Sister
-
ఈ సినిమాను సెన్సార్ కట్ లేకుండా చూస్తేనే!: రాధికా ఆప్టే
హీరోయిన్ రాధికా ఆప్టే ఇటీవలే సిస్టర్ మిడ్నైట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ఇంతకు ముందెన్నడు చేయని డిఫరెంట్ రోల్లో నటించింది. ఈ మూవీని ఇటీవలే కాన్స్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమాపై పలువురు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. మే 23న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఈ చిత్రం ఇండియాలో విడుదలకు ముందు సెన్సార్ గురించి ఆందోళన ఉండేదని రాధికా తెలిపింది. ఎలాంటి కట్ లేకుండా సెన్సార్ ఇస్తేనే బాగుంటుందని భావించినట్లు పేర్కొంది. ఎందుకంటే ఈ చిత్రం కట్ చేయకుండా ప్రదర్శిస్తేనే అర్థమవుతుందని వెల్లడించింది. అనుకున్నట్లే ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ వచ్చిందని రాధికా ఆప్టే పంచుకుంది.రాధికా ఆప్టే మాట్లాడుతూ.. 'స్క్రిప్ట్ను తాను ఇంతకు ముందు చేసిన వాటికి భిన్నంగా ఉంది. ఇది చాలా విచిత్రమైన సినిమా. ఇది ఒక క్రేజీ సినిమా. అది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎవరికైనా నటనలో పూర్తి స్వేచ్ఛ లభిస్తే అది చాలా మంచి సినిమా అవుతుంది. లేకపోతే అది ఒక డిజాస్టర్గా మిగులుతుంది. ప్రతి సృజనాత్మక నిర్ణయం వెనుక డైరెక్టర్ కాంధారి ఉన్నారని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ ఫెస్టివల్ సర్క్యూట్లో మా సినిమా విజయం సాధించడం నమ్మకాన్ని మరింత పెంచిందని ఆమె చెప్పింది. -
Brothers Day: నాన్న తరువాత..
ప్రేమికుల దినోత్సవం, స్నేహితులు దినోత్సవం మాదిరిగానే అన్నదమ్ముల దినోత్సవం(Brother's Day) ఉందనే సంగతి మీకు తెలుసా? అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ కుటుంబంలోనైనా అన్నదమ్ములే ఇంటిని చక్కదిద్దేవారుగా నిలుస్తుంటారు. వీరి అనుబంధం చక్కగా ఉన్నప్పుడే వారి కుటుంబానికి సమాజంలో మంచిపేరు వస్తుంది. ఈ రోజు మే 24.. జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ఈ సందర్భంగా ఈ రోజుకున్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం.భారతదేశంలో అనుబంధాలకు ఎంతో ప్రాముఖ్యత కనిపిస్తుంది. వాటిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. అన్న, తమ్ముడు ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తుంటారు. అన్నదమ్ముల దినోత్సవాన్ని తొలుత తొలుత అలబామాకు చెందిన ఓ సిరామిక్ కళాకారుడు, సి డేనియల్ రోడ్స్ జరుపుకున్నారని చెబుతారు. 2005 నుంచి ప్రతి సంవత్సరం మే 24న ఈ బ్రదర్స్ డేని చేసుకుంటున్నారు. మొదట్లో దీనిని అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు. తర్వాత ప్రపంచమంతటా జరుపుకోవడం ప్రారంభించారు. కొన్ని దేశాలలో అయితే ఈ రోజున అధికారిక సెలవుదినం(Holiday)గానూ ప్రకటించారు.అన్న అంటే ఓ బాధ్యత. నాన్న తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది ఆయనే. అదే విధంగా తమ్ముడు కూడా బాధ్యతగానే మెలుగుతాడు. ఇక అమ్మాయిలైతే తమ బ్రదర్స్ను తమకు సెక్యూరిటీ కల్పించేవారిగా భావిస్తుంటారు. రక్త సంబంధం లేకపోయినా ఆత్మీయంగా ఇతరులను సోదర భావంతో చూసుకునే ప్రత్యేకమైన రోజు ఇది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా తమ ప్రియమైన సోదరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈరోజున తమ అన్నదమ్ములకు నచ్చిన వంటకాలను చేయడంతో పాటు వారికి నచ్చిన వస్తువులను కానుకలుగా అందజేస్తుంటారు. కొన్ని దేశాల్లో అన్నదమ్ముల దినోత్సవం నాడు సోదరులతో రోజంతా సరదాగా గడపడం, వారితో కలిసి టూరిస్ట్ ప్లేస్లకు వెళ్లడంలాంటివి చేస్తుంటారు.ఇది కూడా చదవండి: తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం -
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
సాక్షి, చెన్నై: 2004లో సునామీ సృష్టించిన విలయతాండవం సమయంలో కడలూరులో ఐఏఎస్ అధికారిగా గగన్దీప్సింగ్ బేడీ పనితీరును చిన్న పిల్లలుగా ఉన్న ఇద్దరు సిస్టర్స్ కనులార చూశారు. సునామీ విలయం నుంచి బయటపడిన జీడి పప్పు రైతు కుటుంబంలోని ఈ ఇద్దరు తాము సైతం ఐఏఎస్ కావాలన్న కలతో ముందుకు సాగారు. ఇందులో ఒకరు ఐఏఎస్గా, మరొకరు ఐపీఎస్గా విధుల్లో చేరి రాణిస్తున్నారు. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని మరుంగూర్ గ్రామానికి చెందిన రామనాథన్, ఇలవరసి దంపతుల కుమార్తెలు సుస్మిత, ఐశ్వర్య. ఈ ఇద్దరి మధ్య ఏడాదిన్నర వయస్సు తేడా. 2004లో జరిగిన సునామీ తాండవం సమయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్గా ఉన్న గగన్దీప్సింగ్ బేడి అప్పట్లో కడలూరులో వీరోచితంగా సేవలు అందించడంలో శ్రమించారు. దీనిని చిన్న పిల్లలుగా ఉన్న సుస్మిత, ఐశ్వర్య చూసి, తాము సైతం ఐఏఎస్లు కావాలన్న లక్ష్యంతో చదివారు. అన్నావర్సిటీలో పట్టభద్రులయ్యారు. కల సాకారం యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు. తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం వీరిలో సుస్మిత ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ ఐపీఎస్గా కాకినాడలో ఏఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఐశ్వర్య తమిళనాడులోని తూత్తుకుడి అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఏదో ఒక రోజున ఒక జిల్లాకు ఎస్పీగా ఒకరు, ఒక జిల్లాకు కలెక్టర్గా మరొకరు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఒకే ఇంటికి చెందిన ఈ ఇద్దరు సిస్టర్స్ విధుల్లో రాణిస్తున్నారు. తన కుమార్తెల గురించి రామనాథన్ మాట్లాడుతూ తన పిల్లలు ఇద్దరు ఐపీఎస్, ఐఏఎస్లుగా ఉండడంతో ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ గగన్ దీప్ సింగ్బేడి పనితీరును తన ఇద్దరు పిల్లలు ఆదర్శంగా తీసుకున్నారని పేర్కొన్నారు. సివిల్ సర్వీసులో రాణించి వారి కలను సాకారం చేసుకున్నారని, ఇద్దరు గెలిచారని ఆనందం వ్యక్తం చేశారు. -
కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)
-
చెల్లి పెళ్లిని గుర్తు చేసుకున్న బిగ్బాస్ బ్యూటీ హరితేజ..!
