breaking news
tirumala
-
తిరుమలలో నకిలీ ఆధార్లతో గదుల దందా.. ఆరుగురి అరెస్ట్
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ.. అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచారు.ఈ క్రమంలో ఇవాళ(శనివారం) ఉదయం తిరుమల సీఆర్వో కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు వ్యక్తులను సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటి ద్వారా టీటీడీ సీఆర్వోలో గదులు పొందుతున్నట్లు వెల్లడైంది.అనంతరం ఆ గదులను గదులు లభించని భక్తులకు అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అదే విధంగా, తిరుమలలోని పీఏసీ-5 వద్ద భక్తులు ఛార్జింగ్కు ఉంచిన సెల్ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. నిందితులు బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల దగ్గర నుంచి గది బుకింగ్లు, నకిలీ గుర్తింపు పత్రాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఉపయోగించిన సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల విచారణలో భాగంగా ఈ నెల 6న తెల్లవారుజామున తిరుమల పీఏసీ-5 దగ్గర దొంగతనం చేసిన రెండు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు సూచించారు. రూమ్ దళారీలను నమ్మి టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని తెలిపారు. నకిలీ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాల ద్వారా గదులు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. రూమ్ దళారీల కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు.. భక్తులను మోసం చేసే ప్రయత్నాలు గుర్తించిన వెంటనే పోలీసు అత్యవసర సేవ 112, సంబంధిత టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. -
సామాన్య భక్తురాలిగా శ్రీలీల.. వీడియో వైరల్
హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉన్నారు. ఇటీవలే అరుణాచలం సందర్శించిన బ్యూటీ.. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే వీఐపీ సంప్రదాయానికి భిన్నంగా శ్రీలీల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సామాన్య భక్తురాలిగా సర్వదర్శనం క్యూ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో శ్రీలీల నిర్ణయంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది. పెళ్లి సందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ధమాకా, భగవంత్ కేసరి, రాబిన్హుడ్, మాస్ జాతర లాంటి సినిమాల్లో మెప్పించింది. ఈ ఏడాది పరాశక్తి మూవీతో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రజినీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. #SreeLeela visited Tirupati to seek blessings 🙏Humble way as she opted for common queue darshan, avoids VVIP access 👏pic.twitter.com/OO9Cns4bfF— Balaji (@RDBalaji) August 7, 2026 -
శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్ పాండ్యా.. కొత్త లుక్ సీక్రెట్ ఏంటి..?
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దంపతులు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి భక్తులకు కీలక సమాచారం
సాక్షి, తిరుమల: భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం వెల్లడించింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు శ్రీవారి పుష్కరిణిలో భక్తులకు ప్రవేశం నిలిపివేస్తున్నట్టు తెలిపింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 31 వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు భారీ వర్షాలు, తుఫాన్లను దృష్టిలో ఉంచుకుని ముందుస్తు జాగ్రత్తలో భాగంగా పుష్కరిణిని పూర్తిగా మూసివేస్తామని టీటీడీ తెలిపింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 40 రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని వెల్లడించింది. 40 రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరని, శ్రీవారి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాగా, శ్రీవారి బ్రహ్మూత్సవాలు ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి జరగనున్నాయి. చదవండి: హనుమాన్ విగ్రహం దొంగ టీడీపీ నేత -
తిరుమలలో విగ్రహం దొంగలించింది నారా లోకేష్ అనుచరుడే
-
హనుమాన్ విగ్రహం దొంగ టీడీపీ నేత
తిరుపతి క్రైం/తిరుమల/తగరపువలస: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలురాయి వద్ద బుధవారం వేకువజామున అపహరణకు గురైన ఆంజనేయస్వామి విగ్రహం కేసు గురువారం సంచలన మలుపు తిరిగింది. ఈ ఘటనలో అరెస్టయిన నిందితుడు భీమిలికి చెందిన టీడీపీ నాయకుడేనన్న విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా, వార్తా ఛానళ్లలో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. నిందితుడు విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పొట్నూరు రాము కుమారుడు, ఐటీడీపీ కార్యదర్శి జశ్వంత్కుమార్ (22) అని తేలింది. ఈ విగ్రహం చోరీ వెనుక మరెవరైనా ఉన్నారా? జశ్వంత్కు ఎవరైనా ప్రోత్సాహం అందించారా? చోరీ సమయంలో ఇంకెవరైనా సహకరించారా? అనే కోణాల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు జశ్వంత్ భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజకు అత్యంత కీలక సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. బీటెక్ చదివి, ఐటీడీపీలో భీమిలి నియోజకవర్గం కార్యదర్శిగా కొనసాగుతున్న జశ్వంత్కు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కూడా సాన్నిహిత్యం ఉన్నట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. వీరితో ఉన్న పరిచయాలను అడ్డుపెట్టుకుని గతంలో పలువురిని బెదిరించిన సందర్భాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడు ఆంజనేయస్వామి విగ్రహం అపహరణ కేసులో పోలీసులకు చిక్కిన విషయం బుధవారమే తెలిసినా, టీడీపీ ఉన్నత నాయకత్వం సూచనల మేరకు పొట్నూరు రాము మౌనం పాటించారు. సాంకేతికత ఆధారంగా నిందితుడి అరెస్ట్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని మామండూరు మిట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోని చిన్న అభయ ఆంజనేయస్వామి విగ్రహం అపహరణకు గురైన కేసును తిరుపతి జిల్లా పోలీసులు 15 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ వివరాలను జిల్లా ఏఎస్పీలు గురువారం మీడియాకు వెల్లడించారు. టీటీడీ ఏవీఎస్ఓ ఎ.వెంకట శివకుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు టీటీడీ విజిలెన్స్ అధికారులతో కలిపి ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా విస్తృతంగా గాలింపు నిర్వహించారు. నిందితుడు ప్రయాణించిన జీపును గుర్తించి, అతని కదలికలను విశ్లేషించారు. రైల్వే పోలీసుల సహకారంతో ఒంగోలు రైల్వే స్టేషన్లో విశాఖపటా్ననికి చెందిన పొట్నూరు జశ్వంత్ కుమార్ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి విగ్రహాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, జశ్వంత్ కుమార్ ఇంజినీరింగ్ వరకు చదివి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడని, మూడేళ్లుగా మానసిక పరిస్థితి స్థిరంగా లేదని కుటుంబ సభ్యులు విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గొర్ల మండలంలోని భువనేశ్వరి పీఠంతో అతనికి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. నిందితుడు పొట్నూరు జశ్వంత్ కుమార్ను రిమాండ్కు తరలించి, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు వెల్లడించారు. కాగా, నిందితుడు జశ్వంత్ మానసిక స్థితి బాగోలేదని తిరుపతి పోలీసులు చెప్పడం సరికాదని భీమిలి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు రైల్వేస్టేషన్లో విగ్రహంతో జశ్వంత్ దొరకగానే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిందని, అతడి బ్యాక్ గ్రౌండ్ తెలిసిపోయిందని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు.. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని డైవర్షన్ డ్రామాకు తెర లేపారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన కూడా నిందితుడు తన స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లొచ్చారని స్థానికులు తెలిపారు. -
ఫ్యామిలీతో శ్రీవారిని దర్శించుకున్న మార్గాని భరత్
-
తిరుమలలో దారుణం
తిరుమల: తిరుమల–తిరుపతి మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద భక్తులు నిత్యం పూజలు నిర్వహించే ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం వేకువజామున అపహరించడం కలకలం రేపింది. ఈ ఘటనతో టీటీడీ భద్రతా వ్యవస్థ, విజిలెన్స్ విభాగం రాత్రి గస్తీ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బుధవారం ఉదయం పూజల కోసం వచ్చిన స్థానికులు, భక్తులకు విగ్రహం కనిపించకపోవడంతో వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తుల కదలికలను గుర్తించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. విగ్రహాన్ని వాహనంలో తరలించారా? లేక కాలినడకన తీసుకెళ్లారా? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది.తిరుమలలో 24 గంటలపాటు టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆంజనేయస్వామి విగ్రహం మాయం కావడం భద్రతా వ్యవస్థ సమర్థతపై సందేహాలకు తావిస్తోంది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్డులోని చిన్న దేవాలయాలు, విగ్రహాలు, మండపాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరుతున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచిస్తున్నారు.పోలీసుల అదుపులో నిందితుడు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, ఇతర కీలక సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు విశాఖపట్నానికి చెందిన పి.జస్వంత్గా గుర్తించారు. నిందితుడి నేపథ్యం, విగ్రహం స్వా«దీనం తదితర అంశాలపై తిరుపతి జిల్లా పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. పోలీసులు అలా ఎందుకు చెప్పారు? హనుమాన్ విగ్రహం చోరీ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విగ్రహాన్ని త్వరలోనే స్వా«దీనం చేసుకుని బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై టీటీడీ అధికారులు పూర్తి స్థాయి నివేదిక కోరినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి తిరుపతి జిల్లా పోలీసులు విడుదల చేసిన ప్రకటనపై పలు ప్రశ్నలు, సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఒక అడుగు ఎత్తున్న హనుమాన్ రాతి విగ్రహాన్ని జూలై 22వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో గోవిందమాల ధరించిన ఓ భక్తుడు తీసుకెళ్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పోలీసులు, టీటీడీ విజిలెన్స్తో కలిసి 10 ప్రత్యేక బృందాల ద్వారా ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటన ఎక్కడికి దారితీస్తుందోనని ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. ఈ విగ్రహం పురాతనమైనది కాదని చెప్పే ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విగ్రహాన్ని కొందరు భక్తులు 2000 సంవత్సరం తర్వాత ప్రతిష్టించారని ప్రత్యేకించి చెప్పడంలో ఉద్దేశం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన టీటీడీ నిఘా, భద్రత వ్యవస్థలో డొల్లతనాన్ని మరోమారు ఎత్తి చూపింది. -
"పెద్ది" మూవీ పోస్టర్ తో తిరుమలలో మహిళ హల్ చల్..!
-
నడకమార్గంలో ‘పెద్ది’ సినిమా పోస్టర్తో మహిళ హల్చల్
సాక్షి, తిరుమల: తిరుమలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ లోపం మరోసారి బయటపడింది. తిరుమల నడక మార్గంలో ‘పెద్ది’ సినిమా పోస్టర్తో ఓ మహిళ హల్చల్ చేసింది. నిషేధం ఉన్నా పోస్టర్తో మహిళ రావడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రాజకీయ, సినిమా ప్రచారాలకు తిరుమలలో అనుమతి లేదు. పెద్ది సినిమా పోస్టర్తో మహిళ నడిచిన వీడియో వైరల్గా మారింది. తిరుమల పవిత్రతపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.కాగా, గత శుక్రవారం(జులై 17) తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం శ్రీరంగం నుంచి పట్టువ్రస్తాల సమర్పణ వైభవంగా జరుగుతుండగా, మరోవైపు మహాద్వారం గుండా అనుమతి లేకుండానే ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడన్న ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధుల కథనం ప్రకారం.. రాజారెడ్డి అనే వ్యక్తి అధికారిక అనుమతి లేకుండానే శుక్రవారం తిరుమల ఆలయ మహాద్వారం ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. మహాద్వారం వద్ద విధులు నిర్వహించే విజిలెన్స్ అధికారులు ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాల్సి ఉండగా, ఈ ఘటనలో ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కాలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. -
‘చంద్రబాబు పాలనలో దేవుడికి కూడా రక్షణ లేదు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో దేవుడికి కూడా రక్షణ లేదని.. తిరుమలలో 60 ఏళ్ల చరిత్ర ఉన్న విగ్రహం చోరీకి గురైందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.‘‘బీఆర్ నాయుడు రావటంతోనే గోవులు చనిపోయాయి. ఇక అప్పట్నుంచి తరచూ ఏదోక అపచారం జరుగుతూనే ఉంది. మద్యం, గంజాయి, మాంసాహారం కొండ మీద వస్తుంది. బీఆర్ నాయుడు టీటీడీని ఛైర్మన్గా కాకుండా ఒక టీవీ ఛానల్ నడిపినట్టు నడుపుతున్నారు. దందాలు, సెటిల్మెంట్లు, అక్రమాలు భారీగా జరుగుతున్నాయి..విగ్రహం చోరీ జరిగితే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. మెట్లు కడిగిన నాయకులు ఏమయ్యారు?. చంద్రబాబు పాలనలో ఆలయాలు కూల్చేయడం, విగ్రహాల చోరీలు జరుగుతున్నాయి. బీఆర్ నాయుడు రాకతో తిరుమల క్షేత్రంలో అపచారం జరిగింది’’ అని శ్యామల మండిపడ్డారు. -
‘తిరుమల ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు?’
సాక్షి, తిరుపతి: ‘‘తిరుమలలో హనుమాన్ విగ్రహం మాయమైంది. వందల ఏళ్ల పురాతన విగ్రహం చోరీకి గురైంది. కూటమి చేస్తానన్న తిరుమల ప్రక్షాళన ఇదేనా? అంటూ వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు.‘‘25 వేల మందికి పైగా మెట్ల మార్గం పాదయాత్ర ద్వారా తిరుమలకు వెళ్లే మార్గంలో ఈ విగ్రహాన్ని దర్శిస్తారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి రోజున వైభవంగా టీటీడీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. విగ్రహం చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి...టీటీడీ విజిలెన్స్ అధికారులు చోరీ చేసిన దొంగను పిచ్చివాడిగా ముద్ర వేసే కుట్ర జరుగుతోందని మాకు సమాచారం. నిత్యం కొండపై ఏదో ఒక ఘోరం, అపచారం జరుగుతోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు చెందిన అంశం ఇది. చంద్రబాబు బాధ్యతా వహించాలి. టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. -
తిరుమలలో హరీష్ రావు ఫ్యామిలీ
-
తిరుమలలో మరో వివాదం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం శ్రీరంగం నుంచి పట్టువ్రస్తాల సమర్పణ వైభవంగా జరుగుతుండగా, మరోవైపు మహాద్వారం గుండా అనుమతి లేకుండానే ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధుల కథనం ప్రకారం.. రాజారెడ్డి అనే వ్యక్తి అధికారిక అనుమతి లేకుండానే శుక్రవారం తిరుమల ఆలయ మహాద్వారం ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అదే సమయంలో తమిళనాడు దేవదాయశాఖ మంత్రి, కమిషనర్, వారి కుటుంబ సభ్యులతో కూడిన బృందానికి టీటీడీ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు సమాచారం. అయితే, ఆ అధికారిక జాబితాలో లేని వ్యక్తి వారితో పాటు లోపలికి వెళ్లాడని ఆరోపిస్తున్నారు. మహాద్వారం వద్ద విధులు నిర్వహించే విజిలెన్స్ అధికారులు ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాల్సి ఉండగా, ఈ ఘటనలో ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కాలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని భక్తులు, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రూప్స్ తో బయటపెట్టిన భూమన.. టీటీడీలో ఉద్యోగాల మాయాజాలం
-
తిరుమలలో ప్రోటోకాల్ రగడ.. నారాయణ స్వామికి అవమానం!
