breaking news
Chandrababu Naidu
-
మా భూములు లాక్కోవడానికి నువ్వు ఎవడివి..? చంద్రబాబుపై పెనుమాక రైతుల ఆగ్రహం
-
ఎవడి సొమ్ము అని మా భూములు అడుగుతున్నావ్.. అసలు ఈ గొడవకు కారణం ?
-
రాష్ట్రపతికి ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాట్లు చేస్తారా?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన జరగడం లేదు. ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. ఇదేనా సంపద సృష్టి అని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రభుత్వ అతిధి గృహంలో బస చెయ్యాలి. రాష్ట్రపతికి ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాట్లు చేస్తారా?. ఇది ప్రైవేట్ సంస్థకి దోచి పెట్టడం కాదా?. మన దగ్గర ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేవా?. ఈ నిర్ణయం మన ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. ప్రభుత్వ భవనాలను రాష్ట్రపతి వాడుకోవాలి. అవసరం అనుకుంటే భవనాలను ఆధునీకరణ చేసుకోవాలి. మన దేశం పరువు, ప్రతిష్ట ఏం కావాలి అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘మా పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. అధికారం చేతుల్లో ఉందని.. మాపై కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీతో పాటు, పోలీసుల మీద కూడా దాడి జరిగింది. మా పార్టీ నేతలపై టీడీపీ దాడులను ఖండిస్తున్నాం. రాష్ట్రంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులతో ఆటవిక పరిపాలన చేస్తున్నారు. అమరావతి రైతుల బాధలు తెలుసుకునేందుకు వెళ్లిన వారిపై హత్యా ప్రయత్నం చేశారు. పోలీసులను కూడా కొట్టారు. ఆ కానిస్టేబుల్ చావు బతుకుల మధ్య ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి.రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుంది. అమరావతికి వెళ్తే తప్పేంటి?. రాజకీయ విమర్శలు చెయ్యాలనుకుంటే చేయండి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా?. అమరావతిలో జరుగుతున్న అక్రమాలు బయట పడతాయని భయంతో ఉన్నారు. అమరావతి దోపిడీని చూస్తే తప్పేంటి?. దోపిడీ కాదు అమరావతిలో జరుగుతుంది అభివృద్దే అనుకుంటే మీకు భయమెందుకు?. ప్రభుత్వం మీ చేతిలో ఉందని మా నాయకులపై కేసులు పెడుతున్నారు.మన సంస్కృతికి విరుద్దంగా చీచుల్లో బార్లు పెడుతున్నారు. ఎయిర్పోర్టుల్లోనూ ప్రభుత్వం బార్లు ఓపెన్ చేస్తున్నారు. విదేశీ సంస్కృతి వేరు.. మన సంస్కృతి వేరు. బార్లు పెట్టడమే సంపద సృష్టా?. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు.. మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్రం సబ్సిడీ మీద మామిడి కొంటుంది. మీరు దేనికీ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. అన్ని పంటలు పండించే రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయం దండగ అనే నాడుడి బాబు సార్ధకం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మొదట నష్టపోయేది రైతులే. మీకు ఓటేసిన పాపానికి ఇదేనా మీ పాలన. కూటమి నేతలు మాట్లాడితే అవి సూక్తులు.. ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు.రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవటం లేదు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఆ సమయం ఆసన్నం అయ్యింది. విశాఖలో విలువైన భూములన్నీ పప్పు బెల్లల్లా పంచేస్తున్నారు. ఉపాధి కల్పన ఎక్కడా లేదు. భోగాపురం ఎయిర్పోర్టుకి దారి లేదు.. నీరు లేదు. అలాంటి విమానాశ్రయంలో బారు పెడతా అంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్న ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే మళ్ళీ యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారు.. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. మా నేతలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అమరావతి రైతులు వారి సమస్యలు మాకు చెప్పుకున్నారు. అమరావతి రావాలని ఇబ్బంది పడ్డ రైతులే ఆహ్వానించారు. ‘మావిగన్’ మా విధానం అని స్పష్టం చేశారు. -
ప్రభుత్వమా?.. గూండాల రాజ్యమా? బాబును నిలదీసిన జగన్
-
విమాన వేగంతో భూముల సమర్పణ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్యులు కోరుకుంటే అత్యంత విలువైన భూములు ఎంత వేగంగా పరుల పరమవుతాయో చెప్పడానికి తాజా ఉదాహరణ ఇది. రాష్ట్రంలోని ఓ కీలక మంత్రి దుబాయ్ వెళ్లడం, ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడి ఓ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లుగా కేవలం లక్ష రూపాయల మూలధనంతో ఢిల్లీలో ఓ కంపెనీ అవతరించడం, వారు ఏప్రిల్లో వందల కోట్ల విలువైన కాకినాడలోని మారిటైమ్ బోర్డు భూములను కోరడం, రెండు నెలల్లోనే ఆ భూములను వారి పరం చేయడం.. అంతా శరవేగంగా జరిగిపోయాయి. కాకినాడ వద్ద ప్రత్యేకంగా గుర్తించిన 45 ఎకరాల మారిటైమ్ బోర్డ్ భూమిని దుబాయ్కు చెందిన ఎస్ఏఎఫ్ అనుబంధ కంపెనీ సేఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కు 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1,835 కోట్లతో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూమి కేటాయించిన 15 నెలల్లో పనులు ప్రారంభించాలన్న షరతు విధించారు. లక్ష రూపాయలతో కంపెనీ ఏర్పాటు గతేడాది ఫిబ్రవరి నెలలో వ్యక్తిగత పర్యటన పేరుతో రాష్ట్రానికి చెందిన ఒక కీలక మంత్రి దుబాయ్ వెళ్లడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం కావడం అందరికీ తెలిసిందే. అప్పటి దుబాయ్ పర్యటన ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తీర ప్రాంతంలో వందల కోట్ల విలువైన మారిటైమ్ భూములను కొట్టేయడానికి ఈ పర్యటనలో, ఆ తర్వాత పెద్ద పథకమే వేసినట్లు అధికారవర్గాల కథనం. ఈ పథకంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఢిల్లీ కేంద్రంగా కేవలం లక్ష రూపాయల మూలధనంతో ఇద్దరు డైరెక్టర్లతో సేఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ డైరెక్టర్లుగా వీణా దీపక్ మున్గన్హల్లి, అమేయా యశ్వంత్ జోషి వ్యవహరిస్తున్నారు. ఇందులో వీణా దీపక్కు ఏవియేషన్ ఫ్యూయల్ వ్యాపారంలో ఎటువంటి అనుభవం లేదు. ఆమె ఇప్పటి వరకు వివిధ బ్రాండ్ నేమ్స్తో సెలూన్స్, స్పా, ఫ్యాషన్ బిజినెస్ చేస్తున్నారు. వీళ్లు లక్ష రూపాయల మూలధనంతో ఏకంగా రూ.1,835 కోట్ల విలువైన పెట్టుబడులు పెడతామంటూ రాష్ట్రానికి ప్రతిపాదన పంపగానే ఫైళ్లు వేగంగా కదిలాయి. ముందుగా భూ కేటాయింపులకు అడ్డంకిగా ఉన్న ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాట్మెంట్ గైడ్లైన్స్ – 2026ను సవరించారు. ఫిబ్రవరిలో కంపెనీ ఏర్పాటు కాగానే ఏప్రిల్లో కేటాయింపు నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు రావడం.., శనివారం భూ కేటాయింపులు చేయడం జరిగిపోయాయి. సెలూన్స్, స్పా వ్యాపారంలో అనుభవం ఉన్న వాళ్లు ఏవియేషన్ ఇంధన తయారీ యూనిట్ ఏర్పాటంటూ ముందుకు రావడం.., ప్రభుత్వం వేగంగా స్పందించి భూములు ఇచ్చేయడం.. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల స్కెచ్ ప్రకారమే జరిగాయని కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
వెలి'కొండంత' అబద్ధం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు తన దైన శైలిలో మరో క్రెడిట్ చోరీకి పన్నాగం పన్నుతున్నారు. విశాఖలో డేటా సెంటర్, భూముల సమగ్ర రీసర్వే, గత ప్రభుత్వం చేపట్టిన ఇతరత్రా కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకోవడానికి పాట్లు పడుతున్న ఆయన చూపు ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. శనివారం మార్కాపురం జిల్లాలో గంటావానిపల్లె వద్ద వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను పరిశీలించిన ఆయన.. అక్కడే నిర్వాసితులు, రైతులతో సమావేశమయ్యారు. ఆ ప్రాజెక్టు పనులను 1996లో తానే ప్రారంభించానని, ఇప్పుడు తానే పూర్తి చేస్తున్నానంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ క్రెడిట్ చోరీకి తెర తీశారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన, ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన జంట సొరంగాల(ట్విన్ టన్నెల్స్)ను రికార్డు సమయంలో పూర్తి చేసి.. 2024 మార్చి 6న నాటి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించి, రూ.992 కోట్లు వ్యయం చేసి, పునరావాసం కల్పించడానికి శ్రీకారం చుట్టింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. కేవలం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే దుర్బుద్ధితోనే నిర్వాసిత కుటుంబాలకు రెండేళ్లుగా పునరావాసం కల్పించకుండా.. నల్లమలసాగర్కు కృష్ణా జలాలను విడుదల చేయకుండా చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తోందని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2024–25లో 1,439 టీఎంసీలు, 2025–26లో 1,936.79 టీఎంసీల ప్రవాహం వచ్చి .. ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 2024–25లో 848.96 టీఎంసీలు, 2025–26లో 1,652.12 టీఎంసీలు కలిశాయని ఎత్తి చూపుతున్నారు. 2024లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణా జలాలను 2024లోనే నల్లమలసాగర్కు మళ్లించి.. దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో నాసిరకంగా పనులు వైఎస్సార్సీపీ సర్కార్ తయారు చేసిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఖరీఫ్ సీజన్లో కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఒడిసిపట్టి.. నల్లమలసాగర్కు తరలించి ఉంటే తమ ప్రాంతాలు సుభిక్షం అయ్యేవని రైతులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్ను అనుసంధానం చేసే ఫీడర్ ఛానల్ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా, మిగిలిన పనులను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2024లో కురిసిన భారీ వర్షాలకు టీడీపీ సర్కార్ పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్ ఛానల్ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్ ఛానల్ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్ వాల్, మిగతా ప్రాంతాల్లో కాంక్రీట్ లైనింగ్ చేసే పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. వాటిని అస్మదీయ కాంట్రాక్టర్కు చంద్రబాబు సర్కార్ కట్టబెట్టడం గమనార్హం. హామీని నిలబెట్టుకున్న వైఎస్ జగన్» వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. » 2014–19లో టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చి న వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్ క్లియర్ చేశారు. » 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది (2021) పూర్తి చేయించారు. » రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్ జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి, టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. » 2019–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేయించింది. » రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్ పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. తద్వారా రికార్డు సమయంలో 7.685 కిలోమీటర్ల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తి చేశారు. » వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. » శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. జగన్ ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. » వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్ జగన్ రూపొందించిన ప్రణాళికలో భాగంగా దొనకొండలో ఏర్పాటు చేసే మెగా ఇండ్రస్టియల్ మాన్యుపాక్చరింగ్ జోన్)కు 1.27 టీఎంసీల సరఫరాకు లైన్ క్లియర్ చేశారు. దొనకొండ, పామూరు ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఊతం ఇవ్వడం ద్వారా భారీ ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రణాళిక రూపొందించారు. స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత వైఎస్» శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కిలోమీటర్ల పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని 1993–94లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు. » మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. » తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో 2004 అక్టోబర్ 27న పనులకు శ్రీకారం చుట్టారు. » జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా 21.8 కిలోమీటర్ల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులను చేపట్టారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులు చేపట్టారు.అప్పుడూ ఇప్పుడూ చంద్రబాబు సర్కార్ దోపిడీ» 2014–19 మధ్య జరిగిన అక్రమాలను కడిగేసిన కాగ్ » 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు.. అదే ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1996 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది కేవలం రూ.పది లక్షలు మాత్రమే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయం చేశారు. అప్పట్లో చంద్రబాబు పనులు చేపట్టి ఉంటే.. తెలుగుగంగ ప్రాజెక్టుకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–2 నీటిని కేటాయించినట్లే వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసి ఉండేదని సాగు నీటి రంగ నిపుణులు ఎత్తి చూపుతున్నారు. » విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా, పనుల్లో ఏమాత్రం ప్రగతి కన్పించక పోవడమే చంద్రబాబు సర్కార్ చేసిన దోపిడీకి నిదర్శనం. జీవో–22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచి పెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతు చేయక పోవడం వల్ల టీబీఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు నిదర్శనం.» 2017, 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలు ఇస్తూ వచ్చి న చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు మరో కాంట్రాక్టర్కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు దోచేయడాన్ని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగి పారేసింది. » 2014–19 మధ్య ఫీడర్ కెనాల్లో చంద్రబాబు సర్కార్ హయాంలో అత్యంత నాసిరకంగా పనులు చేశారు. 2024లో కురిసిన భారీ వర్షాలతో ఫీడర్ కెనాల్లో చేరిన వరద నీటికి అది కోతకు గురై దెబ్బతింది. దాంతో ఆ అక్రమాలను కప్పిపెట్టే ముసుగులో ఫీడర్ కెనాల్కు రిటైనింగ్ వాల్, లైనింగ్ పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. వాటిని అస్మదీయ కాంట్రాక్టర్కు కట్టబెట్టి.. కమీషన్లు దండుకున్నారని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. -
ప్రభుత్వాన్ని నడుపుతున్నారా.. గూండాల రాజ్యం నడుపుతున్నారా?
సాక్షి, అమరావతి: రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీతో కలిసి రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై ఉండవల్లి సెంటర్లో టీడీపీ గూండాలు దాడులు చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా.. లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా.. అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా అంటూ మండిపడ్డారు. అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారా.. అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ‘ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడి కాదా? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా.. లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసులు దగ్గరుండి ఈ దాడిని సమన్వయం చేయడం అత్యంత దారుణం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసే దాడులకు వైఎస్సార్సీపీ తలవంచదని, మీ అవినీతి, దోపిడీ దౌర్జన్యాలను ఎప్పటికప్పడు ఎండగడతామని తేల్చి చెప్పారు. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరి వాళ్లు కాదని.. వారి పక్షాన వైఎస్సార్సీపీ నిలబడి, తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..రైతులకు తోడుగా నిలవడం తప్పా?‘చంద్రబాబు గారూ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకు ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడి కాదా? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో–ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణం. అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా? భూములు ఇవ్వని వారిని భూ సేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగు నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్యంతరం లేని పరిస్థితులను వారికి కల్పిస్తున్నారు. భూములు ఇవ్వకపోయినా, రిటర్న్బుల్ ప్లాట్ల కింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఇన్ని రకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్ల చేత రౌడీయిజం చేయిస్తారా?ఇంకా ఎందుకు? ఎవరి కోసం కావాలి? అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి మమ్మల్ని నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా చంద్రబాబూ? ఇవాళ మీ అవినీతి, దోపిడీ కోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చ ముఠాలతో స్వైర విహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచి వేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా.. రోజురోజుకూ మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలు పెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైఎస్సార్సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరి వాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ, వైఎస్సార్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది’ అని స్పష్టం చేశారు. -
ఇది ప్రజాస్వామ్యమా.. నిరంకుశత్వమా!?
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు వెస్ట్: భూసేకరణ పేరుతో సీఎం చంద్రబాబు ఆడుతున్న నాటకాలు సహించేది లేదని గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ రైతులు తేల్చిచెప్పారు. పది మందికి అన్నం పెట్టే రైతుల భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకుని ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి దోచిపెడుతుందని మండిపడ్డారు. నలుగురు ఉండే చంద్రబాబు కుటుంబానికి పచ్చని ఐదెకరాల భూమి అవసరమా? అని సూటిగా ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశ పాలనా అంటూ దుమ్మెత్తి పోశారు. ఇప్పటివరకు అవసరమైన రోడ్లకు, వాగులకు భూములను స్వచ్ఛందంగా ఇచ్చామని.. ఇంకా మా భూముల్లో వ్యాపారం చేస్తామంటే ఇచ్చేదిలేదని వారు తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులకు సీఆర్డీఏ నుంచి అందిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు శనివారం గుంటూరు కలెక్టరేట్లో సీఆర్డీఏ డెప్యూటీ కలెక్టర్ మధుసూదనరావును కలిశారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే.. భూములను పిల్లలకిచ్చేశామయ్యా.. నాకు 1.60 ఎకరాల భూమి ఉంది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లళ్ల సమయంలో పిల్లలకిచ్చేశాం. ఇప్పుడేమో ప్రభుత్వం బలవంతపు భూసేకరణంటూ ఇబ్బందులు పెడుతోంది. పిల్లలకిచ్చి న భూమిని వారి అనుమతిలేకుండా ప్రభుత్వానికి ఎలా ఇవ్వగలం. ఈ ప్రభుత్వం మా కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. మా అనుమతులు లేకుండా భూములు తీసుకునే హక్కు ఎవరిచ్చారు? భగవంతుడ్నే నమ్ముకున్నాం. – ఎం.రమాదేవి, ఉండవల్లి రైతు చంద్రబాబు నివాసానికి ఐదు ఎకరాలా!?.. ఎంతో విలువైన రైతుల భూముల్ని తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదెకరాల్లో ఇల్లు నిర్మించుకోవడం అవసరమా? భూసేకరణలో కనీస నిబంధనలే కాదు, విధి విధానాలు కూడా పాటించడంలేదు. రైల్వేలో టీసీ ఉద్యోగం వదిలేసి 1995 నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఇది నాకు ప్రాణ సమానం. భూమికి మరణం ఉండదు. మా చివరి శ్వాస వరకు నా భూమిని ఎవ్వరీకీ ఇచ్చేదిలేదు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా సిద్ధం. – రఘునాథరెడ్డి, రైతు రైతుల అభిప్రాయాలకు విలువేది?.. నేను చిన్న రైతును. నాకు 95 సెంట్ల భూమి ఉంది. ఇందులో 25 సెంట్లు కుమార్తె వివాహ సమయంలో ఇచ్చేశాను. మిగతా భూమిలో గేదెలు, ఆవులు పెట్టుకుని, కూరగాయలు పండించుకుని జీవిస్తున్నా. కొండవీటి వాగు పక్కనే నా భూమి ఉంది. ప్రభుత్వ అవసరాలైన రోడ్డు, కాలువలకు భూమి ఇవ్వడానికి సిద్ధమే. మా భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఒప్పుకునేది లేదు. – తక్కెళ్లపాటి బక్కిరెడ్డి, రైతు అధికారులు వివరాలు ఇవ్వడంలేదు.. మా భూములు కావాలంటున్న సీఆర్డీఏ అధికారులు కనీసం అడిగిన వివరాలు కూడా చెప్పడంలేదు. వారు మా అభిప్రాయాన్ని తెలుసుకోవడం కంటే ప్రభుత్వ నిర్ణయం అమలుచేయడమే ముఖ్యంగా వ్యవహరిస్తున్నారు. నాకున్న 1.18 ఎకరాల భూమే నాకు ఆధారం. మొత్తం పూలింగ్కు ఇమ్మంటే ఏమైపోవాలి? – ఝాన్సీరెడ్డి, రైతు క్యాన్సర్ రోగితో ప్రభుత్వం ఆడుకుంటోంది.. కొన్నినెలలుగా నిద్రపోతే ఒట్టు. ఒకపక్క బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నా. మరోపక్క ప్రభుత్వ వేధింపులతో తల్లడిల్లుతున్నా. మా భూములపై మాకు హక్కులుండవా.. ఇదేం న్యాయం? కూటమి ప్రభుత్వంలో ఇంతటి అన్యాయం చేస్తారని అనుకోలేదు. ప్రభుత్వం మా ఉసురుపోసుకుంటుంది. – జి. శివకుమారి, రైతు కుటుంబంలో గొడవులవుతున్నాయి.. నాకున్న ఎకరం భూమి ఇద్దరు అమ్మాయిలకు వివాహ సమయంలోనే ఇచ్చేశాను. ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వం తీసుకుంటుందంటే అల్లుళ్లు ఊరుకుంటారా? ఈ వయస్సులో ఈ టెన్షన్ ఏంటో తెలీడంలేదు. – ఆర్. విజయలక్ష్మి, రైతు చంద్రబాబుకు భూదాహం.. చంద్రబాబుకు భూదాహం. అందుకే రైతులకు చెందిన వేల ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు అరాచకంపై కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ కనీసం ప్రశ్నించకపోవడం ధారుణం. రైతుల తరఫున రాజీలేని పోరాటంతో పాటు న్యాయపోరాటానికి సిద్ధమే. – మున్నంగి వీర శ్రీధర్రెడ్డి, రైతుఇంకెన్ని వేల ఎకరాలు తీసుకుంటారు?రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక విధానాలతో, బలవంతంగా రాజధాని ప్రాంతంలోని భూములను రైతుల నుంచి తీసుకొనేందుకు ప్రయత్నిస్తోంది. దీనిని ఉపేక్షించేది లేదు. బెదిరించి భూములు లాక్కోవాలని చూస్తే భయపడేది లేదు. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే 50 వేల ఎకరాలకు పైగా భూమి ప్రభుత్వం చేతిలో ఉంది., ఇంకెన్ని వేల ఎకరాలు తీసుకుంటారు? – డాక్టర్ కన్నారావు నాయుడు, ఉండవల్లి రైతు -
పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తారా?: వైఎస్ జగన్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడిని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. రాజధాని బాధిత రైతులకు వైఎస్సార్సీపీ అండగా నిలిస్తే దాడులు చేయిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబూ.. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?, లేక గూండాల రాజ్యాన్ని నడుపుతున్నారా? అంటూ ధ్వజమెత్తారు. రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? అంటూ ‘ఎక్స్’లో ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నించారు వైఎస్ జగన్.ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? ‘పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా?, రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా?, ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణం. అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా?’ అని ప్రశ్నించారు.రైతుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా?‘భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగును నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్యంతరంలేని పరిస్థితులను వారికి కల్పించడం, భూములు ఇవ్వకపోయినా, రిటర్న్బుల్ ప్లాట్లకింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించడం… ఇన్నిరకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్లచేత రౌడీయిజం చేయిస్తారా? అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా?’ అని నిలదీశారు.ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ‘చంద్రబాబుగారు.. ఇవాళ మీ అవినీతి, దోపిడీకోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా, రోజురోజుకూ మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైయస్సార్సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ, వైయస్సార్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. .@ncbn గారూ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైయస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి… pic.twitter.com/ejIPtAhYcI— YS Jagan Mohan Reddy (@ysjagan) June 27, 2026 -
మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం
సాక్షి, విజయవాడ: మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఎయిర్పోర్టుల్లో వైన్ షాపులు, బార్లకు అనుమతి ఇవ్వనుంది. తిరుపతి మినహా అన్ని ఎయిర్పోర్టుల్లో మద్యం విక్రయాలు జరపనున్నారు. ఎయిర్పోర్టుల్లో వైన్స్, బార్లకు 24 గంటలూ అనుమతి ఇవ్వడానికి నిర్ణయించింది. లైసెన్స్ ఫీజులు, పన్నులపై కొత్త మార్గదర్శకాలు అమలు చేయనుంది.బార్ లైసెన్స్ దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు. మద్యం షాపుల దరఖాస్తు రుసుము రూ.2లక్షలు. ఎయిర్పోర్టు వైన్ షాపు ఎక్సైజ్ ట్యాక్స్ రూ.కోటిగా చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. 20 లక్షల సర్క్యులేషన్ దాటిన ఎయిర్పోర్టుల్లో బార్లకు ఎక్సైజ్ ట్యాక్స్ రూ.25లక్షలు. 20 లక్షలలోపు సర్క్యులేషన్ ఉంటే రూ.15లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.ప్రైవేట్ వైన్ షాపులు, పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి. ఇటీవలే బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఎయిర్ పోర్టులలో వైన్ షాప్, బార్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. -
మారవా చంద్రబాబు... నీకు ఇదే మా లాస్ట్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ అయితే..!
-
ఆ రాళ్ళూ మాపై పడి ఉంటే... చంద్రబాబు, లోకేష్ లపై అంబటి ఫైర్
-
రెచ్చిపోయిన టీడీపీ గూండాలు.. కూటమి ప్రభుత్వంలో పోలీసుల పనితీరు..
-
సంక్షేమ పథకాలు గెలిపించలేవు: పవన్ కల్యాణ్
సాక్షి, మంగళగిరి: జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సంక్షేమ పథకాలతోనే ఎన్నికల్లో గెలవలేం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సంక్షేమ హామీల అమలుపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయనే చర్చ జోరందుకుంది. శనివారం మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. సంక్షేమ పథకాలను పార్టీ గౌరవిస్తుందన్నారు. అయితే అవసరమే అయినప్పటికీ అవే ఎన్నికల్లో విజయాన్ని కట్టబెట్టవన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరో కోణంలో చర్చకు దారి తీస్తున్నాయి. ఎందుకంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఎన్నికల ప్రచారంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల్లో కీలకమైనవి ఇప్పటికీ అమలులోకి రాలేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు చంద్రబాబు, పవన్లు స్వయంగా బాండ్లు రాసిచ్చి మరీ హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులైనా అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ అంశంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని, ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలని వైఎస్సార్సీపీ పదేపదే డిమాండ్ చేస్తూ.. పోరాటాలు చేస్తోంది.మరోవైపు రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉందని చెబుతున్న చంద్రబాబు... ఇంకోవైపు భారీగా కొత్త అప్పులు చేస్తూనే, సంక్షేమ హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ చేసిన సంక్షేమంతోనే ఓట్లు రావు అనే వ్యాఖ్యలు.. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం చేతులెత్తేసిన సంకేతాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం జరగదని పరోక్షంగా పవన్ అంగీకరించినట్లుగా ఈ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఏపీలో మీ ఓటు ఉండాలంటే..! -
ఎక్కడ ఏమి మాట్లాడాలో చేతకాని సీఎం.. నీ చేతకానితనం వల్లే ఏపీకి నష్టం
-
‘అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న వేలాది మంది అక్కచెల్లెమ్మల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. 'స్మార్ట్ కిచెన్స్' పేరుతో పార్టీ అనుచరుల పొట్టలు నింపుతూ, దాదాపు 85 వేల మంది మహిళలను రోడ్డున పడేసే కుట్ర జరుగుతోందని అన్నారాయన.ఈ మేరకు శనివారం 'ఎక్స్' వేదికగా వైఎస్ జగన్ స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత 20 ఏళ్లకు పైగా మధ్యాహ్న భోజనం వండుతున్న మహిళలు ఎంతోమంది ఉన్నారని, అలాంటి వారి ఉపాధిని ఒక్కసారిగా దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.మధ్యాహ్న భోజన కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని జగన్ అంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచామని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇంకా మెరుగైన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోకుండా, స్మార్ట్ కిచెన్స్ పేరుతో వారినే తొలగించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో @ncbn గారు చెలగాటం ఆడుతున్నారు. దాదాపు 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు, వీరిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 27, 2026మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని, వారికి అండగా నిలుస్తుందని జగన్ స్పష్టం చేశారు. ఇప్పటికే బకాయిపడ్డ రెండు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు వారి వేతనాలను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్స్ పేరుతో ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడితే వేలాది పేద మహిళల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని జగన్ కోరారు. -
ఏది తల్లీ నాటి సురక్షిత పాలన! తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ‘తిప్పలే’క చతికిల
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు ఏటా తగ్గుముఖం పడుతున్నాయి. ఆస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చి న తల్లులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం లభించడం లేదు. దీంతో పసికందులతో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీల్లో అష్టకష్టాలు పడుతూ బాలింతలు ఇళ్లకు చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదికి 3 లక్షల మేర ప్రసవాలు చేస్తుంటారు. ఇదిలా ఉండగా 2019 ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వం 279 అరకొర వాహనాలతోనే తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు నడిపింది. దీంతో సొంత డబ్బు ఖర్చు పెట్టి బాలింతలు ఇళ్లకు చేరుకోవాల్సిన దుస్థితి అప్పట్లో ఉండేది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్ నుంచి 500 వాహనాలతో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విస్తరించింది. ఏసీ కార్లను సేవల కోసం సమకూర్చడమే కాకుండా తల్లులు, బిడ్డల రక్షణ, భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం పెట్టారు. ఈ క్రమంలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవల్లో ఒక్కసారి పురోగతి నమోదైంది. 2023లో ఏకంగా 2,16,256కు సేవలు పెరిగాయి. అంటే రోజుకు సగటున 600 మంది బాలితలు సేవలు పొందారు. ఇదిలా ఉండగా 2024లో చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే పరిస్థితులు తారుమారయ్యాయి. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఫలితంగా ఏటా సేవలు పెరగాల్సి ఉండగా, తగ్గుముఖం పడుతున్నాయి. 2023లో 2.16 లక్షల సేవలు నమోదవ్వగా, 2024లో 1.86 లక్షలకు పడిపోయాయి. 2025లో మరో 15 వేల మేర తగ్గి 1.71 వేల మందికే సేవలు అందాయి. ఈ లెక్కన పరిశీలిస్తే 2023లో రోజుకు 600 మందికి సేవలు అందగా, 2025లో 469కి ఆ సంఖ్య దిగజారింది. 2023లో జనవరి నుంచి మే మధ్య నెలకు 16 వేల నుంచి 19 వేల సేవలు ప్రభుత్వం అందించింది. ఇప్పుడు నెలకు 14వేల లోపు మాత్రమే సేవలు అందుతున్నాయని తెలుస్తోంది. రూ. వందల నుంచి రూ. వేలల్లో భారం చంద్రబాబు ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను గాలికి వదిలేయడంతో నిరుపేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అనంతరం ఇళ్లకు కనిష్టంగా రూ.500 నుంచి దూరాన్ని బట్టి రూ. వేలల్లో సైతం బాలింతల కుటుంబ సభ్యులు ఖర్చు చేయాల్సి వస్తోంది. బాబు అధికారం చేపట్టిన వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా బాలింతలకు ఇచ్చే రూ. 5 వేల ఆరోగ్య ఆసరా సాయాన్ని నిలిపేశారు. దీనికి తోడు ఉచిత ప్రయాణ సౌకర్యాన్నీ నిర్లక్ష్యం చేయడంతో నిరుపేదలపై ఆర్థిక భారం పడుతోంది. గత ప్రభుత్వంలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులపై ఫిర్యాదులను టోల్ ఫ్రీ నెంబర్ 104 ద్వారా ఫిర్యాదులను స్వీకరించేది. ఇప్పుడా ప్రత్యేక శ్రద్ధ లేకుండా పోయిందని బాలింతలు, గర్భిణులు మండిపడుతున్నారు. నాడు సురక్షిత ఆలంబన 2022 జూన్ ఒకటో తేదీన విజయవాడ రైల్వే స్టేషన్లో ఎస్.కె.అమీనాకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. ఆ కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. విజయవాడ పాత జీజీహెచ్కు అమీనాను తరలించింది. వైద్యులు అమీనాకు ప్రసవం చేశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చి ంది. కొద్ది రోజులు విశ్రాంతి అనంతరం అదేనెల 11వ తేదీ ఆస్పత్రి నుంచి అమీనాను డిశ్చార్జి చేశారు. అమీనాది వైఎస్సార్ కడప జిల్లా కడప నగరం యానాది కాలనీ. ఈ క్రమంలో ఇంటికి వెళ్లాలంటే 400 కిలోమీటర్ల మేర ప్రయాణం. తల్లీబిడ్డ రైలు, బస్సుల్లో వెళ్లడం కష్టంతో కూడుకున్న విషయం. ప్రైవేట్ ట్యాక్సీ అద్దెకు తీసుకుని వెళ్లాలంటే సుమారు రూ.10వేల మేర వెచ్చించాలి. ఇలాంటి పరిస్థితుల్లో అమీనాకు ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనం అండగా నిలిచింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాహనంలో అమీనా ఆమె బిడ్డను వైఎస్ జగన్ ప్రభుత్వం క్షేమంగా ఇంటికి చేర్చింది. నేడు నరకయాతన అల్లూరి జిల్లా ముంచంగిపుట్ట మండలం మత్స్యపురం గ్రామానికి చెందిన చెందిన సుమిత్ర ఈ ఏడాది ఏప్రిల్ 19న కేజీహెచ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తల్లీబిడ్డను ఇంటికి చేర్చడం కోసం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనం సమకూర్చాలని కేజీహెచ్ అధికారులను కోరారు. వాహనాలు అందుబాటులో లేవని, ఓ రోజు వేచి ఉండాలని సూచించారు. దీంతో చేసేదేమీ లేక అష్టకష్టాలు పడి ఆర్డీసీ బస్టాండ్కు, అక్కడి నుంచి బస్లో మత్స్యపురానికి రోజుల బిడ్డతో బాలింత సుమిత్రను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకుని వెళ్లారు. నాడు వైఎస్ జగన్ సంక్షేమ శకానికి, నేడు చంద్రబాబు చీకటి పాలనకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. -
అంబటి కేసులో ఇద్దరు CIలకు నోటీసులు.. రెచ్చిపోతున్న ఖాకీలు
-
తుంగభద్రపై ఏపీకి ఆసక్తి లేదనే సందేశం వెళ్లింది
-
తాడిపత్రి లో నీకు దమ్ముంటే.. బాబుకు వార్నింగ్..
-
రూ. 100 కోట్ల విలువైన భూమి రాత్రికి రాత్రే తారుమారు..
-
కాంగ్రెస్ తో చంద్రబాబు చీకటి రాజకీయం బట్టబయలు.. ఢిల్లీకి లోకేష్ పరుగు.!
-
బాబు మార్క్ కుట్ర సిద్ధాంతాలు.. ఎల్లో మీడియా వాయింపు!
అధికారంలో ఉన్నవారికి తమ తప్పులను ఎత్తి చూపితే అవి కుట్రల్లా కనిపిస్తాయి. అంతే తప్ప తాము చేస్తున్న పనులలో తప్పులు జరుగుతున్నాయని అంగీకరించలేరు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని అధికారులను హెచ్చరించారట. ఇంతకీ ఆయన దృష్టిలో ఏది కుట్ర? ఏది కాదు? తాను విపక్షంలో ఉంటే ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేస్తుంటారు. అదే అధికారంలో ఉన్నప్పుడు విపక్షం సాక్ష్యాధారాలు చూపిస్తూ విమర్శలు చేసినా, ఆయా వివాదాలలో తన ప్రభుత్వం దొరికిపోయినా అదంతా కుట్ర అని చెబుతూ జనం నమ్మాలని కోరుకుంటారు. ఆయనకు ఎల్లో మీడియా తబలా వాయిస్తుంటాయి కనుక అలా సాగిపోతుంటుంది. తమ వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం ఆయన లక్ష్యంగా ఉంటుంది.ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో విపక్షంపై ఇదే ఆరోపణ చేసేది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు లోక్సభ సభ్యురాలిగా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు వచ్చినప్పుడు ఆమె ఇది కుట్ర అని ఆరోపించి ఏకంగా ఎమర్జెన్సీని విధించి, అనేక మంది ప్రతిపక్ష పార్టీల నేతలను జైళ్లలో పెట్టించారు. ఎమర్జెన్సీని ఎత్తివేశాక కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలైంది. అది వేరే విషయం.కాంగ్రెస్ ఐ నుంచి రాజకీయ ఆరంగ్రేట్రం చేసిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకుని, తన మామ ఎన్టీఆర్ను పడదోసి అధికారంలోకి వచ్చారు. ఇదే పని 1984లో నాదెండ్ల భాస్కరరావు చేస్తే కుట్ర అని, ప్రజాస్వామ్య హననం అని అంటారు. సొంత మామ ఎన్టీఆర్ను కూలదోస్తే మాత్రం అది కుట్ర కాదని ప్రచారం చేసుకోగలిగారు. ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబును తీవ్రమైన భాషలో నిందించారు. ఆర్టీజీఎస్ అధికారుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని అన్నారట. ఎల్లో మీడియా చాలా ప్రముఖంగా ప్రచారం చేసింది. ఇంతకీ ఏది కుట్ర అవుతుంది? పోలీస్ స్టేషన్లలో నిందితులను హింసించి చంపిన ఘటనలను ఎవరికి తెలియకుండా చేయాలని అనుకోవడం కుట్ర అవుతుందా? ఆ విషయాన్ని బహిర్గతం చేసిన వైఎస్సార్సీపీ ది కుట్ర అవుతుందా?విజయవాడలో సాయికృష్ణ అనే కాపు యువకుడు మిస్సింగ్ అవడం, ఆ తర్వాత అతనిని దహనం చేసి బూడిద కూడా కనిపించకుండా చేశారన్న ఆరోపణ రావడం ఏమిటి? దాని గురించి నిష్పక్షపాతంగా విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవన్ని కుట్రలు అన్నట్లుగా మాట్లాడడం ఏమిటి. సాయికృష్ణ కేసులో ఇంతవరకు ఒక్క సీఐని మాత్రం అరెస్టు చేసి, మిగిలినవారి జోలికి వెళ్లకపోవడం కుట్ర అవుతుందా? కాదా? చివరికి సిసిటీవీ ఫుటేజీ మిస్ అవ్వడం అంటే కూటమిప్రభుత్వ పనితీరుకు దర్పణం పడుతుందా? లేదా? ఈ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబును రక్షించడం కోసం ప్రభుత్వం రకరకాల పన్నాగాలను పన్నుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.మాజీ మంత్రి అంబటి రాంబాబు, జైభీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ వంటివారు అనేక ఆధారాలతో సహా ఆరోపణలు చేశారే. వాటికి జవాబు ఇవ్వకుండా కుట్రలు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా అధికారులకు ఎలాంటి సంకేతం పంపుతున్నారు? అంటే తప్పు చేసినా దొరకవద్దని పరోక్షంగా చెబుతున్నారా? లీగల్గా, టెక్నికల్గా దొరకరాదని చెబుతున్నట్లు అనిపించదా! సాయికృష్ణ రౌడీషీటర్ అని ప్రచారం చేసి, అతని కుటుంబాన్ని జగన్ పరామర్శించడాన్ని టీడీపీ ఎందుకు తప్పు పట్టింది? ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా రౌడీషీటర్ కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడడాన్ని ఏమని అంటారు? ఏమి న్యాయం చేశారో బయటపెట్టకుండా బాధిత కుటుంబ నోరు కట్టేయడాన్ని కుట్ర అంటారా? లేక ఓపెన్గా ప్రజాస్వామ్య హక్కుల కోసం వైఎస్సార్సీపీ, మరి కొన్ని ఇతర ప్రతిపక్షాలు పోరాడడం కుట్ర అవుతుందా?వివిధ ఘటనలకు కులం, మతం రంగు పులుముతున్నారని కూడా ఆయన అన్నారట. ఇలాంటి వ్యవహారాలలో చంద్రబాబుకు ఉన్న అనుభవం మరెవరికైనా ఉందా? అన్న చర్చ జరుగుతోంది. కందుకూరులో జనసేనకు చెందిన ఒక కాపు వ్యక్తి టీడీపీ నేత చేతిలో హత్యకు గురైతే ఏ ప్రాతిపదికన ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద చంద్రయ్య అనే స్థానిక టీడీపీ నేత ఫ్యాక్షన్ రాజకీయాలలో హత్యకు గురైతే బీసీ నేతను వైఎస్సార్సీపీ వారు చంపారంటూ ఒక అబద్ధాన్ని ప్రచారం చేసిన మాట నిజమా? కాదా?ఆ తర్వాత టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న అతని కుమారుడికి ఏ ప్రమాణం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు? అందులో కుల రాజకీయం లేదా? వైఎస్సార్సీపీ హయాంలో క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన సుధాకర్ అనే డాక్టర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తర్వాతకాలంలో ఆయన మద్యం మత్తులో విశాఖ నడిరోడ్డుపై నానా రచ్చ చేస్తుంటే పోలీస్ కానిస్టేబుల్ ఆయన చేతులు కట్టి స్టేషన్కు తీసుకువెళితే దళిత డాక్టర్ను అలా చేస్తారా అంటూ విమర్శలు చేయడాన్ని ఏమని అంటారు? అది కుట్ర కాదా? అతను అనారోగ్యానికి గురై మరణిస్తే, దానిని ఆనాటి ప్రభుత్వానికి ఆపాదించడం ఏ రాజకీయం అవుతుంది? అవినీతి కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు అయినా, మరో కేసులో ఇంకో నేత కొల్లురవీంద్ర అరెస్టు అయినా బీసీలను అరెస్టు చేస్తారా అంటూ ఎల్లో మీడియా ద్వారా విరుచుకుపడింది ఎవరు? దానిని కుల రాజకీయం అంటారా? ఇంకేమైనా అంటారా?అసలు విషయంలోకి వెళ్లకుండా ప్రత్యర్ధులపై తట్టెడు బురద వేయడంలో చంద్రబాబు ఘనాపాటి అని ఆయన విమర్శకులు చెబుతుంటారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్న, చితక కేసులు పెట్టించి, ఆయనపై దుష్ప్రచారం చేసింది ఎవరు? ఆయన కుమారుడు జగన్పై ఈ పదేళ్లలో ఎన్ని కుట్రలు చేశారు. ఎంత అబద్దపు ప్రచారం చేశారు? ఇక మత రాజకీయం గురించి చెప్పవలసి వస్తే చాంతాడంత అవుతుంది.కొన్నిచోట్ల టీడీపీకి చెందిన వారు విగ్రహాలను ధ్వంసం చేస్తే ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటివారిలో ఒకరికి ఐదు లక్షల పరిహారాన్ని ఎలా ఇచ్చారు? తిరుమల లడ్డూపై లేని వివాదాన్ని సృష్టించి వైఎస్సార్సీపీపై అభాండాలు వేయడం కుట్ర అవుతుందా? కాదా? పోనీ జగన్ ఏ కుట్ర పన్నారో ఒక్కటైనా ఉదాహరణ ఇవ్వాలి కదా! అలాకాకుండా బట్టకాల్చి మీద వేయడం ఏమిటి? దానిని కదా కుట్ర అనాల్సింది. మొత్తం మీద ఇటీవలికాలంలో ప్రభుత్వపరంగా జరగుతున్న అనేక ఘటనలలో అటు పాలకులు, ఇటు అధికారులపై ఆరోపణలు వస్తుండడంతో చంద్రబాబు కుట్ర ధీరిని ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైద్య మాల్‘ప్రాక్టీస్’కు రెడ్కార్పెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని, వైద్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేసింది. కార్పొరేట్ శక్తుల ప్రయోజ నాల కోసం ఏకంగా ప్రజల ప్రాణాలకే రక్షణ లేకుండా చేసింది. ఇతర రాష్ట్రాల వైద్యులు ఏపీ మెడికల్ కౌన్సిల్లో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) సమ ర్పణ, స్థానికంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం జీవో 81ని జారీ చేసింది. ఇతర రాష్ట్రాల వైద్యుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో కోట్లాది మంది రాష్ట్ర ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమించే ఆస్కారం ఉందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదకర విధానం లేదని చెబుతున్నారు. రాష్ట్ర కౌన్సిల్ నిర్వీర్యంరాష్ట్రంలో వైద్య ప్రమాణాలను పర్యవేక్షించడానికి, అర్హులైన వైద్యులను గుర్తించడానికి ఏపీఎంసీ అత్యున్నత చట్టబద్ధమైన సంస్థగా పనిచేస్తోంది. వైద్య విద్య పూర్తి చేసుకున్న వైద్యుల రిజిస్ట్రేషన్, రెన్యూవల్, వారిపై వచ్చే ఎథికల్ కేసుల విచారణ, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం వంటి కార్యకలాపాలు పూర్తిగా కౌన్సిల్ పరిధిలోనే నడవాలి. కౌన్సిల్ నిబంధనల ప్రకారం దేశంలోని ఇతర రాష్ట్రాల వైద్యులు ఏపీలో ప్రాక్టీస్ చేయాలంటే తొలుత వారు అప్పటికే రిజిస్టర్ అయిన కౌన్సిల్ నుంచి ఎన్ఓసీ సమర్పించి, మన దగ్గర స్థానిక రిజిస్ట్రేషన్ పొందాలి. ఈ ప్రక్రియలో ఏదైనా మార్పు చేయాలంటే తొలుత కౌన్సిల్లో చర్చించి, నిబంధనల్లో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కౌన్సిల్కు కనీస సమాచారం లేకుండా బాబు సర్కారు జీవో 81ని తెచ్చింది. ఈ క్రమంలో ఇంత అడ్డగోలు ప్రక్రియ దేశంలో మరెక్కడా లేదని కౌన్సిల్ సభ్యులే వెల్లడిస్తున్నారు. డీరెగ్యులేషన్ 2.0 సాకుతో అరాచకందేశంలో పరిశ్రమలు, వ్యాపారాలపై నిబంధనల భారాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం డీరెగ్యులేషన్ 2.0 సంస్కరణలు తెచ్చింది. వీటి అమలు సాకుతో ప్రజల ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టేస్తూ అరాచకాలకు బాబు సర్కారు పాల్పడుతోంది. డీరెగ్యులేషన్ కింద కొన్ని సంస్కరణలు తేవాలని కేంద్రం కేవలం సిఫార్సులు మాత్రమే చేసింది. వాటి అమలు తప్పనిసరి కాదు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ అనేక రాష్ట్రాల కౌన్సిల్స్ వాటి అమలుపై ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. మహారాష్ట్రలో ఆ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో సిఫార్సులపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల కౌన్సిల్స్లో నమోదైన వైద్యులు మహారాష్ట్రలో ప్రాక్టీస్ చేయడానికి ఎన్ఓసీ సమర్పణ నిబంధనను మాత్రమే సడలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగుతోందని ఆ రాష్ట్ర కౌన్సిల్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం ఎన్ఓసీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. నకిలీ వైద్యుల చొరబాటుకు ఆస్కారం జీవో 81 నకిలీ వైద్యులకు ఏపీలో రెడ్ కార్పెట్ లాంటిదని వైద్యులు విమర్శిస్తున్నారు. ఈ జీవో ప్రకా రం ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇతర రాష్ట్రాల వైద్యులు ఏపీలో ప్రాక్టీస్ చేయడానికి డిక్లరేషన్, తమ వివ రాలు సమర్పిస్తే చాలు. వాటిని ధ్రువీకరించాక రిజి స్ట్రేషన్ వంటి ప్రక్రియ ఉండదు. ఈ క్రమంలో నకి లీ వైద్యులను గుర్తించడం అసాధ్యంగా మారు తుంది. పక్క రాష్ట్రాల్లో డిగ్రీలు లేకుండా ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోయిన వారు, అక్కడ మెడికల్ కౌన్సిల్స్ చేత సస్పెండ్ చేయబడిన నకిలీ వైద్యులు ఏపీలోకి సుల భంగా చొరబడటానికి ఆస్కారం ఉంది. దేశంలో 35 రాష్ట్ర, కేంద్రపాలిత మెడికల్ కౌన్సిల్స్ ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకూ మెజార్టీ శాతం కౌన్సిల్స్ సమాచారం పూర్తి స్థాయిలో డిజిటలైజ్ కాలేదు. ఏపీలో ప్రాక్టీస్ చేస్తామని వైద్య విద్య సర్టిఫికెట్లు సమర్పిస్తే అవి సరైనవో కాదో పరిశీలించే ఆన్లైన్ మెకానిజం కూడా లేదు. వైద్యుల వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ విధానం అమలుపై అత్యంత కీలకమైన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) సైతం ఇప్పటి వరకూ నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఏపీఎంసీలో రిజిస్టర్ కాని వైద్యులు రాష్ట్రంలో చికిత్సలు చేసి రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లితే వారిపై చర్యలు తీసుకోవడానికి చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. -
కరెంట్ కొంటూ షాకులిస్తూ..
సాక్షి, అమరావతి : తాము అధికారంలోకి వచ్చాక బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలు చేయడం లేదని టీడీపీ కూటమి సర్కారు కాకి లెక్కలు చెబుతోందని అధికారిక గణాంకాల సాక్షిగా తేలిపోయింది. చంద్రబాబు సర్కారు రెండేళ్ల పాలనలో విద్యుదుత్పత్తి పెంచడంలో ఎలాంటి ఫలితాలు సాధించకపోగా మార్కెట్ నుంచి భారీ స్థాయిలో విద్యుత్ కొనుగోళ్లు చేపట్టినట్లు అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయి. 2024–25లో 3,930 మిలియన్ యూనిట్లు, 2025–26లో 3,556 మిలియన్ యూనిట్లు చొప్పున బహిరంగ మార్కెట్లో కూటమి ప్రభుత్వం కరెంట్ కొనుగోలు చేసింది. అంతిమంగా ఈ భారం మొత్తం ప్రజలపైనే పడనుంది. రూ.4,476.03 కోట్లు వ్యయం.. కూటమి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024–26 మధ్య కాలంలో షార్ట్ టర్మ్ మార్కెట్ ద్వారా 7,486 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ కొనుగోలు చేసింది. రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు బహిరంగ మార్కెట్పైనే ఆధారపడింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ రెండేళ్లలో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో ఒక్క మెగావాట్ కూడా పెరుగుదల నమోదు కాకపోవడం! అదే 2019–24 మధ్య గత ప్రభుత్వంలో 1,576 మెగావాట్ల సామర్థ్యం జత కాగా.. 2024–26 వరకు కొత్తగా ఒక్క మెగావాట్ కూడా జత కాలేదని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. సొంత ఉత్పత్తి సామర్థ్యం పెరగకపోవడంతో విద్యుత్ కొనుగోళ్లు తప్పని పరిస్థితిగా మారాయి. ఇక గ్రిడ్కు అదనంగా ఒక్క యూనిట్ కూడా పునరుత్పాదక విద్యుత్ సమకూరలేదు. దీంతో మార్కెట్ ధరలు పెరిగిన ప్రతిసారీ ఆ భారం నేరుగా డిస్కంలపై, చివరకు ప్రజలపైనే పడే దుస్థితి ఏర్పడింది. కూటమి సర్కారు తాజాగా విడుదల చేసిన ప్రగతి నివేదికలోని మరో కీలక అంశం మరింత ఆందోళన కలిగిస్తోంది. గతంలో షార్ట్ టర్మ్ మార్కెట్ విద్యుత్ కొనుగోలు ధర యూనిట్కు రూ. 4.02 ఉంటే.. కూటమి ప్రభుత్వంలో అది ఏకంగా రూ.5.68 నుంచి రూ.5.98 వరకు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అంటే అత్యవసర కొనుగోళ్లు.. సాధారణ దీర్ఘకాలిక ఒప్పందాల కంటే చాలా ఖరీదైనవిగా మారినట్లు స్పష్టమవుతోంది. ఈ లెక్కన ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలో 7,486 మిలియన్ యూనిట్ల కొనుగోళ్లకు దాదాపు రూ.4,476.03 కోట్లు వ్యయం చేసింది. కాగితాలకే పరిమితం.. కూటమి ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన రంగంలో 5,541 మెగావాట్ల సామర్ధ్యాన్ని కొత్తగా జత చేశామని చెబుతోంది. వాస్తవానికి ఆ ప్రాజెక్టుల నుంచి పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రాలేదు. కనీసం వాటి నుంచి సమకూరినా మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మరోవైపు విద్యుత్ సంస్థలు ఇంకా రూ.29,618 కోట్ల నష్టాల్లో కొనసాగుతుండగా.. రూ. 33,950 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది.విద్యుత్ రంగంలో రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలేవీ లేకపోగా.. సొంత ఉత్పత్తి సామర్థ్యం పెంచకుండా మార్కెట్ కొనుగోళ్లపైనే ఆధారపడటం, ఖరీదైన విద్యుత్ కొనుగోళ్లతో భవిష్యత్లో ప్రజలపై ఆర్థిక భారం పెరగడం, డిస్కమ్లు మరింత నష్టాల్లో కూరుకుపోవడం లాంటివి ప్రగతి నివేదికలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
కాపు రిజర్వేషన్లపై అబద్ధాలెందుకు!?
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఏమాత్రం అమలుచేయని కాపుల రిజర్వేషన్లను వైఎస్ జగన్ రద్దుచేసే అవకాశం ఎక్కడుంటుందని కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) సూటిగా ప్రశ్నించింది. చంద్రబాబు వాటిని అమలుచేస్తే.. జగన్ తొలగించినట్లు టీడీపీ కూటమి నేతలు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని సమితి తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఈ రిజర్వేషన్ల విషయమై మీడియా సమావేశాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పడంపై తీవ్రంగా స్పందించిన కేఆర్పీఎస్ నేతలు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను కేఆర్పీఎస్ గౌరవ చైర్మన్ దాసరి రాము, చైర్మన్ చనమల్ల ప్రసాదరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాసాబత్తుల శ్రీనివాస్, కన్వీనర్ రావి శ్రీనివాస్, కో చైర్మన్లు కాజా సత్యనారాయణ, కర్రి వెంకటరమణ, మెర్ల నాగ సత్యనారాయణ తదితరులు మీడియాకు విడుదల చేశారు. కాపులకు చంద్రబాబు ఏ రిజర్వేషన్లు అమలుచేయలేదని, ఆయన్ను దామోదరం సంజీవయ్యతో పోల్చడం సరికాదన్నారు. లేఖలో వారు ఏం పేర్కొన్నారంటే.. కాపులకు అన్యాయం చేసింది బాబే..కాపులకు మేలు చేస్తూ 1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి జీఓ–30 ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు దీనిని అమలుచేయలేదు. జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ నివేదికను కూడా అటకెక్కించారు. అప్పటికి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 46 శాతమే ఉన్నప్పటికీ కాపులకు రిజర్వేషన్లు అమలుచేయకుండా తీవ్ర అన్యాయం చేసింది చంద్రబాబే. అప్పట్లో కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు, మెస్ బిల్లులు కూడా మంజూరుచేయని చంద్రబాబును దామోదరం సంజీవయ్యతో పోలుస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కీర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు రిజర్వేషన్ ఉద్యమంలో పాల్గొన్న నిమ్మల రామానాయుడు అన్నీ తెలిసి అబద్ధాలు చెప్పడం సరికాదు. రిజర్వేషన్లపై అడుగడుగునా మోసం..అధికారంలోకి వచ్చిన ఆర్నెలల్లో కాపు రిజర్వేషన్లు అమలుచేస్తానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అత్యంత పకడ్బందీగా చంద్రబాబు మోసం చేశారు. బీసీ–ఎఫ్ ద్వారా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఒకసారి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పది శాతంలో కాపులకు ఐదు శాతం ఇస్తామంటూ మరోసారి చంద్రబాబు దగా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు హామీలిచ్చారేగానీ ఆచరణలో ఆయనెక్కడ అమలుచేశారు? ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడే రోస్టర్ పాయింట్లను ఎందుకు నిర్ణయించలేదు? ఇంకెంత కాలం మోసం చేస్తారు?..వాస్తవానికి.. భారత రాజ్యాంగ సవరణ ద్వారా మోదీ ప్రభుత్వం 2018 చివర్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటించింది. 2019 ప్రారంభంలో దేశమంతా దీనిని అమలుచేసినా తెలుగు రాష్ట్రాల్లో అమలుచేయలేదు. అనుమతి కోసం అనే సాకుతో చంద్రబాబు అవసరంలేకపోయినా కేంద్రానికి లేఖలు రాసి కాలయాపన చేసి చేతులు దులిపేసుకున్నారే తప్ప.. రిజర్వేషన్లు అమలుచేయలేదు. వాస్తవ విషయాలను మరుగుపరిచి చంద్రబాబు రిజర్వేషన్లు ఇచ్చేసినట్టు.. వాటిని వైఎస్ జగన్ తీసేసినట్టు కూటమి నేతలు కన్నా, నిమ్మల దారుణమైన అబద్ధాన్ని ప్రచారం చేయడం తగదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా.. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా వైఎస్ జగన్పై నెపం నెట్టి ఇంకెంత కాలం కాపులను మోసం చేస్తారు? జనాభా ప్రాతిపదికగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి 12 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలనే మా డిమాండ్పై టీడీపీ కూటమిలోని కాపు నేతలు ఎందుకు స్పందించరు? అబద్ధాలతో కాపులను మోసగించే ప్రయత్నం చేస్తున్న కన్నా, నిమ్మల వంటి కూటమి నేతలు ఎవరైనా మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు వస్తే రిజర్వేషన్ల అమలులోని వాస్తవాలు నిరూపిస్తాం. -
పోలీస్ బిగ్ బాస్ వెనుక చంద్రబాబు హస్తం..? సాయికృష్ణ ఫ్యామిలీతో బాబు డీల్
-
మహిళలకు చంద్రబాబు మోసంపై YS జగన్ ఆగ్రహం
-
రాబోయే రెండేళ్లు దద్దరిల్లిపోద్ది.. గుర్తుపెట్టుకో చంద్రబాబు
-
‘సాయికృష్ణ కేసుపై కొత్త డ్రామా.. సెకండ్ హాఫ్ దద్దరిల్లుతుంది’
సాక్షి, విశాఖపట్నం: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనపై కులాలను ప్రస్తావిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి మరొకరు లేరంటూ మండిపడ్డారు. సాయికృష్ణ మరణాన్ని కేవలం ఒక సీఐ చేసిన చర్యగా చూపించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఈ కేసుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘సాయికృష్ణ హత్యకు సీఎం చంద్రబాబు కులాలను ఆపాదిస్తున్నారు. చనిపోయిన వాడు కాపు, చంపినవాడు కాపునే అని మాట్లాడుతున్నారు. కులాన్ని ఆపాదించి రాజకీయం చేయాలని చూస్తున్నారు. జరిగిన హత్య నుంచి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలో సాయికృష్ణ లాంటి హత్య ఎక్కడ జరిగి ఉండదు. హెబియస్ కార్పస్ రిట్ వేస్తే సాయికృష చనిపోయారని చెబుతున్నారు. సాయికృష కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తే సాయికృష్ణ క్రిమినల్ అని విమర్శలు చేశారు. అదే సాయికృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శిస్తే ఆ వ్యక్తి ఏమవుతారో బాబే సమాధానం చెప్పాలి.సాయికృష్ణ హత్య ప్రభుత్వ హత్య. ఇది ఒక సీఐ చేసిన హత్య కాదు. డీజీపీ, డీజీ, ఏసీపీ అందరినీ అరెస్ట్ చేయాలి. సిట్ విచారణ ద్వారా వాస్తవాలు బయటకు రావు. సీబీఐతో విచారణ జరగాలి. పోలీసులు చట్టానికి లోబడి పని చేయండి. రేపటి రోజున మిమ్మల్ని కాపాడేందుకు చంద్రబాబు, లోకేష్ రారు. కూటమి రెండున్నర ఏళ్ళు సినిమాకు ఇంటర్వెల్ పడింది. మిగతా రెండున్నర ఏళ్ల సినిమా దద్దరిల్లిపోతుంది. ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్ నెట్ కాదు. వైఎస్సార్సీపీ ముందు చంద్రబాబు డ్రామాలు చెల్లవు.ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు గుడ్డు అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు మీ ప్రభుత్వం మెడలు వంచుతాం. కాపుల సమస్యలపై సమావేశం పెట్టుకుంటే పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా సమావేశమయ్యారు అని రాస్తున్నారు. హోంశాఖ సరిగా పనిచేయలేదని పవన్ చెప్పారు. సాయికృష్ణ హత్య నుంచి ప్రజల దృష్టి మార్చడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు. -
మహిళలకు కూటమి మరో వాగ్దాన భంగం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. మహిళల చేతిలో నిధులు ఉంటే స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పుకొచ్చారు.మహిళలకు చంద్రబాబు మోసంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవటంతో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. డ్వాక్రా గ్రూపులకు రుణాలు అందితే మహిళల్లో ఆర్థిక స్వావలంభన చేకూరుతుంది. వారి చేతిలో నిధులుంటే ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. రుణాల పెరుగుదల ఆగిపోవటంతో పెట్టుబడులు, ఆదాయాలు తగ్గాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది.2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయ వృద్ధి -3.22% నెగటివ్గా ఉంది. స్వయం సహాయక గ్రూపులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రాయితీ చాలా కీలకమైన పథకం. మా ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద రూ.4,969 కోట్లు చెల్లించాం. అదనంగా ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించాం. ఇవన్నీ మహిళలకు స్వయం ఉపాధికి మంచి అవకాశాలుగా మారాయి. టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో స్వయం సహాయక గ్రూపు రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా చేతులు ఎత్తేసింది.రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ అమలు చేయకపోగా, ప్రస్తుతం ఉన్న వడ్డీ రాయితీ పథకానికే నిధులు విడుదల చేయట్లేదు. గత రెండేళ్లుగా రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. ఒక్కో SHG సంఘం మీద సగటున రూ.6 లక్షల రుణభారం ఉందనుకుంటే.. టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం ఏటా సుమారు రూ.3,000 కోట్లు అవసరం అవుతుంది. అంటే ఈ రెండేళ్లకు కలిపి మహిళలకు సుమారు రూ.6,000 కోట్ల ప్రయోజనం అందకుండా పోయింది. మా హయాంలో తీసుకున్న చర్యల వల్ల SHGలకు రుణాల వృద్ధి గణనీయంగా పెరిగింది. మా ప్రభుత్వ చివరి సంవత్సరంలో SHGలకు అందిన రుణాలు రూ.49,696 కోట్లు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మొదటి సంవత్సరంలో అవి రూ.41,623 కోట్లకు తగ్గాయి. 2025-26లో మరింత తగ్గి రూ.41,105 కోట్లకు చేరాయి. ఇలా మహిళా సంఘాలకు ఆర్థిక మద్దతు తగ్గటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది’ అని చెప్పుకొచ్చారు. 𝗖𝗼𝗻𝘀𝗲𝗾𝘂𝗲𝗻𝗰𝗲𝘀 𝗼𝗳 𝗮𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝗯𝗿𝗼𝗸𝗲𝗻 𝗽𝗿𝗼𝗺𝗶𝘀𝗲 𝘁𝗼 𝘄𝗼𝗺𝗲𝗻Credit growth to Self Help Groups is vital and is regarded as the lifeblood of rural economy. Credit growth indicates productive investments strengthening the SHGs' income generating ability… pic.twitter.com/Ql4wamJ4mg— YS Jagan Mohan Reddy (@ysjagan) June 25, 2026 -
ముద్రగడ ఆరోగ్యంపై పిచ్చి వార్తలు.. తోట త్రిమూర్తులు స్ట్రాంగ్ వార్నింగ్
-
గ్రామాల్లో బాబు సర్కారు ‘పెట్రోలు మంట’
సాక్షి, అమరావతి : లీటరు పెట్రోల్ ధర ఎంత..? అందరికీ తెలిసిన ధర రూ. 117. డీజిల్ ధర ఇంకా తక్కువే. కానీ గ్రామ పంచాయతీల్లో వాహనాలకు పెట్రోలు లీటరు రూ. 3.50 లక్షల చొప్పున కొన్నట్లు పలు గ్రామ పంచాయతీల నుంచి నిధులు డ్రా చేశారట. స్వయంగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజే ఈ విషయం చెప్పారు. గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ నెలతో ముగియగా, ఆ తర్వాత మే, జూన్ నెలల్లోనే ఈ మేరకు బిల్లులు డ్రా చేసినట్లు చెప్పారు. గ్రామ పంచాయతీల్లో ఇంత పెద్ద స్కామా..! అంటూ అవాక్కయ్యారా..! కాదు.. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులపై ఉక్కుపాదం మోపడం వల్ల జరిగిన తతంగం. కేంద్ర ప్రభుత్వ గ్రామ పంచాయతీలకు ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లిస్తూ, పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినప్పుడు కొంత కొంతగా జమ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇచ్చిన నిధులను కూడా గ్రామా అవసరాలకు ఖర్చు పెట్టకుండా పలు ఆంక్షలు విధించింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో పంచాయతీలకు అవసరమైన పనుల ఖర్చుల బిల్లులను ఆంక్షలు లేని పద్దుల్లో కలిపి డ్రా చేసినట్లు ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన పితలాటకమేనని, కనీసం సిబ్బంది జీతాలకు కూడా వేరే పద్దులో వేయాల్సి వచ్చిందని అంటున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఇప్పుడిది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తమ మీద అభాండాలు వేయడానికి ఇదంతా చేస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. కమిషనర్ చెప్పిందిదీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మంగళవారం అన్ని జిల్లాల జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో), డిప్యూటీ ఎంపీడీవోలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఏ ఊరులో ఎన్ని లీటర్ల పెట్రోల్, డీజిల్ కోనుగోలుకు సంబంధిత పంచాయతీల నిధుల నుంచి ఎన్ని లక్షలు డ్రా చేశారో వివరాలు చెప్పి, ఆ జిల్లాల డీపీవోలు తక్షణమే ఆ పంచాయతీల రికార్డులు పరిశీలించి, ఆయా పంచాయతీ కార్యదర్శులు, మండల డిప్యూటీ ఎంపీడీవోలపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ‘తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం నామవరం గ్రామ పంచాయతీలో రెండు లీటర్ల పెట్రోలుకు రూ.7 లక్షలు, కృష్ణా జిల్లా పామర్రు మండలం జుజ్జవరం గ్రామ పంచాయతీలో డీజీల్, పెట్రోల్ కొనుగోలు పేరిట రూ. 37 లక్షలు డ్రా చేశారు. బాపట్ల జిల్లా బాపట్ల మండలం అడవిపల్లె పాలెంలోనూ 2 లీటర్ల పెట్రోల్ కోసం రూ. 15 లక్షలు, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మహాదేవపురం పంచాయతీలో 7 లీటర్ల పెట్రోల్కు రూ. 12 లక్షలు, సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలం తూముకుంట గ్రామంలో పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లకు రూ. 11 లక్షలు ఖర్చు చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామ పంచాయతీలో రూ. 10 లక్షలు.., ఈపూరు గ్రామ పంచాయతీలో రూ. 7.69 లక్షలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మైలవరం ఐతవరంలో 5 లీటర్లకు 9.50 లక్షలు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో రూ. 7.93 లక్షలు, సత్యసాయి జిల్లా హిందూపుర్ మండలం గొల్లపురంలో రూ. 7 లక్షలు.. గత రెండు నెలల్లో డ్రా చేశారు’ అని కమిషనర్ చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వమే ఆంక్షలు పెట్టి.. అభాండాలు వేస్తోందంటున్న ఉద్యోగులు ఇది చంద్రబాబు ప్రభుత్వం విధించిన ఆంక్షల ఫలితమేనని క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు గ్రామ పంచాయతీల నిధులను ప్రభుత్వం సూచించే పనులకు మాత్రమే వినియోగించాలంటూ గత ఏడాది డిసెంబరులోనే పరిమితులు విధించింది. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు పెట్టుకోకుండా ఈ ఏడాది జనవరి నుంచీ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో గ్రామ పంచాయతీల్లో పనిచేసే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాల చెల్లింపులపైనా ఆంక్షలు పెట్టినట్టు ఉద్యోగ ప్రతినిధులు చెబుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య వాహనాల డీజిల్, పెట్రోలుకు సైతం నిధులు డ్రా చేసే పరిస్థితి లేదని మండల అధికారులు పంచాయతీరాజ్ శాఖ దృష్టికి తీసుకు రావడంతో మే నెలలో వీటికి మాత్రమే బిల్లులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ కఠిన ఆంక్షల వల్ల వాస్తవంగా జరిగిన ఖర్చుల బిల్లులనే ఆంక్షలు లేని ఇతర పద్దుల కింద పెట్టడం జరిగిందే తప్ప, ఇందులో అక్రమాలు లేవని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. సిబ్బంది జీతాలు, అభివృద్ధి పనుల బిల్లులను కూడా డీజిల్, పెట్రోల్ కొనుగోలు పద్దులో కలిపి నిధులు డ్రా చేసినట్టు చెబుతున్నారు. గ్రామాల్లో అవసరాలకు పంచాయతీల వద్ద ఉన్న నిధులను ఎలాంటి ఆంక్షలు లేకుండా ఖర్చు చేసుకోవడానికి అవకాశమిచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, తిరిగి ప్రభుత్వం తమపైనే అభాండాలు వేస్తోందని మండిపడుతున్నారు. -
విద్యుత్ చార్జీలే పెంచలేదట!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని, ఇకపై రానున్న మూడేళ్లలోనూ ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖపై రెండేళ్ల ప్రగతి నివేదికను మంత్రి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ తయారు చేయించిన ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ను ఆయన విలేకరులకు చదివి వినిపించారు. ఆ నివేదికలో మంత్రి చెప్పిన అవాస్తవాలు, అసలు నిజాలు ఇలా ఉన్నాయి. అసత్యం : జగన్ ఐదేళ్ల హయాంలో తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్లు భారం వేశారు. బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ రూ.12–15కు కొనుగోలు చేశారు.వాస్తవం : గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు, తీసుకువచ్చిన వినూత్న విధానాల వల్ల 2019–24 మధ్య విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. ఫలితంగా రాష్ట్ర ప్రజలపై రూ.5,252.93 కోట్ల ట్రూ అప్ భారం తగ్గింది. వినియోగదారులపై విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం రాలేదు. అసత్యం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు.వాస్తవం : చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల చార్జీల భారాన్ని వేసింది. అందులో 2024 చివరి నుంచే రూ.6,072.86 కోట్లు, 2025 జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యూనిట్ కి రూ.0.40 పైసలు చొప్పున వసూలు చేశారు. ఇది దాదాపుగా రూ.2,787.18 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ లెక్కన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలపై రూ.20,135.50 కోట్లు విద్యుత్ చార్జీల భారం వేసింది.అసత్యం : గత ప్రభుత్వంలో విద్యుత్ సంస్థలపై రూ.49,596 కోట్ల అప్పుల భారం మోపారు. వాస్తవం : చంద్రబాబు గత పాలనలో సగటున అప్పుల వృద్ధి రేటు 24 శాతం. అదే జగన్ హయాంలో కోవిడ్ లాంటి సంక్షోభాలున్నా, అది కేవలం 7.3 శాతం మాత్రమే. అంతకు ముందు ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం అదనంగా రూ.38,836 కోట్ల రుణాలను ఆర్థిక సంస్థల నుంచి డిస్కంలు తీసుకోవాల్సి వచ్చింది.అసత్యం : జగన్ ప్రభుత్వం ఏపీ జెన్కోలో బొగ్గు లేకుండా చేసి నిర్వీర్యం చేసింది. వాస్తవం : చంద్రబాబు గత హయాంలో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం చంద్రబాబు 7213 మెగావాట్ల ఉంటే అది జగన్ హయాంలో 8,789 మెగావాట్లకు పెరిగింది. అంటే 1576 మెగావాట్లు కొత్తగా వచ్చింది. మొత్తం విద్యుత్ ఉత్పత్తి 2018–19లో 27,197 మిలియన్ యూనిట్లు ఉంటే జగన్ హయాంలో 2023–24లో 34,181 మిలియన్ యూనిట్లుగా ఉంది. గత చంద్రబాబు ప్రభుత్వం కంటే ఏపీ జెన్కో, ట్రాన్స్ కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఎక్కువ లాభాలను ఆర్జించాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 61,347 మిలియన్ యూనిట్లు ఇవ్వడానికే ఆపసోపాలు పడి పవర్ హాలిడేలు, విద్యుత్ కోతలు విధించేవారు. కానీ వైఎస్ జగన్ హయాంలో 81,293 మిలియన్ యూనిట్ల డిమాండ్ను ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా తీర్చగలిగారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 14,948 మెగావాట్ల నుంచి 17,102 మెగావాట్లకు పెరిగింది. 2022–23లో 93 శాతం (12.40 మిలియన్ మెట్రిక్ టన్) ఉన్న బొగ్గు లభ్యత, 2023–24లో 96.52 శాతానికి (14.74 మిలియన్ మెట్రిక్ టన్)కి పెరిగింది. అసత్యం : విద్యుత్ పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను జగన్ రద్దు చేశారు. వాస్తవం : రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా, ట్రూ అప్ చార్జీలపై తప్పుడు నివేదికలిచ్చి డిస్కంలను అప్పులు పాలు చేసిన ఘనత చంద్రబాబుదే. టీడీపీ ప్రభుత్వం 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధర (యూనిట్ రూ.7)కు కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కంలు ఏటా దాదాపు రూ.3,500 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ భారం మోయాల్సి వస్తోంది. ఈ ఒప్పందాల కోసం థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని (బ్యాక్ డౌన్) తగ్గించింది. అసత్యం : జగన్ ప్రభుత్వంలో డిస్కంలు ‘సీ’, ‘డీ’ రేటింగులకు పడిపోయాయి. వాస్తవం : జగన్ హయాంలో రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందించింది. ఏపీట్రాన్స్కో, నెడ్కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వరించాయి. ఏపీఎస్పీడీసీఎల్కు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ‘కన్జ్యూమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్ లభించింది. అసత్యం : రూ.1.50కే ఆక్వాకు యూనిట్ విద్యుత్ అందరికీ ఇవ్వలేదు.వాస్తవం : వ్యవసాయం, ఆక్వా ,పశు సంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలు కలిపి మొత్తం 39.64 లక్షల మంది వినియోగదారులకు ఉచిత, సబ్సిడీ విద్యుత్ను గత ప్రభుత్వం అందించింది. ధోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లు, చేనేత కార్మికులు, లాండ్రీలు, దారిద్ర రేఖకు దిగువ ఉన్న వారికి, ప్రొఫెషనల్ గోల్డ్స్మిత్ల దుకాణాలకు కూడా ఉచిత, సబ్సిడీ విద్యుత్ సరఫరా చేసింది. ‘సెకీ’ విద్యుత్ తీసుకుంటున్నాంసోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుంచి ఒప్పందం మేరకు సౌర విద్యుత్ను యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. దాదాపు 300 మెగావాట్లకు పైగా ఇప్పటికే తీసుకున్నామని, దానికి బిల్లు చెల్లించేటప్పుడు ఐఎస్టీఎస్ చార్జీలు పరిశీలిస్తామని తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ను వచ్చే 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు, 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు సెకీ(ఎస్ఈసీఐ)తో గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అది కూడా యూనిట్ కేవలం రూ.2.49కే. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 కన్నా ఇది‡ తక్కువ. సెకీ విద్యుత్కు కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు అదే వెసులుబాటుతో సెకీ విద్యుత్ను చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటోంది. అయినా అధిక ధర పెట్టారని గతంలో చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం తెలిసిందే. 5 స్టార్ రేటెడ్ ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లపై కూడా నాడు తప్పుడు ప్రచారం చేసి, ఇప్పుడు వాటినే కొనసాగిస్తోంది. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా మంత్రి గొట్టిపాటి రవి నుంచి మౌనమే సమాధానం వచ్చింది. -
బీసీలకు బాబు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా ఉంటానంటూ ఎన్నికల ముందు నమ్మబలికి అధికారంలోకి రాగానే హామీలు అమలు చేయకుండా వారి వెన్నువిరిచేలా వ్యవహరించడం చంద్రబాబు నైజం. తొలి నుంచీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ టీడీపీ బీసీల పార్టీ అంటూ వారిని భ్రమల్లో ముంచి అధికారంలోకి వచ్చాక దగా చేయడం బాబుకు అలవాటు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన చంద్రబాబుకు బీసీల జీవితాలను మెరుగు పరిచేలా చేసిన ఒక్క పనీ చెప్పుకోవడానికి లేదు. గతంలో కత్తెరలు, మిషన్లు వంటి పనిముట్లు అరకొరగా ఇచ్చే ఆదరణ పథకం తప్ప.. బీసీల ఉన్నతికి ఉపయోగపడే ఒక్క చర్య కూడా బాబు తీసుకోలేదు. పైగా హామీల గురించి ప్రశ్నించిన వెనుకబడిన వర్గాలను ఏం తమాషాలు చేస్తున్నారా.. పిచ్చాటలు ఆడారంటే మీ తోకలు కత్తిరిస్తా.. మీ తాట తీస్తా.. అంటూ అవమానకరంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది. బీసీ డిక్లరేషన్.. అదే మోసం రిపీట్.. 2014 ఎన్నికల ముందు 2012 జూలై 12న బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే బీసీలను దారుణంగా దగా చేశారు. 19 ప్రధాన హామీలతోపాటు చేతి వృత్తులు, కులాల వారీగామొత్తం 119 హామీలిచ్చిన చంద్రబాబు 2014 నుంచి ఐదేళ్లపాటు అధికారం అనుభవించి ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదన్నది వాస్తవం. డిక్లరేషన్ అమలు అంటూ ఏకంగా 56 కమిటీలు వేసి కాలయాపన చేశారన్నది జగమెరిగిన సత్యం. కత్తెరలు, ఇస్త్రీ పెట్టేలు ఇచ్చి అదే ఆదరణ అంటూ డబ్బాలు కొట్టుకున్నారు. బీసీలకు వంద ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని 2012 బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన చంద్రబాబు 2014లో సగం సీట్లూ ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో కేవలం 43 సీట్లతో సరిపెట్టారు. 2024లోనూ బీసీ డిక్లరేషన్ పేరుతో నయవంచన చేశారు. ఆ ఎన్నికల్లోనూ బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వలేదు. 2024 డిక్లరేషన్లో ఇచ్చిన హామీలకూ తిలోదకాలు ఇచ్చారు. రెండేళ్ల పదవీకాలం పూర్తయినా బీసీలకు ఇచ్చిన హామీ ఒక్కటీ నెరవేర్చలేదు. బీసీ సబ్ప్లాన్.. నిధుల కేటాయింపులో చీటింగ్.. బీసీలకు సబ్ప్లాన్ పెట్టి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామంటూ 2014, 2024 ఎన్నికల్లో హామీలు ఇచ్చిన చంద్రబాబు దగా చేశారు. 2014 ఎన్నికల్లో ఏడాదికి రూ.10వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50వేల కోట్లు కేటాయిస్తానని చెప్పి అందులో సగం నిధులూ కేటాయించలేదు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామనే హామీ ఇచ్చి గత రెండేళ్ల కాలంలో బడ్జెట్ల్లో బీసీ సంక్షేమంలో రూ.11,426 కోట్లు కోత పెట్టి దగా చేశారు. అంటే 2024–25లో రూ.18,593.45కోట్లు కేటాయించి రూ.15,400.88 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.23,256.79కోట్లు కేటాయించి రూ.15,023.37 మాత్రమే ఖర్చు చేశారు. కురుబలకు గొర్రెలు లేవు.. చేనేతకు జీఎస్టీ రాలేదు.. రాష్ట్రంలో వృత్తిదారులనూ చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. యాదవ, కురుబలకు అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం రెండేళ్లుగా మాటలకే పరిమితమైంది. చేనేతకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ రాలేదు. రాష్ట్రంలో చేనేతకు ఉచిత విద్యుత్ పథకంలో నెలకు హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500యూనిట్లు ఉచితం అనేది దాదాపు రెండేళ్ల తర్వాత ఏప్రిల్ నుంచి అమలులోకి తెచ్చారు. అదీ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన 1,03,534 అర్హుల్లో 57,247మందికే పరిమితం చేయడం దుర్మార్గం. వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్, రాయల్టీ , సీనరీ చార్జీల్లో మినహాయింపు ఉత్తర్వులకే పరిమితం కావడంతో రాష్ట్రంలో అమలుకావడంలేదు. రజకులకు దోబీ ఘాట్ల నిర్మాణంలేదు, స్వర్ణకారులకు అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మత్స్యకారులకు ఆర్థిక సాయం అంతంతమాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మే 18న 1,52,248 మంది మత్స్యకారులను అర్హులుగా ప్రకటించి మే 19న 1,30,796 మందికి రూ.20వేలు చొప్పున విడుదల చేసినట్టు ప్రకటించారు. అంటే ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలోనే రకరకాల సాకులు చూపి 21,452 మందికి మత్స్యకార భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టింది. నాయీబ్రాహ్మణులకు ఆలయాల్లో నెలకు రూ.25వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు ఆదాయం తగ్గితే మిగిలిన మొత్తం ఆ ఆలయాల నుంచి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసి చేతులుదులుపుకున్నారు. గీతకార్మికులకు కేటాయించిన పది శాతం మద్యం షాపులనూ అధికార పక్షానికి చెందిన బినామీలే దక్కించుకుని దగా చేశారు. బీసీ రిజర్వేషన్లపై దొంగాట.. రిజర్వేషన్ల విషయమై గత ఎన్నికల్లో బీసీలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందిన చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అదే విషయమై దొంగాట ఆడుతున్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రచార్భాటం చేసుకోవడం మినహా ఆ దిశగా చేసిన ప్రయత్నాలు లేవు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, పట్టణ అభివద్ధి సంస్థలు, మార్కెటింగ్ కమిటీలు తదితర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోను, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, పాలక మండళ్లలో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు హామీ ఆచరణకు నోచుకోకపోవడంతో బీసీల పట్ల ఆయనకు కించిత్ చిత్తశుద్ధి కూడా లేదని తేటతెల్లమవుతోంది.బీసీలకు వైఎస్ జగన్ పెద్దపీటపదవుల్లో సామాజిక న్యాయంవైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఫిబ్రవరి 15న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేసి చూపించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీల సంక్షేమానికి పెద్దపీట వేశారు. బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదని.. వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్ది చూపించారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చేయి పట్టుకుని ముందుకు నడిపించి సరికొత్త చరిత్రను సృష్టించారు. సామాజిక న్యాయం అమలులో దేశానికే దిక్సూచిగా నిలిచారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో టీడీపీ నాయకుడితో కేసు వేయించి చంద్రబాబు ద్రోహం చేస్తే.. అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన వైఎస్ జగన్ బీసీల పక్షపాతిగా మన్ననలు అందుకున్నారు.అప్పటి వరకు ఓసీలకే పరిమితం అనుకున్న మైలవరం ఎమ్మెల్యే, నరసారావుపేట ఎంపీ సీట్లు సైతం 2024 ఎన్నికల్లో బీసీలకు కేటాయించి సామాజిక విప్లవానికి సరికొత్త భాష్యం చెప్పారు.ఓసీ మహిళకు రిజర్వ్ అయిన విజయవాడ నగర మేయర్ పదవిని రాయన భాగ్యలక్ష్మికి, కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని ఉప్పాల హారికకు ఇచ్చి బీసీ మహిళలకు గొప్ప అవకాశాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్కు దక్కింది. బీసీలకు అసెంబ్లీ స్పీకర్, ఉపముఖ్యమంత్రి పదవులతోపాటు 11 మంత్రి పదవులు, ఎంపీ పదవులు ఇచ్చారు. 38 మంది ఎమ్మెల్సీల్లో 18 బీసీలకే ఇచ్చారు. 9మంది నగర మేయర్లతోపాటు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో దాదాపు 70శాతం వరకు బీసీలకే అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారు. 50 శాతం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులుదేశంలోనే మొదటిసారిగా చట్టం చేసి మరీ 50 శాతం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులు బీసీలకు వైఎస్ జగన్ కట్టబెట్టారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుతోపాటు డైరెక్టరేట్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక సహకార సంస్థనూ ఏర్పాటు చేశారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి ఉన్నతికి వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. జన గణనలో కుల గణన కోసం జాతీయ స్థాయిలో బీసీ సంఘాలు ఉద్యమించినా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఘనత వైఎస్ జగన్కు దక్కింది. ఆ తర్వాత కేంద్రం అందుకు సానుకూల నిర్ణయాన్నీ ప్రకటించడం గమనార్హం. ఎవరూ అడగకుండానే ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని తెచ్చి బీమా వర్తింపజేయడం ద్వారా కల్లు గీత కార్మికులకు వైఎస్ జగన్ నిజమైన భరోసా అందించారు. చేనేత కార్మికుల పెన్షన్ రూ.వెయ్యి చేస్తానని చివర్లో లబ్దిదారులను కుదించి బాబు మోసం చేస్తే.. జగన్ మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేతన్న నేస్తంతో ఏటా రూ.24వేలు సాయంతోపాటు పెన్షన్ వయో పరిమితిని కుదించి అర్హులైన చేనేతలందరికీ న్యాయం చేశారు. నవరత్నాలతో బీసీలకు డీబీటీ ద్వారా రూ.1,22,451.82 కోట్లు, నాన్–డీబీటీ ద్వారా రూ.50,657.39కోట్లు మొత్తం (డీబీటీ, నాన్–డీబీటీ) రూ.1,73,109.21కోట్లు అందించి జగన్ బీసీ సంక్షేమంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. 50 ఏళ్లకే పింఛన్ వంచన.. ఆదరణ ఆర్భాటంతో సరి.. బీసీలకు 50ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ రెండేళ్లుగా అమలుకు నోచుకోలేదు. బీసీ రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు రెండేళ్లకు ముసాయిదా రూపొందించినట్టు ప్రకటించి సరిపెట్టారు. అది పూర్తిస్థాయిలో చట్టం రూపంలో ఎప్పటికి వస్తుందన్నది అనుమానమే. రూ.5వేల కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తామన్న హామీ రెండేళ్లుగా సమీక్షలతోనే సరిపోయింది. ఆచరణలో కాలయాపన చేయడంతో బీసీ వృత్తిదారులను నుంచి తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోంది. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34శాతం రిజర్వేషన్, చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్, తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామ్యం వంటి హామీలు ప్రకటనతో సరిపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఆచరణలో ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు కేటాయింపులు లేవు. స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10వేల కోట్లు వ్యయం మేనిఫెస్టోకే పరిమితమైంది.ఆదరణ లేదు.. ఆదుకున్నది లేదు..ఎన్నికల ముందు బీసీ వృత్తిదారులకు మాయ మాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. రెండేళ్లుగా బీసీ వృత్తిదారులకు ఆదరణ పథకం లేదు.. సంక్షేమ పథకాలతో ఆదుకున్నదీ లేదు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లతో ఆదరణ 3.0ద్వారా అధునాతన వృత్తి పరికరాలు అందిస్తామని చెప్పారు. రెండేళ్లలో బడ్జెట్లో రూ.రెండు వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం రూ.వెయ్యి కోట్లు కేటాయించినా అందులోనూ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. బీసీ వృత్తిదారులకు రూ.10వేల కోట్లతో ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేస్తామని మోసం చేశారు. బీసీ కులాలకు రక్షణ చట్టం తెస్తామని ఇప్పుడు కాలయాపన చేస్తున్నారు. కూటమి పాలనలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. –మన్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ వృత్తి సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్రకన్వీనర్ఉపాధి లేదు.. నిరుద్యోగ భృతి రాదు..ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం హామీలు గుప్పించిన చంద్రబాబు రాష్ట్రంలో యువత, విద్యార్థులను దారుణంగా మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని దగా చేశారు. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేలు ఇస్తామని రెండేళ్లయినా ఒక్క రూపాయీ విదల్చలేదు. బాబు ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ, పుస్తకాలు ఇతర ఖర్చులకు రూ.లక్షలు ఖర్చు పెట్టేందుకు మధ్యతరగతి ప్రజలూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి సామాన్యులకూ కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన విద్యా హక్కు చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో చదువులు పూర్తైన విద్యార్థులకు కాలేజీల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. సర్టిఫికెట్లు రాకపోవడంతో వారికి ఉద్యోగం వచ్చినా చేరలేని దయనీయ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. –ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్, బీసీ విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్40ఏళ్లుగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నారుఫార్టీ ఇయర్స్ ఇండస్త్రీ అని చెప్పుకొనే చంద్రబాబు 40ఏళ్లకుపైగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు ఊదరగొడతారు. ఆయనను నమ్మి ఓట్లేస్తే.. అధికారంలోకి వచ్చాక దగా చేయడం అలవాటుగా మారింది. 2024 ఎన్నికల్లోనూ బీసీ ఓట్ల కోసం చంద్రబాబు బీసీ రక్షణ చట్టం తెస్తానని, బీసీ ఉప ప్రణాళిక అమలు చేస్తానని, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానని అనేక హామీలు ఇచ్చి అమలులో కాలయాపన చేస్తున్నారు. బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. – బీసీ రమేష్గౌడ్, బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించేసింది! రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ హత్య కేసును నీరుగార్చేందుకు పక్కా పన్నాగానికి తెగబడింది. ఈ హత్య వెనుక సూత్రధారులు, పాత్రధారులను కాపాడేందుకు కుతంత్రం పన్నింది. ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్, బిగ్బాస్తో సహా అందరినీ ఈ కేసు నుంచి తప్పించింది. అందుకు ఈ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సాధనంగా చేసుకుంది. సాయికృష్ణ లాకప్ హత్యకు సంబంధించిన కనీస వివరాలు, దర్యాప్తులో పాటించాల్సిన ప్రాథమిక నియమాలను కూడా పట్టించుకోకుండా ‘సిట్’ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు సాయికృష్ణ హత్యకు గురైనట్లు సూటిగా పేర్కొనని సిట్... దర్యాప్తులో కీలకమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి తూతూమంత్రంగా రిమాండ్ రిపోర్టును రూపొందించడం వెనుక ప్రభుత్వ పెద్దల కుతంత్రం ఉందన్నది స్పష్టమవుతోంది. అసలు సాయికృష్ణను ఎప్పుడు హత్య చేశారు..? హత్యాయుధం.. సమయం.. మృతదేహం తరలింపు.. అవశేషాల గుర్తింపు.. ప్రత్యక్ష సాక్షులు, కీలకమైన పోలీసు రిజిస్టర్లు, రికార్డులు... వాటిని పర్యవేక్షించాల్సిన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు... సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ బాధ్యులు.. సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్ స్వాధీనం..! ఇలా ఏ అంశాలను కూడా ప్రస్తావించకుండానే, వాటి గురించి పేర్కొనకుండానే రిమాండ్ రిపోర్టును సమర్పించడం విభ్రాంతి కలిగిస్తోంది. ప్రధానంగా సాయికృష్ణను లాకప్లోనే హత్య చేయడం వెనుక కుట్ర కోణం ఏమిటన్నది పట్టించుకోకపోవడం గమనార్హం. తద్వారా ఈ కేసులో ఎవరో కీలక ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్, బిగ్బాస్లను కాపాడాలన్నదే ప్రభుత్వ పన్నాగమన్నది తేటతెల్లమవుతోంది. సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా బట్టబయలైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది....హత్య వివరాలే లేకుండా రిమాండ్ రిపోర్టా?కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ మరణం కేసును న్యాయ విచారణలో బలహీనపరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అసలు సాయికృష్ణ హత్యకు గురయ్యారని సూటిగా పేర్కొనలేదు. హత్యకు గురై ఉంటారని మొక్కుబడిగా పేర్కొంటూ ఆయన్ని హతుడు (డిసీజ్డ్)అని పేర్కొంది. కానీ ఆయన్ని ఎప్పుడు, ఎక్కడ ఎలా హత్య చేశారు? అనే కనీస వివరాలను రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనలేదు. అంటే.. నేర ప్రదేశం, సమయం, నేరం చేసిన విధానం గురించి అసలు ప్రస్తావించనేలేదు. టాస్క్ఫోర్స్ అధికారులు సాయికృష్ణను కృష్ణలంక పోలీసులకు అప్పగించిన తరువాత.. వివరాలన్నీ అగమ్యగోచరమే. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన సాయికృష్ణ తరువాత ఏమయ్యారన్నది సిట్ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించనే లేదు. ఆయన ప్రాణాలతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లారా...? లేదా ఆయన మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తరలించారా? అనే కీలక అంశాన్ని పేర్కొనాల్సిన కనీస బాధ్యతను కూడా సిట్ అధికారులు విస్మరించారు. అసలు సాయికృష్ణ లాకప్లో హత్యకు గురయ్యారనే విషయాన్నే రిమాండ్ రిపోర్ట్లో సూటిగా ఎక్కడా ప్రస్తావించకపోవడం విస్మయపరుస్తోంది. లాకప్లో హత్యకు గురైనట్టు భావిస్తున్నామని మాత్రమే పేర్కొంది. హత్య ప్రదేశం, సమయం, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అన్నవి ఈ కేసులో ప్రధానమైనవి. ఆ మూడు కీలక అంశాల గురించి రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. సాయికృష్ణ మృతదేహాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులను కూడా సిట్ గుర్తించనే లేదు. తద్వారా సాయికృష్ణను లాకప్లో హత్య చేశారని నిరూపించడానికి కీలక ఆధారం లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త పడినట్టు స్పష్టమవుతోంది. అంటే సాయికృష్ణ అసలు హత్యకు గురయ్యారా లేదా అనే సందేహానికి బలం చేకూర్చేందుకు ప్రభుత్వం ముందుగానే కుట్రకు బరితెగించింది. అంతగా ఈ కేసును నీరుగార్చాలని ప్రభుత్వ పెద్దలు ఎందుకు భావిస్తున్నట్లు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రత్యక్ష సాక్షులే లేకుండా చేసే కుతంత్రంఇక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకుండా చేయాలన్న ముందస్తు పన్నాగంతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం బాధితుడి తల్లితోపాటు ఎస్సైను మాత్రమే ప్రత్యక్ష సాక్షిగా పేర్కొనడం విడ్డూరంగా ఉంది. పోలీసులు కొడుతున్న దెబ్బలకు తన కుమారుడు ఆర్తనాదాలు చేయటాన్ని తాను విన్నట్లు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పారని ప్రస్తావించారు. బాధితుడి తల్లి ఫిర్యాదుదారు కాబట్టి ఆమె సాక్ష్యం న్యాయస్థానంలో చెల్లదు. ఆ ఎస్సై కూడా తాను మే 6 – 8వ తేదీల మధ్య సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూశానని చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. న్యాయ విచారణ సమయంలో ఆయన మాట మార్చే అవకాశాలు ఉన్నాయి. మరి అన్ని రోజులపాటు పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించిన అంతమంది ఇతర అధికారులు, పోలీసులను ప్రత్యక్ష సాక్షులుగా ఎందుకు పేర్కొన లేదన్నది కీలకంగా మారింది. సాయికృష్ణ మృతదేహం పోలీసు స్టేషన్ నుంచి మాయమైంది. ఆ పని కేవలం ఒక్క మనిషి చేయడం అసాధ్యం! మరి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? అనేది సిట్ పట్టించుకోలేదు. సరైన సాక్ష్యాలు లేకుండా సిట్ తూతూ మంత్రంగా రిపోర్ట్ రిపోర్ట్ రూపొందించడం ద్వారా ఈ కేసు నుంచి ఎవర్ని కాపాడేందుకు యత్నిస్తోందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కీలక రిజిస్టర్లు, రికార్డుల వివరాలే లేకుండా రిమాండ్ రిపోర్టా...!