breaking news
Donald Trump
-
ఆ ‘పదం’ అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్
తన గురించి తానే కాస్త అతిగా గొప్పలు చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పొగిడేసుకున్నారు. తనను తాను ప్రశంసించుకుంటూ 10 నెలల్లో 8 యుద్ధాలను ఆపేశానని.. ఇందుకు ప్రధాన కారణం టారిఫ్లేనంటూ వ్యాఖ్యానించారు. తాజాగా అమెరికా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇంగ్లీష్ భాషలో తనకు అత్యంత ఇష్టమైన పదం ‘టారిఫ్స్’ అంటూ చెప్పుకొచ్చారు.మరోవైపు మాజీ అధ్యక్షుడు జో బైడెన్పై విమర్శలు గుప్పించారు. తనకు గందరగోళ పరిస్థితి వదిలి వెళ్లారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను అమెరికా బలాన్ని తిరిగి నిలబెట్టానని.. 10 నెలల్లో 8 యుద్ధాలను పరిష్కరించానన్నారు. ఇరాన్ అణు ముప్పును తొలగించాను. గాజాలో యుద్ధాన్ని ముగించాను. దాదాపు 3,000 ఏళ్ల అనంతరం అక్కడ శాంతిని నెలకొల్పి.. బందీలను స్వదేశానికి తీసుకొచ్చానన్న ట్రంప్.. తన ప్రభుత్వ 2026 అజెండాను ప్రజలకు వివరించారు.#WATCH | In an address to the Nation, US President Donald Trump says, "I restored American strength, settled 8 wars in 10 months, destroyed the Iran nuclear threat and ended the war in Gaza - bringing for the first time in 3000 years peace to the Middle East and secured the… pic.twitter.com/8SAKdDQLvN— ANI (@ANI) December 18, 2025కాగా, అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేదించిన దేశాల జాబితాను ట్రంప్ యంత్రాంగం మరింత విస్తరించింది. మరో 20 దేశాలను తాజాగా అందులోకి చేర్చింది. అమెరికా జాతీయ భద్రత, ప్రజల భద్రత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సంబంధిత ఉత్తర్వులపై అధ్యక్షుడు మంగళవారం సంతకం చేశారు.బుర్కినా ఫాసో, మాలీ, నైగర్, దక్షిణ సుడాన్, సిరియాపై పూర్తి ఆంక్షలు, అమెరికాలోకి ప్రవేశంపై నిషేధం విధించారు. మరో 15 దేశాలైన అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోటె డి ఐవోయిర్, డొమినికా, గాబన్, ద గాంబియా, మలావీ, మార్షియానా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే పాక్షిక నిషేధ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
డెమొక్రట్ల పైచేయి.. ట్రంప్ ఉత్తర్వులు నిలిపివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై డెమొక్రట్లు మరోసారి పైచేయి సాధించారు. డిటెన్షన్ సెంటర్ల విషయంలో ఆయన జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెడుతూ వాషింగ్టన్ డీసీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గత ఆరు నెలలుగా ఈ విషయంలో డెమొక్రట్లు న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా చట్ట సభ్యులు ఎవరైనా సరే గతంలో డిటెన్షన్ సెంటర్లకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి సందర్శించే వీలుండేది. అయితే ట్రంప్(Trump) రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఆ సందర్శనలపై ఆంక్షలు విధించారు. ‘‘వారం ముందుగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు(ICE) సెంటర్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫీల్డ్ ఆఫీసులు అనుమతి ఇస్తేనే సందర్శించొచ్చు. లేకుంటే లేదు’’ అనే ఉత్తర్వులు తీసుకొచ్చారు. అయితే.. ఈ ఉత్తర్వులపై హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్లోని డెమొక్రట్లు కోర్టును ఆశ్రయించారు. ట్రంప్ 2.0లో ఎంతటి కఠిన వైఖరి అవలంభిస్తున్నది చూస్తున్నదే. మరీ ముఖ్యంగా వలసవాదుల విషయంలో ఆయన ధోరణి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అదే సమయంలో.. డిటెన్షన్ సెంటర్లలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని డెమొక్రట్లు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. సరైన వసతులు ఉండడం లేదని.. అక్కడి వాళ్లను దారుణంగా చూస్తున్నారని.. ఈ తరుణంలో అలాంటివేవీ బయట పడకుండా ఉండేందుకే ట్రంప్ ఈ ఉత్తర్వులు తెచ్చారన్నది డెమొక్రట్ల వాదన. అయితే.. ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఆ వాదనను ఖండించింది. చట్ట సభ్యుల భద్రత కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో.. డెమొక్రట్ల వాదనలతో ఏకీభవించిన ఫెడరల్ జడ్జి జియా కాబ్ ట్రంప్ ఉత్తర్వులను ఫెడరల్ చట్టాలకు విరుద్ధమని ప్రకటిస్తూ.. వాటిని పక్కన పెడుతూ తీర్పు ఇచ్చారు. జియా కాబ్ గత అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో నియమించబడ్డారు. ఇదిలా ఉంటే.. అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లను ఆకస్మికంగా సందర్శించే హక్కు కల్పించే ఫెడరల్ చట్టాన్ని తెచ్చింది ట్రంపే కావడం గమనార్హం. ట్రంప్ మొదటి దఫా అధ్యక్ష పదవీ కాలంలో ఈ చట్టం ఆమోదించబడింది. ఇదిలా ఉంటే.. న్యూజెర్సీ డెమొక్రటిక్ ప్రతినిధి లమోనికా మెకైవర్ ఈ ఏడాది మే నెలలో న్యూయార్క్లోని ఓ డిటెన్షన్ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు. అయితే ఆ సమయంలో డిసెన్షన్ సెంటర్లో పెద్ద గొడవే జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఆమెపై కేసు కూడా నమోదు చేసింది. అయితే ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆమె మండిపడ్డారు. ఈ ఘటన జరిగిన నెలలోపే ట్రంప్ చట్ట సభ్యుల ఆకస్మిక సందర్శనలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ చదవండి: ఇక పూర్తిస్థాయి యుద్ధమేనా ట్రంప్? -
వెనిజులాపై ట్రంప్... పూర్తిస్థాయి యుద్ధం?
వాషింగ్టన్: దక్షిణ అమెరికా దేశం వెనిజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్, వాటిని ఎలాగైనా చేజిక్కించుకునే ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగా ఆ దేశానికి చమురు నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. సాగర జలాల్లో భారీగా నేవీ, సైన్యాన్ని మొహరించి ప్రతి చమురు నౌకనూ అడ్డుకుని తీరుతామని సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ఖాతాలో మంగళవారం ఆయన పోస్ట్ పెట్టారు. ‘వెనిజులాను అన్నివైపుల నుంచి దిగ్బంధించాం. కనీవినీ ఎరగనంతటి సంఖ్యలో సైన్యం ఆ దేశాన్ని చుట్టుముట్టనుంది. వెనిజులా చమురు విక్రయ సొమ్మంతా అమెరికాలోకి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటివాటికే ఉపయోగపడుతోంది. ఇది మా దేశ భద్రతకే సవాలుగా మారింది. అందుకే ఈ దిగ్బంధం. న్యాయబద్ధంగా అమెరికాకు చెందాల్సిన వెనిజులాలోని అపార చమురు నిల్వలు, భూములు, ఆస్తులు అన్నింటినీ మాకు అప్పగించేదాకా వదలం’ అని స్పష్టం చేశారు. గత నెలలో కూడా వెనిజులా తీర సమీపంలో ఆ దేశ చమురు నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ట్రంప్ తీరుపై వెనిజులా మండిపడింది. ‘ఒక సార్వభౌమ దేశంలోని ఆస్తులు, చమురు క్షేత్రాలు తమావేవని అంటారా? అంతర్జాతీయ చట్టాలను, స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలను ట్రంప్ తుంగలో తొక్కుతున్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ అసలు ఉద్దేశం డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కట్టడి కాదని స్వయానా ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ స్పష్టం చేశారు. మాట వినని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దింపడమేనని ఆయన అసలు లక్ష్యమని కుండబద్దలు కొట్టారు! ఈ మేరకు వానిటీ ఫెయిర్ వైల్స్కు ఇచ్చిన సంచలనాత్మక ఇంటర్వ్యూ మంగళవారం ప్రచురితమైంది. మదురో కాళ్ళబేరానికి వచ్చి తప్పుకునేదాకా వెనిజులా చమురు నౌకలను పేల్చేస్తూనే ఉంటామని కూడా ఆయన స్పష్టం చేయడం విశేషం! వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వకున్న విషయం తెలిసిందే. ఆ దేశం ఏకంగా రోజుకు 10 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థకు చమురు ఆదాయమే జీవనాడి. -
అమెరికాలోకి రాకుండా మరో 20 దేశాలపై నిషేధం
వాషింగ్టన్: అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేదించిన దేశాల జాబితాను ట్రంప్ యంత్రాంగం మరింత విస్తరించింది. మరో 20 దేశాలను తాజాగా అందులోకి చేర్చింది. అమెరికా జాతీయ భద్రత, ప్రజల భద్రత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సంబంధిత ఉత్తర్వులపై అధ్యక్షుడు మంగళవారం సంతకం చేశారు. బుర్కినా ఫాసో, మాలీ, నైగర్, దక్షిణ సుడాన్, సిరియాపై పూర్తి ఆంక్షలు, అమెరికాలోకి ప్రవేశంపై నిషేధం విధించారు. మరో 15 దేశాలైన అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోటె డి ఐవోయిర్, డొమినికా, గాబన్, ద గాంబియా, మలావీ, మార్షియానా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే పాక్షిక నిషేధ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘ఈ దేశాలకు అమెరికా చట్టంపై గౌరవం లేదు. తన పౌరుల గురించిన సమగ్ర సమాచారం పొందుపరచడంలో అమెరికా నిఘా, భద్రతా, ఇమ్మిగ్రేషన్ విభాగాలకు అందించడంలో తరచూ విఫలమవుతున్నాయి‘ అని తెలిపారు. పాలస్తీనా అథారిటీ తాలూకు పత్రాలున్న వారి ప్రవేశాన్ని నిషేధించారు. వెస్ట్ బ్యాంక్, గాజాల్లో పలు ఉగ్ర మూకలు చురుగ్గా పనిచేస్తున్నాయి. అమెరికా పౌరులను పొట్టన పెట్టుకున్నాయి. అందుకే ఈ చర్య’ అని వైట్ హౌస్ పేర్కొంది. వాటిపై కొనసాగింపు అఫ్గానిస్తాన్, బర్మా సహా 12 దేశాలపై ఇటీవలే అమెరికా నిషేధం విధించడం తెలిసిందే. అది ఇకముందు కూడా కొనసాగనుంది. గత నెలలో ఒక అఫ్గాన్ దేశస్తుడు వాషింగ్టన్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బందిని కాల్చి చంపడం తెలిసిందే. ఆ నేపథ్యంలో అఫ్గాన్తో పాటు ఇలా పలు మూడో ప్రపంచ దేశాలపై అమెరికా కఠిన నిషేధాలు విధిస్తూ వస్తోంది. -
ట్రంప్తో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ భేటీ?
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. గాజాలో శాంతిస్థాపనకు ముస్లిం దేశాలు అక్కడ సైనిక దళాలలను ఏర్పాటు చేయాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఆసిమ్ మునీర్ ఆవిషయమై యుఎస్ అధ్యక్షుడితో చర్చించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం పాకిస్థాన్-అమెరికా మధ్య సంబంధాలు బలీయంగా ఉన్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్లతో ఇటీవల తరచుగా భేటీలు జరుపుతున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ట్రంప్ ఎఫ్-16 యుద్ధవిమానాల అప్గ్రేడ్ కోసం పాకిస్థాన్కు ప్రత్యేక ప్యాకేజ్ మంజూరు చేశారు. ఈ చర్య భారత్ను కలవరపాటుకు గురిచేసింది. అనంతరం కూడా భారత్పై పలు రకాల ఆంక్షలు విధించి అదే సమయంలో పాకిస్థాన్కు దగ్గరయ్యే యత్నం ట్రంప్ చేశారు.కాగా ఇటీవల గాజాలో శాంతిస్థాపన కోసం ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ముస్లిం దేశాలైన పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాలు తమ దేశ సైనిక దళాలను గాజాలో మెుహరించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈ విషయమై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ట్రంప్తో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై పాకిస్థాన్లో వ్యతిరేకత ఎదురవుతుంది. అక్కడి ప్రజలు ఆదేశ సైనికులను గాజా పంపించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. ఒకవేళ ఈ డీల్కు అంగీకరిస్తే సొంత దేశంలో వ్యతిరేకత, అంగీకరించకుంటే అమెరికా అధ్యక్షుడి ఆగ్రహాం మెుత్తానికి ఆసిమ్ మునీర్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన ఉంది. ఈ డీల్కు టర్కీ, ఈజిప్టు, జోర్దాన్ దేశాలు మద్దుతిస్తున్నాయి. ఇరాన్ మాత్రం వ్యతిరేకంగా ఉంది. ఆ విషయమై గత నెలలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి స్పందించారు. గాజాలో సైనిక దళాల మెుహరింపు విషయం ఆలోచిస్తామన్నారు. అయితే హామాస్ని నిరాయుధీకరించడం తమ పని కాదన్నారు. -
భారత్-అమెరికా ట్రేడ్ డీల్ జాప్యం..
ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. మరొకటి వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తి. వ్యూహాత్మకంగా చూస్తే ఇద్దరిదీ విడదీయరాని బంధం. కానీ, వ్యాపారం విషయానికి వస్తే మాత్రం నువ్వా-నేనా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ప్రతిసారీ చర్చలు కొలిక్కి వచ్చే సమయానికి ఏదో ఒక అడ్డంకి పలకరిస్తూనే ఉంది.అమెరికా విధిస్తున్న కఠినమైన టారిఫ్ రూల్స్ ఒకవైపు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని వాషింగ్టన్ జీర్ణించుకోలేకపోవడం మరోవైపు.. ఈ రెండింటి మధ్య ట్రేడ్ డీల్ దోబూచులాడుతోంది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న పేచీ ఎక్కడ? అగ్రరాజ్యం ఆంక్షల నడుమ భారత్ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటోంది? ఈ ప్రతిష్టంభనకు గల కారణాలపై ప్రత్యేక విశ్లేషణ..టారిఫ్ యుద్ధం.. అమెరికా అభ్యంతరంభారత మార్కెట్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు కలిగిన మార్కెట్లలో ఒకటి అని అమెరికా వాదిస్తుంది. ముఖ్యంగా హార్లే డేవిడ్సన్ వంటి బైకులు, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న పన్నులను తగ్గించాలని కోరుతోంది.భారత్ వాదనభారత్ తన దేశీయ పరిశ్రమలను (Make in India) కాపాడుకోవడానికి ఈ పన్నులు అవసరమని చెబుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో భారత్ను ‘టారిఫ్ కింగ్’ అని పిలవడం, ప్రస్తుతం మళ్లీ అధికారం చేపట్టాక అదే ధోరణి కొనసాగుతోంది.రష్యా నుంచి చమురు కొనుగోళ్లుఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఇది అమెరికాలోని కొందరు రాజకీయ నాయకులకు నచ్చలేదు. రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారని అమెరికా భావిస్తుండగా భారత్ తన స్ట్రాటజిక్ అటానమీ(వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి) వైఖరిని స్పష్టం చేసింది. ఈ భౌగోళిక రాజకీయ భేదాభిప్రాయాలు వాణిజ్య చర్చలపై ప్రభావం చూపుతున్నాయి.జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) హోదాగతంలో అమెరికా భారత్కు జీఎస్పీ హోదా ఇచ్చేది. దీని ద్వారా కొన్ని భారతీయ ఉత్పత్తులు సుంకం లేకుండానే అమెరికాలోకి ప్రవేశించేవి. ట్రంప్ మొదటి హయాంలో ఈ హోదాను రద్దు చేశారు. దీన్ని పునరుద్ధరించాలని భారత్ పట్టుబడుతుండగా, అమెరికా మాత్రం భారత మార్కెట్లలో తమ డెయిరీ, మెడికల్ డివైజ్లకు(Stents etc..) మరింత వెసులుబాటు ఇస్తేనే ఆలోచిస్తామని అంటోంది.డేటా గోప్యత, ఈ-కామర్స్ విధానాలుఅమెరికన్ దిగ్గజాలైన అమెజాన్, వాల్మార్ట్ (ఫ్లిప్కార్ట్), గూగుల్ వంటి కంపెనీలు భారత మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. భారత్ తీసుకొస్తున్న డేటా లోకలైజేషన్(భారతీయ వినియోగదారుల సమాచారం ఇక్కడే ఉండాలి), ఈ-కామర్స్ నిబంధనలు అమెరికాకు ఇబ్బందికరంగా మారాయి. తమ కంపెనీలకు భారత్ ‘లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్’(పోటీలో ఉన్న అందరికీ సమాన అవకాశాలు కల్పించడం) కల్పించడం లేదని అమెరికా వాణిజ్య శాఖ తరచుగా ఆరోపిస్తోంది.ఫార్మా రంగంలో..అమెరికన్ ఫార్మా కంపెనీలు తమ మందుల పేటెంట్ హక్కుల విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. తక్కువ ధరకే జనరిక్ మందులను ఉత్పత్తి చేసే భారత విధానం తమ లాభాలను దెబ్బతీస్తోందని వారి వాదన.డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా భారత్తో ట్రేడ్ డీల్ను వ్యూహాత్మకంగా వాయిదా వేస్తున్నారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 2025లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, ట్రంప్ శైలిని పరిశీలిస్తే దీని వెనుక ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.ప్రతికార సుంకాలుభారత్ అమెరికా వస్తువులపై ఎంత పన్ను విధిస్తుందో, అమెరికా కూడా భారత వస్తువులపై అంతే పన్ను విధించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. దాంతో 2025 ఆగస్టులో భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 25% రెసిప్రోకల్ సుంకాన్ని విధించింది. భారత్ తన వైపు నుంచి పన్నులు తగ్గించే వరకు ఈ డీల్పై సంతకం చేయకూడదనేది ఆయన ఉద్దేశం.క్రూడాయిల్.. ఎస్-400 పేచీఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాలను (S-400 వంటివి) కొనుగోలు చేయడం ట్రంప్నకు నచ్చడంలేదు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు భారత్పై అదనంగా మరో 25% పెనాల్టీ సుంకాన్ని విధించారు. అంటే ప్రస్తుతం కొన్ని భారతీయ ఉత్పత్తులపై మొత్తం 50% సుంకం అమలవుతోంది. భారత్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకునేలా ఒత్తిడి తేవడానికి ఈ డీల్ను ఒక ఆయుధంగా వాడుతున్నారు.అమెరికా రైతుల ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ పనిచేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఆయన కోరుతున్నారు. ఇటీవల భారతీయ బియ్యం ఎగుమతులపై కూడా ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తూ అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. భారత రైతుల ప్రయోజనాల దృష్ట్యా మన ప్రభుత్వం దీనికి సుముఖంగా లేదు. దీంతో చర్చలు నిలిచిపోయాయి.వ్యక్తిగత ప్రతిష్ఠ, మధ్యవర్తిత్వంకొన్ని విశ్లేషణల ప్రకారం (ఉదాహరణకు: జెఫరీస్ గ్రూప్ నివేదిక), భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో తాను మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. కానీ భారత్ దాన్ని సున్నితంగా తిరస్కరించడం ఆయనకు నచ్చలేదని, ఆ అసహనం కూడా వాణిజ్య చర్చల జాప్యానికి ఒక కారణమని భావిస్తున్నారు. ట్రంప్ తన మద్దతుదారులకు (MAGA - Make America Great Again) తాను ఇతర దేశాలతో వాణిజ్యం పరంగా ఒక కఠినమైన బేరసారాలాడే వ్యక్తి(Tough Negotiator) అని నిరూపించుకోవాలి. భారత్తో అరకొర ఒప్పందం చేసుకుంటే అది తన రాజకీయ ఇమేజ్కు దెబ్బని ఆయన భావిస్తున్నారు. భారత్ నుంచి భారీగా రాయితీలు పొందితేనే అది తనకు రాజకీయంగా విజయం అని ఆయన నమ్ముతున్నారు.ప్రస్తుత పరిస్థితిఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు పూర్తిగా ఆగిపోలేదు. ఇటీవల కూడా అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం భారత్లో పర్యటించింది. అమెరికా పట్టుబడుతున్న మొక్కజొన్న (Corn), సోయా వంటి ఉత్పత్తులను భారత్లోకి అనుమతించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇరు దేశాలు ఈ విషయంలో ఒక అంగీకారానికి వస్తే 2026 ప్రారంభంలో ఈ సుంకాలు తగ్గే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే.. -
ఆమెకు 39, అతనికి 47 : ప్రియురాలితో ఎంగేజ్మెంట్ వీడియో వైరల్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన ప్రియురాలు, మోడల్, సామాజికవేత్త అయిన బెట్టినా ఆండర్సన్తో వైట్హౌస్ హాలిడే పార్టీలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈవిషయాన్ని వైట్హౌస్లో నిర్వహించిన ప్రీ-క్రిస్మస్ వేడుకల సందర్భంగా ట్రంప్ జూనియర్ తెలియజేశారు. ఇప్పటికే రెండు సార్లు నిశ్చితార్థం చేసుకున్న ఈయనకు ఇది మూడో నిశ్చితార్థం కావడం గమనార్హం. వేడుకలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు అనేక మంది ప్రభుత్వ అధికారులు, ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.తనకు ఎస్ చెప్పిన ప్రియురాలికి 47 ఏళ్ల జూ. ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఇది అత్యంత మరపురాని వారాంతం. జీవిత ప్రేమను వివాహం చేసుకోబోతున్నాను. నేను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిని, ధన్యవాదాలు,” అంటూ 39 ఏళ్ల బెట్టీ తన సంతోషాన్ని ప్రకటించారు. బెట్టినా ఆండర్సన్ ఎవరు?బెట్టినా ఆండర్సన్ దాతృత్వవేత్తలు హ్యారీ లాయ్ ఆండర్సన్ జూనియర్, ఇంగర్ ఆండర్సన్ కుమార్తె. ఆమె పామ్ బీచ్ సామాజిక మరియు దాతృత్వ వర్గాలలో బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె ఆడ్రీ గ్రస్ స్థాపించిన హోప్ ఫర్ డిప్రెషన్ రీసెర్చ్ ఫౌండేషన్కు న్యాయవాది. ఫ్లోరిడాకు చెందిన పరిరక్షణ చొరవ ప్రాజెక్ట్ పారడైజ్లో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పామ్ బీచ్ కౌంటీ అక్షరాస్యత కూటమితో క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా పాల్గొంటుంది.ఈ జంట దాదాపు ఒక సంవత్సరం పాటు కలిసి ఉన్నారని సమాచారం. గత నెలలో జరిగిన వ్యాపారవేత్త కుమార్తో వివాహానికి హాజరై ఉదయపూర్లో సందడి చేశారు.ట్రంప్ జూనియర్ గతంలో వెనెస్సా ట్రంప్ను వివాహం చేసుకున్నాడు. 12 ఏళ్ల తరువాత 2018లో వారి విడాకులు తీసుకున్నారు. వీరికి. ఐదుగురు పిల్లలు ఉన్నారుఈ తర్వాత, ట్రంప్ జూనియర్ 2018లో మాజీ ఫాక్స్ న్యూస్ హోస్ట్ కింబర్లీ గిల్ఫోయిల్తో డేటింగ్ ప్రారంభించాడు. 020లో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లి దాకా రాలేదు. అయితే వారి సంబంధం 2024 చివరిలో ముగిసింది. 2024లో ఆండర్సన్, జూ. ట్రంప్ బంధం వెలుగులోకి వచ్చింది. BREAKING NEWS:President Trump just announced at the White House that his son @DonaldJTrumpJr and his girlfriend Bettina Anderson are getting married! They just got engaged. Congratulations to them both. pic.twitter.com/psb38nTGla— Laura Loomer (@LauraLoomer) December 16, 2025 "> -
39 దేశాలపై.. ట్రంప్ ట్రావెల్ బ్యాన్
-
ట్రంప్ ఖాతాలోకి మరికొన్ని దేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం మరో ఏడు దేశాలపై నిషేధం విధించే ఉత్తర్వులపై ఆయన సంతకాలు(Trump Travel Ban) చేశారు. దీంతో.. మొత్తం 39 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించినట్లయ్యింది.ట్రంప్ తాజా సంతకంతో అమెరికాలో ప్రవేశానికి నిషేధం ఉన్న దేశాల సంఖ్యను 19 నుంచి 39కి పెరిగింది(US Travel Ban). వలస విధానాలను మరింత కఠినతరం చేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారని ఈ సందర్భంగా వైట్హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందుకు దేశ భద్రతనే కారణమని చెబుతోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మొన్నీమధ్యే కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక నేషనల్ గార్డ్ సభ్యులు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు అఫ్గనిస్థాన్ నుంచి వలస వచ్చిన రహ్మానుల్లా లకన్వాల్గా నిర్ధారించారు. దీంతో.. వలసవాదులపై ట్రంప్ భగ్గుమన్నారు. తాజాగా.. పూర్తి నిషేధం విధించిన దేశాలు లావోస్, సియెర్రా లియోన్, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, సౌత్ సూడాన్, సిరియా ఉన్నాయి. అలాగే.. తాత్కాలిక నిషేధం (భాగస్వామ్య పరిమితులు) విధించిన దేశాలు.. అంగోలా, ఆంటిగ్వా & బార్బుడా, బెనిన్, కోట్ దివ్వార్, డొమినికా, గాబోన్, గాంబియా, మలావి, మౌరిటేనియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వేలు.పలు దేశాలపై నిషేధం మాత్రమే కాదు.. పాలస్తీనా వలసల మీద కూడా ట్రంప్ కొరడా ఝుళిపించారు. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు కలిగిన వారికి కూడా ఈ పరిమితులు వర్తించనున్నాయి. అదే సమయంలో.. తుర్కమేనిస్తాన్(మధ్య ఆసియా) పౌరులపై ఉన్న నాన్-ఇమిగ్రెంట్ వీసా నిషేధాన్ని ఎత్తివేసినా, ప్రవేశాన్ని మాత్రం నిలిపివేశారు.మినహాయింపు వీళ్లకే.. శాశ్వత నివాసితులతో పాటు ఇప్పటికే వీసా కలిగిన వాళ్లకు.. అలాగే కొన్ని ప్రత్యేక వీసా వర్గాలకు.. అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమైన వాళ్లకు మినహాయింపు దక్కనుంది.ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే వలస విధానాలను కఠినతరం చేస్తోంది. అలాగే ఆశ్రయం (అసైలం) విషయంలోనూ ఆంక్షలను అమలు చేస్తోంది. అదే సమయంలో బైడెన్ కాలంలో ఇచ్చిన వీసాలను సమీక్షించడంతో పాటు గ్రీన్ కార్డ్ హోల్డర్ల పునఃపరిశీలన వంటి చర్యలు చేపడుతోంది.ట్రంప్ పూర్తి నిషేధం విధించిన దేశాలు (Full Ban):1. ఆఫ్ఘానిస్తాన్2. బర్మా (మయన్మార్)3. చాద్4. రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో5. ఈక్వటోరియల్ గినియా6. ఎరిట్రియా7. హైటి8. ఇరాన్9. లిబియా10. సోమాలియా11. సూడాన్12. యెమెన్13. బురుండి14. క్యూబా15. లావోస్16. సియెర్రా లియోన్17. టోగో18. తుర్కమేనిస్తాన్19. వెనిజులా20. బుర్కినా ఫాసో21. మాలి22. నైజర్23. సౌత్ సూడాన్24. సిరియాభాగస్వామ్య పరిమితులు ఉన్న దేశాలు (Partial Restrictions):25. అంగోలా26. ఆంటిగ్వా & బార్బుడా27. బెనిన్28. కోట్ దివ్వార్29. డొమినికా30. గాబోన్31. గాంబియా32. మలావి33. మౌరిటేనియా34. నైజీరియా35. సెనెగల్36. టాంజానియా37. టోంగా38. జాంబియా39. జింబాబ్వేభాగస్వామ్య ప్రయాణ నిషేధం (Partial Travel Ban) అంటే.. ఒక దేశానికి చెందిన ప్రజలందరిపై పూర్తి నిషేధం కాకుండా, కొన్ని వర్గాలపై మాత్రమే పరిమితులు విధించడం. ఉదాహరణకు, పర్యాటక వీసాలు లేదంటే విద్యార్థి వీసాలు నిలిపివేయొచ్చు. కానీ వ్యాపార వీసాలు, అధికారిక వీసాలు అనుమతించొచ్చు. అలాగే సమాచారం పంచుకోవడంలో లోపాలు, భద్రతా తనిఖీలలో లోపాలు ఉన్న దేశాలపై ఈ విధమైన పరిమితులు అమలు చేస్తారు. భద్రతా కారణాల వల్ల కొన్ని వర్గాల వ్యక్తులు (ఉదా: ప్రభుత్వ అధికారులు, సైనికులు, లేదంటే నిర్దిష్ట వయసు ఉన్నవాళ్లను అమెరికాలో ప్రవేశించకుండా ఆపవచ్చు. -
బీబీసీపై ట్రంప్ పరువు నష్టం దావా
వాషింగ్టన్: అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా వేశారు. 2021లో కేపిటల్ హిల్ దాడి సమయంలో తన ప్రసంగాన్ని దురుద్దేశంతో తప్పుగా, రెచ్చగొట్టేవిధంగా బీబీసీ ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు. అందుకుగాను సంస్థ 10 బిలియన్ డాలర్లు (రూ.90వేల కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ జోక్యం చేసుకోవడానికి, ప్రభావితం చేయడానికి ప్రయతి్నంచిందన్నారు. ఈ మేరకు 33 పేజీలతో మయామి ఫెడరల్ కోర్టులో దావాను వేశారు.2021 జనవరి 6న తేదీన అధ్యక్ష ఎన్నికల ఫలితాల సమయంలో కేపిటల్ హిల్పై దాడికి ముందు తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ గంటపాటు మాట్లాడారు. ఈ సందర్భంగా ‘కేపిటల్ హిల్కు వెళ్తున్నాం. నేనూ మీతోపాటు వస్తున్నాం. మనం పోరాడదాం’అన్నట్టుగా ఉన్న ప్రసంగాన్ని బీబీసీ ‘పనోరమ’డాక్యుమెంటరీగా ప్రసారం చేసింది. అయితే రెండు వేర్వేరు భాగాలను ఎడిట్ చేసి, కలిపి ప్రసారం చేశారని ట్రంప్ ఆరోపించారు. తాను మాట్లాడని విషయాలను మాట్లాడినట్లుగా ప్రసారం చేసినందుకు బీబీసీపై దావా వేస్తున్నట్లు చెప్పారు. -
నాటోలో ఉక్రెయిన్ చేరికకు రష్యా ఓకే!
బెర్లిన్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించే ప్రయత్నాల్లో అతి పెద్ద ముందడుగు. అమెరికా, యూరప్ దేశాలతో కుడిన నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరికను అనుమతించే విషయమై యోచిస్తున్నట్టు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జర్మనీలో చర్చలు జరుపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూతల బృందం సోమవారం ఈ మేరకు పేర్కొంది. రష్యా వర్గాల నుంచి తమకు ఈ మేరకు వర్తమానం వచ్చినట్టు తెలిపింది. నాటోలో ఉక్రెయిన్ చేరికను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆది నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. అలాంటి ప్రయత్నం చేస్తే మొత్తం యూరప్ నే తమ శత్రువుగా భావించి వారితో నేరుగా యుద్ధానికి దిగాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. మరోవైపు, అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ భద్రతకు కచ్చితమైన హామీలిస్తే నాటోలో చేరిక డిమాండ్ ను శాశ్వతంగా వదులుకుంటామని జెలెన్ స్కీ ఆదివారమే ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ఈ విషయమై రష్యా వైఖరి ఇలా అనూహ్యంగా మారడం విశేషం! -
ప్రపంచంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకులు
ఇదివరకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల గురించి విని ఉంటారు, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల గురించి తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు ఈ కథనంలో ప్రపంచంలోనే అత్యంత ధనికులైన రాజకీయ నాయకులు ఎవరు?, వాళ్ల నెట్వర్త్ ఎంత అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)రష్యన్ అధ్యక్షుడు పుతిన్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడు. ఈయనకు ప్రధానంగా ఇంధన & సహజ వనరుల కంపెనీలలో ఎక్కువ వాటా వస్తుందని సమాచారం. దీంతో ఆయనను అత్యంత సంపన్నుడిగా గుర్తించారు. అయితే ఈయన నెట్వర్త్ ఎంత అనే విషయం అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. 200 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. సుదీర్ఘ రాజకీయ జీవితం ఈ అపారమైన సంపదకు కారణమైందని పలువురు చెబుతున్నారు.అలెగ్జాండర్ లుకాషెంకో (Alexander Lukashenko)పలు నివేదికల ప్రకారం.. సుమారు 9 బిలియన్ డాలర్ల సంపద కలిగిన అలెగ్జాండర్ లుకాషెంకో ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజకీయం నాయకుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. 1994 నుంచి బెలారస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈయనకు.. విదేశాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ , వ్యవసాయ, మాన్యుఫ్యాక్టరింగ్ సంస్థలలో వాటాలు ఉన్నాయని సమాచారం.డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద.. ప్రధానంగా రియల్ ఎస్టేట్, బ్రాండింగ్, హోటల్స్ & గోల్ఫ్ రిసార్ట్ల నుండి వస్తుంది. ఈయన నెట్వర్త్ సుమారు 7.2 బిలియన్ డాలర్లు అని అంచనా. ఈయన రాజకీయ పదవిలో ఉన్న సమయం కంటే.. పెట్టుబడులు & మీడియా వెంచర్లలోనే సమయం గడిపారు. దీంతో ఆయన నెట్వర్త్ గణనీయంగా పెరుగుతూ ఉంది.కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ నెట్వర్త్ దాదాపు 5 బిలియన్ డాలర్లు అని అంచనా. కానీ ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు ఈయన సంపద 40 బిలియన్ డాలర్లని చెబుతున్నారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం, సైన్యం, వ్యాపారాలన్నీ కిమ్ కుటుంబం నియంత్రణలోనే ఉంటాయి. అంతే కాకుండా.. బంగారం, బొగ్గు, ఆయుధాలు, సిగరెట్లు, మద్యం ఎగుమతులు ద్వారా కూడా వీరికి ఆదాయం వస్తుంది.జీ జిన్పింగ్ (Xi Jinping)బ్లూమ్బెర్గ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం.. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సంపద 1.5 బిలియన్ డాలర్లు. ఇందులో ఆయన కుటుంబ సంబంధిత ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. జిన్పింగ్ జీతం ఏడాదికి కేవలం 22,000 డాలర్లు మాత్రమే. ఇది కాకుండా ఈయనకు భూ ఖనిజాలు, టెక్ సంస్థలు, బంధువులతో ముడిపడి ఉన్న రియల్ ఎస్టేట్లో అనేక పెట్టుబడులు ఉన్నాయి.ఇదీ చదవండి: డీజిల్ కార్లు కనుమరుగవుతాయా?: ఎందుకు.. -
రష్యా భూభాగంపై జిత్తులమారి చైనా కన్ను!
పొరుగు దేశాల భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపించే జిత్తుల మారి చైనా ఇప్పుడు రష్యాపై కన్నేసింది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చి.. మ్యాపులు విడుదల చేసే డ్రాగన్ దేశం ఇప్పుడు రష్యా-చైనా సరిహద్దుల్లోని ఓ ద్వీపం తమదేనని వాదిస్తోంది. దీనిపై రష్యా నిఘా వర్గాలు ఇది నిజమేనంటూ నివేదికలు అందజేశాయి. అసలు ఆ ద్వీపం కథేంటి? శతాబ్దన్నర క్రితం చైనా ఆ ద్వీపాన్ని కోల్పోవడానికి కారణాలేంటి? దీనిపై సాక్షి డిజిటల్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ కథనం ఇది..రష్యాలోని సైబీరియా ప్రాంతంలో.. ఉస్సూరీ-అమూర్ నదుల సంగమం వద్ద అతిపెద్ద ద్వీపం ఉంది. దీన్ని బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్గా పిలుస్తారు. 150 ఏళ్లుగా ఇది రష్యాలో అంతర్భాగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ ద్వీపంపై చైనా కన్నేసింది. ఈ ద్వీపాన్ని ఆక్రమించాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇటీవల రష్యా నిఘా సంస్థ ఎఫ్ఎస్బీ 8 పేజీల నివేదికను అందజేసింది. ఆ నివేదికలో చైనాను శత్రువుగా పేర్కొంది. అమెరికా మ్యాగజైన్ ‘న్యూస్ వీక్’.. అదేవిధంగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక దీనిపై కథనాలను ప్రచురించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2023లో చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మ్యాపుల్లో ఈ ఐల్యాండ్ పూర్తిగా చైనాదేనని పేర్కొనడమే కాకుండా.. ఆ దీవి పేరును మార్చివేసింది. అంతేకాదు.. రష్యాలోని తూర్పు నగరం వ్లాడివోస్టోక్ కూడా తమ భూభాగమేనని చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ మ్యాప్ స్పష్టం చేస్తోంది.బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ ఒకప్పుడు చైనాలో భాగమే..! కానీ, 150 ఏళ్ల క్రితం.. అంటే.. 19వ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం బలహీనపడింది. ఆ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైంది. భద్రత దృష్ట్యా ఈ దీవిని రష్యాకు అప్పగించింది. రష్యాకు కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ఈ దీవి అప్పట్లో అవసరంగా మారింది. 1958లో జరిగిన ఒప్పందం ప్రకారం అమూర్ నదికి ఉత్తరాన ఉన్న విశాలమైన ప్రాంతాన్ని రష్యాకు అప్పటించింది. 1860లో మరో యుద్ధంలో చైనా ఓడిపోవడం.. పాశ్చాత్య దేశాలకు రష్యా సహకరిస్తుందనే భయంతో ‘పెకింగ్ ఒప్పందం’ చేసుకుంది. ఈ రెండు ఒప్పందాల ప్రకారం ఈ దీవితోపాటు.. సువిశాలమైన భూభాగం రష్యా సొంతమైంది. ఆ వెంటనే రష్యా ఇక్కడ వ్లాదివోస్తోక్ నగరాన్ని నిర్మించింది.ఐదు దశాబ్దాల క్రితం నుంచి చైనా సంస్కరణల బాటలో దూసుకుపోతున్నది. రెండు దశాబ్దాలుగా ఆర్థికంగా బలోపేతమవుతుండడంతో.. క్రమంగా ఈ ప్రాంతాలపై వివాదాలు రాజుకున్నాయి. రష్యా-చైనా మధ్య 4,200 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సరిహద్దు ఉంది. 60వ దశకంలో కూడా ఈ సరిహద్దు వెంబడి ఇరుదేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. 1990-2000 మధ్యకాలంలో ఈ వివాదం మరింత ముదిరింది. దాంతో.. పలు ఒప్పందాలు కుదిరాయి. అయినా డ్రాగన్ తన కవ్వింపు చర్యలకు ఫుల్స్టాప్ పెట్టకపోవడంతో 2008లో రష్యా కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్లో కొంత భాగం చైనాకు చెందుతుంది.ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఈ యుద్ధంతో రష్యా ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో చిక్కకుపోయింది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో అతలాకుతలమమయ్యింది. దీంతో డ్రాగన్ మరోమారు కుయుక్తులకు తెరతీసింది. ఓ వైపు రష్యాను మిత్రదేశంగా పేర్కొంటునే.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను కాదని రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించింది. మరోవైపు బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ని హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఒకవేళ చైనా తన చర్యలను మరింత ముమ్మరం చేస్తే.. రష్యా దానిని ఎదుర్కోగలదా? ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైతే.. అది ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -హెచ్.కమలాపతి రావు -
పాకిస్థాన్కు.. అమెరికా మరో వరం
జీ7 దేశాలను కాదని.. భారత్ సహా ఐదు దేశాలతో కోర్-5 దేశాల కూటమి ఏర్పాటుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు పాకిస్థాన్పై వరాల జల్లులను కంటిన్యూ చేస్తున్నారు. వాణిజ్యం, అప్పులు, ఇతరత్రా సహాయసహకారాలు అందించడంలో ఇప్పటికే పాకిస్థాన్కు అగ్రతాంబూలం ఇస్తున్న ట్రంప్ సర్కారు.. తాజాగా పాక్ యుద్ధ విమానాలు – ఎఫ్16 అప్గ్రేడేషన్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏకంగా 686 మిలియన్ డాలర్లు.. అంటే.. సుమారు 5,800 కోట్ల రూపాయలను వెచ్చించనుంది.పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే..! ఆ తర్వాత పాక్ ప్రతిస్పందనకు ధీటుగా బదులిచ్చేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. అయితే.. భారత్తో పోలిస్తే.. పాకిస్థాన్ వద్ద అధునాతన యుద్ధ విమానాలున్నాయి. అమెరికా సరఫరా చేసిన ఎఫ్16, చైనా అందజేసిన జే10సీ వంటి యుద్ధ విమానాలు పాకిస్థాన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. అయినా.. భారత్ తన సంప్రదాయ మిరాజ్, మిగ్ విమానాలతో పాకిస్థాన్ పీచమణిచింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిమ్ మునీర్ ఆ సమయంలో బంకర్లలో తలదాచుకోవడంతో.. అధునాతన యుద్ధ విమానాలున్నా పాకిస్థాన్ ఏమీ చేయలేకపోయింది.నిజానికి ఆపరేషన్ సిందూర్లో భారత్కు చెందిన రాఫెల్ను కూల్చేశామని పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసింది. అదే సమయంలో పాకిస్థాన్కు చెందిన అమెరికా తయారీ ఎఫ్-16లు భారత్ దాడిలో ధ్వంసమైనట్లు నివేదికలు వచ్చాయి. ఇది ఒక విధంగా అమెరికాకు తీవ్ర అవమానం. దీంతో అగ్రరాజ్యం పాకిస్థాన్కు ఇచ్చిన యుద్ధ విమానాలను మరింత సమర్థంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ 5,800 కోట్ల రూపాయలతో పాకిస్థాన్ వద్ద ఉన్న ఎఫ్16 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను అమెరికా పార్లమెంట్కు పంపింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ చేసిన ప్రతిపాదన ఇప్పుడు అమెరికా పార్లమెంట్ ముందు ఉంది. దీనిపై కాంగ్రెస్ ఆమోదం లేదా తిరస్కరణకు 30 రోజుల సమయం ఉంది. ఆ వెంటనే అమెరికా తన మిత్రదేశమైన పాక్కు లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ను జారీ చేస్తుంది. ఆ వెంటనే పాకిస్థాన్లోని ఎఫ్16 యుద్ధ విమానాల అప్గ్రేడ్ ప్రక్రియ మొదలవుతుంది. 686 మిలియన్ డాలర్ల ప్రతిపాదనలో వేర్వేరు కేటగిరీల వారీగా ఆ ఏజెన్సీ వివరాలను కాంగ్రెస్కు అందజేసింది. దాని ప్రకారం 37 మిలియన్ డాలర్లను ఎఫ్16లో ఉపయోగించే కీలక పరికరాలకు వెచ్చిస్తారు. మిగతా 649 మిలియన్ డాలర్లను హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అభివృద్ధి, లాజిస్టిక్స్కు కేటాయిస్తారు.సరే.. పాకిస్థాన్కు అమెరికా చేసే ఈ సాయంతో భారత్కు నష్టమేంటి? అనుకుంటున్నారా? దీని ప్రభావం మనదేశంపై తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే.. ఎఫ్16లో అత్యంత కీలకమైన అప్గ్రేడేషన్స్పై అమెరికా దృష్టి సారించింది. ముఖ్యంగా 92 లింక్-16 టాక్టికల్ డేటా లింక్ సిస్టమ్ని పాకిస్థాన్కు అందజేయనుంది. ఈ సాంకేతికత అమెరికాతోపాటు.. నాటో దేశాల వద్ద మాత్రమే ఉంది. అంటే.. క్లిష్టపరిస్థితుల్లో అమెరికా, నాటో దేశాల మధ్య జామ్-ప్రూఫ్ కమ్యూనికేషన్కు ఉపయోగపడే ఈ టెక్నాలజీ ఇప్పుడు పాకిస్థాన్కు అందుతుంది. దీంతోపాటు.. కొత్త ఏవియానిక్స్, క్ట్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, మిషన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్, విడిభాగాలను అమెరికా అందజేస్తుంది. ఇక ఎఫ్16పై పైలట్లకు సమర్థమైన ట్రైనింగ్ ఇచ్చేలా సిమ్యులేటర్లను అందజేయనుంది. అయితే.. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ నుంచి భారత్కు మరింత ముప్పు పెరిగే ప్రమాదాలున్నాయి. అయితే.. శత్రువు కదలికలను నిశితంగా పరిశీలించే భారత ప్రభుత్వం .. ముప్పును ఎదుర్కోవడంలో చాణక్య నీతిని ప్రదర్శిస్తుందని ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచదేశాలు గుర్తించాయి. ఇప్పుడు ఎఫ్16ల అప్గ్రేడేషన్ ముప్పును కూడా భారత్ సమర్థంగా ఎదుర్కొంటుందని ఆశిద్దాం..!-హెచ్.కమలాపతి రావు -
భారత్తో ట్రంప్ దాగుడు మూతలు..?
ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలను చూస్తే.. భారత్తో అమెరికా దూరం పెరిగిపోయిందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణం. ఏ విషయాన్ని తెగేసి చెప్పకుండా భారత్-పాక్ల యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకున్న ట్రంప్.. మద్దతు విషయానికొచ్చేసరికి పాక్కే ప్రయారిటీ ఇచ్చారు. ఆ దేశ ఆర్మీ ఛీఫ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్లను అమెరికాకు ఆహ్వానించడమే కాకుండా వారితో రాసుకుపూసుకుని తిరిగారు. ఇక్కడ ట్రంప్ ద్వంద్వ వైఖరి బయటపడింది. భారత్పై ఆంక్షలే లక్ష్యంగా..అదే సమయంలో భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించి అక్కసు తీర్చుకున్నారు. దీనిపై అమెరికాలో ఉన్న నిపణులు సైతం ట్రంప్ను హెచ్చరించారు కూడా. భారత్పై అత్యధిక సుంకాలు విధిస్తే ఆ దేశంలో ఎన్నో దశాబ్దాల నుంచి సాగుతున్న మిత్రత్వం చెడిపోతుందని కూడా వివరించారు. దానివల్ల అమెరికాక ఒరిగేదేమీ లేకపోయినా మనమే దెబ్బతింటామని కూడా చెప్పారు. కేవలం భారత్కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని ఒక్క ఒక్క తలంపుతో 50శాతం సుంకాలను విధించారు ట్రంప్.ఇదిలా ఉంచితే, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించారు. రష్యా చమురును కొనడం ఆపాలనే భారత్ను చాలాసార్లే హెచ్చరించారు. అయితే దాన్న భారత్ పూర్తి సీరియస్గా తీసుకోగా పోగా రష్యా నుంచి చమురు కొనడాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల రష్యా అధ్యక్షడు పుతిన్.. భారత్కు వచ్చిన నేపథ్యంలో కూడా చమురు సరఫరాపై ఒక్క ముక్కలో తేల్చి పారేశారు. తాము భారత్కు సరఫరా చేస్తామని కచ్చితంగా చెప్పేశారు. మరొకవైపు చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఇలా వరుస పరిణామాలు ట్రంప్కు అసహనం తెప్పిస్తున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా వేరే దేశాలకు భారత్ దగ్గరవ్వడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. మెక్సికో సుంకాల వెనుక ట్రంప్ హస్తం?గత రెండు రోజుల క్రితం భారత దిగుమతులపై మెక్సికో 50 శాతం సుంకాన్ని విధించింది. దీనికి ఏవో కారణాలు చెప్పుకొచ్చింది. తమ దేశంతో పూర్తిస్థాయి వాణిజ్య సంబంధాలు లేని దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తున్నామంటూ స్పష్టం చేసింది. ఈ జాబితాలో భారత్తో పాటు చైనా కూడా చేరింది. మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) లేని దేశాలన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయని చెప్పింది. అయితే వీటి వెనుక ఉన్నది ట్రంప్ అని పలు ఆరోఫలణలు వచ్చాయి.. వస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఇప్పటికే మెక్సికో సుంకాలపై స్పందించారు. ఇది ట్రంప్ చర్య కావొచ్చనే అనమానం వ్యక్తం చేశారు. దీన్ని పూర్తిగా కాదనలేం. అమెరికాకు అత్యంత మిత్ర దేశాల్లో మెక్సికో ఒకటి. మెక్సికోను పదే పదే పొగడ్తలతో ముంచెత్తం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది.ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య ఒప్పందాలున్నాయి. గతంలో పలు సందర్భాల్లో మెక్సికో అధ్యక్షరాలు క్లాడియా షీన్బామ్ను అత్యంత సాహసిగా, గొప్ప నాయకురాలిగా అభివర్ణించారు ట్రంప్. ఇక మెక్సికోకు కూడా అమెరికాపై అంతే ప్రేమ ఉంది. ఈ కారణంగానే ట్రంప్ దాగుడు మూతలకు తెరలేపి భారత్కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని చూశారనేది నిపుణుల అంచనా. ఇది ట్రేడ్ డైవర్షన్కు అడ్డుకట్టా.. ట్రంప్ అడ్డుకట్టా..?భారత్, చైనాలపై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాలు మెక్సికోకు దిగుమతి చేసే వస్తువులను నేరుగా అమెరికాకు పంపకుండా మెక్సికో ద్వారా మళ్లించి ఆ తర్వాత అమెరికాకు పంపే అవకాశం ఉంది. దీన్ని ట్రేడ్ డైవర్షన్ అంటారు.దీనికి అడ్డుకట్టవేయాలనే తలంపుతో మెక్సికో చేసినా, ఇందులో ట్రంప్ హస్తం ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారత్పై అమెరికా విధించిన సుంకాలపై అక్కడ ఎంపీల నుంచే ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ట్రంప్ ఇలా చేసే ఉంటారనేది మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. ఇదీ చదవండి:భారత్పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావంట్రంప్ భారీ సుంకాల రద్దు.. ? యూఎస్ కాంగ్రెస్లో తీర్మానం! -
ట్రంప్ భారీ సుంకాల రద్దు?.. యూఎస్ కాంగ్రెస్లో తీర్మానం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతపై విధించిన అదనపు సుంకాలు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తన జాతీయ అత్యవసర అధికారాన్ని ఉపయోగించి, భారతదేశం నుండి వచ్చే దిగుమతులపై 50 శాతం అదనపు సుంకాన్ని విధించారు. తాజాగా వీటిని రద్దు చేయాలంటూ ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ప్రతినిధులు డెబోరా రాస్, మార్క్ వీసీ, భారతీయ-అమెరికన్ రాజా కృష్ణమూర్తి నేతృత్వంలో ఈ తీర్మానం వెలువడింది. ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధం అని, ఇది అమెరికన్ కార్మికులు, వినియోగదారులతో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు హానికరం అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానం కేవలం వాణిజ్యపరమైన సమస్యను మాత్రమే కాకుండా, అధ్యక్షుడు తన అత్యవసర అధికారాలను ఏకపక్షంగా వినియోగించడాన్ని ఎత్తిచూపింది.ఈ సుంకాల ప్రభావం గురించి కాంగ్రెస్ మహిళా సభ్యురాలు డెబోరా రాస్ మాట్లాడుతూ నార్త్ కరోలినా ఆర్థిక వ్యవస్థ భారతదేశం వాణిజ్యం, పెట్టుబడులతో ముడిపడి ఉందని, భారతీయ అమెరికన్ సమాజం ఇక్కడ వేళ్లూనుకుందని అన్నారు. భారతీయ కంపెనీలు ఇక్కడ బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి, వేలాది ఉద్యోగాలు సృష్టించాయని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యుడు మార్క్ వీసీ తన ప్రసంగంలో భారతదేశాన్ని .. ముఖ్యమైన సాంస్కృతిక, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణించారు. ఈ చట్టవిరుద్ధమైన పన్నులు అమెరికన్ పౌరులపై భారం మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ సుంకాలు వ్యతిరేకమైనవని, అమెరికన్ కార్మికులకు హాని కలిగిస్తాయని, వినియోగదారులకు ఖర్చులను పెంచుతాయని అన్నారు. ఈ సుంకాలను రద్దు చేయడం ద్వారా యూఎస్-భారతదేశం మధ్య ఉన్న కీలకమైన ఆర్థిక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయవచ్చని, తద్వారా మన ఉమ్మడి ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొన్నారు. ఈ తీర్మానం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నంగా తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ గత ఆగస్టులో భారత్పై రెండు విడతలుగా 25 శాతం చొప్పున సుంకాలను విధించారు. భారతదేశం రష్యన్ చమురు కొనుగోలు చేస్తూ, మాస్కో యుద్ధ ప్రయోజనానికి ఆజ్యం పోస్తున్నదని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద సుంకాలను పెంచారు.ఇది కూడా చదవండి: ఆకాశానికి రంగులు అద్దిన ఉల్కలు! -
ట్రంప్.. క్లింటన్.. బానన్.. బిల్గేట్స్.. ఎప్స్టీన్ ఫైల్స్లో మరో బాంబు!
ప్రపంచాన్ని కుదిపేస్తున్న హైఫ్రొఫైల్ సెక్స్ స్కాండల్ ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రట్స్ నేతృత్వంలోని హౌజ్ ఓవర్సైట్ కమిటీ మరికొన్ని ఫొటోలను తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో రాజకీయ, వ్యాపార ప్రముఖులకు సంబంధించిన మొత్తం 19 ఫొటోలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ ఆప్తుడు స్టీవ్ బానన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ ట్రెజరీ సెక్రటరీ ల్యారీ సమర్స్, బిల్ గేట్స్, ప్రముఖ ఫిల్మ్మేకర్ వూడీ అలెన్, ప్రిన్స్ ఆండ్రూ.. ఇలా పలువురు జెఫ్రీ ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్నట్లు అందులో ఉంది. ఇందులో.. డొనాల్డ్ ట్రంప్ కొంత మంది అమ్మాయిలతో(వాళ్ల మఖాల బ్లర్ చేసి ఉన్నాయి) కలిసి దిగిన ఫొటో బ్లాక్ అండ్ వైట్లో ఉంది. మరొక ఫొటోలో ఎప్స్టీన్తో కలిసి ట్రంప్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇంకొక ఫొటోలో ఒక అమ్మాయితో(ముఖం కనిపించకుండా చేశారు) కలిసి ఫొటోకు ఫోజు ఇచ్చారాయన. ఇంకొక ఫొటోలో ట్రంప్ పేరిట కండోమ్ ఉండడం గమనార్హం. వీటితో పాటు క్లింటన్ ఎప్స్టీన్తో దిగిన ఫొటోలు, ఎప్స్టీన్ ఎస్టేట్లో బిల్గేట్స్ సహా పలువురు ప్రముఖులు సందడి చేసిన ఫొటోలు ఉన్నాయి.ట్రంప్.. ఎప్స్టీన్ ఒకప్పుడు మంచి స్నేహితులే. అయితే లైంగిక దాడి కేసులో ఎప్స్టీన్ అరెస్ట్(2004) తర్వాత ఆ బంధానికి ఎండ్కార్డ్ పడింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఇదే విషయాన్ని ఆయన చెబుతూ వస్తుంటారు. బానన్తో ఎప్స్టీన్ సెల్ఫీ.. పక్కన ఐల్యాండ్లోని ఓ గోడ మీద ఫొటోలో బిల్గేట్స్తాజాగా రిలీజ్ అయిన ఫొటోలు.. పలు ఈవెంట్లలో, పిచ్చాపాటి సంభాషణల్లో దిగిన ఫొటోలే ఉన్నాయి. అంతేగానీ.. అందులో ఉన్నవాళ్లంతా ఎప్స్టీన్ పాపాల్లో భాగం అయినట్లు మాత్రం ఎక్కడా లేదని చెబుతూ ఈ ఫొటోలను రిపబ్లికన్లు తేలికగా తీసుకుంటున్నారు. మరోవైపు ట్రంప్ కూడా ఆ ఫొటోలు అంతగా చర్చించుకోవాల్సిన విషయమేమీ కాదని అన్నారు. ‘‘నేను వాటిని చూడలేదు. కానీ అందరికీ ఈ వ్యక్తి(బానోన్ను ఉద్దేశిస్తూ..) తెలుసు. అతను పామ్ బీచ్లో ఎక్కడైనా కనిపించేవాడు. అతనితో వందలాది మంది ఫోటోలు ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు’’ అంటూ బదులిచ్చారు. 🇺🇸⚡️Reporter: There were new Epstein photos released today showing..What was your reaction?Trump: I haven't seen them, but everybody knew this man (Bannon). He was all over Palm Beach. There are 100s and 100s of people that have photos with him. I know nothing about it. pic.twitter.com/KKWGtyr4Q2— Osint World (@OsiOsint1) December 12, 2025కామ పిశాచి.. ఎప్స్టీన్!అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి.. కొంత కాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఎప్స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే రెండు దీవుల్లో(ప్రైవేట్ ఐల్యాండ్)లో.. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి(ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు). ఎప్స్టీన్ ఫైల్స్లో.. మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే..ఎఫ్బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ ఏడాది జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని.. సన్నిహితంగా ఉన్న ప్రమఖలపైనా నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే..ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ట్రంప్ ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపించాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ సెక్స్ స్కాండల్ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు కూడా).. ట్రంప్ను కూడా ఎఫ్బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో.. ఇది డెమోక్రాట్ల మోసం అంటూ తొలి నుంచి ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్.. చివరకు నవంబర్ 30వ తేదీన అధ్యక్ష హోదాలో ఫైల్స్ విడుదలకు ఓ సంతకం చేశారు. ఆ సమయంలో ఇక దాచడానికి ఏమీ లేదు.. విడుదలకు పూర్తి మద్దతు ఇస్తున్నా అని ఆయన ప్రకటించడం గమనార్హం. దాని ప్రకారం.. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 30 రోజుల్లో అన్ని ఫైళ్లను హౌజ్ ఓవర్సైట్ కమిటీకి అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎప్స్టీన్ ప్రైవేట్ ల్యాండ్స్కు సంబంధించి.. అందులో ఉన్న 150 ఫొటోలను, డాక్యుమెంట్లను కమిటీ బయటపెట్టింది. 20,000 పేజీల డాక్యుమెంట్లలో ఎప్స్టీన్కు ప్రముఖ రాజకీయ, మీడియా, హాలీవుడ్, విదేశీ నాయకులతో ఈ-మెయిల్ సంభాషణలు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ల ద్వారానే ప్రిన్స్ ఆండ్రూ పేరు ప్రముఖంగా బయటపడింది. మాజీ ట్రెజరీ కార్యదర్శి లారీ సమర్స్తో ఎప్స్టీన్ చేసిన ఈ-మెయిల్లు, అలాగే ట్రంప్ మాజీ సలహాదారు బానన్కు సహాయం చేయాలనే ఆఫర్లు బయటపడ్డాయి.అంతేకాదు ఐల్యాండ్లోని విలాసవంతమైన వసతుల ఫొటోలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మరోపక్క.. గిస్లేన్ మాక్స్వెల్ కేసుకు సంబంధించిన గ్రాండ్ జ్యూరీ మెటీరియల్స్ కూడా విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాలి, కాబట్టి మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
కోర్–5 సూపర్ క్లబ్
వరల్డ్ ఆర్డర్. ఒక్క వాక్యంలో చెప్పాలంటే బలం, సామర్థ్యం ఆధారంగా వరుస క్రమంలో దేశాల అమరిక. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలే శాసించే ఈ వరల్డ్ ఆర్డర్ త్వరలో పెను మార్పులను చవిచూడనుందా? ఇప్పటిదాకా అత్యంత బలోపేతమైన కూటమిగా ఉన్న జీ7 వైభవం గతించనుందా? దాన్ని తోసిరాజనేలా అతి శక్తిమంతమైన సరికొత్త కూటమి ఒకటి శరవేగంగా పురుడు పోసుకుంటోందా? అన్ని రంగాల్లోనూ నిర్నిరోధంగా దూసుకుపోతున్న నయా భారత్ ది అందులో అతి కీలక పాత్ర కానుందా? అంటే, అవుననే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ముఖ్యంగా కొద్దిరోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు, చేతలు, చాప కింద నీరులా ఆయన చకచకా సాగిస్తున్న ప్రయత్నాలు ఇందుకు ప్రబల సంకేతాలేనని చెబుతున్నారు. కోర్–5 పేరిట కొత్త కూటమికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత డిజిటల్ వార్తా పత్రిక పొలిటికో రాసి కథనం అంతర్జాతీయంగా పెను సంచలనమే సృష్టిస్తోంది. అమెరికా, భారత్, మరో రెండు ఆసియా దిగ్గజాలైన చైనా, జపాన్ తో పాటు ఆశ్చర్యకరంగా రష్యా కూడా ఇందులో భాగస్వామి కానుందని పొలిటికో కథనం సారాంశం. అమెరికాకు సంబంధించిన రక్షణ, జాతీయ భద్రతా వ్యవహారాలను అత్యంత కచి్చతత్వంతో నివేదించే డిఫెన్స్ వన్ సైట్ ను ఉటంకిస్తూ అది ఈ మేరకు పేర్కొంది. ఈ కోర్ గ్రూప్నకు ముద్దుగా ’సీ5 సూపర్ క్లబ్’ గా నామకరణం కూడా చేసింది! నిజంగా గనుక అదే జరిగితే చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి ఇదే అవుతుందని అంతర్జాతీయ నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలో ప్రచురించకుండా రహస్యంగా ఉంచిన భాగంలో సీ5 గురించి వివరంగా ఉన్నట్టు వాషింగ్టన్, వైట్ హౌస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి! ట్రంప్ తీసుకువస్తున్న సరికొత్త సీ 5 ప్రతిపాదనలపై భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, జపాన్ ప్రధాని తకాయిచీ స్పందనలేమిటో తెలియాల్సి ఉంది. యూరప్ దేశాలకు చెక్? జీ7 కూటమిలో అమెరికా, కెనడా , జపాన్ ను మినహాయిస్తే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ రూపంలో నాలుగు యూరప్ దేశాలే ఉన్నాయి. పలు అంశాల్లో వాటి దూకుడు పట్ల ట్రంప్ కొద్దికాలం గుర్రుగా ఉన్నారు. చీటికిమాటికి అన్ని విషయాల్లోనూ తమ మాటే నెగ్గాలనే ఒంటెత్తు పోకడతో అవి శిరోభారంగా మారాయని భావిస్తున్నారు. వాటికి చెక్ పెట్టేందుకే ఈ కొత్త కూటమికి ఆయన తెర తీస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికా విదేశాంగ విధానంలోనే ఇది పెను మార్పు కానుంది! అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టిన గత 80 ఏళ్లలో నిత్యం యూరప్ ను తన అతి సన్నిహిత భాగస్వామిగానే పరిగణిస్తూ రావడం తెలిసిందే.ట్రంప్ సంకేతాలు సీ 5 గ్రూప్ గురించి నిజానికి ట్రంప్ కొంతకాలంగా స్పష్టమైన సంకేతాలే ఇస్తూ వస్తున్నారు. గత జూన్ లో జరిగిన జీ7 శిఖరాగ్రాన్నే ఇందుకు ఆయన వేదికగా మలచుకోవడం విశేషం. జీ7 కూటమిలో రష్యా కొనసాగి ఉండాల్సిందని, ఆ మాటకొస్తే చైనాకూ ఎన్నడో చోటు దక్కాల్సిందని ఆయన కుండబద్ధ్దలు కొట్టారు. తొలుత జీ8గా ఉన్న ఈ కూటమి కాస్తా, 2014లో క్రిమియాను ఆక్రమించిన కారణంగా రష్యాకు ఉద్వాసన పలకడంతో జీ7గా మారింది. ‘నిజానికి అతి పెద్ద తప్పిదమది. అలా చేయకుంటే నేడు ఇంత భారీ యుద్ధమే జరుగుతుండేది కాదు‘ అని ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఉదేశించి జీ7 వేదికగానే ట్రంప్ కుండబద్ధ్దలు కొట్టారు. సి5 మరీ సత్యదూరం ఏమీ కాకపోవచ్చని బైడెన్ హయాంలో అమెరికా జాతీయ భద్రతా మండలిలో కీలకపాత్ర పోషించిన టోరీ తౌసిగ్ చెప్పడం విశేషం. ‘ట్రంప్ కు సిద్ధాంతాలపై పెద్దగా నమ్మకం లేదు. తన ఆలోచనలకు, వ్యూహాలకు, ప్రణాళికలకు ఏది పనికొస్తే అదే అప్పటికి ఆయన సిద్ధాంతం! ఆ లెక్కన కొంతకాలంగా తనకు శిరోభారంగానే గాక అమెరికాకు ఆర్థికంగానూ, ఇతరత్రా కూడా భారంగానే పరిణమిస్తున్న యూరప్ దేశాలను వదిలించుకునేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు.అప్పుడే ఎజెండా రెడీ? అవుననే అంటోంది పొలిటికో. జీ7 మాదిరిగా తర చూ భేటీ కావాలని, అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించాలని ట్రంప్ భావిస్తున్నట్టు అది వివరించింది. అంతేకాదు, పశ్చిమాసియా భద్రతే సీ5 తొలి ఎజెండా అని కూడా డిఫెన్స్ వన్ ను ఉటంకిస్తూ చెప్పేసింది! ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య ఉప్పూ నిప్పుగా ఉన్న సంబంధాలను సరిదిద్దడం సీ5 ’తొలి అసైన్ మెంట్’ అని చెప్పుకొచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ ‘శాంతి’కి గ్రహణం
ఎనిమిది యుద్ధాలను ఆపానని స్వోత్కర్షకు పోతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువు తీసేలా ప్రపంచంలో రెండుచోట్ల మళ్లీ కుంపట్లు రాజుకున్నాయి. సుంకాలు విధిస్తానంటూ బెదిరించి రెండునెలల క్రితం ఆయన ఆగ్నేయాసియా దేశాలైన థాయ్లాండ్ – కంబోడియాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఆపి సఖ్యత కుదిర్చారు. ఆ రెండింటి మధ్యా సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం కుదిరిందని ఆర్భాటంగా ప్రకటించారు. తీరా అయిదురోజుల నాడు కంబోడియా మందుపాతరకు తమ సైనికుడు తీవ్రంగా గాయపడటంతో థాయ్ వైమానిక దళం దాడులు ప్రారంభించింది. ఈసారి దాదాపు పదిమంది మరణించగా వేలాదిమంది జనం ప్రాణభయంతో గ్రామాలు విడిచి పెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. కంబోడియా సైన్యం ప్రతీకార దాడులతో థాయ్ గ్రామాల ప్రజలు కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. మొత్తానికి అటూ, ఇటూ 5 లక్షలమంది నిరాశ్ర యులయ్యారు. ఆఫ్రికాలో పరస్పరం తలపడుతున్న కాంగో–రువాండాల మధ్య కేవలం వారం క్రితం ట్రంప్ శాంతి ఒప్పందం కుదిర్చారు. కానీ అది కూడా విఫలమైంది. పర్యవ సానంగా కాంగోలోని సరిహద్దు గ్రామాలను 2 లక్షల మంది ఖాళీ చేయాల్సి వచ్చింది. రువాండా తిరుగుబాటు సంస్థ ఆ గ్రామాల్లోకి ప్రవేశించిందంటున్నారు.సమస్య మూలమేమిటో తెలుసుకోకుండా, ఇరుపక్షాలూ ఎలాంటి పరిష్కారాన్ని కోరుకుంటున్నాయో గ్రహించకుండా, అందుకు ఏర్పడుతున్న అడ్డంకులేమిటో అర్థం చేసుకోకుండా... ఒక ఫోన్ కాల్తో, ఒకటి రెండు బెదిరింపులతో అంతా సమసిపోతుంద నుకుంటే అవి మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి. ట్రంప్ దౌత్యం విఫలం కావటానికి కారణం ఇదే. ఇరుగు పొరుగు దేశాల మధ్య భూభాగం గురించే ప్రధానంగా ఘర్షణలుంటాయి. థాయ్లాండ్–కంబోడియాల సమస్య కూడా అదే! రెండు దేశాలకూ 817 కిలోమీటర్ల పొడవునా సరిహద్దు ఉంది. ఫ్రాన్స్ దురాక్రమణలో కంబోడియా ఉండగానే వందేళ్ల క్రితం థాయ్లాండ్తో పేచీ ఏర్పడింది. 1953లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దాన్ని పరిష్కరించుకుందామని కంబోడియా ప్రయత్నిస్తోంది. కానీ రెండువైపులా పుట్టు కొచ్చే జాతీయవాద ధోరణులు అందుకు అడ్డంకిగా మారాయి. 2008లో వివాదాస్పద భూభాగంలోని 11వ శతాబ్దం నాటి హిందూ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వార సత్వ సంపదల జాబితాలో చేర్చినప్పుడు అది తమదేనని కంబోడియా ప్రకటించు కోవటంతో ఘర్షణలు తలెత్తాయి. వాస్తవానికి 1962లోనే ఆ భూభాగం కంబోడియా దేనని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది. కానీ అందుకు థాయ్ లాండ్ ససేమిరా అంటున్నది.మొన్న జూలైలో ఇరువైపులా 50 మంది మరణానికి దారితీసిన ఘర్షణలు రాజు కున్నప్పుడు అప్పటి థాయ్ ప్రధాని పెటోంగ్టార్న్ షినవత్రా, కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్తో జరిపిన ఫోన్ సంభాషణలు లీక్ అయ్యి ఆమె పదవి పోగొట్టు కున్నారు. తమ సైన్యం కూడా సరిగా వ్యవహరించటం లేదని ఆమె అంగీకరించటం దేశంలో పెద్ద దుమారం లేపింది. నాలుగు దశాబ్దాలు దేశాన్నేలిన హున్ సేన్ ఇప్పటికీ ప్రస్తుత ప్రధాని, తన కుమారుడు హున్ మానెట్ను తెర వెనక ఉండి నడిపిస్తుంటారు. ఆయనతో మాట్లా డితే తప్ప సమస్య పరిష్కారం కాదని షినవత్రా అనుకోవటం కొంప ముంచింది. తాజా వివాదం పర్యవసానంగా కంబోడియా పౌరులను దేశంలోకి రానీయ కుండా థాయ్లాండ్ సరిహద్దుల వద్ద అడ్డుకుంటుండగా, థాయ్ సినిమాల ప్రసారం, అక్కడి పండ్లు, కూరగాయలు, గ్యాస్, ఇంధనం రాకుండా కంబోడియా నిలిపేసింది.థాయ్–కంబోడియా ఘర్షణలైనా, కాంగో–రువాండాల కొట్లాట అయినా ప్రత్యర్థి దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించినప్పుడే పరిష్కారమవుతాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ అధికారం కోసం జాతీయవాద ధోరణులు రెచ్చగొట్టడం వల్ల సమస్య లొచ్చిపడుతున్నాయి. థాయ్లాండ్లో వచ్చే ఫిబ్రవరి 6న ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, దేశాన్ని రక్షించేది తామేనని చెప్పటానికి కంబో డియాపై యుద్ధభేరి మోగించటంతో పాటు పాలకపక్షం శుక్రవారం పార్లమెంటును రద్దు చేసింది. మళ్లీ ఇరుపక్షాల మధ్యా రాజీ కుదురుస్తానని ట్రంప్ చెబుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
డొనాల్డ్ ట్రంప్లో అసహనం..
