సాక్షి, తిరుమల: తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత సంచరించింది. ఈ క్రమంలో జింకపై చిరుత దాడి చేసింది. దీంతో, జింక అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భక్తులను అప్రమత్తం చేసింది. చిరుత సంచారంలో అలిపిరి మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయపడిపోతున్నారు.


