లడ్డూపై కూటమి అపచారానికి పరిహారం.. వైఎస్సార్‌సీపీ హోమం | YSRCP Bhuman Karunakar Reddy Holds Homam Over Tirumala Laddu Controversy, TDP Faces Backlash Over Social Media Posts | Sakshi
Sakshi News home page

YSRCP Homam: లడ్డూపై కూటమి అపచారానికి పరిహారం.. వైఎస్సార్‌సీపీ హోమం

Jan 30 2026 9:33 AM | Updated on Jan 30 2026 10:34 AM

YSRCP Homam Over Kutami Fake Allegations On Tirumala Laddu

సాక్షి, తిరుపతి: తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్‌ ఇచ్చిన నివేదికలో ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హోమం తలపెట్టింది. ఈ హోమం కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. భూమన నివాసం వద్దే హోమం కార్యక్రమం జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. తిరుమల లడ్డూ సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. లడ్డూ, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఏఐతో ఎడిట్‌లు చేస్తూ.. ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తోంది. దీనికి తోడు.. వైఎస్సార్‌సీపీ ద్రోహం చేసిందంటూ పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది.

టీడీపీ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో.. వెంకటేశ్వర స్వామి ఫొటోలను మార్ఫింగ్ చేసిన పోస్టుల కనిపిస్తున్నాయి. శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు చేస్తున్నాయి ఈ పార్టీ శ్రేణులు. టీడీపీ తీరుపై వెంకటేశ్వర స్వామి భక్తులు మండిపడుతున్నారు. ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి కలిసిందని ప్రచారం చేశారని.. ఇప్పుడు అలాంటిదేం లేదని తేలినా కూడా దేవుడిని అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement