Chandrababu Naidu
-
సేవ్ ఏపీ ఫైబర్ నినాదాలతో దద్దరిల్లిన బాబు కరకట్ట
-
వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పోరాటం ఫలించిందని.. ఆర్డీటీ సేవలకు కేంద్రం ఓకే చెప్పిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్సీపీ పోరాట ఫలితమేనన్నారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ శైలజానాథ్ మండిపడ్డారు.‘‘వారి క్రెడిట్ చోరీని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆర్డీటీని కాపాడుకోవటానికి మేము చాలా పోరాటాలు చేశాం. టీడీపీ నేతలు ఎక్కడైనా ఒక్క పోరాటమైనా చేశారా?. ఆర్డీటీకి 21 ఏప్రిల్ 2025న కేంద్ర ప్రభుత్వం నిధులను ఆపేసింది. ఆ టైంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. కల్యాణదుర్గం ఇన్ఛార్జ్ తలారి రంగయ్య అమిత్షాని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. పోస్టు కార్డుల ఉద్యమం నుండి పార్లమెంటులో నిరసన వరకు చాలా పోరాటాలు చేశాం. మా పోరాట ఫలితాన్ని టీడీపీ నేతలు కైవసం చేసుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు’’ అంటూ శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు మరోసారి నిసిగ్గుగా క్రెడిట్ చోరీ: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తాము చేయని పనుల్ని కూడా చేశామంటూ అబద్ధాల ప్రచారాలు చేసుకోవడం కూటమి సర్కార్కు అలవాటుగా మారిపోయిందని.. నిన్న అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంటే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, పరిశ్రమలశాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. గతంలో ఆర్సెలార్ మిట్టల్ వంటి పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకు రావడానికి వైఎస్ జగన్ కృషి చేస్తే.. పరిశ్రమల్ని తరిమేస్తున్నారంటూ దుష్ప్రచారాలు చేసిన కూటమి పార్టీలు.. ఇప్పుడు 24 నెలల్లో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలపై శ్వేతపత్రం ప్రకటించగలరా? అంటూ గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:కూటమి ప్రభుత్వం మరో క్రెడిట్ చోరీ:మనం సాధించలేని ఘనత గురించి మనమే సాధించినట్లు చెప్పుకోవచ్చనే దానికి నిన్న అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంఖుస్ధాపనే ఉదాహరణ. చంద్రబాబు, లోకేష్, మంత్రులు పరస్పరం భజన చేసుకున్నారు. ఆర్సెలార్ మిట్టల్ ఈ రాష్ట్రానికి రావడానికి పునాదులు వేసింది 2022లో నాటి సీఎం శ్రీ వైయస్ జగన్ అనేది ఒకసారి వీళ్లంతా గుర్తుచేసుకోవాలి. విశాఖలో ఆర్సెలార్ మిట్టల్ టేకోవర్ చేసుకున్న ఎస్ఆర్ ప్లాంట్ విస్తరణ కోసం దావోస్లో జగన్గారితో లక్ష్మీ మిట్టల్ కుమారుడు ఆదిత్యమిట్టల్ ఒప్పందం చేసుకున్నారు.దీంతో పాటు కర్నూలులో గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకూ అదే సమయంలో ఒప్పందం జరిగింది. ఆ విద్యుత్ ప్రాజెక్టులో ఆర్సెలార్ భాగస్వామి అయింది. ఈ పెట్టుబడులతో పాటు కొత్త స్టీల్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు చేయాలని జగన్గారు కోరడంతో మిట్టల్ సముద్ర తీరం వెంట భూములు కేటాయిస్తే తప్పకుండా ప్లాంట్ పెడతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎస్, నేను కూడా ఉన్నాం. మిట్టల్ సంస్థకు భూమి కేటాయించాలని జగన్ చెబితే.. మేం కాకినాడ, మూలపేట పోర్టు, నక్కపల్లి రూపంలో మూడు ఆప్షన్లు వారికి ఇచ్చాం. ఇందులో కంపెనీ ప్రతినిధులు 2024 ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల మధ్య నక్కపల్లిలో భూమి తమకు అనువుగా ఉంటుందని ఎంచుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దీన్ని మేం స్వాగతిస్తున్నాం.నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ సంగతేంటో చెప్పండి?:అదే సమయంలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. దీనికి దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీ పడినా.. హిమాచల్ప్రదేశ్, గుజరాత్, ఏపీకి మాత్రమే ఈ అవకాశం దక్కింది. దాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. వారు భూములు కావాలంటే అందుబాటులో ఉన్న భూములు ఇవ్వొచ్చు. కానీ, అలా కాకుండా భూసేకరణ అంటూ వివాదాలు సృష్టించారు. దానివల్లే బల్క్డ్రగ్ ముందుకు సాగలేదు.ఇంకా బల్డ్ డ్రగ్ పార్క్ వల్ల జబ్బులు వస్తాయని కూటమి పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో చేసిన దుష్ప్రచారం వల్ల కూడా అది ముందుకు సాగడం లేదు. కేంద్రం, రాష్ట్రాలతో పోరాడి తెచ్చిన ఈ బల్క్ డ్రగ్ పార్క్ రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ముందుకెళ్లకపోవడానికి కూటమి పార్టీలే కారణం. ఇప్పుడు ఆర్సెలార్ మిట్టల్ స్లీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ దీనికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎందుకు శ్రద్ధ లేదు?:అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు. ఉపాధి కల్పించలేకపోతే నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలు ఎన్ని? అవి కల్పించిన ఉద్యోగాలు ఎన్ని? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయండి. మీ పచ్చ మీడియాలో 20 లక్షల కోట్ల పెట్టుబడులంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్లో మీరు అధికారంలోకి వచ్చాక 20 నెలల్లోనే 10 వేల మంది ఉపాధి పోయింది. దీనికి సమాధానం చెప్పండి. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీకు ఎందుకు శ్రద్ధ లేదు? స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్లు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపులు ఎందుకు చేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలని చెప్పి, ఇప్పుడు మాత్రం వచ్చే ఐదేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. అప్పటివరకూ మీరు అధికారంలో ఉండాలి కదా..రాష్ట్రం వదిలి పారిపోతున్న పరిశ్రమలు:గతంలో రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోయాయని, అవి ఇప్పుడు తిరిగి వస్తాయని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అచ్యుతాపురంలో కోకా కోలా కంపెనీ ఈ రాష్ట్రానికి, ప్రజా ప్రతినిధులకు ఓ దండం అని చెప్పి భూమి వెనక్కి ఇచ్చి వెళ్లిపోయింది. ఇలా ఈ 20 నెలల్లో రూ.5,600 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. దీనికి కారణం ఈ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు పెడుతున్న ఇబ్బందులే. అల్ట్రాటెక్, ఎల్ అండ్ టీ, భారతీ సిమెంట్స్.. ఇలా రాయలసీమలో ఏ సిమెంట్ ఫ్యాక్టరీతో సక్రమంగా పని చేయించుకునే పరిస్ధితి లేదు.పక్కనే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో యూబీ బీర్ ఫ్యాక్టరీని స్కిట్లు వేసుకునే ఎమ్మెల్యే తనకు కప్పం కడితే తప్ప పని చేయకుండా అడ్డుకుంటున్నారు. జిందాల్ సంస్ధ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని వస్తే, ఊరూపేరు లేని ఓ సినీ నటిని తీసుకుని వాళ్లను వెళ్లగొట్టారు. మీ పాలనలో మీ భూములు వద్దని వెనక్కి వెళ్లిపోయిన కంపెనీల లిస్ట్ నేను బయటపెడతా, దానిపై సమాధానం చెప్పండి. జగన్గారి హయాంలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే, అది వదిలేసి పారిపోయిన కంపెనీల గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీ హయాంలో పారిపోయిన కంపెనీల సంగతేంటో చెప్పండి.పరిశ్రమలు తెచ్చిన జగన్పై దుష్ప్రచారాలు:విశాఖలో రహేజాతో కలిసి ఇనార్బిట్ మాల్కు నాడు జగన్ శంకుస్థాపన చేశారు. దాన్నే నిన్న (సోమవారం) ప్రారంభించారు. అదీ మా కమిట్మెంట్. విశాఖకు ఇనార్పిట్ మాల్ ఓ ల్యాండ్ మార్క్. విశాఖలో ఎన్నో పరిశ్రమలు ఉన్నా ఇనార్పిట్ మాల్ ప్రత్యేకత వేరు. దానికి శంకుస్థాపన చేసింది జగన్. ఈ ప్రభుత్వం తరుచూ మా చిన్నప్పటి నుంచి వింటున్న లులూ మాల్ను ప్రస్తావిస్తుంది. ఈ లులూ మాల్ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో ఎవరికీ తెలియదు. మేం చేసిన పనులు చెప్పుకోవడం లేదు అంటే, అదే వారికీ మాకూ తేడా. అందుకే ఇప్పటికైనా నిరుద్యోగ యువతపై ఫోకస్ పెట్టి వారికి ఉద్యోగాలు కల్పించడం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వడమో చేయాలని ప్రభుత్వాన్ని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
జ్యూస్ ప్యాకెట్లతో పరుగో పరుగు.. చంద్రబాబు సభలో గందరగోళం
-
చంద్రబాబు దిగిపో.. కూటమికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు
-
శాశ్వత భవనాల నిర్మాణం పేరుతో నారా వారి భారీ స్కాం..?
-
యూట్యూబర్లకు నోటీసులు.. TDP తప్పులను ప్రశ్నిస్తే జైలుకే
-
చంద్రబాబు ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి
సాక్షి,అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు సీఎం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తాడేç³ల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించారు. జిల్లాల స్థాయిలో టాస్్కఫోర్స్ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ చేపట్టాలని, వచ్చే రెండు మూడు నెలలు ప్రతి వారం పది రోజులకు ఒకసారి జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, విద్యారి్థ, యువజన, రైతు విభాగాలను మరింత భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.రాయలసీమ జిల్లాల్లో ప్రతి ఇంటికి కరపత్రాల ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం వల్ల జరుగుతున్న నష్టం, ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల జరుగుతున్న అన్యాయాలను తెలియజేయాలని, అల్మట్టి ఎత్తుపెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం తదితర అంశాలపై జిల్లాల్లో సమావేశాలు నిర్వహించుకుని కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్రస్థాయిలో సమన్వయం చేసే బాధ్యతను మాజీ మంత్రి సాకే శైలజానాథ్కు అప్పగించారు. సమావేశంలో పార్టీ నాయకులు సాకే శైలజానాథ్, ఎస్వీ సతీష్రెడ్డి, పి.రవీంద్రనాథ్రెడ్డి, ఉషాశ్రీచరణ్, భూమన కరుణాకర్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, కాటసాని రామ్భూపాల్రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మలసాని మనోహర్రెడ్డి, జిన్నూరి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ ద్రోహి బాబు సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ఉద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)లు మండిపడ్డారు. విజయవాడలోని ధర్నా చౌక్లో సోమవారం సర్కారు తీరుపై గళమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన సీహెచ్వోలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీహెచ్వోలు మాట్లాడుతూ రాత్రిపూట ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) హాజరు పేరిట ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు లేని ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ బకాయిలు అన్నింటినీ వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కోసం వెంటనే కమిటీని వేయాలని, ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) సౌకర్యాన్ని తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్చేశారు.అద్దె భవనాల్లో కొనసాగుతున్న విలేజ్ క్లినిక్స్కు మూడు నెలల అడ్వాన్స్ రెంట్ చెల్లించాలని కోరారు. అద్దె బకాయిలు పేరుకుపోవడంతో యజమానుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. సీహెచ్వోల ధర్మ పోరాటానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎ.వి. నాగేశ్వరరావు, ఐద్వా నేత రమాదేవి సంఘీభావం తెలిపారు. అనంతరం నాగేశ్వరావు మాట్లాడుతూ సీహెచ్వోల పట్ల ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఈ సర్కారు ఉద్యోగ ద్రోహి అని అభివర్ణించారు.రాత్రి ఎనిమిది గంటలకు హాజరు వేయాలని ప్రభుత్వమే కార్మీక చట్టాలను అతిక్రమించడం తగదన్నారు. రమాదేవి మాట్లాడుతూ రాత్రి హాజరుతో ముడిపెట్టి ఇన్సెంటివ్స్లో కోతలు పెట్టి చిరుద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి సీహెచ్వోల ఉద్యోగ క్రమబద్ధికరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీహెచ్వోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రియాంక మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రేమ్, సంయుక్త కార్యదర్శి సుధాకర్, కోశాధికారి సిద్దు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి’
తాడేపల్లి : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ రోజు(సోమవారం, మార్చి 23వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. దీనికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలు హాజరయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జిల్లాల స్ధాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ చేపట్టాలి. వచ్చే రెండు మూడు నెలలు ప్రతి వారం, పది రోజులకోసారి జిల్లా స్ధాయిలో సమావేశాలు నిర్వహించాలి. విద్యార్ధి, యువజన, రైతు విభాగాలను మరింత భాగస్వామ్యం చేయాలి. రాయలసీమ జిల్లాలలో ప్రతి ఇంటికి కరపత్రాల ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం వల్ల జరుగుతున్న నష్టంపై వివరించాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్లలో కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల జరుగుతున్న అన్యాయాలను తీసుకెళ్ళాలి. అల్మట్టి ఎత్తు పెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం, రైతాంగానికి వచ్చే సమస్యలు తదితర అంశాలపై ఆయా జిల్లాలలో సమావేశాలు నిర్వహించాలి’ అని పేర్కొన్నారు. -
‘వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడగండి’
విశాఖపట్నం: తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయనపై షర్మిల, సునీతలు దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఇదంతా మీరు చంద్రబాబు డైరక్షన్లోనే చేస్తున్నారని,. సొంత అన్నని దెబ్బ తీయడానికి ఎదుటి పార్టీతో చేతులు కలుపుతారా? అంటూ మండిపడ్డారు. ఈరోజు( సోమవారం, మార్చి 23వ తేదీ) విశాఖ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన వరుదు కళ్యాణి.. వైఎస్ జగన్ను కోట్లాది మంది ఆడబిడ్డలు అన్నగా భావిస్తారని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా ఉన్నారన్నారు. కానీ మీరు మాత్రం వైఎస్ జగన్పై అభాండాలు వేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారారు..వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత సహనంగా ఉన్నా అబాండాలు వేస్తూనే ఉన్నారు. అసత్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారారు. ప్రెస్మీట్లు పెట్టి అసత్యాలు చెబుతున్నారు. సొంత అన్నను దెబ్బతీయడానికి ఎదుటి పార్టీ చేతులు కలుపుతారా?,ఇంత ప్రేమగా చెల్లెళ్లను చూసుకొనే అన్న ఎవరైనా ఉన్నారా?, మీపై ప్రేమతో జగన్ రూ. 236 కోట్లు ఇచ్చింది నిజం కాదా? , బాబు సంపాదించిన ఆస్తులను తన అక్కా చెల్లెళ్లకు ఇచ్చారా? అని ప్రశ్నించారు.వైఎస్సార్ వీలునామా అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ను ద్వేషించే చంద్రబాబుతో మీరు స్నేహం చేస్తున్నారు.చంద్రబాబు డైరక్షన్లోనే షర్మిల, సునీతలు నడుస్తున్నారని ప్రజలకు తెలుసు. వైఎస్సార్ పేరు మీద నడుస్తున్న పార్టీ నేతలను పట్టుకుని కుక్కలని అంటారా?, మీకు విలువలు, విశ్వసనీయతలు ఉన్నాయా?, తెలంగాణ పార్టీ పెట్టి కడదాకా అక్కడే ఉంటా అన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకూ తెలంగాణను విడిచిపెట్టేది లేదన్నారు. కానీ అక్కడ పార్టీ మూసేసి ఇక్కడకు వచ్చారు’ అని మండిపడ్డారు వరుదు కళ్యాణి.జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడగండి.. వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడిగితే చెబుతారని వరుదు కళ్యాణి సవాల్ చేశారు. ‘ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు. మీ తప్పుడు ఆరోపణలకు మేం సమాధానం చెబుతున్నాంఆయన సహనాన్ని మీరు బలహీనతగా తీసుకుంటున్నారు. వైఎస్ జగన్ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది. వైఎస్ జగన్ చెల్లెలు కదా అని సహనంతో సంస్కారంతో వ్యవహరిస్తున్నాం. ఎవరి డైరక్షన్లో మీరు ఇలా దిగజారి మాట్లాడుతున్నారు. చంద్రబాబు డైరక్షన్లోనే షర్మిల, సునీతలు నడుస్తున్నారని ప్రజలకు తెలుసు. అవినాష్రెడ్డి, రాచమల్లు వేసిన ప్రశ్నలకు సమాధానాలేవి?, వాటికి సమాధానాలు చెప్పే బాధ్యత మీకు లేదా?, వైఎస్ జగన్పై దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? నిలదీశారు. -
‘రాయలసీమ మీద చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం?’
తాడేపల్లి : రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు ఆపేయడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి శైలజానాధ్. రాయలసీమ మీద చంద్రబాబుకు ఎందకంత ద్వేషం అని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 23వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ‘ వైఎస్ జగన్ రూ. 900 కోట్లతో 90 శాతం ఆల్రెడీ పనులు పూర్తి చేశారు. మిగతా పనులు చేయకుండా చంద్రబాబు అన్యాయం చేశారు. తెలంగాణాకు మేలు చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆల్మట్టి నిర్మాణంతో ఇప్పటికే ఏపీకి, రాయలసీమకు అన్యాయం జరిగింది. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. పోలవరంలో వంద టీఎంసీల కంటే తక్కువ నీటిని నిల్వ చేస్తున్నారు. రాష్ట్రమంతటా నీటి కొరత ఏర్పడుబోతోంది. రాయలసీమకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారు. ఏయిమ్స్, గ్రామీణ బ్యాంకు, హైకోర్టు, స్టీల్ ప్లాంట్ వంటివన్నిటినీ చంద్రబాబు తరలించుకుపోయారు. రాయలసీమ మీద చంద్రబాబుకు ప్రేమ లేదనటానికి ఇదే నిదర్శనం. అసలు చంద్రబాబు రాయలసీమకు ఏం న్యాయం చేశారో చెప్పాలి?, వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు రైతులన్నా ప్రాజెక్టులన్నా ఎందుకంత ద్వేషం?, పొరుగు రాష్ట్ర సీఎం వద్దన్నారని రాయలసీమ లిఫ్టును ఆపటం ఏంటి?, తెలంగాణ, కర్నాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలి’ అని డిమాండ్ చేశారు. -
నాడు అభివృద్ధికి రూపం .. నేడు దుబారాకు కలరింగ్!
అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి... ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. కూటమి ప్రభుత్వం ఏదైనా చేసిందంటే అందులో స్వప్రయోజనాలే ఉంటాయి తప్ప, రాష్ట్ర ప్రజలకు అది ఉపయోగపడేది మాత్రం అస్సలు ఉండదు. ఇందుకు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చే నిదర్శనం.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చు రూ. 401 కోట్లట. ఇక్కడ అమరావతి మొత్తం భవనాల ఖర్చు రూ. 2316 కోట్లు కాగా, డిజైన్లకే రూ. 401 కోట్లు ఖర్చు చూపెట్టారు. కేవలం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజెన్లకే వందల కోట్ల రూపాయిలు నీళ్లలా ఖర్చు చేశారు. ఇంతటి ఖర్చు ఎవరికి ఉపయోగం. ఈ ఖర్చును చూస్తే డిజైన్లకు అన్ని వందల కోట్లా అని ముక్కున వేలేసుకోకమానరు ప్రజలు.. అదే సమయంలో మన బాబుగారు చేస్తున్న పాలన కదా ఇలాగే ఉంటుంది అని నవ్వుకోక మానరు.రుషికొండ ప్రభుత్వ భవనాల ఖర్చుకే ఏడుపులు..మరి ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. రుషికొండలో ప్రభుత్వ భవనాలకు అయిన మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 230 కోట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు అవుతున్న ఖర్చు పోలిస్తే ఇది బాగా తక్కువ. మరి ఆనాడు చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలనే ఉద్దేశంతో జగన్ ఆ కార్యక్రమం చేపడితే అప్పడంతా చెత్త ఏడుపులే కనిపించాయి.ఆ భవనాలపై వికృత రాజకీయంరాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా వైఎస్ అద్భుత ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేసింది.తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎప్పుడూ కపట రాజకీయాలు చేస్తూ వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా.. రూ. 230 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఐకానిక్ భవనాలను చూసి టీడీపీ అధినేతలు ఏడుపు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే విష ప్రచారం చేశారు. అవి ప్రభుత్వ భవనాలే అని చెప్పినా శృతిమించి మరీ కపట రాజకీయం చేసింది.చివరకు అవి ప్రభుత్వ భవనాలేనని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అంగీకరించింది. అప్పుడొక ఏడుపు.. ఇప్పుడొక కవరింగ్. ఇది బాబుగారి రాజనీతి పాలన.మరి ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు రూ 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే దాన్ని ఏమనాలి. దీన్ని స్వలాభాపేక్ష అనకుండా ఏమంటారు చంద్రబాబు.అభివృద్ధికి రూపాన్ని చూపెట్టిన నాయకుడు జగన్ఆనాడు అభివృద్ధికి అసలైన రూపాన్ని చూపెట్టిన నాయకుడు వైఎస్ జగన్. ఏ విషయంలోనైనా జగన్ మార్క్ పాలన అనేది కనబడింది. అందుకు రిషికొండలో వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ భవనాలే ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వ భవనాలను చూసి తొలుత అగ్లీ(చెత్త) ఏడుపు ఏడ్చింది మీరే.. ఆ తర్వాత శభాష్ అంటూ మెచ్చుకున్నది మీరే. ఇది కూటమి పెద్దల తీరు. అయితే, మరి ఈరోజు కూటమి పెద్దలు చేస్తున్నదేమిటి?, అభివృద్ధి అంటూ పైకి కల్లిబొల్లి మాటలు చెప్పే నేటి ప్రభుత్వ పెద్దలు.. అసలైన అభివృద్ధికొచ్చేసరికి మాత్రం తేలిపోతున్నారు. ఇక్కడ రిషికొండ భవనాలను, అమరావతి గవర్నమెంట్ భవనాలను పోల్చి చూస్తే.. కూటమి పెద్దలది కేవలం బ్లూప్రింట్ల పాలన అనేది అందరికీ అర్థమవుతోంది. నేటి ప్రభుత్వ పాలనలో డిజైన్ల వంటి వాటికే వందల కోట్ల రూపాయిలను వెచ్చిస్తున్న వైనం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. మరి ఇప్పుడు ఎవరికోసం ఈ దుబారా?అయితే ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. కేవలం డిజైన్లకే ఇంత ఖర్చు అయితే పూర్తి నిర్మాణానికి ఎంత అవుతుంది?, ఇది అభివృద్ధా… లేక దుబారా ఖర్చా?, ప్రజల డబ్బుతో డిజైన్ల పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ఖర్చులు ఏంటని చర్చించుకుంటున్నారు. -
పొరపాటున ఊర్లోకెళితే.. కోడిగుడ్లు, రాళ్లతో ఉరికించి కొడతారు..
-
విశాఖ స్టీల్ భవిష్యత్తు అయోమయం.. అమరావతి పేరుతో అప్పులు, దోపిడీ
-
మొత్తం బరితెగించి పోయారు.. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారు..
-
బాబు సభతో ముచ్చెమటలు.. పదో తరగతి విద్యార్థుల అవస్థలు
సాక్షి,విశాఖ: సీఎం చంద్రబాబు సభ నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులను తరలించడం వల్ల సాధారణ ప్రయాణికులు, ముఖ్యంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, బస్సుల కోసం గంటల కొద్ది బస్ స్టాప్ల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది.అర కొర బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రమాదకర పరిస్థితుల్లో, గుంపుల మధ్య, రద్దీగా ఉన్న వాహనాల్లో ప్రయాణించాల్సి వచ్చింది. పరీక్ష సమయానికి ఆలస్యమవుతుందనే భయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు.ప్రభుత్వ స్కూల్స్కు సెలవుచంద్రబాబు సభతో నర్సీపట్నంలో ప్రభుత్వ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అయితే ప్రైవేట్ స్కూల్స్ మాత్రం సాధారణంగా కొనసాగాయి. దీంతో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు బస్సుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. -
అప్పులు తెచ్చి.. అడుగడుగునా దోపిడీ!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చంద్రబాబు సర్కారు దుబారా వ్యయానికి హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణ పనులు మరో నిదర్శంగా నిలుస్తున్నాయి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) ‘ఎఫ్’ బ్లాక్లో నిర్మిస్తున్న హైకోర్టు భవనానికి హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ (హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ (సీసీటీవీ, ఫైర్ అలారమ్తో కూడిన భద్రత వ్యవస్థ) పనులను రూ.556 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.ఇక ఏజీసీ ‘ఈ’ బ్లాక్లో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ పనులు రూ.424.34 కోట్లతో చేపట్టడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే హైకోర్టు భవన నిర్మాణ పనులను రూ.924.64 కోట్లకు.. అసెంబ్లీ నిర్మాణ పనులు రూ.724.69 కోట్లకు కాంట్రాక్టు సంస్థలకు సీఆర్డీఏ అప్పగించింది.. తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పరిగణనలోకి తీసుకుంటే.. హైకోర్టు నిర్మాణ వ్యయం రూ.1,480.69 కోట్లకు, అసెంబ్లీ నిర్మాణ వ్యయం రూ.1,149.36 కోట్లకు చేరుకుంది.దీంతో చదరపు అడుగు నిర్మాణ వ్యయం అసెంబ్లీ భవనానికి రూ.10,244.07, హైకోర్టు భవనానికి రూ.7,286.03కి పెరిగింది. గతంలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణ పనులను చదరపు అడుగుకు సగటున రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి చదరపు అడుగు వ్యయం రూ.19,183కు చేరింది. ఇప్పుడు శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యే నాటికి ఈ వ్యయం ఇంకెంతకు చేరుతుందోనని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.తాజాగా రూ.556 కోట్లు..హైకోర్టు భవనాన్ని ఏజీసీ ‘ఎఫ్’ బ్లాక్లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులు (బీ+జీ+7)లో 20,32,231 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఈ భవన నిర్మాణ డిజైన్ను రూపొందించింది. ఈ భవన పనులను రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతులతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786.05 కోట్లకు ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ కోట్ చేసి టెండర్ దక్కించుకుంది.జీఎస్టీ, న్యాక్, సీనరేజీ లాంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్లో పేర్కొన్నారు. అంటే.. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్న మాట. తాజాగా.. ఈ భవనం పనులకు రూ.556 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో హైకోర్టు భవన నిర్మాణ వ్యయం రూ.1,480.69 కోట్లకు చేరుకుంది. అసెంబ్లీ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,244.07అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్లో బేస్మెంట్, గ్రౌండ్ఫ్లోర్, 3 అంతస్తులు (బీ+జీ+3)లో 11,21,975 చ.అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్ను కూడా ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థే రూపొందించింది. ఈ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి, మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.4.48 శాతం అధిక ధరకు అంటే.. రూ.617.33 కోట్లకు ఎల్అండ్టీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. తాజాగా.. ఈ పనులకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దాంతో ఈ భవనం నిర్మాణ వ్యయం రూ.1,149.36 కోట్లన్నమాట. అసెంబ్లీ భవన నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.10,244.07కు చేరుకుంది.అసలే అప్పులు.. ఆపై దుబారా..ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలను చంద్రబాబు ప్రభుత్వ రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన ఖర్చంతా వృథానే. అది కూడా అప్పు తెచ్చిందే కావడం గమనార్హం. ఇక అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. అవసరమైన మేర కంటే భారీగా నిర్మిస్తుండటం వల్ల భవనాల నిర్మాణ వ్యయం పెరుగుతోంది. రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది.కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇప్పుడు అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలు పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో ఊహించుకోవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మహానగరాల్లో ఫైవ్స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్తోనూ భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేలకు మించదని గుర్తు చేస్తున్నారు.అలాంటిది రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చి చేపట్టిన భవనాల నిర్మాణ వ్యయం ఎక్కడా లేనట్లు చదరపు అడుగు రూ.పది వేలతో నిర్మిస్తుండడం చూస్తుంటే నీకింత.. నాకింత అన్నట్లుగా దోచుకోవడానికేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
‘బీఆర్ నాయుడు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు’
సాక్షి, విశాఖపట్నం: భగవద్గీతపై బీఆర్ నాయుడు అహంకారంతో మాట్లాడారని.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తిరుపతి ప్రతిష్టని చంద్రబాబు మంట కలిపారని.. బీఅర్ నాయుడు అసభ్య వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనను ఎందుకు టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తున్నారంటూ వరుదు కళ్యాణి ప్రశ్నించారు.‘‘చంద్రబాబు తప్పులను టీవీ5 ఛానల్ కప్పిపుచ్చుతుంది. అందుకే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా తొలగించలేదు. ఒక చేతగాని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చంద్రబాబు నియమించారు. బీఆర్ నాయుడు వైఫల్యం వల్లే క్యూలైన్లో భక్తులు చనిపోయారు. భగవంతుడు అంటే భక్తి లేని వ్యక్తి బీఆర్ నాయుడు. ప్రసాదంలో నాణ్యత లేదని కూటమినేతలే చెప్తుతున్నారు’’ అంటూ వరుదు కళ్యాణి దుయ్యబట్టారు.‘‘మహిళలను మోసం చేసే దుర్మార్గుడిని ఎందుకు టీటీడీ చైర్మన్గా నియమించారు. టీటీడీ ఫుడ్ సేఫ్టీ విభాగం వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేశారు.. హిందూ ద్రోహి చంద్రబాబు. విజయవాడ నడిబొడ్డున 40 దేవాలయాలను కూల్చారు’’ అంటూ కళ్యాణి మండిపడ్డారు. -
రాసలీలలు చేసిన వ్యక్తితో దేవునికి పట్టు వస్త్రాలా?