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శన వ్యవస్థపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కె. నారాయణ స్వామి టీటీడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్ దర్శనం ఇవ్వాల్సి ఉండగా.. సాధారణ దర్శనానికి పంపించారని.. ఇది తనను అవమానించినట్లేనని పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.“దేవుడి దగ్గర అందరూ సమానమే. కానీ భక్తుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించడం బాధాకరం. నాకు ప్రోటోకాల్ ఉన్నప్పటికీ సాధారణ దర్శనం ఇచ్చారు. ఇది అవమానంగా భావిస్తున్నాను” అని నారాయణ స్వామి అన్నారు. అలాగే తిరుమలలో వైఎస్సార్సీపీకి చెందిన నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన వాపోయారు.అదే సమయంలో టీటీడీలో వీఐపీ సంస్కృతిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. “తిరుమలలో పూర్తిగా వీఐపీ దర్శనాలను తొలగించి.. సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరినీ అవమానించే పరిస్థితులు ఉండకూడదు” అని సూచించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల దర్శన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, రద్దీ రోజుల్లో సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు అధిక ప్రాధాన్యత లభిస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రోటోకాల్ పేరుతో ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటంతో సాధారణ భక్తుల దర్శన సమయం మరింత ఆలస్యమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. క్యూలైన్ల నిర్వహణ, భక్తుల సౌకర్యాల పర్యవేక్షణలో పోలీసులు, విజిలెన్స్ విభాగం మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీ సమయాల్లో భక్తుల ఇబ్బందులు, నీరు, ఆహారం, వైద్య సదుపాయాలపై మరింత దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. -
దుమారం రేపుతున్న..నవనీతమ్మ వివాదం
-
తిరుమలలో చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు
-
తిరుమలలో చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు
-
తిరుమలలో చిరుత కలకలం.. అలిపిరి మార్గంలో అలర్ట్
సాక్షి, తిరుమల: తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మరోసారి భక్తులను భయాందోళనకు గురిచేసింది. తాజాగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చిరుతను చూసిన పలువురు భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. శబ్దాలు చేస్తూ చిరుతను నెమ్మదిగా అడవి ప్రాంతం వైపు తరిమారు. అనంతరం చిరుత అడవిలోకి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అలిపిరి నడక మార్గంలో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఒంటరిగా కాకుండా గుంపులుగా మాత్రమే నడవాలని, రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తప్పనిసరిగా శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని సూచనలు చేశారు.మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 73,265 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,690 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.26 కోట్ల ఆదాయం లభించింది. టీటీడీ 4.09 లక్షల లడ్డూలను విక్రయించింది. -
116 ఏళ్ల నవనీతమ్మ వీడియో ఫేక్.. ముసలావిడతో బాబు పబ్లిసిటీ వెనుక అసలు కథ
-
తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు రాజేంద్ర ప్రసాద్,సాయి కుమార్ (ఫొటోలు)
-
తిరుమలలో టీటీడీ నిర్లక్ష్యం.. భూమన సీరియస్
సాక్షి, తిరుపతి: తిరుమలలో టీటీడీ, విజిలెన్స్ నిర్లక్ష్యంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో నిర్లక్ష్యానికి చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. స్వామి వారి చిత్రపటాలు చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. పవనానంద స్వామి.. మీ సనాతనం ఎలా ఉందో చూడండి అని మండిపడ్డారు. ఇవన్నీ చూసి పాలకులు సిగ్గుపడాలన్నారు.టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తిరుమలలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనలో టీటీడీని పరిరక్షిస్తున్నామంటూ గొప్పలు చెబుతూనే తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి పాలనలో అలిపిరి దగ్గర నుంచి కిలోమీటర్ పరిధిలో వెంకటేశ్వర స్వామి స్థలాల్లో పవిత్రంగా ఉండాల్సిన చోట టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొన్ని వందల వేల స్వామి వారి ఫొటోలు అన్ని కూడా అత్యంత నిర్లక్ష్యంగా చెత్తకుప్పల్లో, మల మూత్రాల మధ్య పడేశారు. టీటీడీ వాళ్లు పడేశారు అని చెప్పడం లేదు.. విజిలెన్స్ వైఫల్యం చూపిస్తున్నాం. గత రెండేళ్ల పాలనలో టీటీడీ ప్రక్షాళన చేస్తున్నామని చెబుతున్నారు. కానీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు ఊడిగం చేసే వారు సిగ్గుతో తలదించుకోవాలి.స్వామి వారి చిత్రపటాలు మల మూత్రాల మద్య, బీరు బాటిల్స్ మధ్య ఉన్నాయి. వీటిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మీకు లేదా?. నిర్లక్ష్యంగా వదిలివేసి టీటీడీ చోద్యం చూస్తోంది. మీ పాలనలో ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి అనేది కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. టీటీడీ పాలకులు, అధికారులు సిగ్గుపడాలి. సనాతన ధర్మం సాంప్రదాయం కాపాడతామన్న ఉపముఖ్యమంత్రి పవనానంద స్వామి.. మీ సనాతనం ఎలా ఏడ్చి చచ్చిందో ఓసారి వచ్చి చూడండి. ప్రక్షాళన చేస్తామన్నా పవనానంద స్వామి.. ఇదేనా ప్రక్షాళన, మీ పాలన అంతా అవినీతిమయమే’ అంటూ మండిపడ్డారు. -
తిరుమల శ్రీవారి సన్నిధిలో అనంత్ అంబానీ..
-
భక్తజన సంద్రంగా తిరుమల (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ దుర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి, దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. అలాగే శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.అనంత్ అంబానీ అంతకుముందు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు వెల్లడించారు. ఆ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల జీతభత్యాలు కూడా తామే భరిస్తామన్నారు.ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులను నడిపే 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు చెల్లించడంతో పాటు, తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్లోని వంతారా తహరాలో టీటీడీ గోశాలను ఆధునికీకరించేందుకు అంగీకారం తెలినట్లుగా తెలుస్తోంది. -
29న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: వేసవి సెలవులు ముగిసిపోవడంతో పాటు వారాంతం రావడంతో తిరుమలలో అనూహ్య రద్దీ నెలకొన్న కారణంగా అధిక మంది భక్తులకు దర్శనాలు కల్పించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.. ఈ నేపథ్యంలో ఆదివారం సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదు. ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ లో ఏరోజుకారోజు జారీ చేసే 800 శ్రీవాణి దర్శనాలను కూడా ఆరోజు రద్దు చేశారు. అదేవిధంగా తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, బయట క్యూలైన్లు నిండి బాలాజీ నగర్ ప్రాంతం వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇంకా వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ సీనియర్ అధికారులందరూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. -
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)
-
తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో నందమూరి మోక్షజ్ఞ తేజ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో 'మా ఇంటి బంగారం' టీమ్ (ఫోటోలు)
-
హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!
సాక్షి, తిరుపతి: తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. స్వామివారి ఆలయంపై నుంచి హెలికాఫ్టర్ వెళ్లింది. దీంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఆలయ పవిత్రత దెబ్బ తింటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చోద్యం చూస్తుందా? అని మండిపడుతున్నారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం.. ఆలయ గర్భగుడి మీదుపై డ్రోన్లతో సహా ఎలాంటివి సంచరించకూడదు. కానీ, విమానాల సంచారం తరచూ జరుగుతోంది. ఈ విషయంలో భక్తులు ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఇటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని టీటీడీ చెబుతూ వస్తోంది. అయితే చాలాకాలం తర్వాత ఏకంగా హెలికాఫ్టర్ సంచరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “తిరుమలలో సాధారణంగా విమానాలు వెళ్తున్నాయి… కానీ ఈసారి ఏకంగా హెలికాప్టర్ ఆలయంపైకి వచ్చింది. పవిత్రతను కాపాడాల్సిన వ్యవస్థలు మౌనంగా ఉండటం సరైందేనా?’’ అని కొందరు వాపోతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు కఠిన నియంత్రణలు అవసరమని డిమాండ్ చేస్తున్నారు.ఈ పరిణామం రాజకీయ చర్చలకు కూడా దారి తీసింది. ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ బాధ్యతల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. దీంతో తిరుమలలో విమాన రాకపోకల నియంత్రణపై సమన్వయం ఎంతవరకు ఉందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. -
తిరుమలలో పవన్ కళ్యాణ్ పుస్తకం ఆవిష్కరణ
-
తిరుమలలో జన సైనికుల ఓవరాక్షన్
తిరుమల: తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు జన సైనికులు ఓవరాక్షన్ చేశారు. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రదర్శన చేసి హంగామా సృష్టించారు. పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకాన్ని శ్రీవారి ఆలయం ముందు ప్రదర్శించారు. ఆలయం ముందు పుస్తకాన్ని వీడియోలు తీశారు జనసేన నేతలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుమలలో రాజకీయ ప్రచారంపై నిషేధం ఉన్నా ఉల్లంఘనలకు తెరలేపారు జనసేన నేతలు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విదంగా చేసిన జనసేన వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా సిబ్బంది ఉన్నా ఈ ఘటన ఎలా జరిగిందనే ప్రశ్నలు తలెత్తాయి. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఈ ఉల్లంఘన ఎపిసోడ్తో తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యంపై చర్చ నడుస్తోంది. -
తిరుపతి సభ సాక్షిగా చేతులెత్తేసిన బాబు
-
తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)
-
మొన్ననే బ్రేకప్.. అప్పుడే కలిసిపోయారా?
గతేడాది నుంచి విడాకుల వివాదంతో వార్తల్లో నిలుస్తోన్న హీరో జయం రవి. తన భార్య వేధింపులతో విసిగిపోయానని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు మంజురయ్యే వరకు సినిమాల్లో నటించని కూడా అన్నారు. పెళ్లి తర్వాత నరకం చూశానని అన్నాడు. పెళ్లయిన మొదటి రోజు నుంచే బ్లాక్ మెయిల్ చేశారని.. కనీస గౌరవం కూడా ఇచ్చవాళ్లు కాదన్నారు. ఆఖరికి నేను సంపాదించుకున్న డబ్బుని దాచుకోవడానికి కూడా ఒక అకౌంట్ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వివాదం తర్వాత జయం రవి ప్రముఖ సింగర్ కెనీషాతో రిలేషన్ కొనసాగించారు. కానీ ఇటీవలే సింగర్ కెనీషా కూడా షాకిచ్చింది. రవితో తనకున్న రిలేషన్కి బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఆమె తెలిపారు.అయితే తాజాగా కెనీషా మరో షాకిచ్చింది. సడన్గా జయం రవితో కలిసి తిరుమలలో కనిపించింది. వీరిద్దరు కలిసి దర్శనానికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో వీరిద్దరు మళ్లీ కలిసిపోయారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరోవైవు జయం రవి ఇటీవలే లోకేశ్ కనగరాజ్ మూవీలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Ravi Mohan and Kenisha reunite after separation! pic.twitter.com/xjT0mYi6ip— Princy (@Mrking1618) June 9, 2026 -
ఇంత దారుణమా.. ఫిట్స్ వచ్చి పడిపోతే లాక్ చేసి పోయారు
-
పప్పు కూర
చెన్నైకి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ప్రతి శనివారం తిరుమలకి వచ్చి వెళ్ళడం అలవాటు. ఉదయమే చెన్నై నుంచి కారులో బయలుదేరి కొండకు చేరేవాడు. కొండ దిగేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా తాగేవాడు కాడు. కుదిరితే స్వామివారి దర్శనం చేసుకునే వాడు. కుదరకపోతే ప్రశాంతంగా గుడి ముందర కూర్చునేవాడు. పుష్కరిణి దగ్గరకు వెళ్ళి తలమీద నీళ్ళు చల్లుకునే వాడు. వరాహస్వామి దర్శనం చేసుకునే వాడు. ఆపైన బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నిలబడి ఆలయ గోపురానికి నమస్కరించే వాడు. కర్పూర హారతి ఇచ్చి కొండ దిగేసే వాడు. తిరుపతిలో అతడికి పిల్లనిచ్చిన అత్తగారు ఉన్నారు. కొండ దిగిన ప్రతిసారీ అత్తగారి ఇంటికి వెళ్లి ఆమె బాగోగులు తెలుసుకునేవాడు. అల్లుడు వచ్చిన ప్రతిసారీ ఇంటి పెరట్లో ఉన్న అరటి చెట్టులోని కొన ఆకు కోసి తను చేసిన వేడి వేడి వంటలు వడ్డించేది. పచ్చటి అరిటాకులో పప్పుకూర వడ్డించేది. ఘుమఘుమలాడే నెయ్యి కూడా వేసేది. వెళ్ళిన ప్రతిసారీ ఆమె పప్పుకూరే చేసేది. ఎందుకంటే ఆమె పప్పు కూర మాత్రమే బాగా చేయగలదు. ఎంతో రుచిగా ఉన్నప్పటికీ వారం వారం పప్పుకూర తినలేక అల్లుడికి విసుగు వచ్చింది. ఒకరోజు ఏడుపు ముఖం పెట్టి ‘‘అత్తా, ఎప్పుడూ పప్పు కూరేనా? తినాలంటే మొహం మొత్తుతోంది’’ అన్నాడు. ఆమె నవ్వింది.‘‘అల్లుడూ... పప్పుకూర సరే, పదేళ్ళుగా తిరుమల వచ్చి వెళ్తున్నావు. గుడిలోని స్వామి అప్పుడూ, ఇప్పుడూ ఒక్కరే కదా... ఏ మాత్రం మార్పు లేదు కదా, నీకెప్పుడూ స్వామిని ‘చూసింది చాల్లే’ అనిపించలేదా?’’ అని అడిగింది.అతడు నవ్వాడు.‘‘స్వామిని చూడటం ‘చాలు’ అనిపించదత్తా. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. కొండకి వచ్చిన ప్రతిసారీ దర్శనం చేసుకుని బంగారు వాకిలి దాటి వచ్చేలోగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏమిటో ఈ మాయ’’ అంటూ చేయి కడిగాడు. అత్త తాను చేసిన పప్పు కూర కొద్దిగా గిన్నెలో పెట్టి కూతురికిమ్మనిచెప్పింది. అలాగేనని తల ఊపి ‘రాకుండా ఉండలేను నీ కొండకు... చూడకుండా ఉండలేను ఏ నాటికీ’ అని పాడుకుంటూ చెన్నైకి బయలుదేరాడు. ఆ రోజునుంచి అత్త ముందు పప్పు కూర మాట ఎత్తలేదు అల్లుడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
తిరుమలలో కుంభవృష్టి వర్షం.. భక్తులకు ఇబ్బందులు
తిరుమల: తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం గంటపాటు కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయం చుట్టుపక్కల రహదారులు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా క్యూలైన్లలో నిలబడి ఉన్న భక్తులు తడిసి ఇబ్బంది పడ్డారు. రహదారులు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలు కూడా అంతరాయం కలిగాయి. -
హీరో రవితేజ కూతురు ఎలా ఉందో చూసారా..?
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
-
పెద్ది రిలీజ్..తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ
పెద్ది రిలీజ్ సందర్భంగా సినీ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న జాన్వీ.. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, జాన్వీ కపూర్, రామ్ చరణ్ జంటగా నటించిన పెద్ది చిత్రం ఈ రోజు (జూన్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. కథ బాగున్నప్పటికీ.. కథనం ఊహకందేలా ఉండడం మైనస్ అని చెబుతున్నాయి. అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని అంటున్నారు.ఇక ఏఆర్ రెహమాన్ సంగీతంపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నేపథ్యం సంగీతం కొత్తగా ఉందని... అదే సినిమా స్థాయిని పెంచిందని కామెంట్ చేస్తున్నారు. (పెద్ది సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)Tirumala, Andhra Pradesh: Actor Janhvi Kapoor visited the Tirumala temple and offered prayers at the revered shrine.#JanhviKapoor #Tirumala #Tirupati #AndhraPradesh #CelebrityUpdate pic.twitter.com/hriHzRfDu6— Rohit (@Rohit6156585804) June 4, 2026 -
తిరుమల శ్రీవారి సేవలో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
పెద్ది రిలీజ్ వేళ.. శ్రీవారి సేవలో బుచ్చిబాబు ఫ్యామిలీ
పెద్ది రిలీజ్ వేళ బుచ్చిబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్ది కోసం రామ్ చరణ్తో సహా తాము చాలా కష్టపడ్డామని తెలిపారు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూన్ 3 రాత్రి నుంచే పెద్ది ప్రీమియర్స్ షోలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
తిరుమల : అలిపిరి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ నేతలతో అనుచిత ప్రవర్తన (ఫొటోలు)
-
తిరుమల అలిపిరి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, తిరుమల: తిరుమలలోని అలిపిరి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అలిపిరి వద్ద వీధి వ్యాపారులకు మద్దతుగా ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్సీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, భూమన అభినయ్ రెడ్డితో పాటుగా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, ఎస్సీ యూనివర్సిటీ పోలీసు స్టేషన్కు అభినయ రెడ్డిని పోలీసులు తరలించారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు, వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు ఈడ్చుకెళ్లారు.మరోవైపు.. చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అంతకుముందు అలిపిరి-జూపార్క్ రోడ్లో వీధి వ్యాపారులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కూటమి నేతలు సూచనతో బలవంతంగా చిరు వ్యాపారుల తోపుడు బండ్లు తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి నేతల అప్రజాస్వామ్య చర్యలపై భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో అలిపిరి జూపార్క్ రోడ్ వ్యాపారులకు మద్దతుగా క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు పర్యటన చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తల పర్యటనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ 30 యాక్ట్ పేరుతో అడ్డుకునేందుకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ అలిపిరి వద్ద తోపుడు బండ్లు వ్యాపారులకు వైఎస్సార్సీపీ మద్దతుగా నిలిచింది. -
తిరుమలలో కుండపోత వర్షం
తిరుమల: తిరుమల కొండపై కుండపోతగా వర్షం కురుస్తోంది. రెండు గంటలకు పైగా వర్షం కురుస్తోంది. దాంతో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన ప్రాంతాలన్నీ జలమయంగా మారడంతో భక్తులు అగచాట్లు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్నా.. తిరిగి వసతి ప్రాంతాలకు వెళ్లాలన్నా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. తిరుమలలో ఉన్నపళంగా వాతావరణం మారిపోయి వర్షం పడటం ఆరంభించింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో తిరుపతి నగరంలో కూడా రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. దాంతో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
తిరుమల క్యూలైన్లలో పెరుగుతున్న గొడవలు.. మహిళల మధ్య భారీ ఘర్షణ
-
బాబు వచ్చాక టీటీడీ సర్వనాశనం, మమ్మల్ని కుక్కల్లా చూస్తున్నారు!
