breaking news
Chandrababu Naidu
-
‘చంద్రబాబు మార్క్ దోపిడీకి ఇదే నిదర్శనం’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు మార్క్ దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే నిదర్శనమని, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు ప్రజారోగ్యాన్ని, వైద్య విద్య అభ్యసించాలన్న పేద విద్యార్థుల కలను పణంగా పెడుతున్నాడని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే యూజర్ చార్జీల రూపంలో ప్రజలపై పెనుభారం మోపడం ఖాయమని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా అందిన వైద్య సేవలన్నీ రాబోయే రోజుల్లో డబ్బులు చెల్లించి పొందాల్సిన పరిస్థితి వస్తుందని వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఈ ఉద్యమంతో కూటమి నాయకుల్లో వణుకు మొదలైందని చెప్పారు. కాబట్టే దాన్ని తక్కువ చేసి చూపించేలా కూటమి నాయకులతో సంతకాలు చేసిన ప్రజలను సైకోలు అని తిట్టిస్తూ చంద్రబాబు రోజురోజుకీ దిగజారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణపై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం ఖాయమన్నారు.ఆమె ఇంకా ఏమన్నారంటే...మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి వచ్చిన స్పందన చూసి కూటమి నాయకుల గుండెల్లో వణుకు పుడుతోంది. అందుకే చంద్రబాబు అండ్ కో ప్రజా స్పందనను తక్కువ చేసి చూపించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సైతం మెడికల్ కాలేజీల ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ చెప్పినా ఈ ప్రభుత్వం తీరులో మార్పు కనిపించడం లేదు. కమీషన్ల పేరుతో దోచుకోవడమే లక్ష్యంగా ప్రైవేటీకరణ ముద్దు- ప్రభుత్వ కాలేజీలు వద్దు అనేలా ముందుకు సాగుతున్నాడు. కోటికిపైగా సంతకాలు చేసిన విద్యార్థులు, యువత, మేథావులను సైకోలు, దొంగలు అని కూటమి పార్టీ నాయకులతో చంద్రబాబు తిట్టిస్తున్నాడు. మెడికల్ కాలేజీలు వద్దని సంతకాలు చేసిన 1,04,11,136 మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.ప్రజా పాలన పట్ల బాధ్యత మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు చెంప చెళ్లుమనిపించేలా, కూటమి ప్రభుత్వాన్ని బండకేసి బాదినట్టు ప్రజలు సంతకాలు చేశారు. సంతకాల రూపంలో తమ ఆవేదనను వ్యక్తం చేసిన ప్రజాభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పీపీపీ ముసుగులో జరుగుతున్న ప్రజా దోపిడీని ఆయనకు వివరించారు. గవర్నర్ కూడా ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్నారు. పీపీపీ మోడల్లో చంద్రబాబు తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం కోట్లాదిమంది ప్రజల ఆరోగ్యానినికి గొడ్డలిపెట్టు లాంటిది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని గ్రహించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దీనిపై న్యాయస్థానాల్లో వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోంది. మాకొద్దు బాబోయే అని కోటి మందికిపైగా సంతకాలు చేసి చెప్పినా, ఇప్పటికీ పీపీపీ గొప్ప అన్నట్టు చంద్రబాబు ప్రచారం చేసుకోవడం నిరంకుశత్వానికి నిదర్శనం.లా అండ్ ఆర్డర్ కూడా ప్రైవేటుపరం చేస్తారా?రాష్ట్రంలో అతి ముఖ్యమైన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు.. శాంతి భద్రతల విభాగాన్ని ప్రైవేటుపరం చేస్తారేమో చెప్పాలి. పీపీపీ మోడల్లో రోడ్లు నిర్మాణం చేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసినట్టుగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తర్వాత హెల్త్ ట్యాక్స్ వసూలు చేయకుండా ఉంటారా? అందులో భాగంగానే ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. యూజర్ చార్జీల రూపంలో ప్రజల మీద భారం మోపడానికే చంద్రబాబు ఈ పీపీపీ మోడల్ తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించేస్తున్నాడు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంది. గత టీడీపీ పాలనలోనూ ప్రైవేటుమయంప్రజల ఆరోగ్య భద్రత విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదు. గతంలో రాష్ట్రంలో 260 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండగా వాటి నిర్వహణకు ప్రతినెలా రూ. 4.50 లక్షల చొప్పున కేటాయించి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకి అప్పగించింది. అయినా వాటి ద్వారా ప్రజలకు అందిన వైద్య సేవలు ఏమాత్రం ఉండేవి కాదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూహెచ్సీల సంఖ్యను 560కి పెంచడంతోపాటు నాడు- నేడు ద్వారా వాటిని ఆధునికీకరించి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. 24 బై 7 పనిచేసేలా వైద్యులను అందుబాటులో ఉండటంతోపాటు అన్నిరకాల వైద్యపరికరాలు, మందులను సమకూర్చడం జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో 10,032 వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్లను ఏర్పాటు చేశాం. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా నేరుగా డాక్టర్నే ప్రజల ఇంటికి పంపించడం కూడా వైఎస్ జగన్ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ఒకటి. నాడు మా ప్రభుత్వ హయాంలో ఉచితంగా రక్త పరీక్షలను నిర్వహిస్తే నేడు చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేశాడు. ఏడాదికి రూ. 1000 కోట్లు చెప్పున రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిసినా అందుకు పూనుకోకుండా ప్రైవేటీకరణకే మొగ్గుచూపడానికి ప్రధాన కారణం కూడా కమీషన్ల కోసమే.ఇదేం తెలివితక్కువ విశ్లేషణ చంద్రబాబూ..పీపీపీ మోడల్ ను సమర్థించుకోవడానికి చంద్రబాబు చెబుతున్న మాటలు చూస్తే ఎవరికైనా అనుమానాలు కలగకుండా ఉండవు. ప్రభుత్వ పెత్తనం అని తెలుగులో చెప్పి ప్రైవేట్ మేనేజ్మెంట్ అని ఇంగ్లిష్లో చెబుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని తెలిసినా అడ్డగోలు విశ్లేషణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. 50 ఎకరాల మెడికల్ కాలేజీల భూములను ఎకరం వంద రూపాయలకు 66 ఏళ్లపాటు లీజుకివ్వడాన్ని ప్రజలెవరూ హర్షించడం లేదు. దీంతోపాటు మెడికల్ కాలేజీల పెత్తనం ప్రైవేటుకిచ్చి నిర్వహణకు అయ్యే ఖర్చును మాత్రం ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇలా స్కాంల మీద స్కాంలు చేస్తూ వైద్యవిద్యార్థుల ఆశలను, పేద ప్రజల ఆరోగ్యాన్ని అందని ద్రాక్షగా మార్చేస్తున్నాడు. చంద్రబాబు మార్క్ ఆస్తుల దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద ఉదాహరణ. ఇవన్నీ చూస్తుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ముసుగులో వేల కోట్లు చేతులు మారుతున్నాయని ఎవరికైనా స్పష్టంగా అర్థమైపోతుంది.అందుకే మా నాయకులు వైఎస్ జగన్ దీన్ని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనిపై విచారణ జరిపి అవినీతికి ఎవరు పాల్పడినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదు. తప్పు చేసిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని విడదల రజిని హెచ్చరించారు. -
కలెక్టర్ల వైఫల్యం కాదు.. అది మీ వైఫల్యమే: పేర్ని నాని
మచిలీపట్నం: కలెక్టర్లు సరిగా పని చేయడం లేదంటే అది సీఎం చంద్రబాబు వైఫల్యమేనని మాజీ మంత్రి, వైయస్సార్సీపీ నేత, పేర్ని నాని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాలకు కలెక్టర్లు కేవలం డెలివరీ మెకానిజమ్ మాత్రమే అని, వారికి దిశానిర్దేశం చేసేది సీఎం అనే విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. తన వైఫల్యాలు, తప్పులను అధికారులపై వేసి, సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీల సమావేశం పేరుతో సీఎం చేసింది పాలనా సమీక్ష కాదని, ఒక కాలక్షేప కార్యక్రమం అని తేల్చి చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు మెరుగైన వైద్యం దూరం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు. పేర్ని నాని ఏమన్నారంటే..అది కచ్చితంగా సీఎం వైఫల్యమేసీఎం చంద్రబాబుగారు రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను పిలిచి వారిని దాదాపు 20 గంటలు కూర్చోబెట్టారు. ఈ సమావేశంలో పాలనా సమీక్ష జరగాల్సిన చోట, అధికారులు ఎలా ఉండాలి. ఎలా ఉద్యోగం చేయాలి. ఎవరైనా లావుగా ఉంటే బరువు ఎలా తగ్గాలి. ఫిట్గా ఎలా ఉండాలి. వంటి అంశాలపై కాలక్షేప బఠానీ కబుర్లు చెప్పారు. ఆ కాలక్షేపాన్ని కూడా ప్రజలు చూసేలా టీవీల్లో ప్రసారం చేయించారు. ఇంకా ఆ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘మీరు గొప్పగా పని చేస్తున్నామని అనుకుంటున్నారు. నేనూ అలా అనుకుంటున్నాను. కానీ ప్రజలు అలా అనుకోవడం లేదు’ అంటూ కలెక్టర్లు, ఎస్పీల పనితీరుపై నిందలు వేశారు. రెండేళ్లు పూర్తి అవుతున్న సందర్భంలో ఆయన సూక్తిముక్తావళి చెబుతూ అధికారులను దోషులుగా చూపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వారిని పని చేయనివ్వకుండా అనేక ఆంక్షలు విధించడం ఆయన ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు.మొట్టమొదటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మాత్రం చంద్రబాబు పూర్తిగా భిన్నంగా మాట్లాడారు. ‘మనది పొలిటికల్ గవర్నెన్స్. మా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు మీ వద్దకు వస్తారు. వారికి మర్యాద ఇవ్వండి. మా ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాకుండా చూసుకోండి’ అంటూ అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు చెప్పిన మాటలకు, ఇవాళ చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయింది. ‘మీరు సరిగ్గా పని చేయడం లేదు, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు’ అంటూ అధికారులనే లక్ష్యంగా చేసుకున్నారు. నిజానికి కలెక్టర్లు, ఎస్పీలు కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే. ప్రభుత్వాన్ని నడిపించడం, విధానాలు రూపొందించడం, అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేయడం సీఎం బాధ్యతేనని పేర్ని నాని గుర్తుచేశారు.ముఖ్యమంత్రి బాధ్యత. కలెక్టర్లు, ఎస్పీలు సరిగ్గా పని చేయడం లేదంటే దాని అర్థం ముఖ్యమంత్రి పనితీరు బాగోలేదన్నదే. తన వైఫల్యాలను దాచుకునేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై నిందలు వేయడం అన్యాయం. ప్రజల ముందు మాత్రం మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు పత్తిత్తుల్లా, ప్రతివ్రత కబుర్లు చెబుతూ అధికారుల పనితీరును తప్పు బట్టడం చేతకాని పాలనకు నిదర్శనం. అధికారుల పనితీరు ప్రజలకు నచ్చలేదంటే, ప్రభుత్వ పనితీరు కూడా ప్రజలకు నచ్చనట్లేనన్న సత్యాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి అని పేర్నినాని ధ్వజమెత్తారు.దేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి లేరుప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నడపడం ప్రపంచమంతా జరుగుతోందని చంద్రబాబునాయుడు చెబుతున్నారు. అయితే ప్రపంచంలో జరుగుతున్నదంతా ఆంధ్రప్రదేశ్లో నిజంగా జరుగుతుందా? అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా ఒక ప్రధాని లేదా ముఖ్యమంత్రి తప్పులు చేసి జైలుకు వెళ్లి, ఆరోగ్యం బాగోలేదని బెయిల్పై బయటకు వచ్చి, మళ్లీ ముఖ్యమంత్రి అయి తనపై ఉన్న కేసులన్నీ మూయించుకున్న ఉదాహరణ ఉందా? ఈ తరహా చరిత్ర ఆంధ్రప్రదేశ్లోనే ఒక్క చంద్రబాబు విషయంలో కనిపిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.‘మీరు ముద్దాయిగా ఉండి, మీరే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కేసులు మాఫీ చేయించుకున్న ముఖ్యమంత్రి మీరే కదా?. దేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి మరెవరూ లేరన్న వాస్తవాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వైయస్ జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించడం కాదు, ముందు మీ గతాన్ని, మీ పాలనను మీరు పరిశీలించుకోవాలి. 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వారికి ఇవ్వడం అంటే అమ్మేయడమే..పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే, వారు నిర్వహించి మళ్లీ ప్రభుత్వానికి అప్పగిస్తారని చంద్రబాబు వివరిస్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఈ మెడికల్ కాలేజీలను మొత్తం 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ 66 ఏళ్లలో మీరు, మీ లోకేష్, మీ పవన్ కళ్యాణ్, సత్యకుమార్ ఎవరు ఉంటారు? మేము కూడా అప్పటికి ఉండం కదా? అని ప్రశ్నించారు. ఎకరానికి రూపాయి అద్దెకు ప్రభుత్వ భూములను 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వారికి ఇవ్వడం అంటే అమ్మేయడమే. పీపీపీ ఆస్పత్రి బయట ‘ప్రభుత్వ ఆసుపత్రి’’ అని పెద్ద బోర్డు పెట్టి, కింద చిన్న అక్షరాల్లో ప్రైవేట్ వ్యక్తి పేరు రాస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే. రాష్ట్రంలో ఉన్న మీ భూములను కూడా ఎకరా రూపాయి చొప్పున 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వండి. 66 ఏళ్ల తర్వాత మళ్లీ దేవాన్ష్ లేదా ఆయన కొడుక్కి అప్పగిస్తారు. చంద్రబాబు తత్వం మొత్తం గాలిలో మేడలు కట్టడం, పిట్టల దొర కబుర్లు చెప్పడం, అసాధ్యాన్ని సాధ్యమని చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలే.ఏఐ డాక్టర్ ఎలా అవుతుంది?:చంద్రబాబుకు జ్వరం వస్తే ఆస్పత్రికి ఎందుకు వెళ్తున్నారు? మొన్న డాక్టర్లకు ఏం తెలుసు అని, ఏఐని అడగాలని చంద్రబాబు చెప్పడం కూడా అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. డాక్టర్లు ఇచ్చిన సమాచారంతోనే ఏఐ ఒక నాలెడ్జ్ హబ్గా, డేటా సెంటర్గా తయారవుతుందని, ఏఐ డాక్టర్ కాదని స్పష్టం చేశారు. జ్వరం వస్తే చంద్రబాబు కంప్యూటర్ ఎదుట కూర్చొని ఏఐని అడుగుతారా? లేక వెంటనే నాగార్జున ఆసుపత్రికి పరుగెత్తుకెళ్తారా? అని ప్రశ్నించారు.ప్రైవేటులో ఫ్రీగా వైద్యం అందుతుందా?:2015లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్కు ఇచ్చారు కదా అని గుర్తు చేస్తూ, మీరు ఒక్కరోజైనా ఆ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారా? ఒక్క ఇంజక్షన్ అయినా వేయించుకున్నారా? ఒక్క మందు బిళ్ల అయినా తీసుకున్నారా? ప్రైవేట్ ఆసుపత్రులకు పేదలు ఎలా వెళ్తారు. పీపీపీ వల్ల మెడికల్ సీట్లు పెరుగుతాయి, ఫీజులు అలాగే ఉంటాయని జర్నలిస్టులను చంద్రబాబు దబాయిస్తున్నాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థికి ఏడాదికి కేవలం రూ.15 వేలే ఫీజు ఉంటుంది, స్కానింగ్, ఎంఆర్ఐ, రక్త పరీక్షలు అన్నీ ఉచితంగా లభిస్తాయి. ప్రైవేట్ నిర్వహణలో ఇవన్నీ ఉచితంగా ఇస్తారా. డయాలసిస్, చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితం కదా?బసవ తారకం ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తున్నారా?చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ కలిసి నడుపుతున్న బసవతారకం ఆసుపత్రిలో 70 శాతం ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం వద్ద భూమి తీసుకున్నప్పుడు అంగీకరించారని గుర్తు చేశారు. కానీ ఆ ఆసుపత్రిలో ఒక్క పేదవాడికైనా ఉచితంగా చికిత్స ఇచ్చారా? పేదలు ఆ ఆసుపత్రికి వెళ్లగలుగుతున్నారా? అని ప్రశ్నించారు. అక్కడ పేదల్ని పట్టించుకునే పరిస్థితే లేదని తీవ్రంగా విమర్శించారు. వరి సాగు తగ్గిస్తే యూరియా రూ.800 ఇస్తానని, ఏడాదిలో నేరాలు తగ్గాలంటూ చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్లో మాట్లాడుతున్నాడు. ఆయన పాలనలో నేరాలు తగ్గలేదు–ఘోరాలు మాత్రమే పెరిగాయి. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, హింస, హత్యలు 19 నెలల పాలనకు నిదర్శనంగా మారాయి.డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు?డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలను నిర్లక్ష్యం చేసి హోం శాఖలో జోక్యం చేసుకుంటూ మాటలకే పరిమితమయ్యారు. భీమవరం, పిఠాపురం వంటి ప్రాంతాల్లో పేకాట, ల్యాడ్ సెటిల్మెంట్లు, రాజకీయ జోక్యంతో పోలీసు–రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దళితులపై కుల వివక్ష, జర్నలిస్టులపై దాడులు జరిగినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం చేతకాని పాలనకు స్పష్టమైన నిదర్శనం.మా ప్రభుత్వం వచ్చాక వారందరిపై చర్యలు తప్పవుపీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే వాటిని అమ్మేయడమే. వైయస్ జగన్ ప్రభుత్వం పేదలపై భారం పడకూడదని పారదర్శకంగా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానం తీసుకొస్తే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి వంద శాతం ప్రైవేటీకరణ చేసింది. దీనికి వ్యతిరేకంగా కోటి మందికిపైగా ప్రజల మనోభావాలను వారి సంతకాల రూపంలో నిన్న (గురువారం) శ్రీ వైయస్ జగన్ గవర్నర్ గారికి అందించారు. కాలేజీలు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే వైద్యం వ్యాపారమవుతుంది. ఈ పాపానికి బాధ్యులైన వారందరిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.ఎయిమ్స్ను ఎందుకు పీపీపీ పద్ధతిలో ఇవ్వడం లేదు?లోకేష్ ఇచ్చిన కాగితం చదవడానికి హడావిడిగా వచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, బీజేపీ ప్రతినిధిలా కాకుండా చంద్రబాబు–లోకేష్ ఆదేశాలతో పని చేసే వ్యక్తిగా మారిపోయారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నది తానేనని బహిరంగంగా చెప్పుకుంటూ, ప్రశ్నించే వారిని బెదిరించడం ఆయన అవివేకానికి నిదర్శనం. పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం దొరుకుతుందనడం అబద్ధం. ఉచిత, నాణ్యమైన చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధ్యం. ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీకి ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని మంత్రి, అధికార మదంతో మాట్లాడుతున్నారు.సుష్మా స్వరాజ్ ఏమన్నారో తెలుసా?వైఎస్ జగన్పై కేసుల విషయాన్ని వక్రీకరిస్తూ మాట్లాడే నైతిక హక్కు సత్యకుమార్కు లేదు. ఎందుకంటే ఆయన పని చేస్తున్నది సుమారు 150 కేసులు ఎదుర్కొన్న చంద్రబాబునాయుడు చేతి కింద ఆయన పలు కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు రాలేదా అన్నది రాష్ట్ర ప్రజలకు తెలిసిన వాస్తవం. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేత సుష్మాస్వరాజ్ స్వయంగా, వైయస్ జగన్పై కేసులు రాజకీయ ప్రతీకారమేనని స్పష్టం చేశారు. అధికార మదంతో మాట్లాడడం సత్యకుమార్ అవివేకానికి నిదర్శనం అని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. -
నువ్వు వేస్ట్ అని ప్రజలకు ఎప్పుడో తెలుసు నీకే ఇప్పుడు తెలిసింది
-
Appalaraju: అధికారుల ముందు తప్పు ఒప్పుకున్న బాబు
-
Gudivada : ముందు మీ ఎమ్మెల్యేకు చెప్పండి ప్రతిదానికి ఉన్నాం అంటూ..
-
‘ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి చేయొచ్చు’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారుస్తుందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు ద్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ కేవలం 18 నెలల కాలంలోనే రూ.2.70లక్షల కోట్ల అప్పులు చేసిందని, సరాసరిన రోజుకు రూ. 550 కోట్లు అప్పు ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఈరోజు (శుక్రవారం, డిసెంబర్ 19వ తేదీ) ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేసే ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి చేయొచ్చన్నారు.ఇటీవల జరిపిన ఒక గంట యోగా కార్యక్రమం కోసం రూ. 330 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరుతో ఇదివరకే రూ.వేల కోట్లు దుబారా చేయగా ఇప్పుడు మళ్లీ వేల కోట్లతో కొత్త నిర్మాణాలు చేపడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేవేటీకరణను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం తమను వెన్నుపోటు పొడిచిందని జనమంతా ఆగ్రహంతో ఉన్నారని ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని జనానికి అర్థం అయిందని తెలిపారు.అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం చేపడితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతాకాలు చేశారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం దాగి ఉందని మాజీ మంత్రి అప్పల్రాజు పేర్కొన్నారు. భూమి ప్రభుత్వానిది ఆదాయం మాత్రం ప్రైవేట్వారికా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. రెండేళ్ల జీతాలు ప్రభుత్వమే చెల్లించాలా ఆ జీతాల సొమ్ముతో మరో రెండు వెద్యకళాశాలలు కట్టవచ్చని తెలిపారు.108, 104లను అనర్హులకు కట్టబెట్టిన వైనంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చూశారని తెలిపారు..అందుకోసమే కరోనా సమయంలోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు వైద్యం అందకుండా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేపడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ప్రైవేటీకరణను రద్దు చేసి తీరాతం అని మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు తెేల్చిచేప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.. పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారని పరిశ్రమలపై దాడులు చేసి మూసివేసేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావడం లేదని తెలిపారు. సనాతనవాదని అని గొప్పలు చెప్పుకుతిరిగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోమాంసం దొరికితే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పరకామణి విషయంలో కోర్టు పరిధిలో సెటిల్మెంట్ జరిగితే దాన్ని కూడా రాజకీయం చేయటం ఆయన సంకుచిత బుద్దికి నిదర్శనమని తెలిపారు. -
పాతాళానికి ఏపీ ఆర్థిక వ్యవస్థ బాబు కుట్ర బయటపెట్టిన ఎల్లో మీడియా
-
ఇది అంతం కాదు ఆరంభం.. ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
-
YSRCP Leaders: కోటి సంతకాల ప్రజా ఉద్యమం సూపర్ సక్సెస్
-
Hari Gopala : అదేమైనా నీ అయ్యా సొమ్మా.. నీ ఇష్టం వచ్చినట్టు పంచడానికి
-
‘చంద్రబాబు సర్కార్ చేతకానితనం ఇది’
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలతో వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ, అనకాపల్లిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు భయపడే పరిస్థితి ఉందన్నారు. భూ వివాదాలు, సివిల్ సెటిల్మెంట్లలో ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోవడం ప్రభుత్వం చేతకానితనం అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.కలెక్టర్లు, ఎస్పీలకు క్లాస్ పీకడం వల్ల ప్రయోజనం ఉండదు. సామంత రాజుల్లా చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలకు క్లాస్ పీకి, యాక్షన్ తీసుకుంటేనే దారికి వస్తారు. ముందు ఎమ్మెల్యేలను కట్టడి చేయడంపై సీఎం, డిప్యూటీ సీఎం దృష్టి సారించాలి’’ అంటూ గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు. -
బాబు ఆర్థిక విధ్వంసం.. ఎల్లో మీడియా మాటల్లో!
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు నానాటికీ మరింత అధ్వాన్నంగా మారిపోతుంది. తప్పుడు లెక్కలతో తీరని ద్రోహం జరుగుతోంది’.. ఈ మాటలు అంటోంది ప్రతిపక్షాలు కాదు.. కూటమి ప్రభుత్వానికి దన్నుగా నిలిచే ఎల్లోమీడియా!. ఒకపక్కమే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదని ఒకసారి.. జీఎస్డీపీ బ్రహ్మాండమని ఇంకోసారి చెబుతూంటే.. ఎల్లోమీడియా ఇలా వాస్తవాలు వెల్లడించి పరువు బజారున పడేసింది.అయితే.. ఈ కథనంలో ఎక్కడా చంద్రబాబును తప్పు పట్టలేదు లెండి. తప్పంతా అధికారులదే అన్నట్టుగా ఈ కథనం సాగింది. జీఎస్డీపీ, తలసరి ఆదాయాలు బాగున్నట్లు చూపించి అసలు కష్టాలను దాచేశారని, కాగితాలపై గొప్పలు చెప్పారని వ్యాఖ్యానించింది. దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో ఏపీకి భారీ కోత పడిందని కూడా పేర్కొంది. రెవెన్యూ గ్రాంట్లలోనూ నష్టమే జరుగుతోందని, కేవలం అప్పుల కోసమే జీఎస్డీపీకి రెక్కలు తొడిగారని కూడా వెల్లడించింది.కొంతకాలంగా ఏపీ ఆర్ధిక పరిస్థితి, దొంగ లెక్కల గురించి ఆర్థిక నిపుణులు, అనుభవజ్ఞులైన జర్నలిస్టులు చెబుతున్నది కూడా అదే. అయితే, అప్పుడు పచ్చ మీడియా చంద్రబాబును వెనకేసుకొచ్చింది. ఇప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఇలాంటి కథనాలు రాసిందని అంటున్నారు. అందుకే ఇందులో వాస్తవమున్నా నిజాయితీ మాత్రం కనిపించదు. వైఎస్ జగన్ హయాంలో అప్పులే ఆలంబన అని, ఇప్పుడేమో అప్పులతోపాటు ఇమేజీ కోసం ఆరాటం అని ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. అంతే తప్ప జగన్ టైమ్లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభంతో వచ్చిన సమస్యలను రాయడానికి వీరికి చేయి రాలేదు. పైగా జగన్ హయాంలో రాష్ట్రం బ్రాండ్ పాతాళానికి చేరిందంటూ తప్పుడు వ్యాఖ్యలతో కథనాన్ని ఆరంభించడమే వీరి కుళ్లుకు దర్పణంగా కనిపిస్తుంది. అప్పుడేమో సంక్షేమమేనట, బటన్ నొక్కడమేనట. ఇప్పుడేమో పరిస్థితి మారిందట. సంక్షేమం, అభివృద్ది కావాలట. పెట్టబడులు రావాలట.ఆ రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారని, అందుకు సుమారు రూ.లక్షన్నర కోట్లు ప్రతి ఏటా ఖర్చు చేయాల్సి ఉంటుందని జగన్ చెబితే ఈ మీడియా అంగీకరించిందా?. లేకపోగా జగన్పై చంద్రబాబు శరాలు సంధించారని గొప్పగా రాసింది. జగన్ టైమ్లో పోర్టులు, మెడికల్ కాలేజీలు కడితే, అవేవీ ఎల్లో మీడియా కళ్లకు కనిపించలేదు. పోనీ చంద్రబాబు టైమ్లో వచ్చిన కొత్త పరిశ్రమలు కనిపించాయా అంటే లేదు. కంపెనీలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ధారాదత్తం చేస్తుంటే, రాష్ట్ర ప్రజల సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతుంటే వీరికి తప్పు అనిపించదు. కానీ, జగన్ అలాంటి పనులు చేయకపోయినా ఆయనపై పడి ఏడుస్తుంటుంది. ఈ మీడియా ఇచ్చిన కథనంలో వృద్దిరేటుపై చంద్రబాబు చెబుతున్న విషయాలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని తెలిపింది. ఈ లెక్కల వల్ల రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లలో గండి పడుతోందని తెలిపింది. చంద్రబాబేమో తనంత ఘనాపాటి లేడని అనిపించుకోవాలని అతిశయోక్తులతో కూడిన అంకెలతో గారడి చేస్తుంటే, ఆర్థిక శాఖకు చెందినవారో, లేక మంత్రి ఎవరో ఈ విషయాలు చెప్పి కథనం రాయించినట్లు అనిపిస్తుంది.ఈ తప్పుడు లెక్కల వల్ల ఏపీకి కేవలం రూ.7500 కోట్ల మేర మాత్రమే కేంద్రం గ్రాంట్ వచ్చిందని, అదే బీహారుకు రూ.17500 కోట్లు వచ్చిందని వివరించారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కూడా ఇలాగే నష్టపోతున్నదట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగిపోతోందన్న లెక్కలవల్లే ఈ వాటా తగ్గుతోందట. అయితే ఏపీలో జీఎస్టీ వసూళ్లు తగ్గిన అంశాన్ని ఈ మీడియా కప్పిపుచ్చేసింది. జగన్ టైమ్లో జీఎస్డీపీ రూ.14 లక్షల కోట్ల ఉంటే, దానిని ఏడాదికి రెండు లక్షల కోట్ల చొప్పున పెంచేశారని, దీనికి తగినట్లుగానే తలసరి ఆదాయం అంచనాలు కూడా పెంచేశారని ఈ పత్రిక తెలిపింది. అప్పుల కోసం, బ్రాండ్ ఇమేజీ కోసం ఇలా చేస్తున్నారట. దేశంలో జీఎస్డీపీ 8.7 శాతం ఉంటే, ఏపీలో మాత్రం అది 11.28 శాతంగా చూపించడాన్ని ఈ మీడియా తప్పుపట్టింది. దేశ సగటు కన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా వస్తాయని, ఏపీలో చాలా ఎక్కువగా చూపినందున తక్కువ నిధులు వస్తాయని ఈ మీడియా వాపోయింది. అలాగే జాతీయ తలసరి ఆదాయం కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని ప్రభుత్వం గొప్పలు పోయిందట. ఈ పరిస్థితిలో కేంద్రం నుంచి అధిక నిధులు, పన్నులలో ఎక్కువ వాటా ఎలా వస్తుందని అధికారులు అంటున్నారట.చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ లెక్కల్లోని డొల్లతనం కూడా ఈ పత్రిక బహిర్గతం చేసింది. ఏపీకి పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లుగా అంచనా వేశారని, అవన్ని గాలి మేడలే అని చెబుతూ ఈ పద్దు కింద రూ.ఐదు వేల కోట్లు వస్తే గొప్ప అని స్పష్టం చేసింది. ఇప్పటికి వచ్చింది రూ.3671 కోట్లేనట. రాష్ట్ర పన్ను ఆదాయం కింద రూ.1.09 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే నవంబర్ నాటికి వచ్చింది రూ.68 వేల కోట్లేనని తేలింది. ఆదాయం పరిస్థితి ఇలా ఉండగా, ప్రభుత్వ ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. రెవెన్యూలోటు 163 శాతానికి చేరుకుంది. రూ.1.60 లక్షల కోట్లు వ్యయం చేస్తే అందులో కేవలం రూ.17 వేల కోట్లే మూలధన వ్యయంగా ఉంది. ఈ అంకెల విషయంలో ఎక్కడా జగన్ ప్రభుత్వం నాటి లెక్కలతో పోల్చకుండా ఈ ఎల్లో మీడియా జాగ్రత్తపడింది.కేంద్రం నుంచి కూడా అప్పట్లో అధిక నిధులను జగన్ ప్రభుత్వం సాధించింది. ఉదాహరణకు రెవెన్యూ లోటు కిందే సుమారు రూ.పది వేల కోట్లు పొందింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు రాబట్టుకోగలిగింది. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేసి, అదనపు నిధులు సాధించింది. పైగా ఆ రోజుల్లో జీఎస్టీ వసూళ్లలో కూడా దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉండేది. అయినా అప్పుడు బ్రాండ్ పాతాళంలో ఉందని తప్పుడు రాతలు రాసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు ఈ దారుణ పరిస్థితికి ఎన్ని పాతాళాల లోతున కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందో మాత్రం చెప్పలేదు.వ్యాపార లావాదేవీలు, ప్రజల కొనుగోలు శక్తి మొదలైనవన్నీ జగన్ టైమ్లో మెరుగ్గా ఉన్న విషయాన్ని ఎల్లో మీడియా కప్పిపుచ్చే యత్నం చేసింది. కేవలం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగవేయడానికి వీలుగా గత కొన్నాళ్లుగా కథనాలు ఇస్తున్న ఈ పచ్చ మీడియా అందులో భాగంగానే తాజా కథనమూ ఇచ్చి ఉండవచ్చు. కానీ, ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధ్వంస పాలనను తనకు తెలియకుండానే ప్రజల ముందు ఉంచింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రుషికొండ భవనం.. ఏపీ వైట్ హౌస్
-
జగన్ చరిత్ర సృష్టిస్తే.. నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోయావ్
-
ఎంత పెద్ద స్కామ్ అంటే? లైవ్ లో ఆధారాలతో బట్టబయలు చేసిన కారుమూరి
-
బాబుకు జగన్ దబిడి దిబిడి.. మీకు చేతకాకపోతే వదిలేయండి
-
రాష్ట్ర చరిత్రలో గొప్ప ఉద్యమం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. కాలేజీలను ప్రైవేటువారికి ఇప్పించడమే కాకుండా వాటిలో పనిచేసే సిబ్బందికి రెండేళ్లు చంద్రబాబు సర్కారే వేతనాలు ఇస్తుందట..! ఇదో మరో స్కామ్ అని స్పష్టం చేశారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. ప్రభుత్వ రంగంలోనే వాటిని నిర్మించి నడపాలని డిమాండ్ చేస్తూ 1,04,11,136 మంది సంతకాలు చేసి ఉద్యమాన్ని విజయవంతం చేశారని వెల్లడించారు. ఈ ప్రజా ఉద్యమానికి వచ్చిన స్పందన చూసైనా చంద్రబాబు సర్కార్ వాస్తవాలు గుర్తించి.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిర్ణయం మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. స్కామ్కు పాల్పడిన వారిని జైళ్లకు పంపుతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వారిపై అన్ని చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటికి పైగా సంతకాలతో కూడిన వాహనాలకు గురువారం ఉదయం వైఎస్ జగన్ జెండా ఊపి లోక్భవన్కు పంపారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..చరిత్రలో నిల్చిపోయే ఘట్టంకోటి సంతకాల సేకరణలో మీ కృషి, మీ అందరినీ అభినందించేందుకు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఇక్కడి నుంచి మొదలు పెడితే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, గ్రామస్థాయిలో కార్యకర్తల వరకు అంతా నిబద్ధతతో పని చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలని, ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలనే పట్టుదలతో చేపట్టిన ఇంత గొప్ప ఉద్యమం బహుశా రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. ఇన్ని సంతకాలు సేకరించడం, నిజంగా రాష్ట్ర చరిత్రలో నిల్చిపోయే ఘట్టం. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా.స్కామ్ చేసిన వారెవరినీ వదలం..గవర్నర్కు ఈ పత్రాలన్నీ చూపించిన తర్వాత, ఆయనకు చెప్పిన తర్వాత ఈ పత్రాలతో కోర్టు తలుపు కూడా తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. మీరెప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు (కోటి సంతకాల పత్రాలు) మీకు చూపించడం కోసం సిద్ధంగా ఉంటామని కోర్టుకు నివేదిస్తాం. కానీ ఇంతటితో చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని నేను అనుకోవడం లేదు. గతంలో ఎన్.జనార్ధన్రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడంతో ఏకంగా ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈయనకు (చంద్రబాబు) సిగ్గు లేదో ఇంకొకటి లేదో! ఎడాపెడా గవర్నమెంట్ ఆస్తుల్ని ఇచ్చేస్తూ స్కాములు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు! మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా చంద్రబాబు వినకుండా దీన్ని ముందుకు తీసుకుని పోతే మాత్రం.. ఈ స్కామ్లో ఉన్న వారంతా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలలు తిరక్క ముందే జైళ్లలో ఉంటారు. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. గవర్నర్తో భేటీ తర్వాత కోర్టుల్లో చేసే యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈలోపు చంద్రబాబునాయుడు ఇంకా మనసు మార్చుకోకుండా ముందుకు అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోం. మళ్లీ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం. మళ్లీ ప్రజల మధ్యన నిల్చుని ఉద్యమాలు చేసే కార్యక్రమం కొనసాగుతుంది. బాబు చేసిన మంచి.. బోడి సున్నా!గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ హాస్పిటళ్లు ఎందుకు నడుపుతోంది అని అనుకునే మనిషి బహుశా చంద్రబాబు మినహా ప్రపంచంలో ఎవరూ ఉండరు. నాడు.. మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ బతికింది. కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం. ఇంతకుముందు ఎన్నికల్లో మనం అధికారంలోకి రాకపోయి ఉంటే, చంద్రబాబునాయుడు వచ్చి ఉంటే ఆర్టీసీని కూడా అమ్మేసుండేవారు. మొన్న ఆశ్చర్యకరంగా ఒకమాట విన్నా.. పోలీస్ శాఖను కూడా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తాడట. శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నోటి నుంచి నిన్న (బుధవారం) కలెక్టర్ల సదస్సులో వచ్చిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రజల్లో ఆయన గ్రాఫ్ పడిపోతోంది. దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగా లేదని వారిపై నెపం వేస్తున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టగా వచ్చే మార్చిలో మూడో బడ్జెట్ పెడుతున్నారు. మరి ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అంటే? బోడి సున్నా కనిపిస్తుంది.అప్పటిదాకా ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములూ రద్దయిపోయాయి. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాలకు చెందిన నేతలు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. -
చంద్రబాబు, పవన్, లోకేశ్ జిల్లాల్లో.. శాంతిభద్రతలు దారుణం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సొంత జిల్లా తిరుపతి.. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా.. మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా దిగజారింది. రాష్ట్ర పోలీసు శాఖ అధికారికంగా వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టింది. 2023 డిసెంబరు నుంచి 2024 నవంబరుతో పోలిస్తే.. 2024 డిసెంబరు నుంచి 2025 నవంబరు మధ్య కాలంలో రాష్ట్రంలో దాడులు, దోపిడీలు, ప్రధానంగా ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని ఆ నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో దారుణంగా దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా కనికట్టు చేసేందుకు యత్నించినా వాస్తవాలు మాత్రం బట్టబయలయ్యాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన రెండోరోజు సదస్సులో భాగంగా గురువారం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సీఎం చంద్రబాబు సమీక్షించి నివేదికను సమర్పించారు. అందులోని ప్రధాన అంశాలివీ.. పది జిల్లాల్లో నేరాల తీవ్రత పెరుగుదల.. రాష్ట్రంలో కీలకమైన 10 జిల్లాల్లో నేరాల రేటు గణనీయంగా పెరిగింది. అన్నమయ్య, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, గుంటూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో నేరాల తీవ్రత పెరిగింది. అది కూడా ఆరు జిల్లాల్లో 4.8 శాతం నుంచి 9.5 శాతం నేరాలు తీవ్రంగా పెరగడం గమనార్హం. వామ్మో.. దాడులు, హత్యాయత్నాలు.. » ఇక నేరాల్లో దాడులు, హత్యాయత్నాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2024లో 13 దాడుల కేసులు నమోదు కాగా.. 2025లో 19.8 శాతం పెరుగుదలతో 157 కేసులు నమోదయ్యాయి. » 2024లో 1,291 హత్యాయత్నాలు జరగ్గా.. 2025లో 1,582 జరిగాయి. అంటే.ఈ ఏడాది హత్యాయత్నాలు 22.5 శాతం పెరిగాయి. » వైఎస్సార్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ దౌర్జన్యాలు, దాడులు పేట్రేగిపోయాయి. » ఇక పట్టపగలు దోపిడీలు.. ఈ సందర్భంగా హత్యలూ పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. » ఈ తరహా నేరాలు ఎక్కువగా వైఎస్సార్ కడప, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, గుంటూరు జిల్లాల్లో పెరిగాయి. » ఇక 2025లో మొత్తం 6,139 గంజాయి, డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. నేరాల రేటు ఎక్కువఈ సమావేశంలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నేరాల రేటు అత్యధికంగా ఉందన్నారు. గంజాయి వ్యాపారానికి అడ్డం వస్తే ఏకంగా హత్యలు చేసేస్తున్నారని.. లేడీ డాన్స్ కూడా తయారవుతున్నారని చెప్పారు. నేరాల నియంత్రణలో జిల్లాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందన్నారు. అన్నమయ్య, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, గుంటూరు, తిరుపతి వంటి జిల్లాల్లో నేరాలు పెరుగుతున్నాయని.. దీనిపై విశ్లేషించాలన్నారు. వైఎస్సార్ కడప, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆర్థిక నేరాల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితులకు 15 నిమిషాల్లోనే అత్యవసర సేవలు అందించేలా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంను రూపొందించాలని.. తీరప్రాంతాల్లో భద్రత కోసం డ్రోన్లు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నేరస్తులకు రాజకీయ నేతల అండఇక అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏమీ చేయలేకపోతున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ చెప్పారు. నేరాలకు పాల్పడే వారిని రాజకీయ నేతలు వెనకేసుకొస్తున్నారని అంగీకరించారు. ఫలితంగా.. పోలీసులు నిర్లిప్తంగా ఉండిపోతున్నారని చెప్పారు. విశాఖపట్నంలో కొందరు దాడికి పాల్పడ్డారని పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని పవన్కళ్యాణ్ ఈ సందర్భంగా ఉదహరించారు.ఆర్థిక నేరాలూ పైపైకి.. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు కూడా అమాంతంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2024లో మొత్తం 7,539 కేసులు నమోదు కాగా.. 2025లో ఈ సంఖ్య 8,035కు పెరిగింది. నమ్మకద్రోహంతో ఆరి్థక నేరాలు 2024లో 1,077 కేసులు.. 2025లో 25.6 శాతం పెరిగి 1,353 కేసులు నమోదయ్యాయి. ఇక మోసాలకు సంబంధించి 6,430 కేసులు నమోదు కాగా.. 2025లో 3.6 శాతం పెరుగుదలతో 6,660 కేసులు నమోదయ్యాయి. రోడ్డు ఎక్కాలంటే భయం.. ఇక రహదారి భద్రతలోనూ చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాలు 2.2 శాతం పెరుగుదలతో 18,837 సంభవించాయి. తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు 4.6 శాతం పెరిగాయి. అలాగే, ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా 4.6 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2025లో ఇలా 8,466 మంది మృతిచెందగా.. 10,600 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో తిరుపతి, విశాఖపట్నం, ఎన్టీఆర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనే 29 శాతం సంభవించాయి. -
అయ్యో.. బాబో అన్నా.. పత్తాలేని ఏపీ పోలీస్
సాక్షి, అమరావతి: ‘ఇంటిపేరు కస్తూరి వారు.. ఇల్లంతా గబ్బిలాల కంపు’ అన్నట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. టెక్నాలజీకి తాను అంబాసిడర్నని, ఐటీ, ఏఐలను తానే కనిపెట్టానని తరచూ గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు బండారం బట్టబయలైంది. ఆపదలో ఉన్న బాధితులకు తక్షణ సహాయం అందించి రక్షణ కల్పించే టోల్ ఫ్రీ నంబర్ 112 వ్యవస్థ పనితీరులో ఏపీ ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉంది. బాధితులకు ఆపన్న హస్తం అందించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమై దేశంలోనే అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది.బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్ 2.0)ను ఏపీ ప్రభుత్వం అసలు అందుబాటులోకి తేనేలేదన్నది తేటతెల్లమైంది. ఈ విషయాన్ని మరెవరో కాదు సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు ‘40 ఇయర్స్ ఇండస్డ్రీ’ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు అసలు ప్రజలకు రక్షణ కల్పించాలంటే ఏమేం చేయాలో ఆయన చెప్పారు. ఇప్పటికైనా స్పందించండి అని అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ నెల 8న లేఖ రాయడంతో ఏపీ ప్రభుత్వ అసమర్థత జాతీయస్థాయిలో బట్టబయలైంది. మొద్దునిద్రలో ఏపీ పోలీస్ అయ్యా.. ఆపదలో ఉన్నాం. సహాయం చేయండి’ అని బాధితులు మొరపెట్టుకుంటుంటే.. ఏపీ పోలీసులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. చంద్రబాబు రెడ్బుక్ కక్షసాధింపు చర్యలకు కొమ్ముకాసే పనిలో బిజీగా ఉన్నాం.. సామాన్యుల బాధలను పట్టించుకోం అన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందించి ఆపన్న హస్తం అందించడంలో ఏపీ పోలీసులు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన చేదు వాస్తవం ఇదీ. అగ్రస్థానంలో చండీగఢ్ పోలీసులు బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసు, అగ్నిమాపక, ఇతర అత్యవసర సేవలను ఏకీకృత వ్యవస్థకు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 112ను ప్రవేశపెట్టింది. ఆ నంబరుకు బాధితులు చేస్తున్న కాల్స్పై దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు ఎలా స్పందిస్తున్నారన్న అంశాన్ని కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. దేశ వ్యాప్తంగా 112కు వస్తున్న ఫిర్యాదులపై పోలీసుల సగటు స్పందన సమయం 18.28 నిమిషాలుగా ఉంది. అంటే బాధితుల నుంచి ఫోన్ కాల్ రాగానే 18.28 నిముషాల్లోనే పోలీసులు వారికి తగిన సహాయం అందించి రక్షణ కల్పిస్తున్నారు. ఒకప్పుడు ఈ దేశంలో పోలీసుల సగటు స్పందన సమయం 25 నిమిషాలుగా ఉండేది. కేంద్ర హోంశాఖ సమర్థంగా పర్యవేక్షించిన తరువాత సగటు స్పందన సమయం 18.28 నిముషాలకు తగ్గింది. ఇక బాధితులకు తక్షణం సహాయం అందించడంలో కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పోలీసులు దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. చండీగఢ్ పోలీసులు కేవలం 5.58 నిమిషాల్లోనే బాధితులకు రక్షణ కల్పిస్తుండటం విశేషం.’’ అని అమిత్షా లేఖలో పేర్కొన్నారు. మీరు వెనుకబడి ఉన్నారు.. ఇప్పటికైనా స్పందించండి పోలీసు వ్యవస్థను పటిష్ట పరచడంలో సీఎం చంద్రబాబు వైఫల్యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన లేఖలో ఏమాత్రం మొహమాటం లేకుండా ఎత్తిచూపారు. పోలీసు వ్యవస్థలోని లోపాలపై కుండబద్దలు కొట్టారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు. బాధితులకు తక్షణం సహాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్ 2.0)ను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ అత్యాధునిక విధానాన్ని తక్షణం అమలు చేయాల్సిన ఆవశ్యకత గురించి కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్వహించిన జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో పలుమార్లు దిశానిర్దేశం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా సరే ఏపీ ప్రభుత్వం తదనుగుణంగా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తద్వారా బహుళ సిగ్నల్స్, ఆర్టిఫీషియల్ / మెషిన్ లెర్నింగ్ ఎనేబుల్డ్ ఫీచర్స్, డేటా ఎనలిటిక్స్, ఇంటర్ ఆపరేటరీ, స్టేట్ డేటా ఎక్స్చేంజ్ మొదలైన ఆధునాతన సాంకేతిక మౌలిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఈఆర్ఎస్ఎస్ 2.0 ఆపరేషన్ ప్రొసీజర్ను 21 రాష్ట్రాలు మాత్రమే ప్రవేశపెట్టాయని అమిత్ షా పేర్కొన్నారు. టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏపీలో ఇప్పటివరకు ‘ఈఆర్ఎస్ఎస్ 2.ఓ’ ను ప్రవేశపెట్టనే లేదన్నది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. 2026, మార్చి 31నాటికి ‘ఈఆర్ఎస్ఎస్ 2.0’ను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి అమిత్ షా ఆ లేఖలో గుర్తు చేశారు కూడా. ఇక బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు వీలుగా చేపట్టాల్సిన చర్యలనూ అమిత్ షా తన లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. అమిత్షా చేసిన సూచనలు..» 112సేవలపై విస్తృత ప్రచారం కల్పించండి. » బాధితులకు 24/7 అత్యవసర సేవలు అందించేలా ఎమర్జెన్సీ వాహనాల సంఖ్య పెంచండి. » ఎమర్జెన్సీ వాహనాల్లో మొబైల్ డేటా టెర్మినల్స్(ఎండీటీ)లను ఏర్పాటు చేయండి. » 24 గంటలూ పనిచేసేలా తగినన్ని వర్క్ స్టేషన్లు, కాల్సెంటర్లను ఏర్పాటు చేయండి. » అత్యాధునిక సమాచార సాంకేతికత అందించే ప్రైమరీ రేట్ ఇంటర్ఫేస్(పీఆర్ఐ) లైన్లు తగినన్ని ఏర్పాటు చేయండి. » రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఆస్పత్రుల జీఐఎస్ మ్యాప్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. » డేటా ఇండికేటర్లను ఎప్పటికప్పుడు ఎన్ఎస్ఎస్ పోర్టల్ ద్వారా పర్యవేక్షించండి. » సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్కంప్యూటింగ్( సిడాక్)తో కనెక్టివిటీ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. » నేర, ఘటనాస్థలాలకు వీలైనంత త్వరగా వెళ్లే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురండి.బెడిసికొట్టిన సర్కారు కుతంత్రం.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు ఎస్పీల సమావేశంలో నానాపాట్లు పడింది. ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించడంలో సత్వరం స్పందిస్తున్నామని నమ్మించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఈ అత్యవసర సేవలు అందిస్తున్నామని ఆ నివేదికలో పేర్కొంది. కానీ, అత్యవసర సేవలు అందించడంలో రాష్ట్ర పోలీసులు దారుణంగా విఫలమవుతున్నారని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో తీవ్రంగా ఆక్షేపించారు. అత్యవసర సేవలు అందించేందుకు ఏకంగా 25.50 నిమిషాల సుదీర్ఘ సమయం తీసుకుంటున్నారని ఆ లేఖలో ఆయన కుండబద్దలు కొట్టారు. కానీ, 10 నిమిషాల్లోనే ఆ సేవలు అందిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం అవాస్తవ గణాంకాలను నివేదికలో పేర్కొని అడ్డంగా దొరికిపోయింది.వైఎస్సార్సీపీ హయాంలో భద్రతకు భరోసాతక్షణ అత్యవసర సేవలు పట్టణాల్లో 5 నిమిషాల్లోనే.. గ్రామీణ ప్రాంతాల్లో 8 నిమిషాల్లోనే.. ఆపదలో ఉన్నవారిని తక్షణం ఆదుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత సమర్థంగా వ్యవహరించింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అయితే కేవలం 3 నిముషాల నుంచి 5 నిముషాల్లోనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు రక్షణ కల్పించేవారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే గరిష్టంగా 8 నిÐషాల్లోనే పోలీసులు బాధితులకు అండగా నిలిచేవారు. హత్యలు, లైంగికదాడులు జరగకుండా నిరోధించేవారు. దాడులు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేవారు. బాధితులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేవారు. ఇక ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన దిశ యాప్ మహిళల భద్రతకు పూర్తి భరోసానిచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పెట్రోలింగ్ వాహనాలు, దిశ క్రైమ్ డిటెక్షన్ వాహనాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫోరెన్సిక్ ల్యాబ్లు.. ఇలా అధునాతన వ్యవస్థను నెలకొల్పి దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకే దిశ యాప్ జాతీయ స్థాయిలో ఏకంగా 22 అవార్డులను గెలుచుకుంది. గుజరాత్, మహారాష్ట్ర, పల్పింమ బెంగాల్ తదితర రాష్ట్రాల పోలీసు బృందాలు ఆంధ్ర ప్రదేశ్లో పర్యటించి దిశ యాప్ పనితీరును, ఇక్కడి పోలీసులు చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నాయి. ఈ తరహా యాప్లనే ఆ రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టాయి. -
కూటమి ప్రభుత్వాన్ని కూడా బాబు ప్రైవేటుకు అప్పగించాలి: సీపీఐ రామకృష్ణ
-
చేతకాకపోతే దిగిపో..నేను చూసుకుంటా..!
