం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. దుర్వినియోగాన్ని తగ్గించడానికి, పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడానికంటూ బుధవారం కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే ఎఫ్–వీసాలు, కల్చరల్ ఎక్ఛ్సేంజ్ కోసం ఇచ్చే జే–వీసాలు, విదేశీ జర్నలిస్టులకు ఇచ్చే ఐ–వీసాలపై కాలపరిమితి విధించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యార్థి వీసాలపై ఎలాంటి కాలపరిమితి లేదు. వాళ్లు చదివే కోర్సు ఎన్ని సంవత్సరాలున్నా అంతకాలం వారు ఆ దేశంలో ఉండే అవకాశం ఉంది. అయితే, కొత్త ప్రతిపాదన ప్రకారం విద్యార్థి, ఎక్ఛ్సేంజ్ వీసాలకు నాలుగేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. ఆ గడువు ముగిశాక పొడిగింపు కోసం దర ఖాస్తు చేసుకోవాలి. ఇక జర్నలిస్టులకు 240 రోజు లు మాత్రమే అనుమతిస్తారు. ఇక చైనీయులకైతే కేవలం 90 రోజుల వీసాకు మాత్రమే అనుమతిస్తారు. గత ఏడాది 16 లక్షల మంది విదేశీ విద్యార్థులు 2024లో ఎఫ్–వీసాలపై దాదాపు 16 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా వచ్చారు. అలాగే, దాదాపు 3,55,000 మంది కల్చరల్ ఎక్ఛ్సేంజ్ సందర్శకులు, 13వేల మంది జర్నలిస్టులు అమెరికాకు వచ్చారు. ‘విదేశీ విద్యార్థులు, ఇతర వీసా హోల్డర్లు అమెరికాలో నిరవధికంగా ఉండటానికి చాలాకాలంగా అనుమతి ఉంది. దీనివల్ల భద్రతా ప్రమాదాలు తలెత్తుతున్నాయి. పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథాగా ఖర్చవుతోంది. అమెరికా పౌరులకు ఇది నష్టాన్ని కలిగిస్తోంది. ఈ ప్రతిపాదిత కొత్త నిబంధనలు వీసా హోల్డర్లు అమెరికాలో ఉండే సమయాన్ని పరిమితం చేస్తాయి. దుర్వినియోగం ఆగిపోతుంది. విదేశీ విద్యార్థులను పర్యవేక్షించడానికి ప్రభుత్వంపై భారం తగ్గుతుంది’ అని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే దీనిపై ప్రజల అభిప్రాయాలకు 30 రోజుల గడువు ఉంటుంది. అప్పట్లో పెద్దఎత్తున వ్యతిరేకత డొనాల్డ్ ట్రంప్ మొదటి పదవీకాలం 2020లో కూడా ఇలాంటి ప్రతిపాదనే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 4,300కి పైగా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ విద్యావేత్తల సమూహమైన ఎన్ఏఎఫ్ఎస్ఏ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. దానిని విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే.. బైడెన్ ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసదారులపై అణచివేత తీవ్రం చేసిన విషయం తెలిసిందే. ఆ చర్యల్లో భాగంగానే ఈ కొత్త ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికే వేలాది మంది విద్యార్థి వీసాలు, గ్రీన్ కార్డులు రద్దయ్యాయి. లక్షలాది మంది వలసదారుల చట్టపరమైన హోదా కోల్పోయారు. -
సుంకాలపై ‘సమష్టి’ పోరు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. మన దేశంపై ఉన్న అదనపు సుంకాల భారాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకాలకూ బుధ వారం నుంచి మరో 25 శాతం చేరింది. క్షణానికో రకంగా, రోజుకో విధంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధహస్తుడైన ట్రంప్ చివరికి ఏం చేస్తారోనన్న ఉత్కంఠ అందరిలో ఉండేది. మూర్ఖత్వం విచక్షణను ఎరుగదు. తన ఆదేశాలను ధిక్క రిస్తూ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయటం వల్లే ఈ చర్య తీసుకున్నట్టు అమెరికా చెప్పుకొంటోంది. మనల్ని మించి ముడిచమురు కొంటున్న చైనాకు ఆ తర్కం ఎందుకు వర్తించదో ఇంతవరకూ అది సంజాయిషీ ఇవ్వలేకపోయింది. అసలు రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి అమెరికాకు తప్ప మరెవరికీ లేదు. ఎందుకంటే తెరవెనకుండి యూరప్ దేశాల ద్వారా ఉక్రెయిన్ను రష్యాపై ఉసిగొల్పిందీ, ఆ యుద్ధానికి అంకు రార్పణ చేసిందీ తానే. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం ద్వారా... లేక ఇక వెనక్కు తగ్గాలని ఉక్రెయిన్ను కోరటం ద్వారా శాంతికి దోహదపడాల్సింది కూడా తానే. కానీ ఆ పని చేయకపోగా ఆ యుద్ధం కొనసాగటానికి మనమే బాధ్యులమంటూ దబాయిస్తోంది. దాన్ని ‘మోదీ యుద్ధం’గా అభివర్ణిస్తూ వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో నోరు పారేసుకున్నారు. మనం చమురు కొనటం వల్లే రష్యా యుద్ధం కొనసాగుతోందని తప్పుడు భాష్యానికి దిగారు. ఏ రకంగా చూసినా ప్రపంచంలో సకల అవలక్షణాలకూ బాధ్యత వహించక తప్పని అమెరికాయే రష్యా– ఉక్రెయిన్ యుద్ధానికి కూడా కర్త, కర్మ, క్రియ. ఏకకాలంలో భిన్న సూచనల్ని పంపి అవతలి పక్షాన్ని గందరగోళపరచటం అమెరికాకు అలవాటైన విద్య. ఈ దబాయింపులకు ముందురోజే ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ‘చివరకు రెండు దేశాలూ ఒక్కటవుతాయి’ అని మాట్లాడారు. అందరికన్నా ముందు ఏప్రిల్లోనే వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలెట్టిన భారత్... మే 1 లేదా జూన్ 1 కల్లా దానిపై సంతకాలు చేయాల్సిందని ఆయన చెబుతున్నారు. చర్చించు కుని ఒప్పందంపై సంతకాలు చేస్తారు తప్ప, తమకు నచ్చినట్టు రాసుకుని, ఒప్పందం పూర్తయినట్టేనని చెబితే అంగీకరించేదెవరు? ఇలాంటివి మాఫియా సామ్రాజ్యాల్లో చెల్లుబాటవుతాయి. నాగరిక ప్రపంచంలో సాధ్యపడదు. భారత్–అమెరికా సంబంధాలు ఆదినుంచీ సంక్లిష్టమైనవే. ఇందుకు అమెరికా తనను తానే నిందించుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాకిస్తాన్కు సాయపడుతూ, మనల్ని చీకాకు పరిచేందుకు నిరంతరం ప్రయత్నించేది. ఆ దశ దాటి ఇరు దేశాల మధ్యా స్నేహం చిగురించి, దృఢమైన బంధంగా మారి దశాబ్దాలు దాటుతోంది. కానీ పాకిస్తాన్ను దువ్వటం ఆపలేదు. ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడల్లా మన దేశం డిమాండ్ చేస్తే తాత్కాలికంగా ఆర్థిక సాయం ఆపటం లేదా ఆయుధ సామగ్రి ఎగుమతి నిలిపినట్టు కనబడటం, ఆ తర్వాత పునరుద్ధరించటం అమెరికా దురలవాటు. మొన్నటికి మొన్న పెహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యపై ఒక్క మాట మాట్లాడటానికి నోరు పెగలని ట్రంప్, భారత్–పాక్ ఘర్షణల్ని ఆపానని స్వోత్కర్షకు పోవటం ఇప్పటికీ ఆపలేదు. సరిగదా పాక్ ఆర్మీ చీఫ్కు ఘన ంగా మర్యాదలు చేశారు. కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సు నుంచి రావాలన్న ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించటం, తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులనూ అనుమతించాలన్న ఒత్తిడికి అంగీకరించకపోవటం ట్రంప్ కడుపుమంటకు కారణం. కానీ ముడిచమురు సాకు చెబుతున్నారు. భారత్లో 46 శాతం మంది సాగు రంగంపై ఆధారపడతారు. అమెరికాలో ఇది ఒక్క శాతమే. ఆ ఒక్కశాతం కోసం దేశ జనాభాలో సగంమంది ఆధారపడే రంగాన్ని ధ్వంసం చేయాలట! ఏమైతేనేం తాజా సుంకాల భారం మన దేశంనుంచి పోయే 66 శాతం ఎగుమతులపై తీవ్ర ప్రభావమే చూపగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందువల్ల ఈ ఏడాది, వచ్చే ఏడాది మన వృద్ధిపై 0.8 శాతం కోత పడవచ్చంటున్నారు. రత్నాభర ణాలు, దుస్తులు, వాహనాల విడిభాగాలు, స్టీల్, రొయ్యలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనీ, ఈ రంగాల్లో అనిశ్చితి ఏర్పడుతుందనీ అంచనా. లక్షలాదిమంది కార్మికుల ఉద్యోగాలకు ముప్పు కలగవచ్చు కూడా. ఈ ఎగుమతుల్ని వేరే దేశాలకు మళ్లించగలిగితే నష్టాన్ని తగ్గించుకోగలం. అదృష్టవశాత్తూ మనది ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు. అందుకే దేశ ప్రజానీకమంతా ఒక్కటై పట్టుదలగా ఇక్కడి ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తే ఈ గండాన్ని గట్టెక్కడం కష్టం కాదు. -
భారత్కు పరీక్షా సమయం
భారత ప్రభుత్వం పలు దేశాలతో సంబంధాల అభివృద్ధికి శీఘ్రగతిన చేస్తున్న ప్రయత్నాలు, చూపుతున్న స్వతంత్ర ధోరణి అమెరికాతో తలెత్తిన సమస్యల వల్ల తాత్కాలికమా? లేక దీర్ఘ కాలంలో ‘బ్రిక్స్’ వేదికగా బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థే సరైన ప్రత్యామ్నాయమనే గుర్తింపు మౌలికమైన రీతిలో కలిగి నందువలనా? ఈ కీలకమైన ప్రశ్నపై స్పష్టత అవసరం. ఎన్నెన్ని లోపాలు ఉన్నా వర్ధమాన ప్రపంచంలోని అగ్ర దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచం ఆర్థికంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా కూడా ఒక చౌరస్తా వంటి పరిస్థితిలోకి వచ్చి చేరింది. ప్రపంచాన్ని అన్ని విధాలుగా కొన్ని శతాబ్దాల పాటు శాసించిన పాశ్చాత్య దేశాలు బలహీనపడు తుండటం ఒకవైపు కనిపిస్తున్నది. నెమ్మదిగా బలపడుతూ, స్వతంత్ర ధోరణిలో ముందుకు పోజూస్తున్న వర్ధమాన దేశాల ధోరణి మరో వైపు ఆవిష్కృతమవుతున్నది. అటువంటపుడు భారతదేశం ఎక్కడ నిలిచి ఏ పాత్ర వహించగలదన్నది చరిత్రాత్మక నిర్ణయం కానున్నది.తాత్కాలికమా? దీర్ఘ కాలికమా?భారతదేశం వివిధ కారణాల వల్ల గత పాతిక సంవత్సరాలుగా అమెరికన్ శిబిరానికి సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఇటీవలి కాలంలో బలహీనపడుతున్న అమెరికాకు తన పట్ల, ప్రపంచం పట్ల దృష్టి మారి గతం కన్నా భిన్నమైన విధానాలను రూపొందించుకుంటున్నది. ఈ కొత్త పరిస్థితి భారతదేశానికి ఒక పరీక్షగా మారిందన్నది గుర్తించవలసిన విషయం. అమెరికా విధానాలలోని మార్పుల వల్ల వాణిజ్య సుంకాల రూపంలో, వాణిజ్య ఒప్పందపు చర్చల రూపంలో, ఇతరత్రా కూడా ఎదురవుతున్న ఆర్థిక రంగ సమస్యలు కనిపిస్తున్నవే! ఇవి గాక, ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ప్రభావాలు భారతదేశంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండ బోతున్నాయి. ఉదాహరణకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), ఐసీజే, ఐసీసీ, యూఎన్ఓ, డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్ మొదలైన సంస్థలను బలహీనపరచటమో, వాటి నుంచి ఉపసంహరించుకోవ టమో అమెరికాకు నిత్యకృత్యంగా మారింది. అటువంటపుడు ప్రభుత్వం అమెరికాతో ఏర్పడిన సమస్యలు తాత్కాలికమని, క్రమంగా వెనుకటి స్థితి ఏర్పడగలదనే అవగాహ నతో ముందుకు పోతుందా అన్నది ఒక ప్రశ్న. దీని అర్థం అమెరికాతో మైత్రికి బదులు వైరం ఏర్పడాలని ఎంతమాత్రమూ కాదు. కానీ, తగిన స్పృహ, జాగ్రత్తలు లేని మైత్రికీ, అవి ఉండే మైత్రికీ తేడా ఉంటుంది. అదే సమయంలో రెండు దేశాల మధ్య ఇటీవల తలెత్తిన సమస్యలు పరిష్కారం కావటం అవసరం. అందువల్ల కలిగే మేలు చాలానే ఉంటుంది. అందులో వ్యూహాత్మకమైనవి, దేశ రక్షణకు సంబంధించినవి కూడా ఉంటాయి. అయితే, స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రయోజనాల కోసం అమె రికా వైపు చూడవలసి రావటం ఎంత అవసరమో, దీర్ఘకాలిక దృష్టితో ‘బ్రిక్స్’ వంటి ప్రత్యామ్నాయాలు, బహుళ ధ్రువ ప్రపంచా లను లక్ష్యంగా పెట్టుకోవటం కూడా అంతే అవసరం. ఏక కాలంలో ఈ రెండింటితో ఎట్లా వ్యవహరిస్తారన్నది దౌత్యనీతిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి అటువంటి సంతులనం అవసరమని జైశంకర్ విదేశాంగ మంత్రి అయిన కొత్తలోనే ‘ది ఇండియా వే’ పుస్తకంలో సూచించారు. కానీ, అప్పటికన్నా పాశ్చాత్య ప్రపంచపు బలహీనతలు పెరిగాయి. ముఖ్యంగా ట్రంప్ విధానాలతో పరి స్థితులు గణనీయంగా మారుతున్నాయి. అందువల్ల, ప్రత్యామ్నా యాల వైపు లోగడకన్నా మరింత ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఏర్పడుతున్నది. బ్రిక్స్ కరెన్సీ అనకుండానే...పోతే, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కొన్నింటిని చూద్దాము. అవి – ట్రంప్ సుంకాలు, జిన్పింగ్తో జైశంకర్ సమా వేశం, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి రావడం, ఈ నెలాఖరున బీజింగ్లో జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ శిఖరాగ్ర సమావేశానికి మోదీ వెళ్లనున్నట్లు ప్రకటన, ట్యారిఫ్లకు జంకబోమంటూ దేశ స్వావలంబనకు పిలుపునిచ్చి జీఎస్టీ స్లాబ్లను నాలుగు నుంచి రెండింటికి ప్రభుత్వం తగ్గించటం వంటివి. ఇవన్నీ జాబితా వలె రాసుకోవటం ఎందుకంటే, ఈ పరిణామాలు కొద్ది కాలంలోనే అమెరికా చర్యలకు స్పందనగా జరిగినటువంటివి. వాటన్నిటికి తగు ప్రాముఖ్యం ఉంది.వీటిమధ్య చాలా ముఖ్యమైనది ఒకటి జరిగింది. అది – అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి మారకపు చెల్లింపులకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సడలించటం. ప్రైవేట్ కంపెనీలు ఇతర దేశాలతో జరిపే లావాదేవీలలో రూపాయి కరెన్సీ వినియో గానికి ప్రత్యేకంగా వోస్ట్రో అకౌంట్లు తెరవాలి. అందుకు స్థానిక బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి అవసరమయేది. ఆ నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఇపుడు ఎత్తివేసింది. అందువల్ల వాణిజ్యం సులభతరం అవుతుందనేది సరేసరి. కానీ, అంతకుమించిన విశేషం ఉంది. ఇంతకుముందు వలె డాలర్పై ఆధారపడనక్కర లేక పోవటం! డాలర్కు బదులు ‘బ్రిక్స్’ దేశాలు పరస్పరం గానీ, ఇతర దేశాలతో గానీ తమ సొంత కరెన్సీలలో చెల్లింపులు చేసుకోవాలని, ఆ విధంగా డాలర్ బలహీన పడుతుందన్నది ఆ సంస్థ తీర్మానం. డాలర్కు ప్రత్యామ్నాయంగా ‘బ్రిక్స్’ కరెన్సీ అనకుండానే వారు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇండియా కూడా అటువంటి చెల్లింపులు కొన్ని చేస్తున్నా, డాలర్కు తాము వ్యతిరేకం కాదంటూ వచ్చింది. ధోరణి ఇదే విధంగా కొనసాగితే, కొందరు విమర్శకులు ఎత్తి చూపుతున్నట్లు బ్రెజిల్, చైనాల వలె భారత్ కూడా అమెరికాపై ఎదురు సుంకాలు విధించటం, డబ్ల్యూటీఓకు ఫిర్యాదు చేయటం వంటి చర్యలు తీసుకోగలదేమో చూడవలసి ఉంటుంది.వచ్చే సంవత్సరం ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకో నుంది. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం 2026లో ఢిల్లీలో జరిగి, ఆ సంస్థకు భారతదేశం అధ్యక్షత వహించనుంది. అందువల్ల ఈ దేశంపై ఎటువంటి బాధ్యతలు ఏర్పడతాయో ఊహించవచ్చు. ఇప్పటికే ఒక కొత్త ధోరణిలో ముందుకు వెళ్లవలసి వస్తున్న భారత ప్రభుత్వం ఆ మార్పును స్వల్పకాలికానికి పరిమితం చేయగలదా, లేక దీర్ఘకాలికం, మౌలికం చేయవచ్చునా అన్నది పెద్ద ప్రశ్న అవు తున్నది. ఈ పరిణామాలకు కొసమెరుపు 23వ తేదీ నాటి జైశంకర్ వ్యాఖ్యలు. తన జీవితంలో ట్రంప్ వంటి అధ్యక్షుడిని చూడలేదని, ఇండియా ఉత్పత్తులను వారికి కావాలంటే కొనవచ్చు, లేదా మాన వచ్చునని, మాకు వేరే మార్కెట్లు ఉన్నాయని అన్నారాయన. ఆత్మ విశ్వాసం కలిగి స్వతంత్రంగా వ్యవహరిస్తే ఇట్లాగే ఉంటుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
జిన్పింగ్..ముర్ము..మోదీ !