-
తిరుమల: శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు
తిరుమల: భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రోజూ 1,500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500 టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులో ఉంచనుంది.మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీచేయనుంది. ప్రస్తుతం రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలో అందుబాటులో ఉన్న 800 శ్రీవాణి దర్శన టికెట్లలో ఇప్పటికే రూ.10 వేలు విరాళం చెల్లించి దర్శన టికెట్ కోసం వేచి ఉన్న దాతలకు ప్రతిరోజూ 300 టికెట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ సదుపాయం 2025 మే 1 నుంచి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు వర్తించనుంది. ఈ టికెట్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కలి్పస్తుంది. కాగా ఈ విధానం జూన్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని టీటీడీ పేర్కొంది. -
తిరుపతి: స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు (ఫోటోలు)
-
తిరుమలలో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
-
తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
దేవుడా ఏంటి ఈ కర్మ అనేలా తిరుమల లో పరిస్థితి
-
బీఆర్ నాయడు అరాచకాలపై నా పోరాటం ఆగదు: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అరాచకాలపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కొండ మీద జరుగుతున్న అరాచకాలకు బీఆర్ నాయుడుదే బాధ్యత అని అన్నారు. తిరుమలలో జరుగుతున్న అవినీతిని నిలువరిస్తా అని భూమన చెప్పుకొచ్చారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతలు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. సనాతన ధర్మం ముసుగులో కొందరు నా ఇంటి ముట్టడికి వచ్చారు. ఒబెరాయ్ హోటల్కు స్థలం ఇస్తే సాధవులు ఎందుకు ఖండించలేదు. కొండ మీద జరుగుతున్న అరాచకాలకు బీఆర్ నాయుడుదే బాధ్యత. బీఆర్ నాయుడు నీ బెదిరింపులకు నేను భయపడను. దాడులకు భయపడే వాడిని కాదు.. భయపెట్టేవాడిని. తిరుమలతో జరుగుతున్న అవినీతిని నిలువరిస్తా’ అని తెలిపారు.బీఆర్ నాయుడు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారు. బీఆర్ నాయడు అరాచకాలపై నా పోరాటం ఆగదు.సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే నా ఇంటి ముట్టడికి కొంత మంది వచ్చారు. సాధు పరిషత్ అధ్యక్షుడు అయినంత మాత్రాన సాధువులు అయిపోరు. బీఆర్ నాయుడు అక్రమాలను నేను ప్రశ్నిస్తున్నానే కారణంగా నాపై కుట్రలు చేస్తున్నారు. బీఆర్ నాయుడు నీ గుండెల్లో నిద్రపోతా అని హెచ్చరించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే జగత్ గురువులు, జగత్ కిలాడీలు, టీడీపీ కార్యకర్తలు పసుపు వస్త్రాలు విసర్జించి కాషాయం ధరించి నా ఇంటి ముట్టడికి వచ్చారు. టీడీపీ నాయకుడు నారాయణ రావు సన్యాసులు ముసుగులో ఇంటి ముట్టడికి యత్నించారు. 20 టికెట్లను బ్లాక్లో అమ్ముకునే వ్యక్తి అట్లూరి నారాయణ రావు. సన్యాసి ముసుగులో నా ఇంటి ముట్టడికి సిద్ధపడ్డారు. బీఆర్ నాయుడు తొత్తులుగా వాళ్లంతా నా ఇంటిని ముట్టడికి విఫలయత్నం చేశారు. బీఆర్ నాయుడు.. కాషాయం ముసుగులో ఇలాంటి సన్యాసులను నాపైకి పంపిస్తున్నాడు. బీఆర్ నాయుడు కాదు బీఆర్ కాముడు. ఈ దొంగ స్వామీజీలు కాదు నాకు చెప్పాల్సింది. జగద్గురు కంచి స్వామీజీ, కుర్తాళం పీఠాధిపతి, అహోబిలం పీఠాధిపతిలు చెబితే నేను వింటాను’ అని అన్నారు. -
భక్తులతో రద్దీ.. తిరుమలలో ప్రస్తుత పరిస్థితి
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
-
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)
-
శ్రీవారి సేవలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ దంపతులు (ఫోటోలు)
-
దళారుల చేతిలో శ్రీవాణి టికెట్లు? 10 సెకెన్లలో హైజాక్!
-
తిరుమలలో జోరు వాన.. తడిసి ముద్దయిన భక్తులు
-
తిరుమల శ్రీవారి సేవలో హీరో ఆది పినిశెట్టి దంపతులు.. (ఫొటోలు)
-
మీకొక సందేశాన్ని అందిద్దాం అనే 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కా..
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబం (ఫొటోలు)
-
శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం: భూమన
సాక్షి, తిరుపతి: టీటీడీలో శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం జరిగిందని, నాలుగు నెలలుగా ఒక్క రోజు కూడా కనీసం 8 టికెట్లు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో ఐటీ, విజిలెన్స్, దళారులు, ట్రావెల్ ఏజెంట్స్ కుమ్మక్కై ఒక్కో శ్రీవాణి టికెట్ రూ.15 వేలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.దీన్ని నెలన్నర క్రితమే తాము బయటపెట్టినా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆక్షేపించారు. పదే పదే తాము ప్రశ్నిస్తుంటే చివరికి ఏఐ, ఆటో ఫిల్లింగ్ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. శ్రీవాణి టికెట్ల స్కాంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. భూమన ఇంకా ఏం మాట్లాడారంటే..:నిరంతరాయంగా శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ దోపిడీ:శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ దోపిడీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఉదయం 9 గం,కు మొత్తం 800 శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో ఓపెన్ చేస్తే కేవలం ఒకటిన్నర నిమిషంలో మొత్తం టికెట్లు అమ్ముడు పోయినట్లు వస్తోంది. ఇదెలా సాధ్యం! దీని వెనుక మతలబు ఉంది. పెద్ద అవినీతి దాగి ఉంది. ఇంకా కుట్ర కూడా ఉందని మేం చెబుతున్నాం. దీని మీద టీటీడీ ఓ ప్రకటన ఇచ్చింది. ఇందులో సాఫ్ట్వేర్ మీద నిరంతర నిఘా పెట్టామని, ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ లాంటి పద్దతులతో వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లు పొందే అనుమానాస్పద కార్యక్రమాల మీద డేగ కన్ను వేశామని చెబుతోంది. అలాగే అక్రమ పద్దతుల్లో బుక్ చేస్తున్న ఐడీల్ని నిరోధించి దళారుల ఎత్తుగడల్ని తిప్పికొట్టేలా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నట్లు చెబుతోంది. కాబట్టి మధ్యవర్తుల్ని నమ్మి మోసపోవద్దని టీటీడీ కోరుతోంది.టీటీడీ ద్వంద్వ వైఖరి:ఇంకా 2024 జూన్ నుంచి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించామని, బుకింగ్ సైట్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ చొరబడటం సాధ్యం కాదంటున్నారు. మరోవైపు మళ్లీ కొంతమంది దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ, ఏఐ ఆధారిత ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల్లో టికెట్లు బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.నాలుగు నెలలుగా రోజుకు 8 టికెట్లూ ఇవ్వలేదు!:టీటీడీని నేను ఓ ప్రశ్న వేస్తున్నా. 2024లో అధికారంలోకి వచ్చాక శ్రీవాణి టికెట్ల విధానాన్ని అత్యంత పటిష్టం చేశామని చెబుతున్న మీరు.. ఆటో ఫిల్లింగ్ పద్దతుల ద్వారా దళారులు చొరబడుతున్నారని ఒప్పుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 9న ఆన్ లైన్ విధానం ప్రవేశపెడితే, అప్పటి నుంచి ఇవాళ్టి వరకూ ప్రతీ రోజూ ఇచ్చే 800 శ్రీవాణి టికెట్లలో ఒక్కటి కూడా అర్హులకు అందలేదు. నాలుగు నెలలుగా ఈ విషయం మీరు గుర్తించనే లేదా? లేక నిద్రపోయారా? లేక నిద్ర నటిస్తున్నారా? లేదా మా విమర్శలకు భయపడి ఈ వివరణ ఇచ్చారా? అనేది చెప్పాలి.దళారులు, ట్రావెల్ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్లైన్లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల చేతుల్లో టికెట్లు కనిపిస్తున్నాయి. దీనిపై మేం లోతైన పరిశీలన చేస్తే టీటీడీ ఐటీ జీఎంగా ఓ ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ అర్హత కూడా లేని వ్యక్తిని నియమించారని తేలింది. ఈ వ్యక్తిని గతంలో విదేశాల్లో కళ్యాణోత్సవాలు జరపమని పంపిస్తే దాదాపు రూ.30 లక్షలు తినేశాడని పట్టుకుని ఆ మొత్తం రికవరీ కూడా చేశాం. అలాంటి వ్యక్తిని జీఎంగా నియమించారు. పెద్దలు తమకు తాబేదారుగా ఉంటాడని అతన్ని ఈ పోస్టులో నియమించారు.నిజానికి టీసీఎస్ నుంచి కొత్త సాఫ్ట్వేర్ వచ్చాకే ఈ దోపిడీ మొదలైంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అతనికి అనుంగు శిష్యుడైన మరో బోర్డు సభ్యుడు, స్ధానికుడు కూడా అయిన వ్యక్తి కలిసి రోజుకు రూ.40 లక్షల ఆదాయం శ్రీవాణి టికెట్ల ద్వారా పంచుకుంటున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో దాదాపు రూ.48 కోట్లు అలా దండుకున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి చెందాల్సిన రూ.48 కోట్లను వీరు అక్రమంగా దోచుకున్నారు.సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే రోజుకు 800 టికెట్ల జారీ!:మేం కొత్త సాఫ్ట్ వేర్ తెచ్చినప్పుడు శ్రీవాణి టికెట్లను మూడు నెలలకోసారి సెక్యూరిటీ ఆడిట్ చేసి కేటాయించే వాళ్లం. కానీ ఇప్పుడు టీసీఎస్ ఎలాంటి సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే రోజుకు 800 టికెట్లను రిలీజ్ చేస్తోంది. ఆటో ఫిల్లింగ్ ద్వారా ఎవరో దళారులు, ట్రావెల్ ఏజెంట్లు దూరుతున్నారని చెప్తున్న టీటీడీ.. మేం తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ సిస్టమ్ లో మూడు నెలలకోసారి ఇచ్చే రూ.300 ఎస్ఈడీ టికెట్ల ఫ్రీ బుకింగ్ కానీ, కళ్యాణోత్సవం టికెట్లు కానీ, సేవా టికెట్ల డిప్లు కానీ, వసతి టికెట్లు కానీ, మూడు నెలలకు ఇచ్చే శ్రీవాణి కోటాలో ఎందుకు ఆటోఫిల్లింగ్ జరగడం లేదో సమాధానం చెప్పాలి. కొత్తగా ఆ సాఫ్ట్వేర్ రూపొందించామని చెప్తున్న టీటీడీ.. ఈ 800 టికెట్లకే ఎందుకు ఆటోఫిల్లింగ్ జరుగుతోందో చెప్పాలి.అంటే అందరూ కూడబలుక్కుని దోపిడీ చేస్తున్నారు. విజిలెన్స్, ఐటీ రంగం పూర్తిగా నిర్వీర్యం కావడమే కాకుండా నిస్సత్తువతో మిలాఖత్ అయ్యాయి. అటు పెద్దలు, ఇటు దళారులు, ఐటీ, విజిలెన్స్ కలిసే ఈ తతంగం నడుపుతున్నారు. ఒక్క రోజులో కనుక్కోవాల్సిన విషయాన్ని మేం పదే పదే చెప్తుంటే, విమర్శల జడివాన పెరిగాక ఇలా జరుగుతోందని, డేగ కన్ను వేశామని కబుర్లు చెప్తున్నారు. కన్ను తెరిచారే తప్ప అది పని చేయడం లేదు.సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే:శ్రీవాణి టికెట్ల స్కామ్పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఏకంగా రూ.48 కోట్ల స్కామ్ జరిగింది. మేం శ్రీవాణి టికెట్లు ఆ‹ లైన్లో ఇచ్చినప్పుడు రోజుకు 1000 వరకు ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వం దాన్ని మూసేసి ఆన్ లైన్ విధానం తీసుకొచ్చింది. ఈ నాలుగు నెలల కాలంలో రోజుకు కనీసం 8 మందికి కూడా టికెట్లు దొరకలేదు. దళారులంతా టీటీడీ వెబ్ సైట్ ద్వారానే టికెట్లు కొంటున్నారు. ఎలా అంటే మీ ఐటీ, విజిలెన్స్ విభాగాలు, పాలక మండలి పెద్దలు కుమ్ముక్కు కావడం వల్లే. అలా అంతా ఒక్కౖటై ఒక్కో బ్రేక్ దర్శనం టికెట్ రూ.4 వేలకు అమ్ముతున్నారని భూమన కరుణాకర్రెడ్డి తేల్చి చెప్పారు. -
తిరుమల శ్రీవారి సేవలో రాజశేఖర్ కుటుంబం (ఫొటోలు)
-
తిరుమల కొండపై భారీ వర్షం (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
-
తిరుమలలో త్రిష పూజలు...