-
YS Jagan: మోదీ, పుతిన్ వస్తే ఎక్కడ ఉంచుతావ్ బాబు
-
AI ని అడిగినా చార్ట్ GPT ని అడిగినా చంద్రబాబు స్కామ్ ల బాగోతం చెబుతాయి
-
దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కాం: వైఎస్ జగన్
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలో అతిపెద్ద స్కాం అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల సేకరణ ప్రతులను గురువారం విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ అబ్ధుల్ నజీర్కు అందించారు. అనంతరం లోక్భవన్ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియజేశాం. ఈరోజు ఒక చారిత్రక ఘట్టం. ఏకంగా 1,04,11,136 సంతకాలు. దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి ఉండదేమో?. గత అక్టోబరు 7న ప్రజా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. ఆ తర్వాత అక్టోబరు 10 నుంచి ఈనెల 10 వరకు ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి వార్డులో రచ్చబండ కార్యక్రమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారిని ఉద్యమంలోకి తీసుకువచ్చాం. వాళ్ల సంతకాలు తీసుకున్నాం.నవంబర్ 12న ఒకసారి, మళ్లీ ఈనెల 10న మరోసారి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాం. డిసెంబరు 10న ర్యాలీల తర్వాత కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించాం. అక్కడ డిసెంబరు 15న ర్యాలీలు నిర్వహించి, వాటిని ప్రజలకు చూపాం. ఆ తర్వాత వాటన్నింటినీ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించి, ఈరోజు (గురువారం) గవర్నర్కి చూపించాం. ఆ విధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల నిరసన, వారి మనోభావాలను వివరించాం.అసంబద్ధంగా ప్రభుత్వ నిర్ణయం:ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాను. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ ఎందుకు నడుపుతుంది? దేశంలో అన్ని చోట్ల స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వమే ఎందుకు నడుపుతుందో ఆలోచించారా? రాష్ట్ర ప్రభుత్వమే వీటిని నడపకపోతే పేద, మధ్య తరగతి వారు ప్రైవేటును ఆశ్రయించలేక నష్టపోతారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఒక బాధ్యతగా భావించి నిర్వహిస్తాయి.ఇలా అన్నీ ప్రైవేటీకరిస్తూ పోతే, దోపిడికి చెక్ పడదు. ప్రజా సేవలు పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇన్పేషెంట్గా చేరాలంటే కనీసం రూ.5 వేలు ఛార్జ్ చేస్తారు. కనీస వసతుల రూమ్ కావాలంటే రోజుకు రూ.10 వేలు, ఐసీయూలో రోజుకు కనీసం రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయం.మెడికల్ కాలేజీతో ఫ్రీగా అత్యుత్తమ వైద్య సేవలు: మా ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టాం. ఎక్కడైనా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, అక్కడ టీచింగ్ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆ ఆస్పత్రిలో, మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు అందరూ అందుబాటులో ఉంటారు. దీంతో పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టం వచ్చినట్లు ఛార్జ్ చేయలేవు. మేము నాడు తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే, మన పిల్లలకు మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దాని వల్ల వైద్య విద్య కోరుకునే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్ల మయం:కానీ, ఇప్పుడు చంద్రబాబు ఆ పని చేయకపోగా, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిçస్తూ, స్కామ్లు చేస్తున్నారు. స్కామ్ల విషయంలో చంద్రబాబు నాలుగు అడుగులు ఎక్కువ వేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్ అయితే, ఆ తర్వాత రెండేళ్ల పాటు, ఆ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం మరో స్కామ్. అంటే అక్కడున్న భూమి, భవనాలు, పని చేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, నిర్వహణ మాత్రం ప్రైవేటువారిది. అంటే ఖర్చు ప్రభుత్వానిది. సంపద ప్రైవేటువారికి. ఒక మెడికల్ కాలేజీలో జీతాలు ఏడాదికి కనీసం రూ.60 కోట్లు. రెండేళ్లకు రూ.120 కోట్లు. అంటే ఆ లెక్కన 10 మెడికల్ కాలేజీల సిబ్బందికి రెండేళ్లపాటు జీతంగా కనీసం రూ.1200 కోట్లు అవుతుంది. ఇలాంటి స్కామ్లు దేశంలో ఎక్కడా ఉండవు.నిధుల కొరత అనేది అబద్ధం:మా హయంలో ప్రతి చోట 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేశాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి చేశాం. అవి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. వాటి ద్వారా 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అవసరం. రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా?.పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి. మేం వచ్చాక వాటిని పూర్తి చేస్తాం. చంద్రబాబుకు గట్టిగా తగిలేట్టుగా గవర్నర్ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లాం. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే, మాకు క్రెడిట్ దక్కుతుందన్న అక్కసుతో చంద్రబాబు పేదలకు నష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణతో స్కామ్లు చేస్తున్నారు. నిజానికి ఆ మెడికల్ కాలేజీలన్నీ భవిష్యత్లో లక్ష కోట్ల ఆస్తి అవుతాయి. ఇంకా కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తూ, వెల కట్టలేని సేవలందిస్తూ కోట్లాది మందికి వెలుగులు నింపుతాయి.అందుకే మా పోరాటం ఆపబోము:మా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్కి కోటి సంతకాలు చూపించాం. ఇక్కడి నుంచి రేపు కోర్టులో పిటిషన్ వేస్తాం. అక్కడ కూడా ఈ కోటి సంతకాలు చూపిస్తాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. చంద్రబాబు తోలు మందం కాబట్టి ఆయన మారకపోవచ్చు. కాబట్టి అందరూ కలిసి రావాలి. అందరం కలిసికట్టుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, రేపొద్దున వైద్యం కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. గవర్నర్ కానీ, మనసున్న ఏ వ్యక్తికి కానీ చంద్రబాబు చేసేది తప్పు అని అర్థమవుతుంది. ఇదే గవర్నర్ ఇంట్లో పని చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీకి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుంది. గవర్నర్ది మంచి మనసు. ఆయన అన్నీ అర్థం చేసుకున్నారు.ఈ ప్రభుత్వంలో అన్నీ సున్నా:మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు ప్రతి ద్వారం తొక్కుతాం. కోర్టుల ద్వారా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఉద్యమమూ కొనసాగుతుంది. ఎందుకంటే ఇది కచితంగా స్కామ్. అన్నీ ప్రభుత్వానివే. అప్పగించేది మాత్రం ప్రైవేటు వ్యక్తులకా?. ఎన్నికల ముందు ఏం చెప్పారు? బిర్యానీ పెడతామని నమ్మించారు. కానీ, ఈరోజు అవేవీ లేవు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్ లేదు. దాంతో వారు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేదు. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు ఇవ్వడం లేదు. విశాఖలో మా హయాంలో రిషికొండపై రూ.230 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికంగా ఉంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు నిర్వహించిన యోగా డే కోసం అంత కంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామాగ్రి కొనుగోలులోనూ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. -
2 నెలలు తిరగకుండానే అందరూ జైళ్లలో ఉంటారు జగన్ మాస్ వార్నింగ్
-
YS Jagan : విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు
-
చంద్రబాబు సర్కార్కు వైఎస్ జగన్ అల్టిమేటం
ప్రైవేటీకరణ అనేదే పెద్ద స్కామ్ అని.. అలాంటి స్కామ్ల ఎన్నైనా చేయడానికి చంద్రబాబు నాయుడు ఏనాడూ వెనకడుగు వేయబోరని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల సేకరణ ఒక చరిత్ర. ఈ సంతకాలను గవర్నర్కు సమర్పించి.. చంద్రబాబు నిర్ణయం పట్ల వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను తెలియజేస్తామని వైఎస్ జగన్ అన్నారు. ‘‘కోటి సంతకాలతో గవర్నర్ను కలుస్తాం. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తాం. అవసరమైతే ఈ పత్రాలతో కోర్టు తలుపులు తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. న్యాయస్థానం ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్రెడ్డి సీఎంగా ఉండి.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ అయితే.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇవ్వడం మరో పెద్ద స్కామ్. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాక ఇక ప్రభుత్వం జీతాలు చెల్లించడం ఏంటి?. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది కదా పెద్ద స్కామ్ అంటే!.కోటి సంతకాల మహోద్యమం చూసైనా చంద్రబాబు సర్కార్ నిర్ణయం మార్చుకోవాలి. లేకుంటే ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం. రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతాం’’ అని జగన్ అల్టమేటం జారీ చేశారు. -
జగన్ పంచ్.. నీ పనైపోయింది.. ఆశలు పెట్టుకోకు
-
జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ కీలక సమావేశం (ఫొటోలు)
-
‘చంద్రబాబు మాటలు వింటే ఏం అనాలో అర్థం కావడం లేదు’
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు కట్టబెట్టడమే పెద్ద స్కాం.. అంటూ చంద్రబాబు సర్కార్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు నిర్ణయాన్ని కోటి 4 లక్షల మంది వ్యతిరేకించారని.. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారన్నారు.ఈ సంతకాలు గవర్నర్ను సమర్పిస్తాం.. కోర్టుకు కూడా పంపుతాం. గవర్నర్ దగ్గరకు వెళ్లే ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద కోటి సంతకాల ప్రతులను ఉంచుతాం. కోటి సంతకాలు చూడాలంటూ కోర్టులో అఫిడవిట్ వేస్తాం. స్కామ్లు చేయడానికి చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్. ప్రైవేట్ వాళ్లకు మెడికల్ కాలేజీలు అప్పజెప్పడమే కాదు.. వాళ్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట!. ఒక్కో కాలేజీకి రూ.120 కోట్లు ఎదురు ఇస్తున్నారు(జీతాల కింద).. ఇంత కంటే పెద్ద స్కామ్ ఉంటుందా?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.నింద కలెక్టర్లపై మోపుతున్న చంద్రబాబు:కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాటలు వింటుంటే.. ఆశ్చర్యం కలుగుతోంది. తన గ్రాఫ్ పడిపోవడానికి కలెక్లర్లు కారణం అంటున్నారు. కలెక్టర్ల గ్రాఫ్ కాదు పడిపోతోంది. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. మార్చి వస్తే, మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాడు. ఇప్పటికే రెండు బడ్జెట్లు పెట్టాడు. కానీ, ప్రజలకు ఒక్కటంటే ఒక్క మేలు లేదు. గత పథకాలన్నీ సున్నా. కొత్తగా ఏదీ లేదు. మన ప్రభుత్వ హయాంలో క్యాలెండర్ ప్రకటించి, అన్ని పథకాలు పక్కాగా అమలు చేశాం. వాటితో పాటు, అంత కంటే ఎక్కువగా అమలు చేస్తానన్న చంద్రబాబు, ఏదీ చేయలేదు. గతంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేశారు. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ లేవు. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆరోగ్యశ్రీ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ఇంకా సూపర్సిక్స్, సూపర్సెవెన్ మోసాలు.విద్య, వైద్యం, రవాణా. ప్రభుత్వ వ్యవస్థలు:అసలు ఎక్కడైనా ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు నడుపుతుంది? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అది ఎందుకు జరుగుతోంది?. ఎందుకంటే, ఒకవేళ ప్రభుత్వమే కనుక.. స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు (ప్రజా రవాణా వ్యవస్థ) నడపకపోతే.. విద్య, వైద్యం, రవాణా ఎవరికీ అందుబాటులో ఉండవు. ఆయా రంగాల్లో మొత్తం ప్రైవేటు రంగం పెత్తనమే ఉంటుంది.వ్యవస్థలన్నీ తిరోగమనం:కానీ, ఈరోజు అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అసలు ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు అంటున్నాడు చంద్రబాబు. మనం గత ఎన్నికల్లో గెల్చిపోయి ఉండకపోతే, ఆర్టీసీ కూడా ఉండేది కాదు. అదే చంద్రబాబు వచ్చి ఉంటే, దాన్ని కచ్చితంగా అమ్మేసేవాడు. ఈరోజు అన్ని వ్యవస్థలు తిరోగమనం. గతంలో అమలైన పథకాలన్నీ రద్దు. అన్ని ఘనకార్యాలు చేసిన నీవు (చంద్రబాబు), కలెక్టర్ల సదస్సులో వారి (కలెక్టర్లు) పనితీరు బాగా లేదనడం దారుణం. చంద్రబాబు బుర్ర పని చేయడం లేదు.న్యాయపోరాటం కూడా చేస్తాం:ఆ తర్వాత ఆ పత్రాలు.. కోర్టు ద్వారాలు తడుతాయి. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. వారు ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్రెడ్డి సీఎంగా ఉండి, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తే, ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.2 ఏళ్లు జీతాలు మరో పెద్ద స్కామ్:ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ కాగా.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇస్తుందట!. ఇది మరో పెద్ద స్కామ్. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది ఒక పెద్ద స్కామ్అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం:రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. అందుకే చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నాం. గవర్నర్ 40 మందికి అనుమతి ఇచ్చారు. లోక్భవన్కు వెళ్లే ముందు అంబేడ్కర్ విగ్రహం వరకు అందరం వెళ్దాం. అక్కణ్నుంచి 40 మందితో కలిసి గవర్నర్ను కలుస్తాం. ఆ తర్వాత కోర్టు తలుపు తడతాం. అయినా చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే.. ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
YS Jagan: గ్రాఫ్ పడిపోతుందా..? బాబుపై నాన్ స్టాప్ పంచులు
-
Monditoka Arun: నీ సొంత ఊరిలోనే జగన్కు మద్దతిచ్చారు..
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపుతాం
-
కోటి సంతకాల ఉద్యమం.. ఒక చరిత్ర: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఒక గొప్ప ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని.. చర్రితలో ఇంత పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం జరగలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరికీ వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.‘‘మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు కట్టబెట్టడమే పెద్ద స్కాం. మళ్లీ రూ. 120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు?. కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చి జీతాలు మీరు ఎలా ఇస్తారు?. ఇంతకంటే పెద్ద స్కాం ఉంటుందా?’’ అంటూ వైఎస్ జగన్.. చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘కోటి సంతకాలు లోక్భవన్కు చేరుకున్నాయి. కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు ఒక చరిత్ర. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఈ మాట చంద్రబాబే చెప్పుకున్నారు. కూటమి పాలనలో ప్రజలకు మంచి జరగలేదు. 2 బడ్జెట్లు పెట్టినా ప్రజలను జరిగిన మంచి గుండుసున్నా. మన హయాంలో పథకాల అమలుకు క్యాలెండర్ ఇచ్చాం. బాబు సూపర్సిక్స్, సూపర్ సెవెన్ అంటూ మోసం చేశారు. మన హయాంలో పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశాడు’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘కూటమి పాలనలో వ్యవస్థలు కుప్పకూలాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. అన్నదాతలకు రైతు భరోసా అందడం లేదు. ప్రైవేటీకరణ అంటేనే దోపీడీ. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. మన హయాంలో ఆర్టీసీని బతికించాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం. చంద్రబాబు తప్పులు చేసి కలెక్టర్లపైకి నెట్టేస్తున్నారు. అక్టోబర్ 7న సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించా. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు సంతకాల ఉద్యమం సాగింది’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
సొంతూరిలో చంద్రబాబుకి షాక్!
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతూరిలోనే ఆయనకు షాక్ తగిలింది. ఆయన తీసుకున్న పీపీపీ విధానాన్ని ఆ ఊరి ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఈ ఊరి ప్రజలూ భాగం కావడం గమనార్హం.వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పించారు. అందులో ఏడు పూర్తి చేయగా.. మరో 10 నిర్మాణ దశలో ఉన్నాయి. ఈలోపు కూటమి ప్రభుత్వం జగన్కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో వాటిని అలాగే వదిలేసింది. అటుపై.. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తూ చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంలో వాటి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది.చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ చేపట్టింది వైఎస్సార్సీపీ. తుపాను, వర్షాల్లోనూ రెండు నెలలపాటు రాష్ట్రమంతటా ఉవ్వెత్తున సాగింది ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా.. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనూ ప్రజలు సంతకాలు చేశారు. అయితే.. తమ ఊరి నుంచి ఎలాంటి సంతకాలు చేయలేదని నారావారిపల్లె టీడీపీ నేతలు ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటనలు చేశారు. కానీ, వైఎస్సార్సీపీ రచ్చబండలో భాగంగా అక్కడా సంతకాల సేకరణ జరిగింది. ఆ పత్రాలు అక్కడి నుంచి చంద్రగిరి నియోజకవర్గానికి.. అక్కడి నుంచి తిరుపతికి.. అక్కడి నుంచి ఇవాళ తాడేపల్లికి చేరుకున్నాయి. ఈ లెక్కన.. సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు వైఎస్ జగన్ సమర్పించబోయే చంద్రబాబు వ్యతిరేక ప్రజా గళాల్లో ఆయన సొంతూరి ప్రజలది కూడా ఉండబోతుందన్నమాట. -
జగన్ హయాంలోనే సంపద సృష్టి.. నిజం ఒప్పుకున్న బాబు
-
కోటి గళాలను పక్కదోవ పట్టిస్తారా?
ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల ప్రైవెటీకరణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి కోటి గొంతుకలు మద్దతిస్తూంటే.. ప్రజల్లో ఏర్పడ్డ ఈ అసంతృప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం నానా తంటాలూ పడుతోంది. ఇదే అదనుగా ఎల్లోమీడియా కూడా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు పడుతున్న పాట్లు ప్రజల్లో ఏహ్యభావాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఎల్లోమీడియా కొన్ని వాస్తవాలను తమకు తెలియకుండానే ఒప్పుకుంటూండటం గమనార్హం. ఎల్లోమీడియా ప్రతినిధి ఈనాడు అకస్మాత్తుగా వైద్యకళాశాలల నిర్వహణపై పీపీపీ విధానమే మేలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసిందంటూ ఒక భారీ కథనాన్ని ప్రచురించింది. సహజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పాట అందుకున్నారు. కమిటీ సిఫారసులేమిటన్నది కాసేపు పక్కనబెడదాం. అసలు చంద్రబాబుకు ఇలాంటి కమిటీలపై నమ్మకం ఉందా? మూడు పంటలు పండే అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దు అని కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని బేఖాతరు చేసింది ఈ చంద్రబాబే కదా? ఈనాడు ఈ రకంగా విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే... ఆంధ్రజ్యోతి వైఎస్సార్ సీపీ కోటి సంతకాల ఉద్యమానికి ప్రజా మద్దతు పెద్దగా లేదని సన్నాయి నొక్కులు నొక్కింది. దీన్ని బట్టి మరోసారి స్పష్టమైన విషయం ఏమిటంటే... చంద్రబాబుకు కష్టం కలిగిన ప్రతి సందర్భంలోనూ కాపు కాసేందుకు ఈ ఎల్లో పత్రికలు రెండూ తమదైన డ్రామాను తెరమీదకు తెస్తాయి అని!వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే 17 వైద్య కళాశాలలకు అనుమతులు సాధించారన్న విషయం అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా సాధించిన కళాశాలలు కేవలం 12 మాత్రమే. కానీ ఎకాఎకిన 17 కాలేజీలకు అనుమతి సాధించిన జగన్ను పచ్చ మీడియా, తెలుగుదేశం నేతలు ఎన్నడూ అభినందించిన పాపాన పోలేదు. పైపెచ్చు తప్పుడు ప్రచారాలు ఆరంభించారు. జగన్ ఈ కాలేజీల సమర్థ నిర్వహణ కోసం ఎన్నారై కోటా కింద నిర్దిష్ట ఫీజులు నిర్ణయిస్తే ఇదే టీడీపీ, జనసేనలు తీవ్ర విమర్శలకు దిగాయి. సీట్లు అమ్ముకుంటారా తెగ బాధపడిపోయాయి. బాబు గారి తనయుడు లోకేశ్ యువగళం కార్యక్రమాల్లో మాట్లాడుతూ సీట్లు అన్నింటిని ప్రభుత్వమే కేటాయిస్తుందని, బి కేటగిరి కింద సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉండబోవని హమీ ఇచ్చారు. చంద్రబాబు సైతం అదే చెప్పారు కానీ అధికారం రాగానే మాట మార్చేశారు. ప్రభుత్వ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేయడానికి రెడీ అయ్యారు. అదేమని అడిగితే ఇవి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి కానీ ప్రైవేటు వారు నడుపుతారంటూ బుకాయించడం ఆరంభించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అదే టైమ్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదును భారీగా పెంచేశారు. ప్రభుత్వం ప్రతి కాలేజీకి కేటాయించిన ఏభై నుంచి వంద ఎకరాల భూమిని, ఇప్పటికే సాగిన నిర్మాణాలను ప్రైవేటు సంస్థలకు, అవి కూడా వారి తైనాతీలకు కట్టబెట్టడానికి రంగం సిద్దం చేశారు. పైగా జగన్ టైమ్లో అసలు కాలేజీలు రానట్లు తప్పుడు ప్రచారం చేయాలని కూడా ఆలోచించి చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు వంటివారు కాలేజీలు ఎక్కడ అంటూ ప్రశ్నించి ఆశ్చర్యం కలిగించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనంలోకి వెళ్లారు. ఆయా చోట్ల జగన్ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలు, అలాగే వైసీపీ బృందాలు నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లేలా ప్లాన్ చేశారు. తాను స్వయంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లినప్పుడు వచ్చిన అనూహ్య స్పందన రాష్ట్ర ప్రజలందరిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి రకరకాల దశలలో ఈ ఉద్యమాన్ని ఒక క్రమబద్దంగా సాగించారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకతను రాష్ట్రం, దేశం దృష్టికి తీసుకురావడానికి ఆయన కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. దీంతో వైసీపీ క్యాడర్కు కూడా ఒక ఊపు, ఉత్తేజాన్ని ఇచ్చింది. ప్రతిపక్షంగా ప్రజలలో గట్టిగా పనిచేయడానికి ఇది ఒక అవకాశం కల్పించింది. ప్రభుత్వ పెద్దలకు కంగారు ఏర్పడింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని రక్షించేందుకు, ప్రజలలో ప్రభుత్వ కాలేజీలపై వ్యతిరేకత తీసుకురావడానికి ఎల్లో మీడియా ప్రయత్నాలు ఆరంభించింది.అయినా ప్రజలలో ఈ అంశంపై ఆగ్రహం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈనాడు మీడియా కొద్దిరోజుల క్రితం ‘పీపీపీ విధానమే మేలు’ అన్న శీర్షికతో ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసింది. వివిధ శాఖలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. అవి ఆయా అంశాలపై చర్చలు జరిపి కొన్ని సిఫారసులు చేస్తుంటాయి. అవేవి కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ అభిప్రాయాలుగా చూడరు. ఈ స్టాండింగ్ కమిటీ సిఫారసులను కేంద్రం పట్టించుకున్న సందర్భాలు అరుదు. రాష్ట్రాలలో కూడా శాసనసభ కమిటీల సిఫారసుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. అది ఒక కోణం అయితే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏమైనా ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని సూచించిందా? అంటే లేదు. భవిష్యత్తులో మరిన్ని కాలేజీల అవసరం ఉంటే ప్రైవేటు వారిని కూడా భాగస్వాములు చేయవచ్చని అభిప్రాయపడింది. ప్రత్యేకించి ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకోవచ్చని తెలిపింది. అంతే తప్ప ప్రభుత్వ కాలేజీలు వద్దని కాని, ప్రభుత్వ కాలేజీల కోసం కేటాయించిన భూములు, నిర్మించిన భవనాలను ప్రైవేటు వారికి దోచిపెట్టవచ్చని కాని ఎక్కడా సిఫారసు చేయలేదు. ఒక్కో కాలేజీకి కేటాయించిన ఏభై నుంచి వంద ఎకరాల భూములను ఎకరా రూ.వందకు లీజుకు ఇవ్వాలని, అది కూడా 66 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని ఎక్కడా పేర్కొనలేదు. ఈనాడు మీడియా ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అమలు చేస్తున్న విధానానికి స్టాండింగ్ కమిటీ మద్దతు ఇచ్చిందేమో అన్న అభిప్రాయం కలిగించాలని కుట్రపూరితంగా ఈ కథనం ఇచ్చింది. అందుకే వైసీపీ నేతలు టీజేఆర్ సుధాకర్ బాబు, సిదిరి అప్పలరాజు తదితరులు చంద్రబాబు జేబు సంస్థ మాదిరి ఈనాడు మీడియా తప్పుడు కథనాలు ఇస్తోందని మండిపడ్డారు. చిత్తశుద్ది ఉంటే ఈనాడు ఇప్పటికే మంజూరైన ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి ఈ సిఫారసులు చేయలేదని, భవిష్యత్తులో వచ్చేవాటికి అని రాసి ఉండేది. ఆ పని చేయలేదు. ప్రతి దానికి సొంత భాష్యం ఇచ్చి వైసీపీపై విషం కక్కే ఎల్లో మీడియా ఈ కమిటీ సిఫారసులకు ఉన్న విలువ ఏమిటి? కేంద్రం వీటిలో ఎన్నిటిని పట్టించుకుంటుంది? ఇప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్న వైద్యకాలేజీలు ఎలా నడుస్తున్నాయి. పేదలకు ఏ మేరకు ఉచిత వైద్యం అందుతున్నది? ప్రభుత్వ కాలేజీలలో ఉండే లాభనష్టాలు మొదలైన వాటిని విశ్లేషించి ఉంటే ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పినట్లయ్యేది. అవేవి చేయకుండా ప్రజలను మభ్య పెట్టి, కోటి సంతకాల ఉద్యమంపై నీళ్లు చల్లే ఉద్దేశంతో కథనం రాయడంపై వైసీపీ మండిపడింది. దేశంలో కొత్తగా 75 వేల వైద్య విద్య సీట్లు పెంచడం కోసం స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది తప్ప, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఎక్కడా వ్యాఖ్యానించలేదన్నది వాస్తవం. వైద్య కళాశాలలు లేని జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాలలో కొత్త కాలేజీలు ఏర్పాటు కావాలని కమిటీ అభిప్రాయపడింది. జగన్ తన హయాంలో చేసింది కూడా అదే కదా! కేంద్రం కూడా ప్రభుత్వరంగంలోనే వైద్యకాలేజీలు మంజూరు చేసింది తప్ప పీపీపీ విధానంలో కాదు. బహుళజాతి సంస్థలకు, వేల కోట్ల రూపాయల లాభార్జన చేస్తున్న సంస్థలకు ఎకరా 99 పైసలకే భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం, పేదలకు ప్రయోజనం కలిగించే వైద్య కాలేజీలకు ఐదువేల కోట్లు ఖర్చు చేయడానికి ఇష్టపడడం లేదు. ప్రైవేటువారికే సంపదగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా ఏపీలో ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి మందికి పైగా గళం విప్పడం అభినందనీయం అని చెప్పాలి. ఎల్లో మీడియా ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నట్లు కాకుండా ప్రజల కోసం పనిచేస్తే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రజా ఉద్యమంతో తగ్గిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సంచలన నిర్ణయం..
-
వైఎస్సార్సీపీ కీలక భేటీ.. సాయంత్రం లోక్ భవన్కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్సీపీ కీలక భేటీ జరగనుంది. కోటి సంతకాల ప్రతులను రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్న నేపథ్యంలో ఆయన ముందుగా పార్టీ నేతలతో భేటీ నిర్వహించనున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున.. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రయత్నించారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు రాష్ట్రంలో వైద్య విద్యా అవకాశాలను విస్తరించడం ఉద్దేశంతో ఆయన ఈ అడుగు వేశారు.ఇందులో ఏడు పూర్తి కాగా.. వైఎస్సార్సీపీ దిగిపోయేనాటికి మరో పది నిర్మాణంలో ఉన్నాయి. అయితే.. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. చివరకు పీపీవీ విధానం పేరిట కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పేరిట ప్రజా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు వైఎస్ జగన్.అక్టోబర్ నెలలో గ్రామాల స్థాయిలో ‘రచ్చబండ’ పేరిట మొదలైన సంతకాల సేకరణ.. ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల్లో చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు చేశారు. విద్యార్థులు, మేధావులు.. అన్ని వర్గాల ప్రజలూ వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణలో పాల్గొనడంతో.. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కొసమెరుపు ఏంటంటే.. అలాగే చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలోనూ ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ అక్కడి ప్రజలు సంతకాలు చేయడం..ఇప్పటికే అన్ని జిల్లాల నుండి సంతకాల ప్రతుల బాక్స్లు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం పత్రాలతో వచ్చిన వాహనాలకు వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అవి అక్కడి నుంచి నేరుగా లోక్భవన్(పూర్వ రాజ్భవన్)కు చేరుకుంటాయి.అనంతరం పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమై.. ఇప్పటిదాకా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం గురించి చర్చిస్తారు. సాయంత్రం పార్టీ కీలక నేతలతో కలిసి లోక్ భవన్కు వైఎస్ జగన్కు వెళ్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యి.. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు. -
హైకోర్టు షాక్.. చంద్రబాబు చేసిన పనికి నోరెళ్లబెట్టింది
-
కేంద్రానికి దొరక్కుండా.. బయటపడ్డ అతిపెద్ద స్కామ్
-
పొలంలో ప్రైవేట్ ‘పవర్’!
సాక్షి, అమరావతి: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి అతి తక్కువ ధరకే యూనిట్ కేవలం రూ.2.49కే కొనుగోలుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంటే అదేదో నేరం, ఘోరం అన్నట్లు చిత్రీకరించిన చంద్రబాబు ఇప్పుడు అదే సౌర విద్యుత్ కోసం యూనిట్కు ఏకంగా రూ.3.09 ప్రైవేట్ సంస్థలకు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. తాను అధికారంలోకి వస్తే విద్యుత్తు చార్జీలను ఇంకా తగ్గిస్తానని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు ఇప్పటికే కరెంట్ చార్జీల బాదుడుతో షాకులిస్తుండగా తాజాగా వ్యవసాయానికి సౌర విద్యుత్ పేరుతో ప్రైవేటు సంస్థలకు ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకు ఉపక్రమించారు. రైతులకు మేలు చేస్తున్నామనే ముసుగు వేసి, కమీషన్ల కోసం అడ్డగోలుగా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒకవైపు కేంద్ర పథకాల ద్వారా రాయితీలు పొంది మరోవైపు అన్నదాతలకు ఇవ్వాల్సిన రాయితీని దారి మళ్లించేందుకు ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) నుంచి ఆమోదాన్ని సాధించారు. ప్రైవేటు సౌర విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కమ్లు చెల్లించాల్సిన ధరలను నిర్ణయిస్తూ ఏపీఈఆర్సీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఫీడర్లు దగ్గరే ఉన్నా... గ్రిడ్ నుంచే విద్యుత్రాష్ట్రంలో దాదాపు 19 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏటా డిస్కమ్లకు సుమారు రూ.12,500 కోట్లు రాయితీగా అందించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ఉచిత విద్యుత్తు పథకం ఆటంకం లేకుండా ముందుకు సాగింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుల ఉచిత విద్యుత్ను ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందుకు ‘పీఎం కుసుమ్’ పథకాన్ని అడ్డుపెట్టుకుంది. రాయితీలు వస్తాయని, సరఫరా నష్టాలు తగ్గుతాయంటూ ‘అగ్రికల్చర్ ఫీడర్స్ సోలరైజేషన్’ విధానాన్ని తెరపైకి తెచి్చంది. తద్వారా వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఫీడర్లకు అవసరమైన కరెంట్ను సమీపంలో నెలకొల్పే సోలార్ ప్యానళ్ల ప్రాజెక్టు ద్వారా అందిస్తామని చెబుతోంది. దీనికోసం మూడు డిస్కమ్ల పరిధిలో తొలుత కొన్ని పంపుసెట్లను ఎంపిక చేశారు. కుప్పం రెస్కోతో కలిపి మూడు డిస్కంల పరిధిలో మొత్తం 1,162.8 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యంతో 2,93,587 పంపుసెట్ల సోలరైజేషన్కు ప్రణాళిక సిద్ధమైంది. దీని ప్రకారం 1162.8 మెగావాట్లకు యూనిట్ రూ.3.09 చొప్పున ఏడాదికి రూ.600 కోట్లు ప్రైవేటు సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. అదే సెకీ నుంచి అయితే యూనిట్ రూ.2.49కే వస్తున్నందున ఆ వ్యయం రూ.482 కోట్లు మాత్రమే అవుతుంది. అంటే ఏటా అదనంగా దాదాపు రూ.116 కోట్లను ప్రైవేటు సంస్థలకు పాతికేళ్ల పాటు దోచిపెట్టనున్నట్లు స్పష్టమవుతోంది.ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు..ప్రైవేటు సంస్థలు సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయని, ఆ విద్యుత్ను డిస్కంలు కొనుగోలు చేస్తాయని, దానికి చెల్లించాల్సిన యూనిట్ ధరలను నిర్ణయించాలంటూ ఏపీఈఆర్సీని డిస్కంలు కోరాయి. ఏపీఈపీడీసీఎల్లో యూనిట్కు రూ.3.18, ఏపీఎస్పీడీసీఎల్లో యూనిట్కు రూ.3.16, ఏపీసీపీడీసీఎల్లో యూనిట్కు రూ.3.19 చొప్పున చెల్లిస్తామని తెలిపాయి. అయితే జీఎస్టీ భారం తగ్గుతున్నందున సోలార్ ప్యానెళ్ల ధరలు కూడా తగ్గాయి. దీంతో ప్రైవేటు సంస్థలకు చెల్లించాల్సిన ధరను కూడా తగ్గించాలని కమిషన్ సూచించింది. ఈ క్రమంలో డిస్కంలు మళ్లీ ప్రతిపాదనలు తయారు చేసి పంపించాయి. వాటి ప్రకారం యూనిట్కు రూ.3.09 చొప్పున ప్రైవేటు సంస్థలకు చెల్లించి సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. మరోవైపు ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. అయితే టెండర్ దక్కించుకున్న సంస్థలతో ఈ నెలాఖరులోగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకానికి అర్హత పొందినట్లుగా పరిగణిస్తుంది. అప్పుడే రాయితీ వర్తిస్తుంది.యాక్సిస్ నుంచి యూనిట్ రూ.4.60 కి కొనుగోలువ్యవసాయానికి 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలనే సంకల్పంతో పాటు భవిష్యత్తులో రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా, పవర్ గ్రిడ్ను సమతూకం చేయాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని అతి తక్కువ ధర యూనిట్ రూ.2.49కే కొనేందుకు పీపీఏ చేసుకుంది. ఇలా తీసుకునే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్కు పాతికేళ్ల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తామంటూ సెకీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సెకీ ఒప్పందం వల్ల రాష్ట్రానికి దాదాపు రూ.లక్ష కోట్ల ప్రయోజనం సమకూరుతుంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందించాల్సింది పోయి కూటమి నేతలు, ఎల్లో మీడియా, టీడీపీ కరపత్రికలు విషం గగ్గాయి.సెకీ విద్యుత్ లాభం కాదంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేశాయి. కానీ తర్వాత యాక్సిస్ ఎనర్జీతో యూనిట్ రూ.4.60 చొప్పున 400 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీఏ చేసుకుంది. సెకీ ధరతో పోల్చితే యూనిట్కు రూ.2.11 అదనంగా చెల్లిస్తోంది. తద్వారా దాదాపు రూ.11 వేల కోట్ల భారీ కుంభకోణానికి నిస్సిగ్గుగా తెరదీశారు. అది చాదన్నట్టు ఇప్పుడు సౌర విద్యుత్ను యూనిట్కు రూ.3.09 కొంటామంటోంది.‘సెకీ’ విద్యుత్ చౌకగా తీసుకుంటే తప్పన్నారు..గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే ఇదే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. రూ.లక్ష కోట్ల భారం పడుతుందంటూ పచ్చ పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా తప్పుడు వార్తలు రాయించారు. మరి ఇప్పుడు అంతకు మించి అధిక ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసేందుకు సిద్ధం కావడం గమనార్హం. నాడు సెకీతో ఒప్పందం పాతికేళ్లుకాగా, ఇప్పుడు ప్రైవేటు సంస్థలతో చేసుకునే ఒప్పందం కూడా అన్నే ఏళ్లు కావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల నేరుగా డిస్కంలపైనా, పరోక్షంగా ప్రజలపైనా ఆరి్థక భారం పడుతుందని వాదించిన చంద్రబాబు ఇప్పుడెందుకు అదే మార్గంలో నడుస్తున్నారనేదానికి ఆయనే సమాధానం చెప్పాలి. -
జగన్ విజన్కే బాబు సర్కార్ జై..!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్తను కర్నూలులో ఏర్పాటు చేయడంపై నానా యాగీ చేసి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించిన టీడీపీ.. ఇప్పుడు జగన్ విజన్కే జై కొట్టింది. హెచ్ఆర్సీ, లోకాయుక్తలను విజయవాడకు తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని గతంలో హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని కర్నూలులోనే కొనసాగిస్తామని తాజాగా హైకోర్టుకు వివరించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రభుత్వ విధాన నిర్ణయంలో తామెలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో 2021లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ రికార్డుల్లో లేకపోవడంతో హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గతంలో విచారణకు వచ్చిన సందర్భంలో లోకాయుక్త, హెచ్ఆర్సీలను కర్నూలు నుంచి విజయవాడకు తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. తాజాగా ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాలను కర్నూలులోనే కొనసాగిస్తామని చెప్పారు. -
సచివాలయాలు ఇక ‘స్వర్ణ గ్రామం’
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలను విజన్ యూనిట్లుగా తీర్చిదిద్దుతూ మరింత సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు వాటి పేరును ‘స్వర్ణ గ్రామం’గా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరు బాగుండటం లేదని, హాజరు 74 శాతం దాటడం లేదని, పనితీరు మార్చుకోకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమంటూ హెచ్చరించారు. వాట్సాప్ సేవల్లో సెక్యూరిటీ ఉండదని వినియోగించుకోవడానికి వెనుకాడుతున్నారని, మరికొంతమంది స్మార్ట్ ఫోన్ లేదని, ఎలా వినియోగించుకోవాలో అర్థం కావడం లేదంటున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించడం ద్వారా వాట్సాప్ సేవలను విరివిగా వాడుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. » మారుమూల ప్రాంతాల్లో బ్యాండ్విడ్త్ కనెక్టివిటీ త్వరితగతిన పూర్తి చేసి 4 జీ టవర్ల ఏర్పాటుకు కలెక్టర్లు సహకరించాల్సిందిగా సీఎం సూచించారు. జిల్లాల్లో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ఫైలు ఇకపై ఈ–ఫైల్గానే నిర్వహించాలని, జనవరి 15వతేదీ తర్వాత ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించే విధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిసారి సర్టిఫికెట్ల కోసం ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించి ఇప్పటికే రూ.2,847 కోట్ల పెట్టుబడులకు 29 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. రాష్ట్రంలో ఏటా 5 వేల మందికి క్వాంటం టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 538కిపైగా ఎంవోయూలు గ్రౌండ్ అయ్యే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, లాజిస్టిక్స్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులకు నెల రోజుల్లోగా శంకుస్థాపనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
అన్నీ చేసి అధికారులపై నిందలా?