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ల కొరడా ఝళిపిస్తున్న వేళ ఓ లేఖ భారత్–చైనాల సంబంధాలను మలుపుతిప్పింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఓ లేఖ రాశారు. భారత్తో సంబంధాలను మెరుగుపర్చుకోవాలనే ఆకాంక్షను ఆయన అందులో వ్యక్తం చేశారు. లేఖను రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి అందజేశారు. భారత్కు చెందిన ఓ ఉన్నతాధికారి తమకు ఈ విషయం తెలిపినట్లు బ్లూమ్బర్గ్ తాజా కథనంలో పేర్కొంది. అమెరికాతో కుదుర్చుకున్న ఎలాంటి ఒప్పందమైనా అది అంతిమంగా చైనా ప్రయోజనాలకు హానికల్గిస్తుందని జిన్పింగ్ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. ద్రౌపదీ ముర్ముకు మార్చిలో జిన్పింగ్ ఒక లేఖ రాసినట్లు రెండు దేశాల మీడియాల్లోనూ వచి్చంది. అయితే, ఆ లేఖ ఇదేనా అనే విషయం స్పష్టం కాలేదు. అనంతర పరిణామాల్లో రెండు దేశాలు తమ మధ్య సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు పలు చర్యలను ప్రకటించాయి. కైలాస్–మానస సరోవర్ యాత్ర మార్గాన్ని భారత తీర్థయాత్రికుల కోసం చైనా తెరవగా చైనా పర్యాటకుల కోసం భారత్ వీసాల జారీని ప్రారంభించింది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సేవలు సైతం మొదలయ్యాయి. మార్చిలో జిన్పింగ్ రాసిన లేఖ తర్వాత, ట్రంప్ టారిఫ్ల బాదుడు మొదలుకాక మునుపే భారత్, చైనాల మధ్య దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులు మొదలైనట్లు బ్లూమ్బర్గ్ కథనం విశ్లేషించింది. మరోవైపు, ట్రంప్ టారిఫ్ల విధానం అమెరికా–భారత్ మధ్య అంతరాన్ని పెంచింది. దీనికితోడు భారత్, పాకిస్తాన్ల మధ్య జరగాల్సిన అణుయుద్ధం తన జోక్యంతోనే ఆగిందంటూ ట్రంప్ పదేపదే చెప్పుకోవడాన్ని భారత్కు అస్సలు రుచించలేదు. అప్పటి వరకు చైనాకు దగ్గరయ్యే విషయాన్ని అంత సీరియస్గా ఆలోచించని భారత్ జూన్ తర్వాతే చైనాతో సంబంధాల మెరుగుపై దృష్టిపెట్టిందని బ్లూమ్బర్గ్ కథనం విశ్లేషించింది. గతేడాది లద్దాఖ్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సైన్యాలను పాక్షికంగా ఉపసంహరించుకోవాలని రెండు దేశాలు అంగీకారానికి రావడం కూడా చైనాపై సానుకూలంగా ఆలోచించేందుకు దారి చూపిందని తెలిపింది. ఇదే త్వరలో చైనాలో జరిగే ఎస్సీవో శిఖరాగ్రం సందర్భంగా జిన్పింగ్, మోదీల ముఖాముఖీకి మార్గ సుగమం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ కంటే ముందుగా చైనాపైనే ట్రంప్ 145 శాతం టారిఫ్లను ప్రకటించారు. అయితే, ఆ దేశంతో అమెరికా వైఖరి మరోలా ఉంది. టారిఫ్లకు తాత్కాలిక విరామం ప్రకటించిన అమెరికా ప్రస్తుతం ఆ దేశంతో వాణిజ్య చర్చలు జరుపుతోంది. కీలక ఖనిజాల సరఫరా వంటివి చైనా చేతుల్లో ఉండటంతో ట్రంప్ ఆ దేశంతో జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. -
ఉక్రెయిన్ పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా
-
మిన్నియాపాలిస్ ఘటన: భారత్, ట్రంప్ పేర్లు రాసుకుని..
మిన్నియాపాలిస్ ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాల్పుల తర్వాత రాబిన్ వెస్ట్మన్ (Robin Westman) తనంతట తాను కాల్చుకుని చనిపోయాడు. ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడు అనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే అతని గురించి విచారించిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం మిన్నసోటా స్టేట్ మిన్నియాపాలిస్ నగరంలోని ఓ స్కూల్ వద్ద ప్రార్థనల్లో పాల్గొంటున్న విద్యార్థులపై దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల కోసం రైఫిల్, షాట్గన్, పిస్టల్.. ఉపయోగించాడు. ఆ వెంటనే తనను తాను కాల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 8, 10 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 14 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే.. దుండగుడి ఆయుధాలపై 'న్యూక్ ఇండియా', ‘కిల్ ట్రంప్’ లాంటి భయానక సందేశాలు రాసి ఉన్నాయి.రాబిన్ వెస్ట్మన్.. 2020లో రాబర్ట్ నుండి రాబిన్గా పేరు మార్చుకుని మహిళగా గుర్తింపు పొందినట్లు లీగల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్.. నిందితుడు పురుషుడేనని ధృవీకరించారు. కానీ దర్యాప్తు అధికారులు మాత్రం ట్రాన్స్జెండర్గానే విచారణను కొనసాగిస్తున్నారు. ఇక కాల్పులకు ముందు రాబిన్ డబ్ల్యూ అనే యూట్యూబ్ ఛానెల్లో రెండు వీడియోలు పోస్ట్ చేశారు. అందులో ఆయుధాలు, మ్యాగజైన్లు కనిపించాయి. వాటిపై.. కిల్ డొనాల్డ్ ట్రంప్ నౌ Kill Donald Trump Now, న్యూక్(న్యూక్లియర్ వార్) ఇండియాNuke India, ఇజ్రాయెల్ మస్ట్ ఫాల్Israel must fall, బర్న్ ఇజ్రాయెల్Burn Israel, వేర్ ఈజ్ గాడ్Where is your God?, ఫర్ ది చిల్ట్రన్ For the children అని రాసి ఉంది. అంతేకాదు.. గతంలో కాల్పుల ఘటనలకు పాల్పడిన పలువురు దుండగుల పేర్లు కూడా రాసుకుని చూపించాడు. వాటితో పాటు సిరిలిక్ Cyrillic(రష్యా, బల్గేరియా, సెర్బియా, ఉక్రెయిన్, కజకస్తాన్, కిర్గిజ్ వంటి దేశాల్లో అధికారిక లిపి)లో రాసిన సందేశాలు కనిపించాయి. ఒక వీడియోలో.. ఇది నా కోసం. అవసరమైతే ఉపయోగిస్తాను అని రాబర్ట్ చెబుతున్న దృశ్యం ఉండగా.. మరో దాంట్లో రెండు జర్నల్స్ కనిపిచాయి. అవి కూడా సిరిలిక్ లిపిలోనే ఉన్నాయి. యూట్యూబ్ నుంచి ఆ వీడియోలను డిలీట్ చేయించిన అధికారులు.. ఈ సందేశాలను ఎందుకు రాసుకున్నాడనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కాల్పుల ఘటనను విద్వేషపూరిత దాడిగా ఎఫ్బీఐ భావిస్తోంది. కేథలిక్స్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడమే అతని ధ్యేయంగా కనిపిస్తోందని, దీనిని దేశీయ ఉగ్రవాదంగా పరిగణిస్తూ దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఎలాంటి నేర చరిత్ర లేని వెస్ట్మన్.. అధికారికంగానే తుపాకులను కొనుగోలు చేసినట్లు తేలింది. అతని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.యూఎస్ హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్ట్రీ నోయెమ్ ఘటనపై స్పందించారు. ఈ స్థాయి హింస ఊహించలేనిది. ఆయుధాలపై అతను రాసిన రాతలను బట్టి మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నాడని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన అమెరికాలో స్కూల్ భద్రతపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోందని.. దుండగుడి మానసిక స్థితి, ఆన్లైన్ ప్రేరణలు, ఆయుధాల కొనుగోలు వంటి అంశాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. మిన్నియాపాలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఒహరా స్పందిస్తూ.. ఇది అమాయక పిల్లలపై ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి.. అమానుషం అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల పట్ల గౌరవ సూచికంగా జాతీయ జెండాను సగం ఎగరేయాలని ఆదేశించారు. ఇక.. తాజా ఘటన ఈ ఏడాది విద్యాసంస్థలపై జరిగిన 146వ స్కూల్ కాల్పుల ఘటన కావడం గమనార్హం. -
పుతిన్ కాదు.. ఇది ‘మోదీ యుద్ధం’.. భారత్పై అమెరికా అక్కసు
వాషింగ్టన్: భారత్ను టార్గెట్ చేసిన అమెరికా మరోసారి మన దేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారత్ ప్రధాన కారణం అంటూ వైట్హౌస్ సలహాదారు పీటర్ నవారో సంచలన ఆరోపణలు గుప్పించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ‘మోదీ యుద్ధం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో అమెరికా సుంకాల నుంచి భారత్ తప్పించుకోవాలంటే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం వెంటనే ఆపేయాలని సూచనలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.వైట్హౌస్ సలహాదారు పీటర్ నవారో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు భారత్ ప్రధాన కారణం. రష్యా నుంచి రాయితీపై భారత్ ముడిచమురు కొనుగోలు చేయడంతో యుద్ధంలో పుతిన్ దూకుడుగా వ్యవహరించారు. భారత్ అలా కొనుగోలు చేయకపోతే యుద్ధం ఇంత కాలం కొనసాగేది కాదు. ఇది మోదీ యుద్ధం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేయాలి. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్యలకు భారత్ కూడా సహకరించాలి. మోదీ తీరు విచిత్రంగా ఉంది. రష్యా విషయంలో మోదీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. Trump Adviser Peter Navarro: Everyone in America loses because of India buys oil from Russia. US taxpayers have to send money for Modi’s war in UkraineAnchor (confused): You mean Putin’s war? Navarro: No I mean Modi’s war! pic.twitter.com/HVE8EO7W8g— Shashank Mattoo (@MattooShashank) August 28, 2025ఇరుదేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే.. భారత్ కూడా అందుకు సహకరించాల్సి ఉంటుంది. భారత్ చర్యల వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును నిలిపివేస్తే.. 25 శాతం సుంకాలను పునరుద్ధరిస్తారా? అని ప్రశ్నించగా.. భారత్ ఆ దిశగా చర్యలు తీసుకున్న తర్వాతి రోజు నుంచే 25శాతం సుంకాలు అమలుచేస్తామని స్పష్టంచేశారు.అంతకుముందు కూడా నవారో భారత్పై సంచలన కామెంట్స్ చేశారు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొంటూ భారత్ ‘లాభదాయకమైన పథకం’ నడుపుతోందని ఆరోపించారు. భారత్ను సుంకాల ‘మహారాజు’గా అభివర్ణించారు. భారత్తో అమెరికా వ్యాపారం వల్ల అమెరికన్లపై పడే నికర ప్రభావం ఏంటి?. అమెరికా వ్యాపారాన్ని, అమెరికన్ కార్మికులను ఇది దెబ్బతీస్తుంది. అమెరికా నుంచి పొందుతున్న డబ్బును రష్యన్ చమురు కొనుగోలుకు ఉపయోగిస్తున్నారు. ఆ డబ్బును రష్యా ఆయుధాల తయారీకి వాడి ఉక్రేనియన్లను చంపుతోంది. జరుగుతున్న రక్తపాతంలో తన పాత్రను గుర్తించడానికి భారత్ ఇష్టపడటం లేదు. ప్రస్తుతం భారత్ చేస్తున్నది శాంతిని కోరుకునేలా లేదని, యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. -
ట్రంప్ బిగ్ ఆఫర్.. చైనాకు కొత్త టెన్షన్!
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించారు. దాదాపు ఆరు లక్షల మంది చైనా విద్యార్థులను తమ యూనివర్సిటీల్లో చేర్చుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో, భారీ సంఖ్యలో చైనా విద్యార్థులు.. అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చైనా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ విద్యార్థులపై వేధింపులు మాత్రం ఆపాలని విజ్ఞప్తి చేసింది.కాగా, అక్రమ వలసలు, విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్.. చైనా విద్యార్థుల విషయంలో మాత్రం సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఆరు లక్షల మంది చైనా విద్యార్థులను తమ యూనివర్సిటీల్లో చేర్చుకుంటామని ప్రకటించడంపై చైనా స్పందించింది. ఈ సందర్బంగా చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ..‘అమెరికాలో చదువుకునేందుకు చైనా విద్యార్థులకు ఆహ్వానిస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చైనా విద్యార్థులను వేధించడం, ప్రశ్నించడం, నిరాధార ఆరోపణలతో స్వదేశానికి పంపించడం వంటి చర్యలను ఆపాలి. తద్వారా వారి చట్టబద్ధమైన హక్కులను రక్షించాలి’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. వీసాలు, గ్రీన్కార్డులు, విదేశీ విద్యార్థుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. భారత్ సహా ఇతర దేశాల విద్యార్థుల వీసాల ప్రక్రియను కఠినతరం చేశారు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు. మరోవైపు.. హెచ్-1బీ వీసాలు, గ్రీన్కార్డుల విషయంలో కూడా కొత్త నిబంధనలను తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు. -
‘ట్రంప్ ఫోన్.. ఆపరేషన్ సిందూర్ను ఆపిన ప్రధాని మోదీ’
పాట్నా: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే అణచివేశానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తన చొరవ లేకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదం ఉండేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. ఆయన ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఆపరేషన్ సిందూర్ను నిలిపివేయాలని సూచించారని, కాబట్టే ఆపరేషన్ సిందూర్ ఆగిందని ఆరోపించారు.బీహార్ ముజాఫర్పూర్లో కాంగ్రెస్ ఓటర్ అధికార్ యాత్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. వినండి.. మీరు ఏమి చేస్తున్నారో..అది 24 గంటల్లోపు ఆపండి’అని అన్నారు. అందుకు మోదీ ఆపరేషన్ సిందూర్ను ఐదుగంటల్లోనే ఆపేశారంటూ విమర్శలు గుప్పించారు. కాగా,బీహార్లో కాంగ్రెస్ తలపెట్టిన ఓటర్ అధికార్ యాత్ర కొనసాగుతోంది. బీహార్లో 1,300 కిలోమీటర్ల మేర సాగనుంది. 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తూ సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది. #WATCH | Muzaffarpur, Bihar | Addressing during the 'Voter Adhikar Yatra', Lok Sabha LoP Rahul Gandhi says, "Trump said today that when the war between India and Pakistan was going on, I picked up the phone and told Narendra Modi and told him to stop whatever he was doing within… pic.twitter.com/ap4ih0Ruqt— ANI (@ANI) August 27, 2025 -
అమెరికా సుంకాలకు ఇండియన్ యూనివర్సిటీ ఝలక్
అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలపై నిరసనగా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) తన క్యాంపస్లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవు.ఈ నిర్ణయాన్ని విశ్వవిద్యాలయ ఛాన్సలర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్ ప్రకటించారు. “భారతదేశం అమెరికా ఆర్ధిక బలాయింపు ముందు తలవంచదు. ఇది స్వదేశీ 2.0 ఉద్యమం,” అని ఆయన పేర్కొన్నారు.నిషేధానికి కారణంఅమెరికా ఇటీవల భారత దిగుమతులపై సుంకాలను 50%కి పెంచింది. భారతీయ ఉత్పత్తులపై ఈ చర్యను “ఆర్ధిక దౌర్జన్యం”గా అభివర్ణిస్తూ, మిట్టల్ ఈ నిషేధాన్ని ప్రతిస్పందనగా ప్రకటించారు. “అమెరికా కంపెనీలు భారత మార్కెట్ నుండి సంవత్సరానికి రూ.6.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాయి. ఇది ఒకవైపు లాభాలు, మరోవైపు ఆంక్షలు” అని ఆయన ఓ బహిరంగ లేఖలో అమెరికా అధ్యక్షుడికి రాశారు.ఆందోళలో వ్యాపార వర్గాలుయూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో స్వదేశీ2.0 ( #Swadeshi2.0 ) అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ చర్య పంజాబ్లోని విద్యా సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యాపార వర్గాలు, ముఖ్యంగా బాటిల్డ్ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లు, ఈ నిషేధాన్ని ఆందోళనతో చూస్తున్నారు.If the US goes ahead and imposes 50% tariffs on Indian exports, Lovely Professional University will not sit quietly.Let me remind the US once again - we will ban all American soft drinks on campus, if the US doesn’t withdraw the unfair tariffs by 27th August.I urge every… pic.twitter.com/PhBsVNSJHe— Ashok Kumar Mittal (@DrAshokKMittal) August 24, 2025 -
భారత్పై టారిఫ్ల ఎఫెక్ట్: కంపెనీల దివాళా, లక్షల ఉద్యోగాలు ఉష్కాకి!!
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధింపులపై ప్రముఖ భారత మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా హెచ్చరికలు జారీ చేశారు. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త టారిఫ్లతో సంస్థలు దివాళా తీయడం, వాటిల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయేందుకు దారితీయనుందని అన్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా 50శాతం విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తాజా పరిణామాలపై మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా స్పందించారు.అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారత్ 50శాతం టారిఫ్ చెల్లిస్తోంది. వీటివల్ల భారత్పై కొంతకాలం ప్రతికూల ప్రభావం పడుంది. పలు సంస్థలు దివాళా తీయోచ్చు. షార్ట్ టర్మ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే అంచనా వేశారు.అదనపు టారిఫ్ కారణంగా భారత్ ఉత్పత్తి రంగంపై 30 నుంచి 40 బిలియన్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అజయ్ బగ్గా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ఫలితంగా సమీప భవిష్యత్తులో భారతదేశ జీడీపీ 0.5 శాతం నుంచి 1శాతం వరకు తగ్గుతుంది. రూ.5.25 లక్షల కోట్లు నష్టం వాటిల్లనుంది. అలా అని పరిస్థితులు ఇలాగే స్థిరంగా ఉంటాయా? అని ప్రశ్నిస్తే.. లేదనే సమాధానం చెబుతున్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఆగస్టు 7న నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించింది. నేటి నుంచి మరో 25శాతం అదనపు సుంకాలు.. మొత్తంగా 50శాతం అదనపు సుంకాలు చెల్లిస్తూ భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్ను చెల్లిస్తున్న దేశాల జాబితాలో చేరినట్లైంది.ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం కొనసాగేందుకు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లే కారణమని ట్రంప్ ఆరోపించారు. ఆ కొనుగోళ్లను ఆపకపోతే భారత్ ఎగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికల్ని భారత్ భేఖాతరు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత్ నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు టారిఫ్ చెల్లించాలని ప్రకటించారు. దీంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు నేటినుంచి అమల్లోకి వచ్చాయి. ఆ దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి భారత్ ఎగుమతులపై 50శాతం భారం పడుతోంది. -
ఫోన్ చేసి బెదిరించా.. మోదీ యుద్ధం ఆపేశారు: ట్రంప్
భారత్ ఎంత ఖండిస్తున్నా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మారడం లేదు. భారత్-పాక్ ఘర్షణలను తానే ఆపానంటూ మరోసారి మీడియా ముఖంగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తానే స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారాయన. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం వైట్హౌస్లో కేబినెట్ సమావేశం జరిగింది. మీడియా బ్రీఫింగ్లో ఆయన ఈ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన రోజు జరిగిన పరిణామాలంటూ స్పందించారు. ‘‘ఆ రోజు ఓ కఠినమైన వ్యక్తి.. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. పాకిస్థాన్తో మీకు ఏం జరుగుతోందని ప్రశ్నించాను. ఆ తర్వాత పాక్తోనూ చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పుఉందని భావించా. అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్, పాక్తో వాణిజ్యఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ టారిఫ్లతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పా. నేను మరుసటిరోజు దాకా సమయం ఇస్తే.. ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది’’ అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.US President #DonaldTrump once again doubles down on his claim of playing a catalyst in the truce between India and Pakistan.I am talking to a very terrific man, Prime Minister of India, Narendra Modi. I said, What's going on with you and Pakistan?, says Trump.For the latest… pic.twitter.com/8eQ86ZU0ql— NDTV Profit (@NDTVProfitIndia) August 27, 2025భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ గత కొంతకాలంగా ట్రంప్ చెబుతూనే ఉన్నారు. ఈ ప్రకటనలో విపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ వాదనను భారత్ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాకిస్థాన్ మధ్య మిలిటరీ స్థాయి చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ స్పష్టం చేసింది. అలాగే.. మోదీ–ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఇక..ఆ మధ్య జీ7 సదస్సు నిమిత్తం కెనడా వెళ్లిన ప్రధాని మోదీ దీనిపై స్పందిస్తూ.. భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ‘‘పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్యఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశం పైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్-పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోం’’ అని నాడు అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టం చేశారు. అయినా కూడా ట్రంప్, అమెరికా అదే పాట పాడుతూ వస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ ఫోన్ కాల్స్కు మోదీ నో -
అమెరికా వీసా, గ్రీన్కార్డులపై కొత్త రూల్స్.. ట్రంప్ బిగ్ షాక్!