సాయికృష్ణ లాకప్ మరణం కేసును నీరుగార్చేందుకు సిట్ పక్కాగా రంగంలోకి దిగింది. ప్రధాన బాధ్యుడైన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు టాస్క్ఫోర్స్ అధికారిని ఈ కేసు నుంచి తప్పించాలన్న కుట్ర బయటపడింది. తద్వారా వారిద్దరి వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలను కాపాడాలన్న లక్ష్యంతో వ్యవహరించింది. సాయికృష్ణను టాస్క్ఫోర్స్ అధికారులు మార్కాపురంలో అదుపులోకి తీసుకుని సీఐ నాగరాజుకు అప్పగించినట్టు సిట్ పేర్కొంది. కానీ ఆ తరువాత పరిణామాలపై మాత్రం మౌనంగా ఉండిపోవడం గమనార్హం. ప్రధానంగా ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న తరువాత నిబంధనల ప్రకారం నమోదు చేయాల్సిన కీలక రిజిస్టర్లు, రికార్డులను సిట్ కనీసం పరిశీలించలేదు. తమ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించనూ లేదు. వాటిని రోజూ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన సీపీ రాజశేఖర్బాబు ఎందుకు తన బాధ్యతను విస్మరించారనే కోణంలో దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. ఆ కీలక అంశాలు ఇవీ...» పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల లాకప్లలో ఉన్న వారి వివరాలతో లాకప్ డెయిరీ సర్వీస్రిజిస్టర్(డీఎస్ఆర్)ను సీపీకి సమర్పిస్తారు. నిందితులను లాకప్లో పెట్టిన తేదీ, సమయం, సంబంధిత పోలీసు అధికారి తదితర వివరాలు అందులో ఉంటాయి. 24 గంటలు మించి ఎవరూ లాకప్లో ఉండకుండా.. న్యాయస్థానంలో హాజరుపరిచారా లేదా? అన్నది సీపీ పరిశీలించాలి. మరి సాయికృష్ణను రోజుల తరబడి అక్రమంగా లాకప్లో ఉంచితే ఆ విషయాన్ని సీపీ ఎందుకు పట్టించుకోలేదు? అవేవీ పరిశీలించకుండానే డీఎస్ఆర్ను ఆమోదించారా? అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అంటే సీపీకి తెలిసే సాయికృష్ణను రోజుల తరబడి అక్రమంగా లాకప్లో ఉంచారన్నది స్పష్టమవుతోంది. » ఇక పోలీస్ స్టేషన్లలో స్టేషన్ ఆఫీసర్లు, జనరల్ డ్యూటీ ఇన్చార్జ్లు, సెంట్రీలు ప్రతి ఆరు నుంచి 12 గంటల మధ్య షిఫ్ట్లు మారుతూ ఉంటారు. అలా షిఫ్ట్ మారే సమయంలో లాకప్లో ఉన్న వారి వివరాలను జనరల్ డైరీలో రాయాలి. మరి సాయికృష్ణను ఉంచిన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీ వివరాలను సిట్ ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించ లేదు? జనరల్ డైరీ, స్టేషన్ డైరీ, లాకప్ రిజిస్టర్, కస్టడీ రిజిస్టర్, ప్రిజనర్ మూవ్మెంట్ రిజిస్టర్, విజిటర్స్ రిజిస్టర్, సెంట్రీ రిజిస్టర్, అరెస్టు రికార్డులు ఇవన్నీ కీలకం. వాటిని పరిశీలించకుండా వాటి ప్రస్తావనే లేకుండా రిమాండ్ రిపోర్ట్ రూపొందించడం ద్వారా ఈకేసును నీరుగార్చేందుకు కుట్ర పన్నారన్నది స్పష్టమవుతోంది. » సాయికృష్ణకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారంట్ (ఎన్బీడబ్ల్యూ) పెండింగ్లో ఉన్నందునే టాస్క్ఫోర్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. మరి పెండింగ్లో ఉన్న ఎన్బీడబ్ల్యూలు, వాటిపై తీసుకున్న చర్యలను పోలీస్ కమిషనర్కు ప్రతి రోజూ నివేదిస్తారు. మరి సాయికృష్ణను ఎన్బీడబ్ల్యూ జారీ చేసి అదుపులోకి తీసుకుంటే ఆ విషయాన్ని సీపీకి సమర్పించే రోజువారీ నివేదికలో ప్రస్తావించాలి కదా? మరి ఈ అంశాన్ని ఆయన ఎందుకు పట్టించుకోలేదు? సాయికృష్ణకు ఎన్బీడబ్లూ జారీ చేసి అదుపులోకి తీసుకున్నారా...? తీసుకుంటే న్యాయస్థానంలో ఎప్పుడు ప్రవేశపెడతారు? అని ప్రశ్నించాలి కదా. మరి ఆయన ఎందుకు బాధ్యతాయుతంగా స్పందించలేదు? అంటే ఆయనకు తెలిసే సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రస్తావన రిమాండ్ నివేదికలో పేర్కొనలేదా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.సాయికృష్ణను ఎక్కడ దహనం చేశారో ఎందుకు వెల్లడించలేదు?సాయికృష్ణను ఎలా కనుమరుగు చేశారన్నది కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆయన మృతదేహం అనే అత్యంత కీలకమైన అంశాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. మృతదేహాన్ని ఎలా మాయం చేశారనే విషయాన్నే సిట్ అధికారులు ప్రస్తావించనే లేదు. సాయికృష్ణ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసేశారు అనే కోణంలో సిట్ అధికారులు ఎందుకు దర్యాప్తు చేయడంలేదు? ఆయన మృతదేహాన్ని దహనం చేశారని భావిస్తున్న ప్రదేశాన్ని ఎందుకు గుర్తించ లేదు? వాస్తవానికి సాయికృష్ణను దహనం చేసిన ప్రదేశాన్ని గుర్తించి... అక్కడ అవశేషాలను సేకరించాల్సిన బాధ్యత సిట్ అధికారులపై ఉంది. ప్రధానంగా దంతపు అవశేషాలు అత్యంత కీలకం. మృతదేహాన్ని దహనం చేసినా దంతపు అవశేషాలు మిగిలే ఉంటాయి. వాటి నుంచి డీఎన్ఏ నమూనాలను పరీక్షించి నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించాలి. ఇంతటి కీలకమైన అంశాన్ని పోలీసులు ఎందుకు విస్మరించారన్నది సందేహాస్పదంగా మారింది. అంటే సాయికృష్ణ లాకప్ మరణం కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా బలహీనపరచాలన్నది పోలీసుల లక్ష్యమని స్పష్టమవుతోంది. తద్వారా ఈ హత్య వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులను రక్షించాలన్నదే అసలు ఉద్దేశమని తెలుస్తోంది.క్రిమినల్ కుట్ర కోణాన్నే పట్టించుకోని సిట్ ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే...సాయికృష్ణ లాకప్ హత్య వెనుక ప్రభుత్వ పెద్దలు, ప్రధాన సూత్రధారులను తప్పించేందుకు సిట్ అధికారులు బరితెగించారు. అసలు సాయికృష్ణ హత్య వెనుక కుట్రకోణం ఉందనే విషయాన్నే పట్టించుకోకపోవడమే అందుకు తార్కాణం. అందుకే సాయికృష్ణను ఎందుకు హత్య చేసి ఉంటారు? అనే కోణంలో కనీసం దర్యాప్తు చేయలేదు. విజయవాడకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన ఓ భూ వివాదం, విజయవాడలో ఓ ప్రైవేటు ఆర్థిక సంస్థలో నిధుల వ్యవహారంలో రెండువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయని... ఆ వ్యవహారాలను కప్పిపుచ్చేందుకే సాయికృష్ణను లాకప్లో హత్య చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి సిట్ ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదన్నది కీలకంగా మారింది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తే టీడీపీ ప్రజాప్రతినిధితోపాటు అందుకు సహకరించిన విజయవాడ పోలీస్ బాస్తోపాటు బిగ్బాస్ పాత్ర బయటపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే అసలు సాయికృష్ణ హత్య వెనుక కుట్ర కోణాన్నే విస్మరిస్తే... ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించవచ్చన్నది సిట్ ఉద్దేశం కావచ్చని చెబుతున్నారు.న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకేనా...!సాయికృష్ణ మిస్సింగ్ విషయంలో సీఐ నాగరాజుతోపాటు పోలీసులు న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించారు. హెబియస్ కార్పస్ లాంటి కీలకమైన పిటిషన్కు సంబంధించి న్యాయస్థానానికి సమర్పించే అధికారిక నివేదికపై సీపీ రాజశేఖర్బాబుకు ముందే సమాచారం ఉంటుంది. ఆయన ఆమోదంతోనే న్యాయస్థానానికి నివేదిక ఇస్తారు. కాగా హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సమయంలో సాయికృష్ణ ఆచూకీ తమకు తెలియదని సీఐ నాగరాజుతోపాటు విజయవాడ పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. కానీ సిట్ రిమాండ్ రిపోర్ట్ అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. సాయికృష్ణను టాస్క్ఫోర్స్ పోలీసులు తనకు మే 6న అప్పగించినట్టు నాగరాజు పేర్కొన్నారని చెప్పారు. ఇక్కడ రెండు ప్రధాన సందేహాలు తలెత్తుతున్నాయి...» సాయికృష్ణ ఆచూకీ తమకు తెలియదని కొద్ది రోజుల క్రితం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో ఉద్దేశపూర్వకంగానే అవాస్తవాలు చెప్పారా..? అలా చెబితే అందుకు సీపీతోపాటు విజయవాడ పోలీసులు బాధ్యులు అవుతారు. » లేదా... టాస్క్ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను సీఐ నాగరాజుకు అప్పగించినట్టు ప్రస్తుతం చెబుతున్న రికార్డులు ట్యాంపర్ చేసి ఉండవచ్చు. అధికారిక రికార్డులను ట్యాంపర్ చేయడం తీవ్రమైన నేరం. అందుకు సీపీ రాజశేఖర్బాబు, టాస్క్ఫోర్స్ అధికారులు కూడా బాధ్యులు అవుతారు.ఈ రెండింటిలో ఏది వాస్తవం..? ఏది అవాస్తవం..? అన్నది తేలాల్సి ఉంది.సీసీ టీవీ బ్యాకప్ ఫుటేజీని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ టీవీ కెమెరా ఫుటేజీ ధ్వంసమైనట్లు సిట్ పేర్కొంది. కానీ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ల సీసీ టీవీ ఫుటేజీ డీజీపీ కార్యాలయంలో ఉంటుంది. ఆ బ్యాకప్ నుంచి ఫుటేజీని సిట్ అధికారులు ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నది కీలకంగా మారింది. ఆ ఫుటేజీ కావాలని సిట్ అధికారులు ఆ ప్రాజెక్టు నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థకు లేఖ రాశారు. కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల మెమోరీ డ్యూరేషన్ యూనిట్లు అవసరమని... ఆ మెమోరీ సమకూరిస్తే తాము అందిస్తామని ఆ ప్రైవేటు సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది.కాలయాపన చేసేందుకే సిట్ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్ డీజీపీ కార్యాలయంలోనే ఉంది. సిట్ అధికారులు వెంటనే వెళ్లి ఆ బ్యాకప్ను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?.. వారిని అడ్డుకుంటున్నది ఎవరు? ప్రైవేటు సంస్థ ఇచ్చేంతవరకు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? వెంటనే వచ్చి స్వాధీనం చేసుకోవాలని డీజీపీ ఎందుకు ఆదేశించడం లేదు? ఈలోగా బ్యాకప్ ఫుటేజీ కూడా మాయం చేసే కుట్ర దాగుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. పోలీసు ప్రధాన కార్యాలయంలో బ్యాకప్ ఫుటేజీ కూడా గల్లంతు అయితే అందుకు డీజీపీతోపాటు యావత్ పోలీసు ఐటీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాయికృష్ణ హత్యకు గురయ్యారని స్పష్టంగా పేర్కొన లేదు. పోస్ట్మార్టం, మెడికల్ రికార్డులు లేనే లేవు. మృతదేహాన్ని ఏం చేశారన్నదీ చెప్పలేదు. మృతదేహం అవశేషాలు గుర్తించలేదు. ఎటువంటి అధికారిక రిజిస్టర్టు, రికార్డుల వివరాలు పేర్కొన లేదు. ప్రత్యక్ష సాక్షుల ప్రస్తావనే లేదు. హత్య వెనుక కుట్ర కోణంపై దర్యాప్తే లేదు. వెరసి సాయికృష్ణ లాకప్ హత్య కేసును నీరుగార్చి సూత్రధారులు, పాత్రధారులను కాపాడేందుకు సిట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బరితెగించిందన్నది స్పష్టమవుతోంది. -
చేబదుళ్ల అప్పుల్లో దేశంలోనే ఏపీ టాప్
సాక్షి, అమరావతి: అటు అప్పులపై వడ్డీలు.. చివరకు చేబదుళ్లపైనా వడ్డీలే..! చంద్రబాబు సర్కారు మరో కొత్త చరిత్ర సృష్టించింది. అప్పులపై వడ్డీలు ఎలాగూ తప్పవు. కానీ చేబదుళ్లు అంటే ఎలాంటి వడ్డీ లేకుండా స్వల్పకాల వ్యవధిలో తిరిగి చెల్లించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కల్పించిన వెసులుబాటు! రాబడులు, చెల్లింపుల మధ్య స్పల్ప విరామంలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు రిజర్వు బ్యాంకు ప్రభుత్వాలకు దీని ద్వారా వెసులుబాటు కల్పిస్తుంది. అయితే చంద్రబాబు సర్కారు దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం కావడం.. సకాలంలో తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో చేబదుళ్లపై ఏకంగా రూ.303 కోట్లు వడ్డీ కట్టాల్సి వచ్చినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో దిగజారిన ఆర్థిక వ్యవస్థకు ఇది నిదర్శమని ఆర్థికవేత్తలు అభివర్ణిస్తున్నారు. చేబదుళ్ల అప్పుల్లో ఏపీ టాప్... 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేబదుళ్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు ‘కాగ్’ నివేదిక వెల్లడించింది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్లను వినియోగించుకుని సకాలంలో అప్పు చెల్లిస్తే వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే సకాలంలో అప్పు చెల్లించకుంటే అత్యధిక వడ్డీ కట్టాల్సి వస్తుంది. 2024 –25లో దేశంలోనే అత్యధికంగా చేబదుళ్ల అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు.. ఆ అప్పును సకాలంలో తీర్చకపోవడంతో ఏకంగా రూ.303 కోట్ల మేర వడ్డీ చెల్లించింది. అంతేకాదు.. 2024–25లో చంద్రబాబు సర్కారు ఆర్బీఐ వద్ద కేవలం ఎనిమిది రోజులు మాత్రమే కనీస నగదు నిల్వలను నిర్వహించింది. మిగతా 357 రోజులూ చేబదుళ్ల రూపంలో అప్పు చేయనిదే పూట గడవలేదు. ఇదీ చంద్రబాబు సర్కారు ఆర్థిక వ్యవహారాల దక్షత! అని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. » 2024–25లో దేశంలో 16 రాష్ట్రాలు చేబదుళ్ల తరహాలో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్లు, ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా రూ.6.87 లక్షల కోట్లు వాడుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ ఏకంగా 62 శాతాన్ని వినియోగించుకున్నాయి. దేశంలోనే అత్యధికంగా చేబదుళ్ల రూపంలో రూ.1,72,532 కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ 2024–25లో మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ.1,29,376 కోట్ల చేబదుళ్ల అప్పుతో రెండో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రూ.1,22,279 కోట్ల చేబదుళ్ల అప్పుతో మూడో స్థానంలో ఉంది. » 2024–25లో దేశంలో 11 రాష్ట్రాలు చేబదుళ్ల అప్పులను వినియోగించుకోలేదు. అరుణాచల్ ప్రదేశ్, బిహార్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ చేబదుళ్ల అప్పులను తీసుకోకపోవడం గమనార్హం. చేబదుళ్లపై వడ్డీ... ఆర్థిక నిర్వహణ వైఫల్యమే 2024–25లో చంద్రబాబు సర్కారు 71 రోజులు రూ.42,004 కోట్ల మేర స్పెషల్ వేస్ అండ్ మీన్స్ వినియోగించుకుంది. రూ.73,897 కోట్ల మేర వేస్ అండ్ మీన్స్ 179 రోజులు వాడుకుంది. అలాగే 107 రోజులు రూ.56,631 కోట్ల మేర ఓవర్ డ్రాఫ్ట్ను వినియోగించుకుంది. ఈ మొత్తాలను నిర్దేశించిన గడువులోగా తిరిగి చెల్లించకపోవడంతో ఏకంగా రూ.303 కోట్ల మేర వడ్డీ కింద ఆర్బీఐకి కట్టాల్సి వచ్చింది. చేబదుళ్లకే వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందంటే చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ ఎంత దారుణంగా ఉందో వేరే చెప్పాల్సిన పని లేదని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మీ రాజకీయాల కోసం ముద్రగడను కించపర్చొద్దు: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ: ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడుతుంటే, కూటమి సర్కార్ ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని మానసికంగా క్షోభపెట్టేలా వ్యవహరించడం దారుణమని వైఎస్సార్సీపీ కాపు సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీలు వంగా గీత, తోటనర్సింహం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు.ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్ జగన్ రోజూ ఆరా తీస్తున్నారని, కానీ కూటమి నేతలు మాత్రం మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలనలో విఫలమైన చంద్రబాబు కుల రాజకీయాలతో దాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆక్షేపించారు.ముద్రగడపై ట్రోల్స్ సరికాదు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని ఇంటికి రావాలని అందరూ కోరుకోవాలి. రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో వంగవీటి మోహన రంగా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ఉండే వారు. ఆయన ఎక్కడా అవినీతి మరకలు అంటని వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ట్రోల్స్ చేయడం ఎంతవరకూ ధర్మం అన్నది ఆలోచించాలి. మేం అంతా ఆయన్ను పరామర్శించడానికి వెళ్లాలని భావించినా ఆస్పత్రిలో హడావిడి ఎందుకని రావొద్దని సూచించారు.చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేగా ఉండగానే ముద్రగడ పద్మనాభం మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కించపర్చేలా మాట్లాడటం సరికాదు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గమే కాదు అన్ని వర్గాల్లోనూ ముద్రగడకు అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మా నాయకులు ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలపైనే మాట్లాడాం. మేం కులాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. రాజకీయంగా కాపులకు మేలు చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాంజఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నాయకులు కూడా వారి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప కులాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే ప్రయత్నం జనసేన తప్ప ఎవరూ చేయలేదు. కులాల గురించి మాట్లాడొద్దంటూనే చంద్రబాబు విజయవాడలో లాకప్ డెత్పై స్పందిస్తూ సీఐ కాపు, హతుడు కాపు అంటున్నారు. మీ స్థాయికి ఇది తగునా చెప్పండి. మీరు కులాల గురించి మాట్లాడుతూ మేం మాట్లాడుతున్నామని ఎదురుదాడి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరుతున్నాం.ముద్రగడ సాయం తీసుకునే వ్యక్తి కాదు: కురసాల కన్నబాబువైఎస్సార్సీపీలో కాపు నాయకుల్ని తన ఇంటికి రమ్మని.. తాజా పరిణామాలపై మాట్లాడుకుందామని తోట త్రిమూర్తులు తన ఇంటికి పిలిస్తే చంద్రబాబు దీనిపై అందరినీ రెచ్చగొట్టారు. చనిపోయిన వారికి కులాలు ఆపాదిస్తారా అని ఇవాళ మళ్లీ అదే చంద్రబాబు అడుగుతున్నారు. కులాన్ని నరనరానా జీర్ణించుకుని మాట్లాడుతోంది ఎవరు? ఇవాళ చంద్రబాబు ఓపెన్ చేసిన బంగారు గనికీ, కులానికీ సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ను ఖబర్దార్ అని మేం అన్నామా? రౌడీలకు కులాలు ఉంటాయా అని మీరే ప్రశ్నిస్తున్నారు. కానీ ఇవాళ మళ్లీ కాపు కులం అని ప్రస్తావిస్తూ మిమ్మల్ని ఖబర్దార్ అంటున్నారు.సాయికృష్ణ హత్యను మేం శాంతిభద్రతల సమస్యగానే చూస్తున్నాం. సిట్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సాయికృష్ణది కస్టడియల్ డెత్ అని చెప్పింది. తీసుకొచ్చి కొట్టడం, చంపడం, తల్లి అడిగినా స్పందించినా స్పందించకపోవడం, సీసీ ఫుటేడ్ ఇవ్వకపోవడం ఇలా అన్నీ నేరాలే చేశారు. టాస్క్ ఫోర్స్ పట్టుకొస్తే, పోలీసులు చంపేసి బూడిద చేసేశారు. ఈ ఘటనను మేం కాపుల కోణంలో చూడటం లేదు శాంతిభద్రతల కోణంలోనే చూస్తున్నాం.కాకినాడ రూరల్తో మొదలుపెట్టి రాష్ట్రమంతా పోలీసులు తమకు ఓ ప్రత్యేక రాజ్యాంగం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అక్రమంగా నిర్బంధాలు చేయడం, పచ్చిబూతులు తిట్టడం చేస్తున్నారు. పోలీసులు వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన తప్పదు. ఇది చంద్రబాబు తప్పు అయితే మేం పవన్ కళ్యాణ్ ను ఎందుకు అడుగుతాం? నాలుగైదు రోజులుగా సాయికృష్ణను చంపిన నాగరాజుకు పూలదండలు వేసి హీరోలా కీర్తిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు.ఇదేమైనా సినిమానా? మా ప్రభుత్వంలో కాళహస్తిలో ఓ కార్యకర్తను పోలీసు కొడితే నానా హంగామా చేశారు. ఇప్పుడు కాల్చి బూడిద చేసేస్తే మేం ప్రశ్నించకూడదా? ఇది కాపుల తగువు కాదు చంద్రబాబు తగువే. దీనికి కారణం ఆయన రెడ్ బుక్కే. ఈ ఘటనను కాపులపై రుద్దేసి తప్పించుకుందామనుకుంటున్నారు. కాపుల స్వాభిమానాన్ని దెబ్బతీయొద్దు. జీవితకాలం ఓ లక్ష్యంతో పనిచేసిన ముద్రగడ పద్మనాభం వంటి వ్యక్తిని ఎలా కించపరుస్తారు ? గతంలో అనారోగ్యానికి గురైతే ముద్రగడకు జగన్మోహన్ రెడ్డి ఎయిర్ అంబులెన్స్ పంపుతామంటే ఆయన ఒప్పుకోలేదు.డైవర్షన్ కోసమే చంద్రబాబు కుల ప్రస్తావనలు: దాడిశెట్టి రాజారాష్ట్ర పాలనపై చంద్రబాబు పట్టు కోల్పోయారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కులాల ప్రస్తావన తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఏదో అన్నామని పదే పదే ప్రస్తావన తెస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ను మేం ఏమీ అనలేదు. ముద్రగడ పద్మనాభం వంటి మీ పాత రాజకీయ సహచరుడు వెంటిలేటర్పై ఉంటే మీరు కుటుంబాన్ని వీధిలోకి లాగడం ధర్మంగా ఉందా? గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా వాటిలో చలనం తీసుకొచ్చింది ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు, నిరసనలే. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటించండి. ఆయన ఎవరూ సాయం చేస్తానన్నా తీసుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గుడి ప్రతిష్టకు వెళ్తే ఆయన గురించి చంద్రబాబు అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పెద్ద సమస్య వస్తే మరోసారి తిరుపతి లడ్డూ ప్రస్తావన కూడా తెస్తారు.కాపులు పరస్పరం కొట్టుకోవాలా ?: తోట నర్సింహంచంద్రబాబు రాష్ట్రంలో అనేక రాజకీయాలతో పాటు కుల ప్రస్తావనలు కూడా తెచ్చే దౌర్బాగ్య స్థితికి చేరారు. మాలో ఎవరికీ అలాంటి ఉద్దేశాలు లేవు. అందరూ ఐకమత్యంగా ఉండాలి. కాపు సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగేందుకు తోట త్రిమూర్తులు తన ఇంట్లో సమావేశం పెడితే దానికి పెడార్ధాలు తీస్తున్నారు. గతంలో ఇతర సామాజిక వర్గాలతో పాటు కాపులకు కూడా ఎన్నో పథకాలు తెచ్చి మేలు చేశారు.ఇప్పుడు వాటిని ఆపేస్తున్నారనే దానిపైనే మా అభ్యంతరాలు. చంద్రబాబు ఇవాళ సీఐని ఓ ఉద్యోగిగా కాకుండా కాపు అని ప్రస్తావించడం దారుణం. అంటే కాపులు తమలో తాము కొట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లుంది. ముఖ్యమంత్రి స్ధాయిలో ఉండి పవన్ కళ్యాణ్ను ఏమైనా అంటే ఖబడ్డార్ అని చెప్పడం దారుణం. అంటే పవన్ కళ్యాణ్ను ఏదో ఒకటి అనాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. గతంలో చంద్రబాబు వైఎస్సార్సీపీ వ్యక్తులు వస్తే ఏ పనీ చేయొద్దంటూ కార్యకర్తలకు, అధికారులకు చెప్పాలంటే అంత కన్నా దారుణం దేశంలో ఎక్కడా ఉండదు. అలా మాట్లాడిన వ్యక్తి మళ్లీ ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నారు.పద్దతి మార్చుకోండి: జక్కంపూడి రాజారాష్ట్రంలో క్యారెక్టర్ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చంద్రబాబు. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి ఆయన. గతంలో ఎన్టీఆర్కూ, ఆయన పిల్లలకూ చిచ్చుపెట్టి ఆయన్ను మానసికంగా వేధించి చంపేశారు. వైఎస్ జగన్ ఇంట్లో కూడా తగవులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఇవాళ ముద్రగడ పద్మనాభం ఇంట్లోనూ అదే పని చేస్తున్నారు. పద్మనాభం మీద కూతురితో రోజూ ఏదో ఒక ఆరోపణ చేయిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు.ముద్రగడ దగ్గర డబ్బుల్లేవని, వైద్యం చేయించుకునే పరిస్ధితి లేదని.. వైఎస్ జగన్కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ముద్రగడ అందరికీ పెట్టే వ్యక్తే కానీ, తీసుకునే వ్యక్తి కాదు. ఎవరైనా ఏదైనా ఇస్తామన్నా తీసుకోరు. పద్మనాభం ఇంటికెళ్తే పొట్టపగిలిపోయేలా వేల మందికి సంవత్సరాల తరబడి తినిపించిన వ్యక్తి. ఆస్తులు అమ్ముకున్నాడు కానీ ప్రభుత్వాల సాయం తీసుకోలేదు.మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం బాగోలేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి 50 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపి వైద్యసాయం అందించారు. పద్మనాభం కూడా ఎయిర్ అంబులెన్స్ ఇస్తామంటే వద్దని చెప్పానని గతంలో స్వయంగా లేఖలో చెప్పారు. పద్మనాభం కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం కడుపు మంటతో ఆయన ఇంటిపైకి గతంలో పోలీసుల్ని పంపారు. ఇకనైనా చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు తమ పద్దతి మార్చుకోండి.చంద్రబాబువి దిగజారుడు వ్యాఖ్యలు: వంగా గీతముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి రావాలని మేం కోరుకుంటున్నాం. కొన్ని మీడియా ఛానళ్లు రెండు, మూడు రోజులుగా ఓ ఉద్యమ కారుడి గురించి, వాటి కుటుంబాన్ని మానసికంగా వేధించేలా కథనాలు ప్రసారం చేస్తూ చర్చలు పెడుతున్నాయి. పెద్ద ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోకపోతే చిన్న ఆస్పత్రికి తరలించామని చెప్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఓపెన్ చేసిన ఆస్పత్రి చిన్న క్లినిక్ అని ఎలా అంటారు. ఇంతకీ మీరంతా ఏం ఆశిస్తున్నారు? అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా విడదీయండి. ముక్కలు చేయండి అని చెప్తున్నట్లుంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కులాల గురించి మాట్లాడి తనను తాను దిగజార్చుకుంటున్నారు. వైఎస్ జగన్ను అవమానించే క్రమంలో మొత్తం కాపు జాతిని అవమానించాలనుకుంటున్నారు. కాపు జాతిలో పుట్టిన మాకు అందరూ సమానమే. అన్ని కుటుంబాలు మిమ్మల్ని ఆదరించాయి. కులాల రహితంగా మేం కూడా సేవలందించాం. దయచేసి ఎవరి మెప్పు కోసమో కాపు జాతిని తిట్టకండి. వైఎస్ జగన్ ముద్రగడ పద్మనాభం గారిని ఎంత గౌరవంగా చూస్తారో అందరికీ తెలుసు. ప్రతీ రోజూ ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షణ చేస్తున్నారు. -
76 ఏళ్లు వచ్చాయి... సిగ్గులేదు! సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
"నీ వయసేంటి..? నీ మాటలేంటి..?" నీకు రోజులు దగ్గరపడ్డాయి!
-
‘సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్లాడా?’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిందని మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణపై ఆయన బుధవారం తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పోలీస్స్టేషన్లోనే మర్డర్ చేస్తే ఒక్క అధికారి కానీ, మంత్రికానీ అడగలేదు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లి పరామర్శిస్తే గాని ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సాయికృష్ణ మృతదేహం ఏమైందో చెప్పలేని పరిస్థితుల్లో అధికారులున్నారు. ఈఘటనలో చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాలి. సామాన్యుడి ప్రాణం పోతే పట్టించుకోరా?సాయికృష్ణ ఘటనకు ఎవరు రాజకీయ రంగు పులిమారు. చంద్రబాబూ.. మిమ్మల్ని ప్రజలు ఖబడ్దార్ అంటున్నారు. మీ పాలన ఎప్పుడు పోతుందో అని ప్రజలు రోజులు లెక్కపెడుతున్నారు.మీరు మోదీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు. రౌడీషీటర్ అని ఆరోపిస్తున్నారు.. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా?.కోర్టులో హాజరు పరిచి శిక్ష విధించేలా చేయండి. సాయికృష్ణ కేసులో ఇవాళ జరిగిందా డొల్ల విచారణే. సీపీ నేతృత్వంలోనే టాస్క్ ఫోర్స్ నడుస్తోంది. విచారణలో సీపీ పేరు రాకపోవడం దుర్మార్గం. కృష్ణలంక పీఎస్ పరిధిలోకి వచ్చే ఏసీపీని మీరెందుకు విచారించలేదు.17మంది సాక్షులను విచారించామని చెబుతున్నారు. సిట్ అధికారులు ఈ 17మందితోనే ఎందుకు ఆగిపోయారు.సిట్ విచారణలో సాయికృష్ణను కొట్టి చంపింది ఒక్క సీఐ నాగరాజేనా?. మిగితావారు ఈ కేసులో లేరా?. సీఐ నాగరాజుకు ఎవరు సాయం చేశారు? డెడ్ బాడీని ఎవరు మాయం చేశారు. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్లాడా?. సిట్ విచారణలో ఈ అంశాలన్నీ ఎందుకు తేల్చలేదు. పీఎస్లో ఫుటేజీ మాయం చేస్తే.. బయటి ఫుటేజీ అయినా ఉండాలి కదా?. అంటే ఎవరూ లేని సమయంలో స్టేషన్లోనే మృతదేహాన్ని పాతి పెట్టారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. -
సాయి కృష్ణ లాకప్ డెత్ అసలు నిజాలివే..!
-
కూటమి ప్రభుత్వ డొల్లతనానికి ఈ చిత్రమే నిదర్శనం!
ఈ చిత్రం చూశారా... తలపై పుస్తకాలు, చేతిలో క్యారేజీ పట్టుకుని వెళ్తున్నది పార్వతీపురం మండలం గోచక్క ప్రాథమిక పాటశాల విద్యార్థిని. ఈ ఏడాది విద్యామిత్ర కిట్టు అందజేయకపోవడంతో బడికి పుస్తకాలు తీసుకెళ్లేందుకు బ్యాగు కరువైంది. తలపై పుస్తకాలు పడిపోకుండా ఓ చేత్తో అదిమిపట్టుకుని చిన్నారి వేస్తున్న అడుగులు కూటమి పాలకుల హామీలను వెక్కిరిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే విద్యారంగాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వ డొల్లతనానికి ఈ చిత్రం సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అక్షరాలతో పేదకుటుంబాల చిన్నారుల భవితను మార్చేందుకు కృషిచేయాల్సిన సర్కారు.. పుస్తకాల బరువును పిల్లలకు శిక్షలా మార్చడం పాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. – పార్వతీపురం రూరల్ -
బాబూ.. చరిత్రలో ఇది చీకటి అధ్యాయం!
ఎంతటి పెద్ద కేసు అయినా దానిని మేనేజ్ చేయడం ఒక ఆర్ట్. అలాగే ఎంత చిన్న కేసు అయినా దానిని పెద్దదిగా చూపించడం కూడా ఓ కళే. ఇది అందరివల్ల సాధ్యం అయ్యే పని కాదు. కాని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ విషయంలో ఉన్న నేర్పరితనం బహుశా దేశంలోనే ఇంకెవ్వరికి ఉండదేమో! దీనిని ప్రశంసగా అయినా తీసుకోవచ్చు. లేదా విమర్శగా అయినా భావించవచ్చు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా పలు ఎన్ కౌంటర్ ఘటనలు జరిగాయి. వాటిపై పెద్ద వివాదాలు చెలరేగాయి. అయినా వాటిలో తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేసుకోగలిగిన తెలివి ఆయనది అని చెప్పాలి. అత్యంత సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ కేసును చంద్రబాబు ఎలా హాండిల్ చేశారో చూడండి. సాయి కృష్ణ తల్లికాని, ఇతర కుటుంబ సభ్యులు కాని తొలుత మాట్లాడినదానికి, చంద్రబాబును కలిసిన తర్వాత చెప్పిన విషయాలకు ఎంత తేడా ఉందో గమనించి అంతా ఆశ్చర్యపోవలసి వచ్చింది.ఆ కుటుంబ సభ్యులకు ఏమి న్యాయం జరిగిందో ఎవరికి తెలియదు కాని,వారు చంద్రబాబు,పవన్ కళ్యాణ్లతో పాటు లోకేష్కు కూడా ధన్యవాదాలు తెలిపిన వైనం ఆసక్తికరంగా మారింది. వారికి నిజంగా ఏదైనా న్యాయం జరిగి ఉంటే అది ఏరకంగా జరిగిందో చెప్పి ఉండేవారు. బహిర్గతం చేయలేదంటే భయపడ్డారేమో అన్న సందేహం వస్తుంది. లేదా వారికి ఏమైనా ఇతరత్రా సాయం అందించడానికి అవగాహన కుదిరిందేమో అన్న సంశయం కలుగుతుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు దీనిపై వ్యాఖ్యానిస్తూ సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండవచ్చని, అయినా తాము ఈ కేసుపై పోరాటం ఆపబోమని అన్నారు. జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మరింత గట్టిగా మాట్లాడుతూ సాయికృష్ణ కుటుంబం రాజీ పడినా, తాము వెనక్కి తగ్గబోమని, ఈ హత్య ఏపీ సమాజంపై జరిగిన దాడిగా తాము పరిగణించి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని తెలిపారు. అంతేకాక ఆ కేసులోఎవరెవరి ప్రమేయం ఉండే అవకాశం ఉందో తెలుపుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఎల్లో మీడియా కాని ,టీడీపీ పక్షాన ప్రచారం చేసే డిజిటల్ మీడియా కాని, తొలుత సాయికృష్ణపైన, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన జగన్,వైఎస్సార్సీపీ నేతలపై అడ్డగోలుగా ప్రచారం చేశాయి.ఆ కుటుంబాన్ని కలవడం ద్వారా జగన్ చాలా పెద్ద తప్పు చేశారని, రౌడీషీటర్ కుటుంబాన్ని కలుస్తారా అని టీడీపీ నేతలు దూషించారు. సాయి తల్లిని పరామర్శించి జగన్ ధైర్యం చెప్పాక, పరిస్థితి తీవ్రతను గమనించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆమెను,ఇతర కుటుంబ సభ్యులను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఆ తర్వాత వీరి స్వరం మారింది. ఈ ఉదంతంతో ఎల్లో మీడియా పరువుపోయినట్లయింది. చంద్రబాబు భేటీ తర్వాత ఎల్లో మీడియా ఫ్లేట్ ఫిరాయించేసింది. చంద్రబాబు ఎందుకు ఇంత కంగారుపడి ఆ కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారన్నదానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసు కేవలం సిఐ నాగరాజుకే పరిమితం కాదని,ఆ పైన ఉన్న అధికారులకు,ప్రభుత్వంలో కీలకమైన పదవులలో ఉన్నవారికి కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న భావనతో చంద్రబాబు ఈ జాగ్రత్త తీసుకుని ఉండవచ్చు. సాయి కుటుంబం వారు జనసేన పార్టీవారని, కాపు సామాజిక వర్గంవారని వెల్లడైంది. ఇటీవలి కాలంలో పలు ఘటనలలో కాపు వర్గానికి చెందినవారు కూడా ఇబ్బంది పడుతుండడం ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేస్తోంది. ఈ నేపధ్యంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను తన వైపునకు తిప్పుకుంటే మొత్తం కేసు బలహీనపడిపోవచ్చని అనుకుని ఉండవచ్చని అంటున్నారు.ఈ కేసు బహిర్గతం అయిన తర్వాత,ఏపీలో పలు ఇతర పోలీస్ స్టేషన్ లలో ఇలాంటి లాకప్ హింసలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మరిన్ని వెలుగులోకి రావడం కూడా ఆందోళన కలిగించి ఉండవచ్చు.కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే హింసను తాళలేక ఒక దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసు కూడా ప్రజలలోకి వెళ్లింది. వైఎస్సార్సీపీ నేతలు అతని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి తీవ్రమైన విమర్శలు చేశారు. తెనాలి, కౌతాళం, విజయనగరం తదితర చోట్ల కూడా మరికొన్ని వేధింపుల కేసులు మీడియాలో రిపోర్టు అయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ రెడ్ బుక్ పేరుతో జరిగినన్ని అరాచకాలు ఇన్నీ అన్నీ కావు. ప్రభుత్వం అరాచకాలు నిర్వహించడానికి ఒక శాఖను ఏర్పాటు చేసిందా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. సుమారు ఏభై రోజులపాటు సాయికృష్ణ కేసును ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలీసు అధికారుల చుట్టూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎన్ని రోజులు తిరిగినా ఫలితం దక్కలేదు. చివరికి వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ కేసులో అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడంతో కలకలం ఏర్పడింది.ఆ తర్వాత విజయలక్ష్మి తన బిడ్డ బూడిదైనా ఇవ్వండి అని వాపోయిన కధనం సాక్షి మీడియాలో వచ్చినప్పుడు హృదయమున్న ప్రతి వ్యక్తికి ఆవేదన కలిగించింది. హింసించి హతమార్చడమే కాకుండా, ఆ యువకుడిని కాల్చి బూడిద చేయడమేమిటని అందరూ మాట్లాడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రాజకీయాలకు అతీతంగా, కులాలతో సంబంధం లేకుండా సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించి,ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించడంతో ఒక్కసారిగా చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది.తదుపరి అర్ధరాత్రి వేళ కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో వైపు విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ చార్జీ అమ్మిశెట్టి వాసు ఈ బాధిత కుటుంబంతో రాయబేరాలు చేసి డబ్బు ఆఫర్ చేశారన్న ఆరోపణ వచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందన్న అనుమానం బలపడింది. ఈ సంగతిని సాయి మేనమామే తెలిపారు.జనసేన నేతలకు ఈ ఘోరం గురించి చెప్పినా పట్టించుకోలేదని,అందువల్లే తాము అంబటి రాంబాబుకు వివరాలు అంందిచామని ఆయన చెప్పారు. వరంగల్ లో ఒక బాలుడి పలకరించడానికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లకపోవడం కూడా విమర్శలకు దారి తీసింది. చంద్రబాబు ఒక సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ,డిజిపిలతో దీని గురించి చర్చించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సర్కిల్ ఇన్ స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక ఎసీపీ స్థాయి అధికారిని దర్యాప్తునకు తొలుత నియమించినా,ఆ తర్వాత ఐపిఎస్ లతో కూడిన ఒక సిట్ ను ఏర్పాటు చేశారు.అయినా కేసులో న్యాయం జరుగుతుందా?లేదా?అన్న సందేహాలపై చర్చలు జరుగుతున్నాయి. సీబీఐ విచారణకు విపక్షం డిమాండ్ చేస్తోంది. కేవలం ఒక్క సిఐ మాత్రమే ఇలాంటి ఘోరం చేయలేరని, ఉన్నతాధికారుల ప్రమేయం కూడా కచ్చితంగా ఉందని జడ శ్రావణ్ ఆరోపించారు.ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వంలోని పెద్దలకు కూడా ముందే తెలుసని,వాటిని బయటపెడతానని ఆయన అన్నారు..సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడ సీపీ ఆధ్వర్యంలో ఉండే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకు రావడం,కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లోను, తదుపరి ఒక ప్రైవేటు హోటల్ లోను పెట్టి తీవ్రంగా హింసించడం, గాయపడ్డ అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లడం, ప్రాణం కోల్పోయిన సాయికృష్ణు బస్టాండ్ లో అనాధ శవంగా చూపే ప్రయత్నం చేసి, ఆ తర్వాత స్మశానవాటికలో దహనం చేయడం వంటి ఘట్టాలను జడ శ్రవణ్ పూసగుచ్చినట్లు వివరించారు.కాగా తన కుమారుడిని పోలీసులు పొట్టన పెట్టుకున్నారని ఆరోపించి పలు ప్రశ్నలు వేసిన సాయికృష్ణ తల్లి,ఆమె సోదరులు శుక్రవారం నాడు చంద్రబాబును కలిసిన తర్వాత తమకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అంటూ,ఆయన వంటి మహోన్నత వ్యక్తి,పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నాయకులు తమకు న్యాయం చేసి చూపించి ప్రభుత్వ పాలన సరిగ్గా ఉందని చాటారని మేనమామ నవరంగ్ అనడం పలు సందేహాలకు తావిచ్చింది. ప్రభుత్వం అంత గొప్పగా పని చేసి ఉంటే, ఒకరోజు ముందు ఇదే నవరంగ్ తమను ఎవరూ పట్టించుకోలేదని ఎందుకు విమర్శించారో తెలియదు. ఈ కేసులో వారికి ఎలాంటి న్యాయం జరిగిందో క్లారిటీగా సాయి కుటుంబ సభ్యులు చెప్పలేదు. ప్రభుత్వమూ వివరణ ఇవ్వలేదు. చంద్రబాబు పద్దెనిమిదేళ్ల పాలనకాలంలో ఇలాంటివి పలు ఘటనలు జరిగాయి.నక్సైలైట్ల ఉద్యమ ప్రభావం అధికంగా ఉన్న రోజులలో కొన్ని ఎన్ కౌంటర్లు జరిగాయి. గత టరమ్ లో తిరుమలలో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు ఇరవై మంది ఎదురుకాల్పులలో మరణించారు. పుష్కరాలలో తొక్కిసలాట లో 29 మంది మరణించిన విషయంలో సిసిటీవీ ఫుటేజీ మిస్ అవడం మిస్టరీ అని అప్పట్లో విపక్షాలు విమర్శించేవి. ఇలాంటి ఘటనలలో ఎన్ని ఆరోపణలు వచ్చినా తన ప్రభుత్వానికి,తన పదవికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆయన జాగ్రత్తపడగలిగారు. గతంలో కోడెల శివప్రసాద్ ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణించినప్పుడు సీబీఐ విచారణ జరగకుండా చూసుకోగలిగారు. చింతమనేని ప్రభాకర్ తో సహా పలువురు టీడీపీ,జనసేన ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు వచ్చినా పోలీసులు నిశ్చేష్టులై ఉంటున్నారన్న విమర్శ ఉంది. బలహీనవర్గాలవారిపైన ప్రత్యర్ది పార్టీవారిపైన మాత్రం పోలీసులు రెచ్చిపోతున్నారు.ఈ టరమ్ లో ఎన్ని వందలమందిని రెడ్ బుక్ పేరుతో వేధించారో లెక్కలేదు.తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డులో కూర్చోబెట్టి అరికాళ్లపై దారుణంగా పోలీసులు కొట్టడం మొదలు , పలు కేసుల్లో తీవ్రంగా హింసించడం, చిన్న,చిన్న కేసులలో సైతం వైఎస్సార్సీపీవారైతే నడిరోడ్డుపై నడిపించి అవమానించడం, అదే టీడీపీ వారు ఎన్ని దౌర్జన్యాలు చేసినా నామమాత్రంగా కేసు పెట్టడం వంటివి చేస్తున్నారు. అంబటి రాంబాబు,జోగి రమేష్ ,నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి మాజీ మంత్రుల ఇళ్లపై గంటల తరబడి టీడీపీ క్యాడర్ దాడి చేస్తే మాత్రం పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించారు.దీనితో ఏపీలో పోలీసు రాజ్యం ప్రజలను ఎలా పీడిస్తోందో వివరిస్తూ జగన్ దేశం అంతటికి తెలియచేసే యత్నం చేశారు. చంద్రబాబు ఎంత మేనేజ్ మెంట్ నేర్పరి అయినా ,ఎన్ని కేసుల్లో ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చినా,ఈ సాంకేతిక యుగంలో అన్నీ తెలిసిపోతున్నాయి.చరిత్రలో ఇదో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందన్న సంగతి ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆర్టీసీ ప్రై‘వేటు’కు రైట్ రైట్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)పై ప్రై‘వేటు’కు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఉద్యోగ సంఘాల ఆందోళనను సైతం బేఖాతరు చేసింది. ఇ–బస్సుల ముసుగులో ఆర్టీసీ ప్రైవేటీకరణ తొలి దశకు పచ్చజెండా ఊపింది. తొలి దశలో 1,450 ఇ–బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిపోల వారీగా ప్రవేశపెట్టనున్న ఇ–బస్సుల వివరాలను ఖరారు చేస్తూ రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 29 డిపోల్లో 1,450 ఇ–బస్సులను ప్రవేశపెట్టబోతోంది. దశలవారీగా మొత్తం 11 వేల బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహించడమే తమ విధానమని తేల్చిచెప్పింది. -
Perni Nani: తొక్కి పెట్టి నార తీస్తావా? ఆటలో అరటిపండు గాడివి..!
-
అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు నిలువు దోపిడీ
-
ఎమ్మెల్యేల చేతుల్లోకి అసైన్డ్ భూములు
సాక్షి,విజయవాడ: కేబినెట్ సమావేశంలో కూటమి సర్కార్ రాష్ట్ర పరిపాలన, ప్రజా సేవలు, విద్యా రంగం, వైద్య రంగంపై ప్రతికూల ప్రభావం చూపేలా నిర్ణయాలు తీసుకుంది.వాటిల్లో ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలోని అసైన్డ్ కమిటీలు రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇకపై నియోజకవర్గంలో అసైన్డ్ భూములపై నిర్ణయాధికారాన్ని ఎమ్మెల్యేల కమిటీలకు అప్పగించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలను కమిటీ ఛైర్మన్లుగా నియమించనున్నారు. దీంతో అసైన్డ్ భూములపై తుది నిర్ణయాలు కూటమి ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఈ నిర్ణయం రాజకీయ ప్రభావం, పారదర్శకతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.గీతం యూనివర్సిటీలో 45 మీటర్ల ఎత్తు వరకు స్కూల్ భవన నిర్మాణానికి ఫైర్ ఎన్ఓసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని నిబంధన విధించింది. ఈ నిర్ణయం విద్యా రంగంలో అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నప్పటికీ, భద్రతా ప్రమాణాల అమలు కఠినంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆస్పత్రులు తీసుకునే రుణాలపై వడ్డీ భారాన్ని ఆస్పత్రులే భరించాలని నిర్ణయించింది. 8 శాతం వడ్డీని ఆస్పత్రులే బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ఆస్పత్రులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని, దీని ప్రభావం రోగులపై పడవచ్చని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
మీరిద్దరూ గుండు కొట్టించుకోండి..! లేదంటే ఆవు మూత్రాన్ని నేనే మీ మొఖాన...
-
సాయి కృష్ణ కేసుపై బాబును ప్రశ్నించిన జగన్
-
కాపులపై దాడుల మీద ప్రభుత్వం జవాబివ్వాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపు సామాజికవర్గంపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు ప్రభుత్వం జవాబివ్వాలని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు డిమాండ్ చేశారు. కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్తో పాటు క్రాంతికుమార్ ఆత్మహత్య, గంగమ్మ, కళావతి, తిరుపతమ్మ ఘటనలపై ప్రభుత్వం వెంటనే సమాధానమివ్వాలన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరుస ఘటనలతో ఇరకాటంలో పడిన చంద్రబాబు ఎప్పటిలాగే పవన్కళ్యాణ్, జనసేన నాయకులను రంగంలోకి దింపి డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్పై పిచ్చి కూతలు కూసిన పంతం నానాజీ సహా జనసేన నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఒక వ్యక్తి పోలీసు కస్టడీలో చనిపోతే దానికి హోం మంత్రి, డీజీపీ, పోలీసు అధికారులే బాధ్యత వహించాలన్నారు. మంత్రి కందుల దుర్గేష్ కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడే ముందు.. రెండేళ్లుగా ఆ సంస్థకు ఎందుకు నిధులు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో కాపు నేస్తం సహా వివిధ పథకాల ద్వారా రూ.36 వేల కోట్ల మేర కాపులకు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. -
ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!
సాక్షి, అమరావతి : రెండేళ్లలో అంత చేశాం.. ఇంత చేశాం.. అని భారీగా ప్రచారం చేయాలని భావించి, ఏం చెప్పుకోవాలో తెలియక ఆదిలోనే చతికిల పడింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చాక సాధించిన ప్రగతిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తొలి నివేదిక విద్యుత్ శాఖ నుంచి విడుదల చేస్తామన్నారు. ఆయన చెప్పడమే తడవుగా రెండేళ్ల పాలనలో విద్యుత్ రంగ ప్రగతిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియా మొత్తాన్నీ రాష్ట్ర సచివాలయానికి సోమవారం ఆహ్వానించారు. కానీ అక్కడికి వెళ్లిన విలేకరులకు చుక్కెదురైంది.ఎంత సేపటికీ మంత్రి రాలేదు. ‘అనివార్య కారణాల వల్ల విలేకరుల సమావేశాన్ని రద్దు చేస్తున్నాం’ అంటూ ఓ సంక్షిప్త సందేశాన్ని ప్రభుత్వ అధికారిక వాట్సప్ గ్రూపుల్లో పంపించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నివేదిక సిద్ధం కానప్పుడు విడుదల చేస్తున్నట్టు ఎందుకు ప్రకటించారు? అందరినీ ఎందుకు పిలిచారు? అని మంత్రి అనుచరులు, విద్యుత్ శాఖ అధికారులను మీడియా నిలదీసింది. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అక్కడి నుంచి నిరాశతో వెనుదిరిగింది.అయితే విద్యుత్ శాఖపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశించినప్పటికీ ఇంధన శాఖ మంత్రి సమావేశాన్ని ఆకస్మికంగా రద్దు చేయడం వెనుక అసలు కారణంపై చర్చ సాగుతోంది. గడిచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్లకు పైగా అదనపు చార్జీల భారం మోపిన ప్రభుత్వం, విద్యుత్ ఉత్పత్తి పెంపులో మాత్రం ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా ప్రారంభించలేకపోయిందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో చెప్పుకోవడానికి ఏమీ లేదని భావించిన మంత్రి, అధికారులు అనుకూల నివేదికను ఎలా తయారు చేయాలో తెలియక తలలుపట్టుకుంటున్నారని తెలిసింది. శ్వేతపత్రం సిద్ధం కాకపోవడం వల్లనే మంత్రి సమావేశం రద్దయినట్టు సమాచారం. అవన్నీ వైఎస్సార్సీపీ హయాంలోనే.. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అత్యధిక విద్యుత్ను అందిస్తున్నాయి ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో దాదాపు 45 శాతం ఏపీజెన్కో థర్మల్ కేంద్రాల నుంచే సమకూరుతోంది. వీటిలో ప్రధానంగా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల యూనిట్, విజయవాడ వీటీపీఎస్లోని మరో 800 మెగావాట్ల యూనిట్ ఉన్నాయి. అయితే ఇవి రెండూ గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన ప్రాజెక్టులు. వైఎస్సార్సీపీ పాలనలోనే మొత్తం 1600 మెగావాట్ల థర్మల్ సామర్థ్యం అందుబాటులోకి వచ్చిందనేది వాస్తవం. పునరుత్పాదక విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల హామీలు, లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు గత ప్రభుత్వంలోనే విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో జరిగాయి. దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు 42 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా సుమారు 1.80 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది.ఈ ప్రభుత్వం వచ్చాక వాటికే మళ్లీ కొత్తగా ఒప్పందం చేసుకుని తామే ప్రాజెక్టులు తెచ్చామని చెప్పుకునే ప్రయత్నం చేసి ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే అభాసుపాలయ్యారు. కాబట్టి వాటిని మళ్లీ చెప్పుకోలేరు. ఇలా గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో హరిత, థర్మల్ విద్యుత్ రంగాల్లో నమోదైన ప్రగతి ఒకవైపు కనిపిస్తుండగా, మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే వివిధ రూపాల్లో ప్రజలపై రూ.20 వేల కోట్లకు పైగా భారం పడింది. పోనీ ఉత్పత్తి సామర్థ్య పెంపు లేదా కొత్త ప్రాజెక్టుల పురోగతి ఏమైనా ఉందా అంటే అదీ కనిపించడం లేదు. కొత్తగా సాధించిందేమీ లేకే.. రాష్ట్రంలో రెండేళ్లుగా ఎండ, వాన కాలాలతో సంబంధం లేకుండా అమలు చేస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలు వినియోగదారుల అసంతృప్తికి కారణమవుతున్నాయి. సరఫరా మెరుగ్గా ఉందని అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. దీంతో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, అందులో ప్రస్తావించేందుకు రెండేళ్లలో సాధించిన స్పష్టమైన పురోగతి కనిపించకపోవడం, కొత్త విజయాలు లేకపోవడం అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రోగ్రెస్ రిపోర్ట్పై మంత్రి సమావేశం ఆకస్మికంగా రద్దు కావడం కూడా ఈ నేపథ్యంలో జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపాక, విద్యుత్ రంగంలో కొత్తగా సాధించింది ఏమిటనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. విద్యుదుత్పత్తి పెంపు లేకుండా, కొత్త ప్రాజెక్టులు లేకుండా, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పడంతో మంత్రి వెనకడుగు వేసినట్టు తెలిసింది. అయితే యూనిట్కు రూ.0.13 పైసలు ట్రూ డౌన్ చేశామన్నది హైలైట్ చేస్తూ.. విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గించి ఆర్థికంగా ఆదా చేశామనే అంశాలను ప్రధానంగా చూపించేలా ప్రోగ్రెస్ రిపోర్ట్ను తయారు చేయాలని మంత్రి, అధికారులకు సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. -
ఓటర్ల జాబితా సవరణ..
దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై(సర్) రాజకీయ పార్టీలకు పలు అనుమానాలు కలిగే పరిస్థితి ఉండడం దురదృష్టకరం. దీనికి దేశంలోని ఆయా వ్యవస్థలు బాధ్యత వహించాలి. దేశంలో ఇప్పటికీ బోగస్ ఓట్లతో ఎన్నికలు జరపడం, కొందరి ఓట్లు గల్లంతవడం, పలువురికి రెండు, మూడు చోట్ల ఓట్లు ఉండడం, ఈవీఎమ్ల టాంపరింగ్ అవకాశం, వివిపాట్ స్లిప్ల లెక్కింపు జరగకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల కమిషన్ విఫలం అవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమికి ఉపయోగపడేలా పనిచేస్తోందన్న ఆరోపణ వల్ల కమిషన్ చిత్తశుద్ధిపై ప్రజలలో అనుమానాలు తలెత్తుతున్నాయి.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు రంగం సిద్ధం అయింది. రాజకీయ పార్టీలతో ఏపీ, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారులు సమావేశం అయి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నందున, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అప్రమత్తం అయ్యాయి. కాంగ్రెస్ అభిమానుల ఓట్లు తొలగింపునకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గాంధీభవన్లో ఒక సమావేశం పెట్టుకుని కార్యాచరణ రూపొందించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను కూడా ఒక నియోజకవర్గం బాధ్యతలు తీసుకుని ఓటర్ల జాబితా తీరుపై దృష్టి పెడతామని అనడాన్ని బట్టి ఆ పార్టీ ఎంత సీరియస్గా ఉంది అర్థం చేసుకోవచ్చు.ఈ సందర్భంలోనే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీనిపై శ్రద్ధ వహించడం లేదని, జమిందార్ల మాదిరి వ్యవహరిస్తున్నారని కూడా ఘాటు వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఓటర్ల జాబితా అంశంలో పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. గతంలోనే కొన్ని ఇళ్లలో నలభై, ఏభై ఓట్లు ఉన్న విషయాన్ని గుర్తుచేసి కాంగ్రెస్పై విమర్శలు చేశారు. కాగా బీజేపీ నేతలు మాత్రం పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల ఆరోపణలను తిప్పికొడుతున్నారు.ఏపీ విషయానికి వస్తే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సర్ లో వైఎస్సార్సీపీకి నష్టం జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టారు. నియోజకవర్గంవారీగా బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి తగు శిక్షణ ఇప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇలాంటి వ్యూహాలలో ఉన్న అనుభవం రీత్యా వైఎస్సార్సీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది.విశేషం ఏమిటంటే సర్ కార్యక్రమంపై టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కూడా పిలుపు ఇచ్చారు. టీడీపీ ఓట్లు తొలగించేలా వైఎస్సార్సీపీ కుట్రలు చేయవచ్చని ఆయన అన్నారు. అంతేకాదు 2019 ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నా, పార్టీ సానుభూతిపరుల ఓట్లను వైఎస్సార్సీపీ కుట్రపూరితంగా తొలగించిందని ఆయన ఆరోపించారట. అదే ఆయనలో ఉన్న విశిష్టత. తాను ఏదైనా చేయదలచుకుంటే, తొలుత ప్రత్యర్థులపై ఆ బురద చల్లుతారని రాజకీయపార్టీలలో ఒక అభిప్రాయం ఉంది. సరిగ్గా అదే రీతిలో ఆయన మాట్లాడారు.నిజానికి 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ అలా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించినట్లు ఆరోపణలు రాలేదు. పైగా సేవామిత్ర యాప్ పేరుతో చంద్రబాబు ఆధ్వర్యంలోనే టీడీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితాలో లేకుండా చేయడానికి ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు విజయనగరం జిల్లాలో అలా సేవా మిత్ర యాప్ ద్వారా కొందరు ఉద్యోగులు ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందో తెలుసుకునే యత్నం చేయడాన్ని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆనాడు బహిర్గతం చేశారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో తమిళనాడు, కర్నాటకలలోని సరిహద్దు గ్రామాలకు చెందినవారిని ఓటర్లుగా చేర్పించారని, తద్వారా సుమారు ముప్పైవేల నుంచి నలభైవేల బోగస్ ఓట్లు అక్కడ ఉన్నాయని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంటుంది.గతంలో చంద్రబాబుపై పోటీచేసిన వైఎస్సార్సీపీ నేత, దివంగత మాజీ ఐఏఎస్ చంద్రమౌళి నిత్యం దీనిపై పనిచేసి 17వేల ఓట్లను తొలగించగలిగారు. అయినా అంతకన్నా డబుల్ బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన చెబుతుండేవారు. తాజాగా వైఎస్ జగన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి కుప్పంలో 20వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు ఎన్నడూ వివరణ ఇవ్వలేదు. బీసీ వర్గాలు అధికంగా ఉండే కుప్పాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకోవడమే కాకుండా ఇలా బోగస్ ఓట్లను కూడా చేర్పించడం ద్వారా తనకు తిరుగులేని పరిస్థితిని తెచ్చుకున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి టెక్నిక్లు అమలు చేయడంలో చంద్రబాబుకు మరెవ్వరూ సాటిలేరని గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి వంటి నేతలు విమర్శించేవారు.చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఒక భారీ ర్యాలీ తీసి బోగస్ ఓట్ల జాబితాపై గవర్నర్కు వినతిపత్రం కూడా సమర్పించారు. అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించడం, చనిపోయినవారి ఓట్లు తొలగించడం, డూప్లికేట్ ఓట్లు లేకుండా చూడడం, ఇతర ప్రాంతాలవారు ఓటర్లుగా ఉంటే వాటిని తీసివేయడం వంటి లక్ష్యాలతో ఈ సవరణ జరుగుతుంది. నిజానికి దీని ఆశయం మంచిదే. ఉదాహరణకు హైదరాబాద్లో నివసించే వేలాది మంది ఓటర్లు అటు ఏపీకి, ఇటు తెలంగాణ జిల్లాలకు ఎన్నికల సమయంలో వెళుతుంటారు. తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటారు. వీరికి రెండేసి ఓట్లు ఉండడం చట్ట విరుద్ధం. దానిని శుద్ధి చేయవలసిన అవసరం ఉంది. కాని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దీనిపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు కనిపించదు.ఒక దశలో ఆధార్ కార్డుకు ఓటుకు లింక్ పెట్టాలన్న ఆలోచన జరిగినా దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ అభ్యంతరాలు చెప్పింది. ఓటు వేసినప్పుడు వేలు ముద్ర వేయడం ద్వారా సాంకేతికంగా డబుల్ ఓట్ల అక్రమాలను నివారించవచ్చన్న సూచన ఉన్నా ఎందుకు పట్టించుకోడం లేదు. మొత్తం వ్యవస్థను సరళీకరించి బోగస్ ఓట్లు లేకుండా చేయడం కన్నా, తమకు ఏది ప్రయోజనమో దానిపైనే అధికార పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్న భావన లేకపోలేదు.పశ్చిమబెంగాల్, బీహారు రాష్ట్రాలలో ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టడం వివాదం అయింది. ఇది కేవలం బీజేపీ వ్యతిరేక ఓటర్లను తొలగించడానికి జరిగిన కుట్రగా కాంగ్రెస్తో పాటు పలు విపక్షాలు ఆరోపించాయి. ఈ అంశాన్ని జగన్ ప్రస్తావిస్తూ బెంగాల్లో 91 లక్షల ఓట్లను తొలగించారని, తమిళనాడులో 74 లక్షల ఓట్లు తొలగించారని అన్నారు. మమత బెనర్జీ పోటీచేసిన భవానీపూర్లో 45982 ఓట్లు తొలగిస్తే 15వేల తేడాతో ఆమె ఓడిపోయారని ఆయన చెప్పారు. స్టాలిన్ పోటీచేసిన కొలత్తూరులో 71 వేల ఓట్లు తీసివేస్తే, ఆయన 8వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారని ఉదాహరించారు. బెంగాల్లో 31 లక్షల ఓట్ల తేడాతో, తమిళనాడులో 17 లక్షల ఓట్ల తేడాతో టి.ఎమ్.సి,డి.ఎమ్.కె.లు ఓడిపోయాయని ఆయన వివరించారు.ఏపీలో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోతే, ఆ రాష్ట్రాలలో ఓట్లు తీసివేయడం వల్ల ఓడిపోయారని, రెండూ ప్రమాదమేనని జగన్ వ్యాఖ్యానించారు. కుప్పం ఓట్ల బోగస్ వ్యవహరం ఒక హిస్టరీ మిస్టరీ అని అన్నారు. ఒక్కో బూత్ పరిధిలో ఏభై చొప్పున వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించినా ఐదువేల ఓట్ల వరకు పోయినట్లే అని ఆయన హెచ్చరించారు. అందువల్ల ప్రతి గ్రామంలో ఆ ఓట్ల తొలగింపు లేకుండా, బోగస్ ఓట్లు చేరకుండా అప్రమత్తంగా ఉండాలని జగన్ తన కేడర్కు పిలుపునిచ్చారు. అయితే మరో రెండేళ్ల వరకు అసెంబ్లీ ఎన్నికలు లేనందున, ఒకవేళ మరీ తేడా ఉంటే దానిపై పోరాటం జరిపి, సరిచేసుకునే అవకాశం ఉండవచ్చు.ఏపీలో సీఈఓ ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్సీపీ నేత పేర్నినాని చేసిన సూచనలు కూడా గమనించదగినవే. బూత్ లెవెల్ అధికారులు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లినప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఉండేలా చూడాలని అన్నారు. ఇంతవరకు ఉన్న ఓటర్ల జాబితాలను పార్టీలకు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. కాగా గత ఎన్నికల సమయంలో ఏపీలో 3500 బూత్లలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిపినట్లు చూపిన వైనంపైన, 49 లక్షల ఓట్లు అదనంగా ఎలా పోల్ అయ్యాయన్నదానిపైన ఇంతవరకు ఎన్నికలసంఘం వివరణ ఇవ్వలేకపోయింది.వివిపాట్ స్లిప్లతో ఈవీఎమ్లను సరిపోల్చి చూపడంలో ఎన్నికల సంఘం విఫలం అయింది. వివిపాట్ స్లిప్లను కౌంటింగ్ జరిగిన పది రోజులకే దగ్దం చేయడం అనుమానాలకు దారితీసింది. అలాగే ఈవీఎమ్ల బాటరీ చార్జింగ్ కౌంటింగ్ నాటికి పెరిగిందన్న ఆరోపణపై జవాబు ఇవ్వలేకపోయారు.ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరగకుండా చూసుకోవడానికి వైఎస్సార్సీపీ సన్నద్ధం అయింది. అయినా పలుచోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ నిత్యం ఫిర్యాదు చేయవలసి వస్తోంది. ఏది ఏమైనా రాజకీయ లక్ష్యంతో ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్లను అదనంగా చేర్చడం వంటివి జరగకుండా ఎన్నికల సంఘం నిజాయితీగా వ్యవహరించకపోతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడే ప్రమాదంలో పడుతుంది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్ కల్యాణ్పై అంబటి సంచలన వ్యాఖ్యలు..
సాక్షి, తాడేపల్లి: గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి పోలీసులు మూతికి ప్లాస్టర్ వేసుకున్నారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు?. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు వైఎస్సార్సీపీ భయపడదు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చ అయ్యాయి. సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ఫోర్స్ తీసుకొచ్చింది. సీపీ ఆదేశాలు లేకుండా టాస్క్ఫోర్స్ అడుగు కూడా ముందుకు వేయదు. సీపీ ప్రమేయంతోనే మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చారు. చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టులో ప్రవేశపెట్టకపోతే అక్రమంగా నిర్బంధించినట్టే అవుతుంది. టాస్క్ఫోర్స్ తీసుకొచ్చి హింసించి చంపారంటే గూడుపుఠాణి ఉందనుకోవాలి.సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ.. సీఐ నాగరాజే కాదు సాయికృష్ణ లాకప్ డెత్లో చాలా మంది ప్రమేయం ఉంది. ఈ కేసులో విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ చేయాలి. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు?. సీఐ నాగరాజును విచారిస్తే పెద్దల పేర్లు బయటకు వస్తాయని భయం. లాకప్ డెత్ కేసులో పోలీసులు నాటకాలు ఆడుతున్నారు. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలి. బాధ్యతల నుంచి సీఎం, హోంమంత్రి తప్పించుకోలేరు. విజయవాడ పోలీసు స్టేషన్లలో చట్టాలు అమలు కావడం లేదు. విజయవాడ సీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలి. సీపీని సస్పెండ్ చేసి విచారణ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి. సాయికృష్ణ కోసం వెళ్లి టాస్క్ఫోర్స్ పోలీసుల పేర్లు బయటపెట్టాలి.సాక్షులను బెదిరిస్తున్నారు..సాయికృష్ణ లాకప్ డెత్పై పోలీసులు మాట్లాడటం లేదంటే కుట్ర ఉందని అనుకోవాలి. పోలీసులు నేరం చేస్తే పోలీసులే విచారణ చేయమేంటి?. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాలకు రక్షణ కల్పించాలి. సాయికృష్ణ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు.. సాయికృష్ణ తల్లిని పిలిపించి మాట్లాడుతున్నారు. మరోవైపు.. సాయికృష్ణ క్రిమినల్ అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడుతారు. కాపు నేతల సమావేశానికి ముందు మీటింగ్లో పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అసలు కులం పేరు ఎత్తిందే పవన్. కాపులను క్రిమినల్స్గా ముద్రవేసే కుట్ర జరుగుతోంది.పవన్ కల్యాణ్కు ఏం తెలియదు..వైఎస్సార్సీపీలో గూండాలు లేరు.. జనసేలోనే గూండాలు ఉన్నారు. పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు వైఎస్సార్సీపీ భయపడదు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరించకు పవన్. రక్షించాల్సిన వారే భక్షించారు.. ఇలా చాలా పెద్ద తప్పు. పవన్ కల్యాణ్కు ఏం తెలియదు.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్. జనసేన నేత తాతాజీ.. వైఎస్ జగన్ గురించి ఏం మాట్లాడారో విన్నావా పవన్?. పవన్ కల్యాణ్కు బుర్రలేదు, సిగ్గులేదు. తాతాజీ, చింతమనేని ప్రభాకర్ ఇలాంటి వారిని ఏం చేయాలో చెప్పు పవన్. అడ్వకేట్ శ్రీనివాస్ ఇంటి మీద దాడి చేసి ఆయన మీదనే కేసు పెట్టారు. హోంమంత్రి అనితను కించపరిచే విధంగా పవన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు.. పవన్ కల్యాణ్కు హోంమంత్రి ఇవ్చొచ్చుగా. పవన్ మాటలు, చేష్టలు, వైఖరి.. ద్వంద్వ వైఖరితో ఉన్నాయి. పోలీసు స్టేషన్లో హత్యలు చేసి బూడిత చేసే హక్కు ఎవరికీ లేదు. పవన్ గుర్తుందా. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ను చట్ట ప్రకారమే ఉరి తీశారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబు ప్రేమ ముమ్మాటికీ బూటకం... రైతులకు చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
-
బాబు ప్రేమ బూటకం.. మోసం నిజం!
సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణంగా వంచిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు హామీలిస్తూ చంద్రబాబు చెప్పిన మాటల వీడియో క్లిప్ను జత చేస్తూ.. చంద్రబాబు చేసిన మోసాలను తూర్పారబడుతూ ‘రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం – మోసం నిజం..’ అంటూ ఆదివారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు.పీఎం కిసాన్తో కాకుండా మూడేళ్లలో టీడీపీ కూటమి సర్కార్ ఒక్కో రైతు కుటుంబానికి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.19 వేలేనని స్పష్టం చేశారు. టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం.. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కకున్నా చీమ కుట్టినట్టైనా లేదా? అంటూ నిలదీశారు. మీరు రైతులకు ఇచ్చింది.. వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమేనంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘ఎక్స్’లో వైఎస్ జగన్ ఏమని పోస్టు చేశారంటే..రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - మోసం నిజం!@ncbn గారు రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే. •మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు… pic.twitter.com/0y5C93csiF— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2026⇒ చంద్రబాబు గారు.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్ధలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా.. మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలైనా అన్నీ మోసాలే. మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా ఒక్క సంవత్సరం కూడా మాట తప్పలేదు. పైగా మేం మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం. ఎన్నికల ముందు రాజమహేంద్రవరం వేదికగా పీఎం–కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 చొప్పున ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ పోస్టుకు మీరు మాట్లాడిన మాటలు జత చేస్తున్నా.⇒ 2024–25లో పీఎం–కిసాన్కు అదనంగా మీరు ఇస్తానన్నది, ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది – సున్నా. 2025–26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే. 2026–27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది – కేవలం రూ.5,000. అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం–కిసాన్ కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.19,000. పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85 లక్షల మందికి కుదించారు. కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు.⇒ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో మేం ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాం. ఈ రెండేళ్లలో మీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.⇒ ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్టనష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియం కూడా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం. అది కూడా రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని మీరు ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ–క్రాప్ను, టెస్టింగ్ ల్యాబ్లను నాశనం చేశారు.⇒ ఆక్వా రైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్గా ఉన్న ‘అప్సడా’ అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వా ఫీడ్కు రూ.4 పెంచారు. జూన్లో మరో రూ.10– రూ.12 పెంచారు. కిలోకు ఏకంగా రూ.14– రూ.16 చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యల మేత ధర రూ.72 వేల నుంచి రూ.1.08 లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిన పరిస్థితి. ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టీమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరా చూస్తే తగ్గించింది కేవలం రూ.2 మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప! ఆక్వా రైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీని పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12 చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి ఇవ్వాళ్టికీ రూ.380 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4 ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది? పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం.. సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా? ౖఇక మీరు రైతుల కోసం ఏం చేసినట్టు చంద్రబాబు గారూ? మీరు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే!ఎన్నికల ముందు ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు చెబుతున్న వీడియో కోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి... -
డీఎస్సీపై ప్రశ్నిస్తున్నందుకు పర్వతరెడ్డి విద్యాసంస్థలపై దాడులు
సాక్షి, అమరావతి: డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. డీఎస్సీలో అక్రమాలతోపాటు, కల్తీ నెయ్యి ముసుగులో జరుగుతున్న హెరిటేజ్ దోపిడీని ప్రశ్నించినందుకు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన ద్రోహా న్ని ఎండగడుతూ శాసనమండలిలో, ప్రెస్మీట్లలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసినందుకు చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు ఒడిగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అప్పిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రశ్నించే గొంతును నొక్కడమే ధ్యేయంగా ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 16 వేల మందికి పైగా విద్యార్థులు, 500 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో దాదాపు రెండు దశాబ్దాలుగా నడుస్తున్న సంస్థపై దాడులు చేసి రాజకీయ కక్షసాధింపులకు దిగడం హేయం. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన వ్యాపారాలపై దాడులు చేస్తారా? ఇదే సంప్రదాయాన్ని రాబోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగిస్తే చూడాలని అనుకుంటున్నారా?’ అని నిలదీశారు. డీఎస్సీలో ఏ తప్పూ జరగలేదని భావిస్తే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చు కదా అంటూ విద్యాశాఖ మంత్రి లోకేశ్కు అప్పిరెడ్డి సవాలు విసిరారు. నేడు నెల్లూరుకు వైఎస్సార్సీపీ నాయకుల బృందం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఈ నెల 22న (సోమవారం) వైఎస్సార్సీపీ నాయకులు నెల్లూరు వెళ్లి ఆయనను కలిసి భరోసా ఇస్తారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. -
అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణలు: వైఎస్ జగన్
-
‘రైతులపై బాబు ప్రేమ బూటకం- మోసం.. నిజం’
సాక్షి, తాడేపల్లి: రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం-మోసం నిజం అంటూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబూ.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే’’ అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా, ఒక్క సంవత్సరం కూడా తప్పలేదు. పైగా మేము మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం. ఎన్నికల ముందు రాజమండ్రి వేదికగా నిలబడి, పీఎం-కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి, మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ ట్వీట్కు మీరు మాట్లాడిన మాటలు జతచేస్తున్నాను...2024-25లో పీఎం-కిసాన్కు అదనంగా మీరు ఇస్తానన్నది ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది.. సున్నా. 2025-26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే. 2026-27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది.. కేవలం రూ.5,000. అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం-కిసాన్ కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.19,000...పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85లక్షల మందికి కుదించారు. కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్గా మేం నిలిచాం. ఈ రెండేళ్లలో మీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - మోసం నిజం!@ncbn గారు రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే. •మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు… pic.twitter.com/0y5C93csiF— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2026..ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్ట, నష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా, మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియంకూడా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. కాని, మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం, రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే. ..ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేశారు. ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ-క్రాప్ను, టెస్టింగ్ ల్యాబులను నాశనం చేశారు...ఆక్వారైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్గా ఉన్న అప్సడా అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వాఫీడ్కు రూ.4లు పెంచారు, జూన్లో మరో రూ.10- రూ.12లు పెంచారు. కిలోకు ఏకంగా రూ.14- రూ.16లు చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యలమేత ధర రూ.72వేల నుంచి రూ.1.08లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిన పరిస్థితి...ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టిమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరాచూస్తే తగ్గించింది కేవలం రూ.2లు మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప? పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఆక్వారైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు...మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12లు చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి, ఇవ్వాళ్టికీ రూ.380కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4లు ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?. పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు ఆ ధర రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా?. ఇక మీరు రైతులకోసం ఏంచేసినట్టు చంద్రబాబూ మీరు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
‘సుగాలీ ప్రీతి కేసులో పవన్ చెప్పేవన్నీ అబద్ధాలే’
సాక్షి,తిరుపతి: సుగాలీ ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై రోజా ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు హయాంలోనే సాక్ష్యాధారాలు తారుమారయ్యాయి. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్సార్సీపీనే అండగా నిలిచింది. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని పవన్ అన్నాడు. రెండేళ్లయింది.. పవన్ ఇచ్చిన హామీని గాలికొదిలేశారు.. సాయికృష్ణ కేసులో పవన్ మాటలు చేతకానితనానికి నిదర్శనం.ప్యాకేజీలు తీసుకుని పవన్ బఫూన్లా మారారు. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత శనిలా పట్టుకున్నారని రోజా విమర్శించారు. -
న్యాయం చేస్తానన్న పవన్.. ఆధారాలే లేవంటున్నాడు: సుగాలి పార్వతి
సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రీతి తల్లి సుగాలి పార్వతి తీవ్రంగా ఖండించారు. ఈ కేసును నీరుగార్చేందుకే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సుగాలి ప్రీతి కేసును అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందిన పవన్.. ఇప్పుడు అదే కేసుపై భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసులోని నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం తమకు కలుగుతోందని పేర్కొన్నారు.డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై తాజాగా సుగాలి పార్వతి స్పందించారు. ఈ సందర్బంగా పార్వతి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసే తన మొదటి ప్రాధాన్యమని చెప్పిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఈ కేసులో పవన్ ఒక్క ఆదేశాలు జారీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వంలో అఘాయిత్యం జరిగింది. ఈ అన్యాయంపై పవన్కు పూర్తిగా వివరించాను, ఆధారాలు కూడా ఇచ్చాను. అయినప్పటికీ ఇప్పటికీ న్యాయం చేయలేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశ్నించిన పవన్ ఇప్పుడు ఏమయ్యారు?. నిందితులకు అమ్ముడుపోయే విధంగా పవన్ వ్యహరిస్తున్నట్లుగా మాకు అనిపిస్తోంది. ఈ కేసులో ఆధారాలు తారుమారు అయ్యాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం దారుణం.సుగాలి ప్రీతికి న్యాయం చేయకపోయినా పర్వాలేదు. దీనిపై వక్రీకరించి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగిస్తోంది. టీడీపీ ప్రభుత్వంలోనే కేసులో ఆధారాలను తారుమారు చేశారు. ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నా.. వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్ కళ్యాణ్ తన వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేదని వాపోయారు. కానీ, సుగాలీ ప్రీతి కేసును అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ మాట మారుస్తున్నారు. సుగాలీ ప్రీతి కేసును పవనే నీరుగారుస్తున్నారు.ఈ కేసులో నిందితులను వీదేశాలకు పంపించేందుకు అనుమతులు ఇస్తున్నారు. ప్రస్తుతం స్థానిక మంత్రితో కలిసి నిందితులు తిరుగుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేశారు. సుగాలీ ప్రీతి ఆత్మకు శాంతి కలిగించే విధంగా నేను పోరాటం చేస్తాను. మా కుమార్తె కోసం వీల్ చైర్ యాత్రను ప్రారంభిస్తాను. తప్పకుండా న్యాయం కోసం పోరాటం చేస్తాం’ అని తెలిపారు. -
క్రాంతికుమార్ మృతిపై సీబీఐ విచారణ జరపాలి
లబ్బీపేట/కృష్ణలంక (విజయవాడ తూర్పు): దళిత యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించడంతోపాటు, అతని కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. క్రాంతికుమార్ మృతితో దిక్కులేకుండా పోయిన ఆయన బిడ్డలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రంలో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని రెచ్చి పోతున్నారని, బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, హోంమంత్రి అనిత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే రెచ్చిపోయి హింసిస్తుంటే, సామాన్యులు తమ కష్టాలను ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులకు తాళలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని శనివారం వైఎస్సార్సీపీ నాయకుల బృందం పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. రాష్ట్రంలో కృష్ణలంక లాంటి పోలీస్ స్టేషన్లు ఎన్నో ఉన్నాయని, ఇప్పటికైనా వేధింపులు, దాడులకు ఫుల్స్టాప్ పెట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.ఒక దళిత మహిళ అయ్యుండి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి హోంమంత్రి అనితకి తీరికలేదా అని నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలకు క్రాంతికుమార్ తండ్రి, ఏపీ ఎమ్మార్ఫీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఘటన పూర్వాపరాలను వివరించారు. పోలీసుల వేధింపుల వల్ల తన కొడుకు ప్రాణాలొదిలాడని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ కులంలో పుట్టడమే తప్పయిపోయిందని తన కొడుకు చాలా ఆవేదన చెందాడని కంటతడిపెట్టారు. ప్రజాఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్న తన కొడుక్కే ఇలా జరిగిందంటే ఇక నోరులేని సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ నాగరాజు వంటివారు పోలీసు వ్యవస్థకే మాయని మచ్చని విమర్శించారు. ఘటనపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలివైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించామని చెప్పారు. దళిత యువకులపై పోలీసులు దాడులు చేస్తున్నారని, వారిపై అక్రమంగా గంజాయి కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరిచి వేధిస్తున్నారని విమర్శించారు. బూట్ పాలిష్ చేయాలంటూ క్రాంతిని వేధించిన సీఐ నాగరాజు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చర్మం వలచడం కూడా దళితుల వృత్తే అనే విషయం గుర్తుంచుకోవాలి’’ అని పోలీసులను హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు, దాష్టీకాలు పెరిగిపోయాయని, వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు సాగిస్తున్న మారణకాండకు కృష్ణలంక పరిధిలో జరిగిన సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలే సాక్ష్యమని స్పష్టం చేశారు. హోం మంత్రి అనిత తక్షణమే స్పందించి క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, మేకప్, లాకప్ ప్రభుత్వమని విమర్శించారు. -
సాగు సమ్మె దిశగా రొయ్య రైతులు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రొయ్య రైతులు సాగు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. ఓవైపు రొయ్యల ధరలు పతనమవుతుండగా.. మరోవైపు భారీగా పెంచిన మేత ధరలు రొయ్యల సాగుకు పెనుభారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో రొయ్యల్ని పట్టుబడి పడుతున్న రైతుల్లో అత్యధికులు సాగు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, ఎగుమతిదారులకు కొమ్ముకాస్తూ రైతుల ప్రయోజనాలను పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా లంకలకోడేరుకు చెందిన ఓ రైతు ఇప్పటికే సాగు సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించడమే కాకుండా తహసీల్దార్కు నోటీసు కూడా ఇచ్చారు. ఆయన బాటలోనే మరికొందరు మంది రైతులు సాగు సమ్మెకు దిగడమే మేలన్న ఆలోచనలో ఉన్నారు.పతనమైన ధరలతో సతమతంరాష్ట్రంలో ఈ–ఫిష్ డేటా ప్రకారం 1.62 లక్షల మంది రైతులు 5.72 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేçస్తున్నారు. పెరిగిన చెరువుల లీజు, మేత ధరలు, విద్యుత్ చార్జీల వల్ల రొయ్యలు 100 కౌంట్కు రావాలంటే కిలోకు రూ.270–రూ.290 ఖర్చు చేయాల్సి వస్తోంది. 50 కౌంట్కు చేరాలంటే కిలోకు రూ.340–రూ.350, గరిష్టంగా 30 కౌంట్కు రావాలంటే కిలోకు రూ.450కు పైగా ఖర్చవుతోంది. వైరస్ల ప్రభావంతో వేసవి పంటలో 70–80శాతం, రెండో పంటలో 30–40 శాతానికి మించి సీడ్ సక్సెస్ రేటు ఉండటం లేదు. 100 కౌంట్లో ఎకరాకు టన్ను, 50 కౌంట్ అయితే 2 టన్నులు, 30 కౌంట్ అయితే 3 టన్నులకు మించి వచ్చే పరిస్థితి లేదు. 3 టన్నుల పట్టుబడి పట్టే రైతులు నూటికి 10–15 శాతం మించి ఉండరు. అమెరికా సుంకాల పేరిట గత ఏడాది రొయ్యల ధరలను భారీగా తగ్గించేశారు. ఆ తరువాత పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మూడు నెలల క్రితం కిలో రూ.275 పలికిన 100 కౌంట్ ప్రస్తుతం రూ.225కు దిగజారింది. 50 కౌంట్ ధర రూ.285, 30 కౌంట్ ధర రూ.425కు పడిపోయాయి.గోరుచుట్టుపై రోకలి పోటులా..టన్ను వనామీ రొయ్యల ఉత్పత్తికి రూ.2.60 లక్షలు, టన్ను టైగర్ రొయ్యల ఉత్పత్తికి రూ.3.50 లక్షలు, చేపలకైతే రూ.1.10 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. రొయ్యల మేత కోసం రూ.1.50 లక్షలు, చేపల మేతకైతే రూ.75 వేల వరకు రైతులు ఖర్చు చేస్తుంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.1.08 లక్షలకు చేరింది. గడచిన 5 నెలల్లో టన్నుకు రూ.16 వేల చొప్పున పెంచగా, సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో రూ.4 వేలు తగ్గించేందుకు అంగీకరించిన కంపెనీలు 24 గంటలు తిరక్కుండానే టన్నుకు రూ.2 వేలకు మించి తగ్గించే ప్రసక్తే లేదని ప్లేట్ ఫిరాయించాయి. రొయ్యల ధరలు పడిపోవడం, మేతల ధరలు, సాగులో వినియోగించే ఇతర పరికరాల ధరలు పెరిగిపోవడంతో ఆక్వా సాగు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని పాలకొల్లుకు చెందిన ఆక్వా రైతు కె.సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టుబడి పూర్తి కాగానే సాగు సమ్మెకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు.క్రాప్ హాలిడేకు వెళ్తున్నానేను దాదాపు మూడు దశాబ్దాలుగా రొయ్యల సాగు చేస్తున్నా. 1998లో 25 కేజీల ఫీడ్ బస్తా ధర రూ.1,125 ఉండగా.. ఇప్పుడు రూ.2,700కి చేరింది. నాడు 30 కౌంట్ ధర రూ.625 పలకగా.. ఇప్పుడు రూ.425కు దిగజారిపోయింది. ప్రస్తుతం ఎకరాకు రూ.3.50 లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు ఖర్చవుతోంది. రొయ్యల ధరలు తగ్గటం, మేత ధరలు పెరగటంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రాసెసింగ్ కంపెనీలు, ఫీడ్ తయారీదారులు సిండికేట్గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే క్రాప్ హాలిడేకు వెళ్లాలని నిర్ణయించుకుని తహసీల్దార్ లిఖిత పూర్వకంగా తెలియజేశా. చాలామంది రైతులు క్రాప్ హాలిడేకు వెళ్లాలని భావిస్తున్నారు.– వేగేశ్న గోపాలకృష్ణంరాజు, లంకలకోడేరు, పాలకొల్లు మండలం -
‘టీడీపీ ఆఫీసులోనే స్క్రిప్ట్ రెడీ అవుతోంది’
సాక్షి, తాడేపల్లి: కారుమూరి కుటుంబాన్ని వేధించటానికే అక్రమ కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లేని మద్యం స్కాంలో కారుమూరి సునీల్ని అక్రమంగా అరెస్టు చేశారంటూ ధ్వజమెత్తారు. ‘‘బీసీల అణచివేతకే సునీల్ అరెస్టు. అసలు మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయని ఏ అధికారైనా చెప్పారా?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.కాగ్ లాంటి సంస్థలు ఏమైనా అభ్యంతరం తెలిపాయా?. శాఖాపరమైన విచారణ ఏమైనా జరిగిందా?. అవేమీ లేకుండానే విజిలెన్స్ విచారణకు ఎలా ఆదేశించారు?. సాయిశ్రీనివాస్ అనే టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేయగానే గంటలోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించటం దుర్మార్గం. దమ్ముంటే నారా లోకేషే ఫిర్యాదు చేయొచ్చుగా?. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ మొత్తం ఎపిసోడ్ జరుగుతుంది. ఫిర్యాదు, విచారణ ఎలా జరగాలో టీడీపీ ఆఫీసులోనే స్క్రిప్టు రెడీ అవుతోంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు.‘‘వైఎస్ జగన్ హయాంలో పారదర్శకంగానే రవాణా టెండర్లు జరిగాయి. తక్కువ ప్రైస్ చూపిన వారికే టెండర్లు దక్కాయి. అందులో నేరం ఏం ఉంది?. కేవలం కారుమూరి కుటుంబాన్ని వేధించటానికే అక్రమ కేసు పెట్టారు. అక్రమ కేసులకు సోషల్ మీడియా కార్యకర్తలే భయపడలేదు. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడతారా?’’ అంటూ నాగార్జున యాదవ్ వ్యాఖ్యానించారు. -
మాట్లాడితే లోపల వేసి చంపేస్తాం..! గ్యాంగ్ కు గ్యాంగ్ స్టర్..
-
సాయి కృష్ణ తల్లి చంద్రబాబును కలవడంపై.. రాజేశ్వర్ రెడ్డి షాకింగ్ నిజాలు.
-
అంతా అతని ఆధ్వర్యంలోనే జరిగింది! ఇది నిజం ..
-
ఈ కేసులో న్యాయం జరిగే ప్రసక్తే లేదు..చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్
-
ఆక్వాలోనూ అదే ‘నాటకం’
సాక్షి, అమరావతి: రైతుల పట్ల సీఎం చంద్రబాబు నాటకం, బూటకపు మాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. రొయ్యల ఫీడ్ ధరల విషయంలో బుధవారం చంద్రబాబు చెప్పిన మాటలు ఉత్త డొల్లేనని తేలిపోయింది. చంద్రబాబు సమక్షంలో గురువారం జరిగిన సమావేశంలో ఆక్వా ఫీడ్ ధరలు టన్నుకు రూ.4 వేలు తగ్గించాలని కంపెనీలను సీఎం ఆదేశించగా, అందుకు కంపెనీలు అంగీకరించాయని ప్రకటించారు. ఇదంతా వట్టిదేనని శుక్రవారం ఆక్వా ఫీడ్ కంపెనీలు తేల్చిపారేశాయి. టన్నుకు రూ.4 వేలు తగ్గించే ప్రసక్తే లేదని, రూ.2 వేలకు మించి తగ్గించడంలేదని ఫీడ్ మార్కెట్లో 50 శాతానికి పైగా వాటా కలిగిన అవంతి ఫీడ్స్ కంపెనీతో పాటు ఐఫీడ్ కంపెనీ కూడా అధికారికంగా ప్రకటన జారీ చేశాయి. మిగిలిన కంపెనీలు కూడా టన్నుకు రూ.2 వేలకు మించి తగ్గించలేమని చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వ ప్రకటన వట్టి బూటకమేనని తేలిపోయింది. ఆక్వా రైతులను మరోసారి నిరాశలో ముంచారు. నిన్నటి మాట వట్టిదే.. ఆక్వా రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతోంది. వనామీ రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర, టైగర్ రొయ్యలకు రెండున్నర టన్నుల చొప్పున మేత అవసరం. ఒక్క ఏపీలోనే ఏటా 23 లక్షల టన్నుల మేతను రొయ్య రైతులు కొంటారు. ఈ రంగంలో ఏటా రూ.21 వేల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. దీంట్లో 50 శాతానికి పైగా వాటా అవంతి ఫీడ్స్దే. ఆ తర్వాత 20 శాతం దేవీ ఫీడ్స్ది కాగా, మిగిలిన వాటా బీఎంఆర్ (బీద మస్తాన్రావు), సంధ్య, సీపీ, ఫెడోరో, ఫాల్కన్ వంటి ఇతర సంస్థలది. వీటిలో మెజార్టీ సంస్థలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవే. ఈ కారణంగానే చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని ధిక్కరిస్తూ ఏకపక్షంగా మేత ధరలను పెంచేస్తున్నాయి. ఫిబ్రవరిలో ఏకపక్షంగా రూ.4 వేలు పెంచిన కంపెనీలు తాజాగా ముడిసరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో టన్నుకు వనామీ ఫీడ్పై రూ.12 వేలు, టైగర్ ఫీడ్పై రూ.14 వేలు పెంచుకునేందుకు కమిషనర్ను అనుమతి కోరాయి. అప్సడా అనుమతి లేకుండా గత నెల 11న వనామీ ఫీడ్పై రూ.8,430, టైగర్ ఫీడ్పై రూ.10,520 చొప్పున పెంపునకు సిద్ధమయ్యాయి. ఆక్వా రైతుల ఆందోళనలతో పెంపు అమలును వాయిదా వేశాయి. ఆ తర్వాత పలుమార్లు సమావేశమైనప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. అయినప్పటికీ ఈ నెల 13న వనామీ ఫీడ్పై రూ.10వేలు, టైగర్ ఫీడ్పై రూ.12 వేలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. కాగా గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఫీడ్ తయారీదారులు, ప్రభుత్వ, ఫీడ్ కంపెనీల అనుకూల రైతు ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కంపెనీలు టన్నుకు ఎమ్మార్పీపై రూ.4 వేల చొప్పున తగ్గించేందుకు అంగీకరించాలని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ లెక్కన వనామీ ఫీడ్పై టన్నుకు రూ.6 వేలు, టైగర్ ఫీడ్పై రూ.8వేలు భారం పడుతుందని, ఈ పెంపును కూడా అంగీకరించబోమని, తక్షణమే పెంచిన ఫీడ్ ధరలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కానీ, అసలు విషయాన్ని ఫీడ్ కంపెనీలు శుక్రవారం వెల్లడించాయి. కిలోకు రూ.2 (టన్నుకు రూ.2 వేలు) మాత్రమే తగ్గిస్తామని అవంతి ఫీడ్స్, ఐఫీడ్ కంపెనీ స్పష్టంగా చెప్పేశాయి. మిగిలిన కంపెనీలూ ఇదే మాట చెబుతున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వ బూటకం మరోసారి బయటపడిందని ఆక్వా రైతులు మండిపడుతున్నారు. 2019–24 మధ్యలో కంపెనీలు మూడు సార్లు ఫీడ్ ధరలు పెంచినప్పటికీ వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి ఫలితంగా వెనక్కి తీసుకున్నాయని గుర్తు చేస్తున్నారు. రైతులపై టన్నుకు రూ.8,600కు పైగా భారం పడకుండా వైఎస్ జగన్ అడ్డుకొన్నారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు పెంచిన ధరలను పూర్తి స్థాయిలో రోల్బ్యాక్ చేయకపోతే క్రాప్ హాలిడేకు వెళ్లడం తప్ప గత్యంతరం లేదని తేల్చిచెబుతున్నారు. -
సిగ'ధర'గ!
సాక్షి, అమరావతి: సంక్షోభంలో ఉన్న రైతులకు ఏ ప్రభుత్వాధినేతైనా భరోసా ఇవ్వాలి. అంతే కానీ వారిని మరింత సంక్షోభంలో నెట్టే యత్నం చేయకూడదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రంలో కర్షకులను నిలువునా ముంచేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ పొగాకు రైతులపై ప్రభుత్వ ఉదాసీన వైఖరే నిదర్శనం. గురువారం పొగాకు రైతులు, కంపెనీల ప్రతినిధులతో సమీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో పొగాకు సరాసరి ధర కిలోకు రూ.200కు తగ్గకూడదని ప్రకటించారు. సీఎం స్థాయి వ్యక్తి ప్రకటన తర్వాత సరాసరి ధర పెరగాల్సిందిపోయి మరింత పతనమైపోయింది. దీంతో పొగాకు రైతులు మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం నెలకొంది. సీఎం ప్రకటన తర్వాత శుక్రవారం (జూన్ 19న) సరాసరి అమ్మకం ధర కిలోకు రూ.182.09కు దిగజారిపోవడమే ఇందుకు నిదర్శనం. శుక్రవారం కనిష్ట ధర రూ.160 కాగా, గరిష్ట ధర రూ.250 పలికింది. దాదాపు అన్ని కేంద్రాల్లోనూ సరాసరి అమ్మకం ధరలు రూ.200కు దిగువనే రికార్డవడం ఆందోళనకు గురిచేస్తోంది. సీఎం ప్రకటనకే విలువ లేదా? 2023–24 మార్కెటింగ్ సీజన్తో పోలిస్తే గడిచిన రెండు సీజన్ల నుంచి ధర లేక రాష్ట్రంలో పొగాకు రైతులు విలవిల్లాడుతున్నారు. రబీ 2025–26 సీజన్లో పొగాకు పంటకు మే 25 నాటికి సరాసరి అమ్మకం ధర కిలోకు రూ.237.21కు పడిపోగా, ఆ తర్వాత వరుసగా జూన్ 1 నాటికి రూ.235.63కు, 9వతేదీ నాటికి రూ.232కు, జూన్ 11 నాటికి రూ 230.58కు, 18వ తేదీ నాటికి రూ.184.26కు దిగజారింది. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత శుక్రవారం సరాసరి అమ్మకం ధర 182.09కు పతనమైంది. దక్షిణాది తేలిక నేలల్లో పొగాకు సరాసరి అమ్మకం ధర జూన్ 1న రూ.231.02 పలుకగా, జూన్ 9న రూ.228.39 పడిపోయింది. 15న రూ.210.96 పలుకగా, సీఎం ప్రకటన తర్వాత 19న రూ.200కు దిగజారిపోయింది. దాదాపు అన్ని వేలం కేంద్రాల్లో సరాసరి అమ్మకం ధరలు కిలోకు రూ.200కు దిగువనే నమోదవుతున్నాయి. ప్రధానంగా వెల్లంపల్లి–2 వేలం కేంద్రంలో రూ.183.26, ఒంగోలు–1లో రూ.181.39, ఒంగోలు–2లో రూ.182.77, టంగుటూరులో రూ.190.49, కనిగిరిలో రూ.187.8కు పడిపోయింది. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత ఇంత దారుణంగా సరాసరి అమ్మకం ధరలు దిగజారిపోతుండడంతో పొగాకు రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొనుగోలు కంపెనీల సమక్షంలోనే సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు విలువ ఇంకెక్కడ ఉందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కంపెనీలతో చంద్రబాబు సర్కారు కుమ్మక్కై రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023–24తో పోలిస్తే తీవ్ర నష్టం రబీ 2023–24 మార్కెటింగ్ సీజన్ సరాసరి అమ్మకం ధర రూ.288.65 లభించింది. 2024–25 సీజన్లో సరాసరి అమ్మకం ధర కిలోకు రూ.248.86 మించలేదు. ఇక 2023–24 సీజన్లో దక్కిన సరాసరి అమ్మకం ధరలతో పోలిస్తే కిలోకు రూ.106.56 మేర రైతులు నష్టపోతున్నారు. దీనికి పెరిగిన ఉత్పత్తి వ్యయం ఏటా కిలోకు కనీసం రూ.10 చొప్పున రెండేళ్లలో రూ.20 అదనపు నష్టం కలుపుకోవాలని రైతులు చెబుతున్నారు. బేళ్లూ తిరస్కరణ మరొక వైపు తిరస్కరణకు గురయ్యే బేళ్లు ఉండ కూడదని, నో బిడ్కు చాన్స్ ఇవ్వొద్దంటూ సీఎం చంద్రబాబు ప్రకటించగా, 19న ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు–1, కొండేపి, వెల్లంపల్లి కేంద్రాల్లో సగటున 38.16 శాతం బేళ్లు , పొదిలి –1, కనిగిరి, శ్రీకందుకూరు –1, కందుకూరు –2, డీసీ పల్లిల్లో 24.21 శాతం బేళ్లు తిరస్కరణకు గురి కావడం ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతోంది. మరొక వైపు 17వ తేదీతో పోలిస్తే నో బిడ్ బేళ్లు పెరిగాయని చెప్పక తప్పని దుస్థితి. ఇలా తిరస్కరించిన బేళ్లను వెనక్కి తీసుకెళ్లడానికి బేలుకు రూ.2 వేలు అదనంగా ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు. మరొక వైపు ప్రస్తుత సీజన్లో 260.65 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అంచనా కాగా, వేలం కేంద్రాలు ప్రారంభించి 65 రోజులు దాటిన తర్వాత కూడా 50.82 మిలియన్ కిలోలకు మించి వేలం జరగలేదంటే ఏ స్థాయిలో పొగాకు వేలం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆత్మహత్యలే శరణ్యం రెండు బ్యారన్లకు 18 ఎకరాల్లో వర్జీనియా పొగాకు సాగు కోసం ఎకరానికి రూ.2.50 లక్షలు పెట్టుబడి పెట్టా. దాదాపు 160 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. టంగుటూరు వేలం కేంద్రానికి తొలుత నాలుగు బేళ్లను తీసుకెళ్తే 2 బేళ్లను వెనక్కి పంపేశారు. తీసుకున్న బేళ్లకూ కిలోకు రూ.200 మించి ఇవ్వలేదు. మరోసారి నాలుగు బేళ్ళు తీసుకెళ్తే మళ్ళీ 2 తిరస్కరించారు. కొన్నదానిలో ఒకదాన్ని రంగులేదనే సాకుతో వెనక్కి పంపేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి లాగా మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకు కొనకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. – రాయండ్ల వెంకట నారాయణ, పొందూరు, ప్రకాశం జిల్లా సరాసరి అమ్మకం ధర పతనం సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత సరాసరి అమ్మకం ధరలు మరింత దిగజారిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. చరిత్రలో తొలిసారి వైఎస్ జగన్ హయాంలో పొగాకును కూడా మార్క్ ఫెడ్ ద్వారా కొన్నారు. ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయడం లేదు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
పోలీసులే భక్షకులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘‘పోలీసులే భక్షకులవుతున్నారు. నా బిడ్డ బలవన్మరణానికి కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులే కారణం’’ అని పేరుపోగు క్రాంతికుమార్ తండ్రి, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు విమర్శించారు. క్రాంతికుమార్ మరణానికి కారణమైన సీఐ నాగరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడ ప్రెస్క్లబ్లో పేరుపోగు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ‘‘నేనొక సామాజిక ఉద్యమకారుడిని. సామాజిక సమస్యలపై అనేక పోరాటాలు చేశాను. ప్రజల హక్కులు, దళిత హక్కుల కోసం పోరాడాను. నా బిడ్డకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. గత నెల 21న ఉదయం 10.30 గంటల సమయంలో కృష్ణలంక పోలీసులు నా కుమారుడి ఇంటికి వచ్చారు. సీఐ రమ్మంటున్నారు. పోలీసు స్టేషన్కు రావాలని పిలిచారు. నా బిడ్డ భయపడి రానని చెప్పాడు. ‘‘సీఐ నన్ను చంపేస్తాడు’’ అని పోలీసులతో అన్నాడు. ‘‘నువ్వు వచ్చినా.. రాకపోయినా జరిగేది అదే’’ అని పోలీసులు బెదిరించారు. పోలీసులు పక్క ఇంట్లో ఉన్న నా భార్య వద్దకు వెళ్లి మీ అబ్బాయిని బయటకు రమ్మని చెప్పండని కోరారు. నా భార్య అక్కడికి వెళ్లి కొడుకును బయటకు రమ్మని చెప్పగా .. ‘‘వద్దమ్మ నేను బయటకు వస్తే చంపేస్తారు’’ అని భయపడుతూ నా కొడుకు చెప్పాడు. తర్వాత పోలీసులు వెళ్లిపోయారు. అనంతరం 11 గంటల సమయంలో నా కొడుకు గుళికల మందు తాగాడు. వెంటనే అక్కడే ఉన్న నా భార్య తలుపులు తీయాలని కోరగా తలుపులు తీశాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ వెంటనే హెల్ప్ హాస్పిటల్కు తరలించాం. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లాం. అదే రోజు రాత్రి హాస్పిటల్లో మరణించాడు. ఆత్మహత్య చేసుకున్నాడేమోనని తొలుత అనుకున్నాం. కానీ అతని ఫోన్ వెతకగా సెల్ఫీ వీడియో బయటపడింది. దీనిపై సీపీకి ఫిర్యాదు చేశాం. దీంతో సీపీ వారం గడువు కావాలని కోరారు. ఆ తర్వాత పోలీసులు రాయబారానికి వచ్చారు. నేను నా కొడుకు మరణంపై ప్రైవేటు కేసు వేయడానికి సిద్ధమయ్యా.’’ అని వెంకటేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు. మా అబ్బాయి ఒక్కడే కాదు...పోలీసుల మీద నమ్మకం కోల్పోయానని పేరుపోగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ‘‘మా అబ్బాయి ఒక్కడే కాదు. అతని కంటే ముందే సాయికృష్ణ అనే అతన్ని కూడా పోలీసులే గోళ్లు పీకి లాకప్ డెత్ చేసిన విషయం బయట పడింది. దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో నేను ప్రైవేటు కేసు వేసేందుకు సిద్ధమై లాయర్లను కలుసుకున్నా. ఈ క్రమంలో గురువారం నా కుమారుడు వీడియో బయటకు వచ్చింది. నేనైతే వీడియో బయటికి పంపలేదు. కానీ క్రాంతి చనిపోయే ముందు తన స్నేహితులకు ఆ వీడియో పంపాడు. వారి ద్వారా బయటకు వచ్చింది. నా కొడుకు రౌడీషీటరే. కాదనను. సాయికృష్ణ, నా బిడ్డ క్రాంతికుమార్ వీరికంటే ముందు ఇంకా అనేక మంది సీఐ వేధింపుల బారిన పడ్డారు.’ అని వెంకటేశ్వరరావు మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం ఇన్ఫార్మర్లుగా మారుస్తున్నారు‘‘పోలీసులే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నేర చరిత్ర ఉన్న వారిని ఇన్ఫార్మర్లుగా మార్చుకొని పోలీసులు తమ వ్యక్తిగత స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. పోలీసులు చెప్పినట్లు చేయకుంటే వారం వారం స్టేషన్కు రావడం లేదన్న పేరుతో కొట్టి వేధిస్తున్నారన్నారు. నా బిడ్డ ఇవన్నీ నాకు చెప్పుకోలేక పోయాడు. ఒకటి రెండు సందర్భాల్లో నా దృష్టికి తీసుకొచ్చాడు. ప్రతిసారీ పోలీసులు ఇంటికి రావడం వల్ల నా బిడ్డ భయపడిపోయాడు. సెల్ఫీ వీడియోలోనూ నేను ఎస్సీ మాదిగగా పుట్టడమే తప్పా అంటూ ఆవేదన చెందాడు. సీఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి. అతడిని తక్షణమే అరెస్టుచేయాలి. కఠినంగా శిక్షించాలి’’ అని వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా బిడ్డలా ఎవరూ బలి కాకూడదు‘‘నా బిడ్డ ఆత్మహత్యపై నేను వెంటనే ఏమీ మాట్లాడలేదు. అంత్యక్రియలు, ఆ తర్వాత కార్యక్రమాలన్నీ అయ్యాక స్పందించాలనుకున్నా. దీంతో నేను ప్రలోభాలకు లొంగిపోయానని వార్తలు వచ్చాయి. నేనెవ్వరికి లొంగిపోలేదు. నా బిడ్డ మరణంపై న్యాయ పోరాటం చేస్తా. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి కూడా స్పందించాలి. నేను కోరుతున్నది ఒక్కటే . ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలి. నా బిడ్డలా ఏ వ్యక్తి బలికాకూడదు.’’ అని పేరుపోగు వెంకటేశ్వరరావు కన్నీరుమున్నీరయ్యారు. -
లాకప్లలో... మరణ మృదంగం
సాక్షి, అమరావతి, ఆదోని: విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేసి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేయడం అన్నది చంద్రబాబు ప్రభుత్వం అధికారిక విధానంగా చేసుకున్నట్లుంది! అందుకే బిగ్బాస్ నుంచి రాష్ట్రంలో జిల్లాస్థాయి అధికారుల వరకూ అదే ఖాకీ మార్కు క్రౌర్యాన్ని బరితెగించి ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ‘రెడ్బుక్’ పోలీసులు యథేచ్ఛగా సాగిస్తున్న లాకప్ మరణాల దారుణాలు మరిన్ని బట్టబయలవుతున్నాయి. విజయవాడలో సాయికృష్ణ లాకప్లోనే అదృశ్యం కావడం ఇప్పటికే సంచలనంగా మారగా.... క్రాంతికుమార్ అనే దళిత యువకుడు పోలీసుల థర్డ్ డిగ్రీ వేధింపులు తట్టుకోలేక ఏకంగా ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లాలో కూడా పోలీసులు ఓ దళిత మహిళను విచారణ పేరుతో పాశవికంగా కొట్టి చంపేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల అమానుష కాండపై బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించడంతో తమ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు బిగ్బాస్ నేతృత్వంలో పోలీసులు కొత్త కుట్రకు తెర తీస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..దళిత మహిళపై పోలీసుల క్రౌర్యంకర్నూలు జిల్లా కౌతాళం గ్రామానికి చెందిన గంగమ్మ అనే దళిత మహిళను పోలీసులు ఓ కేసులో తమదైన శైలిలో విచారించారు. ప్రత్యేకంగా ఏర్పడిన సిట్ అధికారులు విచారణ సమయంలో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె అచేతనంగా పడిపోయారు. ఆమె చనిపోయిందని గ్రహించడంతో రాయలసీమలో రెడ్బుక్ రాజ్యాంగానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అవినీతి అనకొండ ఐపీఎస్ అధికారిని సంప్రదించారు. ఆయన సూచనలతో పక్కాగా కథ నడిపించారు. అందుకు గంగమ్మ కుమార్తెను తమదైన శైలిలో బెదిరించి అనుకూలంగా మలచుకున్నారు.గంగమ్మ కాలుజారి పడిపోయి చనిపోయిందని ఆమె కుమార్తె నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నారు. కాలు జారిపడిపోతే పోలీసులు ఆమె కుమార్తె నుంచి లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకోవాల్సిన అవసరం ఏముందీ అంటే... లాకప్ మరణాన్ని కప్పిపుచ్చేందుకు ముందు జాగ్రత్త చర్యగానే పోలీసులు ఈ ఎత్తుగడ వేశారన్నది స్పష్టమవుతోంది. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య గంగమ్మ మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, దళిత సంఘాల ఆదోళనతో ప్రభుత్వం తూతూ మంత్రంగా స్పందించింది.హైకోర్టులో పిటిషన్..గంగమ్మను ఖననం చేశారనే విషయాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఉదంతంపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. గంగమ్మ డీఎన్ఏ శాంపిల్స్ను భద్రపరిచి సమగ్రంగా దర్యాప్తు చేయించాలని పూర్తి వివరాలతో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. దాంతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడలపై బిగ్బాస్, రాయలసీమ అనకొండ ఐపీఎస్ తీవ్రంగా తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. గంగమ్మ లాకప్ మరణం ఉదంతంలో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు గంగమ్మతో పాటు కస్టడీలోకి తీసుకున్న 47 ఏళ్ల బ్యాగారి దర్గప్ప ఖాకీ దెబ్బలకు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. మర్డర్ కేసు నమోదు చేయాలి..కస్టోడియల్ టార్చర్లో లాకప్ డెత్ జరిగితే వెంటనే సదరు పోలీసు అధికారులపై మర్డర్ కేసు బుక్ చేయాలని సుప్రీంకోర్టు పదేపదే చెబుతోంది. దొంగతనం చేశాడన్న ఆరోపణలు వస్తే ముందుగా కేసు రిజిస్టర్ చేస్తున్నారా లేదా? విచారణలో దొంగతనం చేయలేదని తేలితే వదిలేస్తారు. అదేవిధంగా కస్టోడియల్ టార్చర్లో లాకప్ డెత్ జరిగితే తక్షణమే పోలీసులపై కేసు రిజిస్టర్ చేయాల్సిందే. సిట్ వేస్తాం, ఐపీఎస్ అధికారితో విచారణ జరిపిస్తామంటే కుదరదు. ఆర్టికల్ 21 ఏం చెబుతుందంటే.. ఒక వ్యక్తి తప్పు చేశాడా? లేదా? అన్నది కోర్టు రుజువు చేస్తుంది. అంతేగానీ స్టేషన్లలో పోలీసులు కాదు. రాజస్థాన్లో ఒక ఎంపీని చంపితే 30 ఏళ్ల తర్వాత 15 మంది పోలీసు ఆఫీసర్లు జైలుకెళ్లారు. వీరిలో రిటైర్ అయిన వారూ ఉన్నారు. ఒకాయనకు 82 ఏళ్లు. అయినా జైలుకు పోక తప్పలేదు.– డాక్టర్ బి.పురుషోత్తమరెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది -
అవి సర్కారు హత్యలే!
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదే సాయికృష్ణ లాకప్లోనే ‘కనుమరుగు’...! పోలీసుల థర్డ్డిగ్రీ వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్య... ! ఈ రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే!! టీడీపీ కూటమి సర్కారు అరాచక కాండే. ఆ ఇద్దరి కుటుంబ సభ్యులు నెల రోజులపాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా న్యాయం కాదు కదా కనీసం ఓదార్పు దక్కకపోవడం చంద్రబాబు ప్రభుత్వం రాక్షసత్వాన్ని బట్టబయలు చేస్తోంది. లాకప్లోనే సాయికృష్ణ అదృశ్యం... క్రాంత్రి కుమార్ ఆత్మహత్య..! ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని దేశవ్యాప్తంగా న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణ మారణకాండపై జాతీయస్థాయిలో న్యాయ, రాజ్యాంగ నిపుణులు, పౌర హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. న్యాయస్థానం జోక్యం... మీడియా క్రియాశీలతో చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు బయటపడ్డాయని స్పష్టం చేస్తున్నారు. ఇంత బరి తెగింపా బాబూ...! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విజయవాడ పోలీస్ లాకప్లో మరణాలు... దారుణాలు కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే! విజయవాడ పోలీసులు ఇంతటి అమానుషానికి బరితెగించి లాకప్లలో మరణమృదంగం మోగిస్తున్నా కూటమి ప్రభుత్వం దాదాపు నెల రోజులపాటు కప్పిపుచ్చేందుకు యత్నించడం... అసలు ఏమీ జరగలేదని నిస్సిగ్గుగా బుకాయించేందుకు యత్నించడమే నివ్వెరపరుస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు లాకప్లలో మరణాలను ఇంత బరితెగించి కప్పిపుచ్చేందుకు యత్నించలేదని న్యాయ నిపుణులు మండిపడుతున్నారు. ఆ తల్లి గోడు పట్టని ప్రభుత్వం... బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతారన్నది పాషాణ చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. గాదే సాయికృష్ణను పోలీసులు మార్కాపురంలో అక్రమంగా నిర్బంధించి తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీతో వేధించారు. ఆ విషయం తెలిసిన ఆయన తల్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ... విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరిగి తన బిడ్డ కోసం పరితపించారు. అయినా సరే పోలీసుల మనసు ఏమాత్రం కరగలేదు. తన బిడ్డను న్యాయస్థానంలో హాజరుపరచాలని... ప్రాణాలతో అప్పగించాలని ఆమె విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంది. ఇంతటి విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ, హోంమంత్రి అనిత గానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు సాయికృష్ణ విషయంలో ఏం జరిగిందన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. చివరికి ఆమె తన కుమారుడిని అప్పగించాలని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగానే వ్యవహరించింది. సాయికృష్ణ సంగతి తమకు తెలియదని... అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని న్యాయస్థానానికి సైతం అవాస్తవాలు చెబుతూ వచ్చింది. న్యాయస్థానం జోక్యం... తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ తెలపాలని బాధితుడు తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో డొంక కదిలింది. సాయికృష్ణను పోలీసులే అక్రమంగా నిర్బంధించి అదృశ్యం చేశారని సాక్షి పత్రిక సహేతుక వాదనతో వెలుగులోకి తీసుకువచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ తగిలింది. దీంతో హైకోర్టు ఈ కేసులో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతవరకు సాయికృష్ణ విషయమే తెలియదని బుకాయించిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. కేవలం కృష్ణలంక సీఐ నాగరాజు మీద తూతూ మంత్రంగా చర్యలతో విషయాన్ని కప్పిపుచ్చాలని చూసింది. ఆయన్ను వీఆర్కు పంపించి చేతులు దులిపేసుకుంది. వైఎస్ జగన్ రాకతో... తప్పనిసరై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం, పోలీసుల దమనకాండపై మండిపడ్డారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నివాసానికి గురువారం వెళ్లిన వైఎస్ జగన్ పరామర్శించి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర పోలీసు అధికారులు అంతా కలిసే ఈ దారుణానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తామన్నారు. దాంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విధిలేని పరిస్థితుల్లో ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. అప్పటివరకు సాయికృష్ణ గురించే తెలియదు అని బుకాయించిన చంద్రబాబు సర్కారు... అతడిని పోలీసులే లాకప్లో అదృశ్యం చేశారని అంగీకరించక తప్పలేదు. కానీ విచారణను కేవలం సీఐ పాత్ర వరకే పరిమితం చేసి డీజీపీ, విజయవాడ సీపీలను రక్షించేందుకు ఎత్తుగడ వేశారు. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. మొత్తం సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బుకాయించి.. బెదిరించి! ఇక విజయవాడకు చెందిన దళిత యువకుడు క్రాంతి కుమార్ ఉదంతంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అంతే అమానవీయంగా వ్యవహరించింది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారని ఆయన తండ్రి వెంకటేశ్వరరావు రోజుల తరబడి మొత్తుకున్నారు. తన కుమారుడిని అప్పగించాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. కానీ అటు ప్రభుత్వంగానీ ఇటు పోలీసులుగానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు క్రాంతి కుమార్ సంగతి తమకు తెలియదని ప్రభుత్వం... ఆయన తమ వద్ద లేరని పోలీసులు బుకాయించారు. ఆ తండ్రిని బెదిరించి వెనక్కి పంపేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నా సరే ఖాకీల తీరు ఏమాత్రం మారలేదు. ఆయన తండ్రి వెంకటేశ్వరరావును బెదిరించి మౌనం వహించేలా చేశారు. గుట్టుచప్పుడు కాకుండా క్రాంతికుమార్ అంత్యక్రియలు పూర్తి చేయించారు. దమనకాండపై ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధం.. దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టింది. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది. రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో టీడీపీ కూటమి ప్రభుత్వ అమానుష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లాకప్లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసుల అండతో ప్రభుత్వం సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. -
సాయికృష్ణ కేసు.. సీఐ నాగరాజు వెనక ఉన్నవారి సంగతేంటి?
సాక్షి, తాడేపల్లి: రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు పెట్టినప్పుడే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పతనం అయ్యిందని వైఎస్సార్సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి,మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం సాయికృష్ణ కేసులో వరుస పరిణామాలపై పొన్నవోలు సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోంది.పోలీసులు చంద్రబాబుకు ప్రయివేటు సైన్యంలా మారిపోయారు. పోలీసుల చేతిలో సాయికృష్ణ లాకప్ డెత్ అయితే నెల రోజులుగా ప్రభుత్వం ఏం చేస్తోంది?. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయికష్ణ నివాసానికి వెళ్తేగానీ ప్రభుత్వం స్పందించదా?. కేసును సీఐ నాగరాజుతో ముడిపెట్టి వదిలేస్తారా?. సీఐ నాగరాజు వెనుక ఉన్న మిగతా పోలీసు అధికారుల సంగతేంటి?. వారికి తెలియకుండానే లాకప్డెత్ చేసి శవాన్ని మాయం చేస్తారా?.రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు పెట్టినప్పుడే పోలీసు వ్యవస్థ పతనం అయింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్లో అడుగు పెట్టే పరిస్థితే లేదు. పోలీసుల వైఖరికి ఇదే నిదర్శనం. దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య దారుణం. సీఐ నాగరాజు చిత్రహింసలకు గురి చేస్తున్నాడని చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు అధికారులు సీరియస్గా ఉంటే కిందిస్థాయిలో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతాయా?’అని ప్రశ్నించారు. -
Ambati: వీళ్ళందరూ హంతకులే..!
-
‘సాయికృష్ణ కేసును చంద్రబాబు తొక్కేద్దామనుకున్నారు’
సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసుల దుర్మార్గాలపై తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నించారు.‘‘గత నెల 28నే అడ్వకేట్ కనకదుర్గ ఫిర్యాదు చేశారు. అయినా సరే పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు?. వైఎస్ జగన్ వెళ్తేగానీ సీఐ మీద కేసు నమోదు చేయరా?. లాకప్ డెత్ జరిగినట్టు ప్రభుత్వం అంగీకరించింది. సాయికృష్ణ పిన్ని కనకదుర్గ హైకోర్టులో పిల్ వేశారు. ఇక్కడ్నుంచే అసలు కథ ప్రారంభమైంది. సీఐ నాగరాజు మీద కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తే సరిపోదు. పేరిపోగు క్రాంతికుమార్ కూడా సీఐ టార్చర్ వలనే ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాల వెనుక సీఐతోపాటు చాలామంది అధికారులు ఉన్నారు. వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.‘‘సాయికృష్ణ చనిపోయిన ఫోటో, కాళ్ల మీద గాయాలు ఉన్న ఫోటోలు ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి అవన్నీ ఫేక్ ఫోటోలు అంటున్నారు. అవి ఫేక్ ఫోటోలు అయితే సాయికృష్ణను చూపించండి. నేను చూపినవి ఫేక్ ఫోటోలైతే నా మీద కేసు పెట్టుకోవచ్చు. తాము జనసేన పార్టీ అని సాయికృష్ణ కుటుంబ సభ్యులే చెప్పారు. అలాంటి కార్యకర్త ఇంటికెళ్లి కనీసం పరామర్శించలేదు. పైగా రాజీ చేయాలని చూడటం సిగ్గుచేటు. ఆ తల్లి అడిగిన సాయికృష్ణ భస్మం అయినా ఇవ్వండి. జనసేన నాయకులుగా ఉండి ఏం ప్రయోజనం?’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘మీకు చేతగాని పని మేము చేస్తే బురద జల్లుతారా?. సాయికృష్ణ కేసులో మిగిలిన పాత్రధారులంతా బయటకు రావాలి. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సీబీఐ విచారణ చేయాలి. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండొచ్చు. కానీ పోలీసు వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ పోకడలపై మా పోరాటం ఆగదు’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. -
‘ఫిర్యాదు చేసినప్పుడే సీపీ, డీజీపీ ఎందుకు స్పందించలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీతో పాటు ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడమే మీ పనా? అంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల భాష సంస్కార హీనంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయామని పోలీస్ అధికారులే చెబుతున్న పరిస్ధితి నెలకొందని ఆయన ధ్వజమెత్తారు.‘‘సాయికృష్ణ తల్లిదండ్రులు సీపీకి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు?. సాయికృష్ణ లాకప్ డెత్పై సీఎం, హోం మంత్రి ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్తే తెల్లారేలోపు ఎఫ్ఐఆర్ వేశారు. మేకప్ కోసం మాజీ మంత్రి అమర్నాథ్కు నోటీసు ఇచ్చిన హోంమంత్రి.. సాయికృష్ణ లాకప్ డెత్ మీద డీజీపీ,సీపీకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఆక్వా రంగంలో ఒక మాఫియా తయారైంది. ఫీడ్, సీడ్, ఎగుమతుల్లో మాఫియా. రైతు పరిస్ధితి చాలా దయనీయంగా ఉంది. వైఎస్ జగన్ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగొట్టింది. రెండో ఏడాది 7 లక్షల మందికి కోత విధించారు. ఒక్క కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. మోంథా తుపాను బాధితులకు ఇవాళ్టీకి సాయం అందించలేదు...రైతులకు సున్నా వడ్డీ ఏదీ?. 393 మంది రైతులు ఒక ఏడాదిలో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత పంటల బీమా పథకం ఎత్తేశారు. పొగాకు రైతులు ఇవాళ ఒంగోలులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తున్నారు. రైతులకు కార్డు ఇచ్చి.. యూరియా, ఎరువులకు కోత పెట్టారు. కౌలు రైతులు, గిరిజన రైతులు, దేవాదాయ శాఖ రైతులకు కార్డులు లేవు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన కౌలు గుర్తింపు కార్డులను చంద్రబాబు తుంగలోకి తొక్కేశారు. ఎరువులు కావాలంటే.. రూ.15-20 వేలు పెట్టి రైతులు స్మార్ట్ ఫోన్ కొనాలి. రైతును రోడ్డున పడేశారు. ఎరువు కావాలన్న.. విత్తనం కావాలన్న ఎవర్నికలవాలో తెలియదు. రైతులకు ఏం కావాలో తెలుసుకోకుండా.. మేకప్లపై డిస్కషన్లు పెడుతున్నారు’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
CBI ఎంక్వైరీకి రెడీనా హోమ్ మినిస్టర్ గారు
-
మరోసారి చంద్రబాబు సర్కార్ దగా
సాక్షి, విజయవాడ: మరోసారి కూటమి సర్కార్ దగా చేసింది. ఆక్వా మేత ధర కిలోకి రూ.4 తగ్గిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన అమలు కాలేదు. కిలోకి రూ.2 మాత్రమే ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. చంద్రబాబు ఆదేశాలు అమలు కాకపోవడంతో తమను మళ్లీ మోసం చేశారంటూ ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రొయ్యలు, చేపల సాగుకు వినియోగించే అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయే తప్ప ఆక్వా ఉత్పత్తుల ధరలు మాత్రం పెరగడం లేదని రైతులు వాపోయారు. ముడిసరుకుల ధరలు పెరిగినప్పుడు ఫీడ్ ధర పెంచుతున్న కంపెనీలు.. వాటి ధరలు తగ్గినప్పుడు మాత్రం కూడా తగ్గించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, చంద్రబాబు ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం అన్నదాతల పాలిట దుఃఖీభవ పథకంగా మారింది. రాష్ట్రంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసి, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకంతో కలిపి రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది అదీ ఇవ్వకుండా పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు.రెండో ఏడాది అరకొర సాయం అందించిన చంద్రబాబు.. మూడో ఏడాది కూడా రైతులను వంచించేందుకు యత్నిస్తున్నారు. 2026–27 వ్యవసాయ సీజన్కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. అది కూడా అరకొరగానే ఇస్తున్నారు. కౌలు రైతులకు ఈసారీ మొండి చేయే చూపించారు. -
కేసులుంటే చంపేస్తారా ? CPM నేతలు సంచలన కామెంట్స్
-
‘సీఐపై కేసు.. సాయికృష్ణను చంపేశామని సర్కార్ ఒప్పుకుంది’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేశారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.సాయికృష్ణ కేసు విషయమై తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. రెండు మూడు కేసులు ఉంటే చంపి బూడిద చేస్తారా?. చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు?. సీఐ మీద కేసు పెట్టడం ద్వారా సాయికృష్ణను చంపేశామని ప్రభుత్వం ఒప్పుకుంది. సాయికృష్ణ తల్లి శోకం మీ కంటికి కనిపించడం లేదా?. ఆ తల్లి కన్నీరు చూసి రాష్ట్ర ప్రజానీకం తల్లడిల్లిపోతుంది.సాయికృష్ణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాయి కృష్ణ ఉదంతం పోలీసులకు కనువిప్పు కావాలి. సాయికృష్ణ హత్య వ్యవహారంలో A1గా చంద్రబాబును పెట్టాలి. లోకేష్, అనిత, డీజీపీ, సీపీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మన రాష్ట్రానికి చేతకాని సీఎం అధికారంలో ఉన్నారు. లాకప్ డెత్ జరిగితే మేకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. -
డీఎస్సీ, అమరావతిపై సీబీఐ దర్యాప్తు జరగాలి: సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాల్సిందే. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందోని ఆరోపించారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘డీఎస్సీ నియామకాల్లో అర్హులకు ఉద్యోగాలు అందలేదు. అర్హులైన నిరుద్యోగులకు అవకాశాలు దక్కలేదు. డీఎస్సీ పేపర్ లీక్ జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయి. డీఎస్సీ పేపర్ను రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు అమ్ముకున్నారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగులు ఇచ్చారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో టీడీపీ సానుభూతిపరులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వేలాది మంది మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. టీడీపీ స్వప్రయోజనాలు కాపాడే రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయిస్తున్నారు. భూముల కేటాయింపులపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలి. రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. ఒక్క చదరపు అడుగుకు 20,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 5000 రూపాయల లోపే చదరపు అడుగుకు నిర్మాణం ఖర్చు పెడుతున్నారు. ఇదే అమరావతిలో జరుగుతున్న లూటికి నిదర్శనం. ఎన్హెచ్ఏ జాతీయ రహదారుల నిర్మాణానికి కిలోమీటర్కు 20 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. అదే అమరావతిలో 58 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో కూడా నిర్మాణపు ఖర్చులు ఈ స్థాయిలో లేవు. ఈ అంశాలపైన సమగ్రమైన సీబీఐ దర్యాప్తు జరగాలి. ఏపీలో దారుణమైన పాలనను కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తాం’ అని తెలిపారు. అనంతరం, గాదె సాయికృష్ణ కేసు విషయమై వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో పైశాచిక పాలన జరుగుతోంది. సీఐని సస్పెండ్ చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని ప్రశ్నించారు. ఆ తల్లికి ప్రభుత్వ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘తమిళనాడులో లాకప్ డెత్ జరిగితే పోలీసులకు జీవిత శిక్ష విధించారు. ప్రాణాలు తీసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు?. తమిళనాడు కంటే ఘోరమైన ఘటన ఇది. ఎవరికి అన్యాయం జరిగిన వారి పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది అని స్పష్టం చేశారు. -
సర్కారు అండతో ఖాకీల క్రౌర్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ఖాకీ కర్కశం వికట్టాహాసం చేస్తోంది. పోలీసు లాఠీ రాజ్యమేలుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసు థర్డ్ డిగ్రీ రాష్ట్రాన్ని శాసిస్తోంది. రక్షకభట నిలయాలు మానవ వథశాలలుగా మారుతున్నాయి. చంద్రబాబు అండదండలతో టీడీపీ వీరవిధేయ ఐపీఎస్లు రెచ్చిపోయి అరాచకం ప్రదర్శిస్తున్నారు. రోజులు, నెలల తరబడి యువకులను అక్రమంగా నిర్బంధించి.. చిత్రహింసలకు గురిచేస్తూ వారి పాలిట పోలీసులే యమకింకరులుగా మారుతున్నారు. అందుకు విజయవాడ కేంద్రబిందువుగా మారడం గమనార్హం. విజయవాడ పోలీస్ బాస్, బిగ్బాస్ కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్లోనే పోలీస్ థర్డ్ డిగ్రీ వికృత రూపం దాల్చింది. విజయవాడ పోలీసులు కాపు యువకుడు గాదె సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి ‘కనుమరుగు’ చేసిన ఉదంతం సంచలనంగా మారగా... అంతలోనే విజయవాడ పోలీసులు నెలల తరబడి చిత్రహింసలకు గురి చేయడంతో పోగు క్రాంతికుమార్ అనే దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ రెండు ఘటనలపైనా కాపు సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతుండగా.. దళిత సంఘాలు సైతం పోలీస్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహోదగ్రమవుతున్నాయి. పోలీస్ దందాకు ఎదురు తిరగడంతో.. తాజా ఉదంతంలో విజయవాడకు చెందిన దళిత యువకుడు పోగు క్రాంతికుమార్ ఆత్మహత్య ముందు రికార్డు చేసిన మరణ వాంగ్మూలం సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. విజయవాడ పోలీసుల వేధింపులు తట్టుకోలేకే తాను పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన ఆత్మహత్యకు కృష్ణలంక సీఐ నాగరాజు బాధ్యుడని కూడా స్పష్టం చేస్తూ క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడిన తీరు అందర్నీ కలచి వేస్తోంది. ఈ ఉదంతంతో క్రాంతికుమార్ను పోలీసులు ఎంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారన్నది వెలుగులోకి వచ్చింది.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పోగు వెంకటేశ్వరరావు కుమారుడైన క్రాంతికుమార్ వివిధ పనులు చేసుకుంటూ జీవించేవారు. అతడిని కృష్ణలంక పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. తాము చెప్పిన పనులన్నీ చేయాలని వేధించారు. తమకు అనుకూలంగా నేరాలు చేసేలా.. తమ సెటిల్మెంట్లకు సహకరించేలా పోలీసులు ఆయన్ని వాడుకున్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్ల తరువాత పోలీసుల దందాకు తాను సహకరించలేనని క్రాంతికుమార్ ఎదురుతిరిగారు. దాంతో పోలీసులు ఆయనను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి లాఠీమార్కు వేధింపులకు గురి చేశారు. విచారణ పేరుతో రోజూ స్టేషన్కు పిలిపించి వేధించడమే కాకుండా ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇలా మూడు నెలలపాటు పోలీసుల అరాచకం సాగింది. వేధింపులు తట్టుకోలేక.. పోలీసులు థర్డ్ డిగ్రీకి తన శరీరం ఇక ఏమాత్రం సహకరించదని భీతిల్లిన క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో రికార్డు చేసి మే 21న ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ట్విస్ట్ ఇదీ కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ పోలీసులు మే 9న అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తీవ్రంగా చిత్రవథకు గురిచేశారు. కాళ్లూ చేతులూ కట్టేసి లాఠీలతో విరుచుకుపడుతుండటంతో సాయికృష్ణ హాహాకారాలు చేశాడు. పోలీసులు రోజుల తరబడి ఈ అరాచకం కొనసాగించారు. అదే సమయంలో దళిత యువకుడు క్రాంతికుమార్ను సైతం పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. సాయికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో అతడు అచేతనంగా పడిపోయాడు. అనంతరం సాయికృష్ణను ఏం చేయాలనే దానిపై పోలీసులు మంతనాలు సాగించారు. పోలీస్ బాస్తోను, మరికొందరు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటాన్ని క్రాంతికుమార్ గమనించారు. పక్కా పన్నాగంతోనే సాయికృష్ణను ‘కనుమరుగు’ చేయడాన్ని క్రాంతి ప్రత్యక్షంగా చూసినట్టు సమాచారం. తనను కూడా ఇదేవిధంగా చేస్తారని.. సాయికృష్ణలా కనుమరుగైపోతే.. కనీసం తన మృతదేహం కూడా తన కుటుంబ సభ్యులకు దక్కదని క్రాంతికుమార్ భావించారు. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తింటూ ప్రాణాలు విడిచేకంటే ఆత్మహత్యకు పాల్పడితే మంచిదని నిర్ణయించుకున్నారు. తన మరణానికి కారణమేమిటనే దానిపై సెల్ఫీ వీడియో రికార్డు చేసి.. పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు పెడితే పోలీసు మార్క్ బెదిరింపులు పోలీసుల చిత్రహింసలు భరించలేక క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. తప్పనిసరి కావడంతో పోలీసులు మే 22న కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసు బాస్, ఇతర అధికారులు వెంకటేశ్వరరావుపై తమదైన శైలిలో ఒత్తిడి తెచ్చారు. ఈ కేసును పట్టించుకోవద్దని.. కాదని మొండికేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తమ మాట వింటే తృణమో ఫణమో ఇస్తామని కూడా ప్రలోభపెట్టారు. లేకపోతే క్రాంతికుమార్కు పట్టిన గతే ఇతరులకూ పడుతుందని హెచ్చరించారు. దాంతో వెంటేశ్వరరావు మౌనం వహించినట్టు తెలుస్తోంది. పోలీసులే దగ్గరుండి క్రాంతికుమార్ మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేయించారు. ఆ విధంగా తమ అరాచకాన్ని గుట్టుచప్పుడు కాకుండా కప్పిపుచ్చామని భావించారు. ఆ తరువాత సాయికృష్ణ లాకప్లోనే కనుమరుగైన విషయం వెలుగులోకి రాగా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనివెనుక విజయవాడ పోలీస్ బాస్, బిగ్బాస్ సూత్రధారులనే విషయం బయటపడింది. దాంతో బాధిత కుటుంబం ధైర్యం చేసి క్రాంతికుమార్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అన్ని వేళ్లూ బాస్.. బిగ్బాస్వైపే పోలీసుల చిత్రహింసలతో సాయికృష్ణ లాకప్లోనే కనుమరుగు కావడం, దళిత యువకుడు క్రాంతికుమార్ పోలీసుల థర్డ్ డిగ్రీ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాలను పోలీసులు నిస్సిగ్గుగా కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం వారి దమనకాండకు పరాకాష్టగా నిలుస్తోంది. ఈ రెండు ఉదంతాలను సీఐ నాగరాజు వరకే పరిమితం చేసి ఉన్నతాధికారులను తప్పించేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ రెండు దారుణాల వెనుక అన్ని వేళ్లూ విజయవాడ పోలీస్ బాస్, బిగ్బాస్ వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే.. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి అచేతనంగా మారిన తరువాత కనుమరుగు చేయడం అన్నది సీఐ స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదన్నది పోలీసు శాఖ వ్యవహారాల గురించి అవగాహన ఉన్న అందరికీ తెలిసిందే. పోలీస్ కమిషనరేట్కు అల్టిమేట్ బాస్ పోలీస్ కమిషనరే. ఆయనకు చెప్పకుండా సాయికృష్ణను కనుమరుగు చేయడం సాధ్యం కాదు. ఇక రాజధాని ప్రాంతంలో ఓ కాపు యువకుడిని పోలీసులే అదృశ్యం చేసిన విషయాన్ని నగర బాస్.. బిగ్ బాస్ దృష్టికి ముందుగా తీసుకువెళ్లకుండా ఉంటారా అంటే.. కచ్చితంగా కాదని స్పష్టం చేస్తున్నారు పోలీస్ శాఖలో పనిచేసి రిటైరైన అధికారులు. అంటే ఈ విషయాలపై బిగ్ బాస్కు ముందుగానే తగిన సమాచారం ఉండి ఉంటుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఎంవో అండదండలు ఉన్న పోలీస్ బాస్, బిగ్బాస్ స్వయంగా కథ నడపించారు కాబట్టే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎంతగా ఆవేదన వెళ్లగక్కినా, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. పోలీసుల అరాచకాన్ని నిస్సిగ్గుగా వెనకేసుకువచ్చింది. ఐజీపై విచారణకు ఎస్పీనా?! సాయికృష్ణను లాకప్లో అదృశ్యం చేసిన దారుణాన్ని చాకచక్యంగా కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా కుట్రకు తెర తీసింది. ఈ ఉదంతాన్ని పక్కదారి పట్టించేందుకు కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్కు పంపించి సరిపెట్టాలని యత్నించింది. చివరకు ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో ఈ ఉదంతంపై విచారణకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డీఎన్ కిశోర్ను నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. ఎందుకంటే సాయికృష్ణ అదృశ్యం వెనుక కేవలం సీఐ నాగరాజు మాత్రమే కాదు.. విజయవాడ టాస్్కఫోర్స్ విభాగంలో ఇద్దరు ఎస్పీస్థాయి మహిళా అధికారులు, పోలీస్ బాస్ పాత్ర ఉందనేది స్పష్టమవుతోంది. ఈ వ్యవహారం తెలిసినా పోలీస్ బిగ్బాస్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారన్నది కీలకంగా మారింది. అంటే సాయికృష్ణ కనుమరుగైపోయిన ఉదంతంపై విచారించాలంటే.. ప్రాథమికంగా కృష్ణలంక సీఐ నుంచి నగర బాస్ వరకు అధికారులను విచారించాలి. నగర బాస్ ఐజీ ర్యాంక్ అధికారి. ప్రభుత్వం మాత్రం ఎస్పీస్థాయి అధికారి డీఎన్ కిశోర్ను నియమించడం గమనార్హం. నిజానికి ఎస్పీస్థాయి అధికారి ఐజీ స్థాయి అధికారి చేసిన అరాచకం, అక్రమాలపై విచారించలేరు. అది పోలీస్ ప్రోటోకాల్ కూడా కాదు. అయినా సరే ప్రభుత్వం ఎస్పీస్థాయి అధికారినే విచారణాధికారిగా నియమించింది. అంటే విచారణ వ్యవహారాన్ని సీఐ వరకే పరిమితం చేయాలన్నది ప్రభుత్వ కుతంత్రమనే విషయం స్పష్టమవుతోంది. టీడీపీ వీరవిధేయ ఐపీఎస్గా రెడ్బుక్ కుట్రలను అమలు చేస్తున్న రాజశేఖరబాబుకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. సీబీఐ విచారణతోనే న్యాయం: న్యాయ నిపుణులు ‘సాయికృష్ణ ఉదంతంపై వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలి. ఎందుకంటే పోలీస్ అత్యున్నత అధికారుల పాత్ర ఉందని భావిస్తున్న ఈ కేసును దిగువస్థాయి అధికారి అయిన ఎస్పీ డీఎన్ కిశోర్ విచారించడం నిబంధనలకు విరుద్ధం. ఆయన నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించడం సాధ్యం కాదు’ అని న్యాయనిపుణులు, పౌర హక్కుల సంఘాల నేతలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. అందుకే.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ‘తూత్తుకుడి’ తీర్పు రిపీట్ కావచ్చు సాయికృష్ణ ఉదంతం నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడి దారుణ ఉదంతాన్ని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. తూత్తుకుడి పోలీసులు తండ్రీకొడుకులను పోలీస్ స్టేషన్లో అత్యంత భయంకరంగా హింసించడంతో ఇద్దరూ మరణించారు. ఈ కేసును విచారించిన మధురై న్యాయస్థానం ఆ దారుణంలో భాగస్వాములైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 6న సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం విజయవాడ పోలీసులు పాల్పడిన దారుణం కూడా అటువంటిదేనని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేను ప్రత్యక్షంగా చూశా: మహంకాళి చందు గాదె సాయికృష్ణను పోలీసులు చిత్రహింసలకు గురి చేయడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని మహంకాళి చందు అనే యువకుడు వీడియో విడుదల చేశారు. తనను కూడా పోలీసులు ఆ రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారని ఆయన చెప్పాడు. ‘కృష్ణలంక పోలీసులు నన్నూ ఓ కేసులో అదుపులోకి తీసుకుని లాకప్లో పెట్టారు. అదే లాకప్లో ఉన్న సాయికృష్ణపై పోలీసులు విచక్షణా రహితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయన్ని చిత్రహింసలకు గురిచేశారు. అవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. పోలీసులు అంతటి దారుణానికి పాల్పడ్డారు. సాయికృష్ణ చేసిన నేరాన్ని ఒప్పుకున్నా.. చేయని ఇతర నేరాలు కూడా ఒప్పుకోవాలని పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి అతడిని వేధించారు’ అని ఆ వీడియోలో మహంకాళి వివరించాడు. -
పీ–4 ఖర్చు.. బాగా హెచ్చు
సాక్షి, అమరావతి: సంపన్నులను పేదలతో అనుసంధానించి.. పేదరికాన్ని నిర్మూలిస్తామంటూ పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కారు సభల పేరుతో ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తోంది. పీ–4 ప్రథమ వారికోత్సవ వేడుకల్ని నిర్వహించేందుకు రూ.3.07 కోట్లు వెచ్చించేందుకు ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ గురువారం పరిపాలన అనుమతి మంజూరు చేశారు. ఈ మొత్తం ఒక్క రోజు వేడుకలు నిర్వహించేందుకు అయిన వ్యయంగా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఈ ఏడాది మార్చి 30న తిరుపతిలో పీ–4 ప్రథమ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు. దీని కోసం రూ.80 లక్షలు విడుదల చేశారు. అలాగే జిల్లా స్థాయిల్లో ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు జిల్లాకు రూ.2 లక్షల చొప్పున 26 జిల్లాలకు రూ.52 లక్షలను విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వేడుకలకు నియోజకవర్గానికి రూ.లక్ష చొప్పున రూ.175 లక్షల్ని విడుదల చేశారు. సభలు, వేడుకల ఖర్చు రూ.9.15 కోట్లుగత ఏడాది మార్చి 30న సచివాలయం వెనుక పీ–4 పాలసీ ప్రారంభోత్సవం పేరుతో సీఎం చంద్రబాబు ఒకపూట సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు గతంలోనే ప్రణాళికా శాఖ రూ.5.61 కోట్లను విడుదల చేసింది. గత ఏడాది ఆగస్టు 19న మంగళగిరిలోని సీ.కే. కన్వెన్షన్స్లో సీఎం చంద్రబాబు నిర్వహించిన పీ–4 కార్యక్రమానికి ఖర్చుల నిమిత్తం రూ.47.10 లక్షలకు పరిపాలన అనుమతి ఇస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు పీ–4 సభలు, వేడుకల పేరుతో చంద్రబాబు సర్కారు రూ.9.15 కోట్లను వ్యయం చేసింది.పేదరిక నిర్మూలన కోసం పేదలకు నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల పేరుతో రూ.కోట్లు వెచ్చిస్తోంది. సంపన్నులైన 10 శాతం కుటుంబాలు పేదరికంలో ఉన్న కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి. ఈ కార్యక్రమం కోసం సదస్సులు, వేడుకల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ఏకంగా రూ.9.15 కోట్లు వ్యయం చేయడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
రాబడి నాస్తి.. అప్పులు జాస్తి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం తక్కువ.. అప్పులు ఎక్కువ అయ్యాయి. రాష్ట్ర సొంత పన్ను రాబడులను పెంచే ప్రయత్నమే లేకపోవడంతో అప్పుల మీద అప్పులు చేయాల్సి వస్తోంది. మరో పక్క చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా ఇతర రెవెన్యూ రంగాలకు మళ్లించేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) మే నెల వరకు బడ్జెట్ కీలక సూచికలే వెల్లడించాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ సూచికలను వెల్లడించింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రాబడిని మినహాయించి రాష్ట్ర సొంత పన్ను రాబడులు చూస్తే ఏప్రిల్, మే నెలల్లో రూ.19,414 కోట్లు వచ్చినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. ఇదే కాలంలో బడ్జెట్లో చేసిన అప్పు రూ.20,663 కోట్లుగా తెలిపింది. ఇలా రాబడులు తగ్గిపోయి అప్పులు పెరిగిపోవడమంటే రాష్ట్రం దివాళా దిశగా పయనించడమే తప్ప మరొకటి కాదని స్పష్టం అవుతోంది. మరో పక్క చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయడంలేదని కాగ్ పేర్కొన్న కేపిటల్ వ్యయమే స్పష్టం చేస్తోంది. చేసిన అప్పుల్లో కేపిటల్ వ్యయం కేవలం రూ.5,539 కోట్లేనని కాగ్ పేర్కొంది. అంటే బడ్జెట్ ప్రతిపాదన మూల ధన వ్యయంలో మే నెల వరకు రూ.11.38 శాతమే వ్యయంగా ఉంది. బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పులో ఏప్రిల్, మే నెలల్లోనే 27.24 శాతం అప్పు చేసినట్లు కాగ్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లరూపంలో మే నెల వరకు కేవలం 2.01 శాతమే వచ్చినట్లు తెలిపింది. కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.32,458 కోట్లు వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించగా.. వాస్తవంగా వచ్చింది కేవలం రూ.652 కోట్లే. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టలేకపోయింది. మరో పక్క ఆర్థిక ఏడాది రెండు నెలల్లోనే రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో సంవత్సరం మొత్తానికి రెవెన్యూ లోటును రూ.22,002 కోట్లకు పరిమితం చేస్తామని గొప్పగా చెప్పగా.. మే నెల వరకే బడ్జెట్ ప్రతిపాదనల్లో 66.70 శాతం అంటే రూ.14,676 కోట్లకు రెవెన్యూ లోటు చేరినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. బడ్జెట్ ప్రతిపాదనల ద్రవ్యలోటులో తొలి రెండు నెలల్లోనే 27.24 శాతానికి చేరుకుంది. -
అంతన్నారు..ఇంతన్నారు.. చిన్న పాప ఆచూకీ కనిపెట్టలేకపోయారు!
సాక్షి, అమరావతి: ‘ఒక్క పాపను కనిపెట్టలేని వారు..30 వేల మంది మహిళలు, చిన్నారులను వెతికి తీసుకువస్తారా..వాళ్లందరి సంగతి సరేగానీ ముందు ఈ ఒక్క చిన్నారిని వెతికి తీసుకురండి’ అంటూ చంద్రబాబు ఎన్నికల ముందు ఏపీలో 30 వేల మంది మహిళలు, చిన్నారులు మిస్సయ్యారంటూ రోజూ గగ్గోలు పెట్టిన కూటమి నేతలు, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. మహిళలకు భద్రత లేదంటూ గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్లు..ఇప్పుడు జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అవన్నీ రాజకీయ ఆరోపణలే కదా... కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి(2) కనిపించకుండాపోయి రెండు వారాలు అయ్యింది. చిన్నారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదంటూ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికత, కట్టుదిట్టమైన పోలీసింగ్ ఉందంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం..ఒక చిన్నారి జాడ కూడా కనిపెట్టలేకపోవడం దారుణమని మండిపడుతున్నారు.ఎన్నికల ముందు ‘‘రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు, చిన్నారులు మిస్సయ్యారు.. వారందరినీ వెతికి తీసుకొస్తాం’’ అని చెప్పిన కూటమి నేతలు, ఇప్పుడు ఆ మాటలను ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క చిన్నారి కేసులోనే ఫలితం లేకపోవడంతో, 30 వేల మంది గురించి చేసిన ప్రకటనలు కేవలం రాజకీయ ఆరోపణలేనని తేలిపోయిందని స్పష్టం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను నేరుగా ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. -
మూడో ఏడాదీ మోసమే!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం అన్నదాతల పాలిట దుఃఖీభవ పథకంగా మారింది. రాష్ట్రంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసి, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకంతో కలిపి రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది అదీ ఇవ్వకుండా పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొర సాయం అందించిన చంద్రబాబు.. మూడో ఏడాది కూడా రైతులను వంచించేందుకు యత్నిస్తున్నారు. 2026–27 వ్యవసాయ సీజన్కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. అది కూడా అరకొరగానే ఇస్తున్నారు. కౌలు రైతులకు ఈసారీ మొండి చేయే చూపించారు.2023–24లో అర్హత పొందిన 53,58,366 మంది రైతులకు రూ. 20 వేల చొప్పున రూ.10,717 కోట్లు అవసరం కాగా 2024–25లో చంద్రబాబు తొలి బడ్జెట్లో ఈ పథకానికి కేవలం రూ.1,000 కోట్లు విదిల్చారు. ఒక్క రైతుకూ పైసా ఇవ్వలేదు. ఇదిగో అదిగో అంటూ తొలి ఏడాది గడిపేసి, రైతులకు రూ.10,717 కోట్ల పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఆ ఏడాది బకాయిలతో కలిపి మరుసటి ఏడాది (2025–26) బడ్జెట్లో రూ.21,433.46 కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ.6,300 కోట్లతో సరిపెట్టారు. రకరకాల సాకులతో అర్హులైన రైతుల సంఖ్యలో కోతలు వేసి, లబ్ధిదారులను 46.86 లక్షల మందికి కుదించి, దాదాపు 7 లక్షల మందికి కోతపెట్టారు. పాత బకాయిలతో కలిపి ఏకంగా రూ.14,873.28 కోట్లు ఎగ్గొట్టారు. వాస్తవానికి ఏటా భూ యజమానుల సంఖ్య పెరుగుతుంది. కానీ గతేడాది అర్హత పొందిన లబ్ధిదారులకే ఈ ఏడాది కూడా పెట్టుబడి సాయం జమ చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ లెక్కన 46.86 లక్షల మందికి తొలి విడతగా అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు కలిపి రూ.7 వేల చొప్పున శనివారం జమ చేయనున్నారు. లబ్ధిదారుల్లో 45,09,817 మంది భూ యజమానులు కాగా, 1,16,021 మంది అటవీ భూ సాగుదారులున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.2,342.92 కోట్లు జమ చేయనుండగా, పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.782.55 కోట్లు జమ చేయనుంది.కౌలు రైతులకు పైసా ఇవ్వని బాబుమరొక వైపు భూ యజమానులతో పాటు సామాజికవర్గాలతో సంబంధం లేకుండా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు, దేవదాయ ధర్మాదాయ భూ సాగుదారులందరికీ రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. వరుసగా మూడో ఏడాది కూడా కౌలురైతులకు మొండిచేయి చూపింది. కానీ ఇప్పటివరకు పైసా విదల్చలేదు. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులుంటారని అంచనా. వారిలో సెంటు భూమి కూడా లేని వారు 10 లక్షల పైమాటే. 2024–25లో 9.25 లక్షల మందికి, 2025–26లో 8.24 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేశారు. తొలి ఏడాది ఎగ్గొట్టిన పెట్టుబడి సాయాన్ని రెండో ఏడాది భూ యజమానులతో కలిపి సీసీఆర్సీ కార్డులు పొందిన కౌలు రైతులకైనా ఇస్తారని ఆశగా ఎదురు చూశారు. కానీ తొలి విడత సాయం జమ సందర్భంగా ఖరీఫ్–2025 సీజన్లో పంట నమోదు (ఈ – క్రాప్) ప్రామాణికంగా కౌలు రైతుల డేటా ధ్రువీకరణ చేపట్టి, ఆ తర్వాత అర్హత పొందిన వారికి రెండు విడతలు కలిపి జమ చేస్తామని ప్రకటించారు. రెండో విడత సాయం పంపిణీ వేళ కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావచ్చిందని, త్వరలోనే జమ చేస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. చివరికి 2025–26 వ్యవసాయ సీజన్లో పైసా కూడా కౌలు రైతులకు విదిల్చిన పాపానపోలేదు. ఇలా కౌలు రైతులకు రెండేళ్లలో రూ.6400 కోట్ల మేర పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. కనీసం 2026–27 సీజన్లోనైనా కరుణ చూపుతారని ఆశించిన వారి ఆశలపై నీళ్లు జల్లింది. -
రాష్ట్రంలో దుర్మార్గ పాలన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని, దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలను చంద్రబాబు బుట్టదాఖలు చేసి.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎత్తి చూపారు. చంద్రబాబు మోసాలను ఎవరైనా ప్రశ్నిస్తే దొంగ కేసులు.. దొంగ సాక్ష్యాలు.. వేధింపులు.. రెడ్బుక్ రాజ్యాంగంతో అణగదొక్కే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి.. మిగిలింది మూడేళ్లు మాత్రమే.. ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది.. త్వరలోనే దుర్మార్గ పాలన పోతుందని స్పష్టం చేశారు. ‘వచ్చే రెండేళ్లు పార్టీకి ఎంతో కీలకమైన సమయం.. పార్టీలో ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజలతో మమేకం కావాలి.. మీరు ప్రజల కోసం నిలబడండి.. వారి కోసం కష్టపడండి.. మీ అందరి బాధ్యత నాది. నేను స్వయంగా చూసుకుంటాను.. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది.. అన్ని కార్యక్రమాలు వారి చేతుల మీదుగానే కొనసాగిస్తాం’ అని పునరుద్ఘాటించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతోన్న వైఎస్ జగన్.. ఆ దిశలో భాగంగా గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. కార్యకర్తలు, నాయకులను ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు, ఏజెన్సీలో అభివృద్ధి ప్రాజెక్టులతో గిరిజనులకు మేలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని వివరించారు. ఈ సందర్భంగా సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..మన పాలన, చంద్రబాబు పాలనపై ప్రతి ఇంట్లో చర్చ » ‘ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నాకన్నా మీకే బాగా తెలుసు. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్ల పాలన ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు జగన్ను చూశాం.. ఆయన ఐదేళ్ల పాలన చూశామని, ఆ పాలనకు, ఇప్పుడు చంద్రబాబు రెండేళ్ల పాలనకు మధ్య తేడా ఏమిటనేది ప్రతి ఇంట్లో చర్చించుకుంటున్నారు. మన ఐదేళ్ల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని, ఎప్పుడూ జరగని విధంగా పాలన అందించామని గర్వంగా చెబుతున్నా. » మనం రాక ముందు వరకు మేనిఫెస్టో అంటే ఏ మాత్రం విలువ ఉండేది కాదు. ప్రజలకు ఎన్నెన్నో చేస్తామని ఎన్నికల్లో మాట చెప్పి, ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసేవారు. అదే మనం వచ్చాక, తొలిసారిగా మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి, 99 శాతం అమలు చేసిన పార్టీ ఒక్క మన వైఎస్సార్సీపీ మాత్రమే. బడ్జెట్ సమావేశాలకు ముందే పథకాలు, తేదీలు ప్రకటించి, క్రమం తప్పకుండా అమలు చేసింది కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే. గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా చేశాం.» మనం రాకముందు స్కూళ్లు ఎలా ఉండేవి? మనం వచ్చిన తర్వాత ఎలా మారాయి?.. అనేది నాకన్నా మీరు బాగా చెప్పగలుగుతారు. మనం రాక ముందు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు ఎలా ఉండేది? మనం వచ్చాక ఆరోగ్యశ్రీని ఎంత బాగా అమలు చేశాం.. అనేది మీరే బాగా చెప్పగలరు. మనం రాక ముందు వ్యవసాయం ఎలా ఉండేది? రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు.. మనం వచ్చిన తర్వాత రైతన్న ఎలా బాగుపడ్డాడు.. వ్యవసాయంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది మీరే బాగా చెప్పగలరు. మనం రాక ముందు గ్రామాల్లో ఏ పథకం అందక, పరిపాలన అందక, దేనికైనా ఎవరెవరికో డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి. అదే మన వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక, పాలన ఎలా మారింది? గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలు ఎలా అందాయి? అన్నీ చేసి చూపించాం. » సచివాలయాల వ్యవస్థ.. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్. ఇంటి గడప వద్దే ప్రభుత్వ పథకాలు అందాయి. ఇన్ని గొప్ప మార్పులు తీసుకురాగలిగాం. విద్య, వ్యవసాయం, వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చాం. దిశ యాప్తో మహిళలకు రక్షణ కల్పించాం. వారికి తోడుగా నిలబడ్డాం. ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్ను సచివాలయంలో ఉంచాం. గిరిజనులు.. గిరిజన ప్రాంతాల్లో మార్పులు » ఎప్పుడూ చూడని విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూడా మన హయాంలోనే జరిగింది. ఎప్పుడూ చూడని విధంగా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేశాం. 3,22,528 ఎకరాలు, ఆర్ఓఎఫ్ఆర్ డీకేటీ భూముల భూ పట్టాలు పంపిణీ చేశాం. ఒక్క రంపచోడవరంలోనే 20 వేల మందికి 80 వేల ఎకరాల భూముల ఆర్ఓఎఫ్ఆర్ డీకే పట్టాలు పంపిణీ చేశాం. » ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుడితే, వాటిలో ఒక్క మన ప్రాంతంలోనే పాడేరు, పార్వతీపురంతో పాటు, ఏజెన్సీ ముఖ ద్వారమైన నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలు తెచ్చాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. మన గిరిజనులు బాగు పడాలి.. వారు చదువుల్లో ముందుండాలన్న ఆరాటం కేవలం మన ప్రభుత్వంలోనే కనిపించింది. » ఎప్పుడూ చూడని విధంగా ఐటీడీఏల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో తలపెట్టి, వేగంగా పనులు చేశాం. ఇవన్నీ ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగాయని గర్వంగా చెప్పగలను. ఒక తపన, తాపత్రయంతోనే ఇవన్నీ చేశాం. మనుషుల జీవితాలు బాగు పడాలి. వారి బతుకులు మారాలి. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలన్న తపనతో పని చేశాం.ప్రశ్నిస్తే ఓర్చుకోలేకపోతున్నారుచంద్రబాబుకు ఎందుకు ఓటేశాం? జగన్ను ఎందుకు పోగొట్టుకున్నామనే విషయంపై ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. మిగిలింది మూడేళ్లు మాత్రమే. ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. త్వరలోనే దుర్మార్గ పాలన పోతుంది. అంతా అన్యాయమైన పాలన. చంద్రబాబు మోసాలపై ప్రశ్నిస్తే దొంగ కేసులు.. దొంగ సాక్ష్యాలు.. వేధింపులు. రెడ్బుక్ రాజ్యాంగం.. అందరినీ కోరేది ఒక్కటే. చీకటి ఎప్పటికైనా పోతుంది. వెలుగు రాక తప్పదు.ఎన్నికల ముందు వారేం చెప్పారు?ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ ఇచ్చేవి మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ఇంకా ప్రతి ఇంటికి చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో బాండ్లు పంపారు. ప్రతి ఇంట్లో 50 ఏళ్లు నిండిన వారున్నారా? అయితే నీకు రూ.4 వేలు, నీకు రూ.4 వేలు. అలా ఏడాదికి రూ.48 వేలు ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలు కనబడితే ఏడాదికి నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అని చెప్పారు. 18 ఏళ్లు నిండిన నిరుద్యోగ యువకుడు కనిపిస్తే.. నీకు ఏడాదికి రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పారు. మీకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయా? మీరు రైతులా? అయితే మీకు రూ.26 వేలు ఇస్తామన్నారు. మనం ఇచ్చిన దానికన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టో చూపి, ఒక పద్ధతి ప్రకారం మోసం చేశారు. మరి ఇప్పటి పరిస్థితి ఏమిటి? రెండేళ్లు గడిచాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటన్నది చూస్తే.. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి రూ.18 వేల చొప్పున, రెండేళ్లలో రూ.36 వేలు బాకీ. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, రెండేళ్లలో ప్రతి పిల్లాడికి రూ.72 వేలు బాకీ. 50 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.4 వేల చొప్పున, రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. మరోవైపు అమ్మ ఒడి తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. మిగిలిన వారికి ఇచ్చింది కూడా రూ.8 వేలు. రూ.9 వేలు మాత్రమే. కొందరికి రూ.13 వేలు ఇచ్చారు. రైతు భరోసా కింద పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తానన్నాడు. అంటే రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది రూ.14 వేలు. ఇక్కడ బాకీ రూ.26 వేలు. గ్యాస్ సిలిండర్లు ఏటా మూడు ఉచితం అన్నారు. రెండేళ్లలో రెండు మాత్రమే ఇచ్చారు. అది కూడా అందరికీ ఇవ్వలేదు.పేదల పక్షాన నిలబడండి.. జగన్ 2.0లో మీకే అధిక ప్రాధాన్యం ఇంకా మూడేళ్లు. చివరి ఏడాది ఎన్నికల ఏడాది కాబట్టి. ఈ రెండేళ్లు చాలా ముఖ్యం. ఈ కాలంలో పార్టీని మోయాల్సిన బాధ్యత, బాధితులైన ప్రజల పక్షాన పార్టీ తరఫున నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాలపై ఉందని మర్చిపోవద్దు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. రేపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0లో కార్యకర్తలను బాగా చూసుకుంటాను. గత పాలనలో మన కార్యకర్తలను అంత బాగా చూసి ఉండకపోవచ్చు. మనం రాగానే కోవిడ్ రావడంతో, రెండేళ్లు పరిపాలన మీదే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. కానీ, ఈసారి అలా ఉండదు. ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మీ ఆధ్వర్యంలోనే, మీ చేతుల మీదుగానే అందిస్తాం. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. మీరు పేదలకు అండగా, తోడుగా ఉండండి. అది మాత్రమే మిమ్మల్ని కోరుతున్నాను. మిగతా అన్ని విషయాల్లో మీకు తోడుగా నేనుంటాను’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిహారం చెల్లింపుల్లో వివక్ష కొనసాగుతోందని సమావేశంలో కార్యకర్తలు ప్రస్తావించగా, దీనిపై పార్టీ తరఫున పోరాడుతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నిర్వాసితులు తమ పార్టీలో చేరితేనే పరిహారం ఇస్తామని చెబుతున్నారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటిపై పోరాటం కొనసాగిస్తామని, అయినా న్యాయం జరగకపోతే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రంపచోడవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ నాగులాపల్లి ధనలక్ష్మితో పాటు, పార్టీకి చెందిన స్థానిక మాజీ సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
‘రెడ్బుక్ రాజ్యాంగం నిజ స్వరూపం బయటపడింది’
సాక్షి, కాకినాడ జిల్లా: రెడ్ బుక్ రాజ్యాంగం నిజ స్వరూపం బయటపడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులను విచ్చలవిడిగా చేతిలో అస్త్రంలా టీడీపీ వాడుకొంటోంది. విజయవాడ లాకప్ డెత్ ఘటన.. చట్టాలు, మానవ హక్కులు లేవని చెప్పింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ మాట్లాడితే కులం రంగు పులుముతున్నారని ఆయన మండిపడ్డారు.‘‘లాకప్ డెత్ మానవ హక్కులకు సంబంధించిన విషయం. దీంట్లో కులాల్ని, మతాలను తీసుకువచ్చి ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా సొంత మీడియా రంగంలోకి వచ్చేసింది. లాకప్ డెత్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ను ఇరికించాలని వైఎస్ జగన్ మాకు ఆదేశించినట్లు.. దానికి పర్యవేక్షణ బాధ్యత నాకు ఇచ్చినట్లుగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. పవన్ను ఇరికించాలని వైఎస్ జగన్ ఎందుకు అంటారు?. వైఎస్సార్సీపీకి ఏం సంబంధం?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసే హోం మంత్రి, ముఖ్యమంత్రి లాకప్ డెత్ ఘటనకు బాధ్యులు. వీరితో పాటుగా డీజీపీ, సీపీ, ఏసీపీ, సీఐ, ఇతర స్టాప్ బాధ్యులు. చంపేసి బూడిద చేయడం పోలీసుల పరాకాష్ట. లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ను ఆమోదించాలి. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారన్న వాస్తవం లాకప్ డెత్ కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. చట్టాన్ని అమలు చేయాలనే గౌరవం, భయం పోలీసులకు పోయింది’’ అని కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. -
నా పాదయాత్ర ఎప్పుడంటే...
-
జగన్ 2.0 చీకటిపై దండయాత్ర..
-
‘వారికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?’
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగి చాలా రోజులైందని.. వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ(గురువారం) కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి నరేంద్ర పరామర్శించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారు. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణను కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారు. విజయలక్ష్మి చెల్లి దుర్గ డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ వద్దకు వెళితే అడ్డుపడ్డారు. హెబియస్ కార్పస్ వేయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. జూన్ 15వ తేదీన కోర్టు ఆర్డర్ వచ్చాక మా దృష్టికి తెలిసింది. సాయికృష్ణ కుటుంబం మాకు బాగా తెలిసిన వారే..సాయికృష్ణ పై ఓ వర్గం మీడియా దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. కేసులున్నంత మాత్రాన చంపేస్తారా?. కసబ్ను కూడా విచారించాకే శిక్ష విధించారు. సాయికృష్ణ డెడ్బాడీ లేకుండా చేశారు. కనీసం బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకుంటోంది. సాయికృష్ణ కుటుంబం మా పార్టీ కాదు. అయినా మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మేం రాజకీయాలు చేయాలంటే చాలా అంశాలున్నాయి..సాయికృష్ణ అంశాన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగా అందరూ సాయికృష్ణ కుటుంబం కోసం కలిసిరావాలి. పోలీసుల దుర్మార్గపు చర్యలను నిలదీద్దాం. మేం ఆ కుటుంబానికి అండగా ఉంటాం. నేను విడుదల చేసిన ఫోటోలు సాయికృష్ణవి కాకపోతే అతన్ని తీసుకురండి. మానవసమాజం తలదించుకునే ఘటన ఇది.ఇలాంటి ఘటనలను పౌరసమాజం కచ్చితంగా స్పందించాలి. పోలీస్ కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వానికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?. అందరికీ తెలిసే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి. పోలీసు విచారణతో న్యాయం జరగదు. సీబిఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేసినట్లే కేసును కూడా బూడిద చేయాలని చూస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళతాం. సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతోనే నేరం సగం అంగీకరించారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
తాగు.. ఊగు... ఇదే బాబు గారి గ్రేట్ విజన్!
-
రైతులకు ఎప్పుడూ కష్టాలే..అధికారంలో ఉన్న బాబు వేస్ట్
-
‘చంద్రబాబూ.. బీచ్ల్లో బార్లపై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, కానీ ప్రభుత్వం మాత్రం బీచ్ల్లో బార్లు ఏర్పాటు చేయడంపైనే దృష్టి పెట్టిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగిలితే గాలికి కొట్టుకుపోతారని మండిపడ్డారు.తాడేపల్లిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అన్నపూర్ణగా పిలుచుకునే ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో అనేక మంది రైతులు తనువు చాలించారు. ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే తీరిక లేదు. కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 60 నుంచి 65 శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. ప్రతిపక్ష నేతలను తిట్టడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. మంచి పనులు చేయటం మీద దృష్టి పెట్టకుండా నిత్యం వైఎస్ జగన్ మీద విషం చిమ్మే పనిలో ఉన్నారు.గతేదాడి వేలాది మంది రైతులు ఎరువులు, విత్తనాలు దొరక్క ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు ఎరువుల మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోలేదు. ప్రతీ విషయంలో మోసం చేయటం చంద్రబాబు నైజం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేస్తా అన్నారు.. ఇప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్ హయంలో తెచ్చిన ప్రాజెక్టుల వల్ల రైతులు నిలబడ్డారు. జగన్ వచ్చిన తర్వాత 1700 కోట్లు ఖర్చు చేసి 9 గంటలు విద్యుత్ ఇచ్చారు. తోతాపురి మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఏడాది జగన్ వెళ్ళి ఆందోళన చేస్తే కేసులు పెట్టారు. ప్రతిపక్షంగా మేము గట్టిగా మాట్లాడితే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. రైతులకు కావాల్సిన మినిమం సపోర్ట్ కూడా ప్రభుత్వం నుంచి లభించటం లేదు. ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు చంపేశారు.. కనీసం డెడ్ బాడీ ఇవ్వాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేం ఇదే విషయం ప్రశ్నిస్తే కులాల ప్రస్తావన తీసుకువస్తారు. బీచ్లో బార్స్ పట్టడానికి ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ బ్లాక్ చేస్తున్నారు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగిలితే గాలికి కొట్టుకుపోతారు. తక్షణమే రైతుల గురించి ఆలోచన చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
‘సాయికృష్ణ ఘటన సీపీకి తెలిసే జరిగింది’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనమైందని వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్ ఆరోపించారు. సీపీగా రాజశేఖర్ బాబు వచ్చాక విజయవాడ గాడి తప్పిందని సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని ఘోరం విజయవాడలో జరిగింది. పోలీసులే యువకుడిని కొట్టి చంపేసి, కాల్చి బూడిద చేశారు అంటూ వ్యాఖ్యలు చేశారు.గాదె సాయికృష్ణ ఘటనపై దేవినేని అవినాష్ స్పందిస్తూ..‘విజయవాడ నగరంలో పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. రెండేళ్లుగా గంజాయి విక్రయాలు, సెటిల్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. నగరంలో లా అండ్ ఆర్డర్ని సీపీ రాజశేఖర్ బాబు గాలికి వదిలేశారు. దర్జాగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంటే సీపీ పట్టించుకోవడం లేదు. రౌడీ షీటర్స్ నడిరోడ్డుపై ప్రజల్ని ఇబ్బంది పెడుతూ దర్జాగా తిరుగుతున్నారు. పేకాట క్లబ్లు విచ్చలవిడిగా నడుస్తున్నా సీపీ పట్టించుకోరు.సాయికృష్ణ ఘటన సీపీకి తెలిసే జరిగింది. సీపీ బాధ్యత వహించాలి సమాధానం చెప్పాలి. సీపీ ఎందుకు మాట్లాడటం లేదు?. వైఎస్సార్సీపీ నేతల్ని వేధించడంలో సీపీ రాజశేఖర్ బిజీగా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ కళ్లలో ఆనందం చూడటానికే సీపీ పని చేస్తున్నాడు. సీఎం, డిప్యూటీ సీఎం సమావేశమై బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేశారు?. మీ పార్టీల జెండాలు పట్టుకుని ఎన్నికల్లో తిరిగిన కుటుంబానికి మీరు ఇచ్చిన భరోసా ఏది?. సాయికృష్ణను కొట్టి చంపేసి కాల్చి బూడిద చేశారు. ఇదే నిజం. బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సిన స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కనీసం పరామర్శించలేదు. జనసేన ఇంచార్జ్ అమ్మిశెట్టి వాసు ఏకంగా డబ్బులిస్తామని సెటిల్మెంట్ చేస్తున్నాడు’ అంటూ విమర్శలు గుప్పించారు. -
చంద్రబాబూ.. ప్రజల కోసమా?.. పబ్లిసిటీ కోసమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు భలే తమాషాగా ఉంటాయి. జనం నమ్ముతారా? లేదా? అన్నదానితో ఆయనకు నిమిత్తం ఉండదు. ప్రజలు వింటున్నారా? లేదా? అన్నదానితో సంబంధం ఉండదు. తన టీమ్ రాసిచ్చిన స్క్రిప్ట్లోని పాయింట్లను అన్నిటిని చెప్పానా? లేదా? అన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబు ఆయా సభలలో చేసిన ఒక వ్యాఖ్య చూడండి. 'బటన్ నొక్కితే పైశాచిక ఆనందం ఉంటుంది తప్ప ప్రజలను కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకునే పరిస్థితి ఉండదు" అని ఆయన అన్నారు. ఇది గత ముఖ్యమంత్రి జగన్పై చేసిన పరోక్ష ఆరోపణ అని తెలుస్తూనే ఉంది. కాని ప్రజలు తమకు ప్రభుత్వంలో ఉన్నవారు ఇస్తామన్న సంక్షేమ స్కీమ్లు ఇచ్చారా? లేదా? తమకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందా? లేదా? అన్నది చూస్తారు తప్ప, తమ ఇంటికి ముఖ్యమంత్రి వచ్చి పెన్షన్ అందించారా?లేదా? అని ఎవరైనా ఆలోచన చేస్తారా? అసలు ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు ఎందుకు చేస్తున్నారు? దానికి కారణం లేకపోలేదు.గత జగన్ ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ అందించడమే కాకుండా, వారికి అన్ని అవసరాలలోనూ వెన్నంటి ఉండేవారు. ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లడం అంటే ఏమిటో ఆ రోజుల్లో జనం చూశారు. ఆ వ్యవస్థ ప్రజల మన్ననలు పొందిందని గుర్తించారు. అంతే! వెంటనే పరకాయ ప్రవేశం చేసేశారు. తాము వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, జగన్ ఐదువేల రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని, టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రకటన చేశారు. పైగా అది కూడా తెలుగువారంతా పవిత్రంగా భావించే ఉగాది నాడు పూజలు చేసి మరీ చంద్రబాబు ఈ ఉపన్యాసం ఇచ్చారు. ఎవరినైనా మోసం చేయాలనుకుంటే వారికి ఏదైనా ఆశ చూపాలని ఒక సినిమా డైలాగు ఉంటుంది. అందులో ఒక వ్యక్తి తనకు భోజనం చేయడానికి డబ్బు లేదని సాయం చేయాలని రోడ్డు పక్కన ఉన్న ఒకాయనను అడుగుతాడు. అతను డబ్బు ఇవ్వడానికి అంగీకరించడు. పైగా తిడతాడు. ఆ తర్వాత అదే వ్యక్తి తన వద్ద ఉన్న వాచ్ ఖరీదు ఐదువేలు అని, తనకు అత్యవసరం కనుక 500 రూపాయలకే ఇవ్వాలని అనుకుంటున్నానని, తీసుకోండని రోడ్డు పక్కన నిలబడి ఉన్న అతనినే కోరతాడు. నిజానికి దాని ఖరీదు 150 రూపాయలే. ఆ వాచ్ను పరిశీలించిన అతను 400 రూపాయలకు ఇస్తే తీసుకుంటానని అంటాడు. ఆ రకంగా వాచ్ అమ్మిన వ్యక్తి లాభపడతాడన్నమాట.ఆశకు లొంగి రెండో వ్యక్తి మోసపోయాడన్నమాట. ఈ కథకు, చంద్రబాబు ప్రకటనకు నేరుగా సంబంధం ఉందా? లేదా అన్నది పక్కనబెడితే, ప్రజలను ఆశపెట్టి వారికి ఆకర్షించడంలో చంద్రబాబు సిద్దహస్తుడే అన్న అభిప్రాయం ఉంది. ఆ రకంగా వలంటీర్లను వలలో వేసుకుని, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి మొత్తం వలంటీర్ల వ్యవస్థకే పంగనామాలు పెట్టారు. దాంతో అంతకుముందు జగన్ టైమ్లో ఇచ్చిన ఐదువేల గౌరవ వేతనం రాకుండా పోయింది. అలాగే ప్రజలు తమ ఇళ్లవద్దనే అందుకుంటున్న సేవలకు మంగళం పలినట్లయింది. పైగా పెన్షన్ ఇవ్వడానికో, లేదా మరో కార్యక్రమం నిమిత్తమో చంద్రబాబు ప్రత్యేక హెలికాఫ్టర్ వేసుకుని వెళతారు. దీనికి లక్షల్లో ఖర్చు చేయాలి. అలాగే వెళ్లిన గ్రామంలో సభ నిర్వహణకు మరిన్ని లక్షల రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది.వృద్దాప్య పెన్షన్ జగన్ టైమ్లో మూడువేల రూపాయలు ఉండేది. దానిని వలంటీర్ల ద్వారా మొదటి తేదీ తెల్లవారేసరికల్లా అందించేవారు. ఇప్పుడు దానికి ఒక వెయ్యి రూపాయలు కలిపి నాలుగువేల రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు హెలికాఫ్టర్ టూర్ చేయడం గొప్ప సంగతి అని ప్రొజెక్టు చేసుకుంటున్నారు. ఒక ఇంటికి వెళితేనే ఆయనకు అంత తృప్తి అయితే, వైఎస్సార్సీపీ హయాంలో అందరి ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పెన్షన్ అందిస్తే, అది ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఇంటికి వెళ్లి ఇచ్చినట్లవ్వదా! అన్నది వైఎస్సార్సీపీ ప్రశ్న. పోనీ ఇలా గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడైనా చేశారా? అంటే లేదు.1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన పవర్ లో ఉన్నారు కదా! ఆ టైమ్లో ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? ఇప్పుడు వలంటీర్ల బదులు గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇళ్లకు పంపే ప్రయత్నం చేస్తున్నారు కాని, అది అంత సఫలం అవుతున్నదా? అన్నది చర్చ ఉంది. కాగా సచివాలయ ఉద్యోగులను కూడా ప్రభుత్వం వేధిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ఈ వేధింపులను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి.గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ ఒక్కటే కాదు. పౌరసరఫారాల శాఖ అందించే బియ్యం, ఇతర వస్తువులను కూడా వలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఇవ్వడం లేదే! అప్పట్లో ప్రత్యేకంగా వ్యాన్లు పెట్టి సరుకులను డోర్ డెలివరీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులకు వెళ్లి జనం సరుకులు తీసుకోవలసి వస్తోంది. అనేక చోట్ల ప్రజలు క్యూలలో, రద్దీలో గుమికూడవలసి వస్తోంది. ఇది ప్రజలకు సౌకర్యం కల్పించినట్లు అవుతుందా? ఇదే కాదు.. ప్రజలు అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో కాని, అప్లికేషన్లు పెట్టుకోవడంలో కాని, అనేక రకాలుగా వలంటీర్ల సేవలను ప్రజలు పొందేవారు. ఆ వ్యవస్థను తీసివేసి కనీసం వివరణ కూడా ఇవ్వలేదు.వలంటీర్లు ఆందోళనలు చేసి కూటమి ప్రభుత్వంలో తమ ఖర్మ ఇంతేలే అని సరిపెట్టుకున్నారు. జగన్ కూడా కొన్ని స్కీమ్ల అమలు నిమిత్తం ఆయా చోట్ల సభలు నిర్వహంచకపోలేదు. అయినా జగన్ బటన్ నొక్కడమే చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అది వేరే సంగతి. విపక్షంలో ఉన్నప్పుడు బటన్ నొక్కడం ఏముంది.. మూలన ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని విమర్శలు చేసేవారు. తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత బటన్ నొక్కడం తప్పు అన్నట్లు చెబుతున్నారు. ఒకవైపు పొదుపు మంత్రం చెబుతూ, దుబారాపై ఆదేశాలు ఇస్తూ, తానేమో ప్రజల డబ్బును లక్షలలో వృధా చేస్తున్నారు. అది గొప్ప విషయం అని జనాన్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు.వృద్దాప్య పెన్షన్ను సీఎం ఇచ్చినా, వలంటీర్ ఇచ్చినా లబ్దిదారులకు తేడా ఉండదు. వారికి కావల్సింది ఆర్థికసాయమే. వెయ్యి రూపాయలు ఇచ్చి లక్ష రూపాయల ప్రచారం చేసుకోవలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తుంది. ఎన్నికల మానిఫెస్టోలోని అంశాలలో అనేకమైన వాటిని ఎగవేసి, దానిని కవర్ చేసుకునేందుకు చంద్రబాబు నానా పాట్లు పడడానికి ఈ సభలు, ఈ జిమ్మిక్కులు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రజలను స్వయంగా కలిసి కష్ట సుఖాలను నిజంగా చంద్రబాబు తెలుసుకుంటున్నారా? లేక తన పబ్లిసిటీలో భాగంగా దీనిని ఒక ఈవెంట్ గా మార్చారా? అన్నది చర్చనీయాంశమే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వంగలపూడి అనితపై వేటు..?
-
చంద్రబాబు సర్కారుపై సమరానికి సన్నద్ధం
నెల్లూరు (అర్బన్): ‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని రెండేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాం. ప్రభుత్వంతో చర్చించాం. అయినా ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా పీఆర్సీ లేదు.. ఐఆర్ ఇవ్వరు.. డీఏ ఊసెత్తడం లేదు. అందుకే ప్రభుత్వంతో పోరాటానికి సన్నద్ధంగా ఉన్నాం. పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం’ అని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించి పోరాటాన్ని ప్రారంభించేందుకు బొప్పరాజు బుధవారం నెల్లూరులో జేఏసీ భాగస్వాములైన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం కనీసం చైర్మన్ను కూడా నియమించలేదని బొప్పరాజు మండిపడ్డారు. ఐదు డీఏలు ఇవాల్సి ఉందని, వాటి పైనా మాట్లాడడం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో మంచి ఐఆర్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు కూటమి.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదఅన్నారు. తెలంగాణలో మధ్యంతర భృతి (ఐఆర్) తీసుకుంటుంటే, ఏపీలో జీతాలకే పరిమితం కావాల్సి వచ్చిందని అన్నారు. మరోపక్క ఆర్జిత సెలవుల నగదు, డీఏలు, ఇతరత్రా రూ.30 వేల కోట్ల బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. వీటిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఉద్యోగులు నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నారని, సంవత్సరం పనిచేస్తే.. 9 నుంచి 10 నెలల జీతాలు మాత్రమే తీసుకుంటారని, మిగతా నగదును ప్రభుత్వమే ట్యాక్స్ రూపంలో కట్ చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, ఆస్పత్రుల ఖర్చులు, ఈఎంఐ, ఎల్ఐసీ వంటి సేవింగ్స్కు ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్యోగులు ఖర్చు చేస్తారన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆ ప్రణాళిక సర్వనాశనమైందన్నారు. చిన్న ఉద్యోగులందరూ అప్పుల పాలవుతున్నారన్నారు. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వ శాఖలకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ విడుదల చేయకపోవడంతో కార్యాలయాల్లో పరికరాలకు ఉద్యోగుల జేబుల్లో నుంచే ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలిపారు.ప్రభుత్వ ఒత్తిడి వల్లే గుండెపోటు, ఆత్మహత్యలు ప్రభుత్వం కలెక్టర్లకు ర్యాంక్లు ఇస్తుందని, ఆ ర్యాంకుల కోసం కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు రెండు, మూడు రకాల పనులు ఒకే దఫా అప్పగిస్తున్నారన్నారు. ఇద్దరు, ముగ్గురు చేయాల్సిన పనిని ఒక ఉద్యోగి మెడపై కత్తి పెట్టి చేయిస్తున్నారని, కాస్త ఆలస్యం జరిగినా టార్చర్ పెడుతున్నారని చెప్పారు. దీంతో ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురై పలువురు గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారని, మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.తప్పని పరిస్థితుల్లోనే పోరాటాలుఉద్యమాలు తమకు సరదా కాదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పోరాటానికి పూనుకున్నామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఈ విషయాలను అందరి దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులను సంప్రదించి ఐక్య పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చామని చెప్పారు. తన తండ్రి కూడా ఓ పోలీసు ఉద్యోగేనని, ఉద్యోగుల బాధలు తెలుసని మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇప్పుడు ఉద్యోగుల బాధలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ ఖజానా ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని, ఆ లెక్కలు కూడా తేలుస్తామని చెప్పారు. యూపీ వంటి రాష్ట్రాల్లో ఉద్యోగులకు బోనస్లుఉద్యమ కార్యాచరణ రాష్ట్ర కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు మాట్లాడుతూ యూపీ వంటి రాష్ట్రాల్లో ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నారని, తాము బోనస్లు అడగడంలేదని, న్యాయపరంగా రావాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఉద్యోగులతో చర్చించి పీఆర్సీ, ఇతర సమస్యలు పరిష్కరించి, బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్నారు. సమావేశంలో ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
లాకప్డెత్తో సర్కారు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో సంచలనం రేసిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ ఘటన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు ప్రజలను మభ్యపెట్టి, ఈ ఘటనను తాము సీరియస్గా తీసుకున్నట్లు ప్రభుత్వం కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. నెల రోజులుగా సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం.. లాకప్డెత్ అని బయట పడగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సమీక్ష నిర్వహించి, కంటి తుడుపు చర్యగా సీఐ నాగరాజును సస్పెండ్ చేయడం డ్రామాలో భాగమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి సీఐ సస్పెన్షన్ ద్వారా బాధితులను శాంతపరిచే ఎత్తుగడ వేసినట్లు.. సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారా విచారణ పేరుతో నిదానంగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే యత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తెలివిగా తప్పుకున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాపులు రగిలిపోతున్నారని, కాపుల్లో చీలిక వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని పవన్కళ్యాణ్ చూస్తారని, అన్ని విషయాలు ఆయనకే వివరించాలని సీఎం చంద్రబాబు.. డీజీపీకి సూచించడం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తద్వారా ఈ వివాదం నుంచి చంద్రబాబు తెలివిగా తప్పుకొని, పవన్ కళ్యాణ్కు అంట గట్టినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో వైపు ఎవరి ప్రోద్బలం లేకుండానే ఒక సీఐ.. కాపు యువకుడిని కొట్టి చంపి, శవాన్ని తగలబెట్టేంత సాహసం ఎలా చేస్తారని పోలీసు వర్గాల్లో సైతం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం ఇంకా ముదరకుండా చూసుకోవాలంటూ అటు డీజీపీకి, ఇటు పవన్ కళ్యాణ్కు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు కాపు ప్రముఖులతో మాట్లాడాలంటూ పవన్కు సూచించినట్లు తెలిసింది. అయితే మొన్నటిదాక కులం అవసరం లేదంటూ చెబుతూ వచ్చిన వపన్ కళ్యాణ్, ఇప్పుడు ఉన్నట్లుండి కాపులను బుజ్జగించాల్సి రావడం తలనొప్పేనని జనసేన వర్గాలు అంతర్మథనం చెందుతున్నాయి. జనసేనలో కలకలం‘అన్యాయంగా మా బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే, జనసేన తూర్పు ఇన్చార్జి అమ్మిశెట్టి వాసు వచ్చి రూ.50 లక్షలు ఇప్పిస్తా.. రాజీ చేసుకుందామని బేరం పెట్టారని బాధిత కుటుంబం వెల్లడించడం జనసేనలో కలకలం రేపుతోంది. ఇక్కడ లాకప్డెత్ అయింది కాపు యువకుడు, జనసేన కుటుంబ సభ్యుడు. అయితే బాధిత కుటుంబం వద్దకు కేసు రాజీ కోసం ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వచ్చింది కాపు నేత కావడం జనసేనలో కలకలం రేపుతోంది. బాధిత కుటుంబం తరఫున గట్టిగా నిలబడి పోరాటం చేయాల్సిందిపోయి.. చంద్రబాబుకు, టీడీపీకి ఊడిగం చేసేలా ఇదేం పనంటూ ఆ పార్టీ శ్రేణుల్లో.. ప్రత్యేకించి కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ‘మేమూ జనసేనకు చెందిన వాళ్లమే’ అంటూ కుటుంబ సభ్యులు ఐడీ కార్డులతో ప్రెస్ మీట్ పెట్టడం జనసేనకు ఇబ్బందిగా మారింది. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పందించాలంటూ సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్ చేసిన వ్యాఖ్యలు జనసేనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా కేసు రాజీ చేసుకోకపోతే జనసేన పార్టీకి ఇబ్బందులు తప్పవని గ్రహించి, రాజీ కోసం కొత్త దారులు వెతుకుతున్నట్లు తెలిసింది.ప్రభుత్వంపై మండిపడుతున్న కాపులుసాయికృష్ణ ఉదంతంతో చంద్రబాబు ప్రభు త్వంపై కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. అధికారంలోకి రావడం కోసం 2024 ఎన్నికల్లో తమను వాడుకున్న చంద్రబాబు, లోకేశ్లు.. అధికారంలోకి వచ్చాక కరివే పాకులా తీసిపారేశారని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో టీడీపీ నేతలు, కాపు వర్గీయులపై దాడులకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంతో కళ్లుమూసుకుపోయి వ్యవహ రిస్తున్నారని కాపు నేతలు ధ్వజమెత్తుతున్నారు. కాపు సామాజిక వర్గాన్ని చూపించి, చంద్రబాబుతో పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తరు వాత రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని చెబుతున్నారు. ఆయన రాజ కీయ అధికారం కోసం ఉపయోగపడిన కాపు లను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.ఇప్పుడేం చేద్దాం?సాయికృష్ణ వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం మంతనాలుఆందోళనల నేపథ్యంలో డీజీపీతో చర్చసాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై ఆందోళనలు వెల్లువెత్తడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటన నుంచి బుధవారం తిరిగి వచ్చిన చంద్రబాబు.. వెలగపూడి సచివాలయానికి చేరుకుని పవన్తో కలిసి ఈ ఘటనపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబులతో ఏం చేద్దామని చర్చించినట్లు తెలిసింది. విజయవాడ నగరంలో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం ఇరుకున పడాల్సి వస్తుందని తెలియదా.. అని పోలీస్ కమిషనర్ను సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ఘటనకు కారణమైన సీఐ నాగరాజును ఇప్పటికే వీఆర్కు పంపామని చెప్పగా, సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులు ఎవరో తేల్చాలని చెప్పారు. ఈ వ్యవహారంలో నాగరాజు ఎందుకు అంత దూకుడుగా వ్యవహరించాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలిసింది. సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అతని మేనమామ జనసేన పార్టీ కీలక కార్యకర్త కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇకపై ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రతి అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెప్పాలని డీజీపీకి సూచించినట్లు తెలిసింది. రాజకీయంగా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఎలా స్పందించాలనే దానిపైనా పవన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. మీడియా ద్వారా ప్రభుత్వ వాదన వినిపిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు మాట్లాడితే ప్రజల్లో ఇంకా ఆగ్రహం పెల్లుబికే అవకాశం ఉందని, ఆచితూచి వ్యవహరిద్దామని నిర్ణయించారు. మీడియాకు మాత్రం ఈ ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, నిష్పాక్షికంగా విచారణ జరపాలని చెప్పినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు సీఎంవో వర్గాలు బుధవారం రాత్రి అధికారికంగా వెల్లడించాయి. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ నిర్వహించాలని కూడా సీఎం ఆదేశించినట్టు తెలిపాయి. -
సమాధానం చెప్పలేక ఉత్తర కుమార సవాళ్లా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో చర్చకు తాను సిద్ధమని.. సమయం, తేదీ, వేదిక లోకేష్ చెప్పినా సరే.. లేదా తనను చెప్పమన్నా రెడీ అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రతి సవాల్ విసిరారు. దీనిపై లోకేష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని.. ఈలోగా డీఎస్సీ స్కామ్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజల ఎదుట ఉంచిన అంశాలను మరోసారి గుర్తు చేస్తున్నామని.. ముందు వాటికి జవాబు చెప్పాలని సూచించారు. ‘లోకేశ్..! సరుకు లేక సవాళ్లు విసరడం ఏమిటి? వైఎస్ జగన్ ప్రెస్మీట్ విన్నావా అసలు? నువ్వుగానీ, మీ నాన్న గానీ వాటికి సమాధానం చెప్పాలని అడిగారు. వినలేదా? లేక విని కూడా వినపడనట్లు నటిస్తున్నారా? అని ఈ రాష్ట్రంలో యువత అడుగుతోంది.. తల్లిదండ్రులు అడుగుతున్నారు.. ప్రజలు అడుగుతున్నారు.. జగన్ ప్రశ్నలకు జవాబు చెబుతారని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ప్రతి నిరుద్యోగి నీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు. వైఎస్ జగన్ సూటిగా, స్పెసిఫిక్గా ప్రశ్నలు అడిగారు. వాటికి నేరుగా జవాబు చెప్పే ధైర్యం లేక 200 మీటర్ల దూరంలో నీ ఇల్లు ఉంది అని సవాల్ విసురుతావా? మీ నాన్న సవాల్ విసిరితే ఏదైనా అర్ధం ఉంటుంది. మెగా డీఎస్సీ స్కామ్పై అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? దీన్ని బట్టి తప్పు జరిగిందని అర్థమవుతోంది. అది నీకు కూడా తెలుసు. దాన్ని డైవర్ట్ చేయటానికే సవాల్ అంటూ కొత్త నాటకానికి తెర తీశారు. అయినా నువ్వు అడుగుతున్నావ్ కాబట్టి.. ఆ దగా పడ్డ డీఎస్సీ అభ్యర్థులతోనే కలసి వస్తా. వాటికి సమాధానం చెప్పు.. మనిద్దరం మంత్రులుగా చేశాం కాబట్టి సమ ఉజ్జీలం.. నీ స్థాయికి నేను చాలు.. అయినా నీకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా. అందుకే ఆ ప్రశ్నలన్నీ మళ్లీ నిన్ను అడుగుతున్నా. నీకు గుర్తుండేలా ఈసారి అన్ని పత్రికల్లో ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టి ప్రచురించమని కోరుతున్నా. పార్టిసిపెంట్కు ఉద్యోగం ఇచ్చేసి.. గోల్డ్మెడల్ సాధించిన వారికి పోస్టు ఎందుకు ఇవ్వరని గోల్డ్మెడల్ విజేత, డీఎస్సీ అభ్యర్థి దుర్గయ్య అడిగిన ప్రశ్నకు నీ దగ్గర జవాబేది లోకేశ్? ముందు దుర్గయ్య ప్రశ్నకు జవాబు చెప్పు. తరువాత నేను వస్తా.. ’అని పేర్ని నాని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ స్కామ్పై చర్చ విషయంలో లోకేష్ చేస్తున్న సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని వ్యాఖ్యానించారు. డీఎస్సీ స్కామ్ను బయటపెట్టి చాలా రోజులు అయ్యిందని, స్కామ్ జరిగిన తీరును ఆధారాలతో సహా బయటపెట్టామని, ప్రతి అంశాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారని గుర్తు చేశారు. సీబీఐ విచారణ కోరే ధైర్యం వారికి లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వివాదాస్పదమైన, అవినీతిమయమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదన్నారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నలకు జవాబేది లోకేశ్..?1. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు అప్పగించారు? ఎస్సీఈఆర్టీలో పనిచేసిన ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (నవీన్) ఈ పరీక్షల ప్రక్రియలో పాల్గొనలేదా? అదే వ్యక్తికి మెగా డీఎస్సీలో మొదటి ర్యాంకు, తెలుగు టీజీటీ పరీక్షలో జోనల్లో ఆరో ర్యాంకు రాలేదా? మరి మొదటి ర్యాంకు వచ్చిన నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? లాగిన్ ఐడీ ఎందుకు బ్లాక్ చేశారు? డేటా ఎందుకు తొలగించారు? అతడి వివరాలను మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు? సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు? అంటే పేపర్ లీకేజీ జరిగిందని మీరు ఒప్పుకున్నట్లే కదా? వెరిఫికేషన్కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని ఎలా సమర్థించుకుంటారు? అదే నిజమైతే అతడు ఎందుకు హైకోర్టుకు వెళ్లాడు?2. ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం స్పోర్ట్స్ కోటా. 2012లో జారీ చేసిన జీఓ నెం.74 ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా సంబంధిత ఎలిజిబిలిటీ పరీక్షలో తప్పకుండా అర్హత సాధించాలి. కానీ జీవో నెం:4, జీఓ నెం:47 ద్వారా ఆ నిబంధనను ఎందుకు మార్చేశారు? దీనికి వెనుక ఉన్న మతలబు ఏమిటి? అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఎలా ఇస్తారు? చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? పోనీ మీరు చేసింది కరెక్టే అనుకుంటే మళ్లీ ఈ నిబంధనను ఎత్తివేస్తూ జీవో నెం:23, జీఓ నెం:25, జీఓ నెం:56 ఎందుకు ఇచ్చారు? అంటే మీ వాళ్లకోసం గేట్లు ఎత్తారు. మీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం పూర్తికాగానే మళ్లీ గేట్లు మూసేశారు. ఇది స్కామ్ కాదా?3. సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు అధ్యక్షుడు మీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కాదా? జూడో అసోసియేషన్కు మీ ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్ గౌరవ అధ్యక్షుడు కాదా? స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లు ఇచ్చిందీ ఆ అసోసియేషన్లే.. అలాగే ధృవీకరించిందీ వాళ్లే కదా? అవునా? కాదా?4. క్రీడాకారులకే ఇవ్వాలనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారికి టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు? ప్రతిభ ఉన్న క్రీడాకారులకు కాకుండా కేవలం పార్టిసిపెంట్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?5. మెరిట్, ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు, ఏ కోటా కిందకు వస్తారు? వారి ర్యాంకులు ఏమిటి? అనే విషయాలన్నీ మీకు ముందుగానే తెలుసు కాబట్టి అన్నీ పరిశీలించాకే రూల్ నంబర్ 20 ప్రకారం వెరిఫికేషన్కు 1 : 1 పద్ధతిలో పిలిచారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్సర్వీస్ మెన్, జోన్.. ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. కానీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తరువాత, అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలాక కూడా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరిని డ్రాప్ చేశారు? ఎవరి కోసం ఆ సర్దుబాటు? ఇది దగా.. మోసం.. స్కామ్ కాదా?6. టీచర్ల పోస్టులు రూ.15 – 20 లక్షలకు అమ్ముకుంటూ బేరసారాలు జరిగిన ఓ వీడియో బయటకు వచ్చింది. దానికి సమాధానం ఏది? పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకొన్నారు? ఫోన్ నంబర్ తెలిసినా, సంబంధిత వ్యక్తి పేరు ప్రస్తావించకుండా విచారణను ఎందుకు నీరుగార్చారు?7. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకి, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్కు అప్పగించేవారు. గోప్యత, పారదర్శకత కోసం వేర్వేరు వ్యక్తులకు అప్పగించేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. డీఎస్సీ కన్వీనర్ను పక్కన పెట్టి ప్రశ్నాపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. దీనిపై సమాధానం ఏది?8. డీఎస్సీల చరిత్ర చూస్తే.. కలెక్టరేట్ వద్ద నోటీస్ బోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆ పద్ధతిని రద్దు చేసి కేవలం ఆన్లైన్ ప్రదర్శనకే ఎందుకు పరిమితం చేశారు? అందులో కూడా మార్పులు చేర్పులు ఎందుకు చేశారు?9. పీఈటీ ఉపాధ్యాయులకు డీఎస్సీ పరీక్షతోపాటు సంబంధిత డిగ్రీ నుంచి కూడా ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? ఎప్పుడూ లేని విధంగా ఐదేళ్లపాటు వెసులుబాటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?10. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను, జీవితాలను ప్రభుత్వం అత్యంత దారుణంగా, అమానుషంగా తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ కుంభకోణం లోతుగా పాతుకుపోయిన అవినీతి వ్యవహార మే కదా? మరి దీనికి బాధ్యత ఎవరిది? రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు మీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో నిజాలు బయటకు వస్తాయా? ఆ నిజాలన్నీ వెలికి తీయాలంటే సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం లేదా? డీఎస్సీ 2025లో టీజీటీ (తెలుగు) జోన్–2లో తనకు 6వ ర్యాంకు వచ్చినట్లు హైకోర్టుకు తెలిపిన నవీన్ -
సాయికృష్ణ కేసు.. కంటితుడుపు చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం
సాక్షి,కృష్ణ: విజయవాడలో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ కేసుపై కూటమి ప్రభుత్వం స్పందించింది. కంటితుడుపు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. సాయికృష్ణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. నెల రోజులుగా సాయి కృష్ణ మిస్సింగ్పై ప్రభుత్వం స్పందించలేదు.తాజాగా, సాయికృష్ణ కేసుపై చంద్రబాబు, పవన్ సమీక్ష నిర్వహించారు. -
ఏపీ బీచ్లలో మద్యం అమ్మకాలు.. ఎప్పటి నుంచంటే?
సాక్షి,విజయవాడ: ఏపీలో బీచ్ బార్ల పేరిట మందు బాబులతో భారీగా మద్యం తాగించాలని చంద్రబాబు సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. బీచ్లలో బార్లు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. బీచ్ షాక్స్ పేరుతో ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ 362 జీవో ఇచ్చింది.12 జిల్లాల్లో ఏపీటీడీసీ గుర్తించిన చోట్ల బీచ్ షాక్స్ ఏర్పాటుకు విధివిధానాల్ని రూపొందించింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఎంపిక చేసిన బీచ్లలో ఏర్పాటు కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్టు వరకు బీచ్ షాక్స్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద సూర్యలంక, విశాఖ బీచ్లలో ఏర్పాటుకు ప్రతిపాదన తెచ్చింది.బీచ్లలో మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తుంటే.. ‘విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి..? అంటూ బాలకృష్ణ అల్లుడు, టీడీపీ విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ అందుబాటులోకి తేవడంలో నాకెలాంటి తప్పు కనిపించడం లేదు. ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు? అందరూ తాగుతున్నారు కదా.. ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేదంటున్నారే.. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో మహిళలకు భద్రత, రక్షణ ఉందా..? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు ఎక్కువవుతున్నాయని, అందుకనే వాటిని తొలగిస్తున్నట్టు చెప్పారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్తో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవా తరహాలో విశాఖ బీచ్లో ‘బీచ్ షాక్స్’ పేరిట మద్యం పాలసీ తీసుకొస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన వెల్లడించారు. -
ఉతికారేసిన లక్ష్మి పార్వతి, దమ్ముంటే రా...
-
బాబూ, పవన్ మాటల్లో హరితాంధ్ర.. చేతల్లో విధ్వంసాంధ్ర!
రాష్ట్రంలో ఏభై శాతం పచ్చదనమే లక్ష్యం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల క్రితం చేసిన ప్రకటన ఇది. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ సందేశం.. ఇవి వినడానికి ఎంత బాగున్నాయి.. నిజంగానే వీరిద్దరూ అదే లక్ష్యంతో పనిచేస్తుంటే అభినందించవచ్చు. కానీ జరుగుతున్నదేమిటి?. ఏపీలో ఈ మధ్య కాలంలో జరిగినంత పర్యావరణ విధ్వంసం మరెన్నడూ జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు.ఒకవైపు విశాఖలో కొండలను పిండి చేసేస్తున్నారు. ఇంకో వైపు డేటా సెంటర్ల పేరుతో విపరీతమైన కాలుష్యానికి కారకులయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమరావతి రాజధాని పేరుతో వేల ఎకరాలలోని పచ్చటి భూములను ఎండబెట్టారు. కృష్ణానది తీరంలోనే నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం అయిన భవనాలలోనే ముఖ్యమంత్రి, కీలక మంత్రి నివసిస్తారు. అయినా పర్యావరణ దినోత్సవం నాడు మాత్రం గొప్పగా ఉపన్యాసాలు ఇస్తుంటారు. తద్వారా ఇది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని ఒకటికి పదిసార్లు రుజువు చేసుకుంటున్నారని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అమరావతిలో కానీ, ఇప్పుడు విశాఖలో కాని ఎండలు తగ్గించాలని అధికారులను ఆదేశిస్తే వేడి తగ్గిపోతుందా? ఒక నాలుగు కిలోమీటర్ల దూరం ముఖ్యమంత్రి బ్యాటరీ సైకిల్ తొక్కి ఫొటోలకు పోజులు ఇస్తే పర్యావరణాన్ని కాపాడినట్లు అయిపోతుందా?.అవసరమైన మేర భూమి తీసుకుని కావల్సిన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి, వేల ఎకరాల పచ్చటి పొలాలను సమీకరించి, వేల కోట్లను ఓ 30 గ్రామాల పరిధిలో వెచ్చిస్తే ఏపీ ప్రజలందరికీ ఎలా ఉపయోగం జరుగుతుందో తెలియదు. అమరావతి గ్రామాలలో భూమి స్వభావం భారీ భవంతుల నిర్మాణానికి అనువుకాదని పలువురు నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు అనుసరించవలసిన పలు షరతులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించినా వాటిని గాలికి వదలివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అందులో అమరావతిలో జరుగుతున్న పర్యావరణ వినాశనం గురించి పవన్ గట్టిగా మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్నది తప్పు అని స్పష్టంగా చెప్పారు. అవసరమైతే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని కూడా ఆయన ఆనాడు హెచ్చరించారు.2024 నాటికి ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. వెంటనే ఆయన వైఖరి కూడా మారిపోయింది. ఇప్పుడు అమరావతిలో పర్యావరణ విధ్వంసాన్ని సమర్థిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు కృష్ణా తీరం వెంబడి ఉన్న కరకట్ట ఇంటిలో ఉండడాన్ని కూడా పవన్ ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక ఆ ఇంటిని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చిన లింగమనేని రమేష్ను జనసేన పక్షాన రాజ్యసభకు పంపారు. ఈయన చంద్రబాబును మించి అవకాశవాదం ప్రదర్శిస్తున్నట్లుగా అనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ రిషికొండపై అప్పటికే ఉన్న టూరిజం నిర్మాణాలను తొలగించి ప్రతిష్టాత్మకమైన రీతిలో కొత్త భవనాలను నిర్మిస్తే అది పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని, కొండకు గుండు కొడతారా అంటూ దుర్మార్గంగా చంద్రబాబు, పవన్ విమర్శించేవారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అయితే శరభ, శరభ అంటూ పూనకం వచ్చినట్లు వార్తలు ఇచ్చేది. ఇప్పుడు మొత్తం ప్లేట్ ఫిరాయించారు. గూగుల్ అదానీ డేటా సెంటర్ పేరుతో వందల ఎకరాల కొండలను ఇచ్చేశారు. వాటిని ఆ సంస్థలు తవ్విపారేస్తున్నా కిక్కురునడం లేదు. ఇప్పుడు సింహాచలం కొండలకు గుండు కొట్టినా అది సుందరమేనని వీరు భావిస్తున్నారు. డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాలు డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల కలిగే కాలుష్యం, నీటి సమస్య, కరెంటు సమస్య వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని వ్యతిరేకిస్తున్నాయి. దానితో ఆ బహుళజాతి సంస్థలు అభివృద్ది చెందని, అభివృద్ది చెందుతున్న భారత్ వంటి దేశాలపై దృష్టి పెట్టాయని అమెరికాకు చెందిన ఒక మీడియా ఓ కథనాన్ని ఇచ్చింది. డేటా సెంటర్లు రావడం వల్ల ఏపీకి ప్రయోజనం అయితే స్వాగతించవచ్చు. కానీ వాటివల్ల ఎక్కువగా పర్యావరణ అనర్థం జరుగుతుంటే, దానికి ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే విశాఖకు తీరని నష్టం జరుగుతుందన్న భావన ఉంది. దానిపై ప్రజలలో కూడా అలజడి ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డేటా సెంటర్ల వల్ల వచ్చే సమస్యలను ఆలోచించకుండా, కేవలం రాజకీయ కోణంలోనే మాట్లాడితే ఏపీకి ముఖ్యంగా విశాఖకు ఏం ప్రయోజనం కలుగుతుంది?. పైగా ఆ కంపెనీలకు వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ దీనిపై అభ్యంతరం చెబుతూ ఇప్పటికే చంద్రబాబుకు లేఖ రాశారు. రిలయన్స్ సంస్థ ప్రతిపాదిస్తున్న డేటా సెంటర్కు ఏభై వేల కోట్లు రాయితీలు ఇస్తున్నారని, అయినా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అడగడం లేదని ఆయన అన్నారు. వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయో, రావో తెలియని గూగుల్ డేటా సెంటర్కు 22వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారు. మరో పర్యావరణవేత్త బొలిశెట్టి సత్య విశాఖ కొండలను తొలిచివేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. కొండపై జగన్ నిర్మాణం చేస్తే విధ్వంసం, కూటమి ప్రభుత్వం చేస్తే అభివృద్ది అవుతుందా? అని ప్రశ్నించారు.ఇక సముద్ర తీరంలో నిర్మాణాల నిమిత్తం సీఆర్జడ్ నిబంధనల మార్పునకు సూచనలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడంపై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు విశాఖ బీచ్లో మద్యం పాకలను అనుమతించడంపై కూడా జనం మండిపడుతున్నారు. అమరారాజా బ్యాటరీస్ సంస్థ నుంచి వెలువడే కాలుష్యాన్ని సరిచేసుకోవాలని జగన్ ప్రభుత్వం నోటీసు ఇస్తే, పరిశ్రమను తరిమేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన ఘనత టీడీపీది, ఎల్లో మీడియాదే. ఇప్పుడేమో కాలుష్యంపై మరో రకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక విశిష్టత ఉంది. ఆయన సందర్భాన్ని బట్టి అభిప్రాయాలను మార్చేసుకుంటారు. కొద్ది కాలం క్రితం సమీక్షలో అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఇతర శాఖల ప్రతిపాదనలకు గాను అడవులలో చెట్టు నరకడానికి, నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన కోప్పడ్డారు. పర్యావరణ దినోత్సవం నాడు మాత్రం ఏభై శాతం పచ్చదనమే లక్ష్యమని గంభీర ప్రకటనలు చేశారు.ఏపీలో కాలుష్య సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది ఈ మద్య పవన్ రాజమండ్రి సందర్శన సందర్భంగా మరోసారి బయటపడింది. పేపర్ మిల్లు వ్యర్ధ జలాలపై తనకు ఎదురైన సమస్యను మంత్రి దుర్గేష్ వివరించగా, ఆయనపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసి, ఆ పరిశ్రమ వారు తనతో మాట్లాడాలని అన్నారట. రాబోయే గోదావరి పుష్కరాలలో కెమికల్ స్నానాలు చేస్తారా అని కూడా పవన్ సీరియస్గా ప్రశ్నించారు. దీనిని బట్టే గోదావరిలో ఏ మేరకు కాలుష్యం ఉందో అర్దం చేసుకోవచ్చు. ఏడాదిలోగా దీని నివారణకు ఏ మేరకు చర్యలు తీసుకుంటారన్నదానిపై ఆయనే సందేహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరిలో నదీ కాలుష్యం తీరుతెన్నులను కూడా ప్రస్తావించారు. చిత్తశుద్దితో ఆయన కాలుష్య నివారణకు ప్రయత్నిస్తే మంచిదే. కానీ, ఏదో సినిమాటిక్గా డైలాగులు చెప్పి ఊరుకుంటే ఉపయోగం ఉండదు. గ్రామాలలో చెత్త లేకుండా చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పినా, పరిస్థితి పెద్దగా మారినట్లు కనబడదు. ఏది ఏమైనా పర్యావరణ పరిరక్షణను ఒక నినాదంగా మార్చేసి తాము చేయవలసిన విధ్వంసం యథావిధిగా కొనసాగిస్తే ఏపీకి తీరని నష్టం చేసినవారు అవుతారేమోనన్న విషయాన్ని కూటమి పాలకులు ఆలోచించుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నడిరోడ్డుపై ఉరితీయాలి..! ఛీ... గెలవడం కోసం ఇంత దిగజారుతావా..?
-
నీకు జూలై 1 వరకే టైం.. తర్వాత అసలైన సినిమా చూస్తావ్ బాబుకు జగన్ వార్నింగ్
-
ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని భారతదేశంలో నిలిపివేయడానికి ఏ ప్రభుత్వ అధికారి ఉత్తర్వులిచ్చారు?, ఏ నిర్దిష్ట కంటెంట్ ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు?అనే పూర్తి వివరాలను, నోటీసుల అసలు ప్రతులను వెంటనే తమకు అందజేసేలా మెటాను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద ఏదైనా ఖాతాదారుడి కంటెంట్ను తొలగించినప్పుడు, ప్రభుత్వ నోటీసు నకలును సదరు ఖాతాదారుడికి అందించాల్సిన బాధ్యత సంబంధిత సోషల్ మీడియా సంస్థ అయిన మెటాపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేసే విషయంలో మెటా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపారు. ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడానికి గల కారణాలను తెలియజేయకపోవడం, అందుకు సంబంధించిన నోటీసు కాపీని ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని ఆయన హైకోర్టును అభ్యరి్థంచారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు, సదరు బ్లాకింగ్కు దారితీసిన ప్రభుత్వ నోటీసులు, కమ్యూనికేషన్ల కాపీలను తక్షణమే పిటిషనర్లకు సమర్పించేలా మెటా సంస్థను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ‘మెటా అధికార పార్టీకి సహకరిస్తోంది’ ‘శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రభుత్వ నోటీసులను సాకుగా చూపి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ బ్లాకింగ్ ప్రభుత్వ ‘సహయోగ్ పోర్టల్’ ద్వారా జరిగిందని భావిస్తున్నారు. అయితే, నోటీసు ఇచ్చిన సంస్థ అసలు చట్టబద్ధంగా నోటిఫై చేయబడిన సంస్థేనా కాదా అనే వివరాలు దాచారు. ఐటీ బ్లాకింగ్ రూల్స్–2009లోని రూల్ 16 ప్రకారం కొన్ని విషయాలు రహస్యంగా ఉంచవచ్చు. కానీ అది సెక్షన్ 69ఏ కింద చేసే బ్లాకింగ్కు మాత్రమే వర్తిస్తుంది. సెక్షన్ 79(3)(బీ) కింద మెటా తీసుకునే చర్యలకు ఈ రహస్య నిబంధన వర్తించదు. తటస్థ వేదికగా ఉండాల్సిన మెటా, అధికార పక్షం చెప్పినట్లు వింటూ ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కడానికి సహకరిస్తోంది. తద్వారా అది తన తటస్థతను కోల్పోయింది’ అని వివరించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిజిగ్నేటెడ్ ఆఫీసర్, మెటా ప్లాట్ఫామ్ ఇంక్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘మా భావ ప్రకటన స్వేచ్ఛ హరించడమే’ ‘2026 జూన్ 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని భారతదేశంలో ఎవరికీ కనిపించకుండా మెటా సంస్థ నిలిపివేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద భారత ప్రభుత్వం, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి వచ్చిన నోటీసు ఆధారంగా ఈ పేజీని నిలిపివేసినట్టు మెటా పేర్కొంది. అయితే, ఏ అధికారి లేదా ఏ శాఖ నోటీసు ఇచ్చిందో మెటా స్పష్టం చేయలేదు. ఎటువంటి ముందస్తు నోటీసు లేదా సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేశారు. రాజకీయ పార్టీగా ప్రజలతో, లక్షలాది మంది ఫాలోవర్లతో కమ్యూనికేట్ చేయడం మా పార్టీ ప్రాథమిక హక్కు. మా పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం రాజ్యాంగం మాకు ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. ఏదైనా నిర్దిష్ట పోస్ట్, వీడియో లేదా ఇమేజ్ చట్టవిరుద్ధంగా ఉంటే దాన్ని తొలగించవచ్చు. కానీ, కేవలం ఒక అస్పష్టమైన నోటీసుతో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన మొత్తం ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం చట్టపరిధిని మించిన చర్య’ అని అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. -
అప్పులే అప్పులు.. సర్కారు గొప్పలు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే భారీగా అప్పులు చేస్తోంది. ఫలితంగా రాష్ట్ర అప్పుల చిట్టా రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రతి నెలా అప్పులతో పాటు చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్లతోనే పాలన కొనసాగుతోంది. అప్పు చేయకుండా రోజు గడవడం లేదని, రోజువారీ ఖర్చులకు అప్పులు చేస్తున్నారని, ఏడాదిలో 357 రోజులు చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్లేనని కాగ్ కూడా ఎత్తి చూపింది. అయినా సరే చంద్రబాబు సర్కారు అప్పులు చేయడంలో వేగంగా దూసుకుపోతోంది తప్ప వెనకడుగు వేయడం లేదు. మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.4,600 కోట్ల అప్పును ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల.. కేవలం రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా రూ.3,51,695 కోట్లకు చేరాయి. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కుతుంది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలు ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా అప్పులు చేయలేదు. ఒక పక్క అప్పులు భారీగా.. వేగంగా పెరిగిపోతుండగా, మరో పక్క రాష్ట్ర రాబడులు తగ్గిపోతున్నాయి. ఇంత అప్పు చేసినా అభివృద్ధి లేదు. సంక్షేమ కార్యక్రమాల అమలు లేదు. అప్పులతో కొత్తగా ఆస్తులు సృష్టించకపోగా, ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిందంటూ ఒక పక్క చంద్రబాబు గొప్పలు చెబుతుండగా, అందుకు తగినట్లు రాష్ట్ర రాబడులు పెరగనందున బాబు గొప్పలన్నీ అబద్ధాలని తేలిపోతోంది. చేసిన అప్పులను సంక్షేమ పథకాల అమలుకు గానీ, ప్రభుత్వ రంగంలో వైద్య, విద్యా మౌలిక సదుపాయాల కల్పనకు గానీ వెచ్చించకుండా రెవెన్యూ వ్యయాలకు మళ్లించేస్తోంది. దీంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించక పోవడంతో ప్రస్తుతమే కాకుండా భవిష్యత్ అభివృద్ధిని సైతం శూన్యం చేశారని కాగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేంద్ర నిబంధనలు, ఎఫ్ఆర్బీఎం నిబంధనలను తుంగలో తొక్కి.. దొరికిన చోటల్లా అప్పులు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోంది. మద్యం ఆదాయంతో పాటు, గనులను తాకట్టు పెట్టి, బడ్టెట్ బయట చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది. కొత్తగా ఆస్తులు, సంపద సృష్టి లేకపోగా, ఉన్న ఆస్తులు సైతం ప్రైవేట్ పరం చేస్తుండటం గమనార్హం. -
ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై నియోజకవర్గాల్లోని కో–ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలని, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని, సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. సర్ ప్రక్రియపై చర్చిస్తూ.. ఈ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత, దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, తన అధికార దుర్వినియోగంతో ఏదో రకంగా వైఎస్సార్సీపీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బూత్కు కనీసంగా 50 ఓట్లు తొలగించాలని చూస్తున్నారని ఎత్తిచూపారు. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు దీన్ని అడ్డుకోవాలని, ప్రతి ఓటునూ కాపాడుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని పార్టీ నేతలను ఆదేశించారు. -
‘అసలు సమస్యలు పక్కనపెట్టి ‘కూటమి’ డైవర్షన్ డ్రామా’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళల భద్రత, చిన్నారుల అదృశ్య ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు, పెరుగుతున్న అప్పులు, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు వంటి అసలు సమస్యలపై సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ కొత్త వివాదాలకు తెరలేపారని ఆక్షేపించారు.రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై చర్చ జరగకుండా దృష్టి మళ్లించడమే ఈ రాజకీయ రచ్చ వెనుక ఉద్దేశమని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రెస్మీట్లో వీరశేఖర్రెడ్డి ఏమన్నారంటే..అప్పుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డుఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేశారు. కేవలం జూన్ నెల తొలి 15 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. మరోవైపు కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైయస్ జగన్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లి, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, మెడికల్ కాలేజీలు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించింది.ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సూడాన్, సోమాలియా వంటి నిరుపేద దేశాల కంటే దారుణంగా తయారైంది. ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోంది. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందడం లేదు. చేయూత, చేదోడు వంటి సంక్షేమ పథకాలు అటకెక్కాయి. రైతులకు మద్దతు ధర లేదు.. రైతు భరోసా లేదు.రాష్ట్ర ఆదాయం ఆవిరివైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో తలసరి ఆదాయం, జీఎస్డీపీ, జీఎస్టీఎన్ వసూళ్లు, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్ధి, సేవారంగ వృద్ధి గణనీయంగా పెరిగాయి. కానీ నేడు ఆ ప్రగతి కనిపించడం లేదు. సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, రాష్ట్ర సంపదనే ఆవిరి చేస్తున్నారు. క్వార్ట్జ్, మట్టి, ఇసుక, మద్యం, సిలికా, భూములు అన్నింటినీ టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు దారి మళ్లిపోవడంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది.మద్యం ఏరులై పారుతున్నా రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోపిడీ చేస్తున్నారు. కూటమి పాలనలోనే రాష్ట్రం దివాళా దిశగా వెళ్తోందని కాగ్ లెక్కలే చెబుతున్నాయి. సంక్షేమ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఈ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్న నిరంకుశ ధోరణితో పాలన సాగుతోంది.గాడితప్పిన శాంతి భద్రతలురాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో హోంమంత్రి అనిత అసెంబ్లీలో ఇచ్చిన సమాధానమే చెబుతోంది. గంటకు ముగ్గురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె స్వయంగా వెల్లడించారు. ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు వారం రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. విజయవాడలో సాయికృష్ణ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రాప్తాడులో మైనర్ బాలికపై అత్యాచారం, గుంటూరులో టీడీపీ నేతల ఆగడాలు, మహిళలపై వేధింపుల ఘటనలపై మౌనం పాటిస్తున్న ప్రభుత్వం.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను మాత్రం రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తోంది.'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యా?రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, బడుగు బలహీన వర్గాల భద్రత కంటే హోంమంత్రిపై చేసిన 'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యగా చూపించడం దురదృష్టకరం. టీడీపీ, జనసేన నేతలు గతంలో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మరిచి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. నా కూతురు ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ రచ్చ చేయడం మానుకోవాలి. ఈ కీచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే తగిన తీర్పు ఇస్తారు అని వీరశేఖర్రెడ్డి హెచ్చరించారు. -
‘శాంతి భద్రతల వైఫల్యంపై హోం మంత్రి పచ్చి అబద్ధాలు’
సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఖాకీ దుస్తులను ఎల్లో యూనిఫామ్గా మార్చేశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నిత్యం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. క్రైమ్ రేట్ తగ్గిందంటూ హోంమంత్రి అనిత అధికారుల సమక్షంలో పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తేల్చి చెప్పారు. చట్టాల అమల్లో ఏపీ దేశంలోనే 36వ స్థానానికి పడిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత చీవాట్లు తిన్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ హోంమంత్రి తన సంస్కారహీన భాషను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, లైంగిక వేధింపుల నిందితుడు ఆదిమూలం, గర్భస్రావానికి కారణమైన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు చేయడానికి పోలీసులను వాడుకుంటున్నారు. పోలీసుల ఖాకీ దుస్తులను 'ఎల్లో యూనిఫామ్'గా మార్చిన ఘనత చంద్రబాబుదే. ఐపీఎస్ (IPS) కాస్తా కూటమి పాలనలో 'ఇండియన్ పొలిటికల్ పనిష్మెంట్ సర్వీస్' గా.. ఏపీపీఎస్ (APPS) కాస్తా 'ఏపీ పొలిటికల్ రివేంజ్ సర్వీస్' గా మారిపోయాయి.దేశవ్యాప్తంగా కేంద్రం తెచ్చిన 'బీఎన్ఎస్' చట్టాలను ప్రజల కోసం వాడుతుంటే, ఏపీలో మాత్రం వాటిని నిర్వీర్యం చేసి 'బాబు రాజకీయ న్యాయసంహిత చట్టాలు' గా మార్చివేశారు. పోలీసు బెల్టుపై ఉండే మూడు సింహాలు న్యాయం, చట్టం, నీతికి ప్రతీకలు. కానీ నేడు ఆ మూడు సింహాలను మూడు కూటమి పార్టీలకు తొత్తులుగా, కీలుబొమ్మలుగా మార్చేశారు.కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు.. పోలీసుల పక్షపాతంసాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా హోం శాఖ చేష్టలుడిగి చూస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు నడిబొడ్డున పోలీసుల ముందే టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఇంటిపై జేసీబీతో హత్యాయత్నానికి దిగితే.. దౌర్జన్యకారుడిని వదిలేసి బాధితుడిపైనే పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గం. గతంలో ఎమ్మెల్యే గల్లా మాధవి .. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై పోలీసుల ముందే దాడి చేసి, ఆస్తులు తగలబెడితే.. తిరిగి అంబటి రాంబాబుపైనే కేసులు పెట్టారు తప్ప ఎమ్మెల్యే దంపతులపై చర్యలు లేవు.మరో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఇల్లు తగలబెట్టారు. ఈ చర్యలు చూస్తుంటే పోలీసులు అరాచక శక్తులకు అండగా ఉంటున్నారనేది స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పోలీసులకు డీఏ, వీక్లీ ఆఫ్, ఐఆర్, పీఆర్సీ, సరండర్ లీవ్స్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ ఎగ్గొట్టి పోలీసులకే వెన్నుపోటు పొడిచారు.కేంద్ర హోంమంత్రి చీవాట్లు.. దేశంలోనే ఏపీ పోలీస్ ఆఖరి ర్యాంక్హోంమంత్రి అనిత, రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు వైఫల్యాలు జాతీయ స్థాయిలో బయటపడ్డాయి. ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీవాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా? దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కాల్ సెంటర్ (112) రెస్పాండ్ టైమ్ 18 నిమిషాలు ఉంటే, ఏపీలో అది 26 నిమిషాలు ఎందుకుంది? ప్రజలు రక్షించమని ఫోన్ చేస్తే 26 నిమిషాల దాకా పట్టించుకోని వ్యవస్థను పెట్టుకుని హోంమంత్రి అవార్డులు వచ్చాయని ఎలా చెప్పుకుంటారు? కొత్త చట్టాలైన బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ అమల్లో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏపీకి 36వ (చిట్టచివరి) ర్యాంకు వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు.ప్రభుత్వ సర్వేలోనే అట్టడుగు:కూటమి ప్రభుత్వం స్వయంగా చేసిన ఐవీఆర్ఎస్ (IVRS) సర్వేలోనే రాష్ట్రంలోని 21 జిల్లాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. అందుకే ఈ రాష్ట్రంలో 'HM' అంటే హోం మంత్రి కాదు.. 'హెరాస్ మెంట్ మంత్రి' (Harassment Minister) లేదా హెడ్ స్ట్రాంగ్ మంత్రి' అని పిలుస్తున్నారు.ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పలేక హోంమంత్రి అనిత వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమన్నారు. ఒక మాజీ మంత్రిని పట్టుకుని ‘వాడు, వీడు, ఎవడు వీడు’ అంటూ నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో తూలనాడటం ఆమె సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. "గతంలో ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత గారు.. ఆరోజు పిల్లలకు నేర్పించిన సంస్కారం ఇదేనా?"గతంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ని ఏకవచనంతో పిలవడం, టీడీపీ ఆఫీసు వేదికగా గౌరవనీయులైన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలపై అత్యంత హేయమైన పదజాలం వాడటం అనితకే చెల్లింది. మేము కూడా అదే భాషలో మాట్లాడగలం, కానీ వైఎస్సార్సీపీ సంస్కారం తమకు అడ్డువస్తోంది. ఎవరినైనా నోటికొచ్చినట్లు తిట్టి.. ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే 'మహిళా ట్యాగ్'ను తెరపైకి తెచ్చి రాజకీయం చేయడం అనితకు అలవాటుగా మారింది, ఆమె ప్రవర్తన చూసి టీడీపీలోని మహిళలే అసహ్యించుకుంటున్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు..మహిళా హోంమంత్రిగా ఉండి కూడా రాష్ట్రంలో మహిళల రక్షణను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రంలో రోజుకు కనీసం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ముగ్గురు-నలుగురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో 10 రోజుల క్రితం చిన్నపాప కనిపించకుండా పోతే ఆ తల్లి బాధను పట్టించుకున్న నాథుడే లేడు. ఎలమంచిలి రాంబల్లిలో మైనర్ బాలిక గొంతు కోసి చంపేస్తే ఆ కుటుంబానికి బాధ్యత గల హోంమంత్రి ఎందుకు ధైర్యం చెప్పలేదు? కాపు యువకుడిని లాకప్ డెత్ చేస్తే సదరు సీఐ, పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? గంజాయిని నిర్మూలించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గంజాయి డాన్ సోహైల్ పోలీసుల నుంచే తప్పించుకున్నాడు. నిందితుడి గురించి మీడియా అడిగితే హోంమంత్రి తెల్లమొహం వేసుకుని అధికారుల వైపు చూడటం ఆమె అసమర్థతకు నిదర్శనం.పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలకు సూటి ప్రశ్నలుహోంమంత్రికి మద్దతుగా మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి పీతల సుజాత, ఎంపీ బైరెడ్డి శబరిలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. హోంమంత్రి అనిత అత్యంత అసభ్యంగా, రెచ్చిపోయి ప్రతిపక్షాల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఆమెకు ఎందుకు గడ్డిపెట్టలేదు? ఒక ముఖ్యమంత్రి తల్లిని, భార్యని అత్యంత నీచమైన పదజాలం వాడినప్పుడు ఆమెతో ఎందుకు క్షమాపణ చెప్పించలేదు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మీరు తప్పు చేసి మా పార్టీ మీద తిరిగి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలు ఇవన్నీ గమనించరు అని మీరు అనుకుంటున్నారా? మీ పార్టీ నేత బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు. మీకు బాధ్యత లేదా? ఇక డిప్యూటీ సీఎం ట్వీట్ చేస్తూ హోంమంత్రి గారి మీద వ్యాఖ్యలపై స్పందించారు. సభ్యత, సంస్కారం గురించి మాట్లాడుతున్న మీరు మీ తల్లిని తిట్టిని టీడీపీ నేతలకు సభ్యత, సంస్కారం నేర్పించరా?ఆ రోజు బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ను హోటల్లో కలిస్తే.. పవన్ తనను అభినందించారని బండారు స్వయంగా చెప్పుకున్నారు. తోటి కళాకారిణిపై అంత అసహ్యంగా మాట్లాడితే మెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ సంస్కారమా? ప్రతిపక్ష మహిళలపై దాడులు జరిగినప్పుడు మీ సంస్కారం ఎక్కడికి పోయింది. ఒక మహిళకు నలుగురైదుగురు సార్లు అబార్షన్ చేయించిన మీ కూటమి ఎమ్మెల్యేపై కనీస చర్యలు ఎందుకు తీసుకోలేదు? సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా తిడుతూ పోస్టులు పెట్టే సంస్థ 'ఐటీడీపీ' (iTDP) మీ ఆఫీస్ నుంచే నడుస్తోంది కదా.. దానికి సభ్యత నేర్పరా?సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ "ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి" అని అసహ్యంగా మాట్లాడితే.. చంద్రబాబు నాయుడు "కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా" అని ఆడబిడ్డ పుట్టుకను అవమానిస్తే.. వారికి పవన్ కళ్యాణ్ సభ్యత, సంస్కారం నేర్పించరా? కూటమిలోని మహిళలకు ఒక న్యాయం, ఎదుటి పార్టీ మహిళలకు మరొక న్యాయమా? ఒక్క మాట పొరపాటుగా మాట్లాడితే మా సీఎం మందలిస్తారని హోంమంత్రి చెబుతున్నారు... మరి విజయమ్మ, భారతమ్మలను దూషించినప్పుడు చంద్రబాబు ఎందుకు మందలించలేదు?.లీగల్ సెల్ నేత ఇంటిపై జేసీబీతో దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తక్షణమే అరెస్ట్ చేయాలి. కాపు యువకుడిని లాకప్ డెత్ చేసిన పోలీస్ అధికారి (CI)ని వెంటనే అరెస్ట్ చేయాలి. మహిళలను లైంగికంగా వేధించిన కూటమి నేత ఆదిమూలం, మహిళను వేధించి గర్భస్రావం చేయించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను వెంటనే జైలుకు పంపాలి. మహిళా వీఆర్వోను వేధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, మహిళను వేధించిన సంధ్యారాణి పీఏలను తక్షణమే అరెస్ట్ చేయాలి.హోంమంత్రి అనిత ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి శాంతిభద్రతల అమలుపై, మహిళా రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో పాలనలో విఫలమైన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విఫల హోంమంత్రిగా అనిత చరిత్రలో మిగిలిపోతారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు. -
‘ప్రజల ప్రాణాలంటే బాబు సర్కార్కు లెక్కే లేదు’
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో 16 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఘటనపై ప్రభుత్వ స్పందన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కల్తీ పాల ఘటనపై ఇప్పటివరకు పూర్తి నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మార్గాని భరత్ విమర్శించారు. ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా?రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధితులను కలవలేదు. ఇదే ఘటనలో చికిత్స పొందుతున్న చిన్నారి రుహానియా పూర్తిగా కోలుకోలేదు. మొదట పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన అధికారులు తర్వాత డిశ్చార్జ్ చేయాలని ఒత్తిడి చేయడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కల్తీ పాల ఘటనపై ఇప్పటికీ పూర్తి నివేదిక కూడా ఇవ్వలేదు.ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలిమీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా చంద్రబాబు? గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 26 మంది చనిపోతే అది భక్తుల అత్యుత్సాహం వల్లే అని నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి ప్రజలపై నెపం మోపారు. మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్లో పిరియాడిక్ చెకప్ జరగాలని వైయస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. కల్తీ పాల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇచ్చిన రూ.10 లక్షల పరిహారం తక్కువ, వెంటనే దాన్ని రూ.20 లక్షలకు పెంచాలి. భవిష్యత్తులో చికిత్స ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. ఈ ఘటనలో బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం” అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు: రితిక్ తండ్రి లవ్రాజుకల్తీ పాలు తాగి మా బాబు రితిక్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. మొదటి మూడు రోజులు కలెక్టర్, అధికారులు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత మా బాబును ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించమని స్థానిక ఎమ్మెల్యేను కలిస్తే కలెక్టర్ను కలవమన్నారు. ఎవరూ మాకు న్యాయం చేయలేదు. ఎవరూ పట్టించుకోలేదు.ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి: రుహానియా తండ్రి రాకేష్ఫిబ్రవరి 16వ తేదీన మా పాప కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైంది. 17వ తేదీన ఆసుపత్రిలో చేర్పించాం. రెండు ఆసుపత్రుల్లో కలిపి మాకు రూ.3.50 లక్షల వరకు ఖర్చు అయింది. తర్వాత రాజమండ్రి రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేర్పించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చికిత్స జరుగుతోంది. మా పాప కిడ్నీ ట్యూబ్స్ ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు. కానీ పాపను డిశ్చార్జ్ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అధికారులను కలిస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగు నెలలుగా డాక్టర్లు కృషి చేసి మా పాపను బతికించారు. ప్రభుత్వం మొదట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలి. ఇవాళ మాజీ ఎంపీ మార్గాని భరత్ ద్వారా వైఎస్ జగన్ను కలిశాం. ఆయన మాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు” అని రాకేష్ తెలిపారు. -
‘సర్’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పార్టీ సీనియర్ నాయకులతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ‘సర్’ జరుగుతున్న తీరు, అక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ఈ నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు రోజూ సమీక్ష చేయాలన్న వైఎస్ జగన్.. ఏదో రకంగా వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు.‘‘అధికార దుర్వినియోగంతో ఓట్లు తీసివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి బూత్కు 50 వైయస్సార్సీపీ ఓట్లు తీసేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు దీన్ని అడ్డుకోవాలి. ప్రతి ఓటునూ కాపాడుకోవాలి. ‘సర్’పై నియోజకవర్గాల్లోని కో-ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి. ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయలి..అప్పటికీ సమస్య పరిష్కారంకాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు రావాలి. సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దు. సర్ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుంది. ప్రతి నియోకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత అవసరం. నిరంతరం సమీక్షలు నిర్వహించాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు?: గడికోట శ్రీకాంత్ రెడ్డి
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో సాధించింది ఏమీ లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు.‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. ఎమ్మెల్యేలే జనం ఇళ్లపైకి వెళ్లి దాడులు చేస్తున్నారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. అధికార పార్టీ నేతల చెప్పుచేతుల్లో పోలీసులు పని చేయటం సిగ్గుచేటు. ఎమ్మెల్యే చింతలపూడి ప్రభాకర్ రౌడీయిజం చేయటం దుర్మార్గం. ఇలాంటివి జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? పైగా బాధితుడి మీదే కేసు పెడతారా? ప్రశ్నిస్తాననే పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు? రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే ఢిల్లీ వెళ్లి మీటింగులు పెట్టటం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి మంచోడట, కాంగ్రెస్ అంతుచూస్తాడట. లాలూచీలకు అలవాటు పడిన పవన్ ఇంతకంటే ఇంకేం మాట్లాడుతారు? విజయవాడకు చెందిన సాయికృష్ణను పోలీసులు లాకప్ లో చంపేశారు. అతన్ని వెతుకుతున్నామంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యవస్థలను ఇంతగా దిగజార్చుతారా? హోంమంత్రి అనిత ఒక మహిళ అయి ఉండి మహిళలకు రక్షణ కల్పించలేరా? పసిపిల్లలు తప్పి పోయినా తెలుసుకునే పరిస్థితి లేదు. నియంత దేశాల్లో కూడా ఇలాంటి పోకడలు లేవు’’ అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. -
చంద్రబాబు సర్కార్ గుట్టు రట్టు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగించిన నేతలలో ఏదో తెలియని భయం వెన్నాడుతున్నట్లు అనిపిస్తే, వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన నిరసనలలో ఉత్సాహం, తెగింపు కనిపిస్తాయి. కూటమి నేతలు తమ ప్రసంగాలలో సాధించిన విజయాల గురించికన్నా మాజీ సీఎం జగన్ను దూషించడానికి, ద్వేషించడానికే ప్రాధాన్యం ఇచ్చారు.గత ప్రభుత్వం విధ్వంసం చేసిందంటూ ఒక పడికట్టు పదాన్ని పదే, పదే చెప్పి జనాన్ని నమ్మించడానికి యత్నం చేశారే తప్ప, ఏ రకమైన విధ్వంసమో వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు. అదేమంటే ప్రజావేదికను గత ప్రభుత్వం కూల్చడాన్ని ఆయన ఉదహరించారు. ఇది పాడిందే పాడరా అన్న చందంగా ఉంది తప్ప ఒక పాలకుడు చెప్పదగిన మాటగా కనిపించదు.నదీ గర్భంలో ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేపడితే అది సరైన విధానం కాదని ప్రజావేదిక పేరుతో ఉన్న ఒక షెడ్ను గత ప్రభుత్వం కూల్చింది. ఆ మాటకు వస్తే కృష్ణానది తీరాన అక్రమం నిర్మించిన భవనాలలో చంద్రబాబు, కీలక మంత్రి లోకేష్లతో పాటు పలువురు పలుకుబడి కలిగినవారు నివసించడం ఏ రకంగా చట్టబద్దమో ఇన్నేళ్లలో వివరించలేకపోయారు.అమరావతి గ్రామాలలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ చంద్రబాబు ఎదురు జగన్పై ఆరోపణలు చేయడం అర్ధరహితంగా కనిపిస్తుంది. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు అంటూ రాజమండ్రి, యలమంచిలి మొదలైన చోట్ల పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేసింది. కాని ఉండవల్లిలో కరకట్ట అక్రమ కట్టడంలో ఆయన ఎలా నివసిస్తున్నారో అర్థం కాదు. చంద్రబాబు మాట్లాడిన విషయాలలో ఎన్ని అసత్యాలు ఉన్నాయో చూడండి. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు స్పీచ్కి ఎల్లో మీడియా హెడింగ్ పెట్టింది.అందులో నిజం ఉంటే సంతోషించవచ్చు. కాని ఏది విధ్వంసం, ఏది వికాసం అన్నదానిపై ముందుగా చంద్రబాబు క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తేవడం, నాలుగు ఓడరేవులు నిర్మించడం, ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రిని నిర్మించడం, గ్రామ, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం వంటివి నిర్మించడం విధ్వంసం ఎలా అవుతుంది? మెడికల్ కాలేజీలను, పోర్టులను, ఆర్టీసీ బస్టాండ్లను, ఏవి వీలైతే వాటన్నిటిని ప్రైవేటువారికి అప్పగించడాన్ని కదా విధ్వంసం అనాల్సింది. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయయడాన్ని మాట నిలబెట్టుకున్నట్లని అంటారు. అది 95 శాతం వైఎస్ జగన్ చేసి చూపించారు.మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నారు? ఒక్కటి, అరా తప్ప, ఏదైనా స్కీమ్ ను నిక్కచ్చిగా అమలు చేశామని చెప్పే పరిస్థితి లేదు. అన్ని చేసేశామని బుకాయించడంలోనే వీరి బలహీనత కనిపిస్తుంది. జగన్ యువత భవిష్యత్తును దెబ్బతీశారట. ఆయన టైమ్లో లక్షన్నర ఉద్యోగాలు ఏకకాలంలో ఇస్తే అది భవిష్యతుత్తు ఇచ్చినట్లు కాదన్నది చంద్రబాబు అభిప్రాయమా? కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మెగా డీఎస్సీ అంటూ హడావుడి చేశారు కాని, అందులో జరిగిన అక్రమాలపై జగన్ వీటిపై సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక ఎదురుదాడి చేస్తున్నారు.తనకు నోటీసులు ఇవ్వకుండా 53 రోజులు జైలులో ఉంచారని ఆయన అన్నారు. స్కిల్ స్కామ్పై కోర్టులో విచారణ జరగకుండా ఇప్పుడు ఎందుకు మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్ పేరుతో కేసును ఎలా ఉపసంహరించుకుంది కూడా చెబితే బాగుండేది కదా! అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పిన చంద్రబాబు దాదాపు ఏభై వేల కోట్ల అప్పు తీసుకువచ్చి ఒకేచోట ఖర్చుచయడాన్ని, కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు ఆరువేల లోపు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 17 వేల నుంచి ఇరవై వేల వరకు వ్యయం చేయడం వల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయా?లేదా? అన్నది చేస్తున్నది వివరించాలి కదా!ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీపై నిధులు లేవని చేతులు ఎత్తివేయడం సరైనదేనా? సంపద సృస్టించడం తెలుసునని ఎన్నికల ముందు కొట్టిన గప్పాలన్నీ అబద్దాలనేనని ఒప్పుకుంటారా? ఈ స్కీమ్ను అమలు చేయలేదన్న నిజాన్ని ఎంతో కొంత ఒప్పుకున్నందుకు సంతోషించాలి. మామూలుగా అయితే సూపర్ సిక్స్ అన్నీ చేసేశాం అంటూ చెబుతుండడం అసత్యమేనని అంగీకరించారన్నమాట. టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని అని అన్నారు. మరి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేని ఎందుకు కొనసాగిస్తున్నారు?ఇరాన్ యుద్దంతో మామిడి, అరటి తదితర పండ్ల ధరలు పడిపోయాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు. గతంలో కరోనా వచ్చినప్పుడు జగన్ ఈ రైతులను ఎలా ఆదుకుంది తెలియదా? అయినా తాను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అంటూ స్పీచ్లు ఇచ్చింది చంద్రబాబే కదా! మరి ఇప్పుడు యుద్దం వస్తే రైతులను ఎలా ఆదుకోవాలో తెలియకపోతే ఆయన సీనియారిటీ ఏమైనట్లు? పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గిస్తామని చెప్పిన కబుర్లు అన్నీ అబద్దాలేనని ఒప్పుకుంటున్నారా? గత ప్రభుత్వంలో పది లక్షల కోట్ల అప్పు జరిగిందని చెప్పడం అబద్దమా? నిజమా? అన్నది చంద్రబాబుకు తెలియదా?వైఎస్ జగన్ టైమ్లో కరోనా ఉన్నప్పటికీ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఈ రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పు ఎలా చేశారో చంద్రబాబు చెప్పాలి కదా!ఎంతసేపు బురద వేయడమేనా? వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు, లోకేష్లు వ్యాఖ్యానించడంపై సజ్జల, కొడాలి నాని ఇచ్చిన కౌంటర్కు వీరు సమాధానం ఇవ్వలేకపోయారు. తమది పరశురాముడి గొడ్డలి అని, అవినీతి కూటమి ప్రభుత్వాన్ని గొడ్డలి కూకటి వేళ్లతో పెకలిస్తుందని వారు ధైర్యంగా చెప్పారు.టీడీపీ వెన్నుపోటు పార్టీ అన్న విమర్శను చంద్రబాబు, లోకేష్ లు తిప్పికొట్టలేకపోయారు. తమది వెన్నుపోటు పార్టీ అని చెప్పలేరు. అలాగని వెన్నుపోటు పొడవలేదని వాదించలేని నిస్సహాయ స్థితి కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వంతు అబద్దాలతో పాటు కులం, మతం వద్దని, భారతీయత ముఖ్యమంటూ నీతులు చెప్పే యత్నం చేశారు. కాని ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎంతగా కుల, మత, విద్వేషాలు రేకెత్తించింది ప్రజలకు తెలియదా! లోకేష్ తన స్పీచ్లో జగన్పై అమర్యాదకర వ్యాఖ్యలు చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.ఎందుకంటే గతంలో నార్నె శ్రీనివాసరావు, కోలా కృష్ణమోహన్లు ఆయనపై చేసిన ఆరోపణల వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వైఎస్ జగన్పై అనవసర వ్యాఖ్యలు చేసి.. ఈ సమస్య తెచ్చుకోవడం లోకేష్కు ప్రయోజనమా? అవి ప్రచారంలోకి రావడం లోకేష్ కు ప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. విమర్శలలో హుందాతనం ఉండాలి. సంస్కారయుతంగా ఉండాలి. కాని చంద్రబాబు మాదిరి ఏదిపడితే అది మాట్లాడితే సరిపోతుందని అనుకుంటే లోకేష్ పొరబడుతున్నట్లే. కాలం మారిందన్న సంగతి గుర్తించకపోతే ఆయనకే నష్టం.రెడ్బుక్ గురించి ప్రస్తావించి ఏపీలో ఎంత అరాచక పాలన సాగుతోందో లోకేష్ గుర్తు చేసినట్లయింది. కాగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ధైర్యంగా ప్రభుత్వం అణచివేత చర్యలను ఎదుర్కుంటూ నిరసనలు తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ నినదించడానికి ఎక్కడా వెనుకాడలేదు. కూటమి సభలో జనం చాలావరకు మొక్కుబడిగా ఉన్నట్లు కనిపిస్తే, వైఎస్సార్సీపీ క్యాడర్ హోరెత్తించినట్లు అనిపిస్తుంది. కూటమి ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ప్రస్తావించి వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా పచ్చి అబద్ధాల ప్రచారం, మోసం, కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.వైఎస్ జగన్కు, చంద్రబాబుకు ఉన్న ఒక తేడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ జగన్ తన మానిఫెస్టోని సచివాలయంలో తన ఎదుట పెట్టుకున్నారు. అధికారులకు ఇచ్చి అమలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబేమో ఆ మానిఫెస్టోని, ఎన్నికలలో ఇచ్చిన బాండ్ల గురించి ఎన్నడూ ప్రస్తావించినట్లు కనబడదు. తిరుపతి సభకు హెలికాఫ్టర్ లో వస్తూ చదువుకున్నారట! ఎన్ని అబద్ధపు వాగ్దానాలు ప్రకటించి, ప్రజలను మభ్య చేసింది గుర్తు చేసుకుని నవ్వుకుని ఉండాలి. గత ఎన్నికలలో ప్రజలు విజ్ఞత ప్రదర్శించారని ఆయన అన్నారు కానీ.. ఏభై లక్షల మాయ ఓట్లు పోలైన సంగతిని పదే, పదే చెబుతున్న ప్రముఖ మేధావి, చంద్రబాబు వద్ద సలహాదారుగా గతంలో పనిచేసిన పరకాల ప్రభాకర్ ఆరోపిస్తున్న అంశంపై మాత్రం నోరు మెదపలేకపోతున్నారు.ఈ నేపథ్యంలోనే కూటమిలో విజయోత్సవ సంరంభం పెద్దగా కనిపించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ ప్రజలలో దూసుకువెళ్లడానికి వెన్నుపోటుకు రెండేళ్ల నిరసనను వాడుకుందని చెప్పాలి. ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తిని ఎలా తగ్గించాలో తెలియక కూటమి తికమక పడుతుంటే, జనం తమవైపు చూస్తున్నారన్న ఉత్సాహం వైఎస్సార్సీపీలో తొణికిసలాడుతోంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సూట్కేసులు.. సూట్కేసులు డబ్బు ఎక్కడికి వెళ్తుంది?