సాక్షి, అమరావతి: గద్దెనెక్కిన పద్దెనిమిది నెలల కాలంలో మూటగట్టుకున్న వైఫల్యాలన్నిటినీ అధికారులపైకి నెట్టేసి చేతులు దులుపుకుందామనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుని చూసి కలెక్టర్లంతా అవాక్కయ్యారు. తప్పులన్నిటినీ అధికారులపై పడేసి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం ఆయనకు పరిపాటే. బుధవారం సచివాలయంలో ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సునుద్దేశించి ముఖ్యమంత్రి చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఇది మరింత ప్రస్ఫుటమయ్యింది. మేనిఫెస్టోకు అసలు విలువే ఇవ్వకుండా.. సూపర్ సిక్స్ సూపర్ సెవన్ హామీలను అటకెక్కించేసిన చంద్రబాబు ‘మన పనితీరును జనం మెచ్చడంలేదు’ అంటూ ఇప్పుడు తన వైఫల్యాలన్నీ అధికారులపైకి నెట్టేసేందుకు ఆపసోపాలు పడ్డారు. పొలిటికల్ గవర్నెన్స్ కీలకమని చంద్రబాబు ఈ సమావేశంలో పునరుద్ఘాటించారు. నిజానికి ఆయన ‘రాజకీయ పాలన’ 18నెలలుగా సాగుతూనే ఉంది.. సోషల్ మీడియాపై దాడులు చేస్తూ, ప్రతిపక్షంపై దాడులు చేస్తూ, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఆయన పాలన సాగుతోంది. సంపద పెంచకపోగా అడుగడుగునా అవినీతి, కనీవిని ఎరుగని రీతిలో అప్పులు, ప్రతిదాంట్లోనూ కమీషన్లు చూసి జనం ఛీత్కరించుకోక ఏం చేస్తారు? అయితే ఈ ఛీత్కారాలు, వైఫల్యాలు తనపైకి రాకుండా వేరేవాళ్లపైకి తోసేయడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. అన్నిటికీ బాధ్యత తనదే అయినా కలెక్టర్లపైకి నెట్టేసేందుకు కలెక్టర్ల సదస్సును ఆయన వేదికగా చేసుకున్నారు. రాష్ట్రంలో 49 శాతం మంది ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారని, మన పని తీరును జనం మెచ్చడం లేదని అధికార యంత్రాంగాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘మీరు, నేను బాగా పని చేశామనుకుంటున్నాం.. కానీ ప్రజలు మాత్రం మెచ్చడం లేదు. ప్రజలకు సంతృప్తి లేకుండా పని చేస్తున్నాం. ఎక్కడో, ఏదో మిస్ అవుతున్నాం. ప్రజలు మనతో కలిసి వస్తున్నారా? లేదా? చూసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. డేటా చూస్తే.. కొన్ని అంశాల్లో మనం చేసే పనులను ప్రజలు మెచ్చడం లేదనే అవగాహన వచ్చిందన్నారు. రహదారులు, పంచాయతీరాజ్, తాగునీరు, పేదల గృహాలు, నిరుద్యోగం లాంటి సమస్యలున్నాయని, రైతులు పంటలకు ధరలు రావడం లేదంటున్నారని, భూముల సమస్య ఉందని, విద్యుత్ బిల్లులు పెరిగాయని, ప్రజలు విద్యుత్ కోత సమస్యలను ఎదుర్కొంటున్నారని సీఎం చెప్పారు. అంకెలతో సమస్యలు తీరవన్నారు. ఎన్నికలే లేకపోతే 20 ఏళ్లు కొట్టేయచ్చు ప్రభుత్వానికి కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం పట్ల పాజిటివ్ వాతావరణం రావాలంటే వారిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్నికలు లేకపోతే డిక్టేటర్, చైనాలా 20 ఏళ్లు ప్లాన్ చేసుకుని కొట్టేయవచ్చునన్నారు. కానీ ఇక్కడ ఐదేళ్లకోసారి ఎన్నికలకు వెళ్లాల్సి ఉందని, అందుకే రాజకీయ గవర్నెన్స్ కీలకమన్నారు. పారిశ్రామికవేత్తలు తిరుగుముఖం విశాఖ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు బాధ్యత కలెక్టర్లపై ఉందని సీఎం చెప్పారు. పరిశ్రమల అనుమతులకు జాప్యం చేస్తుండటంతో కొంత మంది పెట్టుబడిదారులు తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నారని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేవారిని కలెక్టర్లు, మంత్రులు తక్కువగా చూస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి జనవరి నుంచి ఫైళ్లు, సేవలన్నీ ఆన్లైన్లోనే క్లియర్ చేయాలని ఆదేశించారు. జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీకి వస్తానని సీఎం ప్రకటించారు. ఆ డబ్బులతో మరో రెండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీలో ఇవ్వడం వల్లే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల కంటే కార్పొరేట్ ఆస్పత్రులే బాగా పనిచేస్తాయన్నారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృథా చేశారని విమర్శించారు. ఆ డబ్బులు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించుకునేవాళ్లమని, రుషికొండ ప్యాలెస్ తెల్ల ఏనుగులా మారిందన్నారు. రోడ్లను కూడా పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారని, మరి అవి ప్రైవేటు వ్యక్తులవి అయిపోతాయా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని, విమర్శలు చేస్తే భయపడేది లేదన్నారు. సచివాలయాల ఉద్యోగుల పనితీరుపై సమీక్ష గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల పనితీరును సమీక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పాలనా యంత్రాంగం రోజువారీ విధులకు హాజరు కావాల్సిందేనని, నిర్లక్ష్యం చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులను నియమించి 100 శాతం నిర్వహణ వ్యయం పెంచేసిందని విమర్శించారు. ఆహా..! అలవోకగా అబద్ధాలుసూపర్ సిక్స్ హామీలను అమలు చేశామంటూ కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించడంపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. సూపర్ సిక్స్లో ప్రధాన హామీలైన నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నెలకు రూ.3,000 చొప్పున భృతి, ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా రూ.18,000 హామీలను నెరవేర్చకుండానే సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామంటూ సీఎం చెప్పడం పట్ల కలెక్టర్లు కంగుతిన్నారు. ఇక 1వతేదీ సెలవు వస్తే ముందు రోజే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు ఇస్తున్నట్లు చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో చెప్పారు. అయితే ఒక్క నెల మినహా ఏనాడూ 1వతేదీన జీతాలు ఇచ్చిన పాపాన పోలేదని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. -
మెడి‘కిల్’పై మహోద్యమం.. కోటి గళాల సింహగర్జన
సాక్షి, అమరావతి: కమీషన్ల కక్కుర్తితో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని, విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు ప్రభంజనమైంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు, మేధావులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు సర్కార్పై కళ్లెర్ర చేశారు. కోటి గళాలతో సింహగర్జన చేశారు.నిరసన జ్వాల ఉవ్వెత్తున ఎగసి పడటంతో కోటి సంతకాల ఉద్యమం ప్రజా మహోద్యమంగా మారింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలసి కోటి సంతకాల ప్రతులను అందిచనున్నారు. గద్దెనెక్కిన 18 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ రూ.2,81,312 కోట్లు అప్పు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. నెలకు రూ.15,628.44 కోట్లు.. రోజుకు రూ.520.94 కోట్లు చొప్పున అప్పు చేసింది. అంటే.. ఒక్క రోజులో చేసిన అప్పుతో ఒక మెడికల్ కాలేజీని పూర్తి చేయొచ్చు. కేవలం పది రోజుల్లో చేసిన అప్పుతో మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేయొచ్చు.కానీ.. అందుకు విరుద్ధంగా అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను దుబారా చేస్తూ మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల్లేవని సాకు చూపుతూ.. ప్రైవేటీకరణ ముసుగులో వాటిని చంద్రబాబు సర్కార్ బినామీలకు కట్టబెట్టాలన్న కుట్రపై జనం భగ్గుమన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లోని 175 నియోజకవర్గాలలో గ్రామాలు.. పట్టణాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాలకు చెందిన 1,04,11,136 మంది ప్రజలు స్వచ్ఛందగా సంతకాలు చేశారు.ఆ సంతకాల ప్రతులు 26 జిల్లాల నుంచి మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఆ సంతకాల ప్రతులను గురువారం గవర్నర్కు అందజేయనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలుపుదల చేసి.. వాటిని ప్రభుత్వమే నిర్మించి, నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్నారు. 14 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టని చంద్రబాబు రాష్ట్రంలో 1923 నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడు సార్లు అంటే 1995–99, 1999–04, 2014–19 మధ్య 14 ఏళ్లు సీఎంగా పాలించారు. ఆ మూడు దఫాల్లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు.కనీసం కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. ఈ క్రమంలో 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 13 జిల్లాలను పునర్విభజించి, 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు.ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు నాణ్యమైన వైద్యం అందించడం.. పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల కనీస స్థలం ఉండేలా భూమిని కేటాయించారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేసి అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు.కోవిడ్ మహమ్మారి వంటి సమస్యలు రెండేళ్లపాటు రాష్ట్రాన్ని పీడించినా, ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడా వెనక్కు తగ్గకుండా మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే ధృడ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి, తరగతులు మొదలుపెట్టారు.గతేడాది ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా తరగతులు ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట పులివెందుల మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గతేడాది అనుమతులు ఇచ్చింది. కానీ.. ఆ సీట్లు మాకు వద్దంటూ ఎన్ఎంసీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమీకరించింది. ఆ నిధులను సది్వనియోగం చేసుకుని.. వైఎస్సార్సీపీ సర్కార్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి.ఈ విద్యా సంవత్సరం అంటే 2025–26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో కూడా వైద్య కళాశాలలు ప్రారంభం అయ్యేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే ఉండేవి.కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగితే.. మొత్తంమ్మీద 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తరగతులు ప్రారంభమైన కొత్త మెడికల్ కాలేజీల్లో అప్పట్లోనే 800 సీట్లు భర్తీ చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్ అంగీకరించి ఉంటే మరో 50 సీట్లు వచ్చేవి.ఎక్కడ వైఎస్ జగన్కు క్రెడిట్ వస్తుందోనని ఏకంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు దెబ్బ తీస్తున్నారని మేధావులు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలన్నీ అందుబాటులోకి వచ్చేవి.అణచివేసే దుస్సాహసంపై ప్రజాగ్రహం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతుండటం.. రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తుండటంతో చంద్రబాబు సర్కార్ వెన్నులో వణుకు పుట్టింది. రచ్చబండ కార్యక్రమాలపై పోలీసులను ఉసిగొల్పి ప్రజా ఉద్యమాన్ని అణచివేసే దుస్సాహసంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది.చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక చర్యలపై సమర భేరి మోగించింది. నవంబర్ 12న నియోజకవర్గాల కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కారు. ఈ నెల 10న ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా చేసిన సంతకాల ప్రతులను ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో ప్రజలు భారీగా పాల్గొన్నారు.పోలీసుల ద్వారా ర్యాలీలను అడగడుగునా అడ్డుకోవడానికి చంద్రబాబు చేసిన కుట్రలను జనం పటాపంచలు చేశారు. ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలను ప్రదర్శిస్తూ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి బాబు సర్కార్పై రణభేరి మోగించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కోటి గళాలు సింహగర్జన చేశాయి. మహోద్యమంగా ప్రజా ఉద్యమం కమీషన్ల కక్కుర్తితో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 7న వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి సమరభేరి మోగించారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ ఆఖరు వరకు 175 నియోజకవర్గాల్లో గ్రామాలు, పట్టణాల్లో వైఎస్సార్సీపీ నేతలు విస్తృతంగా రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు.భవిష్యత్తులో రూ.లక్ష కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను బినామీలకు కట్టబెట్టాలన్న చంద్రబాబు కుట్రను.. పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను దూరం చేస్తున్న దురాగతాన్ని ప్రజల కళ్లకు కట్టినట్టు వివరించారు. వీటికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నిర్మించి, నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కోటి మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. -
అమెరికాకు విశ్వసనీయ భాగస్వామిగా ఏపీ కొనసాగుతుంది-చంద్రబాబు
-
హాస్టల్ విద్యార్థులకు కలుషిత నీరు.. తప్పు ఒప్పుకున్న చంద్రబాబు
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులకు కలుషిత నీరు అందించినట్లు సీఎం చంద్రబాబు అంగీకరించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ..‘హాస్టళ్లలో నీళ్లు సరిగా లేవు, బాత్రూమ్లు సరిగా లేవు. కలుషిత నీరు ఇవ్వడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఇది మనందరం సిగ్గుపడే విషయం’ అని అన్నారు. ఇన్నాళ్లూ మంత్రులు హాస్టళ్లలో నీటి సమస్య లేదని, కలుషితం కాలేదని బుకాయించారు. కానీ ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాస్టళ్లలోని దుస్థితిని బయటపెట్టారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావించగా.. ఇప్పుడు తన పాలనా వైఫల్యాల్ని చంద్రబాబు సైతం అంగీకరించడం గమనార్హం. -
చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ
-
ఇది పీపీపీ కాదు.. పెద్ద స్కామ్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కోటి సంతకాల ప్రతులను బుధవారం.. ఆ పార్టీ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం? అంటూ ప్రశ్నించారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్కు పాల్పడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. కోటిమందికి పైగా చేసిన సంతకాలే.. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజా నిరసనకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్ణయంపై ఇది కచ్చితంగా రెఫరెండమే అని ఆయన తేల్చి చెప్పారు. ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలని కలగన్నవైఎస్ జగన్ అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.అయితే అధికారంలోకి రాగానే కాలేజీల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు.. కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మమ్మాటికీ ముందస్తు కుట్రేనని.. . ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు. కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగిస్తున్న చంద్రబాబు.. అదనంగా 2 ఏళ్ల పాటు రూ.1400 కోట్లు జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలన్న నిర్ణయం.. మరో భారీ కుంభకోణమని స్పష్టం చేశారు.చంద్రబాబు తీరుకు నిరసనగా రేపు సాయంత్రం(డిసెంబర్ 18, గురువారం) వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గౌరవ గవర్నర్కు కోటి సంతకాల ప్రతులు సమర్పిస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన... లేనిపక్షంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షించి, బాధ్యులను బోనెక్కిస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీని మెడికల్ హబ్ చేయడమే వైఎస్ జగన్ లక్ష్యం:ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకుని రావటమే కష్టం, అలాంటి అనుమతులన్నీ వైఎస్ జగన్ సాధించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కాలేజీలు తెచ్చారు. దేశంలోనే ఉత్తమ మెడికల్ హబ్గా ఏపీని మార్చాలని జగన్ కలలు కన్నారు. ఆ మేరకు కింది స్థాయి నుండి పటిష్ఠం చేసుకుంటూ వచ్చారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసింది. అనంతరం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. ప్రైవేటు రంగంలోనే అత్యుత్తమ సేవలందుతాయని తాను నమ్ముతున్న సిధ్దాంతాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. తాను అధికారంలో లేనప్పుడు ఎప్పుడూ ప్రైవేటు రంగం గురించి నోరెత్తని చంద్రబాబు.. గెలిచిన తర్వాత ప్రైవేటు రంగంలో మంచి సేవలు అందుతాయని చెప్పడం అలవాటు.ఆర్థిక వనరులు లోటు లేకున్నా ప్రైవేటీకరణ మంత్రం:వైఎస్ జగన్ ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేయకుండానే, కేవలం కాలేజీలని నిర్మించాలని లక్ష్యంగా మాత్రమే చెబితే.. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం కష్టమని చెప్పడంలో అర్ధముంది. కానీ ఐదు మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ పూర్తి చేసి, ఆ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగి, విజయవంతంగా కాలేజీలు నడుస్తున్నాయి. మరో రెండు కాలేజీలు పూర్తయ్యాయి.. మరో మూడు కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి.అంటే మొత్తం 10 కాలేజీలు దాదాపు పూర్తైన దశలో ఎందుకు వాటిని ఆపాల్సి వచ్చింది. మరో కీలకమైన అంశం ఏమిటంటే... కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా వివిధ ఆర్ధికసంస్ధలతో వైయస్.జగన్ ప్రభుత్వమే టై అప్ అయింది. నీకు కావాల్సిందల్లా కాలేజీల నిర్మించాలన్న మనసు మాత్రమే. అదే చంద్రబాబుకు లేదు. చంద్రబాబు హెరిటేజ్తో సహా ఎవరైనా ప్రైవేటు రంగంలో ఉచితంగా సేవలు అందిస్తారా? రూపాయి పెట్టుబడి పెట్టి రూ.10, రూ.20, రూ.50 ఎలా సంపాదించాలనే వస్తారు. చంద్రబాబు ఏం చెప్పినా పీపీపీ అనేది ఓ పెద్ద స్కామ్. ఇంకా జనాల చెవిలో పువ్వులు ఎలా పెట్టగలననుకుంటున్నాడో తెలియడం లేదు? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కోసం వైఎస్ జగన్ అక్టోబరులో పిలుపునిస్తే... ఈ రెండు నెలల్లో వచ్చిన ప్రజాస్పందన చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల అభిప్రాయం చంద్రబాబుకు అర్థం కావడం లేదు. కోటి సంతకాలకు అక్టోబరులో పిలుపునిస్తే.. జనంలో వస్తున్న స్పందన అందరికీ తెలుసు.ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రిఫరెండంలా.. చరిత్రలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పూడూ చూడని విధంగా తొలిసారిగా ఇంత పక్కాగా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. వైయస్సార్సీపీ ఆధ్యర్యంలో ప్రతిచోటా జనంలోని వెళ్లి సంతకాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పేదలతో పాటు సమసమాజం కావాలనుకునేవాళ్లు, సమాజంలో అసమానతలు తగ్గించాలని కోరుకునేవారు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు.ప్రైవేటీకరణే చంద్రబాబు విజన్:ఇవాల్టికి చంద్రబాబు కొంచెం తగ్గి.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం పేరు పెద్దదిగా ఉంటే.. ప్రైవేటు వాళ్ల పేరు చిన్న అక్షరాల్లో ఉంటుందని చెబుతున్నారు. కాలేజీల భవనాలు, ఆసుపత్రులు, భూమి అంతా ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టిన తర్వాత వాళ్లు పేరు పెట్టినా, పెట్టకపోయినా ఏం ప్రయోజనం ఉంటుంది. పైగా వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించడానికి అంగీకరించడం మరించి ఆశ్చర్యకరం. ఇన్ని ప్రైవేటు వారికి ఇచ్చినప్పుడు... ప్రభుత్వమే ఎందుకు నిర్వహించలేకపోతుంది?మెడిసిన్ చేయాలనుకునే విద్యార్ధులు తొలుత ప్రభుత్వ కాలేజీలనే కోరుకుంటారు. కారణం ఆయా కాలేజీలకు వచ్చే పేషెంట్లు, ఉత్తమ సర్వీసులు, మంచి శిక్షణ అందుతుందన్న ఆలోచనతోనే ఎంచుకుంటారు. మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెడితే... మేం అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అన్నింటినీ రద్దు చేసి ఉచితం చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్నే నిలిపివేశారు.ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సపోర్టు చేసి నెత్తిన పెట్టుకునే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన మొదటి నుంచి ఇదే తీరు. కేవలం కాసుల కోసం కక్కుర్తి పడి ప్రైవేటీకరణ చేయడం ఒక అంశం అయితే... ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్యరంగంలో ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడు. వైయస్.జగన్ విజయవంతంగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే... దాన్ని కొనసాగించాల్సింది పోయి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు 100 శాతం మెడికల్ సేవలు ఉచితం అని చెప్పాడు. ఇవాళ 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా వస్తాయని, 70 శాతం ఇన్ పేషెంట్ కేటగిరీలో ఉచితం అని చెబుతున్నాడు. ఇవన్నీ ఎవరికి చెబుతున్నావ్ చంద్రబాబూ?జీతాలు చెల్లింపు మరో కుంభకోణం..వైఎస్ జగన్ ఇప్పటికే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించి, విజయవంతంగా నిర్వహించవచ్చని, సామర్థ్యం ఉన్న సిబ్బందిని నియమించవచ్చని నిరూపించిన తర్వాత.. ఇవాళ చంద్రబాబు దాన్నుంచి పక్కకు పోవడం అంటే ఇది పెద్ద కుంభకోణం. రెండో కుంభకోణం.. రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తామని చెప్పడం. ఒక వైపు మెడికల్ కాలేజీలను నిర్మించడానికి డబ్బుల్లేవు అని చెబుతూ... మెడికల్ కాలేజీలను, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, భూమితో సహా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూనే.. వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వం నుంచి చెల్లించడం అంటే ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.8 కోట్లు చొప్పున 10 మెడికల్ కాలేజీలకు రూ.80 కోట్లు ఖర్చువుతుంది. రెండేళ్లకు రూ.1400 కోట్లు ఇవ్వాలి. ఈ డబ్బులతో కాలేజీలు పూర్తి కావా?ఇవాళ కార్పొరేట్ కాలేజీల్లో వైద్యం ఖర్చు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఇవాళ కొత్త ట్రీట్మెంట్ వచ్చిందంటే అది ఎన్ని లక్షలు కట్టమంటే అంతా కట్టాల్సిందే? ఇక్కడ మొదలుపెట్టి ప్రైమరీ హెల్త్ కేర్ను కూడా ప్రైవేటుకు కచ్చితంగా అప్పగిస్తాడు. అంటే మొత్తం వైద్య ఆరోగ్యరంగం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. మన ఆర్దిక వ్యవస్ధలో ప్రైవేటు ఉండడం మన మార్కెట్ ఎకానమీలో భాగం.ప్రజల పట్ల ప్రేమ - పాప భీతి లేని వ్యక్తి చంద్రబాబులాభం లేకుండా ప్రైవేటు వ్యాపారులు రారని తెలిసి, వాళ్లకు లాభాలిచ్చి, నువ్వు వేల కోట్లు కుమ్మిరించి.. ఇక్కడ అవసరమైన రూ.2-3 వేల కోట్లు పెట్టలేదంటే చంద్రబాబు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు. ఆయన సేవలు చేయనవసరం లేదు, కానీ ద్రోహం చేయడం మహాపాపం. నా వల్ల ఇంత నష్టం జరుగుతుందన్న భయం కానీ పాపభీతి కానీ రెండూ చంద్రబాబుకు లేవు. అందుకే నేటికీ ప్రైవేటీకరణ మంచిదని బుకాయిస్తున్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల వెల్లువఈ నేపధ్యంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరనసగా వైఎస్ జగన్ పిలుపు మేరకు అక్టోబర్లో సంతకాల సేకరణ ఉద్యమం మొదలుపెట్టి... రెండు నెలల కాలంలో 1 కోటి సంతకాలను లక్ష్యంగా పెడితే... 1,04,11,136 సంతకాలు వచ్చాయి. ఈ సంతకాలన్నీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మీరు వ్యతిరేకిస్తే... సంతకం చేయమని అడిగితే..రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో చేసినవే. జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళంలో జిల్లాలో 4,02,833, విజయనగరం జిల్లాలో 3,99,908, పార్వతీపురం మన్యం 2,15,500, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,47,000, విశాఖపట్నం 4,19,200, అనకాపల్లి జిల్లాలో 3,73,000, కాకినాడ జిల్లాలో 4,00,600, బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,20,086, తూర్పుగోదావరి జిల్లాలో 4,06,929, పశ్చిమ గోదావరి జిల్లాలో 4,19,650, ఏలూరు జిల్లాలో 3,60,008, కృష్ణా జిల్లాలో 3,77,336, ఎన్టీఆర్ జిల్లాలో 4,31,217, గుంటూరు జిల్లాలో 4,78,059,..పల్నాడు జిల్లాలో 4,31,802, బాపట్ల జిల్లాలో 3,73,199, ప్రకాశం జిల్లాలో 5,26,168, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 6,30,040, కర్నూలు జిల్లాలో 3,98.277, నంద్యాల జిల్లాలో 4,05,500, అనంతపురం జిల్లాలో 4,55,840, శ్రీసత్యసాయి జిల్లాలో 4,40,358, వైయస్సార్ జిల్లాలో 4,80,101, అన్నమయ్య జిల్లాలో 2,60,500, చిత్తూరు జిల్లాలో 7,22,025 మొత్తం 1 కోటి 3 లక్షల 71వేల 136 సంతకాలు చేరాయి. ఇవి కాకుండా కేంద్ర కార్యాలయానికి చేరిన మరో 40వేలు సంతకాలు కలిపి మొత్తం... 1, 04,11,136 నిఖార్సైన సంతకాలతో ప్రవైటీకరణకు వ్యతిరేకంగా తమ మద్ధతు తెలిపారు.బ్యాలెట్ తీర్పు తరహాలో ప్రజాభిప్రాయం:రాష్ట్రంలో ప్రజాభిప్రాయసేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులో తీర్పునిచ్చినట్లు.. రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. 1.04 కోట్ల మంది సంతకాలు అంటే అన్ని కుటుంబాలు సంతకాలు చేశారంటే... రాష్ట్రంలో మొత్తం కుటంబాలు 1.60 కోట్లు పైగా ఉంటే... అందులో 1.04 కోట్ల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.ఇంతమంది సంతకాలు చేసిన తర్వాత చంద్రబాబు పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. క్రెడిట్ ఆయనే తీసుకుని... మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి. టిడ్కో ఇళ్ల విషయంలో కూడా గతంలో చంద్రబాబు డబ్బులు వసూలు చేసి పూర్తి చేయకుండా వదిలేస్తే.. వైఎస్ జగన్ హయాంలో క్రెడిట్ కూడా క్లెయిమ్ కూడా చేయకుండా.. ఉచితంగా అందించారు. అది వైఎస్ జగన్కు ఉన్న ఆలోచన. రాజకీయం కోసం ప్రజలతో ఆడుకోవడం సరికాదు. వైఎస్ జగన్ హయాంలో కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో చూపించుకున్నాడు. ఏమాత్రం జంకులేకుండా క్లెయిమ్ చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు.కాలేజీల నిర్మాణానికి కుంటిసాకులు:ఇవాళ మెడికల్ కాలేజీలను కూడా తానే కట్టానని చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవచ్చు.. కానీ ప్రైవేటీకరణ చేసి ప్రజల ఉసురు తీసుకోవద్దు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దు. వైఎస్ జగన్ ప్రారంభించిన వాటి నిర్మాణం కొనసాగిస్తే సరిపోతుంది. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు చేసిన రూ. 2.60 లక్షల కోట్లకు పైగా అప్పులో .. కొంత మెడికల్ కాలేజీల కోసం వెచ్చిస్తే సరిపోయేది. కానీ కుంటిసాకులు వెదుకుతూ, పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పిందని తన అనుకూల పత్రికల్లో రాయించుకోవడం మానేసి... చేసి చూపించాలి వైఎస్సార్ ఉచిత కరెంటు ఇవ్వడం అసాధ్యమని అందరూ అన్నారు.. దాన్ని ఆయన చేసి చూపించేసరికి అందరూ దాన్ని అనుసరిస్తున్నారు.నీవు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యం కాదు అనుకున్నావు.. కానీ వైఎస్ జగన్ వాటిని చేసి చూపిస్తే దాన్ని కొనసాగించ లేకపోవడం దారుణం. భవిష్యత్తు తరాలకు 20, 30 ఏళ్లు గడిచిన తర్వాత... మెడిసిన్లో గొప్ప సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకునే అవకాశాన్ని చేతులారా చంద్రబాబు చంపేస్తున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను నిర్మించాలని కోరుతున్నాం.ఇదే విషయంపై రేపు సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ ఒక ప్రతినిధి బృందంతో... గవర్నర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు, సంతకాల ప్రతులను ఆయనకు సమర్పిస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అప్పటికైనా చంద్రబాబు కుట్రపూరితమైన, తన దుర్మార్గమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మెడికల్ కాలేజీలను ప్రభుత్వరంగంలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..రోడ్లు పీపీపీ విధానంలో నిర్మిస్తే అవి ప్రభుత్వం వద్దే ఉంటాయి కదా అని ప్రశ్నించగా.. అలా చేయడం వల్ల టోల్ గేట్ల ఖర్చు భారీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఇవేవీ లేవని.. ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్ష లేకుండా ఎందుకు వస్తారని నిలదీశారు. మెడికల్ కాలేజీలు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయమని... ఏ దేశమైనా ప్రభుత్వ పరిధిలేకుండా వైద్యాన్ని ప్రైవేటుపరం చేయలేదని గుర్తు చేశారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు.. వాటి ధరలను సమాజం భరించలేదని... అందుకే ప్రభుత్వం వాటిని బేలన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోటి సంతకాలు ఎవరు చేశారన్నది.. తెలుగుదేశం పార్టీ నేతలందరికీ తెలుసు. ప్రైవేటీకరణ విషయంలో మారిన చంద్రబాబు మాట తీరే ఇందుకు నిదర్శనం. అయినా మొండిగా ముందుకు వెళ్తూ చంద్రబాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు.వైఎస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ప్రవేశపెడితే.. ఇదే కూటమి నేతలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా కాలేజీలనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. 108 సేవలకు సంబంధించి ప్రతిచోటా మొత్తం ప్రభుత్వం చేయాలనుకోవడం మంచి మార్గం. ఒకవేళ అది కాకపోతే ప్రభుత్వ కంట్రోల్ ఉంచేలా చూడాలి. కానీ కూటమి నేతలు మేం అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేసి మొత్తం ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పి... ఇవాళ ప్రైవేటీకరణకు వెళ్లడమే మంచిదని వితండవాదం చేయడం దుర్మార్గం.రాజధాని నిర్మాణం కోసం డిజైన్లు, లైటింగ్ వంటి వాటి కోసం కోట్లాది రూపాయులు ఖర్చుపెడుతున్నారు. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వచ్చేసరికి చేయాలన్న ఉద్దేశం లేకపోవడంతోనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఇలా చేయడం దుర్మార్గం. ఉచితంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైయస్.జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణం చేసి చూపించిన తర్వాత కూడా ఇలాంటి వాదన చేయడం అర్ధరహితమని తేల్చి చెప్పారు. -
Gorantla: నీ ప్రభుత్వ పతనానికి పునాది రాళ్లు గుత్తుపెట్టుకో చంద్రబాబు..
-
సీఎం చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేర్లను మార్చి తన ఖతాలో వేసుకున్న చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు. ఇవాళ విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పేరును మార్చి ఇకపై వాటిని ‘స్వర్ణ గ్రామం’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు తమ గ్రామంలోనే అన్ని ప్రభుత్వ సేవలను పొందే అవకాశం కలిగింది. పలు శాఖల పనులను ఒకే కేంద్రంలో సమీకరించడం వల్ల ప్రజలకు సేవలు మరింత సులభతరం అయ్యాయి. కొత్త పేరుతో కొనసాగింపుఅయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం, ఈ వ్యవస్థను కొనసాగిస్తూ..దానికి కొత్త పేరు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘స్వర్ణ గ్రామాలు’ అనే పేరుతో క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు.చంద్రబాబుపై విమర్శలుచంద్రబాబు నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ సృష్టించిన వ్యవస్థకు పేరు మార్చి క్రెడిట్ తీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. -
‘కోటి సంతకాలు.. బాబు పతనానికి పునాదులు’
సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాలు కాదు.. చంద్రబాబు పతనానికి పునాదులు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీద ఉన్న కోపంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. విశాఖ ఉక్కును సైతం ప్రైవేటీకరణ చేస్తారా? అంటూ గోరంట్ల మాధవ్ నిలదీశారు.భూమి, బిల్డింగ్లు అన్నీ ప్రభుత్వమే ఇస్తే నీ బినామీలకు దోచి పెడతారా?. వంద రూపాయలకే ఎకరం భూమి ఇస్తారా?. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉంది. కాలేజీలను ప్రైవేట్ వారికి ఇచ్చి జీతాలు మాత్రం ప్రభుత్వమే ఇస్తుందంట.. ఆదాయం మాత్రం ప్రైవేట్ వారే తీసుకుంటారట. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. -
Gudivada: ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టే..
-
‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ కుంభకోణం’
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ కుంభకోణం ఉందని.. పీపీపీ ముసుగులో అడుగడుగునా అడ్డగోలు దోపిడీకి తెర తీశారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్.. చంద్రబాబు విధానాలను నిలదీశారు.కుడిచేత్తో కాలేజీలిచ్చి.. ఎడమ చేత్తో కమీషన్లు: గుడివాడ అమర్నాథ్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైయస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన వచ్చింది. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, 7 కాలేజీలను పూర్తి చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని నిర్ణయించడంపై ప్రజలు మండి పడుతున్నారు.కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి దాగి ఉందన్న వైఎస్సార్సీపీ వాదనను ప్రజలు అర్థం చేసుకున్నారు. గత మా ప్రభుత్వం నిర్మించిన కాలేజీలు, ఆస్పత్రులతో పాటు ఆయా ఆస్పత్రుల పరిధిలో ఉన్న వందల కోట్ల విలువ చేసే భూములను కాజేయాలన్న కుట్రతోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఒక వైపు ఏడాదిన్నరలోనే రూ. 2.66 లక్షల కోట్ల అప్పు చేయడమే కాక, మెడికల్ కాలేజీల రూపంలో జగన్ సృష్టించిన వేల కోట్ల విలువైన సంపదను ప్రైవేటుకి అప్పనంగా ధారాదత్తం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు ఆయా కాలేజీల్లో పనిచేసే స్టాఫ్కి రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో ప్రజా సంపదను దోచిపెడుతున్నాడు. కుడి చేతితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి రాసిచ్చి, జీతాల రూపంలో ఒక్కో ఏడాది ఇచ్చే దాదాపు రూ.800 కోట్ల సొమ్మును ఎడమ చేత్తో వారి నుంచి లాక్కుంటున్నాడు. తన దోపిడీ కుట్రలను యథేచ్ఛగా అమలు చేయడానికి నిస్సిగ్గుగా పార్లమెంట్ స్థాయీ సంఘం నివేదికను కూడా వక్రీకరించేస్తున్నాడు. కిక్ బ్యాక్ల కోసం తాను ఎంతకైనా దిగజారుతానని చెప్పకనే చెబుతున్నాడు.జీతాల చెల్లింపుల పేరుతో రూ.1400 కోట్లు దోపిడీ: గోరంట్ల మాధవ్పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు కుట్రలను రాష్ట్ర యువత, మేథావులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కూటమి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించే దర్జాగా దోపిడీకి బాటలు వేసుకుంటున్నాడు. రేపు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై లోతైన విచారణ చేసి నిందితులు ఎవరున్నా వదిలి పెట్టబోము. న్యాయస్థానాల్లో నిలబెట్టి కఠినంగా శిక్షించే వరకు వెనకాడబోము.కేవలం దోపిడీ ఆలోచనలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. జగన్గారు నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు కాలేజీలను దక్కించుకున్న 10 మెడికల్ కళాశాలల ఉద్యోగులకు రెండేళ్లపాటు జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా మరో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా ఇదంతా ప్రజల ఆస్తులను అప్పనంగా తన బినామీలకు దోచిపెట్టే కుట్రే. ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.70 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ. 140 కోట్లు.. రెండేళ్లలో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు దోచిపెట్టే కుట్రకు తెర లేపారు. కుడిచేత్తో కాలేజీలను, కాలేజీ భూములను వారి చేతిలో పెట్టి.. ఎడమ చేత్తో జీతాల పేరుతో ఇచ్చిన రూ.1400 కోట్ల డబ్బును వారి నుంచి తీసుకునే దోపిడికి స్కెచ్ వేశాడు. ఇందుకు రాబోయే రోజుల్లో చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు.ప్రైవేటీకరణ వెనుక లక్ష కోట్ల దోపిడీ: :మొండితోక అరుణ్కుమార్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు లక్ష కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు. ప్రజావైద్య రంగాన్ని బలోపేతం చేసి పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ గారు నాడు 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతోపాటు 7 కాలేజీలను పూర్తి చేసి 5 కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఒక్కో మెడికల్ కాలేజీని 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మెడికల్ కాలేజీల రూపంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల విలువైన సంపద సృష్టిస్తే. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు దాన్ని తన బినామీలకు ధారాదత్తం చేసే కుట్రలకు తెరలేపాడు.నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు, తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించకపోగా.. వైఎస్ జగన్ నిర్మించిన కాలేజీలను 66 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు. మెడికల్ కాలేజీలకున్న 50 ఎకరాలు ప్రభుత్వ భూమి, భవనాలు ప్రభుత్వానివి వాటి విలువ వందల కోట్లలో ఉంటే ఎకరా రూ.100లకు ధారాదత్తం చేశాడు. ఇది కాకుండా రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు ముట్టజెప్పే ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్రభుత్వ సంపదపై ప్రైవేటు వ్యక్తులకు పెత్తనం అప్పజెబుతున్నాడు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన వచ్చింది. 1.36 కోట్ల మందికిపైగా సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని బాహాటంగానే తప్పుబట్టారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లెలో కూడా సగం మందికిపైగా ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాలు చేశారంటే ఏ విధంగా చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కాలేజీలపై పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు మా పార్టీ వెనక్కి తగ్గబోదు. -
కలెక్టర్ల సాక్షిగానే తమ పాలన సరిగాలేదన్న చంద్రబాబు
-
TJR : సంపద సృష్టి నిజమే.. కానీ రాష్ట్రానికి కాదు నారా కుటుంబానికి
-
గుమ్మనూరు గూండాగిరి.. చేతగాక చేతులెత్తేసిన చంద్రబాబు
-
ఒబెరాయ్ హోటల్ కి TTD భూములు.. చంద్రబాబు తీరని ద్రోహం..
-
పథకాలనే కాదు జగన్ స్టైల్ ని కూడా కాఫీ.. కారుమూరి వెంకట్ రెడ్డి సెటైర్లే సెటైర్లు
-
ఇది పరకామణి చోరీ కంటే పెద్ద దోపిడి.. చంద్రబాబుపై భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం అవుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారాయన. బుధవారం తన నివాసంలో భూమన మీడియాతో మాట్లాడారు.. .. టీటీడీకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. దేవస్థానం భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. అలిపిరిలో సమీపంలో అత్యంత విలువైన భూముల్ని ఇచ్చేస్తున్నారు. ఎకరా రూ.26 కోట్ల రూ.52 లక్షల ఖరీదైన భూముల్ని కట్టబెట్టారు. రూ.460 కోట్ల విలువైన భూమిని ఒబెరాయ్కి ఇచ్చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇది. 13వ తేదీన జీవోకూడా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 13న జీవో.. 5న రిజిస్ట్రేషన్ చేశారు. మరి ఇంకా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సైట్లో ఎందుకు కనిపించడం లేదు?. ఎవరికి మేలు చేయడానికి రూ. 2 కోట్లు బిల్డింగ్ ఫీజుకు సర్దుబాటు చేశారు, రూ. 26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేసేశారు. ఆ భూముల్లో భారీగా చందనపు చెట్ల ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కాకముందే చెట్లు కొట్టడం ప్రారంభించారు. ఒక బ్రాహ్మణుడు స్వామివారికి ఇచ్చిన భూమిని బాబు పందేర వేస్తున్నారు. తిరుమల పవిత్రతతను కాపాడడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. వంద గదుల హోటల్కు భారీ ఎత్తున భూములు కట్టబెడుతున్నారు. ప్రభుత్వం దగ్గరి భూములు ఇవ్వకుండా(రెవెన్యూ ల్యాండ్).. టీటీడీ భూములు ఎలా ఇస్తారు?. గతంలోనూ హోటల్పేరు మార్చి తతంగం అంతా నడిపించింది చంద్రబాబే. దేవుడిని దోపిడీ చేసి ఒబెరాయ్కు ఇప్పుడు భూములు అప్పజెప్తునారు. దేవుడి ఇనాం భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారు?. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారు. వెంకటేశ్వరస్వామికి చంద్రబాబు చేస్తోంది అన్యాయం కాదా?..’’ అని భూమన మండిపడ్డారు. వంద రూమ్ల ఒబెరాయ్ హోటల్తో 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు చెప్తోంది. అదెలా సాధ్యం. ఇది పరకామణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడి. దీని వల్ల టీటీడీకి వచ్చిన లాభం ఏమిటి?. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనాడు తీసుకు వచ్చిన ఏడు కొండలు పరిధిలోనే ఈ భూములు ఉన్నాయి. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉంది. అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి?.. స్వామీజీలు ఇప్పటికైనా మౌనం వీడాలి. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేయాలి. ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి తప్పిదాలు చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: తిరుమలలో మహాపచారం.. మద్యం, బిర్యానీ ప్యాకెట్లు లభ్యం! -
వివేకా కేసులో చంద్రబాబుకు సీబీఐ కోర్టు షాక్
-
చంద్రబాబు అప్పులు.. కేంద్ర మంత్రి వెల్లడి
-
చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: క్రెడిట్ చోరీలో ఆరితేరిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన రికార్డులు తానే తిరగరాస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను తమ ప్రభుత్వం చేసినవిగా చెప్పుకునేందుకు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటును ‘గూగుల్’ ముసుగులో తన ఘనతగా చెప్పుకునేందుకు ఆపసోపాలుపడిన చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో 6,100 మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన హైడ్రామాకు తెరతీశారు. ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాల ప్రదానం పేరిట మంగళవారం ప్రచారార్భాటంతో కనికట్టు చేయడం పోలీసు వర్గాలనే విస్మయపరుస్తోంది. ఈ ప్రక్రియలో అసలు వాస్తవాలివీ.. 2022లోనే నోటిఫికేషన్.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలుత 2022లో ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలూ నిర్వహించి 411 ఉద్యోగాలను భర్తీ చేసింది. అలాగే 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3,580, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు 2,520 మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022, నవంబరులో నోటిఫికేషన్ జారీచేసింది. ఆ పోస్టులకు మొత్తం 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే 2023, జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,59,182 మంది అభ్యర్థులు హాజరైన ఈ పరీక్ష ఫలితాలను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రకటించారు. కోర్టు కేసులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ను అడ్డుకున్న టీడీపీ.. అయితే, ఈ కానిస్టేబుల్ పోస్టుల భర్తీని అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ దురుద్దేశంతో అడ్డుకుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధపడింది. కానీ, టీడీపీ నేతలు తమ వర్గీయుల ద్వారా న్యాయస్థానాల్లో 36 పిటిషన్లు వేయించారు. దాదాపు ఏడాదిపాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే తమ వర్గీయుల చేత ఆ కేసులన్నీ ఉపసంహరింపజేయడం గమనార్హం. దీంతో రాష్ట్ర పోలీసు నియామక మండలి దేహదారుఢ్య పరీక్షలు, అనంతరం మెయిన్స్ పరీక్షలు నిర్వహించి 5,757 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. చంద్రబాబు హైడ్రామా.. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను ఇప్పుడు తన ఘనతగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు హైడ్రామాకు తెరతీశారు. ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాల ప్రదానం పేరిట తెగ హడావుడి చేశారు. వాస్తవానికి.. కానిస్టేబుళ్లకు రాష్ట్రంలోని వివిధ ఏపీఎస్పీ బెటాలియన్లలో నియామక పత్రాలు అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కానీ, ఈ పోస్టుల భర్తీ తన ఘనతగా చెప్పుకునేందుకు.. అలాగే, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు ఓ ఎత్తుగడ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన మొత్తం 5757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాల ప్రదానం కార్యాక్రమాన్ని మంగళగిరిలోని పోలీస్ బెటాలియన్లో మంగళవారం నిర్వహించారు. అంతేకాదు.. ఎంపికైన ఒక్కో కానిస్టేబుల్ అభ్యర్థి తనతో కనీసం ముగ్గురు కుటుంబ సభ్యులను తీసుకురావాలని మెలిక పెట్టారు. వీరిని ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం తరలించింది. అంతమందితో సమావేశం నిర్వహించి తన సొంత డబ్బా కొట్టుకోవాలన్నది చంద్రబాబు పన్నాగం. అంటే.. శ్రీకాకుళం, అనంతపురం తదితర సుదూర ప్రాంతాల నుంచి ఎంపికైన అభ్యర్థులే కాకుండా వారి కుటుంబ సభ్యులు వ్యయ ప్రయాసలు భరించి మంగళగిరి రావాలని హుకుం జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. అయితే, వీరు ఇంకా విధుల్లో చేరకుండానే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వీరికి వారెంట్ జారీచేసి ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చింది. ఈ బాధ్యతలను జిల్లాల ఎస్పీలు పర్యవేక్షించారు. నిజానికి.. పోలీసు, రెవెన్యూ తదితర కీలక శాఖలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. కానీ, చంద్రబాబు సర్కారు ఈ కార్యక్రమాన్ని ఫక్తు పార్టీ కార్యక్రమంగా మార్చేసింది. పైగా.. ఎంపికైన అభ్యర్థులతో జిల్లాల వారీగా సమావేశాలు కూడా నిర్వహించాలని ఆదేశించింది. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై అటు పోలీసు వర్గాలతోపాటు ఇటు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల కుటుంబాలు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నాయి. ఈ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమాన్ని కూడా పార్టీ కార్యక్రమంలా చేయడమేంటని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. -
అరువు కోసం అడ్డదారులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రాజ్యాంగ నిబంధనలను ఉల్లఘించి, ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) నిబంధనలకు విరుద్ధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా భారీగా అప్పులు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక రుణ పరిమితికి మించి చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) నుంచి అధిక వడ్డీకి బాండ్లు జారీ చేయడం ద్వారా అప్పు చేశారు. అంటే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ అప్పు చేశారన్నమాట. ఏపీఎస్బీసీఎల్ ద్వారా అప్పు చేయడం రాజ్యాంగంలోని అధికరణ 293 (3) కింద కేంద్ర విధించిన వార్షిక రుణ పరిమితిని ఉల్లఘించడమేనని కేంద్ర ఆర్దిక శాఖ రాష్ట్రాలకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొంది. కేంద్రం ఆదేశాల ప్రకారం ఏపీఎస్బీసీఎల్ ద్వారా సేకరించే అప్పులు వార్షిక రుణ పరిమితిలో భాగమవుతాయని తెలిసినా కూడా చంద్రబాబు ప్రభుత్వం మద్యం బాండ్లు జారీచేయడం ద్వారా అప్పులు చేయడం ఆందోళనకరమని నిపుణులంటున్నారు. ఇలా చేయడం వల్ల అధికవడ్డీ భారంతో పాటు కమీషన్ కూడా చెల్లించాల్సి రావడం వల్ల రాష్ట్ర ప్రజలపై భారీ భారం పడుతుందని వారు పేర్కొంటున్నారు.అధిక వడ్డీ... కమీషన్.. ఏపీఎస్బీసీఎల్ ద్వారా 9.15 శాతం అధికవడ్డీకి రూ.5,490 కోట్లు అప్పు చేశారు. కేంద్రం నిబంధనలకు లోబడి చేసే అప్పులైతే 7శాతం వడ్డీకే వస్తాయి. కానీ ఎఫ్ఆర్బీఎం పరిమితులను, కేంద్రం మార్గదర్శకాలను చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడో అతిక్రమించేసింది. అందుకే 9.15శాతం అధికవడ్డీతో అప్పులు చేస్తున్నారు. అంతేకాదు ఈ అప్పు చేయడం కోసం అప్పు మొత్తంపై 1.5 శాతం కమీషన్గా చెల్లించారు. అంటే కమీషన్ రూపంలో ఏకంగా రూ.80 కోట్లకు పైగా చెల్లించారు. బాండ్లు జారీ అరేంజర్కు ఈ కమీషన్ చెల్లించారు. 6 నుంచి 7 శాతానికి రుణం దొరికే అవకాశం ఉన్నా 9.15 శాతానికి తీసుకున్నారు. ఇందులో కూడా కుంభకోణం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికవడ్డీకి సిద్ధపడడం, భారీ కమీషన్ చెల్లించడం అనుమానాస్పదంగా ఉందని, దీనిపై అత్యవసర దర్యాప్తు జరగాల్సిందేనని ఆర్థిక నిపుణులంటున్నారు. రుణ పరిమితికి మించి అప్పులు.. కేంద్రం నిర్ధేశించిన రుణ పరిమితికి మించి అప్పులు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. 2014–19 మధ్య కేంద్రం నిర్ధేశించిన రుణ పరిమితికి మించి ఏకంగా రూ.16,418 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పు మొత్తం మేర రుణపరిమితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం తగ్గించేసింది. కోవిడ్ సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్రం అంతకుముందు చంద్రబాబు పరిమితికి మించి అప్పు చేసిన పాపానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి శిక్ష వేసింది. అప్పులు చేయడానికి చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధమైన మార్గాలను యథేచ్ఛగా అనుసరిస్తున్నారు. ఇప్పటికే మే 25వ తేదీ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు) బాండ్లు జారీ చేశారు. ప్రభుత్వ హామీతో పాటు.. ఎన్సీడీ హోల్డర్లు ప్రభుత్వం అనుమతి లేకుండానే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ను నేరుగా యాక్సెస్ చేయడానికి అనుమతించారు. ఇది ఒక రకంగా ప్రభుత్వ ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టుపెట్టడమే. ఈ మార్గం ద్వారా రూ. 9,000 కోట్లు అప్పు చేశారు. ఇందుకోసం ఏకంగా రూ.1,91,000 కోట్ల విలువైన మైనింగ్ లీజులను సెక్యూరిటీగా పెట్టారు. సౌత్ సూడాన్తో పోటీ తథ్యం.. నాడు తక్కువ వడ్డీకి తక్కువ అప్పులు చేసినా రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చారు. ఇపుడు నిబంధనలకు విరుద్ధంగా అధికవడ్డీలకు అధిక అప్పులు చేస్తున్నారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 80 శాతం అప్పులను ఈ 18 నెలల్లోనే చేసేశారు. ఈ వేగంతో మరి మిగిలిన 42 నెలల్లో చంద్రబాబు చేసే అప్పులు ఎక్కడకు చేరుకుంటాయో.. వడ్డీలు ఏపీ పరిస్థితిని ఏ మేరకు దిగజారుస్థాయో ఊహలకందడం లేదని ఆర్థిక నిపుణులంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అస్థవ్యస్ధ ఆర్దిక నిర్వహణతో రాష్ట్ర ఆదాయ వృద్ధి దారుణంగా క్షీణిస్తోంది. మరోపక్క మూలధన వ్యయం తగ్గిపోతోంది. రెవెన్యూ వ్యయానికి కూడా భారీగా అప్పులు చేస్తున్నారు. ఇలానే ఉంటే ఏపీ పరిస్థితి శ్రీలంక ఏమో గానీ ఆఫ్రికన్ దేశమైన సౌత్ సూడాన్ కన్నా దిగజారడం ఖాయమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. నాడు గగ్గోలు పెట్టి... వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాచురేషన్ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసింది. నాడు మద్యం ఆదాయంపై చేసిన అప్పులపై చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టింది. అంతే కాకుండా కేంద్ర ఆర్థికశాఖకు, ఆర్బీఐకి, సెబీకి ఫిర్యాదులు చేసింది. రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ ఎల్లోమీడియాలో ఎన్నో కథనాలు వండివార్చారు.. ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేస్తున్నారంటూ ఎల్లో మీడియా, చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టింది. ఇపుడు చంద్రబాబు చేసిందేమిటి? అదే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అధికవడ్డీకి రూ.5,490 కోట్లు అప్పు చేశారు. ఆ ఆదాయం తగ్గకుండా ఉండడం కోసమే ఊరూ వాడా బెల్ట్ షాపులు, పర్మిట్ రూములతో జనాన్ని మద్యం మత్తులో ముంచేస్తున్నారు. చంద్రబాబు హయాంలో అప్పుల శాతం పెరుగుతోంది రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడిసాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అప్పుల శాతం పెరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్కు వెల్లడించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం జీఎస్డీపీలో అప్పుల శాతం 33.1 శాతమే ఉండగా, 2024–25లో 34.3 శాతానికి, 2025–26లో 34.7 శాతానికి పెరిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, స్పెషల్ పర్సప్ వెహికిల్స్ (ఎస్పీవీలు) ద్వారా చేసే అప్పులను ఆయా రాష్ట్రాలు స్వయంగా చేసిన అప్పుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ద్వారా చేసే అప్పులకు అసలు, వడ్డీలను రాష్ట్ర బడ్జెట్ నుంచే చెల్లిస్తారని, ఈ నేపథ్యంలో కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితికి లోబడే ఆ అప్పులు కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితికి మించి గతంలో అప్పులు చేస్తే ఆ రుణాలను తదుపరి సంవత్సరాల రుణ పరిమితిలో తగ్గించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (3) ప్రకారం రాష్ట్రాలకు నికర రుణ పరిమితిని ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. -