వాష్టింగన్: వీసాలు, గ్రీన్ కార్డ్ విషయంలో అమెరికా మరో బాంబు పేల్చింది. అమెరికాలో హెచ్-1బీ(H-1B) వీసా, గ్రీన్ కార్డ్ రూల్స్ మొత్తం మార్చబోతున్నట్టు యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత గ్రీన్ కార్డ్ వ్యవస్థ పెద్ద కుంభకోణంగా మారిపోయిందని ఆరోపించారు. దీంతో, ఇకపై అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఊహించిన షాక్ తగిలింది.అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో హెచ్-1బీ(H-1B) వీసా, గ్రీన్ కార్డ్ అమలు విషయంలో కొత్త రూల్స్ తీసుకువస్తున్నాం. ప్రస్తుత లాటరీ పద్ధతిని రద్దు చేయబోతున్నాం. కేవలం నైపుణ్యం, వేతనం ఆధారంగా వీసాలు జారీ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుత H-1B వీసా వ్యవస్థ విదేశీ కార్మికులను అమెరికన్ ఉద్యోగ అవకాశాలను భర్తీ చేయడానికి అనుమతించే ఒక స్కాంగా మారిపోయింది. అమెరికన్ కార్మికులను నియమించడమే మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. గ్రీన్ కార్డ్ను సైతం మార్చబోతున్నాం. ప్రస్తుత గ్రీన్ కార్డ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి.The current H1B visa system is a scam that lets foreign workers fill American job opportunities. Hiring American workers should be the priority of all great American businesses. Now is the time to hire American. pic.twitter.com/l27HEhF7C3— Howard Lutnick (@howardlutnick) August 26, 2025ప్రస్తుతం ఉన్న లాటరీ వ్యవస్థ ద్వారా అర్హత లేని, తక్కువ వేతనం పొందే వ్యక్తులకు కూడా గ్రీన్ కార్డ్ లభిస్తోందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. సగటు అమెరికన్ వార్షిక ఆదాయం $75,000 ఉండగా, గ్రీన్ కార్డ్ హోల్డర్ సగటు వార్షిక ఆదాయం $66,000 మాత్రమే ఉంది. ఇది తక్కువ సంపాదన ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడమే అవుతుంది అంటూ లాజిక్ చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, తాము ఈ కొత్త సంస్కరణలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లాలనుకునే వారిపై కొత్త విధానం ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మార్పులు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.🚨 BREAKING: Howard Lutnick reveals he will now seek to have the United States federal government OWN a portion of the patents currently owned by universities as a result of new inventions."If we give them the money, don't you think it's fair the USA and taxpayers who funded it… pic.twitter.com/uFKGdj5rV1— Eric Daugherty (@EricLDaugh) August 26, 2025ఇదిలా ఉండగా.. ఈ కొత్త విధానంలో H-1B వీసాలను ఎక్కువ జీతాలు ఉన్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. దీంతోపాటు, ట్రంప్ ప్రభుత్వం 'గోల్డ్ కార్డ్' అనే కొత్త వీసా ప్లాన్ కూడా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికాలో $5 మిలియన్లు పెట్టుబడి పెట్టే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పిస్తారు. ఈ కార్డ్కు అప్లై చూసుకోడానికి దాదాపు 2,50,000 మంది దరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నారని, దీని వల్ల $1.25 ట్రిలియన్ల పెట్టుబడులు వస్తాయని లుట్నిక్ తెలిపారు. -
చైనాకు ట్రంప్ బంపరాఫర్
వాషింగ్టన్: అమెరికా, చైనా మధ్య కీలకమైన సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పేర్కొన్నారు. ఆరు లక్షల మంది చైనా విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. వారికోసం అమెరికా యూనివర్సిటీల తలుపులు తెరిచి ఉంచామని వెల్లడించారు. చైనా విద్యార్థులు తమ దేశంలో నిక్షేపంగా ఉన్నత చదువులు చదువుకోవచ్చని సూచించారు.వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చైనాలోని అరుదైన ఖనిజాలు అమెరికాకు సులువుగా లభించేలా చూడాల్సిన బాధ్యత జిన్పింగ్ ప్రభుత్వంపై ఉందన్నారు. లేకపోతే చైనా ఉత్పత్తులపై 200 శాతం టారిఫ్లు విధించడానికైనా వెనుకాడబోమని హెచ్చరంచారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతల కారణంగా చైనా విద్యార్థులు నష్టపోవడం తమకు సమ్మతం కాదన్నారు. వారిపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త వహిస్తామన్నారు. మరోవైపు చైనా విద్యార్థులకు ట్రంప్ ఆహ్వానం పటకడం పట్ల మాగా(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Trump claims we’re going to let 600k Chinese students in and that China has paid a lot in tariffs. No, they actually haven’t. Guess how much CHINA has paid in tariffs. Just guess. This guy conned so many of you idiot MAGA loyalists and now you’re going to jump through hoops… pic.twitter.com/JAX9l8czSO— JohnBurk (@johnburk39) August 25, 2025 -
అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై మరో 25 శాతం టారిఫ్లు నేటి నుంచే అమల్లోకి..
-
ఫెడరల్ రిజర్వు గవర్నర్కు ట్రంప్ ఉద్వాసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వు గవర్నర్ లిసా కుక్ను తొలగించారు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి సొంత ట్రూత్ మీడియాలో ట్రంప్ ప్రకటించారు. ఆమె మోసానికి పాల్పడినట్లు వచి్చన ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని తెలిపారు. మిషిగన్, జార్జియాలోని భవనా లను ప్రాథమిక నివాసాలుగా ప్రకటిస్తూ ఆమె సంతకాలు చేసిన పత్రాలను ట్రంప్ అటాచ్ చేశారు. రెండు వారాల వ్యవధిల్లోనే రెండిళ్లను ఆమె కోరారని, బహుశా మొదటి నివాసం విషయం మ ర్చిపోయి ఉంటారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మార్టిగేజ్(తనఖా) విభాగానికి ట్రంప్ నియమించిన బిల్ పాల్ట్ గత వారం స్వయంగా లిసాపై ఆరోపణలు చేయడం గమనార్హం. స్వల్పకాలిక వడ్డీ రేట్లలో కోత విధించాలంటూ ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్పై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. చెప్పింది చేయకుంటే పదవి నుంచి తొలగిస్తానని హెచ్చరిక సైతం చేయడం గమనార్హం. అదేవిధంగా, సెంట్రల్ బ్యాంకు బోర్డులోని ఏడుగురు సభ్యుల్లో లిసా ఒకరు. మొత్తం 12 మంది సభ్యుల్లో లిసా సహా ఏడుగురికి మాత్రం వడ్డీ రేట్లు తగ్గించే అధికారముంది. వడ్డీ రేటు తగ్గించేందుకు లిసా అంగీకరించడం లేదు. జూలైలో జరిగిన బోర్డు సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు పావెల్తోపాటు ఓటేసిన వారిలో లిసా కుక్ ఉన్నారు. దీంతో, ఇటీవల రాజీనామా చేయాలంటూ ట్రంప్ కోరినా ఆమె కొనసాగుతూనే ఉన్నారు. ఇది నచ్చని ట్రంప్ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారంతోనే లిసా కుక్ను తొలగించినట్లు తాజాగా సమర్థించుకున్నారు. ఆ అధికారం అధ్యక్షుడికి లేదు ఫెడరల్ రిజర్వు గవర్నర్ లిసా కుక్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. వేధింపులకు భయపడి రాజీనామా చేయబోనని తెగేసి చెప్పారు. తనను తొలగించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రజలకు సేవలందించేందుకు 2022 నుంచి కొనసాగుతున్నానన్నారు. ట్రంప్ చర్యకు తగు కారణం లేదన్నారు. ట్రంప్ చూపుతున్న పత్రాలు నాలుగేళ్ల క్రితం తాను సెంట్రల్ బ్యాంకులో చేరకముందునాటివని తెలిపారు. -
ట్రంప్ ఫోన్ కాల్స్కు మోదీ నో
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నించారా? అందుకు మోదీ తిరస్కరించారా? ట్రంప్తో సంభాషణకు మోదీ ఇష్టపడలేదా? అంటే.. అవుననే చెబుతోంది జర్మనీ వార్తాపత్రిక ఫ్రాంక్ఫర్టర్ అల్జెమేని(ఎఫ్ఏజెడ్). భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఏకంగా 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. దీనిపట్ల భారత నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీతో ఫోన్లో మాట్లాడడానికి ట్రంప్ కనీసం నాలుగుసార్లు ప్రయత్నించారని జర్మనీ పత్రిక పేర్కొంది. అమెరికా నుంచి నాలుగుసార్లు ఫోన్ చేసినా మోదీ స్పందించలేదని వెల్లడించింది. అమెరికా విజ్ఞప్తులను ఆయన గట్టిగా తిరస్కరించారని, ట్రంప్ విధించిన టారిఫ్ల పట్ల తన ఆగ్రహాన్ని పరోక్షంగా వ్యక్తీకరించారని స్పష్టంచేసింది. ఈ మేరకు జర్మనీ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని బెర్లిన్కు చెందిన గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ థార్స్టెన్ బెన్నర్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ శాపనార్థాలు భారత్–అమెరికా మధ్య గత 25 ఏళ్లుగా సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. కానీ, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. భారత్ ఇస్తున్న సొమ్మును ఉక్రెయిన్లో యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ హెచ్చరికలను భారత ప్రభుత్వం లెక్కచేయకపోవడంతో ప్రతీకార చర్యల కింద 50 శాతం టారిఫ్లు విధించారు. భారత్–రష్యా సంబంధాల గురించి తాను పట్టించుకోనని, ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మృతప్రాయంగా మారుతాయంటూ ట్రంప్ శాపనార్థాలు సైతం పెట్టారు. అయితే, ట్రంప్కు ప్రధాని మోదీ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని తేలి్చచెప్పారు. టారిఫ్లకు బెదిరిపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రెచ్చగొట్టేలా ట్రంప్ చర్యలు! మరోవైపు భారత్–పాకిస్తాన్ ఘర్షణను తానే ఆపేశానని ట్రంప్ తరచుగా చెప్పుకుంటున్నారు. తాను చొరవ తీసుకోకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. భారత్పై ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్పై దాడులకు తెరదించేలా చేశానని ట్రంప్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ హఠాత్తుగా ఆగిపోవడం తన ఘనతేనని స్పష్టంచేశారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. భారత్–పాక్ యుద్ధాన్ని ఆపేసినందుకు నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని అంటున్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ను ట్రంప్ ముద్దు చేస్తున్నారు. వైట్హౌస్కు అధికారికంగా ఆహా్వనించి, ఘనంగా విందు ఇచ్చారు. పాకిస్తాన్కు ఆర్థికంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ భారత ప్రభుత్వానికి రుచించడం లేదు. ట్రంప్ చర్యలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని భావిస్తోంది. అందుకు ట్రంప్తో మాటాడ్డానికి ప్రధాని మోదీ ఇష్టపడలేదని తెలుస్తోంది. మరోవైపు ఇటీవలి కాలంలో చైనాతో సంబంధాలకు మోదీ ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఆయన ఈ నెలాఖరులో చైనాలో పర్యటించబోతున్నారు -
‘ట్రంప్.. మరో ఆరు నెలలే..’ వైరల్ వీడియోలో నిజమెంత?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక టిక్టాక్ వీడియోలో అధ్యక్షుడు ట్రంప్ మరో ఆరు నుండి ఎనిమిది నెలల మాత్రమే బతుకుతారనే వాదన వినిపిస్తోంది. ఎపిస్టెమిక్ క్రైసిస్ అనే ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియోలో, తనను డాక్టరేట్ పొందిన హోమ్ హెల్త్ ఫిజికల్ థెరపిస్ట్ అని చెప్పుకుంటున్న వ్యక్తి.. అధ్యక్షుడు ట్రంప్.. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించాడు.‘ఆయనకు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందని నాకు తెలుసు. ఆయన పాదాలు, చీలమండలలో వాపు దీనికి సంకేతం. వాపు మరింత తీవ్రమవుతోందని మాకు తెలుసు. అందుకే ఆయన బహిరంగ సభల సమయంలో డెస్క్ వెనుక కూర్చుంటున్నారు. ఈ సంకేతాలను చూస్తుంటే, ట్రంప్ ఇంకో ఆరు నుండి ఎనిమిది నెలలు మాత్రమే బతకవచ్చని’ అన్నారు. I’ve watched this 4 times so far. 😌Credit: epistemiccrisis on TikTok pic.twitter.com/M4FUoANHHg— Annalea 🪷🐝🥑🍁🌻🍌 (@citizengatsby) August 23, 2025దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్తో ఇటీవల జరిగిన సమావేశంలో, కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తున్నప్పుడు ట్రంప్ చేతులపై నున్న గాయాల ఫోటోలు వైరల్గా మారాయి. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై పలువురిలో ఆందోళన చోటుచేసుకుంది. పలు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఈ గాయాలను మేకప్తో దాచడంతో, ఇవి మీడియా దృష్టి నుంచి ఆకర్షించలేదనే మాట వినిపిస్తోంది.తాజా ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ, కొందరు అధ్యక్షుడు ట్రంప్ చాలాకాలంగా ఎదురుగా కెమెరాలున్నప్పుడు డెస్క్ వెనుకగా కూర్చుంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. చీలమండ వాపు అనేది హృద్రోగ లేదా మూత్రపిండాల వ్యాధులకు సంబంధించినదని వారు అంటున్నారు. ఈ ఊహాగానాల నేపధ్యంలో వైట్ హౌస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ వాదనలను ఖండించింది. అధ్యక్షుడు ట్రంప్ ప్రజల మనిషి. అతను చరిత్రలో నిలిచిపోతాడు. ప్రతిరోజూ అధిక సంఖ్యలో ప్రజలను కలుస్తూ, వారితో కరచాలనం చేస్తున్నారు. అతని నిబద్ధత అచంచలమైనది. ప్రతిరోజూ దానిని రుజువు చేస్తున్నారంటూ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. -
ఉత్తర కొరియాతో పెట్టుకుంటున్న ట్రంప్.. కిమ్ జోంగ్ ఉన్తో భేటీ?
వాషింగ్టన్: ఉత్తరకొరియాతో సత్సంబంధాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ సమక్షంలో కొరియా ద్వీపకల్పంలో శాంతిని తీసుకురావాలనే తన కోరికను అభివ్యక్తం చేశారు. ఇందుకోసం ఉత్తర కొరియా సుప్రీం నేత కిమ్ జోంగ్ ఉన్తో సమావేశం కావాలనుకుంటున్నట్లు తెలిపారు.ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన లీని తొలిసారిగా ట్రంప్ వైట్హౌస్కు స్వాగతించారు. ఈ సందర్భంగా ట్రంప్ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలో తగిన సమయంలో కిమ్ జోంగ్ ఉన్తో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నానని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ తనతో మంచిగా వ్యవహరించారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా,దక్షిణ కొరియా సమావేశంలో.. లీ జే మ్యుంగ్ కూడా ట్రంప్ సారధ్యంలో కొరియా ద్వీపకల్పానికి శాంతి చేకూరాలనే అభిలాషను వ్యక్తం చేశారు.ప్రపంచంలో ప్రత్యేక దేశంగా పేరొందిన కొరియా ద్వీపకల్పంలో ట్రంప్ శాంతిని తీసుకురాగలరని ఆశిస్తున్నానని, కిమ్ జోంగ్ ఉన్కు సన్నిహితులు కాగలరని, ఉత్తర కొరియాలో ట్రంప్ ప్రత్యేక ప్రపంచాన్ని (రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్) నిర్మించగలరని లీ జే మ్యుంగ్ పేర్కొన్నారు. కాగా ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఉత్తర కొరియా ఇంకా స్పందించలేదు. అయితే దక్షిణ కొరియాతో యూఎస్ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా మీడియా ప్రత్యేక దృష్టి సారించిందని సమాచారం. కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకోవాలనే కాంక్ష అమెరికాలో ఉందనే అభిప్రాయాన్ని ఉత్తర కొరియా వ్యక్తం చేసింది.కాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు వైట్ హౌస్ నుంచి పదేపదే ఆహ్వానాలు అందినప్పటికీ అతను విస్మరిస్తూనే వస్తున్నారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ తన మొదటి పదవీకాలంలోనూ ఉత్తరకొరియాతో దౌత్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. గడచిన జూలైలో ట్రంప్.. కిమ్తో భేటీని కోరుతూ లేఖ రాయగా, దానిని ఉత్తర కొరియా ఐక్యరాజ్యసమితి కార్యాలయ సిబ్బంది తిరస్కరించారని ఉత్తర కొరియా మీడియా తెలిపింది. -
భారత్కు అమెరికా టారిఫ్ నోటీసులు
వాషింగ్టన్: భారత్పై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా నోటీసు జారీ చేసింది. భారత్ నుండి వచ్చే దిగుమతులపై ఈ అదనపు భారం వర్తిస్తుందని అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసు విడుదల చేసింది. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27న అర్ధరాత్రి 12:01 నుండి అమల్లోకి వస్తాయని తెలియజేసింది.అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై ఆగస్టు 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం అమెరికా విషయంలో చేస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందించాలని యూఎస్ ఏజెన్సీలను ఈ ఉత్తర్వులో ఆదేశించారు. దీనిలో భాగంగా భారతదేశంపై కొత్త సుంకాల విధింపును కూడా పేర్కొన్నారు.ఈ నోటీసులో పేర్కొన్న పలు భారతీయ ఉత్పత్తులకు ఈ సుంకాలు వర్తిస్తాయని అమెరికా పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత వచ్చే లేదా గిడ్డంగులనుండి బయటకు తీసుకెళ్లే ఏ వస్తువులకైనా ఈ సుంకాలు వర్తిస్తాయని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదరని పక్షంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కూడా అదనపు సుంకాలు విధిస్తామని లేదా మాస్కోపై అదనపు ఆంక్షలు విధించనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నోటీసు ద్వారా సంకేతాలిచ్చారు. ఈ విషయంలో పురోగతి సాధించలేని పక్షంలో రాబోయే వారాల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.ఇప్పటివరకు యూఎస్.. చైనాతో సహా రష్యన్ చమురు కొనుగోలుదారులపై ఇలాంటి చర్యలను చేప్టటలేదు. ఈ ఏడాది ఆగస్టులో ట్రంప్ భారత్పై అదనంగా 25 శాతం సుంకాలను విధించారు. భారతదేశం నుండి వచ్చే ఉత్పత్తులపై మొత్తం సుంకాన్ని 50 శాతానికి పెంచారు. న్యూఢిల్లీ.. రష్యా చమురు కొనుగోలును కొనసాగించినందుకు జరిమానాగా అమెరికా ఈ చర్య చేపట్టింది. అయితే భారత్ వీటిని ద్వితీయ సుంకాలని పేర్కొంటూ, వీటిని అన్యాయం, అసమంజసం అని పేర్కొంది. అదే సమయంలో చర్చలలో పురోగతి చోటుచేసుకుంటే పెరిగిన సుంకాల అవసరం కూడా ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చింది.కాగా అహ్మదాబాద్లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ అమెరికా సంకాలపై స్పందిస్తూ.. వాషింగ్టన్ విధించే ఆర్థిక ఒత్తిడిని లెక్క చేయమని, ఇందుకు ప్రతిగా తమ ప్రభుత్వం ఒక మార్గాన్ని కనుగొంటుందని పేర్కొన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా, దానిని తట్టుకునే శక్తిని పెంచుకుంటూనే ఉంటామని, నేడు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఎంతో శక్తిని పొందుతోందని, దీని వెనుక రెండు దశాబ్దాల కృషి ఉందన్నారు. -
పాత ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులతో ట్రంప్ పంపేస్తారా?
