Chandrababu Naidu
-
చంద్రబాబు సర్కార్ దారుణ నిర్ణయం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుంది. నాడు-నేడు స్కూళ్ల కోసం విరాళాలు వసూలు చేయాలని నిర్ణయించింది. విరాళాలు వస్తేనే స్కూళ్లు అభివృద్ధి చేయాలని.. విరాళాలు కోసం ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. విరాళాల సేకరణకి ప్రత్యేక డోనార్ పోర్టల్ ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలకు ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఇక దాతల దయపైనే పేద పిల్లల పాఠశాలల భవిష్యత్ ఆధారపడి ఉంది.మరోవైపు, రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి దిగజారిపోతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో అడ్మిషన్లు తగ్గిపోవడంతో పాటు, బడి బయటి పిల్లలను సైతం పట్టించుకోక పోవడంతో డ్రాప్ అవుట్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ప్రైవేటు స్కూళ్లల్లో అడ్మిషన్లు పెరగడం గమనార్హం. విద్యా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంస్కరణలను చంద్రబాబు సర్కార్ ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. నిర్వీర్యం చేస్తూ వస్తోంది.రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్లు 15.50 శాతం, యూపీ స్కూళ్లల్లో 3.70 శాతం, ప్రాథమిక పాఠశాలల్లో 1.4 శాతం పెరిగింది. ఇదే క్రమంలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) నమోదు కూడా దిగజారినట్టు యూడైస్ ప్లస్ నివేదికలు చెబుతున్నాయి. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26)లో ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని అనేక సంస్కరణలను అమలు చేసింది. వేల కోట్ల నిధులను వెచ్చింది. వేల ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేలా ప్రణాళికను అమలు చేసింది. సర్కారు బడుల నిర్వహణలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి, చంద్రబాబు సర్కార్కి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. -
కూటమి ప్రభుత్వం దుబారా ఖర్చులు.. ప్రజలకు మాత్రం పొదుపు పాఠాలు
సాక్షి,అమరావతి: ఏపీ కేబినెట్లో చంద్రబాబు కొత్త ప్రచారం ప్రారంభించారు. విచిత్రమేమిటంటే, పర్యటనల పేరుతో, ఢిల్లీలో తన ఇంటి కోసం చేస్తున్న దుబారా ఖర్చులను మరిచిపోయిన చంద్రబాబు సర్కార్ ప్రజలకు పొదుపు పాఠాలు చెబుతోంది. కానీ సీఎం, మంత్రుల ప్రత్యేక విమానాల ఖర్చులపై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ‘నాదేశం -నా బాధ్యత’ అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారు చంద్రబాబు. జిల్లా పర్యటనల్లో ఖర్చు తగ్గింపు చర్యలు చేపడుతున్నామని చెబుతున్న చంద్రబాబు సర్కార్, వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’ అని ప్రకటించింది. -
రామోజీ చనిపోతే కేసులు ఎత్తేయాలా?
-
TTD టిక్కెట్ల స్కామ్ 48 కోట్లు దోచేశారు
-
పొలిటికల్ స్టైల్ షో.. ఈ అదిరే లుక్స్ చూశారా?..
-
క్రెడిట్ చోరీకి బాబు తంటాలు
-
అమ్మ రాధాకృష్ణా.. అమరావతిలో జాక్ పాట్ వెనుక ఇదీ అసలు కథ
-
‘జగన్ అంటే.. బాబు సర్కార్కు ఎందుకంత భయం?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అరెస్టు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అమరావతి అద్దాలకు రూ.2500 కోట్లు అని ఈనాడులో వచ్చిన వార్త గురించి ప్రస్తావించినా కేసులు, బీఆర్ నాయుడు రాసలీలలు గురించి ప్రశ్నిస్తే కేసులు, కర్నూలు బస్సు దహనం గురించి మాట్లాడినా కేసులే, శాంతిభద్రతల కోసం పని చేయాల్సిన పోలీసులను ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు’’ అంటూ మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అధికారాన్ని ఉపయోగించి రూల్స్కు విరుద్దంగా పని చేస్తున్నారు. ఏకంగా సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారు. కోర్టులు చేయాల్సిన పనులను కూడా పోలీసులే చేస్తారా?. అసభ్యకరమైన పోస్టులు ఉంటే ఆ పోస్టులను తొలగించాలి. కానీ ఏకంగా ఖాతాలనే తొలగించమనే హక్కు ఎవరిచ్చారు?. వైఎస్సార్సీపీకి చెందిన జగనన్న కనెక్ట్స్ను తొలగించాలని ఆదేశాలిచ్చారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రూల్స్కు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారు?. చట్టానికి వ్యతిరేకంగా పోలీసులు పని చేయటం దుర్మార్గం.‘‘ప్రజా సమస్యలను ప్రశ్నించినా ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. వైఎస్సార్సీపీ ఇన్స్ట్రాగ్రామ్ని పోలీసుల ద్వారా తొలగించారు. 27,443 హింసాత్మక నేరాలు ఏపీలో జరగడం దారుణం. రాష్ట్రంలో శాంతిభద్రతల పూర్తిగా కొరవడ్డాయి. వైఎస్ జగన్ని చూసి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?. సరైన పరిపాలన చేస్తే ఆ భయం ఉండదు. తాము చేస్తున్న దోపిడీ, అవినీతిలను బయటపెడుతున్నందునే ప్రభుత్వానికి భయం. కేసులు ఎదుర్కోవటం మాకు కొత్త కాదు. కొంతమంది కార్యకర్తలను హత్యలు చేశారు. మా వారిపై దాడులు చేసి, మళ్ళీ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. చట్టవ్యతిరేకంగా పని చేస్తున్న అధికారులందరి పేర్లూ డిజిటల్ బుక్లో నమోదు చేశాం. వారిపై కచ్చితంగా చట్టపరంగా పోరాటం చేస్తాం’’ అని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. -
రామోజీ తప్పులు మరణంతో సరా?
ఊరందరికి నీతులు చెప్పే ఈనాడు మీడియా తన గ్రూపు సంస్థల విషయానికి వచ్చేసరికి కళ్లు మూసేసుకుంటుంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఈనాడు గ్రూపు సంస్థలు మీడియా బలంతో తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాగూ వారి ఇంటి మనిషే. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ కూడా గురువు బాటలోనే నడుస్తూ ఈనాడు గ్రూపునకు వంత పాడుతున్నారన్న విమర్శ ఉంది. ఆర్బీఐ చట్టం ప్రకారం... అవిభాజ్య హిందూ కుటుంబం తరఫున ప్రజల నుంచి డిపాజిట్ల వసూలు చేస్తే సేకరించిన మొత్తానికి రెట్టింపు జరిమానా, జైలు శిక్షకు గురి అవుతారు. అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ప్రజల నుంచి రూ.2600 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందన్నది ఆరోపణ. రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఈ విషయమై కోర్టుకెక్కారు. ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం వ్యవస్థల్లోని లోపం. ఈ వివాదం మొదలయ్యాక రామోజీరావు టీవీ ఛానళ్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని డిపాజిటర్లకు తిరిగి చెల్లించినట్లుగా చెబుతారు కానీ... అందులో మతలబులు ఉన్నాయన్నది ఉండవల్లి వాదన. అందుకే ఆయన అప్పట్లో డిపాజిటర్ల జాబితా కోరారు.ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ఉన్న కేసును కొట్టి వేస్తే ఆ విషయం వ్యాజ్యం వేసిన ఉండవల్లికి కొన్ని నెలలపాటు తెలియకపోవడం. సమాచారం తెలుసుకున్న ఉండవల్లి సుప్రీంకోర్టు ఆశ్రయించడం, న్యాయస్థానం ఆదేశించడంతో కేసు మళ్లీ తెలంగాణ హైకోర్టుకు వచ్చింది. అయితే అప్పటికి సంస్థ అధినేత రామోజీ రావు మరణించినందున, రెండు రాష్ట్ర ప్రభుత్వాల అఫిడవిట్లను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు కేసును కొట్టివేసింది. దీనిపై ఉండవల్లి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత టర్మ్లో ఏపీలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం డిపాజిట్ల సేకరణలో జరిగిన తప్పులను ఎత్తిచూపి అఫిడవిట్ దాఖలు చేసింది. కాని ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కార్ మరో వైఖరి తీసుకుంది. రామోజీరావు మరణించారు కనుక ఆ కేసును ఎత్తివేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ కోర్టును కోరాయి. చట్టం ప్రకారం ఇది చెల్లుతుందా అన్న చర్చ జరుగుతోంది. నేరం జరిగిన తర్వాత సంబంధిత సంస్థ యజమాని మరణిస్తే, ఆ కంపెనీ బాధ్యత తీరిపోతుందా అన్నదే ప్రశ్న. ఈ నేపథ్యంలోనే మార్గదర్శి కేసు ఇక్కడితో ముగించాలంటే ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతామని తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నందున క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవని అభిప్రాయపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్ తరపున ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్గి వాదిస్తూ రామోజీరావు మరణించినందున కేసు ముగించాలని కోరగా, ఉండవల్లి అరుణకుమార్ తరపు న్యాయవాది కె.