వైఎస్ జగన్పై దర్యాప్తు అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు చేతిలో పావుగా మారి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదజల్లేందుకు యత్నించిన ఎల్లో మీడియా, నర్రెడ్డి సునీతలకు సీబీఐ కోర్టు గట్టిగా అక్షింతలు వేసింది. వీళ్లంతా గత కొన్నేళ్లుగా చేస్తున్నదంతా కేవలం దుష్ప్రచారమేనని, అందులో ఎంతమాత్రమూ వాస్తవం లేదని సీబీఐ కోర్టు తీర్పు సాక్షిగా స్పష్టమయ్యింది. నిరాధార ఆరోపణలతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించాలనుకున్న కుట్రలన్నీ బెడిసి కొట్టాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలన్న పిటిషన్పై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేకన్యాయస్థానం విస్పష్టంగా తీర్పును వెల్లడించింది. రెండువారాలపాటు దాదాపు 20 గంటల సేపు వాదనలు విన్న సీబీఐ కోర్టు 161 పేజీల సుదీర్ఘమైన, స్పష్టమైన తీర్పును వెలువరించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతిపై ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఏ వ్యక్తి మరణించినా, అతని సమీప బంధువులకు తెలియజేయడం చాలా సహజమని.. వివేకా హత్య విషయం జగన్కు తెలియజేయడాన్ని తప్పుబట్టడంగానీ, అనుమానించడంగానీ సరికాదని కోర్టు స్పష్టం చేసింది. వివేకా హత్యకు సంబంధించి వైఎస్ జగన్కు ముందే కాల్ వచ్చిందంటూ చంద్రబాబు, ఆయన చేతిలో పావుగా మారిన సునీత, ఎల్లోమీడియా చేసిందంతా దుష్ప్రచారమేనని, అంతా కట్టుకథేనని ఈ తీర్పును బట్టి స్పష్టమయ్యింది. స్వయంగా కన్నతండ్రిని అత్యంత కిరాతకంగా హత్యచేసిన దస్తగిరి బైట దర్జాగా తిరుగుతుంటే ప్రశ్నించాల్సిన సునీత.. చంద్రబాబు కేసులు వాదించే సుప్రీంకోర్టు న్యాయవాది లూథ్రా దస్తగిరి న్యాయవాదిగా మారి వాదిస్తుంటే పట్టించుకోని సునీత.. చేస్తున్న ఆరోపణలన్నీ దిగజారుడు ఆరోపణలేనని సీబీఐ కోర్టు తీర్పుతో వెల్లడైంది.చంద్రబాబు చేతిలో పావుగా మారి సీబీఐ కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు సునీత ప్రయతి్నంచినట్లు ఈ తీర్పును బట్టి అర్ధమవుతోంది. ‘వైఎస్ జగన్ స్వయానా వివేకా సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు. జగన్ తాతగారైన రాజారెడ్డికి, వైఎస్ భాస్కర్రెడ్డి తండ్రి చిన్న కొండారెడ్డి కుటుంబాలకు ఏదో చిన్న ఆస్తి తగాదాలు తప్ప.. జగన్, వివేకాకు మధ్య ఎలాంటి వివాదాలు లేవన్నది ప్రాసిక్యూషన్ వాదన’ అని పేర్కొంది. నాటి సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, సాంబశివారెడ్డిలను విచారించినా ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ సునీత విజ్ఞప్తిని తిరస్కరించింది. చార్జిïÙట్ ప్రకారం వారికి హత్యతో ఏదైనా సంబంధం ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదంది. హత్య జరిగిన రోజు(2019 మార్చి 15) ఉదయం 5:30 గంటలకు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చిందంటూ చేస్తోన్న ఆరోపణలపై మరింత దర్యాప్తు చేయవలసిన అవసరం లేదని అభిప్రాయపడింది. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో నర్రెడ్డి సునీత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ఈ నెల 10న తీర్పును వెల్లడించిన న్యాయస్థానం.. మంగళవారం అధికారిక కాపీని విడుదల చేసింది. వివరాలు ఆ మేరకు.. చాలా అంశాలపై దర్యాప్తునకు నిరాకరణ ‘ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారి జె.శంకర్ను సీఆర్పీసీ సెక్షన్ 161 కింద విచారించారు. 2021, సెపె్టంబర్ 28న వాంగ్మూలంలో జరిగిందంతా చెప్పారు. ఈ విషయంలో తదుపరి విచారణ అవసరం లేదు. భాస్కర్రెడ్డి, అవినాశ్రెడ్డిని రక్షించడానికి, హత్యకు బాధ్యత వహించేందుకు శివశంకర్రెడ్డి రూ.10 కోట్లను గంగాధర్రెడ్డికి ఇవ్వాలని చూశారని, అతని పాత్రపై విచారణ చేసినందున దర్యాప్తు చేయాలన్న సునీత అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేం. అవినాశ్రెడ్డితో సునీల్యాదవ్కు ఉన్న సంబంధం.. హత్యకు ముందు, తర్వాత వారి కదలికలకు సంబంధించి మొబైల్ ఫోన్ల కాల్ డేటా రికార్డు సేకరించి ఇప్పటికే పరిశీలించారు. హత్య జరిగిన రోజు అవినాశ్రెడ్డి ఎక్కడ ఉన్నారనే విషయానికి సంబంధించి ఐపీడీఆర్ విశ్లేషణ జరిగింది. ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం... న్యాయవాది ఓబుల్రెడ్డి, భరత్యాదవ్లు అవినాశ్రెడ్డికి సన్నిహితులు. ఎంవీ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు ఇస్తున్నప్పుడు ఓబుల్రెడ్డి కూడా స్టేషన్కు వెళ్లారు. భరత్ యాదవ్ వాంగ్మూలాన్ని సెక్షన్ 161 కింద 2021, జూన్ 28న నమోదు చేశారు. ఫిర్యాదుదారుడితో పాటు స్టేషన్కు వెళ్లారన్న ఒక్క కారణంతో ఓబుల్ రెడ్డి పాత్రపై తదుపరి దర్యాప్తుకు ఆదేశించలేం. ఆర్థిక లావాదేవీలు ఉంటే విచారణ సమయంలో నిరూపించవచ్చు’అని పేర్కొంది. అనుమానం ఆధారం కాదు.. ‘సయ్యద్ మున్నాకు చెందిన ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్లోని లాకర్ తెరవడం, అందులో నగదు, ఆభరణాలు లభించడం విషయానికొస్తే.. మరో తాళంతో సీబీఐ తిరిగి వాటిని లాకర్లో ఉంచినందున దీనిపై తదుపరి విచారణ అవసరం లేదు. మున్నా లాకర్లో లభించిన మొత్తానికి సంబంధించి సీబీఐ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు తెలియజేసింది. 2019, మార్చి 14 నాటి ఫుటేజీకి కాకుండా కేవలం 15 నాటి ఫుటేజీకి మాత్రమే సీబీఐ పరిమితమైందన్న పిటిషనర్ చేసిన వాదననూ అనుమతించలేం. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తారు. పిటిషనర్ వద్ద తన వాదనకు ఎటువంటి ఆధారం లేదు. హత్య జరిగిన రోజు ఒకే విధమైన నడక ఉన్న వ్యక్తిని గమనించిన విషయానికి సంబంధించి పిటిషనర్ అభ్యంతరం సరికాదు. కేవలం అనుమానం ఆధారంగా, ప్రత్యేకించి చిత్రం స్పష్టంగా లేనప్పుడు, ఆ విషయంలో తదుపరి విచారణ జరిపినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇదే విషయాన్ని వి.శివకుమార్ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో హైకోర్టు స్పష్టం చేసింది. నేర స్థలం ఫోటోలు, వీడియోల ఫోరెన్సిక్ నివేదిక అసంపూర్ణంగా ఉందన్నది ఈ దశలో నిర్ణయించలేం. విచారణ సమయంలో సంబంధిత సాక్షులను విచారించడం ద్వారా దానిని పరీక్షించవచ్చు’అని న్యాయస్థానం స్పష్టం చేసింది. డ్రైవర్ లోవరాజు ఏప్రిల్ ఉద్యోగం మానేయడం, హత్య జరిగిన రోజు విధులకు గైర్హాజర్ కావడానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. దర్యాప్తు అధికారి రాజు ప్రభుత్వ ఉద్యోగులందరినీ, అవినాశ్రెడ్డి వ్యక్తిగత సిబ్బంది రాఘవ రెడ్డిని సరిగ్గా విచారించలేదనే పిటిషనర్ వాదనను స్వాగతించలేం. ఎందుకంటే, నిందితులతో రాఘవ రెడ్డి ఎలాంటి లావాదేవీలు జరిపారని గానీ లేదా మధ్యవర్తిగా వ్యవహరించారని గానీ చార్జిషీట్లో ఎక్కడా పేర్కొనలేదు. ఇప్పటికే విచారించిన సాక్షులను తిరిగి విచారించడం అంటే.. దర్యాప్తు మళ్లీ మొదటి నుంచి ప్రారంభినట్లు అవుతుంది. ఇది అనుమతించబడదు. శివశంకర్రెడ్డి కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డిపైనా దర్యాప్తు అనవసరం’ అని న్యాయస్థానం పేర్కొంది. -
ఫేక్ సొసైటీతో భూకబ్జా కుట్ర
విజయవాడ నడిబొడ్డున ఖరీదైన భవానీపురంలోని జోజినగర్లో భూముల కబ్జాకు 2016లోనే కన్నేశారు. 1981 నాటి డేట్తో ఒక ఫేక్ సొసైటీని 2016లో ఏర్పాటు చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇప్పుడు జోజినగర్లో ఏకంగా 42 మంది పేదల ఇళ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేయటాన్ని బట్టి ఇందులో కూటమి పెద్దల కుట్ర స్పష్టంగా తేలుతోంది. ఇళ్ల కూల్చివేతపై సీబీఐతో విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది ఏమిటి? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోంది? పేదల తరపున ఉందా? ఇక్కడి వారు సీఎం చంద్రబాబును మూడుసార్లు, లోకేశ్ రెండు సార్లు కలిశారు. అర్జీలు ఇచ్చారు. ఎవరికైతే వీరు అర్జీలు ఇచ్చారో.. వారే కుట్ర పన్ని వీళ్లకు అన్యాయం చేశారు.సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు సర్కారు విజయవాడ భవానీపురంలోని జోజినగర్లో 42 మంది పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్ల కూల్చివేత దారుణమన్నారు. ఈ కూల్చివేతలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్నితో పాటు స్థానిక జనసేన కార్పొరేటర్ సోదరుడి ప్రమేయం ఉందన్నారు.‘సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్లు ఎలా కూల్చేస్తారు? పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేయడం దుర్మార్గం. జోజినగర్ బాధితుల బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లించాలి. కూల్చివేతలో ఇళ్లు కోల్పోయిన ఆ 42 కుటుంబాలకు తిరిగి ఇళ్లు కట్టించి ఇవ్వాలి’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. లేని పక్షంలో తమ ప్రభుత్వం రాగానే విచారణ జరిపించి ఈ ఘటనకు బాధ్యులను బోనులో నిలబెట్టి తీరుతామని హెచ్చరించారు.జోజినగర్ బాధితులకు పూర్తి అండగా నిలబడతామని, వారి న్యాయ పోరాటానికి పార్టీ తోడుగా ఉంటుందని ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం జోజినగర్లో పర్యటించి ఇళ్లు కోల్పోవడంతో రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ ఏకపక్షంగా తమ ఇళ్లను కూల్చివేశారని, ఎంత ప్రాథేయపడినా ఆలకించకుండా ఈ ప్రభుత్వం తమ బతుకులను రోడ్డు పాలు చేసిందని బాధిత కుటుంబాలు ఆక్రోశించాయి. వారికి న్యాయం జరిగేవరకు తోడుగా నిలిచి పోరాడతామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..ప్రభుత్వ పెద్దల అండతోనే కూల్చివేతలు..విజయవాడ జోజినగర్లో 42 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారు 25 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే ఒక్కసారిగా వచ్చి ధ్వంసం చేశారు. ఈ స్థలం గురించి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరుగుతోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఆ 42 కుటుంబాలకు డిసెంబరు 31 వరకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఒకవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా, ఈనెల 31 వరకు ఊరట ఉండగానే.. ఒకేసారి 200 మందికి పైగా పోలీసులు వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ, ఈ 42 ఇళ్లకు సంబంధించిన వారిని నిర్దాక్షిణ్యంగా, వాళ్లు ఇళ్లలో ఉండగానే, ఇళ్లన్నీ పడగొట్టి రోడ్డున పడేశారు.ప్రభుత్వ పెద్దల ప్రమేయం, వారి సహకారం, ఆశీస్సులతోనే ఇదంతా జరిగింది. అందుకే ఇంత అకస్మాత్తుగా కూల్చివేశారు. ఈ నెలాఖరు వరకు గడువు ఉందని తెలిసి కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వారిని రోడ్డు పాల్జేశారు.ఫేక్ సొసైటీ ఏర్పాటు..ఇక్కడ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.150 కోట్లకు పైగానే ఉంది. దీంతో దీంట్లోకి ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఓ ఫేక్ సొసైటీని పెట్టారు. 1981 డేట్తో ఒక తప్పుడు సొసైటీని ఏర్పాటు చేసి, రూ.150 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు అడుగులు పడ్డాయి.వీరంతా చంద్రబాబు సన్నిహితులు. నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడికి కూడా ఇందులో ప్రమేయం ఉంది. ఇంతమంది కలిశారు. అధికార దుర్వినియోగం ఎలా ఉంటుందనేందుకు ఇది నిదర్శనం. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే, డిసెంబర్ 31 వరకు వెసులుబాటు ఉన్నా కూడా.. 200 మందికిపైగా పోలీసులు వచ్చి ఇంత మందిని రోడ్డు పాల్జేశారు.ఈ స్థలాలు వేరేవారివైతే.. అనుమతులన్నీ ఎలా ఇచ్చారు?ఈ 2.17 ఎకరాల స్థలంలో 2001కి ముందు నుంచి 25 ఏళ్లుగా వీరు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇందులో చాలా మంది ఇళ్లు కూడా కట్టుకున్నారు. వాటికి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కూడా ఇచ్చారు. ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజీ కనెక్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఇళ్లకు ప్లాన్ అప్రూవల్ నుంచి అన్ని అనుమతులూ ఉన్నాయి. మరోవైపు బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి.ఇక్కడున్న వారిలో చాలామంది రూ.20 లక్షలు, రూ.25 లక్షలకుపైగా లోన్లు కూడా తీసుకుని ఇళ్లు కట్టుకున్నారు. మరి ఇక్కడ స్థలాలు వేరేవారివైతే.. ఎలా అనుమతి ఇచ్చారు? ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? బిల్డింగ్ ప్లాన్ ఎలా అనుమతించారు? బ్యాంకులు లోన్లు ఎలా ఇచ్చాయి? వాటర్, పవర్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు? మరి ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు, అన్ని అనుమతులున్నా.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, న్యాయం చేయాలని కనీసం ఆలోచన చేయకుండా, ప్రైవేటు వ్యక్తులకు మద్దతు ఇస్తూ, పోలీసులు వచ్చి పొక్లెయిన్లు, బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పగలగొట్టారు.గతంలో ఇక్కడ ఇళ్ల క్రయ విక్రయాలు జరిగినప్పుడు అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పలు సందర్భాల్లో పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడా, ఎవరి నుంచి అభ్యంతరాలు రాలేదు. ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేందుకు, రూ.150 కోట్లకుపైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు.. చంద్రబాబు, ఆయన కుమారుడు, టీడీపీ ఎంపీ, జనసేన కార్పొరేటర్ సోదరుడు.. ఇంతమంది కలిసి ఒక్కటై పేదలను నిస్సహాయులుగా రోడ్ల మీద నిలబెట్టించారు.సీబీఐతో విచారణ జరిపించాలి..ఇక్కడే కాదు.. రాష్ట్రమంతా ఇదే కొనసాగుతోంది. ఎక్కడైనా చిన్న చిన్న లిటిగేషన్లు ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఎంటర్ అవుతున్నారు. ల్యాండ్ కబ్జా చేస్తున్నారు. కొన్ని చోట్ల వారే స్వయంగా లిటిగేషన్లు పెట్టి కబ్జా చేస్తున్నారు. వీరే నిషేధిత జాబితాలో ఆస్తులను బలవంతంగా చేరుస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడు.. వీరంతా కలసి ఏ రకంగా కబ్జాలు చేయిస్తున్నారో ప్రజలకు తెలియాలి.ఇక్కడ 1981 డేట్ వేసి ఓ ఫేక్ సొసైటీని 2016లో ఏర్పాటు చేశారు. అది కూడా బయటకు రావాలి. ప్రభుత్వం పేదలకు అండగా ఉండాల్సింది పోయి వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేసింది. అందుకే మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలి. వాస్తవాలు బయటకు రావాలి.ప్రభుత్వమే లోన్లు చెల్లించాలి.. ఇళ్లు కూడా కట్టించాలిఇక్కడ 25 ఏళ్ల నుంచి ఉంటున్నారు. వారికి బ్యాంక్ లోన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇళ్లు లేవు. అందుకే ప్రభుత్వం ముందుకు రావాలి. వీరి బ్యాంక్ రుణాలు ప్రభుత్వమే కట్టాలి. వీరందరికి ఇక్కడ గానీ మరెక్కడైనా గానీ పక్కాగా ఇళ్లు కట్టించాలి.ఇది మీ జగనన్న మాట..!అయ్యా చంద్రబాబూ..! మీరు ఈ పని చేయకపోతే, రేపు మా ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం. దోషులను కోర్టు ముందు నిలబెడతాం. ఇక్కడి బాధితులందరికీ తోడుగా నిలబడతాం. బాధితులకు ఇది మీ జగనన్న మాట అని హామీ ఇస్తున్నా. సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ బాధితుల తరపున వాదించేందుకు వైఎస్సార్ సీపీ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తాం.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహూల్లా, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్తలు మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పోతిన మహేష్, పూనూరు గౌతంరెడ్డి, ఆసిఫ్, జోగి రాజీవ్, రామిరెడ్డి, కొండారెడ్డి, సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆడపిల్లలకు పసుపు–కుంకుమ కింద ఇచ్చా మేం 2007లో ఇక్కడ 180 గజాల ప్లాట్ కొన్నాం. నా ఇద్దరు కుమార్తెలకు 2015లో పెళ్లిళ్లు చేశాం. ఆ ప్లాట్ను రెండు భాగాలు చేసి 2016లో నా కుమార్తెలకు పసుపు–కుంకుమ కింద ఇచ్చాను. ఇప్పుడేమో ఆ ప్లాట్ మాది కాదని రోడ్డుపాలు చేశారు. ఇద్దరు కుమార్తెలు మా పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. అల్లుళ్లు గొడవ చేస్తున్నారు. చాలా దారుణంగా మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. అన్ని విధాలా అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు భరోసా ఇచ్చారు.– కోడెబోయిన కోటేశ్వరమ్మప్రభుత్వమే మమ్మల్ని రోడ్డుపాలు చేసింది మేం అందరం డబ్బులు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశాం. అక్రమంగా ఆక్రమించుకుని ఉంటున్న స్థలాలు కాదు ఇవి. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. మేం కొన్న స్థలాలు 25 తర్వాత మావి కాదంటే... మేం ఏమి చేయాలి? ఏమీ అర్థంకావడం లేదు. మాకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే మమ్మల్ని రోడ్డుపాలు చేసింది. అధికారులు బలవంతంగా మా ఇళ్లు కూల్చేశారు. ఉన్నపళంగా రోడ్డుపాలు చేశారు. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు.– విజయలక్ష్మిప్రైవేట్ వ్యక్తులకు కొమ్ముకాసిన ప్రభుత్వం మేం ఎన్నో ఏళ్లపాటు డబ్బులు కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఈ ప్రభుత్వం కొమ్ముకాసి మమ్మల్ని బజారున పడేసింది. ఇంత అడ్డగోలుగా మమ్మల్ని రోడ్డుపాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి పేదలంటే చిన్నచూపని అర్థమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చి మాకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. న్యాయ పోరాటానికి సహకారం అందిస్తామని, మాకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మాకు చాలా ధైర్యం వచ్చింది.– కె.అరుణరూ.25 లక్షలు బ్యాంక్ రుణం ఎలా కట్టాలి? కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని ఇక్కడ స్థలం కొన్నాం. కార్పొరేషన్ నుంచి ప్లాన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. ఇంటి నిర్మాణానికి బ్యాంకు నుంచి రూ.25 లక్షలు రుణం తీసుకున్నాం. ఇప్పుడేమో ఇంటిని దౌర్జన్యంగా కూల్చేశారు. మేం కొనుక్కున్న స్థలం మాదికాదంటున్నారు. బ్యాంక్ రుణం ఎలా కట్టాలి? మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులే మా ఇంటి నిర్మాణానికి ప్లాన్ ఇచ్చారు. ఆ ఇంటికి పన్ను కట్టించుకుంటున్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసులు వచ్చి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే మేం ఎలా బతకాలి?.– డి.స్రవంతిఊరిలో పొలం అమ్మి ఇక్కడ స్థలం కొన్నాం సిటీలో స్థలం ఉంటే మా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించాం. 25 ఏళ్ల కిందట సొంతూరులో ఉన్న ఎకరం పొలం అమ్మి ఇక్కడ స్థలం కొన్నాం. మొత్తం 42 ప్లాట్లు కొనుగోలుచేసివారు పేదలు. రోజువారీ పనులు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుని బతికేవాళ్లు. మేం అందరం కలిసి ఈ ప్రాంతంలో ఇళ్లు కట్టుకుని కాస్త అభివృద్ధి చేసుకున్నాం. చీమలు పుట్టలు పెడితే పాములు వచ్చి ఆక్రమించినట్లుగా సొసైటీ పేరుతో అక్రమంగా మా స్థలాలను ఆక్రమించారు. ప్రశ్నిస్తే కోర్టు తీర్పు అంటూ బెదిరిస్తున్నారు.– సుబ్బులులీగల్ సపోర్ట్ ఇస్తామని వైఎస్ జగన్ భరోసా కోర్టు తీర్పులో ఇళ్లు కూల్చి 42 ప్లాట్లను స్వా«దీనం చేసుకోవాలని ఎక్కడా పేర్కొనలేదు. ఈ నెలాఖరు వరకు కోర్టు గడువిచ్చింది. స్థానిక న్యాయస్థానాలు, హైకోర్టు ఇలా చాలాచోట్ల వాదోపవాదనలు జరిగాయి. అయితే బాధితులకు సరైన న్యాయం జరగలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల బాధితుల తరఫున న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించటానికి లీగర్ సపోర్ట్ ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. – వి.స్వప్న, న్యాయవాది -
రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
-
YS Jagan: వీళ్ళే లిటికేషన్ క్రీయేట్ చేసి 150 కోట్ల భూమిని కొట్టేద్దాం అని..
-
MASS WARNING : 42 కుటుంబాలను నడిరోడ్డున పడేస్తావా?
-
YS Jagan: స్థలం వీళ్లది కాకపోతే.. పర్మిషన్స్ ఎలా ఇచ్చారు?
-
సుప్రీంకోర్టులో కేసు ఉండగానే JCBలతో కూల్చేశారు జగన్ ఫైర్
-
బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేశారు: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ.. అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భవానీపురం జోజి నగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉంది. అయినా కూడా వీళ్ల ఇళ్లను ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీం కోర్టు వీళ్లకు ఊరట ఇచ్చింది. పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతుగా ఈ కూల్చివేతలు జరిపారు. 200 మంది పోలీసులు ఈ కూల్చివేతలు జరిపారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయి. అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడి వాళ్లను రోడ్డుపాలు చేశారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. .. 2.17 ఎకరాల ఈ భూమి విలువ రూ.150 కోట్ల దాకా ఉంటుంది. 2016లో ఫేక్ సొసైటీ క్రియేట్ చేశారు. అప్పటి నంచే ఈ భూమిని కాజేసేందుకు స్కెచ్ వేశారు. కూల్చివేతల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పేటర్ సోదరుడి ప్రమేయం కూడా ఉంది. బాధితులు చంద్రబాబును మూడుసార్లు కలిశారు. లోకేష్ను రెండు సార్లు కలిశారు. ఆ ఇద్దరికీ వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కూడా కుట్రపూరితంగా.. చంద్రబాబు, లోకేష్, చిన్నిలు బాధితులకు అన్యాయం చేశారు. బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు’’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్లకు అన్నిరకాల అనుమతులు కూడా ఉన్నాయి. బ్యాంకుల నుంచి లోన్లు కూడా వచ్చాయి. ఎన్నో ఏళ్లగా ఈఎంఐలు కూడా కడుతున్నారు. అయినా కూడా కుట్ర పన్ని కూల్చివేతలు జరిపారు. స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు?. ఇళ్లకు ఎలా అనుమతులు ఇచ్చారు?.. బ్యాంకు లోన్లు ఎలా వచ్చాయి?.. క్రయవిక్రయాలపై పేపర్లలలో కూడా ప్రకటనలు ఇచ్చారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు? అని ప్రశ్నించారాయన. ఈ క్రమంలో ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని.. బాధితులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కేటాయించాలని.. వాళ్ల బ్యాంకు లోన్లు కూడా ప్రభుత్వమే కట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ‘‘బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. అవసరమైన న్యాయ సహకారం కూడా అందిస్తాం. ఒకవేళ మీరు ఎంక్వైరీ వేయకపోతే.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పని చేస్తుంది. దోషులుగా మిమ్మల్ని కోర్టు ముందు నిలబెడుతుంది’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
KSR: EVMల ఛార్జింగ్ ఎలా మారింది? జగన్ చెప్పిందే నిజమైంది
-
‘‘బాబుగోరు.. మీరు గుడ్డో గుడ్డూ’’
ఏది ఏమైనా బాబుగోరు మీరన్నా...మీ పాలన అన్నా చెవి కోసుకుంటా. అసలు మీలా పాలించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? నాకైతే డౌటనుమానమే. గత ఎన్నికల్లో మీరు గొప్ప మనసు చేస్కొని మమ్మల్ని మీతో కలవనివ్వబట్టే కదా ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టా ...సెంటర్ లో మన సర్కారు నిలబెట్టా. మేం కూటమి అంటున్నామే కానీ అదంతా మీ చలవ కాకపోతే మరేందనుకుంటున్నారు. మీరు మాతో జట్టుకట్టబట్టే కదా ఈ పుణ్యం పురుషార్థం మాకు దక్కింది. అయినా బాబుగోరు మీ గొప్పతనం మీకు తెల్వదు... ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికక్కెడికో తీసుకెళ్లి పోతున్నారంటే నిజం నన్ను నమ్మండి..అసలు మీకున్న విజను...మీకున్న లిజను ఎవరికుంది చెప్పండి? కానీ విజన్ లేని వారికి ఏం తెలిసొస్తుంది చెప్పండి. ఒక్కోసారి వీరంతా ఎందుకొచ్చారా రాజకీయాల్లోకి అనిపించేస్తుందంటే నమ్మండి సుమండీ. అయినా కోటిజన్మల పుణ్యఫలం వల్లే కదా మీ స్నేహం మాకు దక్కింది. మీరాదరి మేమీ దరిని ఉన్నా....చెగువీరాను పూనిన ఆ అద్భుత వ్యక్తే కదా మనల్ని కలిపింది..లేదంటే మేమెంత ఒంటరి పక్షులమైపోయేవాళ్ళమో తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుందంటే నమ్మండి సుమండి..అయినా ఎవరెవరో ఏదో అంటుంటారు...మనం అదంతా పట్టించుకోరాదు బాబుగోరు. అలా పట్టించుకుంటే రాజకీయాల్లో ఉండగలమా? అయినా నా చాదస్తం గానీ మీకు ఇవన్నీ కొట్టినపిండేగా. నిజమే అప్పుడెప్పుడో పాత ఎన్నికలప్పుడు మమ్మల్ని మీరు మనసారా దూషించారు. కానీ మీ తిట్లే మాకు దీవెనలని అనుకోలేదూ..అయినా బాబుగోరు మమ్మల్ని మీరు అప్పుడెంత దూషించారో...ఆ క్షణాన కాస్త కోపం వచ్చినా...మళ్ళీ మాతో కలవాలని మీరు పదే పదే కలవరించారు చూడండీ...అదీ మీ గొప్పతనం. మన మధ్య స్నేహబంధం నాగార్జునా సిమెంట్ కన్నా దృఢమైంది. కాకుంటే ఇన్నిసార్లు మీరు ఇన్నేసి మాటలన్నా...మళ్ళీ లటుక్కున వచ్చి మమ్మల్ని అతుక్కుపోయారు చూడండి...అబ్బబ్బా ఏమన్నా పొలిటికల్ విజనా మీది. .ఇక మీ సైనికుని గురించి ఏం చెప్పమంటారు...ఎంతని చెప్పమంటారు? ఇపుడు వారు మాకూ ఆంతరంగికులై పోయారు. అసలు వారిని మీరు బలే తయారు చేశారు బాబుగోరు. ఏ ఇజాలు తెలీకపోయినా...నిజాలు రాకపోయినా పర్వాలేదు పైకి మాత్రం గంభీరంగా ఎస్వీరంగారావులాగా తలూపుకొంటూ తిరుగుతుండాలి. ఆయన అచ్చం అలానే చేస్తున్నారాయే. మమ్మల్ని కలవక ముందు చెగువీరా అన్నారా...ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో... అని పాటలు కూడా పాడేశారా...ఇపుడు చూడండి నుదుటిపై ఇంతేసి బొట్టు పెట్టుకుని , కాషాయం చుట్టుకుని...నా ధర్మం...నేచూస్తా...నే కాస్తా అంటూ ఎర్రజెండా పట్టుకున్నోరిలా రంకెలు వేస్తున్నారు. అసలు మీ ట్రైనింగ్ ఇక్కడే కనిపిస్తోంది. నేను మారాను అని చెప్పకుండానే చేసి చూపిస్తున్నారు. జనాలు ఎలాగూ నమ్మరనుకోండి ...అది మా సిలబస్ కాదు కదా. చూశారా ఇదీ కదా సేవ..సారీ స్నేహధర్మమంటే..గత ఎన్నికల్లో మీతో కలిసి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నానని బలే ప్రచారంలో పెట్టారు బాబుగోరు. అయినా అన్నామో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక...దాందేముంది లేండి...ఆ ప్రచారం వల్ల మీరు కుషీ అయితే అదే పదివేలు. గిట్టని వారు అది అబద్దమంటారని పీల్ కాకండి బాబుగోరు. మనం మనం బాగుంటే చాలు కదా...ఏదో మీ తృప్తి కోసం అలా అన్నారే అనుకోండి...మరీ అంత ప్రచారంలో పెడితే ఎలా? వదిలేయండి బాబుగోరు...మీ విజన్ కు అది ఆనదు గాక ఆనదు. అదేదో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మెడికల్ కళాశాలలు ప్రైవేటు వద్దంటూ కోటి సంతకాలు చేయిస్తున్నారటగా... నిరసనలు కూడా చేస్తున్నారటగా...జనాలూ వస్తున్నారటగా...ఆ మీరు బెదరుతారా ఏంది? అయినా ప్రైవేటైజేషన్ అంటే మీకు ఎంత ప్రేమో మాకు తెలీదా ఏంటి? మేం కూడా విశాఖ ఉక్కును ఎవరికైనా అప్పగిద్దామనే కదా అనుకుంటున్నది....కానీ గట్టిగా అనరాదు వేరెవరూ వినరాదు...మన సర్కారుకు ఇంకా బోల్డంత టైముంది ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది...ఇదే కదా బాబుగోరు మీ మనసులో మాట....అరే మా మనసులోనూ ఇదే. కానీయండి అలా ముందుకెళదాం..సివారఖరికి మేము చెప్పొచ్చేదేంటంటే.. ప్రతిపక్షాలు కదా కాస్త ఘాటుగానే వ్యవహరిస్తుంటాయి. కానీ మనం కూడా తక్కువేం కాదుగా అంతకంతకు నాటుగానే ఉంటున్నాం. మీరు మాత్రం తగ్గేదేలా అన్నట్లుండండి. విజన్ అంటూ ఊదరగొట్టండి. అసలు జనాలు మీరు ఏం చెబుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేక బిక్కమొగం వేసుకోవాలి. వారు తేరుకునేలోగా మన పుణ్యకాలం ఎలాగూ పూర్తయిపోతుంది. మరి ఆతర్వాతో అంటారా...సినబాబు చూసుకుంటారు లెండి. మన ప్యూచరేంటి అంటారా? నందో రాజో భవిష్యతి అనుకుని గ్లాసు నీళ్లు గటగటా తాగేయడమే. సరే మరి నేనుంటా మీరలాగే ముందుకు వెళ్ళిపోతూనే ఉండండేం.. పొరపాటున కూడా ఆగకండి.::ఆర్ఎం -
జోజి నగర్ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, విజయవాడ: భవానీపురం జోజి నగర్లో ఇళ్ల కోల్పోయిన బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తమ గోడును ఆయనకు చెప్పుకున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలను ఆయనకు చూపించాయి. ‘‘25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మావన్నీ కూడా పట్టా భూములే. అన్ని అనుమతులున్నాయి. వాటర్, కరెంట్ బిల్లులు కడుతూ వచ్చాం. మా ఇళ్లను అన్యాయంగా కూల్చేశారు. మమ్మల్ని రోడ్డున పడేశారు..’’ అని జగన్ వద్ద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితులతో.. ‘‘అధైర్య పడొద్దని.. అండగా ఉంటామని.. అన్నివిధాల అవసరమైన సాయం అందిస్తామని’’ అని ఆయన భరోసా ఇచ్చారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. ఆయన్ని చూసేందుకు.. ఫొటోలు తీసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు.. కరచలనం చేసేందుకు.. భారీగా జనం తరలివచ్చారు.ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజి నగర్లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. తమ ఇళ్లను కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులు ప్రభుత్వ పెద్దలకు కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వైఎస్ జగన్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు కంటతడి పెట్టగా.. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని, అవసరమైన న్యాయ సహయం అందిస్తానని ఆయన వాళ్లకు మాటిచ్చారు. ఈ క్రమంలో.. ఇవాళ స్వయంగా ఆయన జోజినగర్ వెళ్లి బాధితులతో కలిసి కూల్చివేత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే.. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ప్రొద్భలంతోనే కూల్చివేతలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూల్చివేతల సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నామని.. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్నామని.. ఇప్పుడు నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. -
రిలయన్స్కు బాబు సర్కారు జీహుజూర్
సాక్షి, అమరావతి: ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని సడలించి మరీ చంద్రబాబు సర్కారు రిలయన్స్ సంస్థకు జీహుజూర్ అంటోంది. ఆ సంస్థ అడిగినంత మేర ఐదేళ్ల పాటు రాయితీలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇటీవల జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్సూ్యమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ పానీయాల తయారీ యూనిట్ (కార్బొనేటేడ్ సాఫ్ట్డ్రింక్స్, పండ్ల రసాలు–ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్)ను ఏర్పాటుచేయనుంది.ఇందుకోసం రూ.1,622 కోట్ల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి కల్పించనుంది. అయితే, రిలయన్స్ కన్సూ్యమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ మొత్తం స్థిర మూలధన పెట్టుబడిలో రూ.601.87 కోట్లు టైలర్ మేడ్ రాయితీలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఐదేళ్ల పాటు ఈ రాయితీలు ఇవ్వడానికి రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ విధానం (2024–29) ప్రకారం అనర్హతగా ఉంది. దీంతో.. ఈ అనర్హత షరతును సడలిస్తూ దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించి ఐదేళ్ల వ్యవధిలో మూలధన సబ్సిడీని మంజూరుచేసేందుకు చంద్రబాబు సర్కారు ఆమోదం తెలిపింది. సంస్థ అడిగినంత మేర రూ.601.87 కోట్ల రాయితీ చెల్లించేందుకు అనుమతించింది.కేపిటల్ సబ్సిడీ కింద రూ.25 కోట్లు, రాష్ట్రంలో తయారుచేసి విక్రయించే ఉత్పత్తులపై ఎస్జీఎస్టీ కింద నగదు రూపంలో రాష్ట్రానికి వచ్చే 100 శాతాన్ని ఐదేళ్ల పాటు తిరిగి సంస్థకు చెల్లించనున్నారు. ఇలా ఐదేళ్లలో రూ.493.95 కోట్లు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీల కింద రూ.40.86 కోట్లను.. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు కింద ఐదేళ్ల పాటు రూ.40.86 కోట్లను రాయితీ రూపంలో ఇస్తారు. అలాగే, స్టాంప్ డ్యూటీ, బదిలీ సుంకం, భూ మార్పిడి ఛార్జీల రూపంలో రూ.1.20 కోట్లు తిరిగి చెల్లిస్తారు. ఇంధన శాఖ, రెవెన్యూ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ, ఏపీఈడీబీ సీఈఓ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని, నిర్దేశించిన సమయంలో వివిధ అనుమతులు పొందేందుకు వీలు కల్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో సూచించారు. బడా సంస్థకు ఇంతగా రాయితీలా?.. ఇదిలా ఉంటే.. అత్యధిక ధనిక సంస్థ అయిన రిలయన్స్కు ఇలా అడిగినంత మేర రాయితీలు ఇవ్వడంపట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఒక పక్క చిన్నచిన్న పారిశ్రామికవేత్తలకు రాయితీ బకాయిలు ఇవ్వకుండా మరోపక్క బడా సంస్థలు అడిగినంత మేర పాలసీలను సడలించి మరీ రాయితీలు ఇవ్వడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. కేవలం 1,200 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్న నేపథ్యంలో ఖజానా నుంచి ఏకంగా రూ.601.87 కోట్లు రాయితీలు ఇవ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు. -
బాబు పాలనలో నిరుద్యోగాంధ్రానే..! ఏపీలోనే నిరుద్యోగ రేటు అత్యధికం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్ర బాబు పాలనలో రాష్ట్రంలో అప్పులతోపాటు నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోతోంది. జాతీయ స్థాయిని మించి ఆంద్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు అత్యధికంగా ఉందని సోమవారం రాజ్యసభలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2 శాతంగా ఉంది. అదే ఆంద్రప్రదేశ్లో జాతీయ స్థాయిని మించి 8.2 శాతం నిరుద్యోగ రేటు ఉంది. జాతీయ స్థాయి సగటు నిరుద్యోగితతో పాటు మిగతా పెద్ద రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా నిరుద్యోగ రేటు ఉంది.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి చూస్తే మొత్తం ఏపీలో నిరుద్యోగ రేటు 8.2 శాతం ఉండగా పురుషుల్లో 7.2 శాతం, మహిళల్లో 10.1 శాతం నిరుద్యోగ రేటు ఉంది. ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫేస్టోలో చంద్రబాబు అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కలి్పస్తామని, లేదంటే అప్పటి వరకు నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.అయితే అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా ఆ హామీని అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశానని, ఇక దీన్ని అమలు చేసినట్లేనని మాట మార్చేశారు. అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు చెప్పారు. ఈ హామీని కూడా చంద్రబాబు అటకెక్కించేశారు. ఆడబిడ్డ నిధి పీ–4తో అనుసంధానం చేశానని మహిళలను నిండా మోసం చేశారు. దీంతో రాష్ట్రంలో యువతకు ఉపాధి లభించడం లేదు. దీంతో నిరుద్యోగిత పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
ఏపీలో కమీషన్ల కోసమే ప్రైవేటు అప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చెప్పారు. లోక్సభలో సోమవారం అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో పాల్గొన్న మిథున్రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వ తీరును, కేంద్రం చూసీచూడనట్లు వ్యవహరించడాన్ని ఎండగట్టారు. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని ముందుకొస్తున్నా.. కమీషన్ల కక్కుర్తితో అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తెస్తున్నారని చెప్పారు.ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా తెచ్చే ఈ అప్పులకు ఏకంగా రాష్ట్ర ఖజానా (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచే నేరుగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. గతంలో అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్) 13.5 శాతంగా ఉంటే, ప్రస్తుతం అది దేశంలోనే అత్యధికంగా 22 శాతానికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.రూ.150 కోట్ల కమీషన్: ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్ల పేరుతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు (9.3 శాతం) నిధులు సమీకరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకులు 6 శాతానికే రుణాలు ఇస్తుంటే.. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఎందుకు అప్పులు చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం 1.5 శాతం బ్రోకరేజ్ కమీషన్ కోసమే ఈ దందా నడుస్తోందని, దాదాపు రూ.150 కోట్ల ప్రజాధనాన్ని కమీషన్ల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్రం పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.అంతేగాక ప్రైవేటు వ్యక్తుల నుంచి తెచ్చే అప్పులకు గ్యారెంటీగా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ను చూపించడం, ప్రభుత్వ అనుమతి లేకుండానే అందులోంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడం దుర్మార్గమని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల అప్పులను కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని లేఖలు రాసిన కేంద్ర ఆర్థికశాఖ.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు.ఇప్పుడు నిబంధనలు మారాయా? లేక కూటమి ప్రభుత్వానికి ఒక న్యాయం, మాకో న్యాయమా?.. అని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కూలీలకు గత ఏడు నెలలుగా డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సొంత రాష్ట్రం, సొంత నియోజకవర్గంలోనే ఈ దుస్థితి ఉందంటే సిగ్గుచేటని విమర్శించారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించే కుట్రలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ప్లాంట్కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వమే నడపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుపరం చేయడాన్ని మిథున్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కడప–బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. -
పత్తాలేని పట్టాదారు పాస్ పుస్తకాలు.. ఏడాది నుంచి జారీ నిలిపివేసిన చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు రైతులు విలవిల్లాడుతున్నారు. గత ప్రభుత్వంపై అక్కసుతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీని నిలిపివేయడంతో గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వాటిపై అప్పటి సీఎం జగన్ ఫొటో ఉందనే కారణంతో ఏడాదిగా పాస్ పుస్తకాల జారీని నిలిపివేసింది. గత ప్రభుత్వంఇచ్చిన లక్షలాది పట్టాదార్ పుస్తకాలను వెనక్కి తీసు కుని కొత్తవి ఇస్తామని చెప్పినా ఇప్పటివరకూ ఆ పని చేయలేకపోయింది. పాస్ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు తీసుకునేందుకు రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ఎందుకంటే.. భూమి ఉందని నిరూపించుకునే ఏకైక ఆధారం ఈ పాస్ పుస్తకమే. జగన్ హయాంలో క్యూఆర్ కోడ్తో జారీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని ఎనిమిది వేల గ్రామాల్లో భూముల రీసర్వేను పూర్తిచేసి సంబంధిత రైతులకు క్యూఆర్ కోడ్తో రైతులకు పాస్ పుస్తకాలు అందజేసింది. ప్రతీ రైతుకి ఆధార్ నంబర్ తరహాలో ఒక యూనిక్ ఐడీని కేటాయించింది. రికార్డుల్లోగానీ, భూమిపైగానీ ఎటువంటి ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా భూవివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సర్వే విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్ల రాయితీ కూడా ప్రకటించింది. అయితే, వైఎస్ జగన్ హయాంలో జరిగిన భూ సంస్కరణలను వ్యతిరేకించి అభాండాలు మోపిన చంద్రబాబు ప్రభుత్వం ఆ రాయితీ సొమ్ము ఇటీవలే స్వీకరించడం విశేషం. వెనక్కి తీసుకుని కొత్తవి ఇవ్వలేదు.. మరోవైపు.. గత ప్రభుత్వం చేసిన రీసర్వేపై చంద్రబాబు బ్యాచ్ అభాండాలు మోపినా దానిని కొనసాగించక తప్పలేదు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఉందనే కారణంతో ఎనిమిది వేల గ్రామాల్లో సర్వే పూర్తయినా భూములకు సంబంధించిన పుస్తకాలను రైతులకు పంచలేదు. పంచిన వాటిని కూడా వీఆర్ఓల ద్వారా వెనక్కి తీసుకుంది. వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని ప్రకటించి ఏడాది దాటిపోయింది. ఇందుకోసం రూ.15 కోట్లతో టెండర్ పిలిచింది. చెన్నైకి చెందిన కంపెనీకి టెండరు ఖరారుచేసి పనులు అప్పగించింది. అయితే, ఈ ముద్రణలో చాలా లోపాలు చోటుచేసుకున్నాయి. తొలి విడతలో కొన్ని పుస్తకాలు ముద్రించగా వాటిలో అన్నీ తప్పుల తడకలేనని అధికారులు వాపోతున్నారు. పేర్లు, సర్వే నంబర్లు వంటివన్నీ మారిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. వాటిని పంచకుండా ఇంకా ముద్రణ పూర్తికాలేదని చెబుతున్నారు. రైతులు తమకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని పదేపదే అడుగుతున్నా వారిని రేపు, మాపు అంటూ చంద్రబాబు ప్రభుత్వం తిప్పుతూనే ఉంది. తహశీల్దార్లు కూడా పాస్ పుస్తకాలు ఎప్పుడు వస్తాయో తమకు తెలీదని చేతులెత్తేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా దీనిపై సరిగ్గా సమాధానం చెప్పకుండా త్వరలో ప్రింటింగ్ పూర్తవుతుందని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇటీవలే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాస్ పుస్తకాల ముద్రణకు పిలిచిన టెండర్లలో ఏర్పడిన సమస్యవల్ల ఇబ్బంది ఏర్పడిందని చావు కబురు చల్లగా చెప్పారు. అంటే.. ఇప్పట్లో పాస్ పుస్తకాలు వచ్చే అవకాశం లేదు. రైతుల అగచాట్లు.. పాస్ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలేదు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే నంబర్ల స్థానంలో ఎల్పీఎం నంబర్లు కేటాయించారు. ఈ నంబర్లు ఉన్న పాస్ పుస్తకాలు లేకపోవడంతో భూముల అమ్మకాలు కూడా జరగడంలేదు. రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉన్నా పాస్ పుస్తకాలు లేవనే భయంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేస్తే అడంగల్లో పేరు మారుతుంది తప్ప పుస్తకం రావడంలేదు. మరోవైపు.. రీ సర్వే జరగని గ్రామాల్లోనూ పాస్ పుస్తకాల జారీ కావడంలేదు. దీంతో.. రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
YSRCP తరఫున చర్చలో పాల్గొన్న పార్టీ పక్షనేత మిథున్ రెడ్డి
-
YSRCP Leaders: ఈ జన సునామీని చూశావ్..! దమ్ముంటే ప్రైవేటీకరణ చేసి చూడు
-
‘మాపై కేసులు.. అప్పులు.. తండ్రీకొడుకుల గొప్పలు ఇవే మిగిలాయి’
విశాఖ : కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి జరగలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నార్ మరోసారి ధ్వజమెత్తారు. ఐటీ కంపెనీల ముసుగులో ప్రజల ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కేసులు బనాయించడం, లప్పులు చేయడం, తండ్రీ కొడుకులు గొప్పలు చెప్పుకోవడం ఇవే మిగిలాయని ఎద్దేవా చేశారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 15వ తేదీ) అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘పెద్ద కంపెనీలకు భూములు ఇవ్వడం.. పెట్టుబడులను ప్రోత్సాహించడం సహజం. రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కట్టాబేడుతున్నారు. ఆ కంపెనిల్లో సత్వ ఒకటి. సత్త్వ కంపెనీకి 30 ఎకరాలు రిషికొండలో ఇచ్చారు. మార్కెట్ విలువ రూ. 40 కోట్లు ఎకరా ఉంటుంది.మొత్తం 30 ఎకరాలు రూ. 45 కోట్లకే ప్రభుత్వం కేటాయించింది. సత్త్వ ఉద్యోగాలు ఇవ్వదు. ఇది ఒక అద్దెలకు ఇచ్చుకునే సంస్థ. భూమి కేటాయించిన 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. ఇప్పటి వరకూ డబ్బులు సత్త్వ కంపెనీ కట్టలేదు. డబ్బులు కట్టడానికి గడువు పెంచుతూ జిఓ ఇచ్చారు. వడ్డీ కూడా లేకుండా చేశారు. రూ. 1500 కోట్లు విలువ చేసే భూమి 45 కోట్లకు కొట్టేసి.. ఆ డబ్బులు కూడా కట్టడం లేదు. సత్త్వ వెనక సీఎం చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. ఆ సంస్థ చేసే నిర్మానాలకు 50 శాతం మళ్ళీ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఒప్పందం ఉందా..?. 50% భూమిలో గృహ నిర్మానాలు చేసుకోడానికి అనుమతి ఇచ్చారు..ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా..?, సత్త్వ అన్ని రాష్ట్రల్లో వేలంలో భూములు కొనుక్కుంది’ అని స్పష్టం చేశారు. -
చంద్రబాబు రాజకీయ సమాధి ఖాయం ఇప్పటికైనా PPP ఆపేయ్
-
‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’
చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ప్రజా పోరాటంగా మారిన తీరు యావత్ దేశాన్నే ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్సీపీ ఈ ఉద్యమాన్ని “ప్రజా గళం”గా అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. అందుకు కారణం.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొనడమే!.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరలించింది. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్కు నివేదించి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. రచ్చబండతో షురూ ..అక్టోబర్లో వైఎస్సార్సీపీ “రచ్చబండ” పేరుతో ప్రజల మధ్యకు వెళ్లి సంతకాల సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు.తుపాను ఆపలేకపోయింది!లక్ష్యం కోటి సంతకాలు. ఆ సమయంలోనే తుపాను, వర్షాలు వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమం ప్లాప్ అవుతుందని కూటమి సర్కార్ సంతోషించింది. కానీ, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయం సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారు. ఆపై ఈ ప్రజా ఉద్యమం నవంబర్కొచ్చేసరికి నియోజకవర్గాల స్థాయికి చేరింది. ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. అటుపై సంతకాల బాక్సులు సేకరించి.. నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ ర్యాలీలకు అనూహ స్పందన లభించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసించాలి అంటూ ఆ ర్యాలీల్లో నినాదాలు చేశారు. డిసెంబర్ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ బాక్సులను భద్రంగా జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులకు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ ర్యాలీగా తాడేపల్లికి తరలించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ ఉద్యమం.. తమ ఆరోగ్యం, విద్యా హక్కుల పరిరక్షణ కోసమని జనం అర్థం చేసుకున్నారు. అందుకే ఇవాళ్టి(సోమవారం) ర్యాలీలో పార్టీ శ్రేణులకు పోటీగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం వల్లే ఇది ఒక విశాలమైన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. -
దళిత మహిళపై కుట్ర.. నీతులు చెప్తారు.. పాటించరు..!