-
ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్గా ఉండకూడదు: సీపీఐ నారాయణ
సాక్షి, విజయవాడ: టీటీడీ ఛైర్మన్ వ్యవహరంపై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. పవిత్ర ఆలయాన్ని చంద్రబాబు శుద్ధి చేస్తాడని ఆశించామని.. ఛైర్మన్ను రాజీనామా చేయమని బాబు ఎందుకు చెప్పడం లేదంటూ నారాయణ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్గా ఉండకూడదంటూ మండిపడ్డారు.పశ్చిమాసియా ఉద్రిక్తతలపై నారాయణ స్పందిస్తూ.. ‘‘యుద్ధం ప్రపంచ మానవాళి మీద పడిందన్నారు. అమెరికాలోని కార్పోరేట్ కంపెనీల కోసం యుద్ధం జరుగుతున్నారు. ఆయిల్ కంపెనీను కార్పోరేట్లకు అప్పగించడానికే ఈ యుద్ధం.. వెనెజులను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో రూ. 50వేల కోట్లు భారం మనపై పడింది. ఇరాక్లో అణుబాంబుల పేర్లతో ఆయిల్ కోసం దాడులు చేస్తున్నారు...కోటి మంది భారతీయులు గల్ప్ దేశాల్లో చిక్కున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఐక్యత లేకుండా పోయింది. యుద్ధం కారణంగా టూరిజం దెబ్బతింది. డాలర్ 100 రూపాయల దగ్గరకు చేరింది. ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆయిల్ రేట్లు పెరిగితే అన్ని రేట్లు పెరుగుతాయి. యుద్ధం వల్ల దేశం ప్రత్యక్షంగా అతలాకుతలం అవుతుంది. మోదీ ట్రంప్కి సలహా ఇచ్చి యుద్ధం ఆపమని చెప్పాలి’’ అని నారాయణ సూచించారు -
బీఆర్ నాయుడు దూరంగా ఉండటం చంద్రబాబు నటనే: భూమన
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంటకాగుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్టు చంద్రబాబు నటించారని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ నాయుడును అటెండర్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల పర్యటన సందర్భంగా చంద్రబాబు.. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్టు నటించారు. చంద్రబాబు కార్యకర్తలతో కూడా నాటకాలు ఆడుతున్నారు. బీఆర్ నాయుడుది కల్మష స్వభావం. చంద్రబాబు అన్నప్రసాదానికి వెళ్లే బీఆర్ నాయుడు నక్కి నక్కి ఉన్నారు. బీఆర్ నాయుడుకు అటెండర్ కూడా పట్టించుకోరు. నీతి మాలిన బీఆర్ నాయుడు నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు. బీఆర్ నాయుడును తీసేసి దేవాలయ ప్రతిష్ట కాపాడితే అర్థవంతంగా ఉండేది.కీలక సమావేశంలోనే బీఆర్ నాయుడు.. చంద్రబాబు పక్కన లేడు. బీఆర్ నాయుడు ఏ టెక్నాలజీతో మాయం అయ్యాడో?. ప్రసాదం ఇచ్చే సమయంలోనూ మాయావి బీఆర్ నాయకుడు మాయమయ్యాడు. బీఆర్ నాయుడికి సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాల్సిందే. వీధిలో ఉండలేడు, ఇంట్లోకి రానివ్వరు అన్నట్టు బీఆర్ నాయుడు పరిస్థితి ఉంది. నిన్న ఘటన చూసిన తర్వాత బీఆర్ నాయుడుకి ఎవరైనా మర్యాద ఇస్తారా?. అధికారం లేని పదవి, ఆదరణలేని ఉద్యోగుల మధ్య ఉండటం అవసరమా?. బీఆర్ నాయుడుని తీసేయడానికి చంద్రబాబుకు భయం. చంద్రబాబు పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉంది. చంద్రబాబు, బీఆర్ నాయుడు ఇద్దరూ స్వామి వారి ద్రోహులే. చంద్రబాబు ఓ కళంకితుడికి పదవి ఇచ్చారు. అసమర్థుడు అని తేలిన తర్వాత కూడా బీఆర్ నాయుడు పదవి అంటిపెట్టుకున్నారు. పవన కల్యాణనంద స్వాముల వారు కొండపై ప్రతీ రాయిని కడిగినా పాపం పోదు.బీఆర్ నాయుడు కుమారుడు జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఏప్రిల్ ఐదో తేదీన జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసమే బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారా?. బీఆర్ నాయుడుని ఇంకా పదవిలో కొనసాగించడం అత్యంత హేయం అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. -
విశాఖలో గీతం యూనివర్సిటీ బరితెగింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ బరితెగించింది.కూటమి ప్రభుత్వంలో గీతం యూనివర్సిటీ యాజమాన్యం అక్రమ నిర్మాణాలు మరో స్టేజ్కు చేరుకున్నాయి. అధికార అండతో కోర్టులో కేసు ఉండగానే యాజమాన్యం నిర్మాణాలను ప్రారంభించింది. అయితే, గీతం అక్రమ నిర్మాణాలవైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.వివరాల ప్రకారం.. విశాఖలోని 55 ఎకరాల ఆక్రమిత భూముల్లో గీతం యాజమాన్యం నిర్మాణాలు చేపట్టింది. కోర్టులో కేసు ఉండగానే నిర్మాణాలు ప్రారంభించింది. అధికార అండతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఆక్రమిత భూముల్లో ప్రభుత్వ బోర్డులు తొలగించి మరీ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక, ఇప్పటికే గీతం కబ్జా భూములను 22-ఏ జాబితా నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల 5000 కోట్ల విలువైన భూమి అడ్డదారిలో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ జరిగింది. -
BR నాయుడు రాసలీలపై చంద్రబాబు కొత్త డ్రామా
-
మిత్రపక్షానికి బాబు వెన్నుపోటు.. పవన్ కు ఆహ్వానం లేదు
-
ఏపీలో సైదాపురం గనుల లీజుకు కూటమి సర్కారు సై... ఎన్జీటీలో కేసు నడుస్తున్నా లెక్క చేయని ప్రభుత్వ పెద్దలు
-
బల్క్ డ్రగ్ పార్కుకు ‘ఉక్కు’తాడు
సాక్షి, అమరావతి: ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం 13 రాష్ట్రాలతో పోరాడి దక్కించుకున్న బల్క్ డ్రగ్ పార్కుపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపింది. ఈ పార్కు కోసం గత ప్రభుత్వం సేకరించిన 2,000 ఎకరాల్లో 783.74 ఎకరాలు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్కు కేటాయించడం ద్వారా ప్రాజెక్టును వివాదాల సుడిగుండంలోకి నెట్టేశారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్ఎస్ ఇండియా) సంస్థ 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 23న భూమిపూజ చేయనున్నారు. ఈ ఉక్కు కర్మాగారం కోసం ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన బల్క్ డ్రగ్ పార్కును బాబు సర్కారు నిర్వీర్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం వివాద రహితంగా భూసేకరణ పూర్తిచేసినా..! ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకి కేటాయించిన భూమికి బదులుగా బల్్కడ్రగ్ పార్కుకు 790 ఎకరాలు భూమిని మత్స్యకార గ్రామాల్లో బాబు సర్కారు కేటాయించినా.. అక్కడ మత్స్యకారులు, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో బల్క్ డ్రగ్ పార్కు ప్రశ్నార్థకంగా మారింది. తొలుత నక్కపల్లి వద్ద బల్్కడ్రగ్ పార్కును అనకాపల్లి, నక్కపల్లి మండలాలకు చెందిన రాజయపేట, డీఎల్ పురం, వేంపాడు, బుచ్చిరాజు పేట, చందనాడ గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ భూమిని రాజయపేట, డీఎల్పురం, వేంపాడు, బుచిరాజుపేట, చందనాడ, పెద్దతీర్నాలా సీహెచ్ లక్ష్మీపురం, ఉపమాక, ఎన్నర్సాపురం, గుడివాడ గ్రామాల పరిధిలోకి మార్చారు. గత ప్రభుత్వం వివాద రహితంగా భూ సేకరణ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియనూ పూర్తి చేసింది. ఈ లోగా ఎన్నికలు రావడంతో నిర్మాణ పనుల ప్రారంభం ఆగింది. ఈ ఏడాది మార్చి నాటికి బల్్కడ్రగ్ పార్కును అందుబాటులోకి తీసుకురావాలని గత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి ఇప్పుడు రెండేళ్లు గడిచినా ఒక తట్టెడు మట్టి ఎత్తకపోగా చంద్రబాబు సర్కారు మొత్తం ప్రాజెక్టును వివాదాల్లోకి నెట్టేసింది. కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందాలంటే ఈ ప్రాజెక్టును ఈ నెలలోగా పూర్తి చేయాల్సి ఉంది. కానీ భూసేకరణ కూడా పూర్తి కాకపోవడంతో ఈ గడువును మరో ఏడాది అంటే వచ్చేఏడాది మార్చి వరకు పెంచాలంటూ కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. మిట్టల్ కోసం విశాఖ ఉక్కు ప్రయోజనాలూ తాకట్టు మిట్టల్ స్టీల్పై ఉన్న విపరీతమైన ప్రేమతో విశాఖ స్టీల్ప్లాంట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వేషం పెంచుకున్నారు. విశాఖ ఉక్కుపై తన అక్కసును పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరిచారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు ముగింపు సమావేశంలో విశాఖ స్టీల్పై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఒంటికాలిపై లేచారు. విశాఖ స్టీల్ కారి్మకులను పనిదొంగలని అభివరి్ణంచారు. పనిచేయకుండా కూర్చొబెట్టి జీతాలు ఇవ్వాలా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు విశాఖ ఉక్కుకు సొంత ఇనుప గనుల గురించి ఏనాడూ కేంద్రంతో చర్చలు జరిపి ఒప్పించని చంద్రబాబు ప్రైవేటు సంస్థ అయిన మిట్టల్ స్టీల్ కోసం నేరుగా ప్రధానిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పారు. మిట్టల్ స్టీల్కు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) ముడి ఇనుమును లారీల ద్వారా సరఫరా చేస్తానంటే మిట్టల్ స్టీల్ గొట్టాలు (స్లరీ) ద్వారా సరఫరా చేయాలని కోరిందని, దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో తాను స్వయంగా మాట్లాడినా పనికాకపోతే స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఒకటికి రెండుసార్లు గట్టిగా చెప్పి పనిచేయించుకున్నట్లు తెలిపారు. చరిత్రలో ఎక్కడా జరగనంత స్పీడ్గా అనుమతులన్నీ మంజూరు చేయించి రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచి్చనట్లు సీఎం తెలిపారు. అంతేకాకుండా ఈ కంపెనీ ప్రారంభించిన వెంటనే లాభాల్లోకి వస్తుందంటూ కితాబిచ్చారు. అంతేకాదు మిట్టల్ స్టీల్ కోసం కాకినాడ గేట్వే పోర్టు అభివృద్ధినీ పణంగా పెట్టి అనకాపల్లి జిల్లా డీఎల్ పురం వద్ద సముద్రపు ఒడ్డు నుంచి 2.9 కిలోమీటర్లలోపు క్యాపిటివ్ గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి బాబు సర్కారు అనుమతించింది. ఒక్క మిట్టల్ స్టీల్ కోసం బల్్కడ్రగ్ పార్కు, కాకినాడ గేట్వే పోర్టులను పణంగా పెట్టడమే కాకుండా అనుమతుల దగ్గర నుంచి గనుల కేటాయింపు వరకు ప్రత్యేక దృష్టి సారించిన దాంట్లో పదో శాతం శ్రద్ద విశాఖ స్టీల్పై పెట్టి ఉంటే విశాఖ స్టీల్ ఇప్పటికే స్వయం ప్రతిపత్తి సంస్థగా ఎదిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. -
ఏపీఐఐసీ దైన్యం.. ప్రైవేటుకు దాసోహం
సాక్షి, అమరావతి : ఐటీ కంపెనీల ముసుగులో ఇప్పటికే విశాఖలో వేల కోట్ల రూపాయల భూములను పప్పు బెల్లాలుగా పంచిపెట్టిన చంద్రబాబు సర్కారు కన్ను ఇప్పుడు ఏపీఐఐసీ సేకరించిన విలువైన భూములపై పడింది. అనేక పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో ఘన చరిత్ర ఉన్న ఏపీఐఐసీని ‘రియల్’ దోపీడి సంస్థగా మార్చేస్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం పేదల నుంచి కారు చౌకగా సేకరించిన భూములను పారిశ్రామిక పార్కుల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు చౌకగా కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాల్సిన ఏపీఐఐసీ.. ఆ పని వదిలేసి, సేకరించిన భూములను సైతం ప్రభుత్వ పెద్దలకు చెందిన బినామీ రియల్ ఎస్టేట్ సంస్థలు, రహస్య భాగస్వాములకు ధారాదత్తం చేయనుంది. తాజాగా ఇప్పటికే పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన నాయుడు పేట, కొప్పర్తి, మాచర్ల, నందిగామ వంటి చోట్ల రూ.కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 14 చోట్ల 4,109.01 ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి ఏపీఐఐసీ ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. అత్యల్పంగా కొప్పర్తిలో 100 ఎకరాలు, అత్యధికంగా నాయుడుపేటలో 500 ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనుంది. పారిశ్రామిక పార్కులు, పెద్ద పెద్ద వాణిజ్య భవనాలు కట్టిన సంస్థలే కాకుండా, రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఈ బిడ్డింగ్లో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రైవేటు పార్కుల పాలసీ ముసుగులో తమకు కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడమే ఈ నిబంధనల ఉద్దేశమని వారు స్పష్టం చేస్తున్నారు. ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన పార్కుల్లో ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమిని కేటాయించాల్సి ఉంటుంది. పారిశ్రామిక పార్కుల పేరిట దళితుల నుంచి భారీ ఎత్తున భూమిని సేకరించి, ఇప్పుడు వాటిని గంపగుత్తగా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా ఆ రిజర్వేషన్కు కూటమి సర్కారు మంగళం పాడుతోంది. ఐదు తొలగించి.. నాలుగు చేర్చి.. గతేడాది ఆగస్టులో ఏపీఐఐసీ 15 చోట్ల ప్రైవేటు పార్కుల అభివృద్ధి కోసం టెండర్లు పిలిచింది. కానీ అందులో పేర్కొన్న కొన్ని ప్రాంతాల భూములపై రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో టెండర్ల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి, తాజాగా టెండర్లను పిలిచింది. ఉదాహరణకు జగ్గయ్యపేట వద్ద ఉన్న జయంతిపురం వద్ద 498.93 ఎకరాల భూమిలో ప్రైవేటు పార్కు అభివృద్ధి కోసం టెండర్లు పిలిచారు. కానీ ఈ భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి అత్యంత దగ్గర బంధువులు కన్నేశారు. దీన్ని ప్రైవేటు పార్కుల లిస్టులో పెట్టడంతో వారి నుంచి పెద్దఎత్తున ఒత్తిడి రావడంతో తొలగించారు. ఇదే రీతిలో ఒత్తిడి రావడంతో అచ్యుతాపురం (280.55 ఎకరాలు), రౌతు సురమాల (481.50 ఎకరాలు) కోసలనగరం (500 ఎకరాలు), చిలమత్తూరు (124.36 ఎకరాలు) భూములను తాజాగా టెండర్ల లిస్టు నుంచి తొలగించారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తగా నాయుడుపేట(500 ఎకరాలు), కొప్పర్తి (100 ఎకరాలు), పామూరు (458.07 ఎకరాలు), మాకవారిపాలెం (198.42 ఎకరాలు) వచ్చి చేరాయి. గతంలో టెండర్లు పిలిచిన వాటిని ఎందుకు తొలగించారు.. ఇప్పుడు కొత్త వాటిని ఏ విధానంలో చేర్చారన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన వివరణ లేదు. ఏపీ ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ 2024–29 పేరిట 14 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, ఆసక్తిగల సంస్థలు బిడ్లు దాఖలు చేయడానికి ఏప్రిల్ 22 ఆఖరు తేది అని మాత్రమే పేర్కొన్నారు. -
దేవుడి భూములకు బేరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒక్కో వ్యవస్థను ప్రైవేట్ పరం చేసేస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా దేవాలయాలకు చెందిన విలువైన ఆస్తులపై దృష్టి సారించింది! ప్రముఖ దేవాలయాలకు చెందిన అత్యంత విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ.. పవిత్ర ప్రాంగణాల్లో వ్యాపార కార్యకలాపాలకు చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపింది! ఆలయాల వద్ద ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి అనుమతించడం ద్వారా విచ్చలవిడి ధోరణికి తెర తీస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే 2024 ఆగస్టు 27న పెద్ద ఆలయాల పరిసరాల్లో ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఇటీవల ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల వద్ద ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ దేవుడు భూములను 33 ఏళ్ల పాటు లీజుకిచ్చేందుకు స్థలాలను గుర్తించాలంటూ దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈవోలను ఆదేశించారు. ఆరు ఆలయాల వద్ద.. మద్యం, మాంసం సరఫరా జరిగే ప్రైవేట్ హోటళ్లను ఆలయాల వద్ద అదికూడా దేవుడి భూములను లీజుకిచ్చి అనుమతించడం పట్ల దేవదాయశాఖ వర్గాలు విస్తుపోతున్నాయి. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల వద్ద అర ఎకరం నుంచి ఎకరం చొప్పున ప్రైవేట్ హోటళ్లకు లీజుకిచ్చేందుకు స్థలాలను గుర్తించాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశించారు. అయితే వీటిల్లో విజయవాడ దుర్గ గుడి మినహా మిగిలిన ఆరు చోట్ల భక్తుల కోసం ఆయా ఆలయాల నిధులతో నిరి్మంచిన గదులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో చోట వందకు పైగా అద్దె గదులున్న దేవాలయాలున్నాయి. భక్తులకు అన్ని రకాల వసతులతో ఏసీ గదులు అందుబాటు ధరలో ఉన్నాయి. అయినప్పటికీ వీటిని కాదని ప్రైవేట్ హోటళ్ల నిర్మాణాలకు అనుమతించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వేలం లేకుండా కావాల్సిన వారికి కట్టబెట్టేందుకే..! దేవదాయశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, సత్రాల పేరిట 4.45 లక్షల ఎకరాల భూములు ఉండగా 2.11 కోట్ల చదరపు గజాలు (4,355 ఎకరాలు) ఖాళీగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుంది. 33 ఏళ్ల లీజుకు అప్పగించడం అంటే హోటళ్ల నిర్మాణం జరిగాక ఇక ఆ భూములు తిరిగి దేవాలయాల ఆ«దీనంలోకి వచ్చే పరిస్థితి ఉండదనే ఆందోళన వ్యక్తమవుతోంది. వేలం విధానంలో కాకుండా లీజు ద్వారా కేటాయించడంతో టీడీపీ పెద్దల సన్నిహితుల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమని పేర్కొంటున్నారు. 2014–19 మధ్య కూడా చంద్రబాబు ఇదే రీతిలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధుల కోసమంటూ విశాఖ పరిధిలోని దేవదాయశాఖ భూములకు బేరం పెట్టింది. రూ.వంద కోట్లకు భూములను విక్రయించినా విజయనగరం మెడికల్ కాలేజీ నిర్మాణానికి కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయలేదు. -
‘అరటి’పై బాబు కోతలే!
‘అరటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. రాయలసీమ అరటిని ముంబై, కోల్కత్తా లాంటి జాతీయ మార్కెట్లకు తరలించేందుకు లాజిస్టిక్స్ ప్లాన్ సమర్ధంగా అమలు చేశాం. రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేయడంవల్ల రైతులకు గరిష్ట ధరలు లభిస్తున్నాయి. అన్నదాతకు గిట్టుబాటు ధర దక్కేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం..’ – సీఎం చంద్రబాబు‘హ్యాపీ ఫార్మర్ – హ్యాపీ ఏపీ..’ గత ప్రభుత్వ పాలనలో నష్టపోయిన అరటి రైతులకు మన కూటమి ప్రభుత్వంలో మంచి రోజులు వచ్చాయి. మార్కెట్ పరిస్థితులను గాడిలో పెట్టడం వల్ల క్వింటాల్కు రికార్డు స్థాయిలో ధరలు లభిస్తున్నాయి. రైతు ముఖంలో చిరునవ్వు చూడటమే మా ధ్యేయం. గతేడాది నష్టాల నుంచి అన్నదాతలను బయటపడేశాం..’ – మంత్రి నారా లోకేశ్సాక్షి, అమరావతి: ధరలు కొద్దిగా పెరిగితే చాలు.. ‘మా చొరవతోనే రైతుకు భారీ ధరలు‘ అంటూ ప్రకటనలతో ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం అరటి ధరలు మరోసారి పాతాళానికి దిగజారిపోతున్నా చేష్టలుడిగి చూస్తున్నారు. ధరలు పెరిగినప్పుడు అంతా తమ గొప్పతనం అంటూ ఊదరగొడుతూ.. రేట్లు పతనమైతే ప్రకృతి వైపరీత్యం.. అంటూ వారిని గాలికొదిలేస్తుండడం గమనార్హం. కోతకొచ్చాక కొనేవారు లేక.. రాష్ట్రంలో 2.77 లక్షల ఎకరాల్లో అరటి సాగవుతోంది. వైఎస్సార్ కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనే లక్ష ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఇక్కడ జీ–9 వెరైటీ సాగవుతుంది. ఇదంతా పూర్తిగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ. గతంలో ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు కాగా పెరిగిన ఎరువులు, పురుగు మందులు ధరలు, కూలీ, రవాణా ఖర్చులతో ప్రస్తుతం రూ.1.20 లక్షల నుంచి రూ.1.80 లక్షలు వరకు వ్యయం అవుతోందని అరటి రైతులు చెబుతున్నారు. దాదాపు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తుండగా 53 శాతం రాయలసీమ జిల్లాల నుంచే వస్తోంది. అనంతపురం, నంద్యాల జిల్లాలలో టిష్యూ కల్చర్ ద్వారా నాటిన మొదటి పంట దిగుబడులు డిసెంబర్ నుంచి మార్చి వరకు వస్తుండగా, వైఎస్సార్ కడపలో జనవరి నుంచి మే వరకు దిగుబడులు వస్తాయి. రెండో పంటగా పిలకల ద్వారా సాగైన అరటి జూలై నుంచి డిసెంబర్ వరకు వస్తుంది. 2023–24లో టన్ను రూ.30 వేలకు పైగా పలికిన అరటి గతేడాది రూ.వెయ్యికి దిగజారడంతో అరటి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం టన్ను నాలుగైదు వేలకు మించి పలకని దుస్థితి నెలకొంది. ధర లేక, కొనేవారు లేక పంటను కొంతమంది రైతులు మేకలు, పశువుల మేతకు వదిలేస్తుంటే.. మరికొందరు తోటల్లోనే వదిలేస్తున్నారు. ఇంకొందరైతే కూలీ ఖర్చులు కూడా దక్కడం లేదన్న ఆవేదనతో తోటలను దున్నేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఊసే లేదు.. అరటి ధర ఒకటి రెండు రూపాయలు పెరిగినప్పుడు.. విదేశాలకు పంపిస్తున్నాం.. రైతులను రాజులుగా చేస్తున్నాం.. అంటూ ట్వీట్లు వేసే ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ధరలు పతనమై రైతులు రోడ్డున పడితే ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి గాలికిఎగిరిపోయింది. అరటి సహా మొక్కజొన్న, జొన్న, సజ్జలు ధరలు పతనమైనా మార్కెట్లో జోక్యం చేసుకుని పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి వ్యాపారుల మధ్య పోటీ పెంచాలన్న ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు. కనీసం మద్దతు ధరకు కొనుగోలు చేసి మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలు, అంగన్వాడీలకు సరఫరాచేస్తే రైతులు కొంత మేర గట్టెక్కుతారనే స్పృహ లేకుండా పోయింది. ప్రభుత్వ పెద్దలు ట్వీట్లు, స్టేట్మెంట్లతో కాలక్షేపం చేయకుండా తక్షణమే మార్కెట్లో జోక్యం చేసుకొని టన్ను కనీసం రూ.15 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో అరటికి మహర్దశ వైఎస్ జగన్ హయాంలో దేశంలోఎక్కడా లేని విధంగా అరటికి ప్రత్యేకంగా మద్దతు ధర ప్రకటించడమే కాదు.. ఏటా పంట మార్కెట్కు వచ్చే ముందే ధరలను పర్యవేక్షిస్తూ ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు అండగా నిలిచారు. ఇలా దాదాపు 12వేల టన్నులకు పైగా అరటిని కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విదేశాలకు ఎగుమతి కోసం తాడిపత్రి నుంచి ముంబైకి ఏటా కిసాన్ రైళ్లు నడిపి ఎగుమతులను ప్రోత్సహించారు. 2014–19మధ్య చంద్రబాబు హయాంలో 23 వేల టన్నుల అరటి ఎగుమతులు జరిగితే.. వైఎస్ జగన్ హయాంలో 2019–24 మధ్య ఏకంగా 3 లక్షల టన్నులకు పైగా సౌదీ అరేబియా, కువైట్, కతార్, బహ్రెయిన్, యూఏఈ, యూరోపియన్ దేశాలతో పాటు అమెరికాకు సైతం ఎగుమతి కావడం గమనార్హం. 2018–19లో టన్ను రూ.5 వేలకు మించని ధర 2023–24లో రికార్డు స్థాయిలో ఏకంగా రూ.32 వేలకు పైగా పలికింది. వైఎస్సార్ సీపీ హయాంలో అరటి సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో ఏపీ సాధించిన ప్రగతిని గుర్తిస్తూ బనానా ఎక్స్పోర్టు ప్రమోషన్ అవార్డు–2020, ద బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డ్స్– 2022 లాంటి పలు పురస్కారాలు రాష్ట్రానికి లభించడం అరటి రైతుల పట్ల వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.ప్రభుత్వం స్పందించడం లేదు.. ఐదెకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టా. గతేడాది వడగండ్ల వాన, ఈదురు గాలులతో పంట తుడిచి పెట్టుకుపోయింది. ఈ ఏడాది పంట కోతకొచ్చినా కొనేవారు లేరు. స్థానిక మార్కెట్లో టన్ను రూ.5 వేలకు మించి పలకడం లేదు. అయినకాడికి తెగనమ్ముకుందామనుకున్నా కొనేవారు లేరు. ప్రభుత్వం స్పందించడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – బాబా హుస్సేన్, అరటి రైతు, మురారి చింతల, వైఎస్సార్ జిల్లాపతనమైనా పట్టించుకోరేమి? అరటి ధరలు పెరిగినప్పుడు మావల్లే అని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ధరలు పతనమైతే కన్నెత్తి చూడడం లేదు. ధరలు పతనమైనా పట్టించుకోరేమి? 4 ఎకరాల్లో అరటి వేశా. ప్రస్తుతం పంట పక్వానికి వచ్చింది. వ్యాపారుల చుట్టూ రోజూ ప్రదక్షిణ చేస్తున్నా కొనే నాధుడు కరువయ్యాడు. ప్రభుత్వం ఆదుకోకపోతే వరుసగా రెండో ఏడాది కూడా అరటి రైతులకు నష్టాలు తప్పవు. – భాస్కరరెడ్డి, అంకేవానిపల్లె, వైఎస్సార్ జిల్లాపైసా పరిహారం రాలేదు.. అరటి రైతులు రెండేళ్లుగా తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. గతేడాది గాలివాన, వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం నుంచి పైసా పరిహారం రాలేదు. మరొక వైపు ధరలు పతనమైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ఏడాది పంట కోత దశలో ఉన్నప్పుడు ధరలు దిగజారిపోయాయి . చిన్నపాటి గాలి వాన వస్తే పక్వానికి వచ్చిన పంట తుడిచిపెట్టుకుపోతుంది. గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. –నాగార్జునరెడ్డి, లింగాల, వైఎస్సార్ జిల్లా -
అప్పుల్లో నెల నెలాభివృద్ధి!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఓ వైపు నెల నెలా అప్పులు చేయడంలో భారీ వృద్ధి నమోదు చేస్తూ, మరో వైపు రెవెన్యూ రాబడుల్లో నెల నెలా అథమ స్థాయికి దిగజారిపోతోంది. అప్పులు చేయడంపై చూపిస్తున్న శ్రద్ధ రెవెన్యూ రాబడులు పెంచడం ద్వారా సంపద సృష్టిపై చూపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఫిబ్రవరి వరకు బడ్జెట్ కీలక సూచికలపై కాగ్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికే బడ్జెట్ అంచనాలను మించి అప్పులు చేసినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది అంటే మార్చి ఆఖరు నాటికి రూ.79,926 కోట్ల అప్పు చేయనున్నట్లు బడ్జెట్ అంచనాల్లో పేర్కొనగా, ఫిబ్రవరి నాటికే ఏకంగా రూ.94,393 కోట్లు అప్పు చేసింది. అంటే బడ్జెట్ అంచనాలను మించి రూ.14,467 కోట్లు అప్పు చేసింది. మరో పక్క రెవెన్యూ రాబడుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తోంది. 2023–24 ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి నాటికి వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా ఈ ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రాకపోవడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. రెవెన్యూ రాబడులు 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.1,52,820 కోట్లు రాగా, ప్రస్తుత ఆర్థిక ఏడాది (2025–26) ఫిబ్రవరి నాటికి రూ.1,49,546 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రెవెన్యూ రాబడుల్లో రూ.3,274 కోట్లు తగ్గిపోయాయి. సాధారణంగా ఏటా ఎంతో కొంత మేర రెవెన్యూ రాబడులు పెరుగుతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఆర్థికంగా దిగజారిపోతున్న రాష్ట్రం రెవెన్యూ రాబడులు తగ్గడం అంటే రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోతోందని స్పష్టం అవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచి్చన నాటి నుంచి ప్రతి నెలా అమ్మకం పన్ను రాబడితో పాటు పన్నేతర ఆదాయం, ఇతర పన్నులు, డ్యూటీలు రాబడితో పాటు కేంద్ర గ్రాంట్లు తిరోగమనమే తప్ప పురోగమనం లేదు. అమ్మకం పన్ను రాబడి 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.16,860 కోట్లు ఉంటే, 2025–26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.16,304 కోట్లు మాత్రమే. అంటే రూ.556 కోట్లు తగ్గిపోయింది. ఇతర పన్నులు, డ్యూటీల రూపంలో రాబడి 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.6,549 కోట్లు వస్తే, 2025–26లో అదే సమయానికి రూ.4,955 కోట్లే వచ్చాయి. అంటే రూ.1,594 కోట్ల రాబడి తగ్గిపోయింది. పన్నేతర రాబడి 2023–24 ఫిబ్రవరి నాటికి రూ.6,740 కోట్లు వస్తే, 2025–26 ఫిబ్రవరి నాటికి రూ.5,067 కోట్లే వచ్చాయి. రూ.1,673 కోట్లు రాబడి తగ్గిపోయింది. కేంద్ర గ్రాంట్లలోనూ విఫలంకేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం బాగస్వామిగా ఉన్నప్పటికీ, కేంద్ర గ్రాంట్లను రాబట్టడంలో విఫలమైంది. 2023–24 ఫిబ్రవరి నాటికి కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.29,589 కోట్లు రాగా, 2025–26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి అవి రూ.14,737 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రూ.14,852 కోట్లు తగ్గిపోయాయి. విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు చెందిన సామాజిక రంగ వ్యయం కూడా చంద్రబాబు హయాంలో తగ్గిపోయింది. 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి సామాజిక రంగ వ్యయం రూ.1,16,413 కోట్లు ఉంటే, 2025–26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.1,02,423 కోట్లే ఉంది. అంటే సామాజిక రంగ వ్యయం రూ.13,990 కోట్లు తగ్గిపోయింది. మరో పక్క రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రెవెన్యూ లోటు రూ.60,812 కోట్లకు, ద్రవ్యలోటు రూ.91,310 కోట్లకు చేరినట్లు కాగ్ తెలిపింది. -
సోషల్ మీడియాపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: అతిపవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ దుర్మార్గమైన దుష్ప్రచారం చేసి.. అది హెరిటేజ్ సిండికేట్ నెయ్యి కాంట్రాక్టుల కోసమేనన్న విషయం బయటపడి.. తెలుగుప్రజలంతా ఛీత్కరిస్తుండడం ఒకవైపు.. అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టిన టీవీ5 అధినేత బీఆర్నాయుడి రాసలీలలు బయటపడి వేంకటేశ్వరస్వామి భక్తులంతా ఛీకొడుతుండడం మరోవైపు.. అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న ఈ విమర్శల జడిలో ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇక ఎవరూ ఈ విషయాలపై మాట్లాడకుండా ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోని అన్ని వేదికలలోనూ హెరిటేజ్, బీఆర్ నాయుడు అనే పేర్లు కనబడకుండా చేయడానికి మాస్టర్ప్లాన్ వేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టు నుంచి ఈనెల 3న ఈ మేరకు ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో కూడా బీఆర్ నాయుడు, హెరిటేజ్ లపై ఏ విధమైన ప్రచారం చేయకూడదని, ఎలాంటి పోస్టులు ఉన్నా తొలగించాలనేది ఆ ఉత్తర్వుల సారాంశం. ఈ కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని బీఆర్ నాయుడు, హెరిటేజ్ అనే పేర్లు కనపడితే చాలు, వెంటనే రిమూవ్ చేయాలంటూ ప్రభుత్వం ఆయా సంస్థలకు నోటీసులు పంపిస్తోంది. వేదిక ఏదైనా సరే.. బీఆర్ నాయుడు, హెరిటేజ్ అనే పేరుతో ఆ పోస్టులు ఉంటే ఆయా సంస్థలకు నోటీసులు పంపి, బలవంతంగా పోస్టులను డిలీట్ చేయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కార్ ఈ విధంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇది ప్రజల భావప్రకటనా స్వేచ్ఛపై చంద్రబాబు సర్కార్ చేస్తున్న దాడేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.డిలీట్ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు..ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే సాకుతో సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. నేరుగా వారికి మెయిల్స్ చేయడంతో పాటు, సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపిస్తోంది. అందులో వేలాది మంది పేర్లను, ఐడీలను పేర్కొంటూ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలంటూ.. సబ్జెక్ట్, కంటెంట్ తో సంబంధం లేకుండా హెరిటేజ్, బీఆర్ నాయుడు అనే పదాలు ఉంటే చాలు, వీడియో అయినా, పోస్ట్ అయినా, పోస్టర్ అయినా, మీమ్ అయినా, నాలుగు అక్షరాలైనా సరే.. డిలీట్ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. చివరికి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన వీడియోలు కూడా డిలీట్ చేయాలంటూ నోటీసులిస్తున్నారంటే సోషల్ మీడియా దెబ్బకు ప్రభుత్వ పెద్దలు ఎంతలా భయకంపితులు అవుతున్నారో అర్థమవుతుంది. మరింత మందికి తెలియకూడదనే..ఇటీవల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం.. ముఖ్యంగా పరాయి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై పోస్టులు, వీడియోలు, మీమ్స్ వెల్లువెత్తాయి. పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి పనులు చేసిన బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. కానీ, తప్పులను సరిదిద్దుకోవాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా అలాంటి పోస్టులు పెట్టిన వారిపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపులకు పాల్పడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక హెరిటేజ్ విషయంలోనూ ప్రభుత్వం నిజాలు బయటకు రానీయకుండా అడ్డుకుంటోంది. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ ఇష్యూ, అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం, వీఎస్ఆర్ సంస్థకు హెరిటేజ్ కు సంబంధాలు బయటపడటంతో చంద్రబాబు సర్కార్ బెంబేలెత్తింది. అందుకు సంబంధించిన వీడియోలు, పోస్టులన్నీ డిలీట్ చేయిస్తోంది. అజిత్ పవార్ మేనల్లుడు, ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ మాట్లాడిన మాటలు పోస్టు చేసిన వారికి కూడా నోటీసులిచ్చి డిలీట్ చేయించారు.భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డుకట్ట..వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛపై చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా దాడికి పాల్పడుతోంది. అన్యాయాలపై, దుర్మార్గాలపై వాయిస్ వినిపించకుండా చేస్తున్న దాడి అత్యంత దారుణం. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై జరుగుతున్న ఇలాంటి పరిణామాలు తీవ్ర అభ్యంతరకరం. ప్రభుత్వంపై విమర్శలు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు, నోటీసులు, పోస్టుల తొలగింపు ముమ్మాటికీ నియంత పాలనకు నిదర్శనం. – కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది -
మా భారతమ్మ పై పడి ఏడుస్తారు కదా ఉగాది వేడుకల్లో మరి మీ భార్యలు ఎక్కడ..?
-
జగన్ ప్రభుత్వమే బాగుండేది కొంపముంచిన అకాల వర్షాలు కూటమిపై రైతుల ఆగ్రహం
-
LG కంపెనీ కోసం గొల్లపాళ్యంలో కూటమి బలవంతపు భూసేకరణ
-
BR నాయుడుకు షాక్ ఇచ్చిన చంద్రబాబు?
-
బీఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టారా?
తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో మరో వివాదం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గైర్హాజరయ్యారు. కనీసం సీఎం చంద్రబాబు స్వాగత కార్యక్రమంలో కూడా బీఆర్ నాయుడు కనిపించలేదు. టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి.. సీఎం చంద్రబాబుకు ఎందుకు స్వాగతం చెప్పలేదు.. సమీక్షా సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారనేది అనేక సందేహాలకు తావిచ్చింది.బీఆర్ నాయుడిని సీఎం చంద్రబాబు కావాలనే దూరం పెట్టారా? అనే అనుమానం వస్తుంది. ఇటీవల బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టడమే ఇందుకు కారణం కావచ్చొనది పలువురి అభిప్రాయంగా ఉంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో సీఎం చంద్రబాబు.. టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. మరి అటువంటి సమావేశానికి టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు హాజరు కాలేదనేది ఇక్కడ ప్రశ్న. టీటీడీలో అంతర్గత విభేదాలా.. లేక ప్రోటోకాల్ వివాదమా? అనేది అధికార వర్గాల్లో చర్చకు దారి తీసింది. -
చంద్రబాబు పరిస్థితి మన్మధుడు సినిమాలో బ్రహ్మనాదంలా... బాబుపై జడ శ్రవణ్ సెటైర్లు
-
టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ
-
బాబు తిరుమల టూర్ లో BR నాయుడు ఎక్కడ?
-
సినిమాలో బ్రహ్మానందం రాజకీయాల్లో చంద్రబాబు...
-
తిరుమలలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ.. భక్తుల ఆశ్చర్యం
సాక్షి, తిరుపతి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా చంద్రబాబు.. టీటీడీలోనూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్ని బాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2023లో ల్యాబ్ ఏర్పాటుకు సీఈఓ కమలవర్థన్ చర్చలు జరిపారు. అనంతరం, 20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. నాటి నిర్ణయం మేరకు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ తిరుమలలో అందుబాటులోకి వచ్చింది. వైఎస్ జగన్ హయాంలోనే ల్యాబ్ బలోపేతమైంది.ఇంత జరిగినా బిల్డప్ బాబు చంద్రబాబు మాత్రం ప్రసాదం నాణ్యతకు తానే దృష్టిపెట్టినట్టు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. అయితే, వైఎస్ జగన్ గతంలోనే తిరుమలలో ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, తాజాగా చంద్రబాబు క్రెడిట్ చోరీని చూసిన శ్రీవారి భక్తులు నివ్వెరపోతున్నరు. -
పాలు పితుకుతున్నావా..? గాడిదలు కాస్తున్నావా..?
-
చంద్రబాబు టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ
-
ముస్లింలకు తోఫా కాదు.. ధోకా
సాక్షి, అమరావతి : ముస్లింలకు రంజాన్ తోఫా ఇస్తానంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మరోసారి ధోకా ఇచ్చారు. గత ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండానే, ఇటీవల ఇఫ్తార్ విందులో అన్నీ చేసేసినట్టు అబద్ధాలు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ముస్లింలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యాక్రమాలను కూడా తానే చేసినట్టు బాబు క్రెడిట్ చోరీకి పాల్పడిన తీరును ముస్లిం నేతలు తప్పు పడుతున్నారు. ఇమామ్కు రూ.5 వేలు, మౌజన్లకు రూ.3 వేలు ఉన్న గౌరవ వేతనాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలకు పెంచింది. వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకించి, ముస్లింల పక్షాన ఉన్న వైఎస్ జగన్ తన హయాంలో వక్ఫ్ ఆస్తుల సర్వే నిర్వహించి, అన్యాక్రాంతమైన వాటిని కాపాడి, వేలాది వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేయించారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ వర్గాలకు వివిధ పథకాల కింద డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఏకంగా రూ.20,863.40 కోట్ల లబ్ధి చేకూర్చారు. తద్వారా ముస్లింలను రాజకీయంగా, ఆరి్థకంగా, సామాజికంగా ముందుకు నడిపించారని ముస్లిం సమాజం చర్చించుకోవడం గమనార్హం. ఇదే సమయంలో చంద్రబాబు చేసిన దగాను గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు మోసాలివీ» మసీదులకు రూ.5 వేల చొప్పున నిర్వహణ ఖర్చులు ఇస్తామన్న హామీ ఊసేలేదు. » ఇమామ్, మౌజన్లకు నెలల తరబడి గౌరవ వేతనాలు పెండింగ్. బక్రీద్, రంజాన్ ముందు హడావుడిగా అరకొరగా విడుదల. » 22 నెలలుగా 1,500 మసీదులకు చెందిన ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనం దరఖాస్తులు పెండింగ్. » గత ప్రభుత్వ హయాంలో నియమించిన వక్ఫ్ బోర్డు రద్దు. నూతన వక్ఫ్ బోర్డులో మతపరమైన సాహితీ వేత్తలకు ఇవ్వాల్సిన డైరెక్టర్ పోస్టులను టీడీపీ నేతలకు కట్టబెట్టిన వైనం. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన రాజమహేంద్రవరానికి చెందిన ముస్లిం ప్రతినిధి. » కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు పలికిన చంద్రబాబు సర్కారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా అన్యాక్రాంతం చేసేందుకు ఆస్కారం కల్పిస్తూ.. మరోవైపు వాటిని రక్షిస్తున్నట్టు బిల్డప్. » అధికారంలోకి వచ్చిన వెంటనే దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి.. ఏడాది తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఆమోదం. మరో ఆరు నెలలకు తీరుబడిగా జీఓ ఇచ్చి.. ఇస్తామన్న రూ.100 కోట్లు ఇప్పటి వరకు కేటాయించలేదు. » రాష్ట్రంలో ఈద్గాలు, ఖబర్స్తాన్లకు భూములు కేటాయింపు, ముస్లింలకు ఆటోనగర్ల ఏర్పాటు హుళక్కే. » 2024 హజ్ యాత్రకు వెళ్లిన వారికి గత ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు సైతం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చెల్లించలేదు. » హజ్ యాత్రకు వెళ్లిన వారికి రూ.లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చి.. 2025లో వెళ్లిన వారందరికీ కాకుండా విజయవాడ నుంచి వెళ్లిన వారికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. » మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. » చంద్రన్న పెళ్లి కానుక, ఇస్లామిక్ బ్యాంక్, 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్, విదేశీ విద్య పథకం తదితర హామీలు అమలు చేయకుండా మరో సారి మోసం చేశారు. -
మత్స్యకారులకు ‘పెద్దల’ వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అలల సవ్వడితో ఆహ్లాదకరంగా ఉండే తీర ప్రాంతం చంద్రబాబు సర్కారు పెద్దల కుట్రలతో అట్టుడికి పోతోంది. తమ బతుకులను ఛిద్రం చేస్తున్న తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీగా డీల్ కుదుర్చుకున్నారనే విషయం ఆంధ్రా మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ బతుకులపై దెబ్బ కొట్టిన వారికి ఎలా మద్దతిస్తారంటూ మత్స్యకార గ్రామాలన్నీ ఏకమై రగిలిపోతున్నాయి. ప్రభుత్వం అండ చూసుకుని మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన గ్రామ పెద్దలను తాళ్లతో నిర్బంధించి ఆరా తీయడంతో సర్కారు ద్రోహం బయటపడింది.ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి పెద్దపట్టపుపాళెం నుంచి తడ వరకు సముద్ర జలాల్లోకి తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో చొచ్చుకువచ్చి స్థానిక మత్స్యకారుల వేటలో పట్టుబడిన మత్స్య సంపదను దోచుకెళ్లడంతోపాటు వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది. దీంతో అనేక దఫాలు తమిళ బోట్లను, జాలర్లను పట్టుకుని నిర్బంధిస్తే.. ఆంధ్రా, తమిళ ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం చేసి విడిపిస్తున్నాయి. అయినా తమిళ జాలర్లు పంథా మార్చుకోకపోగా, ఆంధ్రా మత్స్యకారులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను భరించలేక కావలి, బోగోలు, అల్లూరు, ముత్తుకూరు మండలాలకు చెందిన మత్స్యకారులు ఈ దఫా గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఐదు నెలల క్రితం తమిళనాడుకు చెందిన నాలుగు మెకనైజ్డ్ బోట్లు (500 సీసీ) జిల్లాలోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుంటుండగా ప్రాణాలకు తెగించి ఆ బోట్లతోపాటు పలువురు తమిళ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ పరిణామం సంచలనంగా మారడంతో కొందరు పెద్దలు స్థానిక మత్స్యకారులను ఒప్పించి తమిళ జాలర్లను వదిలేలా చేశారు. కానీ ఆ నాలుగు బోట్లను మాత్రం వదిలి పెట్టలేదు. వీటిని అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెం మత్స్యకారుల పెద్దలకు అప్పగించారు. ఐదు నెలలుగా మత్స్యకార యువత వంతుల వారీగా బోట్ల వద్ద కాపలాగా ఉంటున్నారు. ఈ దఫా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వదిలే ప్రసక్తి లేదని ఒకమాటపై నిలిచారు. ఈ క్రమంలో మెరైన్ పోలీసులు సైతం ఆ బోట్ల భద్రతలో పాలుపంచుకున్నారు. తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీ డీల్ » ఇటీవల బోగోలు మండలం జువ్వలదిన్నెకు ఒక కీలక మంత్రి వచ్చి వెళ్లడం.. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో మత్స్యకారులతో మరో మంత్రి సమావేశం కావడం.. ఆ తర్వాత నాలుగు రోజులకే అర్ధరాత్రి వేళ మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తమ నిర్బంధంలో ఉంచుకున్న నాలుగు బోట్లను రహస్యంగా వదిలేయడం జరిగిపోయింది. ఆఖరి క్షణంలో ఈ విషయం తెలుసుకున్న మత్స్యకారులు మరోసారి ప్రాణాలకు తెగించి మెకనైజ్డ్ బోట్లను వెంటాడినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మత్స్యకారులు కోపాగి్నతో రగిలిపోతున్నారు. » టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతే ఈ మంత్రాంగం నడిచిందని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెం పెద్దలకు భారీ మొత్తం చేతిలో పెట్టి, మత్స్యకారుల నిర్బంధంలో ఉన్న తమిళ బోట్లను విడిపించినట్లు తెలుస్తోంది. ఇదంతా టీడీపీ పెద్దల కుట్ర కోణంతోనే జరిగిందని తీర ప్రాంతంలో ఉన్న దాదాపు 114 గ్రామాల మత్స్యకార ప్రజలు మండిపడుతున్నారు. బోట్లు వదిలేసిన వారిని నిర్బంధించిన మత్స్యకారులు » అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెంకు చెందిన గ్రామ పెద్ద కాపు, ఆయన ఇద్దరు కుమారులతోపాటు బోగోలు మండలం బంగారుపాళెంకు చెందిన మరో కాపును మత్స్యకారులు, ఆయా గ్రామాల పెద్ద కాపులు కలిసి నిర్బంధించారు. తాళ్లతో కట్టేసి ఈ కుట్రకోణం వెనుక టీడీపీ పెద్దలు ఎవరున్నారో చెప్పాలని ఒత్తిడి తెచ్చారు.» మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన కాపుల నోటి నుంచి టీడీపీ కీలక నేతల పేర్లు వచి్చనట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి హస్తం కూడా ఉందని, కొందరు పోలీసు అధికారులు కూడా సహకరించడం వల్లే ఆ బోట్లను వదిలేశారని సమాచారం. దీంతో అధికార పార్టీ నేతలు, పోలీసులు అటు వైపు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కోసం వచ్చే నెల 3న సమావేశం కావాలని ఆ గ్రామాల మత్స్యకారులు నిర్ణయించారు. అప్పటి వరకు తాము నిర్బంధించిన వారిని తమ అదుపులోనే ఉంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.తరచూ జరిగేది ఇదేతీరంలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల మత్స్యకారులు తరచూ తమిళ జాలర్లతో బతుకు పోరాటం చేస్తున్నారు. వీరు వేటాడిన మత్స్య సంపదను రెప్పపాటులో తమిళ మత్స్య దొంగలు అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి దోచుకుపోతున్నారు. తమిళనాడులోని వ్యాపారులు కొందరు అత్యాధునిక బోట్లు, వలలతో వచ్చి మత్స్య సంపదను కొల్ల గొడుతున్నారు. నిబంధనల ప్రకారం తీరానికి 12 నాటికల్ మైళ్ల అవతల కాకుండా కేవలం 5 నాటికల్ మైళ్లలోపు వేట సాగిస్తున్నారు. తిరుపతి జిల్లా తడ నుంచి ప్రకాశం జిల్లా కొత్త పట్నం వరకు తమిళ మత్స్యకారులు దూసుకొస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు ప్రాంతం గోవిందరావు పట్టపుపాళెం, నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టపుపాళెం, రామాయపట్నం, చాకిచర్ల పట్టపుపాళెం, ఊర్లపాళెం, పాకల పట్టపుపాళెం, టంగుటూరు మండలం తాళ్లపాళెం కొత్తపట్నం బీచ్, మడనూరు ప్రాంతాల్లో తమిళ మత్స్యకారులు దాడులకు తెగబడుతున్నారు. -
అది నేనే.. ఇదీ నేనే..!
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం, మరోసారి ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. తిరుమలలో స్వామివారి ప్రసాదంలో వాడే ముడిపదార్థాలు, భక్తులకు పెట్టే అన్నప్రసాదాల్లో నాణ్యతను పెంపొందించేందుకు శనివారం ప్రారంభం కానున్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు తానే కారణమన్నట్లు ప్రచారం చేసుకుంటూ, స్వయంగా శ్రీవెంకటేశ్వరుని సాక్షిగా బాబు సర్కార్ తాజాగా క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. జగన్ ప్రభుత్వ చొరవతో ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రత్యేకంగా తిరుమలకు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను మంజూరు చేస్తే అది తన ఘనతగా చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే.. » 2023 ఆగస్టు 23, 24 తేదీల్లో 41వ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సమావేశాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తిరుపతిలో నిర్వహించింది. సమావేశానికి హాజరైన సీఈవో కమలవర్ధన్రావు ఈ సందర్భంగా తిరుమలలో పర్యటించారు. అన్నప్రసాద భవనాన్ని, శ్రీవారి లడ్డూ పోటును స్వయంగా సందర్శించారు. టీటీడీ అధికారులతో సైతం సమావేశం నిర్వహించారు.» అప్పటికే భక్తులకు ఇచ్చే ప్రసాదం, అన్నప్రసాదం తయారీ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం... తిరుమలకు ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను మంజూరు చేయాలని సీఈవోను కోరింది.» దీంతో భక్తులకు వడ్డించే ఆహారం, లడ్డూ తయారీలో వాడే నెయ్యి, పాలు, సుగంధ ద్రవ్యాల స్వచ్ఛతను పరీక్షించడానికి టీటీడీకి సొంతంగా అధునాతన ల్యాబ్ను ఎఫ్ఎస్ఎస్ఏఐ తరపున మంజూరు చేస్తున్నట్లు మీడియా సాక్షిగా కమలవర్ధన్రావు ప్రకటించారు.» వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ల్యాబ్ ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందుకు రావడంతో, ల్యాబ్ ఏర్పాటు కోసం ఆనాటి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు కసరత్తు కూడా ప్రారంభించారు. » ల్యాబ్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలోనే ఎఫ్ఎస్ఎస్ఏఐకు ప్రతిపాదనలు కూడా పంపారు.» గత ప్రభుత్వంలో జరిగిన కృషి కారణంగా రూ.20 కోట్లతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ ఏర్పాటయ్యింది. » అదంతా తన గొప్పేనంటూ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ చేస్తున్న హడావుడి సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. -
పండుగ వేళ.. తీరని విషాదం
భద్రాచలం అర్బన్/ఉయ్యూరు రూరల్/కుక్కునూరు/మంగళగిరి టౌన్/ఎటపాక: గోదావరి తీరం వెంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కొల్లుగూడెం దగ్గర గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు ఏపీ వాసులు, ఇద్దరు భద్రాచలం వాసులుగా తేలింది. ముగ్గురి మృతదేహాలు లభించాయి. భద్రాచలం పట్టణానికి చెందిన చారిగుంట్ల శ్రీకర్గుప్తా(21) విజయవాడలోని అమరావతి ఎస్ఆర్ఎమ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం, పొడిచేటి అభిరామ్(21) భద్రాచలంలో వేద విద్య అభ్యసిస్తున్నారు. వీరు ఏపీ, తెలంగాణ సరిహద్దులోని గోదావరి నదిలో గతంలో దిగిన ఫొటోలను తమ స్నేహితులకు చూపించారు. దీంతో ఆ ప్రదేశం బాగుందని మిత్ర బృందం భావించింది. ఈక్రమంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నామని చెప్పి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కనుమూరు గ్రామానికి చెందిన దగ్గుబాటి నవదీప్(19), ఉయ్యూరుకు చెందిన గోక తేజజ్ఞసాయి(19), మదనపల్లెకు చెందిన సతీశ్(19)తో పాటు మరో ఇద్దరు స్నేహితులైన సీహెచ్.దీపక్, గడ్డం హర్షవర్ధన్ ఐదుగురు గురువారం ఉదయం భద్రాచలం చేరుకున్నారు. వీరందరూ విజయవాడ సమీపంలోని విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. స్థానికులైన శ్రీకర్, అభిరామ్తో కలిసి మధ్యాహ్నం భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం శుక్రవారం ఉదయం సరదాగా ఫొటోలు దిగేందుకు ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న గోదావరి తీరానికి బయలుదేరారు. లోతు ఉన్న ప్రాంతం కావడంతో.. కొల్లుగూడెం దగ్గర గోదావరి నదిలో నీటి పాయ అవతలి ఒడ్డు(కుక్కునూరు) దిశగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నదిలో ఇసుక తిన్నెల్లో సుమారు రెండు కిలోమీటర్లు దూరం నడిచి, నీరు ఉన్న ప్రాంతానికి వారంతా చేరుకున్నారు. వీరు చేరుకున్న ప్రదేశానికి ఎగువన కిన్నెరసాని నది గోదావరిలో కలుస్తుండగా దిగువన కొంత దూరంలో పాములేరు వాగు కలుస్తుంది. దీంతో పెద్ద బండరాళ్లతో కూడిన ఆ ప్రదేశంలో నీరు ఎక్కువగా ఉంది. ఇక్కడ నీటి లోతు ఇరవై అడుగుల పైనే ఉంటుందని అంచనా. ఇది ప్రమాదకర ప్రదేశమని తెలియని విద్యార్థులంతా తమ ఫోన్లు ఒడ్డున ఉంచి నీళ్లలోకి దిగారు.సాయం అందలేదు వారిలో ముందుగా తేజజ్ఞ లోతును అంచనా వేయలేక మునిగిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరుగా శ్రీకర్గుప్తా, అభిరామ్, నవదీప్, సతీశ్ కూడా మునిగారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంతో నీళ్లలో ఉన్న దీపక్ బయటకు వచ్చాడు. నీళ్లలోకి వెళ్లి గల్లంతవుతున్న వారిని కాపాడేందుకు హర్షవర్ధన్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాగే, భద్రాచలం వైపు ఒడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరాన ఉండడం, కుక్కునూరు వైపు పూర్తిగా నీరు ఉండడంతో సమీపంలో సాయం చేసే వారెవరూ కనిపించలేదు. కనీసం చేపలు పట్టే వారు కూడా ఆ సమయంలో లేరు. ఉదయం 11గంటలకు గోదావరిలో నీటి పాయ దగ్గరకు చేరుకుంటే కాసేపటికే 11–15 గంటలకు ప్రమాదం జరిగింది. నీళ్లలో మునిగిన స్నేహితులు ఎంతకూ బయటకు రాకపోవడంతో తమ ఫోన్ల ద్వారా 11–30 గంటలకు బయటకు సమాచారం చేరవేశారు.గజ ఈతగాళ్లతో గాలింపుస్నేహితులు ఐదుగురు గల్లంతైన సమాచారాన్ని దీపక్, హర్ష కలిసి శ్రీకర్ గుప్తా తండ్రికి ఫోన్లో చెప్పారు. దీంతో ఆయన భద్రాచలం పోలీసు, అగి్నమాపక శాఖ అధికారులతో పాటు ఎటపాక అధికారులకు కూడా ఫోన్ చేశారు. గజ ఈతగాళ్లతో అక్కడికి చేరుకున్న అధికారులు గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు శ్రీకర్, నవదీప్, అభిరామ్ మృతదేహాలు బయటపడగా.. సతీష్కుమార్, తేజజ్ఞ ఆచూకీ తెలియరాలేదు. ఉయ్యూరు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతి విషాద చాయలు అలుముకున్నాయి.మృతులు, గల్లంతైన వారి వివరాలు 01) చారుగుళ్ల శ్రీకర్ గుప్తా(21), అమరావతి ఎస్ఆర్ఎమ్లో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: చారుగుళ్ల రామకృష్ణ, భద్రాచలం 02) దగ్గుబాటి నవదీప్(19), విజయవాడ కేఎల్యూలో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: ఫణీంద్రనాథ్, కనుమూరు గ్రామం, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 03) పొడిచేటి అభిరామ్(19), వేదవిద్య తండ్రి: వంశీ, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ 04) పాశం సతీష్ కుమార్(19), అమరావతి ఎస్ఆర్ఎమ్లో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: పాశం నారాయణ, మదనపల్లె, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ 05) గోకా తేజజ్ఞ సాయి(19), అమరావతి ఎస్ఆర్ఎంలో బీటెక్ సెకండ్ ఇయర్ స్వస్థలం: ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్స్థానిక అధికారుల తీరుపై తీవ్ర విమర్శ యువకులు నదిలో గల్లంతైన ఘటనలో ఆంధ్ర అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టగా ఆ తరువాత ఘటనా స్థలానికి ఎటపాక, కుక్కునూరు మండల అధికారులు వచ్చారు. ఈ ప్రాంతం తమ పరిధి కాదంటే.. తమ పరిధి కూడా కాదంటూ వాదించుకున్న తీరు స్థానికంగా వివాదాస్పదంగా మారింది. కనీసం మండల సరిహద్దులు తెలియకుండా అధికారులు విధులు నిర్వహిస్తున్నారా ? అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆదుకోవాల్సింది పోయి తమ ప్రాంతం కాదంటూ తప్పించుకునే వ్యవహార శైలి సరైనది కాదని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ సరిహద్దులు తెలియకుండా పాలనా వ్యవస్థ ఎలా నడిపిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సాక్షి, అమరావతి: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతై ముగ్గురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషాదకరమని, ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం మృతుల కుటుంబాలకు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా మృతుల కుటుంబాలకు సానుభూతి సాక్షి, అమరావతి: ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
మందుల కొనుగోళ్లలో మాయాజాలం
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ప్రజాధనం దోపిడీతో అవినీతికి కేంద్ర బిందువుగా మారిపోయింది. సంస్థ కేంద్రంగా సాగుతున్న దోపిడీ వెనుక వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మార్కెట్లో రూ.1.50 లక్షల కంటే ఎక్కువ విలువ చేయని వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్ట్ పరికరాన్ని ఏకంగా రూ.3.13 లక్షలకు కొనుగోలు చేసిన దోపిడీ ఉదంతం ఇటీవలే వెలుగు చూసింది.ఇప్పుడు మందుల కొనుగోళ్లలోనూ అక్రమాలు బయటపడ్డాయి. అజిత్రోమైసిన్ 500 ఎంజీ వంద మాత్రలను రూ.177కు సరఫరా చేసేలా యూనిక్యూర్ ఇండియా సంస్థ గతంలో రేట్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఆ సంస్థ మందులు సరఫరా చేయలేదన్న సాకుతో స్ట్రైడ్ ఆర్గానిక్ సంస్థతో ఏకంగా రూ.869 చొప్పున చెల్లించి మాత్రల కొనుగోళ్లు చేపడుతోంది. అంటే రూ. 692 ఎక్కువ చెల్లిస్తున్నారు. కనీసం ప్రయత్నించకుండా నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎల్–1 సంస్థ మందులు సరఫరా చేయకపోతే.. వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టి పెనాల్టీ విధించాలి. ఆ సంస్థ సరఫరా చేసే ధరకే మందుల కొనుగోళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙంచాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎల్–1 సంస్థ ధరకు ఎల్2, ఎల్3 సంస్థలు మందులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంటే అదే ధరకు కొనుగోలుచేయాలి. లేనిపక్షంలో అదే ధరకు కార్పొరేషన్లోని ఇతర సరఫరా సంస్థలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కొనుగోళ్లలో ప్రభుత్వంపై అదనపు భారం పడితే ఆ మొత్తాన్ని కూడా ఎల్–1 సంస్థ నుంచే రాబట్టాలి. ప్రస్తుత ఘటనలో ఈ ప్రయత్నాలేమీ చేయకుండా.. నేరుగా ఎల్–2 సంస్థను కూడా పక్కనపెట్టి ఎల్–3 అయిన స్ట్రైడ్ ఆర్గానిక్ సంస్థకు వంద మాత్రలకు రూ.869 చెల్లించేలా ఆర్డర్లు ఇచ్చేశారు. ఎల్–1 యూనిక్యూర్ ధర కంటే రూ.692 అధిక మొత్తంతో స్ట్రైడ్ ఆర్గానిక్ నుంచి మందులు కొనుగోలు చేయడం వెనుక డ్రగ్స్ విభాగంలోని కీలక అధికారి పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఎంఎస్ఐడీసీ ప్రభుత్వాస్పత్రుల కోసం లక్షల సంఖ్యలో మాత్రలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో హోల్సేల్ ధరల కంటే అత్యంత తక్కువ ధరకు మందులు సరఫరా చేయడానికి ఫార్మా సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ నేపథ్యంలో అజిత్రోమైసిన్ వంద మాత్రలకు రూ.869 చెల్లించడం చూసి మందుల సరఫరా సంస్థలే ఆశ్చర్యపోతున్నాయి. -
వచ్చే మంగళవారం బాబు సర్కారు... మళ్లీ రూ.3,900 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు మళ్లీ బడ్జెట్ పరిధిలో అప్పు చేస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,900 కోట్ల అప్పును సమీకరించి ఇవ్వనుంది. 17 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 20 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 25 ఏళ్ల కాల వ్యవధిలో రూ.900 కోట్ల అప్పును ప్రభుత్వం చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. కాగా, ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం 22 నెలల్లోనే రూ.3,33,321 కోట్ల అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేయనున్న అప్పుతో కలిపితే మొత్తం రూ.3,37,221 కోట్లకు చేరనుంది. దీంతో నెలకు రూ.15,328.22 కోట్లు, రోజుకు రూ.511 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి రూ.3,000 కోట్లు అప్పు సేకరించి ఇచ్చింది. -
గుప్పిట్లో ‘ఫ్రీహోల్డ్’
సాక్షి, అమరావతి: పేద రైతులకు గత ప్రభుత్వంలో హక్కులు దక్కిన ఫ్రీహోల్డ్ భూముల్లో 7.50 లక్షల ఎకరాలను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసినా ఇప్పటివరకూ ఉత్తర్వులు వెలువడకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై ఏడాదిన్నర పాటు నాన్చి ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది. ఫ్రీహోల్డ్ అయిన (యాజమాన్య హక్కులు వచ్చిన) మొత్తం 13.59 లక్షల ఎకరాల భూముల్లో 7.50 లక్షల ఎకరాలను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే రెండు వారాలు దాటిపోయినా ఇంతవరకూ దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం. దీంతో దీని వెనుక ఏదో గూడుపుఠాణీ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు వెంటనే అమలు జరిగిపోతాయి. రాజధాని పనులు, ఇతర వ్యవహారాలపై ఏర్పాటు చేసిన ఉపసంఘాలు చేసిన సిఫారసులను ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి తెస్తూ జీవోలు ఇస్తోంది. కానీ పేద అసైన్డ్ రైతులకు సంబంధించిన భూములను రెండేళ్లు గాల్లో పెట్టి చివరికి వారి ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నా అమలుకు వెనుకాడుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉప సంఘం సిఫారసులు అందిన తర్వాత 2, 3 రోజుల్లోనే అందుకు సంబంధించిన జీవోలు వెలువడాలి. రెవెన్యూ శాఖ మంత్రి అదే విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే జీవో వస్తుందని చెబుతున్నా ఇప్పటివరకూ రాకపోవడంపై అధికారవర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ముసుగులో టీడీపీ నేతలు సర్దేస్తున్నారా..! ఎలాగూ సగం ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించారు కనుక సందట్లో సడేమియా మాదిరిగా అసైన్డ్ భూములను నొక్కేయడానికి టీడీపీ నేతలు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎన్నికలు రావడంతో గత ప్రభుత్వంలో ఫ్రీహోల్డ్ అవకుండా మిగిలిపోయిన కొన్ని భూములను తాజాగా ఫ్రీహోల్డ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన అసైనీలు ఉంటే వారి ద్వారా.. లేదంటే ఆదీనంలో ఉన్న రైతులతో మాట్లాడి నయానో భయానో లొంగదీసుకుంటున్నట్లు చెబుతున్నారు. తృణమో పణమో ముట్టజెప్పి వారి భూముల్ని స్వాదీనం చేసుకుంటున్నారని సమాచారం. గతంలోనే ఫ్రీహోల్డ్ అయిన భూములతో కలిపి వాటిని ఇప్పుడు ఫ్రీహోల్డ్ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం ఎత్తివేస్తూ వెంటనే ఇవ్వాల్సిన జీవో ఇంతవరకూ వెలువడలేదని తెలుస్తోంది. టీడీపీ నేతలు అనుకున్న భూములన్నీ వారి చేతుల్లోకి వచ్చాక జీవో జారీ చేస్తారని చెబుతున్నారు. తద్వారా గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో కొన్నింటిని ఇప్పుడు 22ఏ జాబితా నుంచి తీసివేశామని పైకి చెప్పుకుంటూ తాజాగా వేలాది ఎకరాలను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ హక్కులిస్తే.. బాబు ఆంక్షలు పెట్టి వేధించారు అనేక దశాబ్దాలపాటు తమ భూములపై ఎలాంటి హక్కులు లేకుండా ఉన్న పేద అసైన్డ్ రైతులకు ఊరటనిస్తూ వారి భూములపై వైఎస్ జగన్ హయాంలో హక్కులు కల్పించారు. ఇందుకోసం అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) ఇచ్చారు. దీంతో 27.40 లక్షల ఎకరాలకు చెందిన అసైన్డ్ రైతులకు సంపూర్ణంగా హక్కులు కల్పించడంతో వారు ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులయ్యారు. 2024లో ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేయగా, దాదాపు 20 లక్షల మంది రైతులను యజమానులను చేసింది. అయితే వైఎస్ జగన్ హయాంలోనే హక్కులు రావడంతో.. ఆ భూములపై కత్తి కట్టిన చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే వాటిని 22 ఏ జాబితాలో పెట్టింది. రెండేళ్ల నుంచి ఆ భూములపై నిషేధాన్ని కొనసాగిస్తూ ఆ రైతులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. అసైన్డ్ రైతుల ఒత్తిడితో ఫ్రీహోల్డ్ అయిన భూముల్లో సగం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని రెండేళ్ల తర్వాత నిర్ణయించింది. అయినప్పటికీ దాన్ని అమలు చేయకుండా తెర వెనుక భూములు కొట్టేయడానికి సన్నాహాలు చేస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
దేశంలో తొలిసారి మిస్టేక్ అఫ్ ఫ్యాక్ట్ కింద కేసులను కొట్టేశారు
-
భువనేశ్వరి భారీ స్కెచ్ బాబు బండారం బయటపెట్టిన జడ శ్రవణ్
-
YSRCP బూత్ కమిటీ సమావేశం.. నేతలకు RK రోజా సూచన
-
నారా కాస్త నీరో లోకేష్ అయ్యాడు..లోకేష్ పై నిప్పులు చెరిగిన తాటిపర్తి
-
మీరు చేస్తే సంసారం.. పక్కవాడు చేస్తే వ్యభిచారం పోలీస్ వ్యవస్థ, చంద్రబాబు పై జాడ శ్రవణ్ నిప్పులు
-
‘జాబ్ క్యాలెండర్ను లోకేష్ జోక్ క్యాలెండర్గా మార్చేశారు’
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ జాబ్ కేలండర్ని జోక్ కేలండర్గా మార్చారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కేలండర్లో డేట్లు ఉన్నాయి.. గానీ ఉద్యోగాల డేటా లేదు. తూతూమంత్రంగా 10 వేల ఉద్యోగాలు ప్రకటించి చేతులు దులుపున్నారు. లోకేష్, చంద్రబాబే కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో చాలాసార్లు చెప్పారు. మాటల్లో మాత్రం గ్లోబల్ లెవల్లో మాట్లాడతారు. చేతల్లో మాత్రం ఏమీ ఉండదు’’ అంటూ తాటిపర్తి ధ్వజమెత్తారు.‘‘నారా వారు కాదు.. నీరో వారని నిరూపించుకున్నారు. నిరుద్యోగ భృతి రెండేళ్లుగా ఇవ్వలేదు. లోకేష్ చదువుకున్న వ్యక్తి కాదు.. చదువుకొన్న వ్యక్తి. అందుకే నిరుద్యోగుల కష్టాలు ఆయనకు తెలియవు. అరచేతిలో వైకుంఠం చూపించటం తప్ప లోకేష్ చేస్తున్నది లేదు. అర్హత లేని లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రులు అయ్యారుగానీ నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్..వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను చంద్రబాబు తీసేశారు. ఔట్ సోర్సింగ్లోనే 9 వేల ఉద్యోగాలు తొలగించారు. ఏపీ ఫైబర్లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. రేషన్ వాహనాల్లో పని చేసే 2,900 ఉద్యోగులను తొలగించారు. బేవరేజ్ కార్పొరేషన్లోని 18 వేల మందిని తొలగించారు. తొలగించటమే తప్ప చంద్రబాబు ఇచ్చేదేమీ ఉండదు. గ్రూప్-2 కోసం ఏళ్లుగా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నిరుద్యోగుల జీవితాలతో లోకేష్ బంతాట ఆడుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి పేరుతోనూ మోసం చేశారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి కేటాయింపుల్లేవ్. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదు’’ అంటూ తాటిపర్తి చంద్రశేఖర్ దుయ్యబట్టారు. -
‘ఉగాది రోజు కూడా చంద్రబాబు అబద్ధాలు’
తిరుపతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పండుగ నాడు కూడా అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జనం నవ్వుతున్నారని సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ‘జగనన్న పాలనలో ప్రతి పేదవాడు,ఉద్యోగి, రైతు, సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ అని ,మ్యానిఫెస్టోలో పెట్టారు. సూపర్ సిక్స్తో సూపర్ మోసం చేశారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు 1500 ఇస్తామని,మోసం చేశారు. రైతులుకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎక్కడైనా ఇచ్చారా..? ఏవిధంగా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎవరు సంతోషంగా లేరు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సిగ్గులేని బీఆర్ నాయుడు.. చైర్మన పదవి నాకు ఏమైనా అన్నం పెడుతుందా అంటాడు.. హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి అంటాడు.. అర్హత లేని వాళ్లకు గౌరవం ఇస్తే ఇలానే ఉంటుంది.. రాజీనామా చెయ్.. బీఆర్ నాయుడు లాంటి అర్హత లేని వాళ్లను తరిమి తరమి కొట్టాలి’ అని ఆర్కే రోజా విమర్శించారు. -
తినేది పెరుగన్నం నిమ్మకాయ బద్ద ఆస్తులు మాత్రం 20 లక్షల కోట్లు.. శ్రవణ్ షాకింగ్ నిజాలు
-
మీరు ఎంత అడ్డుకున్నా.. అది జరగినివ్వం బాబుపై నిప్పులు చెరిగిన కాకాణి
-
ఒక రోజు వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త.. పిన్నెల్లి మాస్ వార్నింగ్
-
పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవి
ఉగాది పండుగ నాడు హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక వైభవంగా జరిగింది. ఉగాది అనగానే గతంలో చిత్రసీమ సినీ పురస్కారాలు ఘనంగా జరిగేవి. అయితే, పలు కారణాలతో సుమారు 13ఏళ్లుగా ఈ పురస్కారాలకు టాలీవుడ్ నోచుకోలేకపోయింది. అయితే, గతేడాది నుంచి సినిమా రంగంలోని ప్రతిభకు పట్టం కడుతూ తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ను అందిస్తూ వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి, ఆర్.నారాయణమూర్తి ప్రసంశించారు. సినిమా నటీనటులను గుర్తించడంలో పక్క రాష్ట్రం వెనుకంజలో ఉందని చిరు అన్నారు.కాంతారావు పురస్కారాన్ని అందుకున్న ఆర్.నారాయణమూర్తి ఇలా అన్నారు. సినిమా అవార్డ్స్ కోసం పదమూడేళ్లపాటు చిత్ర పరిశ్రమ ఎదురు చూసింది. అయితే, సూపర్స్టార్ కృష్ణ అభిమాని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ చూపించి గతేడాది నుంచి మళ్లీ అవార్డ్స్ ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు సినిమా ఉనికిని గుర్తించి, కళాకారుల్ని గౌరవించినందుకు నా అభినందనలు. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్గార్ల తర్వాత మూడో హీరో కాంతారావుగారు. తెలంగాణ గడ్డ బిడ్డ ఆయన. జానపద హీరో. తెలుగు ఎంజీఆర్ ఆయన. ఎలాంటి పాత్ర వేసినా రామారావుగారి తర్వాత మెప్పించిన గొప్ప నటుడాయన. అలాంటి కాంతారావుగారి అవార్డుని నాకు ఇచ్చి, నా జన్మధన్యం చేసిన రేవంత్ రెడ్డిగారికి థ్యాంక్స్.'చంద్రబాబునాయుడు గారు... మీకు దండం పెడుతున్నా. మీరు చాలా పెద్దవారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిగారు దూసుకెళ్లిపోతున్నారు. చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటూ, గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చుకుంటూ... ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి, గౌరవించి మీరు కూడా దయ ఉంచి నంది అవార్డులు ఇవ్వండి సార్.. ఇండస్ట్రీని ప్రోత్సహించండి.' అని ఏపీ ప్రభుత్వం గురించి నారాయణమూర్తి అన్నారు.పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవిఎన్టీఆర్ జాతీయ అవార్డుగ్రహీత చిరంజీవి ఏపీలో చిత్ర పరిశ్రమ గురించి ఇలా అన్నారు. 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’కి మూలం అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారికి, మంత్రి జూపల్లిగారికి అభినందనలు చెబుతున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవింపబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. ఈ మాటల ఆదర్శంతో ఆగిపోయిన ఈ అవార్డుల పంపిణీకి పునరుజ్జీవం పోసిన రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు.పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల, వాళ్లని ఉత్సాహపరిచే విధానంలో కొంచెం వెనుకంజలో ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్లకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు తెలంగాణ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని, మరింత ప్రోత్సహిస్తే కనుక ఎంతో మంది యంగ్స్టర్స్ మరిన్ని సినిమాలు చేస్తారు. రాష్ట్రానికి సినిమా రెవెన్యూ కూడా సమకూరుతుంది.' అన్నారుహాలీవుడ్ సినిమా అంటే ఎవరికైనా సరే అమెరికానే గుర్తొస్తుందని చిరంజీవి అన్నారు. కానీ, ఇండియన్ సినిమా అంటే హైదరాబాద్–తెలంగాణ గుర్తుకు రావాలనే ముఖ్యోద్దేశంతో రేవంత్ రెడ్డిగారు చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీవైపు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానని సీఎంతో అన్నారు. -
సాయం అందక వ్యాపారం సాగక!
రెండేళ్లుగా అర్హులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరవు గత ప్రభుత్వంలో ‘జగనన్న తోడు’ ద్వారా ఆర్థిక భరోసా ఏటా సున్నా వడ్డీకే రూ.10 వేలు అందించి తోడ్పాటు నేడు కూలీలుగా మారుతున్న చిరువ్యాపారులు చంద్రబాబు ప్రభుత్వంలో చిరు వ్యాపారులకు మొండిచెయ్యి చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టాక చిరువ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. అన్ని వర్గాల ప్రజలతో పాటు వీరు కూడా ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో అనేక వాగ్దానాలు చేసిన చంద్రబాబు.. గద్దెనెక్కాక ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా రూ.10 వేలు చొప్పున వడ్డీలేని రుణ సాయం అందేది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేయడంతో పేద ప్రజలకు ఆర్థిక భరోసా కరవై.. వారి జీవన ప్రమాణాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి.సబ్బవరం: అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో రోడ్ల పక్కన, ప్రధాన కూడళ్లలోని బహిరంగ ప్రదేశాల్లో తోపుడు బండ్లు, చిన్న చిన్న బడ్డీలపై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు చాలా మంది ఉన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 248 డ్వాక్రా సంఘాల్లోని అర్హులైన 450 మందికి ఏటా రూ.10 వేలు చొప్పున జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీలేని రుణ సాయం రూ.45 లక్షలు అందేది. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా స్వయం ఉపాధి రుణాలు నిలిపేసింది. దీంతో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వయం ఉపాధికి తూట్లుబహరంగ ప్రదేశాలు, రోడ్లు, వీధుల్లో తోపుడు బండ్లు, చిన్న దుకాణాలు, సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, నెత్తిన గంపలతో ఇంటింటికీ తిరిగి పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిల్లర వర్తకులకు గత ప్రభుత్వంలో ఆర్థిక ఆసరా ఉండేది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల మంజూరు ఆశించిన మేర లేదు. దీంతో అర్హులు స్వయం ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. చిరువ్యాపారాలతో ఉపాధి పొందే వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటు లేకపోవడంతో వారి జీవన పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అన్న చందంగా మారాయి. కొంత మంది చిన్నచిన్న వ్యాపారాలను వదిలేసి కుటుంబ పోషణ కోసం కూలీల అవతారం ఎత్తుతున్నారు. గత ప్రభుత్వంలో సున్నా వడ్డీకే రూ.10 వేలు గత ప్రభుత్వంలో జగనన్న తోడు పథకం ద్వారా గ్రామాల్లోని చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత అందేది. వలంటీర్ల ద్వారా అర్హులను గుర్తించి ఆయా గ్రామాల పరిధిలోని బ్యాంకుల నుంచి సున్నా వడ్డీకే రూ.10 వేలు అందించేది. బ్యాంకుల నుంచి లబి్ధదారుడు తీసుకున్న రుణానికి ప్రభుత్వమే వడ్డీ చెల్లించేది. ఇలా గత ప్రభుత్వంలో అందిన ఆర్థిక భరోసాతో చాలా మంది చిరు వర్తకులు తమ వ్యాపారాలను మెరుగుపర్చుకునేవారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా కనీస చొరవ కూడా చూపకపోవడంతో వీరంతా ఎప్పటిలానే వడ్డీ వ్యాపారులు, రోజువారీ ఫైనాన్స్ ఇచ్చేవారి బారిన పడి, అధిక వడ్డీలతో కుదేలవుతున్నారు. ఆ పథకం అమలు చేయాలి నేను శ్రీదుర్గసాయి గ్రూప్ సభ్యురాలిని. సబ్బవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గాయత్రీ టీనేజ్ పాయింట్ అనే చిన్న వ్యాపారం నిర్వహిస్తున్నా. జగనన్న ప్రభుత్వం అమలు చేసిన జగనన్న తోడు పథకం ద్వారా రూ.10 వేలు ఆర్థిక సాయం అందింది. నా వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశం లభించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తూ తీసుకున్న రుణాన్ని సకాలంలో పూర్తిగా చెల్లించాను. ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఆ పథకం అమలు చేస్తే బాగుండు. – గెడ్డం సూర్యకుమారి, బడ్డీకొట్టు వ్యాపారి, గెడ్డం వీధి -
భృతికి తూట్లు.. కన్సల్టెంట్లకు కోట్లు
సాక్షి, అమరావతి: ఒకపక్క ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతూ.. భృతి ఎగ్గొడుతూ.. నిరుద్యోగుల ఆశలను చంద్రబాబు సర్కారు చిదిమేస్తోంది. మరోవైపు ఆ మేరకు ఉద్యోగాలను తిరిగి భర్తీ చేయకుండా డ్రామాలాడుతోంది. రాష్ట్రంలో దాదాపు 1.72 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించేసి.. కేవలం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అంటూ సరికొత్త నాటకానికి తెర తీయడంపై యువత మండిపడుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3,000 చొప్పున భృతి చెల్లిస్తామని సూపర్ సిక్స్లో ప్రధానంగా హామీ ఇవ్వడంతోపాటు ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటింటికీ బాండ్లు పంచారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా భృతి కోసం పైసా కూడా కేటాయించకుండా రూ.21,600 కోట్లు ఎగ్గొట్టి తాజాగా జాబ్ క్యాలెండర్, పోస్టుల భర్తీ అంటూ మభ్యపుచ్చే యత్నాలకు దిగారు. నిజానికి చంద్రబాబు సర్కారు నిరుద్యోగ యువతకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టింది. మరోవైపు కన్సల్టెంట్ల పేరుతో పలుకుబడి కలిగిన వారికి ప్రజాధనాన్ని పంచి పెడుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల బడ్జెట్ సమావేశాల చివరి రోజు స్వయంగా ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టిన ద్రవ్య విధాన పత్రంలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ఖాళీ పోస్టులు 1.72 లక్షలు.. ప్రతి ఆర్థిక ఏడాది బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను ద్రవ్య విధాన పత్రం ద్వారా వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2024 మార్చి నాటికి (వైఎస్ జగన్ హయాంలో) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 11,79,332 మంది ఉన్నట్లు తాజా ద్రవ్య విధాన పత్రంలో ఆర్థిక మంత్రి వెల్లడించారు. మరోవైపు 2025 డిసెంబర్ నాటికి (చంద్రబాబు ప్రభుత్వంలో) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 10.07 లక్షలు మాత్రమేనని ద్రవ్య విధాన పత్రంలో తెలియచేయడం గమనార్హం. అంటే చంద్రబాబు పాలనలో ఉద్యోగుల సంఖ్య ఏకంగా 1.72 లక్షలు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయకుండా జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు సర్కారు కళ్లుగప్పుతోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. కన్సల్టెంట్లకు రూ.3,054.78 కోట్లు నిరుద్యోగ భృతిని సీఎం చంద్రబాబు ఒక భ్రాంతిగా మార్చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచకపోగా లక్షలాది మంది వలంటీర్లతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించేసింది. వారి పొట్టగొట్టి ఏటా రూ.1,500 కోట్లను మిగుల్చుకుంది. ఒకపక్క నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా వృత్తిపరమైన సర్వీసుల పేరుతో పలుకుబడి కలిగిన వారిని భారీ సంఖ్యలో కన్సల్టెంట్లగా నియమించుకుంది. ఈ విషయం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ద్రవ్య విధాన పత్రంలోనే స్పష్టమైంది. చంద్రబాబు సర్కారు వృత్తిపరమైన సర్వీసుల పేరుతో ఏకంగా 54,903 మందిని కన్సల్టెంట్లగా నియమించుకుంది. వారికి వేతనాల రూపంలో ఏడాదికి ఏకంగా రూ.3,054.78 కోట్లు చెల్లిస్తోంది. వలంటీర్లపై వేటు.. ఔట్ సోర్సింగ్ ఔట్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,71,167 మంది వలంటీర్లు ఉండగా వారికి వేతనాల కింద ఏడాదికి రూ.1,500 కోట్లు చెల్లించినట్లు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి సమర్పించిన ద్రవ్య విధాన పత్రంలో చంద్రబాబు సర్కారు తెలిపింది. మరోపక్కతమకు ఇష్టంలేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేసింది. గత ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 96,675 మంది ఉండగా చంద్రబాబు సర్కారు అసెంబ్లీకి సమర్పించిన ద్రవ్య విధాన పత్రంలో వారి సంఖ్య గతేడాది డిసెంబర్ నాటికి 87,681కి తగ్గిపోయినట్లు తెలిపింది. అంటే చంద్రబాబు సర్కారులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 8,994 మంది తగ్గిపోయారు. చిరుద్యోగుల పొట్టగొట్టి పలుకుబడి గల పెద్ద వ్యక్తులను కన్సల్టెంట్లుగా నియమించుకోవడమే లక్ష్యంగా కూటమి సర్కారు పాలన సాగిస్తోంది. ఇక గతంతో పోలిస్తే జిల్లా ప్రజా పరిషత్ ఉద్యోగులతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశ వర్కర్లు, ఔట్ సోర్సింగ్ వర్కర్లు కూడా గణనీయంగా తగ్గిపోయారు.ఇది పచ్చి మోసం లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలను తొలగించేసి, కేవలం 10 వేల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని చూపడం దుర్మార్గం. 6 లక్షలపైన గ్రూప్–2 అభ్యర్థులు ఏళ్ల తరబడి చదువుతుంటే 750 పోస్టులు ప్రకటించడం, 11 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని డీజీపీ ప్రకటించినా, 2,778 పోస్టులే ప్రకటించడం ఏమిటీ? గత ప్రభుత్వంలో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 243 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులిచ్చినా, ఇప్పటిదాకా భర్తీకి చర్యలు చేపట్టలేదు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు అధికారంలోకి వచ్చిన ప్రతి సారీ పెంచుతూ యువతను తీవ్రంగా మోసం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేసిన మంత్రి లోకేశ్కు ఇప్పుడు ఆ ఖాళీలు కనిపించడం లేదా? నిరుద్యోగుల సత్తా చూపుతాం. – రామచంద్ర ఏంబేటి, నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడువ్యాయామ విద్య పోస్టులు ఏమయ్యాయి? జాబ్ క్యాలెండర్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. పాఠశాల వ్యాయామ విద్య విభాగంలో ఎలాంటి ఖాళీలు చూపకపోవడం శోచనీయం. అనేక సందర్భాలలో ప్రభుత్వ పెద్దలు ఎన్నో వేదికలపై క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పడం తప్ప, ఆచరణలో మాత్రం అది కనిపించలేదు. ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే పీఈటీ పోస్టులను, విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలలకు పీడీ పోస్టులు కొత్త డీఎస్సీలో భర్తీ చేయాలి. దశాబ్ద కాలంగా భర్తీకి నోచుకోని పీడీ జూనియర్ లెక్చరర్, పీడీ డిగ్రీ లెక్చరర్ పోస్టులనూ మంజూరు చేయాలి. – కె.నరసింహారెడ్డి, ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడుఆ పోస్టులన్నీ ఇప్పుడేవీ? » ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, గత ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ప్రతిపక్షంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ విమర్శించారు. గ్రూప్–1, 2 పోస్టులు 2 వేలు, ఇంజినీరింగ్ పోస్టులు 20 వేలు, టీచర్ పోస్టులు 25 వేల ఖాళీలు ఉన్నాయని ప్రచా రం చేశారు. కానీ ఇప్పుడు అతి స్వల్పంగానే పోస్టు లను ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. » గతేడాది ఆగస్టు 31 నాటికి హోం శాఖలో 11,639 పోస్టులు వివిధ కేడర్లో ఖాళీలు ఉన్నట్టు డీజీపీ కార్యాలయం హోం శాఖ ముఖ్య కార్యదర్శికి వివరాలు అందించింది. ఈ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు హైకోర్టును సైతం ఆశ్రయించారు. నిర్ణీత గడువులోగా పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఆదేశించింది. » అయితే తాజా క్యాలెండర్లో హోంశాఖలో 2,778 పోస్టులను మాత్రమే చూపారు. మరి మిగిలిన 10 వేల పోస్టులు ఆరు నెలల కాలంలో ఎక్కడికిపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం 2024 జూన్ 12న డీఎస్సీపై తొలి సంతకం చేశారు. సగానికి సగం పోస్టులు దాచేసి ఏడాదిన్నర తర్వాత డీఎస్సీ నిర్వహించారు. » గతంలో పాఠశాల విద్యా శాఖలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రచారం చేసినవారు ప్రస్తుత క్యాలెండర్లో పాఠశాల విద్య, ఇంటర్ విద్యలో కేవలం 3,004 పోస్టులు ప్రకటించడం ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీఈ–2009 చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో స్పెషల్ టీచర్ ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో దాదాపు 2,500 స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని 2024లోనే ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం » గ్రామ, పట్టణ ప్రజలకు వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందించేందుకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. నిర్వహణ కోసం 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థను నాశనం చేయడం ప్రారంభించింది. » దాదాపు 30 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖల్లో డెప్యుటేషన్పై తరలించారు. ఉద్యోగులను ఇష్టారాజ్యంగా వివిధ శాఖల్లో విలీనం చేస్తున్నారు. డిపార్ట్మెంట్లలో ఉద్యోగులకు అడహక్ పదోన్నతులు కల్పిస్తూ ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా మోసమేనని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. ఒక్క డీఎస్సీ నిర్వహణనే ఏడాదిన్నర కాలం సాగదీసిన కూటమి ప్రభుత్వం ఈ పోస్టుల నోటిఫికేషన్లు ఇవ్వడం నుంచి పోస్టుల భర్తీ వరకు భంగపాటు తప్పదని చెబుతున్నారు. » గత ప్రభుత్వం ఉన్నత విద్యలో యూనివర్సిటీల్లో 3,220 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కోర్టు కేసుల నెపంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి, కేవలం 1,500 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం మోసమే. -
షర్మిల మాటలు హద్దులు దాటుతున్నాయి: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గత మూడు, నాలుగేళ్లుగా షర్మిల, సునీత.. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న షర్మిలమ్మ మాట్లాడిన మాటలు హద్దులు దాటాయన్నారు. కనీస ఆలోచన లేకుండా హద్దులు దాటి సొంత అన్నపై వ్యక్తిత్వ దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్సార్ కుమార్తె, జగన్కు చెల్లెలు కదా అని మేం చాలా వరకూ మిన్నకుండిపోయాం. ఆమె నిన్న మాట్లాడుతూ అన్న అనే పదానికే నువ్వు కలంకం అన్నారు. ఈ మాట మమ్మల్ని చాలా బాధించింది. బట్ట కాల్చి మసి మీ అన్న ముఖాన వేసి తుడుచుకో అంటే ఒప్పుకోరు తల్లీ. అన్న అనే పదానికే ఆయన అనర్హుడు అన్న తర్వాత మీ అన్న మీకు చేసిన అన్యాయం ఏంటో మీరు చెప్పాలి. నువ్వు ఏదేదో మాట్లాడి బురద జల్లి పోతానంటే కుదరదు. నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏంటో స్పష్టంగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.’’ అని రాచమల్లు పేర్కొన్నారు.‘‘మీ అన్నపై ఇంతటి విషాన్ని చిమ్మడానికి ఏం కారణం..? ఏమి నీకు అన్యాయం జరిగింది..?. నాలుగు గోడల మధ్య ఏదైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాల్సింది. పోయి పులివెందుల పూల అంగళ్ల సర్కిల్లో పరిచినారు. మీ ఇంట్లో ఏదైనా చర్చించుకుంటే మరుసటి రోజే ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్గా వస్తుంది. ఇవన్నీ వారికి ఎవరు చెప్తున్నారు. షర్మిల, సునీతల ఫోన్లు పరిశీలిస్తే ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబుతో టచ్లో ఉన్న విషయం ఇట్లే బయటపడుతుంది. మీ తండ్రి చనిపోతే సంతోషించిన చంద్రబాబు లాంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా?. అన్న అనే పదానికే కళంకం తెచ్చాడంటున్న నీవు నీకు ఏ విషయంలో అన్యాయం చేశాడు..?’’ అంటూ రాచమల్లు ప్రశ్నించారు.‘‘ఆస్తి విషయంలో చేశాడా..? అధికారం విషయంలో అన్యాయం చేశాడా..?. వైఎస్సార్ 2004లో అఫిడవిట్లో చూపించిన ఆస్తులు 2009లో లేవు. ఈ మధ్య కాలంలో రాజశేఖరరెడ్డి తన ఆస్తులను నీకు, జగన్కు పంచేశారు. మీ తండ్రి చట్ట ప్రకారం మీ అన్నకు, నీకు సమానంగా ఆస్తులు పంచారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇళ్లు షర్మిలమ్మకే ఇచ్చారు. ఇడుపులపాయలో 51 ఎకరా వ్యవసాయ భూమిని షర్మిల పేరుతో రిజిస్టర్ చేయించారు. 15 మెగావాట్ల ఎస్సారెస్ స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఆమెకే ఇచ్చారు. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టునూ ఆమెకే ఇచ్చాడు...విజయవాడ యువరాజ్ థియేటర్లో 36 శాతం భాగం షర్మిలమ్మకే రాసిచ్చాడు. పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని ఆమెకే రాసిచ్చారు. విజయలక్ష్మి ట్రేడ్ అండ్ మినరల్స్ వంద శాతం వాటా ఆమెకే ఇచ్చేశారు. రాజారెడ్డి గారి హయాం నుంచి రైల్వే కోడూరులో ఉన్న ఇంటిని కూడా ఆమెకే రాసిచ్చాడు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుంటలో 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమెకే ఇచ్చారు. ఇలా నీకు సగం వాటాను ఇస్తుంటే అంగీకరించడం అనేది జగన్ గొప్పతనం. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టారు కాబట్టి మీ అన్న ఒప్పుకున్నాడు అంటే సరే.. మీ వదిన ఎలా ఒప్పుకుంది..?..సమాజంలో ఏ ఇంటి కోడలూ ఆడబిడ్డకు సమాన ఆస్తి ఇస్తే అంగీకరిస్తుందా..?. అయినా భారతమ్మ ఒప్పుకున్నారు అంటే మీ తండ్రి, మీ అన్న కంటే వెయ్యి రెట్లు ఆమె గొప్పది. ఇన్ని ఆస్తులు తీసుకున్నందుకేనా వైఎస్ జగన్ అన్న అనే పదానికి కళంకం...?. వైఎస్సార్ మరణించినప్పటి నుంచీ నువ్వు జగన్తో విభేదించే వరకూ తాను సంపాదించుకున్న దాంట్లో జగన్ నీకు రూ.236 కోట్లు ఇచ్చారు...అయినా మీరు ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మా అన్న దుర్మార్గుడు అంటున్నారు. మీ అన్న ముఖ్యమంత్రిగా చేసిన పనులకు దేశమంతా పొగుడుతుంటే నువ్వు విమర్శలు చేశావు. అవన్నీ చాలవన్నట్లు వివేకానందరెడ్డి హత్య రక్తపు మరకలను జగన్ నెత్తిన వేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ఇంత నిందలు వేస్తావా..?. ఇవన్నీ చాలవన్నట్లు చంద్రబాబుతో చెలిమి చేస్తూ.. ఏబీఎన్ రాధాకృష్ణకు ఉప్పందించి బజారుకీడుస్తావా...?. నీకు ఎక్కడ న్యాయం ఉంది.. ఎక్కడ కృతజ్ఞత ఉందమ్మా నీకు..?. నీ స్థానంలో ఏ చెల్లి ఉన్నా జగన్ లాంటి అన్నను గుండెల్లో పెట్టుకుని ఉండేవారు...నువ్వు కొంగుపట్టుకుని జగన్కి, అవినాష్కి ఓటు వేయవద్దని పులివెందుల పూలఅంగళ్ల సర్కిల్లో అర్థించావు. అవినాష్ రెడ్డి వివేకాను చంపి ఉంటే నాకు ఓటు వేయండి.. లేదంటే అవినాష్కు ఓటు వేయండి అని కొంగుపట్టి మరీ అడిగావు. నువ్వు చెప్పిన మాటలు ప్రజలు నమ్మారా? అవినాష్రెడ్డి గెలిచాడు. నువ్వు చెప్పిన తప్పుడు మాటల వల్ల జిల్లాలో మేం ఐదుమంది ఎమ్మెల్యేలం ఓడిపోయాం. నీ లెక్క ప్రకారం వివేకా హత్యలో అవినాష్రెడ్డికి సంబంధం లేదని ప్రజలు నమ్మారు కాబట్టే ప్రజలు ఆయన్ను గెలిపించారు...అంతటితో ఆగకుండా చంద్రబాబు ఏ కీ ఇస్తే దాన్ని సునీతమ్మ మాట్లాడుతుంది. మూడు నాలుగు రోజుల తర్వాత మీరొచ్చి అవే మాటలు మాట్లాడతారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనేదే మీ లక్ష్యం. నీకు ఆస్తి పంపకానికి ఒప్పుకుని, సొంతంగా డబ్బిచ్చి.. తన సొంత ఆస్తుల నుంచి కూడా నీకు భాగాలిస్తే.. నీకు సంతృప్తి లేదు. సరస్వతి భూముల విషయంలో ఆమె చేసిన వ్యవహారం వింటే చాలా బాధ కలుగుతుంది...జగన్పై కేసుల కారణంగా ఆ భూములు అటాచ్మెంటులో ఉంటే.. దానిలోని విజయమ్మ పేరుపై ఉన్న భూములను తన పేరుపై రాయించుకోవాలని చూశారు. దాని కోసం ఆ షేర్ కాగితాలు పోయాయని కేసు పెట్టి.. ఆ తర్వాత విజయమ్మ ఆస్తిని తన పేరుపై బదలాయింపు చేసుకుంది. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తిని బదలాయింపు చేయకూడదని అందరికీ తెలుసు. అలా చేస్తే వైఎస్ జగన్ బెయిల్ రద్దు అవుతుందని కూడా అందరికీ తెలుసు. అయినా బదలాయింపు చేశావంటే.. మీ అన్న మళ్లీ జైలుకు పోవాలనేగా..?..పగోడు పదహారు నెలలు జైల్లో పెడితే.. చెల్లెలు 32 నెలలు జైల్లో పెట్టాలనుకుంది. వైఎస్ జగన్ ఆ విషయం తెలుసుకుని ఎన్సీఎల్టీకి వెళ్లి జాగ్రత్త పడ్డాడు. ఆ కేసులో షర్మిలమ్మ ఓడిపోయింది. మళ్లీ విజయమ్మతో చెన్నై కోర్టులో కేసు వేయించింది. ఆ కేసు కాగితాలు చెన్నై కోర్టులో వేయించిన గంటకే చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయం చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలకు తెలుసు. షర్మిల, సునీతలు జగన్కు ఒక్క చెల్లెల్లే. కానీ రాష్ట్రంలో కోటి మంది మహిళలు ఆయనకు ఓటేశారు. వారంతా వైఎస్ జగన్ మాకు దేవుడిచ్చిన అన్న అంటున్నారు...వాళ్లంతా దేవుడిచ్చిన అన్న అంటుంటే రక్త సంబంధం కలిగిన నీకు మాత్రం కళంకితుడా..?. ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ, సునీతలను చూసిన తర్వాత చెల్లెల్లు అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. నీలాంటి చెల్లెలు కావాలని ఏ అన్నా కోరుకోడు. వారి వారి స్థాయిని బట్టి నువ్వొక్కదానివే కాదు. .మేమంతా పార్టీ కోసం కష్టపడ్డాం. షర్మిలమ్మ జగన్తో గొడవ పడకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి పదవినే పంచాలి. అప్పుడే ఆమె శాంతిస్తుంది. ఇప్పుడు జగన్ పెట్టుబడులు, ఆస్తులు మొత్తం ఊడ్చి షర్మిలకు ఇస్తే అప్పుడు శాంతిస్తుందేమో..?. ఎక్కడన్నా జగన్ వ్యాపారాల్లో నువ్వు పెట్టుబడి పెట్టావా..? ఏమీ లేకపోయినా తన సొంత సంపాదనలో నీకు వాటా ఇచ్చాడు...మీరు టీడీపీ కండువా కప్పుకోకపోయినా.. సైకిల్ ఎక్కకపోయినా మీరు మాత్రం టీడీపీనే. వైఎస్సార్ కూతురు ఇలా టీడీపీకి వెళ్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. రాష్ట్రంలో చంద్రబాబు ఇన్ని తప్పులు చేస్తున్నా, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా ఆమె ఒక్క మాట కూడా విమర్శించదు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రశ్నించాల్సిన నువ్వు జగన్ను టార్గెట్ చేస్తున్నావు. ఇక మీదట మీరు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎన్ని సార్లైనా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఇక మా దృష్టిలో మీరు రాజశేఖరరెడ్డి కూతురు అని కానీ, జగన్ చెల్లెలు అని కాని ఉండదు. నాకైతే నువ్వు ఒక చెడ్డ చెల్లెలు అనే అభిప్రాయం మాత్రమే ఉంది. ఇంత మేలు చేసిన అన్నను పట్టుకుని అన్ననే పదానికే కళంకం అంటావా..?..చంద్రబాబుకు ఒక చెల్లెలు ఉందన్న విషయమే ప్రపంచానికి తెలియదు. అలాంటి చంద్రబాబు వద్దకు మాకు న్యాయం చేయండి అని ఈ చెల్లెల్లు వెళ్లారు. ఇదిగో నా చెల్లెలు షర్మిల.. నేను వదిలిన రామబాణం అని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జగన్. నువ్వు ఇన్ని మాటలు ఆయన్ను మాట్లాడుతున్నా ఒక్క రోజు కూడా జగన్ నీపై నోరెత్తలేదు. అది ఆయన సంస్కారం.. నా చెల్లిపై మాట్లాడితే అది నాకే కదా అవమానం అనుకున్నాడు జగన్. కానీ మీరు ఒకే సారి వంద ఈటెలు తీసుకుని పొడిచినట్లు చేస్తున్నారు...తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబూ అసలు నీ చెల్లెలు ఎవరో ఈ సమాజానికి తెలుసునా..?. చంద్రబాబుకు తమ్ముడున్నాడని తెలుసు.. ఆయన ఎలా చనిపోయాడో కూడా ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు కుటుంబ వ్యవస్థపై గౌరవం ఉందా..? అలా ఉంటే హరికృష్ణకు, ఆయన పిల్లలకు అన్యాయం చేస్తాడా?. సొంత వారినే మోసం చేసిన చంద్రబాబు.. షర్మిలమ్మ, సునీతమ్మలకు న్యాయం చేస్తాడా..?. మీ ఇద్దరిని నడి ఏట్లోకి తీసుకెళ్లి ముంచేస్తాడు.. గుర్తుంచుకోండి...5 కోట్ల మంది ప్రజలను, సొంత కుటుంబ సభ్యులను మోసం చేసిన చంద్రబాబుకు షర్మిల, సునీతలను మోసం చేయడం ఒక లెక్కా?. ఆ చంద్రబాబు చేతిలో మోసం పోయి చిట్టచివరకు మళ్లీ ఆ అన్న వద్దకే మీరిద్దరూ చేరతారు. అన్నా.. తప్పయిందని ప్రాయశ్చిత్తం మీ అన్నా, వదిలనల వద్దకే వచ్చే రోజు ముందుంది. షర్మిలమ్మ.. అన్నతో సమానంగా వైఎస్సార్ ఆస్తులు పంచిన విషయంపై సమాధానం చెప్పాలి. నీకు అవసరం అయినప్పుడల్లా రూ.236 కోట్లు ఇచ్చినది నిజమా? కాదా? అనేది షర్మిల చెప్పాలి. జగన్, భారతీలు వివేకాను చంపారని మీరు మీ పిల్లలపై ఒట్టేసి చెప్పగలరా?. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా.. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా సునీత, షర్మిల తెరమీదకు వస్తారు...నిజంగా షర్మిలమ్మకు చిత్తశుద్ధి ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మాట్లాడితే నీ సైతాన్ సైన్యం అంటున్నారు.. కానీ నువ్వు జగన్కు రక్తం పంచుకుపుట్టిన చెల్లివి అయినా.. మేం రక్తం పంచుకోకపోయినా చివరికి వరకూ ఆయన కోసం, ఆయన వెంటే ఉంటాం. ఆస్తులకు మీరు భాగస్థులు.. కానీ మేం అభిమానానికి భాగస్థులం.. సైతాన్ సైన్యం కానే కాము. జగన్ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మమ్మల్ని పట్టుకుని సైతాన్ అంటారా..?. మన ఇంటి గుట్టును ఏబీఎన్ రాధాకృష్ణకు, చంద్రబాబుకు ఇస్తున్న మీరు తప్పు చేసిన మనుషులు. అన్ననే పదానికి కళంకం అన్నందుకు బాధతో మేం మాట్లాడుతున్నాం. అన్న అనే పదానికి, వదిన అనే పదానికి అర్థం చెప్పిన వాళ్లు జగన్, భారతమ్మలు. షర్మిలమ్మ ప్రెస్మీట్ పెట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. -
అబద్దంలా నక్షత్రం.. వెన్నుపోటు రాశి.. చంద్రబాబుకు వరుదు కళ్యాణి కౌంటర్
-
‘కూటమి నేతలకు రాజపూజ్యం.. ప్రజలకు అవమానం’
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం అబద్ధాల నక్షత్రంలో వెన్నుపోటు రాశిలో ఏర్పడిందని.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి నేతల ఆదాయం పెరిగింది.. పేద ప్రజల ఆదాయం పెరగలేదు. కూటమి మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్యపూజ్యం.. ప్రజలకు అవమానం. నిరుద్యోగులు, రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులను కూటమి మోసం చేసింది’’ అని వరుదు కల్యాణి మండిపడ్డారు.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. రైతులకు పెట్టుబడిసాయం లేదు.. గిట్టుబాటు ధర లేదు. మహిళలకు ఎన్నోహామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయలేదు. మహిళల రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. ఉద్యోగుల పరిస్థితి కక్కలేక.. మింగలేక అన్నట్టు ఉంది. కూటమి పాలన అత్యంత దారుణంగా ఉంది. ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు మోసానికి మరోసారి గురికావద్దని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం’’ అని వరుదు కల్యాణి పేర్కొన్నారు.ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు: కల్పలతారెడ్డివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏవర్గం ప్రజలు పండగ చేసుకోలేదని.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఉగాది కాదు దగాదిగా భావిస్తున్నారు. ఈ ఉగాదికి అయినా మేలు జరుగుతుందని ఉద్యోగులు ఆశించారు. పీఆర్సీ, ఐఆర్, డీఏకి సంబంధించిన జీవోలు విడుదల చేస్తారని ఆశించారు. వెయ్యి రూపాయిలు కూడా ప్రభుత్వం వేతనం పెంచలేదు..అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి చేస్తామని చెప్పారు. మంచి ఐఆర్ అన్నారు, పెండింగ్ బకాయిలు అని ఉద్యోగులను మోసం చేసింది. ఉద్యోగస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి పండగకి ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నారు. పండగ వచ్చి పొతుంది తప్ప ఒక్క మేలు మాత్రం జరగడం లేదు. గతంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. కరోనా సమయంలో 23శాతం పిట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగస్తులు రోడ్డెక్కుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పీఆర్సీ కమిషన్ని నియమించాలని కోరుతున్నా కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. పిఆర్సీ కమిషన్ని త్వరగా నియమించాలి. పిఆర్సీ ఆలస్యం అయితే ఐఆర్ ప్రకటించాలి. 29 శాతం పిఆర్సీని అమలు చేయాలి. ఉద్యోగస్తులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి’’ అని కల్పలతారెడ్డి డిమాండ్ చేశారు. -
ఎన్నికల్లో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబుదే: సతీష్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శిస్తే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను ఎల్లో మీడియా హైలైట్ చేస్తోందన్నారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో షర్మిల, సునీత పావులు అని విమర్శించారు. జగన్తో యుద్ధం చేయలేక చంద్రబాబు.. షర్మిల, సునీతను వాడుకుంటున్నారని ఆరోపించారు. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబు ఇచ్చినదే అని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిలకు ఏనాడూ ఎల్లో మీడియా వార్తలు రాయలేదు. వైఎస్ జగన్ను షర్మిల విమర్శిస్తే మాత్రం పెద్ద అక్షరాలతో వార్తలు రాస్తారు. వైఎస్సార్ బతికున్నప్పుడే షర్మిలకు ఆస్తి రాసిచ్చారు. జూబ్లీహిల్స్లో ఇల్లు, ఇడుపులపాయలో భూమి, హైడ్రో ప్రాజెక్టు, స్వస్తి హైడ్రో ప్రాజెక్టులో వాటా.. ఇలా అనేక ఆస్తులు రాసిచ్చారు. కొడుకు కన్నా షర్మిలకే వైఎస్ఆర్ ఎక్కువ ఆస్తి ఇచ్చారు. ఇప్పుడు జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తిలో కూడా వాటా కావాలని అడగటం అన్యాయం. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబు ఇచ్చినదే. షర్మిల లాంటి చెల్లెలు తమకు వద్దని సామాన్యులు కూడా అనుకుంటున్నారు.దస్తగిరి అనే వ్యక్తి వివేకానంద రెడ్డిని హత్య చేశారు. వివేకానందరెడ్డికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇమేజ్కి దెబ్బ తగలకూడదని అవినాష్ భావించారు. ఇప్పటికీ సునీతక్క, వివేకం పెదనాన్న అనే అవినాష్ మాట్లాడతారు. అవినాష్ అంత ప్రేమను చూపిస్తుంటే సునీత మాత్రం వివేకా పేరును చెడగొడుతోంది. సీబీఐతో విచారణ కావాలని పిటిషన్ వేసిందే సునీత. ఆమె కోరిక ప్రకారం సీబీఐ విచారణ జరిపింది. ఒక భూమి విషయంలో ఎర్ర గంగిరెడ్డి, వివేకానందరెడ్డికి వివాదాలు వచ్చాయని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిపై దాడి చేశాడని దస్తగిరి చెప్పాడు. వివేకానందరెడ్డిని హతమార్చే సమయంలో కొన్ని పేపర్ల కోసం వెతికారని కూడా చెప్పాడుఆ పేపర్లు ఏంటి? వివేకానంద రెడ్డికి ఇతర మహిళలతో ఉన్న సంబంధాలు ఏంటి?. అవినాష్ రెడ్డి జీవితంలో చిన్న మరక కూడా లేదు. కానీ అవినాష్ను అభాసు పాలు చేసేలా సునీత వ్యవహరిస్తున్నారు. ఎంపీ సీటు కోసం హత్య చేశారన్న షర్మిల మాటలు అవివేకం. వివేకా హత్య జరిగే సమయానికే అవినాష్ రెడ్డికి జగన్ సీటు ఇచ్చారు. వివేకా కూడా అవినాష్ గెలుపు కోసం ప్రచారం చేశారు. సునీత, చంద్రబాబు, షర్మిల, దస్తగిరి ఒక్కటే. వారందరికీ కోర్టులో వాదించేది ఒక్కరే న్యాయవాది. ఈ విషయాలపై చర్చించేందుకు మేము సిద్దమే. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి ఎందుకు వదిలేశారు?. ఏపీలో జగన్ను ఓడించటానికి చంద్రబాబు ఆడిన నాటకంలో షర్మిల పాత్రధారి. తాను చెప్పినట్టే సీబీఐ, సుప్రీంకోర్టు వినాలి అన్నట్టుగా సునీత వ్యవహరిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
చంద్రబాబుకు ఈసీ షాక్ పంచాయతీ ఓటర్ల లిస్ట్ తప్పనిసరి!
-
జైలు నుంచి పిన్నెల్లి విడుదల..
సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి నుంచి విడుదలయ్యారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో పిన్నెల్లికి వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. అయితే, జంట హత్యల కేసులో పిన్నెల్లిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు బనాయించిన సంగతి తెలిసిందే.జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం పిన్నెల్లి మాట్లాడుతూ..‘పెందుర్తి మండలంలో టీడీపీ వర్గాల గొడవలో నాపై అక్రమ కేసు బనాయించారు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇరికించారు. ఆనాటి ఎస్పీ సైతం ఈ హత్యలు ఇరువర్గాల పోరుగా తేల్చారు. అయినప్పటికీ మమ్మల్ని అన్యాయంగా జైలుకు పంపించారు. భవిష్యత్త్లో మాకు తప్పకుండా ఒక రోజు వస్తుంది. ఆరోజు దీని వెనుక ఎవరు ఉన్నారో బయటకు లాగుతాము, ఎవ్వరినీ వదిలిపెట్టే సమస్య లేదు. రాజకీయ నాయకులు, అధికారులు ఎవ్వరు ఉన్నా చట్టం ముందు నిలబెడుతాం. 99 రోజులు జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురిచేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
బాబు అవినీతికి రాచమార్గం క్యాపిటల్ తో కరప్షన్
-
పూటకో మాటతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కారు ఆటలు... జాబ్ కేలండర్ పేరిట లీకులిస్తూ మోసం
-
ఒక్క ప్రశ్నకైనా బదులివ్వగలరా?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారని పదేపదే రుజువవుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేవనెత్తిన అంశాలలో ఒక్క దానికైనా సునీతగానీ, షర్మిలగానీ జవాబివ్వగలరా అని ఆయన ప్రశ్నించారు. నిజాలకు పాతరేసి దర్యాప్తు సంస్థలను, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యమన్నట్లు వారి తీరు ఉందని రాచమల్లు బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలను సంధించారు. ధైర్యముంటే వాటికి జవాబివ్వాలని రాచమల్లు సవాల్ చేశారు. ఆ ప్రశ్నలిలా ఉన్నాయి.» వివేకా హత్య కేసులో అతి ముఖ్యమైన అంశాలను వదిలేసి సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ ఎందుకు తప్పుదోవపట్టిస్తున్నారు? ఎవరి ప్రయోజనం కోసం మీరు పనిచేస్తున్నారు? » సునీత కుటుంబం వివేకాకు చెక్పవర్ తీసేసి ఖర్చులకు డబ్బులు కూడా లేని పరిస్థితికి తీసుకురావడం నిజం కాదా? » సునీత తండ్రిని హత్య చేసింది తానేనని ఒప్పుకున్న దస్తగిరి దర్జాగా బయట తిరుగుతున్నా అతనికి మీరు మద్దతుగా నిలవడం వెనక మర్మమేమిటి? అతనిని శిక్షించాలని ఎందుకు కోరడం లేదు? » చంద్రబాబుకు, సునీతకు, దస్తగిరికి ఒకే న్యాయవాది ఎందుకు ఉన్నారు? అత్యంత ఖరీదైన న్యాయవాది లూథ్రాను దస్తగిరి బెయిల్ రద్దు కాకుండా సునీత నియమించడమేమిటి? » హత్యకు ముందు రోజు వివేకా అటెండర్ పండంటి రాజశేఖర్ను వివేకా భార్య సౌభాగ్యమ్మ, సునీత భర్త రాజశేఖర్ సెలవు ఇచ్చి మరీ కాణిపాకం ఎందుకు పంపించారు? » వివేకాను హత్య చేయడానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఆయన్ను హింసించామని దస్తగిరి చెప్పాడు. డాక్యుమెంట్లను వెరిఫై చేసుకున్న తర్వాతనే హత్య చేసినట్లు చెప్పాడు. హత్య చేశాక కూడా ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లినట్లు చెప్పాడు. రౌండ్ సీల్తో ఉన్న ఆ డాక్యుమెంట్లు ఏమిటి? వాటి గురించి మీరు ఎందుకు పట్టుబట్టడం లేదు? » హత్య జరిగిన చోట లేఖను సునీత భర్త రాజశేఖర్ ఎందుకు దాచినట్లు? లేఖలో విషయాలు ఎవరికీ చెప్పకుండా లేఖను దాచాల్సిందిగా పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించాల్సిన అవసరమేమిటి? » హత్య గురించి తెలియజేసే కీలకమైన వివేకా లేఖ గురించి సునీత సీబీఐకి రెండు రకాల స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చారు? అసలు సీబీఐ సునీతకు ఆ వెసులుబాటు ఎందుకు ఇచ్చినట్లు? » వివేకాకు అనేకమందితో అక్రమ సంబంధం ఉందని పేర్లతో సహా దస్తగిరి స్టేట్మెంట్లో ఉంది. ఆ మహిళల భర్తలు, పిల్లలు వివేకాపై కక్షపెంచుకున్నారని ఆ స్టేట్మెంట్లో ఉంది. వారిపై విచారణ ఎందుకు కోరడంలేదు? » వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయన జీవించి ఉంటే 30 నుంచి 40శాతం ఆస్తులను తన రెండో భార్యకు ఇచ్చేవారు. అందుకని ఇది మొదటిభార్య కుటుంబం చేసిన మర్డర్ ఫర్ గెయిన్ కాదా? ఈ కోణంలో మీరు ఎందుకు విచారణ కోరడం లేదు? » వివేకా రెండో భార్య షమీమ్కు, వివేకాకు మధ్య నడిచిన చాట్స్ను బయటపెట్టే ధైర్యం మీకు ఉందా? » షమీమ్ కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయించడానికి మీరు సిద్ధమేనా? » చంద్రబాబుతో కలసి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ను మీరు అనుకున్నట్లు నడిపిస్తుండడం నిజం కాదా? పలువురి చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడం అందుకు రుజువు కాదా? హిమకుంట్లకు చెందిన ఓ వ్యక్తిపై సునీత, ఆమె భర్త రాజశేఖర్ చెప్పినట్లు చెప్పాల్సిందిగా ఒత్తిడి చేయడం నిజం కాదా? » ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్లడం, విచారణను అడ్డుకోవడం.. గడచిన రెండు మూడేళ్లుగా సునీతకు ఇదే పని కదా? ఎవరి ప్రయోజనం కోసం విచారణ పూర్తికాకుండా అడ్డుకుంటున్నారు? » చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడమే మీ లక్ష్యమని రాష్ట్ర ప్రజలకు అర్ధమయ్యింది. వచ్చే ఎన్నికల వరకు ఈ కేసును లాగాలని, తద్వారా చంద్రబాబుకు మేలు చేయాలని మీరు పనిగా పెట్టుకున్నారు. మీరు చంద్రబాబు చేతిలో పావులుగా మారడం నిజం కాదా? -
‘ఇన్నర్’లో సీఐడీని చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదలాయించాలని కోరుతూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై వాదనలు ముగిశాయి. అలాగే ఈ కేసులో చంద్రబాబుకు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆళ్ల దాఖలు చేసిన మరో పిటిషన్ విచారణార్హతతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును ఏసీబీ కోర్టు నుంచి విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ విచారణార్హతపై కూడా వాదనలు ముగిశాయి. ఈ మూడు వ్యాజ్యాల్లో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆధారాలు ఉన్నాయన్న అదే సీఐడీ.. ఇప్పుడు లేవంటోంది అంతకు ముందు ఆళ్ల తరఫున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ చేసిన వాదనల్లో ముఖ్యాంశాలు.. » ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్నారు. » ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ప్రస్తుతం సీఐడీ పనిచేస్తోంది. » ఈ నేపథ్యంలో సీఐడీ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు. » గతంలో ఆళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ ఆ తరువాత ప్రాథమిక విచారణ జరిపి పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించి, చార్జిషీట్ దాఖలు చేసింది. » అయితే ప్రభుత్వం మారిన వెంటనే సీఐడీ గతానికి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఏకంగా కేసును మూసివేసేందుకు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. » ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన కింద పనిచేసే సీఐడీని ప్రభావితం చేస్తున్నారు. అందువల్ల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి. » ఇక చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు పలు షరతులు విధించింది. దర్యాప్తును ప్రభావితం చేయరాదన్నది కూడా ఓ షరతు. చంద్రబాబు ఆ షరతును ఉల్లంఘించారు. అందుకే ఆయన బెయిల్ను రద్దు చేయాలి. » అంతేకాక ఈ కేసును ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టే వినాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని చెప్పింది. చార్జిషీట్ దాఖలు చేయడం పూర్తయిన నేపథ్యంలో ట్రయల్ నిర్వహించే నిమిత్తం ఏసీబీ కోర్టు ఈ కేసును ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాల్సి ఉంటుంది. » కాగా, సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. రాజకీయ కారణాలతో ఆళ్ల ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారని తెలిపారు. -
బిల్డర్ బాబు కొత్త రేటు..
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం పెంచేయడంలో చంద్రబాబు సర్కార్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయమే ఇందుకు తార్కాణం. నేలపాడు వద్ద అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో శాశ్వత సచివాలయం, హెచ్వోడీ(శాఖాధిపతులు) కార్యాలయాల కోసం ఐదు టవర్లను డయాగ్రిడ్ విధానంలో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్(విద్యుత్ సరఫరా), హెచ్వీఏసీ(వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ ఇటీవల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని బట్టి చూస్తే శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.12,779.07 అని అర్ధమౌతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్తో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేలకు మించడం లేదని ఇంజినీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీగా కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. శాశ్వత సచివాలయం నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఇంకెంత పెరుగుతుందో అని లెక్కలు వేస్తున్నారు. గతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,350తో మొదలై.. పూర్తయ్యే సరికి చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. రాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాడూ–నేడూ కాంట్రాక్టర్ ఒక్కరే..: » సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2025లో టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. సీఎం కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో మూడు ప్యాకేజీలకు ముఖ్యనేత ఏర్పాటుచేసిన సిండికేట్లోని ఎన్సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి. » 1, 2 టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487.11 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన షాపూర్జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.81 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో షాపూర్జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోలిస్తే ఇప్పటికే ఈ కాంట్రాక్టు వ్యయం రూ.830.35 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. » 3, 4 టవర్ల నిర్మాణ పనులను 4.54 శాతం అధిక ధరకు అంటే రూ.1,303.85 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.55 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.784.62 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో ఎల్ అండ్ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018 తో పోలిస్తే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.760.93 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది. » జీఏడీ టవర్ నిర్మాణ పనులను 4.53 శాతం అధిక ధరకు అంటే రూ.882.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1 నిలిచిన ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు సీఆర్డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోలిస్తే ఇప్పటికే ఈ కాంట్రాక్టు వ్యయం రూ.492.01 కోట్లు పెరిగింది. అప్పు చేసి.. దోచిపెట్టి.. పంచుకు తినేలా శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ.. ఇప్పుడూ డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోలిస్తే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాల్సినంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోలిస్తే టవర్ల కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ఇదే టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోలిస్తే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. ఇక ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్(విద్యుత్ సరఫరా), హెచ్వీఏసీ(వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది. దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. కానీ.. శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరడంపై ఇంజినీర్లు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచి పెడుతూ.. నీకింత నాకింత అంటూ ముఖ్యనేత పంచుకుతినేలా కుట్ర పన్నారంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసిమోపెడుతెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసిన సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐదు టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి పథకం రచించారని.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి కాంట్రాక్టు వ్యయం ఇంకెంతకు పెరుగుతుందోనని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతిభకు పరాభవం
సాక్షి, అమరావతి: తెలుగు సాహితీ రంగాన్ని సీఎం చంద్రబాబు ఘోరంగా అవమానించారు. కవులు, కళాకారులకు తీవ్ర అన్యాయం చేశారు. పండితులనే కనీస గౌరవం కూడా లేకుండా వారి మనోభావాలను దెబ్బతీశారు. అవార్డుకు ఎంపిక చేసి.. రాత్రికి రాత్రే వారి పేర్లను తొలగించేశారు. ఉదయం ఫోన్చేసి పురస్కార స్వీకరణకు రానవసరం లేదని కర్కశంగా చెప్పించారు. ముఖ్యంగా పురస్కార గ్రహీతల ఎంపికలో వారికి నచ్చిన వారికి కులాల ప్రాతిపదికన అవార్డులు పంచేశారు. ముస్లిం సామాజిక వర్గంలో ప్రముఖ రచయితలు ఉన్నప్పటికీ ఆ వర్గం నుంచి ఒక్కరంటే ఒక్కరిని కూడా పురస్కారానికి ఎంపిక చేయలేదు. మహిళా కవులు, రచయితలకు కూడా కనీస ప్రాధాన్యత దక్కలేదు. ప్రతిభకంటే కులాలకు, రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేయడాన్ని సాహిత్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. పరాభవ నామ సంవత్సరంలో తొలి పరాభవం తమకే జరిగిందంటూ కవులు, కళాకారులు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎంపిక చేసి రావద్దంటూ ఫోన్లు దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ సతీష్ చందర్కు కళారత్న అవార్డు ప్రకటించి.. కుటుంబంతో సహా రావాలని, వారందరి వివరాలు కూడా తీసుకున్న కొద్ది గంటలకే ‘మీరు అవార్డు తీసుకోవడానికి రావద్దు. మీ పేరును జాబితా నుంచి తొలగించాం’ అని ఫోన్ చేసి ఆయనను చంద్రబాబు ప్రభుత్వం అవమానించింది. అదేవిధంగా కాకినాడలోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ సాహిత్యవేత్త మధునాపంతుల సత్యనారాయణమూర్తికి సైతం ఇలాంటి పరాభవమే జరిగింది. ఉగాది పురస్కారం ఇస్తున్నట్టు ప్రకటించి, కనీసం ఆయనకు కారణం కూడా చెప్పకుండానే అవార్డు స్వీకరణకు రావద్దంటూ ఫోన్ చేసి చెప్పేశారు. అనకాపల్లికి చెందిన మినియేచర్ ఆర్టిస్ట్ గొట్టెం వెంకటేష్కు కూడా ఇదే అవమానం ఎదురైంది. ఎంపికలో రాజకీయం ఏటా కళ, సేవ, సాహిత్య, పత్రిక రంగాల్లో విశేష సేవలందించిన వారిని, నిష్ణాతులైన పండితులను ఉగాది పురస్కారాలతో సత్కరించడం ఆనవాయితీ. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ ఈ పురస్కారాలకు జరిగే ఎంపిక వివాదాస్పదంగా మారింది. ప్రతిభను చూసి చేయాల్సిన ఎంపిక ప్రక్రియలో రాజకీయ జోక్యం పెరిగింది. ఫలితంగా అర్హులకు అన్యాయం జరుగుతూనే ఉంది. గతేడాది కనీసం ఎంపిక జాబితాలో కూడా లేనివారు వేదికపై నగదు పురస్కారాలను అందుకుని వెళ్లిపోయారు. ఈ సారైనా పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని భావించి వివిధ రంగాలకు చెందిన దాదాపు 2 వేల మంది పురస్కారాలకు దరఖాస్తు చేశారు. ఇలా అలవాటైపోయింది ఈ ప్రభుత్వానికి.. ఉగాది వేడుకల సందర్భంగా సృజనాత్మక, సాంస్కృతిక శాఖ తయారు చేసిన ఆహ్వానపత్రమే తప్పుల తడకగా ఉంది. ప్రొటోకాల్ తెలియక పేర్లను తికమకగా ప్రచురించారు. పదవీ కాలం పూర్తయిన ఎమ్మెల్సీ పేర్లు వేసేశారు. అంబేడ్కర్ స్వరాజ్ మైదానంలో జరుగుతున్నట్టు ప్రచురించారు. తరువాత వేదికను తుమ్మలపల్లి కళాక్షేత్రానికి మార్చారు. తీరిగ్గా నాలుక్కరుచుకుని మళ్లీ కొత్త ఆహ్వాన పత్రాలు ముద్రిస్తున్నారు. మొన్నటికి మొన్న కందుకూరి ప్రతిష్టాత్మక అవార్డులు, నంది నాటకోత్సవాల నోటిఫికేషన్ విడుదల చేశారు. మళ్లీ గంటకే రద్దు చేశారు. నిన్న కళారత్న, ఉగాది పురస్కారాల జీవో విడుదల చేశారు. రాత్రికి రాత్రి మార్పులు చేర్పులు చేశారు. ప్రకటించిన పేర్లు తొలగించేశారు. దరఖాస్తు చేసిన వారిలో కళారత్న (హంస) పురస్కారాలకు 40 మందిని, ఉగాది పురస్కారాలకు 124 మందిని ప్రభుత్వం నియమించిన జంబో కమిటీ ఎంపిక చేసినట్టు మంగళవారం ప్రకటించింది. అయితే, రాత్రికి రాత్రి వీరిలో కొందరిని తొలగించారు. మరికొందరిని జత చేశారు. చివరకు కళారత్నకు 38 మంది, ఉగాది పురస్కారానికి 123 మంది అర్హులుగా తేల్చారు. అర్హులకు అన్యాయం విజయవాడ కృష్ణలంకలో 40 ఏళ్లుగా కూచిపూడి నాట్యానికి అంకితమైన ఓ నాట్యాచార్యుడు దరఖాస్తు చేసినా పురస్కారం ఇవ్వలేదు. కానీ.. కమిటీ చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తన అనుచరులైన నలుగురికి అవార్డులు ఇచ్చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిటీలోని వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాల మేరకు నచ్చని వారిని పక్కనపెట్టి.. కావాల్సిన వారిని పురస్కారాలకు ఎంపిక చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ను వదిలి హైదరాబాద్లో స్థిరపడిన వారికి అనేక విభాగాల్లో పురస్కారాలు ప్రకటించారు. ఈ మొత్తం ఎంపిక ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేల వంటి రాజకీయ నేతల సిఫారసు లేఖలు ముఖ్య భూమిక పోషించాయని పలువురు ఆరోపిస్తున్నారు. తొలి పరాభవం నాకే ఏపీ సర్కారు నాకు కళారత్న ప్రకటించి.. రాత్రికి రాత్రే నా పేరును జాబితానుంచి తొలగించింది. ‘పరాభవ’నామ సంవత్సరంలో తొలి పరాభవం నాకే. ఏపీ సర్కారుకు ధన్యవాదాలు. – సతీష్ చందర్, సీనియర్ జర్నలిస్ట్ -
ఉద్యోగాల కల్పనపై చంద్రబాబు వ్యాఖ్యలు
-
‘చంద్రబాబు సర్కార్ పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది’
సాక్షి, ఢిల్లీ: ఏపీలో రైతులకు 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్ లను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో వ్యవసాయ శాఖ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. పీఎం కిసాన్ పథకం కింద సహాయాన్ని పదివేల రూపాయలకు పెంచాలన్నారు.‘‘ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశాం. 54 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల బీమాను అందించాం. కానీ, ప్రస్తుత బాబు ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. 2024 -25 బడ్జెట్లో దీనికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. 2025-26లో 1000 కోట్ల రూపాయలు కేటాయించినా బీమా కంపెనీలకు ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు. రైతులకు పంట బీమాను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది’’ అని వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు.‘‘2,492 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించకపోవడంతో ఏపీని ఇన్సూరెన్స్ కంపెనీలు బ్లాక్ లిస్టులో పెట్టాయి. దాంతో రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో.. రైతులు ప్రీమియం చెల్లించడానికి యాప్ ఓపెన్ కావడం లేదు. ప్రీమియం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్లను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఏపీ రైతులకు బీమాను చెల్లించేలా చర్యలు తీసుకోవాలి..ఇరాన్ యుద్ధం వల్ల అరటి, మామిడి, మస్క్ మెలన్, వాటర్ మెలన్ ధరలు ఘోరంగా పడిపోయాయి. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పెండింగ్ ఇన్పుట్ బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. హార్టికల్చర్ హబ్గా ఉన్న రాయలసీమలో భారీ ఎత్తున అరటి మామిడి మస్క్ మిలన్ వాటర్ మిలన్ పంటలు పండుతున్నాయి. పప్పులపై దిగుమతి సుంకం తొలగించడం వల్ల విదేశాల నుంచి భారీ ఎత్తున పప్పులు దిగుమతి అయ్యాయి. దాని ఫలితంగా దేశీయ పప్పులు పండించే రైతులు గిట్టుబాటు ధర కంటే తక్కువకి అమ్ముకోవాల్సిన పరిస్థితి పడింది.ఏపీలో 3.7 లక్షల ఎకరాల్లో శనగ పంట పండిస్తున్నారు. పప్పు ధాన్యాలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవడం, పప్పు ధాన్యాలపై దిగుమతి పాలసీని పున:పరిశీలన చేయాలి. ప్రతి గ్రామంలో వ్యవసాయ గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. మండల లెవెల్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. వ్యవసాయంత్రీకరణ కు నిధులు కేటాయించాలి’’ అని వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. -
‘దివ్యాంగులకు 16 సర్వీసుల్లో ఫ్రీ బస్సు వర్తింపచేయాలి’
సాక్షి, తాడేపల్లి: కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలను మార్చేసినట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు బస్సెక్కి హడావుడి చేశారని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి ఆక్షేపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలో 50 శాతం సబ్సిడీ ఉందని గుర్తు చేశారు.చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం 16 బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, దివ్యాంగుల సహాయకులకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల బతుకు భారంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా సదరం సర్టిఫికెట్ల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇంద్రధనస్సు పేరుతో ఇచ్చిన ఏడు హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రెస్మీట్లో పులిపాటి దుర్గారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..ప్రచార ఆర్భాటంతో సరి:కేవలం 5 ఆర్టీసీ సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలు మార్చేసినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దివ్యాంగులకు మేలు చేసినట్టు ఆర్భాటంగా మంగళగిరిలో బస్సెక్కి హడావుడి చేశారు. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు చార్జీలో 50 శాతం సబ్సిడీ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు కల్పిస్తున్నది కేవలం 50 శాతం మాత్రమే.అది కూడా 5 సర్వీసులకే వర్తింపజేస్తున్నారు. చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 11 సర్వీసుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేవాడు. వారితోపాటు వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీని అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో వర్తింపజేసేవారు. టిడ్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పినా రెండేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. అమరావతిలో దివ్యాంగులకు దివ్యాంగ భవన్ కడతామని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.2016 నాటి చట్టం అమలు చేయాలి:ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం, వాటిలో ఎక్కడా దివ్యాంగుల ఊసే ఎత్తలేదు. 2016 నాటి చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 4 శాతం నిధులు అంటే, రూ.12 వేల కోట్లు దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించాలి. కానీ రెండేళ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదు. నియోజకవర్గానికి 5 ట్రై మోటార్ సైకిళ్లు ఇస్తామని చెప్పినా అరకొరగా పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇచ్చే వాటిని కూడా అర్హులైన వారికి కాకుండా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. దివ్యాంగులు ఎక్కడికెళ్లినా ఇబ్బందులు:చంద్రబాబు దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో విధాలుగా వేధిస్తున్నాడు. గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 365 రోజులపాటు ఎప్పుడైనా సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వలంటీర్ వ్యవస్థ ద్వారా డాక్టర్లు నేరుగా ఇంటికొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేసేవారు.కానీ నేడు కూటమి పాలనలో సోమ, మంగళవారాలు మాత్రమే దరఖాస్తు చేసుకునే నిబంధన పెట్టారు. పైగా వైద్య పరీక్షల కోసం సొంత జిల్లాలకు కాకుండా పక్క జిల్లాలకు వెళ్లే నిబంధన పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పైగా సదరం సర్టిఫికెట్లలో తప్పులు దొర్లితే వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఉండటం లేదు.డిజెబిలిటీ శాతం తక్కువగా చూపించి పింఛన్లలో కోతలు విధిస్తున్నారు. పింఛన్ల మీద ఆధారపడి బతుకుతున్న దివ్యాంగులకు పింఛన్లు తీసేసి వారి బతుకులను చంద్రబాబు అంధకారంలోకి నెట్టేశాడు. రెండేళ్లలో పింఛన్లు తీసేయడమే కానీ, దివ్యాంగులకు కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో దివ్యాంగులకు అందజేసే ట్రై మోటార్ సైకిళ్లు, హియరింగ్ యంత్రాలు, బ్లైండ్ పర్సన్స్ కి స్టిక్స్ వంటివి ఇవ్వడం ఆపేశారు. దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేకమైన స్కూల్స్, ప్రత్యేక వైద్యసేవలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మోసగించారు.దివ్యాంగ విద్యార్థులకు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అందే స్కాలర్షిప్స్ కూడా అందకుండా చేశారు. ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఉండటం లేదు. దివ్యాంగులకు హక్కుగా దక్కాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదు. దివ్యాంగులు ఆలయాలకు వెళ్లినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఎప్పుడు?:వైఎస్సార్సీపీ తరఫున రోడ్డెక్కి ఉద్యమిస్తే కానీ 2024–25, 2025–26 బ్యాక్ లాగ్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. తూతూమంత్రంగా కడప, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో నోటిఫికేషన్ ఇప్పించారు. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. 3 జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.వైఎస్సార్సీపీ హయాంలో రుణ సబ్సిడీలు ఇచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడడం జరిగింది. కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో దివ్యాంగులకే ఎక్కువ నష్టం జరిగింది టీడీపీ కూటమి ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పులిపాటి దుర్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
వక్ఫ్ భూముల జోలికొస్తే.. కూటమికి అంజాద్ బాషా వార్నింగ్
-
ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు
-
‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’
సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు...మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే...రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’ అని అంబటి రాంబాబు అన్నారు. -
ఇప్పుడు రండి.. గేటు మీద చేయి వేసి చూడండి
-
‘ముస్లింలను చంద్రబాబు మోసం చేశారు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని.. పవిత్ర ఇఫ్తార్లో పాల్గొని కూడా అబద్ధాలు చెప్పటం బాధాకరమని వైఎస్సార్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇమామ్లకు రూ. 10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ది’’ అని అంజాద్ బాషా గుర్తు చేశారు.‘‘చంద్రబాబు 2019-24 మధ్య పెట్టిన బకాయి రూ.24 కోట్లను కూడా జగనే తీర్చారు. మొన్నటి ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. 50 ఏళ్లు దాటిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వటం లేదు?. ఈద్గాలు, ఖబరస్థాన్లకు భూమి ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ అంజాద్ బాషా నిలదీశారు.‘‘విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తానని చెప్పి, ఇప్పటికీ స్థలం కూడా కేటాయించలేదు. నూర్ బాషా కార్పోరేషన్కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. గౌరవ వేతనం కూడా ఆర్నేళ్లుగా ఇవ్వకుండా బకాయి పెట్టారు. గట్టిగా పోరాటం చేస్తే రిలీజ్ చేసి పండుగ చేసుకోమంటున్నారు. అడ్వాన్స్ ఇచ్చి పండగ చేసుకోమన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. హజ్ యాత్రికులకు వైఎస్ జగన్ ఆర్థిక సహాయం అందించారు. 1870 మంది యాత్రికులు వెళ్తే కేవలం 72 మందికే చంద్రబాబు ఆర్థిక సాయం చేశారు. ఇదే మా ముస్లింల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ?. ఈ ఏడాది వెళ్తున్న 2005 మంది హజ్ యాత్రికులకు అందరికీ లక్ష చొప్పున ఇవ్వాల్సిందే’’ అని అంజాద్ బాషా డిమాండ్ చేశారు.‘‘వైఎస్ జగన్ హయాంలో విజయవాడలోనే ఎంబార్కేషన్ పాయింట్ను ఓపెన్ చేశారు. ఒక్కొక్క ముస్లిం మీద పడిన రూ.83 వేలు అదనపు భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. వైఎస్ జగన్ ముస్లింల సంక్షేమం కోసం రూ.24,304 కోట్లు ఖర్చు చేశారు. ముస్లింల మీద జగన్ ఎంత ప్రేమ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు. మైనారిటీలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఐదుగురికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇక్బాల్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. జకియాఖానంకి ఎమ్మెల్సీ ఇచ్చి మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. 12 కార్పొరేషన్లకు ముస్లింలను ఛైర్మన్లుగా చేశారు. చంద్రబాబు హామీలు ఇవ్వటమే తప్ప.. ముస్లింలకు చేసింది ఏమీ చేయలేదు..వక్ఫ్ ఆస్తులు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం. 460 ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురైంది. చినకాకాని దగ్గర ఉన్న 71 ఎకరాల వక్ఫ్ భూమి మీద నారా లోకేష్ కన్ను పడింది. పరిశ్రమల పేరుతో తీసుకునేందుకు జీవో ఇచ్చారు. రాజధానిలో ఉన్న వేల ఎకరాల భూములను కాదని వక్ఫ్ భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. వక్ఫ్ భూములను కాపాడుకోవటానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు..వినుకొండలో రషీద్ అనే ముస్లిం యువకుడిని నడిరోడ్డు మీద చంపేశారు. పుంగనూరులో మైనారిటీ బాలికను హత్య చేసి నీళ్లలో పడేశారు. రాయచోటిలో కౌన్సిలర్ మీద టీటీడీ గూండాలు దాడి చేశారు. పులివెందులలో బీటెక్ రవి అనుచరులు.. దంపతుల మీద దాడి చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక ముస్లింని హత్య చేశారు’’ అంటూ అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బరితెగించిన సీఎం హెరిటేజ్ కు 100 కోట్ల ప్రజా సొమ్ము
-
మోదీకి బాబు బెదిరింపు.. జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీసిన ఎంపీ పుట్టా మహేష్
-
చంద్రబాబుకు బిగ్ షాక్, ACB కోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ
-
చంద్రబాబు హామీలన్నీ మోసాలే... ఒంగోలు నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల భేటీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
ఫిబ్రవరి 15న రాత్రి పాల రూపంలో చేతికందిన కాలకూట విషం తాగి ఆస్పత్రుల పాలయ్యారు. చివరకు కిడ్నీలు పాడై రోజుకొకరు, ఇద్దరు చొప్పున ఓ చిన్నారి సహా 16 మంది.. సర్కారు నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ ఇప్పటికే పాడెక్కారు. ఇద్దరు చిన్నారులు సహా మరో నలుగురు ఆస్పత్రుల్లోనే మరణ వేదన అనుభవిస్తుండగా.. వారి అవస్థల్ని చూడలేక ఆ కుటుంబాలు ఇప్పటికీ నరకయాతన పడుతున్నాయి. మొత్తానికి దేశంలోనే అత్యధిక ప్రాణాలను బలిగొన్న రాజమహేంద్రవరం ‘పాల’కూట విషపు మృత్యుఘోష ‘ఈ పాపం ఎవరిది బాబూ!’ అని బిగ్గరగా ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్ల 2015 గోదావరి పుష్కరాల మొదటి రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు మరణించగా.. మరో ఏడాదిలో రానున్న గోదావరి పుష్కరాలకు ముందు అదే చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల కల్తీ పాల ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని రాజమహేంద్రవరం వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. (యిర్రింకి ఉమామహేశ్వరరావు, ఎస్.ఫయాజ్/రాజమహేంద్రవరం) ‘రాజమహేంద్రవరం పాల కల్తీ కాటుపై చంద్రబాబు సర్కారు స్పందించడం లేటయ్యింది. ఒకే సమస్యతో ఎక్కువ మంది బాధితులు ఆస్పత్రుల్లో చేరినప్పుడే ప్రభుత్వం అప్రమత్తమై.. అందుకు కారణాలు నిర్ధారించి.. తక్షణ చర్యలు చేపట్టి ఉంటే 16 ప్రాణాలు నిలిచేవి. మరో నలుగురి ప్రాణాలు కొనఊపిరితో బిక్కుబిక్కుమనేవి కాదు. ఆస్పత్రుల్లో చేరిన బాధితులు వారం రోజుల తర్వాత తమ అస్వస్థతకు కల్తీ పాలే కారణమని చెప్పాక.. ప్రభుత్వం తీరుబడిగా స్పందించింది. వైఎస్సార్సీపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాకే చంద్రబాబు ఈ ఘటనపై స్పందించారు’ రాజమహేంద్రవరంలో ఎవరిని కదిపినా ఇవే మాటలు చెబుతున్నారు. బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. వారు చనిపోయాక అరకొర పరిహారం అందించినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయిన వారిని కోల్పోయి.. ప్రైవేట్ వైద్యానికి రూ.లక్షలకు లక్షలు దొరికిన చోటల్లా అప్పులు చేసిన కుటుంబాలు నెల రోజులు గడిచినా మనోవేదన నుంచి బయటపడలేదు. బాధితుల కుటుంబ సభ్యులను కదిలిస్తే.. కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్న సన్నివేశాలు గుండెల్ని పిండేస్తున్నాయి.ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందిఒక్కో కుటుంబానిదీ ఒక్కో విషాదం చౌడేశ్వరి నగర్లోని గుండాబత్తుల ఫణి మధుకుమార్ ఇంటిని విషాదం వెంటాడుతోంది. కల్తీ పాలకు ఆయన తల్లి వెంకటలక్ష్మి (70), పెద్దనాన్న గంటా సూర్యారావు (80), పిన్ని రఘుపతి సూర్యకుమారి (62) బలైపోయారు. మధు తండ్రి వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం కిమ్స్ ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయనకు ఇప్పటికే నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు. అయినా గ్యారంటీ లేదని వైద్యులు చెబుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన కుయ్యోటి ఛాయశ్రీ (54) కల్తీ పాలు తాగి ఫిబ్రవరి 16న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే రాజమహేంద్రవరం డెల్టా ఆస్పత్రిలో చేరి్పంచగా.. క్రియాటినిన్ పెరిగిపోవడంతో కిడ్నీ పనిచేయడం ఆగిపోయింది. డయాలసిస్ చేసినా ఫలితం లేక కిడ్నీకి స్టెంట్ వేశారు. అయినా పరిస్థితి విషమించడంతో ఛాయశ్రీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆమె భర్త మురళీకృష్ణ నగరంలోని రవి చైతన్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె చికిత్స పొందుతూ ఫిబ్రవరి 20న ప్రాణాలు కోల్పోయింది.ఆమె మరణాన్ని ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకోలేదు. అదేమంటే పోస్టుమార్టం చేయలేదనే సాకుతో పరిహారం ఎగ్గొట్టింది. ఇప్పటికే జయలక్ష్మి కో–ఆపరేటివ్ బ్యాంక్ బోర్డు తిప్పేయడంతో ఆ బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.15 లక్షలు కోల్పోయానని, కొందరిని నమ్మి రూ.10 లక్షల అప్పులు ఇస్తే ఎగ్గొట్టారని మురళీకృష్ణ తెలిపారు. ఆర్థికంగా దెబ్బతిన్న తాను ఇప్పుడు భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానన్నారు.అనుమానాలను నివృత్తి చేయని సర్కారు పాలలో ఇథలీన్ గ్లైకాల్ కలవడమే బాధితుల మృతికి కారణమని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి కల్తీ పాలు, బాధితుల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపినట్టు ప్రకటించిన ప్రభుత్వం.. ల్యాబ్ల నుంచి వచి్చన వాస్తవ నివేదికలను ఇప్పటికీ రహస్యంగానే ఉంచింది. వాస్తవానికి ఇథలీన్ గ్లైకాల్ కలిస్తే పాలు నీలం రంగులోకి మారిపోతాయని.. అయితే, బాధితులు తాగిన పాలు రంగు మారలేదని చెబుతున్నారు. మరికొందరు గడ్డి మందు ఏమైనా కలిసిందేమో అంటున్నారు. ఇంకొందరు పాల వ్యాపారం పోటీలో ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ రిపోర్టులు అందితే పాలల్లో కల్తీ ఎలా జరిగింది?, ఏం కలిసింది?, బాధితులపై అంత ప్రభావం చూపడానికి కారణమేంటి? అనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పాల పదార్థాలు తీసుకోవాలన్నా, టీ తాగాలన్నా జనం వణికిపోతున్నారు. గణేష్ సరఫరా చేసిన పాల నుంచి వెన్న సేకరించి నెయ్యిగా దాచుకున్న వారు ఉన్నారని.. వారిని అప్రమత్తం చేయడం, పాల కల్తీపై అవగాహన కల్పించండంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు వాపోతున్నారు. వైద్యానికే రూ.4.50 లక్షలైంది ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజినీర్ శేషగిరిరావు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన కుమారుడు, కోడలు విషయం తెలుసుకుని వచ్చి ఆయనను దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైద్య ఖర్చులు రూ.4.50 లక్షలయ్యాయి. ఆ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించాల్సి ఉంది. భర్త బతికాడు.. భార్య ప్రాణం పోయింది శివరాత్రి రోజు రాత్రి కల్తీ పాలతో కాఫీ కలిపి బండారు వీరలక్ష్మి (60) తన భర్త నాగమోహనరావుకు ఇచ్చింది. పాలు చేదుగా ఉన్నాయని గుర్తించిన భర్త ఆ కాఫీ తాగకుండా పారబోశారు. ‘కాఫీ పొడి ఎక్కువ వేసి ఉంటాను. అందుకే చేదుగా ఉందని చెప్పిన భార్య చేదు అనిపించినా కాఫీ తాగింది. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. తన భార్య కూడా ఆ కాఫీ తాగకుండా ఉంటే బతికేదని నాగమోహనరావు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రసాదం తిని పాప బతికింది లాలాచెరువు ప్రాంతానికే చెందిన జి.నాగవెంకటేష్ కు జైక్రిత్ రాజ్, జయ హిమాన్షి అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. రెండున్నరేళ్ల వయసున్న వారిద్దరికి పాలు కలిపి ఇస్తే జైక్రిత్ తాగాడని.. అప్పటికే దేవుడి ప్రసాదం తిన్నందున జయ హిమాన్షి తాగలేదని చిన్నారుల తాతయ్య ప్రకాశరావు చెప్పారు. పాలు తాగి అస్వస్థతకు గురైన జైక్రిత్ రాజ్ను కాపాడుకునేందుకు అప్పులు చేసి ఎంత ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదని అతడి తాతయ్య ఆవేదనతో చెప్పారు. పరిహారంలోనూ పరిహాసమే కల్తీ పాల ఘటనలో మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సైతం బాధిత కుటుంబాలను పరిహసిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అయితే, రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చిందని బాధితులు వాపోతున్నారు. అయిన వారిని కోల్పోయిన వారికి పరిహారం పెంచాలని.. ఒక్కొక్కరు రూ.1.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేసిన కుటుంబాలకు వైద్య ఖర్చులను తక్షణం చెల్లించి ఆదుకోవాలని వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాల నేతలు పదేపదే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శేషజీవితం ప్రశాంతంగా గడుపుదామని వచ్చి.. విశాఖపట్నంలో ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైరైన మంచి రాధాకృష్ణమూర్తి (72) శేషజీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు రాజమహేంద్రవరం వచ్చారు. కుమార్తెతోపాటు అయిన వారంతా ఇక్కడే ఉండటంతో ఆనందంగా గడపాలని భావించి ఇక్కడ స్థిరపడ్డారు. ఇటీవల కల్తీ పాలు తాగడంతో యూరిన్ ఆగిపోయి పరిస్థితి సీరియస్ అవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యానికి ఎంత ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందని ఆయన కుమార్తె గడిశెట్టి వెంకటదుర్గ ఆవేదనతో తెలిపారు. పాలు తాగకపోవడంతో ప్రాణాలతో ఉన్నాం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ అమ్మను చూసేందుకు చిన్నపిల్లలతో సహా రాజమండ్రికి వచ్చిన తాము పాలు తాగకపోవడంతో ప్రాణాలతో ఉన్నామని వియ్యూరి రాజేష్ తెలిపారు. శివరాత్రికి రెండు రోజుల ముందే తాను కుటుంబంతో హైదరాబాద్కు, తన తమ్ముడు జగన్నాథ్ వైజాగ్లోని అత్తారింటికి వెళ్లాడని చెప్పారు. శివరాత్రి తర్వాత రోజున తన తల్లి గొంతునొప్పి, చెవుల్లోంచి చీము కారడం, కళ్లు మంటలు ఉన్నట్టు ఫోన్ చేసి చెప్పిందన్నారు. గోరువెచ్చని నీళ్లు తాగడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పిందని.. తాము కూడా అక్కడే ఉంటే పాలు, మజ్జిగ, టీ తాగి ఉండే వాళ్లమని.. అదే జరిగితే తన రెండేళ్ల కుమారుడు, తన తమ్ముడి 7 నెలల కొడుకు పరిస్థితి ఎలా ఉండేదో తలచుకుంటేనే భయం వేస్తోందని రాజేష్ చెప్పారు. -
చంద్రబాబు, బీఆర్నాయుడు హైందవ ద్రోహులు
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హైందవ ద్రోహులని వైఎస్సార్సీపీ శ్రేణులు మంగళవారం నిప్పులు చెరిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణం రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కారు. తిరుపతిలో బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలపై పచ్చ గూండాలు దాడులకు పాల్పడడంపై మండిపడ్డారు. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డు చేత పట్టుకొని నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టారు. పలు చోట్ల రోడ్లపై బైఠాయించి బీఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు ద్వయంపై ధ్వజమెత్తారు. అసమర్థ సర్కారుకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా పలు చోట్ల పార్టీ నాయకులు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును చంద్రబాబు సర్కారు అణచివేస్తోందని మండిపడ్డారు. మహిళలను గౌరవించడం హైందవ సంప్రదాయమని, అబలలపై దాడులకు పాల్పడడం అత్యంత పాశవికమని దుయ్యబట్టారు. స్త్రీమూర్తులపై దారుణాలకు ఒడిగట్టేవారు హైందవ ద్రోహులేనని, వారు తక్షణం పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపైనే దాడులు చేసి, వారిపైనే తిరిగి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్న ఈ నిరంకుశ సర్కారుకు పతనం తప్పదని హెచ్చరించారు. మహిళామూర్తులను బాధించిన ఏ పాలకుడూ బతికిబట్టకట్టినట్టు చరిత్రలో లేదని ఆక్రోశించారు. బాబు దుశ్శాసన పాలనకు ఘోర పరాభవం తప్పదని దుయ్యబట్టారు. మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. » ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ దుష్ట సర్కారుకు సద్బుద్ధి ప్రసాదించాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.» నెల్లూరు వీఆర్సీ సెంటర్లో నల్ల కండువాలతో వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. బాబు దుశ్శాసన పాలనకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. » ప్రకాశం జిల్లా ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. » ఏలూరులో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ ధర్నా చేశారు. » పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. » తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. » డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వైఎస్సార్ సీపీ నేతలు నిరసన తెలిపారు. బుద్ధ విహార్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి రోడ్డుపై బైఠాయించారు. » కాకినాడ ఇంద్రపాలెం వంతెన సమీపాన అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నేతలు నిరసన తెలిపారు. » విజయనగరంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ధర్నా చేశారు. బాబు పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. » పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. » శ్రీకాకుళంలోనూ పార్టీ శ్రేణులు నిరసన గళమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. » విశాఖపట్నం ఎల్ఐసీ జంక్షన్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. » అనకాపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మానవహారం నిర్మించారు. » అనంతపురం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు కదంతొక్కారు. నిరసన ప్రదర్శనలు చేశారు. » ఉమ్మడి తిరుపతి జిల్లాలోనూ వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. ధర్నాలు చేశారు.అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. » కర్నూలు, నంద్యాలలోనూ వైఎస్సార్సీపీ నేతలు బాబు సర్కారు హిందూ వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. -
ఖజానాను కొల్లగొట్టు... సొంత సంస్థకు దోచిపెట్టు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్కు ప్రభుత్వ ఖజానా నుంచి భారీ నజరానా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 35 మందికి ఉద్యోగాలు కల్పించనున్న హెరిటేజ్ సంస్థకు ఖజానా నుంచి ఏకంగా రూ.59.69 కోట్ల రాయితీలను ఇచ్చేశారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్కు ఈ రాయితీలు ఇచ్చేందుకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ), కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల కల్పన పేరుతో తన కుటుంబ సంస్థ హెరిటేజ్ విస్తరణ ద్వారా వ్యాపారాన్ని పెంచుకునేందుకు రాష్ట్ర ఖజానా నుంచి భారీ రాయితీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించడం గమనార్హం. కొత్తగా హెరిటేజ్ సంస్థను ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటికే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపెంట్లలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్ను అప్గ్రేడేషన్ పేరుతో విస్తరించనున్నారు. ఈ విస్తరణకు రూ.209.68 కోట్లు వ్యయం చేస్తారట. తద్వారా ఉద్యోగాలిచ్చేది మాత్రం 35 మందికే. ఖజానాకు గండి కొట్టి హెరిటేజ్ విస్తరణకు రాయితీలు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద మెగా ప్రాజెక్టు హోదా పొందిన ఈ హెరిటేజ్ డెయిరీ విస్తరణ వల్ల ఉత్పత్తుల తయారీ బాగా పెంచుకోనుంది. ఫ్లేవర్డ్ పాలు 131 శాతం, పనీర్ 400 శాతం, నెయ్యి ఉత్పత్తి ఏకంగా 566 శాతం పెరిగి చంద్రబాబు కుటుంబం భారీ లాభాలను పొందనుంది. మరోవైపు ఈ సంస్థకిచ్చే రాయితీలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడనుంది. తన సొంత కుటుంబ సంస్థ లాభాల కోసం ఖజానా నుంచి ఏకంగా రూ.59.69 కోట్ల రాయతీలను ఇవ్వడం పట్ల అధికార వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని ఐదేళ్లపాటు ఖజానా నుంచి హెరిటేజ్కు రాయితీల రూపంలో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెక్నాలజీ అప్గ్రేడేషన్కు రూ.34.93 కోట్లు సబ్సిడీ చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే నూరు శాతం ఐదేళ్లపాటు ఎస్జీఎస్టీ రూ.17.80 కోట్లు తిరిగి హెరిటేజ్కు చెల్లించనున్నారు. ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్కు రూపాయి చొప్పున రూ.0.98 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదేళ్ల మినహాయింపు రూ.0.98 కోట్లు రాయితీ కల్పించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వడ్డీ రాయితీ కింద రూ.5 కోట్లు తిరిగి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా నీతులు చెబుతూ... ‘‘హెరిటేజ్ మా కుటుంబ సంస్థ. మా కుటుంబ సభ్యులు దాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధీ చేకూరలేదు. ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరుకోలేదు. ఈ సంస్థ పెట్టినప్పుడే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రభుత్వం నుంచి ఏదీ ఆశించకూడదన్నదే మా విధానం. దానికి కట్టుబడే ఇప్పటి వరకు నడుచుకున్నాం’’ ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో వల్లెవేసిన నీతి వ్యాఖ్యలు. సీన్ కట్చేస్తే.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్వయంగా పాల్గొన్న మంత్రివర్గ సమావేశంలో తమ కుటుంబ సంస్థ హెరిటేజ్కు ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా భారీ ప్రయోజనాలను కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. తొలి నుంచీ హెరిటేజ్పై అమిత ప్రేమ 2014–19 సమయంలో కూడా పశువుల దాణా తయారీ కేంద్రం పేరుతో రాజధానికి సమీపంలో కృష్ణా జిల్లాలో 10 ఎకరాలు భూమి, నెల్లూరు జిల్లాలో హెరిటేజ్ ఫుడ్స్ పేరిట 10 ఎకరాలు, అనంతపురంలో 6.46 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రభుత్వం నుంచి అయాచిత ప్రయోజనాలు పొందుతూ అసెంబ్లీలో మాత్రం ప్రభుత్వం నుంచి హెరిటేజ్ ఎటువంటి ప్రయోజనాలనూ పొందడం లేదంటూ చెప్పడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అలా ప్రతిపాదనలు రాగానే... ఇలా ప్రోత్సాహకాలు» తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, కాశీపెంట్ల గ్రామంలో ఉన్న తమ పాల శుద్ధి యూనిట్ సాంకేతిక ఉన్నతీకరణ (విస్తరణ) కోసం రూ.209.68 కోట్ల పెట్టుబడితో 35 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పన సామర్థ్యంతో, ప్రత్యేకంగా రూపొందించిన ప్రోత్సాహకాల మంజూరు కోసం హెరిటేజ్ సంస్ధ ప్రతిపాదనలను సమర్పించింది. » హెరిటేజ్ సంస్థ ప్రతిపాదనలపై గత నెల 12న సీఎస్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో చేసిన సిఫార్సులను గతనెల18న సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో ఉంచారు. » కంపెనీ అభ్యర్థించిన మేరకు రూ.59.69 కోట్ల వరకు ప్రత్యేక ప్రోత్సాహకాలను మంజూరు చేయాలని ఎస్ఐపీబీ సిఫార్సు చేసింది. -
మైనారిటీలను ఇంకెంతకాలం మోసం చేస్తావ్ బాబూ..
రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్నానని, వక్ఫ్ భూములను కాపాడుతామని ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ముస్లిం సమాజం మండిపడుతోంది. 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు... 2024 ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలు కూడా గాలికొదిలేశారని మైనారిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్టు అబద్ధాలు చెబుతూ ముస్లిం మైనారిటీలను ఇంకెంతకాలం మోసం చేస్తావ్ బాబూ... అంటూ ప్రశి్నస్తున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలోని పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం వారు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. – సాక్షి, అమరావతిదూదేకులకు రూ.వంద కోట్లు ఎప్పుడిచ్చారు? నూర్బాషాల (దూదేకుల) ఆర్థిక ఉన్నతి కోసం ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తానని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చి అమలు చేయలేదు. మళ్లీ అదే హామీని 2024 ఎన్నికల్లోనూ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత నూర్బాషాలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. తర్వాత ఆరు నెలలకు జీవో ఇచ్చారు. కానీ, దానిని అమలు చేయకుండా పక్కన పడేశారు. అయినా దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్కు రూ.100 కోట్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఇఫ్తార్ విందులో చంద్రబాబు ప్రకటించడం పచ్చి మోసం. అల్లా సాక్షిగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకు అక్కడ ఉన్న పెద్దలు కూడా అడ్డుచెప్పకపోవడం సరికాదు. – షేక్ దస్తగిరి, ఏపీ నూర్బాషా(దూదేకుల) జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఐటీ పార్కుల కోసం వక్ఫ్ భూములా? వక్ఫ్ భూములను కాపాడుతున్నానని, ముస్లింల కోసం ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తున్నానని చంద్రబాబు చెప్పడం పచ్చి అబద్ధం. ముస్లిం సమాజానికి ఉపయోగపడాల్సిన వక్ఫ్ భూములను ఐటీ పార్కుల పేరుతో అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇమామ్, మౌజన్లకు ఆరు నెలల బకాయిలు విడుదల చేసినట్టు గొప్పులు చెబుతున్న చంద్రబాబు... దాదాపు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న 1,500 మసీదుల దరఖాస్తులను పరిశీలించి వాటిలో పనిచేసే ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఎందుకు మంజూరు చేయడంలేదు? మైనారిటీలకు మూడు బడ్జెట్లలో ఎంత కేటాయించారు? దానిలో ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. – షేక్ నాగుల్మీరా, ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబద్ధాలు చెబితే ముస్లిం సమాజం హర్షించదుఇఫ్తార్ విందు ఒక్కటి ఇస్తే ముస్లిం మైనారిటీలకు అన్నీ చేసినట్లు కాదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు. కనీసం పేద ముస్లింలకు పండుగ వేళ రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ముస్లింలు ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. అంతేగానీ ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్లు అబద్ధాలు చెబితే ముస్లిం సమాజం హర్షించదు. తగిన సమయంలో బుద్ధి చెప్పి తీరుతుంది. – ఎంఏ క్రిస్టీ, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
రైతు సమస్యలపై చంద్రబాబు సర్కార్ స్పందించాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అనే రీతిలోనే ఇప్పటికీ చంద్రబాబు ఆలోచిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘సగటున రోజుకు 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభమే ఈ ఆత్మహత్యలకు కారణం. విపత్తులు వచ్చినా ప్రభుత్వం మాటలు తప్ప.. లబ్ధి చేకూర్చడం లేదు. ఎన్నికల ముందు రైతులకు, రైతు కూలీలకు అనేక హామీలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అరకొర మినహా ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు...మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చినా ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు కూడా కేటాయించలేదు. వైఎస్సార్, జగన్ పరిపాలనలో రైతే రాజు అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించక రైతులు విపత్తులతో నష్టపోయారు. అన్నంపెట్టే రైతుల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆదుకోవాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
BR నాయుడి బూతు పురాణం చూసి కూడా.. బాబు, పవన్ నోరు ఎందుకు మెదపట్లే..?
-
హెరిటేజ్కి చంద్రబాబు ప్రభుత్వం భారీ రాయితీలు
సాక్షి,అమరావతి: హెరిటేజ్కి చంద్రబాబు ప్రభుత్వం భారీ రాయితీలు కల్పించింది. టైలర్ మేడ్ రాయితీలిస్తూ జీవో 57ను ప్రభుత్వం జారీ చేసింది. హెరిటేజ్ కంపెనీకి మొత్తం రూ.59.69 కోట్లు రాయతీలిస్తున్నట్లు జీవోలో పేర్కొంది.35మందికి ఉద్యోగాలిస్తుందని రూ.59.69కోట్ల రాయితీ, టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ రూ.34.93కోట్లు ఇస్తుంది. ఐదేళ్ల పాటు 100శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్,జీఎస్టీ రీయింబర్స్మెంట్ కింద రూ.17.80కోట్లు లబ్ధి. ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీల్లో యూనిట్కి రూపాయి రాయితీ, ఐదేళ్లూ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూనిట్కి రూపాయి రాయితీ ఇచ్చింది. విద్యుత్ రాయితీల ద్వారా హెరిటేజ్కి రూ.2కోట్లు లబ్ధి చేకూరనుంది. 2శాతం వడ్డీ రాయితీ కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
బాబు ఆగ్రహం, సీరియస్, వార్నింగ్ అంటూ ఎల్లో హెడ్ లైన్స్.. బాబు మార్క్ నోటీస్ డ్రామా
-
బాబు మీ శేష జీవితం జైలులోనే..! అంత ఈజీగా తప్పించుకోలేరు
-
'గ్యాస్' ట్రబుల్!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. గృహ, వాణిజ్య సిలిండర్ల మధ్య తేడా లేకుండా బ్లాక్ మార్కెట్ దందా నడుస్తుంటే కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. అత్యవసర వినియోగానికి ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టళ్లకు సైతం గ్యాస్ను అందించలేని దుస్థితిలో ఉంది. పైకి మాత్రం చంద్రబాబు యంత్రాంగం బూటకపు ప్రకటనలు చేస్తూ కాలం గడిపేస్తోంది. ముఖ్యంగా టీడీపీ నాయకులు, సానుభూతిపరుల చేతుల్లోని గ్యాస్ ఏజెన్సీల ద్వారా బ్లాక్ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తోంది. ఫలితంగా సంక్షోభ పరిస్థితులను అనుకూలంగా మలుచుకునే చంద్రబాబు నైజం మరోసారి బట్టబయలైంది. ముఖ్యంగా హోటళ్లు, కాఫీ షాపులు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా చేయట్లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. బ్లాక్ మార్కెట్లో రూ.3వేల నుంచి రూ.4వేలు చెల్లిస్తే సిలిండర్లు దొరకడం అధికార పార్టీ దందాను బట్టబయలు చేస్తోంది. మరోవైపు గృహ వినియోగ గ్యాస్ పంపిణీకి ఎటువంటి అవరోధం లేకపోయినా వినియోగదారులు గ్యాస్బుక్ చేసుకుని వారం రోజులు దాటుతున్నా సరఫరా జరగట్లేదు. నిత్యం గ్యాస్ ఏజెన్సీలకు ఫోన్లు చేస్తే రేపు, ఎల్లుండి.. అంటూ సమాధానం వస్తోంది మినహా గ్యాస్ అందట్లేదు. సహజ వాయువులు, ఎల్పీజీ ఉత్పత్తులను ‘నిత్యావసర వస్తువుల చట్టం’లోకి మార్చినప్పటికీ యథేచ్ఛగా పక్కదారి పట్టిస్తుండటం గమనార్హం. నాలుగు రోజులకే నిల్వ! ఏపీలో 1.61 కోట్ల గృహ వినియోగ, 10లక్షల వరకు వాణిజ్య వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ వినియోగానికి రోజుకు 4వేల టన్నుల గ్యాస్ అవసరం. రాష్ట్రంలో 17 వేల టన్నుల నిల్వలు ఉన్నాయి. ఇది నాలుగు రోజులకు మాత్రమే సరిపోతాయి. గడిచిన కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి. గతంలో నిత్యం 2.50 లక్షలకు పైగా గ్యాస్ సిలిండర్లు సరఫరా ఉంటే తాజా ఆందోళనకర పరిస్థితుల్లో రోజువారీ బుకింగ్లు 3లక్షలకుపైగా పెరిగాయి. గ్యాస్ బుకింగ్ గడువు పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులకు పెంచిన తర్వాత కూడా బుకింగ్లు తగ్గట్లేదు. అంటే, ఇంటిలో గ్యాస్ నిండుకుంటున్న తరుణంలో బుక్ చేసుకున్న వినియోగదారులు వారానికిపైగా సిలిండర్ కోసం ఎదురు చూడకతప్పని పరిస్థితి. మరోవైపు క్లిష్ట పరిస్థితుల్లో వెసులుబాటు ఇవ్వాల్సిన చోట ప్రభుత్వం ఈ–కేవైసీని తప్పని సరి చేయడంతో సమస్య జటిలమైంది. గ్యాస్ బుక్ అవ్వట్లేదంటూ వేలాదిమంది వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మూసివేతకు దగ్గరగా హోటళ్లు గ్యాస్ కొరత హోటళ్లు, ఆతిథ్య రంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలో 2వేలకు పైగా స్టార్ హోటళ్లు, 3 వేలకుపైగా రెస్టారెంట్లతో పాటు చిరువ్యాపారులు కలుపుకొంటే 25వేలకుపై వ్యాపార సంస్థలు దినదిన గండంగా నడుస్తున్నాయి. నిత్యం హోటళ్ల రంగంలో 50 వేలకుపైగా సిలిండర్లు అవసరం. అలాంటిది ఒక్కసారిగా గ్యాస్ సరఫరా నిలిపివేడయంతో ఎప్పుడు పొయ్యి ఆరిపోతుందో తెలియని పరిస్థితుల్లో పని చేస్తున్నాయి. ప్రభుత్వం వాణిజ్య సిలిండర్లకు ఆంక్షలు పెడితే.. బ్లాక్ మార్కెట్లో రూ.3 వేలు నుంచి రూ.4వేలు వెచ్చించి కొనుగోలు చేస్తూ వ్యాపారాలు సాగిస్తున్నాయి. ఈ బ్లాక్ మార్కెట్ దందా గృహ వినియోగ సిలిండర్ల కొరతకు ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే చాలా హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసు వ్యాపారులు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు.మార్కెట్లోని పరిస్థితిలో మార్పు రాకపోతే హోటళ్ల మూసివేతకు వారం కంటే ఎక్కువ సమయం పట్టదని అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హోటళ్ల సమయాన్ని అధికారికంగా రాత్రి 10 గంటల్లోపు కుదించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడం గమనార్హం. -
బీసీ, ఎస్సీ నేతలపైనే బాబు ప్రతాపం
సాక్షి, అమరావతి: అడ్డగోలు వ్యవహారాలు నడుపుతూ దొరికిపోయిన టీడీపీ నేతలపై చర్యల విషయంలో సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పట్ల ఆపార్టీ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎస్సీ, బీసీ నేతలైతే వెంటనే చర్యలు తీసుకోవడం.. సొంత సామాజికవర్గం నేతల విషయంలో మౌనముద్ర దాల్చడం ఏంటని మండిపడుతున్నారు. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో చిక్కడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు. అదే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలపై ఎంత దుమారం రేగినా కిక్కురుమనకపోవడాన్ని పలువురు యాదవ సామాజిక వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సొంత సామాజికవర్గం నేత కావడంతోనే బీఆర్ నాయుడు పవిత్రమైన టీటీడీ చైర్మన్గా ఉండి రాసలీలలు నడుపుతున్నా పట్టించుకోకుండా వదిలేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజానీకంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. కనీసం టీటీడీకి ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని అయినా బీఆర్ నాయుడిపై చర్యలు తీసుకుంటే బాగుండేదని తటస్థులు సైతం పేర్కొంటున్నారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనని, ఆయన ఒక్క క్షణం టీటీడీ చైర్మన్గా కొనసాగినా పదవికి కళంకమేనని సోషల్ మీడియాలో సైతం చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంతో టీటీడీ ప్రతిష్టకు భంగం వాటిల్లినా చంద్రబాబు నోరు మెదపలేదు. కనీసం ఆయన్ను వివరణ కూడా అడగకుండా.. ఎవరు ఎటు పోయినా.. రాష్ట్రం ఏమైనా.. టీటీడీ భ్రష్టు పట్టిపోయినా ఫర్వాలేదనే రీతిలో బీఆర్ నాయుడిని కొనసాగిస్తున్నారు. బీఆర్ నాయుడు తీరుపై కూటమి నేతల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన వల్ల అందరం ఇరుకునపడ్డామని, ఇంకా అందలం ఎక్కించడం ఏమిటనే అసహనం దాదాపు అందరిలోనూ కనిపించింది. అయినా సరే.. సొంత సామాజికవర్గం కావడం, అందులోనూ తనకు డప్పు కొట్టడంలో రికార్డులు బద్దలుకొట్టిన ఒక టీవీ ఛానల్కు బీఆర్ నాయుడు యజమాని కావడంతో చంద్రబాబు చేష్టలుడిగిపోయారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. పుట్టాకు షోకాజ్ డ్రామా.. డ్రగ్స్ కేసులో దొరికిపోయిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో తాను సీరియస్ అయినట్లు చంద్రబాబు లీకులు ఇచ్చారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, వెంటనే వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్ నోటీసుల డ్రామాకు తెర తీశారు. వాస్తవానికి పుట్టా మహేష్ పై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాల్సి ఉన్నా సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు, మరో సీనియర్ నేత సుధాకర్ యాదవ్కుమారుడు కావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చి ఊరుకున్నారు. కనీసం నామమాత్రంగా తీసుకున్న ఇలాంటి చర్యలైనా బీఆర్ నాయుడి విషయంలో ఎందుకు తీసుకోలేకపోయారనే ప్రశ్నకు చంద్రబాబు వైపు నుంచి సమాధానం లేకుండా పోయింది. కోనేటి ఆదిమూలం సస్పెన్షన్ గతేడాది సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియో బయటకు రావడంతో ఆయనపై ఆగమేఘాల మీద సస్పెన్షన్ వేటు వేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీ లోనే ఉన్నా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దళిత నేత కావడంతో ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పుట్టా మహేష్ బీసీ కావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చి డ్రామా నడిపారు. కానీ బీఆర్ నాయుడు తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయన్ను కనీసం వివరణ కూడా అడగలేదు. ఎస్సీ నేతలపై ఒంటి కాలిపై లేస్తున్న చంద్రబాబు.. బీసీలైతే ఓ మాదిరిగా స్పందిస్తున్నట్లు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అదే సొంత సామాజికవర్గం నేతలైతే ఎంత పెద్ద తప్పు చేసినా కనీసం పట్టించుకోనని తేల్చేసినట్లు ఈ మూడు ఉదంతాల ద్వారా తేటతెల్లమైందని పేర్కొంటున్నారు. -
కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే బెయిలా?
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెడుతున్నారు.. డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పట్టుబడితే మాత్రం స్టేషన్ బెయిల్పై విడుదల చేస్తున్నారు. చిన్న చిన్న కేసుల్లో అమాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్న ప్రభుత్వం.. కూటమి నేతల డ్రగ్స్ కేసులు, మహిళలపై పాల్పడుతున్న నేరాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టకుండా ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది’ అని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఈ ద్వంద్వ వైఖరిని వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా సోమవారం ప్రశ్నించింది. ఏలూరు నియోజకవర్గ లోక్సభ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్న కేసులో అడ్డంగా పట్టుబడ్డారని, ఇలాంటి ఘటన పార్లమెంట్ చరిత్రలో అరుదని పేర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ బలాన్ని ఉపయోగించి బెయిల్పై బయటకు తీసుకురావడం, షోకాజ్ నోటీసుల పేరుతో డ్రామాలు చేయడం సరికాదని అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్పందించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారన్న ఆరోపణలు, డ్రగ్స్ పరీక్షలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రక్త పరీక్షల్లో కొకైన్ వాడినట్లు పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారని, దీనిపై స్పందించాలని కోరారు. అలాగే మహిళలపై వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కూటమి ప్రజాప్రతినిధులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వైఎస్సార్సీపీ మండిపడింది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన అత్యాచార ఆరోపణలు, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక దాడి ఆరోపణలు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై వేధింపుల ఆరోపణలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్పై అశ్లీల వీడియో కాల్స్ ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు లేవని ధ్వజమెత్తింది. మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై కూడా చర్యలు తీసుకోలేదని తెలిపింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఒక మహిళను మోసం చేశాడని ఆరోపణలు వచి్చనప్పటికీ స్పందన లేకపోవడం ఆందోళనకరమని తెలిపింది. కమిటీల విచారణలు, షోకాజ్ నోటీసుల పేరుతో డ్రామాలు ఆపి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. లేకపోతే ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని క్షమించరని ఎక్స్లో వైఎస్సార్సీపీ హెచ్చరించింది. -
మైకంలో ముంచారు..!
ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను బురిడీ కొట్టించడం తన పేటెంట్ హక్కని చంద్రబాబు మరోసారి నిరూపించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాకు తలుపులు బార్లా తెరిచారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన లోకేశ్ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. డ్రగ్స్ బ్యాచ్కు వత్తాసు పలుకుతూ ప్రజలను మోసగిస్తున్నారు. మాదక ద్రవ్యాల బానిసలను అరెస్టు చేయాలని ఎన్నికల ముందు వేదికల మీద వీరావేశంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్.. టీడీపీ కూటమి గంజాయి దందాపై మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోతున్నారు. వెరసి అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నిజ స్వరూపం ప్రదర్శించారు. రాష్ట్రాన్ని టీడీపీ డ్రగ్స్ మాఫియాకు అప్పగించేసి తన మార్కు మోసాన్ని పునరావృతం చేశారు. దీంతో మాయల ఫకీరు మాయమాటలు నమ్మి మోసపోయిన బాలనాగమ్మలా తయారైంది రాష్ట్రం పరిస్థితి. టీడీపీ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలో డ్రగ్స్, గంజాయి రాజధానిగా ముద్ర వేసుకుని జాతీయ స్థాయిలో చెడ్డపేరు తెచ్చుకుంటోంది. -సాక్షి, అమరావతి నాడు ప్రజల్ని మభ్య పెట్టేందుకే విష ప్రచారం..చంద్రబాబు బృందం పన్నాగం తాము అధికారంలోకి వస్తే చాలు డ్రగ్స్, గంజాయిలను అరికడతామన్న చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ మాటలు ఎన్నికల ముందు కోటలు దాటాయి. నాడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేసేందుకు గంజాయి, డ్రగ్స్ దందా పెరిగిపోయిందంటూ ఊరూవాడా దుష్ప్రచారానికి తెర తీశారు. అందుకు టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా వత్తాసు పలికింది. కారు కూతలు, కాకి లెక్కలతో ప్రజల్ని తప్పుదారి పట్టించాయి. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి దందాను ఉక్కుపాదంతో అణచివేసింది. అందుకోసమే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అనే వ్యవస్థను ప్రత్యేకంగా నెలకొల్పి విస్తృత అధికారాలు కల్పించింది. ‘సెబ్’ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ)లో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి సాగును కూకటి వేళ్లతో పెకిలించి వేసింది. ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో విజయవంతంగా నిర్వహించి 11,500 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించింది. దశాబ్దాలుగా గంజాయి సాగును జీవనాధారంగా చేసుకున్న గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. తద్వారా ఏవోబీలో గంజాయి సాగు అన్నదే లేకుండా చేసింది. అయినా సరే.. చంద్రబాబు, లోకేశ్ రాజకీయ దురుద్దేశాలతో నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే చాలు వంద రోజుల్లోనే గంజాయి, డ్రగ్స్ అనేవే లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఈ దుష్ప్రచార కుట్రలో చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ పాలు పంచుకుని మరింత దిగజారుడు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారని... ఈమేరకు కేంద్ర నిఘా వర్గాలు తనకు తెలిపాయంటూ దుష్ప్రచారం చేశారు. అందుకు గంజాయి బ్యాచ్లే కారణమని ఆరోపణలు చేశారు. ఇలా చంద్రబాబు ముఠా ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా పక్కా పన్నాగంతో దుష్ప్రచారానికి బరి తెగించింది. నాడు దుష్ప్రచార రాద్ధాంతం.. నేడు డ్రగ్స్ దందాపై మౌనమే సిద్ధాంతంఇదీ పవన్ కళ్యాణ్ తీరు రాష్ట్రంలో 34 వేల మంది బాలికలు కనిపించకుండా పోయారని గతంలో విష ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ తాను ఉప ముఖ్యమంత్రి కాగానే ఆ మాటే ఎత్తడం లేదు. మరి ఆ బాలికలను సురక్షితంగా వారి కుటుంబాల దగ్గరకు చేర్చేందుకు ఏ చర్యలు తీసుకున్నారంటే సమాధానమే చెప్పడం లేదు. ఎందుకంటే.. వైఎస్సార్సీపీ హయాంలో బాలికలు కనిపించకుండా పోయారని తాను చేసింది తప్పుడుప్రచారమేనన్న నిజం ఆయనకు తెలుసు కాబట్టే!నాడు చంద్రబాబు కుట్ర స్క్రిప్ట్ ప్రకారమే అవాస్తవ ఆరోపణలతో పవన్ నటించారన్నది స్పష్టమైంది. ఇక ప్రస్తుతం టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకున్నారని వెల్లడైనా సరే పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కూటమి ప్రభుత్వంలో ఈ 20 నెలల్లోనే 280 మంది మహిళలపై లైంగిక దాడులు జరిగినా.. వారిలో 15 మందిపై హత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చినా పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు. ఎందుకంటే.. ఈసారి చంద్రబాబు ఆయనకు స్క్రిప్ట్ ఇవ్వలేదు కదా!నేడుడ్రగ్స్ దందాకు రాచబాటమత్తు మందుల రాజధానిగా ఏపీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నిజ స్వరూపం ప్రదర్శించారు. టీడీపీ గంజాయి, డ్రగ్స్ మాఫియాకు తలుపులు బార్లా తెరిచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అణచివేసిన గంజాయి దందాను మళ్లీ తెరపైకి తెచ్చారు. చంద్రబాబుకు వీరవిధేయులైన టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలే రింగ్ మాస్టర్లుగా డ్రగ్స్ దందాకు బరి తెగించారు. ఏవోబీలో గంజాయి సాగును మళ్లీ పట్టాలు ఎక్కించడంతోపాటు.. ఒడిశా, చత్తీస్ఘడ్ నుంచి గంజాయి స్మగ్లింగ్కు ఏపీని గేట్వేగా మార్చేశారు. ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలను తమ గంజాయి దందాకు మార్కెట్గా చేసుకున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు డోర్ డెలివరీ... ఫామ్హౌస్లో రేవ్ పార్టీలంటే చాలు బల్్కగా సరఫరా... విద్యా సంస్థలే లక్ష్యంగా రిటైల్ అమ్మకాలు...! ఇలా వివిధ రీతుల్లో గంజాయి, డ్రగ్స్ మార్కెటింగ్ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇక ద్రవరూప గంజాయి (లిక్విడ్ గంజాయి) మాఫియా అయితే అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. సాధారణ గంజాయి కిలో రూ.12 వేలు ఉంటే... లిక్విడ్ గంజాయి లీటరు రూ.లక్ష ధర పలుకుతుండటమే అందుకు కారణం. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ‘గంజాయి వద్దు బ్రో..’ అనే నినాదాలతో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ టీడీపీ గంజాయి మాఫియా దర్జాగా దందా సాగిస్తున్నా కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఏటా రాష్ట్రం గుండా రూ.600 కోట్ల విలువైన 5 లక్షల కిలోల గంజాయి దందా సాగుతోందని పోలీసు వర్గాలే అంచనా వేస్తున్నాయి. ఇక అప్ఘనిస్తాన్, నేపాల్ నుంచి తెప్పిస్తున్న కొకైన్ లాంటి డ్రగ్స్ దందా మరో రూ.500 కోట్లు ఉంటుందని చెబుతున్నాయి. దాంతోపాటు టీడీపీ మద్యం మాఫియా ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాను ఏకంగా కుటీర పరిశ్రమ తరహాలో ఊరూవాడా నెలకొల్పి దోపిడీకి పాల్పడుతోంది. ఏటా రూ.5 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల దోపిడీయే లక్ష్యంగా దందా సాగిస్తోంది. ‘దమ్మారో... దమ్’ అంటున్న కూటమి నేతలు మరోవైపు టీడీపీ కూటమి నేతలు దమ్మారో దమ్..! అంటూ డ్రగ్స్, గంజాయి మత్తులో జోగుతున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుదీర్రెడ్డి డ్రగ్స్ మత్తులో జోగుతూ ఇటీవల పోలీసులకు చిక్కారు. గతేడాది భీమవరం ఎమ్మెల్యే పి.రామాంజనేయులు కుమారుడు కూడా హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో చిక్కారని జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కావడం గమనార్హం. తాజాగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్లో డ్రగ్స్ సేవించి అడ్డంగా దొరికారు. అయినా సరే కేవలం షోకాజ్ నోటీసుతో చంద్రబాబు సరిపుచ్చారు. తమ అధినేత అండ చూసుకునే ఎంపీ పుట్టా మహేశ్ సోమవారం లోక్సభ సమావేశాలకు దర్జాగా హాజరయ్యారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
న్యాయానికి ముసుగేసి.. వాస్తవాలు దాచేసి..
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలను పక్కదోవ పట్టించి, చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా విచారణ సాగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి ఆరోపించారు. సోమవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో సునీత అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని, సీబీఐ విచారణలో ఉన్న లొసుగులను ఆధారాలతో సహా ఎండగట్టారు. ‘హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరికి సునీత మద్దతుగా నిలబడటం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేము కోర్టును కోరితే, ఆమె మాత్రం లూథ్రా వంటి ఖరీదైన న్యాయవాదులను పెట్టి అతడికి అండగా ఎలా నిలబడతారని నిలదీశారు. హత్య జరిగిన వెంటనే వివేకానంద రాసిన లేఖ గురించి పీఏ కృష్ణారెడ్డి ద్వారా సమాచారం అందినప్పటికీ, పోలీసులు వచ్చే వరకు ఆ లేఖను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. సీబీఐ ముందు సునీత ఒకసారి లేఖ గురించి తెలుసునని, మరోసారి తెలియదని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని... ఇలా స్టేట్మెంట్లు మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి? లేఖను దాచిపెట్టడం నేరం కాదా? అందులో ఉన్న నిజాన్ని ఎందుకు తొక్కిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు వివేకానందరెడ్డి గారి రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడికి ఆస్తిలో వాటా వెళ్తుందనే భయంతో ఈ హత్య జరిగి ఉండవచ్చన్న అవినాష్ రెడ్డి... ఇది ‘మర్డర్ ఫర్ గెయిన్’ (ఆస్తి కోసం జరిగిన హత్య) కోణం కాదా? ఈ విషయాలపై దర్యాప్తు చేయాలని సునీత ఎందుకు కోరడం లేదని నిలదీశారు. షమీమ్ కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. అలాగే వివేకాకు, షమీమ్కు మధ్య నడిచిన చాట్స్ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసును వచ్చే ఎన్నికల వరకు లాగడం ద్వారా చంద్రబాబుకు పొలిటికల్ మైలేజ్ ఇవ్వడమే సునీత లక్ష్యంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు.. ఢిల్లీలో ఉన్న కొందరు పెద్ద మనుషుల అండతో, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే న్యాయం గెలిచే రోజు వస్తుందని... మమ్మల్ని అనవసరంగా నిందించిన వారంతా ముక్కున వేలేసుకునే రోజు దగ్గర్లోనే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరగా విచారణ పూర్తి చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలి అని అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం నిందితులు విచారణలో అనేక విషయాలు చెప్పారు. వివిధ లావాదేవీల్లో వైఎస్ వివేకానందరెడ్డికి డబ్బులు, డైమండ్స్ రూపంలోనూ, ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉంది. దాని కోసం వివేకానందరెడ్డి గారు కొంత మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయిందీ, రావాల్సిన డబ్బు రాకుండా పోయిందన్న బాధ ఆయనకు ఉంది. అందుకే అందరి మీద కోప్పడేవారని ఉంది. దాని మీద ఎందుకు తదుపరి దర్యాప్తు సునీత కోరడం లేదు?. మరోవైపు తొలిసారి 161 స్టేట్మెంట్లో దస్తగిరి... వివేకానందరెడ్డి గారిని చంపక ముందు డాక్యుమెంట్లు గురించి అడిగామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి ఆయన్ను తీవ్రంగా కొట్టామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కున్న తర్వాత అవి తాము అనుకున్నవో కావో తేల్చుకున్న తర్వాతే చంపామని చెప్పాడు. హత్య అనంతరం రెండు మూడు సార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లామని కూడా చెప్పాడు. దస్తగిరి బెయిల్ ఎందుకు అడ్డుకోలేదు? మీకు అత్యంత ఆప్తుడైన దస్తగిరి ఇంత స్పష్టంగా చెప్పాడు. ఆయన బెయిల్ రద్దు చేయమని మేమే కోర్టులో వేసినా.. మీరు మాత్రం ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఏకంగా లూథ్రా లాంటి న్యాయవాదిని దస్తగిరి తరపున నియమించి మాపై పోరాడతారు. చంద్రబాబుకు, వివేకాను హత్య చేసిన దస్తగిరికి, మీకు న్యాయవాదిగా లూథ్రాయే ఉండడంలోని ఆంతర్యమేమిటి? దస్తగిరికి యాంటిసిపేటరీ బెయిలిచ్చినా మీరు అడ్డుకోలేదు. ప్రతి అంశానికి అడ్డుపడే మీరు తానే మీ నాన్నగారిని చంపానని దస్తగిరి చెప్పినా ... అతను దర్జాగా బయట తిరుగుతున్నా కనీసం బెయిల్ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన్ను శిక్షించాలని మీరు ఎందుకు కోరరు? అంత కీలకమైన డాక్యుమెంట్లు ఏవని అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఇదే విషయాన్ని అడగడానికి మీకు ఎందుకు నోరు రావడం లేదు? కోర్టును, సీబీఐను అడగాల్సిన బాధ్యత మీకు లేదా? హత్య అనంతరం లేఖ గురించి ఎందుకు చెప్పలేదు? మీ తల్లి, భర్త అటెండర్కు సెలవు ఇచ్చి పంపిస్తే మీరు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు? హత్య జరిగిన రోజు రాత్రి దోపిడీకి గురైన డాక్యుమెంట్ల గురించి కూడా మీరు నోరు మెదపడం లేదు.. సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ.... కీలకమైన విషయాలను ఇగ్నోర్ చేసే కార్యక్రమం మీరు ఇన్నాళ్లూ చేశారన్నది పచ్చి నిజం. ఈ కేసులో పీఏ కృష్ణారెడ్డి తొలుత మృతదేహాన్ని, లేఖను చూసిన తర్వాత తొలుత సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి బావమరిది, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సొంత సోదరుడు శివప్రకాష్ రెడ్డికి ఆ లేఖ గురించి, చనిపోయిన విషయం కూడా చెప్పాడు. ఆ లెటర్లో అంశాలు కూడా మీ అందరికీ చదివి వినిపించాడు. కానీ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అక్కడున్న లెటర్ గురించి ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు?. వివేక అటెండర్ పండంటి రాజశేఖర్ను హత్యకు ముందు రోజు కుటుంబసభ్యులే కాణిపాకం ఎందుకు పంపించారు?సునీత పరస్పర విరుద్ధ ప్రకటనలు... పైగా ఎవరికీ లేని అవకాశం సీబీఐ సునీతకి ఇచ్చింది. 2020 జులై 28న ఆ లేఖ గురించి సునీతను సీబీఐ అడిగింది. ఈ లేఖ చాలా కీలకమైన ఆధారం, ఆ లేఖ గురించి తెలిస్తే ఇది హత్య అని తెలిసి ఉండేది, అంత ప్రాముఖ్యత ఉన్న లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారని ప్రశ్నించింది. దానికి ఆమె లెటర్ ఉన్న విషయం పీఏ కృష్ణారెడ్డి తమకు వాట్సప్లో చెప్పాడని అంగీకరించింది. అదే టైంలో ఎందుకు బయట పెట్టలేదనడానికి ఊరంతా గొడవలు అవుతాయని చెప్పలేదంటూ పెద్ద థియరీ చెప్పారు. మరలా నెల రోజులకు 27 ఆగస్టు 2020 నాడు సీబీఐ ముందుకు వచి్చ, నెల రోజుల క్రితం లెటర్ గురించి తాను చెప్పినదంతా తూచ్... నాకు ఆ లేఖ గురించి ఏం తెలియదు, నేను ఏ లెటరూ చూడలేదు, సాయంత్రం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారి చేతిలో లేఖ చూడ్డం తప్ప నాకేమీ తెలియదు అని అబద్దం చెప్పింది. ముందు ఒక వాంగ్మూలం ఇచి్చన తర్వాత దాన్ని కవర్ చేయడానికి సీబీఐ మరో వాంగ్మూలం తీసుకోవడం ఎంత వరకు సమంజసం? మరో కీలమైన అంశం నా బెయిల్ గురించి హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు... గతంలో సునీత మాట్లాడిన వీడియోను హైకోర్టు ముందు ఉంచాను. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన 12 రోజులకు అంటే మార్చి 27, 2019లో మాట్లాడుతూ... గడిచిన కొన్ని నెలలుగా అవినాష్ని ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి మా నాన్న శ్రమిస్తున్నారు అని మాట్లాడిన వీడియోను హైకోర్టుకు సమర్పించాను. అనంతరం నాకు బెయిల్ వచ్చిన తర్వాత మరలా సీబీఐ అధికారులను సునీత పిలిచి... మరలా మే 31, 2023 అంటే మూడేళ్ల తర్వాత గతంలో మాట్లాడిన వీడియోను కవర్ చేసే విధంగా మరో స్టేట్మెంట్ ఇప్పించారు. అందులో భాగంగా గతంలో మీరు ఎందుకు అలా మాట్లాడారు అని సీబీఐ అడిగితే నాకు సజ్జల రామకృష్ణారెడ్డి అలా మాట్లాడమన్నారు అందుకే మాట్లాడానని చెప్పింది. విచారణలో లొసుగులను ఇవన్నీ తేటతెల్లం చేస్తున్నాయి. మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారించరు? వివేకాకు, ఆయన రెండో భార్య షమీమ్కు మధ్య నడిచిన చాట్స్ను బయటపెట్టే ధైర్యం ఉందా? వివేకా రెండో భార్య కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయించే ధైర్యం మీకు ఉందా? ఈ కేసులో విచారణను పరిశీలిస్తే.. వివేకానందరెడ్డి ఆమె పేరిట ఆస్తులు ఇవ్వాలనుకున్నారని ఉంది. హైదరాబాద్లో ఒక ఇల్లు కొనివ్వాలనుకున్నాడని ఉంది. షమీమ్ కుమారుడిని హెచ్పీఎస్ స్కూలులో అడ్మిషన్ తీసుకుని చేర్చాలనుకున్నాడని ఉంది. వాళ్లను పూర్తిగా సెటిల్ చేయాలనుకున్నాడని ఉంది. ఒకవైపు వివేకాకు సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్ పూర్తిగా చెక్ పవర్ తీసేశారు. ఖర్చులకు కూడా డబ్బులేని పరిస్థితికి ఆయన్ను తీసుకొచ్చారు. చివరగా గత మూడేళ్లులో ఆయనతో మాట్లాడడంలేదని కూడా విచారణలో సునీతక్క మాటల్లో ఉంది. ఆ కోణంలో ఎందుకు విచారించడం లేదు..? షమీమ్కు వివేకా ఎన్నో హామీలిచ్చారు. అవి నెరవేరకుండానే హత్యకావించబడ్డారు. ఎవరు చేసి ఉంటారు ఈ హత్య? ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వివేకా ఆస్తులు షమీమ్కు, ఆమె కొడుకుకు పోతే నష్టపోయేదెవరు? ఆ నష్టం వాటిల్లకుండా వారే చేసి ఉండవచ్చు కదా? మర్డర్ ఫర్ గెయిన్ ఎందుకు కాకూడదు ఇది? ఆ దొంగిలించబడ్డ రౌండ్ సీల్ ఉన్న డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారణ చేయలేదు? నిత్యం విచారణను అడ్డుకునే ప్రయత్నంలో సునీత... ముఖ్యంగా రామ్ సింగ్ వీళ్ల చేతుల్లోకి వచి్చన తర్వాత సుధాసింగ్, దీపక్ గారిని విచారణ నుంచి తప్పించిన తర్వాత పూర్తిగా శిక్షణ ఇచ్చి ఇష్టమొచి్చనట్లు స్టేట్ మెంట్లు తీసుకున్నారన్నది పచ్చి నిజం. అదే విధంగా దస్తగిరి తన స్టేట్మెంట్లో వివేకానందరెడ్డి గారికి అనేక అక్రమ సంబంధాలున్నాయని చెప్పారు. ఆ కోణంలో కూడా విచారణ అడిగే ప్రయత్నం సునీత చేయదు. అది వ్యక్తిగత అంశం కాబట్టి నేను అటువైపు వెళ్లదల్చుకోలేదు. నేను అనేకసార్లు సీబీఐ డైరెక్టర్కి వినతిపత్రం ద్వారా మొరపెట్టుకున్నా మా మొర ఆలకించలేదు. ఆ రోజుల్లో విచారణలో వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నాలు జరగలేదు. ఏకపక్షంగా విచారణ జరిగింది. ఇప్పుడు కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్లి, విచారణ అడ్డుకునేలా ప్రయత్నం చేస్తోంది. గడిచిన రెండు, మూడేళ్లుగా ఇదే పని చేస్తోంది. వచ్చే ఎన్నికల వరకు హత్య కేసును లాగడమే లక్ష్యం... ఎప్పుడు విచారణ జరిగినా.. దేవుడి ముందు, చట్టం ముందు మేం తప్పు చేయలేదన్న విషయాన్ని నిరూపించుకుంటామన్న ధైర్యం, నమ్మకం, విశ్వాసం మాకుంది. విచారణ జరిగేలా సహకరించమని సునీతని కోరుతున్నాం. కానీ వీరి ఆలోచన మాత్రం వచ్చే ఎన్నికల వరకు వివేకానంద రెడ్డి హత్య కేసును లాగడం ద్వారా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చడమే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. విచారణ జరగకూడదన్నట్లు, దోషులెవరూ బయటకు రాకూడదన్నట్లు ఆమె వైఖరి ఉంది. ఎవరైనా ఆధారాలుంటే విచారణ సందర్భంగా సమర్పిస్తారు.. కానీ సునీత అలా చేయకుండా ఈ కేసును ఇలాగే కొనసాగించాలని, చంద్రబాబు చేతిలో పావులా మారి ఆయనకు రాజకీయంగా ఉపయోగపడాలన్న ఆరాటం తప్ప.. న్యాయం కోసం పోరాటం అన్నది ఎక్కడా లేదు. కాబట్టి చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనలను పక్కన పెట్టాలని కోరుతున్నాను.తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ...ఏపీకి సంబంధించిన పెద్ద మనిషి, ఢిల్లీలో కీలకమైన పోస్టులో ఉండడం, ఆయన ఆశీస్సులతో అప్పటి సీబీఐ డైరెక్టర్ నియామకం జరగడం, ఆయనను సునీత అనేకసార్లు కలవడం, చంద్రబాబు నాయుడు, సునీత కలిసి ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ దిశగా కేసును తీసుకెళ్లారు. వారికి నచి్చన వారిని తీసుకెళ్లి సీబీఐ విచారణ చేసింది. గతంలో ఎన్నికల ముందు 2024 ఏప్రిల్లో నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాను. నన్ను సీబీఐ 12 సార్లు విచారణకు పిలిచింది. నేను మూడోసారి సీబీఐ విచారణకు వెళ్లినప్పుడు హత్య జరిగిన రోజు మేము గమనించిన విషయాలు చెప్పాను. నేను సీఐ గారికి సమాచారం ఇచ్చాను. స్థానికులు వివేకానందరెడ్డి గారిని చూస్తామని గట్టిగా గొడవపడితే వాళ్లను కూడా అనుమతించాం. ఆ రోజు నేను సీబీఐకి చెప్పాను. ఆ రోజు వచి్చన హిమకుంట్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి.. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. 2025లో సునీత, ఆమె భర్త ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి... ఘటన జరిగిన తర్వాత వెళ్లిన వాళ్లలో నువ్వు కూడా ఉన్నావు, సీబీఐ వాళ్లు నిన్ను పిలిచి విషయం అడుగుతారని చెప్పారు. దానికి ఆయన నేను తప్పకుండా చెబుతానంటే... అలా చెప్పడం కాదు అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పాడని స్టేట్మెంటు ఇమ్మన్నారు. నాకు అలా చెప్పలేదంటే... మా నాన్నకి ఆప్తుడివి నువ్వు అలా చెప్పాల్సిందేనని అంటే... అక్కడ నుంచి వెళ్లిపోయి మరలా వారం తర్వాత ఆయనపై ఒత్తిడి తెచి్చ.. తాము చెప్పమన్నట్టే స్టేట్మెంట్ ఇమ్మని ఒత్తిడి చేశారు. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదే రీతిలో తప్పుడు స్టేట్మెంట్లను ఇప్పిస్తూ వచ్చారు. వారినే సీబీఐ పిలుస్తూ వచి్చంది.విచారణ పూర్తి చేయాలి..సునీత లేఖ దాచిపెట్టిన విషయం, సౌభాగ్య పెద్దమ్మ, నర్రెడ్డి రాజశేఖర్ కలిసి అటెండర్కి సెలవు ఇచ్చి కాణిపాకం పంపించడం, డాక్యుమెంట్ దొంగతనం వంటి అంశాలపై దర్యాప్తు కోరాల్సింది పోయి.. అసలు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తోంది. దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. దస్తగిరి బెయిల్ క్యాన్సిలేషన్ కోసం మేం పిటిషన్ వేస్తే.. వెంటనే ఆమె ఇంప్లీడ్ అయి.. దస్తగిరి తరపున లూథ్రాతో వాదనలు వినిపిస్తారు. ఈ కేసు విషయంలో గత మూడేళ్లుగా వాస్తవాలు తెలియకుండా మమ్నల్ని ఎంతో మంది దూషించారు. వీళ్లంతా తాము అనవసరంగా నిందించామని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఈ కేసు ఆలస్యం కాకుండా త్వరగా విచారణ జరిగే దిశగా న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలి. సునీత భర్త రాజశేఖర్కు టీడీపీ నాయకుడు బీటెక్ రవికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలి.గుండెపోటు థియరీని సృష్టించింది సునీతే..ఈ కేసులో అనేక సందర్భాల్లో సీబీఐ అప్పటి డైరెక్టర్కు తాము చెప్పిన కోణాల్లో దర్యాప్తు చేయాలని విజ్ఞపి చేశాం. పైన నేను చెప్పిన అన్ని అంశాలను లేఖ రూపంలో రాశాను. కేవలం టార్గెటెడ్ దర్యాప్తు చేసిందే తప్ప... సీబీఐ వాస్తవాలను వెలికి తీసే దిశగా దర్యాప్తు చేయలేదు. గతంలో కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి, సీబీఐకి మెయిల్స్, రిజిస్టర్డ్ పోస్టు రూపంలో మేము అనుకున్న అంశాలపై ఫిర్యాదు చేశాం. సునీత ఇప్పుడు కూడా చంద్రబాబు ఆదేశాల ప్రకారం పలు రకాల పిటిషన్స్ వేసి విచారణను మరింత ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఈ అంశాన్ని వెలుగులో ఉంచడమే వీరి లక్ష్యం. వివేకానంద రెడ్డి హత్య జరిగే నాటికి చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అదే విధంగా గుండెపోటు అని అవినాష్ రెడ్డి చెప్పాడని చెప్పమంటూ.. సునీత చాలా మందిని ట్రైన్ చేశారు. గుండెపోటు అని తాను అనుకున్నానని సునీత చెప్పింది. అసలు ఆ థియరీని సృష్టించింది, సిట్ ముందు చెప్పిందే సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి కూడా సిట్ ముందు హాజరై శివప్రకాష్ రెడ్డి, ఆయన కుమారుడు ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారన్నారు. చేసినదంతా వాళ్లే చేసి అన్యాయంగా మా మీద నిందలు వేశారు. మార్చి 16న సునీత తానే స్వయంగా సిట్ ముందు గుండెపోటు అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. కీలకమైన అంశాలను పక్కనపెట్టి.. ఇతర అంశాలను కోర్టు దృష్టికి, సీబీఐ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా విచారణను జాప్యం చేయడం ద్వారా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వివేకానందరెడ్డి చెక్ పవర్ తీసివేసి చనిపోయే ముందు ఖర్చులకు డబ్బుల్లేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఆయనతో మాట్లాడలేదు. ఆ కోణంలో విచారణ జరగాలి. షమీమ్కి వివేకానంద రెడ్డికి మధ్య జరిగిన చాట్స్ బయటకు రావాలి. దొంగిలించబడిన రౌండ్ సీల్ డాక్యుమెంట్లలో ఏముంది? మర్డర్ ఫర్ గెయిన్ దిశగా సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నదే మా వాదన. కొంతమందిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా వివేకం అని సినిమా తీసి రాక్షసానందం పొందారు. కానీ పైన దేవుడు కూడా క్షమించడు. వాళ్లందరినీ దేవుడు శిక్షించడం ఖాయం. ఈ ప్రశ్నలకు బదులేది?ఈ విషయాలపై మరింత విచారణకు సునీత ఎందుకు పట్టుబట్టడం లేదు?1. హత్యకు ముందు రోజు వివేకా అటెండర్ పండంటి రాజశేఖర్ను సౌభాగ్యమ్మ, అల్లుడు రాజశేఖర్ కాణిపాకం ఎందుకు పంపించారు?2. వివేకాను హత్య చేయడానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఆయన్ను హింసించామని దస్తగిరి చెప్పాడు. డాక్యుమెంట్లను వెరిఫై చేసుకున్న తర్వాతనే హత్య చేసినట్లు చెప్పాడు. హత్య చేశాక కూడా ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లినట్లు చెప్పాడు. రౌండ్ సీల్తో ఉన్న ఆ డాక్యుమెంట్లు ఏమిటి?3. హత్య జరిగిన చోట లేఖను సునీత భర్త రాజశేఖర్ ఎందుకు దాచినట్లు? లేఖలో విషయాలు ఎవరికీ చెప్పకుండా లేఖను దాచాల్సిందిగా పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం అనుమానాస్పదం కాదా?4. వివేకాకు అనేకమందితో అక్రమ సంబంధం ఉందని పేర్లతో సహా దస్తగిరి స్టేట్మెంట్లో ఉంది. ఆ మహిళల భర్తలు, పిల్లలు వివేకాపై కక్ష పెంచుకున్నారని ఆ స్టేట్మెంట్లో ఉంది.5. వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయన జీవించి ఉంటే 30 నుంచి 40శాతం ఆస్తులను తన రెండో భార్యకు ఇచ్చేవారు. అందుకని ఇది మొదటిభార్య కుటుంబం చేసిన మర్డర్ ఫర్ గెయిన్ కాదా?6. హంతకుడు దస్తగిరి ముందస్తు బెయిల్ను సునీత అడ్డుకోదు. ఎందుకంటే సునీత ఏం కోరుకుంటుందో అదే దస్తగిరి చెబుతాడు. స్టేట్మెంట్గా ఇస్తాడు. మేం దస్తగిరి బెయిల్ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళితే సునీత ఇంప్లీడ్ అయ్యింది. బెయిల్ రద్దు కోసం కాదు.. దస్తగిరి బెయిల్ ఉండాలని.. దస్తగిరి రక్షణ కోసం లూద్రా వంటి సీనియర్ లాయర్ను దింపుతుంది. -
బాబు పాలన హిందుత్వానికి ప్రమాదకరం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన హిందుత్వానికి ప్రమాదకరంగా మారిందని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్పై ఆరోపణలొస్తే విచారణ జరిపించకుండా తాత్సారం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం విజయవాడలోని వీహెచ్పీ కార్యాలయంలో పరిషత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభాగం క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, రాష్ట్ర విభాగం కోశాధికారి దుర్గాప్రసాదరాజు, విజయవాడ మహానగర కార్యదర్శి శ్రీహరి విలేకరులతో మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు, ధార్మిక, ఆధ్యాత్మిక బాధ్యతల్లో ఉన్నవాళ్లపై ఆరోపణలొస్తే తక్షణమే నైతిక బాధ్యతవహించి బాధ్యతల నుంచి తప్పుకోవాలని, లేకుంటే ప్రభుత్వమే దర్యాప్తునకు ఆదేశించాలని పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై ఆరోపణలొస్తే మిన్నకుండడం ఏమిటని ధ్వజమెత్తారు. ఎంపీ డ్రగ్స్ తీసుకున్న ఘటనపై స్పందించిన చంద్రబాబు, టీటీడీ చైర్మన్పై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని నిలదీశారు. ఇటీవల తరచూ ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పిల్లలను కంటే రాయితీలు ఇస్తామని చేస్తున్న ప్రకటన ఏ వర్గాలకని ప్రశ్నించారు. దేవుడి భూములను కాపాడాలని సర్కారుకు లేదు దేవదాయ శాఖ భూముల విషయంలో సర్కారు తీరు హిందూ సమాజానికి చాలా ప్రమాదకరంగా ఉందని తనికెళ్ల రవికుమార్ విమర్శించారు. ప్రైవేట్ వ్యక్తుల భూములు లక్షన్నర ఎకరాలు దేవదాయ భూముల్లో కలిశాయన్న సాకుతో దేవుడి మాన్యాలను దోచుకునే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. సర్వే నంబర్లు మారాయన్న పేరుతో దేవదాయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీర్ఘకాలిక లీజులెందుకు? పట్టణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాల భూములను 33 ఏళ్ల పాటు దీర్ఘకాలికంగా ప్రైవేట్ సంస్థలకు లీజుకివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 139 తేవడాన్ని సత్య రవికుమార్ తప్పుపట్టారు. దేవుడి భూములను గరిష్టంగా 11 ఏళ్లకు మాత్రమే టెండరు ద్వారా లీజుకు ఇవ్వాలని చట్టం ఉంటే 33 ఏళ్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. వీహెచ్పీ నేతలు లేవనెత్తిన మరిన్ని అంశాలివీ.. »‘‘కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట ఆలయ భూమి విజయవాడ సమీపాన గొల్లపూడిలో ఉంటే ఆ భూమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం, గోల్ఫ్ కోర్టుకు సర్కారు కేటాయించింది. దీనిని తప్పుబడుతూ సుప్రీంకోర్టు స్టే ఇస్తే.. 56 రోజుల్లో దానిని ఖాళీ చేసి అప్పగిస్తామని అఫిడవిట్ ఇచ్చిన సర్కారు ఇప్పటికి వంద రోజులైనా, భూమిని దేవస్థానానికి ఎందుకు అప్పగించలేదు. » కాకినాడ శ్రీభావనారాయణస్వామి ఆలయ భూములను క్రికెట్ స్టేడియం కోసం ఇచ్చారు. దీనిపై కోర్టుకెళ్లి స్టే తీసుకురావాల్సి వచ్చింది. » సింహాచలం ఆలయ భూములను పంచ గ్రామాల పరిధిలో ఆక్రమిస్తే ఆక్రమణదారులకు రెగ్యులర్ చేయడం కోసం ప్రభుత్వం కమిటీ వేయడం ఏమిటీ? ఈ భూముల్లో కొందరు చర్చిలు, మసీదులూ కట్టారు. » ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో వందలాది ఎకరాల దేవదాయ భూమిని రాత్రికిరాత్రి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేయత్నం చంద్రబాబు సర్కారు చేసింది. తిరుపతిలో ముంతాజ్ హోటల్కు భూములివ్వాలని ప్రభుత్వం యత్నిస్తోంది. » దేవదాయ భూముల పరిరక్షణ కోసం వీహెచ్పీ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల హైందవ శంఖారావం సభను నిర్వహించాం. దేవదాయ భూముల రక్షణకు చట్ట సవరణ నమూనా డ్రాప్ట్ తయారు చేసి ప్రభుత్వానికి, సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ అధ్యక్షుడుకి ఇచ్చాం. అయినా ప్రభుత్వం దైవ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. వీటిన్నింటిపై హిందూ సమాజాన్ని జాగృతం చేస్తాం. మరో ధారి్మక స్వతంత్ర పోరాటానికి హిందువులను సిద్ధం చేస్తాం.’’ -
పుట్టాపై సీరియస్... BR నాయుడుపై మాత్రం నో సీరియస్... జడ శ్రవణ్ సెటైర్లు
-
బసవతారకంకు రెడ్ కార్పెట్ బావమరిది ఆనందం కోసం.. అడ్డగోలు చెల్లింపులు
-
బాబు ఒక్క పథకానికైనా.. పొట్టి శ్రీరాములు పేరు పెట్టలేదు?
-
‘బాబూ.. ఎంపీ మహేష్ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని ప్రశ్నించింది. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి.. డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, హోం మంత్రి అనిత.. మీరు అనుసరించే చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా? ఇలా చేసి సమాజానికి, యువతకు తప్పుడు సందేశం ఇస్తున్న మాట వాస్తవం కాదా?. హైదరాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారన్నది వాస్తవం కాదా? ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారన్నది వాస్తవం కాదా? డ్రగ్ నిర్ధారణ పరీక్షలను తారుమారు చేయడానికి యూరిన్ శాంపిల్స్లో భాగంగా యూరిన్ బదులు నీరు ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. చివరకు కొకైన్ తీసుకున్నట్టుగా రక్త పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. ఇన్ని పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, తేలుకుట్టిన సామెత మాదిరిగా మౌనం దాల్చడం, పైగా పలుకుబడిని ఉపయోగించి, బెయిల్ మీద తీసుకురావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డ్రగ్స్ వ్యవహారాల్లో, మహిళలపై నేరాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే తాటతీస్తా అని పదేపదే చెప్తున్న మాటలు కేవలం డైలాగులు మాత్రమేనని, చేతల్లో శూన్యమని, మీ అసలు రంగు ఇదేనని మరోసారి రుజువు అయ్యింది.కూటమికి చెందిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా మీకే స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో ఇంకా ఇంకా డ్రామా చేస్తూనే ఉన్నారు.టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళమీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే, పంచాయతీ చేశారు తప్ప నో యాక్షన్.KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద కూడా నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద కూడా నో యాక్షన్.మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్.ఇక ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసం చేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా మీకే లేఖ రాసినా టీటీడీ చైర్మన్లాంటి పోస్టులో పెట్టారు.కమిటీల విచారణ, షోకాజ్ నోటీసుల పేరిట చేస్తున్న డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ చేత తక్షణమే రాజీనామా చేయించడంతోపాటు, వీళ్లందరి మీద చర్యలు తీసుకోండి. లేకపోతే మీ పార్టీని ప్రజలు క్షమించరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 🚨 #TDPDrugMafiaకోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్… pic.twitter.com/uzpnXwd562— YSR Congress Party (@YSRCParty) March 16, 2026 -
చంద్రబాబు అరెస్ట్.. రమణ రియాక్షన్.. KSR దిమ్మతిరిగే కౌంటర్
-
పిన్నెల్లి సోదరులను హింసిస్తున్నారు. బాబుపై మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్
-
పొట్టి శ్రీరాములును అవమానించిన వ్యక్తి చంద్రబాబు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: ఏపీలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేయలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు జ్ఞాపకాలను లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ త్రిమూర్తి చౌక్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆర్య వైశ్యుల చందాలతో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక అంగుళానికి 5 వేల చొప్పున వసూలు చేశారు. 158 అడుగుల ఎన్టీఆర్ విగ్రహానికి మాత్రం 17వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారు. ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆయన త్యాగాన్ని గుర్తించిన పార్టీ వైఎస్సార్సీపీ. నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాం. వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహించాం. పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను సన్మానించాం. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఒక్కసారి కూడా పొట్టి శ్రీరాములు జయంతి కానీ, ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు కానీ నిర్వహించలేదు. పొట్టి శ్రీరాములుని అవమానించిన వ్యక్తి చంద్రబాబు. ఆయన జ్ఞాపకాలను లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే మొదటి ఏడాది ఘనంగా అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు’ అని చెప్పుకొచ్చారు. -
చంద్రబాబు, లోకేష్ అంతకు అంత అనుభవిస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
-
పెట్టుబడి సాయం ఆలోచన వైఎస్ జగన్దే
సాక్షి, అమరావతి: దేశంలో రైతుకు పెట్టుబడి సాయం అందిచాలనే ఆలోచన చేయడమే కాదు... అధికారంలోకి వచ్చీరాగానే అమలు చేసింది కూడా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుస కరువు, కాటకాలతో అల్లాడుతున్న రైతులకు అండగా నిలవాలన్న ఆలోచనతో 2017లో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. ఆ తర్వాత 2018 డిసెంబర్లో కేంద్రం పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.6 వేల ఆరి్థక సాయం ప్రకటించి, 2019 జనవరి నుంచి అమలులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఆ సమయంలో చంద్రబాబు‡ ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనకు ఈ ఆలోచన రాలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పిన వైఎస్ జగన్... అధికారంలోకి రాగానే రూ.12,500లను రూ.13,500కు పెంచి, ఐదేళ్లపాటు రూ.67,500 చొప్పున ఇచ్చారని వివరించారు. రైతులు, కౌలు రైతులతోపాటు దేవదాయ, అటవీ, ఇతర భూముల సాగుదారులు కలిపి 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల లబ్ధి చేకూర్చారని తెలిపారు. చంద్రబాబు 2024 ఎన్నికల సమయంలో కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ, అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఎగ్గొట్టారన్నారు. రెండో ఏడాది 46.86 లక్షల మందికి అరకొరగా అన్నదాత సుఖీభవ కింద సాయం అందించారని పేర్కొన్నారు. లబ్ధిదారులను భారీగా తగ్గించడమే కాకుండా రెండేళ్లలో ఒక్కో రైతుకు దాదాపు రూ.30వేలు చొప్పున ఎగ్గొట్టారని విమర్శించారు. -
బావమరిది కళ్లల్లో ఆనందం కోసం..
చంద్రబాబు బంధుప్రీతి కథా‘చిత్రమిది’. సంపద సృష్టి హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ హామీలిచ్చింది జనం కోసం కాదని.. తన కుటుంబ సంపద సృష్టి కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బావమరిది బాలకృష్ణ కళ్లల్లో ఆనందం కోసం.. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో పెద్దపీట వేశారు. ఇందుకోసం గతేడాది చీకటి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిల కోసం నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు తరచూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా.. సమ్మెబాట పడుతున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. కానీ.. బాలకృష్ణ ఆస్పత్రికి మాత్రం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు చెల్లించడం బాబు బంధుప్రీతికి అద్దం పడుతోంది.సాక్షి, అమరావతి: అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించనని దైవసాక్షిగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు.. పాలనలో అడుగడుగునా పక్షపాతం, రాగద్వేషాలు కనబరుస్తున్నారు. సొంత ప్రయోజనాలు, అయినవారికి మేలు తలపెట్టడమే లక్ష్యంగా పాలనలో పారదర్శక విధానాలకు స్వస్తి పలికి అక్రమ విధానాలకు తెరలేపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.3 వేల కోట్లకు పైగా నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు పెట్టిన చంద్రబాబు తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నడిపే బసవతారకం ఆస్పత్రికి మాత్రం శరవేగంగా బిల్లులు ఇచ్చేస్తున్నారు. బిల్లు చెల్లింపుల్లో ఆలస్యం కాకుండా ఉండేందుకు పథకం ప్రారంభం నుంచి అమలవుతున్న ‘ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ (ఫిఫో)’ విధానానికి తిలోదకాలిచ్చేశారు. ఫిఫో నిబంధనలతో పని లేకుండా నిధుల విడుదలలో ప్రాధాన్యత కోసం గతేడాది వైద్య శాఖతో చీకటి ఉత్తర్వులు జారీ చేయించారు. రూ.50 కోట్ల వరకు చెల్లింపు నిబంధనల ప్రకారం ఏ ఆస్పత్రి మొదటగా బిల్లులు సమర్పిస్తుందో.. చెల్లింపుల్లో దానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించే ప్రభుత్వ, ప్రైవేట్ ఇలా ఏ ఆస్పత్రికైనా ఫిఫో షరతులు వర్తిస్తాయి. అయితే.. బసవతారకం ఆస్పత్రి విషయంలో గతేడాది మార్చిలో ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో ఫిఫో నిబంధనలను సడలిస్తూ వైద్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో పీపీపీ పద్ధతిలో డయాలసిస్, క్యాథ్ల్యాబ్ సేవలు అందించే సంస్థలు, టీటీడీ వైద్య సంస్థలకు మేలు చేస్తున్నట్టు సాకు చూపి బసవతారకం ఆస్పత్రికి చెల్లింపుల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు వైద్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం బసవతారకం ఆస్పత్రికి మేలు చేసే లక్ష్యంతో నెట్వర్క్ ఆస్పత్రుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం పీపీపీ, టీటీడీ సంస్థలను జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ బాలకృష్ణ ఆస్పత్రికి 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు నిధుల వరద పారించినట్టు తెలుస్తోంది. బాబు గద్దెనెక్కిన నాటినుంచే బసవతారకం ఆస్పత్రికి అక్రమ విధానంలో బిల్లు చెల్లింపులు ప్రారంభించారనే ఆరోపణలున్నాయి. ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో బసవతారకం ఆస్పత్రికి ఫిఫో నిబంధనల నుంచి సడలింపు ఇస్తూ వైద్య శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ముఖ్యనేత ఆదేశాలతో.. గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సీఈవోగా పనిచేసిన ఓ యువ ఐఏఎస్ అడ్డగోలు చెల్లింపులను అనుమతించబోనని చెప్పడంతో ఆ పంచాయితీ ముఖ్యనేత కార్యాలయానికి చేరింది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో ఫిఫో నుంచి ప్రభుత్వం సడలింపులు ఇచ్చినట్టు వెల్లడైంది. ఈ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని క్లెయిమ్ల పరిశీలన, బిల్లులు అప్లోడ్ చేయడం, నిధులు విడుదలలో బాలకృష్ణ ఆస్పత్రికి రెడ్కార్పెట్ వేశారు. తమకు ఇవ్వకుండా బాలకృష్ణ ఆస్పతికి ఇవ్వడం ఏంటని నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు వాపోతున్నారు. అనేక ఆస్పత్రులు ఉన్నా.. వాస్తవానికి రాష్ట్రంలో బసవతారకం తరహాలోనే ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే అనేక ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. నెల్లూరులో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, రాజమండ్రిలో జీఎస్ఎల్ కేన్సర్ ట్రస్టు, విశాఖలో లయన్స్ కేన్సర్ హాస్పిటల్, పుట్టపర్తిలో శ్రీసత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇలా అనేక ట్రస్టు/మిషన్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో సేవలు అందిస్తున్నాయి. బసవతారకం ఆస్పత్రి కూడా అలాంటిదే అయినా.. కేవలం తన బావమరిది నడిపే ఆస్పత్రి కావడంతో వల్లమాలిన బంధుప్రీతితో చంద్రబాబు నిధుల చెల్లింపుల్లో అవాంతరాలు లేకుండా చేస్తున్నారని విమర్శలున్నాయి. -
అప్పుల భారంతో అన్నదాతల బలవన్మరణం
ఎమ్మిగనూరురూరల్/గుంతకల్లు రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తోంది. సకాలంలో పంట రుణాలు అందించక.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరో వైపు రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో అప్పులు తీర్చే మార్గం లేక .. అవమానాలు భరించలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తిమ్మాపురంలో..: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురం గ్రామానికి చెందిన బీజీ అశోక్(28) నాలుగు ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లి సాగు చేశాడు. పంటలు, ఇంటి ఖర్చుల కోసం రూ. 9.50 లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు సరిగ్గా పండకపోవడంతో నష్టం వచ్చింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆదివారం సాయంత్రం అశోక్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అతడికి భార్య రాధ, ఉషశ్రీ(3), సాన్విక(01) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు చెప్పారు. గుంతకల్లులో..: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం సంతోష్ నగర్లో ఉంటున్న కురుబ రామిరెడ్డి(53) వ్యవసాయం కలిసి రాక.. అప్పులు తీసుకున్న వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు...కర్నూలు జిల్లా హాలహర్నికి చెందిన కురుబ రామిరెడ్డి వ్యవసాయం కోసం దాదాపు రూ.10 లక్షల మేర అప్పు చేశారు. తీర్చే మార్గం కానరాక ఐదేళ్ల కిందట గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్కు చేరుకున్నాడు. భార్య సుజాత, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులోళ్ల నుంచి వేధింపులు పెరిగిపోవడంతో దిక్కుతోచని రామిరెడ్డి ఈ నెల 12న అర్ధరాత్రి పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. కసాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘దేశం’లో కలకలం!
సాక్షి, అమరావతి: హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రకరకాల గారడీలు చేస్తుంటే పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు డ్రగ్స్ పార్టీలు, రాసలీలల్లో మునిగి తేలుతుండడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనతో ఉలిక్కిపడిన టీడీపీ శిబిరం ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతోంది. మహేశ్ డ్రగ్స్ వ్యవహారంతో టీడీపీ పరువు బజారున పడిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఇలాంటి నేతలకు సీట్లు ఇచ్చి చంద్రబాబు ఇప్పుడు నాలుక కరుచుకుని ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పుట్టా మహేశ్కు రాజకీయ అవగాహన లేకపోయినా, కేవలం డబ్బు ఉందనే కారణంతో కడప జిల్లా నుంచి తీసుకువచ్చి గత ఎన్నికల్లో ఏలూరు ఎంపీ సీటు ఇచ్చారు. ఎక్కడి నుంచో వలస వచ్చిన నేతకు ఇక్కడ ఎంపీగా చేయడం ఏమిటని స్థానిక టీడీపీ నేతలంతా వ్యతిరేకించినా చంద్రబాబు ఆయనకే సీటిచ్చారు.ఎంపీగా గెలిచిన తర్వాత మహేష్ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా మాత్రమే వెళుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పుట్టా మహేష్ టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడికి సొంత అల్లుడు. మరో సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు. అందుకే ఆయనకు ఎంపీ సీటు చాలా సులభంగా దక్కిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ నాయుడు రాసలీలలు మరవక ముందే.. ఏడాదిగా కూటమి పార్టీల నేతలు ప్రజలు, పరిపాలనను గాలికి వదిలేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటకు రావడంతో దానిపై రాజకీయ దుమారం రేగింది. తన చేష్టలను బీఆర్ నాయుడు నిస్సిగ్గుగా సమర్థించుకున్నా, సోషల్ మీడియా మాత్రం ఆయన నిజ స్వరూపాన్ని కడిగి పారేసింది. కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి రాసలీలలు బయటకు రావడంతో ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ బలంగా వచ్చింది. అయితే ఆయన ఒక టీవీ ఛానల్కు యజమాని కావడంతో ఆయనపై చర్య తీసుకునేందుకు, రాజీనామా చేయించేందుకు చంద్రబాబు వెనుకాడినట్లు ప్రచారం జరిగింది. కానీ నీతి నియమాలు లేని వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టడం, ఆయనకు చంద్రబాబు మద్దతు పలకడంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ నాయుడి వ్యవహారం సర్దుమణగక ముందే పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారం గుట్టు రట్టయింది. అదే బాటలో పలువురు క్యూ కొద్దిరోజుల క్రితం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు సైతం హైదరాబాద్లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డాడు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆ నియోజకవర్గానికి చెందిన కేజీబీవీ ప్రిన్సిపాల్ మీడియా ఎదుట చెప్పి బోరున విలపించారు. ఆమెకు న్యాయం చేయకపోగా ఆమెను బెదిరించి నోరు మూయించేందుకు ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. జనసేనకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించినట్లు ఒక మహిళ వీడియోలు విడుదల చేయడం కలకలం రేపింది. ఆయన్ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచడం తప్ప జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి ఆయనపై చర్య తీసుకోలేదు. టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం రట్టయింది. ఆయన వేధింపుల వీడియోలు బయటకు వచి్చనా బాధితుల్ని బెదిరించి రాజీ చేశారనే విమర్శలు వచ్చాయి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. కూటమిలో ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలకు సంబంధించి తరచూ రాసలీలలు, లైంగిక వేధింపులు, డ్రగ్స్ వ్యవహారాలు బయట పడుతున్నాయి. చంద్రబాబు పైకి నీతి సూత్రాలు చెబుతూ కవర్ చేస్తున్నా, ఆ పార్టీల ప్రజాప్రతినిధులు మాత్రం ఇష్టానుసారం చెలరేగిపోతున్నట్లు ఈ ఘటనల ద్వారా తేటతెల్లమవుతోంది.ఆ ఎంపీకి షోకాజ్తో సరిహైదరాబాదులో డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కు కేవలం షోకాజ్ నోటీసులు ఇచ్చి సరిపెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయినట్లు అనుకూల మీడియాకు టీడీపీ కార్యాలయం ఆదివారం లీకులు ఇచ్చింది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు సీరియస్ అయినట్లు, షోకాజ్ నోటీసులు ఇవ్వమన్నట్లు ఇచ్చిన లీకులన్నీ డ్రామాయేననే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మహేశ్కు ఎలాంటి షోకాజ్ నోటీసులు జారీ చేయలేదని సమాచారం. తీవ్ర స్థాయి ఆరోపణలు వచ్చినా సరే చంద్రబాబు ఆయన్ను వెనకేసుకుని వస్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఈపాటికి సస్పెన్షన్ చేసేవారని.. బాబు తీరు చూస్తుంటే అంతా ఉత్తుత్తి హడావుడేనని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. -
కేంద్ర నిధుల్లో కోత
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్నప్పటికీ నిధులను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడంలో సీఎం చంద్రబాబు మరోసారి విఫలమయ్యారు. ఈ ఆర్థిక ఏడాది (2025–26) కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో రాబట్టలేక చేతులెత్తేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్న తరుణంలో నిధులను సకాలంలో వ్యయం చేయకపోవడంతో కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపుల్లో భారీగా కోత పడింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో రూ.4,042 కోట్ల మేర కోత విధించింది. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మునిసిపల్, పట్టణాభివృద్ధి, సెకండరీ విద్యకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు గండి పడింది. ఆ నిధులు.. ఇతర రాష్ట్రాలకు! ఈ ఆర్థిక ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.18,662 కోట్లను కేటాయించగా చివరిలో రూ.14,620 కోట్లకు కుదించింది. అంటే రూ.4,042 కోట్ల మేర కోత పడింది. ఏ రాష్ట్రమైనా కేటాయించిన నిధులను సకాలంలో వ్యయం చేయకుంటే ఆ మేరకు కోత విధించి ఇతర రాష్ట్రాలకు అదనంగా అందజేస్తుంది. కేంద్రం కేటాయించిన నిధులను సైతం వ్యయం చేయకుండా కోత విధించే దుస్థితికి టీడీపీ కూటమి సర్కారు అసమర్థతే నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కేటాయింపులను సకాలంలో ఖర్చు చేసి అదనపు నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతారు. దీనికి భిన్నంగా చంద్రబాబు సర్కారు పాలన కొనసాగుతోంది. ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కేటాయింపుల్లో రూ.1,026 కోట్లు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలకు రూ.832 కోట్లు, సెకండరీ విద్య కేటాయింపుల్లో రూ.620 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.389 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.236 కోట్లు, గృహ నిర్మాణ శాఖలకు కేటాయింపుల్లో రూ.154 కోట్ల మేర కేంద్రం కోత విధించింది. -
బాబు ‘డ్రగుల్బాజీ’ పాలన
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం/నెల్లూరు రూరల్/ప్రొద్దుటూరు క్రైం/కాకినాడ రూరల్/ఏలూరు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో దగుల్బాజీ పాలన సాగిస్తున్నారని, మత్తు పదార్థాలు, మగువలతో అధికార కూటమి నేతలు పట్టుబడుతున్నా.. ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఆయన పాలనలో రాష్ట్రం మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిపోయిందని, మత్తు ముఠాలు యథేచ్ఛగా దందాలు సాగిస్తున్నాయని విమర్శించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, టీజేఆర్ సుధాకర్బాబు, భూమన అభినయ్రెడ్డి, దూలం నాగేశ్వరరావు, మామిళ్లపల్లి జయప్రకాష్, కంభం విజయరాజు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ను తప్పించేందుకు తన ఆత్మీయ సన్నిహితుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని చంద్రబాబు రంగంలోకి దింపారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే మత్తు పదార్థాలు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఈ రోజు ఏం సమాధానం చెబుతారని ప్రశి్నంచారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మత్తు పదార్థాల దందా విచ్చలవిడిగా సాగుతోందని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వంటి నేతలు రాసలీలలతో పట్టుబడినా వారిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బాబు పాలనలో టీడీపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా గంజాయి దందా నడిపిస్తున్నారని మండిపడ్డారు. మద నపల్లిలో ఒక యువకుడు గంజాయి సేవించి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడని, కుప్పంలోనూ గంజాయి దొరికిందని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికినా పోలీసులేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఏలూరు ఎంపీ చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం పరువు జాతీయస్థాయిలో బజారున పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కారుతో బాబు అనైతిక బంధం కొనసాగిస్తున్నారని, తన తప్పుడు పనులు, స్కాంలు కప్పిపుచ్చుకునేందుకు ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతలను బాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. -
‘ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు నోరు విప్పరేం?’
సాక్షి, కాకినాడ జిల్లా: టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిందన్న అనుమానం ప్రజలకు వచ్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో దొరికారు. ఇప్పటి వరకు దీనిపై చంద్రబాబు కానీ.. టీడీపీ నేతలు కానీ నోరెత్తలేదు. తెల్లవారు లేస్తే ప్రవచనాలు చెప్పే చంద్రబాబు.. డ్రగ్స్ తీసుకుని దొరికిన ఎంపీపై ఏం చెబుతారు అని మేము అడుగుతున్నాం’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘డ్రగ్స్ రహిత సమాజం సృష్టించాలని.. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మంత్రి లోకేష్ ఉద్యమంలా ప్రచారం చేశారు. డ్రగ్స్ వద్దని ప్రజలకు చెబుతారు కానీ.. మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తూ ఉంటారు. ఎదుట వారికి చెప్పడానికే నీతులు.. మేము మాత్రం అన్ని పనులు చేస్తాం అన్నట్లు ఉంది టీడీపీ పరిస్థితి. ఒకాయన మహిళలతో రాసలీలలు.. మరోకరు డ్రగ్స్తో దొరికిన ప్రభుత్వ పరంగా ఏలాంటి చర్యలు ఉండవు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని హోమంత్రి అనిత ప్రకటించిన పది రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సొంత జిల్లాలో గంజాయి పట్టుబడింది...పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు.. తప్పుడు కేసులు కట్టడంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే పార్టీ స్పందన ఏంటీ?. అంతకు ముందు కూటమి ఎమ్మెల్యేల బాగోతం.. తరువాత టీవీ 5 చైర్మన్ బాగోతం.. ఇప్పుడు ఏలూరు ఎంపీ బాగోతం చూస్తున్నాం’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు. -
జగన్ అధికారంలోకి రాగానే జరిగేది ఇదే.. చుక్కలే
-
ఆటో కార్మీకులంటే అంత అలుసా బాబూ?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల జరిగిన మహిళా దినోత్సవంలో ఆటోకార్మీకులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆటో కార్మికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆటో కార్మీకులు ప్రమాదాలకు కారణం అవుతున్నారని, ప్రమాదాల నుంచి మహిళలను రక్షించేందుకే ఫ్రీ బస్సు పథకం ఏర్పాటు చేశానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఇలా ఆటో కార్మీకులను దోషులుగా చూపడం తగదన్నారు. రైళ్లు, బస్సులు చివరికి విమానాలు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. కేవలం ఆటో కార్మీకులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో శనివారం ఆటోవాలాలు ధర్నా చేపట్టారు. తమనుద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆటోకార్మీకులు తప్పుబట్టారు. తన సొంత హెరిటేజ్కి రూ.200 కోట్లకు పైగా ప్రభుత్వం నుంచి రాయితీలు పొందడం దుర్మార్గమన్నారు. లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ ఇఫ్టూ ఆధ్వర్యంలో ఈ నెల23న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు కె.పోలారి, మునిశంకర్, పెద్దిరాజు పాల్గొన్నారు. -
ఏపీ బడ్జెట్ లో చంద్రబాబు తప్పుడు లెక్కలు ఆధారాలతో బయటపెట్టిన బుగ్గన
-
అన్నదాత సుఖీభవ పేరుతో. చంద్రబాబు భారీ మోసం
-
ఏలూరు జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ కష్టాలు... అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
-
‘చంద్రబాబు సర్కార్ అప్పుల్లో రికార్డులు సృష్టిస్తోంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉపయోగించడం లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన అనుభవాన్ని ఊరారా తప్పుడు ప్రచారాన్ని చేయడానికే వినియోగిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘దేశంలో నాకంటే సీనియర్ లేడని చెప్పుకునే చంద్రబాబు.. అబద్ధాలపైనే బతకాల్సిన పరిస్థితి. ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేసి ఓటుగా మార్చుకోవాలని చంద్రబాబు చూస్తాడు. అందుకే ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా చెప్పుకోడానికి ఏమీ లేని పరిస్థితి. ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు అన్నాడు. వైఎస్సార్సీపీని మిగిలిన వారికి దూరం చేయాలని దుష్ప్రచారానికి దిగాడు. సుప్రీం కోర్టు చెప్పినా ఇంకా అదే దుష్ప్రచారాన్ని చేస్తూనే ఉన్నాడు...చివరికి మండలి చైర్మన్ కులాన్ని ప్రశ్నించే స్థాయికి మీ పార్టీ దిగజారింది. లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నాడు. మా నాయకుడు వైఎస్ వివేకా అంశంలోనే ఇదే తరహా రాజకీయం చేశాడు. ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం కుటిల రాజకీయం చేశాడు. పాశవికంగా చంపిన వారీని దగ్గర పెట్టుకుని విషప్రచారం చేశాడు. నేడు సుప్రీం కోర్టులో వాస్తవలేంటి అనేది అందరికీ తెలిసిపోయింది. చంపిన వారు చంద్రబాబు ప్రభుత్వంలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు..ఆనాడు 14 లక్షల కోట్ల అప్పు అన్న వ్యక్తి.. ఇప్పుడు 3 లక్షల కోట్లు మాత్రమే అంటున్నాడు. నేడు రెండేళ్లలోనే మా ఐదేళ్లలో చేసిన అప్పులు చేశాడు. ఎవరు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది ఎవరో ప్రజలు గమనించాలి. అన్ని అంశాల్లో మోసంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. నిరుద్యోగ భృతి నుంచి సూపర్ సిక్స్ గురించే కేటాయింపులు లేవు. చివరికి కేబినెట్పై కూడా పట్టు కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ నిన్నటి కేబినెట్ మీటింగ్కు రాలేదు. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ ధరలు పెంచుకునే బిజీలో ఉన్నాడు. రాష్ట్రంలో రైతులు నానా తంటాలు పడుతుంటే వీళ్లు సినిమా ప్రమోషన్లో ఉన్నారు..గత ఏడాది రైతులు అన్ని విధాల మోసం పోయారు. మళ్ళీ ఈ ఏడాది కూడా అదే తీరు. అన్నీ నేనే చేశాను అంటాడు. ఒక్క ప్రాజెక్ట్ డిజైన్ అయినా నువ్వు చేసావా బాబు..?. నేడు రాయలసీమ లిఫ్ట్ ఫణంగా పెట్టిన నువ్వు రాయలసీమను ఉద్ధరిస్తావా?. ఇన్ని రకాలుగా మా కడుపు కొడుతున్న నీకు దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు. నేడు పాలల్లో, నెయ్యిలో ఎక్కడ చూసినా అన్నిటా కల్తీ. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సప్లై చేసి కోట్లు కొల్లగొట్టవ్. హెరిటేజ్కి ఎన్ని రాయితీలు తీసుకున్నావో ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. వివేకా కేసులో విచారించి వాస్తవాలెంటో తేల్చండి. ఎవరు తప్పు చేసినా మీరే చర్యలు తీసుకోండి’’ అంటూ శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. -
500 కోట్ల మోసం! పోలవరం పనుల్లో అక్రమాలు CBI SP సంచలన లేఖ
-
ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. నీ కేసులన్నీ రీ ఓపెన్ చేయించలేకపోతే నా వృత్తినే వదిలేస్తా..
-
అయ్యా చంద్రబాబు.. ప్రధాని పదవి ఖాళీగా ఇరాన్ లో మాత్రమే ఉంది
-
మీ కోడలిని కూడా ముగ్గురిని కనుమను.. బాబుపై అడ్వకేట్ రజిని నాన్ స్టాప్ సెటైర్లు
-
7 లక్షల మంది రైతులకు బిగ్ షాక్.. వ్యవసాయానికి బాబు ఉరి
-
నాకు లాస్ట్ ర్యాంకా! బాబుపై అనిత ఆగ్రహం
-
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
-
35 ఉద్యోగాల పేరుతో హెరిటేజ్ భారీ దోపిడీ.. బయటపెట్టిన వెంకటరెడ్డి
-
వేతన వెతలు.. పండగ వేళ పస్తులు!