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్ హరితేజ. గతేడాది బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టి అభిమానులను అలరించింది. దాదాపు పదివారాల పాటు హౌస్లో ఉండి ఫ్యాన్స్ను అలరించింది. సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్గా నిలిచింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్గా వ్యవహరించింది. గతేడాది రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా మెప్పించింది.అయితే తాజాగా తన చెల్లి పెళ్లిలో సందడి చేసింది హరితేజ. వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చెల్లి పెళ్లి వైభోగం అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది హరితేజ. అయితే తన సిస్టర్ పెళ్లి ఫిబ్రవరిలో జరగ్గా.. తాజాగా మరోసారి ఫోటోలను పంచుకుంది. కాగా.. హరితేజ కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ 2021లో భూమి అనే కూతురు జన్మించింది. View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) -
చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)
-
నాన్న చూపునకూ నోచుకోకుండానే..!
నిర్మల్/పెంబి: ‘నాన్న.. నువ్వేం ఫికర్ చేయకు. ఇటేం మనసు పెట్టుకోకు. అమ్మా మేము మంచిగనే ఉన్నం. మంచిగ చదువుకుంటున్నం. నువ్వు జాగ్రత్తగా ఉండు. తొందరలనే మనకు మంచి రోజులు వస్తయ్..’ అంటూ నిత్యం తమ తండ్రి మనసులో ఆశలు వెలిగించే ఆ ‘దీపాలు’ అవి నెరవేరకముందే అర్ధంతరంగా ఆరిపోయాయి. తన బిడ్డల చివరిచూపు కోసం ఆ తండ్రి దేశంకాని దేశంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. రెక్కల కష్టంతో పెంచుకున్న బిడ్డలిద్దరూ అసువులు బాయడంతో ఆ తల్లి గుండె చెరువైంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ సమీపంలో ఎన్హెచ్ 44పై శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతొర్యతండాకు చెందిన అక్కాచెల్లెళ్లు అశ్విని(21), మంజుల(17) మృతిచెందారు. మారుమూల తండా నుంచి..గ్రామస్తులు, జక్రాన్పల్లి ఎస్సై ఎండీ మాలిక్ రహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన పెంబి మండలం లోతొర్య తండాలో మట్టిగోడలతో రేకుల ఇంట్లో ఉంటున్న బానావత్ సుగుణ, రెడ్డి దంపతులకు ముగ్గురు కూతుళ్లు కుమార్తెలు అశ్విని, మంజుల, నిహారికలతోపాటు కుమారుడు ఆకాశ్ ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు. ఎకరం భూమి మాత్రమే ఉండటంతో రోజువారీ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడంతో మూడేళ్లక్రితం బానావత్ రెడ్డి దుబాయి వెళ్లాడు.ఎలాగైనా చదవాలని..తమకోసం తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగిన పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దకూతురు అశ్విని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల ఫైనలియర్ పూర్తిచేసింది. రెండోకూతురు మంజుల ఇచ్చోడలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. మంజులకు ఈఏపీ ఎంట్రన్స్ టెస్ట్ ఉండటంతో అక్క అశ్విని సమీప బంధువు జాదవ్ హంసరాజుతో కలిసి గురువారం కారులో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పరీక్ష రాసి, శుక్రవారం తండాకు తిరిగి వస్తుండగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కాచెలెళ్లు అక్కడే చనిపోగా, బంధువు జాదవ్ హంసరాజు కాలు, చేయి విరిగాయి. అతడిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.చివరిచూపునకూ నోచుకోలేక..మూడేళ్లక్రితం దుబాయి వెళ్లిన బాణావత్ రెడ్డి ఏడాదిపాటు ఓ కంపెనీలో పనిచేశాడు. ఆ ఏడాది పనిచేసినా కంపెనీ ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. మోసపోయానని తెలుసుకున్న రెడ్డి బయటకు వచ్చి కలివెల్లి వీసాపై చిన్నచితకా పనులు చేసుకుంటున్నాడు. ఏడాదికాలంగా ఖర్చుల కోసం భార్య సుగుణనే ఇక్కడి నుంచి డబ్బులను పంపిస్తోంది. ప్రస్తుతం ఆయన స్వదేశానికి తిరిగి రావడానికీ డబ్బులు లేవు. తన కన్నబిడ్డలను చివరిచూపు కూడా చూడలేని దయనీయ పరిస్థితి. కనీసం విమాన చార్జీలకు డబ్బులు ఇస్తే.. తన బిడ్డల చివరిచూపైనా చూస్తానంటూ రెడ్డి విలపిస్తున్నాడు. -
ఆస్తి కోసం తల్లిని దూషిస్తూ అక్కను కాలుతో తన్నిన ఎమ్మెల్యే అనుచరుడు ఉదయ్ కిరణ్
-
వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
బాలీవుడ్ నటి దిశా పటానీ అక్క ఖుష్బూ పఠానీ ఒక పసికందును రక్షించి ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన కరుణ , ధైర్యసాహసాలు నెట్టింట ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇంతకీ ఎవరీ ఖుష్బూ పటానీ? సోదరి దిశా గ్లామర్ ప్రపంచాన్ని ఏలుతోంటే.. ఖుష్బూ దేశానికి సేవ చేసే ఆర్మీ ఆఫీసర్ ఎలా అయింది? మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఇంట్రస్టింగ్ జర్నీ గురించి తెలుసుకుందామా.అద్భుతనటిగా, ఫిట్నెస్ ప్రియురాలిగా పేరు తెచ్చుకున్న దిశా పటానీతో పాటు, ఆమె అక్క ఖుష్బూ పటానీ పేరు కూడా పాపులరే. భారతీయ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఖుష్బూ ఇప్పుడు బహుళ పాత్రల్లో నిమగ్నమై ఉంది. వదిలివేయబడిన బిడ్డను రక్షించిన తర్వాత ఖుష్బూ ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తన సోదరి దిశాతో సమానంగా అద్భుతమైన ఇపుడు బరేలీలో పాపను రక్షించి వార్తల్లో నిలిచింది.1991 నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జన్మించింది ఖుష్బూ. బిబిఎల్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, తరువాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఖుష్బూ పటానీ తెలివైన విద్యార్థి. కానీ కాలేజీ చదువుకొనే రోజుల్లో వేధింపులకు గురైంది. కొంతమంది అబ్బాయిలు ఆమెను కారులో వెంబడించి వేధించారు. ఒక ప్రాజెక్ట్ పని తర్వాత తన స్నేహితుడితో కలిసి రాత్రి ఆలస్యంగా తన హాస్టల్కు వచ్చేది. ఆ సమయంలో కారులో ఒకడు పిచ్చిగా వెంటబడి, వేధించేవాడు. ఒక సందర్భంగా ఖుష్బూ ఒక మహిళల పబ్లిక్ వాష్రూమ్లో దాక్కుని తనను తాను రక్షించుకుంది. ఈ సమయంలో చాలా భయపడేపోయేదట. దీంతో ఆమె ఒంటరిగా వెళ్లడం మానేసింది. చదవండి: 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీపట్టుదలగా చదువుకు పూర్తి చేసి ఎంఎన్సీలో జాబ్ సంపాదించింది కానీ ఆ ఉద్యోగం ఖుష్బూకి సంతొషాన్నివ్వలేదు. కాలేజీ రోజుల నాటి భయంకరమైన అనుభవం వెంటాడేది. ఆ భయంనుంచి వచ్చిన ఆలోచనే సైన్యంలో చేరడానికి ప్రేరేపించింది. అప్పటి వరకు, ఆమెకు సైన్యంలో చేరాలనే ఆలోచన లేదు.భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాక, తన వేధింపుల గురించి తన తండ్రితో చెప్పుకుంది. SSB ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణురాలై లెఫ్టినెంట్గా ఆర్మీలో చేరింది. నిజమైన దేశభక్తురాలిగా దేశానికి సేవ చేసింది. ఖుష్బూ పటానీ 34 సంవత్సరాల వయసులో మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ చేసి వెల్నెస్ కోచ్గా ఉంది. అంతేకాదు ఆమె TEDx స్పీకర్ కూడాసోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా అభమానులకు స్ఫూర్తినిస్తోంది. ఖుష్బూ టారో కార్డ్ రీడర్ కూడా, కెరీర్, వ్యాపారం, డబ్బు, అనేక ఇతర విషయాలలో సూచనలిస్తుంది. -
ఆస్తిలో వాటా కోసం, చిన్నబావమరిదికి స్కెచ్.. కట్ చేస్తే!