వాషింగ్టన్: అమెరికాలోని ప్రతి ఒక్క ఉద్యోగం అమెరికన్లకే దక్కాలనే దురాశతో దొరికిన ప్రతి ఒక్క అవకాశాన్ని, లొసుగును వాడుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి గ్రీన్కార్డ్, వీసాదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చారు. మద్యం తాగి వాహనం నడపడంతో నమోదైన పాత కేసులను సైతం తిరిగి తోడి ఆయా వ్యక్తులపై మళ్లీ నేరాభియోగాలు మోపి దేశం నుంచి బహిష్కరించాలని ట్రంప్ సర్కార్ కంకణం కట్టుకుంది. ఇందులోభాగంగా ఇప్పటికే ‘ప్రొటెక్షన్ అవర్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డ్రంక్ అండర్ ఇన్ప్లూయన్స్’చట్టాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రతినిధుల(దిగువ)సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు జూలై చివరివారంలో ఆమోద ముద్రపడింది. వెంటనే దీనిని ఎగువ సభ అయిన సెనేట్లో ప్రవేశపెట్టారు. జూన్లో ఈ బిల్లును సెనేట్ జుడీíÙయరీ, రూల్స్ కమిటీ పరిశీలనకు పంపించారు. అక్కడ బిల్లుకు ఆమోదముద్రపడితే సెనేట్లో తర్వాత ఆమోదం పొందే అవకాశాలు మెరుగవుతాయి. ఈ లెక్కన బిల్లు చివరకు చట్టంగా మారితే ఇప్పటికే పాత ‘డ్రంక్ అండ్ డ్రైవ్’కేసులున్న గ్రీన్కార్డ్ పొందిన భారతీయులకూ కష్టాలు మొదలుకానున్నాయి. ఇక విద్యార్థి, హెచ్–1బీ వంటి వీసాలు పొందిన భారతీయులకూ బహిష్కరణ వేటు పడే అవకాశముంది. ఇమిగ్రేషన్ అండ్ నేషనల్ చట్టానికి సవరణలు తెస్తూ ఈ హెచ్.ఆర్.875 బిల్లును తీసుకొచ్చారు. అమెరికా పౌరసత్వంలేని విదేశీయులు అమెరికాలో మద్యం తాగి, లేదంటే మద్యం మత్తులో వాహనం నడిపి రోడ్డు ప్రమాదం చేసినా, అమెరికన్ల ప్రాణాలు హరించినా అలాంటి వ్యక్తలను దేశబహిష్కరణ చేయాలనే ప్రధానోద్దేశ్యంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై గ్రీన్కార్డ్, వీసాదారుల నుంచి సర్వత్రా విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత నిర్దయగా నిబంధనలు కొత్త బిల్లులో పేర్కొన్న నిబంధనలు, షరతులు చూస్తుంటే ఎలాగైనా సరే పాత, చిన్నపాటి నేరాలకు పాల్పడిన విదేశీయులను ఖచ్చితంగా దేశబహిష్కరణచేయాలనే ఉద్దేశం్య స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘ఒక పదేళ్ల క్రితంనాటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయినాసరే, అది ఇప్పటికే మూసేసిన కేసు అయినాసరే దానిని మళ్లీ తెరచి నేరం మోపుతారు. ఆ కేసులో నిందితుడు క్షమాపణ చెప్పడం, సంబంధిత ట్రయల్ కోర్టు అందుకు సమ్మతి తెలపడం వంటి సందర్భాల్లోనూ పాత కేసులను తిరగతోడి దేశ బహిష్కరణచేస్తారు’’అని వలసదారుల కేసులను వాదించే లాయర్ జోసెఫ్ ట్సాంగ్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇది అత్యంత దారుణమైన బిల్లు. ఉదాహరణకు గ్రీన్కార్డ్దారుడు లేదంటే స్టూడెంట్ వీసా, హెచ్–1బీ వంటి అంతర్జాతీయ వీసా పొందిన వ్యక్తి పదేళ్ల క్రితం మద్యం మత్తులో చిన్నపాటి యాక్సిడెంట్ చేసి తర్వాత కేసు నుంచి బయటపడ్డాను అనుకుందాం. ఈరోజు ఆ వ్యక్తి స్వదేశానికి లేదంటే వేరే పని నిమిత్తం న్యూజిలాండ్ వంటి దేశానికి వెళ్లాడనుకుందాం. ఈలోపు హెచ్.ఆర్.875 బిల్లు చట్టంగామారితే ఇకపై ఆ వ్యక్తిని అమెరికాలోకి అనుమతించబోరు. కనీసం ఆ పాత కేసుపై వాదించుకునే అవకాశం అతనికి ఇవ్వబోరు. నిన్ను అమెరికాలోకి అనుమతించబోమనే ముంద్తు హెచ్చరిక కూడా ప్రభుత్వం పంపబోదు. అసలు అమెరికాలోకి వచ్చే అధికారిక మార్గాలన్నీ మూసుకుపోతాయి. ఇంతటి నిర్దయ నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి’’అని జోసెఫ్ చెప్పారు. ‘‘ఎలాంటి అధికారిక పత్రాలు లేని వలసదారులు, వీసా, శాశ్వత స్థిరనివాస హోదా సవరణ కోసం దరఖాస్తు చేసుకుని వేచిచూస్తున్న వ్యక్తులకు సైతం ఈ బిల్లు వర్తిస్తుంది’’అని వలసదారుల న్యాయసేవల సంస్థ ‘ల్యాండర్హోమ్ ఇమిగ్రేషన్’పేర్కొంది. ఈ బిల్లు చట్టంగా మారేలోపే పాత కేసులున్న వ్యక్తులు తక్షణం కోర్టులను ఆశ్రయించి తమ వాదనలను వినిపించడం ఉత్తమమని ఈ సంస్థ అభిప్రాయపడింది. -
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాకిచ్చిన భారత్
-
ట్రంప్కు బిగ్ షాకిచ్చిన భారత్
మాస్కో: రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఎట్టకేలకు భారత్ తన వైఖరిని బయటపెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తూ బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో భారత్ కౌంటరిచ్చింది. ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటామని స్పష్టం చేసింది. దేశీయ ప్రయోజనాలకే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని కుండబద్దలు కొట్టింది.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ తాజాగా రష్యా ప్రభుత్వం వార్తా సంస్థ టాస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటాం. ఎక్కడ చౌకగా దొరికితే ఇండియన్ కంపెనీలు అక్కడే కొనుగోలు చేస్తాయి. దేశీయ ప్రయోజనాలకే కాపాడుకోవడానికే ఢిల్లీ ప్రాధాన్యం ఇస్తుంది. భారత్లోని 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రత మా లక్ష్యం. ఇతర దేశాల మాదిరిగానే రష్యాతో సహకారంలో భాగంగా చమురు మార్కెట్, ప్రపంచ చమురు మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడింది.🚨 BIG STATEMENT Indian Envoy to Russia, Vinay Kumar, SLAMS US move to impose 25% tariffs on INDIA for buying Russian oil.— Calls it ‘Unfair, Unreasonable & Unjustified.’— Says Indian companies will KEEP buying oil from Wherever they get the best deal. pic.twitter.com/yyiHjhpkFA— VIPIN_UPDATE🚨 (@Vipin_Update) August 25, 2025భారత్ విషయంలో వాషింగ్టన్ నిర్ణయం అన్యాయం, అసమంజసమైనది. భారత్ ప్రభుత్వం ఎల్లప్పుడు దేశ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. రష్యాతో అమెరికా సహా పలు యూరప్ దేశాలు వ్యాపారం చేస్తున్నాయి. వాటిపై మాత్రం ఎందుకు సుంకాలు విధించలేదు అని ప్రశ్నించారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత వస్తువులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత్.. రష్యా ముడి చమురు కొనుగోలుకు 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. భారత్.. రష్యా ముడి చమురు కొనుగోళ్లు ఉక్రెయిన్లో మాస్కో యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణను భారత్ తిరస్కరించింది. -
భారత్పై సుంకాలు.. ట్రంప్ టార్గెట్ అదే: జేడీ వాన్స్
వాషింగ్టన్: భారత్పై అమెరికా సుంకాల విధింపుపై ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను అడ్డుకునేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్పై ఒత్తిడి పెట్టినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదని వాన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాన్స్ మాట్లాడుతూ..‘రష్యాకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, తద్వారా అది యుద్ధాన్ని కొనసాగించలేకపోవడం ఈ చర్యల లక్ష్యం. అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం తర్వాత ఏర్పడిన అడ్డంకులు ఉన్నప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదు. రష్యాపై ట్రంప్ బలమైన ఆర్థిక ఒత్తిడిని తెచ్చారు.ఎలా అంటే.. భారత్పై అదనపు సుంకాలు విధించడం ద్వారా , చమురు నుంచి వచ్చే రష్యా ఆదాయాలు తగ్గిపోతాయి. రష్యా దాడులను ఆపివేస్తే, దానిని మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చేర్చవచ్చని, కానీ దాడులు కొనసాగితే, అది ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే సందేశాన్ని ఇవ్వడానికి ట్రంప్ ప్రయత్నించారని అన్నారు. ఉక్రెయిన్పై బాంబు దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంభించారు. భారత్ ద్వితీయ సుంకాలను విధించడం కూడా ఇందులో భాగమని తెలిపారు.మరోవైపు.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా విమర్శలు చేసింది. భారత వస్తువులపై ట్రంప్ సుంకాన్ని 50 శాతానికి రెట్టింపు చేయడం వల్ల భారత్-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదే సమయంలో రష్యా చమురును ఎక్కువగా కొనుగోలు చేసే చైనాపై ట్రంప్ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో, ట్రంప్ తీరును పలు దేశాల నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
ఉక్రెయిన్కు 3,350 క్షిపణులు పంపనున్న అమెరికా
వాషింగ్టన్: ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. 850 మిలియన్ డాలర్ల విలువైన 3,350కి పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ఈఆర్ఏఎమ్) క్షిపణులను ఉక్రెయిన్కు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఆయుధ ప్యాకేజీకి యురోపియన్దేశాలు నిధులు సమకూరుస్తున్నాయి. ఆరు వారాల్లో ఈ క్షిపణులు కీవ్కు చేరుకుంటాయి. ఇవి ఎప్పుడో ఉక్రెయిన్కు చేరాల్సి ఉండగా.. రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల నేపథ్యంలో కొంత ఆలస్యం అయ్యాయి. వీటిలో 240 నుంచి 450 కి.మీ. పరిధి కలిగిన ఈ ఈ ఆర్ఏఎమ్ క్షిపణులు ఉన్నాయి. -
నిలుపుకోవాల్సిన బంధం
ఇండియాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరుపారేసు కోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఆయన అక్కసు వెనుక ప్రతిసారీ ఒక భూ స్వామ్య పెత్తందారీ విధానం కనిపిస్తుంది. సుంకాలు, జరిమానాలను రక్షణ కవచంగా ధరించి ఆయన విమర్శలకు, బెదిరింపులకు దిగుతూంటారు. అమెరికా అధ్యక్షుడి వదరుబోతుదనంలో ఒక సామ్రాజ్య వాదిలో ఉండే దురహంకారం ప్రతిబింబిస్తూ ఉంటుంది.రష్యా చమురును ఒక బూచిగా చూపిస్తున్నారంతే. అలనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ధోరణి ఇప్పుడు అమెరికా వ్యవహార శైలిలో కనిపిస్తోంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమ పట్ల భారత దేశం అనుసరిస్తున్నట్లు చెబుతున్న సంరక్షణ విధానంపై నిజంగానే అమెరికా విభేదిస్తోందని మనకు ఎక్కడైనా మనసు పొరల్లో చిన్న సందేహం మిగిలి ఉంటే, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఉపయోగించిన భాషతో అది కాస్తా పటాపంచలైపోతుంది. ‘మహారాజా సుంకాలు’ అనే పద బంధాన్ని గమనిస్తే, భారత దేశాన్ని ప్రాచ్యవాద, పురాతన జాతివాద కళ్ళద్దాలతోనే నవారో చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఈసారి ఆయన ‘పాములు ఆడించే వాళ్ళ’ ఉపమానాన్ని ఉపయోగిస్తారేమో! ఏదో ఒక పక్షం వైపు రావలసిందిగా భారతదేశాన్ని నేరుగానే హెచ్చరించారాయన. కొత్తగా ఉపయోగించిన మాటలతో భారతీయుల మనసును నవారో మరింత గాయపరచారు. క్రెమ్లిన్కి ‘లాండ్రోమాట్’గా ఆయన భారతదేశాన్ని అభివర్ణించారు. నిజానికి, అప్ప టికి కొద్ది రోజుల క్రితమే అలాస్కాలో వ్లాదిమీర్ పుతిన్కి ట్రంప్ అక్షరాలా ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికిన సంగతిని ఆయన సమయానుకూలంగా మరచినట్లుంది. అమెరికా ఆత్మవంచనమనం రష్యా ముడి చమురు కొని, శుద్ధి చేసిన తర్వాత, ఆ చమురును యూరప్ దేశాలు కూడా కొనుగోలు చేశాయి. అలా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా మనం ‘లాభాలు గడిస్తున్నా’మని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించారు. కానీ, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నిజంగా లబ్ధి పొందు తున్నది వారే! ఐరోపా దేశాలు అమెరికా నుంచి ఆయుధాలు కొని ఉక్రెయిన్కు లాభాలకు అమ్ముతున్నాయి. అందుకే అవి విక్రయిస్తున్న అన్ని ఆయుధాలపైనా (అదనపు వ్యయాలు, లాభం కింద) ట్రంప్ ప్రభుత్వం 10% మొత్తాన్ని తీసుకుంటోందని బిసెంట్ మరో ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించారు. ఇండియా మాత్రం రష్యా చమురు కొనడం తమ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతూంటే... అదే వ్యక్తులు, పుతిన్ యుద్ధాన్ని మనం బలో పేతం చేస్తున్నట్లుగా నిందిస్తున్నారు. ఇక్కడ అమెరికా ఆత్మ వంచన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కపటత్వానికీ స్థిరమైన వాదన అవసరం.ఎవరో ఒక అధ్యక్షుడి చపలచిత్త ధోరణిని పట్టించుకోనక్కర లేదని, భారత–అమెరికా స్నేహ సంబంధాలు సుదీర్ఘమైనవి, గాఢ మైనవని వాదించేవారితో నేనూ ఏకీభవిస్తాను. కానీ, ట్రంప్కు అర్థ మయ్యే భాషలోనే ఆయనకు వ్యతిరేకంగా స్వల్పకాలిక చర్యనైనా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. అలా గని వాషింగ్టన్ ఇవ్వనిది చైనా మనకేదో దోచిపెడుతుందని కూడా నేను అనుకోవడం లేదు. చైనాను నమ్మవచ్చా?ట్రంప్ది దూకుడు తత్త్వం. చైనా సైనికంగా మనకి ప్రత్యర్థి. ట్రంప్వి అవాకులో చవాకులో బహిరంగంగానే ఉంటాయి. జిన్పింగ్వి పారదర్శకం కాని తెరవెనుక చర్యలు. పాకిస్తాన్ పట్ల ట్రంప్ మెతక వైఖరిని అర్థం చేసుకోవచ్చు. దాని పొగడ్తలకు ఆయన ఉబ్బి పోయాడు, లేదా అది ఇవ్వజూపిన ప్రయోజనాలకు ప్రలోభపడ్డాడు అనుకుందాం. కానీ, ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాకి స్తాన్తో చైనా చెట్టపట్టాలేసుకుని తిరిగింది.కనుక, ట్రంప్ను, ప్రస్తుత లోటుపాట్లను పక్కనపెట్టి అమెరికా – భారత్ స్నేహ సంబంధాన్ని కాపాడుకోవాలని కోరుకోవడంలో ఔచిత్యం ఉంది. ఇప్పటి అమెరికా స్పందన ఒకటే పాఠం నేర్పుతోంది. అది: ప్రపంచంలో ఓ మూలనున్న ప్రాంతంపై లేదా ఒకే దేశంపై ఆశలన్నీ పెట్టుకోవద్దు. అది ప్రమాదకరం.మనవాళ్లు ఏం చేస్తున్నట్టు?ట్రంప్ను భారత్ ఎందుకు దారికి తెచ్చుకోలేకపోయింది అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ ఆగి పోవడంలో ట్రంప్ స్వోత్కర్షను సమర్థించనందుకా? ఆయన ‘ఇగో’ దెబ్బతిందా? ట్రంప్ మాజీ అంగరక్షకుడు ఒకరిని పాకిస్తాన్ తన లాబీయిస్టులలో ఒకడిగా చేర్చుకుందని చెబుతున్నారు. మనం అలా కాకుండా, లాంఛన పూర్వకంగా, సంయమనంతో దౌత్యం నెరప డమా? కానీ, నాకొకటే సందేహం. అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన గొప్ప వ్యక్తులు ఏమైపోయినట్లు? యాభై లక్షల మంది ఇండియన్–అమెరికన్ సమూహాన్ని ఒక చక్కని వలస వర్గానికి నమూనాగా తరచూ అభినందిస్తూ ఉంటారు. ఆ వర్గం నాయకులు పెద్ద టెక్, ఫినాన్షియల్ సంస్థలను నడుపు తున్నారు. విద్యా, విధాన నిర్ణాయక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారు. ఇండియా పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు చూసి వారికి ఒళ్ళు మండటం లేదా? స్వీయ నిర్ణయాలు తీసుకోవడం భారతదేశానికున్న సార్వభౌమాధికారమనే సంగతిని ట్రంప్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతే, ఆయన శ్వేత సౌధం నుంచి నిష్క్ర మించే నాటికి కాపాడుకోవాల్సినవి పెద్దగా ఏమీ మిగలవు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోండి.. భారత్కు నిక్కీ హేలీ సూచన
వాషింగ్టన్: అమెరికా, భారత్ మధ్య ప్రస్తుత పరిస్థితులపై అమెరికా రిపబ్లికన్ నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయం, చమురు కొనుగోళ్లపై లేవనెత్తిన అభ్యంతరాన్ని భారత్ సీరియస్గా తీసుకోవాలని సూచనలు చేశారు. ట్రంప్, మోదీ మధ్య ఇలాంటి పోరాటం దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చైనాపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.భారత్కు నిక్కీ హేలీ మంచి మిత్రురాలిగా పేరున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంక్షలు విధించి భారత్ను అమెరికా దూరం చేసుకోవడంపై నిక్కీ హేలీ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిక్కీ హేలీ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘దశాబ్దాలుగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం ఉంది. రష్యా నుంచి చమురు విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్గా తీసుకోవాలి. దాని పరిష్కారం కోసం వీలైనంత త్వరగా అమెరికాతో కలిసి పనిచేయాలి. వాణిజ్యంలో, రష్యా చమురుపై అభిప్రాయభేదాలు వంటివి పరిష్కరించుకోవడానికి బలమైన చర్చలు, సంప్రదింపులు అవసరం.India must take Trump's point over Russian oil seriously, and work with the White House to find a solution. The sooner the better. Decades of friendship and good will between the world's two largest democracies provide a solid basis to move past the current turbulence.…— Nikki Haley (@NikkiHaley) August 23, 2025ఇక, చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ మిత్రులుగా ఉండాలి అన్న అంశం చాలా ముఖ్యమైంది. దానిని ఏమాత్రం విస్మరించడకూడదు. చైనాను ఎదుర్కోవాలన్న వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ట్రంప్ నిర్ణయాలు విపత్కరంగా మారాయి. ప్రపంచంలో ఆరోవంతు జనాభాకు కేంద్రం భారత్. అత్యంత యువ జనాభాతో చైనాను దాటేసింది. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ ’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా, భారత్ మధ్య ఘర్షణల వాతావరణం నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య పోరు దురదృష్టకరమని అభివర్ణించారు. భారత్ లాంటి మిత్రదేశాలను ట్రంప్ దూరం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన దౌత్య ప్రయత్నాలు జరగకుండా, అల్టిమేటంలు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. గొప్ప దేశాలు ఎల్లప్పుడూ ప్రజలకు అల్టిమేటంలు ఇవ్వడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శించవు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో చర్చలు పరస్పర సహకారం, గౌరవం ద్వారా జరిగాయి. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆదేశాలు, ఒత్తిడితో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
అమెరికాలో వలసదార్లు తగ్గుముఖం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదార్లకు కష్టాలు మొదలయ్యాయి. ట్రంప్ సర్కార్ విధానాలతో విదేశీయులు బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కబెట్టుకొనే పరిస్థితి వచ్చింది. ఎవరిని ఎప్పుడు వెళ్లగొడతారో తెలియడంలేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ‘సామూహిక తరలింపులకు’ తెరలేపారు. వేలాది మందిని బలవంతంగా స్వదేశాలకు పంపించారు. కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి మరీ విమానాల్లో తరలించారు. చట్టాలను ఉల్లంఘించారంటూ అభియోగాలు మోపి విదేశీయులను అరెస్టు చేస్తున్నారు. అమెరికాలోకి ప్రవేశంపై కొత్తకొత్త ఆంక్షలు విధిస్తున్నారు. వీసాలు రద్దు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ వలసదార్లను బెంబేలెత్తిస్తున్నాయి. చాలామంది అమెరికాను వీడుతున్నారు. అమెరికాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ దాకా.. కేవలం ఆరు నెలల్లో వలసదార్ల సంఖ్య ఏకంగా 15 లక్షలు తగ్గినట్లు ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. అగ్రరాజ్యంలో 1960వ దశకం తర్వాత ఇమ్మిగ్రెంట్స్ సంఖ్య ఈ స్థాయిలో తగ్గి పోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఏడాది అరంభంలో దేశంలో మొత్తం వలసదార్లు 5.33 కోట్ల మంది ఉండగా, ప్రస్తుతం 5.19 కోట్లకు పడిపోయింది. → వలసదార్లు వెనక్కి వెళ్లిపోతుండడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. → ఆరు నెలల్లో తగ్గిపోయిన ఇమ్మిగ్రెంట్లలో 7.50 లక్షల మంది కార్మికులే ఉంటారని అంచనా. కార్మికులు వెళ్లిపోతే లేబర్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. → అమెరికాలో జనాభాలో ‘పనిచేసే సామర్థ్యం కలిగిన’ వారి సంఖ్య పెరగడం లేదు. వర్కింగ్–ఏజ్ పీపుల్ సరిపడా లేకపోతే వలసదార్లపై ఆధారపడాల్సిందే. → కొత్త వలసదార్లు రాకపోగా, ఉన్నవారే స్వదేశాలకు, ఇతర దేశాలకు వెళ్లిపోతుండడంతో ఆర్థిక వ్యవస్థ దిగజారుతుందని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. → నిజానికి వలసదార్లపై కఠిన ఆంక్షలు 2024లో జో బైడెన్ ప్రభుత్వ హయాంలోనే మొదల య్యాయి. విదేశీయుల రాకను సరిహద్దుల్లో కట్టడిచేశారు. ట్రంప్ వచ్చాక ఆంక్షల మరింత తీవ్రమయ్యాయి. విదేశీయులను బయటకు వెళ్లగొట్టడమే ఏకైక లక్ష్యం అన్నట్లుగా ట్రంప్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇలాంటి పరిస్థితి గత 70 ఏళ్లలో ఎప్పుడూ లేదు. → అమెరికాలో చట్టబద్ధమైన వలసదార్లే కాకుండా అక్రమ వలసదార్ల సంఖ్య కూడా వేగంగా తగ్గిపోతోంది. → ప్రపంచవ్యాప్తంగా చూస్తే వలసదార్లు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో అగ్రస్థానం ఇప్పటికీ అమెరికాదే. ఈ ఏడాది జనవరిలో దేశ జనాభాలో వలసదార్ల వాటా 15.8 శాతం కాగా, జూన్ నాటికి 15.4 శాతానికి పడిపోయినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. → అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఇమ్మిగ్రెంట్లు ఉన్నారు. -
రష్యాకు రెండు వారాల గడువిస్తున్నా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు రెండు వారాల అల్టిమేటం ఇచ్చారు. అప్పటి వరకు తగు రీతిలో స్పందించకుంటే రష్యాపై ఆంక్షలు విధించాలా లేదా సుంకాలతో బాదాలా అనేది నిర్ణయిస్తామని తెలిపారు. ఉక్రెయిన్లోని అమెరికాకు చెందిన ఎల్రక్టానిక్ ఫ్యాక్టరీపై రష్యా క్షిపణి దాడి నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ఇటీవల అమెరికాలోని అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయంటూ ప్రకటించిన ట్రంప్ తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రష్యా దాడితో తాను సంతోషంగా లేనని, పరిస్థితిని మరోసారి సమీక్షిస్తానని ట్రంప్ అన్నారు. తదుపరి చర్యలను రెండు వారాల్లో ప్రకటిస్తానని పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య సంక్షోభం తెలివితక్కువైంది. వారానికి 7 వేల మంది, అంతకంటే ఎక్కువ మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ పోరాటాన్ని ఆపాలనుకుంటున్నా, అయితే, ఇప్పుడది కష్టతరంగా మారింది’అని ట్రంప్ అన్నారు. -
ఇబ్బందైతే కొనకండి!