-
తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
ట్రెండింగ్: తమిళనాడు రిజల్ట్.. తిరుమలలో హీరోయిన్ త్రిష
ప్రముఖ హిరోయిన్ త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఆమె (మే 4, సోమవారం) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.ఆదివారం రాత్రి తన తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన త్రిష.. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా, సామాన్య భక్తురాలిలా ఆమె శాంతియుతంగా పూజలు నిర్వహించారు.తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజే త్రిష తిరుమలకు వెళ్లడంతో.. ఆమె విజయ్ పార్టీ విజయం కోసమే ఈ మొక్కులు చెల్లించుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి కావడంతో.. ఆయన సన్నిహితురాలైన త్రిష పర్యటనపై అభిమానులు పలు కామెంట్లు చేస్తున్నారు. -
అది ఏకపక్ష కమిషన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన దినేష్కుమార్ ఏకసభ్య కమిషన్.. ఏకపక్ష కమిషన్గా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టుగానే దినేష్కుమార్ తన నివేదికను తయారు చేశారని చెప్పారు. తిరుపతిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ దాదాపు ఏడాదిన్నర పైగా విచారణ జరిపింది. లడ్డూ కల్తీ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టంగా తెలిపింది. అయినా చంద్రబాబు,పవన్లు వైఎస్సార్సీపీ పాలనలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ దినేష్కుమార్తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఏకపక్షంగా మారి చంద్రబాబు పక్షాన నివేదిక ఇచ్చింది. అది అధికారికంగా విడుదల కాక ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల చేతుల్లోకి వెళ్లి విభిన్న కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఒక పత్రికలో అనిల్ సింఘాల్, మరొక దాంట్లో ధర్మారెడ్డి పేర్లు, తర్వాత మా పేర్లను కూడా చేర్చడం అనుమానాలకు తావిస్తోంది. దినేష్కుమార్ నివేదిక ప్రకారం నేను, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పర్చేజ్ కమిటీలో కేవలం ప్రత్యేక ఆహ్వానితులమే. పూర్తి స్థాయి సభ్యులం కాదు. అసలు సభ్యులైన మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని సీబీఐ గంటల తరబడి విచారించగా, నన్ను మాత్రం 15 నిమిషాల్లోనే బయటకు పంపించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి పంపింది’ అని భూమన తెలిపారు. ఈ సమావేశంలో భూమన ఇంకా ఏమన్నారంటే.. దినేష్ కుమార్కు టీటీడీ చైర్మన్ పదవి ఆఫర్ దినేష్కుమార్ అనే వ్యక్తి ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారిగా పేరుంది. గతంలో చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఆయనకు ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి ఆశ చూపించి, ఏకసభ్య కమిషన్గా నియమించి, చంద్రబాబు చెప్పినట్టుగా నివేదిక ఇప్పించారు. ఆయన విచారణలో అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి వంటి వారిని పిలిచారా? నిందితులుగా పేర్కొంటున్న జగదీశ్వర్రెడ్డి, బాలాజీ, విజయభాస్కర్, సురేంద్రనాథ్లను విచారించారా? మమ్మల్ని ఎప్పుడైనా విచారణకు పిలిచారా? పిలవకుండానే మీ ఇష్టం వచి్చనట్లు నివేదిక ఎలా ఇస్తారు? ఏడాదిన్నర పాటు సీబీఐ సిట్ అధికారులు ఎనిమిది రాష్ట్రాలు తిరిగి వందల మందిని విచారించి ఇచ్చిన నివేదిక కంటే మీ విచారణ గొప్పదా? సీబీఐ మమ్మల్ని ఎవరినీ దోషులుగా నిర్ధారించలేదు కాబట్టి, మమ్మల్ని దోషులుగా చూపించేందుకు ఉద్దేశ పూర్వకంగానే ఈ ఏకసభ్య కమిష¯Œన్ను ఏర్పాటు చేశారు. దమ్ముంటే కేసులు పెట్టండి? ⇒ దినేష్కుమార్ నివేదికపై ఈనాడులో కథనం వచ్చిన వెంటనే టీటీడీ బోర్డు సభ్యులు హడావుడిగా మీడియా ముందుకు వచ్చి ఈ నెల 6న బోర్డు మీటింగ్లో తీర్మానం చేసి మాపై క్రిమినల్ కేసులు పెడతామని చెబుతున్నారు. చాలెంజ్ చేస్తున్నాం.. దమ్ముంటే కేసులు పెట్టండి. అదే పత్రికలో నేను, భాస్కర్రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులమేనని, చర్యలు బోర్డు నిర్ణయానికే వదిలేశారని రాశారు. అనిల్కుమార్ సింఘాల్పై ఎలాంటి చర్యలకు కమిషన్ ఆదేశించకపోయినా, ఆయన కింద ఉన్న సీఈవో బాలాజీ, ధర్మారెడ్డి, జగదీశ్వర్రెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు సూచించడం ఆశ్చర్యకరం. బీఆర్ నాయుడు వ్యవహారాలపై, కొండపై రెండేళ్లుగా జరుగుతున్న అపచారాలపై కూడా దినేష్ కుమార్ విచారణ చేయాల్సింది. ⇒ చంద్రబాబు హయాంలో కిలో నెయ్యి రూ.321తో సరఫరా చేసిన హెరిటేజ్తో సంబంధం ఉన్న ఇందాపూర్ ఇప్పుడు కిలో నెయ్యి రూ.658తో ఎలా సరఫరా చేస్తోంది? అసలు ఇందాపూర్–హెరిటేజ్ సంబంధం ఏమిటి? దీనిపై కూడా దినేష్కుమార్ విచారణ చేయాలి. 2018లో చంద్రబాబు పాలనలోనే బోలేబాబాకు సంబంధించిన హర్‡్షప్రెష్ డెయిరీకి తలుపులు తెరిచి, ఆ సంస్థ నుంచి సుమారు 82 వేల కేజీల నెయ్యి సరఫరా జరిగిన విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు? 2019లో మా ప్రభుత్వం వచ్చాక ఒక్క డెయిరీ అయినా వచ్చిందా? ⇒ 2023లో నేను టీటీడీ చైర్మన్ అయ్యాక మళ్లీ నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ వైష్ణవి, ప్రీమియం, మావిగంగ డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయి కదా.. కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ విధానం ప్రకారం స్థానిక డెయిరీలకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము నిబంధనలు మార్చాము. నాణ్యత ప్రమాణాలు తగ్గించామని మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ⇒ ఇప్పుడు మీరు చెబుతున్న ఆల్ఫా, ప్రీమియం డెయిరీలు 2014–2019 మధ్య 80 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేశాయి. అలాగే ఇందాపూర్, ఆల్ఫా, బోలేబాబా డెయిరీలు టెండర్లలో పాల్గొన్నది నిజం కాదా? ఈ విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లతో కలిసి త్రిసభ్య కమిషన్ వేయండి. మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యిని పట్టుకుని, అదే నెయ్యిని తిరిగి లడ్డూ తయారీలో వాడారని సీబీఐ చెప్పింది. మీరు వెనక్కి పంపిన అదే నెయ్యిని వైష్ణవి డెయిరీ ద్వారా తిరుమలకు పంపించి లడ్డూలు తయారు చేయించింది మీరు కాదా? జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన నెయ్యినే మీరు ఉపయోగించారు. మా హయాంలో బీటా సైటోస్టెరాల్ పరీక్షల్లో లోపాలు తేలితే 18 సార్లు నెయ్యిని వెనక్కి పంపించాం. మీ హయాంలో కూడా 14 సార్లు తిరస్కరించారనే విషయం వాస్తవం కాదా? మేం ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకుని ల్యాబ్లను ఆధునీకరించాం, ఎఫ్ఎస్ఎస్ఏఐతో కలిసి రూ.30 కోట్ల ల్యాబ్కు పునాదులు వేసింది కూడా మేమే. ఆ తర్వాత మీరు దేవాన్‡్ష పుట్టిన రోజున ఓపెన్ చేశారంతే. 2018లోనే మీరు రూ.4.5 కోట్లకు ఫ్లేవర్ ఝీ కొనుగోలు చేశారు. మీ లడ్డూ నాణ్యమైనదైతే అది ఎందుకు? ఈ ఏకపక్ష కమిషన్ అసలు ఉద్దేశం డైవర్షన్ రాజకీయాలే. ఇందాపూర్–హెరిటేజ్ బంధాన్ని దాచడానికే ఇదంతా. ఈ సమావేశంలో మాజీ మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర పాల్గొన్నారు. -
తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష్మి శరత్కుమార్ (ఫొటోలు)
-
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు
-
తిరుమలలో కొత్త జంట సందడి
-
ఘనంగా జరిగిన బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి
-
తిరుమలలో వైభవంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు . తను ప్రేమించిన కావ్య రెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు. రెండు కుటుంబాల సమక్షంలో బుధవారం రాత్రి వారి వివాహం జరిగింది. తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఈ వేడుకలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.మే 1న హైదరాబాద్లో భారీ ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. హైదరాబాద్కు చెందిన కావ్య రెడ్డి తండ్రి, తాత న్యాయ రంగ ప్రముఖలని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ గతేడాది ‘కిష్కింధపురి’ చిత్రంతో హిట్ కొట్టాడు. . ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ అనే ఆసక్తికరమైన రెండు ప్రాజెక్ట్లలో పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Beautiful Tirupathi 2.0 (@beautifultirupathi_2.0) -
తిరుపతిలో వివాహం నా అదృష్టం.
-
నేడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నేడు (ఏప్రిల్ 29) వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కావ్య రెడ్డి అనే యువతితోకలిసి తిరుమలలో ఏడు అడుగులు వెయ్యబోతున్నాడు. బుధవారం రాత్రి 11: 13 గంటలకు సాయి శ్రీనివాస్- కావ్యల పెళ్లి శ్రీవారి సాక్షిగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది. సినీ ప్రముఖుల కోసం మే 1న హైదరాబాద్లో భారీ ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్కు చెందిన కావ్యను ప్రేమించి శ్రీనివాస్ పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసింది. కొంతకాలంగా వారు ప్రేమలో ఉన్నామని రెండు కుటుంబాలకు తెలిపి ఒక్కటి కానున్నారు. కావ్య తండ్రి, తాత న్యాయ రంగ ప్రముఖలని తెలుస్తోంది. బెల్లంకొండ కుటుంబం సాయి శ్రీనివాస్ పెళ్లి ఘనంగా నిర్వహించనుంది. తమ కుటుంబ దైవం సమక్షంలో పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. అందుకోసం ఇప్పటికే శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)
-
సతీమణితో శ్రీవారిని సేవలో డైరెక్టర్ బాబీ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్
టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతర వీరికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక బాబీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవితో జతకట్టారు. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. బాబీతో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కించనున్న చిత్రం వచ్చే నెలలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన టైటిల్ కాకాజీ అని ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ బాబీ pic.twitter.com/aXxXVBlxUM— Telugu360 (@Telugu360) April 24, 2026 -
తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)
-
తిరుమలలో మహిళ అదృశ్యం
సాక్షి, తిరుమల: తిరుమలలో ఓ మహిళ అదృశ్యం ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సదరు మహిళను గుంటూరుకు చెందిన లక్ష్మీ తిరుపతమ్మగా గుర్తించారు. కాగా, ఆమెకు ఇటీవలే పెద్దలు వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలోనే పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వివరాల మేరకు.. గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మ (27) కుటుంబం సోమవారం తిరుమల దర్శనానికి వెళ్లారు. వీరంతా తిరుమలలో HVC 694-A గదిలో ఉన్నారు. అనంతరం, మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో లక్ష్మీ తిరుపతమ్మ గది నుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంతసేపటికీ ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు ఉదయం 7 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. ఇటీవలే ఆమెకు పెద్దలు వివాహం నిశ్చయించారు. అయితే, వివాహం ఇష్టం లేక తిరుపతమ్మ వెళ్లినట్లు అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇక, స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సదరు మహిళను గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆమె ఫొటోను విడుదల చేశారు. -
BR నాయుడు మనుషుల మరో దందా ఇది కడుక్కునే పాపం కాదు..
-
తిరుమల పదవుల్లో అనర్హులు.. శ్రీవాణి టికెట్ 15000: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక అపచారాలు పరాకాష్టకు చేరుకున్నాయి. 300 రూపాయల టికెట్ను మూడు వేలకు అమ్ముకుంటున్నారని అన్నారు. విజిలెన్స్ అధికారులే ఈ పాపానికి ఒడిగడుతున్నారు అంటూ మండిపడ్డారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమలను ప్రళాక్షన చేస్తాం అనేవి కూటమి నేతల మాయమాటలు మాత్రమే. తాపేదారులతో అడ్డూ అదుపు లేకుండా అపచారాలు చేస్తున్నారు. 2008లో నేను పాలకమండలి అధ్యక్షునిగా ఉన్న సమయంలో బాలమురళి కృష్ణను ఆస్థాన విద్వాంసుడిగా నియమించాం. ఆయన చేత ఆలయం ముందు సంగీత కార్యక్రమం నిర్వహించాం. ఇది శాశ్వతంగా ఉండాలని నాదనీరాజన ప్రాంగణం వెలసింది. ఆ వేదికలో సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా కార్యక్రమం జరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆ వేదికపై అవినీతి కంపు కొడుతోంది. దీని కోసం భాస్కర్ అనే అధికారిని నియమించారు. ఆయనకు అర్హత అసలు లేదు. సీఎం, చైర్మన్ అండదండలతో భాస్కర్ పేట్రేగి పోతున్నారు.ప్రోగ్రాం ఇచ్చేందుకే కమీషన్లు, పారితోషికంలో కమీషన్లు తీసుకుంటున్నారు. వీఐపీ, బ్రేక్, 300 రూపాయల దర్శనం టికెట్లు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. 300 టికెట్లను మూడు వేలకు అమ్మేస్తున్నారు. విజిలెన్స్ అధికారులే ఈ పాపానికి ఒడిగడుతున్నారు. శ్రీవాణి టికెట్లను 15 వేలకు అమ్మేస్తున్నారు. ఎస్వీబీసీలో అనర్హులకు పదవి ఇచ్చి నాశనం చేశారు. రూ.50 కోట్లతో ఎస్వీబీసీని స్వయం ప్రతిపత్తి సంస్థగా తీర్చి దిద్దే ప్రయత్నం వైఎస్సార్సీపీ హయాంలో జరిగింది. కరోనా సమయంలో ఎస్వీబీసీ ద్వారా ప్రేరణ పొందేలా చేశాం, ధైర్యం పెంచాం. ఈ కూటమి ప్రభుత్వం కుప్ప విశ్వనాథ శర్మను ఎస్వీబీసీ నుంచి పంపేశారు. చతుర్వేద యాగాలు పూర్తిగా నిలిపివేశారు. 700 మంది వేద పారాయణదారుల నియామకం కాలేదు. కన్వీనర్ కోట్ల రూపాయలు అభ్యర్థుల వద్ద నుంచి కాజేసినా చర్యలు లేవు.నృత్య, సంగీత కళాశాలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. అర్హత లేని వ్యక్తిని హిందూ ధర్మ ప్రచార పరిషత్కు నియమించారు. ఆన్లైన్ పెట్టిన అనంతరం 800 టికెట్లు ఎలా పూర్తి అవుతాయి. ఒక్కో టికెట్ కొట్టడానికి ఎంత సమయం పడుతుంది. కొండపై బ్రోకర్లు ఉన్నారు. రూ.15 వేలు ఇస్తే టికెట్లను బ్రోకర్లు అమ్మేస్తున్నారు. 400 నుంచి 600 టికెట్లు అమ్మేస్తున్నారు. రోజుకు శ్రీవాణి టికెట్ల ముసుగులో 15 లక్షలకు పైగా అవినీతికి పాల్పడుతున్నారు అంటూ ఆరోపించారు. -
బాబు బర్త్డే వేడుకల్లో తిరుమల సెట్!
సాక్షి, నెల్లూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడు టీడీపీ శ్రేణులు అతి ప్రదర్శిస్తున్నాయి. వేడుకల పేరుతో రోడ్ల మీదకు చేరి జనజీవనానికి ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఆత్మకూరులో స్వయానా దేవాదాయ శాఖ మంత్రి అత్యుత్సాహానికి దిగారు. తిరుమల తరహా సెట్టింగ్ వేయించి పూజలు చేయిస్తుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అయితే.. ఈ వేడుకలకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ దండోరా వేయించారాయన. ఇక్కడితో ఆగితే ఫర్వాలేదు.. ఏకంగా తిరుమల గాలిగోపురం సెట్ వేయించారాయన. ఆ సెట్ను ఆనుకుని పొలిటికల్ బ్యానర్లు వెలిశాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల అర్చకులు, పండితులతో పూజలు, బాబు పేరిట హోమాలు చేయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమై విమర్శలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. -
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్ (ఫొటోలు)
-
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
-
తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో శ్రీలీల.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలీలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. హీరోయిన్ శ్రీలీలను చూసిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే చివరిసారిగా పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలతో మెప్పించిన కన్నడ బ్యూటీ.. ఐటమ్ సాంగ్స్లోనూ మెప్పించింది. పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్తో అదరగొట్టేసింది. అంతేకాకుండా ఈ ఏడాది పరాశక్తి మూవీతోనూ అలరించింది. Actress #Sreeleela visited Tirumala Tirupati Devasthanams today to seek divine blessings 🙏 pic.twitter.com/TBSdj6FQ6G— Eluru Sreenu (@IamEluruSreenu) April 9, 2026 -
తిరుమల శ్రీవారి సేవలో నయన్ దంపతులు.. వీడియో వైరల్..!
కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఈ జంటకు పండితులు ఆశీర్వచనాలు అందించారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన నయన్ దంపతులు తిరుమల స్వామివారికి మొక్కులు చెల్లించకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ జంట దర్శనం అనంతరం అభిమానులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. నయన్ భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ ఎల్ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఏప్రిల్ 10న రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ తిరుమలలో పూజలు చేశారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ మూవీలో ఎస్జే సూర్య ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా. నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)
-
కాలి నడకన తిరుమలకు.. ఎందుకు వెళ్తానంటే?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్వీకపూర్కు తిరుమలను తరచుగా సందర్శిస్తూ ఉంటారు. అమ్మ శ్రీదేవి బాటలోనే ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఎప్పుడు తిరుమలకు వెళ్లినా కాలి నడకనే కొండపైకి చేరుకుంటుంది జాన్వీ. సెలబ్రిటీ అయినప్పటికీ కాలి నడకన వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. దీని వెనుక గల ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.తాను తిరుమలకు కాలి నడకన వెళ్లేందుకు గల కారణాలను వివరించింది జాన్వీ కపూర్. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది. కాలినడకన ప్రయాణించడం వల్ల కలియుగ దైవం బాలాజీకి మరింత దగ్గరైనట్లు అనిపిస్తుందని తెలిపింది. ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవమని తనకు చాలా ఇష్టమని పేర్కొంది. భక్తితో మెట్లు ఎక్కి ఇష్టదైవమైన శ్రీవారి చెంతకు చేరడాన్ని ఒక గొప్ప సౌభాగ్యంగా భావిస్తానని జాన్వీ కపూర్ వెల్లడించింది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
-
టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు అనర్హుడు
బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా అనర్హుడని, ఆయనను తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. రాసలీలల బీఆర్ నాయుడు రాచపుండులా మారారని ధ్వజమెత్తాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు, ఇతర దేవాలయాల్లో కార్యకర్తలు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. హైందవ, తిరుమల తిరుపతి పరిరక్షణ కోసం ప్రత్యేక పూజలు చేశారు. సాక్షి,అమరావతి(సాక్షి, నెట్వర్క్): రాసలీలల బీఆర్ నాయుడు రాచపుండులా మారారని వైఎస్సార్సీపీ శ్రేణులు ధ్వజమెత్తాయి. టీటీడీ చైర్మన్గా ఆయన అనర్హుడని, ఆయనను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు, ఇతర దేవాలయాల్లో కార్యకర్తలు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవటంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు బీఆర్ నాయుడిని వెనకేసుకువస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ల తీరుపై మండిపడ్డారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలనూ చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్పీపీ మండిపడింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని .. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి.. బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. పవిత్ర క్షేత్ర బాధ్యత అందరి బాధ్యతని, హైందవ ధర్మానికి క్యాన్సర్లా ప్రమాదకారిగా పరిణవిుంచిన బీఆర్ నాయుడిని తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ హైందవ, తిరుమల తిరుపతి పరిరక్షణ కోసం ప్రత్యేక పూజలు చేశారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు వేంకటేశ్వస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టి బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. కృష్ణాజిల్లా పామర్రులోని ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ⇒ గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి, ప్రత్తిపాడు, మంగళగిరి, తాడికొండ నియోజవకర్గాల్లోనూ నాయకులు, కార్యకర్తలు గుడుల్లో ప్రత్యేక పూజలు చేశారు. పల్నాడు, బాపట్ల జిల్లాలోనూ నేతలు బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రత్యేక పూజల అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ⇒ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, గూడురు నియోజకవర్గాల్లోని ఆలయాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా అనర్హుడని నాయకులు నినదించారు. ⇒ ప్రకాశం జిల్లా దర్శి, సంతనూతలపాడు, కనిగిరి, అద్దంకి, కొండపి, యర్రగొండపాలెం, మార్కాపురం, కందుకూరు తదితర నియోజకవర్గాల్లోని ఆలయాల్లో వైఎస్సార్సీపీ నేతలు పూజలు చేశారు. బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ⇒ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని వేంకటేశ్వస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నేతలు నిర్వహించారు. బీఆర్నాయుడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ⇒ ఏలూరు జిల్లా కైకలూరు, దెందులూరు, నూజివీడు, పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ⇒ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్సార్ సీపీ నేతలు బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఆలయాల్లో పూజలు చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడాలని నినదించారు. ⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ పవిత్రత కోసం ప్రార్థించారు. ⇒ ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు బీఆర్ నాయుడు రాసలీలలపై ధ్వజమెత్తారు. ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే చంద్రబాబైనా ఆయనను తొలగించాలని నినదించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. ⇒ ఉమ్మడి తిరుపతి జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. హైందవ ధర్మానికి నాయుడు ప్రమాదకారి అని నినదించారు. ఆలయల్లో పూజలు చేశారు. తిరుపతి తాతాయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. ⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు గళమెత్తారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు అనర్హుడని నినదించారు. టెంకాయలు కొట్టి చంద్రబాబు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుడిని వేడుకున్నారు. ⇒ ఉమ్మడి అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కాయి. బీఆర్ నాయుడు రాసలీలలపై ధ్వజమెత్తారు. ఆలయాల్లో పూజలు చేసి, ర్యాలీలు నిర్వహించారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
-
తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన టాటా సుమో
-
తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)
-
నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి నాలుగు మాడవీధులలో ఊరేగనున్నారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. వసంతోత్సవ అభిషేక నివేదనల అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. 31న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవం నిర్వహిస్తారు. 1న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా రోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. అలాగే రోజూ సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం ఉంటుంది. ఈ సందర్భంగా మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. -
తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)
-
తిరుమల కొండపై గ్యాస్ కష్టాలు మూతబడుతున్న హోటల్స్
-
BR నాయుడు రాసలీలపై చంద్రబాబు కొత్త డ్రామా
-
మిత్రపక్షానికి బాబు వెన్నుపోటు.. పవన్ కు ఆహ్వానం లేదు
-
బీఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టారా?
తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో మరో వివాదం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గైర్హాజరయ్యారు. కనీసం సీఎం చంద్రబాబు స్వాగత కార్యక్రమంలో కూడా బీఆర్ నాయుడు కనిపించలేదు. టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి.. సీఎం చంద్రబాబుకు ఎందుకు స్వాగతం చెప్పలేదు.. సమీక్షా సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారనేది అనేక సందేహాలకు తావిచ్చింది.బీఆర్ నాయుడిని సీఎం చంద్రబాబు కావాలనే దూరం పెట్టారా? అనే అనుమానం వస్తుంది. ఇటీవల బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టడమే ఇందుకు కారణం కావచ్చొనది పలువురి అభిప్రాయంగా ఉంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో సీఎం చంద్రబాబు.. టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. మరి అటువంటి సమావేశానికి టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు హాజరు కాలేదనేది ఇక్కడ ప్రశ్న. టీటీడీలో అంతర్గత విభేదాలా.. లేక ప్రోటోకాల్ వివాదమా? అనేది అధికార వర్గాల్లో చర్చకు దారి తీసింది. -
తిరుమలలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ.. భక్తుల ఆశ్చర్యం
సాక్షి, తిరుపతి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా చంద్రబాబు.. టీటీడీలోనూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్ని బాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2023లో ల్యాబ్ ఏర్పాటుకు సీఈఓ కమలవర్థన్ చర్చలు జరిపారు. అనంతరం, 20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. నాటి నిర్ణయం మేరకు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ తిరుమలలో అందుబాటులోకి వచ్చింది. వైఎస్ జగన్ హయాంలోనే ల్యాబ్ బలోపేతమైంది.ఇంత జరిగినా బిల్డప్ బాబు చంద్రబాబు మాత్రం ప్రసాదం నాణ్యతకు తానే దృష్టిపెట్టినట్టు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. అయితే, వైఎస్ జగన్ గతంలోనే తిరుమలలో ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, తాజాగా చంద్రబాబు క్రెడిట్ చోరీని చూసిన శ్రీవారి భక్తులు నివ్వెరపోతున్నరు. -
అది నేనే.. ఇదీ నేనే..!
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం, మరోసారి ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. తిరుమలలో స్వామివారి ప్రసాదంలో వాడే ముడిపదార్థాలు, భక్తులకు పెట్టే అన్నప్రసాదాల్లో నాణ్యతను పెంపొందించేందుకు శనివారం ప్రారంభం కానున్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు తానే కారణమన్నట్లు ప్రచారం చేసుకుంటూ, స్వయంగా శ్రీవెంకటేశ్వరుని సాక్షిగా బాబు సర్కార్ తాజాగా క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. జగన్ ప్రభుత్వ చొరవతో ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రత్యేకంగా తిరుమలకు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను మంజూరు చేస్తే అది తన ఘనతగా చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే.. » 2023 ఆగస్టు 23, 24 తేదీల్లో 41వ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సమావేశాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తిరుపతిలో నిర్వహించింది. సమావేశానికి హాజరైన సీఈవో కమలవర్ధన్రావు ఈ సందర్భంగా తిరుమలలో పర్యటించారు. అన్నప్రసాద భవనాన్ని, శ్రీవారి లడ్డూ పోటును స్వయంగా సందర్శించారు. టీటీడీ అధికారులతో సైతం సమావేశం నిర్వహించారు.» అప్పటికే భక్తులకు ఇచ్చే ప్రసాదం, అన్నప్రసాదం తయారీ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం... తిరుమలకు ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను మంజూరు చేయాలని సీఈవోను కోరింది.» దీంతో భక్తులకు వడ్డించే ఆహారం, లడ్డూ తయారీలో వాడే నెయ్యి, పాలు, సుగంధ ద్రవ్యాల స్వచ్ఛతను పరీక్షించడానికి టీటీడీకి సొంతంగా అధునాతన ల్యాబ్ను ఎఫ్ఎస్ఎస్ఏఐ తరపున మంజూరు చేస్తున్నట్లు మీడియా సాక్షిగా కమలవర్ధన్రావు ప్రకటించారు.» వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ల్యాబ్ ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందుకు రావడంతో, ల్యాబ్ ఏర్పాటు కోసం ఆనాటి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు కసరత్తు కూడా ప్రారంభించారు. » ల్యాబ్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలోనే ఎఫ్ఎస్ఎస్ఏఐకు ప్రతిపాదనలు కూడా పంపారు.» గత ప్రభుత్వంలో జరిగిన కృషి కారణంగా రూ.20 కోట్లతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ ఏర్పాటయ్యింది. » అదంతా తన గొప్పేనంటూ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ చేస్తున్న హడావుడి సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. -
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మాళవిక (ఫొటోలు)
-
తిరుమలలో తీవ్రంగా గ్యాస్ కొరత
తిరుమల: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో కూడా గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం చేతులెత్తేయడంతో గ్యాస్ కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో ఈ సమస్య మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ హోటళ్లు, టీ స్టాళ్లు గ్యాస్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే అనేక హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో సుమారు 40 ఫాస్ట్ ఫుడ్హోటళ్లు, 30 టీస్టాళ్లు పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేశాయి. మిగతా హోటల్ యజమానులు కూడా గ్యాస్ లేక వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరు యజమానులు ఉదయం సేవలను నిలిపివేసి, కేవలం సాయంత్రం సమయంలో మాత్రమే టిఫిన్లు అందిస్తున్నారు. దీంతో భక్తులకు తగినంత ఆహారం దొరక్క ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నాయి. హోటళ్లు మూతపడడంతో అందుబాటులో ఉన్న కొద్ది హోటళ్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. తిరుమల వంటి ప్రముఖ క్షేత్రంలో ఈ పరిస్థితి కొనసాగితే భక్తుల సేవలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. -
రేపు తిరుమల జూన్ దర్శన కోటా విడుదల
తిరుమల: తిరుమలలో జూన్కు సంబంధించి శ్రీవారి వివిధ దర్శనాల, గదుల కోటాను ఈనెల 18న టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎల్రక్టానిక్ డిప్ కోసం 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.21న ఆర్జిత సేవా టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా, 23న అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. -
తిరుమల లడ్డూ బాగాలేదు.. బీజేపీ మాధవి లతా సంచలన వ్యాఖ్యలు
-
తిరుమలలో భక్తుల ఆందోళన
తిరుమల: దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్నా.. ప్రాథమిక సదుపాయాలు కూడా కల్పించలేదంటూ తిరుమలలో భక్తులు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చి నారాయణగిరి షెడ్లలో గంటల తరబడి వేచి ఉన్న తమకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేదంటూ నిరసన తెలిపారు. కొందరు భక్తులు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షెడ్లలో రద్దీ పెరిగిపోయినా తాగునీరు, విశ్రాంతి, పరిశుభ్రత, గాలి ప్రసరణ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా తగినంతగా కల్పించలేదని చెప్పారు.వృద్ధులు, పిల్లల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఈ ఇబ్బందుల నేపథ్యంలో పలువురు భక్తులు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. దర్శన నిర్వహణలో లోపాలు, షెడ్లలో అవ్యవస్థ పరిస్థితులపై నినదించారు. భక్తుల నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్: భక్తులు నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై భక్తులు, నెటిజన్లు స్పందిస్తూ.. తిరుమలలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
2025లో జరిగిన చోరీ ఇప్పటివరకూ ఎందుకు దాచారు ?
-
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
-
AP: తిరుమల వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా ఇందాపూర్ డైరీదేనా?
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భూమన కరుణాకర్ రెడ్డి
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైవీ సుబ్బారెడ్డి
-
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)
-
జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)
-
చర్చలేకుండా డైవర్షన్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై అధికారపక్షం అసలు చర్చే జరగనివ్వలేదు. శాసనమండలిలో గురువారం కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు పదేపదే అడ్డుతగులుతూ చర్చను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం కల్తీ నెయ్యి పేరుతో అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, దానిపై చర్చిద్దామంటే సభ నుంచి ఆ పార్టీ సభ్యులు పారిపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. అశ్లీల వీడియోల్లో ఉన్నది తానేనని బీఆర్ నాయుడు అంగీకరించిన తర్వాత కూడా ఆయన్ను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి చంద్రబాబు ఎందుకు భయపడిపోతున్నారని ప్రశ్నించారు. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్టు కోసమే కల్తీ నాటకాన్ని తెరపైకి తెచ్చారని బయటపడడంతో అధికారపక్షం ఇరుకున పడిపోయింది. గురువారం తిరుమల లడ్డూపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతుండగా అడ్డుపడి అచ్చెన్నాయుడు లేచి సమస్యను పక్కదారిపట్టించేందుకు ప్రయత్నించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ పోడియంలోకి దూసుకు వచ్చారు. ఈ నిరసన కార్యక్రమం మధ్యనే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్టేట్మెంట్ను చదివేసి మమ అనిపించారు. వైఎస్సార్సీపీ సభ్యుల నిరసనతో సభను చైర్మన్ అయిదు నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే విధమైన పరిస్థితి కొనసాగడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.చర్చకు దూరంగా పలాయనం..కల్తీ ఆరోపణలపై చర్చిద్దామంటే అధికారపక్షం పూర్తిగా పలాయనం చిత్తగించింది. దానిపై చర్చ జరగనీయకుండా రకరకాల వాదనలతో సమస్యను డైవర్ట్ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశారని ఆధారాలతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మండలిలో నిరూపించారు. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్కి టీటీడీ నిధులు దోచిపెట్టడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా చేయడానికి కాంట్రాక్టు దక్కించుకుందని వారు పేర్కొన్నారు. ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్ అనుబంధ సంస్థేనని ఒకసారి, కాదు.. అక్కడ హెరిటేజ్ ఉత్పత్తులు మాత్రమే తయారవుతాయని మరోసారి.. హెరిటేజ్ వెబ్సైట్ను మార్చడమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ సభ్యులు వివరించారు. హెరిటేజ్ ఆధ్వర్యంలో ఏఆర్, ఇందాపూర్, సంగం, ప్రీమియర్ ఆగ్రో, భోలేబాబా డెయిరీలతో ఏర్పడిన డెయిరీ సిండికేట్ గుట్టును బయటపెట్టడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం చర్చలో పాల్గొనకపోవడమంటే హెరిటేజ్ అవినీతిని అంగీకరించినట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. కల్తీ జరగలేదని సీబీఐ సిట్ చార్జిషీట్లో పేర్కొనడాన్ని బట్టి రాజకీయ స్వార్థం కోసమే తిరుమల శ్రీవారిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారని ప్రజలు అర్ధంచేసుకున్నారని వారు వివరించారు. సమాధానం చెప్పలేకే డైవర్షన్..రాజకీయ లబ్ధి, హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం చంద్రబాబు ఘోరమైన కుట్రచేశారని తేలిపోయింది. దానిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఏఆర్ డెయిరీ పేరుతో వచ్చిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపితే దాన్ని వైష్ణవి డెయిరీ పేరుతో తిరిగి రప్పించి లడ్డూ తయారీకి ఎలా వాడారని అడిగితే దానికి దేవదాయ శాఖ మంత్రి నుంచి సమాధానం లేదు. టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టిన ఇందాపూర్ డెయిరీపై సస్పెన్షన్ ఎత్తివేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. భోలేబాబా డెయిరీకి టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చింది కూడా చంద్రబాబే. వీటిలో దేనికీ సమాధానం చెప్పలేక కూటమి సభ్యులు వేరే అంశాలను లేవనెత్తి సభను డైవర్ట్ చేశారు.టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలి..టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన బీఆర్ నాయుడు చైర్మన్ పదవికి అనర్హుడు. అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ‘ఆ వీడియోలో తప్పేముందని.. ఆమె కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఆ వీడియోలు, చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్కు బాధిత మహిళ రాసిన లేఖలపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం. పవన్ నిజంగా హిందువైతే బీఆర్ నాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలి.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. -
పెద్ది హీరోయిన్ బర్త్ డే.. కాలి నడకన తిరుమలకు..!