ఘట్కేసర్: ఆస్తి పంపకాల్లో వాటా కోసం రెక్కీ ఏర్పాటు చేసిన ఘటన ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకుషాపూర్ గ్రామానికి చెందిన బోనాల రాజశేఖర్, ఈశ్వర్ తమ సోదరి లావణ్యను కొండాపూర్ మసీదుబండకు చెందిన మేడ్చల్ శ్రీనివాస్తో వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ. 12 లక్షలు, ఎకరం భూమి కట్నంగా ఇచ్చారు. అయితే తర్వాత తండ్రి పెంటయ్య ఉద్యోగ విరమణతో వచ్చినడబ్బులోనూ తనకు వాటా కావాలని సోదరి లావణ్య సోదరులను డిమాండ్ చేసింది. దీంతో ఇచ్చిన ఎకరం భూమి విక్రయించిందని, తిరిగి డబ్బులు ఇచ్చేది లేదనడంతో గొడవ ప్రారంభమైంది. బావమరుదుల కదలికలపై రెక్కీ.. బావమరుదుల కదలికలు తెలుసుకునేందుకు శ్రీనివాస్ టోలీచౌక్కు చెందిన బాబు షేక్ సాహెల్ (20), ఎండీ ఇర్ఫాన్ (20), మహమ్మద్ అబ్బు, సల్మాన్(18)తో పాటు మరో మైనర్తో రూ.15 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. రూ. 1000 చొప్పున 3 సార్లు గూగుల్ పే ద్వారా డబ్బు పంపించి చిన్నబావమరిది ఈశ్వర్, ఇంటి, లొకేషన్ ఫొటోలు శ్రీనివాస్ ఇర్ఫాన్కు అందజేశాడు. బుధవారం ఉదయం వారు అంకుషాపూర్ గ్రామంలో బైక్ నంబర్ కనిపించకుండా జాగ్రత్త పడటం, ముఖాలకు మాస్క్లు ధరించి అనుమానాస్పదంగా రెక్కీ నిర్వహిస్తుండగా.. స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని పట్టుకుని ఫోన్ తనిఖీ చేయగా బావ శ్రీనివాస్ పంపిన ఫొటోలు, ఫోన్లో టచ్లో ఉన్నట్లు గుర్తించడంతో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 4 సెల్ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు బావ శ్రీనివాస్, సోదరి లావణ్య పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. గతంలోనూ రెక్కీ నిర్వహించిన విషయమై ఇప్పటికే ఓ కేసు ఉంది. హత్యాయత్నం కోణం ఉందా..? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. -
అపార్ట్మెంట్లో అక్కా చెల్లెళ్లు మృతి
హైదరాబాద్: మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు అక్కచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక మనోవికాస్ నగర్ శ్రీనిధి ఆపార్ట్మెంట్లో మీనా చంద్రన్ (59 ), వీణా చంద్రన్ (60) అనే అక్కా చెల్లెళ్లు నివాసం ఉంటున్నారు. వీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటమేగాక మానసిక స్థితి సరిగా లేదు. ఈనెల 11న ఇంట్లో తలుపులు వేసుకుని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గది నుంచి దుర్వాసన æవస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు 13 సాయంత్రం కార్ఖాన పోలీసులకు, మారేడుపల్లిలో ఉంటున్న మరో సోదరి సాధనకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి తండ్రి చంద్రన్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా అతను మృతి చెందడంతో గత కొన్నేళ్లుగా అతని పెన్షన్ డబ్బులతో వీరు జీవనం సాగిస్తున్నారని వీరి సోదరుడు దుబాయ్లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మానసిక స్థితి సరిగా లేని వీరు వింతగా ప్రవర్తిస్తూ ఆపార్ట్మెంట్ వాసులను ఇబ్బందులకు గురిచేసే వారని పలుమార్లు వీరిపై పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. సీఐ రామకృష్ణ నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇక మెహర్ రమేశ్ సినిమాల విషయానికొస్తే తెలుగులో 'శక్తి', 'కంత్రి', 'షాడో', 'భోళా శంకర్' సినిమాలను తెరకెక్కించారు. అంతకుముందు 2002లో తొలుత ఇతడు నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిరంజీవికి వరసకు తమ్ముడు అయ్యే మెహర్.. మహేశ్బాబు 'బాబీ' మూవీ సునీల్ అనే కామెడీ రోల్ చేశాడు. ఆ సినిమా ఆడకపోవడంతో మెహర్ యాక్టింగ్ వదిలేశాడు.ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. అయితే ఒకానొక సందర్భంలో అనుకోకుండా 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం వచ్చింది. అలా బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అ తర్వాత 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో హిట్ కొట్టాడు. ఇలా కన్నడ భాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం అంతలా సక్సెస్ కాలేకపోయారు. -
చెల్లెళ్లతో ప్రభాస్.. డార్లింగ్ అప్పుడెలా ఉన్నాడో చూశారా? (ఫోటోలు)
-
రిషభ్ పంత్ సోదరి సాక్షి హల్దీ వేడుక.. ఫొటోలు వైరల్
-
పెళ్లిలో సాయిపల్లవి సిస్టర్స్ హంగామా.. ఒకరిని మించి మరొకరు (ఫొటోలు)
-
మద్యానికి బానిసయ్యా.. రోజుకు 9 గంటల నరకం: స్టార్ హీరో చెల్లెలు