న్యూఢిల్లీ: భారత్ నుంచి ముడి చమురు సహా పలు రకాల శుద్ధిచేసిన ఉత్పత్తులను కొనడం మీకు ఇబ్బంది అనుకుంటే అస్సలు కొనొద్దని ట్రంప్ సర్కార్కు భారత విదేశాగ మంత్రి జైశంకర్ తెగేసి చెప్పారు. ట్రంప్ పాలనాయంత్రాంగం అనుక్షణం స్వప్రయోజనాలతో వాణిజ్యంచేస్తూ భారత్ సైతం అదేపనిచేస్తుంటే తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందని జైశంకర్ వ్యాఖ్యానించారు. పలుదేశాలపై ఎడాపెడా పన్నుల పిడిగుద్దులు కురిపించే ట్రంప్ అవలంభించే విదేశాంగ విధానం పూర్తిగా అగమ్యగోచరంగా తయారైందని ఎద్దేవాచేశారు. ఢిల్లీలో జరుగుతున్న ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’లో ఆయన అతిథిగా పాల్గొని పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు. ‘‘మా సరుకు కొనాలని మీపై ఒత్తడి చేయట్లేదు కదా. మీరు భారతీయ చమురు ఉత్పత్తులను కొనకపోతే వేరే దేశాలు కొంటాయి. సరుకులను యూరప్ అమ్ముతుంది. అమెరికా కూడా అమ్ముతుంది. భారత్ సైతం అమ్ముతుంది. మావి వద్దనుకుంటే, సమస్య అనుకుంటే కొనకుంటే సరిపోతుందికదా’’అని జైశంకర్ వ్యాఖ్యానించారు.‘అమెరికా సంప్రదాయక విదేశాంగ విధానానికి ట్రంప్ తిలోదకాలిచ్చారు. ఏ దేశం గురించి ఆయన ఏం అనుకుంటున్నారో ఎవ్వరికీ తెలీదు. అసలు ట్రంప్ సారథ్యంలో అమెరికా విదేశాంగ విధానం అగమ్యగోచరంగా, అధ్వానంగా తయారైంది. ఇలాంటి విదేశాంగ విధానాన్ని, ఇంత బాహాటంగా అమలుచేసిన అమెరికా అధ్యక్షుడిని ప్రపంచం కనీవినీ ఎరుగదు. సొంత వ్యాపారం, వాణిజ్యం పెంచుకోవడంపైనే ట్రంప్ సర్కార్ దృష్టిపెడుతుందని అందరూ అంటారు. మరి అలాంటప్పుడు భారత్ వంటి దేశాలు రష్యా వంటి దేశాలతో వాణిజ్యం చేస్తుంటే మీకొచి్చన ఇబ్బంది ఏంటి?. మీరు చేస్తున్న పనిని వేరొకరు చేయొద్దనడం హాస్యాస్పదం. సొంతింటిని గాలికొదిలేసి పక్కింట్లో ఏం జరుగుతుందా అని ట్రంప్ యంత్రాంగం తొంగి చూస్తుంటే నవ్వొస్తోంది. ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి’’అని ట్రంప్కు జైశంకర్ చురకటించారు. మధ్యవర్తిత్వం ఉత్తిదే ‘‘మేలో ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్, భారత్ యుద్ధంలో మునిగిపోకుండా తాను ఆపానని బీరాలు పలుకుతున్న ట్రంప్ మాటల్లో ఆవగింజంత అయినా నిజం లేదు. అసలు మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ ప్రోత్సహించలేదు. గతంలోనూ తగాదా తీర్చమని ఎవ్వరినీ పెద్దమనిíÙగా పిలవలేదు. 1970వ దశకం నుంచి చూసినా గత అర్థశతాబ్దకాలంలో పాకిస్తాన్తో పొరపొచ్ఛాలకు సంబంధించి ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించకూడదని భారత్ ఏనాడో నిర్ణయించుకుంది’’అని అన్నారు.అన్నింట్లో వైఖరి సుస్పష్టం‘‘ప్రతి అంశానికి సంబంధించి భారత్కు స్పష్టమైన విధానముంది. అమెరికా 50 శాతం టారిఫ్లు విధించినాసరే ఎలాంటి వాణిజ్య ఒప్పందాల్లోనైనా మన రైతుల ప్రయోజనాలే భారతప్రభుత్వానికి అత్యున్నతం. వ్యూహాత్మక వాణిజ్యం మొదలు రక్షణ, టారిఫ్లు, మధ్యవర్తిత్వం దాకా ప్రతి అంశంలో భారత్ స్వీయప్రయోజనాలకే విలువ ఇస్తుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా ప్రతినిధి బృందంతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. సాగు, డెయిరీ ఉత్పత్తుల విషయంలో రైతుల ప్రయోజనాలు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల పరిరక్షణకు భారత్ పట్టుబట్టడంతో ఈ అంశాల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది’’అని జైశంకర్ అన్నారు. పన్నుల భారం మోపడంతో అమెరికా సత్సంబంధాలు సన్నగిల్లి కొత్తగా చైనాతో బంధం కాస్తంత బలపడిందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ‘‘ఒక సందర్భాన్ని వేరొక సందర్భంతో పోల్చిచూసి తుది నిర్ణయానికి, అంచనాకు రావడం సబబుకాదు’’అని వ్యాఖ్యానించారు. -
‘భారత్ అంటే గౌరవం.. మోదీ అంటే అంత కంటే..’
న్యూఢిల్లీ: భారత పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ను ఆర్థికంగా దెబ్బతీయానే ఉద్దేశంతో సుంకాల పెంపునకు నాంది పలికారనే వాదన బలంగా వినిపిస్తోంది.. భారత్పై వరుస సుంకాలతో ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నారని అంటున్నారు పలువురు ప్రముఖులు. భారత్ను చైనా కంటే దారుణంగా చూడటం తగదని అంటున్నారు. చైనా కంటే అధికంగా భారత్పై సుంకాలు విధించడమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని దశాబ్డాలుగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న భారత్ పట్ల ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో ఆయనకే తెలియాలి. భారత్ను ఆర్థికంగా ఎదుగకుండా చూడాలని ట్రంప్ చేస్తున్నారా? అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదే సమయంలో .భారత్పై ట్రంప్ వైఖరి పట్ల అటు అమెరికాలోనే పలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించగా, ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలనే యత్నం కూడా యూఎస్ నుంచి జరుగుతున్నట్లే కనబడుతోంది. తాజాగా అమెరికా మాజీ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు మిచెల్ బామ్గార్టనర్ అమెరికా-భారత్ల ‘మైత్రి’ తిరిగి గాడిలో పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిచెల్ బామ్గార్టనర్ మాట్లాడుతూ.. ట్రంప్కు భారత్ అంటే చాలా గౌరవమని, ప్రధాని మోదీ అంటే అంతకంటే గౌరవమంటూ స్పష్టం చేశారు. ఏ రకంగా భారత్ను డొనాల్డ ట్రంప్ గౌరవిస్తున్నారో చెప్పకపోయినా, త్వరలోనే ఇరుదేశా మధ్య సంబంధాలు తిరిగి యథాస్థితికి వస్తాయని జోస్యం చెప్పారు. ట్రంప్ వైఖరిపై చాలాకాలం ఓపిక పట్టిన భారత్.. ఇప్పుడు మాటల యుద్ధాన్ని ఆరంభించింది. అటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా రష్యాతో బంధాన్ని చెడగొట్టాలని చూసిన ట్రంప్కు.. భారత్ అనూహ్య షాకిచ్చింది. తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని, అందుకు రష్యాతో చమురు కొనుగోలులో ఎటువంటి మార్పు ఉండబోదనే సంకేతాలు పంపింది. దాంతో ట్రంప్కు నోట్లో ఎలక్కాయపడినట్లు అయ్యింది. ప్రస్తుతం నేరుగా మాట్లాడకుండా రాజీ చేసుకునే మంత్రాన్ని అమలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారనేది ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి కనిపిస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహు కూడా అమెరికా-భారత్ సంబంధాలు తిరిగి మెరుగుపడతాయని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని కూడా చెప్పారు. మరి ఇప్పుడు అమెరికా మాజీ దౌత్యవేత్త మిచెల్ బామ్గార్టనర్ సైతం అదే పల్లవి అందుకున్నారు. ఈ రెండు పెద్ద దేశాల మధ్య పలు ప్రాథమిక అంశాలు చాలా బలంగా ఉన్నాయనేది ఒప్పుకోక తప్పదన్నారు. అందువల్ల ఇరు దేశాలు తిరిగి పూర్వ స్థితిని కొనసాగించే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. -
ఈసారి పాక్ను కలిపి ఇచ్చి పడేశారు..!
ఎన్ జైశంకర్.. భారత విదేశాంగ మంత్రిగా సేవలందిస్తున్నారు. ఏదైనా విషయం వచ్చినప్పుడు సమయ స్ఫూర్తిగా స్పందించడంలో జై శంకర్ది ప్రత్యేక శైలి. ఆయనలోని చలోక్తిని కౌంటర్ అనుకోవచ్చు.. చమత్కారం అనుకోవచ్చు.. ఆయన మాటలు ప్రత్యర్థులకు బాధ కల్గించినా కాస్త కచ్చితత్వంతోనే ఉంటాయి. ఈ క్రమంలోనే నేడు(శనివారం, ఆగస్టు 23వ తేదీ) అమెరికా-పాకిస్తాన్లపై సెటైరిక్గా స్పందించారు. ఎకనమిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలోఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్ల ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా జై శంకర్కు ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా పాక్-అమెరికాల వైఖరిపై జై శంకర్ ఘాటుగా స్పందించారు. ఇరు దేశాల చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అంటూనే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ ఇరు దేశాలు వారి చరిత్రను మర్చిపోయినట్లు ఉన్నాయంటూ సమాధానం చెప్పారు. #WATCH | Delhi: "They have a history with each other, and they have a history of overlooking their history... It is the same military that went into Abbottabad (in Pakistan) and found who there?..." says EAM Dr S Jaishankar on relations between US and Pakistan, at The Economic… pic.twitter.com/wpYGfdLpbc— ANI (@ANI) August 23, 2025 ఆ రెండు దేశాలు వారి చరిత్రను విస్మరించినట్లు ఉన్నారు అంటూ ఆల్ ఖైదా నాయకుడు బిన్ లాడెన్ను అమెరికా ఎలా హతమార్చిందనే సంగతిని ఇక్కడ ప్రస్తావించారు. అమెరికా-పాకిస్తాన్లకు చరిత్ర ఉంది. కానీ వారి చరిత్రను వారే మర్చిపోయారో, విస్మరించారో అనేది వారికే తెలియాలి అంటూ బుల్లెట్ లాంటి రిప్లై ఇచ్చారు జైశంకర్.ఇదీ చదవండి: భారత్తో సమస్య ఉంటే.. ట్రంప్కు జై శంకర్ స్పష్టీకరణ -
వారిద్దరినీ కలపడం చాలా కష్టమైన పని: ట్రంప్
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. ఇదే సమయంలో పుతిన్-జెలెన్స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ముందుగా కలుస్తారో లేదో చూడాలనుకుంటున్నాను. పుతిన్-జెలెన్స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం.. నూనె వెనిగర్ను కలపడం లాంటి కష్టమైన ప్రక్రియ. వారిద్దరూ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ఒకవేళ సమావేశం జరగకపోతే, ఎందుకు సమావేశం కాలేదో అందుకు గల కారణాలను తెలుసుకుంటానని అన్నారు. శాంతి చర్చలకు రష్యా ఒప్పుకోని క్రమంలో మాస్కో మరోసారి భారీ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు.Q: “How long will you give Putin?”Trump: “A couple of weeks. We’re going to figure this out. It takes two to tango… In the meantime, people continue to die.”Trump is NEVER going to hold Putin accountable. Ever.pic.twitter.com/TusMVxEIXk— Republicans against Trump (@RpsAgainstTrump) August 22, 2025అయితే ఇరు దేశాలూ యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రజలను చంపుకుంటూనే ఉన్నారు. ఇది చాలా మూర్ఖత్వం. యుద్ధం వల్ల వారానికి 7,000 మంది చనిపోతున్నారు. నేను ముందు 5,000 అన్నాను కానీ ఇప్పుడు 7,000 మంది వారానికి చనిపోతున్నారు. అందులో ఎక్కువ మంది సైనికులే ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా రష్యా క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్లో ఒక అమెరికన్ కర్మాగారం దెబ్బతిన్నట్టు వచ్చిన వార్తపై స్పందిస్తూ ట్రంప్ స్పందించారు. రష్యా దాడుల విషయంలో తాను సంతోషంగా లేనని చెప్పారు. తాను ఏడు యుద్ధాలను పరిష్కరించానని చెప్పారు. మొత్తం 10 యుద్ధాలు ఆపిన తాను ఉక్రెయిన్- రష్యా యుద్ధం విషయంలో అస్సలు సంతోషంగా లేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్- పాక్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఇండియా–పాకిస్థాన్ మధ్య అణు యుద్ధాన్ని తాను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. -
ట్రంప్ మరో ఎత్తుగడ: భారత రాయబారిగా సన్నిహితుడు సెర్గియో గోర్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను తనదారికి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్ పై తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ ఇప్పుడు తన దగ్గరున్న మరో అస్త్రం ప్రయోగించారు. భారత్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్లో తమ దేశ రాయబారిని మారుస్తూ అకస్మాత్తు నిర్ణయం తీసుకున్నారు.భారత్- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో ఈ నిర్ణయం కీలకంగా పరిణమంచింది. వైట్ హౌస్లో తనకు అత్యంత సన్నిహితుడు, పర్సనల్ డైరెక్టర్ గా ఉన్న సెర్గియో గోర్ ను ట్రంప్ భారతదేశ నూతన రాయబారిగా నియమించారు. చమురు కొనుగోలు తదితర అంశాలలో భారత్ రష్యా బంధం బలపడుతున్న సమయంలో ట్రంప్.. సర్గియోకు నూతన బాధ్యతలు అప్పజెప్పారు. ఈ పదవి ఖాళీ అయిన ఎనిమిది నెలల తర్వాత ఈ తాజా నియామకం జరిగింది. సెర్గియో గోర్ అధ్యక్షుడు ట్రంప్కు అత్యంత విధేయునిగా పేరుగాంచాడు. భారత రాయబాది సెర్గియో గోర్ నియామకాన్ని తన ట్రూత్ సోషల్లో తెలియజేసిన ట్రంప్ త్వరలోనే ఆయన పరిపాలనా విభాగంలో చేరనున్నారని ప్రకటించారు. సెర్గియో గోర్ దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగా విధులు నిర్వహించనున్నారు. ఆయనను స్పెషల్ ఎన్వాయ్ ఫర్ సౌత్ సెంట్రల్ ఏసియన్ ఎఫైర్స్గా ట్రంప్ నియమించారు. ఆయన భారత్కు వెళ్లేంతవరకు వైట్హౌస్లోనే తన పాత విధులను నిర్వహిస్తారని ట్రంప్ ఆ పోస్ట్ లో తెలియజేశారు.సెర్గియో తనకు అత్యంత సన్నిహితునిగా ఉన్నారని, చాలా కాలంగా తనకు మద్దుతునిస్తూ, తాను ఎన్నికల్లో గెలిచేందుకు అమితమైన కృషి చేశారని తెలిపారు. అమెరికా అధ్యక్ష సిబ్బందిగా సెర్గియో పాత్ర చాలా కీలకమైనదని ట్రంప్ పేర్కొన్నారు. తాను పాలనలోకి అడుగుపెట్టాక సెర్గియో ఎన్నోమంచి పనులు చేశారన్నారు. ఆయన తన బృందంలో నాలుగువేల మంది దేశ భక్తులను నియమించుకున్నారని,ఫెడరల్ ప్రభుత్వ శాఖల్లోని 95 శాతం ఉద్యోగాలను ఆయన భర్తీ చేశారన్నారు. అతి పెద్ద జనాభా కలిగిన భారత దేశంలో అమెరికా ఎజెండాను పూర్తి చేసేందుకు సెర్గియో తోడ్పడతారని ట్రంప్ పేర్కొన్నారు. -
ట్రంప్ మాజీ సలహాదారు బోల్టన్ ఇంట్లో సోదాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మొదటి సారిగా ఎన్నిౖకైన సమయంలో 2018–19 సంవత్సరాల్లో జాతీయ భద్రతా సలహా దారుగా వ్యవహరించిన జాన్ బోల్టన్ నివాసంపై ఎఫ్బీఐ అధికారులు దాడులు జరిపారు. మేరీల్యాండ్లోని బెథెస్డాలో ఉన్న బోల్టన్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ విషయాన్ని ఎఫ్బీఐ అధికారులు ధ్రువీకరించారు. ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. రహస్య పత్రాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగానే సోదాలు చేపట్టినట్లు మీడియా అంటోంది. వాషింగ్టన్ డీసీలోని బోల్టన్ కార్యాలయంలోనూ సోదాలు జరిగాయని తెలిపింది. అప్పటి ట్రంప్ పాలనపై బోల్టన్ 2020లో ఒక పుస్తకం రాశారు. ఇందులో ట్రంప్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పుస్తకంలోని పలు అంశాలను అధికార రహస్య పత్రాల ద్వారానే బోల్టన్ పొందినట్లు ట్రంప్ గతంలో విమర్శలు చేశారు. దాడులపై బోల్టన్ స్పందించలేదు. దాడుల విషయంతనకు తెలియదని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. -
ట్రంప్ కు భారీ షాక్.. భారత్ వెంట చైనా
-
సుంకాల్లో భారత్ ‘మహారాజ్’.. అమెరికా అధికారి విమర్శలు
వాషింగ్టన్: భారత్ టార్గెట్గా అమెరికా మరోసారి సంచలన విమర్శలు చేసింది. సుంకాల్లో భారత్ను ‘మహారాజ్’ అని పేర్కొంటూ వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ప్రకారమే రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భారత రిఫైనరీలు యుద్ధానికి ఆజ్యం పోస్తూ డబ్బు సంపాదిస్తున్నాయని అన్నారు.వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీటర్.. ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదన్నారు. గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సుంకాలు విధించడంలో భారత్.. ‘మహారాజ్’గా ఉంది. భారత్ సుంకాలు ఎక్కువగా ఉంటాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్కు చెందిన రిఫైనరీలు లాభాలు ఆర్జిస్తున్నాయి. రష్యా ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది.White House Trade Adviser Peter Navarro on India: "Nonsense that India needs Russian Oil""Profiteering by Indian refiners""India has Maharaja tariffs""Road to peace runs thru New Delhi" pic.twitter.com/w64a9nRg2P— Sidhant Sibal (@sidhant) August 21, 2025భారత్కు రష్యన్ చమురు అవసరం అనేది అర్ధం లేనిది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ తన పాత్రను గుర్తించాలని కోరుకోవడం లేదు. భారత్ మనకు వస్తువులను అమ్మి.. వారు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడానికి మన నుండి వచ్చే డబ్బును ఉపయోగిస్తున్నారు. రష్యన్లు ఆ డబ్బును మరిన్ని ఆయుధాలను కొనుగోలు చేయడానికి, ఉక్రెయిన్ ప్రజలపై దాడులు చేయడానికి అది వాడుకుంటున్నారు అని ఆరోపించారు. భారత నాయకత్వాన్ని నేను విమర్శించాలని నేను అనుకోవడం లేదు. మోదీ గొప్ప నాయకుడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర ఏంటో చూడండి.. మీరు ప్రస్తుతం చేస్తున్నది శాంతిని పునరుద్ధరించడానికి కాదు.. అది యుద్ధాన్ని కొనసాగిస్తోంది. రష్యా పట్ల భారత్ తన వైఖరి మార్చుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కాస్త తగ్గిన పుతిన్? ట్రంప్, జెలెన్స్కీ ‘నో’ కామెంట్స్