ఇటీవల కాలంలో పలు దేశాల మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నాయకుల మధ్య మాటల దాడి హెచ్చుమీరుతోంది. ఈ పరిణామాలను చూస్తే గతంలోనే వరల్డ్ వార్-3 వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావించారు. దేశాల మధ్య సఖ్యత చెదిరి, యుద్ధాలకు దారి తీస్తున్న పరిస్థితులే వీటన్నంటికీ కారణం. అటు రష్యా-ఉక్రెయిన్ వార్ మొదలుకొని నేటి పాకిస్తాన్-ఆఫ్గాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితుల్ని చూస్తే ఏదో ఉపధ్రవం రాబోతుందా? అని పగటు ప్రజానీకం ఉలిక్కిపడిన సందర్భాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.ట్రంప్లో అసహనం.. మరొకవైపు ‘శాంతి-శాంతి’ అని చెప్పుకునే అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో వరల్డ్ వార్-3 అంటూ వ్యాఖ్యానించారు కూడా. మళ్లీ తాజాగా ట్రంప్ అదే హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయన్ల మధ్య యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ యుద్ధం కారణంగా గత నెలలోనే సుమారు 25 వేల మంది వరకూ మృత్యువాత పడ్డారని, అందులో ప్రజలు, సైనికులు కూడా ఉన్నారన్నారు.ఆ యుద్ధాన్ని తక్షణమే ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా అది కారణం కావొచ్చని హెచ్చరించారు. ఆ ఇర దేశాల నేతాలకు ఎన్నిసార్లు చెప్పినా యుద్ధాన్ని ఏదొక రూపంలో ముందుకు తీసుకెళుతున్నారే కానీ దాన్ని ముగించాలనే ఆలోచన చేయడం లేదంటూ వైట్హౌస్ వేదికగా మీడియా సమక్షంలో అసహనం వ్యక్తం చేశారు. ఈ సంర్భంగా ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు ట్రంప్.ఇక మాటల్లేవ్.. అంతా యాక్షనే..!అంతకుముందు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ల యుద్ధంపై ట్రంప్ చాలా ఆందోళనగా ఉన్నారన్నారు. అది ట్రంప్కు విపరీతమైన చిరాకు తెప్పిస్తుందన్నారు. ఇరుదేశాలు ఒక సఖ్యతకు వచ్చి యుద్ధం ఆపకపోతే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందన్నారు. ఇక రష్యా- ఉక్రెయిన్లతో మాట్లాడాలని ట్రంప్ అనుకోవడం లేదని, ఇక కేవలం చర్యలతోనే ఇరు దేశాలకు సరైన సమాధానం చెప్పాలని ట్రంప్ భావిస్తున్నారన్నారు. భారత టూరిస్టులకు షాకిచ్చిన ట్రంప్.. -
భారత టూరిస్ట్లకు షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్: వీసాల విషయంలో అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో పర్యాటక వీసాలపై కొత్తగా హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా అమెరికాలో ప్రసవించి... తమ పిల్లలకు పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకుంటే వీసాలు తిరస్కరించనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.కాగా, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో వలసదారులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పర్యటక వీసా (Visa) జారీ విషయంలోనూ ట్రంప్ సర్కార్ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా అమెరికా గడ్డపై బిడ్డకు జన్మనిచ్చి, తద్వారా జన్మతః పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో పర్యాటక వీసా దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది.ఈ నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా..‘పుట్టబోయే చిన్నారులకు అమెరికా పౌరసత్వం పొందడం పర్యాటకుల ప్రధాన ఉద్దేశంగా తాము భావిస్తే.. అటువంటి వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తాం. ఇటువంటి వాటిని అనుమతించం’ అని పేర్కొంది. మరోవైపు తమ దేశంలోకి వచ్చే పర్యాటకుల్లో కొందరు దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా హిస్టరీని అందించడాన్ని తప్పనిసరి చేసే యోచనలో ట్రంప్ సర్కార్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో, H-1B వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాల సమీక్షను కూడా విస్తరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.అంతేకాకుండగా.. అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి ఒక ప్రకటనలో, విదేశాంగ శాఖ ఇప్పటికే F, M, J వంటి విద్యార్థి, సందర్శకుల వీసా వర్గాలకు సోషల్ మీడియా ఖాతాల తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సమీక్ష H-1B, H-4 దరఖాస్తుదారులకు కూడా డిసెంబర్ 15 నుంచి వర్తిస్తుంది. ట్రంప్ యంత్రాంగం ఇటీవల H-1B, H-4 దరఖాస్తుదారులందరికీ సోషల్ మీడియా స్క్రీనింగ్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఇది వేలాది మంది హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, ప్రతి కేసును క్షుణ్ణంగా భద్రతా సమీక్ష చేస్తామని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. -
ట్రంప్ గోల్డ్ కార్డు వచ్చేసింది
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ట్రంప్ గోల్డ్ కార్డు’ వీసా పథకం అమల్లోకి వచ్చింది. బుధవారం శ్వేతసౌధంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయనే స్వయంగా గోల్డ్ కార్డు విక్రయాలను ప్రారంభించారు. ఇందుకోసం trumpcard. gov అనే ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి, శాశ్వత నివాసానికి, తర్వాత పౌరసత్వం పొందడానికి కూడా వీలు కలి్పంచే ఈ కార్డు ధర మిలియన్ డాలర్లు(రూ.9.02 కోట్లు). అమెరికాలో స్థిరపడాలని భావించే విదేశీయులు వ్యక్తిగతంగా లేదా విదేశీ ఉద్యోగుల తరఫున అమెరికాలోని కంపెనీలు కొనుగోలు చేయొచ్చు. కంపెనీల మాత్రం రెండు మిలియన్ల డాలర్లు(రూ.18.03 కోట్లు) చెల్లించాలి. గోల్డ్ కార్డు కోసం వెబ్సైట్లోకి వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రాసెసింగ్ ఫీజు కింద 15,000 డాలర్లు(రూ.13.54 లక్షలు) చెల్లించాలి. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఆన్లైన్లోనే మిలియన్ డాలర్ల రుసుము చెల్లించవచ్చు. అమెరికాలో అతి తక్కువ సమయంలో నివాసిత హోదా, తద్వారా పౌరసత్వం పొందాలంటే ‘ట్రంప్ గోల్డ్ కార్డు’ కొనుగోలు చేయడం చక్కటి మార్గమని ప్రభుత్వం వెల్లడించింది. కార్డు విక్రయాల ద్వారా వచ్చే సొమ్ముతో అమెరికా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. ట్రంప్ గోల్డ్ కార్డు అనేది నిజానికి ఒక వీసా లాంటిదే. నైపుణ్యం కలిగిన విదేశీయులను అమెరికాలో ఉద్యోగాల్లో నియమించుకోవడం, వారు ఇక్కడే ఉండిపోయే అవకాశం కల్పించడం, పౌరసత్వం ఇవ్వడం, అమెరికా అభివృద్ధి కోసం వారి సేవలు ఉపయోగించుకోవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. విదేశీ నిపుణులు రావడం ఒక బహుమతి గోల్డ్ కార్డు వీసా విక్రయాలు అధికారికంగా ప్రారంభం కావడం పట్ల డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న నైపుణ్యం కలిగిన విదేశీ విద్యార్థులు ఇకపై స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉద్యోగాలు పొందవచ్చని, ఇక్కడే ఉండిపోవచ్చని సూచించారు. గ్రీన్ కార్డు కంటే గోల్డ్ కార్డు అత్యత్తమమైనదని స్పష్టంచేశారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు. ట్రంప్ బుధవారం మధ్యాహ్నం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, డెల్ టెక్నాలజీస్ సీఈఓ మైఖేల్ డెల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. వెబ్సైట్ ద్వారా గోల్డ్ కార్డులు కొనుగోలు చేయొచ్చని ట్రంప్ సూచించారు. అమెరికాలో చదువుకుంటున్న భారత్, చైనా విద్యార్థులు విద్యాభ్యాసం ముగిసిన తర్వాత స్వదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి ఉండడం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. విదేశీ నిపుణులు అమెరికాకు రావడం, అమెరికా ప్రగతి కోసం పనిచేయడాన్ని ఒక బహుమతిగా భావిస్తామని చెప్పారు. సమస్య ఏమిటో తెలిసింది..యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్తోపాటు ఇతర కంపెనీల ప్రతినిధులతో తనకు ఎదురైన అనుభవాన్ని ట్రంప్ పంచుకున్నారు. ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులకు చదువు అయిపోయిన తర్వాత సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని, వారిని ఉద్యోగాల్లో నియమించుకోలేకపోతున్నామని, వారంతా అమెరికాలోనే ఉండేలా చూడాలని టిమ్ కుక్ తనను కోరారని తెలిపారు. అసలైన సమస్య ఏమిటో తనకు తెలిసిందని చెప్పారు. ఇకపై ఆ సమస్య ఉండదన్నారు.సొమ్ము చేసుకోవడానికేనా? ఇండియాలో హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను హఠాత్తుగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలను ఐదారు నెలలపాటు వాయిదా వేశారు. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైళ్లను, వారు చేసిన పోస్టులను క్షుణ్నంగా తనిఖీ చేయాల్సి ఉందని అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్ ప్రకటించింది. వేలాది మంది దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. తదుపరి షెడ్యూల్ కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు విక్రయాలకు తెరతీయడం గమనార్హం. అధిక డిమాండ్ ఉన్న హెచ్1బీ వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల కఠినతరం చేసింది. విదేశాల నుంచి వలసలను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. మరోవైపు విదేశీయులను ఆకర్శించడానికి గోల్డ్ కార్డు వీసాను తీసుకొచి్చంది. గోల్డ్ కార్డు పేరిట భారీగా సొమ్ము చేసుకోవడం, ఆర్థిక లోటును పూడ్చుకోవడమే ట్రంప్ సర్కార్ అసలు లక్ష్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్లాటినం వెర్షన్ కార్డును కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీని ధర 5 మిలియన్ల డాలర్లు. కంపెనీలు ఈ కార్డు కొంటే కొన్ని రకాల పన్ను రాయితీలు, మినహాయింపులు లభిస్తాయి. త్వరలో ఈ కార్డు అందుబాటులోకి రానుంది.ఐదేళ్ల తర్వాత పౌరసత్వం: హోవార్డ్ లుట్నిక్ గోల్డ్ కార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే మిలియన్ డాలర్లు, కంపెనీలు దరఖాస్తు చేస్తే రెండు మిలియన్ల డాలర్లు చెల్లించాలని స్పష్టంచేశారు. ఈ కార్డు కొనుగోలు చేసినవారు ఐదేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఒక కార్డుతో ఒక్కరు మాత్రమే అమెరికాలో ఉండడానికి వీలవుతుందని పేర్కొన్నారు. కంపెనీలు ఎన్ని కార్డులైనా కొనుగోలు చేయొచ్చని అన్నారు. కార్డు ఎన్ని రోజుల్లో రావొచ్చు..గోల్డ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యి కార్డు చేతికి అందడానికి కొన్ని వారాల సమయం పడుతుందని చెబుతున్నారు. అవసరాన్ని బట్టి అదనపు డాక్యుమెంట్లు కూడా సమర్పించాలి. దరఖాస్తు రుసుము 15,000 డాలర్లు నాన్ రీఫండబుల్. అంటే గోల్డ్ కార్డు వచి్చనా రాకున్నా ఈ సొమ్ము వెనక్కి తిరిగిరాదు. కార్డు వచి్చన వారికి అమెరికాలో చట్టబద్ధమైన పరి్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ కల్పిస్తారు. ఈబీ–1 లేదా ఈబీ–2 వీసాదారుల హోదా లభిస్తుంది. అసాధారణమైన, అద్భుతమైన తెలివితేటలు, నైపుణ్యాలు ఉన్నవారికి ఈబీ–1 లేదా ఈబీ–2 వీసాలు ఇస్తుంటారు. ట్రంప్ గోల్డ్ కార్డు కొంటే పరోక్షంగా ఈబీ–1 లేదా ఈబీ–2 వీసా పొందినట్లే. -
వీసా రహిత ప్రయాణికులకు.. సోషల్ మీడియా స్క్రీనింగ్
వాషింగ్టన్: విదేశీయులకు ప్రవేశ ని బంధనలను అగ్ర రాజ్యం అమెరికా నానాటికీ కఠినతరం చేస్తోంది. మూడో ఓరియన్ దేశాల వారికి శాశ్వతం తలుపులు మూసేస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించే వెసులుబాటున్న దేశాలకు చెందిన ప్రయాణికుల కూడా పలు నిబంధనలను వర్తింపజేయాలని అమెరికా అంతర్గత భద్రత (హోమ్ లాండ్ సెక్యూరిటీ) విభాగం తాజాగా నిర్ణయించింది. ప్రవేశానికి అనుమతించే ముందు వారి సోషల్ మీడియా హిస్టరీ, ఇ మెయిల్ ఖాతాలు, కుటుంబ సమగ్ర చరిత్ర తదితరాలను లోతుగా పరిశీలించనుంది. బుధవారం ఫెడరల్ రిజిస్టర్ లో ప్రచురించిన నోటీసులో ఈ మేరకు స్పష్టంగా పేర్కొన్నారు. వారి తాలూకు ఐదేళ్ల సోషల్ మీడియా సమాచారాన్ని వడపోయాలని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ప్రతిపాదించినట్టు అందులో పొందుపరిచారు. అంతేగాక ఐదేళ్లలో వారు వాడిన ఫోన్ నంబర్లు తదితరాలను కూడా ఇకపై విధిగా వెల్లడించాల్సి ఉంటుంది. దాదాపు 40 దేశాలకు అమెరికాలోకి వీసారహిత ప్రవేశం అందుబాటులో ఉంది. అక్కడి పౌరులు అగ్ర రాజ్యానికి వెళ్లాలంటే ఎల్రక్టానిక్ సిస్టం ఫర్ ట్రావెల్ అథరైజేషన్లో ఆన్ లైన్లో వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది. ఆ పద్ధతిని ఇకపై మార్చనున్నారు. అభంతరాల స్వీకరణ, వారి అనంతరం 60 రోజుల్లో ఈ నిబంధనలన్నీ అమల్లోకి రానున్నాయి. దీనివల్ల అమెరికాకు పర్యాటకపరంగా నష్ట ఉండబోదని మీడియా ప్రశ్నలకు బదులు ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాకు వీసారహిత ప్రవేశ వెసులుబాటున్న 40 దేశాల్లో అత్యధికం యూరప్, ఆసియా దేశాలే. -
ట్రంప్కు ప్రధాని మోదీ ఫోన్
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పుతిన్ భారత్ పర్యటన తర్వాత ట్రంప్కు మోదీ ఫోన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. శక్తి, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై మోదీ, ట్రంప్ చర్చించారు. ఉమ్మడి, లాభదాయక అంశాలపై కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపారు. వ్యాపారం, సాంకేతిక సహకారంపై కూడా చర్చించారు.కాగా, భారత్, పాక్ దాదాపుగా పూర్తిస్థాయి యుద్ధానికి దిగాయని కల్పించుకుని దాన్ని నివారించానంటూ తాజాగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. మంగళవారం(డిసెంబర్ 9) పెన్సిల్వేనియాలోని మౌంట్ పొకోనో వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ పాలు గొప్పలకు పోయారు. ‘గత 10నెలల్లోనే నేను ఏకంగా 8 యుద్ధాలను ఆపాను. ఆయన ఇలా చెప్పుకోవడం ఇది దాదాపు 70వ సారి కావడం విశేషం! కొసావో, సెర్బియా, ఇండో–పాక్, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపి యా, ఆర్మేనియా, అజర్ బైజాన్‘ అంటూ ఏకంగా జాబితానే ఏకరువు పెట్టారు. ‘ఇప్పుడు కంబోడి యా, థాయ్ లాండ్ తలపడుతున్నాయి. రేపు ఆ దేశాధినేతలకు కాల్ చేయబోతున్నా. ఇలాంటి ప్రకటనలు నేనుగాక ఇంకెవరు చేయగలరు?‘ అంటూ గొప్పలకు పోయారు. సోమాలియా, అఫ్ఘానిస్థాన్ వంటి మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలకు శాశ్వతం ఫుల్ స్టాప్ పెట్టానని చెప్పుకొచ్చారు. మరోవైపు, భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం ప్రధాని మోదీతో టెలిఫోన్లో సంభాషించిన సంగతి తెలిసిందే. నెతన్యాహు త్వరలో భారత పర్యటనకు రానున్నారు. ఇరువురు అగ్రనేతలు త్వరలో సమావేశం కావాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. మోదీ, నెతన్యాహు మధ్య స్నేహపూర్వక, ఆత్మీయ సంభాషణ సాగినట్లు ఇజ్రాయెల్ పీఎంవో పేర్కొంది. -
రూ. 9.1 కోట్లు ఉంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ మీదే! ఎలా అప్లయ్ చేయాలి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తున్న "ట్రంప్ గోల్డ్ కార్డ్" (Trump Gold Card) పథకానికి సంబంధించిన అధికారిక అమ్మకాలను ప్రారంభించారు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు, అమెరికన్ కంపెనీలు నిపుణులైన వారికి ఎంపిక చేసుకు నేందుకు వీలుగా ఈ కార్డుని తీసుకొచ్చారు. గోల్డ్ కార్డ్కు భారీ ఖరీదు ఈ 'ట్రంప్ గోల్డ్ కార్డ్' పథకం ప్రధానంగా డబ్బు చెల్లించే వారికి వేగవంతమైన వసతి మార్గాన్ని అందిస్తుంది. అలాగే అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి ఒక మార్గంగా ట్రంప్ భావిస్తున్నారు. అదే సమయంలో ఫెడరల్ ఖజానాకు ఆదాయాన్ని తెచ్చి పెడుతుందని అంచనా. అయితే ఈ గోల్డ్ కార్డ్ కోసం వ్యక్తి ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.9.1 కోట్లు), ప్రతీ ఉద్యోగి కోసం సంస్థ 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. దీనికి త్వరలో ఉన్నతస్థాయి ‘ప్లాటినం కార్డ్’ హామీ ఇవ్వబడుతుందని ప్రకటించారువైట్హౌస్లోని వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. ఈ కొత్త వెబ్సైట్ ద్వారా గ్రీన్ కార్డు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నిమిషాల్లోనే జరుగుతుందన్నారు. 1990లో విదేశీ పెట్టుబడుల నిమిత్తం తీసుకొచ్చిన EB-5 విధానంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ చెప్పారు. వీటిని అరికట్టాలనే ఉద్దేశంతోనే గోల్డ్ కార్డును ప్రకటించారు. ప్రాథమికంగా, ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే, కానీ దానికంటే చాలా మెరుగైనది, చాలా శక్తివంతమైనది, చాలా బలమైన మార్గం." అని ట్రంప్ చెప్పారు. భారతదేశం, చైనా వంటి దేశాల విద్యార్థులు అగ్రశ్రేణి అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకుని పట్టభద్రులైన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి రావడం సిగ్గు చేటని ట్రంప్ వ్యాఖ్యానించారు. .ఎలా దరఖాస్తు చేయాలిదరఖాస్తులను trumpcard.gov ద్వారా దాఖలు చేయాలి.గోల్డ్ కార్డ్, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ లేదా ప్లాటినం వెయిట్లిస్ట్ను ఎంచుకోవాలివ్యక్తిగత వివరాలను నమోదు చేయాలిmyUSCIS.gov ఖాతాను క్రియేట్ చేసి 15వేల డాలర్ల (నాన్ రిఫండబుల్) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలివ్యక్తిగతం దరఖాస్తు చేసుకుంటోంటే ఒక మిలియన్ డాలర్లు, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ కోసం 2 మిలియన్లు డాలర్లు చెల్లించాలి. దీనికనుగుణంగా ఆప్షన్ ఎంచుకోవాలి. వెరిఫికేషన్ తరువాత మొత్తం రుసుము చెల్లించాలి.క్రెడిట్ కార్డ్, ACH డెబిట్ (USలో మాత్రమే) లేదా అంతర్జాతీయ వైర్ బదిలీ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?చట్టబద్ధమైన శాశ్వత నివాసానికి అర్హులు అయి ఉండాలియునైటెడ్ స్టేట్స్కు అనుమతి ఉండాలివీసా నంబర్ అందుబాటులో ఉండాలిగోల్డ్ కార్డ్ హోల్డర్లు US శాశ్వత నివాసితుల వలె పన్ను విధించబడతారు.ఆమోదం పొందడానికి ఎంత సమయం పడుతుంది?ప్రాసెసింగ్ రుసుము చెల్లించిన తర్వాత, నేపథ్య తనిఖీ , పరిశీలన సాధారణంగా కొన్ని వారాలు పడుతుంది. దరఖాస్తుదారులు వీసా ఇంటర్వ్యూను పూర్తి చేయాలి , డాక్యుమెంట్ అభ్యర్థనలకు వెంటనే స్పందించాలి.గోల్డ్ కార్డ్ రద్దు అయ్యే అవకాశం ఉందా? ఇతర అమెరికా వీసా మాదిరిగానే, జాతీయ భద్రతా సమస్యలు లేదా తీవ్రమైన నేరారోపణల మీద వీటిని రద్దు చేసే అవకాశం ఉంది.కాగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల వీసాలు సర్వసాధారణం, యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీతో సహా డజన్ల కొద్దీ దేశాలు సంపన్న వ్యక్తులకు "గోల్డెన్ వీసాల" వెర్షన్లను అందిస్తున్నాయి. -
యుద్ధం ఆపా!
న్యూయార్క్, పెన్సిల్వేనియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. ‘భారత్, పాక్ దాదాపుగా పూర్తిస్థాయి యుద్ధానికి దిగాయి. కల్పించుకుని దాన్ని నివారించా‘ అన్నారు. ఆయన ఇలా చెప్పుకోవడం ఇది దాదాపు 70వ సారి కావడం విశేషం! మంగళవారం పెన్సిల్వేనియాలోని మౌంట్ పొకోనో వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ పాలు గొప్పలకు పోయారు. ‘గత 10నెలల్లోనే నేను ఏకంగా 8 యుద్ధాలను ఆపాను. కొసావో, సెర్బియా, ఇండో–పాక్, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపి యా, ఆర్మేనియా, అజర్ బైజాన్‘ అంటూ ఏకంగా జాబితానే ఏకరువు పెట్టారు. ‘ఇప్పుడు కంబోడి యా, థాయ్ లాండ్ తలపడుతున్నాయి. రేపు ఆ దేశాధినేతలకు కాల్ చేయబోతున్నా. ఇలాంటి ప్రకటనలు నేనుగాక ఇంకెవరు చేయగలరు?‘ అంటూ గొప్పలకు పోయారు. సోమాలియా, అఫ్ఘానిస్థాన్ వంటి మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలకు శాశ్వతం ఫుల్ స్టాప్ పెట్టానని చెప్పుకొచ్చారు. నార్వే, స్వీడన్, డెన్మార్క్ లాంటి దేశాల నుంచి అమెరికాకు రారెందుకంటూ వాపోయారు. గత ఏప్రిల్ లో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహిత కాల్పులతో పొట్టన పెట్టు కోవడం, అందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి దాయాది పీచమణచడం తెలిసిందే. చివరికి పాక్ కాళ్ల బేరానికి రావడంతో శాంతి కుదిరింది. అదంతా తన ఘనతేనని అప్పట్లోనే ట్రంప్ చెప్పు కున్నారు. అదేమీ లేదని భారత్ అప్పుడే కొట్టిపారేసింది. కేవలం ఇరు దేశాల చర్చలతోనే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేసింది. -
దిక్కుతోచని ఉక్రెయిన్
నెలలు గడుస్తున్నా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విరమణకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అసహనం కట్టలు తెంచుకున్నట్టు కనబడుతోంది. మధ్యవర్తిగా తన ప్రతిపాదనలకు ససేమిరా అంటున్న ఉక్రెయిన్తోపాటు, దానికి దన్నుగా నిలబడిన యూరప్ దేశాలను కూడా ఆయన తూర్పార బడుతున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతున్నదనీ, యూరప్ దేశాలు బలహీనంగా మారి క్షీణదశకు చేరుకున్నాయనీ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. వైరి పక్షాలు ఎటూ నువ్వా నేనా అన్నట్టు ఉంటాయి. మధ్యవర్తిత్వం వహించే దేశం ఓపిగ్గా వాస్తవ పరిస్థితులను అర్థం చేయించి ఏదోమేరకు తగ్గేలా చేయటం అవసరం. కానీ అలా చేయాలంటే మధ్యవర్తిత్వం వహించే దేశానికి విశ్వసనీయత, ప్రతిష్ఠ ఉండాలి. ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాకు ఆ రెండూ తగ్గాయి. ఏ విషయంలోనూ ఆయన నిలకడగా లేకపోవటం, ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తూ అయోమయాన్ని సృష్టించటం కారణం. జో బైడెన్ హయాంలో అమెరికా ప్రాపకంతోనే యూరప్ దేశాలు ఉక్రెయిన్ను రష్యాపైకి ఉసిగొల్పాయి. కానీ ట్రంప్ వచ్చాక అంతా తలకిందులయి యూరప్ దేశాలకు దిక్కుతోచడం లేదు. అంతేకాదు, ఇటీవల జాతీయ భద్రతా వ్యూహం పేరిట అమెరికా విడుదల చేసిన విధాన పత్రం కూడా వాటికి మింగుడుపడటం లేదు. అట్లాస్ మాదిరిగా ఒంటరిగా భూగోళాన్ని మోయటం ఇకపై ఉండబోదనీ, యూరప్ స్వీయరక్షణ బాధ్యత చూసుకోవాలనీ ఆ పత్రం స్పష్టం చేసింది. ప్రపంచాధిపత్యం కోసం పోటీపడటం పర్యవసానంగా అమెరికా బలహీనపడిందనీ, అందుకే పాత విధానానికి అవసరమైన దిద్దుబాట్లు తప్పనిసరనీ తేల్చింది. ఇప్పటికి ఎనిమిది యుద్ధాలు ఆపానని తరచు చెప్పే ట్రంప్ జాబితాలో నిజానికి ఇప్పటికైతే ఉక్రెయిన్ లేదు. కానీ ఆయన అధికార పగ్గాలు చేపట్టిననాడే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని శపథం చేశారు. 2014కు ముందున్న సరిహద్దుల సంగతి ఉక్రెయిన్ మర్చిపోవాలని చెబుతూ వచ్చారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ భూభాగాన్ని వదులుకోవటానికి ససేమిరా అంటున్నారు. నిజానికి 2022లో ఉక్రెయిన్కూ, ఆయనకు మద్దతునిస్తున్న యూరప్ దేశాలకూ బంగారం లాంటి అవకాశం వచ్చింది. టర్కీ మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో రష్యా తనకు తానే రాజీకి సిద్ధపడింది. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటాననీ, నాటోలో చేరబోననీ హామీ ఇస్తే దురాక్రమించిన భూభాగం నుంచి వైదొలగుతామని రష్యా ప్రతినిధి బృందం ప్రతిపాదించింది. యూరప్ నుంచి కూడా దీనిపై హామీ కావాలని కోరింది. అప్పటికి రష్యా పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టి కొన్ని నెలలు మాత్రమే అయింది. కానీ బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటీన ఉక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి రాజీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని నచ్చజెప్పారు. నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాతోనే జాన్సన్ ఈ సైంధవపాత్ర పోషించారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ మొండికేస్తున్నారు. ఆయనకు శాంతియుత పరిష్కారం ఆలోచనే లేదు. ఆధిపత్య స్థాపనే లక్ష్యం. భారత్ వచ్చేముందు ఈ సంగతి నిర్మొహమాటంగా చెప్పారు. ‘ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వైదొలగితే సరే... లేదా దాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటాం’ అని ఆయన ప్రకటించారు. వైరిపక్షాలు చర్చలంటూ మొదలుపెడితే వాటి వైఖరులు ఏదోమేరకు చల్లారుతాయి. కానీ ఆ చర్చలు ఫలించాలంటే తొలుత కాల్పుల విరమణ పాటించాలి. రష్యా, ఉక్రెయిన్ రెండూ అందుకు సిద్ధపడటం లేదు. యుద్ధ వాతావరణంలో చర్చలు ప్రశాంతంగా సాగబోవన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి రష్యా ప్రతిపాదనలకు అంగీకరించమంటూ ఉక్రెయిన్పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో అమెరికాతో నేరుగా మాట్లాడే ధైర్యంలేని యూరప్ దేశాలు... ట్రంప్ను ఖాతరు చేయొద్దని ఉక్రెయిన్కు నూరిపోస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు కాలదన్నుకుంటే, అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారితే ఏమవుతుందో ఉక్రెయిన్ ఈ దశలోనైనా గుర్తెరగాలి. దీన్నుంచి బయటపడాలంటే సొంత గొంతు వినిపించటం ప్రారంభించాలి. -
ప్రెస్ సెక్రటరీ సౌందర్యంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి తన నోటికి పని చెప్పారు.పెన్సిల్వేనియాలో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, అకస్మాత్తుగా వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అందాన్ని పొగడటం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సూపర్స్టార్ కరోలిన్ కూడా ఈ మీటింగ్కు వచ్చిందంటూ ఆమె వ్యక్తిగత సౌందర్యాన్ని, అందాన్ని ఆకాశానికెత్తేశారు. తన పరిపాలన ఆర్థిక విజయాలపై ప్రసంగాన్ని పక్కన పెట్టి మరీ అందమైన ముఖం, గన్నులాంటి పెదవులు చీప్ కామెంట్స్ చేయడం విస్తుగొల్పింది.79 ఏళ్ల ట్రంప్ తనకంటే దాదాపు 50 ఏళ్లు చిన్నదైన 28 ఏళ్ల కరోలిన్ శారీరక సౌందర్యంపై వ్యాఖ్యలు చేశారు. ఆమె పెదవుల్ని ఏకంగా మెషీన్గన్తో పోల్చేశారు. ఆమె గొప్పది కాదా? కరోలిన్ గొప్పదా?" అని ఆయన ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులను అడిగారు. 28 ఏళ్ల ఎంత అందంగా ఉందో అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. తెలుసా, ఆమె టెలివిజన్లో, ఫాక్స్ వంటి టీవీ స్క్రీన్ పై ఆధిపత్యాన్ని చెలాయిస్తుందనీ, చిన్న మెషీన్గన్లాంటి పెదవులు, అందంతో కట్టి పడేస్తుందన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ వింతైన శబ్దాలను చేయడం సభికులను ఆశ్చర్యపరిచింది. కరోలిన్ నిర్భయంగా వాదిస్తుందని, ఎందుకంటే మన విధానాలను ఆమె సూటిగా చెప్పేస్తుందన్నారు. ఆగస్టులో న్యూస్మ్యాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కరోలిన్ బ్యూటీపై దాదాపు ఇలాంటి కమెంట్స్ చేశారు.కాగా డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నసమయంగా అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా 2019 నుంచి 2021 వరకు లివియట్ పనిచేశారు. న్యూహ్యాంప్షైర్కు చెందిన ఆమె రియల్ ఎస్టేట్ డెవలపర్ నికోలస్ రిక్కోను( 60) ను పెళ్లాడింది. ఎన్నికల్లో ఓడిన ఆమె మళ్లీ జనవరిలో వైట్హౌజ్లో ప్రెస్ కార్యదర్శిగా చేరింది.చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఆమె. ట్రంప్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన ఐదో వ్యక్తి, రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టాక తొలి వ్యక్తి ఆమె.ట్రంపు.. కంపు..మరోవైపు ఆమె నైపుణ్యం, శక్తి సామర్థ్యాలపై కాకుండా, కేవలం అందంపై, ముఖ్యంగా పెదవులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు నెటిజన్లు. మహిళలపై ఇలాంటి సెక్సిస్ట్ కామెంట్లు చేయడం ట్రంప్నకు కొత్తేమీ కాదనీ, తన కంపు నోరును మరోసారి బయటపెట్టుకున్నాడని మండిపడుతున్నారు. -
ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. యూరప్లో ఉద్రిక్తత?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. యూరోపియన్ అనుసరిస్తున్న విధానాలు విపత్తులను సృష్టించేవిగా ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు. ‘పొలిటికో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన ఈ విమర్శలు ఇప్పుడు అమెరికా, దాని కీలక మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.నాటో కూటమిపై కూడా ట్రంప్ దృష్టి సారించారు. ఈ కూటమి తనను డాడీ అని పిలుస్తుందని పేర్కొంటూనే, రక్షణ వ్యయంపై యూరోపియన్ దేశాలు ఏవోవో మాట్లాడతాయి తప్ప, యుద్ధం కొనసాగుతున్నప్పటికీ అవసరమైన సహాయాన్ని అందించవని ట్రంప్ ఆరోపించారు. రష్యాకు కైవ్ భూభాగాన్ని అప్పగించాల్సి వస్తుందని, యూరప్లోని చాలా మంది భయపడుతున్న నేపథ్యంలో, యుద్ధాన్ని ముగించాలనే యూఎస్ ప్రణాళికపై పెరుగుతున్న విభేదాల సమయంలో ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్కు అమెరికా మద్దతుపై యూరోపియన్ నేతలు ట్రంప్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ విమర్శలు వెలువడ్డాయి.ఈ సందర్భంలోనే ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మార్షల్ లా కారణంగా ఎన్నికలు వాయిదా పడటం వల్ల దేశం ‘ఇకపై ప్రజాస్వామ్యం కాదు’ అనే స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు. అందుకే రష్యా పైచేయి సాధిస్తోందని ఆయన వాదించారు. యుద్ధాన్ని ముగించడానికి తాను రూపొందించిన ప్రణాళికను గ్రహించి, యుద్ధంలో మరణాలను ఆపడానికి చర్యలు తీసుకోవాలని ఆయన జెలెన్స్కీకి ట్రంప్ సలహా ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, జెలెన్స్కీ మాట్లాడుతూ భద్రతను నిర్ధారించగలిగితే తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వలసల అంశంపై ట్రంప్ చేసిన విమర్శలు ఇటీవల విడుదల చేసిన అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలోని అంశాలను బలపరుస్తున్నాయి. వలసల కారణంగా బ్రిటన్, ఫ్రాన్స్ , జర్మనీ తదితర దేశాలు నాశనం అవుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. యూరప్లోని నేతలు వలసల ప్రభావాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమయ్యారని ట్రంప్ ఆరోపించారు.ఇది కూడా చదవండి: Israel: యుద్ధ విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న గణాంకాలు -
ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. భారత్పై సుంకాలకు రెడీ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్ను దెబ్బతీసేలాంటి నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ రైతుల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు ట్రంప్ సర్కారు భారత బియ్యం, కెనడియన్ ఎరువులతో సహా వ్యవసాయ దిగుమతులపై కొత్త సుంకాలను విధించే దిశగా యోచిస్తున్నది. సబ్సిడీ పొందిన విదేశీ బియ్యం దిగుమతులు అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని, దేశీయ ధరలను దిగజారుస్తున్నాయని అమెరికన్ రైతులు వైట్ హౌస్ రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ ఎదుట ఆరోపించారు. రైతుల వినతిని పరిగణలోకి తీసుకున్న ట్రంప్ ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ట్రంప్ అమెరికన్ రైతుల కోసం $12 బిలియన్ల (₹1,08,156 కోట్లు) బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు నేరుగా ట్రంప్తో మాట్లాడారు. భారతదేశం లాంటి దేశాలు తమ బియ్యాన్ని యూఎస్ మార్కెట్లలోకి తక్కువ ధరలకు డంపింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. ఇది తమకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ట్రంప్ స్పందిస్తూ తమ దేశ మార్కెట్లలోకి అన్యాయంగా వస్తువులను డంపింగ్ చేస్తూ, పలు దేశాలు తమను మోసం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.లూసియానాలోని కెన్నెడీ రైస్ మిల్ సీఈఓ మెరిల్ కెన్నెడీ, డంపింగ్కు ప్రధాన కారకులుగా భారతదేశం, థాయిలాండ్, చైనాలను చూపించారు. చైనా బియ్యం అమెరికా ప్రధాన భూభాగానికి బదులుగా ప్యూర్టో రికో(టెరిటరీ)లోకి తరలిపోతున్నదని తెలిపారు. ఇది తమకు ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. అమెరికా రైతులకు అన్యాయమైన పోటీనిస్తున్న దేశాల పేర్లను రాయమని ట్రంప్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ను ఆదేశించారు. భారతదేశం తన బియ్యం పరిశ్రమను చట్టవిరుద్ధమైన సబ్సిడీలతో ఎలా ప్రోత్సహిస్తుందో కెన్నెడీ వివరించడానికి ప్రయత్నించగా, ట్రంప్ అడ్డుకుంటూ తనకు దేశాల పేర్లు చెప్పాలని కోరారు.ట్రెజరీ కార్యదర్శి బెస్సెంట్ భారతదేశం, థాయిలాండ్ చైనాలను ఎత్తిచూపారు. వెంటనే ట్రంప్ ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వాణిజ్య ఒప్పందాల కోసం కెనడా, భారతదేశం రెండూ అమెరికాతో సంబంధాలను స్థిరీకరించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా డిప్యూటీ యూఎస్టీఆర్ రిక్ స్విట్జర్ నేతృత్వంలోని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయ సీనియర్ ప్రతినిధి బృందం త్వరలో భారతదేశంతో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించనుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కూడా చదవండి: అవినీతి చీకట్లో.. దేశాల ఆర్థిక పతనం -
పదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో, ఫ్యూచర్ సిటీలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని ట్రంప్ మీడియా అండ్ టెక్నా లజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ప్రకటించారు. ఆహ్వానించడంతో పాటు గౌరవం, అభివృద్ధి కనిపించిన చోటే తమ పెట్టుబడులు పెడతామని అన్నారు. గత కొన్ని నెలలుగా తమను తెలంగాణకు ఆహ్వానిస్తూనే ఉన్నా, ఆలస్యం జరిగిందని, రాష్ట్రంలో అభివృద్ధికి భారీ అవకాశాలుండడంతో రాక తప్పలేదని చెప్పారు. సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.భారత్లో అద్భుతమైన మానవ వనరులుపెట్టుబడులు పెట్టేముందు డబ్బు తిరిగి వస్తుందా.. లాభాలు వస్తాయా? అని అందరూ ఆలోచి స్తారని, అయితే అదే ప్రధానం కాకూ డదని స్వైడర్ అన్నారు. స్వల్పకాలిక ప్రయో జనాలు కాకుండా దీర్ఘకాలిక అంశాలూ దృష్టిలో ఉంచుకో వాలని చెప్పారు. ఎక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉంటే అక్కడికి పెట్టు బడులు నీటి ప్రవాహంలా వెళ్తాయన్నారు. భారత దేశంలో అద్భుతమైన నైపుణ్య మానవ వనరులున్నాయని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇండియానే పెద్దన్న పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఇక్కడి ఆదరాభిమానాలు మరిచిపోలేనుసదస్సుకు ఆహ్వానించి తనకు ఊహించని రీతి లో అద్భుత ఆతిథ్య మిచ్చినందుకు సీఎం రేవంత్రెడ్డికి స్వైడర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ చూపిన ఆదరాభిమానాలు మరచిపోలేనని అన్నారు. అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు దాడి చేస్తున్న సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడా నికి ‘ట్రూత్’ సోషల్ మీడియాను ప్రారంభించామని ఈ సందర్భంగా చెప్పారు. తమ ఆలోచనలకు అనుగుణంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజలకు ఉండాలని, ఇది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు -
హైదరాబాద్ రోడ్లకు ట్రంప్, రతన్ టాటా, గూగుల్ పేర్లు
తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు పెద్దపీట వేస్తూ ప్రముఖ ప్రపంచ నాయకుల గౌరవార్థం హైదరాబాద్లోని కీలక రహదారులకు వారి పేరుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉన్న రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలో లేఖ ద్వారా తెలియజేయనుంది.గ్లోబల్గా గుర్తింపు కోసం..రాష్ట్రాన్ని ఆవిష్కరణలతో నడిచే భారతదేశానికి చిహ్నంగా నిలబెట్టే విస్తృత వ్యూహంలో ఈ నామకరణ ప్రతిపాదనలు ఒక భాగమని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ (USISPF) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లోని ముఖ్యమైన రోడ్లకు ప్రముఖ గ్లోబల్ కార్పొరేషన్ల పేర్లు పెట్టాలని ప్రతిపాదించారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు..డొనాల్డ్ ట్రంప్ అవెన్యూతో పాటు మరికొందరు ప్రముఖ వ్యక్తులు, కార్పొరేషన్ల గౌరవార్థం ఇతర రోడ్లకు కూడా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గౌరవార్థం నగరంలోని రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును కలిపే రాబోయే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు తన పేరు పెట్టాలని నిర్ణయించింది.గూగుల్ స్ట్రీట్హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అమెరికా బయట అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేయడాన్ని గుర్తించి ఈ లేన్ను గూగుల్ స్ట్రీట్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఉద్యోగులకు జాక్పాట్ -
తెలంగాణలో పెట్టుబడుల హోరు
ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వీడర్ ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు హాజరై కీలక పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే పదేళ్లలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. అయితే, గతంలో హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును రూ.3,500 కోట్లతో నిర్మించనున్నట్లు (ట్రంప్ ఆర్గనైజేషన్-ట్రైబెకా డెవలపర్స్ భాగస్వామ్యంతో) వార్తలు వచ్చాయి. ట్రంప్ గ్రూప్ తరఫున లక్ష కోట్ల పెట్టుబడి ప్రకటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇది ట్రంప్ ఫ్యామిలీ గ్రూప్ కావడం విశేషం.తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ వేదికగా ఏకంగా రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు 14 ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సు 8, 9 తేదీల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో ఆయా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.భారీ పెట్టుబడుల్లో ముఖ్యాంశాలు:టీసీఎస్ - టీపీజీ భాగస్వామ్యం: ఐటీ దిగ్గజం టీసీఎస్, మరో సంస్థ టీపీజీతో కలిసి రూ.70 వేల కోట్లు (8 బిలియన్ డాలర్లు)** పెట్టుబడితో అత్యాధునిక హైపర్వాల్ట్ డేటా సెంటర్లను స్థాపించనుంది. ఇది అతిపెద్ద వ్యక్తిగత పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది.రంగాలు: ఐటీ, పరిశ్రమలు, పర్యాటకం, క్రీడలు, వినోదం, ఉన్నత విద్య వంటి వివిధ రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి.ఏఐ సిటీ ఏర్పాటు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి ప్రాధాన్యత ఇస్తూ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.అజయ్ దేవ్గణ్ ప్రతిపాదన: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్సిటీ ఏర్పాటుకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ ముందుకొచ్చారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఉద్యోగులకు జాక్పాట్ -
జెలెన్స్కీపై ట్రంప్ అసహనం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలను జెలెన్స్కీ పూర్తిగా చదవలేదని ట్రంప్ మండిపడ్డారు. ఇదే సమయంలో 10 నెలల కాలంలో తాను ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కెన్నెడీ సెంటర్ ఆనర్స్ రెడ్ కార్పెట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం మేము అధ్యక్షుడు పుతిన్, జెలెన్ స్కీ సహా ఉక్రెయిన్ నాయకులతో మాట్లాడుతున్నాం. శాంతి కోసం మేము తయారు చేసిన ప్రతిపాదనలను జెలెన్ స్కీ చదవలేదు. ఆయన తీరు పట్ల నేను కొంచెం నిరాశ చెందాను. ప్రతిపాదనలను అంగీకరించేందుకు జెలెన్ స్కీ సిద్దంగా లేరు. మరోవైపు.. అమెరికా ప్రతిపాదన పట్ల రష్యా రెస్పాన్స్ బాగుంది. జెలెన్ స్కీ నిర్ణయాలను ఉక్రెయిన్ ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. ఎనిమిది యుద్ధాలు ఆపిన నాకు రష్యాతో ఎలా యుద్దం ముగించాలో తెలియదా? అంటూ’ అని ఘాటు విమర్శలు చేశారు.BREAKING: Trump on the US peace plan for Ukraine🕊️:- Discussed with Ukraine & Russia leaders- Russia is fine with it [the proposal]- Zelensky people “love it,” but he hasn’t read it yet“I'm a little bit disappointed that President Zelensky hasn't yet read the proposal.” 👇 pic.twitter.com/wjBwU7hnJp— Kirill Dmitriev (@kadmitriev) December 8, 2025పురోగతి లేని చర్చలు.. మరోవైపు.. అమెరికా–ఉక్రెయిన్ ప్రతినిధులు మియామిలో వరుసగా మూడు రోజుల పాటు చర్చలు జరిపారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ సందర్భంగా అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రణాళికను రష్యా కొన్ని భాగాల్లో అంగీకరించినట్లు అమెరికా పేర్కొంటోంది. కానీ ఉక్రెయిన్ ఇంకా పూర్తిగా అంగీకరించలేదు. చర్చలు కొనసాగుతున్నప్పటికీ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉండటం కీలకం అని అమెరికా, ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఈ చర్చల్లో అమెరికా తరఫున స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొనగా.. ఉక్రెయిన్ తరఫున రుస్తెమ్ ఉమెరోవ్, ఆండ్రి హ్నాటోవ్ ఉన్నారు.. అలాగే, జెలెన్ స్కీ కూడా వీడియో కాల్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు. కాగా, అమెరికా ప్రతిపాదనలోని కొన్నిఅంశాలను రష్యా తిరస్కరించినట్టు తెలిసింది.రష్యా దాడులు..ఇదిలా ఉండగా.. శాంతి స్థాపన కోసం ఒకవైపు ఉక్రెయిన్తో అమెరికా చర్చలు జరుపుతుండగా.. మరోవైపు వాటిని పట్టించుకోకుండా రష్యా దాడులు చేస్తూనే ఉంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ ఉక్రెయిన్పై చేసిన దాడుల్లో మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. సెంట్రల్ సిటీ క్రెమెన్చుక్లోని మౌలిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. దీంతో విద్యుత్తు, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. క్రెమెన్చుక్ నగరం.. అతి పెద్ద చమురు రిఫైనరీలకు, పరిశ్రమలకు కేంద్రం. ఉత్తర ప్రాంతంలోని చెర్నివ్లో జరిగిన దాడిలో ఒకరు మరణించారు. -
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫిఫా శాంతి బహుమతి
-
ట్రంప్కే ‘ఫిఫా’ తొలి శాంతి బహుమతి ఎందుకంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నట్లే.. శాంతి బహుమతి వరించింది. నోబెల్ కాదు.. ఫిఫా శాంతి బహుమతి రూపంలో. ఈ ఏడాదే ప్రారంభమైన తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని శాంతిదూత ట్రంప్కు ప్రకటిస్తున్నట్లు ఫిఫా పేర్కొంది. అవార్డు అందుకుంటూ ట్రంప్ కూడా ఖుషీ అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అయితే, ఈ శాంతి బహుమతి ట్రంప్నకు ఇవ్వడంతో పొలిటికల్ టర్న్ తీసుకుంది.ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్-2026 (FIFA World Cup 2026) పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్నకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ట్రంప్.. బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని గియాని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారని తెలిపారు. ఇందుకు గాను ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్నకు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.కాంగో-రువాండా ఘర్షణలు ఏంటి? కాంగో-రువాండా ఘర్షణలు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) తూర్పు ప్రాంతంలో దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఇది ఖనిజ సంపద, 1994 రువాండా మారణహోమం, రువాండా మద్దతుగల M23 తిరుగుబాటుదారుల కార్యకలాపాలతో ముడిపడి ఉంది. DRC తూర్పు ప్రాంతంలో కోబాల్ట్, బంగారం వంటి విలువైన ఖనిజాలు ఉండటం, వాటిపై నియంత్రణ కోసం కాంగో-రువాండా మధ్య పోరాటం కొనసాగుతోంది. 1994 రువాండా మారణహోమం తర్వాత హుటు, టుట్సీ జాతుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. DRCలోకి శరణార్థులు తరలి వెళ్లడం ఎక్కువైంది. ఈ క్రమంలో రువాండా మద్దతుతో ఉన్న M23 వంటి సాయుధ సమూహాలు, DRC ప్రభుత్వంతో పోరాడటం ప్రారంభమైంది. దీంతో, రెండు వర్గాల మధ్య పొరుగు దేశాల జోక్యం, ఆయుధాల సరఫరా, ప్రాంతీయ ప్రయోజనాలు తెరపైకి వచ్చాయి. అంతర్గత పోరు, దాడుల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాది మంది మరణించారు. లైంగిక హింస వంటివి విపరీతంగా పెరిగాయి. ముఖ్యమైన ఖనిజాలపై నియంత్రణ లేకపోవడంతో దోపిడీ జరిగింది.ఇటీవలి పరిణామాలు (2022-2025):శాంతి చర్చలు: కెన్యా, అంగోలా ద్వారా చర్చలు విఫలం కాగా, 2024లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.US-ఖతార్ ఒప్పందం: జూన్ 2025లో అమెరికా(డొనాల్డ్ ట్రంప్), ఖతార్ మధ్యవర్తిత్వంతో ఒక చారిత్రక శాంతి ఒప్పందంపై సంతకం జరిగింది. ఇందులో సైనిక కార్యకలాపాలను నిలిపివేయడం, శరణార్థులను పునరావాసం కల్పించడం వంటివి ఉన్నాయి.M23తో ఒప్పందం: నవంబర్ 2025లో M23 తిరుగుబాటుదారులు, DRC ప్రభుత్వం దోహాలో ఒక ఒప్పందంపై సంతకం చేసి, శాంతికి ఒక రోడ్మ్యాప్ను రూపొందించారు. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందాలు కుదిరినప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు DRCలో పోరాటాలు ఉద్రికత్తలకు దారి తీశాయి. M23.. గోమా వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.M23 గ్రూప్..2012లో M23 గ్రూప్ ఏర్పడింది.ఇది కాంగోలోని టుట్సీ వర్గానికి చెందిన మాజీ CNDP తిరుగుబాటు దళాల నుండి విడిపోయిన గ్రూప్.2009లో కాంగో ప్రభుత్వం CNDPతో ఒక శాంతి ఒప్పందం (March 23 Agreement) కుదుర్చుకుంది.ఆ ఒప్పందంలోని నిబంధనలు అమలు కాలేదని ఆరోపిస్తూ, తిరుగుబాటు దళాలు “March 23 Movement (M23)” పేరుతో కొత్త గ్రూప్ను ఏర్పాటు చేశాయి.2012–2013 తిరుగుబాటుM23 తూర్పు కాంగోలో వేగంగా ఎదిగిందిగోమా నగరాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. ఇది పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీసింది.అంతర్జాతీయ ఒత్తిడి, ఐక్యరాజ్యసమితి దళాల జోక్యంతో 2013లో M23 ఓడిపోయింది.నాయకులు రువాండా, ఉగాండా వంటి దేశాలకు పారిపోయారు.2021 తర్వాత మళ్లీ పునరుద్ధరణ2021 చివరలో M23 మళ్లీ చురుకుగా మారింది.2022–2025 మధ్య ఈ గ్రూప్ తూర్పు కాంగోలో పెద్ద ఎత్తున దాడులు చేసింది.కాంగో ప్రభుత్వం రువాండా ఈ గ్రూప్కు మద్దతు ఇస్తోంది అని ఆరోపిస్తోంది.రువాండా మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది.2025లో కూడా M23 గోమా, కిట్షంగా, బుకావు వంటి ప్రాంతాల్లో యుద్ధం కొనసాగిస్తోంది.M23 గ్రూప్ లక్ష్యాలుటుట్సీ వర్గాల రక్షణకాంగో ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి2009 ఒప్పందం అమలు చేయించుకోవడంతూర్పు కాంగోలో తమ ప్రభావాన్ని పెంచుకోవడం.ట్రంప్ ఏమన్నాడంటే.. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పడమే నా లక్ష్యం. అవార్డులతో సంబంధం లేకుండా నా పని నేను చేస్తున్నాను. నా దౌత్యంతో యుద్ధాలను ఆపాను.. లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను. కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ. కాంగో-రువాండా మధ్య హింసతో 10 మిలియన్ల మంది చనిపోయారు. మరో 10 మిలియన్ల మంది చావు అంచుల్లో ఉన్నారు. ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాను. ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని సైతం నేనే ఆపాను. నా చర్యలతో ఎన్నో దేశాల మధ్య యద్ధాలు ఆగిపోయాయి. ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిశాయి. ఇది నాకు ఎంతో గర్వకారణం. ఈ అవార్డు పొందడం జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఇదొకటి’ అని వ్యాఖ్యలు చేశారు.#FIFAWorldCup 🇺🇸 Trump just won the FIRST-EVER FIFA Peace Prize!Golden globe for the man bringing REAL peace. Nobel said no… FIFA said HELL YES! America leads, the world heals 🔥🏆Who’s with President Peace?! Drop a 🇺🇸#MAGA pic.twitter.com/j1K98OaTra— TRUTH🕊️ (@HonestHalo) December 5, 2025ఈ ఏడాదే ప్రారంభం.. ప్రపంచ ఫుట్బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే శాంతి బహుమతిని ఇవ్వడం ప్రారంభించింది. తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్టు నవంబర్ 5న ప్రకటించింది. ఈ క్రమంలో శాంతి బహుమతి.. ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని పేర్కొంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసే వారికి ఈ బహుమతిని అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అంతేకాకుండా ఈ బహుమతి ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచదని, 500 కోట్ల మంది ఫుట్బాల్ అభిమానుల తరఫున అందజేసేదిగా గియాని అభివర్ణించారు. ఫిఫాకు ఇదొక గుర్తింపు అని చెప్పారు. విమర్శల వర్షం.. ట్రంప్నకు ఫిఫా బాడీ శాంతి ప్రకటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హ్యూమన్ రైట్ వాట్ సంస్థ ఫిఫాపై బహిరంగాంగానే విమర్శలు గుప్పించింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు, జూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫిఫా కౌన్సిల్లోనూ ఇది వార్తగా నిలిచినట్లు తెలిపింది. ఇక, ట్రంప్.. కాంగో-రువాండా మధ్య శాంతి నెలకొల్పినట్టు చెబుతున్నప్పటికీ అక్కడ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేమీ లేకపోవడం గమనార్హం. మరోవైపు.. యుద్ధాలను ఆపుతున్నట్టు ట్రంప్ చెప్పినా.. భారత్-పాక్ మధ్య ఆయన ప్రమేయమే లేదని ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడం ట్రంప్ ఇప్పటికీ విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిఫా శాంతి బహుమతిని (FIFA Peace Award) ట్రంప్కు ఇవ్వడంపై విమర్శలు పెరిగాయి. అసలు ట్రంప్కు అంత సీన్ ఉందా? అని పలువురు విశ్లేషకులు, నెటిజన్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. -
30 దేశాలపై .. అమెరికా నిషేధం..!