బాలీవుడ్ భామ, పెద్ది మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. ఈ శుక్రవారం ఆమె బర్త్ డే కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అలిపిరి నడకదారిలో నడుచుకుంటూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. జాన్వీ కపూర్తో పాటు నటి మహేశ్వరి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారుబాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా కనిపిచంనుంది. ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ తిరుమలకు కల్తీ నెయ్యి
-
దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యతని.. సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసి కూడా ఆరోపణలున్న వ్యక్తినే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్ట, పవిత్రతను చంద్రబాబు కాలరాశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ నాణ్యత లేదంటూ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి టీటీడీకి రావడం.. రిజెక్ట్ చేసిన వాటిని అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ సిట్ ఛార్జిషీట్లో స్పష్టం చేయడం ఆందోళనకరమన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేపుతూ.. నెయ్యి ధరల విషయంలో తప్పుడు ప్రచారం చేసి లాభాలు ఆర్జించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. దేవుడిపై భక్తి ఉన్న వారు ఎవరైనా ఇలా చేస్తారా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వాల తొలి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్ తీరును సాక్ష్యాధారాలతో ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ బుధవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..దేవుడిపై బాబుకు భక్తి, శ్రద్ధ, భయం లేదని మరోసారి రుజువైంది..దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అది అత్యంత నిష్టతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కళంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ చంద్రబాబు గారికి లేఖ రాస్తూ.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పని కోసం ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి, ఆలయ ప్రతిష్ట, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుకు భక్తీ లేదు.. శ్రద్ధ అంతకన్నా లేదు. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.టీటీడీకి నెయ్యి సరఫరాను సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు..ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నారు. మరోవైపు 2014–19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278– రూ.330 ఉంది. 2019–24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే ఉంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ.. తన హెరిటేజ్కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి రూ.658లకు 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు.. శ్రద్ధ లేదు.. నిష్ట లేదు.. నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది.. లడ్డూ తయారీలో వాడింది బాబు హయాంలోనే..లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ(నాణ్యత) బాగోలేదని ఈ చంద్రబాబు గారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా.. మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం.. ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ–సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు.. ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. -
సమాధానం చెప్పలేక సత‘మతం’!
సాక్షి, అమరావతి: పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చార్జిషీట్లో సీబీఐ తేల్చేసినా, కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు నిర్ధారించినా పశ్చాత్తాపం లేదు..! కనీసం చట్టసభలోనూ కూటమి సర్కారు స్పందించలేదు! 2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీకి ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా కాంట్రాక్టు అప్పగించడంపైనా జవాబు లేదు! ఇటీవల వరకు హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా చూపించిన ఇందాపూర్ డెయిరీని గుట్టు చప్పుడు కాకుండా కో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేయడంపైనా నోరు విప్పలేదు! చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీటీడీ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్లను దొడ్డి దారిన రప్పించి తిరిగి అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూల తయారీకి వాడినట్లు సాక్షాత్తూ సీబీఐ తేల్చేసినా సమాధానం లేదు! ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ ఎప్పుడూ పాల్గొనలేదంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్లో నిజం లేదని.. మండలి సాక్షిగా విపక్షం ఆధారాలను బహిర్గతం చేస్తే సమాధానం అంతకంటే లేదు!!చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేతిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు, సీబీఐ చార్జిషీట్లో తేల్చేయడం.. ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ వ్యాపార అనుబంధం.. నెయ్యిపై రాజకీయ, ఆర్థిక కుట్రలు బహిర్గతం కావడం.. ఇదంతా చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్కు లబ్ధి చేకూర్చేందుకేనని తేటతెల్లం కావడం.. టీడీపీ కూటమి సర్కారుకు దుర్బుద్ధి లేకుంటే దీనిపై చట్టసభలో చర్చకు ఎందుకు జంకుతోందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చర్చించుకోవడం.. శాసన మండలి చైర్మన్ న్యాయం వైపు గట్టిగా నిలబడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చర్చకు ఒప్పుకున్నట్లు నటిస్తూనే చంద్రబాబు సర్కారు డ్రామాలాడటం పట్ల హైందవ ధార్మిక సంస్థలు, హిందూ సమాజం తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇన్ని రోజులూ మొహం చాటేసిన చంద్రబాబు సర్కారు కుట్ర బుద్ధితో టాపిక్ డైవర్షన్ రాజకీయాలకు తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా అధికార పక్షమే ఇన్ని రోజులు సభను అడ్డుకున్న దాఖలాలు దేశ చరిత్రలో లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూపై శాసన మండలిలో బుధవారం చర్చ మొదలు కాగానే మంత్రులు అడ్డుపడటం.. మతం ప్రస్తావన తేవడం.. ఎస్సీ వర్గానికి చెందిన మండలి చైర్మన్పై వ్యక్తిగత విమర్శలు చేయడం అంతా వ్యూహం ప్రకారం లడ్డూపై చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేనని మండలి సాక్షిగా బహిర్గతమైందని పేర్కొంటున్నారు. లడ్డూపై సభలో చర్చ జరిగితే చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుంభకోణం కుట్రలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో టీడీపీ తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్ను ఎంచుకుందని స్పష్టం చేస్తున్నారు. వెబ్సైట్లో తీసేస్తే హెరిటేజ్కు, ఇందాపూర్కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా? ఒక పరిశ్రమ మరో పరిశ్రమతో కలసి వ్యాపారం చేస్తోందంటే వెబ్సైట్లో తీసేస్తే అయిపోతుందా? అంటూ వ్యాఖ్యానించిన మంత్రి అచ్చెన్న దీన్ని కవర్ చేసుకునేందుకే ‘మతం’ ప్రస్తావన తెచ్చారని విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మొత్తం 19 నిమిషాలు మాట్లాడితే అందులో 12 సార్లు అడ్డుపడ్డారంటే అధికారపార్టీ ఏ స్థాయిలో భయపడిందో చెప్పేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.బాబూ.. హిందూ సమాజం నిన్ను క్షమించదు..!రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి వ్యవహారం ఆర్థిక కుట్రగా ఎలా మారిందో విపక్ష సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, తూమాటి మాధవరావు సాక్ష్యాధారాలతో శాసన మండలిలో ఎండగట్టారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును హిందూ సమాజం క్షమించబోదని చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్పై నమ్మకం లేకనే వైవీ సుబ్బారెడ్డి సీబీఐ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని గుర్తు చేశారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్కు ఇందాపూర్ డెయిరీతో ఉన్న సంబంధాలను సాక్ష్యాధారాలతో వివరించారు. హెరిటేజ్ వెబ్సైట్లో ఇన్నాళ్లూ తమ తయారీ సంస్థగా చూపించిన ఇందాపూర్ డెయిరీని ఆరోపణలు రాగానే హఠాత్తుగా కో–మాన్యుఫాక్చర్గా మార్చడంతో పాటు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్తో రాజీనామా చేయించిన వైనాన్ని వివరించారు. 2016లో టీటీడీ నాణ్యత పరీక్షల్లో ఇందాపూర్ డెయిరీ ఫెయిల్ అయ్యిందని, ఇప్పుడు అదే ఇందాపూర్కి రూ.680కి నెయ్యి సరఫరా అప్పగించడం వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం దాగి ఉందన్నారు. ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీలను టీడీపీ ప్రభుత్వమే అనుమతించిందని, వారి హయాంలోనే ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేనందున నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరిస్తే వాటిని ఎవరి ఒత్తిడి మేరకు సంగం డెయిరీతో సంబంధం ఉన్న వైష్ణవీ డెయిరీ ద్వారా అనుమతించారో చెప్పాలంటూ నిలదీశారు. కల్తీ నెయ్యి సరఫరా టీడీపీ హయాంలో జరిగితే వైఎస్సార్ సీపీకి ఏం సంబంధమంటూ ప్రశ్నించారు. ఎన్డీడీబీ రిపోర్టు, సీబీఐ చార్జిషీటులో ఎక్కడా కూడా జంతుకొవ్వు కలిసిందని లేకపోయినా 120 కోట్ల మంది హిందువుల విశ్వాసాన్ని హేళన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు. సీబీఐ చార్జిషీటులో టీటీడీ జీఎం ఫిర్యాదును ప్రస్తావిస్తే, అదే నివేదిక అంటూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు. హెరిటేజ్ ప్రభుత్వ టెండర్లలో ఎప్పుడూ పాల్గొనలేదంటూ శాసన సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. టీటీడీకి పాలపొడి సరఫరా టెండర్లలో పాల్గొందని పేర్కొన్నారు. ఒకసారి టీటీడీకి హెరిటేజ్ పాలపొడి సరఫరా చేయగా బిల్లులు ఆగిపోతే ఒత్తిడి తెచ్చి ప్రత్యేకంగా రిజల్యూషన్తో డబ్బులు తీసుకున్న వైనాన్ని ఆధారాలతో వివరించారు. హెరిటేజ్ మజ్జిగ సరఫరాకు సంబంధించి కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలను కూడా సభ ముందుంచారు. చంద్రబాబు కుటుంబంతో కలసి గత ఐదేళ్లలో పలుదఫాలు తిరుమల వెళ్లి ప్రసాదం తిన్నారని మరి ఎప్పుడైనా లడ్డూ కల్తీ జరిగిందని ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్లి బాగుందంటూ తిరుమల లడ్డూలు తిన్న కూటమి నేతలు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. ఇందాపూర్ కోసం నిబంధనలు మార్చామని స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యుడే స్వయంగా శాసనసభలో వెల్లడించారని గుర్తు చేశారు. కేవలం గేదె పాలను మాత్రమే సేకరిస్తున్న సంగం డెయిరీ ఆవు నెయ్యి ఎలా సరఫరా చేస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ⇒ ఒకానొక దశలో తమ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని కోరిన తూమాటి మాధవరావుపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దాడి చేసే యత్నం చేశారు. ఇంత గందరగోళ పరిస్థితుల మధ్యలో కూడా విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు పూర్తి ఆధారాలతో చంద్రబాబు కుట్రను మండలి సాక్షిగా బయటపెట్టారు.⇒ అంతకుముందు స్వల్పకాలిక చర్చ కంటే ముందు మంత్రి స్టేట్మెంట్ ఇస్తారంటూ అధికారపార్టీ సభ్యులు చర్చ జరగకుండా అడ్డుకున్నారు. అయితే సభలో కొత్త సంప్రదాయాలకు అవకాశం లేదని, నిబంధనల ప్రకారమే చర్చ తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుందంటూ చైర్మన్ చర్చను ప్రారంభించారు. టీడీపీ తరపున అనురాధ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డితో పాటు వైఎస్ జగన్పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. -
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)
-
టీటీడీ చైర్మన్ వ్యవహారం, లడ్డూ కాంట్రాక్టుపై వైఎస్ జగన్ సీరియస్
సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి, తిరుమల లడ్డూ కాంట్రాక్టులో స్కాంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ విమర్శించారు. పవిత్రమైన తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల. తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారు.ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుగారికి లేఖ రాస్తూ, ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా విచారణ, చర్యలు పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?. ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా. చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత,…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 4, 2026లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు, ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడటం, ఇదే విషయాన్ని సీబీఐ-సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తి లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.ఈ రకంగా చంద్రబాబు.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరి మీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నాడు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278-330గా ఉంది. 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్కి చెందిన మానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇందాపూర్ డెయిరీకి, కిలో నెయ్యి రూ.658లకు, 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు, నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ’ అని పోస్టులో పేర్కొన్నారు. -
తిరుమల అలిపిరిలో చిరుత సంచారం.. జింకపై దాడి
సాక్షి, తిరుమల: తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత సంచరించింది. ఈ క్రమంలో జింకపై చిరుత దాడి చేసింది. దీంతో, జింక అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భక్తులను అప్రమత్తం చేసింది. చిరుత సంచారంలో అలిపిరి మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయపడిపోతున్నారు. -
తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ
తిరుమల: తిరుమలలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కృష్ణతేజ అతిథి గృహం సమీపంలోని క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గంటల తరబడి దర్శనం కోసం వేచి ఉన్న సమయంలో ఇద్దరు భక్తుల మధ్య చిన్న మాట పట్టింపు క్రమంగా పెద్ద గొడవకు దారితీసింది. ప్రత్యక్షంగా తెలిపిన వారి వివరాలు మేరకు.. క్యూలో ముందుకు వెళ్లే విషయంలో ఇద్దరు భక్తుల మధ్య వాగ్వివాదం మొదలైంది. క్షణాల్లోనే అది తోపులాటగా మారింది. ఒకరిపై మరొకరు తిట్ల దండకం అందుకుంటూ దాడులకు దిగారు. ఈ క్రమంలో ఓ భక్తుడు తన బెల్ట్ను తీసి మరో భక్తుడిపై దాడిచేయడం అక్కడ ఉన్న వారిని ఉలిక్కిపడేలా చేసింది.ఈ ఘటనతో మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న ఇతర భక్తులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించినా, కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఈ ఘటనతో క్యూలైన్లో కొంతసేపు దర్శన ప్రక్రియకు అంతరాయం కలిగింది. భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తం కావడంతో ఘర్షణను నిలువరించగలిగారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత తిరిగి భక్తులను దర్శనానికి క్యూలో పంపించారు. ఈ ఘటనపై టీటీడీ అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఘర్షణకు దిగడం సమంజసం కాదని టీటీడీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. క్యూలైన్ నియమాలను తప్పనిసరిగా పాటించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా పేర్కొంది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న, జెనీలియా, శ్రీవిష్ణు, బోయపాటి (ఫొటోలు)
-
చంద్రబాబు, పవన్, లోకేశ్లపై కేసులు పెట్టాలి
తాడికొండ: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విషయంలో అబద్ధాలు వల్లె వేస్తూ కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్లపై డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ ఫిర్యాదు చేశారు. అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ చైర్మన్, టీవీ–5 అధినేత బీఆర్ నాయుడు, ఈనాడు, ఈటీవీ అధినేత చెరుకూరి కిరణ్, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ, మహాన్యూస్ వంశీకృష్ణ, ప్రైమ్–9 అధినేత తోపాటు లడ్డూ ప్రసాదం కల్తీ అంటూ న్యూస్ ఛానెల్స్లో చర్చా కార్యక్రమాలు నిర్వహించిన యాంకర్లు, చర్చల్లో పాల్గొన్న వ్యక్తులు, జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగ వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంపై బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నవారంతా దు్రష్పచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడ్డారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ చార్జ్షీట్ సైతం లడ్డూ ప్రసాదాల్లో ఏవిధమైన కొవ్వు కలవలేదని పొందుపరిచినప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. ఎస్వీబీసీ చానెల్ గౌరవానికి భంగం కలిగించిన ఎమ్మెల్యేపై సైతం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తిరుమల శ్రీవారి సేవలో బ్రహ్మానందం కొడుకు (ఫొటోలు)
-
ఇది హిందూ ధర్మంపై దాడే...