పరమేశ్వర్ అభ్యంతరం తెలిపి వ్యక్తి మరణించినా జరిగిన నేరానికి జరిమానా చెల్లించాల్సిందేనని వాదించారు. అత్యున్నత కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు, మార్గదర్శి ఫైనాన్షియర్స్కు నోటీసులు జారీ చేసింది. అక్రమంగా రూ.2600 కోట్ల డిపాజిట్లు సేకరించారని ఆ డబ్బును ఇతర కంపెనీలకు మళ్లించారన్నది ప్రధాన ఆరోపణగా. అంతిమంగా ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో చెప్పలేం. కాకపోతే నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్పై, ఆ పార్టీ నేతలపైన విషం చిమ్ముతూ వార్తలు ప్రచారం చేసే ఈనాడు గ్రూపు మీడియా తన వరకు వచ్చేసరికి ఎలా వ్యవహరిస్తోందని చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ అవుతుంది. ఈ మధ్య టీటీడీ లడ్డూ వివాదంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి దినేష్ కుమార్ ఇచ్చిన నివేదికపై విశ్లేషణలు ఇస్తూ వైసీపీ నేతలపై దారుణమైన కథనాలను రాసింది. ఇదొక్కటే కాదు. అనేక అంశాలలో వైసీపీ తన రాజకీయ ప్రత్యర్థి అన్నట్టుగా ఇష్టారీతిలో స్టోరీలు ఇస్తుంటుంది. గతంలో వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్గా ఉండగా లడ్డూ తయారీలో వాడే నెయ్యి నాణ్యతపై కమిటీ వేసి పరిశీలన చేయాలని ఆదేశించినా, ఆ తర్వాత దానిని ఫాలో అప్ చేయలేదన్నద ఆరోపణట. అలా చేయలేదు కనుక ఆయనను కూడా దోషిగా చూపాల్సిందేనని ఎల్లో మీడియా వాదన. ఆయనను వదలి వేస్తారా అంటూ రాజకీయ నేతల కన్నా ఎక్కువగా వాపోతూ కథనాలు ఇచ్చింది. అలాగే నెయ్యి కొనుగోలు కమిటీలో ప్రస్తుత మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గత టర్మ్లో సభ్యులుగా ఉన్నారు.వారి గురించి మాట మాత్రం రాయకుండా ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు బాధ్యులని దినేష్ కుమార్ నివేదికలో ఉందట. దాని ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా ఈ మీడియా ప్రచారం చేసింది. నిత్యం ఎప్పుడో వైసీపీ హయాంలో ఆ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది! ఇప్పటికీ వైసీపీ అనుకూల అధికారులు ఆయా సంస్థలలో పనిచేస్తున్నారంటూ పిచ్చి వార్తలు రాసే ఈనాడు మీడియా కు సుప్రీంకోర్టులో మార్గదర్శి డిపాజిట్ల కేసులో మాత్రం ఎందుకు కిక్కురుమనలేకపోయింది? వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై చెప్పిన అభిప్రాయం ఆసక్తికరంగా ఉంది. 'తన దగ్గర లైసెన్స్ లేని తుపాకి ఉందని, కాని ఎప్పుడూ ఎవరిని కాల్చలేదని, కేసు రాగానే తిరిగి ఇచ్చేశానని చెబితే చెల్లుతుందా?" అని ఆయన ప్రశ్నించారు. మరో వాదన కూడా వస్తోంది. రామోజీరావు ఈ కేసులో తప్పు చేసినట్లు మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ఒప్పుకున్నట్లేనా అన్నది ప్రశ్న. తప్పు చేసినా ఆయన మరణించారు కనుక కేసు ఎత్తివేయాలని కోర్టులో వాదిస్తున్నారా? అన్న చర్చ నడుస్తోంది. తమకు గిట్టనివారిపై ఉన్నవి,లేనివి రాసి నిత్యం బదనాం చేసే పనిలో ఉండే ఈనాడు ఈ కేసులో లాజిక్కు ఏమిటో వివరించి ఉంటే బాగుండేది కదా! పలుకుబడి కలిగిన తమకు ఆర్బీఐ నిబంధనలు వర్తించవని రాసి ఉండాల్సింది కదా! చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రైతు చనిపోతే.. కుప్పకూలాడని రాస్తావా.. నీది మనిషి పుట్టుకేనా..
-
కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్
-
ఆ లెక్కలు బయటపెట్టాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుబారా ఖర్చులతో రాష్ట్రం అతలాకుతలమవుతుందని.. దీనిపై చర్చించాలంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిలో సాధారణ ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు.‘‘పార్లమెంటు భవనం, తెలంగాణ సెక్రటేరియట్కు కూడా కాని ఖర్చు అమరావతిలో చేస్తున్నారు. అడుగుకు రూ.16 వేలు ఖర్చు చేయటం దుబారా కాదా?. రూ.20 కోట్లతో అయ్యే రోడ్డును వంద కోట్లకు చేయటం చంద్రబాబుకే చెల్లు. అమరావతిలో పెడుతున్న ఖర్చులు చూసి రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి అద్దాలకే రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోయటానికే రూ.800 కోట్లు ఖర్చు చేస్తారా?. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దుబారాని వెంటనే ఆపాలి..కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా తాత్కాలికంగా ఆపారు. అమరావతి నిర్మాణాలపై నిర్ణయం తీసుకోండి. ముందుగా మొక్కజొన్న రైతులకు ఆ డబ్బు చెల్లించండి. చంద్రబాబు తన దుబారా ఖర్చులను రైతులకు ఉపయోగించాలి. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల ప్రయాణాన్ని ఆపాలి. అధికారులు, మంత్రులు కూడా దబారా ఖర్చులు తగ్గించాలి. రాజధాని పేరుతో వసూలు చేసిన బంగారం, డబ్బు లెక్కలు బయట పెట్టాలి. జనం నుండి వసూలు చేసిన ఆ డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయి?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా వెంటనే ఇవ్వాలి. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈవెంట్ లాగా చేస్తూ దుబారా ఖర్చులు పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులను మళ్లీ మళ్లీ ప్రారంభించటం దుబారా కాదా?. ప్రధాని రెండు వాహనాల్లో వెళ్లినందున చంద్రబాబు ఒక్క ఆరులో వెళ్లి పబ్లిసిటీ చేసుకుంటారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది కరోనా టైంలో వచ్చింది. చివరికి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో చెట్లు నాటించింది తానేనని చెప్పుకున్నారు. శ్రీకాకుళం నుండి రాయలసీమకు వర్షపు నీరు పంపుతారట. ఇలాంటి డైలాగులు, అబద్దపు ప్రచారాలు ఆపాలి’’ అని సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
ఆక్వా రైతులకు అన్యాయం.. పచ్చ చొక్కాలకే లాభం! చంద్రబాబు పై కాకాని ఫైర్
-
ఆగని చంద్రబాబు దుబారా ఖర్చులు
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు దుబారా ఖర్చులు కొనసాగుతున్నాయి. సీఎం ఢిల్లీ ఇంటికి హంగులు కోసం రూ.67 లక్షల మంజూరుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీటింగ్ హాల్, మైనర్ రిపేర్ల కోసం రూ.67 లక్షలు ఖర్చు పెట్టనుంది.గతంలో ఇదే ఢిల్లీ ఇంటికి సౌకర్యాలు, హంగులు కోసం 95 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. మళ్ళీ ఇప్పుడు రూ. 67 లక్షలు మంజూరు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కలిపి.. సీఎం చంద్రబాబు ఢిల్లీ నివాసంలో విలాసవంతమైన సదుపాయలకు ఖర్చు 1.62 కోట్లకు చేరుకుంది.కాగా, అసెంబ్లీ నిర్మాణ వ్యయం చంద్రబాబు సర్కార్ పెంచేసిన విషయం తెలిసిందే. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే. -
రైతుల ఉసురు పోసుకుంటున్న... కూటమి ప్రభుత్వ పతనం తప్పదు
-
CM విజయ్ ని చూసి బాబు, పవన్ నేర్చుకోవాలి..
-
మీ కులమైతే చాలు.. ఏమైనా చేస్తారా..?
-
జగనే రైట్ అన్నది కూటమి కూడా గుర్తిస్తోంది!
ఎన్టీ రామారావు నటించిన ఓ సినిమాలో ‘‘కోర్టు కోర్టుకు ఒక తీర్పు...’’ అంటూ ఓ పాటుంది. అప్పట్లో సూపర్హిట్ ఈ పాట. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు గమనిస్తే... ఈ పాట మరోసారి గుర్తుకురాక మానదు. విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం అంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించడం ఇందుకు కారణమవుతోంది. 2019-2024 మధ్యకాలంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషును ప్రవేశపెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే... తెలుగుదేశం, జనసేన, బీజేపీ తదితర పార్టీలు నానా యాగీ చేశాయి. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. ఆంగ్ల మీడియం వల్లనే ఆంధ్ర పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని చెబుతూనే వారికి కావాల్సిన మాధ్యమంలో చదువుకునే వెసలుబాటూ కల్పించారు. ఇందుకోసం ఆంగ్లం, తెలుగు భాషలు రెండింటిలోనూ పాఠాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియంను తీసుకురావడాన్ని ఎద్దేవ చేస్తూ శ్రీకాకుళంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వంటివారు తెలుగు భాషకు ఛాంపియన్ల మాదిరి వాదించారు. కాకినాడ జిల్లా బెండపూడికి చెందిన విద్యార్థులు ఇంగ్లీషు అద్భుతంగా మాట్లాడితే అవమానించిన టీడీపీ పెద్దలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ప్రజలలో మాత్రం ఆంగ్ల మీడియంపైనే ఆసక్తి ఉందన్న విషయం అనేక సర్వేలలో వెల్లడైంది. ప్రైవేటు స్కూళ్లలో ఆంగ్ల మీడియం ఉంటే అభ్యంతర పెట్టని ఈ నేతలు, ప్రభుత్వ స్కూళ్లలో చేరే పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ వద్దని ఎలా అంటారో అర్థం అయ్యేది కాదు. చిత్రంగా తెలుగు మీడియం అంటూ గొంతు చించుకుని మాట్లాడే ప్రముఖులెవ్వరి పిల్లలు, లేదా మనుమళ్లు ఆ మీడియంలో చదవడం లేదు. అంతా పెద్దపెద్ద కార్పొరేట్ స్కూళ్లలోనే ఆంగ్లంలోనే విద్యనభ్యసిస్తుంటారు.ఈ విషయాలన్ని బహిరంగంగానే ప్రజలు మాట్లాడుకునేవారు. అయినా జగన్ ప్రభుత్వం ఆ సంస్కరణ తెచ్చిందన్న ఆక్రోశంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దానిని వ్యతిరేకించారనిపిస్తుంది. రాజకీయ దురుద్దేశాలతో కొందరు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కోర్టుకెక్కారు. అప్పట్లో విచారణ చేసిన హైకోర్టు కూడా ఆంగ్ల మీడియం వైపు మొగ్గు చూపలేదు. కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజలలో చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో లను రద్దు చేసింది. జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.అక్కడ వాదోపవాదాలు చాలాకాలం సాగాయి.అది ఎటూ తేలలేదు. ఈలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది.దాంతో దానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం యధావిధిగా, ఆంగ్ల మీడియం విషయంలోను యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో బోధన భాషగా ఆంగ్లం ఉంటుందని గత నెల 16న ఒక ఆదేశం జారీ చేసింది. దీనిపై ఫ్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ అనే ఆయన హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేసిన ఛీప్ జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్యల బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్ధులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి అని, లేకపోతే పిల్లలు ఆయా రంగాలలో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని అభిప్రాయపడింది. ఇంగ్లీష్ అందరిని ఏకం చేసే ఒక అంశమని కూడా వ్యాఖ్యానించింది. పిల్లలకు తెలుగుతో పాటు ఆంగ్లంలో చదువుకోవడానికి అవకాశం కల్పించడం ద్వారా వారు ఇంతర రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. మంచి పరిణామమంటూ వ్యాఖ్యానించింది. అయితే పిటిషనర్ తరపున న్యాయవాది మాట్లాడుతూ ఇదే అంశంపై గతంలో హైకోర్టు జీవోలను కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా ప్రస్తుత ప్రభుత్వం ఇంగ్లీష్ బోధన భాషగా ప్రొసీడింగ్స్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. ఆంగ్లభాషను పొరపాటున బోధన భాషగా పేర్కొన్నామని, ఆ ప్రొసీడింగ్స్ను సవరించామని నివేదించారు. ప్రభుత్వ స్కూళ్లలో ద్విభాష విధానం అమలలో ఉంటుందని తెలిపారు. దాంతో హైకోర్టు ఈ వ్యాజ్యం నిరర్థకమని తేల్చేసింది. జగన్ ప్రభుత్వం ఇదే విధానం అమలు చేసినప్పుడు ఇదే హైకోర్టులో హోరాహోరీగా వాదోపవాదాలు జరిగాయి. ఆంగ్లంతో పాటు తెలుగు ఉంటుందని ఆనాటి ప్రభుత్వం తెలిపినా న్యాయ వ్యవస్థ కూడా పలు సందేహాలు వెలిబుచ్చింది. అంతేకాక సంబంధిత జీవోను కూడా కొట్టివేసింది. దాంతో అప్పటి ప్రభుత్వం సుప్రింకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినా ద్విభాష విధానాన్నే ఇప్పుడు తెలుగు దేశం ప్రభుత్వం కూడా అమలు చేయక తప్పలేదు. అంటే దీని అర్థం చంద్రబాబు సర్కార్ ఇంగ్లీషులో చదువుకునే అవకాశం లేకుండా చేస్తోందని, తద్వారా పేద పిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్న అభిప్రాయం బలపడుతుండడంతో వెనక్కి తగ్గిందని అనుకోవాలి. అంతేకాక అప్పట్లో రాజకీయంగా వైఎస్సార్సీపీని ఆయా వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టడం, ప్రజలలో ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీయడం వంటి లక్ష్యాలతో టీడీపీ పనిచేసింది. అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకువచ్చిన అనేక సంస్కరణలను, పాలన వ్యవస్థలను కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఒప్పుకోక తప్పడంలేదు. జగన్ టైమ్ లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కూటమి పాలనలో ఇదే అంశంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించకుండా ఉంటారా? జగన్ సీఎంగా ఉంటే ప్రతిదానిని రాజకీయం చేసి,ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విషం చిమ్మిన సంగతి ఒకటికి ,పదిసార్లు నిర్ధారణ అవుతోంది. ఆంగ్ల భాషను మీడియం గా ఉంచడం ద్వారా జగన్ తన విజన్ ను చూపితే, అప్పట్లో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ తదితరలు సంకుచితంగా వ్యవహరించారు.ఇప్పుడు జనాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నిన్ను నమ్మం బాబూ!
-
అసెంబ్లీ నీ జాగీరా.. మెడ పట్టుకొని గెంటేస్తావా..?
-
ఆ తండ్రీకొడుకులకు టైమ్ దగ్గర పడింది!
-
బెంగళూరుకు క్యూ కడుతున్న ఏపీ ప్రజలు.. కారణం ఇదే
నంద్యాల జిల్లా: అధికారంలో ఉన్నామని, తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. పేదలకు ఉపాధిహామీ పథకాన్ని దూరం చేస్తూ కరువు శాసనం రాశారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వీరి వెంట చిన్నారులు, వృద్ధులు వస్తున్నారు. డోన్ మండలం జగదుర్తి గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 1,200 మంది ఉండగా వీరిలో అత్యధికమంది పేదలు. వేసవి కాలంలో వీరికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అండగా నిలిచాయి. ఈ పథకం లక్ష్యం నీరుగార్చేందుకు టీడీపీ నాయకులు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం మేటీ, ఫీల్డ్ అసిస్టెంట్ పదవుల కోసం పోట్లాడుతూ పేదలకు పనులు కల్పించకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో జగదుర్తి గ్రామస్తులు చాలా మంది పనుల కోసం ఆదివారం గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్తేందుకు డోన్ రైల్వేషన్కు వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, దొంగ మస్టర్లతో కూలీల డబ్బులు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు వలస వెళ్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏపీఎం సుకూర్ను ప్రశ్నించగా జగదుర్తి పంచాయతీ పరిధిలో ఉపాధి హామీపనులు ఇంతవరకు జరగని మాట వాస్తవమని పేర్కొన్నారు. గ్రామ పెద్దలతో చర్చించి కూలీలు పనుల కోసం వలస వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. -
అమరావతిలో బాబు మ్యాజిక్ ఎవడి సొమ్ము ఎవడికి దానం
-
భాగ్యలక్ష్మి బంపర్ లాటరీలా.. అమరావతి లాటరీ మాయాజాలం
-
మహా న్యూస్కు భారీ నజరానా ఆ వీడియోల కోసం 56.64 లక్షలు..
-
5 ఎకరాల్లో ఇల్లు ఇంటి ముందు అసెంబ్లీ, వెనుక హైకోర్టు
-
రూ.10 కోట్లు విలువైన పార్క్ స్థలం కబ్జా..!
సాక్షి, టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గుడి, బడి, ప్రభుత్వ స్థలాలు.. ఇలా దేన్నీ వదలకుండా ఆక్రమించేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి రూరల్ మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామ పంచాయతీకి కేటాయించిన రూ.10 కోట్ల విలువజేసే 1.57 ఎకరాల పార్క్ స్థలాన్ని ఓ టీడీపీ నాయకుడు ఆక్రమించి పట్టపగలే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్క్ స్థలం కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టిస్తున్న వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేకి సమీప బంధువునని చెబుతుండడం వల్ల సదరు ఎమ్మెల్యే స్పందించి నిర్మాణ పనులను నిలిపివేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పుదిపట్ల గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 558లో ఉన్న దరఖాస్తు పట్టా భూమిని గతంలో ఓ ప్రైవేట్ వెంచర్ సంస్థ అభివృద్ధి చేసి పార్క్కు కేటాయించినట్టు సమాచారం. ఆ స్థలంపై చాలాకాలం నుంచి కన్నేసిన స్థానిక టీడీపీ నేత ఇప్పుడు అధికార బలంతో స్వా«దీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు తిరుపతి కోర్టును ఆశ్రయించగా, అది పార్కు స్థలమేనని కోర్టు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా రికార్డులు మార్చి ఆక్రమణదారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని, ఆ స్థలంపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తున్నందున కింది కోర్టు ఆదేశాలు ధిక్కరణ కింద చర్యలు కోరతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. -
బాబు బినామీలకు ‘ప్రైమ్ ప్లాట్లు’ రైతులకు పాట్లు: మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో సామాన్య రైతులకు ఒక నీతి.. చంద్రబాబు బినామీలకు మరో నీతి అమలు చేస్తూ వ్యవస్థీకృత వివక్షకు తెర తీశారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. అమరావతిలో భూములిచ్చిన సామాన్య రైతులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఇస్తే.. చంద్రబాబు అనుచరులకు మాత్రం సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో భూములు కేటాయించారన్నారు. చంద్రబాబు తన ఇంటి పక్కన రైతులు ఎవరూ ఉండకూడదని 3,800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే గ్రీన్ బెల్ట్గా మార్చేశారన్నారు.కోర్ క్యాపిటల్ పరిధిలో లక్షన్నర చదరపు అడుగుల వైశాల్యంతో తన ప్యాలెస్ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు రాజధానిలో అద్దాల పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించిన ఆచరణ సాధ్యమైన ‘మావిగన్’ ప్రతిపాదనను పక్కనపెట్టి చంద్రబాబు కేవలం క్విడ్ ప్రో కో కోసమే అమరావతి తంతు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని మీడియాతో మాట్లాడారు.సామాన్యులకు ఒక నీతి... బాబుకు ఒక నీతి..‘సీఆర్డీఏ నిబంధనలు సామాన్య రైతులకు సంకెళ్లులా మారాయి. రైతులు తమ ప్లాట్లను వారసులకు ఇవ్వటానికి కూడా వీల్లేకుండా నిబంధనలు రాసిన చంద్రబాబు తన బినామీలకు మాత్రం అన్ని రూల్స్ పక్కనపెట్టి మేలు చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏ స్థాయిలో చంద్రబాబు దోచుకుంటున్నారో చెప్పేందుకు ఆయన కడుతున్న ప్యాలెసే నిదర్శనం. నక్కపల్లిలో రూ. 600 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ పొందిన అట్లూరు శ్రీనివాసే చంద్రబాబు ఇల్లు కడుతున్నారు. ఇది క్విడ్ ప్రో కో కాదా? ఏడాదిలోనే బాబు ఇంటి సివిల్ పనులు పూర్తయ్యాయి కానీ రాజధాని భవనాలు మాత్రం అతీగతీ లేవు. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసేందుకు ప్రధానమంత్రి పక్క రాష్ట్రంలో ఉన్న వారి ఇళ్లకు వెళ్లడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం’ అని పేర్ని అన్నారు. రెండో విడత పూలింగ్కు వ్యతిరేకం..‘అమరావతి పేరుతో ఇప్పటికే రూ.50 వేల కోట్లు అప్పు చేశారు. 8 నుంచి 10 శాతం వడ్డీకి ఇంకా అప్పు తెస్తున్నారు. కేవలం అద్దాల కోసమే రూ.2,500 కోట్లు ఖర్చు చేయడం ఏ రకమైన అభివృద్ధి? అమరావతిని రాష్ట్రానికి ఒక గుదిబండలా తయారు చేస్తున్నారు. అమరావతిలో రెండో దశ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రైతులు భయపడాల్సిన పనిలేదు. జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆ భూములను నిషే ధిత జాబితా నుంచి తొలగిస్తారు. కేంద్ర మంత్రి పెమ్మ సాని రైతులను గెటవుట్ అని అవమానించడం సిగ్గు చేటు. రూ.వందల కోట్లు పెట్టి మంత్రి పదవి తెచ్చు కున్నంత మాత్రాన రైతులను అవమానించే హక్కు లేదు. రైతుల కళ్లల్లో నీరు రాష్ట్రానికి అరిష్టం. రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో వారిని వేధిస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు’ అని పేర్ని స్పష్టం చేశారు. -
మహాటీవీకి చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధి
సాక్షి,విజయవాడ: మహాటీవీకి చంద్రబాబు ప్రభుత్వం రూ.56.64లక్షలు లబ్ధి పొందేలా నిర్ణయం తీసుకుంది. పబ్లిసిటీ వీడియోలను రూపొందించినందుకు నిధులను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్, దీపం, ఉచిత ఇసుక పథకం వంటి కార్యక్రమాల ప్రచారం కోసం రూ.56.64లక్షల నిధుల్ని కేటాయించారు. తద్వారా చంద్రబాబు తన అనుకూల మీడియాకు భారీగా లబ్ధి చేకూరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఒక్క వర్గానికి కూడా మేలు జరగడం లేదు
-
అమరావతిలో ఏబీఎన్ రాధాకృష్ణ పిల్లలకు ఫ్లాట్లు ఎలా ఇస్తారు?
సాక్షి,తాడేపల్లి: రాజధాని పేరుతో అమరావతిలో ఆర్గనైజ్ కరప్షన్ కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారిందన్న పేర్ని నాని మావిగన్ అభివృద్ధి చేస్తే రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని అన్నారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇంటి సమీపంలో రైతుల ఫ్లాట్లు ఉండొద్దా? రాధాకృష్ణ పిల్లలకు మాత్రం ప్లాట్లు ఇస్తారు. మిగితా వారికి అభివృద్ధి జగరని ప్రాంతంలో ప్లాట్లు ఎందుకు ఇస్తారు. చంద్రబాబు బినామీలకు న్యాయం జరుగుతోంది. కళ్లముందే భారీ దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు కలలు కనే రాజధాని ఎప్పటికి అవుతుందో ఎవరికీ అంతుపట్టటం లేదు. ఐదు లక్షల మందిని సర్వనాశనం చేసే బదులు మావిగన్ రాజధానే బెటర్. మావిగన్ రాజధానికి సిరులు కల్పిస్తుంది. దీనిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పైగా తన మంత్రులతో వైఎస్ జగన్ని దూషిస్తున్నారు.అమరావతిలో వ్యవస్థీకృత అవినీతి జరుగుతోంది. అవినీతికి మారుపేరుగా అమరావతిని తయారు చేశారు.అవినీతే కాదు, వ్యవస్థీకృత వివక్ష కూడా జరుగుతోంది. సీఆర్డీఏ చట్టంలోని ఏ రూలు కూడా చంద్రబాబు, ఆయన మనుషులకు వర్తించవు. ఆ రూల్స్ అన్నీ సామాన్య ప్రజలు, రైతులకే చంద్రబాబు ఇల్లు ఈ6 రోడ్డులో కడుతున్నారు.ఆ స్థలం ఇచ్చిన రైతు కంచర్ల కుటుంబానికి అక్కడే ఎందుకు స్థలం ఇచ్చారు?.2024లో వారికి ప్లాటు కేటాయించటం, 2025లో చంద్రబాబు కొనుక్కున్నారు. ఐదు ఎకరాల్లో చంద్రబాబు కడుతున్న ఇంటిని ఏం ప్యాలెస్ అనాలి?.సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మధ్యలోనే చంద్రబాబుకు ప్లాటు ఎలా వచ్చింది?.సాధారణ రైతులకు ఇలాంటి ప్రాంతాల్లో ఎందుకు ప్లాట్లు ఇవ్వరు?. చంద్రబాబు కడుతున్న ఇంటి పక్కన ఎవరూ ఉండటానికి వీల్లేదన్నట్టుగా గ్రీన్ బెల్ట్ గా ప్రకటించారు.మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్లు ఎలా ఇచ్చారు?.బెజవాడ రమేష్కు నాలుగు ప్రధాన రోడ్ల మధ్యలో ఎలా ఇచ్చారు?.చంద్రబాబు మనుషుల్లోని కమ్మవారికే రాజధానిలో న్యాయం చేస్తున్నారు.మిగతా కమ్మ వారికి ఎందుకు న్యాయం చేయటం లేదు?. సుబ్బారావు అనే టీడీపీ నేతకు కూడా హైకోర్టు పక్కనే ఇచ్చారు. కేంద్ర మంత్రి పెమ్మసాని రైతులను గెటవుట్ అంటూ అవమాన పరుస్తున్నారు. ఆయన ఎదుట సెల్ఫోన్ లో కూడా మాట్లాడటానికి వీల్లేదు. మంత్రి చేష్టలకు రాజధాని రైతులు తీవ్రంగా అవమాన పడుతున్నారు. జూన్ లో వర్షాలు పడితే అమరావతిలో మళ్ళీ నీళ్లు నిలపడతాయిపనులన్నీ ఆగిపోతాయి, మరి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు?. ఇక ప్రభుత్వానికి మిగిలింది కేవలం రెండు ఆరు నెలలు మాత్రమే. ఏడ్చి ఏడ్చి రైతుల కన్నీళ్లు కూడా ఇంకి పోయాయి. రెండో విడత భూములు ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు వైఎస్సార్సీపీ నిషేధం. ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే మా ప్రభుత్వం వచ్చాక తిరిగి ఇచ్చేస్తాం. లక్షన్నర చదరపు అడుగులతో చంద్రబాబు ఇల్లు కడుతున్నారుసంవత్సరానికే చంద్రబాబు ఇల్లు దాదాపుగా పూర్తి కావచ్చింది. కానీ అమరావతి నిర్మాణం మాత్రం ఇంకా ఎక్కడిదక్కడే ఉంది. నగరాలు, రాజధానులను ప్రభుత్వం కట్టిన సందర్భాలు లేవు.అమరావతిలో అద్దాలకు రూ.2,500 కోట్లా?. ఇంత దోపిడీ ఎక్కడా జరగలేదు. రైతులు కన్నీరు పెట్టిన ఏ రాజ్యం బాగు పడలేదు. జనాన్ని కార్లలో తిరగవద్దంటున్న ప్రధాని మోదీ కూడా రైళ్లలో తిరిగితే బాగుంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ కలిసి ఒకే కారులో తిరిగితే మంచిది. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల ఇళ్లు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.అక్కడికి ప్రధాని మోదీ వెళ్లటం ఏపీ ప్రజల ఖర్మ. రాజధానిలో కట్టే ప్రతి ప్రభుత్వ బిల్డింగ్ సీఆర్డీఏకు అద్దె కట్టాలి ఇది అత్యంత దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
కాళహస్తిలో అధికారుల అరాచకం.. ప్రశ్నించిన పాపానికి మహిళపై...
-
‘అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా? అని ప్రశ్నించారు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి కొల్లు రవీంద్ర పచ్చ కళ్ళజోడు తీసి చూస్తే వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కనపడుతుంది. చంద్రబాబులాగా అబద్దపు హామీలు జగన్ ఇవ్వలేదు. మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసిన ఏకైక నేత జగన్. చంద్రబాబు అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేశారు. రాష్ట్రాన్ని అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేమంటూ ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. ఎన్టీఆర్ నుండి రాష్ట్ర ప్రజల వరకు అందరికీ వెన్నుపోటు పొడిచారు.రాష్ట్ర అభివృద్ధి అంటే జగన్ హయాంలోనే జరిగింది. జగన్ తెచ్చిన పది హార్బర్లు, మూడు పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా?. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా?. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందటం ఇష్టం లేదా?. విజయవాడ సిద్దార్థ కాలేజీకి కూడా లీజు పద్ధతిలో భూములు ఇచ్చారు. అక్కడ పేద విద్యార్థులకు సీటు కూడా దొరకదు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి. డిజైన్ల పేరుతో వందల కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప నీకు ఇంకేం వచ్చు? చేతకాని పాలనా.. అసమర్థుని పాలనా..
-
విశాఖను కొత్తగా విశ్వనగరం చేయడం ఏంటి?
మనకు నచ్చిన వాడు అధికారంలో ఉంటే.. విశాఖ విశ్వనగరి అవుతుంది. లేదంటే ఎందుకు కొరగానిది. సాగర ముప్పు ఎదుర్కుంటుంది. ఇదీ ఆంధ్రప్రదేశ్లో ఎల్లోమీడియా వైఖరి. డేటా సెంటర్, లేదా ఇతర పరిశ్రమల ఏర్పాటు కోసం జగన్ భూములు కేటాయిస్తే రాష్ట్రాన్ని అదానికి రాసిచ్చేస్తున్నట్లు... అదే చంద్రబాబు ఇస్తే... మాస్టర్స్ట్రోక్ అన్నమాట. అయితే ఈ రకమైన ద్వంద్వ వైఖరితో ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న కథనాలు వాటి పరువును మరింతగా బజారుకీడుస్తున్న సంగతి వాటికి అర్థం కావడం లేదని అనిపిస్తుంది. తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి నారా లోకేశ్ల ప్రయోజనాలను కాపాడడమే తమ లక్ష్యంగా ఈ రెండు పత్రికలు పని చేస్తున్నాయి. తమ రాతల ద్వారా, ప్రసారాల ద్వారా ప్రజలను నిత్యం మోసం చేయాలని ప్రయత్నిస్తోంది.ఈనాడు పత్రిక కొద్ది రోజుల క్రితం విశ్వనగరి.. మన విశాఖ అని ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అదాని గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేయడానికి రెండు రోజుల ముందు రాసిన స్టోరీ ఇది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల దృష్టి ఇటువైపే అని పేర్కొంది. అంతే... ఏయు శతాబ్ది ఉత్సవాల్లో, డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలోనూ బాబు కూడా అదే రాగం ఎత్తుకున్నారు. నిజానికి విశాఖ ఎప్పటి నుంచో అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఉన్న నగరం. విశాఖపై దాడికి ప్రయత్నించి పాకిస్థాన్ జలాంతర్గామిని భారత నావికాదళం సముద్రంలో ముంచేసింది ఇక్కడే. ఆ జలాంతర్గామి ఇప్పటికీ అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంటుంది.అంతేకాదు. సుందరమైన సముద్రతీరం దాని సొంతం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ అంతటా జరిగిన పెద్ద ఉద్యమం దేశం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు దానిని నీరుకార్చి ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కోసం కూటమి పెద్దలు తాపత్రయపడుతున్నారు. అది వేరే విషయం. హెచ్పీసీఎల్తో పాటు హిందుస్తాన్ జింక్, అనేక భారీ పరిశ్రమలు కొన్ని దశాబ్దాల క్రితమే అక్కడ ఏర్పాటయ్యాయి. రెండు పోర్టులు, షిప్ యార్డులు ఉన్నాయి. అందువల్లే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే ఏపీకి మంచి గ్రోత్ ఇంజన్ అవుతుందని భావించారు. దానిని అడ్డుకుంది ఇదే తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ ఎల్లో మీడియానే! ఎక్కడ జగన్కు పేరొచ్చేస్తుందో అనే దుగ్ధ. ఎలాగైనా దానిపై విషం చిమ్మాలన్న ఏకైక లక్ష్యంతో ఆ మీడియా పనిచేసింది. అందుకే అప్పట్లో ఈనాడు ‘‘తీరంలో చీలిక’’, ‘‘ఈ గాయం తీరనిది’’, ‘‘మరిగే ఎండ కరిగే మంచు, పొంగే సముద్రం ..ఆ నగరాలకు ముప్పు ..జాబితాలో మన విశాఖపట్నం కూడా ,భయపెడుతున్న నాసా అధ్యయనం అని వార్తలు వండి వార్చారు. సముద్రం కారణంగా విశాఖ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని రాశారంటే ఏమని అనుకోవాలి. అంతేకాదు.. తీర ప్రాంతం గుండా భోగాపురం విమానాశ్రయానికి రోడ్డు విస్తరణ చేస్తుంటే ,ప్రజల ఇళ్లు పోతాయని రెచ్చగొడుతూ స్టోరీలు ఇచ్చారు. జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి 'అదాని అడిగారని..2600 కోట్ల భూమి 130 కోట్లకే సొంతం’ అని రాసింది. కృష్ణపట్నం పోర్టును కట్టబెట్టారు..గంగవరం పోర్టును చుట్టబెట్టి ఇచ్చారు., ఇది అదాని పై సర్కార్ కు ఉన్న ప్రేమ అని విమర్శిస్తూ స్టోరీలు ఇచ్చారు. ఇప్పుడు ఇవే మీడియా సంస్థలు ఆహో, ఓహో అని తెగ పొగుడుతూ వార్తలు ఇస్తున్నాయి. అదాని డెటా సెంటర్ను గూగుల్ డేటా సెంటర్ గా ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. ఇక అది సాధ్యం కాదని అర్ధం అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే అదాని డేటా సెంటర్ కే ప్రభుత్వం భూములు కేటాయించవలసి వచ్చింది.ఈ కంపెనీ ఏర్పాటు చేసే డేటా సెంటర్ ను గూగుల్ వాడుకుంటుంది.అంటే ఒక రకంగా అద్దెకు తీసుకుంటుందన్న మాట. తప్పులేదు. కాని జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి ఆ భూమి ఎకరా విలువ రూ.20 కోట్లు ఉంటుందని లెక్కగట్టింది. ఎకరా కోటి రూపాయలకే ఇచ్చేస్తారా అని తప్పుపట్టింది. ఇప్పుడేమో 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతుంటే అబ్బ! ఎంత గొప్పదనం అని తెగ సంబర పడుతోంది. ఇలా ఉంటుంది ఎల్లో మీడియా ద్వంద్వ నీతి. అదాని డేటా సెంటర్ జగన్ టైమ్ లో వచ్చింది. దానిని మరికొంత పెంచి 490 ఎకరాల భూమిని ఇచ్చి గూగుల్ డేటా సెంటర్ అన్నారు. ఒకే. ఫర్వాలేదు.ఈ డేటా సెంటర్ వల్ల తక్కువ ఉద్యోగాలు వస్తాయనే కదా జగన్ ఆ రోజుల్లో పలు షరతులు పెట్టి 25 వేల ఉద్యోగాలు కల్పించాలని జి.ఓ.లో పేర్కొన్నారు. ఇప్పుడేమో కేవలం 200 ఉద్యోగాలే వస్తాయని ప్రభుత్వమే అధికారికంగా తెలిపింది. ఆ తర్వాత ఫ్లెక్సీలలో మాత్రం లక్ష ఎనభైవేల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ ప్రచారం చేస్తే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉద్యోగాలు రావని తేల్చి చెప్పారు. ఈ డేటా సెంటర్లపై అమెరికా, మరికొన్ని దేశాలలో ఎందుకు వ్యతిరేకత వస్తుందో కూడా గమనించాలి. విశాఖ నగరానికి సరఫరా చేసే విద్యుత్ పరిణామం అంత ఈ డేటా సెంటర్ కు నిత్యం అవసరం అవుతుందట.అలాగే నీరు కూడా భారీగా వాడుకుంటుంది. ఇవి ఒక ఎత్తు అయితే ఏకంగా ఈ కంపెనీకి 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై సీనియర్ రిటైర్డ్ అధికారి ఈఎఎస్ శర్మ వంటివారు ఆక్షేపిస్తున్నారు. ఒకవైపు ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అని లోకేశ్ చెబుతున్నారు. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాలలో మాదిరి ఇక్కడ కూడా ఆ కంపెనీలు భూమి కొనుగోలు చేసి యూనిట్లను స్థాపించి ఉండేవి కదా అన్నదానికి జవాబు ఉండదు. భూములు 99 పైసలకే ఇవ్వడం ద్వారా విశ్వనగరం విశాఖ బ్రాండ్ను చంద్రబాబు సర్కార్ పాడు చేస్తున్నదా అన్న సందేహం కలుగుతుంది. జగన్ టైమ్లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకుని డెవలప్మెంట్ సెంటర్ ను ఆరంభించింది.దానివల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడలేదు. కాని ఇప్పుడు అదే కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన ఇరవై ఎకరాల భూమిని 99 పైసలకే అప్పగిస్తున్నారు. ఈ సంస్థ ప్రతి మూడు నెలలకు రూ.8500 కోట్ల లాభాలు ఆర్జిస్తుంటుంది. అలాంటి సంస్థకు దాదాపు ఉచితంగా భూములు ఇవ్వాల్సిన అవసరముందా? అలాగే ఐటి ముసుగులో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ప్రభుత్వ భూములను ఉదారంగా పందేరం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇలాగైతే విశాఖ విశ్వనగరం ఎలా అవుతుంది? భవిష్యత్తులో ప్రభుత్వ భూములే లేకుండా పోతాయి. ఈ స్థితిలో గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ అంతర్జాతీయ గేట్ వేగా ఏపీ అవుతుందని, ఉత్తరాంధ్ర నుంచి వలసలకు ఇకపై బ్రేక్ పడుతుందని చంద్రబాబు చెబితే ప్రజల చెవిలో పూలు పెట్టడం కాకుండా మరొకటి అవుతుందా? గేమ్ ఛేంజర్ వంటి పడికట్టు పదాలను వాడవచ్చు కాని, కేవలం వందల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే ఈ సంస్థ ద్వారా ఎలా వలసలు ఆగుతాయో తెలియదు.ఈ కంపెనీ తొలుత 85వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని అన్నారు.అది తర్వాత 135000 కోట్లు అని చెప్పారు.ఇప్పుడు మీడియాలో లక్షన్నర కోట్ల పెట్టుబడి అంటున్నారు.నిజంగా ఈ స్థాయిలో పెట్టబుడులు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఊహించుకోవచ్చు.నిజంగానే భారి పెట్టుబడులు పెట్టి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే సంతోషించవచ్చు.అలా కాకుండా వైజాగ్ కు ఈ డేటా సెంటర్ లు భారం కాకుండా ఉంటే చాలు అదే పదివేలు అనుకునే పరిస్థితి రాకూడదని చెప్పాలి. కేంద్ర రైల్వే,ఐటిల శాఖల మంత్రి అశ్వనీ వైభవ్ మరింత ఆశ్చర్యకరమైన ప్రకటన ఇచ్చి వెళ్లారు.ఎల్లో మీడియాలో మంచి హెడింగ్ కోసం చెప్పారేమో తెలియదు కాని,అమరావతికి బుల్లెట్ రైలు వచ్చేసిందన్న చందంగా మాట్లాడడడం విడ్డూరం. ఆంధ్ర ప్రజలు అమాయకులని,వారికి ప్రపంచంలో జరిగే విషయాలేవి తెలియదని అనుకుంటున్నట్లుగా ఉంది. మొత్తం మీద ఈ మూడేళ్లు వేలాడే ముంతను చూపుతూ ప్రజలను ఊరిస్తారా? లేక ఏమైనా వాస్తవరూపం దాల్చేలా చేస్తారా అన్నది కాలమే తేల్చుతుంది. కొసమెరుపు ఏమిటంటే ఈ డేటా సెంటర్ నిమిత్తం తర్లుపాడు గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకున్నా, ఇంతవరకు పరిహారం ఇవ్వలేదట. వారు నిరసన చెబుతారని ఊరును దిగ్బందం చేసి కార్యక్రమం నిర్వహించారట. దీనిని బట్టే ప్రభుత్వం చిత్తశుద్ది అర్థం చేసుకోవచ్చేమో! ఇంతకాలం సైబరాబాద్, హైదరాబాద్ తామే నిర్మించామని చంద్రబాబు చెబుతుండేవారు.ఇకపై విశాఖను తామే విశ్వనగరం చేశామని, తామే నిర్మించామని ప్రచారం చేసుకుంటారేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు ఇంటికే.. మోదీ ఎందుకు వెళ్లారు?
-
ఎన్టీఆర్ ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే.. ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు
-
చంద్రబాబు 30వ సారి హస్తినబాట
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోమవారం మరోసారి ఢిల్లీకి రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన హస్తినబాట పట్టడం ఇది 30వ సారి. చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి రానున్నారు. ఆయన తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ కానున్నారు. అనంతరం జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలవనున్నారు. ఆ తర్వాత కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సమ్మిట్కు హాజరుకానున్నారు. అయితే, సీఎం తరచూ ఢిల్లీ పర్యటనకు వచ్చి కేంద్ర మంత్రులను కలుస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సాధించింది శూన్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు పరపతితో తెచ్చిందేమీ లేదు! చంద్రబాబు 2024లో సీఎం అయిన తర్వాత ఢిల్లీకి వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇది 13వ సారి. ఆయన ఢిల్లీకి వచి్చన ప్రతిసారి ‘రాష్ట్రం కోసం అది తెస్తాం.. ఇది తెస్తాం’ అని లీకులు ఇవ్వడం, పెద్ద ఎత్తున ప్రచారం చేయడం... కేంద్ర మంత్రులతో భేటీ ముగిశాక మాత్రం ‘కేంద్రం సహకరిస్తోంది. లేఖలు ఇచ్చాం’ అనే పాత పాటే పాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసే సాధారణ స్కీములు మినహా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా చంద్రబాబు తెచ్చిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.కేంద్రం ఇచ్చే నిధులే తప్ప, తనకున్న పరపతితో రాష్ట్రానికి అదనపు బడ్జెట్ కేటాయింపులు సాధించడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఇప్పటికీ నిధుల కేటాయింపులు, సాంకేతిక అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుండటం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘అయినను పోయిరావలె హస్తినకు‘ అన్న చందంగా చంద్రబాబు 30వ సారి ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. ఈసారి అయినా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారా? లేక రాజకీయ అవసరాలే అజెండాగా ఈ పర్యటన ఉంటుందా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
మేము భూములు ఇవ్వకపోయినా బెదిరించి లాక్కుంటున్నారు..
-
నిధుల వినియోగంలో ఘోర వైఫల్యం
సాక్షి, అమరావతి: కేంద్ర నిధుల వినియోగంలో చంద్రబాబు సర్కారు వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఘోర వైఫల్యం చెందింది. దీంతో రెండు (2024–25, 2025–26) ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు రూ.10,721 కోట్లు మురిగిపోయాయి. 2025–26లోనే కేంద్రం నిధులు రూ.5,321 కోట్లు మురిగిపోవడం గమనార్హం. గడచిన ఆర్థిక సంవత్సరం వివిధ విభాగాలకు కేంద్రం రూ.15,096 కోట్లు కేటాయించగా, అందులో రూ.9,775 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇంత భారీ స్థాయిలో కేంద్రం నిధులను సకాలంలో వ్యయం చేయకపోవడంలో బాబు సర్కార్ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.నిజానికి కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ బాబు ప్రభుత్వం భారీ ఎత్తున కేంద్ర నిధులను రాబట్టుకోవడంలో విఫలమవుతోంది. వచ్చిన నిధులనూ సరిగా వినియోగించడంలోనూ చేతులెత్తేయడం విచారకరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి ఒక రాష్ట్రం నిధుల వినియోగం ఆధారంగానే తదుపరి వాయిదాలను కేంద్రం విడుదల చేస్తుంది.ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేటాయించిన నిధులను సకాలంలో వ్యయం చేసి అదనపు నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించి మంజూరు చేయించుకుంటుంది. చంద్రబాబు సర్కారు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంతో రాష్ట్రం ఆర్థికంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ, సెకండరీ విద్య, గిరిజన సంక్షేమ శాఖల నిధులు భారీగా మురిగిపోయాయి. -
జగన్ పథకాలు ఆపేశారు.. పనికొచ్చే పథకం ఒక్కటీ లేదు
-
‘చంద్రబాబు బడాయి మాటలు తప్పితే చేసిందేమీ లేదు’
తాడేపల్లి : ఈ రెండున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బడాయి మాటలు చెబుతూ మాత్రమే ప్రభుత్వాన్ని నడిపించారని, ప్రజలకు చేసేంది మాత్రం ఏమీ లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలకు ఏమీ చేయకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ‘ఒక్కో కాన్ఫరెన్స్ లో ఒక్కో అంశంపై బడాయి మాటలు చెప్పారు. కానీ ఈ ఏడు సమావేశాల్లో చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. మోదీ కన్నా చంద్రబాబు పరిపాలనాదక్షుడు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు ఇంకేం చేశారు?, ప్రపంచానికి పాఠాలు చెప్తాననే చంద్రబాబు మంత్రులు బృందాన్ని సింగపూర్ ఎందుకు పంపారు?, సింగపూర్లో స్టడీ చేసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారా?, ఇప్పుడు ఆ హామీలన్నీ ఎగ్గొట్టి సింగపూర్ లో ఏం చేశారు?, ఎన్నికలకు ముందు చూపించిన మేనిఫెస్టో ఇప్పుడు ఎక్కడుంది?, ఈ రెండేళ్లలో ఒక్క పేదోడికీ గజం స్థలం కూడా ఇవ్వలేదు. వార్డు, గ్రామ సచివాలయాలను సర్వ నాశనం చేశారు. ఏ పంటకీ గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడి పోతున్నారు. ఆరోగ్యశ్రీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఏమయ్యాయి?, సింగపూర్ పర్యటన కేవలం షికారు కోసమే. ఆర్భాటం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటీ చేయలేదు. ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది. జగన్ హయాంలో జరిగినంత వేగంగా పనులు జరగటం లేదు. ఇచ్చిన డబ్బులు కూడా ఎందుకు ఖర్చు చేయలేదని కేంద్రమే ప్రశ్నించింది. రాయలసీమ లిఫ్టును రేవంత్రెడ్డికి గిఫ్టుగా ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులపై మళ్ళీ అక్రమ కేసులు పెట్టటం దుష్ట సంప్రదాయం. ఎంతమందిని అరెస్టు చేసినా వెనక్కు తగ్గేదే లేదు. క్రిమినల్స్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసుల్ని సోషల్ మీడియా వాళ్ల మీద ప్రయోగిస్తారా?, వెలిగొండలో మంత్రి రామానాయుడు చాలా డ్రామాలు చేస్తున్నారు. ఫోటోలకు స్టిల్ ఇవ్వటం తప్ప ప్రాజెక్టుకు ఎప్పుడు నీరు ఇస్తారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
హైదరాబాద్ ఆస్తులు అమ్మిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీలు వదులుతాడా?: పేర్ని నాని
-
ఇలాంటి వాడిని అల్లుడు ఎలా చేసుకున్నావయ్యా.. చేతకానోడు ముఖ్యమంత్రి అయ్యాడు!
-
కూటమి అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తే జైళ్లకు పంపుతున్నారు
-
రాజకీయ స్వలాభం కోసమే.. బాబు చెప్పు చేతుల్లో ఏపీ పోలీసులు
-
చంద్రబాబు దుర్మార్గ పాలనకు బలం మీడియానే: పొన్నవోలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితి రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై శనివారం గుంటూరు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. పోలీస్ రాజ్ మాత్రమే నడుస్తోంది. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు. సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు నియంత పాలన చేస్తున్నారు. చంద్రబాబు బలం మీడియానే. మీడియాను అడ్డుపెట్టుకుని అరాచక పాలన కొనసాగిస్తున్నారు అని పొన్నవోలు మండిపడ్డారు. -
చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం... రాజకీయ ఆయుధంలా పోలీసులను వాడుకుంటున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటుండడంతో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. అసమ్మతిని అణచి వేయడానికి, ప్రశ్నించే గొంతులను నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను చంద్రబాబు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హలో ఇండియా..!’ ఏపీలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు వాడుకుంటున్న తీరును చూడాలంటూ శుక్రవారం ఆయన తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగంప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటైన వాక్ స్వాతంత్య్రాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్–19లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే వారిని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంలా వాడుతున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా, ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైనా రాజకీయ కక్ష సాధింపులు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. Hello India !!!!!AP CM N. Chandrababu Naidu has been using the police department as his political agents to curb dissent, suppress opposition voices, and systematically curtail Freedom of Speech in Andhra Pradesh.Article 19 of the Indian Constitution guarantees Freedom of… pic.twitter.com/bZKo2kFCW3— YS Jagan Mohan Reddy (@ysjagan) May 8, 2026టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగంప్రభుత్వ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోంది. వారి ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను నిలదీస్తూ అందుకు బాధ్యులైన అధికార పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్ చేసినా ఏమాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే వారి పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. కోర్టులు అనేక సందర్భాల్లో తప్పుబట్టినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి ఏకపక్షంగా కక్ష సాధింపుతో చట్ట విరుద్ధంగా పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయిఅధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా రోజూ వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతోంది. నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తోంది. వాటిపై విపక్ష వైఎస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సాక్ష్యాధారాలు చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు. ఎఫ్ఐఆర్ల ఊసే లేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో హేయంగా వ్యవహరిస్తోంది. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే దాడిగా భావించాల్సి వస్తోంది.స్వేచ్ఛ స్థానంలో భయం.. జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు.. పోలీసు యంత్రాంగం, వ్యవస్థ రాజకీయ ఆయుధంగా మారడం.. ఒక విమర్శను నేరంగా పరిగణించే పరిస్థితి ఉన్న రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కష్టం. హేయమైన చర్యలు, అణచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార దుర్వినియోగానికి పాల్పడటం.. పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించడం.. ప్రతిపక్షం గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేయడం.. సోషల్ మీడియాపై నియంత్రణ.. అసమ్మతిని అణచి వేయడం లాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.సోషల్ మీడియాపై సెన్సార్షిప్టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవడం లేదు. వారి పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ, వారి తప్పులను ఎండగడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్) తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీసు శాఖ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు నోటీసులు పంపిస్తోంది.ఆ విధంగా వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ.. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం.. ఎక్కడా అసమ్మతి గళం వినిపించకుండా ప్రయత్నించడం.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనం. బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలను సహించలేకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతా భావంతో పెల్లుబుకుతున్న అసహనం.. దానివల్ల కక్షపూరిత, నిరంకుశ విధానాలను ప్రభుత్వ చర్యలు తేటతెల్లం చేస్తున్నాయి. -
పోలీసుల ఏకపక్ష వైఖరిపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి : పోలీసుల ఏకపక్ష వైఖరి, సోషల్ మీడియా గొంతు నులుమే ప్రయత్నాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు హలో ఇండియా.. ఏపీలోని పోలీస్ వ్యవస్థ పనితీరును చూడమంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ‘రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. అసమ్మతిని అణిచి వేయడానికి, ప్రశ్నించే గొంతులు నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను క్రమంగా హరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటి వాక్ స్వాతంత్య్రం. దాన్ని మన రాజ్యాంగంలో ఆర్టికల్–19 లో పొందుపర్చారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపించే వారిని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా ఇంకా ప్రజా వ్యతిరేక పాలనను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైయస్సార్సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు, సాధారణ పౌరులపైనా రాజకీయ కక్ష సాధింపు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి.Hello India !!!!!AP CM N. Chandrababu Naidu has been using the police department as his political agents to curb dissent, suppress opposition voices, and systematically curtail Freedom of Speech in Andhra Pradesh.Article 19 of the Indian Constitution guarantees Freedom of… pic.twitter.com/bZKo2kFCW3— YS Jagan Mohan Reddy (@ysjagan) May 8, 2026 తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోంది. తమ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు ఎత్తి చూపుతూ, అందుకు బాధ్యులైన తమ పార్టీ నాయకులపై సోషల్ మీడియలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్ చేసినా ఏ మాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే తమ పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. చట్ట విరుద్ధంగా, కోర్టులు అనేక సందర్భాల్లో తప్పు పట్టినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా, పూర్తి ఏకపక్షంగా, కక్ష సాధింపుతో పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు.అలా తప్పుడు కేసులు పెడుతూ, తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవడం లేదు. తమ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ, వారి తప్పులు ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్) తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీసు శాఖ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు నోటీసులు ఇస్తుంది. ఆ విధంగా ఒక వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం, ఎక్కడా అసమ్మతి గళం వినిపించకుండా ప్రయత్నించడం, ఆ విధంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో అని చెప్పడానికి ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలు సహించకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతా భావం వల్ల పెల్లుబికుతున్న అసహనం. దాని వల్ల కక్షపూరిత, నిరంకుశ విధానాలు. ఆ దిశలో ప్రభుత్వ చర్యలు తేటతెల్లం అవుతున్నాయి. అదే అధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రతిరోజూ వైయస్సార్సీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతోంది.ఆ విధంగా నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తోంది.వాటిపై విపక్ష వైఎస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సాక్ష్యాధారాలు చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు. ఎఫ్ఐఆర్ల ఊసే లేదు.ఆ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో హేయంగా వ్యవహరిస్తోంది. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమే కాకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే దాడిగా భావించాల్సి వస్తోంది.స్వేచ్ఛ స్థానంలో భయం, జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు, పోలీసు యంత్రాంగం, వ్యవస్థ రాజకీయ ఆయుధంగా మారడం, ఒక విమర్శను నేరంగా పరిగణించే పరిస్థితి ఉన్న రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కష్టం. అందుకే హేయమైన చర్యలు, అణిచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, పోలీస్లను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ, ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించడం, ప్రతిపక్ష గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేయడం, సోషల్ మీడియాపై నియంత్రణ.. మొత్తంగా అసమ్మతిని అణచి వేయడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలి’ అని డిమాండ్ చేశారు. -
‘విభజన హామీల సాధనలో టీడీపీ విఫలం’
సాక్షి, విశాఖపట్నం: విభజన హామీలు అమలు చేయమని వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రత్యేక హోదా రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని... ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వం విభజన హామీలు గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు తన ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు 2016లో ఆమరణ నిరాహార దీక్ష చేశాను’’ అని ఆయన గుర్తు చేశారు.‘‘నా మీద అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆత్మహత్యా యత్నం కేసు నమోదు చేయించింది. ఆ కేసులో 6 నెలల జైలు శిక్ష, ఐదు వేలు జరిమానా విధించింది. ఆ కేసు కొట్టివేయాలని చేయాలని హయ్యర్ కోర్టులో అప్పీల్ చేశాము.. వాల్తేర్ డివిజన్తో కూడిన విశాఖ రైల్వే స్టేషన్ కావాలి. ఆదాయం వచ్చే కేకే లైన్ ఒడిశాకు అప్పగించారు. రాష్ట్ర నాయకుల చేతగానితనం వలన కేకే లైన్ ఒడిశాకు పోయింది. విశాఖ వచ్చిన రైల్వే శాఖ మంత్రిని కేకే లైన్ గురించి ఎందుకు అడగలేదు.?. రైల్వే జోన్ గురించి ఎంపీ భరత్కు ఏం తెలుసు? విశాఖ రైల్వే జోన్కు ఆదాయం లేకపోయినా పర్వాలేదని ఎలా మాట్లాడతారు?’’ అంటూ అమర్నాథ్ నిలదీశారు. -
రామ్ ప్రసాద్ రెడ్డి రౌడీయిజం. చేస్తాడనే మంత్రి పదవి ఇచ్చారు
-
బాబు గారి కళ్లలో తృప్తి కోసం...