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉండగా స్టార్ హృతిక్ రోషన్కు సునయన రోషన్ అనే చెల్లెలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. తాను మద్యానికి బానిసైనట్లు వెల్లడించారు. ఆ వ్యసనం నుంచి బయప పడేందుకు చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. రిహబిలిటేషన్ సెంటర్లో నరకం అనుభవించినట్లు సునయన చెప్పుకొచ్చారు. అక్కడ సాధారణ పునరావాస కేంద్రం కంటే అధ్వాన్నంగా ఉంటుందని తాను ఊహించలేదన్నారు. సునయన రోషన్ మాట్లాడుతూ.. 'ఇది మొత్తం 28 రోజుల కోర్సు. అయితే ఇది సాధారణ పునరావాసం లాంటిది కాదు. ప్రాథమికంగా అక్కడ ఎలాంటి వ్యసనానికైనా చికిత్స అందస్తారు. ఆ సెంటర్లో దాదాపు 56 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే అక్కడి వాతావరణం సాధారణ పునరావాసం కంటే చాలా దారుణంగా ఉంది. అసలు నార్మల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నన్ను రోజుకు 9 గంటల పాటు ఓకే గదిలో ఉంచేవారు. అలా ప్రత్యక్షం నరకం అనుభవించా' అని తెలిపింది.అయితే తాను బాగుపడతానని తెలిసే అక్కడికి వెళ్లినట్లు సునయన రోషన్ తెలిపారు. మద్య వ్యసనం నుండి బయటపడేందుకు జీవితంలో ముందుకు సాగడానికి ఒక అడుగుగా భావించినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో కేవలం నాకు కాల్ చేసే వ్యక్తుల నంబర్లు మాత్రం అమ్మ వారికి ఇచ్చిందని వెల్లడించింది. అక్కడికి సెల్ ఫోన్లు, షుగర్, కాఫీ , చాక్లెట్, పెర్ఫ్యూమ్లు అనుమతించరని ఆమె చెప్పింది. అయితే పునరావాసం నుంచి బయటపడిన క్షణంలోనే తన తండ్రి రాకేష్ రోషన్కు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదని సునయన రోషన్ వెల్లడించింది. -
15 ఏళ్ల నాటి ఆభరణాలతో, అందర్నీ కట్టి పడేసిన సాక్షి ధోనీ
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అతని భార్య సాక్షి ధోని హాజరయ్యారు. సతీసమేతంగా ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ ధోని సందడి చేశాడు. రణబీర్ కపూర్ 2009 బ్లాక్ బస్టర్ “అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ”లోని “తు జానే నా” అనే సాంగ్కు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ పెళ్లిలో ఇంకో విశేషం కూడా చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని తన ఆకర్షణీయమైన శైలితో వార్తల్లో నిలిచింది.సాక్షి ధోని ఫ్యాషన్, స్టైల్కి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుకలో పెళ్లైన ఇన్నాళ్ల తరువాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత తన పెళ్లి రోజున ఆభరణాలను ఆభరణాలను తిరిగి ధరించింది.ఆ ఆభరణాలే అందరి దృష్టిని ఆకర్షించాయి. డైమండ్స్ ఆర్ ఫరెవర్ అన్నట్టు వజ్రాలు, పచ్చలు పొదిగిన గోల్డ్ జ్యుయల్లరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోల్డ్ చోకర్ నెక్పీస్, లేయర్డ్ నెక్లెస్, ముక్కెర, జుమ్కాలతో తన లుక్కు మరింత స్టైల్ యాడ్ చేసింది. లెమన్ గ్రీన్ కలర్ పట్టుచీర, స్కాలోప్-నెక్ డిజైన్ ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్, దీనికి జతగా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిర్రర్ దుపట్టాతో తన లుక్ను మరింత ఎలివేట్ చేసుకొని అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే సాక్షి, దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఇవి వైరల్గా మారాయి.మరోవైపు పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో ధోనీ, సాక్షి, పంత్ మధ్య ఆకర్షణీయ సంభాషణ కూడా వైరల్గామారింది. తమ రిలేషన్ షిప్ లో ధోనీనే లక్కీ అని సాక్షి సిగ్గుల మొగ్గలవుతూ చెప్పింది. ఇంతలో మధ్యలో కల్పించుకున్న పంత్, ఆడవాళ్లందరూ ఇలాగే అనుకుంటారని తుంటరి కమెంట్ చేయడంతో అక్కడంతా నవ్వులు పువ్వులు పూశాయి. ఈ వీడియోపై కామెంట్లు వెల్లువెత్తాయి.సాక్షి ధోని పెళ్లి రోజు లుక్15 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహానికి, భారీ నెక్లెస్, చూడామణి లాంటి ఆభరణాలు సహా బుటీ వర్క్, జర్దోసి ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు, ఆకుపచ్చ రంగు లెహంగా ధరించింది 2010 జూలై 10న డెహ్రాడూన్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
కజిన్ పెళ్లిలో సాయిపల్లవి.. ఎంత అందంగా ఉందో! (ఫోటోలు)
-
రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుక.. డ్యాన్స్లతో పిచ్చెక్కించిన ధోని, రైనా (ఫొటోలు)
-
అందంలో సాయిపల్లవికే పోటీ ఇస్తున్న చెల్లి! (ఫొటోలు)
-
ఐటం సాంగ్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ సోదరి (ఫోటోలు)
-
చెల్లి ఋణం తీర్చుకున్న అన్న
-
వితికా షెరు చెల్లిని చూశారా? భర్తతో గృహప్రవేశం (ఫోటోలు)
-
చెల్లి హల్దీ ఫంక్షన్.. హరితేజ హంగామా చూశారా? (ఫోటోలు)
-
బంధువుల పెళ్లిలో ప్రభాస్ సిస్టర్స్.. రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడంటోన్న ఫ్యాన్స్ (ఫోటోలు)
-
పెళ్లి వేడుకలో ప్రభాస్ సిస్టర్స్.. రెబల్ స్టార్ మ్యారేజ్పై మొదలైన చర్చ!