-
30 దేశాల పౌరులపై నిషేధానికి అమెరికా సన్నాహాలు
అమెరికా తమ దేశంలోకి అడుగు పెట్టకుండా మరికొన్ని దేశాల పౌరులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా పౌరుల భద్రత పేరుతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. అమెరికా తమ పౌరుల భద్రత పేరుతో పలు దేశాలను, ఆ దేశాలకు చెందిన పౌరులను నిషేధించాలని నిర్ణయించింది. తాజాగా ఫాక్స్ న్యూస్ ప్రోగ్రామ్ ‘ది ఇంగ్రహం యాంగిల్’లో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే అమెరికా 19 దేశాలకు చెందిన పౌరులపై ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. అంటే.. ఈ దేశాలకు చెందిన పౌరులకు అన్నిరకాల ఇమ్మిగ్రేషన్లను నిలిపివేయనుంది. అదేవిధంగా పౌరసత్వం, గ్రీన్కార్డు దరఖాస్తులకు సైతం ఆయా దేశాల పౌరులను అనర్హులుగా ప్రకటించింది. అదేవిధంగా ఆయా దేశాలకు తమ పౌరులు వెళ్లకూడదంటూ ట్రంప్ ట్రావెల్ అలెర్ట్ జారీ చేశారు. ఇప్పటికే నిషేధం అమలవుతున్న దేశాలు ఏవి? గత నెల వైట్హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్స్పై ఆఫ్ఘన్ శరణార్థి కాల్పులు జరిపిన ఉదంతం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఆఫ్ఘనిస్థాన్తోపాటు.. కాంగో, క్యూబా, ఇరాన్, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్, తుర్కెమెనిస్థాన్, వెనిజులా, యెమన్తోపాటు.. మొత్తం 19 దేశాలపై నిషేధం విధించారు. తాజాగా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ చెప్పిన దాని ప్రకారం ఈ జాబితాలో మరో 11 దేశాలు చేరనున్నట్లు స్పష్టమవుతోంది. ట్రంప్ నిర్ణయాన్ని రివర్స్ మైగ్రేషన్ అనవచ్చా?అవును ఇది కచ్చితంగా రివర్స్ మైగ్రేషనే. ట్రంప్ నిషేధం విధించిన దేశాలకు చెందిన వారిని అమెరికా నుంచి డీపోర్ట్ చేస్తారు. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ తాజాగా ఫాక్స్ న్యూస్తో మాట్లాడినప్పుడు.. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా పౌరుల భద్రత పెరుగుతుందని, తమ దేశంలో నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఆ మేరకు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం భారీ కసరత్తే చేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయంలో సమస్యాత్మక జనాబా తగ్గుతుందని, అంతకు మించితే సామాజిక సమస్యలు ఏమీ ఉండవని అభిప్రాయపడ్డారు. మరో 11 లేదా అంతకంటే ఎక్కువ దేశాలపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ జాబితాలో ఏయే దేశాలున్నాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. -
భారత్కు అండగా రష్యా.. పుతిన్పై ట్రంప్ ఫుల్ ఫోకస్?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో ఉన్నారు. 2021 తర్వాత భారత పర్యటనకు పుతిన్ రావడం ఇదే తొలిసారి. అలాగే, 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత పర్యటనకు పుతిన్ వచ్చిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యత చోటుచేసుకుంది. కాగా, పుతిన్ పర్యటనలో భాగంగా భారత్, రష్యా మధ్య వాణిజ్య, రక్షణ రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే, పుతిన్ భారత పర్యటనలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణంగా భారత్కు రష్యా మిత్ర దేశం కావడమే.రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలు దేశాల్లో అనేకమంది పాలకులు మారారు. దాదాపు పాతికేళ్లుగా పుతిన్ అధికారంలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో అమెరికాలో ఐదుగురు అధ్యక్షులు మారారు. భారత్ ముగ్గురు ప్రధానులను చూసింది. పుతిన్ తప్ప మరో అధ్యక్షుడి పేరు తెలియని యువ ఓటర్లు రష్యాలో చాలా మందే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పుతిన్ హయాంలో భారత్, రష్యా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. రష్యా నేతలు భారత్ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేశారని గతంలో ఒకసారి పుతిన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా పుతిన్ తొలి భారత పర్యటన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో జరిగింది. ఆ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి బాటలు వేసింది. ఇప్పుడు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి.ఆయుధాలు రష్యావే.. భారత్ రష్యా రక్షణ పరిశ్రమకు పెద్ద మార్కెట్గా ఉంది. భారత సాయుధ దళాలు వినియోగించే ఆయుధాల్లో 36 శాతం రష్యావే. రక్షణ సహకారం, లాజిస్టిక్స్ ఒప్పందాల్లో భాగంగా మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు ఐదోతరం సుఖోయ్-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు, ఒప్పందాలు ఎజెండాలో ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్లో పాక్ దాడుల నుంచి భారత్కు రక్షణ కవచంలా నిలిచిన S-400కు అప్డేటెడ్ వర్షనైన S-500 గగనతల రక్షణ వ్యవస్థ అమ్మకాలపై ఇరుదేశాలు ఓ అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక, మిగ్–29, బ్రహ్మోస్ క్షిపణులు, అణు జలాంతర్గాములు వంటి కీలక వ్యవస్థలు రష్యా సహకారంతోనే నడిచాయి. మరోవైపు.. చైనా సైతం భారత్-రష్యా సంబంధాలు అత్యంత వ్యూహాత్మకమైనవి, ప్రపంచ రాజకీయ ఒత్తిళ్లకు లోబడనిది అని పేర్కొంది.కీలక ఒప్పందాలు ఇలా.. 1. RELOS ఒప్పందం (Reciprocal Exchange of Logistic Support)- రష్యా పార్లమెంట్ 2025లో ఆమోదించిన కీలక ఒప్పందం.- రెండు దేశాల సైన్యాలు ఒకరి నౌకాదళ, వైమానిక స్థావరాలు, లాజిస్టిక్ సదుపాయాలు ఉపయోగించుకోవచ్చు.2. 2021–2031 సైనిక-సాంకేతిక సహకార కార్యక్రమం- 2021లో 2+2లో సంతకం.- పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ వంటి విభాగాల్లో దీర్ఘకాలిక సహకారం.3. సుఖోయ్–30 MKI ఒప్పందం- 1996లో మొదటి ఒప్పందం.- 50 విమానాల కొనుగోలు, 140 విమానాల HALలో లైసెన్స్ ఉత్పత్తి.4. బ్రహ్మోస్ క్షిపణి సంయుక్త ప్రాజెక్ట్- భారత్-రష్యా సంయుక్త సంస్థ (BrahMos Aerospace).- ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ వ్యవస్థ.5. మిగ్–29 అప్గ్రేడ్, కొనుగోలు ఒప్పందాలు- పలు దశల్లో మిగ్–29 విమానాల కొనుగోలు, అప్గ్రేడ్.6. అణు జలాంతర్గామి (INS Chakra) లీజ్ ఒప్పందాలు- రష్యా నుండి అణు శక్తితో నడిచే జలాంతర్గాముల లీజ్.7. S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒప్పందం- 2018లో సంతకం.- ఐదు రెజిమెంట్ల కొనుగోలు.8. కా-226T హెలికాప్టర్ సంయుక్త ఉత్పత్తి ఒప్పందం- భారత్లో తయారీకి ఒప్పందం (Make in India).9. AK-203 అసాల్ట్ రైఫిల్ ఉత్పత్తి ఒప్పందం- ఉత్తరప్రదేశ్లో సంయుక్త ఉత్పత్తి.10. పది అంతర్ ప్రభుత్వ ఒప్పందాలు, 15 వాణిజ్య ఒప్పందాలు (2025)- పుతిన్ పర్యటనలో సంతకం చేయడానికి సిద్ధం చేసిన ప్యాకేజ్.11. సంయుక్త సైనిక విన్యాసాలు- ఇండ్రా (INDRA)- అవియాడ్రిల్- నౌకాదళ, వైమానిక, భూసేనల సంయుక్త వ్యాయామాలు.12. అంతరిక్ష–రక్షణ సహకారం- గగనయాన్ వ్యోమగాముల శిక్షణలో రష్యా పాత్ర.- అంతరిక్ష–రక్షణ రంగంలో కొత్త ఒప్పందాలు పుతిన్ పర్యటనలో చర్చించబడ్డాయి.రష్యా-ఉక్రెయిన్ అంశం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి భారత్ ఎంతో సంయమనం పాటించింది. రెండు దేశాల శాంతి కోసమే ప్రయత్నాలు చేసింది. ఓవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరుపుతూనే.. రష్యా దూరం కాకుండా ముందుకు సాగింది. రష్యా నుంచి చమురు విషయంలోనూ భారత్ ప్లాన్ ప్రకారం నడుచుకుంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోలా ఉంది. 50 శాతం దిగుమతి సుంకాలతో భారత్ను లొంగదీసుకోవచ్చని ఆయన భావించారు. కానీ అది జరగలేదు. అమెరికాకు అనుకూలమా? వ్యతిరేకమా? ఏదో ఒకటి చెప్పేయండి అంటూ భారత్కు ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. అయినా రష్యాతో స్నేహ బంధాన్ని భారత్ తెంచుకోలేదు. దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ఎక్కువని గతంలో భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. పుతిన్ పర్యటన వేళ కూడా ఇదే దిశగా ఒప్పందాలు, నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ వ్యవహారాల పరిశీలకులు అంచనా వేస్తున్నారు.రష్యాతో వాణిజ్యం.. 2024-25లో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 68.7 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ 4.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేయగా.. రష్యా నుంచి ఏకంగా 64 బిలియన్ డాలర్ల దిగుమతులను చేసుకుంది. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని ఇరుపక్షాలు ప్రకటించాయి. పుతిన్ పర్యటనలో ఇంధనం ప్రముఖంగా ప్రస్తావనకు రానుంది. భారత్కు తక్కువ ధరకే రష్యా ముడి చమురును సరఫరా చేస్తోంది. ఇది రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉన్న వేళ ఇంధన కొనుగోళ్లపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారత అణు పరిశ్రమలో రష్యా సహకారం మరవలేనిది. పుతిన్ పర్యటన వేళ.. పౌర అణు సహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. చిన్న రియాక్టర్లను ఉత్పత్తి చేయడంలో అపార అనుభవనం ఉన్న రష్యా.. వాటిని భారత్కు ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. కుడంకుళంలో అణుశక్తి ప్రాజెక్టు కొనసాగింపుపై చర్చించనున్నట్లు రష్యా అధికారులు తెలిపారు.ట్రంప్ రియాక్షన్? ఒకవేళ రష్యాతో చమురు అనుబంధాన్ని, రక్షణ రంగ సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంటే, అమెరికా సీరియస్గా స్పందించే ఛాన్స్ ఉంది. ట్రంప్ మరోసారి భారత్పై సుంకాలు విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాకు కోపాన్ని తెప్పించే నిర్ణయాలు, ఒప్పందాల దిశగా భారత్ ప్రస్తుతానికి అడుగులు వేయకపోవచ్చని వారు అంటున్నారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, ఆపద కాలంలో ఆదుకునే రష్యాతో చెలిమిని నిలుపుకునే దిశగా లౌక్యంగా భారత్ ముందుకు సాగుతుందని విశ్లేషిస్తున్నారు.డాలర్కు చెక్ పెట్టే ప్లాన్భారత్, రష్యాలు ప్రస్తుతం అమెరికా డాలరుతో పాటు తమ తమ దేశాల కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలు జరుపుతున్నాయి. రానున్న రోజుల్లో పూర్తిగా సొంత కరెన్సీల్లో వాణిజ్యం జరిపేలా వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే అంశంపై పుతిన్, మోదీ చర్చించనున్నారు. అందుకే పుతిన్ వెంట రష్యాకు చెందిన స్పర్ బ్యాంక్ సీఈఓ ఇవాన్ నోసోవ్ కూడా వచ్చారు. వాణిజ్య లావాదేవీల ద్వారా రష్యాకు పెద్దమొత్తంలో భారత రూపాయలు చేరాయి. వాటితో భారత్లోని మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని స్పర్ బ్యాంక్ యోచిస్తోంది. భారత్తో వాణిజ్య లావాదేవీలు జరిపే క్రమంలో రష్యా వ్యాపారులకు రూపాయి విలువ కలిగిన లెటర్ ఆఫ్ క్రెడిట్ను జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ఈ బ్యాంకు ప్రారంభించింది. ఒకవేళ దీనిపై భారత్-రష్యాలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రష్యా, భారత్పై ట్రంప్ మరోసారి కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. -
పాక్తో ఇంకా సంబంధాలెందుకు?
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు పెద్దపీట వేస్తుండగా.. అమెరికా ఎంపీలు మాత్రం మునీర్పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 44 మంది అమెరికా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను ఆ దేశ విదేశాంగ మంత్రికి పంపారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇకపై అమెరికాలోకి రాకుండా.. ఆయనపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. 44 మంది ఎంపీలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియోకు లేఖ రాశారు. ఇప్పుడు ఈ అంశం అమెరికాలో సంచలనంగా మారింది. ఆసిమ్ మునీర్ ఒక నేరగాడని, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్పైనా చర్యలు తీసుకోవాలని అమెరికా ఎంపీలు తమ లేఖలో పేర్కొన్నారు. మునీర్పై తక్షణమే ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ లేఖ రాసిన వారిలో డెమోక్రటిక్ సభ్యులు ప్రమీలా జయపాల్, గ్రేగ్ కస్సార్ వంటివారు ఉన్నారు. పాకిస్థాన్లో ప్రభుత్వాన్ని సైన్యం నడుపుతోందని, ఆ దేశంలో నియంతృత్వం, హింసా పెరిగాయని, జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని పేర్కొంటూ.. వర్జీనియా జర్నలిస్టు నూరానీ కిడ్నాప్ ఉదంతాన్ని ప్రస్తావించారు వర్జీనియా జర్నలిస్టు అహ్మద్ నూరానీ పాకిస్థాన్ సైన్యంలో అవినీతిపై వరుస కథనాలు రాశారు. ఆ తర్వాత నూరానీ, పాకిస్థాన్లో ఉంటున్న అతని ఇద్దరు సోదరులు అపహరణకు గురయ్యారు. నెలరోజులకు పైగా వారిని పాక్ సైన్యం నిర్బంధించింది. ఆ తర్వాత విడుదల చేసింది. వీరితోపాటు.. ప్రముఖ సంగీత దర్శకుడు సల్మాన్ అహ్మద్ బావమరిది కిడ్నాప్ ఉదంతాన్ని కూడా ఎంపీలు తమ లేఖలో ప్రస్తావించారు. అమెరికా జోక్యం తర్వాతే అతను విడుదలైన విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్థాన్లో విపక్ష నాయకులపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. వారిని జైలులో నిర్బంధిస్తున్నారని, సోషల్ మీడియాలో గళమెత్తే సాధారణ పౌరులను హింసిస్తున్నారని, మహిళలు, మైనారిటీలు, బలూచిస్థాన్ పౌరులు హింసకు గురవుతున్నారని పేర్కొన్నారు.ఇంకా ఆ లేఖలో ఏయే అంశాలను ప్రస్తావించారు?2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంపై దర్యాప్తు జరపాలని ఎంపీలు తమ లేఖలో డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పటాన్ రిపోర్టు పూర్తిగా తప్పుడు సాక్ష్యాలు, అబద్ధాలతో నిండి ఉందని వివరించారు. ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చింది కేవలం తోలుబొమ్మ ప్రభుత్వమేనని విమర్శించారు. సైన్యమే డీఫాక్టోగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు కూడా సైనిక న్యాయస్థానాలు సాధారణ పౌరులపై విచారణ జరపవచ్చని తీర్పునివ్వడం సహజ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఒక్క తీర్పును బట్టే పాకిస్థాన్లో పరిపాలన సైన్యం నియంత్రణలోకి వెళ్లిందని స్పష్టమవుతున్నట్లు వివరించారు. ఇదే లేఖలో ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం, అతని మృతిపై వస్తున్న వార్తలను గురించి ప్రస్తావించారు. అమెరికా చట్టాల ప్రకారం 44 మంది ఎంపీలు రాసిన లేఖను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. ఆరోపణలను ఎదుర్కొనేవారి వీసాపై అమెరికా నిషేధం విధించాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన ఆస్తులు అమెరికాలో ఉంటే.. వాటిని జప్తు చేసే అవకాశాలుంటాయి. -
ఆమె ఓ చెత్త.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ధ్వజమెత్తారు. ఈసారి సోమాలియా దేశం, ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పనిలో పనిగా మిన్నెసోటా డెమొక్రటిక్ నేత ఇల్హాన్ ఒమర్ను ఉద్దేశిస్తూ పరుష పదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మంగళవారం కేబినెట్ మీటింగ్ అనంతరం జరిగిన ప్రెస్మీట్లో ట్రంప్ సంచలన వ్యాఖ్యలే చేశారు. ‘‘సోమాలియా వలసదారులు అమెరికాకు పెనుభారంగా మారారు. వాళ్ల సంక్షేమం కోసం ఫెడరల్ ప్రభుత్వం అనవసర ఖర్చులు చేస్తోంది. తిరిగి వాళ్ల నుంచి మన దేశానికి ఒరుగుతోంది ఏం లేదు. అలాంటి వాళ్లను మన దేశంలో ఉంచాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. ఆ దేశం అస్సలు మంచిది కాదు. పైగా కంపు కొడుతుంటుంది. మన దేశంలోకి అలాంటి చెత్తను అనుమతిస్తే.. దేశం తప్పు దారిలో వెళ్తుంది. ఇల్హాన్ ఒమర్ ఓ చెత్త. ఆమె స్నేహితులు కూడా చెత్తనే. వాళ్లు పని చేసే రకం కాదు. అమెరికాకు ఏ రకంగానూ ఉపయోగపడకపోగా.. ఫిర్యాదులతో బద్నాం చేస్తున్నారు. అలాంటి వాళ్లతో ఏం లాభం?.. అని అన్నారాయన. అయితే మిన్నియాపోలిస్ మేయర్ జాకోబ్ ఫ్రే పైఆరోపణలను ఖండించారు. అభివృద్ధిలో సోమాలియ కమ్యూనిటీ కీలకంగానే వ్యవహరిస్తోందని.. సమాజానికి ట్రంప్ తప్పుడు సందేశాన్ని పంపుతున్నారని అన్నారు. మిన్నెసోటా డెమోక్రాటిక్ గవర్నర్ టిమ్ వాల్జ్ సైతం ట్రంప్ కామెంట్లను ఖండించారు. మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇల్హాన్ ఒమర్ స్పందించారు. ట్రంప్ నాపై పెడుతున్న ఫోకస్ దారుణంగా ఉంది. ఆయనకు తక్షణ సాయం అవసరమని భావిస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. వైట్హౌజ్ సమీపంలో తాజాగా జరిగిన ఉగ్రదాడి తర్వాత.. 19 దేశాల నుంచి అన్ని ఇమిగ్రేషన్ దరఖాస్తులను అమెరికా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమాలియాను, ఆ దేశానికి చెందిన ఇన్హాల్ ఒమర్ను ట్రంప్ టార్గెట్ చేశారు. మిన్నెసోటాలో సోమాలి-అమెరికన్ కమ్యూనిటీ ఎక్కువగా జీవిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వలసదారుల్ని తిరిగి పంపించేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ ఆపరేషన్(Minnesota operation) చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మిన్నెసోటాలో నివసించే సోమాలి కమ్యూనిటీలో సుమారు 95 శాతం మంది అమెరికా పౌరులే అని అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్ మిన్నెసోటా శాఖ చెబుతుండడం గమనార్హం. -
వెనిజులాపై ట్రంప్ పంజా
మొన్నటివరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం తెగ తాపత్రయపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యుద్ధవీరుడి అవతారమెత్తారు. మాదకద్రవ్యాల అడ్డాగా మారి అమెరికా వినాశనానికి కంకణం కట్టుకున్నదని ఆరోపిస్తూ దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై కత్తులు నూరుతున్నారు. అక్కడ ‘కార్టెల్ ఆఫ్ సన్స్’ అనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఉన్నదని ప్రకటించి, దాన్ని నిషేధించారు. అదంతా అబద్ధమని వెనిజులా చెబుతోంది. మొన్న ఆగస్టు నుంచి కరీబియన్ దీవులకు 10,000 మంది సైనికులనూ, అతి పెద్ద విమాన వాహక నౌకనూ, క్షిపణులు వగైరా ఆయుధ సామగ్రినీ తరలించిన అమెరికా ఆ మరుసటి నెల 2న వెనిజులా నుంచి పోతున్న పడవలపై దాడి చేసి 11 మందిని హతమార్చింది. ఇవి మాదకద్రవ్యాలు తరలిస్తున్నాయని ఆరోపించింది. ఆ సాకుతోనే 22 దాడుల్లో 83 మంది ప్రాణాలు తీసింది. ఇందులో ఏ ఉదంతానికీ అమెరికా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. ఈమధ్య వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు ట్రంప్ ఫోన్ చేసి అధికారం వదిలిపెట్టి దేశం వదిలి పారిపోవాలని హెచ్చరించారు. వెనిజులా గగనతలాన్ని మూసివేసినట్టు ప్రకటించారు. తాజాగా బయటపడిన వీడియో ట్రంప్ ప్రభుత్వ హంతక మనస్తత్వాన్ని తెలియ జేస్తోంది. దాడిలో పడవలోని 9 మంది ప్రయాణికులు చనిపోగా, ఇద్దరు బతికి బయట పడ్డారు. వెనువెంటనే మళ్లీ దాడిచేసి ఆ ఇద్దర్నీ కూడా చంపేశారు. మొదట్లో ఆ దాడి గురించి అతిశయోక్తులు చెప్పిన ట్రంప్, వీడియో బయటపడగానే స్వరం మార్చారు. పడవలోని వారందరినీ చంపేయమని రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించటం వల్లే ఇలా చేశామని సైనికాధికారులు చెబుతుండగా, అలా చెప్పలేదని హెగ్సెత్ అంటున్నారు. అది తప్పేనన్నట్టు ట్రంప్ సంజాయిషీ ఇస్తున్నారు. ఈ ఉదంతంపై రిపబ్లికన్లలోనే విభేదాలు బయల్దేరాయి. ప్రతినిధుల సభ అనుమతి లేకుండా దండయాత్రకు అసలు ఎలా దిగుతారంటూ డెమోక్రాట్లు, రిపబ్లికన్లు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు మొదలుకాబోతోంది.సంక్షోభాన్ని సృష్టించటం, ఒక సార్వభౌమాధికార దేశం ప్రమాదకరంగా పరిణమించిందని ఆరోపించటం, ఆ సాకుతో దురాక్రమణకు ప్రయత్నించటం అమెరికాకు అలవాటు. వేరే దేశం గగనతలాన్ని మూసేసినట్టు చెప్పటం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం. సమస్యలుంటే, సాక్ష్యాధారాలుంటే దౌత్యపరంగా పరిష్కరించు కోవటానికి ప్రయత్నించాలి. నిజానికి వెనిజులాపై అమెరికా కడుపుమంట ఈనాటిది కాదు. అక్కడి భూగర్భంలో చమురు, సహజవాయు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం వగైరాలున్నాయి. బహుళజాతి సంస్థల ద్వారా వాటిని కైంకర్యం చేస్తూ వచ్చిన అమెరి కాకు 1999లో తొలిసారి హ్యూగో చావెజ్ రూపంలో ఆటంకం ఎదురైంది. ఆయన అధికారంలోకొచ్చిన వెంటనే దాన్నంతటినీ ఆపేశారు. అప్పటినుంచి ఏదో వంకన వెనిజులాను హస్తగతం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. చావెజ్ అనారోగ్యంతో మరణించాక 2013లో అధికారంలోకొచ్చిన మదురోను ఇబ్బందిపెట్టని రోజంటూ లేదు. క్రితంసారి ఏలుబడిలో ట్రంప్, వెనిజులా నుంచి పారిపోయివచ్చిన జువాన్ గైదోను దేశాధ్యక్షుడిగా ప్రకటించి భంగపడ్డారు. అక్కడ జరిగిన ఎన్నికలు అప్రజాస్వామికమంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ గైదో ఏమయ్యాడో తెలియదు. ఈసారి మాదక ద్రవ్యాల సాకుతో కత్తిగట్టారు. ట్రంప్కు మాదకద్రవ్యాలు అరికట్టే ఉద్దేశం ఉందా? ఉంటే కొకైన్ తరలింపు కేసులో నిరుడు అమెరికా కోర్టు 45 ఏళ్ల శిక్ష విధించిన హోండురస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండోకు క్షమాభిక్ష పెడతామని గతవారం ట్రంప్ ఎలా చెప్పగలిగారు? వెనిజులాపై సైనిక చర్యకు 70 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకమని సీబీఎస్ సర్వే వెల్లడించింది. సైనిక జోక్యం పేరిట ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ గుల్లయిందని, వాటి జోలికి పోవద్దని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారు. నిజానికి అలాంటి హామీతోనే ట్రంప్ అధికారంలోకొచ్చారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదల చేస్తానంటూనే మరో యుద్ధానికి అంకురార్పణ చేస్తున్న ట్రంప్ పోకడ ప్రమాదకరం. అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచానికే ఇది పెను ముప్పు. దీన్ని తక్షణం కట్టిపెట్టాలి. -
ట్రంప్ ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేయడం సాధారణంగా మారిపోయింది. ఆయన మునుపటిలా లేరని.. ఎనర్జీ లెవల్ దారుణంగా పడిపోయిందని.. బహుశా వయోభారమే అందుకు కారణమై ఉండొచ్చని తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇది సాధారణంగానే ఆయనకు కోపం తెప్పించింది.ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలను వైట్హౌజ్ కొట్టిపారేసింది. తాజాగా ఆయన తీయించుకున్న ఎమ్మారై స్కాన్తో ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మీడియా ముందుకు వచ్చారు. సాధారణంగా ఆయన వయసు ఉన్నవాళ్లకు ఇమేజింగ్ పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అలా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి ఆందోళనకరమైన అంశాలు కనిపించలేవు. ఆయన గుండె సాధారణంగానే ఉంది. రక్తనాళాల్లో ఎలాంటి బ్లాకులు లేవు. రక్తప్రవాహానికి ఆటంకం.. గుండె, ప్రధాన రక్తనాళాల్లో ఎలాంటి అసాధారణతలు కనిపించలేదు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు’’ అని మీడియా కథనాలను ఖండించారామె. మరోవైపు న్యూయార్క్ టైమ్స్ కథనం మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.🇺🇸 WHITE HOUSE: TRUMP’S MRI SHOWS “EXCELLENT OVERALL HEALTH”The White House released Trump’s MRI today, confirming everything came back normal. His physician, Capt. Sean Barbarella of the U.S. Navy, said the MRI showed no heart or abdominal issues, with “all major organs… pic.twitter.com/FWHpfHMSoQ— Mario Nawfal (@MarioNawfal) December 2, 2025‘‘ఇప్పటిదాకా నా జీవితంలో ఏనాడూ ఇంతలా కష్టపడలేదు. అంతగా పని చేస్తూ.. పర్ఫెక్ట్గా ఫలితాలు రాబట్టగలుగుతున్నా. శారీరకంగా, మానసికంగా నేను ఫిట్గా ఉన్నా. నా స్టామినా విషయంలో సందేహమే అక్కర్లేదు’’ అని మొన్నీమధ్యే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ను తిట్టిపోసిన ఆయన.. ఆ కథనం వెనుక రాజకీయాల ప్రభావం ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే.. ఎప్పటిలాగే దానిని అమెరికన్ల శత్రువుగా అభివర్ణించారు. అలాగే ఆ కథనం రాసిన కేటీ రోగర్స్కు నానాశాపనార్థాలు పెట్టారు.28 ఏళ్ల కరోలైన్ లెవిట్ అమెరికా చరిత్రలో అత్యంత యువ ప్రెస్ సెక్రటరీ ఘనత దక్కించుకుంది. 2022లో న్యూ హాంప్షైర్ 1వ కాంగ్రెస్ జిల్లా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక ఆమెకు వైట్హౌజ్లో బాధ్యతలు అప్పగించారు. అందగత్తె మాత్రమే కాదు.. తెలివైంది కూడా అంటూ ఆయన తరచూ ఆమెపై ప్రశంసలు గుప్పిస్తుంటారు. ఈ ఏడాదిలోనే ఆమె వివాహం జరిగింది కూడా. -
గగనతలం మూసివేత.. అసలు ఆ హక్కు ఎవరిది?
వెనిజులా అమెరికా మధ్య ఉద్రిక్తతల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో ఫోన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడాడని.. అది హాట్హాట్గా సాగిందని.. పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఈ తరుణంలో.. గగనతలం మూసివేత అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.. వెనిజులా గగనతలం మూసివేయమని ట్రంప్ ప్రకటించారు. అయితే దీనిని వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది చెల్లదని.. ట్రంప్ ప్రకటన తమ దేశ సార్వభౌమాధికారంపై దాడేనని అభివర్ణించింది. అసలు గగనతలంపై నిషేధం విధించే అధికారం ఎవరికి ఉంటుంది?.. ఎవరు ఎవరిపై విధిస్తారు? దానికంటూ ఏమైనా ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయా? .. ఈ నిర్ణయంతో కలిగే నష్టాలేంటి?.. పరిశీలిస్తే.. గగనతలం మూసివేత అంటే.. ఒక దేశం తన భూభాగం పై ఉన్న ఆకాశాన్ని (airspace) ఇతర దేశాల విమానాలకు పూర్తిగా లేదంటే కొంతవరకు నిషేధించడం. అది పరిస్థితులను బట్టి ఆ దేశం తీసుకుంటుంది. ఒక దేశం భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితులు, రాజకీయ నిరసనల కారణంగా గగనతలాన్ని మూసేసుకోవచ్చు. అప్పుడు ఆ దేశం మీదుగా ఇతర దేశాలకు సంబంధించిన విమానాలేవీ ప్రయాణించకూడదు. కానీ, ట్రంప్ అందుకు భిన్నంగా ఇతర దేశాన్ని(వెనిజులా) ఎయిర్స్పేస్ని మూసేయాలని ఆదేశించారు. ఒక దేశం మరొక దేశం గగనతలాన్ని మూసివేయమని చెప్పే హక్కు లేదు. దీంతో ఇది చెల్లదని.. కేవలం రాజకీయ ఉద్రిక్తతల్లో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ఎందుకు ప్రకటించారుట్రంప్ గగనతలం మూసివేతకు చూపిస్తున్న కారణాలు అనేకం ఉన్నాయి. వెనిజులా గగనతలం ద్వారా నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారాయన. డ్రగ్ ట్రాఫికింగ్తో పాటు మానవ అక్రమ రవాణా అరికట్టడం కోసమేనని చెబుతున్నారు. వెనిజులా గగనతలాన్ని పూర్తిగా మూసివేయాలని ఎయిరలైన్స్, పైలట్స్, డ్రగ్ డీలర్స్, హ్యూమన్ ట్రాఫికర్స్కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా కరేబియన్ ప్రాంతంలో భారీ సైనిక దళాలను (ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సహా) మోహరింపజేశారు.రూల్స్ ఇవిగో.. ప్రతి దేశానికి తన ఆకాశంపై సార్వభౌమాధికార హక్కు ఉంటుంది. చికాగో కన్వెన్షన్ (1944) అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ఆధారంగా రూపొందిన ఒప్పందం ఈ విషయంలో ప్రస్తుతానికి అమల్లో ఉంటోంది. ఇందులో భాగంగా.. ఆర్టికల్ 1: ప్రతి దేశానికి తన భూభాగం పై గగనతలంపై పూర్తి సార్వభౌమాధికార హక్కు ఉంటుంది.ఆర్టికల్ 9: ఒక దేశం భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయవచ్చు.ఆర్టికల్ 89: యుద్ధం లేదా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో, దేశాలు ICAO నిబంధనలను పక్కన పెట్టి తమ గగనతలాన్ని నియంత్రించవచ్చు.గతంలో.. తమ జాతీయ భద్రతా కారణాల వల్ల గగనతలాన్ని మూసివేయడం సమర్థిస్తాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో తరచూ ఇది చూసిందే. అలాగే.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యూరప్ దేశాలు రష్యా విమానాలకు గగనతలాన్ని మూసివేశాయి. మొన్నీమద్యే ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాక్ నడుమ కూడా ఎయిరోస్పేస్ మూసివేత కనిపించింది. అయితే.. గగనతలం మూసివేతను తాత్కాలిక, అవసరమైన చర్యగా మాత్రమే ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు సమర్థిస్తాయి. విమర్శకులు మాత్రం దీన్ని రాజకీయ ఒత్తిడి సాధనంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని అంటుంటారు.ప్రభావం.. తమ గగన తలం నుంచి విమానాలు ప్రయాణించకూడదని ఒక దేశం ఆంక్షలు విధించడం లాంటిదే ఈ నిర్ణయం. దీంతో అంతర్జాతీయ విమానాలు ఆ దేశం మీదుగా ప్రయాణించడానికి వీలుండదు. అవి మార్గం మార్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణాలకు సమయం.. ఇంధన ఖర్చు పెరుగుతాయి. ఫ్లైట్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతాయి. అంతర్జాతీయ కనెక్టివిటీలో అంతరాయంతో ప్రయాణికులు ఇబ్బంది పడొచ్చు. అలాగే.. ఆర్థిక నష్టాలకూ అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల వాణిజ్యం, పర్యాటకం దెబ్బతింటాయి.ఎయిర్లైన్స్ ఆదాయం తగ్గుతుంది. కొన్నిసార్లు ఇది యుద్ధ ముప్పుగా కూడా మారొచ్చు. గగనతలం మూసివేత అనేది ఒక దేశం తన సార్వభౌమాధికారాన్ని వినియోగించే చర్య. ఇందుకు చికాగో కన్వెన్షన్ రూల్స్ ఉన్నాయి. కానీ అమెరికా–వెనిజులా ఉద్రిక్తతల్లో ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. అధికారిక ICAO రూల్స్ ప్రకారం చెల్లుబాటు కాదు. దీని వల్ల విమానయాన రంగం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితం అన్నీ ప్రభావితం అవుతాయనే అందోళన వ్యక్తమవుతోంది. -
అన్నంత పని చేయబోతున్న ట్రంప్?!
ఇల్హాన్ ఒమర్ను అమెరికా నుంచి వెళ్లగొడతారా? ఆమెను పంపించేయాల్సిందేనని అక్కడి ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?. ట్రంప్ చెబుతున్నట్లు ఆమె నిజంగానే ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్కు పాల్పడ్డారా? భారత్పై వ్యతిరేక వ్యాఖ్యలు ఆమె ఎందుకు చేయాల్సి వచ్చింది?.. అసలు ఇంతకీ ఇల్హాన్ ఒమర్ నేపథ్యం ఏంటి?.. అమెరికా చట్ట సభ్యురాలు, మిన్నెసోటా రాష్ట్రానికి చెందిన డెమోక్రాటిక్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్. తాజాగా ఆమె వివాహం,ఇమ్మిగ్రేషన్ విషయంలో మోసానికి పాలపడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా పౌరసత్వం కోసం సొంత సోదరుడినే వివాహం చేసుకున్నారని ప్రధాన ఆరోపణ. దీంతో పాటు ఆమె చేస్తున్న యాంటీ అమెరికా కామెంట్లకు అక్కడి ప్రజలు రగిలిపోతున్నారు. డీనేచురలైజ్ చేసి (పౌరసత్వం రద్దు చేసి) దేశం నుంచి వెల్లగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ట్రంప్ అలా అనేసరికి.. 2009లో ఒమర్ అహ్మద్ నూర్ సయీద్ ఎల్మీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె అక్రమంగా అమెరికాకు వలస వచ్చారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తిని ఆమె వివాహమాడారని.. కేవలం అమెరికాలో స్థిరపడేందుకు ఆమె మోసం చేశారని ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆమెను అమెరికా నుంచి బయటకు పంపించేస్తామని వ్యాఖ్యానించారు. వలసల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్న ట్రంప్ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో సాధారణంగానే చర్చ పెద్దదైంది. ఈ ఆరోపణలను ఒమర్ ఖండించారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇస్లామోఫోబిక్, రాజకీయ ప్రేరేపితమైనవిగా అభివర్ణించారామె. రాజకీయంగా తనను బలహీనపర్చేందుకు జరుగుతున్న దాడి అని అన్నారామె. అయితే.. గతంలోనూ..ఇల్హాన్ ఒమర్పై ఈ ఆరోపణలు కొత్తవేం కావు. 2016లో సోమాలి-అమెరికన్ ఫోరమ్ ఒకటి ఈ అభియోగాన్ని తెరపైకి తెచ్చింది. 2018 కాంగ్రెస్ ఎన్నికల సమయంలోనూ ఈ అంశంపై పెద్ద చర్చ నడిచింది. తీవ్ర అభియోగాల నేపథ్యంతో కొన్ని మీడియా సంస్థలు ఇన్వెస్టిగేషన జర్నలిజంతో వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయతనం చేశాయి. 2019-20 మధ్య ఎఫ్బీఐ, హౌజ ఎథిక్స్ కమిటీ ఈ అభియోగాన్ని పరిశీలించి ఏం తేలకపోవడంతో కేసులు మూసివేశాయి కూడా. అయినా కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఈ ఆరోపణలను మళ్లీ ప్రస్తావించారు. దీంతో అమెరికా రాజకీయాల్లో ఇమ్మిగ్రేషన్ & పౌరసత్వంపై పెద్ద చర్చకు దారితీస్తోంది. వెళ్లగొట్టాల్సిందే..! ట్రంప్ వ్యాఖ్యల తర్వాత ఆమెను అమెరికా నుంచి పంపించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అమెరికా ఫస్ట్ నినాదంతో ఉద్యమిస్తున్న మాగా కార్యకర్తలు, కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కోరుతున్నారు. ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నారు. ఆమె మ్యారేజ్ సర్టిఫికెట్ను ఎక్స్ ఖాతాలో వైరల్ చేస్తూ.. సాగనంపాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు.ఇల్హాన్ ఒమర్(43).. పుట్టింది సోమాలియాలో. ఆ దేశ అంతర్యుద్ధంతో 8 ఏళ్ల వయసులో కెన్యాకు చేరుకుని నాలుగేళ్లపాటు శరణార్థ శిబిరాల్లో గడిపింది. అక్కడి నుంచి అమెరికాకు చేరుకున్న ఆమె.. 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందింది. 2018 నుంచి ఇప్పటిదాకా నాలుగుసార్లు ఆమె చట్టసభకు ఎన్నికయ్యారు. అది సాధ్యమేనా?అమెరికా చట్టం ప్రకారం, నేచురలైజ్డ్ సిటిజన్ (పౌరసత్వం పొందిన వ్యక్తి)ను డీనేచురలైజ్ చేయవచ్చు, కానీ అది స్పష్టమైన, బలమైన ఆధారాలతో మాత్రమే సాధ్యం. డీనేచురలైజేషన్ జరిగితే, ఆ వ్యక్తి పర్మనెంట్ రెసిడెంట్ లేదంటే అక్రమ వలసదారుగా మారతారు. తర్వాతే డిపోర్టేషన్ జరుగుతుంది. ఈ మధ్యలో కోర్టు జోక్యాలతో ఏదైనా జరగొచ్చు. అయితే.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా ఇలాంటి చర్యలు ప్రధానంగా యుద్ధ నేరస్తులు, ఉగ్రవాదులపై మాత్రమే జరిగాయి. ఒమర్పై వినిపిస్తున్న ఈ ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు(ఫోరెన్సిక్ సహా) లేకపోవడం వల్ల చట్టపరంగా చర్యలు తీసుకోవడం కష్టమే. భారత్కు ఎందుకు అంత కోపంవివాదాలు ఆమెకు కొత్తేం కాదు. ఆమె బహిరంగంగా చేసిన పలు ప్రకటనలు తీవ్ర దుమారం రేపాయి. సోమాలియా నా సొంతం దేశం అంటూ అమెరికాను ఆమె కించపరిచేలా వ్యవహరించారనే విమర్శ ఒకటి బలంగా వినిపిస్తుంటుంది. అంతేకాదు.. గాజా సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్, అమెరికాను ఉగ్ర గ్రూపులతో పోల్చారామె. అలాగే.. ఇల్హాన్ ఒమర్ గతంలో భారత వ్యతిరేక వైఖరితో వార్తల్లో నిలిచారు. 2022లో ఆమె పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)ను సందర్శించి, స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆమె భారతదేశంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ ఈ పర్యటనను తీవ్రంగా ఖండించింది. -
Andhra Pradesh: ట్రంప్ దెబ్బకు కుయ్యో రొయ్యో..!
ట్రంప్ దెబ్బకి.. రొయ్య గడ్డ కడుతోంది. కోల్డ్ స్టోరేజ్లోనే కాలం సాగిస్తోంది. సముద్ర ఉత్పత్తులు కంటైనర్ ఎక్కించేందుకు వ్యాపారులూ గజగజమంటున్నారు. అగ్రరాజ్యం విధించిన సుంకాల ప్రభావం భారత్పై కనిపించబోదని కేంద్రం.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించామంటూ రాష్ట్ర ప్రభుత్వం బీరాలు పలుకుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం తిరోగమనం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా పన్ను టారిఫ్ల దెబ్బకు విశాఖలోని కంటైనర్ కార్గో ఎగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత ఆరు నెలలుగా దాదాపు 20 నుంచి 30 శాతం వరకూ ఎగుమతులు క్షీణించాయి. పన్ను టారిఫ్ల వ్యవహారం ఓ కొలిక్కి రాకుండా ఈ వ్యత్యాసం భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి, విశాఖపట్నం: మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రగామిగా ఉండే విశాఖపట్నం.. ఇప్పుడు అమెరికా విధించిన సుంకాల దెబ్బ నుంచి కోలుకోలేకపోతోంది. అమెరికా పన్నుల ప్రభావం భారత్పై ఏ మాత్రం ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవ పరిస్థితుల్లో ప్రతికూల ప్రభా వం ఉంటోంది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇందులో 75 శాతం అంతర్గత మత్స్య, ఆక్వా కల్చర్ సంపద కాగా 25 శాతం వరకూ సముద్ర రంగం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో 66 శాతం వాటా రొయ్యలదే కావడం విశేషం. దేశంలో ముఖ్యంగా విశాఖ నుంచి ఎగుమతయ్యే రొయ్యలకు విదేశాల్లో భారీగా గిరాకీ ఉంది. దాని తర్వాత స్థానంలో ట్యూనా చేపల ఎగుమతులున్నాయి. విశాఖ సముద్ర జలాల్లో దొరికే ట్యూనా చేపలు దాదాపు అన్ని దేశాలకు ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. అమెరికా ఈ ఏడాది మొదట్లో మన ఎగుమతులపై 25 శాతం సుంకాలు విధించడం వల్ల రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విశాఖ నుంచి ఎగుమతయ్యే సముద్ర ఉత్పత్తుల్లో 52 శాతం వరకూ మార్కెట్ అమెరికాలోనే జరుగుతోంది. ట్రంప్ సుంకాల పెంపు ఇక్కడ ఎగుమతిదారులకు ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ గణనీయంగా పడిపోయాయి. కోల్డ్ స్టోరేజ్లోనే రొయ్యలు.! రాష్ట్రంలోని దాదాపు 45 రొయ్యల ఉత్పత్తుల ఎగుమతి సంస్థలుండగా.. విశాఖ జిల్లాలో 10కిపైగా ఉన్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో రకం ప్యాకేజీ విధానాన్ని అమలు చేస్తుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పంపించేందుకు దాదాపు లక్ష టన్నుల వరకూ ప్యాకేజీలు చేసి కోల్డ్ స్టోరేజ్లోనే మూలుగుతున్నాయి. వీటి ప్యాకింగ్ మార్చి.. ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు తలప్రాణం తోకకొస్తోందని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అమెరికా సుంకాల ప్రభావం మత్స్యరంగంపై ప్రతికూల ప్రభావం చూపించకుండా కొత్త మార్కెట్ల విస్తరణపై దృష్టిసారించామని కేంద్రం చెబుతున్నా.. ఆ పరిస్థితులు ఎక్కడా క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదని వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మార్కెట్లో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఆరు నెలలుగా అథఃపాతాళానికి.. విశాఖ నుంచి ఆరు నెలలుగా సముద్ర ఎగుమతులు దిగజారుతూ వస్తున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపెడా) నివేదికల ప్రకారం సీఫుడ్ ఎక్స్పోర్ట్స్లో దేశంలోనే విశాఖపట్నం ఏకంగా 26.36 శాతం వాటాని కలిగి ఉంది. విశాఖ నుంచి ఎక్కువగా అమెరికా, చైనా, యూఏఈ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, వియత్నాం, జపాన్, కెనడా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. విశాఖపట్నం కంటైనర్ టెరి్మనల్ ప్రైవేట్ లిమిటెడ్(వీసీటీపీఎల్) ఆధ్వర్యంలో కంటైనర్ కార్గో ఎగుమతులు జరుగుతుంటాయి. విశాఖపట్నం పోర్టులో 32 బెర్త్లు ఉండగా.. గంగవరం పోర్టులో 9 బెర్తులున్నాయి. ఇందులో మొత్తం 23 బెర్త్ల ద్వారా కార్గో కంటైనర్ ఎగుమతులు జరుగుతున్నాయి. ఏటా ఇక్కడి నుంచి సుమారు రూ.17 వేల కోట్ల విలువైన 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. ప్రతి నెలా ఇక్కడి నుంచి 4000 రిఫ్రొజినేటెడ్ కంటైనర్స్(సీఫుడ్) ఎగుమతులు జరుగుతుంటాయి. ఒక్కో కంటైనర్ ద్వారా 30 టన్నుల సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయి. అంటే నెలకు లక్షా 20 వేల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతుండేవి. అమెరికా సుంకాల ప్రభావంతో దాదాపు 30 శాతం వరకూ ఈ ఎగుమతులు క్షీణించాయి. జూన్ నెల నుంచి నవంబర్ వరకూ చూ స్తే.. ప్రతి నెలా 2000 నుంచి 3000 కంటైనర్లకు మించడం లేదని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల బుకింగ్స్ కూడా 20 నుంచి 30 శాతం కంటే దిగువకే ఉన్నాయని పోర్టు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా గడిచిన 6 నెలల్లో వేల కోట్ల టర్నోవర్కు బ్రేక్ పడిందని పోర్టు వర్గాలు చెబుతున్నాయి. -
వలసలపై ట్రంప్ కన్నెర్ర
న్యూయార్క్/వాషింగ్టన్: అగ్రరాజ్యాధినేత అధికారిక నివాసం సమీపంలో గురువారం భద్రతాబలగాలపై అఫ్గాన్ దేశీయుడు జరిపిన కాల్పుల ఘటనపై డొనాల్డ్ ట్రంప్ కన్నెర్రజేశారు. పేద, అంతగా అభివృద్ధి సాధించని దేశాల ప్రజలను వలసదారులుగా అంగీకరించే సంస్కృతికి చరమగీతం పాడుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. శరణార్థులుగా వచ్చి అమెరికా ప్రభుత్వం మీదనే కత్తిదూస్తున్న ఇలాంటి వ్యక్తులకు ఇక ఏమాత్రం ఆశ్రయం కల్పించబోమని ట్రంప్ తెగేసి చెప్పారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని మెట్రోస్టేషన్ సమీపంలో అఫ్గాన్ దేశస్తుడు రహ్మనుల్లా లఖన్వాలా గురువారం జరిపిన కాల్పుల్లో గాయపడిన వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డు మహిళా జవాను సారా బెక్స్ట్రోమ్(20) తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలిశాక ట్రంప్ అనూహ్యంగా ‘థర్డ్ వరల్డ్’ దేశాలపై వలస నిషేధ కొరడా ఝులిపించారు. ఈ మేరకు శుక్రవారం ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్సోషల్లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘సాంకేతికంగా అమెరికా ఎంతో పురోగమిస్తున్నా కాలంచెల్లిన వలసవిధానాల కారణంగా వాటి ప్రయోజనాలను అమెరికన్లు పొందలేపోతున్నారు. జీవనప్రమాణాలు మెరుగపడట్లేవు. ఈ సమస్య సమసిపోయేలా మూడో ప్రపంచదేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపేస్తా. దీంతో బైడెన్ స్వదస్తూరీతో సంతకాలు చేయకున్నా ఆటోపెన్ విధానంతో సమ్మతి సాధించిన లక్షలాది అక్రమ వలసల పరంపరకు అడ్డుకట్టపడుతుంది. అమెరికా ఆస్తిగా పరిగణించబడని, అమెరికాను ప్రేమించని వాళ్లందరికీ ఫెడరల్ ప్రభుత్వ ప్రయోజనాలు, సబ్సిడీలను రద్దుచేస్తా. వలసదారులుగా వచ్చి పౌరసత్వం పొందాక దేశ ప్రశాంతతకు భంగం కల్గించే వాళ్ల శాశ్వతనివాస హోదాను రద్దుచేస్తా. అనధికార అక్రమ ఆటోపెన్ విధానంలో అనుమతి సాధించిన చట్టవ్యతిరేక జనాభాను భారీగా తగ్గిస్తా. తిరోగమన వలస విధానం మాత్రమే అమెరికా పురోగతికి బాటలు వేయగలదు. ఇకపై అమెరికా వ్యతిరేకులు ఇక్కడ ఉండబోరు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి వర్గీకరణ ప్రకారం ప్రపంచంలోని 44 దేశాలను తక్కువ అభివృద్ధి సాధించిన దేశాలుగా లెక్కిస్తున్నారు. ఈ దేశాల నుంచి వలసలను ట్రంప్ అడ్డుకునే వీలుందనే అంచనాలున్నాయి.వాళ్ల గ్రీన్కార్డ్లను పునఃసమీక్షిస్తాంబైడెన్ హయాంలో అఫ్గాన్ నుంచి వలసదారునిగా వచ్చి ప్రత్యేక కారుణ్య పథకంలో భాగంగా అమెరికాలో నివాసఅనుమతి సాధించిన రహ్మనుల్లా కాల్పులకు తెగబడడంతో ట్రంప్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గతంలో వలసదారులుగా వచ్చిన విదేశీయులకు జారీచేసిన గ్రీన్కార్డ్లను పునఃసమీక్షిస్తామని శుక్రవారం అమెరికా సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సేవలు(యూఎస్సీఐఎస్) డైరెక్టర్ జోసెఫ్ ఎలో చెప్పారు. ‘‘ మాదేశం, అమెరికన్ల పరిరక్షణే మాకు పరమోన్నతం. గత పాలకుల తప్పిదాలను ఉపేక్షించే పరిస్థితి లేదు. అఫ్గాన్ దేశస్తుల వలస, శరణార్థి అభ్యర్థనల దరఖాస్తులను నవంబర్ 27వ తేదీ నుంచి పక్కనపడేస్తున్నాం. అత్యంత ప్రమాదకర దేశాలైన అఫ్గానిస్తాన్, మయన్మార్, బురుండీ, చాద్, కాంగో రిపబ్లిక్, క్యూబా, ఈక్వెటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లావోస్, లిబియా, సియెర్రా లియోన్, సోమాలియా, సూడాన్, టోగో, తుర్కెమెనిస్తాన్, వెనిజులా, యెమెన్ల నుంచి వచ్చే శరణార్థి అభ్యర్థనల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటాం’’ అని ఆయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మరోసారి నూతన మార్గదర్శకాలను విడుదలచేశారు.మొదటి ప్రపంచదేశాలంటే?ట్రంప్ ప్రకటనతో మొదటి, రెండో, మూడో ప్రపంచదేశాలు ఏమిటి? అనే చర్చ మొదలైంది. ప్రజాస్వామ్యయుత పాలనతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, అమెరికాతో జట్టుకట్టిన దేశాలను మొదటి ప్రపంచదేశాలు అంటారు. వీటిల్లో ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలతో దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, స్వీడన్, ఐర్లాండ్, ఫిన్లాండ్ ఉన్నాయి.రెండో ప్రపంచదేశాలంటే?కమ్యూనిస్ట్–సామ్యవాద దేశాలను రెండో ప్రపంచదేశాలుగా భావిస్తారు. ఆనాటి సోవియట్ రిపబ్లిక్ దేశాలతోపాటు పోలండ్, తూర్పు జర్మనీ, చెకస్లోవేకియా, బాల్కన్స్, చైనా, మంగోలియా, ఉత్తరకొరియా, వియత్నాం, లావోస్, కాంబోడియాలను రెండో ప్రపంచ దేశాలుగా పరిగణిస్తారు.మూడో ప్రపంచ దేశాలేంటి?ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికాకు మద్దతు పలికిన పశ్చిమ దేశాలను మొదటి ప్రపంచదేశాలుగా భావించగా, కమ్యూనిస్ట్ భావజాలంతో నిండిన తూర్పు దేశాలను రెండో ప్రపంచ దేశాలు అన్నారు. ఈ కూటములకు మద్దతు పలకకుండా, తటస్థంగా ఉండిపోయిన వాటిని మూడో ప్రపంచదేశాలుగా భావించారు. ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలు ఈ వర్గంలో ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా పేద, అంతగా అభివృద్ధి చెందని దేశాలను థర్డ్వరల్డ్ కంట్రీస్గా లెక్కిస్తున్నారు. ఫ్రాన్స్కు చెందిన జనాభా నిపుణుడు ఆల్ఫ్రెడ్ సావీ 1952లో తొలిసారిగా ‘మూడు ప్రపంచాలు, ఒక్కటే భూమి’ పుస్తకంలో ఈ భావనను ప్రతిపాదించారు. భారత్ ఏ జాబితాలో ఉంది?సోవియట్ రష్యా పతనం తర్వాత మూడో ప్రపంచదేశాలు అనే భావన మనుగడలో లేదు. తక్కువ అభివృద్ధి సాధించిన దేశాలనే మూడో ప్రపంచదేశాల గాడిన కడుతున్నారు. ఐక్యరాజ్యసమితి జాబితా ప్రకారం ఇందులో 44 దేశాలున్నాయి. ఆఫ్రికా ఖండంలో 32, ఆసియాలోని 8 దేశాలతోపాటు కరేబియన్ దేశం హైతీ, పసిఫిక్ ద్వీపదేశాలు మూడు మొత్తంగా 44 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. గత భావనల ప్రకారం స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత్ పేద దేశమే. కానీ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతూ పెద్ద ఆర్థికశక్తిగా మారింది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. ఈ లెక్కన ట్రంప్ చెప్పిన మూడో ప్రపంచ దేశాల జాబితాలో భారత్ లేదనే చెప్పాలి. -
పుతిన్-మోదీ దోస్తీ.. టెన్షన్లో ట్రంప్!
ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో రష్యాపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ చమురు విషయంలో భారత్పై సుంకాల యుద్ధమే చేశారు. రెండు దఫాలుగా 50 శాతం అన్యాయంగా పన్నులు విధించారు. అయితే ఏకపక్ష నిర్ణయాలకు తాము తలొగ్గబోమని.. జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని భారత్ కుండబద్ధలు కొట్టింది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన పలు ప్రకటనలనూ (పాక్-భారత్ ఉద్రిక్తతలను ఆపానంటూ చేసినవి కూడా) ఖండించింది కూడా. ఈలోపు.. షాంగై సదస్సులో పుతిన్-మోదీ ఒకే కారులో ప్రయాణించడం, ప్రత్యేకంగా భేటీ కావడంలాంటివి ట్రంప్కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆ రెండు దేశాలవి డెడ్ ఎకానమీలని.. అవి ఎలా పోయినా తనకు సంబంధం లేదంటూ ఆ సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆయన స్వరం మారింది. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించబోతోందని.. ప్రధాని మోదీ మాట మీద తనకు నమ్మకం ఉందని.. భారత్తో అమెరికా అనుబంధం కొనసాగుతుందంటూ స్వరం మార్చారు. అఫ్కోర్స్ భారత్ వాటిని ఖండించింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత్కు రానున్నారు. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాస్తవంగా ఈ ఇద్దరు శక్తివంతమైన నేతల భేటీపై గత ఆరు నెలలుగా ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వీళ్ల కలయిక అంటే ఏమాత్రం మిండుగు పడని ట్రంప్ ఎలా స్పందిస్తారో ? అనేదే అందుకు ప్రధాన కారణం. వాస్తవానికి రష్యా చమురును భారత్కు దూరం చేయాలని ట్రంప్ చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే ఆ పాచికలేవీ పారలేదు. సరికదా ట్రంప్ నుంచి రష్యా చమురు సరఫరాదారులైన ఆంక్షల ప్రకటన వెలువడగానే భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ మాస్కోకు వెళ్లి పుతిన్తో సమావేశం అయ్యారు. అటుపై పుతిన్ సన్నిహితుడైన నికోలాయ్ పెత్రుషెవ్తో ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడేమో డిసెంబరు 4, 5 తేదీల్లో పుతిన్ భారత్లో పర్యటిస్తారనే ప్రకటన వెలువడింది. పుతిన్ ఢిల్లీలో జరగబోయే 23వ రష్యా-భారత్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొంటారు. అయితే భారత్తో భారీ ఎత్తున ఒప్పందాల ఎజెండాతోనే రష్యా అధ్యక్షుడు భారత్కు వస్తున్నారా?.. ఉక్రెయిన్ సంక్షోభం ముగించేందుకు మోదీ మధ్యవర్తిత్వాన్ని పుతిన్ కోరనున్నారా? రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ మాటల్ని పట్టించుకోకూడదని చెబుతారా? అసలు ఇవేవీ కావు.. సైనికపరమైన సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నారా?.. పుతిన్ భారత్కు ఎందుకొస్తున్నారనే ప్రశ్నలపై చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతో పాక్ క్షిపణులను తుక్కు చేసి ప్రపంచానికి సత్తా చాటిన భారత్ ఇప్పుడు రష్యా ఆయుధ సంపత్తిపై ఆసక్తి ప్రదర్శిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా మేక్ ఇన్ ఇండియానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితుల్లో అది కష్టతరమేనన్న అభిప్రాయమూ రక్షణ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే అమెరికా ఆంక్షలను లెక్కచేయని తరుణంలో పుతిన్ భారత్తో మరో కోణంలోనూ ఒప్పందాలు చేసుకునే అవకాశం లేకపోలేదు. అందులో.. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్తు ప్లాంట్లో కొత్త మాడ్యులర్ రియాక్టర్ల నిర్మాణంలో రష్యా భాగస్వామిగా మారే అవకాశం బలంగానే కనిపిస్తోంది. ఎస్సీవో శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సుదీర్ఘంగా భేటీ అయిన పుతిన్.. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు రావడం ట్రంప్ను ఒత్తిడికి గురిచేసే అంశమే. అందుకే వీళ్ల దోస్తీపై ఆయన పగబట్టారు. అదీగాక అమెరికా, యూరప్ దేశాలకు వ్యతిరేకంగా పుతిన్ ఆసియా దేశాలతో ఓ బలమైన కూటమిగా ఎదిగేతే గనుక.. అందులో భారత్ ప్రధాన భూమిక అవకాశాలను తోసిపుచ్చలేం. అందుకే భారత్తో మరింత దగ్గరైతే రష్యా మళ్లీ సూపర్ పవర్గా ఎదుగుతుందనే భయం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.:::వెబ్డెస్క్ స్పెషల్ -
ట్రంప్ బ్యాన్ వార్నింగ్.. అసలేంటీ ‘మూడో ప్రపంచ దేశాలు’
మూడో ప్రపంచ దేశాల వలసల విషయంలో కఠిన వైఖరి అవలంభించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. వైట్హైజ్ సమీపంలో జరిగిన ఉగ్రదాడే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో అసలు ఆ మూడో ప్రపంచ దేశాలంటే ఏంటనే ప్రశ్న తెర మీదకు వచ్చింది.. బుధవారం అమెరికా వైట్ హౌస్ వద్ద అప్గాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి నేషనల్ గార్డ్స్ సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ మహిళా సిబ్బంది మరణించగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై భగ్గుమన్న ట్రంప్.. మరోసారి ఇమిగ్రేషన్ పాలసీపై కఠిన ఆంక్షల ప్రస్తావన తీసుకొచ్చారు. "నేను శాశ్వతంగా మూడో ప్రపంచ దేశాల పౌరులను అమెరికాలోకి అడుగుపెట్టకుండా నిషేధిస్తాను. బైడెన్ ప్రభుత్వంలో అక్రమంగా దేశంలోకి చొరబడిన వారిని పంపిస్తాను. అదే విధంగా దేశానికి ఉపయోగకరంగా లేకుండా అమెరికాను ప్రేమించకుండా ఉన్న వారిని దేశం నుంచి పంపిస్తాను. అమెరికాలో శాంతిని దెబ్బతీసేవారిని సభ్యత్వం రద్దు చేస్తాను. వారికి మన దేశంలో ఎటువంటి సబ్సిడీలు అందకుండా చేస్తాను" అని ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. మూడో ప్రపంచ దేశాలంటే.. కోల్డ్ వార్ సమయంలో(1947-1991) మెుదటి సారిగా ప్రపంచ దేశాలను విభజిస్తూ పదం వాడారు. పెట్టుబడిదారి వ్యవస్థ, నాటో కూటమిలో సభ్యత్వం కలిగిన దేశాలను మెుదటి ప్రపంచ దేశాలుగా పిలిచేవారు. వీటికి అమెరికా నేతృత్వం వహించేది. ప్రణాళికమైన ఆర్థిక వ్యవస్థ వార్సా ఒప్పందంలో (నాటోకి ప్రత్యామ్నాయంగా) భాగమైన దేశాలను రెండవ ప్రపంచ దేశాలుగా పిలిచేవారు. ఈ దేశాలకు యూ.ఎస్.ఎస్ ఆర్ నాయకత్వం వహించేది. ఈ రెండు కూటముల్లో చేరకుండా తటస్థంగా ఉన్న దేశాలను మూడో ప్రపంచ దేశాలు అనేవారు. అయితే..ఆ సమయంలో అభివృద్ధి చెందకుండా ఉన్న దేశాలను, పేదరికంలో మగ్గే దేశాలను మూడో ప్రపంచ దేశాల కేటగిరీలో చేర్చారు. ఈ జాబితాలో ఆనాడు భారత్ కూడా ఉండేది. అయితే ఈ భావన కేవలం రాజకీయ పదం మాత్రమే. దీనికంటూ ఓ అధికారిక గుర్తింపులాంటిదేం లేదు.ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంతో.. ట్రంప్ తాజా ప్రకటన నేపథ్యంతో ఆ మూడో ప్రపంచ దేశాలు ఏంటా? అని వెతుకులాట మొదలైంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం.. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే పదానికి అసలే అర్థమే లేదు. అయితే ఐక్యరాజ్య సమితి ప్రకారం అత్యంత అభివృద్ధి చెందిన జాబితాలో 44 దేశాలు ఉన్నాయి. ఇందులో ఆఫ్రికా నుంచి 32 దేశాలు, ఆసియా నుంచి 8 దేశాలు, ఒక కరేబియన్ దేశం(హైతీ,), ఫసిఫిక్ రీజియన్లోని మూడు దేశాలు ఉన్నాయి. ఈ లెక్కన అభివృద్ధి లేకుండా పేదరికంలో మగ్గుతున్న దేశాలను మూడో ప్రపంచ దేశాలుగా భావించొచ్చు.ఆయన ఉద్దేశం అదేనా?..అయితే ట్రంప్ డిక్షనరీలో దీనర్థం వేరే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే.. గతంలో ట్రంప్ యూఎస్కు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ లిస్ట్లో అఫ్గానిస్థాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఉన్నాయి. వీటితోపాటు ఏడు దేశాల ప్రయాణికులపైనా అప్పట్లో పాక్షికంగా నిషేధం విధించారాయన. దీంతో తాజా ప్రకటన ఆ దేశాలను ఉద్దేశించేనా? అని విశ్లేషణ నడుస్తోంది. ఇంతకీ భారత్ ఎక్కడుంది?ట్రంప్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ప్రకటనతో రాజకీయ విశ్లేషకులు సైతం జుట్టు పీక్కుంటున్నారు. అసలు ఆయన ఏ ప్రతిపాదికన ఆ వార్నింగ్ ఇచ్చి ఉంటారో అర్థం కాక యూఎస్ సాయం మీద ఆధారపడిన పేద దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతానికైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు, లో.. లోయర్ మిడిల్ ఇన్కమ్ దేశాలు అనే పాదాలను వాడుతున్నారు. ఒకప్పుడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ జాబితాలోనే ఉండేది. అయితే.. ఇప్పుడు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. అంతేకాదు.. ఈ మధ్యే జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది కూడా. -
కాల్పుల ఘటన.. ట్రంప్ కఠిన ఆదేశాలు
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్షుడి అధికారిక నివాస భవనం వైట్హౌస్ సమీపంలోనే కాల్పుల కలకలం రేగిన సంగతి తెలిసిందే. విధి నిర్వహణలో ఉన్న వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డు సిబ్బందిపై ఓ యువకుడు పాయింట్ 357 స్మిత్ అండ్ వెసన్ రివాల్వర్తో హఠాత్తుగా కాల్పులు జరిపాడు. మొత్తం ముగ్గురు జవాన్లపై కాల్పులు జరిగాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో జవాను స్వల్పంగా గాయపడ్డాడు.ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్కార్డ్ హోల్డర్స్పై దృష్టిపెట్టారు. 19 దేశాల నుండి వచ్చిన వారికి జారీ చేసిన గ్రీన్ కార్డులపై విస్తృత సమీక్ష చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అఫ్గాన్తో సహా మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ను సమీక్షించనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. ప్రతి విదేశీయుడి గ్రీన్ కార్డును పూర్తిస్థాయిలో పునఃపరిశీలన చేయాలి” అని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించినట్లు తెలిపారు.కాగా, ఇటీవలి కాలంలో భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. తాలిబన్ పాలకులు భారత్కు స్నేహహస్తం అందిస్తున్నారు. కలిసి పనిచేస్తామని చెబుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం, తాలిబన్ పాలకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అఫ్గాన్–పాక్ సరిహద్దుల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్ యువకుడు అమెరికాలో కాల్పులు జరపడం, అధ్యక్షుడు ట్రంప్ అఫ్గానిస్తాన్పై కత్తి నూరుతుండడం చర్చనీయాంశంగా మారింది. -
అమెరికాపై ఉగ్రదాడి!
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్షుడి అధికారిక నివాస భవనం వైట్హౌస్ సమీపంలోనే కాల్పుల మోత మోగింది. అమెరికాకు వలసవచ్చిన అఫ్గానిస్తాన్ యువకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డు జవాన్లు సారా బెక్్రస్టామ్(20), ఆండ్రూ వూల్ఫ్(24) తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లలో ఒకరు జరిపిన ఎదురు కాల్పుల్లో సదరు యువకుడు సైతం గాయాలపాలయ్యాడు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రతిఏటా శ్వేతసౌధంలో ఘనంగా నిర్వహించే కృతజ్ఞతార్పణ దినానికి ముందురోజే కాల్పులు జరగడం, ఇద్దరు జవాన్లు క్షతగాత్రులుగా మారడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని తేల్చిచెప్పారు. జో బైడెన్ హయాంలో అమెరికాకు వలసవచ్చిన అఫ్గాన్ జాతీయుల కార్యకలాపాలపై విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అఫ్గాన్ పౌరుల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే రద్దు చేయాలని తేల్చిచెప్పారు. ఇది మొత్తం అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన నేరంగానే భావిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ దేశాన్ని ప్రేమించనివారు తమకు ఎంతమాత్రం అవసరం లేదని స్పష్టంచేశారు. అసలేం జరిగింది? శ్వేతసౌధంలో జరిగే ‘థ్యాంక్స్ గివింగ్ డే’ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జనం నిరసన వ్యక్తంచేసే అవకాశం ఉందన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా ఇతర రాష్ట్రాల నుంచి నేషనల్ గార్డు సిబ్బందిని రప్పించారు. శ్వేతసౌధం చుట్టుపక్కల మోహరించారు. ఇక్కడికి సమీపంలోనే మెట్రో స్టేషన్ వద్ద బుధవారం మధ్యాహ్నం విధి నిర్వహణలో ఉన్న వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డు సిబ్బందిపై ఓ యువకుడు పాయింట్ 357 స్మిత్ అండ్ వెసన్ రివాల్వర్తో హఠాత్తుగా కాల్పులు జరిపాడు. మొత్తం ముగ్గురు జవాన్లపై కాల్పులు జరిగాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో జవాను స్వల్పంగా గాయపడ్డాడు. అతడు వెంటనే స్పందించి, అఫ్గాన్ యువకుడిపై ఎదురు కాల్పులు ప్రారంభించాడు. తీవ్రస్థాయిలో గాయాలపాలైన ఇద్దరు జవాన్లను ఆసుపత్రికి తరలించారు. ఎదురు కాల్పుల్లో గాయపడిన అఫ్గాన్ యువకుడు భద్రతా సిబ్బంది చేతికి ప్రాణాలతో చిక్కాడు. అతడిని రహ్మనుల్లా లఖన్వాలా(29)గా గుర్తించారు. అనుమానాలు ఎన్నెన్నో.. ఇటీవలి కాలంలో భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. తాలిబన్ పాలకులు భారత్కు స్నేహహస్తం అందిస్తున్నారు. కలిసి పనిచేస్తామని చెబుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం, తాలిబన్ పాలకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అఫ్గాన్–పాక్ సరిహద్దుల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్ యువకుడు అమెరికాలో కాల్పులు జరపడం, అధ్యక్షుడు ట్రంప్ అఫ్గానిస్తాన్పై కత్తి నూరుతుండడం చర్చనీయాంశంగా మారింది. తమను అప్రతిష్టపాలు చేయడానికి పాక్ ప్రభుత్వం కుట్రలు సాగిస్తోందని, వాషింగ్టన్ డీసీలో జరిగిన కాల్పులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్లు తేల్చిచెప్పారు. ఈ ఘటన వెనుక పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా, డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో తన వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను బాగా ముద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి విషయంలోనూ ఆయన పాకిస్తాన్ను వెనకేసుకొస్తున్నారు. పాక్ ప్రత్యర్థి అయిన అఫ్గానిస్తాన్పై మళ్లీ దాడులకు ట్రంప్ కసరత్తు చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. తాజా కాల్పుల ఘటనను సాకుగా చూపించి, అఫ్గాన్పై పెద్ద ఎత్తున విరుచుకుపడినా ఆశ్చర్యంలేదని నిపుణులు అంటున్నారు. ఎవరీ రహ్మనుల్లా? రహ్మనుల్లా లఖన్వాలా అఫ్గానిస్తాన్ జాతీయుడు. అక్కడే పుట్టిపెరిగాడు. 2021లో జో బైడెన్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక కారుణ్య పథకం కింద తన కుటుంబంతో కలిసి అమెరికాకు చేరుకున్నాడు. అప్పట్లో అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంది. స్వదేశానికి తిరిగివచ్చింది. తాలిబన్ల కారణంగా తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ వేలాది మంది అఫ్గాన్లు కూడా శరణార్థుల రూపంలో అమెరికా చేరారు. జో బైడెన్ ప్రభుత్వం వారిని స్వాగతించింది. ఆ సమయంలో దాదాపు 76,000 మంది అఫ్గాన్ పౌరులు అమెరికాకు వలసవచ్చినట్లు అంచనా. వీరంతా వేర్వరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొందరు అమెరికా సైన్యంలోనే అనువాదకులుగా పనిచేస్తున్నారు. రహ్మనుల్లా తన భార్య, ఐదుగురు సంతానంతో కలిసి వాషింగ్టన్ రాష్ట్రంలోని బెల్లింగ్హమ్ అనే ప్రాంతంలో స్థిరపడినట్లు తెలుస్తోంది. అతడు రాజధానికి వచ్చి, జవాన్లపై ఎందుకు కాల్పులు జరిపాడన్నది అంతుబట్టడం లేదు. -
వైట్హౌజ్ ఘటనలో పాక్ ప్రమేయం?!