-
వారెవ్వా బాబు.. మోదీకి తెలీకుండా.. మోదీనే వాడేశారుగా!
-
ఈ రోజు ప్రతి ఒక్కరు కోటి సంతకాలతో.. బాబు పై బియ్యపు మధుసూదన్ రెడ్డి ఫైర్
-
‘అయ్యా చంద్రబాబూ.. మీరు చేస్తోంది పెద్ద తప్పయ్యా’
సాక్షి, కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్యా.. అంటూ కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మచిలీపట్నంలో సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమాన్ని సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజాభిప్రాయాన్ని వైఎస్సార్సీపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అంతకు మించే అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. సంతక పత్రాలతో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీ నిర్వహించింది. జగన్కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని.. కోటి సంతకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని వైఎస్సార్సీపీ చెబుతోంది. మచిలీపట్నంలో ప్రతులను తరలించే కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు.. వైఎస్సార్సీపీ ఆఫీస్ నుంచి వాహనంలో బాక్సులను స్వయంగా పేర్ని నాని, ఇతర నేతలతో కలిసి ఎక్కించారు. అక్కడి నుంచి కోనేరు సెంటర్ దాకా భారీ ర్యాలీ జరిగింది. -
‘రెడ్బుక్’ పాలన తప్ప.. ప్రజా పాలన ఏదీ?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ పాలన తప్ప.. ప్రజా పాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను ఇవాళ భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ప్రజల నుంచి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై నిరసనలు స్వచ్చందంగా మద్దతు తెలిపారని ఆర్కే రోజా అన్నారు.వైఎస్ జగన్.. 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ పేరు చెరిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంది. విద్యార్థుల జీవితాలను కూటమి సర్కార్ నాశనం చేస్తుంది. కూటమి పాలనలో వారు చేసిన సర్వేలోనే అందరు మంత్రులకు రెడ్ మార్క్ వచ్చింది. విద్యావ్యవస్థను నారా లోకేష్ నాశనం చేస్తే.. వ్యవసాయాన్ని అచ్చెన్నాయుడు నాశనం చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు విచ్ఛిన్నం చేశారు. -
ఆయనేమన్నారో.. వీళ్లేం విన్నారో?
ఆంధ్రప్రదేశ్ గురించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసినట్టుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇవి ఆయన చేసినవేనా? లేక బీజేపీలోని టీడీపీ విధేయ ఎంపీలెవరైనా కావాలని అలా రాయించారా? 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లడం మంచిదైందని, ఏపీలో పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తోందని మోదీ వ్యాఖ్యానించినట్లు ఎల్లోమీడియాలో వార్తలొచ్చాయి. ఆయన ఏ ఫీడ్బ్యాక్ తీసుకున్నారో? ఏది బాగుందన్నారో? ఎవరకీ తెలియదు.. బహుశా, ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు మాత్రమే అర్థమైఉంటాయి. ఏదో సాధారణంగా అన్నమాటలను చంద్రబాబుకు మరిన్ని భుజకీర్తులు తొడగవచ్చు అని ఈ రెండు పత్రికలు అనుకుని ఉండవచ్చు. ప్రధానమంత్రి కార్యాలయానికి రాష్ట్రాల సమాచారం రాకుండా ఉంటుందా? అలాంటిది ఏపీలో ఏమి జరుగుతుందో తెలియకుండానే గుడ్డిగా ప్రశంసిస్తారా?.. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును మోదీ ఎలా విమర్శించింది, వారసత్వ రాజకీయాల గురించి ఎలా ధ్వజమెత్తింది, చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎన్ని ఆరోపణలు చేసింది అందరికి తెలిసిన విషయమే కదా!. అలాగే చంద్రబాబు కూడా ప్రధాని అని కూడా చూడకుండా మోదీని దారుణమైన విమర్శలు చేశారు. ఓటమి తర్వాత వ్యూహాత్మకంగా టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించి ఆ పార్టీని మేనేజ్ చేసే పని మొదలుపెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముందుగా బీజేపీతో జత కట్టించారు. ఒక సందర్భంలో బీజేపీకి టీడీసీ కలవడం ఇష్టం లేదని, తాను తిట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు కూడా. అప్పట్లో సీబీటీడీ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.2,000 కోట్ల మేరకు జరిగాయని ప్రకటించింది. ఆ తరువాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియకుండా పోయింది. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీ, అమిత్షాల అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో ఎదురుచూసిన సందర్భాలు కూడా మనం చూశాం. ఆ తరువాత ఏం చేశారో తెలియదు కానీ.. బీజేపీతో పొత్తు అయితే కొదిరింది. ఈ నేపథ్యం మొత్తానఇన పరిగణలోకి తీసుకుంటే.. మోదీ ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు మంచిదని అన్నాడంటే నమ్మడం కష్టమే. అది మంచి, చెడు కాదు. అవకాశవాద రాజకీయ పరిణామం అని మోదీకి కూడా తెలిసే ఉంటుంది. ఆ సంగతి పక్కనబెడితే గత పద్దెనిమిది నెలలుగా ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అధ్వాన్నపు, అరాచకపు పాలనకు మోదీ సర్టిఫికెట్ ఇచ్చి ఉంటే అంతకన్నా ఘోరం లేదు. ఫీడ్బ్యాక్ అంత బాగుంటే.. ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్రం చిట్టచివరి ర్యాంకు ఎలా ఇచ్చింది? రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఏపీలో పోలీసు వ్యవస్థను ఇంతగా దిగజార్చిన ప్రభుత్వం ఇంకో చోట ఉండకపోవచ్చు. తమ పార్టీ వ్యతిరేకమని పలుమార్లు ప్రకటించిన మోదీకి ఏపీలో టీడీపీ, జనసేనలు ప్రజాస్వామ్య పార్టీలుగా కనిపిస్తున్నాయా? లోకేశ్ను వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా గుర్తించే ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారా? మోదీ సైతం డబుల్ స్టాండర్స్ అనుసరిస్తున్న తీరు బాధ కలిగిస్తుంది. ఏపీ ప్రభుత్వ పనితీరు గురించి చూస్తే ఈ ఏడాదిన్నరలో ఏకంగా రూ.2.60 లక్షల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడాన్ని మోదీ సమర్థిస్తారా? ఇదే చంద్రబాబు సమర్థత అని అనుకుంటున్నారా? తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై మోదీ పెదవి విరిచారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరీ తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయని అడిగారట. ఏపీలో మాత్రం పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారట.అసలు ఏపీలో బీజేపీ ఉనికి ఉందా? టీడీపీనే మొత్తం డామినేట్ చేస్తోంది కదా? మోదీకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీలోని టీడీపీ కోవర్టులు ఎప్పటికప్పుడు చంద్రబాబు తరపున కేంద్రంలోని పెద్దలను మేనేజ్ చేస్తుంటారేమో తెలియదు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గంటల కొద్ది భేటీ అవడాన్ని తప్పుపట్టారట..బాగానే ఉంది. మరి తెలంగాణ ఉప ఎన్నికలో తన మిత్రపక్షమైన తెలుగుదేశం బీజేపీ అభ్యర్ధికి ఎందుకు మద్దతు ప్రకటించలేదు? పైగా కాంగ్రెస్ కు సపోర్టు చేసినా బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు కిమ్మనలేదు? దీనిపై మోదీకి ఎవరూ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదా? చంద్రబాబు ,పవన్ కళ్యాణ్, లోకేశ్ లు ఇక్కడ ఎందుకు ప్రచారం చేయలేదు? ఇదేనా ఎన్డీయే పక్షాల తీరు! ఏపీలో జగన్ను, వైసీపీ సోషల్ మీడియాను ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారని కూడా రాయించారు. అంటే వైఎస్సార్సీపీ అంత బలంగా ఉందని మోదీ భావిస్తున్నట్లే కదా! లేదంటే ఒరిజినల్ బీజేపీ వారు కూడా వైఎస్సార్సీపీపై తప్పుడు ఆరోపణలు చేయాలన్న లక్ష్యంతో ఇలా కథ అల్లి ఉండవచ్చన్న సందేహం ఉంది. ఏపీలో టీడీపీ, జనసేనలు సంయుక్తంగా విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికను బీజేపీ తనదని చెప్పలేకపోయింది. అయినా ప్రభుత్వంలో చేరిన తర్వాత ఆ హామీలకు బీజేపీ కూడా ఒప్పుకున్నట్లే కదా! వాటి అమలు తీరు తెన్నుల గురించి, ప్రధాని ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని ఉంటే బాగుండేది కదా! అప్పుడు వాస్తవాలు తెలిసేవి కదా! ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందని ఎల్లో మీడియానే ఆయా సందర్భాలలో కథనాలు ఇచ్చింది.అంతదాకా ఎందుకు మోదీ వ్యాఖ్యల కథనం వచ్చిన రోజునే పరిశీలిస్తే వివిధ పత్రికలలో వచ్చిన వార్తల సారాంశం కనుక ప్రధాని దృష్టికి వెళితే ఏపీలో కూటమి ఎంత అధ్వాన్నంగా ఉన్నది తెలుసుకోవడం కష్టం కాదు.ఎపి ప్రభుత్వం విద్యార్ధులకు ఇచ్చిన బాగ్ లు రెండు నెలల్లోనే చిరిగిపోయాయి. రెవెన్యూ శాఖలో గందరగోళంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్వయంగా చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు తనపై ఉన్న పలు అవినీతి కేసులను, మాఫీ చేయించుకుంటున్న తీరు అందరిని విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా ఫైబర్ నెట్ అవినీతి కేసును కూడా సిఐడి ని ప్రభావితం చేసి మూసివేయించుకున్నారు. ఇది ఏ మేర నైతికతో ప్రధాని చెప్పగలరా? మిత్రపక్షం కాకుండా ఉంటే టీడీపీపైన, చంద్రబాబుపైన మోదీ తదితర బీజేపీ నేతలు ఎంతగా విరుచుకుపడేవారో! చంద్రబాబు తన టూర్ లకు వాడే హెలికాఫ్టర్, విమానం అద్దె ఛార్జీల చెల్లింపునకు నలభైకోట్లకు పైగా ఇప్పటికే ఖర్చు చేశారట. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ లో తిరిగి చేరిన కార్పొరేటర్ ను పోలీసులే కిడ్పాన్ చేశారని వార్తలు వచ్చాయి. విజయవాడలో సుప్రీంకోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే పోలీసుల సమక్షంలో 42 ఇళ్లు కూల్చిన దారుణ ఘటన జరిగింది. ఆ బాధితులు మాజీ సీఎం జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అమరావతిలో రాజధాని అభివృద్ది సంస్థే చెరువులను చెరబట్టి రైతులకు వాటిలో ప్లాట్లు ఇస్తోందన్న స్టోరీ వచ్చింది.దీనిపై రైతులు మండిపడుతున్నారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసు పెట్టిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వారు లొంగిపోవడానికి కోర్టుకు వెళుతుంటే పోలీసులు ఎంత నిర్భంధ కాండ అమలు చేశారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఏపీలో గంజాయి వ్యాసారం సాగుతున్న తీరు అందరిని కలవర పరుస్తోంది.కుల వివాదంగా మారిన ఒక హత్య కేసులో భారీ పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం, నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు హత్యకు గురైతే కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం గంజాయి హబ్గా మారుతోందనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరమా? ఒకవైపు పోలీసుల దౌర్జన్యాలు, మరో వైపు టీడీపీ నేతల దాష్టికాలతో ఏపీ అంతటా అరాచకం ప్రబలుతుంటే మోదీకి ఈ పాలన ఎలా బాగుందో, ఆయనకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు. కేంద్రం నుంచి మోంథా తుపాను సహాయనిధిగా రూ.544 కోట్ల వస్తే ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేతంచర్లలో ఒక లిక్కర్ షాపు యజమాని ఎక్సైజ్ అధికారులు అడిగినంత మామూళ్లు ఇవ్వలేక ఏకంగా షాపునే మూసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎల్లో మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. రవాణా మంత్రి రామ ప్రసాదరెడ్డి పేషీ లో అవినీతి గురించి ఎల్లోమీడియాకు చెందిన ఒక పత్రిక వార్త ఇచ్చింది.రాష్ట్రంలో ప్రతినెల మొదటి తేదీన అందరికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రెవెన్యూ లోటు నిపుణులను భయపెడుతోంది. విశాఖ వంటి ప్రతిష్టాత్మక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. లూలూ గ్రూప్కు విజయవాడలో వందల కోట్ల విలువైన ఆర్టీసీ భూమిని కట్టబెట్టడంపై జనం మండిపడుతున్నారు.ఇలా ఏ రంగం గురించి చూసినా పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. వీటిని కవర్ చేయడానికి మత రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ ను టీడీపీ ఆపరేట్ చేస్తోందన్న అభిప్రాయం ఉంది. వైఎస్సార్సీపీని బదనాం చేయాలన్న దురుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, జనసేనలు వెనుకాడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోదీకి ఏపీ ప్రజలపై ఏ మాత్రం అభిమానం ఉన్నా, వాస్తవికమైన ప్రజాభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా చంద్రబాబు సర్కార్ కు సరైన సలహాలు ఇవ్వగలిగితే అంతా సంతోషిస్తారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కోటి సంతకాలు.. కోట్ల గళాలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం.. వైఎస్సార్సీపీ పోరాటం.. తుది అంకానికి చేరుకున్నాయి.. -
నీకు చేతకాకపోతే దిగిపో.. జగన్ చేసి చూపిస్తాడు..
-
ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
-
పార్లమెంటు స్థాయీ సంఘం నివేదికకు ఎల్లో మీడియా వక్ర భాష్యం
సాక్షి, అమరావతి: దేశంలో వైద్యవిద్య నాణ్యతపై ఇటీవల పార్లమెంటు స్థాయీ సంఘం విడుదల చేసిన నివేదికకూ ఎల్లో మీడియా వక్రభాష్యం పలికింది. కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలల ఆవశ్యకత, ఎంబీబీఎస్ సీట్ల పెంపు అవసరాన్ని స్థాయి సంఘం నొక్కివక్కాణిస్తే.. పీపీపీ విధానాన్ని సమర్థించినట్టు కట్టుకథలల్లుతోంది. కొత్తగా కళాశాలలు ఏర్పాటుకు ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలకు కేవలం పన్ను రాయితీలు చాలన్న స్థాయీ సంఘం సూచనను వక్రీకరించి చంద్రబాబు ప్రైవేటీకకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చినట్టు దుష్ప్రచారం చేస్తోంది. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు స్థాయి సంఘం చెప్పిందేమంటే..! ‘దేశంలో వైద్య విద్యకు ఉన్న పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. సీట్లు పరిమితంగా ఉండటంతో దేశం వెలుపల ఎంబీబీఎస్ అభ్యసించడానికి వలస వెళ్లే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది.’ అని పార్లమెంట్ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఇప్పటికే ప్రకటించినట్టు వచ్చే ఐదేళ్లలో 75 వేల సీట్లు జోడిస్తే విద్యార్థులు వలసలు వెళ్లడానికి అవసరం ఉండదని దృఢంగా అభిప్రాయపడింది. దేశంలో వైద్య విద్య నాణ్యతపై ఇటీవల స్థాయీ సంఘం నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక దేశంలోని అనేక రాష్ట్రాల్లోని వైద్య విద్యలో అసమానతలను బట్టబయలు చేసింది. దేశంలో వైద్య విద్యలో అసమానతలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని స్పష్టం చేసింది. దేశం మొత్తం 1.10 లక్షల ఎంబీబీఎస్ సీట్ల పంపిణీలో రాష్ట్రాల మధ్య అసమానతలను ఎత్తి చూపింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు 150కు దగ్గరగా ఎంబీబీఎస్ సీట్లు ఉండగా జాతీయ స్థాయిలో 75 సీట్లే ఉంటున్నాయని వివరించింది. 10 లక్షల జనాభాకు 50 కంటే తక్కువ సీట్లున్న రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఆయా రాష్ట్రాల పేర్లను నివేదికలో వెల్లడించలేదు. జాతీయ స్థాయిలో 10 లక్షల జనాభాకు 100 సీట్ల నిష్పత్తిని సాధించడానికి మరో 40 వేల సీట్లు కొత్తగా సమకూర్చాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 10 లక్షల జనాభాకు వంద కంటే ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి చేయాలని సిఫార్సు చేసింది. వైద్య కళాశాలలు అందుబాటులో లేని జిల్లాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, కళాశాలల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైద్య విద్యలో బోధన, బోధనేతర సిబ్బంది కొరత అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖలకు పలు సూచనలు చేసింది. వైద్య విద్యలో అసమానతలు అధిగమించడంతోపాటు, నాణ్యత పెంపునకు స్థాయీ సంఘం చేసిన సిఫార్సులకు ఐదేళ్ల కిందటే వైఎస్ జగన్ రాష్ట్రంలో కార్యరూపం ఇచ్చిందని వైద్యవర్గాల్లో చర్చ ఊపందుకుంది. చంద్రబాబు సర్కారు గ్రహణం 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం బాబు గద్దెనెక్కడంతో మిగిలిన మెడికల్ కళాశాలలకు చంద్రగ్రహణం పట్టుకుంది. ఎక్కడికక్కడ గతేడాది జూన్ నుంచి నిర్మాణాలను ఆపేసి, పీపీపీలో వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టే కార్యక్రమానికి చంద్రబాబు తెరలేపారు. వైద్య విద్యపై బాబు చిన్న చూపు ఏపీ విద్యార్థులకు పెను శాపంగా మారింది. ఉమ్మడి ఏపీ నుంచి వేరుపడిన సందర్భంలో మన కంటే తెలంగాణలో తక్కువ సీట్లు ఉండేవి. ఇదిలా ఉండగా పదేళ్లలో ఆ రాష్ట్రంలో తొమ్మిది వేలకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2014లో కేంద్రంలోని ఎన్డీఏతో పొత్తులో ప్రభుత్వాన్ని నడిపిన బాబు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఒక్కటంటే ఒక్క కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయలేదు. ఫలితంగా ఐదు కోట్లమందికిపైగా జనాభా ఉన్న ఏపీలో 2019–20లో 4,650 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో కేవలం రెండు వేల సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉండగా, మిగిలినవి ప్రైవేట్ కాలేజీల్లోవి. పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఏపీ కంటే ఎక్కువ సీట్లుండేవి. పోటీకి సరిపడా ఎంబీబీఎస్ సీట్లు లేక, ప్రైవేట్లో వైద్య విద్యను కొనే స్థోమత లేని వేల మంది విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్, కజికిస్తాన్ వంటి విదేశాలకు పరుగులు తీశారు. సామాన్య ప్రజలు సైతం ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందక తీవ్ర అగచాట్లు పడేవారు. పీపీపీ పేరిట దోచిపెట్టే కుట్రలు దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వాలు పీపీపీలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వాలని పార్లమెంట్ స్థాయీ సంఘం సూచించింది. ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి చేసిన బోధనాస్పత్రులను, తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతోంది. 10 కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ప్రభుత్వమే భూములు సేకరించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించి, నిర్మాణాల్లో మంచి పురోగతి సాధించిన కళాశాలలను పప్పుబెల్లాల మాదిరిగా ప్రైవేటుకు కట్టబెట్టేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బాబు సర్కారు అవలంబిస్తున్న విధానం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పార్లమెంట్ స్థాయి సంఘం సైతం కొత్త కళాశాలల ఏర్పాటు కోసం కేవలం పన్ను రాయితీలు మాత్రమే ఇవ్వాలని సిఫార్సు చేయడం గమనార్హం. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా బాబు సర్కారు అడుగులు వేస్తోంది. అంతేకాకుండా విద్యార్థుల నుంచి ఫీజులు, రోగుల నుంచి చార్జీల రూపంలో దోచుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఎకరం భూమికి కేవలం రూ.100 లీజు రూపంలో ఏకంగా 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కళాశాలలు పెట్టేస్తోంది. గతేడాది ప్రారంభం కాకుండా నిలిచిపోయిన పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని వైద్య కళాశాలలకు టెండర్లూ పిలిచింది. వాస్తవానికి పులివెందుల కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణం వైఎస్ జగన్ హాయంలోనే పూర్తయింది. ఈ నేపథ్యంలోనే బాబు ప్రభుత్వం ఏమీ చేయకున్నా పులివెందులకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 2024–25లోనే 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. అయితే కళాశాల మాకొద్దంటూ చంద్రబాబు సర్కార్ ఎన్ఎంసీకి లేఖలు రాసి, అనుమతులు రద్దు చేసింది. మిగిలిన మూడు కళాశాలలు ప్రారంభించకుండా వదిలేసింది. ఇప్పుడీ నాలుగింటిని తొలి దశలో ప్రైవేట్కు కట్టబెట్టడమే కాకుండా మరింత బరితెగించి, గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధనాస్పత్రులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టబోతుంది. రెండేళ్ల పాటు ఈ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఖజానా నుంచి వేతనాలు చెల్లించడం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు రూ.వందల కోట్లు దోచిపెట్టడానికి స్కెచ్ వేసింది.దోపిడీ విధానాన్ని సమర్థించుకోవడానికి పాట్లుపీపీపీ పేరిట దేశంలో ఎక్కడా లేనివిధంగా బాబు సర్కారు తెరలేపిన దోపిడీ విధానంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన నిరసన ర్యాలీలకు రాజకీయాలకు అతీతంగా విద్యార్థి, ప్రజా, మేధావి వర్గాలు తరలివచ్చాయి. ఈ నేపథ్యంలో తన దోపిడీ విధానాన్ని సమర్థించుకోవడానికి చంద్రబాబు సర్కారు నానా పాట్లు పడుతోంది. పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులకు వక్రభాష్యం చెబుతోంది. వైద్య కళాశాలల అభివృద్ధిలో పీపీపీ విధానమే ఉత్తమం అంటూ తన ఆస్థాన మీడియాలో ప్రచారం చేయించుకుంటోంది. అయితే పార్లమెంట్ స్థాయి సంఘం ఎక్కడా ప్రభుత్వం నిర్మించిన, నిర్మాణం ప్రారంభించిన కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టాలని చెప్పనే లేదు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. మసిబూసి మారేడుగాయ చేయడంలో ఆరితేరిన చంద్రబాబు పార్లమెంట్ స్థాయి సంఘంలోని చిన్న అంశాన్ని ఆయుధంగా మలుచుకుని తాను చేసేదే కరెక్ట్ అన్నట్టు వక్రీకరించేస్తున్నారు.పీపీపీ తప్పితే ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు నిర్వహించడం వేస్ట్ అన్నట్టుగా తప్పుడు ప్రచారాన్ని మరింత విస్తృతం చేసే పనిలోపడ్డారు. ప్లగ్ ప్లే తరహాలో తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతూ పీపీపీనే ఉత్తమ విధానం అంటూ సమర్థించుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నారు. ఐదేళ్ల కిందటే వైఎస్ జగన్ కార్యరూపం ప్రతి 10 లక్షల జనాభాకు 50 కంటే తక్కువ సీట్లు రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని స్థాయి సంఘం ప్రభుత్వాలకు సూచించింది. వైద్య సౌకర్యాలు సరిగా లేని జిల్లాల్లో కళాశాలలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రైవేటులో వైద్య విద్యను అభ్యసించడానికి రూ. కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్న క్రమంలో సామాన్య విద్యార్థుల తెల్లకోటు కల సాకారం చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పింది. పార్లమెంట్ స్థాయీ సంఘం ఇప్పుడు చేసిన సిఫార్సులకు ఐదేళ్ల కిందటే, అంటే 2019లోనే వైఎస్ జగన్ కార్యరూపంలోకి తీసుకొచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసి, ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తానన్న హామీని అమలు చేస్తూ ఏకంగా రూ.8వేల కోట్లకుపైగా నిధులతో 17 కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ ఒక్క ప్రభుత్వ/ప్రైవేట్ వైద్య కళాశాల లేని పల్నాడు, ఏఎస్ఆర్, బాపట్ల, అన్నమయ్య, సత్యసాయి, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగులు వేశారు. మరోవైపు ప్రైవేట్ వైద్య కళాశాలే తప్ప ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందని నంద్యాల, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లోనూ కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పడానికి నడుం బిగించారు. వీటితోపాటు కృష్ణా జిల్లా మచిలీపట్నం, కర్నూల్ జిల్లా ఆదోని, వైఎస్సార్ జిల్లా పులివెందుల, ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో కొత్త కళాశాలల నిర్మాణాలను కరోనా సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించి ప్రారంభించారు. 2023లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, 2024లో పాడేరు వైద్య కళాశాలను ప్రారంభించారు. -
కోటి సంతకాల పత్రాలతో.. నేడు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు
సాక్షి, అమరావతి: పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందకుండా చేస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ.. రూ.లక్ష కోట్ల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టి ‘నీకింత నాకింత’ అంటూ పంచుకు తినేందుకు చంద్రబాబు సర్కారు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పైగా.. ఈ ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగ–ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా కదంతొక్కడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడీ ఉద్యమం తుది అంకానికి చేరుకుంది. కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండటాన్ని నిరసిస్తూ 175 నియోజకవర్గాల్లోనూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేసిన పత్రాలను ఆయా నియోజకవర్గాల నుంచి ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని వైఎస్సార్సీపీ కార్యాలయాలకు భారీ ర్యాలీలతో తరలించారు. ఈ నేపథ్యంలో.. సోమవారం జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చాటిచెప్పేలా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది. ర్యాలీల్లో పాల్గొంటే కేసులంటూ బెదిరింపులు.. ఇక ఈ ర్యాలీలను అడ్డుకోవడానికి చంద్రబాబు సర్కారు అప్పుడే పోలీసులను ఉసిగొలిపింది. ర్యాలీల్లో పాల్గొనవద్దని.. పాల్గొంటే కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలకు జిల్లాల్లో పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అయితే, ఈ బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయబోమని.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించే ర్యాలీల్లో కదంతొక్కుతామని వారు తేల్చిచెబుతున్నారు. కోటి సంతకాల పత్రాలతో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి.. కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి, బినామీలకు కట్టబెట్టి కమీషన్ల దండుకోవడానికి వేసిన ప్రణాళిక.. పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను దూరం చేయడానికి చేస్తున్న కుట్రను మరోసారి ప్రజలకు వైఎస్సార్సీపీ నేతలు వివరించనున్నారు. ఆ తర్వాత కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలను జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడానికి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఈ కోటి సంతకాల పత్రాలను ఈనెల 18న సా. 4 గంటలకు పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్కు నివేదిస్తారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వివరిస్తారు. ప్రభుత్వమే వాటిని పూర్తిచేసి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. వాహనాల ర్యాలీకి అనుమతివ్వండి.. కోటి సంతకాల ప్రతులున్న వాహనాల ర్యాలీలకు అనుమతివ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ర్యాలీల్లో పాల్గొనద్దంటూ జిల్లాల్లో పోలీసులు నోటీసులు జారీచేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ర్యాలీలు, సంతకాల పత్రాల రవాణా సజావుగా సాగేందుకు అనుమతి అవసరమని.. దీనికోసం అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని అప్పిరెడ్డి తన లేఖలో డీజీపీకి విజ్ఞప్తి చేశారు. -
ఏఎంఆర్ విజిలెన్స్ టీమ్ కలకలం!
చీమకుర్తి: ప్రకాశం జిల్లాలో గ్రానైట్ సీనరేజి వసూళ్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టు అప్పగించిన ప్రైవేటు ఏజెన్సీ ఏఎంఆర్ సంస్థ సిబ్బంది ఏకంగా విజిలెన్స్ అధికారుల అవతారమెత్తారు. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులతో ఉన్న వాహనాల్లో వచ్చి పోలీసు అధికారులమంటూ గ్రానైట్ వాహనదారుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. వివరాల్లోకెళ్తే.. గ్రానైట్ వాహనాల నుంచి సక్రమంగా బిల్లులను చెక్ చేస్తున్నారా, లేదా? తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఏఎంఆర్ సంస్థ సిబ్బంది.. విజిలెన్స్ టీమ్ సభ్యులమంటూ మూడు రోజులుగా చీమకుర్తి బైపాస్ రోడ్డుపై గ్రానైట్ వాహనాలను ఆపి ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి నంబర్ ప్లేట్లూ లేకుండా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులతో, చేతిలో లాఠీలతో హడావిడి చేస్తున్నారు. తాము సెంట్రల్ గవర్నమెంట్ విజిలెన్స్ సిబ్బందిమని ఒకసారి, నెల్లూరు మైన్స్ అధికారులమని మరోసారి చెబుతూ లారీలను అడ్డుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నేత గుండా శ్రీనివాసరావు వారిని ఫొటోలు తీసి చీమకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వాహనాలను స్టేషన్కు తరలించారు. పోలీసులు ఏఎంఆర్ సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించగా.. సంస్థ అనుమతితోనే వారి సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు ఇలా తనిఖీలు చేశారని యాజమాన్యం సమాధానమిచ్చింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వాహనాలను వదిలిపెట్టారు. -
'రియల్'.. సీన్ రివర్స్!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి విజయవాడ, నెట్వర్క్: అభివృద్ధికి చిరునామా..! మంచి ప్రభుత్వం..! విజనరీ పాలన..! సంపద సృష్టిస్తానంటూ అంటూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వ్యవస్థలను దిగజారుస్తూ, అన్ని రంగాలను కుప్పకూలుస్తున్నారు. సంక్షేమం ఊసే పట్టించుకోకుండా.. అభివృద్ధి జాడే లేకుండా చేస్తున్నారు. ఒకవైపు పారిశ్రామిక విధానం ముసుగులో తమకు నచ్చినవారికి ఖరీదైన భూములను పప్పు బెల్లాల మాదిరిగా 99 పైసలకే కేటాయిస్తూ, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నీరుగార్చడంతో అవసరాలకు అమ్ముకోలేక రైతులు, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు, వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో సైతం ఇదే దుస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా విజయవాడ, బందరులో జిల్లా కేంద్రాలు, పోర్టు, కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో గుంటూరు నుంచి మచిలీపట్నం దాకా భూముల ధరలు బాగా పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. ఇప్పుడు ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. నెలకు పది రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో పరిస్థితి తారుమారైంది. రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది. విజయవాడ, తిరుపతి, నెల్లూరులో స్థిరాస్తి వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధానిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రచారం మినహా అభివృద్ధి జాడ లేకపోవడంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రివర్స్లో ప్రయాణిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ స్థిరాస్తి క్రయవిక్రయాల్లో మందగమనం కనిపిస్తోంది. రాష్ట్రం దూసుకుపోతోందంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. చంద్రబాబు సర్కారు మాటలు నిజమైతే స్థిరాస్తి మార్కెట్ కళకళలాడాలి. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం పెరగాలి. కానీ మార్కెట్ బేల చూపులు చూస్తోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతంలో ఎన్నడూ లేనివిధంగా పడిపోవడమే ఇందుకు ఉదాహరణ. 2023–24లో రూ.12 వేల కోట్లుగా ఉన్న రిజి్రస్టేషన్ల టార్గెట్ తాజాగా 2025–26 ఏడాదిలో రూ.10,169 కోట్లకు తగ్గిపోవడం గమనార్హం. ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు టార్గెట్ను పెంచుకుంటూ వెళ్లి అందుకనుగుణంగా ఆదాయాన్ని సముపార్జిస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం రివర్స్లో టార్గెట్ను తగ్గించుకుంటూ వెళుతోంది. తద్వారా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, స్థిరాస్తుల కొనుగోళ్లు జరగడం లేదని ప్రభుత్వమే అధికారికంగా నిర్థారించేసింది. 2023–24లో గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజి్రస్టేషన్ జరగగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో అక్టోబర్ నాటికి 13.92 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం దిగజారిన పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. కాగా దివంగత వైఎస్సార్ హయాంలో గొల్లపూడి నుంచి రామవరప్పాడు రింగ్ వరకు ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణంతోపాటు బుడమేరుపై ఫ్లైఓవర్లతో విజయవాడ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. చిన అవుటపల్లి నుంచి వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులను 2014–19 మధ్య టీడీపీ హయాంలో పట్టించుకోలేదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిన అవుటపల్లి నుంచి వెస్ట్ బైపాస్ పనులను 96 శాతం మేర పూర్తి చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరకుపైగా అవుతున్నా మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేయడంలో విఫలమైంది. రిజిస్ట్రేషన్ల టార్గెట్లు రివర్స్ చంద్రబాబు సర్కారు అస్తవ్యస్థ పాలన, విచ్చలవిడి అవినీతితోపాటు సంక్షేమ పథకాలు అందకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఊహించని విధంగా పడిపోయాయి. కనీసం వసూళ్ల లక్ష్యాన్ని కూడా సరిగా నిర్దేశించుకోలేని స్థాయికి రిజిస్ట్రేషన్ల ఆదాయం క్షీణించింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం నిర్దేశించిన లక్ష్యం కంటే కూడా ప్రస్తుతం తక్కువ టార్గెట్ పెట్టుకోవడం ద్వారా స్థిరాస్తి క్రయవిక్రయాలపై చంద్రబాబు సర్కారు ఆశలు వదిలేసుకుంది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని రూ.9,546 కోట్లు రాబట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ లక్ష్యాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం. 2024–25లో రూ.11,997 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకుని రూ.8,843 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంతకుముందు సంవత్సరం వచ్చి న ఆదాయాన్ని కూడా చంద్రబాబు సర్కారు తొలి ఏడాది సాధించలేకపోయింది. ఇక 2025–26లో లక్ష్యాన్ని రూ.10,169 కోట్లుగా పెట్టుకుని అక్టోబర్ నాటికి రిజి్రస్టేషన్ల ద్వారా రూ.7 వేల కోట్లు వసూలు చేయగలిగింది. వరుసగా రెండేళ్లపాటు లక్ష్యాన్ని తగ్గించుకోవడాన్ని బట్టి స్థిరాస్థి రంగంలో ఏమాత్రం వృద్ధి లేదని ఈ ప్రభుత్వమే బయటపెట్టింది. దీంతో తన హయాంలో పడిపోయిన ఆదాయాలనే కొలమానంగా తీసుకుని ప్రస్తుత ఆదాయాలను పోల్చుతుండడం విశేషం. ఆదాయాన్ని 2023–24 సంవత్సరంతో పోల్చకపోవడం, తక్కువ లక్ష్యాన్ని పెట్టుకుని దాంతో పోల్చడం ద్వారా ప్రజలను మభ్యపుచ్చేందుకు యత్నిస్తోంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రబాబు సర్కారు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను సగటున 50 శాతానికిపైగా పెంచింది. దీంతో ప్రజలపై భారం పడి రిజిస్ట్రేషన్ల సొమ్ము ఎక్కువగా కట్టాల్సి వస్తోంది. చార్జీలు పెంచడం ద్వారా ప్రజలను బాది ఆదాయాన్ని పెంచుకున్నా రిజి్రస్టేషన్లు మాత్రం అమాంతం తగ్గిపోవడం గమనార్హం. లేదంటే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇంకా భారీగా పడిపోయేదని స్పష్టంగా తెలుస్తోంది. రాజధానిలో ‘రియల్’ షాక్..! రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. రాజధానికి బడా కంపెనీలు, కార్యాలయాలు వచ్చేస్తున్నాయని చంద్రబాబు సర్కారు ప్రచారం చేస్తున్నా రియల్ వ్యాపారం మాత్రం పెరగడంలేదు. రాజధాని పరిసర ప్రాంతాల్లో కొత్త వెంచర్లు వేయడం తగ్గిపోయింది. ఇప్పటికే వేసిన వాటిలో స్థలాలు అమ్ముడు కావడంలేదు. అపార్టుమెంట్లలో ప్లాట్లు పరిస్థితి కూడా అలాగే ఉంది. స్థలాలు, ప్లాట్ల కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనలో మునిగిపోయారు. స్వయంగా చంద్రబాబు రాజధానిలోని వెలగపూడిలో ఇల్లు నిర్మించుకుంటున్నట్లు చెబుతున్నా అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు. రెండు, మూడు విడతల భూసమీకరణ ద్వారా మరింత భూమిని తీసుకుంటామని ప్రకటించడం, పూలింగ్కు భూములు ఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ చేస్తామని బెదిరిస్తుండటంతో రాజధానిలో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. చంద్రబాబు సర్కారు భూదాహంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. పట్ణణాలు, నగరాల్లోనూ డీలాచంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాయలసీమను పట్టించుకోకపోవడం, ఆ ప్రాంతంలో పెట్టుబడులు రాకపోవడంతో రియల్ రంగం కుదేలైంది. వైఎస్ జగన్ హయాంలో సీమలో పరుగులు తీసిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇప్పుడు కుదేలయ్యాయి. ప్రధానంగా తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో భూముల అమ్మకాలు తగ్గిపోయాయి. స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల దందాలు, భూములపై పెత్తనం చేస్తుండడంతో కొనాలనుకున్న కొద్దిమంది కూడా జంకుతున్నారు. క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం లాంటి ప్రధాన నగరాల్లోనూ రియల్ వ్యాపారం మందకొడిగా ఉంది. నగరాల్లోనూ అమ్మకాలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడ–మచిలీపట్నం రహదారికి ఇరువైపులా గతంలో కళకళలాడిన వ్యాపారం ఇప్పుడు పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం, ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, కార్పొరేట్ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని చంద్రబాబు ప్రభుత్వం బడాయి పోతున్నా భూముల కొనుగోళ్లు మాత్రం లేకపోవడం గమనార్హం. 2019–24 మధ్య విశాఖలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లిన రియల్ వ్యాపారం ఏడాదిన్నరగా దిగజారిపోయింది. పెద్ద ప్రాజెక్టులు చాలా వరకూ ఆగిపోయాయి. కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయాయి. నిర్మాణ రంగం విలవిలఒకపక్క రియల్ రంగం తిరోగమనంలో ఉండడంతో మరోపక్క దానిపై ఆధారపడిన నిర్మాణ రంగం కూడా కుదేలైంది. భవన నిర్మాణ కారి్మకులకు పనులు తగ్గిపోయాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కార్మికులకు గతంలో చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు పని దొరకడం కష్టంగా మారింది. నిర్మాణ రంగంలో కీలకమైన ఇటుక, సిమెంట్, పెయింటింగ్, ప్లంబింగ్, ఇనుము. ఎలక్ట్రిసిటీ, విక్రయాల వ్యాపారాలు క్షీణించాయి. ఇలా చంద్రబాబు సర్కారు అస్తవ్యస్థ విధానాల వల్ల కీలక రంగాలు చతికిలపడ్డాయి. వ్యాపారాలు తగ్గిపోవడంతో వాటిపై ఆధారపడిన వారు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో మనీ సర్క్యులేషన్ తగ్గిపోవడంతో అన్ని వ్యాపారాలు తగ్గిపోయాయి. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ హయాంలో మంచి రోజుల్లో సగటున రోజుకు 150, ఇతర రోజుల్లో 100–120 రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు మంచి రోజుల్లోనూ 70–80 దాటడం లేదు. సాధారణ రోజుల్లో 50 రిజిస్ట్రేషన్లు కావడం గగనంగా ఉంది. 2019కి ముందు మచిలీపట్నం శివారులో సెంటు రూ.3 లక్షలు ఉంటే 2024లో రెట్టింపై రూ.6 లక్షలకు చేరుకుంది. తరువాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా ధరలు పెరగలేదు. 2022–23లో తూర్పు గోదావరి జిల్లాలో 1,29,355 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా 2025–26 నవంబర్ చివరి నాటికి కేవలం 61,597 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. విజయనగరం పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.10 లక్షలు ఉన్న 200 గజాల ఇంటి స్థలం 2019 తరువాత వైఎస్ జగన్ హయాంలో రూ.25 – రూ.30 లక్షలకు చేరుకుంది. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు తగ్గిపోయాయి. మూడు నాలుగేళ్ల క్రితం కొన్న ధరకు అమ్ముకుందామన్నా కొనేవారు లేరని వ్యాపారులు చెబుతున్నారు. కడప అర్బన్, రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత ప్రభుత్వంలో రోజుకు సుమారు 250–300 రిజి్రస్టేషన్లు జరగగా ప్రస్తుతం 50–60 మించడం లేదు. ప్రొద్దుటూరు సబ్ రిజి్రస్టార్ కార్యాలయ పరిధిలో రోజుకు 80–90 రిజిస్ట్రేషన్లు నుంచి ప్రస్తుతం 30కి తగ్గిపోయాయి. ఆదోని మెడికల్ కాలేజీ పరిసరాల్లో గతంలో ఎకరం రూ.5 కోట్లు పలకగా ఇప్పుడు అడిగే నాథుడే కరువయ్యారు. 2023–24 వైఎస్ జగన్ హయాంలో ఇలా..1) రిజిస్ట్రేషన్ల ఆదాయం టార్గెట్ రూ.12,000 కోట్లు 2) రాష్ట్రంలో భారీగా పెరిగిన భూముల ధరలు 3) రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు.. 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ 4) రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, 30 లక్షలకుపైగా గృహ నిర్మాణాలు - ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం - తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు - గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణాలతో స్థానికంగా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధితో పాటు సంపద సృష్టిస్తూ అడుగులు 5) భవన నిర్మాణ కార్మికులకు సమృద్ధిగా పనులు 6) సంక్షేమ పథకాల అమలుతో పెరిగిన పేదల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు 7) రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలు కళకళ. జోరుగా గృహ నిర్మాణాలతో సిమెంట్, పెయింట్లు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వ్యాపారాల జోరు 2025–26 బాబు ప్రభుత్వంలో.. 1) రిజిస్ట్రేషన్ల ఆదాయం టార్గెట్ రూ.10,169 కోట్లకు కుదింపు 2) భూముల ధరలు ఒక్కసారిగా పతనం.. రాజధానిలోనూ మందగమనం 3) రిజిస్ట్రేషన్లు పదుల సంఖ్యకే పరిమితం.. అక్టోబర్ దాకా 13.92 లక్షలే 4) కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోగా ఉన్న వ్యవస్థలే నిర్వీర్యం. 5) పొట్ట కూటి కోసం కార్మికుల అవస్థలు 6) పథకాలు అందక, అభివృద్ధి జాడ లేక పేదల దీనావస్థ 7) రియల్ ఎస్టేట్ వెలవెల. ఆగిన ఇళ్ల నిర్మాణాలు. వ్యాపారులు బేజార్కృష్ణాలో కుప్పకూలింది..! కృష్ణా జిల్లాలో ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గత ప్రభుత్వంలో నెలకు 20 రోజులకు తగ్గకుండా పనులుంటే ఇప్పుడు పది రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని భవన నిర్మాణ కార్మికులు వాపోతున్నారు. అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది. వైఎస్సార్ సీపీ హయాంలో బందరు పోర్టుకు శంకుస్థాపన చేసి పనులను పరుగులు పెట్టించింది. మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. గిలకలదిండి íఫిషింగ్ హార్బర్, పలు కొత్త హైవేలు రావడంతో జిల్లా పునర్విభజన సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. బందర్ హైవే వెంట నిడుమోలు, పామర్రు, ఉయ్యూరు. కంకిపాడు ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. కత్తిపూడి–ఒంగోలు హైవేతో పెడన, అవనిగడ్డ నియోజక వర్గాల్లో సైతం రియల్ భూమ్ అందుకొంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక వేగం మందగించడంతో రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొంది. బాపట్లలో భవన రంగం బాధలు బాపట్ల జిల్లాలో ఏడాదిన్నరగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనమైంది. గత ప్రభుత్వంతో పోలిస్తే రిజి్రస్టేషన్లు సగం తగ్గాయి. వైఎస్ జగన్ హయాంలో బాపట్ల జిల్లాలో 2022 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 76,215 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 50,983 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగాయి. ప్రభుత్వానికి రాబడి తగ్గిపోగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గత ప్రభుత్వంలో నెలకు 22 రోజులకు తగ్గకుండా పనులుంటే ఇప్పుడు పది రోజులు కూడా దొరకడం లేదని భవన నిర్మాణ కారి్మకులు వాపోతున్నారు. సిమెంట్, ఐరన్ విక్రయాలు పడిపోయాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో జిల్లాలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. తీరప్రాంతం అభివృద్ధికి నిధులు కేటాయించడంతో రోడ్లు ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా జరిగాయి. బాపట్ల కేంద్రంగా గత ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేసింది. దీంతో 2019 తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అప్పటివరకూ తీర ప్రాంతంలో ఎకరం రూ.30 లక్షలు పలికిన భూమి తరువాత రూ.3 నుంచి 5 కోట్లకు చేరింది. గత ఏడాదిన్నరగా పరిస్థితి తారుమారైంది. వైఎస్ జగన్ హయాంలో బాపట్ల మెడికల్ కళాశాల ప్రాంతంలో రూ.కోటిన్నర పలికిన ఎకరం భూమిని ప్రస్తుతం రూ.20 లక్షలకు కూడా కొనేవారు లేరు. అద్దంకి, రేపల్లె ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో ఎకరం రూ.కోటి దాకా పలికిన భూముల ధరలు తిరిగి రూ.20 లక్షలకు పతనమయ్యాయి.పల్నాడులో ధరలు పతనం.. పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాల రాకతో పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజుపాలెం, మాచవరం తదితర మండలాల్లో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. రైతుల భూములు రెట్టింపు ధరలు పలికాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ ఆదాయం అమాంతం పడిపోయింది. పల్నాడు జిల్లావ్యాప్తంగా 2023–24లో రిజి్రస్టేషన్ల ద్వారా రూ.472.38 కోట్ల ఆదాయం సమకూరగా 2024–25లో ఆదాయం రూ.396 కోట్లకు పడిపోయింది. 2025–26లో ఇప్పటిదాకా రూ.200 కోట్లు కూడా రాలేదు. గతంలో ఏటా సగటున 32 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా ప్రస్తుతం అది 14 వేలకు పడిపోయింది. దీంతో మధ్యవర్తులు ఉపాధిలేక హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్తున్నారు. గతంలో వెంచర్ల ఏర్పాటుతో ఉపాధి పొందిన వేలాది మంది కూలీలు, ట్రాక్టర్, జేసీబీ, ట్రక్కు డ్రైవర్లు ప్రస్తుతం పనుల కోసం అడ్డాలలో ఎదురు చూస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చేరువలోని కామేపల్లి గ్రామ పరిధిలో 2019కి ముందు ఎకరం పొలం రోడ్డు పక్కన సుమారు రూ.30 లక్షలు ఉండగా స్థానికంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏకంగా ఎకరం రూ.కోటిన్నర దాకా పలికింది. 2024లో వైఎస్సార్సీపీ దిగిపోయేనాటికి ఎకరం రూ.2 కోట్ల దాకా వెళ్లింది. అదే ఇప్పుడు కనీసం రూ.60 – రూ.80 లక్షలు కూడా పలకడం లేదు. కనీసం ధర గురించి అడిగే వారు లేరని రైతులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. నరసరావుపేటలోనూ వెంచర్లు వేసిన వ్యాపారులు స్థలాలు అమ్ముకోలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో నీరసించిన వ్యాపారం నెల్లూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ బాగుంటుందని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన రియల్టర్లు లేఅవుట్లు వేశారు. అన్ని సదుపాయాలతో అధునాతనంగా ఇళ్ల నిర్మాణాలు కూడా చేశారు. ఇప్పుడు వాటిని కొనేవారు లేరు. గత 9 నెలలుగా ఖాళీగా ఉన్నారు. కొందరు బిల్డర్లు నూతనంగా నిర్మించిన ఇళ్లను బాడుగలకు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. భారీగా వడ్డీలు కట్టలేక లబోదిబోమంటున్నారు. ఇక మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తూ చంద్రబాబు సర్కారు ప్రకటన చేసినా రియల్ ఎస్టేట్ ఏమాత్రం ఊపందుకోలేదు. ఏడాదిలో ఒక్కటీ అమ్ముడుపోలేదుటీడీపీ అధికారంలోకి వచ్చాక భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గాయి. గత ఏడాది కాలంలో ఒక్క ప్లాటు కూడా అమ్ముడు పోలేదు. పెట్టుబడులు మొత్తం ప్రాజెక్టులపై పెట్టాం. వ్యాపారం దివాలా తీస్తోంది. తెచి్చన పెట్టుబడులకు వడ్డీలు కట్టడమే సరిపోతోంది.– షేక్ కిరణ్బాబు, బిల్డర్, ఈడుపుగల్లు, కంకిపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా వలసలు పోతున్నారు ఏడాదిన్నరగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. స్థలం అమ్మేవారు ఉన్నా.. కొనేవారు లేరు. అందుకే రిజి్రస్టేషన్లు ఆగిపోయాయి. ఇల్లు కట్టించే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఓపెన్ ప్లాట్లు కూడా అమ్ముడు పోవడం లేదు. దీంతో భవన నిర్మాణ కారి్మకులు తమ పనులను వదిలేసి బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. – నాగరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు, కదిరి, సత్యసాయి జిల్లాపూర్తిగా పతనమైన రియల్ ఎస్టేట్ ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌనైపోయింది. మార్కాపురం జిల్లా ప్రకటిస్తే మంచి ధరలు వస్తాయని ఆశించాం. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అమ్మే వారు ఉన్నాగానీ కొనేవారు లేరు. నేషనల్ హైవే పక్కన కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. సంతనూతలపాడు మండలంలో రియల్ ఎస్టేట్ భూం ఇప్పుడు పూర్తిగా పతనమైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో నమోదవుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఇక్కడ 2022–23లో 6,029 రిజిస్ట్రేషన్లు జరిగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024–25లో ఆ సంఖ్య 3,972కు పడిపోయింది. – కుంచాల ఆంజనేయులు, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లాపూట గడవడమే కష్టంగా ఉందిరియల్ ఎస్టేట్ కుదేలైంది. భవన నిర్మాణాలు భారీగా తగ్గిపోయాయి. గతంలో నెలలో 20 రోజులకుపైగా పనులుంటే ప్రస్తుతం 10–15 రోజులు కూడా దొరకడం లేదు. భవన నిర్మాణ కార్మికులకు పూట గడవడమే కష్టంగా ఉంది. – జి.హరికృష్ణారెడ్డి, ఎనీ్టఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడునెలలో సగం రోజులే పనిరియల్ ఎస్టేట్ లావాదేవీలన్నీ నిలిచి పోయాయి. దీంతో నిర్మాణ పనులపై ఆధారపడి ఇక్కడ జీవిస్తున్న వేల మంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాజధాని వస్తుందన్న సమయంలో భవనాల పనులు మొదలు పెట్టారు. అందరికీ చేతినిండా పని ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పనులు దొరకడం లేదు. రోజుకో బ్యాచ్కి పని సర్దుబాటు చేయాల్సి వస్తోంది. అంటే ఒక కార్మికుడికి నెలలో 15 రోజులు కూడా పని లేకుండా పోయింది. దీంతో కారి్మకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు దొరకకపోవడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. – వైఎస్ మూర్తి, శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మధురవాడ, విశాఖపని దొరకడం లేదు.. గత ప్రభుత్వంలో నెలకు 22 రోజులు పనులు దొరికేవి. ఈ ప్రభుత్వం వచ్చాక నెలకు పది రోజులు కూడా పనులు ఉండడం లేదు. ఉదయమే సెంటర్కు వచ్చి పడిగాపులు కాస్తున్నాం. కుటుంబ పోషణ భారంగా మారింది. – నాగూర్బాషా, భవన నిర్మాణ కార్మికుడు, ఉప్పరపాలెం, బాపట్ల జిల్లా. -
పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు.. వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 మెడికల్ సీట్లు పేదలు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థల్లా మార్చుకున్నారన్న ఆక్షేపించారు. మరోవైపు కేంద్ర స్థాయీ సంఘం పేరుతో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడు.. పీపీపీ విధానమే ముద్దు అంటూ బాబుకి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ద్వారా.. ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకొవాలని చంద్రబాబుకు సూచించారు. అంతే తప్ప ప్రైవేటీకరణ పేరుతో పేదల నోట్లో మట్టికొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.ప్రైవేటీకరణ కూటమి విధానమైతే.. అందుకు వైఎస్సార్సీపీ పూర్తి విరుద్ధమన్న సుధాకర్ బాబు దీనిపై రాజీనామా చేసి ప్రజల రెఫరెండంకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ఏర్పాటు చేస్తే.. మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ రద్దు చేస్తామని బీరాలు పలికి.. ఇవాళ పూర్తిగా కాలేజీలనే ప్రైవేటు పరం చేయడంపై ధ్వజమెత్తారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాజకీయంగా కాక సామాజిక కోణంలో చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాదని పేద బిడ్డల చదువుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సుధాకర్ బాబు, మా తలలు పగిలినా వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 15వ తేదీన జిల్లాల నుంచి కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. 18న జగన్ నాయకత్వంలో గవర్నర్ దగ్గరకు వెళ్తాయన్న ఆయన... ఈలోపు చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు జేబు సంస్థల్లా వ్యవస్థలుఈ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేయబడుతున్నాయని.. చంద్రబాబునాయుడికి జేబు సంస్థలుగా మారిపోతున్నాయని, ఆయన మాఫియా డాన్లా మారిపోయాడని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాం. ఇవాళ ఆది మరోసారి సుస్పష్టం అయింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవచ్చని, వారి చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందుతుందని.. కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లుగా.. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికలో బ్యానర్ ఐటం రాశారు.ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదాన్ని ఎత్తుకుంది. కానీ చంద్రబాబు అనుకూలమైన జేబు సంస్థ అయిన ఈనాడు మాత్రం పీపీపీ విధానమే ముద్దు అని రాసింది. చంద్రబాబుకి డబ్బు కొట్టడంలో ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు ఏం చేసినా రైట్, ఆయన ఏం మాట్లాడినా అదే కరెక్ట్ అని రాస్తుంది. ఇంతమంది ప్రజలు వద్దు అంటే.. కాదు అదే ముద్దు అంటూ ఈనాడు రాయడాన్ని వైఎస్సార్సీపీ ఖండిస్తోంది.మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ.. చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. మీరు చంద్రబాబుకి బాకా ఊదుతున్నారు కాబట్టే మిమ్మల్ని ఎల్లో మీడియా అని వ్యవహరిస్తున్నాం. చంద్రబాబుకి, మీకు ఆర్థికపరమైన, వ్యాపారపరమైన లావాదేవీలున్నాయి. అందుకు నిదర్శనమే ఇవాళ మీరు రాసిన వార్తలు.మెడికల కాలేజీలపై చర్చకు సిద్ధమా?1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఏపీలో 12 మెడికల్ కాలేజీలుంటే.. ఇవాళ అవి 29కు చేరాయి. ఒక్క వైఎస్ జగన్ హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే.. మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకి ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న స్పృహ వచ్చిందా? వైఎస్ జగన్ విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు ఇద్దరి సిద్ధాంతాలు, సంస్కరణలపై ఒక రోజంతా చర్చ నిర్వహిద్దాం. మీకు నచ్చిన టెలివిజన్ చానెల్స్ అధినేతలంతా విజయవాడ తీసుకురండి. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులంతా వస్తాం. చంద్రబాబునాయుడు సిధ్ధాంతమేంటో, ఆయన సిద్ధాంతం పునాదులేంటో చర్చిద్దాం.బలహీనమైన రాజకీయ పునాదులతో ఉన్న చంద్రబాబు... భయం, అభద్రతా భావంతో తనను కానీ పార్టీని ఓన్ చేసుకునే విధానంలో.. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అందరికీ తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు. తాను దోచుకున్న డబ్బులనే మీ అందరికీ పంచుకుంటూ వచ్చాడన్నదే ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి.. మీరు కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, రామోజీ రావు చనిపోతే రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఆయన సంస్మరణ సభ నిర్వహించడం కోసం ఖర్చు చేయడాన్ని ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు జేబు సంస్థ అనడానికి నిదర్శనం.పీపీపీ- దెబ్బతిన్న మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తిపీపీపీ విధానం వల్ల 17 మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజారోగ్యం కొరకు వైఎస్ జగన్ సామాజిక స్పృహతో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలను స్థాపించి.. వందలాది ఎకరాలను ఈ కాలేజీల పరిధిలోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్యం అందించాలని ఆశించాడు. అందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తైంది. 2023-24 విద్యాసంవత్సం నాటికి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కాలేజీలను పూర్త చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? గత ప్రభుత్వంలోనే ఏ పైనానా పూర్తి కాకుండా నిల్చిపోతే... ఏ ప్రజాపరిపాలకుడైనా దాన్ని పూర్తి చేసి ఆ ఘనత తన ఖాతాలో వేసుకుంటాడని భావిస్తాం.ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి.. వీటిని నేనే కట్టానని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటాడని భావించాం. కానీ చంద్రబాబు నికృష్టరాజకీయాలకు, నిరంకుశరాజకీయాలకు తెరలేపాడు.ఏ మాత్రం జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. వందలాది ఉచిత మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి. ఉచిత వైద్య సేవలు ఆశించిన పేదలు, ఆ కాలేజీలదగ్గరకు వచ్చి వైద్యం ఆశించిన వారందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది.పీపీపీపై నిస్సిగ్గుగా అనుకూల ప్రచారంఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు. 108 నాశనం చేశాడు. 104 అయితే అస్సలు కనబడ్డం లేదు. ఆ రోజు 104 అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి చారిత్రాత్మక పథకాలు మచ్చుకైనా రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈ దఫా చంద్రబాబు బరితెగించాడు. ఈ రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తీసుకుందామనుకుని ఆశపడ్డ వాళ్ల నోట్లో మట్టికొట్టాడు. పైగా వాళ్ల పత్రికతో బాకాలు ఊదించుకుంటూ.. పీపీపీ విధానమే బాగుంటుందని, ఇదే సరైన నిర్ణయమని నిస్సిగ్గుగా ప్రచారం చేయించుకుంటున్నాడు.పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వైఎస్సార్సీపీ బద్ద విరుద్దం. మీరు, ఈనాడుతో పాటు మీ అనుకూల పత్రికలు పీపీపీ విధానానికి సానుకూలం. తక్షణమే చంద్రబాబును రాజీనామా చేయమనండి. లోకేష్, పవన్ కళ్యాణ్లను కూడా రాజీనామా చేయమనండి. మా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ప్రజలను రిఫరెండెం కోరుదాం. ప్రజలకు ఏది అవసరమో వారి ముందుకే వెళ్దాం.స్థాయీ సంఘం పేరుతో అబద్దాలుకేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం పీపీపీ విధానం సిఫార్సు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. స్థాయి సంఘం పన్ను రాయితీలు ఇమ్మని, స్కాలర్ షిప్పులు ఇమ్మని చెప్పింది. సీట్లు పెంచాల్సిన ఆవశ్యకత గురించి ఆలోచించమని చెప్పిందే తప్ప.. పీపీపీ విధానం బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయండని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఆ రోజు వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆయా కాలేజీల నిర్వహణకు వీలుగా కన్వీనర్ కోటాతో పాటు సెల్ఫ్ పైనాన్స్ సీట్లను పెట్టాలని ఆలోచన చేస్తే.. వైఎస్ జగన్ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నాడు.వైఎస్ జగన్ ప్రభుత్వ విధానం తప్పు అని.. ఈ పార్టీలు, పత్రికలే దుమ్మెత్తి పోశాయి. ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ.. వార్తలు రాశాయి. అక్కడితే ఆగకుండా మేం ఆధికారంలోకి వస్తే.. 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. పీపీపీ పేరుతో పూర్తిగా ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపించే పనిలో పడ్డారు.పైగా ఆ పీపీపీ విధానంలో కూడా ఉచితాలు ఉంటాయని.. పచ్చి అబద్దాలు చెబుతూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉచితమని చెబుతున్నారు. ఓపీలో ఏం సేవలు అందుతాయి. వీళ్లు చెబుతున్న ఉచితం.. జ్వరం, పన్నో, కన్నూ, కడుపో నొప్పి వస్తే.. ఓపీ ఫ్రీ. అలా కాకుండా కాళ్లూ చేతులు విరిగితేనో, ఇంకేవైనా జబ్బులు వస్తేనో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు పేదలు కట్టుకోలేదు.చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ఆ విషయం అర్థం కాదు. మేం భారీ ఫీజులు కట్టి ఆ వైద్యాన్ని పొందలేరని.. ప్రభుత్వం వైపు చూసే ఆనాథల కోసమే ఈ కళాశాలలు వస్తే.. దాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. పైగా ప్రైవేటీకరణ చేసిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ పేదలకు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది నమ్మవచ్చా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుందా? ఇవాళ కడుతున్న మెడికల్ కాలేజీలో 100 పడకలు ఉంటే.. రిజర్వేషన్ ప్రకారం 70 పేదలకు, మిగిలినవి ఇతరులకు పెట్టగలిగే అవకాశం ఉంటుందా? మరి అలాంటప్పుడు ఈ రకమైన అబద్ధాలు ఎలా చెబుతారు?కాలేజీలు ప్రైవేటీకరణ - జీతాలు ప్రభుత్వ ఖజానాప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమే ఒక పెద్ద స్కామ్ అయితే.. వారికి ప్రభుత్వం మరొక పెద్ద బొనాంజా ప్రకటిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఆసుపత్రులు ఇచ్చి.. అక్కడ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. మీ అరాచాకాలను గమనిస్తున్నారన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎక్కడైనా ఈ సహేతుకమైన చర్చలో.. రూ.140 కోట్లు ప్రవైటు వ్యక్తుల చేతులకి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూడ్డం ఎంతవరకు సహేతుకం? పైగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యప్రసాద్ అవును నిజమే ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని చెబుతున్నాడు. ఈయనా మంత్రి? అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు అంటోంది.పీజీ మెడికల్ సీట్లకు ఒక్కోదానికి రూ.29 లక్షలు వసూలు చేసే విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కెచ్ వేశారు. ఆ రోజు వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆయా కాలేజీల నిర్వహణకు.. స్వతంత్రంగా భరించే విధంగా... కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించారు. దాన్ని విమర్శించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. తీరా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉచిత సీటు వస్తే రూ.30వేలు ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.9 లక్షలు, ఎన్నారై కోటా అయితే రూ.29 లక్షలు రేటు ఫిక్స్ చేశారు. ఆ రోజు మీరు చెప్పినట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచినట్లైతే... ఇవాళ మీరు చెప్పినట్లు రూ.9, రూ.29 లక్షలు ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు?5 కొత్త మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరంలో నాలుగు పీజీ కోర్సులలో 60 సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. ఈ 60 సీట్లను మంజూరు చేసిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కు ఉందా? తొలివిడత 4 కాలేజీల్లో 50 శాతమే కన్వీనర్ కోటా, పీపీపీ పేరుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.. వాటిలో 50 శాతం సీట్ల మాత్రమే ప్రభుత్వ కోటాలో ఉంచుతున్నారు. ఇంతకంటే ద్రోహం ఉంటుందా? ఈ ఒక్క చర్య ద్వారానే ప్రభుత్వ విధానం, చిత్తశుద్ధి తేటతెల్లమైందిమెడికల్ కాలేజీల భూములు కౌరుచౌకగా అప్పగింత..మరోవైపు ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైయస్.జగన్ ప్రభుత్వం 50 ఎకరాల స్ధలం కేటాయిస్తే.. వందలదాలి కోట్ల ఖరీదు చేసే ఆ భూములను ప్రభుత్వం.. రూ.100 కే ప్రైవేటు వ్యక్తులకు దశలవారీగా ధారాధత్తం చేస్తోంది. 33 ఏళ్ల లీజు పేరుతో కేవలం రూ100 కే అప్పగిస్తోంది. ఇది ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడమే. పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక్కా కాలేజీకి 257.50 ఎకరాల భూమిని కేటాయిస్తే అది ఇవాళ 191.71 ఎకరాలకే వచ్చింది. ఈ మధ్యలో భూమి సుమారు 50-60 ఎకరాలు మాయమైపోయింది. ఇది ఘోరమైన, బాధాకరమైన విషయం.ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించడం వల్ల.. తొలి ఏడాది ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. రెండో సంవత్సరంలో 1750 కలిపి మొత్తం 2450 సీట్లను కోల్పోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు జపం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల 2450 సీట్లలో మన ఆంధ్రరాష్ట్రంలో పేద విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయారు.మనస్సుతో చూడండి. ఆ గొప్ప మాకు వద్దు. ఆ 17 కళాశాలల క్రెడిట్ మీరే తీసుకుని, మీరే ప్రారంభించండి. రూ.1000 కోట్లు కేటాయించి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయండి. 2450 సీట్లు కోల్పోయిన వారందరూ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు చెందిన పేదలే ఉంటారు. దయచేసి ప్రైవేటీకరణను ఆపి, ఆ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచండి. ప్రైవేటీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా, సామాజిక కోణంలో చూడాల్సిన ఆవశ్యకత ఉంది.కోటి సంతకాలు పది కోట్లవడం ఖాయంరాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలని వైఎస్ జగన్ భావిస్తే.. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు వస్తే రాజధాని ప్రాంతంలో డెమొగ్రాఫికల్ ఇంబేలన్స్ వస్తుందన్న మహా ఘనుడివి.. అదే విషయాన్ని కోర్టుకు చెప్పిన ఘనుడివి నువ్వు చంద్రబాబూ. అలాంటి నువ్వు మా బిడ్డల చదువులు మీద ఉక్కుపాదం మోపుతుంటే.. ఈ కోటి సంతకాలు పదికోట్లవుతాయి. ఎలాంటి త్యాగాల చేసైనా.. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కడం ఖాయం.15వ తేదీనాటికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తాయి. 18వ తేదీన ఈ సంతకాలన్నీ గవర్నర్కి చేరుతాయి. ఈ లోగా నీ నిర్ణయం మార్చుకో చంద్రబాబూ?. కేసులు పెట్టి, తలలు పగలగొట్టి మమ్నల్ని భయపట్టాలని చూసే మీ ప్రయత్నాలు మమ్నల్ని ఆపలేవు. ప్రజా సమస్యల పోరాటంలో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అలు పెరగని పోరాటం చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే మీ సిద్ధాంతం అయితే.. పేదవాడికి ఉచిత విద్య, వైద్యం అందించడం, ఇళ్ల పట్టా ఇవ్వడం, వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే వైఎస్ జగన్ సిద్ధాంతమని.. మీ సిద్ధాంతాలకు, మా సిద్ధాంతాలకూ జరుగుతున్న పోరాటంలో మేం ఏ పోరాటానికైనా, త్యాగాలకైనా సిద్ధమేనని సుధాకర్ బాబు హెచ్చరించారు. -
అమరావతిపై అనుమానాలు అడిగితే వణుకుతున్నారు..!
-
‘విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు’
హైదరాబాద్: ఏపీలోని కూటమి ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్నా జీవో ఇవ్వడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. కేబినెట్ ఆమోదం లేకండానే విచ్చలవిడిగా అప్పుల తెస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(ఆదివారం, డిసెంబర్ 14వ తేదీ) సోమాజిగూడ ప్రెస్క్లబ్ నంచి మాట్లాడిన ఆయన.. ‘బేవరేజ్ల బాండ్లను రూ. 5,750 కోట్లకు మార్కెట్లో పెట్టారని విమర్శించారు. ఇవే బాండ్లను తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమ కోంస అమ్మకం పెడితే నానా రాద్దాంతం చేశారన్నారు. ‘‘ప్రస్తుత కూటమి ప్రభుతం బేవరేజ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. బేవరేజ్ చెల్లించకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. బేవరేజ్లకు వచ్చే ఆదాయంలో డైరెక్ట్గా అప్పుదారుడు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇంత చేస్తున్న కూటమి ప్రభుత్వం.. మా ప్రభుత్వం హయాంలో గగ్గోలు పెట్టింది. కూటమి మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించింది. కేబినెట్ ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నారు. బాండ్లు తాకట్టుపెట్టి రూ. 5,750 కోట్లు కూటమి ప్రభుత్వం అప్పు చేసింది. 9 శాతం పైగా వడ్డీతో రూ. చంద్రబాబు అప్పు తెచ్చారు.స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని కూడా తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్నారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్య నిషేధం ఉండదని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు విషపు మాటలు, ఈనాడు విషపు రాతలు రాసింది. కేబినెట్ ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. మా ప్రభుత్వంలో బాండ్లు ఇష్యూ చేస్తే అప్పుకిక్కు అని వార్తలు రాసిన కూటమి పత్రికలు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు అప్పు కిక్కి కనిపించడం లేదా.మేము చేస్తే అప్పు. కూటమి ప్రభుత్వం చేస్తే మాత్రం సంపద సృష్టి అన్నట్లు వారి మీడియా వార్తలు రాస్తుంది’ అని మండినడ్డారు బుగ్గన. -
పెన్నోబులేసునికి.. రాజకీయ గ్రహణం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామిఆలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కార్యనిర్వహణాధికారి (ఈఓ) దీర్ఘకాలిక సెలవుల కారణంగా ఆలయ నిర్వహణ – మాన్యం భూముల రక్షణ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మాన్యం భూములు దక్కించుకున్న అధికార పార్టీ నాయకులు లీజు ఎగ్గొట్టడమే కాకుండా అనధికారికంగా భూములు విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఆలయ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉరవకొండ/అనంతపురం కల్చరల్: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తదితర ప్రాంతాల భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న అనంతపురం జిల్లా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సాగాల్సిన పాలనా వ్యవహారాలపై చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) గా ఎవ్వరు వచ్చినా కొద్దిరోజులకే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ భూముల లీజుల కేటాయింపు–నిధుల ఖర్చు చేయాలంటూ వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఉండే ఆలయంలో ఏమి జరిగినా దిక్కు లేకుండా పోతోంది. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2,114 ఎకరాల మాన్యం ఉంది. ఇందులో 146 ఎకరాల ఈనామ్ భూమి, 412 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. మిగతా 1,554 ఎకరాలు ఆమిద్యాల, మోపిడి, కోనాపురం, పెద్దముస్టూరు, మూలగిరిపల్లి, రాచెర్ల, చిన్నముసూ్టరు పరిధిలో ఉన్నాయి. ఆలయ మాన్యాలు కొంతమంది అధికార పార్టీ నేతల చేతుల్లో చిక్కుకున్నాయి. సొంత భూములు ఉన్నా సరే నామమాత్రపు కౌలు చెల్లిస్తూ కొన్నేళ్లుగా ఆలయ భూమిని అనుభవిస్తున్నారు. సాధారణంగా వర్షాధారం అయితే ఎకరాకు రూ.6 వేలు, సాగునీటి సౌకర్యం ఉంటే ఎకరాకు రూ.20 వేలు చొప్పున కౌలు చెల్లించాల్సి ఉన్నా.. ఇక్కడ నారసింహుడికే నామాలు పెట్టి ఎకరాకు నామమాత్రంగా రూ.500 నుంచి రూ.2,500 ఏడాదికి చెల్లిస్తున్నారు. కౌలుదారుల్లో చాలామంది అనధికారికంగా సబ్లీజుకు ఇచ్చుకున్నారు. కొందరు అధికార పార్టీ నేతలైతే కౌలు భూమి తమ సొంత ఆస్తి అయినట్టు ఇతరులకు విక్రయించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి సుమారు 1,400 ఎకరాలకు సంబంధించి కౌలు లీజు ముగిసినా నేటికీ ఆలయ భూములకు బహిరంగ వేలం పాటను అధికారులు నిర్వహించలేదు. 20 శాతం మంది మాత్రమే అసలైన కౌలుదారులు సక్రమంగా ఆలయానికి సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలయ భూముల టెండర్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు అన్నీ తామై సిండికేట్గా మారి టెండర్లు దక్కించుకోవాలని చూడటంతో గతేడాది ఆగస్టు నుంచి వరుసగా మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఏడాదికి సగటున 20 వేల మంది స్వామివారికి తలనీలాలు సమర్పిస్తుంటారు. 2024–25 ఏడాదికి ఉరవకొండకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు రూ.27 లక్షలకు తలనీలాల సేకరణ హక్కులను దక్కించుకున్నాడు. అయితే ఇందులో రూ.9.5 లక్షలు మాత్రమే సదురు టీడీపీ నాయకుడు ఆలయానికి చెల్లించి, మిగతా సొమ్ము నేటికీ జమ చేయలేదు. ఈ సొమ్ములో కూడా గతంలో ఈఓగా విధులు నిర్వహించిన ఓ అధికారి తన సొంతానికి రూ.3 లక్షలు వాడుకున్నట్లు ఆలయ సిబ్బందే గుసగులాడుకోవడం గమనార్హం. భక్తులు పరమపవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం పెన్నహోబిలంలో కొంతకాలంగా కనుమరుగైంది. లడ్డూ ప్రసాదం టెండరు ప్రక్రియ ఆగిపోయి చాలా కాలమైంది. అధికార పార్టీ నేతలు – దేవదాయ శాఖ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో భక్తులకు లడ్డూ ప్రసాదమే లేకుండా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరగానే పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా రమేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. అయితే టీడీపీ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో భరించలేకపోయిన ఆయన దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లారు. దీంతో అప్పటి జిల్లా సహాయ కమిషనర్ (ఏసీ) తిరుమలరెడ్డికి ఆలయ ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయనకూ అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తప్పలేదు. దీంతో ఆయన కూడా సెలవులోకి వెళ్లిపోయారు. తదుపరి ఈఓ బాధ్యతలు గుంతకల్లుకు చెందిన మల్లికార్జున తీసుకుంటారని ఎండోమెంటు అధికారులు చెప్తున్నా.. ఆయన మాత్రం ముందుకు రాలేదు. ఈ క్రమంలో అనంతపురంలోని చెన్నకేశవస్వామి ఆలయం ఈఓగా ఉన్న సుధారాణికి తాత్కాలికంగా పెన్నహోబిలం ఆలయ బాధ్యతలు అప్పగించారు. పెన్నహోబిలం ఆలయ నూతన పాలక మండలి ఇంకా కొలువుదీరలేదు. అయినా సభ్యులుగా తామే ఉంటామని, మేము చెప్పినట్లుగా మీరు పనిచేయాల్సి ఉంటుందని కొందరు అధికార పార్టీనేతలు ఈఓలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి అయ్యే రూ.5 లక్షల ఖర్చును ఆలయ నిధుల నుంచే వెచ్చించాలని షరుతు విధించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఈ అంశం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. చేసేది లేక సెలవుపై వెళ్తున్నారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం పెన్నహోబిలంలో మేం గుర్తించిన సమస్యలను పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ కొన్నాళ్లుగా ఈఓ లేనిమాట నిజమే. సెలవులో ఉన్న తిరుమలరెడ్డి ఈ నెల 19న వస్తారు. అప్పటి వరకు నేను ఇన్చార్జ్గా మాత్రమే కొనసాగుతాను. కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా మేము కూడా ఎండోమెంటు ఇన్స్పెక్టర్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. – సుధారాణి, పెన్నహోబిలం ఆలయఇన్చార్జ్, దేవదాయ శాఖ ఇన్చార్జ్ ఏసీ -
గిరిజన మహిళా మేయర్పై బాబు సర్కారు కుట్ర
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దశాబ్దాల తర్వాత గిరిజన మహిళకు దక్కిన రాజ్యాధికారాన్ని చంద్రబాబు చిదిమేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగరపాలక సంస్థలో అత్యున్నత పదవి అయిన మేయర్గా ఓ గిరిజన మహిళకు అవకాశం కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు నేతలు అనేకానేక కుట్రలకు పాల్పడి, మేయర్ను, ఆమె కుటుంబ సభ్యులను, కార్పొరేటర్లను పైశాచికంగా వేధించి, చివరకు ఆ పదవి నుంచి గిరిజన మహిళా మేయర్ను తప్పించారు. ఇందుకోసం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేసిన వికృత రాజకీయం రాష్ట్రాన్ని నివ్వెరపరిచింది. నాలుగేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన మహిళ అయిన పోట్లూరు స్రవంతిని అత్యున్నతమైన మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. నెల్లూరు నగర పాలక సంస్థను అభివృద్ధి పథంలో నడిపించారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పాలన సాగించారు. బాబు ప్రభుత్వం రాగానే కుట్ర చంద్రబాబు ప్రభుత్వం రాగానే మేయర్ పదవిని చేతిలోకి తీసుకొని, దోపిడీ చేయాలని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కుట్ర పన్నారు. నగర మేయర్ను అధికార పార్టీలోకి తీసుకోవాలని ప్రయతి్నంచారు. అధికార పార్టీలోకి రాలేదన్న కారణంతో పాటు తాము చెప్పిన చోట సంతకాలు చేయలేదన్న అక్కసుతో మేయర్ కుటుంబాన్ని అష్టకష్టాలు పెట్టారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం పూర్తి కాలం పదవిలో కొనసాగనీయకుండానే ఆమెను పదవి నుంచి దింపేసి, మంత్రి నారాయణకు అనుకూలుడైన కార్పొరేటర్కు ఆ పదవి కట్టబెట్టేందుకు కుట్రలకు తెగబడ్డారు. ఇందుకోసం రూ.10 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడలేదు. మేయర్ పీఠంపై డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ను కూర్చోబెట్టేందుకు కార్పొరేటర్లకు తాయిలాలు ఎరవేశారు. కార్పొరేటర్లు లొంగకపోవడంతో వేధింపులు, అరాచకాలకు తెరతీశారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై అక్రమ కేసులు, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ బెదిరించి 40 మందికి పైగా కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు. మేయర్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయడంతో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి తటస్థంగా ఉండాల్సి వచ్చింది. అధికార పార్టీ చెప్పిన విధంగా ఉండాలని రాయబేరాలు చేసినా మేయర్ ససేమీరా అనడంతో మంత్రి, ఎమ్మెల్యే ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 18 నెలలుగా ఆమెను, ఆమె కుటుంబాన్ని రౌడీమూకలతో బెదిరించారు. కార్పొరేషన్ పరిధిలో భవనాల మార్టిగేజ్ విషయంలో ఫోర్జరీ సంతకాలు చేశారని, కార్పొరేషన్ ఉద్యోగులపై దౌర్జన్యాలు చేశారంటూ పలు అక్రమ కేసులతో మేయర్ భర్త జయవర్దన్ను జైలుపాలు చేశారు. మేయర్ను సోషల్ మీడియాలో మానసికంగా వేధించారు. కార్పొరేషన్లో మేయర్కు దక్కాల్సిన కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. అడుగడుగునా అవమానాలకు గురి చేశారు. మేయర్ అన్నింటినీ భరిస్తూ వచ్చారు. చివరకు ఆమెపై అవిశ్వాసం పెట్టడానికి నిర్ణయించారు. అవిశ్వాసానికి సహకరించాలని కార్పొరేటర్లపైనా వేధింపులు, బెదిరింపులు మితిమీరాయి. తమకు మద్దతు పలకని కార్పొరేటర్లను పోలీసులతో కిడ్నాప్ చేయించి క్యాంపు రాజకీయాలకు దిగారు. కార్పొరేటర్లకు తాయిలాలు ప్రకటించి తమ గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న తరుణంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ టీడీపీలోకి ఫిరాయించిన ఐదుగురు కార్పొరేటర్లను తిరిగి వైఎస్సార్సీపీలో చేర్పించి, ఝలక్ ఇచ్చారు. ఈ పరిణామాలతో టీడీపీ గంగవెర్రులెత్తిపోయింది. క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. ఒక్కో కార్పొరేటర్కు రూ.40 లక్షలు ఇచ్చి క్యాంపులకు తరలించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను సైతం తాయిలాలతో పాటు అక్రమ కేసులతో బెదిరించి టీడీపీ కండువా కప్పారు. వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్లను కూడా అసభ్య పదజాలాలతో బెదిరించారు. వారి కుటుంబాలను సైతం టార్గెట్ చేశారు. దీంతో మేయర్ స్రవంతి తన వల్ల మహిళా కార్పొరేటర్లు పడుతున్న బాధకు చలించి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
బాబు కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు భారీ హంగులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు ప్రభుత్వం భారీ హంగులు కల్పిస్తోంది. రూ.5.55 కోట్లతో కొండవీటివాగు ఎత్తిపోతల పథకం నుంచి చంద్రబాబు నివాసం ఉంటున్న కృష్ణా కరకట్ట ప్యాలెస్, ఈ3 (సీడ్ యాక్సిస్ రోడ్డు)–ఎన్9 జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న వీధి దీపాల స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కళాత్మకంగా తీర్చిదిద్దిన కొత్త స్తంభాలు, ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పరిపాలన అనుమతిచ్చారు. ఆ పనులు చేపట్టడానికి అక్టోబర్ 10న రూ.4.27 కోట్ల అంచనా వ్యయంతో, నాలుగు నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో ఆ టెండర్ను రద్దు చేసింది. తాజాగా ఈ పనులు చేపట్టేందుకు టెండర్ పిలవడానికి రూ.5.32 కోట్ల అంచనా వ్యయంతో నవంబర్ 29న సీఆర్డీఏ సీఈ సాంకేతిక అనుమతి ఇచ్చారు. దాంతో ఆ పనులకు రూ.4.27 కోట్ల అంచనా వ్యయంతో శనివారం రెండోసారి సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్లలో బిడ్ల దాఖలుకు తుది గడువును ఈ నెల 17గా నిర్ణయించింది. అంటే.. కేవలం ఐదు రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించడం గమనార్హం. స్వల్పకాలిక టెండర్కు కనీస వ్యవధి వారం రోజులు. కానీ.. ఈ టెండర్ను కేవలం ఐదు రోజుల్లోనే ముగించాలని నిర్ణయించడాన్ని బట్టి చూస్తే.. పనులను ఏ కాంట్రాక్టర్కు కట్టబెట్టాలన్నది ముందుగానే నిర్ణయించారన్నది స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. పాత విద్యుత్ స్తంభాలు, లైటింగ్ వ్యవస్థ బాగున్నప్పటికీ వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 18 నెలల్లో కరకట్ట అక్రమ ప్యాలెస్ మరమ్మతులకు రూ.4కోట్లకు పైగా ఖర్చు ఇక చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ ప్యాలెస్లో ప్రస్తుతం ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ స్థానంలో కొత్త లైన్ వేయడానికి రూ.47 లక్షలు, 250 కేవీఏ జనరేటర్ స్థానంలో 320 కేవీఏ జనరేటర్ ఏర్పాటుకు రూ.60 లక్షలు... వెరసి రూ.1.07 కోట్లను మంజూరు చేశారు. కరకట్ట ప్యాలెస్ అత్యవసర మరమ్మతులకు రూ.2.16 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తంమీద 18 నెలల్లోనే కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు రూ.4 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నారు. కృష్ణా నది కరకట్ట లోపల ఉండవల్లికి సమీపంలో లింగమనేని రమేష్ అక్రమంగా ఈ ప్యాలెస్ నిర్మించారు. ఆ ప్యాలెస్తోపాటు కరకట్ట లోపల నిర్మించినవన్నీ అక్రమ కట్టడాలేనని, వాటిని కూల్చివేస్తామని 2015లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నదిలో పడవపై తిరుగుతూ హంగామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన అప్పటి సీఎం చంద్రబాబు... ఆ కేసు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి ఉండవల్లిలోని లింగమనేని రమేష్ అక్రమ కట్టడం(కరకట్ట ప్యాలెస్)లోకి మకాం మార్చారు. 2014–19 మధ్య కరకట్ట ప్యాలెస్తోపాటు హైదరాబాద్ జూబ్లిహిల్స్లోని నివాసం, మదీనగూడలోని ఫాంహౌస్లో వసతుల కల్పన, భద్రతకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇంకా ఖర్చు చేస్తూనే ఉన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలీకాప్టర్, ప్రత్యేక విమానాల కోసం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.10.92 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.40.96 కోట్లు ఖర్చు చేసినట్లయ్యింది. చంద్రబాబు అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను సద్వినియోగం చేసుకోవాల్సిందిపోయి దుబారా చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కిలోమీటర్కు రూ. 180.35 కోట్లు ఖర్చు.. సంపద సృష్టిస్తానని చెప్పాను కదా తమ్ముళ్లూ!
కిలోమీటర్కు రూ. 180.35 కోట్లు ఖర్చు.. సంపద సృష్టిస్తానని చెప్పాను కదా తమ్ముళ్లూ! -
‘2 లక్షల 66 వేల కోట్లు అప్పులు.. ఒక్క కొత్త పెన్షనైనా ఇచ్చారా?’
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల అంధ్రప్రదేశ్ మారుస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు అప్పులే పరమావధిగా చేస్తున్నారని విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా? అపి బొత్స ప్రశ్నించారు. ఈరో.జు(శనివారం, డిసెంబర్ 13వ తేదీ) విశాఖపట్నం నుంచి మీడియాతో బొత్స మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు 18 నెలల కాలంలో 2 లక్షల 66 వేల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులకు లెక్కలు చెప్పాం. మరి కూటమి పాలనలో చంద్రబాబుేచేసిన అప్పులకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, ఆర్బీకేలతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశాం. చంద్రబాబు చేసిన అప్పులుపారదర్శకంగా ప్రజలకు వివరించాలి. చంద్రబాబు ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు’ అని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే..ఆరోగ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందిచంద్రబాబు 18 నెలల కాలంలో రెండు లక్షలు 66 వేల కోట్లు అప్పు తెచ్చారు..వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో 3 లక్షల 44 కోట్లు అప్పు తెచ్చారు..డైరెక్టర్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా 2 లక్షల కోట్ల కు పైగా ఖర్చు చేశారు..చంద్రబాబు తెచ్చిన అప్పులకు లెక్క పత్రం లేదు..దేనికి ఖర్చు పెట్టారో తెలియదు..వైఎస్ జగన్ 10 లక్షలు 20 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని తప్పుడు ప్రచారం చేశారు..జగన్ తెచ్చిన అప్పులతో శ్రీలంకగా మారిపోతుందన్నారు..చెత్తనుండి సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు..కూటమి పాలనలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది.అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడి ఉంది..పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు..చేయి తడిపితే కానీ పనులు జరజని ఏపీలో పని జరగదురాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి నెలకొంది..జగన్ అప్పులు తెచ్చి 90% వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చారుచంద్రబాబు అప్పల గురించి పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్తున్నారు..ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్ర అభివృద్ధికి చేటు.. -
చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: రాష్ట్రాన్ని కూటమి సర్కార్ అప్పులకుప్పగా మార్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులపై ప్రజలకు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర అప్పులపై టీడీపీ నేతలు దుర్మార్గంగా ప్రచారం చేశారన్నారు.‘‘ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ఒక రాజ్యాంగం.. చంద్రబాబు సీఎంగా ఉంటే మరో రాజ్యాంగం ఉంటుందా?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ చేసిన అప్పులపై రాష్ట్రం శ్రీలంక అవుతోందని గ్లోబెల్ ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 18 నెలల కాలంలో రూ.2,66,175 కోట్లు అప్పు చేశారు. జగన్ అప్పు చేస్తే శాపం అని.. చంద్రబాబు చేస్తే వరం అని సొంత మీడియా బాకా కొట్టుకుంటుంది...కోవిడ్ వంటి కష్టకాలంలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. చెప్పిన అబద్దం చెప్పకుండా వైఎస్ జగన్పై పచ్చి అబద్దాలను ప్రజల చెవుల్లోకి ఎక్కించారు. చంద్రబాబు తెచ్చిన అప్పులు ప్రజల సొమ్ముల్లో వేశారా అంటే? అదీ లేదు. రూ.5,400 కోట్లు ఎక్సైజ్ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఏపీ బేవరేజ్ ద్వారా అప్పు తీసుకురావాలని వైఎస్ జగన్ భావిస్తే.. కేంద్రానికి లేఖ రాసి, కోర్టులో కేసులు వేశారు. వైఎస్ జగన్ చేసిన అప్పులు రాజ్యంగ విరుద్దం అన్నారు. ఇప్పుడు అవే అప్పులు మీరు చేస్తుంటే రాజ్యాంగం ఏమైనా మారిందా?..చంద్రబాబు చేసే అప్పులకు ఏపీ సౌత్ సూడాన్లా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ 18 నెలల కాలంలొ చంద్రబాబు చేసిన అప్పు.. వైఎస్ జగన్ చేసిన అప్పుకంటే 80 శాతం ఎక్కువ. చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?. చంద్రబాబు చేసిన అప్పులు సంపద సృష్టి ఎలా అయ్యింది?. చంద్రబాబు లేకపోతే రాష్ట్రం అదోగతి అయిపోతుందని ఒక కుట్రపూరిత ప్రచారం జరుగుతుంది. పరిమితికి మించి అప్పులు చేయమని చంద్రబాబుకు ఏ చట్టం చెప్పింది. అమరావతి కోసం మరో 7,8 వేల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మీరు చేస్తున్న అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. రెడ్ బుక్ ద్వారా కేసులు పెడతారు. రోడ్డు మీద గోతులు పూడ్చడం లేదు కానీ.. గ్రోత్ ఇంజన్లు, గ్రోత్ కారిడార్ల కోసం మాట్లాడుతున్నారు’’ అంటూ కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. -
నేనింతే.. అదో టైప్.. నిజం చెప్పను.. అబద్దాలు ఆపను..
-
‘టీడీపీకి బలముంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్లో రహస్యంగా జరుగుతాయని.. పైరవీలు, ప్రలోభాలన్నీ అక్కడే చేయిస్తుంటారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పాండిచ్చేరిలో హోటల్కు చేర్చారన్నారు. నెల్లూరు 54 డివిజన్లలో మొత్తం వైఎస్సార్సీపీనే గెలుపొందిందని.. అలాంటి చోట ఏమాత్రం బలం లేకున్నా ఎలా గెలవాలని చూస్తున్నారు?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.‘‘మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగారు. రాజ్యాంగబద్దంగా అవిశ్వాస తీర్మానం మీద ఎన్నిక జరిగితే వైఎస్సార్సీపీనే గెలుస్తుంది. కిడ్నాప్లు చేయటానికి ఖాకీలను వాడుకుంటున్నారు. పోలీసులు ఖాకీ క్యాబ్ సర్వీసులుగా మారారు. కొందరు పోలీసులు బిఎన్ఎస్ చట్టాలు అంటే 'బాబు అన్యాయ సంహిత' చట్టాలుగా మార్చారు’’ అంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు.‘‘టీడీపీకి బలం ఉంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నైతికంగా ఆల్రెడీ ఓడిపోయింది. అధికార బలం ఎల్లవేళలా పని చేయదు. చంద్రబాబు అనైతిక రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టే రోజు వస్తుంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. -
రెడ్జోన్లో కూటమి 80 శాతం ఎమ్మెల్యేలు: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేసిందేమీలేదన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. బాబు పేదల భూములు లాక్కుని ధనవంతులకు ఇచ్చారని ఆరోపించారు. బ్రిటీష్ పాలన తర్వాత వైఎస్ జగన్ మళ్లీ భూముల రీసర్వే చేపట్టారని ధర్మాన చెప్పుకొచ్చారు.మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రెవెన్యూ డిపార్ట్మెంట్పై సమీక్ష చేయడానికి సీఎం చంద్రబాబుకు ఏడాది కాలం పట్టింది. సంస్కరణలు తెచ్చాం అని చంద్రబాబు అంటున్నారు. 2019లో జగన్ వచ్చే వరకు పేదల భూములకు ఎవరూ ఎలాంటి సంస్కరణలు తేలేదు. ఏది ఎవరి భూమి అనేది గుర్తించలేని పరిస్థితి. దశాబ్దాల తరబడి ఉన్న భూములను కారు చౌకగా అమ్మేసిన పరిస్థితి ఉండేది. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణలు తెచ్చింది. 2012కి ముందు ఉన్నవారికి చుక్కల భూమి పట్టాలు ఇవ్వటం జరిగింది. దీని వల్ల పేదలకు భూ హక్కులు వచ్చాయి. లాభం చేకూరింది. బ్యాంకు లోన్లు వచ్చాయి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.1952 తర్వాత మళ్ళీ 2019లో జగన్ భూ సంస్కరణలు తెచ్చారు. భూ సంస్కరణల కోసం తమిళనాడు,కర్ణాటక వెళ్ళి స్టడీ చేశాం. ఏడాదిన్నర అయింది. దాన్ని మీరు ఆపారు. జగన్ తప్ప భూముల విషయంలో బీదలకు అనుకూలంగా చంద్రబాబు ఒక్క నిర్ణయం అయిన చేయగలిగారా?. చంద్రబాబు ఇతరుల వద్ద భూములు లాక్కొని ధనవంతులకు ఇచ్చారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు అన్ని పేదలకు మేలు చేశాయి. వాటిని మభ్యపెట్టి ఎన్నికల్లో మీరు లబ్ధి పొందారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భూములు అన్ని 22Aలో పెట్టి గందరగోళానికి గురి చేశారు. మేము వాటిని సరిచేద్దాం అంటే కేసులు పెట్టి అధికారులను ఎంత భయపెట్టారు. ఎంఆర్వో కార్యాలయాలు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. 80 శాతం ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు. నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు. సంస్కరణలు మీరు చేయలేరు. చేసిన సంస్కరణలను తప్పుడు మార్గంలో భూతద్దంలో చూపిస్తున్నారు అని మండిపడ్డారు. -
అదానీతో బాబు, లోకేష్ భేటీ అందుకేనా?