టాలీవుడ్ హీరోల్లో ఎవరి పెళ్లి కోసమైనా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే అది ఆయన ఒక్కరిదే. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. గతేడాదిలోనే నాగచైతన్య ఓ ఇంటివాడయ్యారు. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే అఖిల్ అక్కినేని సైతం పెళ్లి చేసుకోబోతున్నారు. అలా దాదాపు మన హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.ప్రభాస్ పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు..కానీ టాలీవుడ్ ఫ్యాన్స్కు ఇప్పటి వరకు తీరని కోరిక ఏదైనా ఉందంటే అది మన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వేడుకే. ప్రభాస్ పెళ్లి కోసం ఆయన ఫ్యామిలీ కంటే.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టాలీవుడ్లో ఏదో ఒక సందర్భంలో ఈ టాపిక్ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. అలానే తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది.అందుకు కారణం ప్రభాస్ బంధువుల పెళ్లిలో ఆయన ముగ్గురు చెల్లెల్లతో పాటు కృష్ణంరాజు భార్య శ్యామల దేవి కనిపించారు. పెళ్లిలో వారంతా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేశారు. ఇంకేముంది ప్రభాస్ అన్న పెళ్లి ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన బంధువుల పెళ్లికి కృష్ణంరాజు భార్య శ్యామల దేవి హాజరయ్యారు. ఆమెతో పాటు ముగ్గురు కుమార్తెలు(ప్రభాస్ చెల్లెళ్లు) ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి కూడా ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. అందరూ కలిసి దిగిన ఫోటోలను ప్రసీద్ ఉప్పలపాటి తన ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ప్రభాస్ అన్నకు త్వరగా పెళ్లి చేయండి సిస్టర్స్ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. ప్రసీద తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటున్నారు. మిగిలిన ఇద్దరు సిస్టర్స్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. View this post on Instagram A post shared by Sai Praseedha Uppalapati (@praseedhauppalapati) -
9 రోజులు తల్లి మృతదేహంతోనే ఇద్దరు కూతుళ్లు
బౌద్ధనగర్: బాధ్యతలు చూసుకోవాల్సిన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు... అప్పటి నుంచి తల్లి వారికి అన్ని విధాలా అండగా ఉంటూ ఆదరించింది. ఇప్పుడు ఆ తల్లి అనారోగ్యంతో మరణించింది. కంటికి రెప్పలా చూసుకున్న తల్లి (45) కన్నుమూయడంతో ఇద్దరు కూతుళ్లు తామూ చనిపోవాలని భావించారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో తల్లి శవం పక్కనే పెట్టుకుని తొమ్మిది రోజులపాటు రోజువారీ కార్యకలాపాలు చేసుకున్నారు.సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలకలగూడ ఏసీపీ జైపాల్రెడ్డి, వారాసీగూడ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... ఉస్మానియా వర్సిటీలో ఉద్యోగం చేసే రాజు, లలిత దంపతులు. వీరికి రవళిక (25), అశ్విత (22) అనే ఇద్దరు కూతుళ్లున్నారు. రాజు 2020 లోనే భార్య, పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. రెండు నెలలుగా లలిత ఇద్దరు కూతుళ్లతో కలిసి బౌద్ధనగర్లోని ఓ బహుళ అంతస్తుల భవనంలోని 4వ ఫ్లోర్లో ఉంటోంది. రవళిక ఓ బట్టల షాపులో పనిచేస్తుండగా.. అశి్వత ఈవెంట్స్ నిర్వాహకుల వద్ద చేస్తోంది.కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న లలిత ఈ నెల 23న ఇంట్లోనే కన్నుమూసింది. తల్లి కన్నుమూయడంతో ఆ ఇద్దరు పిల్లలకు ఏంచేయాలో పాలుపోక తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. దహన సంస్కారాలకు డబ్బులు లేక, ఎవరి సహాయం తీసుకోవాలో తెలియక వారు కూడా చనిపోవాలని నిశ్చయించుకున్నారు. కానీ మళ్లీ ధైర్యం రాక, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో 9 రోజుల పాటు తల్లి మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని అలాగే ఉండిపోయారు. శుక్రవారానికి కొద్దిగా తేరుకున్న వాళ్లు తల్లి చనిపోయిన విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయానికి వచ్చి చెప్పారు.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు వారి బంధువుల గురించి ఆరాతీసి వారికి సమాచారం అందించారు. చనిపోయి 9 రోజులు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం నెలకొంది. విషయం తెలిసి ఈ భవనంలో ఉండే వాళ్లంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చుట్టుపక్కల నివసించే వాళ్లు కూడా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మాజీ సీఎం KCR ఇంట్లో విషాదం
-
డబ్బు కోసం అన్నపైనే లైంగిక ఆరోపణలు!?
సొంత సోదరి చేస్తున్న సంచలన ఆరోపణలపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ స్పందించాడు. ఇప్పటికే ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈలోపు.. రక్తం పంచుకుని పుట్టిన సోదరి ఆయన్ని కోర్టుకీడ్చింది. అయితే.. ఆమెకు మానసికస్థితి సరిగా లేదని.. పైగా డబ్బు కోసమే ఈ చర్యకు దిగిందని ఆయన అంటన్నారు. ఈ మేరకు కుటుంబంతో సహా సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశారాయన.దాదాపు దశాబ్ద కాలంగా తన సోదరుడు శామ్ (Sam Altman) తనపై లైంగిక వేధింపులకు పాల్పడాడంటూ ఆన్ ఆల్ట్మన్ మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటినుంచే ఆ దారుణాలను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అయితే.. ఆమె ఈ తరహా ఆరోపలు చేయడం ఇదేం కొత్త కాదు. కాకుంటే ఈసారి దావా వేయడంతో శామ్ ఆల్టమన్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిణామంపై ఆయన ఏమన్నారంటే..‘‘ఆమె ఆరోగ్యంపై మేం చాలా ఆందోళనకు గురవుతున్నాం. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని. ఆమెకు అండగా ఉండేందుకు మేం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఆర్థికంగానూ సాయం చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పటికీ ఆమె మమ్మల్ని ఇంకా డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉంది. మా కుటుంబంపై, ముఖ్యంగా శామ్పై అవాస్తవ ఆరోపణలు చేసి మమ్మల్ని మరింత ఎక్కువగా బాధ పెట్టింది... ఆమె గోప్యత దృష్ట్యా మేం దీనిపై బహిరంగంగా స్పందించొద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆమె శామ్పై కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. తండ్రి నిధులను అక్రమంగా అట్టిపెట్టుకుని.. సొంత కుటుంబసభ్యులపైనే ఆరోపణలకు దిగింది. ఇప్పుడు మరింత దిగజారి శామ్ తనను లైంగికంగా వేధించాడని చెబుతోంది. ఇవన్నీ అవాస్తవం. ఈ పరిస్థితుల్లో మా కుటుంబగోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా. ఇకనైనా ఆమెకు మానసిక ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నాం’’ అని ఆల్ట్మన్ కుటుంబం తమ ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. ఆరోపణలు చేసిన అన్నే ఆల్ట్మన్(Annie Altman).. ఆ కుటుంబానికి కొన్నేళ్లుగా దూరంగా ఉంటోంది. అయితే తనపై జరిగిన లైంగిక దాడికి గానూ శ్యామ్ను విచారించాలని, అలాగే తనకు జరిగిన నష్టానికి గానూ 75వేల డాలర్ల పరిహారం ఇప్పించాలని ఆమె కోర్టుకు కోరారు.