వైట్హౌజ్ వద్ద కాల్పుల ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన అగ్రరాజ్యం.. నేరుగా అఫ్గనిస్థాన్ను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలకు దిగింది. అఫ్గన్ను ప్రమాదకరమైన నేలగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ఇమిగ్రేషన్ దరఖాస్తుల సస్పెండ్కు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)ను పురమాయించారు కూడా. ఈ క్రమంలో.. తాలిబాన్ ప్రభుత్వం తాజా పరిణామాలపై స్పందించింది.వైట్హౌజ్ సమీపంలో జరిగిన దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందా?. కాల్పులకు పాల్పడిన దుండగుడు రెహ్మనుల్లా లఖన్వాల్ను ఆ దేశమే బ్రెయిన్వాష్ చేసి పంపిందా?.. అయ్యి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తోంది అఫ్గనిస్తాన్. కాబూల్ ప్రపంచ దేశాలతో.. ముఖ్యంగా భారతదేశంతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూరస్తోందని చెబుతోంది. ఈ దాడి తమ దేశాన్ని బద్నాం చేసే కుట్ర అయ్యి ఉండొచ్చని.. అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిగితే అసలు విషయం బయటపడుతుందని అంటోంది. తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి సుహైల్ షాహీన్ భారత్కు చెందిన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఈ దాడి వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ప్రమేయం ఉందనిపిస్తోంది. మా దేశగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నంలో భాగమే ఈ దాడి అయ్యి ఉండొచ్చు కూడా. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగితే నిజం బయటపడుతుంది.... ఇది బయటి దేశాల గూఢచారి సంస్థలు(పాక్ ఐఎస్ఐను ఉద్దేశిస్తూ..) పని అయ్యి ఉండొచ్చు. అఫ్గాన్లను ఇతర దేశాల భద్రతా ముప్పుగా చూపించే ప్రయత్నమూ కావొచ్చు. ఇందులో ఏ కోణాన్ని మేం వదలిపెట్టబోం. ఎందుకంటే.. అయితే మా విధానం స్పష్టంగా ఉంది. మా పౌరులు ఎప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడరు. ఆఫ్గన్ నేలను, ఇక్కడి ప్రజల్ని ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించేందుకు మేం అంగీకరించబోం’’ అని అన్నారాయన. అఫ్గాన్ వలస ప్రక్రియను అమెరికా కఠినతరం చేయడంపై స్పందిస్తూ.. అమెరికా ప్రభుత్వం అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపించాలని.. ఆ తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలని అన్నారు.గురువారం వాషింగ్టన్లోని అధ్యక్ష భవనానికి అతి సమీపంలో జరిగిన ఈ కాల్పులతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. కాల్పుల సమయంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి అఫ్గాన్ జాతీయుడని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్రువీకరించారు. అతడి పేరు రెహ్మనుల్లా లఖన్వాల్ (Rahmanullah Lakanwal)గా పేర్కొన్నారు. 2021లో అఫ్గాన్లకు అందించిన స్పెషల్ వీసాపై అగ్రరాజ్యానికి వచ్చినట్లు తెలిపారు. నేషనల్ గార్డులకు తీవ్ర గాయాలయ్యాయని ఎఫ్ఐబీ చీఫ్ కాష్ పటేల్ ప్రకటించారు. కాల్పుల్లో నిందితుడికి కూడా గాయాలవడంతో.. అతడిని ఆస్పత్రికి తరలించామన్నారు. అతడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.వైట్హౌజ్ దాడి ఘటనపై ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇది ఒక దారుణమైన దాడి. విద్వేషపూరితమైన ఉగ్రవాద చర్య. ఇది మొత్తం దేశంపై జరిగిన దాడి. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దీన్ని మేం ఖండిస్తున్నాం. కాల్పుల అనంతరం అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఈ భూమి పైనే ప్రమాదకర ప్రాంతమైన అఫ్గానిస్థాన్ (Afghanistan)కు చెందినవాడని పేర్కొన్నారు. అతడు జో బైడెన్ (Joe Biden) పరిపాలన సమయంలో యూఎస్లోకి ప్రవేశించాడు. బైడెన్ పాలనలో అలా వచ్చినవాళ్లందరినీ విచారించాల్సిన అవసరం ఉంది. అలాంటి శరణార్థులు అమెరికన్ల మనుగడకే ప్రమాదకరం’’ అని అన్నారు. ఈ ఘటన తర్వాత వాషింగ్టన్లో మరో 500 మంది నేషనల్ గార్డ్ సిబ్బంది మోహరింపునకు ఆదేశించారు. అంతేకాదు.. ట్రంప్ ఆదేశాలతో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అఫ్గాన్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
‘ఆ జంతువుపై భారీ మూల్యం’: ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన కాల్పుల సంఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని ఉద్దేశిస్తూ తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్లో చేశారు. దానిలో ట్రంప్ ఆ నిందితుడిని జంతువుతో పోల్చారు. అతను భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. గాయపడిన గార్డులను చికిత్స కోసం రెండు వేర్వేరు ఆసుపత్రులకు తరలించనట్లు తెలిపారు. ఈ ఘటన దరిమిలా ట్రంప్ నగరానికి అదనంగా 500 మంది నేషనల్ గార్డ్ సభ్యులను మోహరించాలని ఆదేశించారు. ట్రంప్తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు. వాన్స్.. ఆ గార్డులను ధైర్యస్థులు అని కొనియాడగా , ఒబామా ‘అమెరికాలో హింసకు స్థానం లేదు’ అని వ్యాఖ్యానించారు. బాధిత సైనికులు, వారి కుటుంబాల కోసం తాను, మిచెల్ ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఈ దాడి వెనుక ఉన్న అనుమానితుడి వివరాలు వెల్లడయ్యాయి. చట్ట అమలు అధికారులు అందించిన సమాచారం ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తిని 29 ఏళ్ల ఆఫ్ఘన్ జాతీయుడు రహ్మానుల్లా లకాన్వాల్గా గుర్తించారు. ఎన్వై పోస్ట్ నివేదిక ప్రకారం లకాన్వాల్ 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనిక ఉపసంహరణ సమయంలో అమెరికాకు వచ్చాడు. అనుమానితుడు కూడా కాల్పుల్లో గాయపడ్డాడు. అయితే అతనికి ప్రాణాపాయం లేదని చట్ట అమలు అధికారి తెలిపారు.ఈ కాల్పులు బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు జరిగాయి. దాడి చేసిన వ్యక్తి ముందుగా ఒక మహిళా గార్డుపై కాల్పులు జరిపాడు. అనంతరం కాల్పులతో మరో గార్డును కూడా గాయపరిచాడు. అయితే సమీపంలో ఉన్న మూడవ గార్డు వెంటనే స్పందించి, కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు గార్డులు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితిపై మొదట్లో గందరగోళం నెలకొంది. వెస్ట్ వర్జీనియా గవర్నర్ పాట్రిక్ మోరిస్సే ఆ ఇద్దరు గార్డులు మరణించారని ప్రకటించిన కొద్దిసేపటికే ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. గాయపడిన ఈ ఇద్దరు యూఎస్ గార్డ్మెన్లు, నేరాలను అరికట్టే మిషన్లో భాగంగా మోహరించిన 2,000 మందికి పైగా సైనికులలో సభ్యులు. ఈ దాడి నేషనల్ గార్డ్ దళాల భద్రత, వారి విధి నిర్వహణలో సవాళ్లను మరోసారి ఎత్తిచూపింది. ఇది కూడా చదవండి: అమెరికాలో కాల్పుల మోత -
ఏప్రిల్లో ట్రంప్ చైనా పర్యటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏప్రిల్లో చైనాలో పర్యటించనున్నారు. టారిఫ్ వార్ తరువాత రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో తాను ఫోన్లో సంభాషించానని, వచ్చే ఏడాది చివర్లో అమెరికా పర్యటనకు జిన్పింగ్ను ఆహ్వనించానని ఎక్స్వేదికగా ట్రంప్ పేర్కొన్నారు. చైనాతో అమెరికా సంబంధం బలంగా ఉందని, ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడేందుకు సహాయపడుతుందని వెల్లడించారు. నెల రోజుల కిందట ఇద్దరు నాయకులు దక్షిణ కొరియాలో భేటీ అయ్యారు. అనంతరం ఫోన్లో సంభాíÙంచారు. ఉక్రెయిన్, ఫెంటానిల్, అమెరికన్ సోయాబీన్స్ కొనుగోళ్లు వంటి అంశాలపై చర్చించామని ట్రంప్ తెలిపారు. పర్యటనలు ప్రస్తావించని చైనా అయితే ముందుగా ఫోన్ కాల్ గురించి ప్రకటించిన చైనా మాత్రం పర్యటనల గురించి వెల్లడించలేదు. కేవలం ఇరు దేశాల మధ్య వాణిజ్యం, తైవాన్, ఉక్రెయిన్ గురించి చర్చించారని పేర్కొంది. ‘‘చైనా ప్రధాన భూభాగానికి తైవాన్ తిరిగి రావడం ‘యుద్ధానంతర అంతర్జాతీయ క్రమంలో అంతర్భాగం’అని జిన్పింగ్ ట్రంప్తో అన్నారు. ట్రంప్ తన పోస్ట్లో ప్రస్తావించని బీజింగ్కు ఇది కీలకమైన సమస్య. ఫాసిజానికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం విజయాన్ని సంయుక్తంగా కాపాడుకోవాలని జిన్పింగ్ ట్రంప్తో అన్నారు. తెవాన్ ప్రశ్న చైనాకు ఎంత ముఖ్యమో అమెరికా అర్థం చేసుకుంటుంది.’’అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్కు సాయంపై అమెరికా అస్పష్టత వాణిజ్య యుద్ధాన్ని తగ్గించడానికి వరుస చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. రెండు అగ్రరాజ్యాల మధ్య వైరుధ్యాలు కొనసాగుతున్నాయని రెండు వైపుల నుంచి వచి్చన ప్రకటనల్లోని లోపాలు సూచిస్తున్నాయి. తైవాన్పై చైనా చర్య తీసుకుంటే, అమెరికాకు కీలకమైన మిత్రదేశమైన జపాన్లోని సైన్యం జోక్యం చేసుకోవచ్చని జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో చైనా–జపాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తకైచి వ్యాఖ్యలను బీజింగ్ ఖండించింది. ఎవరూ తాకకూడని ఎర్ర గీతను జపాన్ దాటిందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు.స్వయం పాలనలో ఉన్న తైవాన్ సార్వభౌమాధికారంపై అమెరికా ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ తైవాన్ను స్వా«దీనం చేసుకోవడానికి బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తుంది. ఏదైనా సాయుధ దాడిని నిరోధించడానికి ద్వీపానికి సాయంగా అమెరికా దళాలను పంపే విషయంలో స్పష్టత లేదు. తైవాన్ తన రక్షణ బడ్జెట్ను పెంచాలని అమెరికా చెబుతోంది. తైవాన్కు 330 మిలియన్ డాలర్ల ఆయుధ అమ్మకాలకు అమెరికా ఈ నెలలో ఆమోదం తెలిపిందని తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో యుద్ధ విమానాల విడిభాగాలు కూడా ఉన్నాయి. దీనిపై చైనా నిరసన వ్యక్తం చేసింది. -
హెచ్1బీ వీసాదార్లను వెళ్లగొట్టబోం
న్యూయార్క్: అమెరికాలో క్షణక్షణ గండంగా గడుపుతున్న భారత హెచ్–1బీ వీసాదారులకు భారీ ఊరట. వారిని అమెరికన్లతో భర్తీ చేసి వారిని భారత్కు తిప్పి పంపాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారంటూ వస్తున్న వార్తలకు వైట్హౌస్ ఫుల్స్టాప్ పెట్టింది. అలాంటి ఆలోచనకు అధ్యక్షుడు అస్సలు మద్దతివ్వడం లేదని స్పష్టం చేసింది. హెచ్–1బీ వీసాలను గురించి ఆయనకున్న అవగాహన అత్యంత పరిమితమని వెల్లడించింది! ఈ విషయమై ట్రంప్కు ఉన్నది కేవలం సాధారణ పరిజ్ఞానంతో కూడిన అవగాహన మాత్రమేనని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ స్పష్టం చేశారు.హెచ్–1బీ వీసాదార్లను అమెరికన్లతో భర్తీ చేస్తారన్న వార్తలను మీడియా ప్రస్తావించగా ఆమె ఈ మేరకు స్పష్టతనిచ్చారు. దీనిపై ట్రంప్ వైఖరిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అధ్యక్షుని కోరికల్లా ఒక్కటే. విదేశీ కంపెనీలు అమెరికాలో లక్షలాది కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాలి. విదేశీ వృత్తి నిపుణులతో తమతో పాటు వెంటబెట్టుకు రావాలి. కొత్త తరం వాణిజ్య పోరులో ఏ దేశాన్నైనా ముందు వరుసలో నిలిపే బ్యాటరీల వంటి కీలక ఉత్పత్తుల్లో అమెరికాను అగ్రగామిగా నిలపాలి.అయితే, అంతిమంగా ఆయా ఉద్యోగాల్లో అమెరికన్లే ఉండేలా చూడాలన్నది ట్రంప్ లక్ష్యమని కూడా లెవిట్ చెప్పుకొచ్చారు! ‘మా దేశంలో వ్యాపారం చేయాలంటే మా దేశస్తులనే ఉద్యోగాల్లోకి తీసుకోవడం మంచిది’అని ఆయా కంపెనీలకు ట్రంప్ స్పష్టంగా చెప్పారన్నారు. ‘‘ప్రస్తుత గందరగోళం అంతటికీ ఆ స్టేట్మెంటే కారణం. కానీ అధ్యక్షుని ఉద్దేశం అంతా అనుకుంటున్నది మాత్రం కాదు’’అంటూ ముక్తాయించారు. అమెరికా ఉత్పత్తి రంగం మున్నెన్నడూ లేనంతగా కోలుకుని దూసుకుపోవాలన్నదే ట్రంప్ కల అన్నారు. నిజానికి ఆయా దేశాలపై టారిఫ్ల విధింపు వెనక అధ్యక్షుని ఏకైక ఉద్దేశం కూడా ఇదేనని చెప్పారు. విదేశీ కంపెనీలు తమతో పాటు సొంత వృత్తి నిపుణులను వేలాదిగా అమెరికాకు తీసుకు రావాలని, వారంతా కీలక వృత్తి నైపుణ్యాలను అమెరికన్లకు నేర్పి స్వదేశాలకు వెళ్లిపోవాలని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. -
ట్రంప్, జిన్పింగ్ మాటామంతి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్పింగ్ సోమవారం ఉదయం ఫోన్లో మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యంతోపాటు తైవాన్, ఉక్రెయిన్ వ్యవహారాలపై వారిద్ద రూ చర్చించుకున్నట్లు అమెరికా, చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దాదాపు నెల రోజుల క్రితం దక్షిణ కొరియాలోని బుసాన్లో ట్రంప్, జిన్పింగ్ కలుసుకున్నారు. ఇంతలోనే మరో సారి వారు చర్చించుకోవడం గమనార్హం. తైవాన్ విషయంలో చైనా వైఖరిని జిన్పింగ్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారని సమాచారం. తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని ఆయన ట్రంప్కు స్పష్టంచేశారు. -
జీ20 సరికొత్త మార్గం
దేశాల మధ్య సహకారం పెంపొందించటం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరత సాధించాలన్న సంకల్పంతో పదిహేడేళ్ల క్రితం ఏర్పడిన జీ20 తొలిసారి అమెరికాను ధిక్కరించింది. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్లో వరసగా రెండు రోజులు కొనసాగి ఆదివారం ముగిసిన సంస్థ శిఖరాగ్ర సదస్సుకు అమెరికా ముఖం చాటేయగా, దాన్ని బతిమాలటా నికీ, నచ్చజెప్పి ఒప్పించటానికీ ఒక్కరంటే ఒక్కరు ప్రయత్నించిన దాఖలా లేదు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తన విపరీత పోకడలతో ఇంటా బయటా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు.శ్వేతజాతి అమెరికన్లకు ఏదో ఒరగబెడుతున్నట్టు కనబడటం కోసం ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పర్యావరణ క్షీణత పెద్ద బోగస్ అని వాదించటమేగాక, బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను వినియోగించే పరిశ్రమలకు రాయితీలిస్తున్నారు. వేరే దేశాలు కూడా తన బాటలోనే నడవాలంటూ ప్రోత్సహి స్తున్నారు. మానవ కార్యకలాపాల పర్యవసానంగా భూగోళం వేడెక్కుతున్నదని, ఇది ధరిత్రి మనుగడకే పెను ముప్పని శాస్త్రవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్నా మొండిగా వ్యవహరిస్తున్నారు.అంతర్జాతీయంగానూ అదే బాణీ అందుకున్నారు. జొహాన్నెస్బర్గ్ సదస్సు ప్రధాన ధ్యేయమే వాతావరణ మార్పులపై చర్చించి తగు చర్యల కోసం ప్రపంచ దేశాలకు పిలుపునివ్వటం గనుక ట్రంప్ గుర్రుగా ఉన్నారు. సదస్సు ఎజెండాను మార్చమంటూ గత కొన్ని వారాలుగా ఒత్తిడి తెచ్చారు. అది సాధ్యపడక పోవడంతో శ్వేత జాతి మైనారిటీల పట్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని, అందుకు నిరసనగానే సదస్సుకు గైర్హాజరు కాదల్చుకున్నట్టు ప్రచారం లంకించు కున్నారు. ట్రంప్కు వంతపాడే అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలీ కూడా సదస్సుకు రాలేదు.కావడానికి జీ20 సంపన్న రాజ్యాల సంస్థే అయినా దక్షిణాఫ్రికా వంటి వెనకబడిన దేశంలో సదస్సు జరిగింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలపై ఉమ్మడి అవగాహ నకు రావాలన్న ధ్యేయంతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఇందులో వర్ధమాన దేశాలకు సైతం భాగస్వామ్యం కల్పించారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల జనాభా గల దేశా లకూ, ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపు 85 శాతం వాటా ఉన్న ఆర్థిక వ్యవస్థలకూ ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సదస్సు నుంచి దూరం జరిగితే ప్రపంచంలో ఏకాకిగా మిగులుతామన్న స్పృహ ట్రంప్కు లేకపోయింది.‘నేను లేకుండా శిఖరాగ్ర సదస్సు డిక్లరేషన్ను విడుదల చేయొద్దని ట్రంప్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా సదస్సు బేఖాతరు చేసింది. అంతేగాక సంప్రదాయానికి భిన్నంగా తొలి రోజునే డిక్లరేషన్ను ఆమోదించింది. తన గైర్హాజర్ అయోమయాన్ని సృష్టించి, డిక్లరేషన్ ఆమోదానికి అధినేతలు తటపటా యిస్తారని ట్రంప్ అనుకున్నారు. కానీ ‘అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగద’ని జీ20 తేల్చిచెప్పింది. వాస్తవానికి సంస్థ అధ్యక్ష పదవి అమెరికాకు రావాలి. కానీ సదస్సుకుట్రంప్ గైర్హాజరు కావటం, కనీసం ఉన్నతాధికారులనైనా పంపక, జూనియర్ అధికారితో సరిపుచ్చటానికి నిరసనగా అధ్యక్ష పదవి బదిలీకి దక్షిణాఫ్రికా నిరాకరించింది.అది ఎప్పుడుంటుందో, అసలు జీ20లో అమెరికా కొనసాగుతుందో లేదో చెప్పలేని స్థితి ఏర్పడింది. అమెరికాలోని మియామిలో వచ్చే ఏడాది జరగాల్సిన తదుపరి సదస్సుపైనా అనిశ్చితి అలుముకుంది. భారత, చైనా, రష్యాలేకాక అమెరికా శిబిరంలో ఉండాల్సిన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, కెనడాలు సైతం ఈ సదస్సులో పాల్గొని వాతావరణ సమస్యలపైనా, ప్రపంచ అసమానతలపైనా దృష్టిపెట్టిన డిక్లరేషన్ను ముక్తకంఠంతో ఆమోదించాయి.పునరుత్పాదక ఇంధన వనరులపై, నిరుపేద దేశాల రుణవిమోచనపై కూడా అవగాహన కుదిరింది. భారత్ సూచించిన విధంగా ఉగ్రవాదంపైనా, మాదకద్రవ్యాలపైనా సమష్టిగా తలపడటానికి ఆమోదం తెలిపాయి. వాతావరణ సమస్యలపై శిఖరాగ్ర సదస్సు అంగీ కారానికి రావటం ట్రంప్ జీర్ణించుకోలేనిది. సదస్సు ఆమోదించిన అంశాల్లో మెజా రిటీ పేద దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించినవే. తనది ఇక గత వైభవమేనని, ఇటువంటి సదస్సులకు దూరంగా ఉంటే అంతిమంగా తన ప్రతిష్ఠ మరింత మసకబారుతుందని అమెరికా గ్రహించాలి. -
ఉక్రెయిన్పై ట్రంప్ ఫుల్ సీరియస్
వాషింగ్టన్: ఉక్రెయిన్ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు కీవ్ అసలు కృతజ్ఞత చూపించలేదని ట్రంప్ దుయ్యబట్టారు. జెనీవా వేదికగా అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.రష్యా దురాక్రమణకు పుల్స్టాప్ పెట్టేందుకు ఉద్దేశించిన అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఆదివారం చర్చలు జరిపారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ జాతీయ భద్రతా సలహాదారులతో మొదటి దఫా చర్చలు ముగిశాయని ఉక్రెయిన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న అధ్యక్ష భవనం చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యర్మాక్ ఎక్స్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా స్పందిస్తూ.. గతంలోనే అమెరికా, ఉక్రెయిన్కు బలమైన నాయకత్వం ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదు. ఇప్పుడు యుద్ధం ముగింపు కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్ చూపిస్తున్న కృతజ్ఞత శూన్యం. ఉక్రెయిన్ కోసం మేము ఇంత చేస్తున్నా జెలెన్స్కీ మాత్రం మా మద్దతు ఇవ్వడం లేదు. అలాగే, రష్యాపై మేము ఆంక్షలు విధించి దారికి తెస్తుంటే యూరప్ మాత్రం మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు.జెలెన్స్కీ స్పందన..మరోవైపు.. ట్రంప్ విమర్శల నేపథ్యంలో జెలెన్ స్కీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా అధ్యక్షుడు ట్రంప్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా చేస్తున్న కృషికి మేము కృతజ్ఞులం. మాకు అమెరికా నాయకత్వం ఎంతో ముఖ్యమైనది. వీలైనంత వరకు మేము నిర్మాణాత్మకంగా పనిచేస్తూనే ఉన్నాం అని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్పై ఒత్తిడి.. ఇదిలా ఉండగా.. యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా ప్రతిపాదిత 28 పాయింట్ల ఒప్పందంలో దురాక్రమణకు పాల్పడిన రష్యాకే అనుకూలంగా ఉండటంపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదనలను సమీక్షించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్ను అవి కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రణాళికకు ప్రత్యామ్నాంగా 28 పాయింట్లతో ఈయూ కొత్త ప్లాన్ను తెరపైకి తెచ్చింది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం కాపాడాల్సిందే అని ప్రతిపాదన చేసింది. అమెరికా ప్లాన్కు కౌంటర్గా ఈయూ ప్రణాళికను రూపొందించింది. ఇక,అంతకుముందు.. ఈ ఒప్పందంతో దేశ సార్వభౌమత్వమా? అమెరికా మద్దతును నిలుపుకోవడమా? తేలిపోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించడం తెలిసిందే. -
ట్రంప్ హెచ్చరిక.. ఉక్రెయిన్కు టెన్షన్?
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రష్యాకు కొంత అనుకూలంగా ఉంటూ.. ఉక్రెయిన్కు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా జెలెన్స్కీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరు దేశాల మధ్య యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అమెరికా 28 అంశాల ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా వైట్హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ విషయంలో ఇది తన తుది ప్రతిపాదన కాదన్నారు. ఒకవేళ జెలెన్స్కీ ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే, ఆయన చివరి వరకు పోరాటం కొనసాగించవచ్చు. శాంతి స్థాపనే తమ లక్ష్యమని, ఎలాగైనా దాన్ని సాధిస్తామని అన్నారు. తాను 2022లో అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధమే జరిగేది కాదని పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో నవంబర్ 27లోగా అంగీకరించాలంటూ ఉక్రెయిన్పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇక, ఈ ప్రణాళికలో చాలా మార్పులు అవసరమని ఉక్రెయిన్ మిత్రదేశాల కూటమి జెలెన్స్కీకి తేల్చిచెప్పింది.Reporter “Is this your final offer to Ukraine”Trump: “No”Even Donald Trump he knows he went to far, he knows his treachery was too obvious. Even the doubters can see he is a Russian asset now and he’s risked his own presidency with what he has done. pic.twitter.com/xIXmWpTy5e— Bricktop_NAFO (@Bricktop_NAFO) November 22, 2025ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రణాళికపై మరో తీవ్రమైన ఆరోపణ బయటకు వచ్చింది. 28 పాయింట్లు ఉన్న ఈ పత్రం వాస్తవానికి రష్యా నుంచి వచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సెనేటర్లకు చెప్పినట్లు రిపబ్లికన్ సెనేటర్ మైక్ రౌండ్స్ వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించలేదు. దీంతో, ఈ ప్రతిపాదనకు మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది.జెలెన్స్కీ ఆందోళన.. మరోవైపు.. ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒప్పందంలోని చాలా అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని కీవ్ భావిస్తోంది. అంగీకరిస్తే దేశ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఒప్పుకోకపోతే ట్రంప్ ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. అమెరికాతో స్నేహాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన అల్టిమేటంతో.. ఆ దేశ జెలెన్స్కీ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది. అదే సమయంలో రాజకీయంగా, సైనికపరంగా కూడా ఆయన తీవ్ర ఇబ్బందుల్నే ఎదుర్కొంటున్నారు.ట్రంప్ శాంతి ప్రణాళిక.. ఈ శాంతి ప్రణాళిక ప్రకారం.. ఉక్రెయిన్ తన సైన్యాన్ని ఆరు లక్షలకు కుదించుకోవాలి. నాటోలోకి ఉక్రెయిన్ ఎప్పటికీ చేరకూడదు. అన్నింటికంటే కీలకం.. క్రిమియా, డాన్బాస్, లుహాన్స్క్తో పాటు.. ఖేర్సన్లో, జపోరిజియాలలో కొన్ని భూభాగాలను రష్యాకు అప్పగించాలి. ఈ ప్రతిపాదనను జెలెన్స్కీ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అయినా ఒప్పందంలో భూభాగాల అప్పగింత ప్రతిపాదనను ట్రంప్ చేయడం గమనార్హం.యుద్ధంలోనూ ఎదురుదెబ్బలుయుద్ధక్షేత్రంలోనూ ఉక్రెయిన్కు పరిస్థితులు ఆశాజనకంగా లేవు. చాలా ప్రాంతాల్లో ఆ దేశ సైన్యానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రష్యా నెమ్మదిగా కీలక ప్రాంతాలను ఆక్రమిస్తోంది. దొనెట్స్క్, ఖేర్సన్ ప్రాంతాల్లో ముందుకు కదులుతోంది. ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా భారీస్థాయిలో దాడులు చేస్తోంది. ఆయుధాల కొరత కూడా ఉక్రెయిన్ సైన్యాన్ని ఇబ్బంది పెడుతోంది. అమెరికా, ఇతర ఐరోపా దేశాల నుంచి సరఫరాలు అనుకున్నంత వేగంగా ఆ దేశానికి చేరడం లేదు. మానవ వనరుల కొరత కూడా వేధిస్తోంది. కొత్తగా సైన్యంలోకి ఎవరూ చేరడానికి ముందుకు రావడం లేదు. దీంతో సైన్యం నైతిక స్థైర్యమూ దెబ్బతింటోంది. -
ఒక్కటైన బద్ధశత్రువులు.. వైట్ హౌస్ లో 45 నిమిషాలకు పైగా భేటీ అయిన ఇద్దరు నేతలు
-
ఆత్మ గౌరవమా.. కీలక మిత్రుడా..?: జెలెన్స్కీ టెన్షన్
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు తెచ్చిన శాంతి ప్రతిపాదనలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవమా లేక కీలకమైన మిత్రుడిని కోల్పోవడమా అనే ప్రశ్న ఇప్పుడు ఉక్రెయిన్ ముందుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఇది అత్యంత కష్ట కాలమని ఆయన తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్ ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పుడు చాలా కష్టమైన ఎంపికను ఎదుర్కోవాల్సి రావచ్చు. దీనివల్ల గౌరవాన్ని కోల్పోవడం లేదా కీలక భాగస్వామిని కోల్పోయే ప్రమాదం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. దురాక్రమణను ఆపాలంటే కీలకమైన పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్ను రష్యాకు వదిలివేయడం వంటి షరతులు ట్రంప్ ప్రతిపాదనల్లో ఉన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో జెలెన్స్కీ ఈ ప్రసంగం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. మూడేళ్లకు పైగా కొనసాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు 28 పాయింట్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్లాన్ సిద్ధం చేశారు. అందులో ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. ఆ ప్రతిపాదనలను అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా రూపొందించారు. ఇటీవల దానిని జెలెన్స్కీ ప్రభుత్వానికి అందించారు. ఆ ప్లాన్ ప్రకారం.. ఉక్రెయిన్ తూర్పు డాన్బాస్లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి. అలాగే ఆ దేశ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలకు అనుమతి ఉండకూడదు. రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్కు ఎవరూ అందించకూడదు. -
ట్రంప్-మమ్దానీ భేటీ.. ఆల్ ఈజ్ వెల్
నిన్న మొన్నటిదాకా ఒకరి మీద మరొకరు కారాలు మిరియాలు నూరుకున్న ట్రంప్-జోహ్రాన్ మమ్దానీలు ఎట్టకేలకు చేతులు కలిపారు(షేక్ హ్యాండ్తో). శ్రుతి మించి తిట్టుకున్న వీళ్లు.. ఇప్పుడేమో ఒకరి మీద ఒకరు ప్రశంసలు గుప్పించుకున్నారు. పైగా తలుపులు బిగించి నిర్వహించిన సమావేశం చాలా గొప్పగా జరిగిందంటూ ప్రకటించుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ భేటీ అయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం వైట్హౌజ్ ఓవల్ ఆఫీస్లో ఈ భేటీ జరిగింది. సాధారణంగా.. తనకు నచ్చని వాళ్లను వైట్హౌజ్కు ఆహ్వానించి మరీ అవమానించడం ట్రంప్ స్టైల్. అలాంటిది ప్రపంచమంతా ఊహించిన దానికంటే భిన్నంగా మమ్దానీతో ట్రంప్ భేటీ జరగడం గమనార్హం.న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచార సమయం నుంచి ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. వలసలు, ఆర్థిక విధానాలపై ఇద్దరూ పరస్పర విమర్శలు గుప్పించుకున్నారు. ట్రంప్ మమ్దానిని “రాడికల్ లెఫ్ట్ లూనాటిక్” అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. మమ్దానీ కూడా ట్రంప్ను ఉద్దేశించి నియంత అంటూ నానా తిట్లు తిట్టాడు. దీంతో సహజంగానే ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ఇప్పుడు అవన్నీ మరిచిపోయి నగర అభివృద్ధికి కృషి చేయాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. మా మధ్య భేటీ చాలా గొప్పగా జరిగింది అంటూ మమ్దానీ పక్కన నిల్చుని ఉండగా తన డెస్క్ మీద కూర్చుని ట్రంప్ ప్రకటన చేశారు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ విషయాల్లో ఏకీభవించాం. మనం ఇద్దరం న్యూయార్క్ ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాం అని అన్నారు. మమ్దానీ కూడా ఆ వ్యాఖ్యలతో ఏకీభవించినట్లు వ్యాఖ్యానించారు. ఈ భేటీ ఫలవంతంగా జరిగినట్లు ప్రకటించాడు.Working people have been left behind in New York. In the wealthiest city in the world, one in five can't afford $2.90 for the train or bus. As I told Trump today— it’s time to put those people right back at the heart of our politics. pic.twitter.com/PUVQfuT38s— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) November 21, 2025భేటీ జరగడానికి కొన్ని గంటల ముందు కూడా.. ‘‘మా దారులు వేరైనా.. మా లక్ష్యం మాత్రం ఒక్కటే. బలమైన న్యూయార్క్ను నిర్మించాలని కోరుకుంటున్నాం. అతడిది భిన్నమైన ఫిలాసఫీ. నాతో పోలిస్తే భిన్నమైంది. అతడి పోరాటాన్ని అభినందిస్తా. ఇలాంటి ప్రయాణం అంత సులభం కాదు. కానీ, అతడు విజయవంతమయ్యాడు. ఇక నుంచి మేమిద్దరం బాగానే ఉంటామని అనుకుంటున్నా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ట్రంప్ జోక్తో.. భేటీ ముగిశాక మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్.. ట్రంప్ను నియంత అన్నవ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా? అని మమ్దానీని ప్రశ్నించాడు. దానికి ఆయన సమాధానం ఇవ్వబోతుండగా.. ‘‘అవునను.. ఓ పనైపోతుంది.. నేనేమనుకోను’’ అంటూ పక్క నుంచి ట్రంప్ తట్టి చెప్పాడు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి."That's okay. You can just say yes. It's easier than explaining it. I don't mind." 🤣🤣🤣 pic.twitter.com/5NpLP6v3gZ— Rapid Response 47 (@RapidResponse47) November 21, 2025 న్యూయార్క్ సిటీకి 2026 ఆర్థిక సంవత్సరంలో ఫెడరల్ ప్రభుత్వం $7.4 బిలియన్ నిధులు కేటాయిస్తోంది. ఎన్నికల సమయంలో.. మమ్దానీ గనుక గెలిస్తే ఈ నిధులను నిలిపివేస్తానని ట్రంప్ హెచ్చరించారు. అయితే.. కాంగ్రెస్ ఆమోదించిన నిధులను నిలిపివేయడానికి ఆయనకు చట్టపరమైన అధికారం స్పష్టంగా లేదు. తాజా భేటీ నేపథ్యంలో ఆ నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.అంతకు ముందు.. న్యూయార్క్ సిటీకి కొత్తగా ఎన్నికైన మేయర్ జోహ్రాన్ మమ్దానీని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా లోనికి ఆహ్వానించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం తట్టి విజయానికి గానూ ప్రశసించారు. ఆ సమయంలో ఓవెల్ ఆఫీస్ బయట ఉన్న కొందరు కేకలు వేస్తూ కోలాహలం చేశారు.భారత మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దానీ ఉగాండాలో పుట్టారు. ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ, ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ల సంతానం ఈయన. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్గా చరిత్ర సృష్టించారు. సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న మమ్దానీ.. ప్రచారంలోనూ వైవిధ్యతను కనబరిచి ఓటర్లను ఆకట్టుకోగలిగారు. మమ్దానీ తన మేయర్ పదవిని జనవరి 1న స్వీకరించనున్నారు. -
తొలిసారి డొనాల్డ్ ట్రంప్తో మామ్దానీ భేటీ..!
అమెరికాలో పెద్ద నగరమైన న్యూ యార్క్ మేయర్గా ఎన్నికైన డెమొక్రటిక్ సోషలిస్ట్, భారతీయ అమెరికన్ యువకుడు జొహ్రాన్ మమ్దాని.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలవనున్నారు. ఈరోజు(శుక్రవారం) డొనాల్డ్ ట్రంప్తో వైట్హౌస్లో భేటీ కానున్నారు మామ్దాని. అయితే న్యూయార్క్ మేయర్గా మామ్దాని ఎన్నిక కావడానికి ముందు, ఆ తర్వాత ఆయనపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. అతనొక కమ్యూనిస్టు అని ఒకవైపు, అతడి పేరు ఎదైనా కావొచ్చు, అతడు ఎవరైతే నాకేంటి? అని హేళన కూడా మాట్లాడారు. అమెరికా ప్రజలు కమ్యూనిజం కావాలో లేక కామన్సెన్స్ కావాలో తేల్చుకొనే సమయం వచ్చిందని అన్నారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా మామ్దానీపై విరుచుకుపడుతూనే ఉన్నారు ట్రంప్. న్యూయార్క్ అభివృద్ధికి సంబంధించి నిధులు ఆపేస్తున్నారని మామ్దానీ సైతం ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు వైట్హౌస్లో ముఖాముఖి ఎదురపడటం ఇదే తొలిసారి. ఏయే అంశాలు ప్రస్తావనకు వస్తాయి. దానికి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మామ్దానీ వైట్హౌస్కి వస్తున్న వేళ కూడా సెటైర్లు పడ్డాయి. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిత్.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాలో పెద్ద నగరమైన న్యూయార్క్కు మేయర్గా ఎన్నికైన కమ్యూనిస్టు మామ్దానీ వైట్హౌస్కు వస్తున్నారంటూ సెటైర్ల వేశారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీ ఒక్కరితోనూ మాట్లాడాతారంటూ చెప్పుకొచ్చారు. అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ట్రంప్ ఎవరితోనైనా మాట్లాడతారంటూ మామ్దానీని తక్కువగా చేసి వ్యాఖ్యలు చేశారు. -
ఆయనవి అనవసరపు వ్యాఖ్యలు.. రమఫోసాపై వైట్హౌజ్ ఆగ్రహం
అమెరికా దక్షిణాఫ్రికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి. జీ20 సదస్సు నేపథ్యంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా కీలక వ్యాఖ్యలు చేయగా.. వాటిపై వైట్హౌజ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆయన అనవసరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడుతోంది.జీ20 సమావేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల్ని ఊచకోత కోస్తున్నారని.. అందుకే ఆ గడ్డపై జరగబోయే సదస్సుకు తాను, తన బృందం హాజరుకాబోదని చెప్పారాయన. అయితే.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా తాజాగా మరో ప్రకటన చేశారు.అమెరికా చివరి నిమిషంలో మనసు మార్చుకుందని.. జీ20 సమావేశాలకు హాజరు కాబోతోందని.. ఇది సానుకూల పరిణామం అని ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. ‘‘ఒక దేశం మరొక దేశాన్ని బలవంతపెట్టకూడదని.. ఏ దేశం మరొక దేశాన్ని బెదిరించలేదని.. అమెరికా నిర్ణయంతో జీ20 సదస్సుపై ఎలాంటి ప్రభావం ఉండబోదు’’ అని అన్నారు. దీంతో ట్రంప్కే ఆయన వార్నింగ్ ఇచ్చారంటూ కథనాలు వెలువడ్డాయి.ఈ వ్యాఖ్యలపై తాజాగా వైట్హౌజ్ స్పందించింది. ‘‘ఆయన అనవసరపు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్, ఆయన బృందం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదని వ్యాఖ్యానించింది. జోహెనెస్బర్గ్లో జరగబోయే జీ20 సమావేశంలో అమెరికా పాల్గొనబోదు. అమెరికా రాయబారి కేవలం హ్యాండోవర్ కార్యక్రమానికి హాజరవుతారు. అంతేగానీ అధికారిక చర్చల్లో పాల్గొనరు’’ అని వైట్ హౌస్ సెక్రటరీ కారోలిన్ లేవిట్ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా G20 ప్రాధాన్యతలు (తక్కువ ఆదాయ దేశాల అప్పు సమస్య, న్యాయమైన ఎనర్జీ మార్పు, ఖనిజ వనరుల వినియోగం) అమెరికా విధానాలకు విరుద్ధమని, అందువల్ల ఏకాభిప్రాయం సాధించలేమని అమెరికా రాయబారి కార్యాలయం మరో ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. COP30 వాతావరణ సమావేశాన్ని సైత అమెరికా బహిష్కరించింది.రెండు దేశాల మధ్య ఎందుకీ వివాదందక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1994 వరకు వర్ణవివక్ష విధానం కొనసాగింది. తెల్లవాళ్లకు (white minority) అధిక హక్కులు, అధికారం ఉండేది. నల్లజాతీయులు (Black majority) సొంతగడ్డపైనే వివక్షను ఎదుర్కొనేవారు. 1994లో నెల్సన్ మండేలా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. ఈ వివక్షకు ఫుల్స్టాప్ పడి సమానత్వం మొదలైంది. అయితే..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణాఫ్రికాపై చాలాకాలంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైన కొన్నిరోజులకు.. ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను వైట్హౌజ్కు రప్పించుకుని మరీ శ్వేత జాతీయుల్ని ఊచకోత కోస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కొన్ని ఫొటోలను ఆయన చూపించారు(వాటిలో చాలావరకు తప్పుడు ఫొటోలు అని ఫ్యాక్ట్ చెక్లో తేలింది).తాజాగా.. ఆ దేశంలో ఉన్న తెల్లజాతీయుల్ని నల్లజాతీయుల్ని హత్యలు చేస్తూ.. వాళ్ల భూములు, పొలాలు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సు నిర్వహించడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అయితే.. ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ దేశంలో వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత కూడా శ్వేత జాతీయులు ఆఫ్రికన్ల కంటే మెరుగైన పరిస్థితుల్లోనే జీవిస్తున్నారంటూ చెబుతోంది.దక్షిణాఫ్రికాపై సుంకాలునిరాధార ఆరోపణలు చేస్తున్న ట్రంప్.. దక్షిణాఫ్రికా రాయబారిని బహిష్కరించారు. ఆ ఆఫ్రికా దేశంపై 30% వాణిజ్య సుంకాలు విధించారు. అయితే అమెరికా ప్రభుత్వ బహిష్కరణ ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికాలో అమెరికా కంపెనీలు కార్యకలాపాలు(సుమారు 600 కంపెనీలు) యధావిధిగా కొనసాగుతున్నాయి. జోహానెస్బర్గ్లో జరిగిన Business 20 (B20) సమావేశంలో అమెరికా కంపెనీలు చురుకుగా పాల్గొన్నాయి. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు సుజాన్ క్లార్క్ ఆ సందర్భంలో దక్షిణాఫ్రికా నాయకత్వాన్ని ప్రశంసించడం గమనార్హం.దక్షిణాఫ్రికా పర్యటనకు మోదీ జీ20 సమావేశాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. ఇందులో 40దేశాలు పాల్గొనబోతున్నాయి. భారత్ తరఫున హాజరయ్యేందుకు ప్రధాని మోదీ ఈ వేకువజామున దక్షిణాఫ్రికాకు బయల్దేరారు. -
నైపుణ్యం కలిగిన వలసదారులను స్వాగతిస్తాం: ట్రంప్
వాషింగ్టన్: వలసదారులపై ఇన్నాళ్లూ కఠిన వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. అమెరికాకు వారి అవసరమేంటో ఆయనకు ఎట్టకేలకు తెలిసొచ్చింది. నైపుణ్యం కలిగిన వలసదారులను కచ్చితంగా స్వాగతిస్తామని చెప్పారు. కంప్యూటర్ చిప్స్, క్షిపణులు లాంటి సంక్లిష్టమైన ఉత్పత్తుల అభివృద్ధి విషయంలో అమెరికన్ కార్మీకులకు వలసదారులు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు గతంలో మద్దతు ఇచ్చానని గుర్తుచేశారు. ఇప్పుడు వలసదారులకు పెద్దపీట వేస్తే స్వదేశంలో కొందరి నుంచి వ్యతిరేకత రావొచ్చని అన్నారు. వ్యతిరేకతను భరిస్తానని చెప్పారు. బుధవారం యూఎస్–సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో ట్రంప్ మాట్లాడారు. దేశ ఆర్థిక ప్రగతి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, మిస్సైల్స్ వంటి కంపెనీల్లో పని చేయడానికి నిపుణులైన వలసదారులు కావాలని తెలిపారు. వారి పరిజ్ఞానం తమ కార్మీకులకు ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. వస్తువుల ఉత్పత్తికి అవసరమైన మానవ వనరులను విదేశాల నుంచి రప్పించుకోవచ్చని అమెరికా సంస్థలకు ట్రంప్ సూచించారు. వేలాది మంది వచ్చినా తప్పకుండా స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు.ఈ విషయంలో నన్ను క్షమించాలి వలసదారుల రాకను వ్యతిరేకించేవారు నిజంగా చాలా తెలివైనవారు, నమ్మశక్యంకాని దేశభక్తులు అని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. అయితే, అమెరికా కార్మీకులకు నైపుణ్యాలు నేరి్పంచాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. మన కంపెనీల్లో బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేవారిని అనుమతించకపోతే మనం విజయవంతమైన వ్యక్తులుగా ఎప్పటికీ ఎదగలేమని తేలి్చచెప్పారు. ఒక పెద్ద కంపెనీ ఏర్పాటై, ఉత్పత్తి ప్రారంభం కావాలంటే విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు, ఉద్యోగులు రావాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ విషయంలో తనను క్షమించాలని కోరారు. మాగా(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్)ను ఇప్పటికీ ఆరాధిస్తున్నానని, విదేశాల నుంచి మనకు కావాల్సిన నిపుణులను రప్పించుకోవడం కూడా ‘మాగా’అవుతుందని అమెరికా అధ్యక్షుడు వివరించారు. తనకు ఓటు వేసేవారి సంఖ్య తగ్గినా పట్టించుకోబోనని, చివరకు వారే అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. -
యుద్ధం ఆపేస్తానన్నారు!
వాషింగ్టన్: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. కానీ, ఈసారి ఒక కొత్త విషయం చెప్పారు. దాడులు ప్రతిదాడులు వెంటనే నిలిపివేయకపోతే ఏకంగా 350 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించడంతో ఆ రెండు దేశాలు మరో గత్యంతరం లేక దారికొచ్చాయని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడారని, పాకిస్తాన్పై యుద్ధం చేయబోమని చెప్పారని స్పష్టంచేశారు. అణ్వస్త్ర దేశాలైన భారత్–పాక్ మధ్య భీకర యుద్ధాన్ని తానే చొరవ తీసుకొని ఆపేశానంటూ ట్రంప్ నోటివెంట వచ్చిన ప్రకటనల సంఖ్య 60 దాటడం గమనార్హం. రెండు దేశాల నడుమ ఘర్షణ ఆగడం వెనుక మూడో వ్యక్తి ప్రమేయం, పాకిస్తాన్ ప్రాధేయపడడం వల్లనే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ పదేపదే చెబుతున్నా ట్రంప్ తన వైఖరి మార్చుకోవడం లేదు. ఆయన తాజాగా యూఎస్–సౌదీ అరేబియా పెట్టుబడుల సదస్సులో ప్రసంగించారు. ‘‘భారత్–పాక్ మధ్య దాడులు ఆరంభం కాగానే ఆ రెండు దేశాల అధినేతలతో మాట్లాడా. దాడులు తక్షణమే ఆపాలని, లేకపోతే 350 శాతం సుంకాలు భరించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించా. అంత పని చేయొద్దని భారత్, పాక్ వేడుకున్నాయి. అణ్వాయుధాలతో పరస్పరం యుద్ధం సాగిస్తే లక్షలాది మంది మరణిస్తారని చెప్పా. లాస్ ఏంజెలెస్ సిటీపై అణుధూళి పేరుకుపోతుందని వెల్లడించా. 350 శాతం సుంకాలు అనగానే రెండు దేశాలు బెదిరిపోయి నా మాట విన్నాయి. ఒక్క మాటతో అంతా సెట్ అయిపోయింది. మొదట నాకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నుంచి ఫోన్ వచ్చింది. యుద్ధాన్ని నిలిపివేసి లక్షలాది మంది ప్రాణాలు కాపాడినందుకు ఆయన నాకు కృతజ్ఞతలు తెలియజేశారు. తర్వాత నరేంద్ర మోదీ ఫోన్చేసి మాట్లాడారు. మేము చేయాల్సింది చేశాం మీరేం చేస్తారో చెప్పాలని ప్రశ్నించా. పాక్పై యుద్ధం చేయబోమని మోదీ బదులిచ్చారు. దాంతో మోదీకి కృతజ్ఞతలు తెలియజేశా’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సదస్సులో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పాల్గొన్నారు. పదేపదే అదే మాట 350 శాతం టారిఫ్లు విధిస్తానని భారత్, పాక్లను హెచ్చరించానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి ఆయన గతంలో మాట్లాడుతూ 200 శాతం టారిఫ్లు విధిస్తానని బెదిరించానని చెప్పారు. ఆ సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అది 350 శాతానికి చేరింది. ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. ఇదిలా ఉండగా, గురువారం వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో డొనాల్డ్ ట్రంప్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ భేటీలోనూ ట్రంప్ తన నోటికి పనిచెప్పారు. భారత్–పాక్ యుద్ధానికి తానే ఫుల్స్టాప్ పెట్టేశానని పునరుద్ఘాటించారు. -
పుతిన్ ఎఫెక్ట్.. ఉక్రెయిన్కు షాకిచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇరు దేశాల మధ్య 28 పాయింట్లతో శాంతి ప్రణాళికను ట్రంప్ ఆమోదించారు. ఇందులో పుతిన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ట్రంప్.. జెలెన్స్కీకి బిగ్ షాకిచ్చారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా ఫైనాన్షియల్ టైమ్స్ కథనాల్లో వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక, తాజాగా యుద్ధానికి ముగింపు కోసం 28 పాయింట్లతో ఒక ప్లాన్ సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా రూపొందించారు. ఇటీవల దానిని జెలెన్స్కీ ప్రభుత్వానికి అందించారు. దీనిపై ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఉక్రెయిన్ జాతీయ భద్రతాధిపతి రుస్తుమ్ ఉమరోవ్ మధ్య సమావేశం జరిగింది. ఈ ప్రణాళికకు అంగీకారం తెలపాలని అమెరికా కోరుకుంటుందని ఆ సందర్భంగా విట్కాఫ్ స్పష్టం చేశారు.అయితే, అందులో ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో, పలు నిబంధనలను జెలెన్స్కీ వ్యతిరేకిస్తున్నారు. వాటిని అంగీకరించడం అంటే తమ సార్వభౌమత్వాన్ని వదులుకోవడమేనని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మిత్ర దేశం నిరాకరిస్తున్నా.. ట్రంప్ మాత్రం దానికి మద్దతు తెలిపారని ఆ కథనం పేర్కొంది.కీలక పాయింట్లు ఇవే..ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి.ఉక్రెయిన్ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలి.ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలకు అనుమతి ఉండకూడదు.ఉక్రెయిన్ తూర్పు డాన్బాస్లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి.రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్కు ఎవరూ అందించకూడదు అనేవి ముఖ్యమైనవిగా ఉన్నాయి. -
ట్రంప్ అభయం.. ఓ థ్యాంక్స్ పడేస్తే పోలా!
ఎలాన్ మస్క్తో డొనాల్డ్ ట్రంప్ సంబంధాలు మళ్లీ మెరగవుతున్నాయా?.. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. మస్క్ వ్యాపారాల గురించి మాట్లాడిన ట్రంప్.. ఆయన వెంట తాను ఉన్నానంటూ అభయం ఇచ్చారు. దానికి మస్క్ బదులిచ్చిన తీరు నెట్టింట చర్చకు దారి తీసింది.అమెరికా-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో ట్రంప్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించిన పన్ను రాయితీ గురించి వివరించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు లాభదాయకంగా ఉందని.. కారు కొనుగోలు చేసే వారికి ఇంత రాయితీ ఎప్పుడూ లేదని అన్నారు. ఈ క్రమంలో మస్క్ను ఉద్దేశిస్తూ.. ‘‘ఇంత చేస్తున్నా కనీసం అతను నాకు సరైన థ్యాంక్స్ చెప్పాడా?” అంటూ అక్కడ ఉన్నవాళ్లను ఉద్దేశిస్తూ సరదాగా ప్రశ్నించారు. మధ్య తరగతి ప్రజలు ఒక మంచి టెస్లా కారు కొనుగోలు చేసి, దానికి రుణం తీసుకుంటే, ఆ రుణంపై వడ్డీకి మేము రాయితీ (డిడక్షన్) ఇస్తున్నాం. నువ్వు(మస్క్ను ఉద్దేశించి..) నిజంగా అదృష్టవంతుడివి. నేను నీతో ఉన్నాను ఎలాన్’’ అని ట్రంప్ చిరునవ్వుతో అన్నారు. దీంతో అక్కడ మళ్లీ నవ్వులు విరబూశాయి.అయితే ఈ ప్రసంగం జరిగిన కొన్ని గంటలకు.. మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు థ్యాంక్స్ చెబుతూ.. ఆయన అమెరికాకు, ప్రపంచానికి ఎంతో చేశారంటూ కొనియాడాడు. I would like to thank President Trump for all he has done for America and the world pic.twitter.com/KdK9VC2MLs— Elon Musk (@elonmusk) November 19, 20252024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ విపరీతంగా పని చేశారు. ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించడం, ఆయన కోసం విరాళాల సేకరణ ద్వారా తన బలమైన మద్దతు ప్రకటించారు. ప్రతిగా ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత.. మస్క్ను Department of Government Efficiency (DOGE) అనే కొత్త శాఖకు నాయకుడిగా నియమించారు. ఈ శాఖ ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, వ్యవస్థను సరళతరం చేయడం లక్ష్యాలతో పని చేసింది. మస్క్కు ట్రంప్ అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం సహజంగానే రిపబ్లికన్లకూ కోపం తెప్పించింది. ఈలోపు.. ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు తేవడాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా.. ఈ ఏడాది మే 30న తన డోజ్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆపై ట్రంప్ పాలనా నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒకానొక టైంలో ఇది ట్రంప్నే తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ బహిరంగానే విమర్శలు చేసుకుంటూ, వార్నింగులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది సాధారణంగానే మస్క్ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపెట్టింది. టెస్లా షేర్లు పడిపోయి భారీ నష్టాలను చవిచూసింది. నాసాతో స్పేస్ఎక్స్ ఒప్పందాలు దాదాపుగా రద్దయ్యే స్థితికి చేరుకున్నాయి. ఈ పరిణామాలన్నీ.. మస్క్ను రాజకీయ పార్టీ ప్రకటన వైపు అడుగులేయించింది. అంతేకాదు ట్రంప్ను ఇరకాటంలో పడేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి అంశాన్ని సైతం మస్క్ ప్రధానంగా ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే.. హఠాత్తుగా అన్నీ మరిచిపోయి ఈ ఇద్దరూ ఇలా ఇప్పుడు కలిసి కనిపిస్తున్నారు. ఆ మధ్య కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ స్మారక సభలో ఈ ఇద్దరూ కనిపించి సందడి చేశారు. మరోవైపు.. పాశ్చాత్య దేశాలతో.. ప్రత్యేకించి వాషింగ్టన్తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు సౌదీ యువరాజు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆయన్ను వైట్హౌజ్కు ఆహ్వానించి ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్కు టిమ్ కుక్, జెన్సెన్ హువాంగ్ , క్రిస్టియానో రొనాల్డో లాంటి ప్రముఖులు హాజరయ్యారు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ మస్క్ సందడి చేశారు. దీంతో అపర కుబేరుడికి మళ్లీ మంచిరోజులు వచ్చాయనే టాక్ నడుస్తోంది. -
‘ఎప్స్టీన్ ఫైళ్లు'.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ రహస్య ఫైళ్లను బహిరంగంగా విడుదల చేయాలంటూ న్యాయ శాఖను ఆదేశించే బిల్లుపై సంతకం చేసినట్లు ప్రకటించారు. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన సోషల్ మీడియా పోస్ట్లో ఆయన.. ‘మా అద్భుతమైన విజయాల నుండి దృష్టి మరల్చేందుకు ‘ఎప్స్టీన్ ఫైళ్లు' అంశాన్ని డెమొక్రాట్లు ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు.‘ఎన్డీటీవీ’ అందించిన కథనంలోని వివరాల ప్రకారం ఈ బిల్లు ‘ఎప్స్టీన్ ఫైళ్లు పారదర్శకత చట్టం’ పేరుతో కాంగ్రెస్లో ద్వైపాక్షిక మద్దతు పొందింది. మంగళవారం హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్లో 427-1 ఓట్ల భారీ తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం. ట్రంప్ వ్యతిరేకత తర్వాత కూడా రిపబ్లికన్లతో సహా మెజారిటీ చట్టసభ సభ్యులు ఈ పారదర్శకతకు మద్దతు తెలిపారు. ఈ పరిణామం ఎప్స్టీన్ బాధితులకు, ఈ కేసులోని నిజానిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్న ప్రజలకు ఉపశమనం కలిగింది.ఈ చట్టం ప్రకారం.. న్యాయ శాఖ (డీఓజే) ఎప్స్టీన్కు సంబంధించిన అన్ని ఫైళ్లు, కమ్యూనికేషన్లను 30 రోజుల్లోపు విడుదల చేయవలసి ఉంటుంది. 2019లో ఫెడరల్ జైలులో ఎప్ స్టీన్ మరణంపై జరిగిన దర్యాప్తుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయాలని ఈ బిల్లు కోరుతోంది. ఎప్స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, అతని మరణంపై అనేక సందేహాలు, కుట్ర కోణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రకటన కీలకంగా మారింది. అయితే ఈ బిల్లులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తుల కోసం ఎప్స్టీన్ బాధితులకు సంబంధించిన కొన్ని సవరణలను (Redactions) చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. అంటే రాజకీయంగా ఎంతటి సున్నితమైన లేదా ఇబ్బందికరమైన సమాచారం ఉన్నా, అది తప్పనిసరిగా బహిర్గతం చేయవలసి ఉంటుంది. త్వరలోనే ఎప్స్టీన్ ఫైళ్లు వెల్లడి కానుండటంతో, దీనిలో ఏయే ప్రముఖుల పేర్లు బయటపడతాయో అనే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.ఇది కూడా చదవండి: ‘ఏడ్చినా.. పట్టించుకోను’.. టీచర్ వేధింపులకు విద్యార్థి బలి -
H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత భారత ఐటీ కంపెనీలకు, ఐటీ నిపుణులకు భారీ ఎదురుదెబ్బ గిలింది. 2025 ఆర్థిక సంవత్సరంలో H-1B వీసా దరఖాస్తులను భారతీయ కంపెనీలు గణనీయంగా తగ్గించేశాయి. బ్లూమ్బెర్గ్ లెక్కల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గాయి. మరోవైపు ఈ పరిణామం అమెరికా ఉద్యోగులను నియామకాలకు దారి తీస్తోంది. శరవేగంగా మారుతున్న సాంకేతిక మార్పులు, భారతదేశం నుండి రిమోట్గా ప్రాజెక్టులను అమలు చేసే సామర్థ్యం పెరుగుదలను ప్రతిబింబిస్తుందని నిపుణులు తెలిపారు.గత దశాబ్ద కాలంతో పోలిసతే ఇది మరింత తీవ్రంగా ఉంది. తీవ్రంగా ఉంది; టాప్ ఏడు భారతీయ సంస్థలు H-1B అప్లికేషన్స్ను 70శాతం తగ్గించాయి. 2025లో, కేవలం 4,573 ప్రారంభ ఉపాధి (initial employment) ఆమోదాలను మాత్రమే పొందారు. అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు H-1B వినియోగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. USCIS డేటా NFAP విశ్లేషణ ప్రకారం, అమెజాన్ 4,644 ప్రారంభ ఆమోదాలతో టాప్లో ఉండగా, మెటా (1,555), మైక్రోసాఫ్ట్ (1,394), గూగుల్ (1,050) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆపిల్ ఆరో స్థానంలో నిలిచింది. నాలుగు అమెరికన్ టెక్ కంపెనీలు తొలి నాలుగు స్థానాలను ఆక్రమించడం ఇదే మొదటిసారి.చదవండి: ఎనిమిదేళ్లనాటి దారుణ హత్యలు : క్లూ ఇచ్చిన ల్యాప్ట్యాప్భారతీయ ఐటీ సంస్థలు టాప్ నుంచి కిందికి పడిపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మొత్తం మీద ఐదో స్థానంలో నిలిచింది, కానీ LTIMindtree (20వ స్థానం), HCL అమెరికా (21వ స్థానం) టాప్ 25లో చోటు దక్కించుకోలేకపోయాయి. దీనికి ఐటీలో నిర్మాణాత్మక మార్పులు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆన్షోర్ ఉద్యోగులు ,రిమోట్ ఎగ్జిక్యూషన్ మోడల్లపై సంస్థలు ఎక్కువగా ఆధారపడుతున్నాయన్నారు. ట్రంప్ కొత్త వీసావిధానం, ప్రతీ కొత్త H-1B కోసం 100,000 డాలర్ల ఫీజు లాంటి వాటికారణంగా కంపెనీల దృక్పథంలో మరింత మార్పువస్తుందని భావిస్తున్నారు.అత్యధిక H-1B వీసాలు ఇక్కడే ఇనీషియల్ ఎంప్లాయ్మెంట్ కోసం 21,559 దరఖాస్తులతో H-1B వీసాల ఆమోదాల జాబితాలో కాలిఫోర్నియా అగ్రస్థానంలో ఉంది, తరువాత టెక్సాస్ (12,613), న్యూయార్క్ (11,436), న్యూజెర్సీ (7,729), వర్జీనియా (7,579) ఉన్నాయి.న్యూయార్క్ నగరం అత్యధిక సంఖ్యలో కొత్త ఆమోదాలను (7,811) నమోదు చేసింది, ఆర్లింగ్టన్, చికాగో, శాన్ జోస్, శాంటా క్లారా, శాన్ఫ్రాన్సిస్కో కూడా ప్రముఖ నగరాలుగా ఉన్నాయి. ప్రొఫెషనల్ , టెక్నికల్ సర్వీసెస్, విద్య, తయారీ, సమాచారం, ఆరోగ్య సంరక్షణ మరియు ఫైనాన్స్ వంటి రంగాలలో H-1B వీసాలకు ప్రాధాన్యత లభించింది. ఇదీ చదవండి: BMW కారు బీభత్సం : భారత సంతతి గర్భిణి దుర్మరణం -
‘ప్రిన్స్’ విందులో.. ట్రంప్ ‘పుత్రోత్సాహం’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో ఉన్నట్టుండి పుత్రోత్సాహం పెల్లుబికింది. దీనికి వైట్ హౌస్లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కోసం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం వేదికగా నిలిచింది. ఈ విందుకు సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హాజరుకావడం ఆసక్తికరంగా మారింది.ఈ సందర్భంగా ట్రంప్.. రొనాల్డోను ప్రత్యేకంగా అభినందించారు. తన కుమారుడు బారన్.. రొనాల్డోకు పెద్ద అభిమాని అని ట్రంప్ వెల్లడించారు. తాను ఆ క్రీడా దిగ్గజాన్ని తన కుమారునికి పరిచయం చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. తన కుమారుడు బారన్ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను కలుసుకున్నాడు. ఇకపై బారన్ తనను మరింత అధికంగా గౌరవిస్తాడని అనుకుంటున్నానని ట్రంప్ చమత్కరించారు. సౌదీ క్లబ్ అల్-నాసర్కు ప్రాతినిధ్యం వహిస్తూ, సౌదీ సాకర్ లీగ్లో కీలక ఆటగాడిగా ఉన్న రొనాల్టో వైట్ హౌస్లో జరిగిన విందుకు హాజరు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించింది. -
ట్రంప్ కొత్త డ్రామా.. డీల్స్ కోసం ‘ఎంబీఎస్’కు క్లీన్చిట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త డ్రామాకు తెరలేపారు. తమ స్వప్రయోజనాల కోసం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)ను వెనుకేసుకొచ్చారు. 2018లో జరిగిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య గురించి సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్కు ఏమీ తెలియదన్నారు. ఖషోగ్గి చాలా వివాదాస్పదుడని, చాలా మందికి నచ్చని వ్యక్తి అని అభివర్ణించారు. ఖషోగ్గి హత్యపై ఓవల్ కార్యాలయంలో యువరాజును ప్రశ్నించిన జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి ప్రశ్నలతో తమ అతిథిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు 2021 నాటి యూఎస్ నిఘా అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయి. నాటి వివరాల ప్రకారం ఖషోగ్గిని చంపడానికి ప్రిన్స్ మొహమ్మద్ ఆదేశించినట్లు తేలింది. కాగా అమెరికా తొలి పర్యటనలో ఉన్న ఎంబీఎస్ మాట్లాడుతూ ఖషోగ్గి హత్య బాధాకరమైనదని, అదొక పెద్ద తప్పిదం అని పేర్కొన్నారు. అయితే దీనిపై ఖషోగ్గి భార్య హనన్ ఎలాటర్ ఖషోగ్గి స్పందిస్తూ, ఎంబీఎస్ తనను కలిసి క్షమాపణ చెప్పి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ వివాదాన్ని పక్కన పెడుతూ అమెరికా- సౌదీ అరేబియా తమ సంబంధాలను బలోపేతం చేసుకుంటూ పలు కీలక ఒప్పందాలకు ఆమోదం తెలిపాయి.ఇందులో పౌర అణుశక్తి సహకార ఒప్పందం, భవిష్యత్తులో ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్ల అమ్మకం మొదలైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఎంబీఎస్ తనకు మంచి స్నేహితుడని ప్రశంసించారు. అలాగే మానవ హక్కులను కాపాడేవాడని కూడా అని కొనియాడారు. కాగా గతంలో సౌదీతో తలెత్తిన దౌత్య సంక్షోభానికి కారణమైన ఖషోగ్గి హత్యను పక్కన పెట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లుందని విమర్శకులు అంటున్నారు. ట్రంప్ వ్యాపార ప్రయోజనాలు ఈ సమావేశంలో ప్రధాన అంశంగా మారాయి. ట్రంప్ ఆర్గనైజేషన్తో సౌదీ డెవలపర్ కొత్త హోటల్ భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఒక రోజు తరువాత ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రాంతీయ శాంతి, ఇజ్రాయెల్తో సంబంధాల సాధారణీకరణ (అబ్రహం ఒప్పందాలు) గురించి కూడా ట్రంప్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో చర్చించారు.ఇది కూడా చదవండి: Bihar: ‘ఇళ్లా.. ఇంద్ర భవనాలా?’.. కొత్త ఎమ్మెల్యేలకు పండుగే! -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై దాదాపు 500 శాతం సుంకాలు విధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. రెండు దేశాల యుద్ధం ముగించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో భేటీ కూడా అయ్యారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అది సాధ్యం కాకపోవడంతో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ పెద్దమొత్తంలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా దాదాపు విఫలం కావడంతో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు సహకరిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్ప ప్రస్తుతం తమ దేశానికి వేరే మార్గం లేదని ట్రంప్ పేర్కొన్నారు.రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్లు విధిస్తానన్నారు. సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు తాజాగా ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ దేశాల జాబితాలో భారత్, చైనా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ను కూడా ఇందులో చేర్చనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తున్నామన్నారు. భారత్, చైనాలే ఆ దేశం నుంచి 70శాతం చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడనుంది. BREAKING:US president Trump approves bill allowing tariffs up to 500% on countries trading with Russia. pic.twitter.com/Lko3wXVuLU— Recon & surveillance (@Recon_surv) November 17, 2025 -
ట్రంప్ యూటర్న్.. ఎప్స్టీన్ ఫైల్స్పై కొత్త ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సరికొత్త నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాలంటూ తన పరిపాలనపై ఒత్తిడి పెరిగిన దరిమిలా దీనిపై ఓటింగ్కు ఆయన హౌస్ రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు.ఎప్స్టీన్ ఫెడరల్ రికార్డులను బహిర్గతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంతకాలం చేసిన ప్రచారానికి అకస్మాత్తుగా ముగింపు పలికారు. ఆదివారం రాత్రి త ట్రూత్ సోషల్లో.. ట్రంప్ తన మునుపటి డిమాండ్ను పక్కన పెడుతూ ‘ఎప్స్టీన్ ఫైళ్లను విడుదల చేయడానికి హౌస్ రిపబ్లికన్లు ఓటు వేయాలి. ఎందుకంటే మన దగ్గర దాచడానికి ఏమీ లేదు’ అని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా న్యాయ శాఖపై ఒత్తిడి తెచ్చిన ఈ బిల్లు హౌస్ లోపల తీవ్రమైన నాటకీయ పరిణామాలకు దారితీసింది. గత వారంలో ఈ చర్యపై ఫ్లోర్ ఓటింగ్ను నిరోధించేందుకు ట్రంప్, స్పీకర్ మైక్ జాన్సన్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే డెమొక్రాట్లతో కలిసి ఓటు వేయడానికి దాదాపు 100 మంది రిపబ్లికన్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. ఈ బిల్లుపై ఓటింగ్ మంగళవారం జరగనుంది. NEW: Epstein survivors release the most powerful PSA I have ever seen. Make this go viral so every member of the House of Representatives sees it. pic.twitter.com/Cb5mUqQDFd— Aaron Parnas (@AaronParnas) November 16, 2025ఎప్స్టీన్ ఫైళ్లలో ఏముంది?లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్, అతని సహచరి గిస్లైన్ మాక్స్వెల్లు పలువురు బాలికలను, మైనర్లను తమ మాన్హాటన్ భవనం, ఫ్లోరిడా ఎస్టేట్, వర్జిన్ ఐలాండ్స్లోని సొంత ద్వీపం తదితర ప్రదేశాలకు తరలించి, లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన ఫైల్స్లో బాధితుల సాక్ష్యాలు, వారికి డబ్బులు చెల్లించిన వివరాలు, రిక్రూట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. ఈ విధమైన వేధింపులకు గురైన బాధితుల సంఖ్య వెయ్యికి పైనే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.ఎప్స్టీన్ సామాజిక సర్కిల్లో పలువురు అమెరికా రాజకీయ నేతలు, ప్రముఖులు, సంపన్నుల పేర్లు ఉన్నాయి. ఇవి ఎప్స్టీన్ బ్లాక్ బుక్, విమాన ప్రయాణాల లాగ్లు (ఫ్లైట్ లాగ్స్),ఇతర పత్రాల నుండి బహిర్గతమయ్యాయి. కొన్ని పత్రాలలో డొనాల్డ్ ట్రంప్ పేరు, అతని కార్యకలాపాల గురించి ఎప్స్టీన్ దగ్గర పనిచేసే ఉద్యోగులు, పైలట్, ఇతరుల మధ్య జరిగిన ఈ మెయిల్ సంభాషణలు ఉన్నాయి. ట్రంప్తో తనకున్న సంబంధం, అతని విమాన ప్రయాణాలు, ఎప్స్టీన్ రాసిన ఈ మెయిల్స్ ఇందులో ఉన్నాయి. అయితే ట్రంప్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తదితర ప్రముఖుల పేర్లు కూడా పత్రాలలో కనిపించాయి. అయితే ఈ పేర్లు కేవలం కాంటాక్ట్ బుక్లు, విమాన లాగ్లు లేదా ఎప్స్టీన్ బర్త్డే బుక్ లోని సందేశాల రూపంలో ఉన్నాయే తప్ప, వారంతా నేరాలలో భాగస్వామ్యం అయ్యారని స్పష్టంగా రుజువు చేసే సాక్ష్యాలు బహిరంగంగా విడుదల కాలేదు.అలాగే ఈ ఫైల్స్లో ఎప్స్టీన్పై 2008లో జరిగిన వివాదాస్పద ప్లీ డీల్, అప్పటి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) అధికారులు తీసుకున్న నిర్ణయాలు, 2019లో జరిగిన అరెస్ట్ వివరాలు కూడా ఉన్నాయి. ఎఫ్బీఐ (ఎఫ్బీఐ) దర్యాప్తులో 300 గిగాబైట్ల డేటా, భౌతిక సాక్ష్యాలు లభించాయి. ఇందులో ఎప్స్టీన్ ఫొటోలు, మైనర్ల లైంగిక చర్యల వీడియోలు, చిత్రాలు, బాధితులకు సంబంధించిన సున్నితమైన వివరాలు ఉన్నాయి.ఇది కూడా చదవండి: Pakistan: మళ్లీ ‘జాఫర్ ఎక్స్ప్రెస్’ టార్గెట్.. రైలు వెళ్లగానే పేలుడు -
మళ్లీ అణ్వాయుధ పోటీ?