-
వీడియో లైవ్ లో ప్లే చేసి... బాబు, లోకేష్ ను ఇచ్చిపడేసిన నాగార్జున యాదవ్
-
కాలం మారింది.. మీకు మిగిలింది మూడేళ్లే జనం మనసులో జగన్
-
ఫేస్ బుక్ అకౌంట్ బ్లాక్ చేసింది వాళ్లే ఇదిగో ప్రూఫ్స్ ...?
-
నన్ను ఒకాయన ఇంకా నువ్వు జైలుకు పోలేదా అని అనగానే..?
-
పెన్షన్ దారులకు బిగ్ షాక్ ఇచ్చిన చంద్రబాబు..!
-
లోకేష్ ను ప్రశ్నిస్తే మధ్యలో రెచ్చిపోతున్న అనితమ్మ
-
ఆర్టీసీ ఆస్తులపై చంద్రబాబు కన్ను
సాక్షి, అమరావతి/బస్డాండ్ (విజయవాడ పశ్చిమ): ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి జేబులు నింపుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (వైఎస్సార్టీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మండిపడ్డారు. రూ.లక్ష కోట్ల విలువైన ఆర్టీసీ డిపోలు, భవనాలు, మౌలిక సదుపాయాలను ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.మాజీ సీఎం జగన్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆదుకుంటే.. చంద్రబాబు మాత్రం సంస్థను దివాలా తీయించేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ లీజు ప్రక్రియను విరమించుకోకపోతే ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. తాము విద్యుత్ బస్సులకు వ్యతిరేకం కాదని, ఆ నెపంతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తమ ట్రేడ్ యూనియన్ తరఫున ప్రతి జిల్లాలో వచ్చే సోమవారం కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని, అప్పటికీ స్పందన లేకపోతే మిగిలిన కారి్మకసంఘాల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకున్న వైఎస్ జగన్ విజయవాడ ఆర్టీసీ హౌస్ ఏదుట వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గౌతంరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్రలు పన్నిందని మండిపడ్డారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యంకు వినతి పత్రాలు అందజేశారు. -
AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!
-
‘చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది’
తాడేపల్లి : రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపు చర్యలు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోందని ధ్వజమెత్తారు. దీనిపై పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు శైలజానాథ్. ఈరోజు(సోమవారం, జూన్ 15వ తేదీ) రాయలసీమ లిఫ్టు నిలిపివేతపై తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన పార్టీ నేతలు సమావేశమయ్యారు. దీనికి సాకే శైలజానాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహనరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నాగార్జున రెడ్డి, కాకాని గోవర్ధన రెడ్డి తదితరులు హాజరయ్యారు. త్వరలో నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై శైలజానాథ్ మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది. రాయలసీమ ప్రాజెక్టులను నిలిపేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపునకు దిగారు. దీనిపై రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు చేస్తాం. తొలుత అనంతపురం, నెల్లూరు జిల్లాలో తొలుత పర్యటిస్తాం. ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ఒత్తిడి చేస్తాం. మా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలి. కృష్ణా, తుంగభద్ర మీద ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా రాయలసీమ ఎడారిగా మారుతోంది. చంద్రబాబు తక్షణం స్పందించాలి.వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్టును ఏర్పాటు చేస్తే చంద్రబాబు దాన్ని ఆపేశారు. రేవంత్ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను పనంగా పెట్టారు. ఏపీ హక్కులను కాలరాశారు. అదేమంటే బనకచర్ల ప్రాజెక్టు పేరు చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే రాయలసీమ లిఫ్టును పూర్తి చేయకుండా బనకచర్ల అంటారెందుకు?, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుక పడిన ప్రాంతాల కన్నీటితో రాజధానిని కడతారా?, రాజధానిలో జరుగుతున్న అవినీతికి అడ్డూ అదుపు లేదు. కేంద్ర ప్రభుత్వ భవనాలకంటే నాలుగు రెట్లు అధికంగా ఖర్చు చేయటం వెనుక భారీ అవినీతి ఉంది. అమరావతిలో పెట్టే ఖర్చులో పది శాతం పెట్టినా మావిగన్, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తవుతాయి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అనేదే లేదు’ అని ధ్వజమెత్తారు. -
అంత భయం ఎందుకు.. YSRCP పేస్ బుక్ బ్లాక్ చంద్రబాబుకు శేఖర్ రెడ్డి కౌంటర్
-
ప్రశ్నించే గొంతును నులిమేస్తున్నారు.. చంద్రబాబుపై జగన్ సీరియస్..
-
మీరు చేసే పని.. జగన్ చేస్తే తట్టుకోగలరా..
-
బాబూ.. పవన్, లోకేశ్ వెళ్తే సరిపోతుందా?
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాదం మాటలకందనిది. మామూలుగా వేడి నీళ్లు పడితేనే తట్టుకోలేం. అలాంటిది 1600 డిగ్రీల వేడి ఉన్న ఇనుప ద్రవం మీద పడితే అది ఎంత దారుణ పరిస్థితి అవుతుందో చెప్పనవసరం లేదు. అలాంటి వాతావరణంలో పనిచేయడమే కష్టం. ఇక ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎంత కష్టం. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మరణించడం అత్యంత విచారకరం. వారి కుటుంబ సభ్యులు పడే మనోవేదన ఇంతింత కాదు. వారు అంత కష్టంలో ఉన్నప్పుడు రాజకీయ నేతలు వెళ్లి ఓదార్చే యత్నం చేస్తారు. ఆ సమయంలో కార్మిక సంఘాల నేతలు వచ్చి తమ సమస్యలను వివరిస్తారు. వాటిని వినే ఓపిక పరామర్శకు వెళ్లిన నేతలకు ఉండాలి. అధికారం ఉంది కదా అని ఏమైనా మాట్లాడవచ్చనుకుంటే అది పొరపాటు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్లు కార్మికులను ఎంతవరకు ఓదార్చారో కాని, వారి మాటలు పుండుమీద కారం చల్లినట్లయిందని కార్మికులు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విశాఖలో కార్మికుల కుటుంబాలను పరామర్శించిన తీరుకు, లోకేష్, పవన్ల వ్యవహార సరళికి మధ్య ఉన్న అంతరాన్ని అంతా చర్చించుకుంటున్నారు. కూటమి నేతలు తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే, జగన్ మాత్రం బాధితుల కుటుంబాలకు భరోసా ఇచ్చేలా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తం అయింది.ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు బాధితుల వద్దకు వెళ్లాలి. వారికి అవసరమైన భరోసా ఇచ్చి రావాలి. చంద్రబాబుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలా మసులుకోవాలో తెలుసు. అయినా ఆయన ఎందుకు విశాఖ వెళ్లలేదో, కార్మికులను పరామర్శించలేదో తెలియదు. బహుశా తన తరపున కీలక మంత్రిగా ఉన్న లోకేష్ వెళితే సరిపోతుందని అనుకున్నారేమో తెలియదు. లేదా గతంలో కార్మికులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు నిలదీసే అవకాశం ఉందని అనుకున్నారేమో చెప్పలేం.మరో వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడకు వెళ్లారు. సహజంగానే పవన్ కళ్యాణ్ కన్నా, లోకేష్కే ఎల్లో మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విషయాన్ని జనసేన నేతలు గమనించకపోలేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు ఒక పార్టీకి అధినేతగా కూడా ఉన్నారు. తాను వెనుకబడిపోకూడదని అప్పటికప్పుడు వెళ్లారేమో తెలియదు. ఇంత పెద్ద ఘటనలు జరిగినప్పుడు కార్మిక వర్గాలలో ఆవేదన, ఆక్రోశం ఉంటుంది. తమ బాధను నేతలకు చెప్పుకునే యత్నం చేస్తారు. కొన్నిసార్లు నేతలను విమర్శిస్తుంటారు. అయినా అధికారంలో ఉన్నవారు సంయమనంతో ఉండి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలి. కాని దురదృష్టావశాత్తు లోకేష్, పవన్ కళ్యాణ్ లు మాట్లాడిన విషయాలు చూడండి. కార్మిక నేతలు ప్రశ్నలు వేస్తుంటే, లోకేష్ అసహనానికి గురై ఎందుకు గొడవపడుతున్నారు. రాజకీయం చేయడానికి వచ్చారా? మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదుగా!' అని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.స్టీల్ ప్లాంట్ను తామే కాపాడామని, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ వైపు చూస్తూ వీరు పోరాడారు అని లోకేష్ అన్నారు. ఆ మంత్రి ఎప్పుడు పోరాడారో ఎవరికి తెలియదు. పైగా స్టీల్ ప్లాంట్ను కాపాడామని లోకేష్ అనగానే అందుకే ఇంతమంది చనిపోయారా?అని కార్మిక నేత ఒకరు ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. మరో సందర్భంలో టీమ్ లెవెన్ కెప్టెన్ వచ్చారా అని జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించడంపై అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు రాలేదన్న విషయాన్ని విస్మరించి జగన్ పై వ్యాఖ్య చేయడమేమిటా అన్న ప్రశ్న వచ్చింది.స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ కేవలం బ్యాంకు రుణాలు చెల్లించడానికి, కార్మికులకు వీఆర్ఎస్ చెల్లించడానికే ఖర్చు చేశారు తప్ప, ప్లాంట్ అభివృద్దికి పెట్టలేదని, ఇదే ప్రైవేటైజేషన్కు జరిగే కుట్ర అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక కర్మాగార యాజమాన్యం 25 లక్షల ఆర్థికసాయం ప్రకటించడంపై కూడా అసంతృప్తి వ్యక్తం అయింది. దీనికి లోకేష్ తగు సమాధానం ఇవ్వకపోగా, కార్మిక సంఘాలు అడుగుతాయని, వారిదేం పోయిందని వ్యాఖ్యానించడం అభ్యంతరకరంగా కనిపిస్తుంది.గతంలో విశాఖలో ఎల్.జి.ఫాలిమార్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి పదమూడు మంది మరణించగా, జగన్ అప్పటికప్పుడు కోటి రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రభుత్వ పక్షాన ప్రకటించారు. అప్పుడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కోటి రూపాయలు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. కాని ఇప్పుడేమో ప్రభుత్వపరంగా సాయం ప్రకటించలేదు. ఒకవైపు రకరకాల పబ్లిసిటీ కార్యక్రమాలకు కోట్లకు కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం, విశాఖ ఉక్కులో ఇంత ఘోర ప్రమాదంలో మరణించిన కుటుంబాలవారికి సాయం చేయలేరా అన్న ప్రశ్న వచ్చింది. పవన్ కళ్యాణ్ యధా ప్రకారం తనకు ఈ ప్లాంట్ విషయంలో అంత అనుభవం లేదని వ్యాఖ్యానించడం కార్మిక సంఘాలకు ఆశ్చర్యం కలిగించింది.గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నించిందని తప్పుడు ఆరోపణ చేసి మళ్లీ దొరికిపోయారు. మరుసటి రోజు జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత లోకేష్, పవన్ లకు గట్టి జవాబు ఇచ్చారు. తమ హయాంలో ప్రధానికి ఎన్నిసార్లు లేఖలు రాసింది.. ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆధార సహితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గతంలో ఈ అంశం ప్రస్తావించి జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని, అందువల్లే ఆ కార్యక్రమం జరగలేదని చెప్పిన వీడియో కూడా ప్రముఖంగా సోషల్ మీడియాలో కనిపించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ ప్లాంట్ను జగన్ ప్రభుత్వం ఎలా ప్రైవేటైజ్ చేస్తుందని సోషల్ మీడియాలో పవన్కు ప్రశ్నలు సందించి ఎద్దేవా చేశారు. ఇక లోకేష్ వ్యవహార శైలిపై జగన్ మండిపడుతూ లోకేష్ వంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంలో కార్మిక సంఘాలు అడిగిన సూటి ప్రశ్నలకు జవాబివ్వకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతూ, ఎదురు సంఘాలపైనే లోకేష్, పవన్ లు విమర్శలు చేయడం కూడా బాగోలేదు. అలా కాకుండా ప్యాకేజీని ఎందుకు ప్లాంట్ అభివృద్దికి వ్యయం చేయలేదు?సుమారు పదివేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు? పలు ముఖ్యమైన విభాగాలను ప్రైవేటు రంగానికి ఎందుకు అప్పగిస్తున్నారు? ప్రైవేటు రంగంలో స్థాపిస్తున్న మిట్టల్ స్టీల్ కు కాప్టివ్ మైన్ ఇంత త్వరగా ఎలా కేటాయించారు. అరవై ఏళ్లకు పైగా నడుస్తున్న విశాఖ స్టీల్కు ఎందుకు కాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు? అన్న ప్రశ్నలకు ఓపికగా వీరిద్దరూ జవాబు ఇచ్చి ఉంటే బాగుండేది. కాని వారికి ఆ విషయాలపై అంత పరిజ్ఞానం ఉందో, లేదో గాని, వాటికి సమాధానం ఇవ్వలేదు. జగన్ మాత్రం అందుకు భిన్నంగా కార్మిక సంఘాలతో ఓపికగా మాట్లాడి స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడానికి తన ప్రయత్నాలను సావధానంగా వివరించారు. అలాగే బాధిత కుటుంబాలవారిని తనదైన శైలిలో ఓదార్చారు. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆ పరిహారం ఇవ్వకపోతే, తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చి తీరుతామని స్పష్టం చేయడంతో బాధితులకు కొంత సాంత్వన చేకూర్చినట్లయింది.గతంలో తన ప్రభుత్వం చేసిన మాదిరే అసెంబ్లీలో ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చంద్రబాబు సర్కార్కు ఆయన సవాల్ చేశారు. దీనిపై కూటమి నేతలు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. జగన్ విశాఖకు వచ్చినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎల్లో మీడియా తట్టుకోలేకపోయింది. ఏవేవో పిచ్చి ఆరోపణలు చేసి జగన్ టూర్ పై విషం చిమ్మే యత్నం చేసింది. ఏది ఏమైనా ఇలాంటి విషాదాలు జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలో పవన్ కళ్యాణ్, లోకేష్ లు ముందుగా తెలుసుకుని రావాలని కార్మిక సంఘాలు చేస్తున్న సూచన అర్థవంతమైనదే అనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు మోసపూరిత ప్రకటనలు..! కొత్త పింఛన్లు గాలికేనా..?
-
సిగ్గులేదా చంద్రబాబు.. ఇంకెంతకాలం దాచుకుంటావ్...!
-
సెలవు రోజూ యోగాంధ్రే!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మెడపై ప్రభుత్వం కత్తి పెట్టి పని చేయిస్తోంది. ఈ ఆదివారం కూడా వారికి సెలవు లేకుండా పోయింది. యోగాంధ్ర రిజిస్ట్రేషన్ల టార్గెట్లు పూర్తి చేయనిపక్షంలో చర్యలు ఉంటాయని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఆదేశించడంతో సెలవు రోజూ సాయంత్రం దాకా విధుల్లో పాల్గొన్నారు. ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కోటి మందిని రిజిస్ట్రేషన్లు చేయాలంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు టార్గెట్లు పెట్టగా.. శుక్రవారం నాటికి కేవలం 25 లక్షల మంది రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి కాకపోవడంతో శనివారం కూడా ప్రతి ఉద్యోగి కనీసం 25 మంది చొప్పున రిజిస్ట్రేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి పని చేయించారని ఉద్యోగ సంఘ నేతలు వాపోతున్నారు.శనివారం రాత్రే పలు జిల్లాల్లో ఆదివారం ఎవరికీ సెలవు లేదంటూ ఉద్యోగులకు మెసేజ్లు పంపించారు. ఆదివారం ఉదయం యోగాంధ్ర శిక్షణ తరగతుల నిర్వహణ, ఆ తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించాలని ఆదేశాలు ఇచి్చనట్టు పలువురు సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. ఆదివారం కూడా మండల, జిల్లా అధికారులు విడతల వారీగా సచివాలయ ఉద్యోగులతో టెలీకాన్ఫరెన్స్లు నిర్వహించడంతో సాయంత్రం వరకు పనిచేసినట్లు పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆర్యవైశ్యుల పాలిట ద్రోహి చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆర్యవైశ్యుల పాలిట ద్రోహిగా సీఎం చంద్రబాబు మిగిలిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో వెలంపల్లి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని, చంద్రబాబు పాలనలో తమ సామాజికవర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో డీబీటీ పథకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి వ్యాపారులకు వైఎస్ జగన్ ఊతమిచ్చారని చెప్పారు. ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య వంటి పథకాల ద్వారా అగ్రవర్ణ పేదలకు పెద్ద ఎత్తున మేలు జరిగిందని వివరించారు. తద్వారా వ్యాపారాలు బాగా జరిగాయని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నీ నిలిచిపోయాయని, మహిళలకు హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి అమలు కాకపోవడంతో పాటు తల్లికి వందనం వంటి పథకాలూ నిర్వీర్యమయ్యాయన్నారు. దీంతో ఆర్యవైశ్యుల వ్యాపారాలు దెబ్బతిన్నాయని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎండోమెంట్ పరిధిలోని ఆర్యౖవెశ్య సత్రాలు, ట్రస్టులను వారే నిర్వహించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. విజయవాడలో ఆర్యవైశ్య భవనం నిర్మాణం, కర్నూలులో పేద ఆర్యవైశ్య విద్యార్థుల హాస్టల్ భవనం కోసం నిధులు మంజూరు, పెనుగొండలో వాసవీ మాత ఆలయాభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించడం వంటి అనేక చర్యల ద్వారా ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ జగన్ చేసినంతగా మరే నాయకుడు చేయలేదని వివరించారు. వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ పరిరక్షణకు వైఎస్ జగన్ విశేష కృషి చేశారు. చింతామణి నాటకాన్ని నిషేధించి ఆ వర్గం మనోభావాలను గౌరవించిన ఘనత ఆయనకే దక్కుతుంది. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ రఘురామకృష్ణరాజు మాట్లాడితే.. ఆయన్ను చంద్రబాబు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ని చేశారు. ఆర్యవైశ్యులకు మంచి రోజులు త్వరలోనే వస్తాయి’ అని చెప్పారు.వైఎస్సార్సీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆర్యవైశ్యులకు వైఎస్సార్సీపీ జెండా అండగా నిలిచింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంఅన్ని వర్గాలపై వేధింపులే లక్ష్యంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్ హయాంలో కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు శాశ్వతం కావు. ప్రజలకు మళ్లీ మంచి రోజులు వస్తాయి. ఆర్యవైశ్యులు శాంతియుత వాతావరణాన్ని కోరుకునే వర్గం. తమ కష్టంతో ఎదిగే వారికి ప్రభుత్వం భద్రత, ప్రశాంతత కల్పించాలి. వారి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచి్చన తర్వాత కృషి చేస్తుంది’ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ఆర్యవైశ్య విభాగం నాయకులు గుబ్బా చంద్రశేఖర్, రేబాల శ్రీను, మిట్టా కరుణాకర్, మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి కనికరమే లేదు
సాక్షి, అమరావతి: ‘వారం కిందట కర్నూల్లో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య.. మొన్న గుంటూరులో ఉద్యోగికి బ్రెయిన్ స్ట్రోక్.., రెండు రోజుల కిందట అనకాపల్లి జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య... పని ఒత్తిడి భరించలేక ఉద్యోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరం కలగడం లేదు’ అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మకమైన సచివాలయ వ్యవస్థ, ప్రస్తుత ప్రభుత్వ మితిమీరిన ఒత్తిడి, వేధింపులతో ఉద్యోగుల పాలిట యమపాశంగా మారుతోందని తప్పుపట్టారు. వారం రోజుల్లో జరిగిన ఈ మూడు సంఘటనలు ఇందుకు నిదర్శనమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ ఉద్యోగులకు ఒక టైమింగ్ లేదు, ఒక సెలవు లేదు, ఒక పండగ లేదని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోగా.. సచివాలయం ఉద్యోగులకు పని లేదంటూ వేల మందిని డిప్యుటేషన్ పేరుతో బదిలీ చేసి మిగిలిన ఉద్యోగులకు ఇన్చార్జి పేరుతో పనిభారం వేసిందని పేర్కొన్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు తమ పనే కాకుండా అదనపు పనితో పాటు వలంటీర్ల పని కూడా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ‘ఇంకా ఎంత మంది చనిపోతే సీఎం స్పందిస్తారు. వంద మంది ప్రాణాలు పోయినా మీకు కనికరం కలగడం లేదా? సచివాలయ ఉద్యోగుల మీద ఎందుకు ఇంత కక్ష? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారే, ఇదేనా అనుకూల వాతావరణం? ఉద్యోగులకు గుండెపోటు తెప్పించడమేనా అనుకూల పనివాతావరణం? ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వేధించడమేనా అనుకూల పని వాతావరణం?’అని ప్రశ్నించారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సక్రమంగా ఇవ్వండినిరంతరం ఇంటింటి సర్వేలతో పాటు యోగాంధ్ర, అక్షరాంధ్ర కార్యక్రమాలు ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసే కార్యక్రమాలను సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తున్న ప్రభుత్వం.. అన్ని పనులు ఒకే సారి చెప్పి ఒత్తిడి చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు వారి జాబ్ చార్ట్ ప్రకారం పనులు అప్పగించాలని, వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సక్రమంగా ఇవ్వాలని కోరారు. ‘సచివాలయ ఉద్యోగ మిత్రులారా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా నిలబడండి. మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తోడుగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
108 కుయ్యో మొర్రో!
చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం జి.గొల్లపల్లి గ్రామానికి చెందిన జ్యోత్స్న ఏడు నెలల గర్భిణి. మే 15న చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో 800 గ్రాముల శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించాలని వైద్యులు సూచించారు. అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో 108 అంబులెన్స్లో పసికందును వెంటిలేటర్పై ఉంచి తిరుపతికి బయలుదేరారు. మురకంబట్టు దగ్గర అంబులెన్స్ ఉన్నట్టుండి ఆగిపోయింది. వెంటిలేటర్పై ఉన్న శిశువుతో రెండు గంటల పాటు నడిరోడ్డుపై కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవించారు. 60 కిలోమీటర్ల దూరంలోని పీలేరు నుంచి మరో అంబులెన్స్ రప్పించి తిరుపతికి తరలించారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో దుస్థితి ఇది.మే 2వ తేదీన ప్రకాశం జిల్లా రాయివారిపాలెంకు చెందిన కట్టా శంకరమ్మ ఇంటి వద్ద స్పహ కోల్పోయి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే 108కు ఫోన్ చేసి అంబులెన్స్ సాయం కోరారు. 10.. 20.. 30.. నిమిషాలు గడిచినా అంబులెన్స్ రాలేదు. మళ్లీ 108కు ఫోన్ చేయగా ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోందంటూ ఏకంగా గంటన్నర ఆలస్యం చేశారు. చివరకు అంబులెన్స్ గ్రామానికి చేరుకునే సరికే శంకరమ్మ తుది శ్వాస విడిచారు. అంబులెన్స్ సకాలంలో వచ్చి ఉంటే శంకరమ్మ బతికేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.సాక్షి, అమరావతి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో నిర్వీర్యమైన 108 అంబులెన్స్ సేవలను ఈ ఘటనలు ఎత్తిచూపుతున్నాయి. ఇక్కడ ఉదహరించిన ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. 2024లో చంద్రబాబు గద్దెనెక్కాక 108, 104 సేవలను అవకతవకలకు కేంద్ర బిందువుగా మార్చేశారు. టీడీపీ నేతకు చెందిన ‘భవ్య’ అనే సంస్థకు అడ్డదారుల్లో 104, 108 నిర్వహణ కాంట్రాక్ట్ను కట్టబెట్టేశారు. అస్మదీయులకు నిర్వహణ కాంట్రాక్ట్ను కట్టబెట్టడంపై చూపిన శ్రద్ధ.. పకడ్బందీగా సేవలు అమలు చేయడంపై పెట్టలేదు. దీంతో రోడ్డు.. ఇతర ప్రమాదాలు, అనారోగ్య బాధితులకు ప్రాణాపాయ పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన అంబులెన్స్లు సకాలంలో స్పందించడం లేదు. నిర్వహణ సరిగా లేక అంబులెన్స్లు మొరాయించడం, ఆపద సమయంలో ఫోన్ చేస్తే సకాలంలో ఘటనా స్థలికి చేరుకోకపోవడం వంటి ఘటనలు రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రాష్ట్రంలో 768 అంబులెన్స్లు ఉండగా, అందులో 731 ఆన్ రోడ్ సేవలు అందించాలి. మిగిలినవి బ్యాకప్ కింద ఉంటాయి. కాగా, రాష్ట్రంలో ఏ ఒక్క రోజు 731 వాహనాలు ఆన్ రోడ్ సేవల్లో ఉండటం లేదని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో 108 అంబులెన్స్లు రోజుకు సగటున మూడు వేల కేసులకు అటెండ్ అయ్యేవి. చంద్రబాబు గద్దెనెక్కాక ఒక్కసారిగా పరిస్థితి తారుమారైందని తెలుస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున 1,500 నుంచి 2 వేల మేర సేవలను అంబులెన్స్లు అందిస్తున్నాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే రోజువారీ వెయ్యికి పైగా సేవలు తగ్గిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో డయాలసిస్ చేయించుకోవాల్సిన కిడ్నీ వ్యాధి రోగులకు ఉచితంగా 108 అంబులెన్స్ సేవలు అందేవి. 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఈ సర్వీస్ను పూర్తిగా ఎత్తేసింది. దీంతో కిడ్నీ బాధితులు ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. మరో వైపు ఒక ప్రభుత్వాస్పత్రి నుంచి మరో ప్రభుత్వాస్పత్రికి మెరుగైన వైద్యం కోసం రోగులను తరలించే సేవలు సైతం పడిపోయాయి. రోగులను తరలించాలని వైద్యులు రెఫర్ చేసినప్పటికీ, ఎమర్జెన్సీ కేసు కాదని నిర్వహణ సంస్థ తిరస్కరిస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఆపద సమయంలో నిర్ధేశిత సమయం కంటే ఆలస్యంగా అంబులెన్స్లు ఘటనా స్థలికి చేరుకుంటున్నాయి. ఫలితంగా అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. సమయానికి వచ్చి ఉంటే ఒట్టు!మార్చి 29న శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. బైక్పై ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించడం కోసం స్థానికులు 108కు ఫోన్ చేశారు. క్షతగాత్రులను అంబులెన్స్ ఎక్కించిన కాసేపటికి అది మొరాయించింది. పోలీసులు, స్థానికులు తలా ఓ చేయి వేసి ఎంత నెట్టినా ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు. 20 నిమిషాల పాటు అష్టకష్టాలు పడ్డాక ఇంజిన్ స్టార్ట్ అయింది. చికిత్స ఆలస్యం అవ్వడంతో క్షతగాత్రులు విలవిల్లాడిపోయారు. » మూడు నెలల కిందట కాకినాడ జిల్లా సర్పవరం సమీపంలో రాత్రి సమయంలో ఓ టిప్పర్ కారును ఢీ కొట్టింది. కారులో విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు. ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళను ఆస్పత్రికి తరలించడం కోసం స్థానికులు 108 అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. అంబులెన్స్లు అందుబాటులో లేవని కాల్ సెంటర్ సిబ్బంది సమాధానం ఇచ్చారు. తీవ్ర గాయాలపాలైన మహిళ విలవిల్లాడుతూ కొద్దిసేపటికే మరణించింది. కాకినాడ నగరానికి కూత వేటు దూరానికి అంబులెన్స్ను పంపక పోవడం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. » మార్చి 26 తెల్లవారుజామున మార్కాపురం వద్ద ప్రైవేట్ బస్సు నడిరోడ్డుపై దగ్ధం అయింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడం కోసం 108కు ఫోన్ చేశారు. 20 సార్లు ఫోన్ చేసినా కనీస స్పందన లేదని ప్రమాదానికి గురైన బస్సులోని యువతి కన్నీరుమున్నీరైంది.» గతేడాది మే 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య బాధితులు అత్యవసర సాయం కోసం 108కు డయల్ చేసినా కాల్స్ కలవలేదు. ఏకంగా ఐదు గంటలకు పైగా సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డు ప్రమాదాలు, గుండె పోటు, ఇతర తీవ్ర అనారోగ్యం పాలైన వారికి సత్వరమే వైద్య సేవలు అందక తీవ్ర అవస్థలు పడ్డారు. పలువురు ఏకంగా మత్యువాత పడ్డారు.నాడు ఏడాదిలో బలోపేతంగతంలో చంద్రబాబు 108 వ్యవస్థను అస్తవ్యస్థంగా మార్చగా, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఏడాది వ్యవధిలో ఈ వ్యవస్థను బలోపేతం చేశారు. 2019కి ముందు 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. కనీసం మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని దుస్థితి. అత్యవసర వైద్య సేవల సంస్కరణల్లో భాగంగా మండలానికి రెండు అంబులెన్స్లు సమకూరుస్తూ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఏడాది తిరక్కుండానే 412 అంబులెన్స్లు కొనుగోలు చేశారు. వీటిని 2020 జూలై1న వైఎస్ జగన్ ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కి పెరిగింది. ఇందు కోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్లో అదనంగా మరో 20 కొత్త 108 అంబులెన్స్లను గిరిజన ప్రాంతాలకు సమకూర్చారు. వీటి కోసం రూ.4.76 కోట్లు వెచ్చించారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. అత్యవసర సేవలను బలోపేతం చేయడం ద్వారా ఐదేళ్లలో 45 లక్షల మంది బాధితులకు అత్యవసర వేళ అండగా నిలిచారు. -
దమ్ముంటే చర్చకు రండి...! లోకేష్ పై డీఎస్సీ విద్యార్థుల ఫైర్!
-
చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇవాళ(ఆదివారం, జూన్ 14) వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ బాధితులు.. టీడీపీ నేతలు ఫేక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను బాధితులు వివరించారు. అధికారులు చెప్పేవన్ని అబద్ధాలేనని మండిపడ్డారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవకతకవలు జరిగాయని.. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీస్తుందన్నారు. యువత భవిష్యత్తో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన మండిపడ్డారు. బెదిరింపులను అడ్డుకోవడానికి అండగా ఉంటామని.. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సజ్జల డిమాండ్ చేశారు.‘‘డీఎస్సీలో కుట్ర పూరితంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రి తప్పు ఒప్పుకుని సీబీఐ విచారణ జరిపించాలి. డీఎస్సీ రాసి క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇవ్వాలి. డీఎస్సీ అభ్యర్థుల పోరాటంలో న్యాయ సహాయం అందిస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డీఎస్సీ.. మంత్రులు సమాధానం చెప్పలేరా: పర్వతనేని
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. అక్రమాలపై ప్రతిపక్షంగా తాము నిరంతరం పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వం, మంత్రులు.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారులను ముందుకు నెడుతున్నారని విమర్శించారు. అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ తాడేపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏపీలో డీఎస్సీ పరీక్ష రాసిన 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం, మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అధికారులను ఎందుకు ముందు పెడుతున్నారు. డీఎస్సీ నిర్వహణపై మంత్రులు కాకుండా అధికారులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్సీఈఆర్టీ (SCERT)లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు రావడం, అలాగే టీజీటీ తెలుగులో ఆరో ర్యాంకు సాధించడం అనేక అనుమానాలకు కారణమైంది.ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో నవీన్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నవీన్ ద్వారానే అనేక మందికి ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి సరైన స్పందన లేదు. ఈవిషయం కోర్టులో ఉంది, చెప్పలేం అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాటవేత ధోరణి ఉంది. ఆయన ఎప్పుడూ స్పోర్ట్స్ డీఎస్సీ గురించి మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు. ఫలితాలు మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణలోనే అనేక అవకతవకలు జరిగాయి. రిజర్వేషన్ల ఉల్లంఘన వల్ల వేలాది మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయారు. సీబీఎస్ఈ, నవోదయ ఇంగ్లిషు మీడియం విద్యార్థులను డీఎస్సీకి దూరం పెట్టడం అన్యాయం.టెట్ రాసినా కూడా వేలాది మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే నార్మలైజేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. జిల్లా స్థాయి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం నార్మలైజేషన్ ప్రక్రియను ఎందుకు తెచ్చింది?. నార్మలైజేషన్ పేరుతో నచ్చిన సెషన్స్లో 7, 8 మార్కులు కలిపి అక్రమాలకు పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై నిరుద్యోగుల పొట్టకొట్టారు. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులను మానసికంగా వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా వింగ్ నిరుద్యోగులపై రకరకాల ముద్రలు వేస్తూ అవమానిస్తోంది. కష్టపడి చదువుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మానసిక వ్యధకు గురిచేస్తున్నారు. -
జిత్తులమారి లెక్కలు.. కూటమి అవినీతి బయటపెట్టిన కేంద్రం
-
‘స్త్రీలోలుడు, వికృత చేష్టల్లో ఆరితేరినవాడు బీఆర్ నాయుడు’
సాక్షి,తిరుపతి: మహానేత వైఎస్సార్ఆర్పై శివానంద స్వామి తదితరులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు.కొంతమంది స్వాములు టీడీపీ నేతలు కంటే దిగజారారు. కాషాయ స్వాములు పచ్చ జెండా ఎత్తుకుని మహానేత వైఎస్ఆర్పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బూతు సినిమాల నిర్మాత అట్లూరి నారాయణ కొండ మీద బ్లాక్ టికెట్లు అమ్ముతాడు. శ్రీను బాలికను అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ఆదేశాలతో ఆధ్యాత్మిక సభ జరిగింది. స్త్రీలోలుడు, వికృత చేష్టల్లో ఆరితేరినవాడు బీఆర్ నాయుడు. అలాంటి బీఆర్ నాయుడికి కొంత మంది స్వాములు తొత్తులుగా మారారు. శ్రీను నీవు కాషాయం వేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతావా?.కొంత మంది స్వాములను టీడీపీ జెండాలు మార్చే కూలీలుగా బీఆర్ నాయుడు మార్చాడు. కొంత మంది సాధువులు కాషా వస్త్రాలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకోవాలి. దేవుడిని రాజకీయ వనరుగా వాడుకుంది చంద్రబాబే. వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిన చంద్రబాబుపై సాధువులు ఎందుకు మాట్లాడరు?.చంద్రబాబు పాలనను రామరాజ్యం అంటున్నారంటే మూటలు బాగానే అంది ఉంటాయి. రెండు కొండలను ఏడు కొండలుగా మార్చి జీవో ఇచ్చింది వైఎస్ఆరే. వేద విశ్వవిద్యాలయం స్థాపించింది వైఎస్ఆర్. పేదలకు పెళ్లిళ్లు చేసిన గొప్ప మనసున్న నాయకుడు వైఎస్ఆర్.ఊరువాడా భజన మండళ్లు నిర్మించిన గొప్ప నాయకుడుకు వైఎస్ఆర్. వెంకటేశ్వర భక్తి ఛానల్ తీసుకొచ్చింది వైఎస్ఆర్. వెంకటేశ్వర భక్తి ఛానల్ వద్దన్నది చంద్రబాబు. గోమాతను పరిరక్షించాలని కంకణం కట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్. నవనీత సేవ తీసుకొచ్చింది వైఎస్ జగన్’ అని భూమన గుర్తు చేశారు. -
అంతన్నాడు ఇంతన్నాడే చంద్రబాబు.. బాబు పై అద్భుతమైన పాటపాడిన మహిళలు
-
బాబోయ్ అంత పెట్టలేమండీ బయటపడ్డ సంచలన ఆడియో
-
ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో కూటమి రంగం సిద్ధం
-
దుబారా ఖర్చుల్లో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు & లోకేష్..
-
Ding Dong: చంద్రబాబుకు బిగ్ షాక్
-
చంద్రబాబుపై కొత్త పాట
-
చంద్రబాబు పేరుతో వీడియో కాల్ AI టెక్నాలజీతో కేటుగాళ్ల మోసం
-
మెగా.. దగా.. బాబుకి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య
-
రెండేళ్లు చేతకాలేదు.. ఇంకో మూడేళ్లు పరిపాలిస్తావా..?