నాలుగేళ్ల తర్వాత అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు భేటీ అయ్యారు. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగానే ఈ సమావేశం జరిగిందన్నది తెలిసిందే. అయితే ఆ మీటింగ్ సారాంశమేమీ ఇప్పటిదాకా బయటకు రాలేదు.ఆగస్టు 15వ తేదీన మూడు గంటలపాటు రహస్య మంతనాలు చేసిన ఈ ఇరుదేశాల నేతలు.. సంయుక్త మీడియా సమావేశంలో తాము చెప్పాలనున్నది చెప్పి తలోదారి వెళ్లిపోయారు. దీంతో భేటీ సంతృప్తికరంగా జరగలేదనే విశ్లేషణలు నడిచాయి. అయితే తాజాగా ఆ భేటీలో ఉక్రెయిన్కు పుతిన్ చేస్తున్న(అలస్కాలో చేసిన) డిమాండ్లు ఏంటో ప్రస్తావిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. రష్యా అధ్యక్ష కార్యాలయం ‘క్రెమ్లిన్’ వర్గాలు వెల్లడించిన ఆ డిమాండ్లను పరిశీలిస్తే..డోన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా అప్పగించడంనాటోలో చేరాలనే ఆలోచనను పక్కనపెట్టేయడంపశ్చిమ బలగాల మోహరింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదుఉక్రెయిన్పై ఒత్తిడి తగ్గించిన పుతిన్?వాస్తవానికి ఈ మూడు పాత డిమాండ్లే! మరి కొత్తగా పుతిన్ ఏం చెబుతున్నారంటే.. 2024 జూన్లో ఉక్రెయిన్కు పెట్టిన కఠినమైన భూభాగాల డిమాండ్లను కొంత మేర తగ్గించినట్టు రష్యా వర్గాలు అంటున్నాయి. పాత డిమాండ్లను పరిశీలిస్తే.. డోనెత్స్క్(Donetsk), లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను పూర్తిగా రష్యాకు అప్పగించాలి. నాటో సభ్యత్వాన్ని త్యజించాలి. పశ్చిమ దేశాల బలగాలు ఉక్రెయిన్లో మోహరించకూడదు.కొత్త ప్రతిపాదనల్లో.. ఉక్రెయిన్ డోన్బాస్లో తన నియంత్రణలో ఉన్న భాగాల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గాలి. రష్యా జపోరిజ్జియా, ఖెర్సన్ ప్రాంతాల్లో ప్రస్తుత యుద్ధ రేఖలను నిలిపివేస్తుంది. ఖార్కివ్, సుమీ, డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతాల్లో రష్యా ఆక్రమించిన చిన్న భాగాలను తిరిగి అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం.. డోన్బాస్లో 88%, జపోరిజ్జియా, ఖెర్సన్లో 73% రష్యా నియంత్రణలో ఉంది.అయితే.. నాటో విస్తరణపై నిషేధం, ఉక్రెయిన్ సైన్యంపై పరిమితులు, పశ్చిమ శాంతి బలగాల మోహరింపు నిషేధం వంటి పాత డిమాండ్లు మాత్రం కొనసాగుతున్నాయి. అదే సమయంలో.. 2022 ఇస్తాంబుల్ ఒప్పందాలను పునరుద్ధరించే అవకాశం కూడా పరిశీలనలో ఉంది. ఇందులో ఐరాస భద్రతా మండలి నుంచి ఉక్రెయిన్కు భద్రతా హామీలు పొందే ప్రతిపాదన ఉంది.ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. గతంలో ఈ డిమాండ్లను "సరెండర్" (లొంగిపోవడం)గా అభివర్ణించిన తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, రష్యా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి వెనక్కి తగ్గే ఆలోచనను పూర్తిగా తిరస్కరించారు.డోనెత్స్క్, లుహాన్స్క్(Donetsk) కలిపిన డోన్బాస్ ప్రాంతం ఉక్రెయిన్కు రక్షణ కోటగా పనిచేస్తుందని జెలెన్స్కీ మొదటి నుంచి చెబుతున్నారు. ‘‘తూర్పు ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గడం అంటే దేశం ఉనికి కోల్పోవడం’’ అని అంటున్నారాయాన. ‘‘ఇది మా శక్తివంతమైన రక్షణ రేఖల అంశం’’ అని కుండబద్దలు కొట్టారు. ఇక.. నాటో సభ్యత్వం.. రాజ్యాంగబద్ధ లక్ష్యమని చెప్పారు. పైగా దీనిని ఉక్రెయిన్కు భద్రతా హామీగా భావిస్తున్నారు. నాటో సభ్యత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు రష్యాకు లేదు అని జెలెన్స్కీ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్, నాటో రష్యా కొత్త ప్రతిపాదనలపై ఇప్పటివరకైతే స్పందించలేదు.అలాస్కాలోని అంకరేజ్ నగరంలో జరిగిన అమెరికా-రష్యా అధ్యక్షులు భేటీ తర్వాత శాంతికి ఉత్తమ అవకాశాలు ఏర్పడినట్టు క్రెమ్లిన్ వర్గాలు అంటున్నాయి. అయితే.. డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం రాజకీయంగా, వ్యూహపరంగా అసాధ్యమైన విషయని పరిశీలకులు అంటున్నారు. రెండు పక్షాలకు అంగీకారయోగ్యంగా లేని షరతులతో శాంతి ప్రతిపాదనలు చేయడం.. ట్రంప్కు షో మాత్రమే కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.అస్పష్టతలు & అడ్డంకులుఉక్రెయిన్ డోన్బాస్ను అప్పగించేందుకు సిద్ధంగా ఉందా? అనే అంశంపై రష్యాకు స్పష్టత లేదు.అమెరికా రష్యా ఆక్రమించిన భూభాగాలను గుర్తిస్తుందా? అనే ప్రశ్న కూడా ఇంకా పరిష్కారమవ్వలేదు.జెలెన్స్కీ అధికార బాధ్యతపై పుతిన్ సందేహాలు వ్యక్తం చేశారు, కానీ కీవ్ ఆయనను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా పేర్కొంటోంది.ట్రంప్ పాత్రఉక్రెయిన్ యుద్ధం ముగించి.. తానొక శాంతి కాముకుడిననే విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పుతిన్, జెలెన్స్కీలతో విడిగా భేటీ అయిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్-అమెరికా త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. -
వీసాలపై ట్రంప్ స్పెషల్ ఫోకస్.. 5.5 కోట్ల మంది టార్గెట్
వాషింగ్టన్: అమెరికాలో వీసాల విషయంలో ట్రంప్ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికా ఉన్న సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను మరింత క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా యంత్రాంగం ఓ ప్రకటనలో పేర్కొంది. డ్రైవర్లకు వర్కర్ వీసాలు మంజూరు చేయడం లేదని మార్కో రూబియో బాంబు పేల్చారు. దీంతో, మరిన్ని వీసాలపై కోత విధించే అవకాశం ఉంది.అయితే, అమెరికాలో ఎవరైనా వీసా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారా అన్నది నిర్ధారించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్లు ట్రంప్ యంత్రాంగం తెలిపింది. ఈ సందర్బంగా అమెరికాలో నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చినా, వీసా కాల పరిమితిని మించి అమెరికాలో నివసిస్తున్నా, ప్రజాభద్రతకు భంగం కలిగించినా అలాంటి వ్యక్తులను స్వదేశాలకు తిప్పి పంపించే చర్యల్లో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక, అమెరికా చట్టాల ఉల్లంఘనలను సైతం సమీక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం అమెరికా చట్టాలను మీరితే విద్యార్థి వీసాలను రద్దుచేయడం ఖాయమని గతంలోనే స్పష్టం చేసిన ట్రంప్ ప్రభుత్వం అన్నంతపనీ చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తూ, పలురకాల నేరాలకు పాల్పడినందుకు శిక్షగా ఇప్పటిదాకా 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఇతరులపై దాడులు, మద్యం సేవించి వాహనం నడపడం, చోరీలకు పాల్పడటం, ఉగ్రవాదానికి నైతిక మద్దతు పలకడం, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయిన అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసాలను రద్దుచేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.🚨 BREAKING: The Trump admin is reviewing ALL 55 MILLION PEOPLE with visas in the United States for potentially deportable violations, per APA LOT of people who hate us are about to be sent home! 🔥Visa holders have been allowed to get away with violations for FAR too long! pic.twitter.com/S5bNIMSgA2— Nick Sortor (@nicksortor) August 21, 2025డ్రైవర్లకు వర్కర్కు నో వీసా.. మరోవైపు.. వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్ వీసాలు మంజూరు చేయమని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో, అమెరికన్లకు ఉద్యోగాలు సైతం లేవన్నారు. అయితే, ఆగస్టు 12న ఫ్లోరిడా టర్న్పైక్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత రూబియో హెచ్చరించడం గమనార్హం. కాగా, సదరు ట్రక్కు డ్రైవర్.. భారత్ నుంచి వలస వెళ్లడం, అతడు చట్ట విరుద్దంగా అమెరికాలో నివాసం ఉంటున్నట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ల వీసాలపై కూడా ట్రంప్ యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక, అమెరికాలో 2023 నాటికి 16 శాతం ట్రక్కు డైవర్లు ఇతర దేశస్థులే ఉన్నట్టు తెలుస్తోంది. Effective immediately we are pausing all issuance of worker visas for commercial truck drivers. The increasing number of foreign drivers operating large tractor-trailer trucks on U.S. roads is endangering American lives and undercutting the livelihoods of American truckers.— Secretary Marco Rubio (@SecRubio) August 21, 2025నాలుగు వేల వీసాలు రద్దు.. అమెరికా చట్ట నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ ఆరువేల మందిలో దాదాపు నాలుగు వేల మంది వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 300 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ‘ఇమిగ్రేషన్, నేషనల్ యాక్ట్లోని మూడో సెక్షన్ ప్రకారం ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిన వారి వీసా రద్దు అవుతుంది. పాలస్తీనా అనుకూల, యూదు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న వారి వీసా రద్దు అవుతుంది. ఉగ్రసంస్థకు అనుకూలంగా వ్యవహరించడం, అమెరికా పౌరులకు ప్రాణహాని కల్పించడం సైతం చట్టాన్ని ఉల్లంఘించే చర్యలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.జనవరి నుంచి వేలాది మంది విద్యార్థుల వీసాల అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ను అర్థంతరంగా ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడం తెలిసిందే. జూన్లో మళ్లీ వీసాల అపాయింట్మెంట్లను పునరుద్ధరించినప్పటికీ అభ్యర్థులంతా తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు అధికారులు తనిఖీ చేసేందుకు వీలుగా ‘పబ్లిక్’ మోడ్లోనే ఉంచాలని సూచనలు చేసింది. మరోవైపు.. అమెరికాలో రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎస్లో అక్రమంగా నివసిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. వారందరినీ అమెరికా నుంచి స్వదేశాలకు పంపించేశారు. -
ట్రంప్ ఓవరాక్షన్.. భారత్కు రష్యా బంపరాఫర్
మాస్కో: భారత్–రష్యా సంబంధాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా నానాటికీ బలపడుతున్నాయని రష్యా సీనియర్ దౌత్యవేత్త, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రొమన్ బాబుష్కిన్ చెప్పారు. భారత ఉత్పత్తులకు తమ మార్కెట్ ద్వారాలు తెరిచి ఉన్నట్లు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.రొమన్ బాబుష్కిన్ బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తొలుత హిందీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ‘ఇక ప్రారంభిద్దాం.. శ్రీగణేషుడే ప్రారంభిస్తున్నాడు’ అని విలేకరులను ఉద్దేశించి చెప్పారు. భారత్–రష్యా సంబంధాలకు పరస్పర విశ్వాసమే మూలస్తంభమని పరోక్షంగా స్పష్టంచేశారు. అమెరికాతోపాటు పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి రష్యా–ఇండియా–చైనా(ఆర్ఐసీ) మధ్య చర్చలు, పరస్పర సహకారాన్ని పునరుద్ధరించుకొనే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.‘మిత్రులను’ అవమానించేందుకు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకాడటం లేదని మండిపడ్డారు. ‘రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తే తప్పేమిటి? దీనిపై పశ్చిమ దేశాలే సమాధానం చెప్పాలి. భారత్ మాకు చాలా ముఖ్యమైన దేశం. భారత్కు చమురు సరఫరాను తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదు’ అని బాబుష్కిన్ తేల్చి చెప్పారు. దీంతో, అమెరికాకు రష్యా గట్టి సమాధానం చెప్పినట్టు అయ్యింది.భారత్కు 5 శాతం రహస్య తగ్గింపుమరోవైపు.. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి భారత్ పరోక్షంగా అండగా నిలుస్తోందని ట్రంప్ కన్నెర్ర చేస్తున్న వేళ ముడి చమురు కొనుగోలుపై భారత్కు ఐదు శాతం రహస్య తగ్గింపు(డిస్కౌంట్) ఆఫర్ చేస్తున్నట్లు భారత్లోని రష్యా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి ఎవ్గెనీ గ్రీవా బుధవారం వెల్లడించారు. ఇది వాణిజ్య సీక్రెట్ అని చెప్పడం గమనార్హం. ఈ ఐదు శాతం డిస్కౌంట్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు ఉంటాయన్నారు. రష్యా నుంచి చమురు కొనే భారత వ్యాపారవేత్తలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. చమురు విషయంలో షిప్పింగ్, బీమా సంబంధిత అంశాలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగం ఉన్నట్లు తెలిపారు. ఇండియా చమురు అవసరాల్లో ఏకంగా 40 శాతం రష్యానే తీరుస్తోందని ఎవ్గెనీ గ్రీవా వివరించారు. బ్యారెల్కు 5 శాతం చొప్పున డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇండియా ప్రతిఏటా 250 మిలియన్ టన్నుల ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని, ఇందులో 40 శాతం రష్యా చమురే ఉంటోందని స్పష్టంచేశారు. -
పుతిన్, జెలెన్ స్కీ భేటీపై ఆసక్తి
-
భారత్పై సుంకాలు అందుకే.. కరోలిన్ లీవిట్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్పై సుంకాల విషయమై అమెరికా మరోసారి స్పందించింది. ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహంలో భాగంగానే భారత్పై సుంకాల విధించినట్టు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పుకొచ్చారు. రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలా చేసినట్టు తెలిపారు.వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయా దేశాల నేతలతో ట్రంప్ చర్చల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్పై దాడులు నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై ట్రంప్ దృష్టి సారించారు. ఆ దేశాలను లక్ష్యంగా చేసుకొని ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నారు. అది ట్రంప్ పరిపాలన వ్యూహం. ఇందులో భాగంగా భారత్పై 50 శాతం సుంకాలను విధించారని అన్నారు. ఇదే సమయంలో భారత్ ఎప్పుడు అమెరికాకు మిత్ర దేశమే అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత్- పాక్ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ వాణిజ్యంతో ముగించారని పాత పాటే పాడారు.మరోవైపు.. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని తెలిపారు. నాటో సెక్రటరీ జనరల్తో సహా యూరోపియన్ నాయకులతో జరిగిన చర్చలే తొలి అడుగు అని పేర్కొన్నారు. త్వరలోనే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. Breaking:President Trump has put 'sanctions' on India to put 'this war (in Ukraine) to a close' & he 'wants to see this war end' says White House Spokesperson Karoline Leavitt pic.twitter.com/rLLq6aiznT— Sidhant Sibal (@sidhant) August 19, 2025 -
ట్రంప్ బాంబ్.. 6 వేల మంది వీసాలు రద్దు
-
సంధి సాధ్యమేనా?!