అణ్వాయుధాల పరీక్షలను తక్షణం పున రుద్ధరించవలసిందిగా రక్షణ (ఇప్పుడు ‘యుద్ధ విభాగం’గా పిలుస్తున్నారు) శాఖను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 29న ప్రకటించారు. ఇది ప్రపంచ అణు సుస్థిరత, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నియమావళులపై అక్షరాలా బాంబు వేయడమే! అమెరికా 1992 సెప్టెంబర్ తర్వాత, పూర్తి విస్ఫోటనాత్మక అణు పరీక్షను నిర్వహించలేదు. అయితే, 1998లో భారత్ అణు పరీక్షలను జరిపితే, ఆ వెంటనే పాకిస్తాన్ కూడా నిర్వహించింది. ఒక అణ్వాయుధాన్ని విస్ఫోటనం చెందించి చూడటం కడసారిగా 2017లో జరిగింది. భూగర్భంలో ఉత్తర కొరియా ఆ పరీక్షను నిర్వహించింది. అప్పటి నుంచి, అణు పాటవ పరీక్షలపై మారటోరియం అమలులో ఉంది. ఇప్పటివరకు అది ఉల్లంఘనకు గురి కాలేదు. ‘‘చాలా ఏళ్ళ క్రితం మేం దాన్ని నిలుపు చేశాం. కానీ, ఇతరులు పరీక్షలు చేస్తూండటంతో, మేం కూడా చేయడం సముచితమని నాకనిపించింది’’ అని ట్రంప్ అన్నారు. రష్యా పేరును ట్రంప్ ప్రస్తావించకపోయినా ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ మాటలన్నారన్నది స్పష్టం. రష్యా పుట్టిస్తున్న దడట్రంప్ ప్రకటనకు 10 రోజుల ముందు, మాస్కో అణ్వాయుధాలను మోసుకెళ్ళగల రెండు అధునాతన ప్రయోగ వ్యవస్థలను పరీ క్షించింది. బురైవెస్నిక్ (ఆకాశం నుంచి జారిపడే) క్రూజ్ క్షిపణిని... అక్టోబర్ 21న, అసాధారణ పొసైడాన్ జలగర్భ టార్పెడోను... అక్టో బర్ 28న పరీక్షించింది. అయితే, ఈ రెండూ అణ్వాయుధాలను మోసుకెళ్ళగల వాహకాలు మాత్రమే. వాటిని పరీక్షించడం అణు విస్ఫోట పరీక్షలతో సమానం కాదు. సాంకేతికంగా, అవి ప్రస్తుత ఆయుధ నియంత్రణ చట్రంలోకి రావు. ప్రయోగ వాహకాలను పరీ క్షించాంగానీ, అణ్వాయుధాలను కాదని రష్యా పునరుద్ఘాటించింది. కానీ అణ్వాయుధాలను కూడా పొదువుకుంటే, బురైవెస్నిక్, పొసైడాన్ ప్రాణాంతక ఆయుధాలుగా పరిణమిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అవి రష్యా వద్ద ఉన్నంతవరకూ దాని జోలికి వెళ్ళే సాహసం ఎవరూ చేయలేరు. రాడార్ దృష్టిలో పడకుండా బురైవెస్నిక్ 15 గంటల్లో 14,000 కిలోమీటర్ల దూరం పయనించినట్లు అక్టోబర్ 21 పరీక్షలో తేలింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన చోట మాత్రమే అది భూవాతావరణంలోకి ప్రవేశించగలదు. ప్రస్తుతమున్న క్షిపణి రక్షణ వ్యవస్థలు దాన్ని పసిగట్టలేవు. అదే అమెరికా ఆందోళనకు కారణం. ఇక పొసైడాన్... మానవ రహిత జలాంతర్గత అణ్వాయుధ వాహకం. ఇది 10,000 కిలోమీటర్ల దూరం పయనించగలదు. గరి ష్ఠంగా గంటకు 100 నాట్ల (185 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగ లదు. నీటిలో 1,000 మీటర్ల లోతు నుంచి సునాయాసంగా పని చేయగలదు. ఇది ఇప్పుడున్న జలాంతర్గామి నిరోధక రణతంత్ర సామర్థ్యాలకు అందనిది. అణ్వాయుధాన్ని కూడా తగిలించుకున్న పొసైడాన్ను యుద్ధంలో ప్రయోగిస్తే, అది భూగర్భ శిలా ఫలకాలను కదిలించే విధంగా అణుధార్మిక సునామీని రేకెత్తించగలదు. భూగోళానికి, మానవాళికి ఇది చూపించగల ప్రళయం మాటలకు అందనిది. ‘ఐరన్ డోమ్’తో మారిన పరిస్థితిప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 1972లో అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్లు బాలిస్టిక్ నిరోధక క్షిపణుల ఒడంబడిక (ఏబీఎం)కు వచ్చాయి. పరస్పరం ఆయుధాలను ప్రయోగించుకుంటే ఇద్దరమూ నాశనం కావడం ఖాయం అనే అవగాహన (మ్యాడ్)ను అది కల్పించింది. విధ్వంసాన్ని ఆధారం చేసుకున్న మనుగడ అనే ఆ సిద్ధాంతం అసంబద్ధమైనదిగా కనిపిస్తుంది. ఏబీఎం ఆనాటి పరిస్థితులను బట్టి కుదుర్చుకున్న సంక్లిష్టమైన,సాంకేతిక–వ్యూహాత్మక ఒడంబడిక. పోగుపడుతున్న సామూహిక విధ్వంసక ఆయుధాల (డబ్లు్య.ఎం.డి.)తో రెండు అగ్ర రాజ్యాల మధ్య అభద్రత నెలకొన్న నేపథ్యంలో కుదుర్చుకున్నది. అయితే, 2001 సెప్టెంబర్ 11 (9/11) పరిణామాల నేపథ్యంలో, అమెరికా 2002 జూన్లో, ఏకపక్షంగా ఆ ఒడంబడిక నుంచి ఉపసంహరించుకుంది. వైశాల్యం కుంచించుకుపోయి, ఆత్మ విశ్వాసం సన్నగిల్లిన పరిస్థితిలోనున్న రష్యాలో అది అభద్రత బీజాలను నాటింది. పొసైడాన్ 2015లో పురుడు పోసుకోవడం పుతిన్ కన్నుల్లో కాంతి రేఖను నింపింది. కడచిన దశాబ్దంలో అది వైఫల్యాలను చూసింది. సైంటిస్టులు ప్రమాదాల్లో హతులయ్యారు. కానీ, కార్యక్రమం కొన సాగింది. అక్టోబర్ 21న విజయవంతమైంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, చేసిన ప్రక టన బహుశా పుతిన్ను ఈ పరీక్షకు పురిగొల్పి ఉండవచ్చు. ‘అమె రికాకు ఐరన్ డోమ్ ఏర్పాటు’ శీర్షికతోనున్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై 2025 జనవరి 27న ట్రంప్ సంతకం చేశారు. ఇప్పుడా డోమ్కు ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. అది అమెరికా ప్రధాన భూభాగానికి అంతటికీ గొడుగులా పనిచేస్తుందనీ, బహుశా 2045 నాటికి పూర్తి కాగల ఈ కార్యక్రమానికి దాదాపు 3.6 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతాయనీ అంచనా. ఇందుకు సంబంధించి ఎలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’కు మొదటి విడత చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ‘స్టార్ వార్స్’ కార్యక్రమాన్నీ, ప్రచ్ఛన్న యుద్ధం అంతాన్నీ గుర్తుకు తెస్తోంది. ఈ కార్యక్రమాలు దీర్ఘకాలంలో అమెరికా, రష్యా రెండింటినీ దివాళా తీయిస్తాయా? నిరాయుధీకరణే దారిపాకిస్తాన్తో సహా ఇతర దేశాలు రహస్యంగా అణు పాటవ పరీ క్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ చెబుతున్నారు. అధునాతన అణ్వా యుధాలు డోమ్లో భాగం కావాలంటున్నారు. దానికి కొనసాగింపుగా, అమెరికా అణు పరీక్షలను పునరుద్ధరిస్తుందని అన్నారు. ‘‘సంయమనం, చర్చలు అవసరమైన సమయంలో అణు పాటవ పరీక్షలను పునరుద్ధరించడం అస్థిరతకు ద్వారాలు తెరుస్తుంది. మూడు దశాబ్దాలుగా అణ్వాయుధ పోటీని నిరోధిస్తూ వస్తున్న అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని బీటలు వారుస్తుంది’’ అని ఆసియా –పసిఫిక్ లీడర్షిప్ నెట్వర్క్ (ఏపీఎల్ఎన్) అనే ప్రాంతీయ బృందం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఆ ప్రకటనపై సంతకం చేసిన వారిలో ఈ వ్యాసకర్త కూడా ఉన్నారు. ట్రంప్ అణు సంయ మనాన్ని పాటిస్తారో, లేక పరీక్షల నిషేధ ‘రెడ్ లైన్’ను ఉల్లంఘిస్తారో చూడవలసి ఉంది. అంతర్జాతీయంగా అణు సంయమనం, నిరాయు ధీకరణకు ఎల్లప్పుడూ పోరాడే భారత్ తన గొంతును తప్పనిసరిగా వినిపించవలసి ఉంది. వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
క్షమాపణ చెప్పినా బీబీసీని వదలని ట్రంప్
లండన్: గతేడాది బీబీసీలో ప్రసారమైన డాక్యుమెంటరీలో ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేయడంతో తలెత్తిన వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ హెడ్ డెబొరా టర్నెస్ రాజీనామా చేశారు. బీబీసీ చైర్మన్ సమీర్ షా కూడా చెప్పారు. అయినప్పటికీ చట్ట పరమైన చర్యల కోసం కోర్టు కెళతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. కనీసం కోటి నుంచి 5 కోట్ల డాలర్ల వరకు తాము పరిహారం కోరే అవకాశముందని శనివారం ఆయన తెలిపారు. ‘మోసానికి పాల్పడినట్లు బీబీసీయే ఒప్పుకుంది. కానీ, క్షమాపణలను చెప్పాల్సిన విధంగా చెప్పలేదు. వాళ్లు మోసం చేశారు. నేను చెప్పని మాటలను చెప్పినట్లుగా డాక్యుమెంటరీలో ప్రసారం చేశారు’అని ట్రంప్ ఆరోపించారు. 2021 జనవరి 6వ తేదీన ట్రంప్ చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేయడంలో పొరపాటు జరిగిందని, తామలా ఉద్దేశపూర్వకంగా చేయలేదని గురువారం బీబీసీ వివరణ ఇచ్చుకుంది. అయితే, పరిహారం చెల్లించేది లేదని తెలపడంపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. తాము మరోసారి ఇలాంటి తప్పిదం చేయమంటూ బీబీసీ ఇచ్చిన వివరణను సైతం ఆయన తప్పుబట్టారు. ‘మీరు చేయకపోవచ్చు, ఇతరులు చేస్తే మాత్రం ఆపరు..ఇదే కదా మీ ఉద్దేశం’అంటూ బీబీసీపై కారాలు మిరియాలు నూరారు. దావా వేయాలని తాము అనుకోవడం లేదన్న ఆయన, అలా చేయక తప్పడం లేదని వ్యాఖ్యానించారు. -
‘ఆహారం’పై టారిఫ్లు రద్దు
వాషింగ్టన్: విదేశీ ఉత్పత్తులపై టారిఫ్లతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్తంత కరుణ చూపారు. విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే పశుమాంసం(బీఫ్), కాఫీ, ఉష్ణమండల పండ్లతోపాటు ఇతర ఉత్పత్తులపై టారిఫ్లు రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అమెరికాలో ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ట్రంప్ కఠిన విధానాలపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజాగ్రహం నానాటికీ తీవ్రమవుతోంది. ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక ట్రంప్ దిగివచ్చినట్లు తెలుస్తోంది. అందుకే టారిఫ్ల రద్దు ప్రకటన చేసినట్లు సమాచారం. దీనివల్ల స్వదేశంలో ధరలు తగ్గుతాయి. అమెరికన్లకు ఊరట లభించనుంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే టారిఫ్ల కొరడా అందుకున్న సంగతి తెలిసిందే. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం బీఫ్, కాఫీ, అరటి పండ్లు, అవకాడో, టమాటాలు, కొబ్బరికాయలు, మామిడికాయలు, కోకోవా, బ్లాక్ టీ, గ్రీన్ టీ, వెనిల్లా బీన్స్, జామకాయలు, నిమ్మకాయలు, నారింజ, పైనాపిల్, జీడిపప్పు, గసగసాలు సహా 100కిపైగా ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేస్తూ సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ టారిఫ్ల రద్దు ఆదేశాలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. -
ట్రంప్, జేడీ వాన్స్ పరస్పరం విభిన్న వ్యాఖ్యలు
అమెరికాలో హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విదేశీ కార్మికుల సమస్యపై సాహసోపేతమైన ప్రకటన చేశారు. విదేశీ ఉద్యోగులను చౌక కార్మికులని పేర్కొనడంతో పాటు అమెరికాకు వారి అవసరం లేదని స్పష్టం చేశారు. సీన్ హన్నిటీతో జరిగిన పాడ్కాస్ట్ సంభాషణలో వాన్స్ మాట్లాడుతూ.. డెమొక్రాట్ మోడల్ ప్రకారం.. తక్కువ వేతనాలు తీసుకునే ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులు యూఎస్లో ఉన్నారని చెప్పారు. ఇది దేశంలోని ఉద్యోగాలు, వేతనాల శ్రేయస్సుకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అమెరికన్ కార్మికులను శక్తివంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా వారు అధిక వేతనాలు పొందుతారని, దేశం మెరుగుపడుతుందని తెలిపారు.భారతీయ టెక్నాలజీ రంగం, వైద్య రంగం నిపుణులు, వైట్ కాలర్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులుగా ఉన్న హెచ్-1బీ వీసాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంస్కరణల ప్రక్రియ మొదలైంది. ఇది గ్రీన్ కార్డ్, పౌరసత్వం కోసం భారతీయుల మార్గాలను నేరుగా ప్రభావితం చేయనుంది.వీసా సంస్కరణలుసెప్టెంబర్ 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమంది నాన్ ఇమ్మిగ్రెంట్ కార్మికుల ప్రవేశంపై పరిమితి విధించాలని భావించారు. దాంతో హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని సంస్కరించడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 21, 2025 తర్వాత దాఖలు చేసిన కొన్ని హెచ్-1బీ పిటిషన్లకు అర్హత షరతుగా అదనంగా రూ.1,00,000 డాలర్లు చెల్లించాలి. ఈ భారీ రుసుము పెంపు వీసా ప్రోగ్రామ్ లక్ష్యాన్ని, లబ్ధిదారులను గణనీయంగా ప్రభావితం చేయనుంది.ట్రంప్ వైఖరి నుంచి వాన్స్ ‘యూటర్న్’వలస ఉద్యోగులకు సంబంధించి వాన్స్ చేసిన వ్యాఖ్యలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వైఖరితో భిన్నంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో నిర్దిష్ట ప్రతిభ ఉన్న కార్మికులు లేరని చెప్పారు. ఆ కొరతను తీర్చడానికి విదేశీ ప్రతిభను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, వాన్స్ అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఈ చర్చ అమెరికన్ శ్రామిక శక్తికి కీలకం ఉంది. ఒకవైపు తక్కువ వేతనాల కోసం విదేశీ కార్మికులను తీసుకురావడం ద్వారా దేశీయ ఉద్యోగాలు దెబ్బతింటాయని విమర్శకులు భావిస్తున్నారు. మరోవైపు, ట్రంప్ సూచించినట్లుగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాల్లో ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి, ఆవిష్కరణలను కొనసాగించడానికి, తయారీ రంగంలో శిక్షణ ఇవ్వడానికి హెచ్-1బీ వీసాదారులు అవసరం అని పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు.ఇదీ చదవండి: ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్.. -
సిరియా దశ మారుతుందా?
అమెరికా అధ్యక్ష పీఠాన్ని డోనాల్డ్ ట్రంప్ దాదాపు పది నెలల క్రితం అధిరోహించాక ఎన్నో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఆ వరసలో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా రాక కూడా ఒకటి. ఒక దేశాధ్యక్షుణ్ణి మీడియా సాక్షిగా తీవ్రంగా మందలించటం, ఆయనతో వాదులాటకు దిగటంతో ట్రంప్ ఏలుబడి మొదలైంది. కానీ ఆ ‘సత్కారం’ అందుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దాన్నంతటినీ దిగమింగుకుని అనంతర కాలంలో ట్రంప్తో చేతులు కలిపి, తమ ఖనిజ సంపద అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఆయన మెప్పు పొందారు. ఇప్పుడు షరాకు రెడ్ కార్పెట్ పరచటంలోని అంతరార్థం ఏమిటో మున్ముందు తెలుస్తుంది. పైకి చెబుతున్న కారణమైతే ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)పై పోరాటానికి సంఘటితమైన 88 దేశాలతో సిరియా చేతులు కలపటానికి సిద్ధపడటం. తాము ఏమనుకుంటే మిగతా ప్రపంచం కూడా అలాగే అనుకోవాలని అమెరికా భావిస్తుంటుంది. ఏడేళ్ల క్రితం అమెరికా దృష్టిలో అల్ షరా కరుడుగట్టిన ఉగ్రవాది. అతన్ని పట్టిస్తే కోటి డాలర్లు ఇస్తామంటూ ప్రకటించింది. నిరుడు డిసెంబర్లో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆ నజారానాను ఉపసంహరించుకున్నారు. మొన్న జూలైలో షరా ఆధ్వర్యంలోని హయత్ తహ్రీర్ అల్ షామ్ (హెచ్టీఎస్)పై ఉగ్రవాద సంస్థ ముద్రను రద్దుచేశారు. సిరియాపై ఉన్న ఆర్థిక ఆంక్షలను రద్దు చేస్తామని మే నెలలో ప్రకటించటంతోపాటు సౌదీ అరేబియాలో ట్రంప్ ఆయన్ను కలుసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో షరా అధ్యక్ష హోదాలో అమెరికా సందర్శిస్తారనగా మొన్న గురువారం ఆదరాబాదరాగా భద్రతా మండలి సమావేశమై నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. చైనా మినహా మిగిలిన 14 సభ్య దేశాలూ మరో మాట లేకుండా ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. అమెరికా తాజా నిర్ణయాలు తప్పని, గత వైఖరే సరైందని ఎవరూ అనరు. కానీ తల్చుకున్నదే తడవుగా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటం, వాటికి భద్రతా మండలి వంటి సంస్థలు సైతం ఎలాంటి ప్రశ్నలూ లేవనెత్తకుండా అంగీకరించటం ఆందోళన కలిగించే అంశం. అమెరికా ఆగ్రహించినంత కాలమూ ఆ దేశంతో సంబంధాలు కలిగి ఉన్నందుకు అమెరికా తీసుకున్న చర్యలతో నష్టపోయిన దేశాల మాటేమిటి? ఇప్పుడు ఇరాన్పైనా, రష్యాపైనా ఆంక్షలున్నాయి. వాటితో వాణిజ్య సంబంధాలు నెరపుతున్నందుకు మన దేశంపై ట్రంప్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందరూ తమకు తోకల్లా ఉండాలన్నది అమెరికా విధానం. సిరియాపై అమెరికా ఆంక్షలు ఈనాటివి కాదు. గత ఎనభైయ్యేళ్లుగా... అంటే 1946లో ఆ దేశం ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందినప్పటినుంచి కొనసాగుతున్నాయి. 1979లో రీగన్, అటుతర్వాత జార్జి బుష్, ఒబామా వాటిని మరింత పెంచారు. 2003లో అమెరికా ఇరాక్ను దురాక్రమించినప్పుడు షరా పట్టుబడ్డారు. ఆయన్ను 2011 వరకూ అమెరికా జైల్లో నిర్బంధించారు. అక్కడ పరివర్తన పొంది విడుదలయ్యాక సిరియా వెళ్లి అల్ కాయిదాతో, అటుతర్వాత ఐఎస్తో చేతులు కలపటం, హెచ్టీఎస్ స్థాపించటం, 2013లో అమెరికా ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించటం చరిత్ర. షరా పలుకుబడి ఉన్న ఉత్తర సిరియా ప్రాంతంలో ఐఎస్ చీఫ్ అబూ బకర్ బగ్దాదీని 2019లో అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఆ మాటెలా ఉన్నా ప్రస్తుతం ఆయన ఏలుబడిలో గత పది నెలలుగా సిరియాలోని మైనారిటీ వర్గాలైన అలావైట్లు, డ్రూజ్లు, క్రైస్తవులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. షరా అనుకూల మిలిటెంట్ సంస్థలు ఇళ్లల్లోకి చొరబడి కాల్చిచంపటం, ఎత్తయిన భవంతుల నుంచి దూకమని హుకుం జారీచేసి ప్రాణాలు తీయటం కొన సాగుతోంది. మొన్న మార్చిలో దాదాపు 2,000 మంది ఆ హింసాకాండకు బలయ్యారు. వాటి నివారణపై ట్రంప్, షరా ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ శిథిలాల దిబ్బగా ఉన్న సిరియాలో 90 శాతంమంది పౌరులు తీవ్ర దారిద్య్రంలో మగ్గుతున్నారు. దేశ పునర్నిర్మాణానికి కనీసం 20,000 కోట్ల డాలర్లు అవసరమవుతాయని ప్రపంచ బ్యాంకు అంచనా. ట్రంప్–షరా సమావేశం తర్వాతైనా సిరియాలో సాధారణ పరిస్థితులు నెలకొని, అది ఆర్థికంగా పుంజుకుంటే మంచిదే. -
షట్డౌన్కు తెర
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43 రోజులపాటు కొనసాగిన షట్డౌన్ ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వ నిధుల బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి సంతకం చేశారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్యుల కష్టాలకు తెరపడింది. షట్డౌన్కు ముగింపు పలికే గవర్నర్మెంట్ ఫండింగ్ బిల్లు సోమవారం సెనేట్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అనంతరం అమెరికా కాంగ్రెస్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుకు అనుకూలంగా 222, వ్యతిరేకంగా 209 ఓట్లు వచ్చాయి. అధికార రపబ్లికన్ పార్టీ సభ్యులు మద్దతు ఇవ్వగా, విపక్ష డెమొక్రాట్లు బిల్లులోని కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వ్యతిరేకంగా ఓటువేశారు. అయినప్పటికీ సభలో అధికార పార్టీకి మెజార్టీ ఉండడంతో బిల్లు గట్టెక్కింది. అనంతరం గంటల వ్యవధిలోనే అధ్యక్షుడి ఆమోదం కోసం బిల్లును పంపించడం, ఆయన సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. #BREAKING: U.S. House votes to end government shutdown, 222-209. Goes now to the president. pic.twitter.com/LPySa48qUZ— CSPAN (@cspan) November 13, 2025దోపిడీకి అమెరికా లొంగదు: ట్రంప్ షట్డౌన్ కారణంగా ఉద్యోగులకు ఇన్నాళ్లూ వేతనాలు ఆగిపోయాయి. ఆఖరికి ఎయిర్పోర్టుల్లో విమానాల రాకపోకలపైనా భారీ ప్రభావం పడింది. ఆహారం కోసం ఫుడ్ బ్యాంకుల ఎదుట జనం బారులు తీరాల్సి వచి్చంది. షట్డౌన్ ఆగిపోవడంతో ఆ కష్టాలకు ఇక తెరపడినట్లే. ప్రజల కష్టాలకు డెమొక్రాట్లే కారణమని డొనాల్డ్ ట్రంప్ నిందించారు. వచ్చే ఏడాది జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయం మర్చిపోవద్దని కోరారు. విపక్ష సభ్యులు చేసిన అన్యాయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. అమెరికా ఎప్పటికీ దోపిడీకి లొంగిపోదన్న సందేశాన్ని పంపిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అమెరికన్లకు రాయితీపై చౌకగా వైద్య సేవలందించే అంశంపై అధికార, విపక్షాల మధ్య మొదలైన ప్రతిష్టంభన చివరకు షట్డౌన్కు దారితీసింది. ఈ రాయితీ ఈ ఏడాది ఆఖర్లో ముగిసిపోనుండగా, దాన్ని ఇంకా పొడిగించాలని డెమొక్రటిక్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. ట్రంప్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. అక్టోబర్ 1న షట్డౌన్ మొదలైంది. అత్యవసరం కాని సాధారణ ప్రభుత్వ సేవలకు నిధుల విడుదల ఆగిపోయింది. విపక్షాలను దారికి తీసుకురావడానికి కొందరు ఉద్యోగులను ట్రంప్ బలవంతంగా తొలగించారు. ప్రభుత్వ నిధుల బిల్లు ప్రకారం.. తొలగింపుకు గురైన ఉద్యోగులను మళ్లీ విధుల్లో చేర్చుకుంటారు. ప్రభుత్వ సేవలకు యథావిధిగా నిధులు విడుదల చేస్తారు. మరోవైపు రాయితీపై ఆరోగ్య సేవలను కొనసాగించడంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై త్వరలో చర్చలు జరుగనున్నాయి. -
నెతన్యాహును క్షమించండి.. ట్రంప్ లేఖ
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును క్షమించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. నెతన్యాహుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. కోర్టుల్లో విచారణ జరుగుతోంది. దోషిగా తేలితే పదవి నుంచి తప్పుకోవాల్సిందే.ఈ నేపథ్యంలో నెతన్యాహుకు మద్దతుగా ట్రంప్ లేఖ రాయడం గమనార్హం. నెతన్యాహుపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని ట్రంప్ పేర్కొన్నారు. ఆయనను విచారించడం న్యాయ సమ్మతం కాదని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ను శాంతి మార్గంలో నడిపిస్తున్నారంటూ నెతన్యాహును ప్రశంసించారు. మరోవైపు ఇజ్రాయెల్ అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ పెత్తనం పెరిగిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ గత నెలలో ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించారు. అప్పుడు కూడా నెతన్యాహును వెనకేసుకొచ్చారు. ఆయనను పెద్ద మనసుతో క్షమించాలని అన్నారు. -
విదేశీ ఉద్యోగులు ఉండాల్సిందే
న్యూయార్క్: విదేశీయులన్నా, హెచ్–1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్లన్నా అంతెత్తున లేచి గోలచేసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా హెచ్–1బీ వీసాదారుల ప్రాధాన్యతను గుర్తించారు. అమెరికా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తి అయిన పరిశ్రమలు, సాంకేతిక రంగంలో విదేశీ ప్రతిభావంతుల కీలకపాత్రను ఆయన తొలిసారిగా కొనియాడారు. విదేశీయుల ప్రతిభ ఖచ్చితంగా అమెరికాకు అవసరమని, హెచ్–1బీ వీసా ఉన్న విదేశీ వృత్తినిపుణులు అమెరికాకు అత్యావశ్యకమని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే అమెరికాలోని నైపుణ్యసంబంధ ఉద్యోగాలన్నీ హెచ్–1బీ వీసాదారులకే కేటాయించకుండా స్థానిక అమెరికన్లకు తగు ప్రాధాన్యతనివ్వాలని ఆయన వెనువెంటనే తనదైన శైలిలో మాట్లాడారు. బుధవారం ఫాక్స్న్యూస్ వార్తసంస్థ వ్యాఖ్యాత లారా ఇన్గ్రహామ్తో ప్రత్యేక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. లక్షలాది మంది విదేశీ కార్మీకులు వద్దు ‘‘ కేవలం స్థానిక అమెరికన్ కార్మీకులతో పని ముందుకు సాగదని నాకూ ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. అమెరికాలోకి విదేశీ ప్రతిభ రావాల్సిందే. అలాఅని ఉద్యోగాలన్నీ లక్షలాది మంది విదేశీ కార్మికులతో నింపేస్తామంటే కుదరదు. స్థానికుల్లోనూ ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. అయితే విదేశీయులకే ప్రత్యేకమైన అదనపు వృత్తి నైపుణ్యాలుంటే వాటిని స్థానిక అమెరికన్లు నేర్చుకోవాల్సిందే. స్థానికులకు నైపుణ్యం తప్పనిసరి. సెపె్టంబర్లో జార్జియా రాష్ట్రంలో దక్షిణకొరియాకు సంబంధించిన హ్యాందాయ్ ఫ్యాక్టరీల్లో అక్రమంగా అమెరికాకు వచ్చిన వలసదారులు కార్మీకులుగా పనిచేస్తున్నారు. వాళ్లను గుర్తించి అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు బహిష్కరించి స్వదేశానికి పంపేశారు. అయితే ఇక్కడ పెద్ద సమస్య వచ్చిపడింది. మేం పంపేసిన కార్మికులు బ్యాటరీలను తయారుచేయడంలో సిద్ధహస్తులు. బ్యాటరీల తయారీ అనేది అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన ప్రక్రియ. అది అంత తేలికైన పని కానేకాదు. ఏమైనా తేడాలొస్తే పేలుళ్లు జరుగుతాయి. సమస్యలు మరింత పెద్దవవుతాయి. మేం బహిష్కరించిన బ్యాటరీ తయారీ కార్మికులు ఒక ఐదారు వందల మంది ఉంటారేమో. అలాంటి వాళ్ల నుంచి స్థానిక అమెరికన్లు వృత్తి మెళకువలను నేర్చుకోవాల్సిందే. ప్రతి రంగంలోనూ విదేశీ ప్రతిభావంతుల నుంచి స్థానిక అమెరికన్లు నైపుణ్యాలను నేర్చుకోవాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగులతో క్షిపణులు అసాధ్యం నిరుద్యోగులుగా ఖాళీగా ఉన్న వాళ్లను హఠాత్తుగా ఉద్యోగాల్లోకి తీసుకుంటే సానుకూల ఫలితాల కంటే తీవ్ర ప్రతికూల ఫలితాలే వస్తాయి. ఉదాహరణకు అమెరికాపై ఆసక్తితో ఏదైనా విదేశీ కంపెనీ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఒక రక్షణరంగ కర్మాగారం స్థాపించేందుకు ఆసక్తి కనబరచిందనుకుందాం. అలాంటప్పుడు వెంటనే మేం ఖాళీగా ఉన్న నిరుద్యోగ అమెరికన్లను ఆ కొత్త ఫ్యాక్టరీలో కొలువుల్లో కూర్చోబెట్టలేం. ఐదేళ్లుగా ఎలాంటి ఉద్యోగం చేయని వ్యక్తులను కార్మీకులుగా మార్చేసి ఏకంగా క్షిపణులను తయారుచేయించలేం’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొత్త హెచ్–1బీ వీసా ఫీజును అనూహ్యంగా ఒకేసారి 1,00,000 డాలర్లకు పెంచేసి అమెరికాకు విదేశీ వృత్తినిపుణులు రాకుండా పరోక్షంగా కట్టడి చర్యలను ఆరంభించిన ట్రంప్ రెండు నెలలు తిరక్కుండానే హెచ్1బీ అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
‘పరాయి ప్రతిభ’ కోసం పోటాపోటీ!
వలస కార్మికులకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. విదేశీ ప్రతిభను ఆకర్షించడానికి దేశాల మధ్య పోటీ విస్తృతమవుతోంది. వలస కార్మికుల కోసం కెనడా భారీ ప్రణాళికను ప్రకటించగా.. విదేశీ ప్రతిభను వద్దనుకున్న అమెరికా సైతం మనసు మార్చుకుని మళ్లీ కావాలంటోంది.ఆవిష్కరణలపరంగా తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు కెనడా కీలక చర్యలు తీసుకుంది. 1,000 మందికి పైగా అగ్రశ్రేణి అంతర్జాతీయ పరిశోధకులు ముఖ్యంగా హెచ్ -1బి వీసా హోల్డర్లను లను ఆకర్షించే లక్ష్యంతో 1.7 బిలియన్ కెనడియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ తన మొదటి ఫెడరల్ బడ్జెట్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.నైపుణ్యం కలిగిన నిపుణులు, ముఖ్యంగా నిర్బంధ యూఎస్ వీసా విధానాల వల్ల ప్రభావితమైన వారి కోసం ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని కెనడా ప్రవేశపెడుతోంది. టెక్నాలజీ, హెల్త్ కేర్, నిర్మాణం వంటి అధిక-డిమాండ్ రంగాలను లక్ష్యంగా ఈ వ్యూహాత్మక ప్రణాళికను కెనాడా ప్రభుత్వం తీసుకొచ్చింది. విదేశీ ప్రతిభకు గుర్తింపునిచ్చేలా, వారు కెనడియన్ శ్రామిక శక్తిలో ఏకీకృతం అయ్యేలా వ్యవస్థల రూపకల్పనకు నిధులు వెచ్చిస్తోంది.అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడం, ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ -1బి వీసా రుసుములను పెంచేయడంతో విదేశీ ప్రతిభకు కలిగిన ఇబ్బందికర పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కెనడా ప్రణాళిక రచించింది. ఫాస్ట్-ట్రాక్ మార్గంతో పాటు, అగ్రశ్రేణి పరిశోధకులు, ఆవిష్కర్తలను నియమించుకోవడానికి బడ్జెట్ నిధులను కేటాయిస్తోంది.ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి గ్లోబల్ హబ్గా ఎదగాలన్న కెనడా ఆకాంక్షను తెలియజేస్తోంది. పరిశ్రమ నాయకులు ఈ ప్రణాళికను స్వాగతించారు. ఇది క్లిష్టమైన కార్మిక అంతరాలను భర్తీ చేయడానికి, ఏఐ, బయోటెక్, క్లీన్ ఎనర్జీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో కెనడా పోటీతత్వాన్ని పెంచడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.మనసు మార్చుకున్న అమెరికా!వలస కార్మికుల విషయంలో అమెరికా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే వలస కార్మికులపై విరుచుకుపడిన అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ (US President Trump).. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లు (రూ.88లక్షలు)కు పెంచి అమెరికాలో స్థిరపడాలనుకొనే ఉద్యోగస్థుల ఆశలపై నీళ్లు చల్లారు. వీసాల విషయంలో కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చారు.అయితే, తాజాగా ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్యూలో మాత్రం వలస కార్మికులపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్తోపాటు, రక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన వలస కార్మికులను నియమించుకోవాలన్నారు. ఆ రంగాలలో అమెరికన్లకు నైపుణ్యత లేదని అంగీకరించారు. -
టారిఫ్లను కొంత తగ్గిస్తాం : ట్రంప్ కొత్త హింట్
వాషింగ్టన్: భారత్తో న్యాయబద్ధమైన వాణిజ్య ఒప్పందం అతి సమీపంలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం ఓకే అయిన పక్షంలో భారత్ వస్తువులపై కొంతమేర టారిఫ్లను తగ్గిస్తామన్నారు. అయితే, భారత్తో కుదరబోయే ఒప్పందం, గతంలో వాటికంటే భిన్నంగా ఉంటుందన్నారు. ‘ప్రస్తుతానికి వాళ్లు నన్ను ఇష్టపడటం లేదు. ఒప్పందం కుదిరితే మళ్లీ నన్ను తిరిగి ప్రేమిస్తారు’అని వ్యాఖ్యానించిన ట్రంప్ ఇతర వివరాలను వెల్లడించలేదు. రెండు వారాల వ్యవధిలో ట్రంప్ ఇలాంటి ప్రకటన చేయడం ఇది రెండోసారి. భారత్తో ద్వైపాక్షిక ఒప్పందం అతిత్వరలోనే కుదరనుందంటూ ఇటీవల ట్రంప్ ప్రకటించడం తెల్సిందే. అయితే, తాజాగా ఆయన చేసిన ప్రకటన ఎప్పటి మాదిరిగానే అతిశయోక్తా?, లేక ఒప్పందం కోసం రెండు పక్షాల మధ్య జరుగుతున్న చర్చల్లో నిజంగానే పురోగతి ఉందా?అనేది స్పష్టం కావాల్సి ఉంది. భారత్లో రాయబారిగా నియమితులవనున్న సెర్గియో గోర్తో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణం చేయించారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ పైవ్యాఖ్యలు చేశారు. ‘చర్చల్లో వాళ్లు(భారత్) సిద్ధహస్తులు. సెర్గియో, వీలైతే ఈ విషయం నువ్వు చూసుకో’అని పేర్కొన్నారు. అదేవిధంగా, రష్యా ఆయిల్ను కొంటున్నందునే భారత్పై అత్యధికంగా టారిఫ్లు వేశామన్నారు. వాణిజ్య ఒప్పందం కుదిరిన పక్షంలో టారిఫ్లను కొంతమేర తగ్గిస్తామని చెప్పారు. ఇదే సమయంలో గత అధ్యక్షుడు బైడెన్పై పాత ధోరణిలోనే విమర్శలు గుప్పించారు. ‘బైడెన్కు భారత్ గురించి తెలియదు. అతడికి అసలేమీ తెలియదు. ఇప్పుడు మేం ఏం చేస్తున్నామో చూడండి’అంటూ బడాయిగా మాట్లాడారు(100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద) -
H1B Visa: తలొగ్గిన ట్రంప్.. మాకు వలస కార్మికులు కావాలి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస కార్మికులపై తొలిసారిగా పాజిటివ్గా స్పందించారు. అమెరికా పారిశ్రామిక, రక్షణ రంగాలలో అభివృద్ధి సాధించాలంటే ఇతర దేశాల నుంచి నైపుణ్యత గల కార్మికులను తమ దేశానికి తీసుకురావాలన్నారు. అయితే, అది పరిమిత స్థాయిలో ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు.డొనాల్ట్ ట్రంప్ ఈ పేరు వింటే చాలు ప్రపంచ దేశాలన్ని తలపట్టుకుంటున్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయంతో ఎవరిని ఇబ్బందిపెడతారో అని ఆలోచిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన తొందరపాటు నిర్ణయాలతో ప్రపంచ దేశాలను ఇబ్బందిపెట్టిన ట్రంప్.. హెచ్-1బీ వీసాలపై కూడా తన మార్క్ చూపించారు. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లు (రూ.88లక్షలు)కు పెంచి అమెరికాలో స్థిరపడాలనుకొనే ఉద్యోగస్థుల ఆశలపై నీళ్లు చల్లారు. వీసాల విషయంలో కఠిన నిబంధనలను కూడా తెరపైకి తెచ్చారు. అయితే, తాజాగా ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్యూలో మాత్రం వలస కార్మికులపై ట్రంప్ పాజిటివ్గా మాట్లాడారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్తోపాటు, రక్షణ రంగంలో నైపుణ్యత గలిగిన వలస కార్మికులను నియమించుకోవాలని తెలిపారు. ఆ రంగాలలో అమెరికన్లకు నైపుణ్యత లేదన్నారు. తమ దేశంలో ఎంతో ప్రతిభ గల యువకులనున్నారని తమ ప్రభుత్వ విధానాలతో అమెరికన్లకు వేతనాలు పెరిగే అవకాశముందని ట్రంప్ తన చర్యలను సమర్థించారు. దేశ యువత స్కిల్స్ నేర్చుకొవాలని అలా చేస్తే వారితో మిస్సైల్స్ తయారు చేయిస్తానని, దేశంలో నిరుద్యోగం లేకుండా చేయవచ్చని అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా మ్యాను ఫ్యాక్చరింగ్ సెక్టార్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నైపుణ్యత గల కార్మికులను అక్రమ వలసలు పేరుతో తొలగించడం ద్వారా తయరీ రంగంలో కార్మికుల కొరత ఏర్పడిందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా పరిస్థితులు మరింత దిగజారగ ముందే ట్రంప్ ఇలా మాట్లాడినట్టు సమాచారం. -
అమెరికా షట్డౌన్ ముగిసినట్టే!
వాషింగ్టన్: అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 41 రోజులపాటు ప్రజలను అష్టకష్టాలకు గురిచేసిన షట్డౌన్ ఎట్టకేలకు ముగింపు దశకు చేరింది. షట్డౌన్ను ముగించి, ప్రభుత్వ సేవలను మళ్లీ ప్రారంభించడానికి వీలుగా సంబంధిత బిల్లును సోమవారం సెనేట్లో ఆమోదించారు. బిల్లుకు మద్దతివ్వడాన్ని విపక్ష డెమొక్రటిక్ పార్టీలో కొందరు సభ్యులు వ్యతిరేకించారు. అయినప్పటికీ మెజార్టీ సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. అధికార రిపబ్లికన్ పార్టీతో అవగాహన కుదరడమే ఇందుకు కారణం. సెనేట్లో బిల్లుకు అనుకూలంగా 60 ఓట్లు, వ్యతిరేకంగా 40 ఓట్లు వచ్చాయి. ఇకపై కాంగ్రెస్లోని ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరిస్తుండడంతో అతిత్వరలో షట్డౌన్ ముగిసిపోనున్నట్లు తెలుస్తోంది.బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ సేవలను చాలా వేగంగా పునరుద్ధరించబోతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, షట్డౌన్ ముగింపు బిల్లును బుధవారం మధ్యాహ్నమే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిసింది. ఈ సభలో కూడా ఆమోదం పొందితే బుధవారమే షట్డౌన్కు తెరపడే అవకాశం ఉంది. గత నెలలో వార్షిక నిధుల బిల్లుకు సెనేట్ ఆమోదం తెలపకపోవడంతో దేశమంతటా షట్డౌన్ మొదలైన సంగతి తెలిసిందే.దీంతో ప్రభుత్వ సేవలు చాలావరకు నిలిచిపోయాయి. అత్యంత ముఖ్యమైన సేవలు మాత్రమే కొనసాగాయి. వేతనాలు హఠాత్తుగా ఆగిపోవడంతో ఉద్యోగుల ఇక్కట్లపాలయ్యారు. నిధులు లేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. పలు కీలక రంగాలు ప్రభావితమయ్యాయి. విమానయాన సేవలు కూడా ఆగిపోయాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
ఇది భారతీయ–అమెరికన్ల విజయం
‘భారతీయులు వెళ్లిపోవాలి’... ఇదే ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) మూకలు ఏడాదిగా చేస్తున్న నినాదం. భారతి సంతతి అమెరికన్లు వారి నినాదం విన్నారు, వెళ్లిపోయారు; కానీ ఇండియాకు కాదు. తాము ఎప్పటినుంచో మద్దతిస్తూ వచ్చి మధ్యలో వదిలేసిన డెమాక్రటిక్ పార్టీలోకి తిరిగి వెళ్లారు! న్యూయార్క్ నగర పునాదులను వారు కదిలించారు.సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ తాజా మేయర్ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయం సాధించారు. మాజీ గవర్నర్ ఆండ్రూ కుమో చిత్తుగా ఓడిపోయారు. మమ్దానీ న్యూయార్క్ మొట్టమొదటి ముస్లిం మేయర్. భారత మూలాలున్న తొలి మేయర్. ఈ వందేళ్లలో ఈ పదవికి ఎన్నికైన అతి పిన్న వయస్కుడు కూడా! మారిన రాజకీయ మొగ్గు‘అమెరికన్ డ్రీమ్’ను సాకారం చేసుకునేందుకు వచ్చిన భారతీయులు– విద్యావంతులు, కుటుంబ జీవులు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఒక ఆదర్శప్రాయమైన సమాజంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంప్రదాయికంగా మేము డెమాక్రటిక్ పార్టీ సానుభూతిపరులం. ఇటీవలి కాలంలో మాలో చాలామంది రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గడం మొదలైంది. క్రమశిక్షణ, వ్యాపార వ్యవస్థాపక సామర్థ్యం, కుటుంబ విలువల పరంగా అది మా జీవి తానుభవానికి దగ్గరగా ఉండటం, మరోవంక డెమాక్రాట్లు రాను రానూ సాంస్కృతిక పోరాటాల్లో మునిగిపోవటం ఇందుకు కారణాలు. నేను కూడా ఈ ఆకర్షణలో పడ్డాను. 1980లో అమెరికా వచ్చి నప్పటి నుంచీ నేను డెమాక్రాట్స్కే ఓటు వేశాను. గత అధ్యక్ష ఎన్ని కలకు మాత్రం దూరంగా ఉన్నాను. జో బైడెన్కు వయసు మీరడం, స్పష్టమైన దిశ కొరవడటం వల్ల ఆయన అభ్యర్థిత్వం నాకు నచ్చ లేదు. మరోవంక, రిపబ్లికన్ పార్టీ చెబుతున్నదీ కొంతవరకు సబబు గానే అనిపించింది. కుటుంబం, మతవిశ్వాసం అంశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రసంగాలు, సోషలిజం గురించి ఆయన చేసిన హెచ్చరికలు నన్ను ఆకట్టు కున్నాయి. మాలో ఇండియాలో పుట్టిపెరిగిన వారున్నారు. వారికి ‘సామ్యవాదం’ అనేది శుద్ధమైన సిద్ధాంతంగా అనిపించదు. రేషన్ క్యూలైన్లు, సరుకుల కొరతలు, ప్రజలు ఏది తినాలో ఎంత సంపా దించాలో నిర్ణయించే అవినీతిపరులైన అధికార గణం... ఇవన్నీ సామ్యవాదపు వాస్తవికతకు అద్దం పడతాయి. చెదిరిన ఆశలునాలాంటి వలసదారులకు, కింది స్థాయి నుంచి ఉన్నత స్థానా లకు ఎదిగిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ఉషా వాన్స్ వంటి వారికి రిపబ్లికన్ పార్టీ ద్వారాలు తెరుస్తుందని నేను అనుకున్నాను. కానీ గడచిన ఏడాది కాలంలో మా ఆశలు హరించుకుపోయాయి. ఒకప్పుడు ఎవరితోనైతే స్నేహం చేసిందో ఇప్పుడు వారిమీదే ‘మాగా’ ఉద్యమం నిప్పులు చెరుగుతోంది. లారా లూమర్ వంటి ఇన్ఫ్లుయె న్సర్లు ఇండియన్ ప్రొఫెషనల్స్ను లక్ష్యంగా చేసుకున్నారు. మార్జోరీ టేలర్ గ్రీన్ వంటి కాంగ్రెస్ సభ్యులు హెచ్–1బి వీసాలకు మంగళం పాడాలని పిలుపునిచ్చారు. భారతీయులు ‘అమెరికన్ల ఉద్యోగాలు దొంగిలిస్తున్నారు’ అని దుష్ప్రచారం చేశారు. సంకే తాలు స్పష్టంగా వెలువడుతున్నాయి: మేం అమెరికాకు ఎంత చేసినా, ఎప్పటికీ పూర్తి అమెరికన్లం కాబోము!అమెరికా జనాభాలో ఇండియన్ అమెరికన్లు రెండు శాతంకంటే తక్కువే ఉండొచ్చు. కానీ ప్రభుత్వ పన్నుల ఆదాయంలో వారి వాటా దాదాపు 6 శాతం. మా సగటు కుటుంబ ఆదాయం జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు. ‘ఫార్చ్యూన్ 500’ జాబితాలోని 16 కంపెనీలకు భారత సంతతి సీఈవోలే సారథ్యం వహిస్తున్నారు. వారి నాయకత్వంలోని ఈ కంపెనీల వార్షిక ఆదాయం లక్ష కోట్ల డాలర్లకు పైనే ఉంటుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలకు పట్టుగొమ్మలుగా ఉన్న చిన్న వ్యాపా రుల నుంచి యూనివర్సిటీలు, ఆసుపత్రులను నిర్వహించే సైంటి స్టులు, ఇంజినీర్లు, వైద్యుల వరకు పలు రంగాల్లో విస్తరించి ఉన్న భారత సంతతి ప్రజలు మరే ఇతర దేశాల వలసదారుల కంటే మిన్నగా అమెరికాను బలోపేతం చేస్తున్నారు. అమెరికా అభ్యున్నతికి దశాబ్దాలుగా శ్రమిస్తున్న మమ్మల్ని ‘గో హోమ్’ అనడం ద్రోహమే!భారత సంతతి అమెరికన్లకు గుండెకాయ లాంటి న్యూజెర్సీ లోని ఎడిసన్ ఓటర్లు ఈ అవమానానికి తగిన జవాబు చెప్పారు. 2024లో అక్కడి ఒక ప్రదేశం ట్రంప్కు 30 పాయింట్ల ఆధిక్యంఇచ్చింది. ఈ నెలలో, డెమాక్రాట్ మికీ షెర్రిల్ దాన్ని 76 పాయింట్ల తేడాతో గెలుచుకున్నాడు. 106 పాయింట్ల ఈ స్వింగ్కు విధానాలతో సంబంధం లేదు; ఆత్మగౌరవం తెచ్చిన మార్పు ఇది.డెమాక్రాట్లా? రిపబ్లికన్లా? ఏమైనా, పార్టీ విధేయతకు సంబంధం లేని కారణాలతోనే భార తీయ అమెరికన్లు డెమాక్రాట్ల చెంతకు తిరిగి వస్తున్నారు. ఆత్మ గౌరవం, అస్తిత్వ రక్షణ అవసరమే ఈ మార్పు తెచ్చింది. అంతేగానీ ప్రగతిశీల రాజకీయాల పట్ల మూఢభక్తి ఇందుకు కారణం కాదు.డెమాక్రటిక్ పార్టీ అన్ని వర్గాలనూ కలుపుకొనిపోవడం గురించి మాట్లాడుతుంది. అయితే, ఒకప్పడు తనకు కంచుకోటలా ఉన్న మధ్యతరగతితో ఇప్పుడు సంబంధం కోల్పోయింది. వలసదారులు పాటించే కుటుంబ విలువల నుంచి అది దూరం జరిగింది. శ్రామిక కుటుంబాల రోజువారీ బతుకు పోరాటాలను విస్మరించింది. అతి వాదుల చేతిలో ఆ పార్టీ బందీగా మారింది. సంస్కృతుల పోరా టాల్లో అది మునిగితేలుతోంది. ‘బాలికలు దుస్తులు మార్చుకునే గదుల్లో (లాకర్ రూమ్స్లో) బాలురు ఉండటం’ అనే అంశం మీద స్కూళ్లు చర్చలు నిర్వహించేదాకా పరిస్థితి వెళ్లింది. ఒకపక్క మౌలిక విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్న సమయంలో ఇలాంటి చర్చలు జరగడం పట్ల ‘నా’ లాంటి వలసదారులు సహా పలువురు అమెరి కన్ తల్లితండ్రులు దిగ్భ్రాంతి చెందారు.మమ్దానీ గెలుపు ఈ నూతన వాస్తవికత రెండు పార్శ్వాలను ప్రతిబింబిస్తోంది. ఒక సమాజపు ఆత్మవిశ్వాసం, స్వరం ఆయన ఎన్నిక వెనుక ఉన్నాయి. అదే సమయంలో, వాస్తవిక దృక్పథం లోపించిన సిద్ధాంతంతో ముడిపడిన ప్రమాదాలనూ అది వెల్లడిస్తోంది. నిత్యావసర వస్తువుల దుకాణాలు నిర్వహిస్తామన్న ఆయన వాగ్దానం దయాపూరితంగా కనబడుతుంది. కానీ, పాత కాలపు ఇండియన్ సోషలిస్టు మోడల్ గురించి తెలిసిన నా లాంటి వారికి ఈ కథ ముగింపు ఎలా ఉండబోతోందో బాగా తెలుసు. అధికార గణస్వామ్యం, జనాకర్షక విధానం స్వల్పకాలంలో ప్రశంసలు కురిపించవచ్చు. అయితే అవి ప్రగతికి శత్రువులు. నాణ్యతకు బదులు నాసిరకంలో సమానత్వం వస్తుంది.రిపబ్లికన్లకు ఇప్పటికీ అవకాశం ఉంది. అయితే వారు తమ దౌర్జన్య వైఖరిని విడనాడాలి. ఒకప్పుడు తమకు వన్నె తెచ్చిన తెగువ, యోగ్యత, ఆశావాదం వంటి విలువలను తిరిగి ఒంటబట్టించుకోవాలి. అందాకా, వారికి దూరమైన ఓటర్లు దూరంగానే ఉంటారు.వివేక్ వాధ్వావ్యాసకర్త విశ్లేషకుడు – ‘వయోనిక్స్ బయోసైన్సెస్’ సీఈఓ(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
రాష్ డ్రైవింగ్, దాడులు, దోపిడీలు : 80 వేల వీసాలు రద్దు
న్యూఢిల్లీ: రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన దేశంలోని విదేశీయులను తరిమేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు డొనాల్డ్ ట్రంప్. చిన్నచిన్న తప్పులకు కూడా వీసాలు రద్దుచేసి బలవంతంగా వారి స్వదేశాలకు పంపేస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి 80 వేల వీసాలు రద్దుచేసినట్టు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉటంకిస్తూ వాషింగ్టన్ ఎగ్జామినర్ సంస్థ పేర్కొంది. మద్యం సేవించి వాహనాలు నడపటం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, దొంగతనాల వంటి నేరాలు చేసిన వారి వీసాలను రద్దుచేసి వారిని స్వదేశాలకు పంపినట్టు తెలిపింది. రద్దుచేసిన ఈ 80 వేల వీసాలు నాన్ ఇమిగ్రేషన్ విభాగానివేనని వెల్లడించింది. ఇందులో 8 వేల వరకు విద్యార్థి వీసాలున్నాయి. అమెరికా చట్టాలను ఏమాత్రం ఉల్లంఘించినా వీసా రద్దు తప్పదని అధికారులు హెచ్చరించినట్టు వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది. ‘అమెరికా చట్టాలను ఉల్లంఘించినా, మన దేశ భద్రతకు ముప్పు కలిగించే పనులు చేసినా.. వారి వీసాలు రద్దుచేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఏమాత్రం సంకోచించదు. మా సందేశం సుస్పష్టం. అమెరికాలోకి ప్రవేశించటం హక్కు కాదు. మేం ఎల్లప్పుడూ అమెరికా ప్రజల భద్రత, ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం’అని ఇమిగ్రేషన్ విభాగం ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి టామీ పిగోట్ తేల్చి చెప్పారు. వీసాల జారీ కఠినతరం ఇప్పటికే జారీచేసిన వీసాలను వివిధ కారణాలు చూపి రద్దుచేయటంతోపాటు కొత్తగా వీసాల జారీలోనూ అమెరికా కఠిన విధానాలు అమలుచేస్తోందని రాయిటర్స్ పేర్కొంది. వీసా జారీ కోసం దరఖాస్తుదారుడి సోషల్మీడియా యాక్టివిటీని పూర్తిగా అధ్యయనం చేస్తున్నారని తెలిపింది. ఈ ఏడాది రద్దు చేసిన వీసాల్లో డ్రైవింగ్లో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినవి 16,000 ఉన్నాయి. దాడులకు పాల్పడినవారికి 12,000, దోపిడీలు చేసినవారికి 8,000 ఉన్నాయి. గడువు దాటిన తర్వాత కూడా దేశంలో ఉన్నవాళ్లు, చట్టాలను ఉల్లంఘించినవాళ్లతోపాటు ఉగ్రవాదానికి మద్దతిచ్చి దాదాపు 6,000 మంది విద్యార్థుల వీసాలు రద్దుచేసినట్టు గత ఆగస్టులు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. కరుడుగట్టిన అమెరికా జాతీయవాది, ట్రంప్ మద్దతుదారుడు చార్లీ కిర్క్ హత్యను సమరి్ధస్తూ సోషల్మీడియాలో పోస్టులు పెట్టిన ఆరుగురి వీసాలు గత నెలలో రద్దుచేసినట్టు ఓ అధికారి వెల్లడించారు. అమెరికా విదేశాంగ విధానాన్ని వ్యతిరేకించి వేలమంది వీసాలను రద్దుచేసినట్టు గత మేలో అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో స్వయంగా ప్రకటించారు. ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యంపాలస్తీనాకు మద్దతిస్తే అంతే సంగతులు.. గాజాపై ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ కొన్నాళ్లుగా అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఆందోళన జరిగాయి. దీంతో ట్రంప్ యంత్రాంగం ఆ నిరసనల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పనిచేసినా, మాట్లాడినా వీసాలు రద్దుచేయాలని విదేశాంగ శాఖ నుంచి ఇమిగ్రేషన్ విభాగానికి ఆదేశాలు వెళ్లాయని రాయిటర్స్ పేర్కొంది. వీసా దరఖాస్తు దారుల్లో పాలస్తీనా మద్దతుదారులుంటే వారి దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. -
తలొగ్గిన ట్రంప్.. ‘భారత్తో న్యాయమైన ఒప్పందం’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి తలొగ్గారు. సుంకాల విషయంలో ఆయన చేసిన తాజా ప్రకటన అందుకు నిదర్శనంగా నిలిచింది. ‘ఏదో ఒక సమయంలో సుంకాలను తగ్గించాలని అమెరికా యోచిస్తోందని, భారతదేశంతో తాము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గరగా ఉన్నామని ట్రంప్ అన్నారు. భారతదేశంతో జరుగుతున్న వాణిజ్య చర్చల గురించి విలేకరులు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తమ దేశం సుంకాలను తగ్గిస్తుందని ప్రకటించారు. రష్యాతో చమురు వ్యాపారం కారణంగా భారత్ తమ నుంచి అధిక సుంకాలను ఎదుర్కొంటున్నదని అంటూనే, న్యూఢిల్లీ.. రష్యా చమురు కొనుగోలును నిలిపివేసిందని కూడా అన్నారు. ఆగస్టులో భారత దిగుమతులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసిన కొన్ని నెలల తర్వాత అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. గత కొంతకాలంగా భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ట్రంప్ భారత్.. రష్యాతో తన చమురు వాణిజ్యాన్ని ముగించబోతున్నదని పలుమార్లు అన్నారు. VIDEO | Washington: Responding to a question during a press conference at White House, US President Donald Trump (@POTUS) said: "Tariffs high on India because of Russian oil; they've reduced Russian oil substantially, at some point will bring tariffs down."(Source: Third Party)… pic.twitter.com/UhjGRqPKxa— Press Trust of India (@PTI_News) November 11, 2025ట్రంప్ తొలిసారి ఈ ప్రకటన చేసినప్పుడు, ప్రధాని మోదీ నుండి తనకు వచ్చిన హామీ వచ్చిందని, దాని ఫలితమే ఇది అని అన్నారు. అయితే అప్పట్లో ఇరు నేతల మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని భారత్ స్పష్టం చేసింది. నేడు(మంగళవారం) జరగబోతున్న వాణిజ్య చర్చల గురించి అడిగినప్పుడు, ట్రంప్ ఇలా అన్నారు ‘మేము భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఇది గతంలో చేసుకున్న దానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం, వారు నన్ను ప్రేమించడం లేదు. అయితే ఇప్పుడు మళ్లీ మమ్మల్ని ప్రేమిస్తారు. మేము న్యాయమైన ఒప్పందాన్ని చేసుకుంటాం. మేము దగ్గరవుతున్నాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: హఫీజ్ మరో కుట్ర:‘బంగ్లా’ నుంచి భారత్పై దాడులు? -
గిలియానీ తదితరులకు ట్రంప్ క్షమాభిక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాజీ వ్యక్తిగత లాయర్ రూడీ గిలియానీ, మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ తదితరులకు క్షమాభిక్ష ప్రకటించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ శ్రేణులు ఫలితాలను ప్రభావితం చేసేందుకు యత్నించగా సహకరించినట్లు వీరిపై ఆరోపణలు న్నాయి. వీరికి అధ్యక్షుడు ట్రంప్ ‘సంపూర్ణ, బేష రతు’ క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంతకం చేశారని ప్రభుత్వ అటార్నీ ఎడ్ మార్టిన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఈ అవకాశం దక్కిన వారిలో సిడ్నీ పావెల్, జాన్ ఈస్ట్మన్ అనే లాయర్లున్నారు. వీరితోపాటు 2020 ఎన్నికల్లో ట్రంప్ తరఫున నకిలీ ఓటర్లుగా మారిన రిపబ్లికన్ పార్టీకి చెందిన కనీసం డజను మంది ఉన్నారు. కాగా, ఈ క్షమాభిక్ష ట్రంప్నకు వర్తించదని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది. -
‘మంచి’ వాతావరణమేది?
కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం పదేళ్ల క్రితం ప్యారిస్ వేదికగా కుదిరిన చరిత్రాత్మక ఒడంబడికను దాదాపు అన్ని దేశాలూ పోటీలు పడి మరీ ఉల్లంఘిస్తున్న తరుణంలో బ్రెజిల్ లోని బెలేమ్ నగరంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్–30) సదస్సు సోమవారం ప్రారంభమైంది. ప్యారిస్ ఒడంబడికలో దేశాల వాగ్దానమేమిటో, నెరవేర్చింది ఏ మేర కో చూసి లక్ష్య నిర్దేశం చేయటం కోసం ఏటా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ సదస్సు 10 రోజుల పాటు జరుగుతుంది. కానీ విషాదమేమంటే... పెద్దగా ఫలితం లేకుండానే అవి ముగిసిపోతున్నాయి. తీసుకున్న అరకొర నిర్ణయాలైనా అమలుపరిచే నాథుడు కనబడడు. అందువల్లే నిరుడు అజర్బైజాన్లోని బాకూలో కాప్–29 తరువాత పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఈసారి సదస్సుకు అనేక విధాల ప్రాముఖ్యం ఉంది. ఇంతవరకూ ఎక్కువగా యూరప్ లేదా పశ్చిమాసియా ప్రాంత దేశాల్లో ఈ సదస్సులు నిర్వహించటం రివాజు. అందుకు భిన్నంగా దక్షిణ అమెరికా ప్రాంత దేశాన్ని ఎంపిక చేసుకోవటం ఈసారి ప్రత్యేకత. అది కూడా భూగోళానికి శ్వాసకోశాలుగా పరిగణించే అమెజాన్ అడవుల ముంగిట కొలువుదీరిన నౌకాశ్రయ నగరం బెలేమ్ కావటం గమనించదగ్గది. వాతావరణ మార్పులపై చర్చించటానికి అదైతేనే ప్రతీకాత్మక వేదికవుతుందని నిర్వాహకులు అభిప్రాయపడి ఉండొచ్చు. అత్యంత దారిద్య్రం, వనరుల దుర్వినియోగం కొట్టొచ్చినట్టు కనబడే బెలేమ్ను దేశదేశాల నుంచీ వచ్చే ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షిస్తే సుస్థిరాభివృద్ధికి మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకతను అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందని కూడా వారు భావించి ఉండొచ్చు. ప్రపంచం ఇప్పుడు ప్రమాదకర వాతావరణంలోకి ప్రవేశించింది. పారిశ్రామికీ కరణకు ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 2 డిగ్రీల సెల్సియస్ లోపే పెరుగుదల ఉండేలా... వీలైతే అది 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితమయ్యేలా ప్రయత్నించాలన్నది ప్యారిస్ ఒడంబడిక కృతనిశ్చయం. కానీ 2024కే ఆ 1.5 డిగ్రీల పరిమితి దాటిపోయామని గణాంకాలు చెబుతున్నాయి. పది రోజులపాటు కొనసాగే ఈ సదస్సులో ఏదో అనుకోని అద్భుతం జరిగితే తప్ప ముంచుకురానున్న విపత్తును ఆపటం దుర్లభం. కానీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. మాట తప్పడం, సాకులు చెప్పడం అన్ని దేశాలకూ అలవాటైంది.గత ఏలుబడిలో ప్యారిస్ ఒడంబడిక నుంచి బయటికొచ్చినట్టే ఇప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తప్పుకున్నారు. ఇది ఒకరకంగా మేలేనని వివిధ దేశాలు భావిస్తున్నాయి గానీ, ట్రంప్ తన ‘బెదిరింపు దౌత్యం’తో మున్ముందు అందరినీ తన దారికితెచ్చే ప్రయత్నం చేస్తారు. గత నెలలో జరిగిన పరిణామమే ఇందుకు తార్కాణం. రవాణా నౌకల కాలుష్యాన్ని సంపూర్ణంగా అరికట్టేందుకు 100 దేశాల మధ్య అవగాహన కుదిరి, ఒడంబడికపై సంతకాలు కాబోతుండగా ట్రంప్ టీమ్ సైంధవ పాత్ర పోషించింది. సంతకాలు చేసే దేశాల నావికుల్ని అమెరికా తీరంలో అడుగు పెట్టనీయబోమని విదేశాంగ మంత్రి మార్కో రూబియో వివిధ దేశాలకు స్వయంగా ఫోన్లు చేసి బెదిరించారని ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం. ఇక సుంకాలు, ఆర్థిక ఆంక్షలు, వీసా బెదిరింపులు షరా మామూలే. దాంతో అది కాస్తా నిలిచిపోయింది. ఇప్పుడు కాప్–30కి ఆ బెడద తప్పదు.ట్రంప్ వచ్చాక అమెరికాలో హరిత ఇంధన ప్రాజెక్టులు అటకెక్కాయి. వాతావరణ మార్పు పెద్ద బోగస్ అంటూ శిలాజ ఇంధన ఆధారిత ప్రాజెక్టులకు అనుమతులిస్తున్నారు. వాతావరణ మార్పులపై గతంలో పెద్ద మాటలు మాట్లాడిన బిల్ గేట్స్ ప్లేటు ఫిరాయించారు. ‘మరీ అంత ప్రమాదమేమీ లేద’ంటూ నసుగుతున్నారు. యూరొప్ యూనియన్ డిటో. అక్కడ అందరిదీ తలో దోవ అవుతోంది. కర్బన ఉద్గారాల తగ్గింపులో మన దేశం రికార్డు కూడా ఏమంత మెరుగ్గా లేదు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా తీరాల సమీపంలోని వేడి నీటి పగడపు దిబ్బలు కనుమరుగు కావటం ప్రమాద సంకేతమని ఇటీవలే బ్రిటన్లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయం చెప్పిన నేపథ్యంలో కాప్–30 చిత్తశుద్ధితో, దృఢంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటేనే భూగోళం పది కాలాలు పచ్చగా ఉండగలదు. లేనట్టయితే ఇక సరిదిద్దుకోవటం సాధ్యపడని ప్రమాదకర స్థితికి చేరుకోవటం ఖాయం. -
నేడు వైట్ హౌస్కు అల్ ఖైదా మాజీ నేత
వాషింగ్టన్: రెండు దశాబ్దాల క్రితం అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాడిన అల్ ఖైదా మిలిటెంట్ అహ్మద్ అల్–షరా(Ahmed al-Sharaa) వైట్హౌస్లో సోమవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమవబోతున్నారు. 1946లో స్వాతంత్య్రం పొందాక ఆధునిక సిరియా అధ్యక్షుడొకరు వాషింగ్టన్ రావడం ఇదే మొదటిసారి. ఈ కీలక భేటీ కోసం ఆయన శనివారమే అమెరికా చేరుకున్నారు. సిరియాపై ఉన్న ఆంక్షల పూర్తిగా తొలగింపు, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికా నాయకత్వంలోని అంతర్జాతీయ కూటమిలో అధికారికంగా చేరడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. తిరుగుబాటు నేత నుంచి అధ్యక్షుడి దాకా అల్ షరా నాయకత్వంలోని తిరుగుబాటు దళాలు గత డిసెంబర్లో బషర్ అసద్ను గద్దెదించాయి. అంతకుమునుపు, అల్ ఖైదా నేతగా ఉన్న అల్ షరా సిరియాలోని అమెరికా బలగాలతో తలపడ్డారు. ఆయన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. ఆయన తలపై రివార్డును కూడా ఉంది. కొంతకాలం అమెరికా బలగాల నిర్బంధంలోనూ ఆయన ఉన్నారు. ఇంతలోనే చకచకా అనూహ్య పరిణామాలు సంభవించాయి. అల్ ఖైదాతో సంబంధాలు తెంచుకున్న అల్ షరా, తాజాగా అంతర్యుద్ధం కారణంగా సిరియాను దూరం పెట్టిన ప్రపంచ దేశాలతో సంబంధాలను తిరిగి నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో, మేలో సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. దీని తర్వాతే ట్రంప్ దశాబ్దాలుగా సిరియాపై కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేస్తామని ప్రకటించారు. సోమవారం వాషింగ్టన్లో ఆయన ట్రంప్తో మళ్లీ భేటీ కానున్నారు. ట్రంప్తో జరిగే చర్చల్లో అల్–షరా ప్రధానంగా సీజర్ చట్టం రద్దు కోసం ఒత్తిడి చేయనున్నారు. గత అసద్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ అమెరికా ఈ చట్టం కింద తీవ్ర ఆంక్షలను విధించింది. -
ఒక్కో అమెరికన్కు 2వేల డాలర్లు ఇస్తా
వాషింగ్టన్: విదేశాలపై సుంకాల భారం మోపడం వల్లే దేశాదాయం విపరీతంగా పెరిగిందని, తద్వారా సమకూరిన ఆదాయం నుంచి అర్హులైన అమెరికన్లకు సుంకాల డివిడెండ్గా 2,000 డాలర్లు పంపిణీ చేస్తానని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ప్రకటించారు. విదేశాలపై సుంకాలను ఇష్టారీతిగా పెంచే విచక్షణాధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుందా? అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాలు అధ్యక్షుడికి వర్తిస్తాయా? అనే అంశాలపై సుప్రీంకోర్టు లోతైన సమీక్ష జరపనున్న నేపథ్యంలో ట్రంప్ ఆదివారం ఈ మేరకు తనదైన రీతిలో స్పందించారు.సొంత సామాజిక మాధ్యమ ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ‘‘సుంకాలను వ్యతిరేకించే వాళ్లంతా మూర్ఖులు. అధిక సుంకాలతో రెవిన్యూ వసూళ్ల వరద మొదలయ్యాక మనం అత్యంత ధనిక, గౌరవప్రద దేశంగా మారాం. మన దగ్గర ద్రవ్యోల్బణం దాదాపు లేదు. స్టాక్మార్కెట్ దూసుకుపోతోంది. ట్రిలియన్ల డాలర్లు వచ్చిపడుతున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్ల అప్పులను తీర్చే ప్రక్రియ మొదలెడతా. అమెరికాలోకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. దాదాపు మిగతా వాళ్లందరికీ సుంకాల డివిడెండ్గా 2,000 డాలర్లు నేరుగా బదిలీచేస్తా’’ అనిట్రంప్ అన్నారు. -
వివేక్ రామస్వామికి డోనాల్డ్ ట్రంప్ మద్దతు
-
ట్రంప్ రాడా?.. అయితే మోదీ కచ్చితంగా వెళ్తారు
దక్షిణాఫ్రికాలో జరగబోయే టీ20 సదస్సును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిష్కరించారు. తాను మాత్రమే కాదు.. అమెరికా తరఫున ప్రతినిధులెవరూ ఆ సదస్సుకు హాజరు కాబోరని స్పష్టం చేశారాయన. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను నవంబర్ 22-23 తేదీల్లో సౌతాఫ్రికాలో జరగబోయే జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాబట్టి తనను తాను విశ్వగురుగా ప్రకటించుకున్న వ్యక్తి కచ్చితంగా ఆ సదస్సుకు వెళ్లి తీరతారు అంటూ మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ శనివారం ఓ ట్వీట్ చేశారు.ఇక.. 2014లో మోదీ ప్రధానిగా తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటిదాకా జీ20 సదస్సులన్నింటికీ హాజరవుతూ వస్తున్నారు మోదీ. బ్రిస్బేన్, అంటాల్యా, హాంగ్జౌ, హాంబర్గ్, బ్యూనస్ ఎయిర్స్, ఓసాకా, రియాద్ (కరోనా కారణంగా వర్చువల్), రోమ్, బాలి, న్యూఢిల్లీల్లో జరిగిన జీ20 సదస్సుల్లో పాల్గొన్నారు. అయితే.. ట్రంప్ నేపథ్యంతో మోదీని ఇలా జైరాం టార్గెట్ చేయడం తొలిసారేం కాదు. భారత్పై ట్రంప్ సుంకాల మోత మోగించాక.. ఈ ఇరు దేశాధినేతలు ఎదురుపడింది లేదు. మొన్నీమధ్యే కౌలాలంపూర్(మలేషియా)లో జరిగిన ఏషియన్ సదస్సు మోదీ గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారాయన. రష్యా చమురు వాణిజ్యంపై ట్రంప్ అభ్యంతరాలు, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ట్రంప్కు ఎదురు పడడం ఇష్టం లేకనే మోదీ హాజరు కాలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎద్దేవా చేశారు. అయితే.. అక్టోబర్ 26-28 తేదీల నడుమ కౌలాలంపూర్ వేదికగా ఏషియన్ సదస్సు జరిగింది. దీపావళి పండుగ నేపథ్యంతో ఈ సదస్సుకు మోదీ హాజరు కాలేకపోయారు. వర్చువల్గా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. అయితే.. ఏషియన్ సదస్సుకు అనుబంధంగా జరిగిన ఈస్ట్ ఏషియా సదస్సుకు మాత్రం భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరై ప్రసంగించారు. అంతకు ముందు.. అక్టోబర్ 13వ తేదీన ఈజిప్ట్ నగరం శర్మ ఎల్ షేక్లో జరిగిన గాజా శాంతి సదస్సుకు కూడా మోదీ గైర్హాజరయ్యారు. చివరి నిమిషంలో ఆహ్వానం అందినందువల్ల రాలేకపోతున్నాంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు.. తన తరపున ప్రత్యేక ప్రతినిధిగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్తో సందేశాన్ని పంపించారు. ఈ సదస్సు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసీ ఆధ్వర్యంలో జరిగిందన్నది తెలిసే ఉంటుంది. ఇదే వేదికగా ట్రంప్పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు గుప్పిస్తూ.. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారంటూ ప్రకటించారు కూడా. ట్రంప్ ఆరోపణలపై సౌతాఫ్రికా స్పందనఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణాఫ్రికాపై చాలాకాలంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైన కొన్నిరోజులకు.. ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను వైట్హౌజ్కు రప్పించుకుని మరీ శ్వేత జాతీయుల్ని ఊచకోత కోస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడేమో.. ఆ దేశంలో ఉన్న తెల్లజాతీయుల్ని నల్లజాతీయుల్ని హత్యలు చేస్తూ.. వాళ్ల భూములు, పొలాలు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సు నిర్వహించడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ తరుణంలో 2026లో ఫ్లోరిడాలోని మియామీలో జీ20 సదస్సుకు తాను ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ దేశంలో వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత కూడా శ్వేత జాతీయులు ఆఫ్రికన్ల కంటే మెరుగైన పరిస్థితుల్లోనే జీవిస్తున్నారంటూ చెబుతోంది. దక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1994 వరకు వర్ణవివక్ష విధానం కొనసాగింది. తెల్లవాళ్లకు (white minority) అధిక హక్కులు, అధికారం ఉండేది. నల్లజాతీయులు (Black majority) సొంతగడ్డపైనే వివక్షను ఎదుర్కొనేవారు. 1994లో నెల్సన్ మండేలా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. ఈ వివక్షకు ఫుల్స్టాప్ పడి సమానత్వం మొదలైంది. -
జీ-20 సదస్సును బహిష్కరిస్తున్నాం: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును అమెరికా బాయ్కాట్ చేస్తున్నట్టు ట్రంప్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో జీ-20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇందుకు గల కారణాలను ట్రంప్ వెల్లడించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా..‘జీ-20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగడం పూర్తిగా అవమానకరం. ఆ దేశంలో మైనార్టీలు అయిన తెల్లజాతి రైతులపై హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలు జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న దారుణాలు ప్రపంచానికి తెలియాలి. అందుకే అమెరికా జీ-20 సదస్సుల్లో అమెరికా పాల్గొనడం లేదు. జీ-20 దేశాల అధినేతల సదస్సుకు అమెరికా నుంచి ఎవరూ హాజరు కావడం లేదు. ఈ సదస్సును బహిష్కరిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.అయితే, ఇటీవల మియామిలో చేసిన ప్రసంగంలో దక్షిణాఫ్రికాను జీ-20 గ్రూప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన ట్రంప్, తాజాగా అక్కడ జరిగే సదస్సును బహిష్కరించాలని నిర్ణయించారు. కాగా, తెల్లజాతి ఆఫ్రికన్ రైతులు దక్షిణాఫ్రికాలో దాడులకు గురవుతున్నారని, అక్కడి సర్కారు వారిని రక్షించడంలో విఫలమైందంటూ ఆరోపించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన తెల్లజాతీయుల కోసం ట్రంప్ ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. వలసదారులకు ఆశ్రయం ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.ట్రంప్కు దక్షిణాఫ్రికా కౌంటర్.. అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ దేశంలో తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ నల్లజాతి ప్రజల కంటే ఎక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని స్పష్టం చేసింది. తెల్లజాతి రైతులపై వివక్ష, హింస జరుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తప్పుడు సమాచారం అందినట్లు తెలిపింది.నవంబర్ 22-23 తేదీల్లో సదస్సు.. ఇక, జీ-20 సదస్సు ఈ ఏడాది నవంబర్ 22-23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరగనుంది. ఈ సదస్సు ఆఫ్రికా ఖండంలో జరగడం ఇదే మొదటిసారి. వాస్తవానికి ట్రంప్ ఇప్పటికే తాను జీ-20 సదస్సుకు హాజరు కావట్లేదని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు వాన్స్ కూడా తన ప్రయాణాన్ని రద్దు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బహిష్కరించారు. -
భారత్-యూఎస్ వాణిజ్య చర్చలపై ట్రంప్ ఆశాభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో కొనసాగుతున్న వాణిజ్య చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలు బాగానే జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా 2026లో ఇండియా పర్యటన చేయబోతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ రష్యాతో భారతదేశ ఇంధన సంబంధాలపై ఆయన తన కఠిన వైఖరిని తెలియజేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించాలని చెప్పారు.వాణిజ్య చర్చలువైట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప వ్యక్తి, మంచి స్నేహితుడు అని ప్రశంసించారు. వాణిజ్య ఉద్రిక్తతలను పరిష్కరించడానికి విస్తృత ప్రయత్నం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘మోదీ రష్యా నుంచి చమురు కొనడం చాలా వరకు నిలిపేశారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. తన భారత పర్యటన గురించి అడిగినప్పుడు ‘మేము చర్చిస్తున్నాం. నేను అక్కడికి రావాలని మోదీ కోరుకుంటారు. నేనూ వెళ్తాను. 2026లో వెళ్లే అవకాశం ఉంది’ అని స్పందించారు.భౌగోళిక రాజకీయ సాధనంగా సుంకాలురష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా భారత్ వస్తువులపై 50% సుంకం విధించింది. ఇందులో 25% పరస్పర సుంకం కాగా, రష్యన్ చమురు కొనుగోళ్లకు అదనంగా 25% సుంకం జోడించారు. యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ ఇటీవల ఈ సుంకాలను సమర్థించారు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చే వ్యూహాత్మక చర్యగా ఆ సుంకాలను రూపొందించినట్లు చెప్పారు. ‘రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ సుంకాలను ఉపయోగిస్తున్నారు. దానివల్లే ఇండియా చమురు కొనడం ఆపండంటూ ట్రంప్ చెప్పారు’ అని అన్నారు. అయితే, భారత్ ఈ వాదనలను ఖండించింది. రష్యన్ చమురును కొనుగోలు చేయడం సార్వభౌమ నిర్ణయం అని తెలిపింది. భారత్ ఏ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించదని అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రైలులో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా? -
రహస్య అణు కార్యకలాపాలు పాక్కు అలవాటే: భారత్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అణ్వాయుధాలను రహస్యంగా పరీక్షిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. దశాబ్దాలుగా కొనసాగిస్తున్న దొంగ రవాణా, ఎగుమతి నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలు, రహస్య ఒప్పందాల చుట్టూ పాకిస్తాన్ రహస్య అణు కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉన్నాయని వ్యాఖ్యానించింది.పాకిస్తాన్ అణు బాంబు రూపకల్పనలో ప్రముఖంగా ఉన్న ఏక్యూ ఖాన్ చర్యలతోపాటు ఆ దేశం అణ్వ్రస్తాలను సమకూర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అంతర్జాతీయ సమాజాన్ని భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తోందని తెలిపింది. దొంగచాటుగా అణు పరీక్షలు జరిపిన చరిత్ర పాకిస్తాన్ సొంతమని ఎద్దేవా చేసింది. పాకిస్తాన్, చైనాలు గుట్టుచప్పుడు కాకుండా అణ్వ్రస్తాలను పరీక్షిస్తున్నందున, తాము కూడా అలా చేస్తే తప్పెలా అవుతుందని ట్రంప్ ఇటీవల సమర్థించుకోవాలని చూడటం తెల్సిందే. -
షుగర్ ఉన్నోళ్లకు నో వీసా!.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వీసాల విషయంలో సంచనల ప్రకటన చేశారు. షుగర్, ఒబెసిటీ ఉన్నవాళ్లకు యూఎస్ వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈమేరకు కొత్త గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ నిబంధనలు వెంటనే అమలు చేయాలని ఎంబసీలు, కాన్యులర్ కార్యాలయాలకు ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినట్లు.. అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.అమెరికా వీసా కోసం అప్లై చేసుకునే దరఖాస్తుదారుల ఆరోగ్య పరిస్థితిని.. ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలించేవారు. స్క్రీనింగ్ టెస్టుల ద్వారా టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నాయా? లేదా?, అనే చెక్ చేసేవారు. ఇప్పుడు తాజాగా.. డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే.. అలాంటి వారికి కూడా వీసా ఇచ్చే అవకాశం లేదు.దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిని అమెరికాలోకి ఆహ్వానిస్తే.. భవిష్యత్తులో కొన్ని సమస్యలు తలెత్తుతాయని, ఆ సమస్యలు ప్రభుత్వ ఖజానాపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. కాబట్టి కొన్ని వ్యాధులున్న దరఖాస్తుదారులు అమెరికాలోకి రానివ్వకపోతే సమస్యలకు చెక్ పెట్టినట్లే అవవుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించే.. డయాబెటిస్, ఊబకాయం ఉండే వారికి అమెరికా వీసా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.షుగర్, ఒబెసిటీ వంటి వ్యాధులకు దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది. దీనికోసం లక్షల డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కుటుంబ సభ్యులపై ఎక్కువ ఆర్ధిక భారం మోపుతోంది. దీనికి ప్రభుత్వం ఏమైనా సాయం అందించాలా?, లేకుంటే ప్రభుత్వం సహాయం లేకుండా.. కుటుంబ సభ్యులే సొంతంగా ఖర్చును భరించగలరా? అనే విషయం మీద స్పష్టత ఏర్పరచుకోవాలి. వలసదారుల వల్ల.. అమెరికాలో ఇబ్బందులు తలెత్తకూడదని ట్రంప్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంది.ఇప్పటి వరకు అనేక కారణాల వల్ల వీసాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలానే ఇన్నాయి. కానీ.. ఇప్పుడు మధుమేహం, ఊబకాయం ఉంటే కూడా అమెరికా వీసా పొందలేరు. దీన్నిబట్టి చూస్తే.. వీసాలను మరింత పరిమితం చేయడానికి ట్రంప్ కంకణం కట్టుకున్నట్లు అర్థమవుతోంది.ఇదీ చదవండి: టయోటా కీలక నిర్ణయం: 10 లక్షల కార్లపై ప్రభావం! -
ట్రంప్కు ‘శాంతి బహుమతి’?.. డిసెంబర్ ఐదున ప్రదానం
న్యూఢిల్లీ: ‘శాంతి బహుమతి’ కోసం తాపత్రయపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల త్వరలో నెరవేరబోతోంది. అయితే అది నోబోల్ నుంచి కాదు. మరో ప్రముఖ సంస్థ ఆయనను ‘శాంతి బహుమతి’తో సత్కరించనున్నట్లు సమాచారం. పైగా ఈ పురస్కారం అందుకునే తొలి ప్రముఖుడు ట్రంప్ అంటూ ఆ సంస్థ అధ్యక్షుడు పరోక్షంగా ప్రకటించారు. ఇంతకీ అది ఏ సంస్థ?.. ఎందుకు ట్రంప్కు శాంతి బహుమతి ఇస్తున్నారనే వివరాల్లోకి వెళితే..అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడా సమాఖ్య(ఫిఫా) త్వరలో తమ సంస్థ నుంచి ‘శాంతి బహుమతి’ని అందించాలని నిర్ణయించింది. దీనికి ‘ఫిఫా శాంతి బహుమతి’గా నామకరణం చేసింది. ప్రపంచంలో శాంతి, ఐక్యతల కోసం విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి, వారికి ‘ఫిఫా’ ఈ ‘శాంతి బహుమతి’ని ప్రదానం చేయనుంది. 2025, డిసెంబర్ ఐదు (శుక్రవారం)న వాషింగ్టన్ డీసీలో జరిగే 2026 ప్రపంచ కప్ డ్రా సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో తన చేతుల మీదుగా ఒక ప్రముఖునికి ‘ఫిఫా శాంతి బహుమతి’ని అందించనున్నారు.‘ఫిఫా’ తెలిపిన వివరాల ప్రకారం శాంతి కోసం విశేషంగా కృషిచేసి, ప్రపంచ ప్రజలను ఏకంచేసిన ప్రముఖుడు ఈ బహుమతిని అందుకోనున్నారు.‘అస్థిరత, విభజనలు పెరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో, సంఘర్షణలను అంతం చేయడానికి, శాంతియుత స్ఫూర్తితో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేసే వారి అత్యుత్తమ సహకారాన్ని గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఇన్ఫాంటినో అన్నారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సన్నిహిత సంబంధం కలిగిన ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో.. అమెరికా బిజినెస్ ఫోరమ్లో పాల్గొన్న సందర్బంగా విలేకరులు.. ‘ఈ బహుమతి తొలిసారిగా ట్రంప్ అందుకోబోతున్నారా?’ అని అడిగారు. దీనికి సమాధానంగా ఆయన ‘డిసెంబర్ 5న మీరంతా చూస్తారు’ అని అన్నారు. బిజినెస్ ఫోరమ్లో ట్రంప్ ప్రసంగం అనంతరం ఇన్ఫాంటినో అదే వేదికపై మాట్లాడారు. ట్రంప్ను ప్రపంచ శాంతి సాధనలో ఛాంపియన్గా తాను చూస్తున్నానని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. గాజాలో శాంతి ఒప్పందం కోసం ట్రంప్ చేసిన కృషికి గాను ఈ అవార్డుకు ఆయన ఖచ్చితంగా అర్హుడు అని ఇన్ఫాంటినో తన ఇన్స్టాగ్రామ్లో ఖాతాలో రాశారు. ఇది కూడా చదవండి: Air India Crash: ‘పైలట్ను నిందించొద్దు’: సుప్రీంకోర్టు -
వచ్చే ఏడాది భారత్కు
న్యూయార్క్/వాషింగ్టన్: వచ్చే ఏడాది భారత్లో పర్యటించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ తనకు ఆహ్వానం పంపారని గురువారం తన ఓవల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఆయన (మోదీ) నా మిత్రుడు. నాతో మాట్లాడినప్పుడు భారత్లో పర్యటించాలని కోరారు. అందుకే నేను వెళ్తున్నా. అక్కడ మోదీతో కలిసి నా పర్యటన గొప్పగా ఉండబోతోంది. ఆయన గొప్ప వ్యక్తి. బహుషా వచ్చే ఏడాది నా పర్యటన ఉండవచ్చు’అని పేర్కొన్నారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ సభ్యులుగా ఉన్న క్వాడ్ సమ్మిట్ త్వరలో భారత్లో జరుగనుంది. సదస్సు తేదీలను భారత్ ఇంకా ప్రకటించలేదు. 2024లో అమెరికాలోని డెలావేర్లో ఈ సదస్సు నిర్వహించారు. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేసిందని ట్రంప్ మరోసారి ప్రకటించారు. ‘ఇది గొప్ప విషయం. మంచిగా జరుగుతోంది. అతను (ట్రంప్) ఆపేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును చాలావరకు ఆపేశారు’అని పేర్కొన్నారు. భారత్– పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్టు మరోసారి చెప్పుకున్నారు. ‘నేను ఆపిన 8 యుద్ధాల్లో ఐదారు వరకు టారిఫ్లు విధిస్తానని బెదిరించి ఆపినవే. అందుకు ఉదాహరణ కూడా ఇస్తా. మీరు భారత్–పాక్ను గమనిస్తే.. వాళ్లు యుద్ధం మొదలుపెట్టారు. పైగా ఆ రెండు అణ్వాయుధ దేశాలు. పరస్పరం 8 యుద్ధ విమానాలు కూల్చేసుకున్నారు. గతంలో లెక్క 7 ఉండేది. ఇప్పుడు 8కి పెరిగింది. వాళ్లకు నేను ఒక్కటే చెప్పి.. మీరు ఇలాగే యుద్ధం చేసుకుంటే.. మీ ఇద్దరిపై భారీగా పన్నులు విధిస్తానని తెలిపా. దీంతో వాళ్లు వెనక్కు తగ్గి యుద్ధాన్ని విరమించారు. టారిఫ్లే లేకుంటే.. నేను ఆ యుద్ధాన్ని ఆపగలిగేవాడిని కాదు’అని ట్రంప్ పేర్కొన్నారు. -
న్యూయార్క్ ప్రజలు పారిపోవాల్సిందే.. ట్రంప్ బెదిరింపులు
-
మమ్దాని ఎవరైతే నాకేంటి?
న్యూయార్క్: అమెరికాలో పెద్ద నగరమైన న్యూ యార్క్ మేయర్గా ఎన్నికైన డెమొక్రటిక్ సోషలిస్ట్, భారతీయ అమెరికన్ యువకుడు జొహ్రాన్ మమ్దా నిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అతడి పేరు ఎదైనా కావొచ్చు, అతడు ఎవరైతే నాకేంటి? అని హేళన చేశారు. అమెరికా ప్రజలు కమ్యూనిజం కావాలో లేక కామన్సెన్స్ కావాలో తేల్చుకొనే సమయం వచ్చిందని అన్నారు. మియామీలో అమెరికా బిజినెస్ ఫోరమ్లో ట్రంప్ ప్రసంగించారు. గత ఏడాది నవంబర్ 5న అమెరికా ప్రజలు తనను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకు న్నారని, తద్వారా దేశ సార్వభౌమత్వాన్ని పునరుద్ధ రించారని చెప్పారు. కానీ, మంగళవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో సార్వభౌమత్వాన్ని కొంత కోల్పో యినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇకపై ఏదైనా జరిగితే తాను చూసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. న్యూయార్క్లో జరిగింది నిజానికి భయానక ఘటన అని అభివర్ణించారు. అలా జరగకూడదని తాను కోరుకున్నానని.. కానీ, జరిగిపోయిందని చెప్పారు. ‘‘న్యూయార్క్లో ఉన్న వ్యక్తి పేరు (మమ్దాని) ఏదైనా కావొచ్చు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతడు ఎవరైతే నాకేంటి? మహిళల క్రీడల్లో పురుషులు ఆడడం ఎలా ఉంటుందో ఆలోచించండి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. డెమొక్రటిక్ పార్టీ న్యూయార్క్లో ఒక కమ్యూనిస్ట్ని మేయర్గా ప్రతిష్టించిందని ట్రంప్ మండిపడ్డారు. అమెరికాలో కమ్యూనిజం ఏనాడూ పనిచేయలేదని గుర్తుచేశారు. సోషలిస్ట్ను కాదను కొని అదేస్థానంలో కమ్యూనిస్ట్ను తలకెత్తు కోవడం ఏమిటని ప్రశ్నించారు. అమెరికాను కమ్యూనిస్ట్ క్యూబాగా, సోషలిస్ట్ వెనుజులా మార్చడానికి తమ ప్రత్యర్థులు కుట్రలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. క్యూబా, వెనుజులాలో ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నామని చెప్పారు. డెమొక్రాట్లు అతివాదులుగా మారుతున్నారని ఆరోపించారు. కమ్యూనిజం పాలనలో ఉన్న న్యూయార్క్ నుంచి వచ్చేవారితో మియామీ శరణార్థి శిబిరంగా మారిపోతుందేమోనని డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తంచేశారు. కమ్యూనిస్ట్లు, మార్క్సిస్ట్లు, సోష లిస్ట్లు, గ్లోబలిస్ట్లతో విధ్వంసమే తప్ప ఒరిగిదేమీ ఉండదని తేల్చిచెప్పారు. తాను అధికా రంలో ఉన్నంత కాలం అమెరికా ఎట్టిపరిస్థితుల్లో కమ్యూ నిస్ట్ దేశంగా మారబోదని ట్రంప్ పేర్కొన్నారు. -
అమెరికా టెక్ కంపెనీలపై నిషేధం విధిస్తే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో సర్వీసులు అందిస్తున్న యూఎస్ టెక్నాలజీ కంపెనీలపై నిషేధం విధించే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో వ్యాపార వర్గాలు, టెక్ నిపుణుల్లో ఆందోళన మొదలైంది. ఈ ముప్పును దృష్టిలో ఉంచుకుని భారతదేశం తన సాంకేతిక స్వావలంబన (టెక్ రెసిలెన్స్)ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు నొక్కి చెప్పారు.ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో చేసిన పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘అమెరికా టెక్ ప్లాట్ఫామ్లను ఉపయోగించకుండా ట్రంప్ ఇండియాలో ఎక్స్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చాట్జీపీటీ వంటి వాటిని నిషేధిస్తే.. పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించండి. దీనికన్నా భయంకరమైంది లేదు! ఈ పరిణామాల నేపథ్యంలో భారత్కు ప్లాన్ బీ ఏమిటో ఆలోచించండి’ అని తెలిపారు. గోయెంకా అభిప్రాయాన్ని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సమర్థిస్తూ ‘నేను అంగీకరిస్తున్నాను. మనం అప్లికేషన్ స్థాయికి మించి అధికంగా టెక్నాలజీపై ఆధారపడుతున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్స్, చిప్స్, ఫ్యాబ్స్.. అన్ని విభాగాల్లో యూఎస్ టెక్నాలజీపై ఆధారపడడం పెరుగుతోంది. దీని పరిష్కరించాలంటే 10 సంవత్సరాల నేషనల్ మిషన్ ఫర్ టెక్ రెసిలెన్స్ అవసరం’ అని చెప్పారు.గోయెంకా పోస్ట్పై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. భారత్ నుంచి అమెరికా టెక్ కంపెనీలు అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ సమస్యను కేవలం యాప్లపై ఆధారపడటంలా కాకుండా టాలెంట్ సప్లై చైన్గా చూడాలని ఒక యూజర్ అన్నారు. మరో యూజర్.. ట్రంప్ భారతదేశం వంటి పెద్ద టెక్ మార్కెట్పై ఆంక్షలు విధించేంత మూర్ఖుడు కాదని, ఇది జరిగే అవకాశం లేదన్నాడు.ఇదీ చదవండి: మస్క్లాంటి వారు మాత్రమే సంపన్నులవుతారు! -
‘ఏడు కాదు ఎనిమిది’.. ట్రంప్ సరికొత్త వాదన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్-పాక్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చానంటూ పాడినపాటే పాడారు. అలాగే భారత్-పాకిస్తాన్ వివాదంలో ఏడు విమానాలు కూలిపోయాయనే నిరాధార వాదనను మళ్లీ వినిపించారు. అయితే ఈసారి విమానాల సంఖ్యను పెంచడం విశేషం. ఆ రెండు అణ్వాయుధ దేశాలతో తాము వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని బెదిరించిన తర్వాతనే అవి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయని ట్రంప్ అన్నారు.మయామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడిన ట్రంప్ తాను.. భారత్- పాక్ మధ్య శాంతి నెలకొనేందుకు మధ్యవర్తిత్వం వహించానని మరోమారు అన్నారు. ‘నాడు నేను భారత్- పాకిస్తాన్లతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నాను. ఇంతలో ఒక వార్తాపత్రిక మొదటి పేజీలో.. వారు యుద్ధానికి దిగుతున్నారని చదివాను. ఏడు విమానాలు తగలబడ్డాయి. ఎనిమిదవది చాలావరకూ ధ్వంసం అయ్యింది. మొత్తం ఎనిమిది విమానాలు కాలిపోయాయి..’ అవి రెండూ అణ్వాయుధ దేశాలు. ‘మీరు శాంతికి అంగీకరిస్తే తప్ప నేను మీతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోను’ అని నేను వారికి చెప్పాను’ అని ట్రంప్ అన్నారు.అయితే ఢిల్లీ- ఇస్లామాబాద్లు యుద్ధం ముప్పును వ్యతిరేకించాయి. ఈ ఘర్షణకు వాణిజ్య ఒప్పందాలతో సంబంధం లేదని తెలిపాయని ట్రంప్ పేర్కొన్నారు. వెంటనే తాను స్పందిస్తూ ‘మీరు అణ్వాయుధ శక్తులు. నేను మీతో వ్యాపారం చేయడం లేదు. మీరు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగినప్పుడు మేము మీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోవడం లేదు’ అని స్పష్టం చేశానని ట్రంప్ పేర్కొన్నారు. ఆ మర్నాడే ఆ రెండు దేశాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయని తనకు ఫోన్ వచ్చిందని ట్రంప్ తెలిపారు. దీంతో తాను వారితో ‘ధన్యవాదాలు.. వాణిజ్యం చేద్దాం’ అని చెప్పానన్నారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదనను భారత్ తిరస్కరించింది. పాకిస్తాన్ కమాండర్లు ఈ దాడిని ఆపాలంటూ భారత సైన్యాన్ని వేడుకున్న దరిమిలా, మే 10న కాల్పుల విరమణ జరిగిందని భారత్ స్పష్టం చేసింది. అయితే ట్రంప్.. అమెరికా మధ్యవర్తిత్వ చర్చల తర్వాతనే భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇప్పటివరకూ 60 సార్లు చెప్పారని చేశారని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పౌరులను దారుణంగా హతమార్చిన దరిమిలా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. ఈ నేపధ్యంలోనే భారత్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.ఇది కూడా చదవండి: ‘ఇక మొదలెడదాం’.. తొలి పోస్టులో మమ్దానీ -
‘ఇక మొదలెడదాం’.. తొలి పోస్టులో మమ్దానీ
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ అత్యంత ఉత్సాహంలో ఉన్నారు. తాజాగా ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో మేయర్గా తాను భవిష్యత్లో చేపట్టబోయే కార్యకలాపాలను ఒక వీడియో ద్వారా వివరించారు. తాను ఇప్పటివరకూ ప్రచారంపై పెట్టిన దృష్టిని ఇకపై పాలనవైపు మళ్లిస్తానని పేర్కొన్నారు.సమర్థవంతమైన పాలనను అందించేందుకు, అందుకు అనుగుణమైన బృందాన్ని ఏర్పాటు చేయనున్నానని, శ్రేష్ఠత, సమగ్రత, నూతన మార్గాలతో సమస్యలను పరిష్కారం దశగా అడుగులు వేయనున్నానని తెలిపారు. న్యూయార్క్ అసెంబ్లీలో క్వీన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మమ్దానీ అతి పిన్న వయస్కుడైన మేయర్గా గుర్తింపు పొందారు. తన విజయం దరిమిలా మమ్దానీ ‘ఎక్స్’ ఖాతాలో ‘2025, జనవరి ఒకటిన నేను మేయర్గా మీ ముందు ఉంటాను. నూతన సంవత్పర వేళ ఈ నగరానికి కొత్త యుగం రాబోతోంది. మంచి ట్రాక్ రికార్డులు కలిగిన ప్రభుత్వశాఖల అనుభవజ్ఞులు, విధాన నిపుణులు, నైపుణ్యం కలిగిన శ్రామికులు నగరాన్ని మెరుగుపరచడానికి ముందు వరుసలో ఉంటారంటూ’ తన ప్రభుత్వ పాలనా తీరును మమ్దానీ వివరించారు. Thank you, New York City. Together we made history.Now let’s get to work. https://t.co/G7F2sbda74 pic.twitter.com/GQABMqJHgn— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) November 5, 2025తన పాలనతో ప్రతిదీ పారదర్శకంగా ఉంటుందని మమ్దానీ ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా మమ్దానీ విజయం దేశంలోని డెమొక్రాట్లకు ఆనందాన్ని అందించింది. మరోవైపు పార్టీలో ధైర్యాన్ని పెంచింది, 2026 మధ్యంతర ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్కు హెచ్చరికగా మారింది. తన ప్రచారంలో మమ్దానీ శ్రామిక వర్గానికి పలు హామీలిచ్చారు. చిన్నారులకు ఉచిత వైద్యం, ఉచిత బస్సు రవాణా, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిరాణా దుకాణాల ఏర్పాటు తదితర హామీలను ఆయన ప్రజలకు ఇచ్చారు. మమ్దానీ తన సోషలిస్ట్ ఆదర్శాలు, ముస్లిం గుర్తింపు కారణంగా అధ్యక్షుడు ట్రంప్ నుండి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మమ్దానీ.. న్యూయార్క్ మేయర్గా విజయం సాధించి వాటిని తిప్పికొట్టారు. ఇది కూడా చదవండి: పాక్ మద్దతు.. భారత్లో మరో ఉగ్రదాడి? -
ట్రంప్.. సౌండ్ పెంచుకోండి
న్యూయార్క్: న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన జొహ్రాన్ మమ్దాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై నిప్పులు చెరిగారు. వలసదారులపై సాగిస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటానని తేల్చిచెప్పారు. రాజకీయ వారసత్వానికి కాలం చెల్లిందని స్పష్టంచేశారు. తన ఎన్నికను అణచివేత, నిరంశకుత్వంపై విజయంగా, ఒక ఆశారేఖగా అభివర్ణించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చరిత్రాత్మక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని మమ్దాని ప్రస్తావించారు. చీకటి నుంచి వెలుగులోకి, పాత యుగం నుంచి కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం అర్ధరాత్రి బ్రూక్లిన్ పారామౌంట్లో మమ్దాని వేలాదిమంది మద్దతుదారులను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. భవిష్యత్తు మన చేతుల్లోని ఉందని అన్నారు. రాజకీయ వారసత్వాన్ని, రాజవంశాన్ని కూల్చేశామని చెప్పారు. మార్పు కోసం, కొత్త తరం రాజకీయాల కోసం న్యూయార్క్ సిటీ గొప్ప తీర్పు ఇచ్చిందని ప్రశంసించారు. నూయార్క్ను మన జీవనానికి అనుకూలంగా మార్చుకోవడానికి ఈ తీర్పు వచ్చిందన్నారు. ప్రజలకు నిజాయతీగా సేవ చేసే ప్రభుత్వం కోసం తీర్పు లభించిందన్నారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య మమ్దాని ఇంకా ఏం మాట్లాడారంటే... అవినీతి సంస్కృతిని అంతం చేస్తాం ‘‘ఈరోజు మీ ముందుకు రావడం గర్వంగా ఉంది. జవహర్లాల్ నెహ్రూ మాటలు గుర్తుచేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఒక శకం ముగిసినప్పుడు.. పాత శకం నుంచి కొత్త శకం వైపు అడుగులు వేసినప్పుడు.. సుదీర్ఘకాలం అణచివేతకు గురైన ఒక జాతి ఆత్మ తన గళం వినిపించినప్పుడు.. చరిత్రలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. ఈరోజు పాత శకం నుంచి నూతన శకంలోకి ప్రవేశించాం. అందుకే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎవరూ అపార్థం చేసుకోకుండా స్పష్టంగా, సంకల్పంతో మాట్లాడుకుందాం. వలసదారులతోనే న్యూయార్క్ మరింత శక్తివంతంగా మారుతుంది. ఇకపై వలసదారుడే నగరానికి సారథ్యం వహించబోతున్నాడు. ఒక గొప్ప మార్పునకు మనం కలిసికట్టుగా నాంది పలుకుదాం. అణచివేతను ఎదుర్కొందాం. అంతులేని అధికారం అండతో వలసదారులపై పగబట్టిన డొనాల్డ్ ట్రంప్కు బుద్ధి చెబుదాం. డొనాల్డ్ ట్రంప్.. మీరు నా మాటలు వింటున్నారని నాకు తెలుసు. మీకు చెప్పడానికి నాలుగు మాటలున్నాయి. అందుకే సౌండ్ పెంచుకోండి. ధనవంతులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. ఎందరో ట్రంప్లు ప్రజలను అడ్డం పెట్టుకొని అక్రమంగా పైకి ఎదిగారు. ట్రంప్ లాంటి బిలియనీర్లు పన్నులు ఎగవేశారు. పన్ను చట్టాలను ఉల్లంఘించారు. ఇకపై అవినీతి సంస్కృతిని అంతం చేస్తాం. కార్మిక, ప్రజా సంఘాలకు అండగా ఉంటాం. కార్మికుల రక్షణలు మరింత విస్తరింపజేస్తాం. కష్టపడి పనిచేసేవారికి తగిన హక్కులు ఉండాల్సిందే. ఏ జాతి వారైనా ప్రియమైనవారే.. రాజకీయ అంధకారం నుంచి న్యూయార్క్ను వెలుగులోకి నడిపిస్తాం. మేము ప్రేమించేవారందరికీ మేము తోడుగా ఉంటాం. వారు వలసదారులైనా, ట్రాన్స్జెండర్లయినా, ఏ జాతి వారైనా మాకు ప్రియమైనవారే. ఓ నల్లజాతి మహిళను ప్రభుత్వం ఉద్యోగం నుంచి డొనాల్డ్డ్ట్రంప్ అన్యాయంగా తొలగించారు. ఆ ఒంటరి మహిళ చాలా కష్టాలు పడుతూ బతుకు పోరాటం చేస్తోంది. అందుకే ప్రజల కష్టాలు మా కష్టాలుగానే భావిస్తాం. న్యూయార్క్లో అన్ని జాతులకూ సమానమైన ఆదరణ లభిస్తుంది. ఎవరిపైనా ఎలాంటి వివక్ష ఉండదు. నగరంలో ఇస్లామోఫోబియాకు స్థానం లేదు. ముస్లింలు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, విజయం సొంతం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యువకుడిని. వృద్ధుడిగా మారినా కూడా ముస్లింగానే ఉంటాను. నేనొక డెమొక్రటిక్ సోషలిస్ట్ను. ముస్లింను అయినందుకు క్షమాపణ చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకు నిరాకరిస్తున్నా. నన్ను గెలిపించినందుకు న్యూయార్క్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధూమ్ మచాలే ధూమ్ ఇలాంటి రోజు ఒకటి ఎప్పటికీ రాదని చాలామంది భావించారు. రాజకీయాలు చాలా క్రూరంగా మారాయని అనుకున్నారు. ఆశను కోల్పోయారు. అలాంటి భయాలకు న్యూయార్క్ నేడు సమాధానం చెప్పింది. ఆశారేఖ సజీవంగానే ఉంది. అసాధ్యం సుసాధ్యం అవుతుందని ప్రజలు విశ్వసించడం వల్లే మనం గెలిచాం. వచ్చే ఏడాది జనవరి 1న మేయర్గా బాధ్యతలు స్వీకరిస్తా. నా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నన్ను తీర్చిదిద్దింది వారే. నా భార్య రమా దువాజీకి కూడా కృతజ్ఞతలు’’ అని మమ్దాని పేర్కొన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తల్లిదండ్రులు, భార్య అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ చిత్రం ‘ధూమ్’లోని ‘ధూమ్ మచాలే ధూమ్’ పాట మార్మోగిపోయింది. -
ట్రంప్కు ‘బ్యాలెట్’ షాక్!
తొమ్మిది నెలల క్రితం అధికారంలోకొచ్చింది మొదలు ఇంటా బయటా విపరీత పోకడలతో, వింత నిర్ణయాలతో బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు తొలిసారి ఓటర్లు షాకిచ్చారు. ఆయన సోషలిస్టు, కమ్యూనిస్టు అంటూ ఈసడించుకున్న 34 ఏళ్ల యువకుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్గా మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. మరోపక్క నిరుడు అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రటిక్ పార్టీకి మొహం చాటేసిన వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాలు గవర్నర్ ఎన్నికల్లో తిరిగి ఆ పార్టీ వైపు మొగ్గాయి. ఆ రెండు చోట్లా డెమాక్రాట్ల తరఫున పోటీచేసిన మహిళా అభ్యర్థులు మికీ షెరిల్, అబిగైల్ స్పాన్బెర్గర్ ఘనవిజయం సాధించారు. క్యాలిఫోర్నియాలో ప్రతినిధుల సభకూ, సెనేట్ సీట్లకూ జిల్లాల హద్దులు నిర్ణయించే పోలింగ్లో సైతం డెమాక్రాట్లదే పైచేయి. ఈ లెక్కన వచ్చే ఏడాది ప్రతినిధుల సభకూ, సెనేట్లోని కొన్ని స్థానాలకూ జరగబోయే ఎన్నికలపై రిపబ్లికన్లు ఆశ వదులుకోవాల్సి రావొచ్చు. ట్రంప్ దూకుడుతో చేష్టలుడిగిన డెమాక్రటిక్ పార్టీకి ఓటర్లే ఊపిరి పోశారని ఫలితాల సరళి చెబుతోంది. న్యూయార్క్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో 20 లక్షల మందిపైగా ఓటు హక్కు వినియోగించుకోవటమైనా, వారిలో సగంమందికి పైగా మమ్దానీ పక్షాన నిలవటం అయినా అసాధారణం. న్యూయార్క్ వందేళ్ల చరిత్రలో ఆయనది ప్రత్యేకమైన రికార్డు. ముస్లిం కావటం, భారతీయ మూలాలున్న వ్యక్తి అయివుండటం, చిన్న వయసులో కీలక పదవికి చేరుకోవటం రికార్డు. విజేతలు ముగ్గురూ కావడానికి డెమాక్రాట్లే అయినా భిన్న దృక్పథాలున్నవారు. గవర్నర్లుగా ఎన్నికైన షెరిల్, స్పాన్బెర్గర్ మధ్యేవాదులు కాగా, మమ్దానీ వామపక్ష భావాలున్నవారు. నమ్ముకున్న మధ్యేవాదాన్ని విడనాడితే తప్ప ఉనికి ఉండబోదన్న ఆందోళనలో డెమాక్రాట్లున్న తరుణంలో మొన్న ఫిబ్రవరిలో మేయర్ అభ్యర్థిత్వం కోసం పార్టీలో జరిగిన పోటీలో మమ్దానీ నిలిచారు. అప్పటికి ఆయనకు నిండా ఒక శాతం ఓట్లు కూడా లేవు. పైగా పోటీపడింది పార్టీలో సంవత్సరాలుగా పాతుకుపోయి, గవర్నర్గా ఎంతో అనుభవం గడించిన ఆండ్రూ కూమోతో. కూమోకు ఐశ్వర్యవంతుల దన్నుంది. పైగా రిపబ్లికన్లకూ, డెమాక్రాట్లకూ అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నా యూదుల ఓటు బ్యాంక్ను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్నే సమర్థిస్తారు. అలాంటి పార్టీలో మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఊచకోతను వ్యతిరేకించటం, మానవ హక్కుల హననాన్ని నిరసించటం సామాన్యం కాదు. ఆ పని మమ్దానీ చేయగలిగారు. దీంతోపాటు వలసదారులపై ట్రంప్ కత్తిగట్టడాన్ని బాహాటంగా ఖండించారు. ఇదంతా పార్టీకి చేటు తెస్తుందని స్వపక్షంలోనే అనేకులు లబలబలాడారు. కానీ మమ్దానీ దృఢంగా నిలబడ్డారు. కనీస అవసరాలైన తిండిగింజలు, గూడు, ఆరోగ్యం అందుబాటు ధరల్లో ఉండాలన్న నినాదంతో ముందు కెళ్లారు. పార్టీలో తన రేటింగ్ను డబుల్ డిజిట్కు తీసుకెళ్లారు. సర్వేల్లో సైతం ముందంజలో ఉన్నారు. దీంతో ట్రంప్ బెదిరింపులకు దిగారు. న్యూయార్క్కు ఫెడరల్ నిధులు ఆపేస్తాననీ, నగరం సర్వనాశనమవుతుందనీ హెచ్చరించారు. కానీ జనం బేఖాతరు చేశారు. వలసలపై యుద్ధం చేస్తున్న ‘మాగా’ ఉద్యమకారులు, రిపబ్లికన్లకు వారిదైన ‘రెడ్ బుక్’ రాజ్యాంగం ఉంది. దాని సాయంతో విశ్వవిద్యాలయాల్లోనూ, రోడ్లపైనా చెలరేగిపోతున్నారు. ఈ ఎన్నికల్లో వారిది చిత్రమైన అవస్థ. ట్రంప్ నేరుగా స్పందించాలా లేదా అన్నది వారు తేల్చుకోలేకపోయారు. సంప్రదాయ ఓట్లు రాలాలంటే ట్రంప్ స్పందించి తీరాలి. తీరా ఓటమి పాలైతే ట్రంప్పై రిఫరెండమ్ అవుతుంది. చివరకు ఆయన మమ్దానీపై నిప్పులు చెరిగారు. సొంత పార్టీ అభ్యర్థి సిల్వాను కాదని కూమో వైపు మొగ్గారు. కానీ వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. అందుకే ఈ ఓటమి పాపం ట్రంప్కి చుట్టుకుంది. అధికారం శాశ్వతమని విర్రవీగే దేశ దేశాల పాలకులకూ ఈ ఫలితాలు ఒక హెచ్చరిక. మందబలంతో చెలరేగితే చివరకు అధోగతేనని ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 30 రాష్ట్రాలు రిపబ్లికన్లకు నీరాజనం పట్టి ఏడాది కాలేదు. ట్రంప్ తన నియంత పోకడలతో దాన్నంతటినీ కాలదన్నుకున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత! -
ఆ సమావేశాల్లో తేలిందేమిటి?