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూలో కల్తీ అంటూ చేస్తున్న ప్రచారం హిందూ ధర్మం పై దాడిగానే భావిస్తున్నామని పలువురు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి లడ్డూను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేస్తుండటం మహా అపచారమని వారు చెప్పారు. ప్రజల దృష్టి మళ్లించే మిషతో ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. రాజకీయం కోసం ఇంతగా దిగజారి వ్యవహరించడం క్షమార్హం కానేకాదని నొక్కి వక్కాణించారు. హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో తిరుమల లడ్డూ ఘటనలో ప్రజలకు వాస్తవాలు తెలియచేసేందుకు విజయవాడలోని ఓ కళ్యాణ మండపంలో శనివారం స్వామీజీలు ఓ సదస్సు నిర్వహించారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా సాగిస్తున్న కుతంత్రమని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన హిందూ ధర్మ పరిరక్షణ సభ్యులు, బ్రాహ్మణ సంఘాల నేతలు, పలువురు స్వామీజీలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పలువురు స్వామీజీలు, తిరుపత్తూర్ శివశక్తి పీఠం నుంచి శ్రీ శివపరిమళమ్మ, కడలూరు శివపీఠం నుంచి సాయిబాబా స్వామి, హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, బ్రాహ్మణ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఆలయాల్లో జరిగిన అపచారాలపై క్యూఆర్ కోడ్తో కూడిన బ్రోచర్ ఆవిష్కరించారు. దుష్ప్రచారం దుర్మార్గం రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని అబాసుపాలు చేసే విధంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. లడ్డూ కల్తీ అంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ హిందువుల మనోభావాలపై దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ధర్మాన్ని కాపాడారు. చంద్రబాబుకు ఒక ధర్మం అంటూ ఏమీ లేదు. ధర్మ శా్రస్తాన్ని పాటించని వారు ధర్మాన్ని నిర్వర్తించలేరు. లడ్డూలో ఎలాంటి కల్తీ లేదని సీబీఐ సిట్ తేల్చిన తర్వాత కూడా బాత్రూమ్ శుభ్రం చేసే కెమికల్స్ వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు దు్రష్పచారం చేయడం దుర్మార్గం. – శ్రీ జ్యోతి స్వామి, శ్రీకాకుళం త్రినాథ త్రివటి ధర్మక్షేత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు రాష్ట్రంలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోంది. లడ్డూ ప్రసాదం కల్తీ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి శ్రీవారి లడ్డూలో గొడ్డు కొవ్వు కలిసిందని మాట్లాడటం సరికాదు. ఇది హిందూ ధర్మంపై దాడిగానే భావించాలి. అందరం సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను ఊరూరా చాటి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి. – బలరామకృష్ణమూర్తి, బ్రాహ్మణ సంఘం నేత హైందవ ధర్మానికి వ్యతిరేకం నెయ్యిలో కల్తీ జరిగిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇది రాజకీయ కక్షల నేపథ్యంలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందంటూ మాట్లాడటం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. హైందవ ధర్మానికి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. తప్పు జరిగిందని పాలకులు లెంపలేసుకోవాలి. – రాధవస్వామి, హైదరాబాద్ స్థాయి దిగి మాట్లాడుతున్నారు శ్రీవారి లడ్డూలు కల్తీ అనే ప్రచారం హిందూ ధర్మంపై దాడిగానే భావించాలి. రాజకీయాల కోసం కలియుగ దైవం శ్రీవారి ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదు. గొడ్డుకొవ్వు, పందికొవ్వు కలిసిందని తొలుత చెప్పారు. కానీ.. సుప్రీంకోర్టు నియమించిన సిట్ జంతువుల కొవ్వు కలవలేదని తన ఛార్జిషీట్లో పేర్కొంది. దీంతో మళ్లీ బాత్రూమ్ కడిగే కెమికల్స్ కలిశాయంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి శ్రీవారి ప్రసాదం విషయంలో ఇంత దిగజారి మాట్లాడమంటే హైందవ ధర్మంపై దాడిగానే భావించాలి. – కామేశ్వరప్రసాద్, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేత చంద్రబాబుదే ఈ పాపం బోలేబాబా డెయిరీకి ద్వారాలు తెరిచిందీ, ఆర్డర్లు ఇచ్చింది 2018లో చంద్రబాబే. పరాగ్ మిల్్క, దొడ్ల డెయిరీకి కూడా గత చంద్రబాబు ప్రభుత్వంలోనే ఆర్డర్లు ఇచ్చారు. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్కు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ అని అదే హెరిటేజ్లో స్పష్టంగా ఉంది. అయితే ఈ విషయం బట్టబయలు కాగానే హెరిటేజ్ వెబ్సైట్లో కో మాన్యుఫాక్చరింగ్ యూనిట్గా మార్పు చేయడం నిజం కాదా? రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంటే అన్నీ అపచారాలే. గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి, ఆలయాల కూల్చివేత, తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి, సింహాచలంలో చందనోత్సవం రోజు, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిలాస ఘటనలు జరిగి పలువురు మృతి చెందడమే ఇందుకు నిదర్శనం. టీటీడీ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ లోపలకు ఎలా అనుమతించారనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. – మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. కేవలం సొంత వ్యాపార ప్రయోజనాల కోసం (హెరిటేజ్ నెయ్యి విక్రయాల కోసం) గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసమే ఈ కల్తీ డ్రామా ఆడారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే. రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధికి, 2019–24 మధ్య వైఎస్ జగన్ పాలనలో జరిగిన అభివృద్ధికి పోలికే లేదు. కాణిపాక ఆలయ పునర్నిర్మాణం, గండి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి వంటివి వైఎస్ జగన్ హయాంలోనే జరిగాయి. వీటిపై బహిరంగ చర్చకు సిద్ధమా? వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఆధ్మాత్మిక చైతన్యంతో.. గతంలో బూట్లతో పూజలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు బూట్లు విప్పుతున్నారు. – వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి -
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మృణాల్ (ఫొటోలు)
-
తిరుమల గుడి ముందే 'బిగ్బాస్' భామ డ్యాన్సులు
తిరుమల కొండపై కొందరు యూట్యూబర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి డ్యాన్సులు వేస్తూ ఓవరాక్షన్ చేస్తున్నారు. టీటీడీ ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ వీళ్ల పద్ధతి మాత్రం అస్సలు మారడం లేదు. తాజాగా 'బిగ్బాస్' ఫేమ్ గీతూ రాయల్ అయితే గుడి ముందే సినిమా పాటలకు స్టెప్పులేసింది. వాటిని రీల్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం కాస్త ఇప్పుడు వివాదాస్పదమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)రీసెంట్గా తన నలుగురు స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లిన యూట్యూబర్ గీతూ.. ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్స్ దగ్గర డ్యాన్సులు చేసింది. వాటిని వీడియోగా చేసి ఇన్ స్టాలో రీల్ అప్లోడ్ చేసింది. దీంతో ఈమెపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే సదరు రీల్ని డిలీట్ చేసింది. తాజాగా ఈమెపై టీటీడీ చర్యలకు కూడా సిద్ధమైంది. అదే విషయాన్ని చెబుతూ మరో వీడియో పోస్ట్ చేసింది. అయితే ఈమె.. ఏకంగా గుడి ముందే డ్యాన్సులు చేస్తుంటే టీటీడీ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.'అందరికీ ఒక గుడ్ న్యూస్. నా మీద చర్యలు తీసుకుంటారట. ఇక హ్యాపీగా ఉండండి. చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇప్పటికే నా జీవితంలో సగం కోల్పోయాను. పోగొట్టుకోవడానికి ఇంకా ఏం మిగలలేదు. ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా మీరు తీసేసి సంతోషంగా ఉండండి' అని గీతూ తన లేటెస్ట్ వీడియోలో చెప్పుకొచ్చింది.తిరుమల కొండపై రూల్స్ పాటించాలని టీటీడీ పదేపదే చెబుతోంది. శ్రీవారి ఆలయం దగ్గర కూడా మైక్లో ప్రచారం చేస్తున్నారు. అయినా సరే కొందరు పట్టించుకోవట్లేదు. టీటీడీ నిబంధనల ప్రకారం.. కొండపై రాజకీయ ప్రసంగాలతో పాటు రీల్స్ చేయడం, ఫొటోషూట్స్ చేయడం లాంటివి నిషిద్ధం. అయినా సరే గీతూ రాయల్ లాంటి యూట్యూబర్లు.. సరదా కోసమో వ్యూస్ కోసమో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తీరా చర్యలకు సిద్ధమైతే గానీ తాము రూల్స్ అతిక్రమించామనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. మరి ఈమెపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: తిరుమల దర్శన వివాదం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ శివానీ నాగరం) View this post on Instagram A post shared by Sakshi TV (@sakshitvdigital) -
దేవునికే టోపీ.. ఆన్ లైన్ లో కిలో నెయ్యి రూ.529.. టీటీడీకి మాత్రం రూ.638..
-
నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,952 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,414 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 6 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
చర్చ జరగాల్సిందే
సాక్షి, అమరావతి: ‘‘తిరుమల ప్రసాదంపై చర్చిద్దామంటే భయమెందుకు? బీఏసీలో చర్చకు ఒప్పుకుని ఇప్పుడు ఎందుకు పారిపోతున్నారు?’’ అంటూ అధికారపక్షాన్ని వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీసింది. టీటీడీలో ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ పాత్రపై సభలో చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలిలో గట్టిగా పట్టుబట్టారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో మండలి హోరెత్తింది. చర్చకు పట్టుబడుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడం, స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందని అధికారపక్షం తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తంచేశారు. సభను స్తంభింపజేశారు. వాయిదా పడినా సభలోనే రెండుగంటలకు పైగా ఆందోళన చేశారు. అంతకుముందు అసెంబ్లీకి వచ్చే సమయంలో కూడా ఇవే డిమాండ్లతో వైఎస్సార్సీపీ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేసుకుంటూ ప్రదర్శనగా వచ్చారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలతో హోరెత్తించారు. అసెంబ్లీ వద్ద మండుటెండలోనే ధర్నాకు దిగారు. కాగా సభలో అధికారపక్ష సభ్యుల తీరుపై మండలి చైర్మన్ మోషేన్ రాజు మనస్తాపానికి గురయ్యారు. అధికారపక్షం చర్చకు అడ్డుపడడం విచారకరమని వ్యాఖ్యానించారు. అనుమతిలేకుండా స్టేట్మెంట్కు సిద్ధపడడం చైర్ను అవమానించడమేనని స్పష్టం చేశారు.చర్చిద్దామంటూనే అధికారపక్షం పలాయనం.. తిరుమల లడ్డూకి ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టడంతో శాసన మండలి శుక్రవారం వేడెక్కింది. ఈ అంశంపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు ఆర్.రమేష్యాదవ్, కేఆర్జే భరత్, సిపాయి సుబ్రమణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్రాజు తిరస్కరించారు. దీంతో చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం ఎక్కి నిరసనకు దిగారు. లడ్డూపై చర్చకు అధికారపక్షం భయపడుతోందని, బీఏసీలో అంగీకరించి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ సభ్యులు గట్టిగా నిలదీశారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మార్చి 4వ తేదీన చర్చిద్దామని, అప్పటికి సరిపోకపోతే ఐదు, ఆరు తేదీల్లో కూడా చర్చిద్దామన్నారు. గురువారం లఘు చర్చ అని చెప్పి అధికారపక్షం భయపడి పారిపోయిందని, స్టేట్మెంట్ ఇస్తే సరిపోదని, చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. చర్చకు సిద్ధమంటూనే అధికారపక్షం ఎందుకు పారిపోతోందని వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. అధికార టీడీపీ సభ్యులు కూడా వెల్లోకి వచ్చి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో 10:19గంటలకు చైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు.రెండు గంటలకు పైగా సభలోనే ఆందోళన..సభ వాయిదా పడిన అనంతరం కూడా చర్చపై పట్టువీడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు దాదాపు రెండు గంటలకుపైగా ఆందోళనను కొనసాగించారు. పోడియం ఎదురుగా వెల్లో నేలపై కూర్చోని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు నిరసనను కొనసాగించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, వరుదు కళ్యాణి, కల్పలత, మొండితోక అరుణుకుమార్, కాంట్రాక్ట్ ఇసాక్, రమేష్యాదవ్, తూమాటి మాధవరావు, పాలవలస విక్రాంత్, వంకా రవీంద్రనాథ్, ఎంవీ రామచంద్రారెడ్డి, ఇజ్రాయేల్, కేఆర్జే భరత్, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తదితరులు ఆందోళన కొనసాగించారు. హెరిటేజ్ నెయ్యి కల్తీ.. కూటమి పాలన కల్తీ, లడ్డూపై చర్చకు పారిపోయిన ప్రభుత్వం సిగ్గు సిగ్గు, స్వామివారిని కించపరిచిన ప్రభుత్వం, లడ్డూ చర్చపై చిత్తశుద్దిలేని ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. అనంతరం 12:53 నిముషాలకు మళ్ళీ సమావేశమైన సభను బుధవారం నాటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. మళ్లీ సభ వాయిదా పడిన తర్వాత కూడా పది నిముషాలపాటు వైఎస్సార్సీపీ సభ్యులు మండలి వెల్లోనే ఆందోళన చేశారు.వైఎస్సార్సీపీ నిరసనతో అట్టుడికిన అసెంబ్లీ ప్రాంతం..అంతకు ముందు వైఎస్సార్సీపీ శాసన మండలి సభ్యులు శుక్రవారం ఉదయం శాసన మండలి ప్రారంభ సమయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత వారంతా అసెంబ్లీ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సాధికారత సంస్థ భవన్ కి ఉదయం 9.50 గంటలకు చేరుకొన్నారు. పెద్ద బ్యానర్లు, ప్లకార్డులు చేత పట్టుకొని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘‘టీటీడీ లడ్డూ ప్రసాదం పై చర్చ అంటే భయమెందుకు? .. ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ దోపిడీ బయటపడుతుందన్న భయమా? .. టీటీడీలో ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ పాత్రపై వెంటనే సభలో చర్చ జరగాలి’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ‘‘ప్రకటన కాదు...చర్చ జరపాలి, లడ్డూపై చర్చ జరిగితే...నిజాలు ప్రజలకు తెలుస్తాయని భయమా ? లడ్డూ అంశంపై చర్చ అంటే..పాలకపక్షానికి భయమెందుకు? చర్చ అంటేనే పారిపోయిన ప్రభుత్వం...సిగ్గు సిగ్గు, చర్చ జరగాలి...హెరిటేజ్ దోపిడీ ప్రజలకు తెలియాలి, చర్చ జరిగితే మీ హెరిటేజ్ దోపిడీ బయటపడుతుందని భయమా ?, దైవం పవిత్రతను దెబ్బతీసి...హెరిటేజ్ దోపిడీకి బాటలు వేసుకుంటారా?’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టుకుని అసెంబ్లీ గేట్ నెంబర్ 4 వరకు ప్రదర్శనగా వచ్చి గేటు వద్ద బైఠాయించారు. ఎమ్మెలీల నినాదాలతో అసెంబ్లీ సమీప ప్రాంతం మార్మోగిపోయింది. అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకొంటూ సభ్యులంతా శాసనమండలిలోకి వెళ్లారు.మండుటెండలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ధర్నా...వైఎస్సార్సీపీ శాసన మండలి సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు శాసన మండలి నుంచి ప్రదర్శనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకొంటూ అసెంబ్లీ గేట్ – 2 వద్దకు వచ్చారు. గేటు బయట రోడ్డుపై మండుటెండలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సభ్యులందరూ టీటీడీ లో హెరిటేజ్ పాత్రపై విచారణ జరపాలి, మీ హెరిటేజ్ కోసం దైవం పై నిందలా.. సిగ్గు సిగ్గు, భోలే బాబా వెనుక ఉన్న అలీ బాబా..చంద్ర బాబే, ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ దోపిడీ నశించాలి, మీ రాజకీయాల కోసం దైవం ప్రవిత్రతను అవమానించిన చంద్రబాబు...వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి, భోలే బాబాను తెచ్చింది..