‘‘మిస్సోరీలోని క్లేటన్లో గల మా ఇంట్లోనే నేను వేధింపులను ఎదుర్కొన్నా. అప్పుడు నాకు మూడేళ్లు. శామ్కు 12 ఏళ్లు. 1997 నుంచి 2006 వరకు అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారానికి పలుమార్లు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దారుణమైన అనుభవాల కారణంగా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. మానసికంగా కుంగిపోయా. ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమో’’ అని శామ్ సోదరి తన దావాలో పేర్కొన్నారు.ఓపెన్ఏఐ సీఈఓగా హారిస్ శామ్ ఆల్టమన్ ప్రపంచానికి సుపరిచితుడే. ఏఐ బూమ్లో ఈయనొక ప్రముఖుడు. తండ్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్కాగా, తల్లి డెర్మటాలజిస్ట్. ఈ జంటకు నలుగురు పిల్లలు కాగా, శామ్ పెద్దోడు. తనను తాను గేగా ప్రకటించుకున్న శామ్.. కిందటి ఏడాది జనవరిలో తన బాయ్ఫ్రెండ్ అలీవర్ ముల్హెరిన్ను వివాహం చేసుకున్నాడు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ మద్దతు క్యాంపెయిన్కు మద్దతుగా విరాళం కూడా ఇచ్చాడు.ఇక.. గత ఏడాది ఓపెన్ఏఐ ఆయనను తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు, వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో కంపెనీ బోర్డు ఆయన్ని తిరిగి తీసుకుంది. తాజాగా.. ఓపెన్ఏఐ విజిల్ బ్లోయర్ సుచీర్ బాలాజీ అనుమానాస్పద మృతి కేసు కూడా ఆయన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది.ఇదీ చదవండి: అద్భుతాలు చేస్తాడనుకున్నాం కానీ,.. సుచీర్ బాలాజీ తల్లిదండ్రుల రోదన -
అందుకే సాయిపల్లవి డిఫరెంట్.. చెల్లితో బీచ్లో చిల్ అవుతూ! (ఫొటోలు)
-
డియర్ అక్క.. నువ్వు సాధించిన ఈ విజయం నాకు స్పూర్తి: శివకార్తికేయన్
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా సోషల్మీడియా ద్వారా తన అక్క గౌరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక ఓమోషనల్ నోట్ రాశారు. ప్రస్తుతం నెట్టింట భారీగా వైరల్ అవుతుంది. చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి టీవీ యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా హీరో రేంజ్కు చేరుకున్నాడు. తను నటించిన రీసెంట్ హిట్ సినిమా అమరన్ బాక్సాఫీస్ వద్ద రూ. 330 కోట్లకు పైగా సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.శివకార్తికేయన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయినప్పటికీ చాలా సాధారణమైన జీవనశైలినే ఇష్టపడుతారు. ఈ క్రమంలో తాజాగా తన సోదరి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇలా పంచుకున్నారు. 'నా జీవితంలో ఆదర్శంగా నిలుస్తున్న ప్రియమైన అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత MBBS (డాక్టర్ కోర్సు) పూర్తి చేశావ్.. తల్లిగా నీ బాధ్యతలు చేస్తూనే 38 ఏళ్ల వయసులో MD వంటి ఉన్నతమైన కోర్సును పూర్తి చేసి గోల్డ్మెడల్ సాధించావ్. ఇప్పుడు 42 ఏళ్ల వయసులో FRCP సాధించావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నింటినీ అధిగమిస్తూ విజయాన్ని అందుకున్నావ్.. ఈ సందర్భంలో మన నాన్న ఉండుంటే చాలా గర్వంగా ఉండేది అక్క' అంటూ తన సోదరి గురించి చెబుతూ ఆయన ఒక నోట్ విడుదల చేశారు.శివకార్తికేయన్ వివాహం కూడా తన దగ్గరి బంధువుల అమ్మాయి అయిన ఆర్తితో జరిగింది. 2010 ఆగస్టు 27న ఆర్తిని ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్నాడు. శివకార్తికేయన్-ఆర్తి దంపతులకు ఒక కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. View this post on Instagram A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan) -
అందమైన వధువుగా నువ్వు.. నాకెంతో సంతోషం: సోదరి పెళ్లి... టీమిండియా కెప్టెన్ భావోద్వేగం(ఫొటోలు)
-
సాయిపల్లవి సిస్టర్ పూజకన్నన్ పెళ్లి వేడుక.. ఈ అరుదైన పిక్స్ చూశారా? (ఫొటోలు)
-
కోహ్లికి స్పెషల్ విషెస్: అక్క, అన్న పిల్లలతో విరాట్ రేర్ ఫొటోలు
-
కౌంట్డౌన్ మొదలైంది..చైతూ- శోభిత పెళ్లి పనులపై సమంత పోస్ట్! (ఫొటోలు)
-
మానవతకు ప్రతిరూపం
మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వివేకా నందుడి బోధనలకు ప్రభావితమై హిందూ (ధర్మం) మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఐర్లాండులో ఆమె 1867 అక్టోబర్ 28న జన్మించారు. ఆమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్లో చేసిన ప్రసంగాలు మార్గ రెట్ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె... వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్ వచ్చింది. ఆమెకు వివేకానంద ‘నివేదిత’ అని నామకరణం చేశారు. నివే దిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన ‘ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్’ పుస్తకంలో వివరించారు. ఇతరుల పట్ల దయతో మెలిగే ఆమె మంచి అభిరుచి గల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం ఆమె 1898 నవంబరులో కలకత్తాలోని బాగ్ బజారులో పాఠశాలను ప్రారంభించారు. కనీస విద్య లేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. 1899 మార్చిలో కలకత్తా వాసులకు ప్లేగువ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించీ, ఆచార వ్యవహారాల గురించీ న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లో ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించారు. 1906లో బెంగాల్కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనవి. 1911 అక్టోబర్ 13న డార్జిలింగ్లో మరణించిన సిస్టర్ నివేదిత తలపెట్టిన పనులను విస్తరించడమే మనం ఆమెకు ఇవ్వగల నివాళి.– సాకి ‘ 99511 72002(నేడు సిస్టర్ నివేదిత జయంతి) -
నాడు సమంత సంగీత్ వేడుక.. సందడి చేసిన శోభిత ధూళిపాళ్ల (ఫొటోలు)
-
టీమిండియా స్టార్ క్రికెటర్ బర్త్డే.. లవ్ యూ అంటూ అక్క విషెస్! (ఫొటోలు)
-
స్టార్టప్ ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం, కట్ చేస్తే అద్దె ఇంట్లోనే నివాసం
