సాక్షి,అబ్దుల్లాపూర్మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో దారుణం చోటు చేసుకుంది. ప్రవర్తన సరిగా లేదనే ఆగ్రహంతో సోదరిని అత్యంత దారుణంగా హతమార్చాడో కర్కోటకుడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడిసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