-
సీఎం ఇంటికి సోకులు.. 5 కోట్లతో అలంకరణ
-
బాబు మాట: అప్పుడలా.. ఇప్పుడిలా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు భలే విచిత్రంగా ఉంటాయి. ఒకపక్క సూపర్సిక్స్ హామలు అమలు చేద్దామని ఉన్నా.. ఖజానా ఖాళీగా ఉందంటారు.. అడిగినా అప్పులివ్వడం లేదని, కేంద్రం ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం నడుచుకుంటూండటంతో కొత్త అప్పులు పుట్టడం లేదంటారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుందని బాధపడేదీ ఈయనే. అవునా? నిజమే కాబోలు అని అనుకునే లోపు అకస్మాత్తుగా ఆయనే ఓ ప్రెజెంటేషన్ ఇచ్చేస్తారు. ఏపీలో జీఎస్డీపీ భేష్ అంటారు. 11.28 వృద్ధి నమోదు చేశామంటారు. ఏడాదిన్నర కాలం కష్టపడి ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదాం అని తన భుజాలు తానే చరచుకుంటారు. ఎల్లోమీడియా ద్వారా వచ్చే సమాచారాన్ని చూసినప్పుడల్లా సామాన్యుడికి వచ్చే సందేహం.. ఇంతకీ ఏపీ దివాళా తీసిందా? అభివృద్ధిలో ముందుకు దూసుకెళుతోందా? ఒక్కటైతే నిజం... బాబుగారి రాజకీయ జీవితాన్ని గమనించిన వారందరూ అంగీకరించే విషయం ఏమిటంటే.. అదేదో పాత సామెత చందంగా ‘‘అవసరార్థం బహుకృత వేషం’’ వేయడంలో దిట్ట అని! పొంతన లేని, సత్యాసత్యాలతో సంబంధం లేని మాటలు కన్నార్పకుండా మాట్లాడగలరని. పోనీ.. ఇలా మాట్లాడితే అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకైనా మీడియా ఆయన్ను ప్రశ్నించాలని అనుకుంటాం కానీ.. ఎల్లోమీడియా ప్రజల పక్షాన పనిచేసి చాలాకాలమైంది. పైగా.. తనను ప్రశ్నించే మీడియాను చంద్రబాబు దూరంగా పెడుతున్నారు కూడా ఎవరైనా ప్రశ్నించినా దబాయించడం అలవాటు చేసుకున్నారు. 2019-2020, 2020-2021 మధ్య ఏపీలో వృద్ది రేటు పడిపోయిందని, జగన్ టైమ్లో జరిగిన విధ్వంసం అది అని చెప్పడానికి చంద్రబాబు యత్నించారు. కానీ అది కరోనా విజృంభించిన సమయం. ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ దాదాపు స్తంభించిన సందర్భం. ఈ సమయాన్ని సాధారణ సమయంతో ఎలా పోలుస్తారని విలేకరులెవరూ ప్రశ్నించలేకపోయారు. అప్పులు తీసుకుని ప్రభుత్వాలు నడపాలని కేంద్రం స్వయంగా అప్పట్లో ఆదేశించిన విషయాన్నీ కూడా ఆయన దాచేశారు. అంతేకాదు. జీఎస్డీపీ భేష్గా ఉందంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అప్పుల గురించి చెప్పకుండా ఈ లెక్కలేమిటి అని ఎవరైనా అడిగారా? అలా అడిగినా వాటి గురించి తర్వాత మాట్లాడదాం అని ఉండవచ్చు. దాంతో మీడియా కూడా సరేలే మనకెందుకులే అని ఊరుకుని ఉండవచ్చు. జీఎస్డీపీ వృద్ధికి ఆయన చెప్పిన కారణాలు గమనించండి. ఆక్వా రంగానికి యూనిట్కు రూ.1.50లకే విద్యుత్ ఇచ్చామని అన్నారు. నిజానికి ఇది జగన్ టైమ్లో మొదలైంది. అమెరికా టారిఫ్ల వల్ల గడ్డు పరిస్థితి ఎదుర్కుంటోందన్నారు. కానీ దాన్ని వివరించనే లేదు. రోడ్లు,పోర్టులు,జలవనరులు రంగాలలో వ్యయం పెంచామన్నారు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు ఎన్నడూ ఒక ఓడరేవుకాని, ఫిషింగ్ హార్బర్ కాని నిర్మించిన పాపాన పోలేదు. జగన్ చేపట్టిన వాటిని తనవిగా కలరింగ్ ఇస్తే ఎలా? పోనీ అవైనా సక్రమంగా జరుగుతున్నాయా? అంటే.. అదీ లేదు. పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. కానీ అదే సమావేశంలో ప్రజలు తింటున్న పంటలనే పండించాలని, లేకుంటే వ్యాపారులు కొనరని, ప్రభుత్వం అన్ని పంటలను కొనుగోలు చేయలేదని తేల్చేశారు. మాట్లాడితే వరి వేయవద్దని చెబుతున్నారు. ఏపీలో అత్యధికులు తినేది వరి అన్నమే. బియ్యం తింటే మధుమేహం వస్తుందని మరొకటి వస్తుందని భయపెడుతున్నారు. బహుశా చంద్రబాబు ఎప్పుడో వరి అన్నం మానివేసి ఉండవచ్చు. అయినా ఆయనకు సుగర్ వ్యాధి ఉందా? లేదా? అన్నది కూడా వివరిస్తే బాగుండేది. జైలులో ఉన్నప్పుడు ఏ ఆనారోగ్యం చూపించి బెయిల్ పొందారు? దానికి కారణాలు కూడా చెబితే ప్రజలకు అర్థమవుతుంది కదా! ఇటీవలి కాలంలో దాదాపు అన్ని పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ధరల స్థీరికరణ నిధిని పెట్టి రైతులను ఆదుకోకుండా గాలికి వదలివేసి ఈ కబుర్లు చెబితే ఏమి లాభం? అంతేకాక రైతు భరోసా కింద ఏడాదికి రూ.20 వేల హామీని అరకొరగా అది కూడా రూ.ఐదువేలతో సరిపెట్టారాయె? రాష్ట్రానికి రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని ఆయన తెలిపారు. ఒక్కోసారి ఒక్కో అంకె చెబుతూ ప్రజలను మభ్యపెట్టడానికే ఈ గణాంకాలు చెబుతుంటారు. ఈ సమ్మిట్ జరగడాదనికి ముందే రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేశారు కదా! వాటిలో ఈ ఏడాదిన్నరలో వచ్చిన పరిశ్రమలు ఏమిటో చెప్పాలి కదా! జగన్ టైమ్లో వచ్చిన కొన్ని పరిశ్రమలకు ప్రారంభోత్సవం చేయడం తప్ప , ఆ తర్వాత వచ్చిన పరిశ్రమలు పెద్దగా లేవు. ఒకేసారి అన్ని పరిశ్రమలు రావు. ఆ విషయం చెప్పవచ్చు. కాని అలాకాకుండా అవేవో రెడీమెడ్గా ఉన్నట్లు చెప్పే యత్నమే బాగోదు.పైగా 99 పైసలకు భూములను కట్టబెడుతూ, వేల కోట్ల రాయితీలు ఇస్తూ ప్రభుత్వంపై భారం మోపుతుంటే ఆదాయం ఎలా సమకూరుతుందో తెలియదు.విద్యార్ధుల,తల్లిదండ్రుల సమావేశం పెట్టామని చంద్రబాబు చెప్పడం విడ్డూరమే.దానికి, వృద్ది రేటుకు సంబంధం ఏమిటో తెలియదు.ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద 6700 కోట్ల బకాయిలు పెట్టి, విద్యారంగాన్ని అభివృద్ది చేస్తున్నామని చెబితే ప్రజల చెవిలో పూలు పెట్టినట్లవ్వదా! ఆరోగ్య రంగంలో మూడువేల కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయా?లేదా? తాను సాధించిన వాటికంటే గత ప్రభుత్వంపై ఏవో ఆధారాలు చూపని ఆరోపణలు చేయడాన్ని నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి గత ప్రభుత్వం అప్పులు తెచ్చిందని చంద్రబాబు అన్నారు. అది ఎంతవరకు నిజం అన్నది పక్కనబెడితే, కొద్ది నెలల క్రితం మైనింగ్ కార్పొరేషన్ ఆదాయాన్ని తనఖాగా పెట్టడమే కాకుండా, ఒకవేళ ప్రభుత్వం అప్పు వాయిదా సకాలంలో తీర్చకపోతే నేరుగా రిజర్వు బ్యాంక్లో ఉండే ట్రెజరీ ఖాతా నుంచి నేరుగా డబ్బు డ్రా చేసుకోవచ్చని ఒప్పందం అయింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? సర్దుబాటు ఛార్జీల పేరిట వేల కోట్ల బాదుడు బాది, ఇప్పుడేమో రెండో ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెబితే సరిపోతుందా? అదే టైమ్ లో మళ్లీ విద్యుత్ ఛార్జీలపై ఈర్డీసీకి ఎందుకు నివేదిక ఇచ్చారు? మరో సంగతి చెప్పాలి. తమ ప్రభుత్వానికి అప్పులు పుట్టడం లేదని నల్లజర్లలో చెప్పారు కదా? ఆ పాయింట్ పై ఈ ప్రజెంటేషన్లో ఎందుకు మాట్లాడలేదు. అప్పుడేమో ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, ఇప్పుడేమో అంతా బాగుందని చెప్పడానికి కారణాలు ఏమిటి? రాష్ట్రం దివాళా తీసిందన్న సంగతి దేశంలో అందరికి తెలిసిపోయేసరికి పరువు పోయిందని ఇప్పుడు సడన్గా ఈ ప్రజెంటేషన్ ఇచ్చారా? లేక అప్పులు ఇచ్చేవారు భయపడుతున్నారు కనుక మాట మార్చారా? పెట్టుబడులు పెట్టేవారు వెనక్కి తగ్గుతున్నారన్న భావనతో అంతా బాగానే ఉందని కలరింగ్ ఇవ్వ సంకల్పించారా? ఏడాదిన్నర కాలంలో రూ.2.60 లక్షల కోట్ల అప్పు చేసిన సంగతి దాచేసి, ఆల్ హాపీస్ అంటూ మభ్యపెట్టే ప్రకటనలు చేస్తే సరిపోతుందా?నిజంగా అంతా బాగుంటే సూపర్ సిక్స్లోని ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి,పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక్కో యువకుడికి పది లక్షల హామీ మొదలైనవాటిని నెరవేర్చి చూపవచ్చు కదా! జనం దగ్గరకు వెళ్లేమో బీద అరుపులు, మీడియా సమావేశంలో ప్రజెంటేషన్లో గొప్పల గప్పాలు చెప్పి ఎవరిని మభ్య పెట్టదలిచారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను మోసం చేయడానికే సొంత లెక్కలతో చంద్రబాబు అంకెల గారడి చేస్తున్నారని, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వృద్ది రేటు, తలసరి ఆదాయం, అప్పుల పరిస్థితి అన్నిటి గురించి కాగ్ గణాంకాల ఆధారంగా వివరిస్తూ ఎందులో చూసినా తన పాలనతో పోల్చితే చంద్రబాబు ప్రభుత్వం తీసికట్టుగానే ఉందని జగన్ రుజువు చేశారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు.. ముందుంది ముసళ్ల పండగ
-
9.15% వడ్డీతో నడ్డి విరిగేలా.. కొత్త అప్పుకు కొత్త ప్లాన్
-
కేసులు కొట్టేయండి.. లేదంటే మిమ్మల్ని క్లోజ్ చేస్తా
-
కిలోమీటర్కు రూ.180.35 కోట్లు
సాక్షి, అమరావతి: అమరావతిలో భవనాలు, రోడ్లు నిర్మాణ పనుల కాంట్రాక్టులను అడ్డగోలు వ్యయాలకు కట్టబెట్టడంలో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) తాము నెలకొల్పిన రికార్డులను తామే బద్దలుకొడుతున్నాయి. తాజాగా సీడ్ యాక్సిస్ (ఈ3) రోడ్డును ఎన్హెచ్–16 (కోల్కతా–చెన్నై జాతీయ రహదారి)తో అనుసంధానించే మూడో దశ పనులను కిలోమీటరుకు రూ.180.35 కోట్లకు అప్పగించేందుకు ఏడీసీఎల్కు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం ఈ మేరకు జీవో ఆర్టీ నం.1471 జారీ చేసింది. » కొండవీటి వాగు నుంచి రైల్వే ట్రాక్పైన మణిపాల్ ఆస్పత్రి మీదుగా వారధి వరకు 3.5 కి.మీ. పొడవు (18.270 కి.మీ.–21.770 కి.మీ.), 60 మీటర్ల వెడల్పుతో ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.511.84 కోట్ల కాంట్రాక్టు విలువతో అక్టోబర్ 27న ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. లంప్సమ్ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించింది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.98.66 కోట్లను తిరిగి చెల్లిస్తామని (రీయింబర్స్) పేర్కొంది. దీంతో కాంట్రాక్టు విలువ రూ.610.5 కోట్లకు చేరుతుంది. » 2.464 కి.మీ. ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) ఎలివేటెడ్ కారిడార్... 99.6 మీటర్లు ఆర్వోబీ, రెండు అండర్ పాస్లు, ఒక ఇంటర్చేంజ్ (ట్రంపెట్), మైనర్ బ్రిడ్జి కమ్ పప్, 3 ర్యాంప్లు (విజయవాడ–అమరావతి 232 మీటర్లు, గుంటూరు–అమరావతి 280 మీటర్లు, విజయవాడ–అమరావతి 115 మీటర్లు) నిర్మించాలి. ఈ ప్రకారం కి.మీ. రోడ్డు, ఆర్వోబీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.174.43 కోట్లను కాంట్రాక్టు విలువగా (రీయింబర్స్మెంట్ మినహా) నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినా..నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ రహదారులను నిరి్మస్తోంది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్హెచ్–65)లో అంతర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు అత్యద్భుత డిజైన్తో కనకదుర్గమ్మ ప్లైఓవర్ను 2.6 కి.మీ. మేర ఆరు వరుసలతో రూ.282.4 కోట్లతో 2020లో పూర్తి చేసింది. అంటే.. కిలోమీటరుకు వ్యయం రూ.108.61 కోట్లు. కోల్కతా–చెన్నై జాతీయ రహదారిలో అంతర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు బెంజ్ సర్కిల్ వద్ద మూడు వరుసలతో 2020 నాటికి 2.35 కి.మీ. మొదటి ప్లైఓవర్ను రూ.80 కోట్లతో, 2.47 కి.మీ. రెండో ప్లైఓవర్ను మూడు వరుసలతో 2021లో రూ.88 కోట్లతో పూర్తి చేసింది. ఈ ప్రకారం ఆరు వరుసలతో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ విధానంలో రహదారి నిర్మాణానికి కి.మీ.కు రూ.69.70 కోట్లను ఎన్హెచ్ఏఐ ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. కానీ, అచ్చం ఇదే పద్ధతిలో నిరి్మస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్డును కాంట్రాక్టు సంస్థకు కి.మీ.కు రూ.180.35 కోట్ల చొప్పున అప్పగిస్తుండడం గమనార్హం. రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే.. రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ అంచనా వ్యయాలను పెంచేస్తూ.. అస్మదీయులకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తూ అధిక ధరకు కాంట్రాక్టు పనులు కట్టబెట్టింది. ఖజానాను కొల్లగొడుతూ నీకింత నాకింత అంటూ పంచుకునేలా టెండర్ల వ్యవస్థను నీరుగార్చింది. కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం, మొబిలైజేషన్ అడ్వాన్సు రద్దు వంటి విప్లవాత్మక సంస్కరణలతో టెండర్ల వ్యవస్థకు మళ్లీ జీవం పోసింది. అయితే, 2024లో చంద్రబాబు సర్కార్ వచ్చాక 2014–19 మధ్య తరహాలోనే అస్మదీయులకు అధిక ధరలకు పనులు కట్టబెట్టేందుకు జ్యుడీíÙయల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ను రద్దు చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్సులను మళ్లీ తెచి్చంది. జ్యుడీíÙయల్ ప్రివ్యూ అమల్లో ఉంటే.. సీడ్ యాక్సిస్(ఈ3) రోడ్డును ఎన్హెచ్–16తో అనుసంధానించే పనుల కాంట్రాక్టు విలువపై ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, మేధావులు, సాధారణ ప్రజలు ఆన్లైన్లో ఆధారాలతో అభ్యంతరాలను లేవనెత్తే అవకాశం ఉండేది. వీటిని పరిగణనలోకి తీసుకుని కాంట్రాక్టు విలువను సవరించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆదేశించే వీలుండేది. రివర్స్ టెండరింగ్ అమల్లో ఉంటే... ఏడీసీఎల్ నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే కనీసం 9–10 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చేవారు. తద్వారా ఖజానాకు భారీఎత్తున ఆదా అయ్యేది. కానీ, చంద్రబాబు సర్కార్ ఆ విధానాలను రద్దు చేయడంతో సీడ్ యాక్సిస్ (ఈ3) రోడ్డును ఎన్హెచ్–16తో అనుసంధానించే పనుల కాంట్రాక్టు విలువ భారీగా ఉంది. రివర్స్ టెండరింగ్ రద్దుతో... 4.05 శాతం అధిక ధరకు రూ.532.57 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ సంస్థ ఎల్–1గా నిలిచింది. దీనికే పనులు అప్పగించడానికి గురువారం కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం ఏడీసీఎల్కు అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు పనులు కేటాయించడంతో ఖజానాపై అదనంగా రూ.20.73 కోట్లు భారం పడింది. సీడ్ యాక్సిస్ రోడ్డును ఎన్హెచ్–16తో అనుసంధానించే రహదారి పనుల కాంట్రాక్టు విలువ కి.మీ.కు రూ.180.35 కోట్లకు చేరింది. నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంకెన్ని కోట్లకు చేరుతుందోనని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంజనీరింగ్ నిపుణుల విస్మయం జాతీయ రహదారుల నిర్మాణం.. కనకదుర్గమ్మ, బెంజ్ సర్కిల్ ప్లైఓవర్ నిర్మాణ వ్యయాలతో సీడ్ యాక్సిస్ రోడ్డును ఎన్హెచ్–16తో అనుసంధానం చేసే రహదారి పనుల కాంట్రాక్టు విలువను పోల్చిచూస్తూ ఇంజనీరింగ్ నిపుణులు నివ్వెరపోతున్నారు. నేషనల్ హైవేలు, అంతర్భాగమైన భారీ ప్లైఓవర్ల కాంట్రాక్టు విలువను ప్రస్తావిస్తూ... ‘‘సీడ్ యాక్సిస్ రోడ్డును తారు, కాంక్రీట్తో కాకుండా బంగారపు పూతతో వేస్తున్నారా?’’ అని ఇంజినీర్లు, జాతీయ రహదారుల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.నీకింత.. నాకింత పంచుకోవడానికేకాంట్రాక్టు విలువను భారీగా పెంచడం వెనుక... ఆ అంచనా వ్యయాన్ని కాంట్రాక్టర్తో కలిసి నీకింత నాకింత అంటూ ముఖ్య నేత, కాంట్రాక్టు సంస్తలు పంచుకుతినడానికేనని ఇంజనీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), కేఎఫ్డబ్ల్యూ(జర్మనీ), హడ్కో వంటి అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను దోచుకుతింటూ ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని కోసం మరో.7,387.70 కోట్లు అప్పు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కోసం చంద్రబాబు సర్కారు చేస్తున్న అప్పులు ‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్లు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం మరో రూ.7,387.70 కోట్లు అప్పు చేస్తున్నారు. నాబార్డు నుంచి ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఏపీ సీఆర్డీఏ) తీసుకునే రూ.7,387.70 కోట్ల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.సీఆర్డీఏ రుణ సంస్థకు అప్పు చెల్లించడంలో విఫలమైనప్పుడు ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఆరి్థక శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వ హామీ, లెటర్ ఆఫ్ కంఫర్ట్ పొందేందుకు అనుమతించింది. హామీ ఇచి్చన మొత్తంపై 5 శాతం గ్యారెంటీ ఫీజును సీఆర్డీఏ చెల్లించాలి. ఇందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం సూచించింది. దీంతో రాజధాని కోసం చేసిన మొత్తం అప్పులు రూ.47,387.70 కోట్లకు చేరాయి. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ చంద్రబాబు ప్రచారం... రాజధాని అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం భారీగా అప్పులు తెస్తున్నారు. మరోపక్క బడ్జెట్ నుంచి నిధులు కూడా విడుదల చేస్తున్నారు. అప్పులు తేవడంతోపాటు బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఎలా అవుతుందో సీఎం చంద్రబాబుకే తెలియాలని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఆగని అప్పుల పరుగు.. బాబు గారి లిక్కర్ బాండ్లు
సాక్షి, అమరావతి: ఎడాపెడా అప్పులు చేయడంలో ఎన్నో డిగ్రీలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త అప్పుల కోసం కొత్త దారులు వెతుకుతున్నారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులుగా పారిస్తున్న చంద్రబాబు సర్కార్... ఇప్పుడు రాబోయే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరో భారీ అప్పు చేసింది. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెడుతూ ఎక్సైజ్ బాండ్ల ద్వారా ఏకంగా రూ.5,490 కోట్ల అప్పు సేకరించింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ బాండ్ల సేకరణ జరిగింది. అది కూడా 9.15శాతం భారీ వడ్డీకి ఈ అప్పు చేయడం గమనార్హం. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లో చేసిన అప్పులు రూ.2,66,175 కోట్లకు (ఇప్పటికే ప్రభుత్వం చేసిన అప్పులు, కొత్తగా చేయడానికి అనుమతించిన అప్పులతో కలిపి) చేరుకున్నాయి. ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం మరో రూ.7,387.70 కోట్లు అప్పు చేస్తున్నట్లు శుక్రవారం పొద్దుపోయిన తర్వాత వెల్లడించారు. ఇవన్నీ సరిపోవన్నట్లు మళ్లీ చంద్రబాబు పదేపదే అప్పులకు అర్రులు చాస్తుండడం చూసి అందరూ నివ్వెరపోతున్నారు. ఈ 18 నెలల్లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 80శాతాన్ని చంద్రబాబు ప్రభుత్వం దాటేసిందంటే పరిస్థితి ఏ మేరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ వడ్డీకి తక్కువ అప్పులు చేస్తేనే వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం దివాళా తీస్తోందని, శ్రీలంక అయిపోతోందని పెడ»ొబ్బలు పెట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు అధిక వడ్డీలకు చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే రాష్ట్రం ఏమౌతుందని శ్రీలంక అవుతున్నట్లా.. లేక సౌత్ సూడాన్ అవుతున్నట్లా.. అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.అధిక వడ్డీతో రూ.5,490 కోట్ల రుణం రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే రాబడిని హామీగా చూపిస్తూ భారీ రుణ సేకరణకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఎక్సైజ్ శాఖ బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.5,490 కోట్ల అప్పు చేశారు. అది కూడా త్రైమాసికానికి అత్యధికంగా 9.15శాతం వడ్డీతో బాండ్లు జారీ చేయాలని నిర్ణయించారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ భారీ రుణం సేకరించారు. 9.15శాతం వడ్డీ రేటుతో బాండ్లను జారీ చేసి రుణాన్ని సేకరిస్తున్నారన్న విషయం బయటకు పొక్కితే ఆరి్థక నిపుణులు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తారన్న కారణంవల్లే దీనిని గోప్యంగా ఉంచారు. ఎంత తాగిస్తే.. అన్ని అప్పులు.. ‘మద్యం అమ్మకాలు పెంచండి.. ఈ ఏడాది రూ.35వేల కోట్ల రాబడి తేవాలి..’ అని సీఎం చంద్రబాబు ఇటీవల ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఊరూవాడా బెల్టు షాపులు పెరిగిపోతున్నా, ఎక్కడబడితే అక్కడ పర్మిట్ రూమ్లు కనిపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనడం లేదు. వీటి వెనక ఉన్న మర్మం ఇపుడు అందరికీ బోధపడింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే తమకు అంత సంతోషం అన్నట్టుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు విధానం. ఎందుకంటే మద్యం విక్రయాలపై పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్లో రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ. 5,490 కోట్ల రుణం సేకరించారు. దీనినిబట్టి రాబోయే రోజుల్లో అనివార్యంగా మద్యం ఆదాయాన్ని భారీగా పెంచాల్సి ఉంటుంది. 2024–25లో మద్యం విక్రయాల ద్వారా రూ.24వేల కోట్ల రాబడి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో మద్యం విక్రయాల ద్వారా పన్నుల ఆదాయం రూ.35 వేల కోట్లకు చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. తరువాత ఏడాది మరింతగా అంటే రూ.50వేల కోట్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. అంటే ప్రస్తుత మద్యం విక్రయాలను ఏకంగా 100శాతం పెంచాలన్నది ప్రభుత్వ విధానమని స్పష్టమవుతోంది. ఎంతగా మద్యం తాగిస్తే...తాము అంతగా అప్పులు చేయడానికి వీలౌతుంది అన్నట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. నిబంధనలకు విరుద్ధంగా.. అధికవడ్డీకి... ఎక్సైజ్ బాండ్ల ద్వారా రుణ సేకరణ కోసం చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బీఎం పరిమితి ఎప్పుడో దాటిపోయింది. అయినా సరే ఎక్సైజ్ బాండ్ల ద్వారా రూ.5,490 కోట్ల రుణం తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా 9.15శాతం చొప్పున అత్యధిక వడ్డీకి కూడా వెనకాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని నిపుణులంటున్నారు. ఎందుకంటే ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఎస్డీఎల్ (స్టేట్ డెవలప్మెంట్ లోన్స్) రూపంలో రుణసేకరణ జరిగితే అందుకు వర్తించే వడ్డీ భారం 6.5 శాతం లోపే ఉంటుంది. కానీ అత్యధిక వడ్డీ రేట్లతో ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుండటం సందేహాస్పదంగా ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయి ఆర్థికంగా దివాళా తీస్తుందని అంటున్నారు. నాడు తక్కువ వడ్డీకి తక్కువ అప్పులు చేస్తున్నా శ్రీలంక అయిపోతుందని విమర్శించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు ఎక్కువ వడ్డీకి ఎక్కువ అప్పులు చేస్తుండడాన్ని ఎలా సమర్థించుకుంటారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.నాడు తీవ్ర స్థాయిలో దుష్ప్రచారంనాడు వైఎస్ జగన్ హయాంలో మద్యం ఆదాయంపై రుణాలు చేయడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వానికి రుణం ఇవ్వవద్దని జాతీయ బ్యాంకులు, స్టాక్ ఎక్సేంజ్లకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు తమ అనుకూల ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయించారు. భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. ఎన్నికల ప్రచారాస్త్రంగానూ వాడుకున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు శ్వేతపత్రాల విడుదల పేరుతో హైడ్రామా సృష్టించి అవే ఆరోపణలు చేశారు. ఇప్పుడు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఇష్టానుసారం అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్, సూపర్ సెవన్లకు ఎగనామం పెట్టేశారు.బాబుగారి అప్పులు చూస్తే.. శ్రీలంక కాదు సౌత్ సూడానే.. 2019–24 మధ్య ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో చేసిన అప్పులు రూ.2,66,175 కోట్లు. అంటే జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పుల్లో 80శాతం అప్పులు ఈ 18 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసేసిందన్నమాట. రానున్న 42 నెలల్లో ఈ లెక్కన అప్పులు చేసుకుంటూ పోతే... శ్రీలంక సంగతి దేవుడెరుగు.. ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సౌత్సూడాన్ కన్నా ఆంధ్రప్రదేశ్ దిగజారిపోవడం ఖాయమని ఆరి్థక నిపుణులంటున్నారు. అప్పుల వేగంలో బాబుగారికి సరిలేరెవ్వరూ.. రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు అన్నీ కలుపుకుంటే రూ.1,40,717 కోట్లుగా ఉన్నాయి. ఆ అప్పులు కాస్తా 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి రూ. 3,90,247 కోట్లకు ఎగబాకాయి. దానర్థం చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు రూ. 2,49,350 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 22.63శాతంగా ఉంది. అదే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 3,90,247 కోట్లు ఉన్న అప్పులు ఐదేళ్ల కాలంలో రూ. 7,21,918 కోట్లకు చేరుకున్నాయి. అంటే ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 3,32,671 కోట్లు. అప్పుల సీఏజీఆర్ 13.57 శాతం మాత్రమే కావడం గమనార్హం. కానీ చంద్రబాబు సీఏజీఆర్ మాత్రం 22.63శాతంగాఉంది. 2014–19లో అధిక వడ్డీలకు అధిక అప్పులతో సంచలనం సృష్టించిన చంద్రబాబు ఇపుడు జగన్ ఐదేళ్లలో చేసిన అప్పులలో 80శాతం అప్పులను ఈ 18 నెలల కాలంలోనే అధిగమించి రాష్ట్రాన్ని సౌత్ సూడాన్ దిశగా నడిపిస్తుండడం ఆందోళనకరమని ఆరి్థక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర విభజన నాటి నుంచి 2024 మార్చి 31 వరకు అప్పుల వివరాలు ఇవీ...కాగ్, రాష్ట్ర బడ్జెట్ కాపీలు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు 1,40,717 కోట్లు కాగా, 2014 నుంచి 2019 మార్చి 31వరకు ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూ.2,49,350 కోట్లు అప్పు చేసింది. ఆ ఐదేళ్లలో పెరిగిన అప్పులు 22.63 శాతం. అదే జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, పెరిగిన అప్పు కేవలం 13.57 శాతమే. -
అమరావతి కోసం మళ్ళీ భారీ అప్పు
విజయవాడ అమరావతి కోసం మళ్లీ అప్పు చేయడానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. నాబార్డ్ ద్వారా రూ. 7,387 కోట్లు అప్పు చేసింది. APCRDAకి నాబార్డ్ రుణం రూ.7,387.70 కోట్లు పొందేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అమరావతి కోసం ఇప్పటికే 40 వేల కోట్లకు పైగా అప్పు తెచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరో అప్పుకు సిద్ధమైంది. తాజా రుణంతో కలిసి అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పు రూ. 47 వేల కోట్లను దాటనుంది. -
Ravi Chandra: విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా?
-
Manohar : చంద్రబాబు.. నకిలీ మద్యంపై దమ్ముంటే లెక్కలు తేల్చండి
-
చంద్రబాబూ.. దమ్ముంటే నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: మొలకలు చెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ కల్తీ మద్యం కుంభకోణం ఈ దేశంలోనే పెద్దదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి అన్నారు. మొలకలచెరువు ఎక్సైజ్ పోలీసు స్టేషన్కి మూడు కిలోమీటర్ల దూరంలోనే కల్తీ మద్యం తయారీ చేశారని.. స్థానిక జనం కనిపెట్టి పోలీసులకు చెప్తే తప్ప పోలీసులు స్పందించలేదని మనోహర్రెడ్డి మండిపడ్డారు.‘‘కూటమి అధికారంలోకి రాగానే ప్రైవేట్కు మద్యం దుకాణాలు కట్టబెట్టి.. ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నారు. టీడీపీ అధినాయకత్వంతో కుమ్మక్కై అక్రమ మద్యం కుటీరాలు ఏర్పాటు చేశారు. 3వ తేదీన కుంభకోణం బయటపడితే 10న అద్దేపల్లి జనార్ధన్ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కూటమి నేతలకు భయం పుట్టింది. అందుకే ఇష్యూని డైవర్ట్ చేయటానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డికి తాము సన్నిహితులమని నేరస్తులు చెప్పారు. తంబళ్లపల్లిలో డంప్ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. జోగి రమేష్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు...ఐవీఆర్ఎస్ కాల్స్తో విష ప్రచారం చేశారు. జయచంద్రారెడ్డి చెప్పినట్లు అంత చేశామని నిందితులే చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడ కల్తీ మద్యం తయారు అయ్యిందో? ఎవరెవరు ఉన్నారో? ఎక్కడెక్కడ సరఫరా చేశారో? విచారణ జరపాలి. కానీ కేసు విచారణ అలా ఎందుకు జరగటం లేదు?. జయచంద్రారెడ్డిని రాష్ట్రానికి రప్పించి కేసును పక్కన పెట్టాలని చూస్తున్నారు. తప్పుడు లెక్కలు చెపుతూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది...ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. కానీ 1600 అని లెక్కలు చెపుతున్నారు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేయించి.. ఛార్జ్షీట్లు వేస్తే.. సిగ్గు లేకుండా విత్ డ్రా చేస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు విచారణను ఎందుకు ఎదుర్కోరు?. నిసిగ్గుగా కేసులు విత్ డ్రా చేయించునే చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఉండరు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడతారు...టీడీపీ వాళ్ళను ఎలా రక్షించుకోవాలనే మాత్రమే పని చూస్తున్నారు. వ్యవస్థలను దిగజార్చటంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు వ్యవస్థలపై నమ్మకం ఉంటే.. మద్యం కుంభకోణంపై స్వతంత్ర ఆడిట్ చేయించండి. ఏ బెల్ట్ షాప్కు ఏ స్పిరిట్ లిక్కర్ వెళ్లిందో తేల్చాలి. చంద్రబాబుకు దమ్ముంటే కేసును ఎదుర్కోని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. జయచంద్రారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దర్యాప్తును నిష్పక్షపాతంగా పూర్తి చేయాలి’’ అని మనోహర్రెడ్డి డిమాండ్ చేశారు. -
Baburao: విజయవాడను చంద్రబాబు అమ్మేస్తున్నాడు
-
సీఐడీ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతోంది :గౌతమ్ రెడ్డి
-
‘చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప.. చేతలు లేవు’
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో విద్యారంగం సర్వనాశనం అయ్యిందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సరైన స్కూల్ బ్యాగులు అందించటం చేతగాని మంత్రి నారా లోకేష్ అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులకు సరైన బ్యాగులు, బూట్లు ఇవ్వటం చేతగాని వ్యక్తి లోకేష్. తన పదవికి రాజీనామా చేయాలంటూ రవిచంద్ర డిమాండ్ చేశారు.‘‘పాఠశాలల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. మూడు దశల్లో తనిఖీలు చేసి బ్యాగులు ఇచ్చామన్న లోకేష్ ఒకసారి ఆ బ్యాగులను చూసి మాట్లాడాలి. కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకం బ్యాగులు అందించారు. నారా లోకేష్ చెప్పిన మాటలకు, విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులకు చాలా తేడా ఉంది. రూ.953 కోట్లు ఖర్చు చేశామనే పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. జగన్ హయాంలో అత్యంత నాణ్యమైన బ్యాగులు అందించారు. జగన్ హయాంలో ఇచ్చిన బ్యాగులనే ఇప్పటికే విద్యార్థులు వాడుతున్నారు. మూడు దశల్లో తనిఖీ చేశామని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు.‘‘ఒక్కో బ్యాగు మీద రూ.2,270లు ఖర్చు చేసి ఇలాంటి నాసిరకం అందిస్తారా?. పిల్లలకు సరైన బూట్లు కూడా అందించలేని ప్రభుత్వం ఇది. నాడు-నేడు కింద జగన్ స్కూళ్లు బాగు చేశారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని ధ్వంసం చేశారు. సరైన బ్యాగులనే పంపిణీ చేయలేని చేతగాని మంత్రి లోకేష్’’ అంటూ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
AP: నేడు జిల్లా కలెక్టరేట్ల ముందు అంగన్వాడీల ఆందోళనలు
-
దెబ్బకు జ్వరం పుట్టించాం అధికారం ఉండి క్యాంపు రాజకీయాలు అనిల్ కుమార్ యాదవ్ ఫైర్
-
‘కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: కేసులను ఎదుర్కోలేని పిరికిపంద చంద్రబాబు అంటూ వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి మండిపడ్డారు. అధికారులను బెదిరించి తన మీద కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసులు క్లోజ్పై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన మీద ఉన్న కేసులను క్లోజ్ చేసుకోవటం సరికాదని గౌతమ్రెడ్డి అన్నారు.‘‘చంద్రబాబు వ్యవహారం దొంగే.. దొంగా దొంగా అన్నట్టుగా ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ను కూడా ఉల్లంఘించారు. ఫైబర్ నెట్ కేసును ఇప్పుడు క్లోజ్ చేయించుకున్నారు. సీఐడీ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతోంది. అవినీతి చేసినట్టు ఆధారాలు ఉన్నా సీఐడీ ఎందుకు కేసును వదిలేసింది?. జగన్ హయాంలో పూర్తయిన కేసులను కూడా రీఓపెన్ చేశారు. చంద్రబాబే స్వయంగా సంతకాలు చేసి దొరికిన కేసులను మాత్రం క్లోజ్ చేశారు’’ అంటూ గౌతమ్రెడ్డి నిలదీశారు.‘‘ఫైబర్ నెట్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. వేమూరి హరిప్రసాద్ కోసం చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కారు. వందల కోట్లు కైంకర్యం చేయటానికి చంద్రబాబు నాటకాలు ఆడారు. చంద్రబాబు నేరాల మీద నేరాలు చేశారు. ఆర్థిక అరాచకం చేసిన చంద్రబాబు తన మీద ఉన్న కేసులను ఎలా క్లోజ్ చేస్తారు?. దీనిపై మేము ప్రొటెక్షన్ పిటిషన్ని హైకోర్టులో వేస్తాం. బ్లాక్ లిస్టులో ఉన్న మనిషిని పిలిచి అందలం ఎక్కించారా లేదా?’’ అంటూ గౌతమ్రెడ్డి ధ్వజమెత్తారు.ఈవీఎంల విషయంలో వేమూరి హరిప్రసాద్కు కోర్టు శిక్ష వేసింది. అలాంటి వ్యక్తిని ఫైబర్ నెట్లోకి ఎలా తెచ్చారు?. 105 రకాల నాసిరకం వస్తువులు కొని అవినీతికి పాల్పడ్డారా? లేదా?. వేమూరి హరిప్రసాద్ని డైరెక్టర్గా తీసుకోవాలని సీఎంవో నుండి లెటర్ ఇవ్వలేదా?. రూ.114 కోట్ల విలువైన అవకతవకలు ఫైబర్ నెట్లో జరిగాయా? లేదా?. ఇలాంటి విషయాలపై విచారణ జరుగుతుండగా కేసును ఎందుకు క్లోజ్ చేశారు?. కేసులను ఎదుర్కోవడం చేతకాని పిరికిపంద చంద్రబాబు. ఈ కేసులను క్లోజ్ చేయటానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అంగీకరించవు. దీనిపై మరింతగా న్యాయ పోరాటం చేస్తాం’’ అని గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. -
‘అధికారంలో ఉండి క్యాంపు పాలిటిక్స్.. టీడీపీ నైతికంగా ఓడినట్టే’
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. టీడీపీ నైతికంగా ఓడిపోయింది. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్, రౌడీయిజం పెరిగిపోయింది. నెల్లూరు సిటీ ఐదో డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారు. మా కార్పొరేటర్లను తీసుకుంటే మాకు నష్టమేమీ లేదు. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. నెల్లూరులో దళారి వ్యవస్థ నడుస్తోంది.మా పార్టీకి సంబంధం లేని మేయర్పై అవిశ్వాసం పెట్టి వైఎస్సార్సీపీపై ట్రోల్స్ చేయడం విడ్డూరం ఉంది. కార్పొరేషన్ విషయంలో ఒకసారి వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్లో ఉన్న 54 మంది కార్పొరేటర్స్ వైఎస్సార్సీపీ బీఫాంతో గెలిచిన వారే. నయానో, భయానో వారిని ప్రలోభ పెట్టి టీడీపీలోకి లాక్కున్నారు. ప్రస్తుతం మాకు వున్న కార్పొరేటర్స్ పదకొండు మంది ఉన్నారు. నిన్న ఐదుగురు జగనన్న హయాంలో మా పార్టీలో చేరారు. అలా చేరిన కార్పొరేటర్ ఒక్కరిని అరెస్ట్ పేరుతో డ్రామా క్రియేట్ చేశారు. నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారు. మాకు సంఖ్య బలం లేదు, మేయర్ మా పార్టీ కాదు. ఐదు మంది మా వైపు వచ్చేసరికి భయపడ్డారు. నేడు టీడీపీ అధికారంలో ఉండి, సంఖ్య బలం ఉన్నా కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మాకు భయపడి కార్పొరేటర్లను క్యాంపునకు తరలించినప్పుడే మేము నైతికంగా గెలిచాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
మోదీ ఫీడ్ బ్యాక్.. బాబులో ఓటమి టెన్షన్
-
ప్రజా ధనంతో జల్సాలు..!
-
అధికారంలో ఉండి కూడా భయపడ్డారు చూడు.. అది జగన్ అంటే
-
సింగపూర్, జపాన్, జర్మనీ ఎక్కడ.. అమరావతిని చూస్తే రక్తం మరిగిపోతుంది
-
మరోకేసు విజయవంతంగా మూసివేయించిన చంద్రబాబు
-
విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగులు, బూట్లు... ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర ఇక్కట్లు
-
చంద్రబాబుకు బిగ్ షాక్.. అమరావతి ఆగినట్టే!
-
చంద్రబాబు హెలికాప్టర్, విమాన చార్జీల అద్దెకు మరో రూ.10.92 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్, విమాన ప్రయాణాల అద్దె కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.10.92 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్కు పరిపాలన అనుమతినిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ప్రత్యేక హెలికాప్టర్ లేదా ప్రత్యేక విమానం వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తరచూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణిస్తున్నారు.ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రత్యేక హెలికాప్టర్, విమాన చార్జీల అద్దె చెల్లింపుల కోసం మే నెల 22వ తేదీన రూ.19.12 కోట్లకు అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెపె్టంబర్ 18న రెండో త్రైమాసికంలో ప్రత్యేక హెలికాప్టర్, విమాన చార్జీల అద్దె చెల్లింపునకు మరో రూ.10.92 కోట్లకు అనుమతిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. తాజాగా మూడో త్రైమాసికంలో అనుమతిచ్చిన రూ.10.92 కోట్లతో కలిపితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్, విమానాలకు అద్దె రూపంలో రూ.40.96 కోట్లను చెల్లించినట్లు అవుతోంది. చినబాబు, పవనూ ప్రత్యేక విమానాల్లోనే చక్కర్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రూ.కోట్లాది రూపాయల ప్రజాధనం ఉపయోగించి ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలోనే చక్కెర్లు కొడుతున్నారు. అయితే వీరు తిరుగుతున్న విమానాల అద్దె లెక్కలు తేలాల్సి ఉంది. -
బాబూ.. ఇదేం 'బ్యాగు'?
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: భుజాలకు తగిలించుకునే బందులు ఊడిపోయాయి.. జిప్పులు పనిచేయడం మానేశాయి.. కుట్టించి వాడుకున్నా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది.. విసుగు చెంది కొన్ని రోజుల్లోపే మూలనపడేసే పరిస్థితి వచ్చింది..! ఇదీ విద్యార్థి మిత్ర పేరుతో చంద్రబాబు సర్కారు అందజేసిన కిట్లలోని స్కూల్ బ్యాగుల దుస్థితి..! రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన బ్యాగ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. విద్యా సంవత్సరం ఏడు నెలలు ముగిసినా ఇంకా కిట్లు అందాల్సినవారు ఉండడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వ విద్యకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తున్నదో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ అందించిన విద్యా కానుక నాణ్యతను విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఇచ్చిన కిట్లోని బ్యాగులు సహా ప్రతి వస్తువును వైఎస్ జగన్ ఆసాంతం పరిశీలించిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మూడంచెల తనిఖీ తర్వాత బ్యాగులు ఇచ్చామని విద్యా శాఖ మంత్రి లోకేశ్ చెబుతున్నారు. కానీ, ఏమాత్రం నాణ్యత లేని బ్యాగులను చూశాక ఆయన పరిశీలించింది ‘కమీషన్ల కోసం’ అనే ఆరోపిస్తున్నారు. ఇక బాబు సర్కారు ఇచ్చిన కిట్లలోని బూట్లు కూడా నాసిరకంగా ఉన్నాయి. సైజు తీసుకోకుండా ఇష్టారీతిన పంపిణీ చేసేశారు. దీంతో హైస్కూల్ వారికి రెండో తరగతి విద్యార్థుల బూట్లు వచ్చాయి. చాలాచోట్ల సాక్సులు ఇవ్వకపోవడంతో వాటిని పక్కన పెట్టేశారు.కాపీ కొట్టి.. ఎగ్గొట్టి...గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చక్కగా అమలు చేసిన ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని చంద్రబాబు సర్కారు కాపీ కొట్టింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరుతో అమలు చేస్తోంది. అయితే, వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఏటా సగటున 43 లక్షల మందికి బడి తెరిచిన రోజే కిట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం బాబు ప్రభుత్వం 35.60 లక్షల మంది విద్యార్థులకే కిట్లనే కొనుగోలు చేసింది. అంటే, విద్యార్థుల సంఖ్యలో ఏడు లక్షల మందికిపైగా కోతపెట్టింది. ఇక రూ.800 కోట్లకు పైగా ఖర్చు చేసి ఒక్కోటి రూ.2,279 విలువతో 35.60 లక్షల కిట్లను కొనుగోలు చేసింది. కానీ, ఈ పథకంలో గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాబీయింగ్తో పెద్దఎత్తున అవినీతికి పాల్పడడంతో బ్యాగుల నాణ్యత అత్యంత నాసిరకంగా ఉన్నట్లు విద్యార్థుల బ్యాగుల సాక్షిగా స్పష్టమవుతోంది. మూడు దశల్లో తనిఖీ చేసిన బ్యాగులు కనీసం రెండు నెలలు కూడా మనలేదు. ఇక పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే కిట్లు అందజేశామని గొప్పలు పోయారు. కానీ, అవినీతి కారణంగా నాణ్యత లేని బ్యాగులు అందాయి. చిరిగిపోయిన వాటికి అతుకులు వేసుకుని వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.ఒకటి ఉంటే మరొకటి లేదు‘గత ప్రభుత్వం విద్యా కానుక పేరుతో నిధులు దుర్వినియోగం చేసింది. మా సర్కారులో విద్యార్థి కిట్ల ఖర్చు తగ్గించి ప్రజాధనం ఆదా చేశాం’ అని విద్యాశాఖ మంత్రి లోకేశ్ గొప్పలు పోయారు. తీరా కిట్లోని బ్యాగులు చూస్తే అత్యంత నాసిరకంగా ఉన్నాయి. బూట్లు సైజు సరిపోవడమే లేదు. కిట్లో ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు లేదు. బ్యాగులతో పాటు చాలా జిల్లాల్లో డిక్షనరీలు, యూనిఫాం, సాక్సులు తదితరాలను విద్యార్థుల తల్లిదండ్రులు సొంతంగా కొనివ్వాల్సి వచ్చింది. దీంతో జగనన్న విద్యా కానుక కిట్లకు చంద్రబాబు విద్యా మిత్రకు పూర్తి వ్యత్యాసం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వ పాఠశాలలో చూసినా చిరిగిన బ్యాగులు గుట్టలుగా పడి ఉన్నాయి.బ్యాగును మూటలా మోయాల్సిందే బాపట్ల జిల్లా కొల్లూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్నా. ప్రభుత్వం ఇచి్చన బ్యాగ్ కొద్ది రోజులకే చిరిగిపోయింది. జిప్పు మొత్తం పాడైంది. భుజాలకు తగిలించుకునే బందులూ ఊడిపోయాయి. బ్యాగ్ను ధాన్యం బస్తాను మోసినట్లు భుజంపై పెట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. – చొప్పర అక్షయ్కుమార్, కొల్లూరు, బాపట్ల జిల్లాఈ చిత్రంలో ఉన్నవారంతా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాల్టీ బ్రాహ్మణ స్ట్రీట్ పురపాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. బాబు సర్కారు ఇచ్చిన బ్యాగులు వెంటనే చిరిగిపోవడంతో మార్కెట్లో కొనుక్కున్న వాటితో రోజూ పాఠశాలకు వస్తున్నారు.4,300 మంది విద్యార్థులు.. 3 వేల బ్యాగులు చిరిగాయి.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పాఠశాలల్లో 4,326 మంది చదువుతున్నారు. వీరికిచ్చిన బ్యాగులు 2 నెలలు కూడా నిలవలేదు. 3 వేల బ్యాగులు చిరిగిపోయాయి. విద్యార్థులు సొంత డబ్బు పెట్టి మార్కెట్లో కొనుక్కున్నారు. కొనలేనివారు చిరిగినవాటినే కుట్టుకుని పాఠశాలకు తెచ్చుకుంటున్నారు.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇస్తున్న నాణ్యమైన బ్యాగులివి అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పినవి ఇవే. ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ, హ్యాండిల్స్ ఊడిపోకుండా బాగా స్టిచ్చింగ్ చేసినట్టు గొప్పలు పోయారు. కానీ, ఆయన చెప్పినదానికి ఇచ్చిన బ్యాగులకు పొంతన లేదు. కొన్ని రోజులకే చిరిగిపోయాయి. కుట్టే వారి వద్దకు కుప్పలు తెప్పలుగా చేరుతున్నాయి.20 రోజులకే చిరిగిపోయిందిఐదో తరగతి చదువుతున్న మా అబ్బాయి ప్రదీప్నకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్ 20 రోజులకే చిరిగిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగ్ రెండేళ్ల పాటు మన్నికగా ఉంది. ప్రస్తుతం నాణ్యత లేని బ్యాగు, సైజ్ తక్కువ ఉన్న బూట్లు పంపిణీ చేశారు. –ముప్పాళ్ల ఎస్తేరు, కొత్తపేట, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లాపీచులు పీచులుగా ఊడిపోయింది...మా అమ్మాయి 7వ తరగతి చదువుతోంది. ఈ ఏడాది జూన్ 17న ఇచ్చిన బ్యాగు 20 రోజులైనా గడవక ముందే కుట్లు పీచులుగా పీచులుగా ఊడిపోయింది. పలుసార్లు కుట్టినా లాభం లేకపోయింది. మార్కెట్లో కొని స్కూల్కు పంపుతున్నాం. జగనన్న ఇచ్చిన బ్యాగులు ఎంతో నాణ్యంగా ఉండేవి. నీటిలో కడిగినా చెక్కుచెదరలేదు. మూడేళ్ల పాటు ఉపయోగించాం. – భాగ్యమ్మ, విద్యార్థిని తల్లి, తిరుపతినాలుగైదు సార్లు కుట్లు వేయించినా...ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను చిన్నచూపు చూడడం సరికాదు. నా ఇద్దరు పిల్లలకు ఇచ్చిన బ్యాగులు కొన్ని నెలలు కూడా ఉపయోగపడలేదు. బ్యాగులను నగరి వెళ్లి నాలుగు సార్లు కుట్లు వేయించా. అయినా నిలువలేదు. చివరికి కొత్తవి కొనిచ్చా. – రామ్మూర్తి, విద్యార్థి తండ్రి, నగరి మండలం, చిత్తూరు జిల్లాకొనుక్కోవడానికి డబ్బులు లేవునేను 8వ తరగతి చదువుతున్నాను. బడిలో ఇచ్చిన బ్యాగు కొద్ది రోజులకే పాడైంది. కుట్టుకొని వాడుకుంటున్నా. కొత్త బ్యాగు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. మాది పేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులను అడగలేకపోతున్నా. – మాలతీ బెహరా, 8వ తరగతి, ఈదుపురం, ఇచ్ఛాపురంఈ విద్యా సంవత్సరంలో బాబు సర్కారు ఇచ్చిన బ్యాగు ఇది... ఇదేమో వైఎస్ జగన్ ప్రభుత్వం రెండేళ్ల కిందట ఇచ్చిన బ్యాగు ఆసాంతం నాణ్యమైన ‘జగనన్న విద్యా కానుక’వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పేద పిల్లలు చదువుకునే పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. తల్లిదండ్రులకు రూపాయి ఖర్చు ఉండకూడదని తపించారు. కార్పొరేట్ స్కూల్ వారితో సమానంగా ఆత్మవిశ్వాసంతో బడికి వెళ్లాలని ‘జగనన్న విద్యా కానుక’ కిట్ను అందించారు. ఏటా సగటున 43 లక్షల మంది విద్యార్థులకు బడి పునఃప్రారంభం మొదటి రోజే పంపిణీ చేశారు. బ్యాగ్, టెక్ట్స్ బుక్స్, నోట్ పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్బుక్స్ (ప్రాథమిక పాఠశాల వారికి), ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (హైస్కూల్), పిక్టోరియల్ డిక్షనరీ, మూడు జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై ఉన్న ఈ కిట్లోని ప్రతి వస్తువు నాణ్యతను స్వయంగా పరిశీలించారు. వస్తువుల నాణ్యత పరిశీలించే బాధ్యతను ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’కు అప్పగించారు. ఇది భారత ప్రభుత్వం మద్దతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సంస్థ. ఇలా నాలుగు విద్యా సంవత్సరాలు రూ.3,366.53 కోట్లతో విద్యా కానుక అందించారు. 2024–25 విద్యా సంవత్సరానికి కూడా జగన్ ప్రభుత్వంలోనే ఆర్డర్ ఇచ్చారు. కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సరఫరాను నిర్లక్ష్యం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంకు పూర్తి భిన్నంగా ఇప్పుడు జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.ఏ విద్యార్థిని అడిగినా... ఆవేదనేఉత్తరాంధ్రలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఎవరిని కదిపినా చిరిగిన బ్యాగులు, పనికిరాని బూట్ల గురించే చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో పదిశాతం బ్యాగులు కూడా మన్నిక లేవు. మూణ్నాళ్లు కూడా రాలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.తిరుపతి జిల్లాలో 3 లక్షల మంది విద్యార్థులకు గాను 2.42 లక్షలమందికే పంపిణీ చేశారు. ఇందులో 80 శాతం బ్యాగ్లు పక్కనపడేశారు. చిత్తూరు జిల్లాలో రెండు నెలల్లోపే చినిగిపోయాయి.కర్నూలు జిల్లాలో ప్రతి స్కూల్లో బ్యాగ్లు చిరిగాయి. పాతవాటితోనే పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. నెల్లూరు జిల్లాలో 2 నెలలకే జిప్లు ఊడి చినిగిపోయాయి. నెల్లూరులో 30 శాతం మంది కొత్తవి కొనుక్కున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఏ పాఠశాలలోనూ విద్యార్థుల వద్ద బ్యాగులు లేవు. బయట కొనుక్కుని వస్తున్నారు. మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం, పెనుకొండలో అధ్వాన పరిస్థితులున్నాయి.నంద్యాల జిల్లాలో మూడేళ్ల కిందట ఇచ్చిన జగనన్న విద్యాకానుకలోని వాటినే విద్యార్థులు వాడుకుంటున్నారు.వైఎస్సార్ కడప జిల్లాలో 1,34,275 బ్యాగులను సరఫరా చేయగా అధిక శాతం చినిగిపోయాయి.ఎన్టీఆర్ జిల్లాలో లక్షమంది విద్యార్థులకు ఇచ్చినా నాసిరకంగా ఉండడంతో చినిగిపోయాయి.ప్రకాశం జిల్లాలో 60శాతం బ్యాగులు పూర్తిగా> పాడయ్యాయి. బాపట్ల జిల్లాలో 87 వేల మందికి బ్యాగ్లు ఇవ్వగా 90 శాతం మొదట్లోనే చిరుగుపట్టాయి.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బ్యాగ్లు నాసిరకంగా ఉండడంతో రెండు నెలలకే పాడయ్యాయి.ఏలూరు జిల్లాలో 90 శాతంపైగా విద్యార్థులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులతోనే పాఠశాలలకు వెళ్తున్నారు. -
లొంగిపోవడానికి వస్తే అరాచకం!