పరస్పరం కలహించుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ల మధ్య సంధి కుదర్చటానికీ, సామరస్యం సాధించటానికీ అలాస్కా శిఖరాగ్ర సమావేశానికి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చివరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అనధికార అధికార ప్రతినిధిగా మారి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాల్పుల విరమణకు రష్యా అంగీకరించకపోతే కఠినాతికఠినంగా వ్యవహరిస్తామని అలాస్కా సమావేశానికి ముందు హెచ్చరించిన ఆయన... కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని, శాంతి ఒప్పందం కోసం చర్చలు జరగాలని చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం వైట్హౌస్లో తనను కలిసినప్పుడు సైతం ఇలాంటి సలహాయే ఇచ్చారు. దీన్ని ఏదో మేరకు సరిదిద్ది, ఉక్రెయిన్కు కనీస భద్రత గ్యారెంటీనైనా సాధించాలన్న ధ్యేయంతో ఆరుగురు యూరొప్ దేశాల నేతలు ట్రంప్తో భేటీ అయ్యారు. అమెరికాతో పాటు రష్యా, ఉక్రెయిన్లు పాల్గొనే త్రైపాక్షిక చర్చలకు సుముఖంగా ఉన్నామని ట్రంప్ చెప్పటం ఉన్నంతలో ఊరటనిచ్చే అంశం. కానీ ట్రంప్ దానికైనా కట్టుబడతారా లేదా... పుతిన్ను ఒప్పించగలరా లేదా అన్నది చెప్పలేం. జెలెన్స్కీకి మొన్న ఫిబ్రవరిలో వైట్హౌస్లో ఎదురైన చేదు అనుభవాలను నివారించి, ఆయన వెనక యూరప్ దేశాలన్నీ ఉన్నాయని చెప్పటానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడెరిక్ షుల్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తదితరులు కలిశారు. కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్నార్థకం. ఉక్రెయిన్కు ‘నాటో తరహా’ భద్రత కల్పించటానికి ట్రంప్ అనుకూలమే గానీ అదంతా యూరప్ దేశాలే చూసుకోవాలట. తమ వంతుగా గగనతల రక్షణ విషయంలో సాయంగా నిలుస్తారట! అసలు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ఏం చేస్తారనే ఆదుర్దా కన్నా ఆయన నాటో పక్షాన ఉంటారా ఉండరా అనే బెంగ ఎక్కువైంది. జెలెన్స్కీతో మళ్లీ ఆయన లడాయికి దిగితే అటుతర్వాత తాము సైతం మాట్లాడే స్థితి ఉండకపోవచ్చన్న భయంతోనే యూరప్ అధినేతలు వైట్హౌస్కు వెళ్ళినట్టు కనిపిస్తోంది. కోల్పోయిన భూభాగాల గురించీ, నాటో సభ్యత్వం గురించీ మరిచిపోవాలని తొలుత తనను కలిసిన జెలెన్స్కీకి చెప్పటంతో పాటు యూరప్ దేశాధినేతల ముందు కూడా ట్రంప్ ఆ మాటే అనటం గమనించదగ్గది. ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన నాటి నుంచీ పుతిన్ చెప్పిన మాటల్నే ట్రంప్ ఇప్పుడు వల్లిస్తున్నారు. చాలా అంశాల్లో పుతిన్కూ, తనకూ ఏకాభిప్రాయం కుదిరిందని ఆ శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన ఇప్పటికే ప్రకటించారు. పుతిన్ దాదాపు పన్నెండేళ్ల క్రితం ఆక్రమించిన క్రిమియాలో పలు పట్టణాలు, నదులూ, పర్వతశ్రేణులూ ఉన్నాయి. విలువైన పంటభూములున్నాయి. ఇవిగాక మూడున్నరేళ్లకు పైగా సాగుతున్న దురాక్రమణ యుద్ధంలో ఆక్రమించుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలున్నాయి. వీటిని వదులుకోవటమంటే జెలెన్స్కీకి ఆత్మహత్యా సదృశం. అయినా తమ కోసం ట్రంప్ ఎంతో చేస్తున్నారని ప్రశంసించి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సి వచ్చింది. జెలెన్స్కీకి అంతకన్నా గత్యంతరం లేదు. ఉక్రెయిన్కి ప్రస్తుతం అందుతున్న సాయంలో 47 శాతం వాటా అమెరికాదే. జర్మనీ 9, బ్రిటన్ 8, జపాన్ 6 శాతాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కెనడా, నెదర్లాండ్స్, స్వీడన్, ఫ్రాన్స్ వంటివి ఒకటి, రెండు శాతాలకు మించి ఇవ్వడం లేదు. అందుకే జెలెన్స్కీ నోరెత్తలేకపోతున్నారు.అమెరికా గత పాలకుల ప్రాపకంతో ఉక్రెయిన్ను రెచ్చగొట్టి, రష్యాతో గిల్లికజ్జాలకు దిగేలా చేసిన యూరప్ దేశాలకు ఇప్పుడు ఏం చేయాలో పాలుబోని దుఃస్థితి. నెలక్రితం ట్రంప్తో మాట్లాడాక అంతా సామరస్యంగా పరిష్కారమైందని, ఉక్రెయిన్ విషయంలో తమను సంప్రదించకుండా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోబోరని యూరప్ దేశాధినేతలు నమ్మారు. అలాస్కా శిఖరాగ్రానికి వారం రోజుల ముందు కూడా వారంతా ట్రంప్ను కలిశారు. ఆ భేటీకి జెలెన్స్కీని కూడా తీసుకెళ్లారు. ముందు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాలనీ, ఆ తర్వాతే ద్వైపాక్షికమో, త్రైపాక్షికమో చర్చలుండాలనీ ఆ భేటీలో అందరూ అభిప్రాయపడ్డారు. తాజాగా ట్రంప్ త్రైపాక్షిక చర్చల గురించి మాట్లాడుతున్నా పుతిన్ అందుకు సుముఖంగా ఉంటారా అన్న సంశయం అందరినీ పీడిస్తోంది. ఆ మాటెలా ఉన్నా అలాస్కా శిఖరాగ్రం భారత్కు ఎంతో కొంత మేలు చేసిందని చెప్పాలి. రష్యాపై ఆగ్రహంతో మనపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఆ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు చెబుతున్న మాటకు కట్టుబడి సాధ్యమైనంత త్వరలో త్రైపాక్షిక చర్చలకు ట్రంప్ చొరవ తీసుకుంటే... పుతిన్ను ఒప్పిస్తే అది శాంతికి దోహదపడుతుంది. -
శాంతి సాధనలో మూడు ముక్కలాట
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 15న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో, 18 నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయ కులతో జరిపిన చర్చలు ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. అందుకు సంబంధించి ఉండిన చివరి అనుమానాలు 18 నాటి వైట్ హౌస్ సమావేశంతో తీరిపోయాయి. అంతకుముందు 15న అలాస్కాలో ట్రంప్, పుతిన్ల మధ్య జరిగిన చర్చలలో కనిపించిన సానుకూలతను జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయకులు వైట్హౌస్ సమావేశంలో భంగపరచవచ్చుననే సందేహా లుండేవి. శాంతి ప్రయత్నాలకు ముందు కాల్పుల విరమణ జరిగి తీరాలనే పట్టుదలతో ఉండిన ఆ బృందం, ట్రంప్ ఆలోచనను తిరిగి మార్చవచ్చుననే భావన చాలా మందికి కలిగింది. కానీ, అది గ్రహించి కావచ్చు 18 నాటి చర్చలకు ముందు రాత్రే ట్రంప్, కేవలం కాల్పుల విరమణ వల్ల ఉపయోగం లేదనీ, పూర్తి స్థాయిలో శాంతి కోసం ప్రయత్నం జరగాలనీ స్పష్టం చేశారు.పుతిన్ వాదనను అంగీకరించిన ట్రంప్అంతిమంగా అలాస్కా, వైట్ హౌస్ భేటీల సారాంశం ఏమిటి? మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంపై అమెరికా, రష్యా అధ్యక్షులు మొదటిసారి సమావేశమయ్యారు. వెంటనే కాల్పుల విరమణకు పుతిన్ను ఒత్తిడి చేయగలనని, అందుకు సమ్మతించని పక్షంలో తీవ్ర మైన చర్యలు తీసుకోగలనంటూ వెళ్లారు ట్రంప్. అక్కడ మూడు గంటల చర్చలలో పుతిన్ ఇచ్చిన సుదీర్ఘమైన వివరణలతో పూర్తిగా సంతృప్తి చెంది, కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని,సంపూర్ణ స్థాయిలో శాంతి సాధనే సరైన మార్గమనే వాదనతో అంగీ కరించారు. చంచల స్వభావిగా పేరున్న ఆయన అటువంటి అభిప్రా యంపై స్థిరపడటం ఈ కథాక్రమంలోని కీలకమైన మలుపు. పుతిన్ వాదన నచ్చినప్పటికీ అట్లా స్థిరపడక పోయి ఉంటే, యూరోపియన్ల సమావేశంలో తన ఆలోచనను తిరిగి మార్చుకునే వారేమో! అపుడు విషయం మళ్లీ మొదటికి వచ్చేది. జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ షుల్జ్, యూరోపియన్ నాయకుల తరఫున మాట్లాడుతూ, శాంతి చర్చల కన్నా ముందు కాల్పుల విరమణ తప్పనిసరియని వాదించారు. కానీ ట్రంప్ జర్మనీ ఛాన్స్లర్ మాటను తోసిపుచ్చారు.ఈ ఒక్క విషయమే ఇంతగా చెప్పుకోవటం ఎందుకంటే, ఈ దశలో మొత్తం విషయమంతా అమెరికా అధ్యక్షుడు ఎవరి వాదనను అంగీకరించి ముందుకు పోగలరన్న దానిపైనే ఆధారపడి ఉంది. ఇపుడు రెండు చర్చల అనంతరం అందుకు స్పష్టత వచ్చినందున ఇతర విషయాలను చూద్దాము. అవి ప్రధానంగా మూడు. ఒకటి– రష్యా కోరుతున్న భూభాగాలను ఉక్రెయిన్ వదలుకోవటం; రెండు– ఉక్రెయిన్ ‘నాటో’లో చేరకపోవటం; మూడు– ఉక్రెయిన్కు భవిష్యత్తులో భద్రత కోసం రక్షణ హామీలు లభించటం. ఈ మూడు అంశాలు కూడా అలాస్కాలో, వైట్ హౌస్లో ప్రస్తావనకు వచ్చాయి. రష్యా తాను ఇప్పటికే పూర్తిగానో, పాక్షికంగానో ఆక్రమించిన క్రిమియా, డొనెటెస్క్, జపోరిజిజియా, ఖేర్సాన్, లుహాన్స్క్, ఖార్కివ్ ప్రాంతాలను తమకు అప్పగించటం, ఆ యా నియంత్రణ రేఖలను అదే స్థాయిలో స్తంభింపజేయటం జరగాలని కోరుతున్నది. అవి అన్నీ కాకపోయినా ఏదో ఒక మేరకు వదులుకోవాలని ట్రంప్ మొదటినుంచి అంటున్నారు. యూరోపియన్ నాయకుల వైఖరి ఇంచుమించు అదే! వైట్ హౌస్ చర్చల సందర్భంలో అవుననక, కాదనక... అది జెలెన్స్కీ తేల్చుకోవలసిన విషయమని వదలి వేశారు. భూభాగాలను వదలుకొనే ప్రసక్తి లేదని జెలెన్స్కీ అంటూనే, అది తనకు, పుతిన్కు, ట్రంప్కు మధ్య త్రైపాక్షిక చర్చ లలో తేలుతుందని మరొకవైపు సూచిస్తున్నారు. ఈ పరిణామాల న్నింటినీ పరిగణనలోకి తీసుకున్నపుడు, రష్యా డిమాండ్లలో ఒకటి కొలిక్కి రాగల అవకాశాలు సూత్రరీత్యా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ‘నాటో’లో చేరకూడదు...‘నాటో’లో ఉక్రెయిన్ సభ్యత్వం విషయానికి వస్తే, రష్యా డిమాండ్కు అమెరికా అధ్యక్షుడు మొదటి నుంచీ సానుకూలంగా ఉన్నారు. అసలు ఉక్రెయిన్ ఆ సంస్థలో చేరాలనుకోవటమే రష్యా అభద్రతా భావానికి, ఈ దాడికి మూల కారణమని కూడా అన్నారు. అటువంటి వైఖరి తీసుకున్న తర్వాత ఇక ఉక్రెయిన్ ఆ సైనిక కూట మిలో చేరగల అవకాశం ఉండదు. వాస్తవానికి అందులో చేరాలనే మాట ఉక్రెయిన్ రాజ్యాంగంలో లాంఛనంగా ఉన్నప్పటికీ, ఆ పట్టుదల యూరోపియన్ దేశాలదే! రష్యాను క్రమంగా చుట్టుముట్టి, ఛిన్నాభిన్నం చేయాలన్నది వారికి గతం నుంచి గల దీర్ఘకాలిక ప్రణాళిక. అయితే, ఈ ఒప్పందాల క్రమంలో ఉక్రెయిన్ తామిక ‘నాటో’లో చేరబోమంటూ రాజ్యాంగపరంగా ప్రకటించవలసి ఉంటుందన్నది రష్యా డిమాండ్. అది జరగాలని ట్రంప్ కూడా ఒత్తిడి చేయవచ్చు. అదే జరిగితే యూరోపియన్ నాయకులు చేయ గలిగింది ఉండదు. ఆ విధంగా శాంతి సాధనకు మరొక అడ్డంకి తొలగిపోతుంది. ఉక్రెయిన్లోని రష్యన్ జాతీయుల హక్కుల పరి రక్షణ వంటి మరికొన్ని అంశాలు ఉన్నాయి గానీ, ఇతరత్రా గల ప్రధాన సమస్యలు పరిష్కారమైనపుడు అవీ కావచ్చు.ఉక్రెయిన్కు ఆందోళనకరంగా ఉన్న ప్రధానాంశం తమ రక్షణ. చర్చలలో రష్యా అధ్యక్షుడు మొట్టమొదటిసారిగా అందుకు కొన్ని సడలింపులు చూపటం శాంతి సాధనకు మార్గాన్ని సుగమం చేసింది. అక్కడ ట్రంప్తో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్కు భద్రత ఏర్పడటం తప్పనిసరి అవసరమని, అక్కడి ప్రజల మూలాలూ తమ ప్రజల మూలాలూ ఒకటేనని, కనుక వారికి రక్షణ ఏర్పాట్లకు ఎటు వంటి అభ్యంతరమూ లేదని అన్నారు. ఆ భద్రత ఏ రూపంలోన న్నది ప్రశ్న. ‘నాటో’లో చేరేందుకు వీలు లేదన్న పుతిన్ డిమాండ్ను ట్రంప్ అంగీకరించారు. అట్లా చేరకపోయినా 5వ ఆర్టికల్ను పోలిన రక్షణలు కల్పించగలమని ట్రంప్ సూచించగా అందుకు పుతిన్ సమ్మతించారు. ఆర్టికల్ 5 అనే మాట ప్రచారంలోకి వచ్చినట్లు అందులోని వివరాలు ప్రచారంలోకి రాలేదు గానీ, అవి గమనించ దగ్గవి. నాటోలోని ఏ దేశంపై అయినా బయటి దేశం దాడి జరిపితే అది మొత్తం నాటో కూటమిపై జరిగిన దాడిగా పరిగణించి అందరూ ఆ దేశానికి మద్దతుగా కదలివస్తారు. కానీ దాని అర్థం అందరూ యుద్ధంలో ప్రవేశిస్తారని కాదు. ఎవరు ఏ రూపంలో పాల్గొంటారన్నది వారి నిర్ణయం. ఉక్రెయిన్ నాటోలో లేకపోయినా అమెరికా సహా అందరూ తమ తమ సహాయాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో గుర్తించవలసింది మరొకటి ఏమంటే, ఉక్రెయిన్కు అంద జేసే ఆయుధాలన్నీ ఖరీదుకేగానీ ఉచితంగా కాదు. వైట్హౌస్ చర్చలు సానుకూలంగా ఉన్నట్లు భావించిన ట్రంప్ ఆ వెంటనే పుతిన్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక ఇరుపక్షాలూ సన్నద్ధమైతే మొదట రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య ద్వైపాక్షికంగా, తర్వాత అమెరికా అధ్యక్షుని చేరికతో త్రైపాక్షికంగా చర్చలు జరుగు తాయి. శాంతి దిశగా అడుగులైతే పడుతున్నాయి. ఇందుకు తిరిగి ఏ భంగమూ కలగదని ఆశించాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్, జెలెన్స్కీ మీటింగ్లో ఏం తేల్చారు?
-
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన
-
ఇది సాకారమైతే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యానికి చెక్!
భారత ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ను శాసించాలి. అధిక నాణ్యత, తక్కువ ధరే మన బలం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన ట్యారిఫ్లను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఈ పిలుపునిచ్చారని వేరే చెప్పాల్సిన అవ సరం లేదు. ఏ దేశమైనా వేరే దేశం నుంచి వస్తు సేవలను దిగుమతి చేసుకుంటుందంటే అర్థం అవి దానికి అవసరమనే కదా! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో భారత్ తన మీద ఆధారపడి ఉందన్నట్లుగా వ్యవహ రిస్తున్నారు. భారతదేశ ఉత్పత్తుల్ని దయతలిచి దిగుమతి చేసుకుంటున్నట్లుగా సుంకాలను విధిస్తున్నారు. అమెరికాకు భారత్ ఎగు మతి చేసే వస్తువులు, సేవల మొత్తం సుమారు 87 బిలియన్ డాలర్లు. ఇది భారత్ మొత్తం ఎగుమతులలో 18% వాటా. ఈ ఏడాది చివరి నాటికి సుమారు 90–100 బిలియన్ డాలర్ల విలువైన వస్తు సేవల ఎగుమతి ఉండవచ్చనేది విశ్లేషకుల అంచనా. సుంకాల వల్ల ఈ ఎగుమతులన్నీ ఆగిపోతాయా అంటే కాదనే చెప్పవచ్చు. భారత్ అతి తక్కువ ధరలకు, నాణ్యమైన వస్తువుల్ని సరఫరాచేస్తోంది. ఉదాహరణకు ఫార్మాస్యూటికల్ రంగం దాదాపు 8 బిలి యన్ డాలర్ల విలువైన పేటెంట్ లేని ఔషధ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి కాక పోతే అక్కడి ప్రజలే ఇబ్బంది పడతారు. అలాగని పూర్తిగా మనకు ఇబ్బంది ఉండదా అంటే... ట్యారిఫ్ల వల్ల అమెరికా ప్రజలు వస్తువులు కొనలేక వినియోగం తగ్గించుకుంటారు. ఆ ప్రభావం మన మీద పడుతుంది. ఇదీచదవండి : బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పైపైకి ఎగబాకుతుండటాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. ఇప్పటివరకూ ఇండో – పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, దాని మిత్ర దేశాలు గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ తన చర్యల ద్వారా స్వీయ ముద్ర వేస్తోంది. తైవాన్తో వాణిజ్య ఒప్పందం, ఫిలిప్పీన్స్తో మిసైల్స్ సరఫరా ఒప్పందం, జపాన్తో టెక్నాలజీ సరఫరాకుసంబంధించిన ఒడంబడిక, వియత్నాంతో సైనిక సహకారం, ఇండో నేషియాతో సముద్ర భద్రత వంటి వాటిపై ఒప్పందాలు కుదుర్చు కుంది. అంతటితో ఆగడం లేదు. రష్యా ప్రతిపాదించిన రష్యా–ఇండియా–చైనా (ఆర్ఐసీ) ప్రతిపాదన మరోసారి తెరమీదికివచ్చింది. ఇది సాకారమైతే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యానికి పూర్తిగా గండికొట్టేయ వచ్చు. నిజానికి ట్రంప్ సుంకాలు విధించింది భారత్పై కాదు. అమెరికా ప్రజలపై! 2025లో అన్ని సుంకాల వల్ల సగటు అమెరికా కుటుంబానికి సంవత్సరానికి 3,800 డాలర్ల నష్టం ఏర్పడుతుందని అంటున్నారు. ట్రంప్ లాంటి వాళ్లు ట్యారిఫ్లు ఎంత ఎక్కువ వేసినా భారత్కు ఇబ్బంది తాత్కాలికమే అవుతుంది. కొత్త మార్కెట్లు భారతీయ వ్యాపారులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సవాళ్లు భారతదేశానికి ఎగుమతులను మెరుగుపరచడానికీ, భౌగోళికంగా వైవిధ్యభరితమైన మార్కెట్లను అన్వేషించడానికీ అవకాశం ఇస్తాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. ట్రంప్ ట్యారిఫ్లు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టేందుకు భారతదేశానికి అవకాశం కల్పిస్తాయి. చదవండి: రూ.13వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?-ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు -
‘నేను మారాను.. మీరే ఏం మారలేదు’.. నవ్వులు పూయించిన జెలెన్స్కీ-ట్రంప్
వైట్హౌజ్ వేదికగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య జరిగిన శాంతి చర్చలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. జెలెన్స్కీ సూట్ అద్భుతంగా ఉందంటూ అమెరికా మీడియా ప్రతినిధులు పేర్కొనగా.. తాను అదే చెప్పానంటూ ట్రంప్ అనడంతో నవ్వులు విరబూశాయి. మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు సోమవారం ఒవెల్ ఆఫీస్లో ట్రంప్-జెలెన్స్కీ, ఈయూ దేశాధినేతల మధ్య జరిగిన తాజా భేటీ పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగింది. అధ్యక్షులు ఇద్దరూ యుద్ధం ముగింపు ప్రయత్నాలపై సానుకూల ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో.. ‘‘ఈ సూట్లో మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు. బాగున్నారు’’ అని గతంలో జెలెన్స్కీని విమర్శించిన బ్రియాన్ గ్లెన్ ప్రశంసలు కురిపించడం విశేషం. ట్రంప్ వెంటనే జోక్యం చేసుకొని.. గతంలో మీపై మాటలతో దాడి చేసింది కూడా ఈ విలేకరేనని చెప్పారు. ‘‘అవును నాకు గుర్తుంది’’ అని జెలెన్స్కీ బదులిచ్చారు. ఆ వెంటనే ‘మీరు అదే సూట్లో ఉన్నారు. నేను మాత్రం మార్చుకున్నాను’ అని గ్లెన్ను ఉద్దేశిస్తూ జెలెస్కీ చెప్పడంతో ట్రంప్తో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు.Brian Glenn: President Zelenskyy, you look fabulous in that suitZelenskyy: You are in the same suit. I changed, you did not. pic.twitter.com/A6556L1G1M— Acyn (@Acyn) August 18, 2025ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్జెలెన్స్కీలు వైట్హౌస్లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సమావేశం వాడీవేడిగా జరగడంతో అప్పుడు జెలెన్స్కీ వేసుకున్న డ్రెస్పై అమెరికా అధ్యక్షుడు సహా అక్కడి మీడియా విమర్శలు గుప్పించింది. టీ షర్టుతోనే వైట్హౌస్లో అధికారిక భేటీలో పాల్గొనడం విమర్శలకు కారణమైంది. ఆక్రమంలో కన్జర్వేటివ్ రిపోర్టర్ బ్రియాన్ గ్లెన్.. ‘‘మీరెందుకు సూట్ వేసుకోలేదు? దేశంలోనే అత్యున్నత కార్యాలయాన్ని మీరు గౌరవించడం లేదని అనేకమంది అమెరికన్లు అనుకుంటున్నారు. అసలు మీకు సొంత సూట్ ఉందా?’’ అని జెలెన్స్కీని నేరుగా ప్రశ్నించారు. దానికి జెలెన్స్కీ బదులిస్తూ.. యుద్ధం ముగిసిన తర్వాత సూట్ వేసుకుంటానని వివరించారు. ఇక.. తాజా భేటీలో.. జెలెన్స్కీ భార్య ఒలెనా జెలెన్స్కా (Olena Zelenska) రాసిన ఓ లేఖను ట్రంప్కు బహుకరించారు. ‘‘ఇది నా సతీమణి, ఉక్రెయిన్ ప్రథమ మహిళ రాసిన లేఖ. కానీ, ఇది మీకు కాదు.. మీ భార్య కోసం’’ అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. రాజకీయాల్లోకి రాకముందు జెలెన్స్కీ సినిమాలు, స్టేజ్ షోల్లో నటించేవారు. అలాగే.. ఒలెనా ఒక రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. -