హెరిటేజ్ బాబే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్సీల నినాదాలతో అసెంబ్లీ ఆవరణ మార్మోగిపోయింది.స్టేట్మెంట్ ఇచ్చేసి తప్పించుకునే పన్నాగం..లడ్డూ గురించి చర్చ జరిగితే హెరిటేజ్ అవినీతి బయటకొస్తుందనే భయంతో స్టేట్మెంట్ ఇచ్చేసి తప్పించుకోవాలనే పన్నాగానికి మంత్రి పయ్యావుల కేశవ్ తెరదీశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ ‘‘రాజకీయాల కోసం దేవుళ్లను రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబు.. తన కుట్రలు బయటకు రావడంతో సమాధానం చెప్పలేక పారిపోతున్నారు. చేసిన తప్పుని అంగీకరించి భక్తులకు సమాధానం చెప్పాల్సిందిపోయి మరింత దిగజారి ప్రవర్తించడం రాష్ట్ర ప్రజలంతా చూశారు.’’ అని అరుణ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కలలో కూడా ఎవరూ వినకూడని మాటలతో తిరుమల పవిత్రతను, స్వామి వారి ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చాడు. కల్తీ నెయ్యి పేరుతో వైఎస్సార్సీపీ మీద నెపం నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబు, సీబీఐ సిట్ చార్జిషీట్తో అడ్డంగా దొరికిపోయాడు. వారి హయాంలో జరిగిన తప్పులకు బాధ్యత తీసుకోకుండా వైయస్సార్సీపీ మీద నిందలు మోపడం సిగ్గుచేటు.’’ అని విమర్శించారు.అనుమతిలేకుండా స్టేట్మెంట్.. చైర్ను అవమానించడమే.. టీడీపీ సభ్యుల తీరుపై మండలి చైర్మన్ మనస్తాపం శాసన మండలిలో లడ్డూపై చర్చను అధికారపక్షం అడ్డుకోవడం విచారకరమని, తన అనుమతి లేకుండా సభలో ఆర్థిక మంత్రి స్టేట్మెంట్ పెట్టేందుకు సిద్ధపడటం చైర్ను అవమానించడమేనని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.. శుక్రవారం ఉదయం మండలి సమావేశం ప్రారంభం కాగానే చైర్మన్ మాట్లాడుతూ.. గురువారం సభలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించి అధికారపక్ష సభ్యుల తీరుపై మనస్తాపం చెందారు. మోషేన్రాజు ఏమన్నారంటే.. ‘‘నిన్నటి రోజు లడ్డూ ప్రసాదంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ పునః ప్రారంభమైనప్పుడు క్వశ్చన్ అవర్ను డీమ్డ్ చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు రూల్స్కు విరుద్ధంగా క్వశ్చన్ అవర్ను జరిపించాలని అడిగారు. లడ్డూ ప్రసాదం చర్చను అడ్డుకునే యత్నం చేయడం విచారకరం. అదే సందర్భంలో అర్థిక శాఖ మంత్రి నాపై కొన్ని సత్యదూరమైన ఆరోపణలు చేశారు. షార్ట్ డిస్కషన్ కోసం జరిపే సన్నాహక చర్యల్లో భాగంగా సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి షార్ట్ డిస్కషన్ టాపిక్పై నోట్స్ పంపించారు. ఆ ప్రతిని చూపించి.. నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికేందుకు టీడీపీ సభ్యులు యత్నించారు. సభను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఇది కూడా కరెక్టు కాదు. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన ఇరు పక్షాల సభ్యులు సభ గౌరవం పెంచేలా నడుచుకోవాలని తెలియజేస్తున్నా’’ అని చైర్మన్ మోషేన్రాజు పేర్కొన్నారు. చైర్మన్ మాటలకు అడ్డుతగులుతూ మంత్రులు కె.అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ఇంకా పొడిగించి చైర్ను అవమానించాలనుకోవడం సరికాదంటూ చైర్మన్ తేల్చిచెప్పారు. ఆ తర్వాత చైర్మన్ అనుమతించడంతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షం ముందుగా నోటీసు ఇవ్వకపోయినా బీఏసీలో అంగీకరించాం కాబట్టి చర్చించేందుకు సిద్ధమయ్యామని, ఆ ముందు రోజునే తమ శాసన సభ్యుడితో నోటీసు ఇప్పించి శాసన సభలో చర్చించామని, అక్కడ జరిగిందే.. మండలిలో జరిగేలా చేశామని పేర్కొన్నారు. దీనికి చైర్మన్ మోషేన్ రాజు స్పందిస్తూ మండలిలో ప్రొసీడింగ్స్ వేరు అని, స్టేట్మెంట్ ఇచ్చాక చర్చ కాదని, చర్చ వేరు స్టేట్మెంట్ వేరని స్పష్టం చేశారు. అనంతరం సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తర్వాత చైర్మన్ చాంబర్కు పలువురు మంత్రులు వెళ్లి మాట్లాడినట్టు సమాచారం. సభలో చైర్మన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. సభలో అధికారపక్షం వ్యవహరించిన తీరు సరికాదని, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని మంత్రుల వద్ద చైర్మన్ మళ్లీ తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అధికారపక్షం పలాయనమంత్రం తిరుమల లడ్డూకు ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించేందుకు సిద్ధమేనంటూ పైకి గంభీరమైన మాటలు చెబుతున్న అధికారపక్షం తీరా చర్చ సమయానికి పలాయనం చిత్తగిస్తోంది. తిరుమల లడ్డూలో ఇందాపూర్ నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో గత ఐదు రోజులుగా మండలి కార్యకలాపాలు స్థంభించాయి. దీంతో ప్రభుత్వ బిజినెస్ ఆమోదించుకోవడం మెట్టు దిగిన అధికారపక్షం ఈ నెల 26న లడ్డూపై స్వల్పకాలిక చర్చకు సిద్ధమని చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అధ్యక్షతన సోమవారం జరిగిన బీఏసీలో అంగీకరించింది. తీరా గురువారం ప్రశ్నోత్తరాల అనంతరం జరగాల్సిన చర్చ సమయం వచ్చే సరికి అధికార పక్షం మాట మార్చింది. చర్చ కాదు.. ప్రభుత్వం తరపున స్టేట్మెంట్ ఇస్తామని మెలికపెట్టింది. నిబంధనలు అంగీకరించవని చైర్మన్ చెప్పినా.. వినని శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేసిన తర్వాతనే చర్చను మొదలుపెట్టాలని పట్టుబట్టారు. దీంతో చర్చను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన చైర్మన్ మోషేన్రాజు వైఎస్సార్సీపీ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంతో మంత్రి కేశవ్ స్టేట్మెంట్పై బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు. ముందుగా మంత్రి స్టేట్మెంట్ సరికాదని, చర్చ అంటే సభ్యులు మాట్లాడతారని చైర్మన్ స్పష్టం చేశారు. ఆ స్టేట్మెంట్ మీరు అనుమతి ఇచ్చిందేనని మంత్రి కేశవ్ గురువారం సభలో చైర్మన్తో ప్రస్తావించారు. అసలు ఆ స్టేట్మెంట్ విషయం నాకు తెలియదని, అది సరికాదని చైర్మన్ అభ్యంతరం తెలిపారు. స్టేట్మెంట్ అని అధికార టీడీపీ, చర్చ కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పట్టుబట్టాయి. గందరగోళ పరిస్థితుల మధ్య గురువారం మండలి చర్చ మధ్యలోనే ఆపి సభను శుక్రవారం నాటికి వాయిదా వేశారు. గురువారం చర్చను ప్రారంభించినందున శుక్రవారం అదే చర్చను కొనసాగించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేతల బొత్స సత్యనారాయణ చైర్మన్ మోషేన్రాజుకు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్కు లేఖ రాసారు. అయినా శుక్రవారం మళ్లీ చర్చకు అవకాశం లేకుండా ఎజెండాలో సైతం పెట్టకుండా నీటిపారుదల అంశాన్ని లఘు చర్చకు పెట్టారు. శుక్రవారం వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో మళ్లీ రగడ రేగింది. గురువారం నాటి సభలో అధికారపక్షం వ్యవహరించిన తీరుపై మనస్తాపం చెందిన చైర్మన్ మోషేన్రాజు శుక్రవారం సభ ప్రారంభంకాగానే ముందు రోజు పరిణామాలు సరికాదని తప్పుబట్టారు. చర్చ కోసం మళ్లీ వాయిదా తీర్మానం తిరస్కరించడంతో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మండలిలో పలాయనమంత్రం పఠిస్తున్న అధికార టీడీపీ మాత్రం మార్చి 4న చర్చను చేపడతామంటూ మళ్లీ కొత్తరాగం అందుకుంది. మొత్తానికి మండలిలో పరిణామాలు అధికారపక్షానికి చెమటలు పట్టిస్తున్నాయి. ప్రజల్లో పాలకపక్షం పరువును పలచన చేస్తున్నాయి. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 73,035 మంది స్వామివారిని దర్శించుకోగా, 27,090 మంది తలనీలాలు సమర్పించారు. హూండీల రూపంలో స్వామివారికి రూ.4.48 కోట్లు సమకూరాయి. -
చర్చ.. రచ్చ!
సాక్షి, అమరావతి: అటు రాయలసీమ లిఫ్ట్.. ఇటు తిరుమల లడ్డూ ప్రసాదం..టీడీపీ పెద్దలను ఇరుకున పెట్టిన రెండు అంశాలపైనా శాసన మండలిలో చర్చ జరగకుండా చంద్రబాబు సర్కారు పలాయనం చిత్తగించింది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు.. క్లోజ్డ్ రూమ్ మీటింగ్లతో చీకటి ఒప్పందాలు.. ఇందాపూర్ – హెరిటేజ్ అనుబంధంపై విపక్ష వైఎస్సార్సీపీ మండలిలో గట్టిగా నిలదీయడంతో చర్చకు అధికార పక్షం ముఖం చాటేసింది. విచిత్రంగా స్పల్పకాలిక చర్చలో ముందుగా ప్రభుత్వం తరపున మంత్రి ప్రకటన చేశాకే విపక్షం మాట్లాడాలంటూ మెలికపెట్టి పారిపోయింది! హెరిటేజ్ పేరు సభ సాక్షిగా బయటకు వస్తుందనే భయంతో అధికార పక్షం రభస సృష్టించింది. సీఎం చంద్రబాబుతో క్లోజ్డ్ రూమ్ మీటింగ్లో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పనులను తాను నిలుపుదల చేయించినట్లు తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై సూటిగా సమాధానం చెప్పాలంటూ మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీయడంతో కూటమి సర్కారు దిక్కుతోచక పారిపోయింది. ఇక టీటీడీ లడ్డూ ప్రసాదం అంశంపై ప్రస్తుత సమావేశాల్లోనే చర్చకు పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఐదురోజుల పాటు శాసనమండలిని స్తంభింపచేశారు. ‘మండలి’ బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం గురువారం చర్చకు అంగీకరించిన కూటమి సర్కారు తీరా సభ ప్రారంభం కాగానే మెలిక పెట్టింది. స్వల్పకాలిక చర్చ నిబంధనలకు విరుద్ధంగా ముందుగా ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తామంటూ మంత్రులే చర్చను అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం స్వల్పకాలిక చర్చ జరిగితే.. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో నిజం లేదని సీబీఐ చార్జిషీట్ సాక్షిగా వెల్లడి కావడం.. అధిక ధరలకు హెరిటేజ్ అనుబంధ సంస్థ ద్వారా టీటీడీ నెయ్యి కాంట్రాక్టులను దక్కించుకోవడం.. ఇందాపూర్తో చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ అనుబంధం.. లాంటి అంశాలన్నీ చట్టసభ సాక్షిగా విపక్షం ఎండగడుతుందనే భయంతో ప్రభుత్వం చర్చ జరగకుండా అడ్డుకుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లడ్డూ ప్రసాదంపై చర్చ గురువారం వాయిదా పడినప్పటికీ మరుసటి రోజు శుక్రవారం సభలో ఆ అంశాన్ని చేపట్టే అవకాశం ఉన్నా.. మంత్రి పయ్యావుల కేశవ్ బయట మీడియాతో మాట్లాడుతూ మార్చి 4న ఆ అంశంపై చర్చ చేపడతామని ప్రకటించడం ప్రభుత్వ ఎత్తుగడను తెలియచేస్తోందని స్పష్టం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీడీపీ చంద్రబాబు సర్కారు ఆడుతున్న కపట నాటకం శాసన మండలి వేదికగా మరోసారి బట్టబయలైంది! టీటీడీ లడ్డూ ప్రసాదంపై జరగాల్సిన స్వల్పకాలిక చర్చను గురువారం సభ ప్రారంభం కాగానే అధికార పక్షం అడ్డుకొని గందరగోళం సృష్టించింది. దీంతో మండలి వాయిదా పడింది. సభా నిబంధనల ప్రకారం స్వల్పకాలిక చర్చలో ముందుగా మంత్రి ప్రకటనకు అవకాశం లేదని మండలి చైర్మన్ మోషేన్రాజు స్పష్టం చేసినప్పటికీ.. శాసన సభావ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ముందుగా ప్రభుత్వం తరఫున ప్రకటన చేసిన తర్వాతే చర్చ చేపట్టాలని, సభను ఎలా జరపాలో ప్రభుత్వానికి చెబుతారా..? అంటూ రభస సృష్టించడంతో గందరగోళ పరిస్థితుల నడుమ సభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏదో ఒక వంకతో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోతోందని విమర్శించారు. ప్రభుత్వం చెప్పేవన్నీ సత్యదూరం, అబద్ధాలని ధ్వజమెత్తారు. తొలుత చైర్మన్ అనుమతితో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి లడ్డూ ప్రసాదంపై స్వల్పకాలిక చర్చను ప్రారంభిస్తూ రెండు సార్లు మాట్లాడేందుకు ప్రయత్నించినా టీడీపీ సభ్యులు గందరగోళ పరిస్థితులు సృష్టించడంతో ప్రసంగం ముందుకు సాగలేదు. ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా పడిన శాసన మండలి మధ్యాహ్నం 1.07 గంటల సమయంలో తిరిగి ప్రారంభమైంది. చైర్మన్ మోషేన్రాజు సభలోకి రాగానే టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు చేరుకుని ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించాలని పట్టుబట్టారు. దీనిపై చైర్మన్ మోషేన్రాజు స్పందిస్తూ.. నేను ఏం మొదలుపెడుతున్నానో తెలియకుండానే ప్రశ్నోత్తరాలు అంటున్నారంటే.. మీరు ముందుగానే నిర్ణయించుకుని వచ్చినట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్సీలను వారి స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. ఈ సమయంలో మంత్రి పయ్యావుల కేశవ్ జోక్యం చేసుకోవడంతో.. చైర్మన్ మోషేన్రాజు స్పందిస్తూ.. ‘మీరు శాసనసభా వ్యవహారాల మంత్రి. మీకు అన్నీ తెలుసు. ఒకసారి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ‘డీమ్డ్ టూ బీ ఆన్సర్..’ అన్న తర్వాత మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు..?’ అని వ్యాఖ్యానించారు. అనంతరం చైర్మన్ ఓ ప్రకటన చేశారు. లడ్డూ ప్రసాదం అంశంలో స్వల్పకాలిక చర్చ చేపడుతున్నామని, చంద్రశేఖర్రెడ్డిని చర్చ ప్రారంభించాలని సూచించారు.ఎలా జరపాలో ప్రభుత్వానికి చెబుతారా సార్..?చైర్మన్ అనుమతితో విపక్ష ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి లడ్డూ ప్రసాదం అంశంపై చర్చను ప్రారంభించి మాట్లాడడం మొదలుపెట్టగానే మంత్రి పయ్యావుల కేశవ్ అడ్డుపడ్డారు. ముందుగా ప్రభుత్వం తరఫున సంబంధిత శాఖ మంత్రి ప్రకటన చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ చైర్మన్కు సూచించారు. సభా నిబంధనలు అందుకు అనుమతించవని చైర్మన్ స్పష్టం చేయడంతో... ‘సభను ఎలా జరపాలో ప్రభుత్వానికి చెబుతారా సార్..? ఎలా జరపాలి? ఏం జరపాలన్నది ప్రభుత్వానికి సూచన చేస్తారా..?’ అంటూ పయ్యావుల వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, మంత్రి మధ్య కొద్దిసేపు సంభాషణ కొనసాగింది.మాటకు మాట...! మంత్రి కేశవ్: ప్రభుత్వం ఈ రోజు ఈ అంశంపై సమాధానం చెప్పడానికి ఎంతసేపైనా సిద్ధంగా ఉంది. వినడానికి ఓపికగా ఉండండి. సంప్రదాయం ప్రకారం మంత్రి మాట్లాడతారు. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి.చైర్మన్ మోషేన్రాజు: ఆర్థిక మంత్రి గారూ.. మీరు చెప్పేది కరెక్టు కాదు. ఎందుకంటే.. స్వల్పకాలిక చర్చలో మంత్రి ప్రకటన చేయడమనే నిబంధన లేదు. ప్రకటనే చేయాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది. వేరే ఫార్మాట్లో వస్తే నేను ఖచ్చితంగా అవకాశం ఇస్తా. అంతేగానీ స్వల్పకాలిక చర్చలో మంత్రి ప్రకటనకు అవకాశం లేదు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టే నేను అవకాశం ఇచ్చా.మంత్రి కేశవ్: ఒక నిమిషం సార్..చైర్మన్ మోషేన్రాజు: దీనిపై చర్చ వద్దండీ..!కేశవ్: స్వల్పకాలిక చర్చకు 150 కాపీల నోట్లు ఏర్పాటు చేయమని రాశారు. ఎవరు రాశారు? మీరే కదా? చైర్మన్: దటీజ్ రాంగ్ డాక్యుమెంట్. నా అనుమతితో చేసిన కమ్యూనికేషన్ కాదు.విపక్షం మైక్ కట్.. పోడియం వద్దకు సభ్యులుసభలో గందరగోళం మధ్యే లడ్డూపై చర్చను ప్రారంభించి మాట్లాడుతున్న విపక్ష ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మైక్ కట్ కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన తెలుపుతూ చైర్మన్ పోడియం వద్దకు చేరుకున్నారు. తమ సభ్యుడు మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని, చర్చను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు ముందుగా ప్రభుత్వం తరఫున ప్రకటనకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. దీనిపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ప్రభుత్వం చర్చను పక్కదారి పట్టించాలని చూస్తోందని, బీఏసీలో అనుకున్న ప్రకారం చర్చకు రావాలని కోరారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిని మాట్లాడేందుకు చైర్మన్ మరోదఫా అనుమతించగా.. మంత్రులతోపాటు టీడీపీ సభ్యులంతా ముందుగా ప్రభుత్వం తరఫున ప్రకటన చేసేందుకు అనుమతించాలంటూ తిరిగి గందరగోళం సృష్టించారు. ఇరుపక్షాల సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. -
తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
లడ్డూపై చర్చ జరుపుతామని మాట మార్చిన ప్రభుత్వం
-
అసలేం జరిగిందంటే? తిరుమల వివాదంపై క్లారిటీ