మాచర్ల/మాచర్ల రూరల్/నరసరావుపేట రూరల్/బాపట్ల : చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు సూచన మేరకు పిన్నెల్లి సోదరులు పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే రీతిలో వ్యవహరించారు. మాచర్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా అడుగడుగునా తనిఖీలు చేస్తూ షాపులు.. దుకాణాలను బంద్ చేయించారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులను బలవంతంగా అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా, మాచర్లలో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. పలువురిని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. తుదకు పిన్నెల్లి కుటుంబ సభ్యులను, బంధువులను కూడా వారి ఇంట్లోకి అనుమతించక పోవడం ప్రభుత్వ అరాచకానికి అద్దం పడుతోంది. మాచర్ల నియోజకవర్గంలో మే 24వ తేదీన వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు బోదిలవీడు వద్ద జవిశెట్టి వెంకటేశ్వర్లు, (అలియాస్ మొద్దయ్య) కోటేశ్వరరావులను తెలుగుదేశం పార్టీ వారే హత్య చేశారని అప్పటి ఎస్పీనే స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ ఘటనలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై అక్రమ కేసు బనాయించారు. ఈ హత్య కేసులో తమకు ఏమీ సంబంధం లేదని పీఆర్కే సోదరులు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి, బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అనంతరం బెయిల్ రద్దు చేస్తూ లొంగిపోవాలని చెప్పింది. ఈ క్రమంలో గురువారం ఉదయం పీఆర్కే సోదరులు తమ లాయర్లతో కలిసి మాచర్ల కోర్టుకు హాజరయ్యారు. జూనియర్ సివిల్ జడ్జి, కోర్టు అడిíÙనల్ జడ్జి ప్రశాంత్ వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించగా వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు జైలుకు తరలించారు. గృహ నిర్బంధాలు.. బెదిరింపులు పిన్నెల్లి సోదరులకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పిన్నెల్లి నివాసం వద్దకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాచర్ల పట్టణానికి నలువైపులా కంచె, బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఐడి కార్డు ఉంటేనే పట్టణంలోనికి అనుమతించారు. రాయవరం జంక్షన్, రచ్చమల్లపాడు, కొత్తపల్లి, గుంటూరు, నర్సరావుపేట రోడ్లు, జమ్మలమడక రహదార్లలో తనిఖీలు చేశారు. కోర్టు వద్ద స్వయంగా జిల్లా ఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. పీఆర్కేను చూసేందుకు వారి సోదరి, పెద్దమ్మ, బంధువులు వచ్చినా అనుమతించ లేదు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. శ్యామల భర్త నర్సారెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో ఉంచారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సు«దీర్ భార్గవ్రెడ్డిలను అడ్డగించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బ్లడ్ బుక్ను నడుపుతున్నారని మండిపడ్డారు. నీచ రాజకీయాలకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, వైఎస్సార్పీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్లు నరసరావుపేటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లాలో పార్టీ నేతలు వరికూటి అశోక్ బాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, డాక్టర్ అశోక్ కుమార్, ఈవూరి గణేశ్, గాదె మధుసూదన్రెడ్డి తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ న్యాయస్థానంపై గౌరవంతో, న్యాయంపై నమ్మకంతో వారి ఆదేశాల మేరకు కోర్టులో హాజరవుతున్నాం. ఈ సందర్భంగా మాకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న ప్రజలను, నాయకులను, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకోవటం దారుణం. నేతల అక్రమ నిర్బంధాలేంటి? రోడ్లపై అడ్డగింతలేంటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు మంచివి కావు. – పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
‘రెవెన్యూ’లో గందరగోళం
సాక్షి, అమరావతి : రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రధానంగా భూముల విషయాలపై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆ అంశాలన్నింటినీ ఏడాదిలోగా పరిష్కరించేందుకు మంత్రులందరూ దృష్టి సారించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని సమాచార శాఖ మంత్రి కె.పార్థసారధి చెప్పారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. భూ రికార్డులను ట్యాంపర్ చేయడంతో పాటు నలుగురు అన్నదమ్ములుండే కుటుంబంలో మొత్తం ఆస్తిని ఒకరే రాయించుకోవడం, ఎటువంటి ఆధారాలు లేకుండా భూములను 22–ఏలో పెట్టడం, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వక పోవడం, రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడటంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి సమస్యలతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని సీఎం తెలిపారన్నారు. మంత్రులందరూ ప్రత్యేక దృష్టితో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంతో పాటు మొత్తం భూ రికార్డులను ట్యాంపరింగ్కు ఆస్కారం లేకుండా బ్లాక్ చైన్లో ఉంచాలని ఆదేశించారని చెప్పారు. భవిష్యత్లో రెవెన్యూ, భూముల సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం స్పష్టం చేశారన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఇలా..» అమృత–2 పథకం కింద పట్టణ స్థానిక సంస్థల్లో రూ.9,514.63 కోట్లతో 506 ప్రాజెక్టులు చేపట్టేందుకు జారీ చేసిన జీవోకు ఆమోదం. మిగిలిన 281 ప్రాజెక్టులను లంప్సమ్ విధానంలో ప్యాకేజీలుగా విభజించి అమలు చేసేందుకు అనుమతి మంజూరు.» అమరావతిలో లోక్భవన్ నిర్మాణాన్ని ఎల్–1 బిడ్డర్కు అప్పగించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి.» ఏపీలోని ఎన్హెచ్–16తో అనుసంధానించే 3.5 కిలోమీటర్ల మేర ఇ–3 రోడ్డు (ఫేస్–3) విస్తరణ ప్యాకేజీని రూ.532.55 కోట్లకు ఎల్–1 బిడ్డర్కు ఇచ్చేందుకు ఏడీసీఎస్ చైర్మన్కు అనుమతి.» చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో పలార్ నదిపై చెక్డ్యామ్ మరమ్మతులకు రూ.15.96 కోట్లు.. సవరించిన ప్రతిపాదనలకు ఆమోదం.» గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న 227 మంది తెలుగు పండిట్లు, 91 మంది హిందీ పండిట్లు, 99 మంది వ్యాయామ ఉపాధ్యాయులను మొత్తం 417 మందిని స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసేందుకు ఆమోదం. » ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్ నిర్మాణం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. » కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన మోడల్ ప్రిజన్స్ చట్టం–2023ను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ చట్టం –2025 ముసాయిదా బిల్లుకు ఆమోదం. ఇందులో భాగంగా ప్రిజన్స్ చట్టం –1894, ప్రిజన్స్ చట్టం–1900, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజన్స్ చట్టం 1950లను రద్దు చేస్తూ కొత్త చట్టం అమలుకు కేబినెట్ ఆమోదం. ముసాయిదా బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతారు.» ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో పలు క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీలు, సంస్థలకు, పర్యాటక ప్రాజెక్టులపై తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. -
ఫైబర్నెట్ కేసు క్లోజ్!
సాక్షి, అమరావతి: ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో సైతం అనుకున్నదే జరిగింది. ఇప్పటికే పలు కుంభకోణాలకు సంబంధించి సీఐడీ గతంలో నమోదు చేసిన కేసులను కొట్టేయించుకున్న సీఎం చంద్రబాబు తాజాగా ఫైబర్ నెట్ కుంభకోణం కేసును కూడా విజయవంతంగా కొట్టేయించుకున్నారు. ప్రభుత్వం అధీనంలో పనిచేసే సీఐడీని పూర్తిగా అదుపులోకి తీసుకుని అధికారులను ప్రభావితం చేసి అనుకూలంగా మార్చుకున్నారు. మాటవినని అధికారులను సస్పెండ్ చేశారు. పలువురిని బదిలీ చేశారు. దాంతో సీఐడీ కేసులన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.కుంభకోణాలపై అనేక ఆధారాలు సేకరించిన సీఐడీ...2014–19 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు కుంభకోణాలు జరిగాయి. అసైన్డ్ భూముల కుంభకోణంపై 2020లో, ఫైబర్ నెట్ కుంభకోణంపై 2021లో, మద్యం కుంభకోణం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడీ 2023లో పలు కేసులు నమోదు చేసింది. చంద్రబాబు, ఆయన మంత్రివర్గంలో ఉన్న పలువురిని నిందితులుగా చేర్చింది. చాలా మంది కీలక సాక్షులను విచారించింది. చంద్రబాబు తదితరుల అక్రమాలను, అవకతవకలను, ఆశ్రిత పక్షపాతాన్ని రుజువుచేసే పలు సాక్ష్యాధారాలను సీఐడీ సేకరించింది. అక్రమాలను నిర్ధారించింది. సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి ఏసీబీ కోర్టులో చార్జిషీట్లు సైతం దాఖలు చేసింది.నిందితులే పాలకులు కావడంతో...ప్రభుత్వం మారడం, గతంలో పలు కుంభకోణాల కేసులో నిందితులుగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, అలాగే లోకేశ్, నారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు మంత్రులు కావడంతో పరిస్థితి మారిపోయింది. పరిపాలన మొత్తం తమ చెప్పు చేతల్లో ఉండటంతో నిందితులుగా ఉన్న వారు సీఐడీ అధికారులను తీవ్రంగా ప్రభావితం చేశారు. తమపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసిన పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. మరికొందరిని బదిలీ చేశారు. తమకు కావాల్సిన వారిని సీఐడీలోకి తీసుకొచ్చారు. ఇదే సమయంలో గతంలో తమపై సీఐడీకి ఫిర్యాదు చేసిన అధికారులు వాసుదేవరెడ్డి, మధుసూధన్రెడ్డి తదితరులను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబు, లోకేశ్, నారాయణ తదితరులపై కేసుల మూసివేతకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. గతంలో దర్యాప్తు చేసి సేకరించిన కీలక సాక్ష్యాధారాలన్నింటినీ మూలనపడేసింది.అంతా రహస్యమే...చంద్రబాబు తదితరులపై నమోదు చేసిన కేసులను మూసివేయాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పలు పిటిషన్లు దాఖలు చేసింది. వాటిని అత్యంత రహస్యంగా ఉంచింది. ఫిర్యాదుదారులైన వాసుదేవరెడ్డి, మధుసూధన్రెడ్డి వంటి అధికారులను కోర్టుకు తీసుకొచ్చింది. చంద్రబాబు తదితరులపై కేసుల ఉపసంహరణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారి చేత చెప్పించింది. ఏసీబీ కోర్టు సైతం వాస్తవ ఫిర్యాదుదారులు ఎవరో తెలుసుకోకుండా చంద్రబాబు తదితరులపై దాఖలైన పలు కేసులను మూసివేస్తూ ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది. చంద్రబాబుపై కేసులను మూసివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీలు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఏ కారణంతో ఏసీబీ కోర్టు చంద్రబాబు తదితరులపై కేసులను మూసివేసిందో కూడా తెలియడం లేదు. చంద్రబాబుపై కేసుల మూసివేత వ్యవహారం ఇంత రహస్యంగా సాగుతుండటంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో సర్టిఫైడ్ కాపీలు ఇవ్వండి...ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్, నారాయణ తదిత రులపై అసైన్డ్ భూములు, మద్యం, ఉచిత ఇసుక కుంభకోణాలకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, దర్యాప్తులో భాగంగా నమోదు చేసిన వాంగ్మూలాలు, దర్యాప్తు పూర్తి చేసి దాఖలు చేసిన చార్జిషీట్లు, కేసులను మూసివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీలను అందచేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు విజయవాడ ఏసీబీ కోర్టులో థర్డ్ పార్టీ పిటిషన్లు దాఖలు చేశారు.అయితే ఆ కాపీలను అందచేసేందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తూ 5వ తేదీన ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వుల కాపీ 6 రోజుల తర్వాత గురువారం బయటకు వచ్చింది. సువర్ణరాజు పిటిషన్ రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తోందని, అందుకే ఆయన అభ్యర్థనను అనుమతించడం లేదని ఉత్తర్వులో పేర్కొన్నారు.గౌతంరెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్ కొట్టివేత..ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబుపై గతంలో తాము దాఖలు చేసిన కేసును మూసివేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ని వ్యతిరేకిస్తూ ఫైబర్ నెట్ లిమిటెడ్ పూర్వ చైర్మన్, ఫిర్యాదుదారు అయిన పూనూరు గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు గురువారం తీర్పు వెలువరించారు. చంద్రబాబు తదితరులపై ఫైబర్ నెట్ మూసివేత కోసం సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ని వ్యతిరేకిస్తూ గౌతంరెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో తాను ఫిర్యాదుదారునని, కేసు మూసివేతకు ముందు తనకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, సీఐడీ ఆ పని చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫైబర్నెట్ లిమిటెడ్కు అప్పట్లో ఎండీగా ఉన్న మధుసూధన్రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయన చేత కేసు మూసివేతకు అభ్యంతరం లేదని చెప్పించడం చట్ట విరుద్ధమని ఆయన వివరించారు.ఫైబర్నెట్ రింగ్మాస్టర్ చంద్రబాబేసాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాం (2024–19)లో యథేచ్ఛగా సాగిన దోపిడీ పర్వంలో ఫైబర్ నెట్ కుంభకోణం కూడా ఒక అంకం. చంద్రబాబే ఈ కుంభకోణం రింగ్ మాస్టర్. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ను తన అస్మదీయుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధులు కొల్లగొట్టారని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. అందుకే ఏ1గా చంద్రబాబు, ఏ2గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ3గా ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్, ఇన్క్యాప్ సంస్థలకు అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావులతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. చంద్రబాబు పన్నాగం ప్రకారమే...మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు చంద్రబాబు బరితెగించారు. తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కే ఈ ప్రాజెక్టును అప్పగించడం కోసం ఆయన్ను ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యునిగా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని ఫైబర్నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వారు టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదన్నది నిబంధన. కానీ చంద్రబాబు ఆ నిబంధనను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్ట్ కింద సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతంగా పెంచేశారు. ఇక ఈ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్లో ఉంది. కానీ చంద్రబాబు ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి ఏకపక్షంగా తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టేశారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించారు. నకిలీ ఇన్వాయిస్లతో నిధులు కొల్లగొట్టి..ఇక ప్రాజెక్ట్ను అమలు చేయడంలో కూడా టెరాసాఫ్ట్ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి, కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది.అక్రమాలు తేల్చిన మధుసూధన్రెడ్డితోనే అభ్యంతరం లేదని చెప్పించిన సీఐడీ...ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీగా మధుసూధన్రెడ్డి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను నిర్ధారించిన విషయాన్ని గౌతంరెడ్డి ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. భారీ మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేల్చిన విషయాన్ని కూడా కోర్టుకు తెలియచేశారు. అయినా మధుసూధన్రెడ్డి ఫైబర్ నెట్ కుంభకోణంపై చంద్రబాబు తదితరులపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు అభ్యంతరం లేదని చెప్పడంపై గౌతంరెడ్డి తన పిటిషన్లో విస్మయం వ్యక్తం చేశారు. ఈ కుంభకోణం కేసులో సీఐడీ సేకరించిన ఆధారాలను, చార్జిషీట్లు పరిశీలించి ఆ తరువాతనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్, గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్పై ఇటీవల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయాధికారి భాస్కరరావు గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. చంద్రబాబు తదితరులపై కేసు మూసివేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించారు. ఇదే సమయంలో గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ను తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చారు. అయితే ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి రాలేదు. ఏ కారణాలతో సీఐడీ పిటిషన్ను అనుమతించారు, ఏ కారణాలతో గౌతంరెడ్డి పిటిషన్ను తోసిపుచ్చారో అన్న వివరాలు తెలియాల్సి ఉంది. -
చెరువులను చెరబట్టిన సీఆర్డీఏ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో ఆ ప్రాంత రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అన్నీ ఇన్నీ కావు. తొలి దశ కింద పదేళ్ల క్రితం భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లలో కొన్ని రిజిస్ట్రేషన్ చేసినా, ఇప్పటి వరకు ఆ ప్లాట్లను అభివృద్ధి చేయలేదు. మరికొందరికి అసలు ప్లాట్లే ఇవ్వలేదు. ఇప్పుడు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చెరువు భూములను ప్లాట్లుగా మార్చి, రైతులకు ఇచ్చి, వారిని మోసం చేస్తోంది. ఇది రైతులకు ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధం. పైగా, భవిష్యత్తులో ఇవి చెరువు భూములంటూ ప్రభుత్వమే ఇక్కడి నుంచి రైతుల ఇళ్లను కూలగొట్టి, పంపించేసే అవకాశాలు అధికం. ఇలా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కూడా వెన్నుపోటు పొడుస్తోంది. సందట్లో సడేమియాగా అర్హులు కాని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులకూ ప్లాట్లు ఇచ్చుకుంటోంది. రాజధాని ప్రాంతంలో పలువురు రైతులను నిలువునా ముంచేందుకు చంద్రబాబు సర్కారు నేతృత్వంలోని సీఆర్డీఏ చెరువుల భూములను కబ్జా చేసింది. రాజధాని కోసం భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) కింద భూములు ఇచ్చిన రైతులకు వాటిలో రెసిడెన్షియల్ ప్లాట్లు (నివాస స్థలాలు) రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. ఆ ముసుగులో టీడీపీ సానుభూతిపరులు, ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిందంటూ రైతులు ఆరోపిస్తున్నారు. తుళ్లూరు, పిచ్చుకలపాలెం చెరువు భూములలో రెసిడెన్షియల్ ప్లాట్లను సీఆర్డీఏ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే అందుకు ఆధారం. దొండపాడు చెరువును కబ్జా చేసి, చదును చేసి సీడ్ యాక్సిస్ రోడ్డును నిర్మించడం మరో నిదర్శనం. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాలలోని 29,233 మంది రైతులు 34,937.33 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ‘భూ సమీకరణ’ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ఈ రైతులకు మెట్ట భూమి ఎకరానికి అభివృద్ధి చేసిన 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇస్తామని, మాగాణి (జరీబు) భూమైతే ఎకరానికి 1000 గజాల నివాస, 450 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు 29,233 మంది రైతులకు 69,421 ప్లాట్లను కేటాయించామని, ఇప్పటివరకూ 27,105 మంది రైతులకు 61,753 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని సీఆర్డీఏ చెబుతోంది. ఇంకా 2,128 మంది రైతులకు 7,668 ప్లాట్లను ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. చెరువును అసైన్డు భూమిగా చిత్రీకరించి..తుళ్లూరు మండలం పిచ్చుకలపాలెంలో రీసర్వే అండ్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) ప్రకారం సర్వే నంబరు 87లో 11.25 ఎకరాలు, సర్వే నంబరు 88లో 0.31, 89లో 0.59 ఎకరాలు చెరువు భూమి అని స్పష్టంగా ఉంది. ఆ గ్రామ భౌగోళిక మ్యాప్లోనూ సర్వే నంబరు 87లో చెరువు ఉన్నట్లు చూపుతోంది. కానీ, ఆ చెరువు భూమిలో 78 మందికి సీఆర్డీఏ రెసిడెన్షియల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చేసింది. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే నంబరు 87లో భూమి అసైన్డు భూమిగా సీఆర్డీఏ పేర్కొనడం గమనార్హం. అంటే... పిచ్చుకలపాలెం చెరువులో 11.25 ఎకరాల భూమిని అసైన్డు భూమిగా మార్చేశారన్నది స్పష్టమవుతోంది. కొండవీటి వాగు వరదను మళ్లించేందుకు నెక్కల్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.83 కిలోమీటర్ల పొడవున తవ్వుతున్న గ్రావిటీ కెనాల్ను పిచ్చుకలపాలెం చెరువులోనూ కొంత భాగం తవ్వారు. ఆ కెనాల్కు అటు ఇటుగా ఈ 78 మందికి ప్లాట్లు కేటాయించడం గమనార్హం. ఇక తుళ్లూరులో సర్వే నెంబరు 80లో 33.06 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ‘మీ భూమి’ వెబ్సైట్లో ఇప్పటికీ అది చెరువు భూమే అని అడంగల్ రికార్డు స్పష్టం చేస్తోంది. కానీ.. ఆ చెరువు భూమిలో 65 మందికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసింది. ఇక ప్రధాన రాజధాని ప్రాంతం (సీడ్ కేపిటల్)ను కోల్కత–చెన్నై జాతీయ రహదారితో అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం దొండపాడు చెరువును సీఆర్డీఏ కబ్జా చేయడం గమనార్హం. ఆ చెరువును చదును చేసి రోడ్డు నిర్మించింది. చెరువును పరిరక్షించాల్సింది పోయి..కొండవీటివాగు, పాలవాగు ముంపు నుంచి రాజధాని అమరావతిని తప్పించడానికి ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు నెదర్లాండ్కు చెందిన నిపుణులు రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముంపు ముప్పు నివారణ పనులను సీఆర్డీఏ చేపట్టింది. చిన్నపాటి వర్షం కురిస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు తరచుగా ముంపు సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికి ప్రధాన కారణం చెరువులు, వాగులు, వంకలు ఆక్రమించడమేనన్నది బహిరంగ రహస్యమే. అసలే ముంపు ముప్పు ఉన్న రాజధాని ప్రాంతంలో చెరువులను కబ్జా చేసి, వాటి స్వరూపాన్ని మార్చేస్తే వరద ముప్పు మరింత పెరుగుతుందని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వరద ముప్పు, భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, వంకలు, నదులు, జలాశయాల భూమిని ఇతర అవసరాలకు మళ్లించకూడదని.. వాటిని పూర్తి స్థాయిలో పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీం కోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనేక సార్లు స్పష్టమైన ఆదేశాలిచ్చాయని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కి చెరువు భూములను రెసిడెన్షియల్ ప్లాట్ల కింద ఇచ్చేయడం, సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మించడం సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను అపహాస్యం చేయడమేనని పర్యావరణవేత్తలు, న్యాయనిపుణులు అంటున్నారు.అనర్హులే అధికం..రాజధానికి భూములిచ్చిన రైతులకు మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీం కింద అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు సీఆర్డీఏ ఇవ్వాలి. ఆ ప్లాట్లను భూసమీకరణ కింద తీసుకున్న భూములలోనే ఇవ్వాలి. కానీ.. పిచ్చుకలపాలెం చెరువు భూమిలో 78 మందికి, తుళ్లూరు చెరువు భూమిలో 65 మందికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం బట్టి చూస్తే.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకూ చంద్రబాబు సర్కారు వెన్నుపోటు పొడిచిందన్నది స్పష్టమవుతోంది. ఆ ప్లాట్లలో ఇళ్లను నిర్మించుకుంటే.. చట్టప్రకారం భవిష్యత్లో వాటిని కూల్చేయడం ఖాయమని, అప్పుడు తమ పరిస్థితి ఏమిటని రైతులు నిలదీస్తున్నారు. ఇక్కడ టీడీపీ సానుభూతిపరులు, ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వారికి కొన్ని ప్లాట్లు అక్రమంగా కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే చెరువు భూమిని సీఆర్డీఏ అసైన్డు భూమిగా చిత్రీకరించిందని మండిపడుతున్నారు. చెరువును మాయం చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, వాతావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడతామని పిచ్చుకలపాలెం, తుళ్లూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చెరువు భూమిలో ప్లాట్లు ఎలా ఇస్తారు?పిచ్చుకలపాలెంలో సర్వే నంబరు 87లో 11.25 ఎకరాల భూమిలో చెరువు ఉంది. ఆర్ఎస్ఆర్, రెవెన్యూ మ్యాప్ ప్రకారం ఆ సర్వే నంబరులో చెరువు ఉందన్నది స్పష్టం. సీఆర్డీఏ అధికారులు 78 మందికి రెసిడెన్షియల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేశారు. ఇది అక్రమం కాదా? ఆ ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుంటే భవిష్యత్తులో వాటిని కూల్చరని గ్యారంటీ ఇచ్చేదెవరు?రాజధానికి భూములు ఇచ్చిన పాపానికి మాకు చెరువు భూమిలో ప్లాట్లు అంటగట్టి మోసం చేస్తారా? పిచ్చుకలపాలెం చెరువు భూమిలో ప్లాట్లు ఇచ్చిన వారిలో రైతులు కాని వారు కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – బ్రహ్మంచౌదరి, రైతు, పిచ్చుకలపాలెం -
చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్ మంత్రులపై సీరియస్..
-
‘కూటమి నేతలు తప్పు చేసి.. వైఎస్సార్సీపీపై బురదజల్లుతారా?’
సాక్షి, తిరుపతి: కూటమి వచ్చాక తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్ జగన్పై కూటమి దాడి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు వైఖరితోనే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని.. కూటమి నేతలు తప్పు చేసి వైఎస్సార్సీపీపై బురదజల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ను దెబ్బతీయడానికి తిరుమలను చంద్రబాబు వాడుకుంటున్నారు. ఎన్నికల ముందు, తరువాత తిరుమల చూట్టు రాజకీయాలు చేస్తున్నారు. లడ్డూ, పరకామణి, పట్టు వస్త్రాలు అవినీతి అంటూ జగన్ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయంగా దెబ్బ తీయడానికి స్వామివారి కూటమి నేతలు వాడుకుంటున్నారు...పదిరోజుల వైకుంఠ ఏకాదశి వద్దని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ అదే కొనసాగిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు దీనికి కారణం వైఎస్సార్సీపీనే.. పదిరోజుల దర్శనం తప్పు అంటూ ప్రచారం చేశారు. లడ్డూ కేసులో ఇప్పటి వరకు రాజకీయపరమైన అరెస్టు ఒక్కటి జరగలేదు. కాని సుబ్బారెడ్డి చేశాడని అసత్య ప్రచారం చేశారు...సింహాచలం ఆలయంలో దొంగతనం చేస్తే స్టేషను బెయిల్ ఇచ్చి వదిలేశారు. 2015 నుంచి 2025 వరకు పట్టు వస్త్రాల స్కాం జరిగితే.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నాడు. రోజుకో మాట మాట్లాడటంలో పవన్ దిట్టా. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడూ జరగని అపచారాలు తిరుమలలో జరిగాయి’’ అని భూమన ధ్వజమెత్తారు. -
జైల్లో పెట్టుకుంటూ పోతే భయపడే ప్రసక్తే లేదు: YSRCP నేతలు
-
చంద్రబాబుపై డి.రాజా ఆగ్రహం
సాక్షి,అనంతపురం: చంద్రబాబు పరిపాలనపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా (దొరైసామి రాజా) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి చంద్రబాబు ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. అంబేద్కర్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ పాలన సాగుతోంది. రాజ్యాంగాన్నే మార్చాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నా చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. -
చంద్రబాబుని లెక్క చేయని మంత్రులు!
సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లైట్ తీసుకుంటున్నారా?. పద్దతి మార్చుకోవాలని పదే పదే చెబుతున్నా.. తమ దారి తమదేనన్న రీతిలో వాళ్లు వ్యవహరిస్తుండడం, దానికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం రోటీన్గా మారిపోయింది. ఈ క్రమంలో.. ఇవాళ కేబినెట్ మీటింగ్లోనూ సీన్ రిపీట్ అయ్యింది. ఏకంగా మంత్రులపైనే చంద్రబాబు చిందులు తొక్కినట్లు సమాచారం. ఇంతకీ ఎందుకు అంటారా?.. మంత్రులు కాస్త లేట్గా కేబినెట్ మీటింగ్కు వచ్చారట!. దీంతో నా అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీనే పట్టించుకోరా? అని మండిపడ్డారట!. ఆపై ఏమనుకున్నారో ఏమో కాస్త శాంతించి.. మంత్రులు అయ్యి ఉండి మీరే టైంకి రాకపోతే ఎలా?.. అని కాస్త తగ్గిన వాయిస్తో చంద్రబాబు మాట్లాడారట. అలా లేట్గా వచ్చిన వాళ్లలో ఆనం రామనారాయణరెడ్డి, సంధ్యారాణి, సుభాష్లు ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడంతో ఆయనలోని కోపధారి బయటకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. బుధవారం ఏం జరిగిందంటే.. రాష్ట్ర మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన హెచ్ఓడీల (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పలుమార్లు సూచనలు చేసినప్పటికీ మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. ‘‘చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తెలియడం లేదు. మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఫైళ్ల పురోగతి, ప్రాజెక్టుల స్థితి, బడ్జెట్ వినియోగం వంటి అంశాలపై రోజువారీగా సమీక్ష చేయాలి’’ అన్నారు. అలాగే.. కేంద్రం నుంచి నిధులు రప్పించడంలో మంత్రులు అట్టర్ప్లాప్ అవుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారని అధికార వర్గాలు తెలిపాయి. -
బాబూగోరిజం అంటే ఇదే మరి...
ఇజాలు నిజాలు వేర్వేరు...ఇజం నిజం కానక్కర్లేదు...నిజానికి ఇజం అక్కర్లేదు..ఇదే మన ముఖ్యమంత్రి బాబుగారి సిద్ధాంతమేమో అనిపిస్తోంది. చెప్పొచ్చేదేంటంటే...సర్కారు సంక్షేమ కాడిని కిందికి పడేసి...ప్రైవేటు భుజాన పెట్టేయడమే వారి దృష్టిలో అసలు సిసలు సంస్కరణ. మీకు డౌటనుమానమా? అయితే ఏపీలో కాస్త లుక్కేయండి...బాబుగోరు పవర్ లోకి వచ్చాక ఎన్ని విప్లవాలు పుట్టుకొచ్చాయో....వైద్యవిద్యను దెబ్బకు ప్రైవేటు పరం కానిచ్చి పరమానందంగా అలా ముందుకెళదాం అంటున్నారు. కావచ్చు మనకేంటి నష్టం? అంటారా? ప్రజలకు ప్రాథమిక హక్కుగా అందాల్సిన వైద్యం పక్కా కమర్షియల్ గా మారిపోవడానికి ....ఆ వైద్యవిద్యపై కొందరు ఖర్చుపెట్టే లక్షలాది ఫీజులు కాదా. ఇలా ప్రతీది ప్రైవేటు అంటూ పోతే సర్కారుకు బరువు బాధ్యతలు పేలపిండిలెక్కన మారిపోవా? అని కొందరు బాధపడుతున్నారు. .అసలు బాబుగోరి రూటే వేరండి...మనకు అర్థం చేసుకునే బుర్ర ఉండాలి. వారిది మొదట్నుంచీ ఇదే స్టైల్. కాశీకి పోయి ఏదో ఒకటి వదిలేసేవారున్నట్లే...సర్కారు వచ్చాక దేన్నైనా ప్రైవేటు భుజాలపై పెట్టి వదిలించుకునే అలవాటున్నవారు మరి. అందుకే ఈసారి మెడికల్ కాలేజీ పై పడ్డారు. అన్నిటికీ మించి గత సర్కారు చేసిన ఏ మంచి పనినైనా సరే కెలకాల్సిన గొప్ప బాధ్యత అధికారంలోకి వచ్చాక ఉంటుంది కదా అనుకుంటున్నారేమో తెలీదు కానీ ...వైఎస్సార్ సీపీ అధికాంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవాలన్న అంశాన్ని ఇపుడు ప్రైవేటు వారికిచ్చేశారు. గతంలో మహారాజులు నచ్చిన వారికి అగ్రహారాలు రాసిచ్చినట్లు ఇపుడు ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేసేందుకు రెడీ అయిపోయారు. మరోపక్క విశాక స్టీల్ ప్రైవేటుపరం చేసే కుంపటి రగులుతునే ఉంది..సీట్లు తక్కువొచ్చాయి కదా జగన్ పార్టీ ఏం చేస్తుందిలే అనుకుంటే...అంతకంతకూ పవర్ ఫుల్ గా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది. ఇపుడు కో టి గళాల గర్జన అంటూ జగన్ మరో అంకానికి తెరలేపడంతో కూటమి అధినేత బాబుగారు జర గుస్సాఅవుతున్నారని వినికిడి. గత రెండు నెలలుగా వైఎస్పార్ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో కోటి సంతకాల సేకరణోద్యమం ఉధృతంగా సాగుతున్నది బాబుగారి దాకా చేరక పోతుందా? వారు కినుక వహించకుండా పోతారా? అన్నది కదా పాయింట్..గత వైఎస్సార్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్ది బడుగు పిల్లల నోట ఇంగ్లీష్ మాటలు పలికించిన తీరు ఎంతకాదన్నా కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇబ్బందిగానే మారింది. ప్రైవేటు పాఠశాలల ఊసెత్తని తరం వచ్చేస్తోందన్న ఆందోళన అప్పట్లో వారిలో ఎంతుండేదని. కూటమి రాగానే హమ్మయ్యా మనకిక భయంలేదు...సర్కారు పాఠశాలలకు మళ్ళీ నిరాదరణ వైభోగం తప్పదనుకున్నారని సమాచారం. ఇపుడు మరి బాబుగారికి ఆలోచన ఏ బ్రహ్మీ ముహూర్తాన పుట్టిందో తెలీదు కానీ గత వైఎస్సార్ సీపీ సర్కారు హయంలో ఏర్పడ్డ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించుకున్నారు. .ఇది మున్ముందు సామాన్య ప్రజలకు ఎంత ఇబ్బందిగా మారుతుంది. వైద్యం బడుగు ప్రజలకు అందుబాటులోకి రాకపోతే ఎంత కష్టంగా ఉంటుంది...ఇవేవీ ఇపుడు వారి సిలబస్ లో లేని అంశాలు. అయినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ...ఆ వారసత్వ బాటలో నడచిన తనయుడు మాజీసీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సర్కారు విద్య సంస్కరణలు ప్రజలకు గుర్తుండే ఉంటుందిగా. మరీ ముఖ్యంగా ఇలా ప్రైవేటు పడగ విప్పినపుడు ఇంకా బాగా గుర్తొస్తుంటుంది. - ఆరేం. -
అప్పుల కుప్పలు.. ప్రజలకు కష్టాలే కష్టాలు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయన్న తాజా నివేదిక ఆందోళనకరం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం అధ్యయనం ప్రకారం వేగంగా రుణగ్రస్థమవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ముందున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వాలు చేస్తున్న పదేళ్ల టర్మ్ అప్పులు మరీ ఎక్కువ భాగంగా మారుతున్నాయని, చేసిన అప్పులు సక్రమంగా వాడకపోవడం, ఉద్దేశించిన పథకాలకు కేటాయించకపోవడం, ఆశించినంత రాబడి లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అడిగినా అప్పులివ్వడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బీఎం చట్టం వల్ల కొత్త అప్పులు పుట్టడం లేదని కూడా వాపోయారు. అయితే... ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమిటి? అప్పటి సీఎం అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడని.. తాను సంపద సృష్టించి ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తానని కదా? ఏమైంది? అధికారం దక్కగానే స్వరం మారింది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అలాగని కొత్తగా సంపద సృష్టించారా? ఊహూ.. అదీ లేదు. పైగా నిధుల ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నారన్న వస్తున్న విమర్శలనూ పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో రూ.40 వేల కోట్ల అప్పు చేసేందుకు అవకాశం ఉండగా రూ.49 వేలు, తెలంగాణ రూ.31 వేల కోట్ల స్థానంలో రూ.60 వేల కోట్లు అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తాల్లోనూ పదేళ్లలో తిరిగి చెల్లించవలసిన సెక్యూరిటీలే ఎక్కువ. దీనివల్ల వచ్చే పదేళ్లలో రాష్ట్రాలు మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కునే ప్రమాదం ఉంది. అయితే హైదరాబాద్ మహానగరంలోని ప్రభుత్వ భూముల వేలం ద్వారా తెలంగాణ ఏటా రూ.5 నుంచి రూ.పది వేల కోట్ల వరకూ సంపాదిస్తోంది. పైగా రాజధాని పేరుతో ఇష్టమొచ్చినట్లు అప్పు చేయాల్సిన అవసరమూ ఆ రాష్ట్రానికి లేదు. పరిశ్రమల పేరు చెప్పి అణాకు, బేడాకు భూములు కూడా ఇవ్వడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి.ఆదాయమేమో తక్కువ. దుబారా ఎక్కువ. విజన్ విజన్ అని చంద్రబాబు చెప్పే మాటలు చేతల్లో మాత్రం అస్సలు కనిపించడం లేదు. చంద్రబాబు తాను చేతల మనిషిని కూడా అన్నది రుజువు చేసుకోవల్సిన తరుణం వచ్చింది. ఎందుకంటే అధికారం దక్కిన తరువాత కేవలం 18 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఎకాఎకి రూ.2.5 లక్షల కోట్ల వరకూ ఉంది. ఈ డబ్బు ఎలా సద్వినియోగమైందో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రజలకు ఆరోగ్య వరప్రదాయిని కాగల 17 వైద్యకళాశాలలను ప్రైవేట్ పరం చేయడం, రూ.6500 కోట్లకు పైగా ఫీజ్ రీయంబర్స్మెంట్ బకాయిలు, రూ.3000 కోట్ల ఎన్టీఆర్ ఆరోగ్యసేవ బకాయిలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. మరో వైపు సూపర్ సిక్స్ అని, ఎన్నికల ప్రణాళిక అని ఏటా సుమారు లక్షన్నర కోట్ల విలువైన హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వాటిలో కొన్నిటిని అరకొరగా చేసి.మిగిలిన వాటిని మంగళం పలకడానికి ఇప్పుడు తాజాగా అప్పులు పుట్టడం లేదన్న గాత్రం అంందుకున్నట్లు అనిపిస్తుంది. రాష్ట్ర జీఎస్టీ రాబడి తగ్గడం కూడా మరో ప్రమాద సూచిక. జీఎస్టీ స్లాబ్లు తగ్గడంతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని ఎల్లోమీడియా డబ్బా కొట్టినా ఇప్పుడు మాటమార్చి రాబడి తగ్గిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని సెంట్రల్ యూనివర్శిటీ లోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అసోసియేట్ ఫ్రొషెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి వంటి వారు కూడా అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒక్క కరోనా సంక్షోభ సమయంలో తప్పు నిర్ణీత పరిమితిలోపే అప్పులు చేసేవని, 2025లో పలు రాష్ట్రాలు హద్దులు దాటి అప్పులు చేస్తూ భావితరాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వాలు ఏ స్కీమ్ కింద అప్పులు చేస్తాయో దానికి ఖర్చు చేయకుండా దారి మళ్లించడం, దుర్వినియోగం చేయడం వల్ల అప్పు తీర్చడానికి అవసరమైన ఆదాయం రాదు. దాంతో అప్పులకు వడ్డీ తోడై భారం తడిసి మోపెడవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అసలు అప్పుల్లేకుండానే రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పినా ఇప్పటివరకూ రూ.40 వేల కోట్లు అప్పులు చేశారు. తెచ్చిన అప్పులతో రోడ్ల వంటివి నిర్మించినప్పటికీ ఆ తరువాత ఆదాయమేమీ రావడం లేదు. దీంతో అప్పులపై వడ్డీ భారం అంతకంతకూ పెరిగిపోతోంది. భూమి ఇచ్చిన రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత మిగిలిన భూమిని అమ్మి మాత్రమే ప్రభుత్వం డబ్బు సంపాదించుకోవాలి. లేదంటే అప్పు ఓ గుదిబండగా మారుతుంది. ఈ దృష్టితోనే రాజధాని పేరుతో విపరీతమైన ఖర్చులు వద్దని నిపుణులు వారించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం కంప చెట్లు కొట్టించేందుకే రూ.40 కోట్లు వ్యయం చేశారంటే ఈ ప్రభుత్వం దుబారా స్థాయి ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. వందల కోట్ల రూపాయలతో వరదనీరు తోడటం, కిలోమీటర్ రహదారికి ఎక్కడా లేనంతగా రూ.75 కోట్ల నుంచి రూ.174 కోట్ల వరకూ ఖర్చు చేస్తూండటం, మహా నగరాల్లోనూ లేని విధంగా చదరపు అడుగు భవన నిర్మాణానికి రూ.పదివేలకు మించి వ్యయం చేస్తూండటం కూడా ప్రభుత్వం తీరుకు అద్దం పట్టేవే. ఇలా లక్షల కోట్లు వ్యయం చేసి ఆ తర్వాత తిరిగి రాబట్టుకునే మార్గం లేకపోతే ఆ భారం రాష్ట్ర ప్రజలు మోయవలసిందే. ఈ మధ్యకాలంలో పరిశ్రమలకు ఇస్తున్న భారీ రాయితీలు కూడా ఆర్థిక పరిస్థితిపై మరిన్ని సందేహాలను లేవనెత్తుతున్నాయి. విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.22 వేల కోట్లకుపైగా రాయితీలు ఇవ్వడం దీనివల్ల వచ్చే ఉద్యోగావకాశాలు రెండువేలు కూడా లేకపోవడం చర్చనీయాంశమైంది. నిజానికి ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలో 200 ఉద్యోగాలే వస్తాయని తెలిపారు. అదే జరిగితే ప్రభుత్వం ఈ భారం అంతా మోయవలసి వస్తుంది.ఇక కొన్ని పరిశ్రమలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్నారు. అలాకాకుండా ప్రభుత్వం హేతుబద్దమైన రీతిలో ఈ ధరలు నిర్ణయించి ఉంటే అది అమ్మకమైన, లీజు అయినా ప్రభుత్వానికి కొంత ఆర్జన ఉంటుంది. ఇలా ఒకవైపు రాయితీలు ఇచ్చుకుంటూ పోయి, మరో వైపు ప్రభుత్వానికి ఏళ్లతరబడి వచ్చే ఆదాయం లేని పరిస్తితి ఏర్పడితే అది ఆర్ధిక సంక్షోభానికి దారితీయవచ్చన్నది నిపుణుల అంచనా.తీసుకునే రుణాలు ఏ పాతికేళ్లకో చెల్లించేలా తీసుకోగలిగితే అది ఒక రకంగా ఉండవచ్చు.కాని కేవలం పదేళ్లకే తిరిగి చెల్లించేలా ఒప్పందం అయితే ఏటాటే ఆర్ధిక భారం పెరుగుతుంది. అప్పులు తీర్చడానికే అప్పులు చేసే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. అప్పుడు రాష్ట్రాలు ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందన్నది నిపుణుల అంచనాగా ఉంది. తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం,ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేసి జనాన్ని మోసం చేయడం, అరకొరగా చేసి అన్నీ చేసేశామని బొంకడం, ఇంకో వైపు ఎక్కడ వీలైతే అక్కడ అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడం,దానిని కప్పిపుచ్చుతూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం..ఇదే - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