ఆరోగ్యకరమైన ఆహారం, లేదా ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతుందా అన్వేషించి, అన్వేషించి చివరికి వారే తయారు చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల సక్సెస్ స్టోరీ ఇది. సుహాసిని, ఆమె సోదరి అనిందితా సంపత్ న్యూయార్క్లో నివసించేవారు. వీరిద్దరూ కలిసి యోగా క్లాస్కు హాజరయ్యేవారు. ఒకరోజు అనిందిత ట్రేడర్ జో నుండి ప్రోటీన్ బార్ను తీసుకున్నప్పుడు, వాటికి ప్రత్యామ్నాయంగా ఏమైనా దొరుకుతుందా అని ఆలోచింది. ఆ వెదుకులాటే కొత్త స్టార్టప్ ఎనర్జీ బార్ బ్రాండ్ కంపెనీకి నాంది పలికింది. కట్ చేస్తే.. రూ. 500 కోట్ల ఆదాయం.ఎంత విజయం సాధించాం, ఎంత డబ్బు సంపాదించామన్నదికాదు ముఖ్యం, తద్వారా ప్రజల జీవితాల్లో ఎంత మార్పుతెచ్చామన్నంది కూడా ముఖ్యం అంటారు బెంగుళూరుకు చెందిన సోదరీమణులు సుహాసిని.ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటే ఏమి చేయాలి?ఎలా ఉండా? అనే ఆలోచన ఫలితంగా పుట్టిందే 'యోగా బార్'. బెంగళూరుకు చెందిన సుహాసిని సంపత్, తన సోదరి అనిందితా సంపత్తో కలిసి 2014లో దీన్ని ప్రారంభించారు. యుఎస్లో ఉద్యోగం చేస్తూ, చదువుకుంటున్నప్పుడు ఫిట్నెస్ స్పృహతో, శ్రద్ధగా యోగా తరగతులకు హాజరయ్యేవారు. కఠినమైన వ్యాయామ సెషన్ల తర్వాత, బాగా ఆకలి వేసింది. కానీ తమ కడుపుని సంతృప్తిపరిచే ఆరోగ్యకరమైన, పోషకమైన స్నాక్స్ తిందామంటే దొరికేదికాదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రూ.25 లక్షలతో స్ప్రౌట్ లైఫ్ ఫుడ్ అనే సంస్థను ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా వివిధ ఉత్పత్తులతో తమ వ్యాపారాన్ని విస్తరించారు. వాటిల్లోయోగా బార్ కూడా ఒకటి.యోగా బార్ భారతీయ ఆహార, ఆరోగ్య ప్రమాణాలను సంతృప్తి పరచడమే కాకుండా, అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)చే ఆమోదాన్ని పొందారు. స్నాక్బార్తో మొదలుపెట్టి పీనట్ బటర్, ఓట్స్.. ఇలా రకరకాల ఉత్పత్తులతో నాణ్యతకు మారుపేరుగా నిలిచింది .కట్ చేస్తే గత ఏడాది ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2026 నాటికి 100 శాతం స్టార్టప్ను రూ. 500 కోట్లకు కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకుంది.తొలి సంవత్సరంలో 5 లక్షల రూపాయలు. ఇండియాకు తిరిగి వచ్చి 2015 ఆగస్టులో, తొలి ఉత్పత్తి మల్టీగ్రెయిన్ ఎనర్జీ బార్లను, 2018లో ప్రొటీన్ బార్ను లాంచ్ చేసింది కంపెనీ. దీని ఆదాయం 2019లో రూ. 12 కోట్ల నుండి 2021 నాటికి రూ. 45 కోట్లకు పెరిగింది. వేలాది ఔట్ లెట్లతో అమెరికా, యూకేలో రెండు లక్షలకు పైగా కస్టమర్లు, ఎగుమతులతో, యోగా బార్ భారతదేశంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది. దీంతో రూ.175 కోట్లతో సంస్థలో 39.4 శాతం వాటా కొనుగోలు చేసింది ఐటీసీ. సుహాసిని, అనిందిత, ఆర్తి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచీ పోటీతత్వం, విజయాల పట్ల ఆసక్తి ఉన్న సోదరీమణులు ఇంటా బైటా రాణించారు. ప్రపంచంలోని అత్యుత్తమ కాలేజీల్లో చదువుకున్నారు. పెరుగుతున్నక్రమంలో రెస్టారెంట్ ఆహారం కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే ఇష్టపడేవారు. ముఖ్యంగా కూరగాయలు, తృణధాన్యాలు ,పండ్లతో పాటు, పిల్లలు ఇష్టమపడే జంక్ ఫుడ్ కోరికలను తీర్చడానికి, వారి తల్లి ఆరోగ్యకరమైన స్నాక్స్ స్వీట్ల తయారు చేసేవారట. అదే హెల్దీ యోగా బార్ సంస్థకు పునాది అంటారీ సోదరీ మణులు. కాగా లండన్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన సుహాసిని చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేశారు. రెండు ఇళ్లు ఉన్నప్పటికీ వాటికి అద్దెకిచ్చి బెంగళూరులో అద్దెకు నివసిస్తుండటం విశేషం. ఈమెకు రియల్ ఏస్టేట్ వ్యాపారంలో కూడా పట్టు ఉందిట. -
పూజా కన్నన్ పెళ్లిలో సాయిపల్లవి ఎమోషనల్ మూమెంట్స్ (ఫోటోలు)
-
Pooja Kannan: చెల్లి మెహందీ ఫంక్షన్.. దగ్గరుండి రెడీ చేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
పూజా కన్నన్ హల్దీ ఫంక్షన్.. అందరి కళ్లు సాయిపల్లవిపైనే! (ఫోటోలు)
-
టీమిండియా స్టార్ అక్క.. ఈమె కూడా క్రికెటరే! (ఫొటోలు)
-
హీరోయిన్ రష్మిక చెల్లిని చూశారా? ఎంత చిన్న పిల్లనో! (ఫొటోలు)
-
రక్షాబంధన్: అన్నకు ప్రాణం పోసిన చెల్లెలు
అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. చెల్లెలంటే ప్రాణమిచ్చే అన్న.. అన్నయ్యంటే ప్రాణం పెట్టే చెల్లెళ్లను మనం చూసే ఉంటాం. ఇటువంటి కథనాలను మనం వినే ఉంటాం. అయితే అంతకుమించిన అనుభంధం రాజస్థాన్లోని ఈ అన్నాచెల్లెళ్లది.రాజస్థాన్లోని రామ్గఢ్కు చెందిన ఒక సోదరి తన సోదరునికి కిడ్నీని దానం చేయడం ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. వీరు ఆస్పత్రిలోనే రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఉపాధ్యాయురాలు సునీతా బుడానియా తన కిడ్నీని తన సోదరుడు దేవేంద్ర బుడానియాకు దానం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ అహ్మదాబాద్లోని సివిల్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.2016లో దేవేంద్ర బుడానియా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపధ్యంలో అతని బంధువైన బీర్బల్ బుడానియా అతనికి కిడ్నీని దానం చేశారు. అయితే ఆ కిడ్నీ ఎనిమిదేళ్ల తర్వాత పనిచేయడం మానేసింది. దీంతో దేవేంద్రకు మరోమారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో దేవేంద్ర సోదరి సునీత తన అన్నకు తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా సునీతతో మీడియాతో మాట్లాడుతూ వివాహం అయినంతమాత్రన ఆడపిల్లకు పుట్టింటితో సంబంధం ముగిసిపోదని, అది ఇంకా పెరుగుతుందని అన్నారు. ఆడపిల్లకు అటు పుట్టినిల్లు, ఇటు అత్తారిల్లు అనే విధంగా బాధ్యతలు పెరుగుతాయన్నారు. తాను తన సోదరునికి కిడ్నీని దానం చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే డిశ్చార్జి కానున్నారు. -
Rakshabandhan: ఆడపడుచులకు యోగీ సర్కార్ కానుక
రక్షా బంధన్ నాడు మహిళలకు ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కారు ప్రత్యేక కానుక ప్రకటించింది. ఆగస్టు 17 నుండి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో అదనంగా బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆడపడచులకు ఆగస్టు 19, 20 తేదీలలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.ఆగస్టు 17 నుంచి 22వ తేదీ వరకు అన్ని రూట్లలో నిరంతరాయంగా బస్సులు నడిపేందుకు వీలుగా రావాణాశాఖ అధికారులు, ఉద్యోగుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సమయంలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లకు ప్రోత్సాహక నగదును ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టు బస్సులను కూడా నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలోని గోరఖ్పూర్ నుండి లక్నో, వారణాసి, కాన్పూర్, ఢిల్లీ, ప్రయాగ్రాజ్ మార్గాలకు అదనపు బస్సులు నడపనున్నారు. ఇప్పటికే లోకల్ రూట్లలో నడుస్తున్న బస్సులకు అదనంగా ట్రిప్పులు పెంచనున్నారు. -