సాక్షి, అమరావతి: వేతనాలు చెల్లించకుండా చంద్రబాబు సర్కారు ఉపాధిహామీ కూలీల కుటుంబాలను పస్తులుంచుతోంది. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులకు హాజరైన కూలీలకు ప్రభుత్వం మూడున్నర నెలలుగా వేతనాలు చెల్లించలేదు. దాదాపు రూ.660 కోట్లు బకాయిపడింది. పూటగడవక.. వేతనాలు అందక పేదలు అవస్థలు పడుతున్నారు. ఐదారు రోజుల్లో ఉగాది పండగ వస్తుంది.. ఇంకొద్ది రోజులకు శ్రీరామనవమి.మధ్యలో రంజాన్ పండగ కూడా ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది పేద కుటుంబాల్లో పండగల సంతోషమే కనిపించడం లేదు. పనులు లేక... చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఉపాధి పనిచేసిన కూలీలకు 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలి. ఇదే విషయం కేంద్రం చేసిన చట్టం చెబుతోంది. అయినా నెలల తరబడి ప్రభుత్వమే వేతనాలు చెల్లించకుండా పండగ రోజుల్లో సైతం పేదలను పస్తులు పెడుతోంది. పనుల కల్పనలోనూ విఫలం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల కల్పన తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఆర్థిక ఏడాదిలో 25 కోట్లకుపైగా పనిదినాలు కల్పించి పేద ప్రజలకు భరోసా కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ఏడాది 19 కోట్ల పనిదినాలు కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 46.55 లక్షల కుటుంబాలకు 25.54 కోట్ల పనిదినాలు పనులు కల్పించారు. చంద్రబాబు సీఎం అయ్యాక 2024 –25 ఆర్థిక ఏడాదిలో 24.22 కోట్ల పనిదినాలు కల్పించినా... అందులో చంద్రబాబు సీఎం కాకమునుపు 2024 ఏప్రిల్, మే నెలలోనే 11.68 కోట్ల పనిదినాల కల్పన పూర్తయింది. ఆర్థిక ఏడాదిలో మిగిలిన 10 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం కేవలం 12.54 కోట్ల పనిదినాలే కల్పించింది. 20 రోజుల్లో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పోర్టల్ వెల్లడించిన గణాంకాల ప్రకారమే మార్చి 13 తేదీ వరకు 17.86 కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంతో పోల్చితే దాదాపు ఏడున్నర కోట్ల పనిదినాలు తక్కువ కావడం గమనార్హం. మరోవైపు చేసిన పనికీ నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో ప్రస్తుతం రోజు వారీ 5.5లక్షల మంది కూలీలు మాత్రమే పనులకు హాజరవుతున్నారు. -
ఇండ్రస్టియల్ ఏరియాలో... డ్రగ్ రాకెట్
కొండపల్లి (ఇబ్రహీంపట్నం): చంద్రబాబు ప్రభుత్వ నిఘా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి, ఏరులైపారుతున్న మద్యం ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో తాజాగా డ్రగ్స్ తయారీకి వినియోగించే రసాయనాలు, మత్తుపదార్థాల భారీ రాకెట్ బయటపడ్డం ఆందోళనకు గురిచేస్తోంది. అదికూడా కొండపల్లి ఇండ్రస్టియల్ ఏరియా (ఐడీఏ)లోనే కావడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి నివాసానికి, కొండపల్లి ఇండ్రస్టియల్ ఏరియాకు మధ్య కృష్ణానదే అడ్డం కావడం గమనార్హం.ఇలాంటి ప్రాంతంలో హైదరాబాద్కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు డ్రగ్స్ డెన్ను గుర్తించి దాదాపు రూ.47 కోట్ల విలువైన 237 కిలోల ఆల్ఫ్రాజోలంతోపాటు దీనికి అదనంగా డ్రగ్స్ తయారీలో వినియోగించే 800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల రసాయనాలను స్వా«దీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ రాకెట్లో హైదరాబాద్ బొల్లారంకు చెందిన సాయి త్రిభువన్, సౌరభ్కుమార్ను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఇండ్రస్టియల్ ఏరియాలే అక్రమ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతుండడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. అధికారులే విస్తుపోయేలా.. ‘ఆపరేషన్ వైట్ హోమర్’ పేరుతో హైదరాబాద్ డీఆర్ఐ బృందం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఇండ్రస్టియల్ ఏరియా (ఐడీఏ)లో మెరుపుదాడులు నిర్వహించింది. ఎమ్మెస్ రేస్ ఆర్గానిక్ పేరుతో నిర్వహిస్తున్న కంపెనీలో భారీగా నిల్వచేసిన ఆ్రల్పాజోలంను గుర్తించారు. కెమికల్ కంపెనీ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలు అధికారులనే విస్తుపోయేలా చేశాయి. ఆ్రల్పాజోలం, డ్రగ్స్ తయారీలో వినియోగించే ముడి పదార్థాలు, లీటర్ల రసాయనాలతోపాటు ఫ్యాక్టరీలోని సెంట్రిఫ్యూజన్ మిషన్లు, డ్రైయర్లు, రియాక్టర్లను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న కంపెనీని సీజ్ చేశారు. తెలంగాణలోని కల్లు డిపోలకు డ్రగ్స్ తరలింపు ఇక్కడ తయారైన డ్రగ్స్ను తెలంగాణలోని కల్లు డిపోలకు తరలిస్తున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. సుమారు 20 ఏళ్ల అనుభవం కలిగిన కెమిస్ట్ ఈ డ్రగ్స్ తయారీ రాకెట్లో మాస్టర్ మైండ్గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో డ్రగ్స్ తయారీపై నిఘా ఎక్కువగా ఉండటంతో కొండపల్లిలోని ఇండ్రస్టియల్ ఏరియాను అడ్డాగా చేసుకుని ఆ్రల్పాజోలం తయారు చేస్తున్నట్లు అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని మరికొన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు కొనసాగుతుండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అధికారులు ఈ కెమిస్ట్ నెట్వర్క్ వెనుక ఉన్న ఫైనాన్షియర్లు, కొనుగోలు దారులు ఎవరన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. చంద్రబాబు సర్కార్ పర్యవేక్షణ వైఫల్యంపారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కంపెనీల కార్యకలాపాలపై డ్రగ్ కంట్రోల్ శాఖ, ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖలు తరచుగా తనిఖీలు చేయాలి. అయితే గుట్టుచప్పుడు కాకుండా భారీ స్థాయిలో 237 కిలోల ఆ్రల్పాజోలం తయారీ జరగడం స్థానిక అధికారుల పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తోంది. ఇక ఈ డ్రగ్స్ను తెలంగాణలోని కల్లు డిపోలకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడం చూస్తే దీనివెనుక అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉందని సూచిస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందుగానే ఈ కార్యకలాపాలను గుర్తించలేకపోవడం ప్రభుత్వ యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.పైగా రాష్ట్ర పోలీస్ లేదా డ్రగ్ కంట్రోల్ విభాగం కాకుండా హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారుల చర్యలతో ఈ రాకెట్ వెలుగులోకి రావడం గమనార్హం. దీనివల్ల రాష్ట్ర స్థాయి నిఘా వ్యవస్థ సమర్థతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండ్రస్టియల్ ఏరియాలో డ్రగ్స్ తయారీ జరగడం పెట్టుబడిదారులపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అంశం. పరిశ్రమల పేరుతో అక్రమ కార్యకలాపాలు జరిగితే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ, అసలు మాస్టర్మైండ్ ఎవరు? ఈ నెట్వర్క్ ఎంత పెద్దది? రాష్ట్రంలో ఇంకా ఇలాంటి యూనిట్లు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. -
అధిక సంతానంపై ప్రేమ!
ఈమధ్య జనాభా పెంచండంటూ పిలుపునిచ్చే నాయకులు దేశంలో ఎక్కువయ్యారు. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ‘ఇద్దరు లేక ముగ్గురు చాలు’, ‘మేమిద్దరం... మాకిద్దరు’ వంటి నినాదాలు హోరెత్తిన దేశంలో ఇలా కోరటం కాస్త వింతగానే ఉంటుంది. ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భాగవత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు తరచూ బహిరంగ సభల్లో ఇలాంటి పిలుపునిస్తున్నారు. వాస్తవానికి మన దేశ జనాభా తక్కువేం లేదు. జనగణన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు గనుక నికరంగా ఆ సంఖ్య ఎంతన్నది తెలియకపోయినా అది 145 కోట్ల వరకూ ఉండొచ్చని వివిధ నివేదికలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా దాన్నే ధ్రువీకరించింది. అంటే ప్రపంచంలో జనాభారీత్యా మనదే ప్రథమస్థానం. అయినా అధిక సంతానం అవసరమంటున్నారు నేతలు. జనాభా తగ్గించటం కోసం పది పదిహేనేళ్ల క్రితం వరకూ ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటించేవి. ఉచితంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, నగదు బహుమతి, ఇళ్ల కేటాయింపు వంటి నజరానాలుండేవి. వైద్యులకు సైతం ప్రోత్సాహకాలుండేవి. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారు పంచా యతీరాజ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ చాలా ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. అయిదేళ్ల క్రితం కూడా అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ఇద్దరికి మించి పిల్లలుంటే సంక్షేమ పథకాలు వర్తించబోవని, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల్ని చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగిగా మారాక సంతానం పెరిగినా కొలువుండదని చెప్పారు.ఇప్పుడు గాలి మళ్లింది. నాయకుల స్వరం మారింది. అయితే వీరందరి ఉద్దేశాలూ ఒకటి కాదు. కొందరి పిలుపు వెనక హిందూ జనాభా తగ్గుతోందన్న ఆందోళన ఉంది. స్టాలిన్ వంటి వారైతే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల జనాభా వ్యత్యాసం వల్ల పార్లమెంటులో సీట్ల సంఖ్య మొదలుకొని వనరుల కేటాయింపు వరకూ అన్నిటా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆదుర్దా పడుతున్నారు. అయితే చంద్రబాబు ఆంతర్యమేమిటో ఎవరూ చెప్పలేరు. స్టాలిన్తో ఏకీభవిస్తున్నట్టు తెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీకి ఆగ్రహం వస్తుందని భయం. జనాభా పెంచమని ఆమధ్య ఒకటి రెండుసార్లు ముసిముసి నవ్వులతో చెప్పిన ఆయన... ఇటీవల నజరానాలు ప్రకటించారు. ఇద్దర్ని లేదా ముగ్గుర్ని కనే తల్లిదండ్రులకు రూ. 25,000, జంటలకు అవసరమైతే ఉచిత సంతాన సాఫల్య (ఐవీఎఫ్) చికిత్స, మూడో సంతానాన్ని కంటే... వారికి అయిదేళ్లు వచ్చేవరకూ నెలకు రూ. 1,000, పద్దెనిమిదేళ్ల వరకూ ఉచిత ప్రభుత్వ విద్య వంటివి అందులో ఉన్నాయి. ఎటూ అమలు చేసే అలవాటు లేదు గనుక ఇలాంటి వాగ్దానాలు ఆయన ఎన్నయినా చేయగలరు. దేశంలో సంతానోత్పత్తి (టీఎఫ్ఆర్) జాతీయ సగటు 2000 సంవత్సరం నాటికి 3.2. అంటే సగటున ఒక మహిళకు ముగ్గురు సంతానం. అదిప్పుడు దాదాపు 2కు చేరుకుంది. తాజా లెక్కల ప్రకారం ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల సగటు 1.5 నుంచి 1.6 వరకూ ఉంది. టీఎఫ్ఆర్ 2.1 ఉంటే జనాభా స్థిరంగా ఉంటుందని, తగ్గితే జనాభా క్షీణిస్తూ వృద్ధుల సంఖ్య పెరుగుతుందని, 2.1 కన్నా హెచ్చితే పెరుగుదల వేగం హెచ్చుగా ఉంటుందని అంచనా. అక్షరాస్యత పెరగటం, మహిళలు ఉద్యోగాలు చేయటం, కుటుంబాల్లో వారి మాట చెల్లుబాటు కావటం, అస్థిర జీవితాలు, వలసలు వగైరాలన్నీ ఒకరి తోనో, ఇద్దరితోనో సరిపెట్టుకునేలా చేస్తున్నాయి. కారణాలు ఏమైనా ఉండొచ్చు... అవి సహేతుకమైనవే కావొచ్చు. కానీ ఇలాంటి ఉద్బోధల వల్ల కుటుంబాల్లో స్త్రీలు ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొనాలో, వారికెదురయ్యే ఆరోగ్య సమస్యలేమిటో చంద్రబాబు గమనించారా? ఎన్నికల్లో ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అంటూ సంతకం చేసి గుప్పించిన వాగ్దానాలకే దిక్కు లేకుండా పోయాక ఇలాంటి హామీలు మహిళలు ఎలా నమ్మాలి? మద్యపానంతో మగవాళ్లు ఇల్లు గుల్ల చేస్తుంటే ఏం పెట్టి పిల్లల్ని పెంచాలి? సంతానం విషయంలో స్త్రీకి స్వయంప్రతిపత్తి ఉంటుందని గుర్తుందా? అసలు విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో చేస్తున్నదేమిటి? ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సాధనపై శ్రద్ధవుందా? వీటన్నిటినీ నిజాయతీగా సమీక్షించుకుని సంతానం పెంచటం గురించి బాబు మాట్లాడాలి. -
రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తాను: చంద్రబాబు వ్యాఖ్యలు
-
‘చంద్రబాబు.. ఇరాన్లో మాత్రమే ఆ పదవి ఖాళీ ఉంది’
విస్సన్నపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ధ్వజమెత్తారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడనని చంద్రబాబు అనుకున్నారని, నిక్కర్లు వేసుకున్నప్పటి నుండి తాను రాజకీయం చేస్తున్నానని, ఇటువంటి బెదిరింపులకు భయపడనని జోగి రమేష్ స్పష్టం చేశారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత తగ్గుతా అనుకున్నావా.. వైఎస్సార్సీపీ జెండాను భుజం దింపుతా అనుకున్నావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్న పేటలో మీడియాతో మాట్లాడారు జోగి రమేష్. ‘ తిరువూరు గడ్డ అంటే వైఎస్సార్సీపీ అడ్డా. గ్రామాల్లో ఏ ఊరికి వెళ్ళినా కూడా చంద్రబాబు ఎప్పుడు దిగిపోతాడు.. జగనన్న ఎప్పుడు సీఎం అవుతాడు అంటున్నారు. నేను చంద్రబాబును ఒక మాటే కదే అన్నాను. కల్తీ లిక్కర్ నారా వారి సారా ఏరులై పారుతుంది అనే కదా అన్నాను. ఒక్క మాటకే 83 రోజులు జైలుకు పంపించావు. చంద్రబాబు విద్య,వైద్యాన్ని పడకెత్తించాడు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటూ మోసగించావు. లోకేష్ ఏమన్నాను చిప్ దొబ్బిందా అన్నాను అంతేగా. దానికై ఇంటిపై యాసిడ్ బాంబులతో దాడులు చేశారు. కల్తీ నెయ్యి గురించి నానా యాగీ చేస్తున్నారే. సుప్రీంకోర్టు సైతం చెంప చెల్లుమనిపించింది’ అని మండిపడ్డారు.ఇరాన్లో మాత్రమే ఖాళీ ఉంది..చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలా. చంద్రబాబు ప్రధానమంత్రి అవకాశం వస్తేనే వదిలేసుకున్నాడట. ఉపప్రధాని పదవి చాలా చీప్ అట.. మోదీ స్థాయి అయితేనే కావాలట. మోదీ స్థాయి పదవి కావాలంటే చంద్రబాబుకు ఇరాన్లో మాత్రమే ఖాళీ ఉంది’ అని ఎద్దేవా చేశారు. -
ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టి మరి ... బాబు అప్పుల చిట్టా ఆధారాలతో చూపించిన పేర్ని నాని
-
బాబు సంపద పెంచేందుకు హెరిటేజ్ కి భారీ రాయితీలు
-
‘నా దాహం తీరనిది.. నేనొక భూ పిపాసిని అనేలా చంద్రబాబు’
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. భూదాహం తప్పితే ఇంకోటి లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభానాధ్రీశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన ప్రభుత్వంలో చాలా వేగంగా రైతుల నుంచి భూములు లాక్కొంటున్నారని ధ్వజమెత్తారు. చట్టంతో పనిలేకుండా అనుకున్నదే తడువగా ముందుకు అడుగులు వేస్తున్నారని విమర్శించారు. ‘‘నా దాహం తీరనిది..నేనొక భూ పిపాసిని’’ అనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అని వడ్డే శోభానాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు.‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల నుంచి లాక్కున భూములను కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారు. వేల ఎకరాల భూమిని తీసుకుని కార్పొరేట్లకు ఇచ్చే చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమైన చర్య. పేదల పొట్టకొట్టి వారి నోటి వద్ద కూడు తీసి బడా కంపెనీలకు ఇచ్చే ఆలోచన చంద్రబాబు చేయడం తగదు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనను విరమించుకోవాలి. అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని చంద్రబాబు ఉపసంహరించుకోవాలి. ఏపీ ప్రభుత్వం 26 లక్షల ఎకరాల భూమిని సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం కేటాయించే ప్రణాళికను రూపొందించింది. ఇది చట్ట విరుద్ధం , రాజ్యాంగ విరుద్ధం. నా దాహం తీరనిది..నేనొక భూ పిపాసిని అనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు స్వార్ధపూరిత ఆలోచనలను మానుకోవాలి. ఏపీలో ప్రతీ ఇంటిమీద , ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానల్స్ పెట్టండి. కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయండి. లేకపోతే చంద్రబాబు భూ బకాసురుడు అనే నింద మోయాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. -
మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఇరవై నెలల కూటమి పాలనలో కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పులే చేశామని, ఏనాడూ నెట్ బారోయింగ్ సీలింగ్ (ఎన్బీసీ) అధిగమించలేదని చెబుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి ఇవే మాటలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి అధికారికంగా ప్రకాటన విడుదల చేసే దమ్ముందా అంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్ చేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు పేర్ని నాని కాగ్ లెక్కలతో వివరించారు. ఎన్బీసీ దాటి అప్పులు చేయలేదని పయ్యావుల పచ్చి అబద్దం చెప్పాడని కాగ్ వెబ్సైట్ సాక్షిగా ఆయన నిరూపించారు. మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్టు కూటమి అప్పులు రూ. 1.05 లక్షల కోట్లని వారం రోజుల్లో నిరూపించలేకపోతే అబద్ధాల కేశవ్ అని నేమ్ బోర్డు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ, మండలిలో తప్పుడు సమాచారం ఇచ్చిన సంబంధిత అధికారులపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ), మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. చంద్రగిరిలో ఉన్న చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ యూనిట్లో మెషినరీ అప్గ్రడేషన్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అప్పుల మంత్రి, అబద్ధాల కేశవ్రాష్ట్ర అప్పులపై పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్ మీద మరోసారి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడు. పేరుకి ఆర్థికశాఖ మంత్రేకానీ నోటి మాటలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడే ఆయన, తాను చేసిన ఆరోపణలు ఏ ఒక్కదానికీ ఆధారాలు చూపించే ధైర్యం చేయలేదు. ఈ అబద్ధాల అప్పుల మంత్రి ఏ ఒక్కరోజూ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడలేదు. వైఎస్ జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనడానికి ఆయన దగ్గరున్న ఆధారాలుంటే చూపించాలి కదా. వైఎస్ జగన్ ప్రెస్మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలని తేల్చేసిన పయ్యావుల.. ఏయే అంశాలు అబద్ధాలు చెప్పారు, వాటికి సంబంధించి నిజమైన ఆధారాలు దగ్గరుంటే బయటపెట్టాలి.మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో20 నెలల పాలనలో మా ప్రభుత్వం చేసింది కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పేనని, కానీ వైయస్ జగన్ గారు రూ. 3.20 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు చెప్పారని పయ్యావుల చెబుతున్నాడు. కానీ కరెక్టుగా చెప్పాలంటే ఆ అప్పు రూ. 3,27,370.37 కోట్లు. (రూ. 3.27 లక్షల కోట్లు). కాగ్ లెక్కల ప్రకారం 2024-25లో బడ్జెట్ బారోయింగ్స్ రూ.81,082.51 కోట్లని వెబ్సైట్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దానికి పయ్యావుల మాత్రం రూ.69 వేల కోట్లేనని పచ్చి అబద్ధం చెబుతున్నాడు. ఏప్రిల్ 1, 2025 నుంచి 2026 జనవరి 31నాటికి బడ్జెట్ బారోయింగ్స్ రూ. 87,674.04 కోట్లని కాగ్ వెబ్సైట్ చెబుతోంది.అంటే, ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు రూ. 1.70 లక్షల కోట్లు. ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చి వివిధ కార్పోరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు మరో రూ. 89,026.82 కోట్లు. ఇవేకాకుండా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా రూ.11,850 కోట్లు. ఫిబ్రవరి 2026, మార్చిలో ఎస్డీఎల్ బాండ్స్ ద్వారా రూ. 9,900 కోట్లు అప్పులు తెచ్చారు. మొత్తం 20 నెలల్లో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.3,27,370.37 కోట్లు. ఇవన్నీ రాష్ట్ర ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు.అప్పులు రూ.1.05 లక్షల కోట్లేనని లేఖ ఇప్పించు..వైయస్సార్సీపీ ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చిందని చెబుతున్న పయ్యావుల కేశవ్.. ఇదే మాటను రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి స్టేట్మెంట్ రిలీజ్ చేసే దమ్ముందా? మంత్రి మాట్లాడింది అబద్ధం కాదని, రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ. 1.05 లక్షల కోట్లేనని వారం రోజుల్లో రాయించి ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇవ్వగలరా? ఇవ్వలేకపోతే పయ్యావుల కేశవ్ ఛాంబర్ బయట అబద్దాల కేశవ్ అని పేరు మార్చుకోవాలని ఛాలెంజ్ విసురుతున్నా.నెట్ బారోయింగ్ ఎక్కడా మా ప్రభుత్వం అధిగమించలేదని పయ్యావుల మరో అబద్ధం చెప్పాడు. రాష్ట్ర జీఎస్డీపీ మీద 3 శాతం నెట్ బారోయింగ్ దాటి అప్పులు చేసినట్టు కాగ్ వెబ్సైట్లో చెప్పింది. ఏపీ ప్రభుత్వం 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఎక్కడా నెట్ బారోయింగ్ అధిగమించలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇప్పించే ధైర్యం పయ్యావులకు ఉందా? అసెంబ్లీ, కౌన్సిల్లో అప్పులపై తప్పుడు లెక్కలు రాసి ఇచ్చారో ఆ అధికారులందరిపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధాని మోడీ గారికి ఫిర్యాదు చేస్తాం.ఎమ్మెల్యే బాధితురాలికి నేరం జరిగిందా?నిందితులను బాధితులుగా చేర్చడమే వైయస్ జగన్ పరిపాలన అంటాడు.. కూటమి ప్రభుత్వంలో రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే ఒక మహిళకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి వేధించి పలుమార్లు అబార్షన్లు చేయిస్తే.. ఆమెకు మీ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో చెప్పాలి. మహిళలకు అన్యాయం చేసిన వాడికి అదే ఆఖరి రోజు అని పదే పదే చెప్పుకుని తిరిగే సీఎం చంద్రబాబు.. ఆ బాధిత మహిళకు ఏం న్యాయం చేశాడు? మీ ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి, మీ మంత్రి లోకేష్లను కలిసి మొర పెట్టుకుంటే ఆమె జరిగిన న్యాయం ఏంటి? ఆ కూటమి ఎమ్మెల్యేని శిక్షించకపోగా తిరిగి ఆమె మీదనే కేసులు పెట్టి వేధించింది మీరు కాదా? ఆ కేసులను చూసి హైకోర్టు చీవాట్లు పెట్టలేదా? బాధితులను వేధించింది మీరు కాదా?హెరిటేజ్ మెషినరీ అప్గ్రేడ్ కోసం రూ.200 కోట్లు హెరిటేజ్ వ్యాపారం తన కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం చేస్తున్నారని, వారు ఏనాడూ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఎప్పుడెప్పుడు టెండర్లలో పాల్గొన్నారు. నెయ్యితో పాటు టెండర్లలో ఏవేవీ సప్లై చేశారు? ఎల్ -3 గా ఎప్పుడు వచ్చారు. 2 వేల కేజీల పాల పొడిని ఏ రేటుకు సప్లై చేశారు వంటి అన్ని వివరాలు ఆయన మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన అబద్ధం చెప్పాడని ప్రజలే తేల్చేశారు. అవేకాదు.. టీటీడీ సొమ్ము దోచుకోవడానికి హెరిటేజ్ డెయిరీ సిండికేట్ చేసిన దారుణాలు కూడా అన్ని వెలుగులోకి వచ్చాయి. ఇదంతా దేవుడి మహిమ. చంద్రబాబు పాపాలను దేవుడే దగ్గరుండి బయటపెట్టిస్తున్నాడు.ఇది కాకుండా ఈరోజు కేబినెట్లో చంద్రగిరి ప్రాంతంలో ఉన్న హెరిటేజ్ డెయిరీలో రూ. 200 కోట్లతో మిషనరీ అప్గ్రేడ్ కోసం ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చే రాయితీలు కాకుండా టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ సిద్ధం చేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కొత్తగా 35 మందికి ఉద్యోగాలిస్తారట. నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకునే చంద్రబాబు కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎందుకు దాచిపెట్టారు? దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఏమిటని అడిగితే ఫ్లేవర్డ్ పాలు 131 శాతం అదనంగా ఉత్పత్తి జరుగుతుందని చెబుతున్నారు. పన్నీరు 400 శాతం అదనంగా వస్తుందట. వాటి వల్ల ప్రయోజనం ప్రజలకా? లేక హెరిటేజ్కా? పైగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 పేరుతో హెరిటేజ్కి భారీ రాయితీలు ప్రకటించారు. కరెంట్ యూనిట్కి రూపాయి తగ్గింపు. ఐదేళ్లపాటు 100 శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇచ్చారు.బీఆర్ నాయుడితో రాజీనామా చేయించలేరా?టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి అశ్లీల వీడియో బయటకొచ్చినా ఆయనతో ఇప్పటివరకు రాజీనామా చేయించని చంద్రబాబుకి దేవుడంటే భయం, భక్తి ఉందని ఎలా అనుకోవాలి? వీడియో బయటకొచ్చిన తర్వాతైనా పశ్చాత్తాపం చెందకుండా అంతలా బరితెగించి మాట్లాడుతున్న బీఆర్ నాయుడిని వెనకేసుకు రావడం సిగ్గుచేటు. టీటీడీ చైర్మన్కి ఉన్న పాత బాగోతాలను ఆపాదించవచ్చా అని ప్రశ్నిస్తున్న ఎల్లో మీడియాకి నా సూటి ప్రశ్న.. అలాంటి బాగోతాలున్న వ్యక్తిని దేవుడి సేవకు వాడటం కరెక్టా? ఇలాంటి బాగోతం గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి తెలిసే టీటీడీ చైర్మన్గా నియామకం జరిగిందని బాధితురాలి లేఖల ద్వారా ప్రపంచానికి తెలిసింది. అయినప్పటికీ ఆయన్ను చైర్మన్గా నియమించారు. వీడియోలు బయటకొచ్చినప్పుడైనా నిఆయనతో రాజీనామా చేయించి టీటీడీ ప్రతిష్ట కాపాడాలని అనిపించలేదా? లోకేష్ పాపానికి హెడ్ మాస్టర్ బలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని రోజూ పేపర్ల నిండా వార్తలు, సోషల్ మీడియా నిండా వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఏనాడూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించలేదు. రెండేళ్లుగా ఈ సమస్య ఉన్నా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడానికి ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. పిల్లల ఆవేదన ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. దేశాలు దాటి క్రికెట్ మ్యాచ్లు చూడటంపైన ఆయనకున్న శ్రద్ధ పిల్లలకు మంచి భోజనం పెట్టడం పైన లేదు.మధ్యాహ్న భోజనం బాగోలేదని మైలవరం తారకరామ నగర్ పాఠశాల హెచ్ఎం డ్రామా చేశాడని ఆంధ్రజ్యోతిలో వార్త రాస్తే, హెచ్ఎం బాధ్యత లేకుండా ప్రవర్తించాడన్న కారణంతో డీఈవో ఆయన్ను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ వాస్తవానికి వంట బాగోలేదని ఎన్నోసార్లు విద్యార్థులు పోరు పెడుతున్నట్టు హెచ్ఎం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఎంక్వయిరీకి వెళ్లిన అధికారుల ముందు అన్నం బాగుండటం లేదని విద్యార్థులు ఏడుస్తూ చెప్పిన మాటలను కూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు? సోషల్ మీడియా దెబ్బకి నారా లోకేష్ వైఫల్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో హెడ్ మాస్టర్ను బలి తీసుకున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? విద్యాశాఖను నిర్వహించడం చేతకానప్పుడు ఏశాఖా లేని మంత్రి పదవి తీసుకుని లోకేష్ బయట తిరుగుతూ ఎంజాయ్ చేసినా విద్యార్థులకు మేలు చేసిన వాడవుతాడని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
హెరిటేజ్కి రాయితీలు.. ఏపీ కేబినెట్ ఆమోదం
సాక్షి, విజయవాడ: హెరిటేజ్కి రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు హెరిటేజ్ ఫుడ్స్ నిర్వహిస్తుండగా.. చంద్రగిరి మండలం కాశీపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్కి కేబినెట్ రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెరిటేజ్ టెక్నాలజీ అప్ గ్రేడేషన్ కోసం సబ్సిడీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఐదేళ్ల పాటు 100 శాతం జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరెంట్ బిల్లులో యూనిట్ కి రూ.1 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. హెరిటేజ్ నెయ్యి ఉత్పత్తి 566 శాతం, ఫ్లేవర్డ్ పాలు 131, పన్నీర్ 400 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద భారీ రాయితీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హెరిటేజ్ రాయితీలను మంత్రి పార్థసారధి మీడియా సమావేశంలో వెల్లడించలేదు. అజెండాలో చివరి అంశంగా పెట్టి.. ఏపీ కేబినెట్ ఆమోదించింది. -
పవన్ ముందు బాబుకు అవమానం పిఠాపురం వర్మ ఆగ్రహం
-
‘ఏపీ రైతుల మోయలేని రుణభారానికి చంద్రబాబే కారణం’
కాకినాడ: ఏపీలోని రైతులు రుణభారాన్ని మోయలేని స్థితిలోకి రావడానికి చంద్రబాబు సర్కారే కారణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఏపీలో రైతులపై అత్యధిక రుణభారం ఉందనే విషయాన్ని ఇటీవల కేంద్ర మంత్రి పార్లమెంట్ వేదికగా వెల్లడించారని కురసాల ఈ సందర్భంగా గుర్తుచేశారు. మీ నిర్లక్ష్యం కారణంగా... రుణాభారంలో ఏపీ రైతులు రెండవ స్ధానంలో ఉన్నారు. 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సగటున నలుగురు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ... వైఎస్ జగన్ అమలు చేసిన రైతు భరోసకు కాపీ.మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం పాడేశారు. రెండవ ఏడాది రూ.10 వేలు ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయంలో 53 లక్షల 58 వేల మందికి ఏటా పెట్టుబడి సాయం అందించారు. మీ హయంలో ఏడు లక్షల మంది రైతులు తగ్గిపోయారు. పథకమే పూర్తిగా అమలు చేయ్యకుండా ఏడు లక్షలమందికి కోత విధించారు. గడిచిన రెండేళ్ళల్లో కౌలు రైతుకు ఒక్క సహయం అందించలేదు. కౌలు రైతుల పట్ల ఎందుకు అంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కూటమి పాలన లో ఇప్పటి వరకు 16 సార్ల ప్రకృతి విపత్తు వచ్చాయి. ఏ రైతుకు సాయం అందించారో చెప్పండి. వందల కోట్లు ప్రీయమం కట్టడానికి డబ్బులు లేకపోతే ...రెండేళ్ళ కాలంలో చేసిన రూ.3 లక్షల కోట్ల అప్పులు ఏమైయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులకు సహయం చేయడ్యానికి బడ్జెట్ లో ఇది పెట్టామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు.*కోవిడ్లో కూడా పంటలకు మార్కెట్ స్ధిరికరణ చేసి..చివరకు మేము బూడిద గుమ్మడి కాయాలు కూడా కొనుగోలు చేశాం. ఏ సీజన్ లో పంట నష్టపోతే ... ఆ సీజన్ లోనే వైఎస్ జగన్ నష్టపరిహారం అందించారు.ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులను కొనే పరిస్ధితిలో ప్రభుత్వం లేదు. అరటిని ఇప్పుడు టన్ను రూ.ఐదు వేలకు అమ్ముకునే దుస్ధితికి రైతు వచ్చాడు. టమాటకు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పాడేసుకుంటున్నాడు. ఇది రైతుల పట్ల మీ నిర్లక్ష్యం కాదా? చంద్రబాబు’ అని ప్రశ్నించారు కురసాల కన్నబాబు. -
ముగ్గురిని కంటే 25 నలుగురైతే 50 వేలు.. ఇప్పుడు మనం ఏం చేయాలంటే..
-
ముగ్గురిని ఎందుకు కనలేదు... చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
-
ఏపీ కేబినెట్ భేటీ..పవన్ సహా ఆరుగురు మంత్రుల డుమ్మా!
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి మంత్రుల గైర్హాజరు చర్చాంశనీయంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఆరుగురు మంత్రులు హాజరు కాకపోవడం విశేషంశుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి, అమరావతి రాజధాని పురోగతి వంటి కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. అయితే, ఈ సమావేశానికి పలువురు మంత్రులు డుమ్మా కొట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సుకు కూడా పవన్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. నాదెండ్ల మనోహర్ సమావేశానికి దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణంగా హోమ్ మంత్రి అనిత, మంత్రి టీజీ భరత్, మంత్రి గొట్టిపాటి రవి.. కుటుంబ కార్యక్రమం కారణంగా మరో మంత్రి ఫరూక్ హాజరు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.మొత్తం ఆరుగురు మంత్రులు గైర్హాజరు కావడంతో ఈ కేబినెట్ సమావేశం చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కాయి. ముఖ్యంగా పవన్ వరుసగా రెండు కీలక సమావేశాలకు హాజరు కాకపోవడంపై వివిధ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అధికార వర్గాలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. -
అప్పుల్లో బ్లాక్ బస్టర్.. బాబు ఆల్ టైమ్ రికార్డ్
-
పట్టణాల్లో పౌర సేవలు అవుట్ సోర్సింగ్కు
సాక్షి, అమరావతి : పట్టణ స్థానిక సంస్థల పౌర సేవలన్నింటినీ అవుట్ సోర్సింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించడంతో పాటు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించి పీపీపీ విధానంలో ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. సచివాలయంలో గురువారం రెండోరోజు కలెక్టర్ల సదస్సులో పలు శాఖలపై సీఎం సమీక్షించారు. పట్టణ స్థానిక సంస్థలన్నింటిలోనూ విద్యుత్ వాహనాలను తీసుకురావాలని ఆదేశించారు. అభివృద్ధి చేస్తున్నా జీఎస్టీ ఆదాయం ఆ మేర ఎందుకు పెరగడంలేదనే విషయంపై అధ్యయనం చేయాలని వాణిజ్య పన్నులు, ఆర్థిక శాఖను ఆదేశించారు. అభివృద్ది జరిగితే ఆ మేర ఆదాయం పెరగాలని.. కానీ, ఎక్కడో తేడా కనిపిస్తోందన్నారు. ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి పన్ను ఎగవేతకు చెక్ పెట్టాలన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది సొంత ఆదాయం పన్ను వృద్ధి కేవలం నాలుగు శాతమే ఉందని.. అలాగే, ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది ఐదుశాతం మేర తగ్గిందని ముఖ్యమంత్రి చెప్పారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. కొందరు అటవీ అధికారులతో ఇబ్బందులు.. అటవీ శాఖపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు ఈ శాఖాధికారుల అసాధ్యమైన ఆలోచనలతో ఇబ్బందులు వస్తున్నాయి. ఆచరణ సాధ్యంకాని ఆలోచనలతో వ్యవహరిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా? శ్రీశైలంలో అటవీ శాఖాధికారులు భక్తులను అడ్డుకున్నారు. ఆ తర్వాత రోజు తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చింది. బద్వేలులోనూ అటవీ శాఖ ఇదే తరహాలో వ్యవహరించింది. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడా. మరోసారి మాట్లాడతా. అటవీ శాఖాధికారులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలి. జిల్లాల్లో పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ చూపుతూ పెట్టుబడుల మీటింగులు పెట్టాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జిల్లాల వారీగా ర్యాంకులిస్తాం. జాతీయ రహదారులపై వే సైడ్ ఎమినిటీస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, నైట్హాల్ట్ కోసం గదుల నిర్మాణం చేపడితే పెట్టుబడులు వస్తాయి. ఏపీఐఐసీ ద్వారా చేసే భూ కేటాయింపుల్లో కలెక్టర్లు ఐదెకరాల వరకూ చేసేలా వారికి ఆథరైజేషన్ ఇవ్వాలి. విజయవాడలోని డిస్నీల్యాండ్, భవానీ ఐల్యాండ్లను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తాం. పవన్, లోకేశ్ డుమ్మా.. ఇక రెండ్రోజుల ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్ డుమ్మా కొట్టారు. కీలక మంత్రులు హాజరుకాకపోవడంపట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తంచేసింది. కార్యక్రమంలో భాగంగా ‘అరకు కౌని’ పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను సీఎం ఆవిష్కరించి స్టాల్ను సందర్శించారు. సమావేశంలో సీఎం గొప్పలు పోవడం అధికారులకు అసహనం కలిగించింది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు అది చేశా.. ఇది చేశానని చెప్పడం కేవలం కాలక్షేపానికి మాత్రమే పనికొస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
ఫిషింగ్ హార్బర్ పోయింది.. ‘జువ్వలదిన్నె’ ప్రైవేట్ పరం!
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీల నుంచి ఒక్కో రంగాన్ని ప్రైవేట్పరం చేసి సంపద సృష్టించకపోగా ఆస్తులను తెగనమ్ముతూ క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు సర్కారు తాజాగా గత ప్రభుత్వ కృషితో సాకారమైన ఫిషింగ్ హార్బర్లపై కన్నేసింది. మన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు వేట కోసం వలస వెళ్లి అవస్థలు పడకూడదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫిషింగ్ హార్బర్ను చంద్రబాబు సర్కారు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. 2024 ఆగస్టులో ప్రధాని మోదీ ప్రారంభించిన నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కూటమి సర్కారు ఇంతవరకూ అందుబాటులోకి తేకుండా మత్స్యకారుల ఆశలను నీరుగార్చింది. తాజాగా దీన్ని నౌకా నిర్మాణ కేంద్రంగా మారుస్తూ ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్కు 29.58 ఎకరాలు కేటాయించింది. ఇందులో 7.58 ఎకరాలు వాటర్ ఫ్రంట్ ల్యాండ్, 22 ఎకరాలు హార్బర్ ల్యాండ్కు నిర్దేశించారు. మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా తన తనయుడు లోకేశ్తో శంకుస్థాపన చేయించడం గమనార్హం. ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ జువ్వలదిన్నెలో అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్ యూనిట్ సిస్టమ్స్ సెంటర్ను అభివృద్ధి చేయనుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడిచే మానవ రహిత ఉపరితల వాహనాలు, నీటి అడుగున తిరిగే వాహనాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం తొలి దశలో కేవలం రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొదట 29.58 ఎకరాలు కేటాయించగా మొత్తం 150 ఎకరాలు అప్పగించనున్నట్లు శుక్రవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. అంటే రానున్న కాలంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మొత్తం సాగర్ డిఫెన్స్కు కేటాయించనున్నట్లు స్పష్టమవుతోంది. మత్స్యకారుల నోట్లో మట్టి.. రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. తొలి దశలో రూ.1,522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసింది. జువ్వలదిన్నె హార్బర్ను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు 30న వర్చువల్గా ప్రారంభించినా చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు అందుబాటులోకి తేలేదు. రెండేళ్లలో ఏ ఒక్క ఫిషింగ్ హార్బర్నూ అందుబాటులోకి తేకపోగా గత ప్రభుత్వం చేపట్టిన వాటిని సైతం ప్రైవేట్పరం చేస్తోంది. జువ్వలదిన్నె హార్బర్ అందుబాటులోకి రాకపోవడంతో ఈ ప్రాంత మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు భారీ బోట్లతో మన తీర ప్రాంతంలో వేటాడుతున్న విషయాన్ని కొద్ది రోజుల క్రితం నెల్లూరు కలెక్టర్ సీఎం చంద్రబాబు దృష్టికి తెచి్చనా తనకు పట్టనట్లే వ్యవహరించారు. ఇప్పుడు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ స్థానంలో షిప్యార్డ్కు శంకుస్థాపన ద్వారా మత్స్యకారుల ఆశలను శాశ్వతంగా నీరుగార్చారు. మత్స్యకారుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో కేవలం చేపలు పట్టడానికి ఉపయోగపడే టెక్నాలజీని అభివృద్ధి చేస్తారంటూ నమ్మబలుకుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పెద్ద నౌకల తయారీతోపాటు సముద్ర జలాల్లో పరీక్షలు నిర్వహించడం స్థానిక మత్స్య సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బందరు ఫిషింగ్ హార్బరు వద్ద కూడా..ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా మన జలాల్లోనే చేపల వేట చేపట్టేలా మాజీ సీఎం వైఎస్ జగన్ జువ్వలదిన్నె హార్బర్కు శ్రీకారం చుడితే ఇప్పుడు షిప్యార్డ్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుగరాజపట్నం వద్ద అభివృద్ధి చేయనున్న షిప్ బిల్డింగ్ క్లస్టర్లో కాకుండా జువ్వలదిన్నె వద్ద షిప్ యార్డు నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే రీతిలో మచిలీపట్నం ఫిషింగ్ హార్బరు వద్ద కూడా మరో షిప్ యార్డు నిర్మాణం చేపట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటం మత్స్యకారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