ఇండియన్ డ్రైవర్ యూటర్న్.. ట్రంప్-కాలిఫోర్నియా గవర్నర్ మధ్య చిచ్చు
కాలిఫోర్నియా: అమెరికాలో భారీ సెమీ – ట్రక్ నడుపుతున్న హర్జిందర్ సింగ్ అనే భారతీయుడు అక్రమంగా యూ-టర్న్ తీసుకుని, ముగ్గురి మృతికి కారకునిగా మారడం ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్- కాలిఫోర్నియా గవర్నర్ మధ్య వివాదాలకు కారణంగా నిలిచింది. ఫ్లోరిడా టర్న్పైక్ పై జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హర్జిందర్ సింగ్ అక్రమంగా యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక కారు ఆ ట్రక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. Three innocent people were killed in Florida because Gavin Newsom’s California DMV issued an illegal alien a Commercial Driver’s License—this state of governance is asinine.How many more innocent people have to die before Gavin Newsom stops playing games with the safety of the… https://t.co/QrEMOsDnIL— Homeland Security (@DHSgov) August 18, 2025ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు ఈ ప్రమాదాన్ని సాధారణ రోడ్డు యాక్సిడెంట్ మాదిరిగా కాకుండా, హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ కేసుగా నమోదు చేశారు. అంటే చట్టవిరుద్ధ డ్రైవింగ్ కారణంగా ఇతరుల ప్రాణాలు పోయాయని భావిస్తూ డ్రైవర్ పై కేసు నమోదు చేయడం. కాగా అమెరికాలో అక్రమంగా 2018 నుంచి ఉంటున్న హర్జిందర్ సింగ్ కాలికాలిఫోర్నియా స్టేట్ నుంచి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అక్రమ వలసదారు హర్జిందర్ సింగ్ లైసెన్స్ ఎలా పొందాడనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ హైవే సేఫ్టీ అండ్ మోటార్ వెహికల్స్ డైరెక్టర్ డేవ్ కర్నర్ మాట్లాడుతూ.. హర్జిందర్ సింగ్ నేరపూరిత చర్యల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అతను ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు. చట్టాల ప్రకారం హత్య కేసును ఎదుర్కోనున్నాడు. అలాగే ఇమిగ్రేషన్ ఉల్లంఘన కేసునూ ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు.భారతదేశానికి చెందిన హర్జిందర్ సింగ్ చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటునప్పటికీ కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ (డీఎంవీ) వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ‘ఎక్స్’లో తెలియజేసింది. ఇందుకు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ కారణమని ఆరోపించింది. అతను అమెరికన్ ప్రజల భద్రతతో ఆటలాడుకుంటున్నాడని పేర్కొంది. తమ సంస్థ ఇటువంటి నేరస్తులైన అక్రమ వలసదారులను అమెరికా నుండి బయటకు పంపేందుకు 24 గంటలూ పనిచేస్తున్నదని డీహెచ్ఎస్ పేర్కొంది..@grok, who was President in 2018? pic.twitter.com/51mbnoaghX— Governor Newsom Press Office (@GovPressOffice) August 17, 2025అయితే దీనికి కౌంటర్గా గవర్నర్ న్యూసమ్ ప్రెస్ ఆఫీస్ హర్జిందర్ సింగ్ యూఎస్లోకి ప్రవేశించిన సమయంలో ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నారని పేర్కొంది. కాలిఫోర్నియా చట్టం ప్రకారం దేశంలో చట్టబద్ధమైన ఉనికి ఉన్నప్పుడే వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారని తెలిపింది. సింగ్ 2018 సెప్టెంబర్లో కాలిఫోర్నియా సరిహద్దును అక్రమంగా దాటారని, అప్పుడు బోర్డర్ పెట్రోల్ అరెస్టు చేసిందని వివరించింది. ఆ తర్వాత సింగ్ను ఫాస్ట్-ట్రాక్ డిపోర్టేషన్ కోసం ప్రాసెస్ చేశారని తెలిపింది. ఆ తర్వాత 2019, జనవరిలో నోటీసు టు అప్పీర్ ఇచ్చిన తర్వాత ఆయనను ఐదువేల అమెరికన్ డాలర్ల ఇమ్మిగ్రేషన్ బాండ్పై విడుదల చేశారని, అప్పటి నుండి హర్జిందర్ సింగ్ఇమ్మిగ్రేషన్ ప్రక్రియల్లోనే ఉన్నాడని న్యూసమ్ ప్రెస్ వివరించింది. -
ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీతో భేటీ అనంతరం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీ ఇరువురు సమావేశమయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోందంటూ పేర్కొన్నారు. సుమారు నాలుగేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు ఇది కీలక అడుగుగా అభివర్ణించిన ఆయన.. దీర్ఘకాలికశాంతి కోసం ప్రయత్నిస్తామన్నారు.‘‘ వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడిరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ ఉర్సులా వాండెర్లెయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో జరిగిన చర్చలు అద్భుతంగా ముగిశాయి. వాషింగ్టన్ సమన్వయంతో యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు భద్రతా హామీలు అందించాలనే దానిపైనే చర్చలు ప్రధానంగా సాగాయి. రష్యా, ఉక్రెయిన్లతో శాంతి నెలకొనబోతుందనే విషయంపై నేతలందరూ సంతోషం వ్యక్తం చేశారు. చర్చల ముగింపులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో నేను ఫోన్ కాల్లో మాట్లాడాను. జెలెన్స్కీ, పుతిన్ మధ్య భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వీరి భేటీ ఎక్కడ జరగాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీరి సమావేశం ముగిసిన తర్వాత వారితో కలిసి నేను భేటీ అవుతాను. సుమారు నాలుగేళ్ల యుద్ధం ముగించేందుకు ఇదొక మంచి ముందడుగు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ సమన్వయంతో రష్యా, ఉక్రెయిన్ల మధ్య సమావేశం జరగనుంది’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే భేటీ ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనేదానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. వైట్హౌజ్లో ట్రంప్-జెలెన్స్కీ, ఈయూ నేతల భేటీపై రష్యా ఇంకా స్పందించాల్సి ఉంది.అంతకు ముందు.. భేటీ ముగిశాక ట్రంప్తో జరిగిన చర్చలపై జెలెన్స్కీ సంతోషం వ్యక్తం చేశారు. చాలా నిర్మాణాత్మకంగా భేటీ జరిగిందని.. భద్రతా హామీలతో సహా పలు సున్నిత విషయాలపై మాట్లాడినట్లు తెలిపారు. త్రైపాక్షిక భేటీకి తాము సిద్ధమేనంటూ పేర్కొన్నారాయన. అదే సమయంలో జెలెన్స్కీతో పాటు వచ్చిన యూరోపియన్ నేతలు ట్రంప్తో చాలా కీలక విషయాలపై చర్చించారు. ఎవరేమన్నారంటే.. రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం, సెక్యూరిటీ గ్యారంటీలు చర్రితలో నిలిచిపోయే కీలక ముందడుగుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభివర్ణించారు. రష్యాతో సమావేశానికి ముందే కాల్పుల విరమణ జరగాలని జర్మన్ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పునేందుకు రష్యాపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మాట్లాడుతూ.. ట్రంప్ త్రైపాక్షిక సమావేశంపై చర్చించారని, అయితే దీన్ని విస్తృతం చేసి యురోపియన్ నేతను ఆ భేటీకి అనుమతించాలని ప్రతిపాదించారు. ఇది యూరప్ మొత్తానికి సంబంధించిన విస్తృత భద్రతా హామీలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ ఈ వివాదం మళ్లీ తలెత్తకుండా ఎలా నిర్ధారించుకోవాలని ప్రశ్నించారు. శాంతి ఒప్పందానికి ఇది ముందస్తు షరతు అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసే దాడులను అడ్డుకోవాలని అందుకు మిత్రపక్షాలు కలిసిరావాలని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె పేర్కొన్నారు.ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాల నేతల ప్రకటనలతో.. ఆ చర్చల్లో అంతగా పురోగతి కనిపించలేదన్న విమర్శ వినిపించింది. పైగా అలస్కా భేటీలో పుతిన్ పెట్టిన భూభాగాల మార్పిడి షరతును జెలెన్స్కీ వ్యతిరేకించడంతో.. వైట్హౌజ్ చర్చలూ విఫలం కావొచ్చని అంతా భావించారు. అదే సమయంలో.. ఈ ఏడాదిలోనే వైట్హౌజ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లు జెలెన్స్కీ విరుచుకుపడ్డారు. ఈ తరుణంలో అంచనాలకు భిన్నంగా తాజా భేటీ ప్రశాంత వాతావరణంలో.. అదీ యూరోపియన్ నేతల సమక్షంలో జరగడం గమనార్హం. -
ఈవీఎంలు రద్దు చేస్తా..: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: సంచలనాల తేనెతుట్టెను తరచూ కదుపుతూ వివాదాలను రాజేసే అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తాజాగా కొత్త అంశంతో తెరమీదకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపుతానని అంతర్జాతీయ అంశాన్ని ఎత్తుకున్న ట్రంప్ హఠాత్తుగా దేశీయ రాజకీయ అంశంపై ప్రధానంగా దృష్టిసారించారు. పోస్టల్ ఓటింగ్(మెయిల్ ఇన్ బ్యాలెట్) విధానం పూర్తి లోపభూయిష్టంగా తయారైందని, పోస్టల్ ఓటింగ్ కారణంగా భారీ స్థాయిలో మోసం జరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘అత్యంత వివాదాలకు కేంద్రస్థానంగా నిలుస్తున్న ఓటింగ్ మెషీన్లను మూలకు పడేస్తా. 2026లో వచ్చే మధ్యంతర ఎన్నికలలోపే మెయిల్–ఇన్–బ్యాలెట్, ఓటింగ్ మెషీన్లకు చరమగీతం పాడుతూ త్వరలోనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తా’’ అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘‘ మెయిల్–ఇన్ బ్యాలెట్ విధానానికి ముగింపు పలికే ఉద్యమానికి సారథ్యంవహిస్తా. కచ్చితత్వం లోపించిన, అత్యంత ఖరీదైన, వివాదాస్పదమైన ఓటింగ్ మెషీన్లను త్యజిద్దాం. అత్యంత అనువైన, భద్రమైన, సులభతరమైన బ్యాలెట్ (వాటర్మార్క్) పేపర్తో పోలిస్తే ఓటింగ్ మెషీన్ అనేది పదిరెట్లు ఎక్కువ వ్యయంతో కూడిన వ్యవహారం. బ్యాలెట్ పేపర్తో చాలా వేగంగా ఎన్నికలు నిర్వహించవచ్చు. ఎలాంటి అనుమానాలకు తావుండదు. ఎవరు గెలిచారో, ఎవరు ఓడారో ఇట్టే తెలిసిపోతుంది. మెయిల్–ఇన్–ఓటింగ్ను అనుసరిస్తున్న ఏకైక దేశం మనదే. భారీస్థాయిలో ఓట్ల అవకతవకలు వెలుగుచూడడంతో దాదాపు అన్ని దేశాలు ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లకు మంగళంపాడాయి. ఇకనైనా తప్పులను సరిదిద్దుకుందాం. తప్పుల సవరణను డెమొక్రాట్లు పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్లు ఈ తప్పులను గతంలో ఎన్నడూలేనంతటి స్థాయిలో చేశారు. 2026 మధ్యంతర ఎన్నికలకు మరింత విశ్వసనీయతను ఆపాదించేందుకు సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై త్వరలో సంతకం చేస్తా’’ అని అన్నారు. ఈ మేరకు ఆయన తన సొంత సామాజికమాధ్యమ ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. రాష్ట్రాలది కేవలం ఏజెంట్ పాత్ర ‘‘ ఎన్నికల్లో రాష్ట్రాల పాత్ర నామామాత్రం. ఫెడరల్ ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లను టేబుల్పై ఉంచడం, లెక్కించడం వంటివి చేసే ఏజెంట్ పాత్ర మాత్రమే పోషించాలి. అమెరికా అధ్యక్షుడి ఆదేశానుసారం ఫెడరల్ ప్రభుత్వం సూచించే సూచనలను రాష్ట్రాలు తూ.చ. తప్పకుండా పాటిస్తే సరిపోతుంది. అలా ఉంటేనే దేశానికి మంచిది. అంతేగానీ విప్లవ భావజాల విపక్ష పార్టీలు సరిహద్దులు తెరవాలని డిమాండ్లు చేయడం, మహిళా క్రీడల్లో ట్రాన్స్జెండర్ల మాటున పురుషులూ పాల్గొనేలా చేయడం వంటివి ప్రోత్సహించకూడదు. అసలు ఈ లోపభూయిష్ట మెయిల్–ఇన్ కుంభకోణం జరక్కపోతే డెమొక్రాట్లు గతంలో గద్దెనెక్కేవాళ్లే కాదు. మెయిన్–ఇన్ బ్యాలెట్/ఓటింగ్తో ఎన్నికలు ఎప్పటికీ విశ్వసనీయంగా జరగబోవు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా డెమొక్రాట్లకు బాగా తెలుసు. అమెరికా ఎన్నికల ప్రక్రియకు విశ్వసనీయత, సమగ్రత తెచ్చేందుకు రిపబ్లికన్ పార్టీ నేతలతో కలిసి నేను ఎంతకైనా తెగించి పోరాడతా. మెయిల్–ఇన్ బ్యాలెట్ అనేది పూర్తి మోసపూరిత ప్రక్రియ. ఇక ఓటింగ్ మెషీన్లను ఉపయోగించడం అనేది మొత్తంగా ఎన్నికల ప్రక్రియను వినాశనం చేయడమే. ఇక వీటికి ఖచ్చితంగా ముగింపు పలకాల్సిందే. పారదర్శకంగా, నిజాయతీగా ఎన్నికలు నిర్వహించుకోకుంటే బలమైన, దుర్బేధ్యమైన సరిహద్దులేకుంటే మనకంటూ ఒక దేశం కూడా మిగలదు’’ అని ట్రంప్ అమెరికన్ ఓటర్లనుద్దేశించి అన్నారు. -
తరువాయి.. త్రైపాక్షిక చర్చలు
వాషింగ్టన్: ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలికేందుకు కంకణం కట్టుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యురోపియన్ యూనియన్ కీలక సభ్య దేశాల అగ్రనేతలు యుద్ధ పరిసమాప్తి కృషిపర్వంలో కీలక పురోగతి సాధించారు. ఇందుకు అమెరికా రాజధాని నగరం వేదికైంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్లతో కలిసి తాను త్రైపాక్షిక సమావేశం నిర్వహించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం వాషింగ్టన్లోని అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లోని ఈస్ట్రూమ్లో ఐరోపా సమాఖ్య కీలక సభ్యదేశాల అగ్రనేతలతో ట్రంప్ సంయుక్త సమావేశం ఏర్పాటుచేశారు. త్వరలో యుద్ధ విరమణ కోసం పుతిన్, జెలెన్స్కీ, ట్రంప్ త్రైపాక్షిక సమావేశం జరిపేందుకు ఈయూ నేతలు ఏకగ్రీవంగా అంగీకరించారు. అయితే ఈ త్రైపాక్షిక భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా నిర్ణయించలేదు. సెక్యూరిటీ గ్యారెంటీలో ఉండే ప్రధానాంశాలు సైతం ఇంకా ఖరారుకాలేదు. ‘నాటో’ కూటమిలో చేరకపోయినా సరే అదే తరహాలో ‘రక్షణ హామీ’ని ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పుతిన్ పేర్కొన్న అంశం ఈ సంయుక్త సమావేశంలో ప్రస్తావనకు వచి్చంది. ఈ సంయుక్త సమావేశంల నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రూటే, యురోపియన్ కమిషన్ మహిళా అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, జర్మనీ చాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమయ్యారు. అయితే ఈ త్రైపాక్షిక సమావేశంలో ఈయూ తరఫున సైతం ఒక ప్రతినిధి పాల్గొంటే మంచిదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ అభిప్రాయపడ్డారు. నాటోయేతర రక్షణహామీకి ట్రంప్ ముందుకు రావడం ఈ మొత్తం ప్రక్రియలో కీలక పరిణామమని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే అన్నారు. తక్షణం కాల్పుల విరమణ ప్రకటిస్తే బాగుంటుందని జర్మనీ చాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ అభిప్రాయపడ్డారు. యుద్ధకాల్పుల మోత మెల్లగా తగ్గుముఖం పట్టనుందని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వ్యాఖ్యానించారు. అంతకుముందు నేతలంతా ఒక గ్రూప్ ఫొటో దిగారు. జెలెన్స్కీని మెచ్చుకున్న ట్రంప్ ఈయూ నేతలతో భేటీకి ముందు తొలుత జెలెన్స్కీతో ట్రంప్ విడిగా సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గత భేటీలో టీ–షర్ట్ వేసుకొచి్చన జెలెన్స్కీని అమెరికా మీడియా తప్పుబట్టిన నేపథ్యంలో ఈసారి నలుపు రంగు సూట్ ధరించారు. సూట్ డిజైన్ను ట్రంప్ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్కు జెలెన్స్కీ ఒక లేఖ అందించారు. ‘‘ ఇది మీ భార్య కోసం. అయితే ఇది నేను రాసింది కాదు. నా భార్య రాసింది’’ అనడంతో అందరూ ఫక్కున నవ్వేశారు. తర్వాత ట్రంప్ మాట్లాడారు. ‘‘ యుద్ధంలో యావత్ ప్రపంచమే అలసిపోయింది. మనం దీనిని ఇక ముగింపునకు తీసుకొద్దాం. ఈరోజంతా మంచే జరగబోతోంది. పుతిన్, జలెన్స్కీతో కలిసి త్రైపాక్షిక భేటీ ఆమోదయోగ్యమైన రీతిలో జరిగే అవకాశముంది. ఈ యుద్ధం ముగియబోతోంది. ముగింపు అనేది అంతా కాకపోయినా కొంతైనా మిస్టర్ జెలెన్స్కీ చేతుల్లోనే ఉంది’’ అని ట్రంప్ అన్నారు. సెక్యూరిటీ గ్యారెంటీ హామీలో భాగంగా ఉక్రెయిన్కు భవిష్యత్తులో అమెరికా బలగాలు మొహరిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ సూటిగా సమాధానం చెప్పలేదు. -
ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్
మాస్కో: అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (valdimir Putin) మధ్య ఉక్రెయిన్ యుద్ధం ముగించే విషయంపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్లాదిమిర్ పుతిన్ తనకు ఫోన్ చేసినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో‘ఇటీవల అలాస్కాలో ట్రంప్తో జరిగిన సమావేశం గురించి ఫోన్లో మాట్లాడి, తన అభిప్రాయాలను పంచుకున్నారు. నా స్నేహితుడు పుతిన్కు ధన్యవాదాలు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ నిరంతరం కోరుకుంటుంది.ఈ విషయంలో జరుగుతున్న అన్నీ ప్రయాత్నాలకు భారత్ మద్దతు పలుకుతుంది’అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2022 నుండి కొనసాగుతున్న ఉక్రెయిన్పై కొనసాగుతున్న రష్యా యుద్ధంపై ప్రపంచ దేశాల ఎదుట భారత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, ఈ విషయంలో భారత్ తన పూర్తి మద్దతును అందిస్తుందని ప్రధాని కార్యాలయంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. Thank my friend, President Putin, for his phone call and for sharing insights on his recent meeting with President Trump in Alaska. India has consistently called for a peaceful resolution of the Ukraine conflict and supports all efforts in this regard. I look forward to our…— Narendra Modi (@narendramodi) August 18, 2025