సోదరితో పాటు షాపింగ్ చేసిన షేక్ హసీనా
బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా బృందంలోని సభ్యులంతా హడావుడిగా భారత్కు తరలివచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం షేక్ హసీనా టీమ్లోని చాలా మంది ఇక్కడికి వచ్చే సమయంలో తమ దుస్తులతో పాటు ఇతర రోజువారీ వినియోగ వస్తువులను కూడా తీసుకురాలేదు.భారత ప్రోటోకాల్ అధికారులు హసీనా జట్టు సభ్యులకు దుస్తులు ఇతర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు సహాయం అందించారు. బంగ్లాదేశ్లో వారు ఎదుర్కొన్న భయానక అనుభవాల నుంచి వారు ఇంకా కోలుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ సైన్యం షేక్ హసీనాకు రాజీనామా చేసేందుకు 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చింది. దీంతో ఆమె వెంటనే తన రాజీనామాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్కు సమర్పించారు. అనంతరం ఆమె భారత్ తరలివచ్చారు.తాజాగా షేక్ హసీనా తన సోదరి రిహన్నాతో కలిసి ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్ షాపింగ్ కాంప్లె క్స్కు వచ్చి తనకు అవసరమైన దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. ఆమె సుమారు రూ.30 వేల విలువైన సామగ్రి కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొత్తాన్ని ఆమె భారతీయ రూపాయిలలో చెల్లించారు. అయితే ఈ కొనుగోలు అధికారికంగా ధృవీకృతం కాలేదు. ప్రస్తుతం షేక్ హసీనా.. హిండన్ ఎయిర్బేస్లోని సేఫ్ హౌస్లో ఉంటున్నారు. ఆమె త్వరలో ఇక్కడ నుండి మరొక ప్రదేశానికి తరలివెళ్లవచ్చని తెలుస్తోంది.షేక్ హసీనా భద్రత కోసం ఆమె ఉంటున్న ప్రాంతంలో కమాండోలను మోహరించారు. షేక్ హసీనా తన సోదరి రెహానాతో కలిసి బంగ్లాదేశ్ నుంచి హిండన్ ఎయిర్బేస్కు చేరుకున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ హిండన్ ఎయిర్బేస్లో ఆమెను కలుసుకున్నారు. -
సెయిలింగ్ సిస్టర్స్..
ఒడ్డున చేరే అలల్లాంటివి వారి జీవితాలు.. ఐనప్పటికీ ఎగిసిపడే కెరటాల్లా తెరచాపలై దూసుకపోతోంది వారి చైతన్యం. చాలామందికి సెయిలింగ్ అంటే ఏంటో కూడా సరిగా తెలియని తరుణంలో.. ఇదే సెయిలింగ్లో నేషనల్ చాంపియన్లుగా నిలుస్తున్నారు ఆ అక్కాచెల్లెళ్లు.. పేదరికం అడ్డంకి కాకుండా యాచ్ క్లబ్ అందిస్తున్న సహకారంతో రసూల్పుర ఉద్భవ్ స్కూల్లో 8, 10 తరగతులు చదువుతున్న కొమరవెల్లి దీక్షిత, కొమరవెల్లి లాహరిలు టాప్ సెయిలింగ్ సిస్టర్స్గా రాణిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగానే కాకుండా భారత్ తరపున విదేశాల్లోనూ సెయిలింగ్ పోటీల్లో పాల్గొంటూ దేశ కీర్తికి భవిష్యత్ వారధులుగా నిలుస్తున్నారు. వివిధ క్రీడల్లో నగరానికి చెందిన సానియా మీర్జా, సైనా నెహా్వల్, పీవీ సింధూ, నిఖత్ జరీనా రాణించినట్టే.. రానున్న కాలంలో సెయిలింగ్ క్రీడకూ ఈ అక్కాచెల్లెళ్లు కేరాఫ్ అడ్రస్గా మారతారేమో.. ముంగ్గురు ఆడపిల్లలున్న కుటుంబం అది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు.. సామాన్య జీవనమే గగనమైన తరుణంలో అనితర సాధ్యమైన సెయిలింగ్ పోటీల్లో చాంపియన్లుగా నిలుస్తున్నారంటే ఆ అక్కా చెళ్లెల్ల ఆత్మ స్థైర్యమేంటో ఊహించవచ్చు. వీరి సామర్థ్యాలను గుర్తించిన నగరంలోని యాచ్ క్లబ్ వ్యవస్థాపకులు సుహేమ్ షేక్ వారి విద్యతో పాటు సెయిలింగ్ శిక్షణకు సహాకారం అందిస్తున్నారు. అందివచి్చన సహకారాన్ని వినియోగించుకుంటూ.. ఈ హైదరాబాదీ సెయిలర్లు జాతీయ స్థాయిలో పతకాల పంట పండించారు. సౌత్ కొరియా, భారత్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో దీక్షిత కొమురవెళ్లి పోటీపడింది. ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతున్న మరో అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో పతకం కోసం పోరాడుతోంది. ఈ మధ్యనే జరిగిన ఓ ప్రమాదంలో చెయి విరగడంతో లండన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ పోటీలకు వెళ్లలేకపోయానని లహరి బాధను వ్యక్తం చేసింది. అయితే కొన్ని రోజుల క్రితమే నగరం వేదికగా జరగిన 15వ మాన్సూన్ రెగట్టా పోటీల్లో అదే గాయంతోనే పోటీ చేసి అందరి ప్రశంసలను పొందింది చెల్లి. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న మొదటమ్మాయి కూడా సెయిలింగ్లో ప్రవేశముంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సెయిలింగ్ను కొనసాగించలేకపోయిందని తల్లి కవిత తెలిపింది. పిల్లల చదువులు, సెయిలింగ్ శిక్షణతో పాటే తనకు కూడా యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో వంట వండటానికి ఉద్యోగమిచ్చి ఉపాధి అవకాశాన్ని కల్పించారని సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీక్షిత విజయాలు–పతకాలుకాంస్యం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ జూనియర్ నేషనల్స్ 2022. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 14వ మాన్సూన్ రెగట్టా 2023. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ 3వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2023. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికలవిభాగం వైఏఐ యూత్ నేషనల్స్ 2023. వెండి పతకం– ఆప్టిమిస్ట్ వైఏఐ జూనియర్ నేషనల్స్ 2023. వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ జూనియర్ నేషనల్స్ 2023. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం సెయిల్ ఇండియా 2024. వెండి పతకం– ఆప్టిమిస్ట్ 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ 4వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2024. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 15వ మాన్సూన్ రెగట్టా 2024.లహరి విజయాలు–పతకాలు..బంగారు పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం, మొదటి వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2023. వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం, వైఏఐ 3వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2023. కాంస్యం– ఆప్టిమిస్ట్ వైఏఐ యూత్ నేషనల్స్ 2022. కాంస్యం– ఆప్టిమిస్ట్ 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024. వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024.ప్రతిష్ఠాత్మక సెయిలింగ్ పోటీల్లో జాతీయ స్థాయి పతకాలు.. లండన్, కొరియాలో దీక్షిత, నేషనల్స్లో లహరి రాణింపు.. విద్య, సెయిలింగ్లో యాచ్ క్లబ్ సహాయం -
బాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ అక్కాతమ్ముడు ఎవరంటే (ఫోటోలు)