వాషింగ్టన్: మీరేమో ఇరాన్పై యుద్ధం ఐదారు వారాలు కొనసాగిస్తాం’ అని అంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. పదిరోజుల్లో దాటితే దాడులు చేసేందుకు మన దగ్గర సరిపడ ఆయుధాలు లేవని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది.
అమెరికా-ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసింది. పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలే లక్ష్యంగా దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. అమెరికా సైతం అదే స్థాయిలో దాడుల్ని కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో ట్రంప్కు పెంగటాన్ రిక్వెస్ట్ చేసింది. ఇరాన్పై దాడి చేస్తూ వెళితే 10రోజుల తర్వాత మిసైళ్లు లేవని తెలిపింది. ఇప్పటికే ఇంటర్ సెప్టార్ మిసైళ్ల కొరత ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మనకే ప్రతికూల ప్రభావం పడుతుందని, యుద్ధానికి భారీగా ఖర్చవుతుందంటూ పెంటగాన్ వాపోతుంది’మరి ఆయుధాల కొరతపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు. తదుపరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది చర్చాంశనీయంగా మారింది.
ఇరాన్పై దాడులు, ఇటీవలి అనేక ఇతర సైనిక ప్రయత్నాల తర్వాత ఆయుధాల కొరత తగ్గించేలా పెంటగాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఆయుధాల ఉత్పత్తిని పెంచేందుకు ట్రంప్ పరిపాలన విభాగం వైట్ హౌస్లో అతిపెద్ద యుఎస్ రక్షణ కాంట్రాక్టర్ల కార్యనిర్వాహకులతో సమావేశం కావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్భందనం చేసింది. గీత దాటితే నౌకల కింద బాంబులు పెట్టి పేల్చేస్తానమి హెచ్చరిస్తోంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన అంశంలో డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రపంచానికి ఇంధన సరఫరాకు ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసా కల్పిస్తున్నారు. హర్మూజ్ జలసంధిలో ప్రస్తుతం 700నౌకలు ఉన్నాయి. ఆ నౌకలు గమ్య స్థానానికి వెళ్లేలా తమ సైన్యం రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు.