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు ఏడు రోజులలో ఆసియాలో కీలకమైన ఆర్థిక సమావేశాలు వరుసగా జరిగాయి. జరిగింది ఆసియాలోని మలేషియా, జపాన్, దక్షిణ కొరియాలలో అయినా, అమెరికా, చైనా, రష్యా సహా ప్రపంచ దేశాలు పాల్గొన్నాయి. ఆ సమావేశాలలో జరిగిన చర్చలు, జరిగిన ఒప్పందాలు మొత్తం ప్రపంచ వాణిజ్య, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల విషయమై భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనా ధోరణులు ఏ విధంగా ఉండనున్నాయో ఆ సమావేశాలలో స్పష్టమైంది. కానీ, అగ్రస్థాయి ఆసియా దేశం అయి ఉండి, ఆర్థిక పరిమాణంలో నాల్గవ స్థానానికి చేరిన ఇండియా ప్రధాని మోదీ మాత్రం ఆ సమావేశాలలో పాల్గొనక అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకు ప్రభుత్వం అధికారికమైన వివరణ కూడా ఏమీ ఇవ్వక ఊహాగానాలకు వదలివేసి మరింత ఆశ్చర్యపరిచింది.ట్రంప్ వర్సెస్ ఇతర దేశాలుమొదట మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ‘ఆసియాన్’, ఆర్సీఈపీ (రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్), తర్వాత దక్షిణ కొరియా నగరం బూసాన్లో ఏపీఈసీ (ఆసియా– ఫసిఫిక్, ఎకనమిక్ కో–ఆపరేషన్) శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. అమెరికా, చైనా అధ్యక్షులు విడిగా సమావేశమయ్యారు. వీటి మధ్య అమెరికా అధ్యక్షుడు జపాన్ వెళ్లి అక్కడి ప్రధానితో చర్చలు జరిపారు. ‘ఆసియాన్’లో 11 దేశాలకు, ఆర్సీఈపీలో 15 దేశాలకు, ఏపీఈసీలో 21 దేశాలకు సభ్యత్వం ఉంది. మొత్తం అన్ని ఖండాలకు చెందిన ఈ దేశాలను కలిపి చూస్తే, ప్రపంచ జనాభాలో, ఆర్థిక శక్తిలో, వాణిజ్యంలో అత్యధిక భాగస్వామ్యం వాటిదే. చర్చలు, తీర్మానాలు, ఒప్పందాల చివరన రెండు ధోరణులు స్పష్టంగా తేలాయి. ఒకటి – అమెరికా తన ‘అమెరికా ఫస్ట్’ నినాదా నికి అనుగుణంగా ఆ యా దేశాలతో విడివిడిగా చర్చించి ద్వైపాక్షిక ఒప్పందాలు మాత్రమే చేసుకోవటం. చైనా మినహా మరెవరిపై సుంకాలు తగ్గించకపోవటం. ఆ యా సంస్థల సామూహిక చర్చలలో అధ్యక్షుడు ట్రంప్ అసలు పాల్గొనక పోవటం. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల పట్ల విముఖత చూపటం. ఇందుకు భిన్నంగా, అమెరికాకు సన్నిహితంగా భావించే వాటితో సహా తక్కిన అన్ని దేశాలు, ఎటువంటి మినహాయింపు లేకుండా, స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టు బడులు వర్తమాన ప్రపంచానికి తప్పనిసరి అవసరమని తీర్మానించాయి. వారిలో కొందరు ఒత్తిడి కారణంగానైతేనేమి, సైద్ధాంతిక మైత్రి వల్లనైతేనేమి అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసు కున్నారు. ప్రధానంగా అరుదైన లోహాలు, ఖనిజాలు, అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, రక్షణ, రవాణా పరికరాలకు సంబంధించి! అదే సమయంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుకూలిస్తూ, ఒత్తిడులను వ్యతిరేకిస్తూ తీర్మానించారు. పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ – ప్రొటెక్షనిజాన్నీ, ప్రపంచం తిరిగి ఆటవిక రాజ్య స్థితికి వెళ్లటాన్నీ విమర్శించారు. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలలో ఒకటైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ అయితే తాము వాణిజ్య పరంగా అమెరికాపై ఆధారపడే సాంప్రదాయిక స్థితి నుంచి దూరంగా జరగదలచుకున్నామనీ, రాగల కాలంలో అమెరికా బయటి దేశాలతో వాణిజ్యాన్ని రెట్టింపు చేయగలమనీ ప్రకటించారు. ఆ వెంటనే చైనా అధ్యక్షునితో సమావేశమై, ‘మరింత సుస్థిరమైన, సమ్మిళితమైన అంతర్జాతీయ వ్యవస్థ నిర్మాణానికి’ చైనాతో కలిసి పనిచేయగలమన్నారు. త్వరలో చైనా సందర్శనకు అంగీకరించారు.ప్రాంతీయ సంబంధాల సరళతరంవాస్తవానికి ఒకవైపు అమెరికా, మరొకవైపు తక్కిన ప్రపంచపు ఈ విధమైన ధోరణులు కొంత కాలంగా కనిపిస్తున్నవే. అది ట్రంప్కు తెలియనిది కాదు. ఆయన తన విధానాలను ఈ ఆసియా సమావేశాల సందర్భంగా మార్చుకోగలరని కూడా ఎవరూ ఆశించి ఉండరు. అయితే రెండు ధోరణులు కూడా ఈ వారం రోజుల సమా వేశాల కాలంలో మరింత స్థిర రూపం తీసుకోవటమన్నది గమనించదగ్గది. అంతా మన మంచికే అన్న సామెత వలె, ఈ పరిణామాలు ప్రపంచ దేశాల మధ్య బహుముఖ సంబంధాలు, బహుళ ధ్రువ ప్రపంచ ఆవిష్కరణకు మార్గాన్ని మరింత సుగమం చేయగలవు.ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. అవి – సాధారణంగా అమెరికా పలుకుబడి కింద పని చేస్తాయనే పేరున్న ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎంఎఫ్) ఈ సమావేశాలకు ముందు చెప్పిన మాటలు. నిబంధనలకు విరుద్ధంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల దృష్ట్యా వివిధ దేశాలు తమ ప్రాంతీయ వాణిజ్య సంబంధాలను సరళతరం చేసుకోవాలని ఐరాస వాణిజ్య విభాగం అధికారులు సూచించారు. తర్వాత ఆసియా ప్రాంతీయ ఆర్థిక పరిస్థితులపై ఐఎంఎఫ్ ఒక నివేదికను విడుదల చేస్తూ– ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధి ప్రధానంగా వాణిజ్యంపై ఆధార పడి ఉందనీ, అందువల్ల అక్కడి దేశాలు సుంకాలు కాని ఇతర వాణిజ్య ఆంక్షలను తగ్గించుకోవటం, ప్రాంతీయ వాణిజ్యాన్ని సమీ కృత పరచుకోవటం, ఆ విధంగా అమెరికా సుంకాల ఒత్తిడి నుంచి తప్పించుకోవటం, ప్రపంచ ఆర్థిక ఒడుదొడుకులను తట్టుకోవటం చేయాలనీ చెప్పింది. ఇండియా ఏం చేస్తున్నట్టు?ఇంత ముఖ్యమైన సమావేశాలకు కిందిస్థాయి అధికారులను మాత్రమే పంపిన భారత ప్రభుత్వం దీనంతటి నుంచి గ్రహించవలసింది చాలానే ఉంది. ఉదాహరణకు మనం ‘లుక్ ఈస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’ అని చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాము గానీ, ఆర్సీఈపీలో సభ్యత్వమైనా లేదు. ఆసియాన్లో సభ్యత్వం లేకున్నా ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి’ హోదా ఉంది. ‘ఆసియాన్’ కూటమితో వాణిజ్య, ఆర్థిక సంబంధాల గణనీయమైన అభివృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ ఆ పని మందకొడిగానే సాగుతున్నది. చైనా 771 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, మన వాణిజ్యం విలువ 131 బిలియన్లు మాత్రమే. భౌతికంగా, డిజిటల్ పరంగా సంబంధాలు చాలా పరిమితం. పోతే... ఐరాస, ఐఎంఎఫ్ సూచనలను అన్వయించుకుని చూస్తే – ఇండియా ఉన్న దక్షిణాసియాలో, ‘సార్క్’లో ఆర్థిక సమన్వయం, వాణిజ్య సంబంధాలు పాకిస్తాన్తో సమస్య వల్ల అథమ స్థాయిలో ఉన్నాయి. ‘బిమ్స్టెక్’ అనే మరొక సంస్థను పాకిస్తాన్ను మినహాయిస్తూ ఏర్పాటు చేసినా పరిస్థితి మెరుగుపడటం లేదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన మమ్దనీ
-
ట్రంప్ కు ఎదురుదెబ్బ.. డెమోక్రాట్ల ఘన విజయం
-
రిపబ్లికన్ల ఓటమి.. ట్రంప్ వింత సమాధానం
వాషింగ్టన్: అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని షాకిచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓటర్లు ఝలక్ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై తాజాగా ట్రంప్ స్పందించారు.అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా స్పందిస్తూ.. ఎన్నికల బ్యాలెట్ పేపర్లో ట్రంప్ ఫొటో లేదు. అమెరికాలో షట్డౌన్ ఉంది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోవడానికి ఇవే రెండు ముఖ్య కారణాలు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Nov 04, 2025, 10:05 PM ET )“TRUMP WASN’T ON THE BALLOT, AND SHUTDOWN, WERE THE TWO REASONS THAT REPUBLICANS LOST ELECTIONS TONIGHT,” according to Pollsters. pic.twitter.com/l3sMRCplPk— Fan Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) November 5, 2025 గవర్నర్, మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్ పార్టీ ఓటమివర్జీనియా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ఓటమివర్జీనియా గవర్నర్గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్వర్జీనియా తొలి మహిళా గవర్నర్గా అబిగైల్ స్నాన్బర్గర్ రికార్డుసిన్సినాటి మేయర్గా డెమోక్రాట్ అభ్యర్థి అఫ్తాబ్ పురేవాల్ గెలుపుఅట్లాంటా మేయర్గా డెమోక్రాట్ అభ్యర్థి ఆండ్రీ డికెన్స్ తిరిగి ఎన్నికపిట్స్బర్గ్ మేయర్ రేసులో డెమోక్రాట్ అభ్యర్థి కోరీ ఓకానర్ విజయం రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ..వర్జీనియాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. రిపబ్లికన్ పార్టీ సీయర్స్ ఓటమి పాలవ్వగా.. డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్నాన్బర్గర్ గవర్నర్గా ఎన్నికయ్యారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్ కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. అబిగైల్ 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో మొదటి మహిళా గవర్నర్ గా అబిగైల్ చరిత్ర సృష్టించారు.జేడీవాన్స్ తమ్ముడికీ తప్పని ఓటమి..మరోవైపు సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి తమ్ముడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీబౌమన్ కూడా ఓడిపోయారు. ఈయనపై డెమొక్రాట్ అఫ్తాబ్ పురేవాల్ గెలుపొందారు. పురేవాల్ రెండవ సారి మేయర్ గా ఎన్నికయ్యారు. తొలిసారి 2021లో మేయర్గా ఎన్నికయ్యారు. మే నెలలో జరిగిన ఆల్ పార్టీ మున్సిపల్ ప్రైమరీలో ఆయన 80% కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు. -
ట్రంప్కు భారీ షాక్.. మమ్దానీ గెలుపు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ(34) విజయం సాధించారు. ఎన్నికల్లో ముందు నుంచి మెరుగైన ఆధిక్యంలో కొనసాగిన మమ్దానీ ఘన విజయం అందుకున్నారు. మమ్దానీ విజయం నేపథ్యంలో ఆయనకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 49.6 శాతం ఓట్లు(6,77,615) పోల్ అయ్యాయి. ప్రత్యర్థి క్యూమోకు 41.6 శాతం ఓట్లు(5,68,488) వచ్చాయి. దీంతో, దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. కాగా, ఒక ఉన్నత కుటుంబం నుంచి స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య సోషలిస్ట్ అయిన మమ్దానీ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించాడు. ఏడేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. 2018లో సహజ పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక.. ఎన్నికల సందర్భంగా మంగళవారం ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చారు. నగర ఎన్నికల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు రెండు మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు వేశారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటు వేయడం ఇదే మొదటిసారి. కాగా, అక్టోబర్ 24, 28 మధ్య నిర్వహించిన మారిస్ట్ పోల్లో మమ్దానీ.. క్యూమో కంటే 16 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. రిపబ్లిక్న్ కర్టిస్ సైవా అనే సంస్థ కూడా అతనికి 16 శాతం ఆధిక్యాన్ని అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. వామపక్ష నేత అయిన జోహ్రన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విరుచుకుపడ్డారు. ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. మమ్దానీ వంద శాతం కమ్యూనిస్టు పిచ్చొడని ట్రంప్ దుయ్యబట్టడం తెలిసిందే. అయినప్పటికీ మమ్దానీ విజయం సాధించడం విశేషం. BREAKING: Democratic Socialist Zohran Mamdani wins the New York City mayoral election, Decision Desk HQ projects pic.twitter.com/iphko44pmF— Republicans against Trump (@RpsAgainstTrump) November 5, 2025మమ్దానీ హామీ..జోహ్రాన్ మమ్దానీ సామాజిక కార్యకర్త. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య రమా దువాజీ(rama duwaji). ఓ డేటింగ్ యాప్తో పరిచయమై.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఎన్నికల సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో దూసుకెళ్లారు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.‘గుజరాత్’పై మమ్దానీ వీడియో వైరల్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన 2002లో గుజరాత్లో జరిగిన ఘర్షణలపై మమ్దానీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడ ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని, చాలామందిని హత్య చేశారని మమ్దానీ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులా మోదీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ మండిపడ్డాడు. మమ్దానీ వ్యాఖ్యలపై పలువురు భారతీయులతో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ట్రంప్కు ప్రధాని మోదీపై గౌరవం అందుకే..’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత్పై ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఒక వార్త ఇప్పుడు హైలెట్గా నిలిచింది. అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తరచూ మాట్లాడుతుంటారని, ఆయన ఇరు దేశాల వాణిజ్య చర్చలను కొనసాగిస్తారని వైట్ హౌస్ ప్రకటించింది.‘అధ్యక్షుడు, ఆయన వాణిజ్య బృందం భారతదేశంతో చర్చలు జరుపుతోందని, ప్రధాని మోదీపై అధ్యక్షునికి అమితమైన గౌరవం ఉందని, వారు తరచూ మాట్లాడుకుంటారని’ వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ విలేకరులతో అన్నారు. ట్రంప్ త్వరలో దక్షిణ కొరియాలో జరిగే సమావేశంలో భారతదేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నారని కరోలిన్ లీవిట్ తెలిపారు.కాగా భారత్.. రష్యన్ చమురు కొనుగోళ్లకు ప్రతిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత దిగుమతులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. మాస్కోలోని రెండు ప్రధాన ముడి చమురు ఎగుమతిదారులైన రోస్నెఫ్ట్, లుకోయిల్లపై వాషింగ్టన్ గత వారంలో ఆంక్షలు విధించింది. ఈ నేపధ్యంలో భారత శుద్ధి కర్మాగారాలు రష్యన్ చమురు దిగుమతులను తగ్గించాయి.ఇది కూడా చదవండి: మళ్లీ భారత్ను టార్గెట్ చేసిన ట్రంప్ -
మళ్లీ భారత్ను టార్గెట్ చేసిన ట్రంప్
వాషింగ్టన్: రష్యా , ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్, చైనాలు కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరువైపులా అణ్వాయుధ ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నందున ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమని ‘సీబీఎస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అలాగే తాను అమెరికా దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సమర్థించుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సీబీఎస్’కు 60 నిమిషాలపాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 33 ఏళ్ల నిషేధం తర్వాత అమెరికన్ దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ తాను ఆదేశాలు జారీ చేశానన్నారు. చైనా, పాకిస్తాన్ ఇప్పటికే రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అన్నారు. అయితే ఆ దేశాలు ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదని, తాము అందుకు భిన్నమని అన్నారు. ఉత్తర కొరియా, పాకిస్తాన్ పరీక్షలు చేస్తున్నాయనే సమాచారం తమవద్ద ఉందన్నారు. భారత్, పాక్లు గత మే నెలలో అణు యుద్ధం అంచునకు చేరాయని, అయితే తాను వాణిజ్యం, సుంకాలతో దానిని అడ్డుకున్నానని అన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోకపోతే లక్షలాది మంది చనిపోయేవారని ట్రంప్ పేర్కొన్నారు.ఆ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు భూగర్భంలో పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ పరీక్షలతో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అయితే కంపనం అనుభూతి మాత్రం కలుగుతుంది. గ్లోబల్ మానిటరింగ్ స్టేషన్లు భూగర్భ అణు పేలుళ్ల వల్ల కలిగే భూకంపం లాంటి కంపనాలను గుర్తిస్తాయి. అటువంటి పరీక్షలను రహస్యంగా నిర్వహించవచ్చని, వాటిని గుర్తించలేమని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ చైనా, పాకిస్తాన్లు అణ్వాయుధాలను పరీక్షిస్తుంటే, అది భారతదేశాన్ని మరింత అస్థిరంగా మారుస్తుందని ట్రంప్ పరోక్షంగా పేర్కొన్నారు. -
పాక్ చైనా అణుపరీక్షలు చేస్తున్నాయి
వాషింగ్టన్: దశాబ్దాల క్రితంనాటి తొలితరం అణుబాంబు ధాటికే హిరోషిమా, నాగసాకి నగరాలు తుడిచిపెట్టుకుపోయిన దారుణోదంతాలను చవిచూసిన ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో చెడువార్తను మోసుకొచ్చారు. గత ఒడంబడికలను బుట్టదాఖలుచేస్తూ ఇకపై తాము అణుపరీక్షలు చేపడతామని ట్రంప్ సోమవారం ప్రకటించారు. తాము మాత్రమే అణుపరీక్షలు చేయట్లేమని, ఇప్పటికే పాకిస్తాన్, చైనా ఈ పని మొదలెట్టాయని ఆయన కొత్త విషయం చెప్పారు. సీబీసీ న్యూస్ ఛానల్ వారి నోరా ఓ డేనియల్ ఇంటర్వ్యూలో ట్రంప్ పలు విషయాలను వెల్లడించారు. ‘‘ రష్యా అణు పరీక్షలు చేస్తోంది. చైనా తక్కువేం తినలేదు. అదికూడా అణుపరీక్షలు చేస్తోంది. ఈ విషయాన్ని అవి బహిరంగంగా చెప్పట్లేవు. మేం అలా కాదు. మేం అన్నీ చెప్పేస్తాం. అమెరికా సైతం అణుపరీక్షలు చేయబోతోంది. ఎందుకంటే వాళ్లంతా చేస్తున్నారుగా. ఉత్తర కొరియా ఇప్పటికే అణుపరీక్షలు చేసేసింది. పాకిస్తాన్ ఇప్పుడు చేస్తోంది’’ అని ట్రంప్ చెప్పారు. ‘‘ కొన్ని దేశాలు తమ అణు పరీక్షల వివరాలను బహిర్గతంచేయట్లేవు. ఆ అణుపరీక్షలు భూగర్భంలో జరుగుతున్నాయో. దాంతో అవి ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయో ఎవరికీ తెలీవు. కేవలం సూక్ష్మస్థాయిలో ప్రకంపనలు మాత్రమే వస్తాయి. ఈ నేపథ్యంలో అమెరికా పరీక్షలు జరపడం సబబే’’ అని ట్రంప్ తన నిర్ణయాన్ని సమరి్థంచుకున్నారు. ‘‘అణ్వాయుధాలను తయారుచేశాక వాటిని పరీక్షించకుండా ఉంటే ఎలా? అవి పనిచేస్తున్నాయో లేదో తెలియాలంటే పరీక్షించాలి కదా. అయినా ఇతర దేశాలు అణుపరీక్షలు జరుపుతూ అణ్వ్రస్తాలను పెంచుకుంటున్నాయి. అమెరికా సైతం తగు నిల్వలను సముపార్జించాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్కు పొంచి ఉన్న ముప్పు చైనా, పాక్లు కొత్తగా అణుపరీక్షలు జరుపుతోందన్న ట్రంప్ వ్యాఖ్యలతో సరిహద్దున పొరుగుదేశంతో భారత్కు అణుముప్పు పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే భారత్ కంటే అత్యధికంగా చైనా వద్ద ఏకంగా 600 అణ్వాయుధాలు ఉన్నాయి. మరో ఐదేళ్లలో వీటి సంఖ్య 1,000కి చేరుకోనుంది. పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలున్నాయి. భారత్ వద్ద 180 అణువార్హెడ్లు ఉన్నాయి. అంతర్జాతీయ అధికారిక రికార్డ్ల ప్రకారం రష్యా 1990తర్వాత అణుపరీక్షలు జరపలేదు. చైనా 1996 తర్వాత, భారత్ 1998 మే తర్వాత అణుపరీక్షలు చేయలేదు. -
యుద్ధంలోకి అమెరికా?.. వణికిపోతున్న ప్రపంచం
చరిత్ర మళ్లీ తన రక్తపు పుటలను తిరగేస్తోంది. మరో యుద్ధం మన కళ్ల ముందు పుడుతోంది. ఈసారి ఇది చిన్న దేశాల మధ్య కాదు.. ఏకంగా అమెరికా యుద్ధరంగంలోకి అడుగుపెడుతోందన్న వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. వెనిజులా తీరప్రాంతాల్లో సముద్రం మంటల్లో కరిగిపోతున్న వేళ.. అమెరికా నౌకాదళం పేల్చిన బుల్లెట్లు ఆకాశాన్ని ఎర్రగా మార్చేశాయి. ఇది మాదకద్రవ్యాల నౌక అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. వెనిజులా మాత్రం ఇది తమ ప్రజల నౌక అని గట్టిగా చెబుతోంది. ఆ అగ్నిజ్వాలల మధ్య మానవ శరీరాలు ముక్కలై పోయాయి. ఇటు వెనిజులా డిక్టెటర్ నికోలాస్ మడూరో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాస్కో, బీజింగ్, టెహ్రాన్కి రహస్య పత్రాలు పంపించారు. ఆయుధాలు, క్షిపణులు పంపాలని రష్యా, చైనా, ఇరాన్ దేశాలను కోరారు. వెనిజులా కోసం రష్యా ఇప్పటికే రాడార్లను సిద్ధం చేస్తోందని సమాచారం.. ఇటు చైనా తన సాంకేతికతను పరిశీలిస్తుంటే.. అటు ఇరాన్ తన డ్రోన్లను గాల్లోకి ఎగరేస్తోంది. మరోవైపు ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఓ భారీ స్టేట్మెంట్ వదిలారు. మడూరో తన చివరి రోజులు లెక్కబెట్టుకుంటున్నారని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.యుద్ధ క్షేత్రంలా కరేబియన్ సముద్రంఇటు కరేబియన్ సముద్రం యుద్ధ క్షేత్రంలా మారిన సమయంలో.. అమెరికా నౌకలు వరుసగా కదులుతున్నాయి. ఆకాశంలో ఫైటర్ జెట్లు తిప్పుకుంటున్నాయి. ఈ మొత్తం పరిణామాలను ప్రపంచం ఊపిరిబిగపట్టి చూస్తోంది. ఒకవైపు అమెరికా శక్తి.. మరోవైపు రష్యా, చైనా, ఇరాన్ మిత్రబలగాలు...! ఏ క్షణానైనా మొదటి క్షిపణి ప్రయాణించే అవకాశం ఉంది. ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు అంచనా ప్రపంచాన్ని మళ్లీ అగ్నిగుండంలోకి నెట్టేసే ఛాన్స్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మరోసారి యుద్ధపు నీడలోకి జారిపోతోంది. దశాబ్దాల క్రితమే..నిజానికి అమెరికా-వెనిజులా మధ్య ఘర్షణ ఈరోజు పుట్టిన గొడవ కాదు. దశాబ్దాల క్రితమే ఈ మంటలు మొదలయ్యాయి. 1999లో హ్యుగో చావెజ్ అధికారంలోకి వచ్చారు. ఆయన అమెరికా ఆధిపత్యాన్ని బహిరంగంగా సవాలు చేశారు. వెనిజులా ఆయిల్ సంపదను ప్రజల కోసం ఉపయోగిస్తానని ప్రకటించడం.. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆ నాడు కుదిపేసింది. అప్పటి నుంచే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. చావెజ్ తర్వాత మడూరో బాధ్యతలు స్వీకరించగానే అమెరికా ఆంక్షల వర్షం కురిపించింది. ఇక 2019లో మడూరోను అధ్యక్షుడిగా అంగీకరించకుండా జువాన్ను వెనుజులా ప్రెసిడెంట్గా అమెరికా గుర్తించింది. అమెరికా ఆంక్షలతో ఒకప్పుడు బలంగా నిలిచిన దేశం.. ఆ తర్వాత ఆకలితో విలవిల్లాడే స్థితికి చేరింది. ఆయిల్ నిల్వలు ఉన్నా వాటిని అమ్మే దేశాలు లేకుండాపోయాయి. కరెన్సీ విలువ నేలమట్టమైన సమయంలో... దేశం ఆర్థికంగా కూలిపోయింది. అయితే మడూరో వెనక్కి తగ్గకుండా.. రష్యా, చైనా, ఇరాన్ వైపు తిరిగారు.సరిహద్దు సముద్రంలో పేలుళ్లుఇక 2025లో అమెరికా వెనిజులా మధ్య సరిహద్దు సముద్రంలో పేలుళ్లు మొదలయ్యాయి. అమెరికా సైన్యం వెనిజులా నౌకలపై అనేకసార్లు దాడుల చేసింది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో వెనుజులా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత మడూరో ప్రజల ముందు వచ్చి అమెరికాను నేరుగా హెచ్చరించారు. అదే సమయంలో రష్యా, చైనా, ఇరాన్ నాయకులతో అత్యవసర చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయి. వెనిజులాకు క్షిపణి వ్యవస్థలు అందించడానికి పుతిన్ సర్కార్ అంగీకరించింది. రాడార్ నెట్వర్క్ విస్తరణకు చైనా సహకరిస్తానని చెప్పగా.. ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీని అందిస్తానని ప్రకటించింది. ఈ చర్యలతో అమెరికా మరింత కఠినంగా మారింది. ఈ మూడు దేశాల చర్యలను నార్కో టెరరిజంగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అమెరికా నౌకాదళం.. కరేబియన్ సముద్రంలో తన సైనిక బలగాలను రెండింతలు పెంచింది. రహస్య గూఢచార వాహనాలు వెనిజులా గగనతలంలో ఇప్పటికే తిరుగుతున్నాయని సమాచారం.అమెరికా ఆధిపత్యానికి సవాలుఇక రష్యా, చైనా, ఇరాన్ ఈ ఘటనను అమెరికా ఆధిపత్యానికి సవాలుగా చూస్తున్నాయి. వెనిజులా తమకు వ్యూహాత్మక కేంద్రంగా మారుతుందని భావిస్తున్నాయి. రష్యా ఇప్పటికే నౌకాశ్రయ ఒప్పందం సిద్ధం చేసుకుంది. చైనా.. వెనిజులా ఆయిల్ బాకీలకు బదులుగా మిలిటరీ సదుపాయాలు కోరుతోంది. ఇరాన్.. వెనిజులాలోని గగనతల కేంద్రాలను డ్రోన్ నియంత్రణ స్థావరాలుగా మార్చే పనిలో ఉంది. ఇటు ఈ మొత్తం వ్యవహారంలో లాటిన్ అమెరికా అంతా ఆందోళనలో నిండిపోయింది. బ్రెజిల్, కొలంబియా, పెరూ దేశాలు భయంతో మౌనంగా ఉండిపోయాయి. ఇటు యూరప్తో పాటు యునైటెడ్ నేషన్స్ ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ..ట్రంప్ గారు వెనక్కి తగ్గేలా కనిపించడంలేదండి. ఇలా చూస్తే.. ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త యుద్ధం అంచున నిలబడి ఉందనే చెప్పవచ్చు. ఒకవైపు అమెరికా ఆధిపత్యం, మరోవైపు రష్యా-చైనా-ఇరాన్ కూటమి. ఎవరు వెనక్కి తగ్గినా అది ఓటమే అవుతుంది.. ఎవరు ముందుకు కదిలినా అది యుద్ధానికి ప్రారంభమవుతుంది..! మరి చూడాలి ఏ క్షణాన ఏం జరుగుతుందోననే టెన్షన్ మాత్రం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: రోజుకు 15 మందిని చంపేస్తున్న అతివేగం -
ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. క్రైస్తవులను అన్యాయంగా చంపేస్తూ చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపిస్తూ ఆఫ్రికన్ దేశం నైజీరియాపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు సైనిక చర్య తప్పదంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్యే నైజీరియాను అమెరికా ‘కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్’ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న హింసపై తీవ్రంగా స్పందించారు. ఫ్లోరిడాలో ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. నైజీరియాలో క్రైస్తవులను రికార్డు స్థాయిలో హత్య చేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలోనే చంపుతున్నారు. నైజీరియాలో క్రైస్తవులు తీవ్ర ముప్పులో ఉన్నారు. ఇక మీదట అలా జరగనివ్వబోను. అవసరమైతే అమెరికా బలగాలను మోహరిస్తాం. వైమానిక దాడులు జరుపుతాం. ఇప్పటికే యుద్ధ విభాగానికి(Department of War) ఆదేశాలు కూడా జారీ చేశాను’’ అని తీవ్ర హెచ్చరికలే జారీ చేశారాయన. అంతకు ముందు.. శుక్రవారం కూడా ఆయన ఇలాగే మాట్లాడారు. నైజీరియాలో క్రైస్తవత్వం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ హింసకు రాడికల్ ఇస్లామిస్టులు కారణమని ఆయన ఆరోపించారు. ఇది ఆగకపోతే నైజీరియాకు అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తానని హెచ్చరిస్తూనే.. గన్స్-అ-బ్లేజింగ్ అంటూ అమెరికా సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు. సీపీసీ అంటే..తాజాగా నైజీరియాను కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్(CPC) జాబితాలో చేర్చారు. ఆ వెంటనే ఆ జాబితా వెలువడడం గమనార్హం. సీపీసీని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తయారు చేస్తుంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం (International Religious Freedom Act - IRFA) 1998 ప్రకారం.. ప్రతి ఏటా ఈ జాబితాను రివైజ్ చేస్తుంటారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి (U.S. Secretary of State) ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ జాబితాలో మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న దేశాలు ఉంటాయి. మతపరమైన హింస, వివక్ష, బలవంతపు మత మార్పిడిలు, మతపరమైన హక్కుల హననంలాంటి అంశాల ఆధారంగా ఈ లిస్ట్ రూపొందిస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల మినహాయింపులు ఇవ్వవచ్చు. నైజీరియాతో పాటు చైనా, మయన్మార్, ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.నైజీరియా స్పందనఉగ్రవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు నైజీరియా అధ్యక్షుడు బోలా టిన్బు వ్యాఖ్యానించారు. అయితే.. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవం ఇవ్వాలని కోరారు. ‘‘ఆయన నైజీరియా పట్ల సానుకూలంగా ఉన్నారనే భావిస్తున్నాం. ఇరు దేశాధినేతలు కూర్చుని మాట్లాడుకుంటే.. ఉగ్రవాదాన్ని అణచివేయడం అంత కష్టమేమీ కాదు. ఆయన్ని త్వరలోనే మా అధ్యక్షుడు కలవాలనుకుంటున్నారు’’ అంటూ అధ్యక్ష సలహాదారు డేనియల్ బ్వాలా చెబుతున్నారు. నైజీరియాలో ఏం జరుగుతోందసలు.. నైజీరియాలో బోకోహరాం, ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్( ISWAP) వంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు గత కొంతకాలంగా హింసాత్మక చర్యలు కొనసాగిస్తున్నాయి. వీటికి తోడు రైతులు గొర్రెల కాపరులు మధ్య ఘర్షణలు.. మతపరమైన, జాతిపరమైన రూపం సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే క్రైస్తవులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా..ప్లాటూ, బెన్యూ, కడునా రీజియన్లలో క్రిస్టియన్లపై దాడులు పరిపాటిగా మారాయి. నైజీరియన్ సంస్థల కథనాల ప్రకారం.. 2019 నుంచి ఇప్పటిదాకా 600 మంది క్రైస్తవులు దారుణ హత్యకు గురయ్యారు ఇక్కడ. అయితే.. కొన్ని గ్లోబల్ సంస్థలు మాత్రం ఆ సంఖ్య 7,000 దాకా ఉండొచ్చని చెబుతున్నాయి. అలాగే లక్షల మంది నిరాశ్రయులయ్యారని అంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అంతర్యుద్ధాల కారణంగా అవి ఫలించడం లేదు. -
‘ట్రంప్ ఏం చేస్తారో..’: ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో జరుగుతున్న ఘటనలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత కాలంలో అన్నింటా అనిశ్చితి పెరిగిపోయిందని, సైబర్ సవాళ్లు మరింత వేగవంతం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, ట్రంప్ ఈ రోజు ఏమి చేస్తారో? రేపు ఏమి చేయబోతున్నారో అతనే చెప్పలేరని ద్వివేది వ్యాఖ్యానించారు.మధ్యప్రదేశ్లోని రేవాలో గల టిఆర్ఎస్ కళాశాలలో విద్యార్థులతో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, నేటి కాలంలో అనిశ్చితి సాధారణమైపోయిందని, భద్రత, సైబర్ యుద్ధం లాంటి సవాళ్లు వేగంగా చుట్టుముడుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సవాళ్లు మరింత అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత , అస్పష్టతకు దారితీస్తాయని వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో ఎవరూ ఊహిచలేరన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు ఏమి చేస్తారు? రేపు ఏమి చేయనున్నారు? అనేది అతనికే తెలియదని అనుకుంటున్నానన్నారు. సవాళ్లు చాలా త్వరగా వస్తున్నాయి. పాత సవాలును గ్రహించేలోపే, కొత్తది ఉద్భవిస్తోంది. దీనినే ఇప్పుడు సైన్యం ఎదుర్కొంటోంది. సరిహద్దుల్లో అయినా, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ యుద్ధం అయినా సవాళ్లు వేగంగా చుట్టుముడుతున్నాయన్నారు.ఇప్పుడు కొత్తగా అంతరిక్ష యుద్ధం, ఉపగ్రహాలు, రసాయన, జీవ, రేడియోలాజికల్, సమాచార యుద్ధాలు మొదలయ్యాయని ద్వివేది పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్లో కరాచీపై దాడి జరిగిందంటూ అనేక వార్తలు వచ్చాయని, అవి తమకూ చేరాయని, అయితే అవి ఎక్కడి నుండి వచ్చాయో తమకు తెలియదన్నారు. ఇటువంటి సవాళ్ల పరిషర్కారానికి భూమి, ఆకాశం, నీరు.. ఈ మూడింటిపైనా పని చేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Mexico: సూపర్ మార్కెట్లో పేలుడు.. 23 మంది మృతి -
భారత్పై ట్రంప్ టారిఫ్ ఉగ్రవాదం
న్యూఢిల్లీ: భారత్ సహా వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల పేరుతో చేస్తున్న ఆర్థిక దాడిని యోగా గురువు బాబా రాందేవ్ తప్పుబట్టారు. ట్రంప్ టారిఫ్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఆర్థిక యుద్ధం కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని పేర్కొన్నారు. ఎలాంటి ఆర్థిక యుద్ధానికైనా ‘స్వదేశీ’యే సరైన పరిష్కారమని రాందేవ్ తెలిపారు. మహర్షి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద వంట మహనీయులు ఇదే విషయం చెప్పారన్నారు. ఆత్మ నిర్భరత, స్వయం సమృద్ధి, స్వావలంబన స్వదేశీకి కీలకమన్నారు. అమెరికా అవలంభిస్తున్న విస్తరణ, సామాజ్రావాద ధోరణుల నేపథ్యంలో దేశీయంగా తయారైన ఉత్పత్తులు, వస్తువులను కొనడం ద్వారా అందరం అభివృద్ధి చెందుతామన్నారు. -
తొలిసారి అమెరికాకు సిరియా అధ్యక్షుడు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా మధ్య భేటీ ముహూర్తం ఖరారైంది. నవంబర్ 10వ తేదీన డొనాల్డ్ ట్రంప్ను సిరియా తాత్కాలిక అధ్యక్షుడు ఆల్ షరా వాషింగ్టన్లో కలవనున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. సిరియా అధ్యక్షుడు అధికారికంగా అమెరికా రాజధాని వాషింగ్టన్కు రావడం ఇదే తొలిసారి. అంతకుముందు ఎప్పుడూ సిరియా అధ్యక్షుడికి అమెరికా నుంచి అధికారిక ఆహ్వానం అందలేదు. దీనికి కారణం వారి మధ్య ఉన్న శత్రుత్వమే. ఇరుదేశాల మధ్య గతంలో అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీనిలో భాగంగానే తమ శత్రు దేశమైన సిరియాకు ఆహ్వానం పంపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అమెరికా-సిరియాల సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉండేవి. సిరియాలోని అంతర్గత యుద్ధం, ఉగ్రవాద సంస్థల ప్రాబల్యం, మానవ హక్కుల ఉల్లంఘనలకు సిరియా పాల్పడుతోందని అమెరికా విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే ఆ దేశంపై కఠినపై ఆంక్షలు విధించింది అమెరికా. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో సిరియాను తమ దారికి తెచ్చుకోవాలనే యోచనలో ఉన్నారు ట్రంప్. అందులో భాగంగానే సిరియా అధ్యక్ష పదవిలో ఉన్న అల్ షరాకు ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ భేటీపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ప్రధానంగా ఇజ్రాయిల్, ఇరాన్, రష్యా వంటి తదితర దేశాలు ఈ భేటీని నిశితంగా గమనించే అవకాశం ఉంది. 25 ఏళ్లలో తొలిసారి..ఈ ఏడాది మే నెలలో సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా భేటీ అయ్యారు. ఇది 25 ఏళ్లలో అమెరికా, సిరియాల మధ్య జరిగిన మొదటి సమావేశం. ఈ సమావేశం తరువాత సిరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. -
‘భారతీయులే కీలకం.. హెచ్-1బీ వీసాపై మరో ట్విస్ట్’
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ(H-1B) వీసాలపై ఫీజు పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీసాలపై ప్రకటనను పునఃపరిశీలించాలని అమెరికా చట్టసభ సభ్యుల బృందం.. తాజాగా ట్రంప్ను కోరడం విశేషం. ఫీజు పెంపుల అంశం అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండగా.. ఏఐ(AI) సాంకేతిక నాయకత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా చట్టసభ సభ్యుల బృందం ప్రతినిధులు జిమ్మీ పనెట్టా, అమీ బెరా, సలుద్ కార్బజల్, జూలీ జాన్సన్ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లేఖ రాశారు. ఈ లేఖలో హెచ్1-బీ వీసాల ఫీజుల పెంపు గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. లేఖలో..‘హెచ్-1బీ గ్రహీతల్లో అత్యధిక వాటాను భారతీయులు కలిగి ఉన్నారు. వారిలో ఎక్కువ మంది సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు(AI)లో అమెరికా నాయకత్వానికి కేంద్రంగా ఉన్నారు. వీసాల విషయం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు కూడా ఎంతో కీలకం. ఇలాంటి వీసా విధానం ఇండో-పసిఫిక్లో అమెరికాకు అత్యంత సన్నిహిత ప్రజాస్వామ్య మిత్రదేశాలలో ఒకటైన భారత్తో సంబంధాలను దెబ్బతీస్తుంది. వీసాల అమలు వల్ల కీలకమైన ప్రజాస్వామ్య భాగస్వామితో వ్యూహాత్మకంగా అమెరికా భాగస్వామ్యం బలపడుతుంది.మరోవైపు.. ఏఐ, అధునాతన సాంకేతికతలలో చైనా దూకుడుగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో మనం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడాన్ని కొనసాగించాలి. హెచ్-1బీ వీసాల అమలు అంటే కేవలం ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయడం కాదు. ఇది 21వ శతాబ్దంలో ప్రపంచ శక్తిని నిర్వచించే పరిశ్రమలలో అమెరికా నాయకత్వాన్ని చూపించడం. వీసాల ఫీజు పెంపు పెద్ద కంపెనీలకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ.. నైపుణ్యంపై ఆధారపడే స్టార్టప్లు, పరిశోధన సంస్థలను గుదిబండగా మారుతుంది’ అని హెచ్చరించారు. లేబర్ డిపార్ట్మెంట్ వీడియో..ఇదిలా ఉండగా.. హెచ్-1బీ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమిస్తున్నారని అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఆరోపించింది. హెచ్-1బీ వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ యువత తమ అమెరికన్ డ్రీమ్స్ కోల్పోతున్నారని, పరిస్థితిని సరిచేసి ఆ కలను తిరిగి అమెరికా ప్రజలకు ఇవ్వాలని సంకల్పించామని పేర్కొంది. దీనికి సంబంధించి తాజాగా వీడియో విడుదల చేసింది.ఈ వీడియోలో చూపించిన గణాంకాల ప్రకారం, హెచ్-1బీ వీసాలలో 72 శాతం భారతీయులకే జారీ అవుతున్నాయని వెల్లడించింది. వీసా కింద అమెరికాలో పనిచేస్తున్న నైపుణ్య కార్మికుల్లో అధికశాతం భారత్ నుంచే వెళ్తున్నారని తెలిపింది. వీసా వ్యవస్థలో ఎలాంటి అవకతవకలు ఉన్నాయా అని గుర్తించేందుకు ప్రాజెక్ట్ ఫైర్వాల్ పేరిట ఆడిట్ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమిస్తూ, స్థానిక అమెరికన్లకు నష్టం కలిగించే కంపెనీలను గుర్తించడమని పేర్కొంది. -
ఇదెక్కడి న్యాయం?.. ట్రంప్పై విరుచుకుపడ్డ కమలా హారిస్
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెతతారు. అధ్యక్ష భవనం వైట్హౌజ్లో భారీ వ్యయంతో బాల్రూమ్ నిర్మించాలన్న ప్రణాళికను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పిల్లల ప్రాణాలకు సంబంధించిన విషయాన్ని పట్టించుకోని ఈ చర్యను అసహ్యకరమైందిగా పేర్కొంటూ ట్రంప్పై విరుచుకుపడ్డారు. జాన్ స్టీవర్ట్ నిర్వహించిన ది విక్లీ షో (The Weekly Show) పోడ్కాస్ట్లో పాల్గొన్న హారిస్ ఈ అంశంపై మాట్లాడుతూ ఊగిపోయారు. ‘‘ఆ మనిషి తన ధనిక మిత్రుల కోసమే బాల్రూమ్ నిర్మిలించాలనుకుంటున్నారు. ప్రభుత్వం షట్డౌన్ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయమేనా ఇది?. అసలు ఆ మనిషి ప్రజల గురించి పట్టించుకోరా? సిగ్గుందా??.. .. అమెరికాలో పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆహార సహాయం(SNAP) నిలిచిపోయే పరిస్థితిలో ఉంది. ఆకలితో మరణాలు సంభవించే పరిస్థితి నెలకొంది. మరి ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి?.. వాళ్ల గురించి ఆ మనిషి కనీసం ఆలోచించరా? అంటూ ఆగ్రహంతో కమలా హారిస్ ఊగిపోయారు(మధ్యలో కోపంతో ఆమె F*** పదం ఉపయోగించారు). వ్యవస్థను కదిలించడం వేరు, దాన్ని నాశనం చేయడం వేరు. ప్రజలు ఆకలితో బాధపడుతున్న సమయంలో ఈ విధమైన ప్రాజెక్టులు అసహ్యకరమైనవి అని అభిప్రాయపడ్డారు. చిన్నపిల్లలు ఆకలితో బాధపడుతున్న సమయంలో స్నాప్(SNAP) బెనిఫిట్స్ ముగియబోతున్నాయి. కానీ అధ్యక్షుడు బాల్రూమ్ నిర్మాణం గురించి ఆలోచిస్తున్నారు. ఇది అమానవీయం అని కమలా హారిస్ తేల్చేశారు. SNAP అంటే Supplemental Nutrition Assistance Program. ఇది అమెరికా ప్రభుత్వం నిర్వహించే ఆహార సహాయ కార్యక్రమం, దీని ద్వారా అర్హత కలిగిన పేద కుటుంబాలకు ఫుడ్ స్టాంప్స్ లేదంటే EBT కార్డుల ద్వారా నెలకు కొన్ని డాలర్లు అందిస్తారు. ఈ డబ్బుతో వారు ఆహార పదార్థాలు కొనుగోలు చేయగలుగుతారు.ఇదిలా ఉంటే.. వైట్హౌజ్లోని ఈస్ట్ వింగ్లోని భాగాన్ని కూల్చేసి అత్యాధునికంగా బాల్రూమ్ను నిర్మించే ప్రయత్నంలో ట్రంప్ ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని అంచనా. అయితే.. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తిగా ప్రైవేట్ విరాళాలతోనే కట్టబతున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య హెల్త్ ఇన్సురెన్స్ సబ్సిడీ, ఫారిన్ఎయిడ్.. ఇతరత్రా ఫెడరల్ బడ్జెట్ విషయంలో మనీ బిల్లులపై సెనేట్లో ఏకాభిప్రాయం(13 సార్లు ఓటింగ్ జరిగినా) కుదరలేదు.దీంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే.. జీతం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయాల్సిన పరిస్థితి అన్నమాట. దీంతో SNAP ఫుడ్ బెనిఫిట్స్, మిలిటరీ పే, ఇతర సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేటితో షట్డౌన్ 31వ రోజుకి చేరుకుంది. పోలిమార్కెట్ బెట్టింగ్ అంచనాల ప్రకారం, నవంబర్ 16 తర్వాతే షట్డౌన్ ముగిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. -
‘తాత్కాలిక సంధి’ కాలం!
ఎట్టకేలకు అమెరికా–చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు దక్షిణ కొరియాలోని బూసాన్లో గురు వారం చర్చించాక ఇరు దేశాల మధ్యా తాత్కాలిక సంధి కుదిరింది. వాణిజ్య కీచులాట లకు రెండు దేశాలూ ఏడాది పాటు విరామం ప్రకటించాయి. చైనా దిగుమతులపై విధించిన సుంకాల్లో 10 శాతం తగ్గించాలని అమెరికా నిర్ణయించింది. అలాగే అపురూప ఖనిజాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని చైనా నిర్ణయం తీసుకుంది.దాంతోపాటు అమెరికా నుంచి సోయాబీన్స్ కొనుగోళ్లను పునరుద్ధరించటానికి అంగీకరించింది. రెండు దేశాల దోబూచులాట ట్రంప్ ఆగమనంతో మాత్రమే మొదలుకాలేదు. ఆ రెండింటి మధ్యా అంతకుముందే ఉన్న వాణిజ్య ఆధిపత్య పోటీ జో బైడెన్ హయాంలో తీవ్రతరమైంది. దాన్ని ట్రంప్ మరింత ఎగదోశారు. మొన్న ఏప్రిల్లో చైనాపై 145 శాతం సుంకాలు విధించారు. ఈ బ్లాక్మెయిల్కు తలొగ్గబోమనీ, తుదివరకూ పోరాడతామనీ చైనా జవాబిచ్చింది. ఈ పోటీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలన్నీ సతమతమయ్యాయి. కానీ తాజా చర్చల వల్ల తాత్కాలికంగానైనా అవి సద్దు మణగటం మంచి పరిణామం. ఈ చర్చలు మరిన్ని చర్చలకు దారితీసి వాణిజ్య సంధికి దారితీయొచ్చన్న ఆశాభావం కూడా అందరిలో వ్యక్తమవుతోంది. ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్నప్పుడు చిరునవ్వులు రువ్వుకోవడం, ఎక్కువసేపు కరచాలనాలతో ఫొటోలకు పోజులివ్వటం రివాజే. ట్రంప్, జిన్పింగ్లిద్దర్నీ అంచనా వేయటం అంత సులభం కూడా కాదు. అందులోనూ ట్రంప్ 24 గంటలు తిరగకుండా మాట మార్చటంలో సిద్ధహస్తుడు. అందువల్ల బూసాన్ సమావేశంపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పైగా చర్చల అనంతరం ట్రంప్ ప్రకటించినంతస్పష్టంగా చైనా వైపు నుంచి వివరణ లేదు. ‘కీలక ఆర్థిక, వాణిజ్య అంశాలపై అధినేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య దృఢమైన పునాది కోసం ట్రంప్తో కలిసి పనిచేయటానికి షి సంసిద్ధత చూపారు’ అని చైనా ప్రకటన చెబుతోంది. అపురూప ఖనిజాల సంగతేమీ అందులో లేదు. కాకపోతే చైనా వాణిజ్య శాఖ ప్రకటన ‘అక్టోబర్ 9 నాటి ఎగుమతుల నియంత్రణలను’ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలి పింది. అందులో అపురూప ఖనిజాలు కూడా ఉన్నాయి. కార్లు, సెమీ కండక్టర్లే కాక సైనిక ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు తేలినందువల్లే నియంత్రణ విధించామని చైనా లోగడ తెలిపింది.ట్రంప్ తగ్గించామంటున్న సుంకాల విషయంలోనూ తకరారు ఉంది. మాదక ద్రవ్యాల తయారీకి తోడ్పడే ఫెంటానిల్ రసాయనాన్ని చైనా ఎగుమతి చేస్తోందని ఆరో పిస్తూ చైనా సరుకులపై ట్రంప్ 20 శాతం సుంకాలు విధించారు. ఇప్పుడు 10 శాతం తగ్గించటమంటే దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేదని అర్థం. తాము కూడా సుంకాలు సవరిస్తామని చైనా అంటున్నది. తమ ఎన్విడియా కంపెనీ చిప్లను చైనా కొనుగోలు చేయొచ్చని ట్రంప్ అన్నప్పటికీ బ్లాక్వెల్ చిప్ల విషయం చర్చకు రాలేదంటున్నారు.అంటే ఈ సంధిలోనూ అపరిష్కృత సమస్యలు దాగున్నాయి.రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలూ అగ్రభాగాన ఉన్నాయన్న మాటేగానీ మాంద్యంతో యాతన పడుతున్నాయి. ట్రంప్ సుంకాల యుద్ధంతో సోయాబీన్స్ను బ్రెజిల్ నుంచి చైనా కొనుగోలు చేయటం మొదలెట్టింది. దాంతో అమెరికా రైతులు దివాలా స్థితికి చేరారు. అది ట్రంప్ను ఊపిరాడకుండా చేస్తోంది. అందుకే జిన్పింగ్తో చర్చల్లో తైవాన్ సమస్య జోలికి పోలేదు. అటు చైనా 2021 నాటి స్థిరాస్తి మార్కెట్ సంక్షోభం నుంచి బయటపడలేదు. దేశంలో కొనుగోలు శక్తి పడిపోవటంతో సరుకు అమ్ముడు కాక మార్కెట్లు నేలచూపు చూస్తున్నాయి. 2035 నాటికి ఏఐలో అగ్రగామిగా మారి తిరిగి పుంజుకోవాలనుకుంటున్నా అమెరికా నియంత్రణలు అడ్డంకిగా మారాయి. విద్య, నైపు ణ్యాల్లో భారీగా వ్యయం చేయాలనుకుంటున్న చైనా అందుకవసరమైన పెట్టుబడుల కోసం చూస్తోంది. అపురూప ఖనిజాల నియంత్రణ ద్వారా ఇప్పటికైతే అమెరికాను దారికి తెచ్చుకుంది. వచ్చే ఏప్రిల్లో బీజింగ్ సందర్శిస్తానని ట్రంప్ అంటున్నారు గనుక ఆ లోగా ఈ ‘తాత్కాలిక సంధి’ సామరస్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
కొనడం కన్నా మానడం మేలు
రష్యాకు చెందిన ‘రోస్నెఫ్ట్’, ‘ల్యూక్ ఆయిల్’ కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెడుతూ అక్టోబరు 22న అమెరికా తీసు కున్న నిర్ణయం రష్యానూ, రష్యా చమురు కొంటున్న దేశాలనూ ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. రష్యా ముడిచమురు ఆదాయంలో 57 శాతం ఈ రెండు దిగ్గజసంస్థల ద్వారానే సమకూరుతుంది. ఇతర చిన్నాచితకా కంపెనీల ద్వారా మిగిలిన 43 శాతం లభిస్తోంది. చిన్న కంపెనీల మీద ఎలాంటి ఆంక్షలు విధించనప్పటికీ, ఇండియా వంటి ప్రధాన చమురు దిగుమతి దేశాల మీద అమెరికా చర్య ప్రభావం గణనీయంగా ఉంటుంది. బ్లాక్ లిస్టెడ్ కంపెనీల నుంచి కొనుగోళ్లు చేయ బోమని ఇండియా చమురు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతులు ఒకప్పుడు కేవలం1 శాతం ఉండేవి అలాంటిది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అవి 38 శాతం గరిష్ఠ స్థాయికి పెరిగాయి. ఇండియా ఇలా రష్యా ముడి చమురు కొంటూ పుతిన్ యద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. చౌకగా లభిస్తున్నందువల్లే దేశ ప్రయోజనాల దృష్టిలో తాము రష్యా చమురు కొంటున్నామని భారత ప్రభుత్వం ఈ ఆరోపణను కొట్టివేసింది. ఇండియా సందిగ్ధంఅమెరికా తాజా నిర్ణయంతో ఇండియా సందిగ్ధంలో పడింది. ఏదో ఒక విధంగా రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగించడమా, లేదంటే రష్యా చమురుకు పూర్తిగా దూరం కావటమా అన్నది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. నిజానికి రెండు సర్వసత్తాక దేశాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం ఎలా జరగాలో శాసించే హక్కు అమెరికాకు లేదు. తమ కంపెనీలు రెండిటిని అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ, చమురు ఎగుమతులు నిలిపివేయాలని రష్యా భావించడం లేదు. కానీ బ్లాక్ లిస్టెడ్ కంపెనీలతో వ్యాపారం చేసే దేశాల మీద అమెరికా ద్వితీయ స్థాయి ఆంక్షలు విధించే అవకాశం ఉన్నందున, అంత రిస్కు తీసుకుని రష్యా చమురు కొనాలా వద్దా అనేది ఇండియా, చైనా వంటి దిగుమతిదారులు తమకు తాముగా తీసు కోవలసిన నిర్ణయం. ఇప్పుడు ఇండియా ముందు రెండు మార్గాలు ఉన్నాయి. అమె రికా ఆంక్షలు విధించినా సరే రష్యా చమురును ఇకమీదటా కొనడం వాటిలో ఒకటి. అమెరికా ఆంక్షలు వర్తించకుండా దళారుల ద్వారా సమకూర్చుకునే వీలుంది. రష్యా రహస్యంగా నడుపుతున్న రహస్య (షాడో) ట్యాంకర్ల ద్వారానూ తెప్పించుకోవచ్చు. ఏదో విధంగా చౌక ధరలకు రష్యా చమురు తెప్పించుకోవడం సాధ్యమే. అయితే ఈ చర్యలు ట్రంప్కు ఆగ్రహం కలిగిస్తాయి. చపల చిత్తుడైన ట్రంప్ఆంక్షలను ధిక్కరించడం తెలివైన పని అనిపించుకోదు. ట్రంప్తో ఢీకొనడం అంటే, తలను రాతి గోడకేసి కొట్టుకోవడమే. అమెరికాతో తలపడటంలో మన కంటే గట్టిదైన చైనా సైతం ఆ రెండు రష్యాకంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపి వేస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది.వాణిజ్య ఒప్పందమే ఆచరణీయంట్రంప్తో తల గోక్కోవడం కంటే, ఆచరణీయ వైఖరి అవలంబించాలి. విస్తృత వ్యూహాత్మక లక్ష్యాలకు ముప్పు వాటిల్లని రీతిలో, దౌత్య ఇంధన ఆర్థిక ప్రయోజనాలను సమతుల్యం చేసేట్లు ఈ వైఖరి ఉండాలి. ఇది రెండో మార్గం. మన చేతిలో ఉన్న ముక్కలతోనే మనం ఆడాలి. సమకాలీన భౌగోళిక రాజకీయాల్లో ఆచరణవాదమే నడుస్తోంది. ఇండియా భిన్నంగా వ్యవహరించలేదు. అమెరికా ఒత్తిడికి లొంగిపోతున్నామా అన్నది ముఖ్యం కాదు. దేశానికి గరిష్ఠ ప్రయోజనం దేనివల్ల సిద్ధిస్తుందో ఆ మార్గాన్ని ఎంచుకోవాలి.ఒకటి: ఆంక్షలకు గురికాని రష్యా ఇంధన కంపెనీల నుంచి కొను గోళ్లు చేసే అవకాశం ఇప్పటికీ ఉంది. రోస్నెఫ్ట్, ల్యూక్ఆయిల్ నుంచి కాకుండా మిగిలిన రష్యా కంపెనీల నుంచి కొంటే అమెరికా సెకండరీ ఆంక్షలు వర్తించవు. ఆంక్షలు ఆ రెండు కంపెనీల మీదే కానీ రష్యా ఆయిలు మీద కాదు. అయినా సరే ఇది అనుకున్నంత సులభం కాదు. రెండు: అమెరికా ఆంక్షలను ఇండియా తోసిరాజన గలదా, ఆ సాహసం ఫలితమిస్తుందా, అమెరికాతో ముడిపడి ఉండే విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మాత్రమే రష్యా చమురు కొనుగోళ్ల కొనసాగింపుపై ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది.ఇండియా వస్తువుల మీద ట్రంప్ తొలుత విధించిన 25 శాతం సుంకాలను వీలైనంత తగ్గించేలా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొను గోళ్లను నిలిపివేసినట్లయితే, తరువాత మోపిన 25 శాతం అదనపు సుంకాలను కూడా తగ్గించడానికి లేదా రద్దు చేయడానికి వీలు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికాతో సానుకూల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోడానికి అనువుగా రష్యా చమురుకు స్వస్తి పలికే అంశాన్ని పరిశీలించాలి. ప్రతిష్ఠ స్థానే ప్రయోజనాలుట్రంప్ ఏకపక్ష ఆంక్షలను తోసిరాజన్నట్లయితే, దేశ గౌరవం ఇనుమడిస్తుంది. కానీ దానివల్ల ఒనగూరే ప్రయోజనాలు పరిమిత మైనవి. వాటి కంటే మనం ఎదుర్కొనే రిస్కులు ఎక్కువ. కాబట్టి, అమెరికా విధానంలో మార్పు కోసం రష్యా నుంచి చమురు కొను గోళ్లను నిలిపివేసే ఆలోచన చేయాలి. తద్వారా, దక్షిణాసియాలోఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ అవలంబిస్తున్న ప్రతికూల భౌగో ళిక రాజకీయ వైఖరికి తెరపడుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ బలాబలాల సమతౌల్యాన్ని సానుకూల రీతిలో పునురు ద్ధరించుకునేందుకు అమెరికా సహకారం తీసుకుని తీరాలి. ప్రాంతీ యంగా వారి వ్యూహాత్మక ప్రయోజనాలకూ ఢోకా ఉండదన్న భరోసా ఇవ్వాలి. స్పష్టంగా చెప్పాలంటే, రష్యా చమురు కంపెనీల మీద అమెరికా ఆంక్షలు ధిక్కరించడానికి ఇండియాకు ఉన్న అవకాశాలు పరి మితం. ఈ తప్పనిసరి పరిస్థితి నుంచి ఎంతో కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేయాలి. కీలకమైన తన వ్యూహాత్మక ప్రయోజనాలు పరిరక్షించేట్లయితే, రష్యాపై ఆంక్షల పట్ల అభ్యంతరం లేదనిఇండియా ప్రతిపాదించాలి. జాతి గౌరవం, దేశ ప్రతిష్ఠ అంటూ అతిశయాలకు పోతే ప్రయోజనం ఉండదు. -వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రేటజిక్ డిఫెన్స్ అండ్రిసెర్చ్’ వ్యవస్థాపక డైరెక్టర్ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-హ్యాపీమాన్ జాకబ్ -
వలసదారులకు మరో పిడుగులాంటి వార్త
-
వలసదారులపై మరో పిడుగు
వాషింగ్టన్: అమెరికాలో వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ నాన్–ఇమిగ్రెంట్ ఉద్యోగుల పని అనుమతులను(వర్క్ పర్మిట్లు) అటోమేటిక్గా రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలికింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ బుధవారం ప్రకటన జారీ చేసింది. ఈ నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి వచి్చంది. దీంతో విదేశీ ఉద్యోగులు.. ప్రధానంగా అమెరికాలోని భారతీయ ఉద్యోగులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు, హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నెల 30వ తేదీ లేదా ఆ తర్వాత వర్క్ పర్మిట్లు(ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు–ఈఏడీ) పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై అటోమేటిక్ రెన్యువల్ సదుపాయం ఉండదు. అక్టోబర్ 30 కంటే ముందు వర్క్ పర్మిట్లు పొడిగించుకున్నవారిపై ఎలాంటి ప్రభావం పడదు. వారి వర్క్ పర్మిట్లు(ఈఏడీ) ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతాయి. అమెరికాలో ఈఏడీ పొడిగింపు కోసం ప్రతిఏటా 4.50 లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు. ఇకపై విదేశీ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు రెన్యువల్ కావాలంటే ప్రత్యేక తనిఖీలు, పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంతోపాటు వర్క్ పర్మిట్ల విషయంలో మోసాలకు తెరదించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తేల్చిచెప్పింది. బైడెన్ నిర్ణయానికి మంగళం హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు(హెచ్–4 వీసాదారులు), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ)లో ఉన్న ఎఫ్–1 వీసా ఉన్న విదేశీ విద్యార్థులు సహా కొన్ని కేటగిరీల వలసదారుల వర్క్ పర్మిట్ల కాలవ్యవధి ముగిసినప్పటికీ 540 రోజుల దాకా చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకొనే అవకాశాన్ని జో బైడెన్ ప్రభుత్వ హయాంలో కల్పించారు. నిర్దేశిత గడవులోగా దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ఆటోమేటిక్గా వర్క్ పర్మిట్ రెన్యువల్ అయ్యేది. ఈ విధానానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికింది. వర్క్ పర్మిట్ గడువు ముగిసేదాకా వేచి ఉండకుండా రెన్యువల్ కోసం వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందే దరఖాస్తు చేసుకుంటే మంచిదని యూఎస్ సిటిజెన్íÙప్, ఇమిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్సీఐఎస్) స్పష్టంచేసింది. రెన్యువల్ దరఖాస్తు విషయంలో జాప్యం చేస్తే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్(డాక్యుమెంటేషన్)లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. అసలు ఏమిటీ వర్క్ పర్మిట్? కొన్ని కేటగిరీల నాన్–ఇమిగ్రెంట్ వీసాదారులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవాలంటే వర్క్ పర్మిట్(ఈఏడీ) తప్పనిసరిగా కలిగి ఉండాలి. నాన్–ఇమిగ్రెంట్ విదేశీ కార్మికుడు అమెరికాలో నిర్దేశిత కాలంపాటు ఉద్యోగం చేయడానికి చట్టబద్ధమైన అనుమతి ఉందని చెప్పడానికి ఈఏడీ ఒక ఆధారం. గ్రీన్కార్డుతో అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందినవారికి వర్క్ పర్మిట్తో అవసరం లేదు. అయితే, గ్రీన్కార్డు పెండింగ్లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటే వర్క్ పర్మిట్ తీసుకోవాల్సిందే. హెచ్–1బీ వీసాదారులు కూడా పని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. -
ట్రంప్, జిన్పింగ్ స్నేహగీతం
సియోల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్పింగ్ ఆరేళ్ల తర్వాత ముఖాముఖి సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై దాదాపు రెండు గంటలపాటు చర్చించుకున్నారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనడానికి దక్షిణ కొరియాకు చేరుకున్న ఇరువురు నేతలు గురువారం బుసాన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చైనా ఉత్పత్తులపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం గమనార్హం. అలాగే అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయడానికి చైనా అంగీకరించింది. మొత్తానికి అమెరికా, చైనాల మధ్య స్నేహ సంబంధాలకు ట్రంప్–జిన్పింగ్ భేటీ అద్దం పట్టింది. ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని అమెరికాకు తిరిగివెళ్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. జిన్పింగ్తో ముఖాముఖి సమావేశం పూర్తిస్థాయిలో విజయవంతమైందని అన్నారు. మాదక ద్రవ్యాల(ఫెంటానిల్) తయారీకి అవసరమైన రసాయనాలు విక్రయిస్తున్నందుకు శిక్షగా చైనాపై ఈ ఏడాది మొదట్లో విధించిన 20 శాతం టారిఫ్లను 10 శాతానికి తగ్గించబోతున్నట్లు తెలిపారు. దీంతో చైనాపై మొత్తం టారిఫ్లు 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గిపోనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్లో తాను చైనాలో పర్యటించబోతున్నట్లు ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత జిన్పింగ్ సైతం అమెరికాకు రాబోతున్నారని వెల్లడించారు. మరిన్ని అడ్వాన్స్డ్ కంప్యూటర్ చిప్లను చైనాకు ఎగుమతి చేయడంపై జిన్పింగ్తో చర్చించానని అన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకం చేయబోతున్నట్లు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ విషయంలో పెద్దగా అవరోధాలేవీ లేవన్నారు. టిక్టాక్ సమస్యను పరిష్కరించుకుంటాం: చైనా ట్రంప్, జిన్పింగ్ భేటీలో టిక్టాక్ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదు. టిక్టాక్ యజమాన్యాన్ని చైనా నుంచి అమెరికాకు బదిలీ చేయాలని ట్రంప్ చెబుతున్న సంగతి తెలిసిందే. టిక్టాక్ను అమెరికా సంస్థకు అప్పగించాలని చాలారోజులుగా డిమాండ్ చేస్తున్నారు. చైనా యాజమాన్యంలో ఉంటే అమెరికాలోని యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని అంటున్నారు. దీనికి చైనా అంగీకరించడం లేదు. అమెరికాతో నెలకొన్న టిక్టాక్ సమస్యను కచి్చతంగా పరిష్కరించుకుంటామని చైనా వాణిజ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిపై అమెరికాతో చర్చిస్తామని పేర్కొంది. మరోవైపు అమెరికాలో టిక్టాక్ను కొనసాగించేలా చైనాతో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం సంకేతాలిచి్చంది.అమెరికా నుంచి సోయాబీన్ దిగుమతులు అమెరికా నుంచి ప్రతిఏటా 25 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్ దిగుమతి చేసుకోవడానికి చైనా అంగీకరించింది. ఈ మేరకు ట్రంప్, జిన్పింగ్ చర్చల్లో ఒప్పందం కుదిరినట్లు అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఈ ఒప్పందం వచ్చే మూడేళ్లపాటు అమల్లో ఉంటుందన్నారు. ఈరోజు నుంచి వచ్చే ఏడాది జనవరి దాకా చైనా 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలు చేయనుందని తెలిపారు. దీనివల్ల అమెరికా రైతులకు లబ్ధి చేకూరుతుందని బెసెంట్ వివరించారు. -
చమురు కొనుగోళ్లకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాం
న్యూఢిల్లీ: రష్యన్ చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్ తన ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు మరిన్ని కొత్త మార్గాలను అన్వేíషింంచనుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైస్వాల్ గురువారం ప్రకటించారు. రష్యాలో ప్రభుత్వరంగ అతిపెద్ద చమురు సంస్థ రోస్నెఫ్ట్తోపాటు అక్కడి అతిపెద్ద ప్రైవేట్ చమురు సంస్థ లక్ఆయిల్లపై ఆంక్షల కొరడా ఝలిపించామని దక్షిణకొరియాలో ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే భారత్ స్పందించడం గమనార్హం. అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ ఈ సంస్థల నుంచి తక్కువ ధరకు చమురుకొనే బదులు ఇదే రేట్లకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయగల అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది. రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకుంటూ అమెరికా పెట్రోలియం ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోబోందన్న వార్తల నడుమ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ స్పందించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ ఇంకా చర్చలు జరుపుతోందని గుర్తుచేశారు. అయితే గత నెలలతో పోలిస్తే తాజాగా రష్యన్ సంస్థల నుంచి భారత చమురు కొనుగోళ్లు తగ్గినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఛాబహార్ పోర్ట్ విషయంలో ఊరట ఇరాన్లోని కీలక ఛాబహార్ ఓడరేవు నుంచి అంతర్జాతీయ నౌకల రాకపోకలపై అమెరికా విధించిన ఆంక్షలను భారత్ కోసం కొద్దికాలం పక్కనబెట్టింది. ఆరు నెలలపాటు ఆంక్షల నుంచి భారత్ను మినహాయింపునిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మినహాయింపు అక్టోబర్ 29వ తేదీ నుంచి మొదలవుతుందని జైస్వాల్ చెప్పారు. అంతర్జాతీయంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటంతో తనకు ప్రతికూలంగా మారొద్దనే అక్కసుతో అమెరికా ఈ ఓడరేవుపై సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ఆంక్షలు విధించడం తెల్సిందే. అయితే భారత అభ్యర్థనతో ఆ ఆంక్షల అమలును నెలరోజులు వాయిదా వేశారు. తాజా చర్చలతో దానిని మరో ఆరునెలలు పొడిగించారు. ఛాబహర్ పోర్ట్ను అనుసంధానత, సత్సంబంధాలే లక్ష్యంగా భారత్, ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధిచేశాయి. -
యుద్ధం ఆపానన్న ట్రంప్తో మోదీ వాదనలో గెలవలేరు
షేక్పురా(బిహార్): ఆపరేషన్ సిందూర్ వేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న వాదనలకు అడ్డుకట్ట వేసే ధైర్యం ప్రధాని మోదీకి అస్సలు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. బిహార్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా గురువారం నలంద, షేక్పురాలో సభలో రాహుల్ ప్రసంగిస్తూ మోదీపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ‘‘తన కారణంగానే భారత్, పాక్ యుద్ధం ఆగిందని ఇప్పటికే ఎన్నో సార్లు ట్రంప్ అంతర్జాతీయ వేదికలపై డప్పు కొట్టారు. ఆయన ప్రకటనలను ప్రధాని మోదీ కనీసం అడ్డుకునే సాహసం చేయట్లేరు. మీరు మాట్లాడేది అబద్ధం అని మాట వరసకు కూడా ట్రంప్కు చెప్పే ధైర్యం మోదీకి లేదు. ఇటీవల కాలంలో మోదీ అమెరికాకు వెళ్లాల్సింది. కానీ ట్రంప్ భయానికే ఆయన అమెరికా వైపు కన్నెత్తి చూడట్లేరు. నిజంగానే మోదీకి అంతటి ధైర్యం ఉంటే బిహార్ ఎన్నికల ర్యాలీల్లో యుద్ధం ఆపింది ట్రంప్ కానేకాదు అని మోదీ కరాఖండీగా ప్రకటించాలి’’అని రాహుల్సవాల్ విసిరారు. ధైర్యశాలి ప్రధాని అంటే మా నాన్నమ్మే ‘‘నిజానికి ప్రధాని అంటే ఎంతటి ధైర్యశాలిగా ఉండాలో మా నాన్నమ్మ, నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవాలి. 1971లో నాటి అమెరికా అధ్యక్షుడితో ఇందిర సూటిగా ‘మాకు మీరంటే ఏమాత్రం భయంలేదు’అని ముఖం మీదే చెప్పేశారు. ఆమె తెగింపు గల నాయకురాలు’’అని ఇందిరను రాహుల్ గుర్తుచేసుకున్నారు. బిహార్లో భూములు అందుబాటులో లేవన్న అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘బడా పారిశ్రామిక సంస్థకు చవగ్గా భూములు అమ్మేస్తూ పోతే ఇక భూముల లభ్యత ఎలా సాధ్యం?’’అని ప్రశ్నించారు. -
చైనాకు ట్రంప్ గుడ్న్యూస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. చైనాపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గురువారం దక్షిణ కొరియా బుసాన్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. జిన్పింగ్తో భేటీ అద్భుతంగా జరిగిందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం.. 2018 దాకా చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 0-5 శాతంగా ఉండేవి. అయితే 2021లో అది 20 శాతానికి చేరింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టి టారిఫ్ వార్ మొదలుపెట్టాక చైనా విషయంలోనూ పెంపు ఉండొచ్చని అంతా భావించారు. అందుకు తగ్గట్లే అది 57 శాతానికి చేరింది. అయితే ఆ పెంపు 155 శాతం దాకా ఉంటుందని.. నవంబర్ 1వ తేదీ నుంచి అమలు అవుతుందని ఆయన హెచ్చరించారు కూడా. ఈలోపు..పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా గురువారం ఈ ఇరు దేశాధినేతలు రెండు గంటలపాటు సమావేశం కాగా, చర్చలు ఫలవంతం అయ్యాయి. తాజా తగ్గింపుతో సుంకాలు 47 శాతానికి చేరాయి. ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక అద్భుతమైన ఆరంభం అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. టారిఫ్ తగ్గింపుతో పాటు సోయాబీన్ కొనుగోళ్ల పునరుద్ధరణ, అలాగే.. రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి ఇంతకు మించి ఏం చెప్పలేనన్న ఆయన.. ముఖ్యమైన అంశాలకు సంబంధించి వివరాలను కాసేపట్లో విడుదల చేస్తామని మీడియాకు తెలిపారు. -
మాది గొప్ప సంబంధం.. మళ్లీ కలవడం ఆనందంగా ఉంది
వాణిజ్య ఉద్రిక్తతల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ముఖాముఖి మాట్లాడుకున్నారు. దక్షిణ కొరియా బుసాన్లో గురువారం ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా ఈ ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత.. కరచలనం చేసుకుంటూ నవ్వుకుంటూ ఇద్దరూ మీడియా ముందు ఫోజులిచ్చారు. ఆపై ఇరు దేశాల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ జరిపారు.‘‘మా మధ్య మంచి పరిచయం ఉంది. మాది గొప్ప సంబంధం. మళ్లీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగానే కుదిరే అవకాశం ఉంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మీరు తిరిగి అధ్యక్షుడయ్యాక మూడుసార్లు ఫోన్లో మాట్లాడాం, చైనా-అమెరికా ఆర్థిక సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. అమెరికాను గొప్ప దేశంగా మార్చే దృష్టితో చైనా అభివృద్ధి సాగుతోంది అని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. ఇరు దేశాల సంబంధాలు స్నేహపూర్వకంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అదే సమయంలో.. BREAKING 🚨 China’s President stuns the world THANKING President Trump for promoting PEACE "Mr President you care a lot about world peace. You are very enthusiastic about settling regional hotspot issues”I AM IN TOTAL SHOCK 🔥 pic.twitter.com/yEkzCdigUf— MAGA Voice (@MAGAVoice) October 30, 2025చైనా-అమెరికా.. రెండు ప్రపంచ శక్తులు. అవి ఎప్పుడూ ఒకే అభిప్రాయంలో ఉండకపోవడం సహజం. పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం కూడా సహజమే. కానీ వాటిని ద్వైపాక్షిక సంబంధాల చర్చల ద్వారా అధిగమించి ముందుకు ఎలా సాగుతామనేదే ముఖ్యం అని జిన్పింగ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. మరోవైపు.. గాజా కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రపై జిన్పింగ్ ప్రశంస గుప్పించారు. ప్రపంచ శాంతికి ఈ ఒప్పందం మీరు చేసిన గొప్ప కృషి అని అన్నారాయన. ఇలాంటి శాంతి చర్చలకు చైనా మద్దతు తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. అంతకు ముందు.. JUST IN: 🇺🇸🇨🇳 President Trump officially meets with Chinese President Xi Jinping to discuss trade deal. pic.twitter.com/lIB0O68Wo7— Watcher.Guru (@WatcherGuru) October 30, 2025తమ భేటీ విజయవంతం అవుతుందనే ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నాకు ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన(జిన్పింగ్) చాలా కఠినమైన చర్చాకర్త. అది ఏమాత్రం మంచిది కాదు’’ అంటూ అక్కడ నవ్వులు పూయించారు. ఇదిలా ఉంటే.. 2018లో ప్రారంభమైన ట్రంప్-చైనా వాణిజ్య యుద్ధం 2025లో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసింది. ట్రంప్ సుంకాల బెదిరింపులు.. చైనా కూడా తన "రేర్ ఎర్త్ మినరల్స్" ఎగుమతులపై నియంత్రణలను విధించడంతో పరిస్థితి క్షీణించసాగింది. ఈ తరుణంలో.. తాజా భేటీ చైనా–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు దారితీసే అవకాశం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలతోపాటు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చిస్తారని, ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో జరుగుతున్న భేటీ సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. అయితే ట్రంప్-జిన్పింగ్ల భేటీ కంటే ముందే ట్రేడ్ డీల్కు సంబంధించిన ఒప్పందం ఖరారైనట్లు సంకేతాలు అందుతున్నాయి. దీని ప్రకారం.. అమెరికా సుంకాలను నిలిపివేయడం, అలాగే.. చైనా కూడా తన "రేర్ ఎర్త్ మినరల్స్" నియంత్రణలను ఒక సంవత్సరం పాటు వాయిదా వేయడం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
ట్రంప్కి ఊహించని ఎదురుదెబ్బ!
పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి..అంతర్జాతీయ సమాజంలో ఒంటరితనం.. వెరసి ఒత్తిడికి గురైన ఇరాన్-రష్యాలు.. ఇప్పుడు అమెరికా సైతం అడ్డుకోలేని మార్గాన్ని ఎంచుకున్నాయి అదే 162 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ప్రపంచ వాణిజ్యాన్ని శాశ్వతంగా మార్చివేయగల ఈ పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీసింది.. ఇరాన్-రష్యాల మధ్య రష్ట్ నుంచి అస్తారా వరకు నిర్మిస్తున్న ఈ రైల్వే మార్గం ఇనుము, కాంక్రీటుతో కూడిన ఉత్త నిర్మాణం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC)లో అత్యంత కీలక భాగం. మొత్తం 7,200 కిలోమీటర్ల పరిధిలోని ఈ కారిడార్ వాణిజ్య ఖర్చులను ఈ రైల్వే లైన్ 30 శాతం తగ్గించడమే కాదు.. రవాణా సమయాన్ని కూడా 37 రోజుల నుండి 19 రోజులకు తగ్గించగలదు. పైగా సుయాజ్ కాలువ మార్గంతో పోలిస్తే సగం సమయం మాత్రమే!.ఇరాన్తో ఈ ఏడాది జనవరిలోనే రష్యా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కీలక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 1.6 బిలియన్ యూరోల(మన కరెన్సీలో 1,641 కోట్ల రూపాయలు) నిధులను ఒక్క రష్యానే ఈ ప్రాజెక్టు కోసం సమకూర్చనుంది. ఈ ప్రాజెక్టు గనుక అందుబాటులోకి వస్తే.. ప్రతి ఏడాది 20 మిలియన్ టన్నుల సరుకులు(నూనె, గ్యాస్, ఉక్కు, ఆహారం, యంత్రాల వంటివి) రవాణా చేయొచ్చు. అయితే..రష్యా-ఇరాన్ ఈ రైలు ప్రాజెక్ట్ వ్యూహాత్మకమేనన్న అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ఏర్పడిన ఒంటరితనాన్ని అధిగమించి, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రధారులుగా మారాలని రష్యా, ఇరాన్లు భావిస్తున్నాయనేది స్పష్టం అవుతోంది. పైగా సూయాజ్ కాలువ, మలక్కా జలసంధి పాశ్చాత్య దేశాలు అడ్డుపడదగిన మార్గం కాదు కూడా.ఏయే దేశాలు చేతులు కలపొచ్చు?చైనా ఈ అభివృద్ధిని ఆసక్తిగా గమనిస్తోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో(BRI) ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం నుండి బాల్టిక్ వరకు నిరంతర వాణిజ్య మార్గాన్ని పర్యవేక్షిస్తోంది. పాశ్చాత్య ఆంక్షలను తిరస్కరిస్తున్న ఈ బ్లాక్.. భవిష్యత్తులో INSTCతో చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. 2024లో రష్యా అధికారికంగా గుర్తించిన తాలిబన్ పాలిత అఫ్గనిస్తాన్ కూడా ఈ కారిడార్లో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇది పాకిస్థాన్ను పక్కనపెట్టి దక్షిణాసియాలోకి మార్గాన్ని విస్తరించనుంది. ఇదే సమయంలో భారత్ ప్రతిపాదించిన IMEC కారిడార్(అమెరికా, భారత్, ఇజ్రాయెల్, యూరప్ కలిసి ప్రతిపాదించిన మార్గం) ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. దీంతో.. భారత్ కూడా ఈ మార్గాన్ని పరిశీలించవచ్చనే అంచనాలున్నాయి. ప్రభావం..ఈ రైలు మార్గం (Rasht–Astara) పాశ్చాత్య దేశాల, ముఖ్యంగా అమెరికా ప్రభావాన్ని తగ్గించడంలో కీలకమే చెప్పొచ్చు. పైగా ఈ కారిడార్ ద్వారా చైనా, భారత్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో రష్యా-ఇరాన్ సంబంధాలు బలపడతాయి. ఇది అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపరచే దిశగా సాగుతుంది. బ్రిక్స్, SCO బలమైన మద్దతుతో.. పాశ్చాత్య దేశాలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అడ్డుకోగలరా?ఇంతటి వ్యూహాత్మకమైన రైలు మార్గాన్ని ట్రంప్ దీన్ని నేరుగా అడ్డుకోవడం చాలా కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. అయితే.. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రొత్సహించడమో(IMEC కారిడార్ త్వరగతిన పూర్తయ్యేలా చూడడం) లేదంటే ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లతో ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇదీ చదవండి: ప్రపంచానికి దారిదీపం భారతే! -
నేడు డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ సమావేశం
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్పింగ్ గురువారం దక్షిణ కొరియాలో సమావేశం కాబోతున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలతోపాటు ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించే అవకాశం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ బుధవారం వెల్లడించారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ ఇప్పటికే దక్షిణ కొరియాకు చేరుకున్నారు. దక్షిణ కొరియాలోని బుసాన్ సిటీలో ట్రంప్, జిన్పింగ్ భేటీ కాబోతున్నారు. అమెరికా–చైనా సంబంధాల్లో స్థిరమైన పురోగతికి నూతన వేగాన్ని కల్పిచేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని తాము అంచనా వేస్తున్నట్లు జియాకున్ తెలియజేశారు. సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షీ జిన్పింగ్తో ముఖాముఖి భేటీ అవుతుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
104 మందిని చంపేసి కాల్పుల విరమణ పాట!
డెయిర్–అల్–బాలాహ్(గాజా స్ట్రిప్): పెద్దన్న పాత్రలో డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉత్తదేనని తేలిపోయింది. బందీల మృతదేహాల అప్పగింత ఆలస్యమైందన్న సాకు చూపి ఇజ్రాయెల్ మళ్లీ గాజాపై భీకర స్థాయిలో దాడులతో తెగబడింది. సంధి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇజ్రాయెల్ మంగళవారం రాత్రి మొదలెట్టిన భూతల, గగనతల దాడుల్లో ఇప్పటిదాకా 104 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 10న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక ఈ స్థాయిలో దాడులు, ఇంతటి మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. దీంతో పశ్చిమాసియాలో హమాస్ సాయుధులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య విబేధాలు నివురుగప్పిన నిప్పులా అలాగే ఉన్నాయని స్పష్టమైంది. ఇష్టారీతిగా దాడులు చేసి 104 మందిని పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్ సైన్యం బుధవారం సాయంత్రం నుంచి మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకివచ్చిందని ప్రకటించడం గమనార్హం. -
మోదీ గొప్ప వ్యక్తి.. కిల్లర్
టోక్యో/సియోల్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వాచాలత్వం ప్రదర్శించారు. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. మోదీ చాలా మంచి మనిషి, చక్కగా, అందంగా కనిపించే నాయకుడు అంటూనే ఆయనొక కిల్లర్, నరకం లాంటి కఠినమైన వ్యక్తి అంటూ ఆక్షేపించారు. మనం ఎలాంటి మంచి తండ్రి కావాలని కోరుకుంటామో సరిగ్గా అలా కనిపించే వ్యక్తి మోదీ అంటూ వ్యాఖ్యానించారు. మూడు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఉదయం జపాన్ నుంచి దక్షిణ కొరియాకు చేరుకున్నారు. గెయింగ్జూలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార(అపెక్) సీఈఓ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహ బాంధవ్యాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఆయన గొప్ప మిత్రుడు అంటూ ప్రశంసించారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని, అందుకోసం వాణిజ్యం అనే అస్త్రం ప్రయోగించానని మరోసారి వెల్లడించారు. భారత్–పాక్ మధ్య ఘర్షణ మొదలైన తర్వాత మోదీతో ఫోన్లో మాట్లాడానని, మీతో వాణిజ్య ఒప్పందం చేసుకొనే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పానని వివరించారు. పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభించారంటూ మోదీని మందలించానని అన్నారు. వాణిజ్య ఒప్పందం ఉండదని కచ్చితంగా చెప్పడంతో భారత్ దారికొచ్చిందని, పాక్పై దాడులు నిలిపివేసిందని స్పష్టంచేశారు. కొత్త, అందమైన యుద్ధ విమానాలు ధ్వంసం దక్షిణ కొరియాకు బయలుదేరడానికి ముందు ట్రంప్ జపాన్ రాజధాని టోక్యోలో వ్యాపారవేత్తలతో విందు కార్యక్రమంలో మాట్లాడారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేశానని చెప్పారు. ఆపరేషన్ సిందూర్లో భారత్కు నష్టం వాటిల్లిందని పరోక్షంగా స్పష్టంచేశారు. ‘‘ఏడు నూతన, అందమైన యుద్ధ విమానాలు నేలకూలాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య జరిగిన యుద్ధంలో అవి ధ్వంసమయ్యాయి’’ అని తెలిపారు. -
మోదీతో అంత ఈజీ కాదు: ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒస్పేసుకున్నారా?, త్వరలో భారత్తో వాణిజ్య చర్చలకు సిద్ధమవుతున్న ట్రంప్.. మోదీపై ప్రశంసలకు కారణం ఏమిటి?, భారత్తో స్నేహ హస్తాన్ని కాదనుకుంటే తమకే ముప్పు తప్పదని ట్రంప్ గ్రహించారా?, వీటికి మరింత బలం చేకూరుస్తూ దక్షిణకొరియా వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.‘నాకు మోదీతో మంచి రిలేషన్ ఉంది. ఆయన చూడటానికి చాలా సౌమ్యంగా కనిపిస్తారు. తండ్రిలా కనిపిస్తారు. కానీ ఆయనతో అంత ఈజీ కాదు. మోదీ అంటే నరకం కంటే కఠినం. ఆయనొక ‘కిల్లర్’’ అంటూ కొనియాడారు. ఇక్కడ కిల్లర్ అనే కాస్త వివాదాస్పదంగా కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా వెనుకడుగేసి నైజం మోదీలో లేదనేది ట్రంప్ చెప్పకనే చెప్పేశారు. దక్షిణ కొరియాలోని గ్యోంగ్జులో జరిగిన ఆసియన్-పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ (APEC) సీఈఓల సమ్మిట్లోట్రంప్ మాట్లాడుతూ.. మోదీని ఆకాశానికెత్తేశారు. భారత–అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరిగే అవకాశముందని చెప్పారు ట్రంప్.- పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో మోదీతో జరిగిన సంభాషణను సైతం వివరించారు ట్రంప్. ఆ సమయంలో మోదీ తనతో మాట్లాడిన శైలిని సైతం ట్రంప్ అనుకరించారు. -
మనది స్వర్ణయుగ బంధం
టోక్యో: చైనాతో వాణిజ్య యుద్ధ భయాల వేళ.. ఆ దేశానికి చారిత్రక శత్రువు అయిన జపాన్కు మరింత దగ్గరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. సోమవారం నుంచి జపాన్లో రెండురోజుల పర్యటనలో ఉన్న ఆయన జపాన్ తొలి మహిళా ప్రధాని సనాయి తకాయిచితో అనేక అంశాలపై చర్చలు జరిపారు. మంగళవారం రోజంతా ఈ ఇద్దరు నేతలు వివిధ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. ట్రంప్ను ప్రసన్నం చేసుకొనేందుకు తకాయిచి ప్రయత్నించగా, జపాన్ నుంచి బలవంతంగానైనా పెట్టుబడులు రాబట్టేందుకు ట్రంప్ ప్రయత్నించారు.పనిలో పనిగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ను నామినేట్ చేసేందుకు తకాయిచిని ఒప్పించారు. తకాయిచితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా జపాన్కు ట్రంప్ పలు హామీ ఇచ్చారు. ‘జపాన్కు సాయం చేసేందుకు నేను చేయాల్సిందంతా చేస్తాను. మన ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడు చాలా బలమైన స్థాయిలో ఉన్నాయి’అని పేర్కొన్నారు. లంచ్ మీటింగ్లో భాగంగా ఇరువురు నేతలు అంతర్జాతీయ పరిణామాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించారు. రెండు దేశాల మధ్య కీలకమైన ఖనిజా లపై వాణిజ్య సంబంధాల్లో ప్రస్తుతం స్వర్ణ యుగం నడుస్తోందని ఇద్దరు నేతలు వ్యాఖ్యానించారు. అమెరికాలో జపాన్ భారీ పెట్టుబడులుట్రంప్ తన సహజ ధోరణిలో జపాన్కు వరాలు ప్రకటిస్తూనే నిందలు కూడా మోపారు. జపాన్ అసలు అమెరికా వాహనాలను కొనటం లేదని ఆరోపించారు. అమెరికాలో 550 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు లంచ్ మీటింగ్లో ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికాకు చెందిన 150 ఫోర్డ్ ట్రక్కులకు కొనుగోలు చేస్తామని తకాయిచి ప్రకటించారు.అనంతరం టోక్యో సమీపంలోని అమెరికా సైనిక స్థావరం వద్ద ఉన్న అమెరికా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్పై కూడా ట్రంప్, తకాయిచి సమావేశమయ్యారు. మరోవైపు అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా, జపాన్ కంపెనీల సీఈవోలకు ట్రంప్ విందు ఇచ్చారు. జపాన్ కంపెనీల సీఈవోలతో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ విందు సమావేశం నిర్వహించి భారీగా పెట్టుబడులు రాబట్టారు. వెస్టింగ్హౌస్, జీఈ వెర్నోవా సంస్థలు అమెరికాలో అణు విద్యుత్ ప్రాజెక్టుల్లో 100 బిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ట్రంప్కు శుభవార్తనోబెల్ శాంతి పురస్కారం కోసం తహతహలా డుతున్న ట్రంప్కు జపాన్ ప్రధాని శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ను నామినేట్ చేస్తామని తకాయిచి హామీ ఇచ్చినట్లు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ లీవిట్ తెలిపారు. ఈ ఏడాది పాకిస్తాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు, వ్యక్తులు ట్రంప్ను నామినేట్ చేసినా నోబెల్ కమిటీ ఆయనకు శాంతిపురస్కారం ఇవ్వలేదు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య సమావేశంలో పాల్గొనేందుకు ట్రంప్ బుధవారం దక్షిణకొరియాకు బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో చర్చలు జరుపనున్నారు. -
తదుపరి గురి వెనిజులా?
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు గల లాటిన్ అమెరికా దేశం వెనిజులాను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా ఇపుడు సన్నాహాలు ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ఉక్రెయిన్, గాజా యుద్ధాల తర్వాత ఈ కొత్త పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తు న్నాయి. తమ సన్నాహాలలో భాగంగా అమెరికా ఇటీవలి వారాలలో వెనిజులా సమీపంలోని కరీబియన్ సముద్రానికి 10 యుద్ధ నౌకలను, 10 ఎఫ్–35 యుద్ధ విమానాలను, ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌకను, ఒక అణుశక్తి జలాంత ర్గామిని మోహరించింది. ఇందుకు అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్న కారణాలు అదే ప్రాంతంలో గల ట్రినిడాడ్ దేశంతో కలిసి యుద్ధ విన్యాసాలు జరపటం, అదే విధంగా వెనిజులా నుంచి మాదక ద్రవ్యాల రవాణాను నిలువరించటం! కానీ, గత 35 సంవత్సరా లుగా ఎన్నడూ లేని స్థాయిలో సాగుతున్న మోహరింపుల ఉద్దేశం అదేనని ఎవరూ నమ్మటం లేదు.చమురు కోసమేనా?వెనిజులాలోని చమురు నిల్వలు 303 బిలియన్ బ్యారల్స్ అని అంచనా. వాటితో పోల్చినపుడు సౌదీ అరేబియా నిల్వలు 267 బిలియన్లు, ఇరాన్వి 208 బిలియన్లు, రష్యావి 80 బిలియన్లు కావ టాన్ని బట్టి పరిస్థితిని ఊహించవచ్చు. అయితే, పాశ్చాత్య దేశాల ఆంక్షలు, పెట్టుబడులకు – మౌలిక ఏర్పాట్లకు గల కొరత కారణంగా అక్కడ ఉత్పత్తి స్వల్పంగానే జరుగుతున్నది. మరొకవైపు అక్కడి నిల్వలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు పాశ్చాత్య దేశాల కంపెనీల ప్రయత్నాలు నెరవేరటం లేదు. ఆ నిల్వలన్నింటి యాజ మాన్యం అక్కడి ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. సోషలిస్టు పార్టీకి చెందిన హ్యూగో చావెజ్ ప్రభుత్వం లోగడ తీసుకున్న ఈ నిర్ణ యాన్ని, ఆయన వారసుడైన ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో కొనసాగిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరిపడని ట్రంప్, ఆయనను పడగొట్టేందుకు తన మొదటి పాలనా కాలంలోనూ ప్రయత్నించారు గానీ వీలుపడలేదు.వెనిజులాలో సోషలిస్టు పార్టీ బలమైనది. తమ దేశంలోగానీ, మొత్తం లాటిన్ అమెరికాలో గానీ అమెరికా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చావెజ్ తన రోజులలో ప్రపంచవ్యాప్తంగా పేరు పడ్డారు. ఆయన మరణం తర్వాత అధ్యక్షుడైన మదురో స్వరంలో అటువంటి తీవ్రత లేకపోయినా, విధానాలలో ఎటువంటి మార్పూ లేదు. మదురో సమాజంలోని అడుగుస్థాయి నుంచి ఎదిగి వచ్చిన వాడు. 2013 నుంచి ఇప్పటికీ వరుసగా అధ్యక్షునిగా ఎన్నికవు తున్నారు. ఆయనకు ప్రజల మద్దతు సరేసరి కాగా, సమాజంలోని ఎగువ తరగతులు, పట్టణవాసులతోపాటు సైన్యం సమర్థన కూడా పూర్తిగా ఉందన్నది అంచనా. అందువల్లనే ఆయన్ని అమెరికా అనేక ఇతర లాటిన్ అమెరికా దేశాలలో చేసినట్లు అంతర్గత కుట్రల ద్వారా పడగొట్టలేక పోతున్నదనే అభిప్రాయం ఉంది. మాదక ద్రవ్యాల సాకుతో...ఒక విశేషం చెప్పుకోవాలి. గత ఎన్నికలలో మదురోతో పోటీ చేసి ఓడిన మరియా కొరీనా మచాడోకు ఇటీవలి నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు. వెనిజులా సమీపాన అమెరికా సేనల మోహరింపుపై, ‘యుద్ధాన్ని మదురో ప్రారంభించారు, ట్రంప్ ముగించనున్నారు’ అని వ్యాఖ్యానించి ఆమె అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ నేపథ్యం ఇట్లుండగా, వెనిజులాపై చర్యలకు ట్రంప్ సాకులు వెతకటం మొదలుపెట్టారు. అందులో మొదటిది నిరుటి అధ్యక్ష ఎన్నికలలో అక్రమాలు జరిగాయనీ, అందువల్లనే మరియా మచాడో ఓడిందనీ ఆయన ఆరోపణ. మరొక దేశపు ఎన్నికల సక్ర మాలు, అక్రమాలను నిర్ధారించటమనే సాకుతో తమకు సరిపడని ప్రభుత్వాలను పడగొట్టజూడటం అమెరికాకు గతం నుంచి ఉన్న సంప్రదాయమే! అంతెందుకు? వెనిజులాకు సరిగా పొరుగునే గల బ్రెజిల్లో, ఎన్నికలలో గెలిచిన అధ్యక్షుడు లూలాతో ఓడిన బోల్సొ నారో తిరుగుబాటును, ఆయనపై కోర్టు చర్యలను ట్రంప్ బాహాటంగా వ్యతిరేకించారు. తన మిత్రుడైన బోల్సొనారోపై చర్యలు తీసు కున్నందుకు బ్రెజిల్పై సుంకాలను 50 శాతం పెంచారు. అమెరికా ఉద్దేశంలో ఇదంతా ప్రజాస్వామ్య పరిరక్షణ. కనుక ఇపుడు వెనిజులా ఎన్నికలు, మచాడో ఫిర్యాదులు అమెరికా అధ్యక్షునికి సాకులుగా ఉపయోగపడుతున్నాయి. అయితే, గత ఏడాదిగా సాగుతున్న ఈ ప్రయత్నాలు నెరవేరక పోతుండటంతో ట్రంప్ ఇటీవల కొత్త సాకు ముందుకు తెస్తున్నారు. వెనిజులా నుంచి తమ దేశంలోకి కొకైన్, ఫెంటానిల్ వంటి డ్రగ్స్ భారీగా రవాణా అవుతున్నాయంటున్నారు!మాదక ద్రవ్యాల సమస్య అమెరికాలో తీవ్రంగా ఉంది. కానీ అందులో వెనిజులా పాత్ర ఏమిటన్నది ప్రశ్న. అమెరికా సంస్థ ప్రక టించిన మాదక ద్రవ్యాల నివేదిక – 2025లో వెనిజులా ప్రస్తావన లేదు. కొకైన్, ఫెంటానిల్ తదితరాలన్నీ ఉత్పత్తి అవుతున్నది కొలంబియా, పెరూ, బొలీవియా, మెక్సికో వంటి చోట్ల. రవాణా మాత్రం స్వల్పస్థాయిలో వెనిజులా మీదుగా జరుగుతున్నది. ఇతరత్రా కూడా బయటి నిపుణుల అభిప్రాయం అదే.ఏకపక్ష దాడులుఈ వివరాలన్నీ గమనించినపుడు, అమెరికా అధ్యక్షుని లక్ష్యం మదురో ప్రభుత్వాన్ని పడగొట్టి తమ అనుకూలురను అధికారానికి తేవటమని తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఆ మాట ట్రంప్ గత పర్యాయమే అన్నట్లు పైన చూశాము. అదే మాటను ఈసారి డొంక తిరుగుడుగా చెబుతుండగా, తన విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూటిగానే అంటున్నారు. ఇటీవలి వారాలకు వస్తే, అక్కడ జోక్యం చేసుకుని రహస్య కార్యకలాపాలు సాగించవలసిందిగా సీఐఏను ఆదేశించినట్లు ట్రంప్ బాహాటంగానే ప్రకటించారు. మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయంటూ వెనిజులా తీరంలో పది బోట్లపై వైమానిక దాడులు జరిపి సుమారు యాభైమంది ప్రాణాలు తీశారు. ఆ రవాణా అబద్ధమని, అవన్నీ మామూలు బోట్లని మదురో ఖండించారు. మాదక ద్రవ్యాలకు ఆధారాలు దాడికి ముందుగానీ, తర్వాతగానీ ఉన్నాయా అన్న మీడియా ప్రశ్నలకు ట్రంప్ సమాధానమివ్వలేదు. ఐక్యరాజ్యసమితి సముద్రయాన, సముద్ర తీర చట్టాల ప్రకారం అసలు అటువంటి దాడుల అధికా రమే లేదని నిపుణులు స్పష్టం చేశారు. అయినా ఇదంతా ప్రపంచపు అమాయకత్వంగాని, అమెరికా ప్రయోజనాలకు ఎప్పుడు ఏది ప్రతిబంధకమైంది గనుక!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
‘భజనలో.. గోల్డ్ మెడల్ నీకేపో!’
ఒకవేళ భజన అనే పోటీ గనుక ఒలింపిక్స్లో ఉండి ఉంటే.. పాకిస్తాన్కు కచ్చితంగా ఆ పోటీల్లో గోల్డ్ మెడల్ వచ్చి తీరేదేమో!. విన్నర్ పోడియంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉండి ఉండేవారేమో!.. ఈ మాటలు అంటోంది ఆ దేశ మాజీ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై విపరీతమైన ప్రశంసలు గుప్పించాడు. కంబోడియా–థాయ్లాండ్ మధ్య తాజాగా కౌలాలంపూర్ ట్రంప్ సమక్షంలో శాంతి ఒప్పందం కుదరింది. ఈ నేపథ్యంలో.. శాంతి, స్థిరత్వానికి కృషి చేసే నాయకుండంటూ పాక్ ప్రధాని విపరీతమైన పొగడ్తలు గుప్పించారు. మొన్న గాజా శాంతి ప్రణాళిక.. ఇప్పుడేమో ఇది. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో శాంతి కోసం ట్రంప్ చేసిన కృషి ప్రపంచాన్ని రక్షించింది. లక్షల మంది ప్రాణాలు పోకుండా నిలబెట్టింది అని షెహబాజ్ పేర్కొన్నారు.దీనిపై పాకిస్తాన్ మాజీ అమెరికా రాయబారి హుస్సేన్ హక్కానీ, షెహబాజ్ షరీఫ్పై వ్యంగ్యంగా స్పందించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్ను పొగడటంలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచే స్థాయిలో ఉన్నారంటూ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ఫరీద్ జకారియా వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘ఇది ఒలింపిక్ క్రీడ అయితే, షరీఫ్ పోడియం మీద గోల్డ్ మెడల్తో నిలిచేవారు అని అన్నారు. ఈజిప్ట్లో జరిగిన గాజా శాంతి సదస్సులోనూ షరీఫ్ ట్రంప్ను విపరీతంగా పొడిగారు. ట్రంప్ను శాంతి పురుషుడిగా అభివర్ణిస్తూ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడంటూ మాట్లాడారు. ఆ సమయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చిత్రమైన హవభావాలు ప్రదర్శించడం విపరీతంగా వైరల్ అయ్యింది. షరీఫ్ మాటలతో కడుపు నిండిపోయిన ట్రంప్ ‘ఇక మాట్లాడేం లేదని, ఇంటికి వెళ్లిపోదాం’ అంటూ వ్యంగ్యంఆ స్పందించడం మరో కొసమెరుపు. అయితే షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను పాక్ పౌరులే భరించలేకపోయారు. అంతలా దిగజారి పొగడాల్సిన అవసరం ఏముందంటూ.. ప్రధానిని తిట్టిపోశారు కూడా. -
రాజ్యాంగ విరుద్ధమైనా.. ‘మళ్లీ నేనే!?’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(79) తన మనసులోని మాట బయటపెట్టారా?. ముచ్చటగా మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటున్నారా?. జపాన్ పర్యటనకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యల ఆంతర్యం అదేనంటూ చర్చ నడుస్తోంది ఇప్పుడు.వైట్హౌజ్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ తాజాగా ట్రంప్ మూడో దఫా పోటీపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. జపాన్ పర్యటనకు బయల్దేరే ముందు విమానం(Air Force One) వద్ద మీడియా ఆయన్ని ఆ వ్యాఖ్యలపై ప్రశ్నించింది. దానికి ట్రంప్ స్పందిస్తూ.. ‘‘మూడోసారి పోటీ చేయడం నాకు ఇష్టమే. నా వద్ద అత్యుత్తమ నెంబర్లు ఉన్నాయి’’ అంటూ బదులిచ్చారు. అయితే.. ఆ వెంటనే ‘‘ఇంకా ఆ విషయంపై నిజంగా ఆలోచించలేదు’’ అని అన్నారు. ట్రంప్ తన తరువాత రిపబ్లికన్ పార్టీని నడిపే నాయకులుగా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్లను ప్రస్తావించారు. మా వద్ద గొప్ప నాయకులు ఉన్నారు అంటూ రుబియో వైపు చూపిస్తూ.. ‘వాళ్లలో ఒకరు ఇక్కడే ఉన్నారు’ అని చమత్కరించారు. అలాగే.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను ప్రశంసిస్తూ.. అవును, జేడీ అద్భుతంగా ఉన్నాడు. ఉపాధ్యక్షుడు గొప్పవాడు. వీళ్లిద్దరిని ఎదుర్కొనే వారు ఉండరేమో అని ట్రంప్ అన్నారు.అమెరికాకు అధ్యక్ష ఎన్నికలు 2028 సంవత్సరంలో జరగనున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఒక వ్యక్తి అధ్యక్ష పదవికి రెండుసార్లు మాత్రమే ఎన్నిక కావచ్చు. మూడోసారి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే స్టీవ్ బానన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ట్రంప్ 2028లో మూడోసారి అధ్యక్షుడిగా అవుతారు. దీనికి ఒక ప్రణాళిక ఉంది. కఠినమైన అడ్డంకే ఉన్నా.. దాన్ని అధిగమించే మార్గాలు ఉన్నాయి. 2016, 2024లో ట్రంప్ సాధించారు. వచ్చేసారి కూడా సాధించగలరు అని అన్నారు. గతంలో ఫ్రాక్లిన్ డి రూజ్వెల్ట్ అమెరికాకు నాలుగు పర్యాయాలు అధ్యక్షుడిగా పని చేశారు. అయితే.. 1951లో రాజ్యాంగానికి 22వ సవరణ (22nd Amendment) ద్వారా రాటిఫై చేశారు. ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే, అమెరికా రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే, అత్యధిక రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇది రాజకీయంగా చాలా కష్టమైన ప్రక్రియ. ఇది ప్రస్తుతం సాధ్యపడే అవకాశాలు లేవు. స్టీవ్ బానన్, ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీసేలా ఉన్నా.. న్యాయపరంగా అవి అమలులోకి రావడం అసాధ్యం. ఇదిలా ఉండగా.. ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ మలేషియా నుంచి జపాన్ చేరుకున్నారు. సోషల్ ట్రూత్లో ఈ మేరకు.. మలేషియా అద్భుతమైన దేశం. ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలు, రేర్ ఎర్త్ డీల్స్ సంతకం చేశాం. ముఖ్యంగా థాయ్లాండ్ మరియు కంబోడియా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. యుద్ధం లేదు! కోట్లాది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఇది చేయడం గౌరవంగా ఉంది. ఇప్పుడు జపాన్కు బయల్దేరా అని పోస్ట్ చేశారు. -
పాక్ మాకు మిత్రుడే.. భారత్తో బంధం వదులుకోలేం: మార్కో రుబియో
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ విషయంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్తో వ్యూహాత్మక సంబంధాల విస్తరిస్తున్న సమయంలో భారత్ను దూరం చేసుకోలేమని చెప్పుకొచ్చారు. భారత్తో ఉన్న చారిత్రాత్మక, బలమైన, ముఖ్యమైన సంబంధాలను పణంగా పెట్టబోమని తెలిపారు.మలేసియా రాజధాని కౌలాలంపూర్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్తో మార్కో రుబియో ఈరోజు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పాక్తో అమెరికా సంబంధాలపై కొన్ని కారణాల రీత్యా భారత్కు ఆందోళనలు ఉన్నాయి. వేర్వేరు దేశాలతో మాకు సంబంధాలు ఉండాలనేది భారత్ అర్థం చేసుకోవాలి. ఎన్నడూ భారత్తో బంధాలను మేం వదులుకోబోమని క్లారిటీ ఇచ్చారు.ఇదే సమయంలో పాక్తో వ్యూహాత్మక సంబంధాల విస్తరణలో మాకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దౌత్యం, దానితో ముడిపడిన అంశాల వరకు భారతీయులు ఎంతో పరిపక్వతతో ఉంటారనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాతో సంబంధాల్లేని కొన్ని దేశాలతో భారత్కు అనుబంధం ఉంది. అందువల్ల ఇదంతా పరిపక్వతతో కూడిన, ఆచరణీయ విదేశాంగ విధానం’ అని చెప్పుకొచ్చారు. అలాగే, రష్యాతో చమురు కొనుగోళ్ల సంబంధాలను మళ్లించుకునేందుకు భారత్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తంచేసిందని చెప్పారు.ఇదిలా ఉండగా.. మలేషియా వేదికగా ఆసియన్ సదస్సు జరుగుతోంది. ఆసియాన్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్.. మలేషియా పర్యటనకు వచ్చారు. ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. ఆసియాన్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, జపాన్ కొత్త ప్రధాని తకాయిచి, దక్షిణ కొరియా నేతలు కూడా పాల్గొననున్నారు. -
రష్యా చమురుకు భారత్ రాం రాం!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా ఆపేయాలని భారత్పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అదే మాట మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా తగ్గిస్తోందని తెలిపారు. చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారీగా తగ్గిస్తోందని చెప్పారు. శనివారం తన ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మలేషియా వెళ్లూ మార్గమధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణకొరియాలో జరుగనున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య (అపెక్) సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశమై నప్పుడు రష్యా చమురు గురించి కూడా ప్రస్తావిస్తానని చెప్పారు. భారత్–పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాపనని మరోసారి చెప్పుకున్నారు. ‘భారత్–పాక్ యుద్ధంతోపాటు మరికొన్ని యుద్ధాలను ఆపటం చాలా కష్టమని, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపటం చాలా తేలిక అని నేను భావించాను. కానీ, నా అంచనా తప్పింది. భారత్–పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు నేను చేయాల్సిందంతా చేశాను. రష్యా– ఉక్రెయిన్ విషయంలో కూడా అదే వ్యూహం అమలుచేశాం. కానీ, ఆ రెండు దేశాధినేతల మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ పరస్పరం తీవ్రంగా అసహ్యించుకుంటారు’అని ట్రంప్ తెలిపారు. -
తీమోర్కు సభ్యత్వం
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) సమావేశంలో కీలక పరిణా మాలు చోటు చేసుకు న్నాయి. 1990ల తర్వాత చేపట్టిన మొట్టమొదటి విస్తరణలో సమాఖ్య నూతన సభ్య దేశంగా తూర్పు తీమోర్ చేరింది. కాంబోడియా–థాయ్లాండ్ల మధ్య కాల్పుల విరమణను మరింతకాలం పొడిగించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సమావేశ వేదికపై ఏర్పాటు చేసిన జెండాల్లో తూర్పు తీమోర్ లేదా తిమోర్ లెస్టీ జెండాను కూడా చేర్చారు. తమ కల ఇప్పటికి నిజమైందని ఆ దేశ ప్రధానమంత్రి జనానా గుజ్మావో తెలిపారు. అదేవిధంగా, సమావేశానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో సరిహద్దు సమస్యపై కాల్పుల విరమణను మరికొంతకాలం పొడిగించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై కాంబోడియా– థాయ్లాండ్ ప్రధానులు హున్ మనెట్, అనుతిన్ చర్న్విరకుల్లు సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా బందీలుగా ఉన్న 18 మంది కాంబోడియా సైనికులను థాయ్లాండ్ విడిచిపెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా, సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాలు మోహరించిన భారీ ఆయుధాలను ఉపసంహరించుకుంటాయి. ఒప్పందంలోని అంశాల అమలును పర్యవేక్షించేందుకు ఆసి యాన్ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ ఒప్పందాన్ని సంయుక్త ప్రకటనగా కాంబోడియా, థాయ్ నేతలు పేర్కొనగా ట్రంప్..కౌలాలంపూర్ శాంతి ఒప్పందంగా దీనిని అభివర్ణించారు. ఈ రెండు దేశాలతోపాటు మలేసియాతోనూ తాము కీలక ఖనిజాలు సహా పలు ఆర్థిక ఒప్పందాలను కుదుర్చుకున్నామని చెప్పారు. ట్రంప్తోపాటు చైనా ప్రధాని లీ క్వియాంగ్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, జపాన్ నూతన ప్రధాని సనే తకాయిచీ, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా తదితర డజనుకు పైగా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజులపాటు సాగే ఈ సమావేశాల్లో రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్, చైనాల నుంచి వచ్చిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలతో సభ్య దేశాలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది.ట్రంప్–జిన్పింగ్ భేటీకి రంగం సిద్ధంఆధునిక సాంకేతికతకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాల ఎగుమ తులపై చైనా నిషేధం విధించడం, వాటిని తొలగించకుంటే మరో 100 శాతం టారిఫ్లు తప్పవంటూ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక ఉద్రిక్తతలు ఆసియాన్ సమా వేశాల సందర్భంగా సడలిన జాడలు కనిపిస్తున్నాయి. కౌలాలంపూర్ వేదికగా అమెరికా, చైనా ఉన్నత స్థాయి ప్రతినిధులు జరిపిన చర్చల్లో ఒక అంగీకారం కుదిరింది. చైనా వాణిజ్య ప్రతినిధి లి చెంగాంగ్ మీడియాతో మాట్లాడుతూ..రెండు పక్షాలు వివాదాస్పద అంశాలపై ప్రాథమిక ఏకాభిప్రాయానికి వచ్చాయని, సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా యని పేర్కొన్నారు. రెండు దేశాలు ఒప్పందం వైపు మొగ్గు చూపుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అన్నారు. భవిష్యత్తులో చైనాలో పర్యటించాలనుకుంటున్నానని, అదేవిధంగా జిన్పింగ్ ఫ్లోరిడాలోని తన మార్ ఇ లాగో రిసార్టుకు లేదా వాషింగ్టన్కు వస్తారని చెప్పారు. -
స్వేచ్ఛా వాణిజ్యం బలోపేతం
ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనిశి్చత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్లో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. కౌలాలంపూర్/న్యూఢిల్లీ: ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్ నగరంలో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ శాంతిభద్రతలకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందని, దీనిని ఎదుర్కొనేందుకు అందరం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ అన్నారు. ఆసియాన్–ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్(ఏఐటీఐజీఏ)ను వీలైనంత త్వరగా సమీక్షించాలని మోదీ అభిలషించారు. మోదీ ప్రసంగ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఏఐటీఐజీఏ ఒప్పందం 15 ఏళ్ల క్రితం అమల్లోకి వచి్చంది. ఇప్పుడు భారత్–ఆసియాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమైతే ఇరు దేశాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. ప్రాంతీయ సహకారం సైతం ఇనుమడిస్తుంది’’అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా ఆసియాన్, భారత్ల ఆర్థిక ప్రగతికి బాటలువేసే కీలకమైన సుస్థిర పర్యాటకంపై ఇరువర్గాలు ఒక ప్రకటన విడుదలచేశాయి. ‘‘ఇండో–పసిఫిక్లో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్) కూటమికి భారత్ గట్టి మద్దతుదారుగా నిలుస్తోంది. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం(2026–2030) అమలు కోసం ఆసియాన్–భారత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్కు మద్దతు పలుకుతున్నాం. త్వరలో రెండో ఆసియాన్–భారత్ రక్షణ మంత్రుల సమావేశం, రెండో ఆసియాన్–భారత్ నౌకావిన్యాసాలు జరుపుదాం’’అని మోదీ అన్నారు. నాలుగో వంతు మనమే ‘‘విశ్వమానవాళిలో నాలుగో వంతు జనాభాకు భారత్, ఆసియాన్ దేశాలే ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. జనాభాను మాత్రమే కాదు మనం అత్యంత చరిత్రాత్మకమైన ఒప్పందాలు, విలువల బంధాలతో పెనవేసుకుపోయా. గ్లోబల్ సౌత్లో మనం కలిసి ముందడుగువేస్తున్నాం. కేవలం వాణిజ్య భాగస్వాములం కాదు సాంస్కృతిక సహచరులం. భారత్ అవలంభిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ అనేది పునాదిరాయి. ఆసియాన్ లక్ష్యాలకు, ఇండో–పసిఫిక్ విషయంలో ఆసియాన్ వైఖరికి భారత్ ఎల్లవేళలా పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతోంది. ఒడిదుడుకుల కాలంలోనూ భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది సుస్థిరాభివృద్ధిని కొనసాగించింది. ఈ బలమైన బంధమే యావత్ ప్రపంచ సుస్థిరాభివృద్ధి, ప్రగతికి కొత్త అంకురార్పణ చేస్తోంది. భారత్, ఆసియాన్ రెండూ విద్య, పర్యాటకం, శాస్త్రసాంకేతిక, ఆరోగ్య, శుద్ధ ఇంధనం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో మరింత బలమైన పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయి. ఇకమీదట సైతం సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకునేందుకు కలిసి పనిచేస్తాం. భారత, ఆసియాన్ ప్రజల మధ్య సత్సంబంధాలను పెంచుతాం. ఇందుకోసం భుజం భుజం కలిపి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఆసియాన్ పవర్ గ్రిడ్ కార్యక్రమం కోసం 400 నిపుణులకు పునరుత్పాదక ఇంధన రంగంలో శిక్షణనిప్పిస్తాం ’’అని మోదీ అన్నారు. సవాళ్లు ఎదురవుతున్నా.. అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నా డిజిటల్ సమ్మిళిత వృద్ధి, ఆహార భద్రత, సరకు రవాణా గొలుసు వంటి అంశాల్లో ఆసియాన్ దేశాలు సమష్టిగా పోరాడుతూ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఇతివృత్తమైన ‘సమ్మిళిత సుస్థిరత’భావనను శిఖరాగ్రాలపై నిలిపాయి. ఆసియాన్ దేశాల ప్రాధాన్యతలను మద్దతు పలుకుతూనే ఆసియాన్ దేశాలను ఇలాగే సమష్టిగా కలిపి ఉంచేందుకు భారత్ కృషిచేస్తుంది. ఆపత్కాలంలో ఆసియాన్ దేశాలను ఆదుకునేందుకు భారత్ సదా ఆపన్నహస్తం అందించింది. మనవతా సాయం, విపత్తు సాయం, సముద్రయాన భద్రత, సాగరసంబంధ వాణిజ్యాభివృద్ధికి భారత్ అండగా నిలబడుతుంది. 2026 ఏడాదిని ‘ఆసియాన్–భారత్ సముద్ర సహకార సంవత్సరం’గా ప్రకటిస్తున్నాం’’అని మోదీ చెప్పారు. -
ఇదేదో భలే ఉందే.. డ్యాన్స్ చూస్తూ ట్రంప్ మార్క్ స్టెప్పులు
కౌలాలంపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రోజులు తర్వాత మళ్లీ ఫుల్ జోష్లో కనిపించారు. ఆనందంలో డ్యాన్స్ చేస్తూ కేరింతలు కొట్టారు. మలేషియా పర్యటనలో భాగంగా ట్రంప్ ఇలా స్టెప్పులు వేయడం విశేషం. ట్రంప్ డ్యాన్స్(Trump Dance Video) వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మలేసియా పర్యటనకు వెళ్లారు. అమెరికా నుంచి దాదాపు 23 గంటల పాటు విమాన ప్రయాణం చేసిన ట్రంప్.. ఆదివారం కౌలాలంపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్కు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Malaysian Prime Minister Anwar Ibrahim) ఘన స్వాగతం పలికారు. అయితే, ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి కిందకు దిగగానే ట్రంప్ రెడ్ కార్పెట్పై నడుచుకుంటూ వస్తుండగా.. అక్కడ ఓ బృందం మలేషియా సంప్రదాయ నృత్యం చేస్తోంది.Such a beautiful arrival ceremony for President Trump in Malaysia 🇺🇸🇲🇾 - and he broke out the Trump Dance!🎥: @MargoMartin47 pic.twitter.com/igTo36ofBs— Monica Crowley (@MonicaCrowley) October 26, 2025దీంతో, వారి సంగీతం, నృత్యం ట్రంప్కు నచ్చడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టులో డ్యాన్స్ చేస్తున్న వారిపైపు నడిచి ట్రంప్ తన మార్క్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక అతిథి ట్రంప్తో పాటు.. మలేషియా ప్రధాని అన్వర్ కూడా సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. ఆసియాన్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్.. మలేషియా పర్యటనకు వచ్చారు. ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. ఆసియాన్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, జపాన్ కొత్త ప్రధాని తకాయిచి, దక్షిణ కొరియా నేతలు కూడా పాల్గొననున్నారు. -
ట్రంప్ విషయంలో అదే నిజమైంది.. అధ్యక్ష పోటీపై స్పందించిన కమలా హారిస్
వాష్టింగన్: అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా ఏదో ఒకరోజు అమెరికాకు అధ్యక్షురాలిని కావచ్చు అని అన్నారు. భవిష్యత్తులో శ్వేతసౌధంలో ఓ మహిళా అధ్యక్షురాలు ఉంటుందన్న విశ్వాసం ఆమె వ్యక్తం చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై అమెరికన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజాగా ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష పదవి కోసం నేను మరోసారి పోటీచేసే అవకాశం లేకపోలేదు. నా మనవరాళ్లు వారి జీవితకాలంలో కచ్చితంగా ఓ మహిళా అధ్యక్షురాలిని చూస్తారు. బహుశా అది నేనే కావచ్చు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ విషయమై నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉందని భావిస్తున్నాను. వాస్తవానికి నేను చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. నా కెరీర్ మొత్తాన్ని దేశ సేవలో గడిపాను. అది నా రక్తంలో ఉంది అని చెప్పుకొచ్చారు.Kamala Harris tells the BBC that she may “possibly” run for president again:“I am not done. I have lived my entire career a life of service and it’s in my bones. There are many ways to serve. I have not decided yet what I will do in the future beyond what I am doing right now.” pic.twitter.com/96QUWYYQkj— Pop Crave (@PopCrave) October 25, 2025ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనపై స్పందిస్తూ..‘ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ గురించి తాము చేసిన హెచ్చరికలు నిజమే అని ఇప్పుడు నిరూపితం అయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఫాసిస్ట్లా ప్రవర్తిస్తారని, నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతారని మేము ముందే చెప్పాం. మా అంచనా నిజమైంది. ట్రంప్ న్యాయశాఖను ఆయుధంగా మలచుకుంటానని చెప్పారని, ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు’ అని ఆరోపించారు.ఇదిలా ఉండగా.. తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి నిర్వహించిన పోల్స్లో డెమోక్రట్ల తరఫున ఆశావహుల రేసులో కమలా హారిస్ వెనుకంజలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా, తాను వాటిని పట్టించుకోనని తెలిపారు. ఒకవేళ ఇలాంటి పోల్స్ను పట్టించుకొని ఉంటే, తాను గత ఎన్నికల్లో పోటీపడేదాన్నే కాదని తెలిపారు. ఇక, గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి తరఫున కమల పోటీచేసిన విషయం తెలిసిందే. -
కెనడాపై ఉరిమిన ట్రంప్.. సుంకాలు 10 శాతం పెంపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తన ప్రతాపం చూపారు. తాజాగా కెనడియన్ వస్తువులపై సుంకాలను అదనంగా 10 శాతం మేరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దివంగత అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ నాడు సుంకాలపై చేసిన ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్పులను కెనడా వినియోగించిన దరిమిలా ఆగ్రహంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పొరుగు దేశమైన కెనడా రూపొందించిన ఒక టీవీ వాణిజ్య ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. అమెరికా ఇటీవలే కెనడాపై 35 శాతం నుంచి 50 శాతం వరకు సుంకాలు విధించింది. అయితే ఈ సుంకాల తగ్గింపుపై రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటిపై ఒక ఒప్పందం కుదురుతుందని కెనడా అధికారులు భావిస్తున్న తరుణంలో అందుకు భిన్నంగా జరిగింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ- డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవలే ఓవల్ ఆఫీస్లో స్నేహపూర్వక సమావేశం జరిగింది. అయితే ఇంతలోనే ఊహించని విధంగా ట్రంప్.. కెనడాతో చర్చల రద్దును ప్రకటించారు. దీనికి కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ప్రసారం చేసిన ఒక టీవీ ప్రకటన అని సమాచారం. ఈ ప్రకటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ .. సుంకాలు, ఆంక్షలు దీర్ఘకాలంలో అమెరికన్లకు ముప్పు తీసుకొస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన గత వారం రోజులుగా అమెరికా టీవీ ఛానెల్స్లో ప్రసారమవుతోంది.అమెరికా ప్రవేశపెడుతున్న సుంకాల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుంది. ఈ నేపధ్యంలో కోర్టు తీర్పును ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే కెనడా ఈ ప్రకటనను ప్రచారంలోకి తీసుకొచ్చిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కాగా దీనిపై రొనాల్డ్ రీగన్ ఫౌండేషన్ కూడా స్పందించింది. సదరు ప్రకటనను ఖండించింది. ‘వారు ఈ ప్రకటనను వెంటనే తీసివేయాలి. అది మోసపూరితమైనదని తెలిసి కూడా వారు వరల్డ్ సిరీస్ సమయంలో దానిని ప్రసారం చేయడానికి అనుమతించారు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పేర్కొన్నారు. వాస్తవాలను తప్పుగా చూపించడంలాంటి శత్రు చర్యల కారణంగా కెనడాపై సుంకాన్ని.. వారు ఇప్పుడు చెల్లిస్తున్న దానికంటే 10 శాతం అదనంగా పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.ఇది కూడా చదవండి: ‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం -
రష్యా చమురు.. ఏకాకిగా భారత్?
అంతర్జాతీయ వాణిజ్యంలో సమానత్వం అవసరమని, ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్న దేశాలకు వేర్వేరు నిబంధనలు వర్తింపజేయడం అన్యాయమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. రష్యా చమురు విషయంలో భారత్పైనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తుండడం గురించి ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో భారత్ ఏకాకిగా మారిందంటూ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక్ష చర్చల్లో భాగంగా జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన బెర్లిన్లో జరిగిన ఓ కార్యక్రమాంలో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు పేపర్లో చూశాను. ముడి చమురు కొనుగోలు విషయంలో ఆంక్షల నుంచి మిహాయించాలని జర్మనీ కోరినట్టు అందులో ఉంది. యూకే ఇప్పటికే అమెరికా నుంచి చమురు కొనుగోలు పరంగా మినహాయింపు పొందింది. అలాంటప్పుడు భారత్నే ఎందుకు లక్ష్యం చేసుకుంటున్నారు?.. అని మంత్రి అన్నారాయన. ఇదిలా ఉంటే.. రష్యా చమురు కంపెనీలైన రోజ్నెఫ్ట్, ల్యూక్ ఆయిల్తో ఎవరూ వ్యాపార లావాదేవీలు నిర్వహించరాదంటూ ఈ నెల 22న అమెరికా ఆంక్షలు ప్రకటించింది. అయితే ఈ తరహా సుంకాలు అనుచితం, అన్యాయం, అసమంజసమని భారత్ తరఫున గోయల్ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాతో భారత్ జరిపే చమురు వాణిజ్యం వల్లే నిధులు సమకూరుతున్నాయని.. తక్షణమే ఆ కొనుగోళ్లను ఆపేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పెనాల్టీ టారిఫ్లు విధించిన ఆయన.. ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ వచ్చారు. అయినప్పటికీ భారత్ మాత్రం జాతి ప్రయోజనాలు తప్పించి.. మరే ఇతర కోణంలోనూ నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టం చేసింది. అయితే.. మోదీ తనకు మంచి మిత్రుడని, రష్యా కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చారని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారత్ ఈ ప్రకటనను ఖండించింది. ఆ వెంటనే ఆయన స్వరం మారింది. వైట్హౌజ్ దీపావళి వేడుకల్లో మాట్లాడుతూ.. భారీగా కొనుగోళ్లను జరపబోదంటూ మరో ప్రకటన చేసేశారు. అదే సమయంలో.. ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కూడా ఓ కొలిక్కి రాబోతోందని తెలిపారు. రష్యా నుంచి ముడి చమురును నిలిపివేయాలంటూ అమెరికా ఒత్తిళ్లు తీసుకువస్తున్న వేళ.. మంత్రి పీయూష్ గోయల్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. -
ట్రంప్ ‘ఏడువారాల నగలు’
మహారాణులకు, ఏడువారాల నగల వలె, అమెరికా మహారాజు డోనాల్డ్ ట్రంప్కు ఏడువారాల వ్యూహాలుంటాయి. ఈ స్థితిని ప్రపంచం పలు విషయాలలో గమనిస్తున్నది. గమనించి మొదట భయ పడింది. తర్వాత అయోమయానికిగురైంది. చివరకు పరిస్థితి కొంత వినోదాత్మకంగా మారగా, ప్రేక్షకులలో కొందరు ట్రంప్ తలపై ఆయన ఇటీవల స్వయంగా ధరించి పోస్ట్ చేసిన రాజు గారి కిరీటానికి బదులు సర్కస్ క్లౌన్ టోపీని చూస్తున్నారు. కొందరు ఏమిచేయాలో తోచక విసుగెత్తి తలలు పట్టుకుంటున్నారు.అమెరికా అధ్యక్షుని గురించి పైన చేసిన వ్యాఖ్యలేవీ కాలక్షేపపు ఊహాగానాలు కావు. ప్రతి ఒక్కటీ వాస్తవంగా జరుగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకుని అన్న మాటే. అట్లా పరిగణించిన విష యాలు ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, భారత దేశంతో ఆర్థిక – వ్యూహాత్మక సంబంధాలు, చైనాతో వాణిజ్య – వ్యూహాత్మక తగవులు. వీటికి సంబంధించి కొన్ని మాసాల నుంచి మొదలుకొని నేటివరకు మాట్లాడుతున్నవి, చేస్తున్నవి, చేస్తానని చేయనివి, తాను చేయకున్నా ఇతరులు చేయాలనేవి, ఇతరులు చేయాలంటూ తిరిగి అందుకు మార్పులు చేసేవి, తాను చేస్తాననే వాటిలో మార్పులు తెచ్చేవి... అన్నింటినీ ఒక కాలక్రమంలో పేర్చి పెట్టి చూస్తే, మొత్తం మీద కనిపించేది ట్రంప్ చక్రవర్తి ‘ఏడువారాల నగలు’. మనంఅంటున్న ఈ మాట ఆయనకు చేరే అవకాశం లేదుగానీ, ఇటీవల అమెరికన్ పౌరులు ‘నో కింగ్’ అంటూ పెద్ద ఎత్తున జరిపిన నిరసనలను హాస్యాస్పదంగా చూపేందుకు తానే హాస్యాస్పద వేషధారణ చిత్రాన్ని పోస్ట్ పెట్టినట్లు, ఏడువారాల నగలతో ఏడు పోస్టులు పెట్టే వారేమో!చక్రవర్తి ఎందుకు?ట్రంప్ చేస్తున్నదంతా ఒక వ్యూహంలో భాగమని ఆయన అంతే వాసులు ప్రచారం చేసి లోకాన్ని నమ్మించజూశారు. వారు చెప్పిన దాని ప్రకారం ఆయన ఒక విషయమై అవతలి వారిని పిచ్చుకపై వేస్తాను సుమా బహ్మాస్త్రం అన్నట్లు మొదటే భయపెడతారు. అట్లా వేయటం నిజంగా తన ఉద్దేశం కాదు. కానీ అట్లా భయపెడితే అవతలి వారు బ్రహ్మాస్త్ర ప్రయోగం నిజంగానే జరగవచ్చునని భయ పడిపోయి, తన ఆదేశాలను శిరసావహించగలరన్నది ట్రంప్ అంచ నాలట! దానిని వారు బ్రహ్మాస్త్ర వ్యూహమన్నారు. ఇది యథాతథంగా వినేందుకు గొప్పగా తోస్తుంది. మధ్యయుగాల నాటి ‘బెనెవెలెంట్ డిక్టేటర్ (ఉదార నియంత) లక్షణాల తరహాలో కనిపిస్తుంది. ట్రంప్ వ్యక్తిత్వంలో, వ్యవహరణలో నిజంగానే ఈ లక్షణాలు ఉన్నాయన్నది కొందరి అభిప్రాయం. పరిస్థితి అంతవరకే అయితే ఫరవాలేదు. నిజం చెప్పాలంటే ‘ఉదార నియంత’ భావన ఆధునిక ప్రజాస్వామ్య భావనలకు సరిపడేది కాదుగానీ, ఒకోసారి అందువల్ల కొంత మంచి కూడా జరుగుతుంటుంది. అదే సమయంలో ఎక్కువసార్లు బెడిసి కొడుతుంది. ఈ రెండింటిలో ఏమి జరిగేదీ అవతలి పక్షాల పైనా, వాస్తవ పరిస్థితుల పైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, కిరీటం ధరించిన ‘కింగ్ ట్రంప్’ గారి ‘బెనెవె లెంట్ డిక్టేటర్’ వ్యూహం కొద్ది సందర్భాలలో తప్ప పనిచేయదు. వాస్తవానికి ఈ హెచ్చరిక ఆయనకు అందరికన్నా ముందు చేసినవాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా. అయినదానికి కాని దానికి ట్యారిఫ్లు పెంచుతూ, వాణిజ్య ఒప్పందాల గురించి బెది రిస్తూ, చివరకు బ్రెజిల్ ప్రతిపక్ష నాయకుడు బోల్సొనారోపై చర్యల విషయంలోనూ జోక్యం చేసుకొనజూసినపుడు, ‘‘ప్రపంచం చక్ర వర్తిని కోరుకోవటం లేదు. అమెరికన్లు ట్రంప్ను ఎన్నుకున్నది చక్ర వర్తి అయేందుకు కాదు’’ అని ఘాటుగా మాట్లాడారాయన. పరిస్థి తిని ట్రంప్ అర్థం చేసుకోలేదన్నది వేరే విషయం! మార్చేందుకే మాట ఉన్నది...ప్రస్తుతానికి వచ్చి, పైన పేర్కొన్న వేర్వేరు విషయాలను గమనిస్తే, అమెరికా అధ్యక్షుడు నాలుగు రోజులకు ఒక విధంగా మాట మార్చటం చూస్తున్నాం. ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటలలో ఆపివేయగలనంటూ మొదలుపెట్టిన ఆయన, ఇపుడు ఏమిచేయాలో తోచక, టేబుల్కు రెండు వైపులా తానే నిలిచి తనతో తానే పింగ్పాంగ్ ఆడుతున్నారు. ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని, సోమవారం నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ను హెచ్చరిస్తారు. డోన్బాస్ను వదలుకోవాలని మంగళవారం ఆదేశించి క్రిమియాను సైతం స్వాధీన పరచుకునేందుకు జెలెన్స్కీకి తోమహాక్లు అంద జేయగలనంటూ బుధవారం నాడు పుతిన్ను భయపెట్టజూస్తారు. గురువారంరోజు ఇద్దరితోనూ ఖనిజ ఒప్పందపు చర్చలు నడుపు తారు. శుక్రవారం యూరోపియన్ దేశాలను మీ దారి మీదేనని చెప్పి, శనివారం నాడు ‘నాటో’ను అందరం కలిసి బలోపేతం చేద్దామంటారు. ఈ విధంగా ఉక్రెయిన్ విషయమై ప్రపంచం గమనించి అబ్బు రపడుతున్న ‘ఏడువారాల నగల ప్రదర్శన’ వంటిదే ఇతర సంద ర్భాల్లోనూ చూస్తున్నాము. ఉక్రెయిన్ వలెనే మరొక యుద్ధమైన గాజాను గమనించండి. గతాన్ని కొద్దిసేపు అటుంచి ఇటీవలి పరిణామాలనే గమనిస్తే– 20 అంశాల ప్రకటన, షర్మ్ అల్ షేక్ సంతకాలతో మొత్తం పశ్చిమాసియాలోనే ‘శాశ్వత శాంతి’ సిద్ధించిందని ప్రకటించారు ట్రంప్. అది తొందరపాటనీ, మొదటి దశ అయిన కాల్పుల విరమణే ఇంకా స్థిరపడవలసి ఉందనీ అందరూ ఎత్తిచూపారు. కానీ అధ్యక్షుడు మాత్రం నోబెల్ శాంతి ప్రకటన ముగిసినదే తడవు హమాస్కు హెచ్చరికలు మొదలుపెట్టారు.అంతర్గత అరాచక శక్తులను అదుపు చేసేందుకు హమాస్ ఆయు ధాలను ఉంచుకోవచ్చునని ఒకరోజు ప్రకటించి, ఒకరోజు తిరిగే సరికి అస్త్రసన్యాసం చేస్తారా లేక ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ‘సర్వనాశనం’ చేయాలా అని బెదిరింపులు మొదలుపెట్టారు. ఇజ్రా యెల్ బాంబింగులు, సహాయ సరఫరాల నిలిపివేతలపై మౌనం వహిస్తున్నారు. గతంలోకి వెళితే, ఆయన గాజా, పాలస్తీనా విధా నాలు, రకరకాల ప్రకటనలు తెలిసినవే గనుక ఇక్కడ రాయ నక్కర లేదు. 20 అంశాల ప్రకటన అయితే బయటి వారితో తాత్కా లిక ప్రభుత్వం, బయటి దళాలతో భద్రతావ్యవస్థ, బయటి వారి ప్రణాళికల మేరకు అభివృద్ధి అని చెప్పటం మినహా, స్వతంత్ర పాలస్తీనా గురించి నిశ్చితంగా ఏమీ పేర్కొనక పోవటం తెలిసిందే. వీటన్నింటి చుట్టూ తిరుగుతూ ట్రంప్ వేర్వేరు మాటలతో ఏడు వారాల నగలు ధరిస్తూనే ఉన్నారు. మధ్యయుగాల క్రీడభారత దేశం, చైనాలతో ట్యారిఫ్లు, వాణిజ్య ఒప్పందాలకుసంబంధించి కూడా సరిగా ఇదే జరుగుతున్నది. ఒక రోజు బెదిరింపులు, ఈసడింపులు, మరునాడు సానునయమైన మాటలు. ఒక రోజు సంయుక్త సమావేశపు ప్రతిపాదనలు, మరొకరోజు వాయి దాలు... ఇది ఈ రెండు ఆసియన్ దేశాల విషయంలోనూ జరుగు తున్నది. ట్రంప్కు సమస్య ఎక్కడ వస్తున్నదంటే, కొద్ది తేడాలతో రెండు దేశాలు కూడా ఒక పరిమితిని దాటి తమ జాతీయ ప్రయో జనాలను వదులుకునేందుకు సిద్ధంగా లేవు. చైనా అయితే తన ఆర్థిక బలిమి వల్ల, కొన్ని రంగాలలో అమెరికాను పూర్తిగా ధిక్కరించ గలగటం ట్రంప్కు పాలుపోని పరిస్థితి అయింది. అయినా చైనా, ఇండియాలను గెలవనివ్వకూడదు గనుక, తరచూ ‘నగల మార్పిడి’ చేసుకుంటూనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు అర్థం చేసుకుని మారవలసింది ఏమంటే, తన వ్యూహంలో బలహీనతలు అనేకం ఉన్నాయి. ప్రపంచం ఒకప్పటి వలె లేదు. అందువల్ల, మధ్య యుగపు రాజువలె కిరీట ధారణ, రాణివలె ఏడువారాల నగలు చూసి చిత్తభ్రమలకు లోనై లొంగిపోయే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతున్నది.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్