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లింది? మొదట చేసిన ఆరోపణ ఏమిటి? ఆ తర్వాత వేసిన కుప్పిగంతులు ఎన్ని? సీబీఐ విచారణలో నిందితులుగా గుర్తించని వారిపై సైతం కేసులు పెట్టాలని ఎల్లో మీడియా ఎందుకు గొడవ చేస్తోంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలం క్రితం తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతుకొవ్వు, బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏదో జరిగిపోయినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నానా హడావుడి చేశారు. దుర్గగుడి మెట్లు కడిగారు. తిరుపతిలో సభ పెట్టి సనాతన హిందువునని ప్రకటించుకున్నారు కూడా. ఆ తరువాతేమైంది? తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులతో వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు అండ్ కో నానా ప్రయత్నాలూ చేసింది. అయితే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో తన ప్రభుత్వ పోలీసు అధికారులు ఇద్దరు ఉండేలా మాత్రం చేసుకోగలిగారు. అయినప్పటికీ జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసింది. ఫలితంగా కూటమి ప్రభుత్వ పరువు పోయింది. రాజకీయం కోసం నీచమైన ఆరోపణలు చేశారన్న భావన ప్రజలలో ఏర్పడింది. అయితే నెయ్యిలో పామాయిల్ వంటివి కల్తీ అయి ఉండవచ్చని సీబీఐ అభిప్రాయపడి కొందరు డెయిరీ యజమానులపై, టీటీడీ అధికారులపై కేసులు పెట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం శాంతించలేకపోయింది. ఎలాగైనా నెపం వైఎస్సార్సీపీ వారిపై నెట్టాలని మరో కమిషన్ ఏర్పాటు చేసింది. సీబీఐ నివేదికలోని అంశాల ఆధారంగా తదుపరి చర్యలపై నివేదిక కోరింది. మొత్తమ్మీద అందులో ఏదో రకంగా అప్పటి ఈఓ ధర్మారెడ్డి పేరు ప్రస్తావించడం ఎల్లో మీడియాకు సంతోషం కలిగించింది. చంద్రబాబు సంతృప్తి చెందారో లేదో తెలియాల్సి ఉంది. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. అధికారులు తన మనసులోని మాటను కనిపెట్టి నిర్ణయాలు చేసేవరకు మీటింగుల పేరుతో తిప్పుతుంటారని చెబుతుండేవారు. పూర్వం ఆయా ఆరోపణలపై తాము కోరుకున్న నివేదికలు ఇచ్చే విధంగా కొందరు రిటైర్డ్ న్యాయమూర్తులకు బాధ్యత అప్పగిస్తుంటారన్న ప్రచారం ఉంది. ఇప్పటికీ అదే తరహాలో వ్యవహరిస్తున్నారేమో తెలియదు.అదే మాదిరి తాను ఆశించిన రీతిలో నివేదిక కోసం మరో రిటైర్డ్ ఐఎఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ నియమించారన్న భావన అధికారవర్గాలలో ఉంది. ఆ కమిషన్ పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలోని అంశాలు ఎల్లో మీడియాకే లీక్ చేసినట్లుగా ఉంది. వారు టీడీపీకి ఉపయోగపడే అంశాలనే ప్రచారం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో కీలకమైన పలు అంశాలు మిస్ అయినట్లు అనిపిస్తుంది. 2019-2024 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి మీద మాత్రమే ఎందుకు రిపోర్టు ఇచ్చారు? అంతకుముందు 2014-2019 మధ్య టీడీపీ పాలనలో సరఫరా అయిన నెయ్యి గురించి ఎందుకు నివేదికలో ప్రస్తావించలేదు? టీడీపీ పాలనలో నెయ్యి సరఫరా చేసిన సంస్థలే వైఎస్సార్సీపీ హయాంలోనూ నెయ్యి ఇచ్చాయి కదా! తప్పు జరిగితే అప్పుడు కూడా జరిగి ఉండాలి కదా?తక్కువ రేటుకు ఇస్తే కల్తీ జరిగినట్లు అన్న నిర్ధారణకు వస్తే, 2014 టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా జరిగినట్లే అవుతుంది కదా?అప్పుడు కూడా కిలో నెయ్యి ధర రూ.400 లోపే ఉంది కదా! నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది, లడ్డూ తయారీలో వాడింది చంద్రబాబు హయాంలోనే అని సీబీఐ నివేదికను ఉటుంకిస్తూ కొద్దికాలం క్రితం మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యకు ఇంతవరకు చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేకపోయారు? మరో విశేషం ఏమిటంటే దినేష్ కుమార్ కమిషన్ చాలా విచిత్రమైన ప్రతిపాదన చేసింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టులో తక్కువ ధర ఆధారంగా నిర్ణయం చేసే టెండర్ విధానం వద్దని ఈ కమిషన్ సిఫారస్ చేసిందని ఎల్లో మీడియా రాసింది. ఇలా ఎందుకు చేశారు? అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం తక్కువ రేట్లకే నెయ్యి కొనుగోలు చేసినా, ఆ తర్వాత తమకు కావల్సిన ఒక సంస్థ ద్వారా అధిక రేటుకు కిలో సుమారు రూ.650లకు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకోవడానికి జరిగిన ప్రయత్నం కాదా? పైగా ఇదే పద్దతి అన్ని చోట్ల అమలు చేస్తే, ఎవరు ఎక్కువ రేటు వేస్తే వారికి టెండర్ వస్తుంది కదా! ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా?అమరావతి నిర్మాణ పనుల్లో జరుగుతున్న దోపిడీకి రాజముద్ర వేయడానికి ఏమైనా ఈ సిఫారస్ ఉపయోగపడుతుందా అన్న చర్చ కూడా ఉంది. కూటమి ప్రభుత్వ హయాంలో టీటీడీ వారు ఇందాపూర్ డెయిరీకి అధిక ధరకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారన్న ఆరోపణపై, దానికి హెరిటేజ్ సంస్థకు మధ్య ఉన్న సంబంధం మొదలైన అంశాలపై కూడా దినేష్ కుమార్ కమిషన్ పరిశీలన చేసి, వాస్తవాలు నిగ్గు తేల్చాలి కదా! మరో చిత్రమేమిటంటే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి నెయ్యి నాణ్యతపై పరిశీలన చేయాలని ఆదేశాలు ఇచ్చారు కాని, ఆ తర్వాత పట్టించుకోలేదట. అందువల్ల ఆయనను బాధ్యుడిని చేయాలని ఈనాడు మీడియా అడ్డగోలు రాతలు రాస్తోంది. అదే ధీరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర ప్రభుత్వ పెద్దలకు వర్తింప చేయాలని ఈ మీడియా చెబుతుందా? అధికారిక హోదాలో చంద్రబాబు పలు ఆదేశాలు ఇస్తుంటారు. వాటి ఆయనే చూడాలని, లేకుంటే బాధ్యత వహించాలని ఈ మీడియా ఒప్పుకుంటుందా? అప్పుడేమో అధికారులది తప్పని వీరు చెబుతారు. టీటీడీ విషయానికి వస్తే ఛైర్మన్ ది తప్పంటారన్నమాట. అర్థంపర్థం లేకుండా ఎల్లో మీడియా వార్తలు ఇస్తున్నదనడానికి ఇదే నిదర్శనం. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్లో వందల కోట్ల స్కామ్ జరిగిందని, సంబంధిత ఫైల్ పై చంద్రబాబే అప్పట్లో సంతకాలు చేశారని, ఆయన ఆదేశాల మేరకే నిధుల విడుదల జరిగిందని, టీడీపీ ఆఫీస్ ఖాతాలోకి కూడా నిధులు వెళ్లాయని గతంలో సీఐడీ ఆరోపణ చేస్తే, ఇదే ఈనాడు మీడియా ఏమి రాసింది? అబ్బే చంద్రబాబుకు దీనిని ఎలా రుద్దుతారని ప్రచారం చేసిందా?లేదా? అమ్మో చంద్రబాబుపై ఆరోపణ చేస్తారా? అని గగ్గోలు పెట్టిందా? లేదా? వైవి సుబ్బారెడ్డిపై మాత్రం అర్జెంట్ గా చర్య తీసుకోవాలని ఈ ఎల్లో మీడియా ఎందుకు ఏడుపు లంకించుకుందో తెలియదా! అలాగే మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలకు కూడా నెయ్యి టెండర్ల నిబంధనల మార్పుతో సంబంధం ఉందని ఈ కమిషన్ అభిప్రాయపడిందట. అయినా వారిపై చర్యకు సిఫారస్ చేయకపోవడం ఏమిటని ఎల్లో మీడియా బాధట. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవాలని కోరవచ్చు. నెయ్యిలో ఎప్పుడు కల్తీ జరిగినా అరికట్టవలసిందే. కూటమి హయాంలో కల్తీ జరిగితే సమర్ధించడం, అప్పుడు తక్కువ ధరకు నెయ్యి సరఫరా అయినా కల్తీ లేనట్లు, ఆ తర్వాత అయితే ఉన్నట్లు సూత్రికరించడం, అలాగే చంద్రబాబు టైమ్ లో వచ్చిన కంపెనీ అయితే దానిని వదలివేయడం, అదే కంపెనీ జగన్ టైమ్లో కొనసాగితే అందుకు ఏకంగా సి.ఎమ్.నే బాద్యుడిని చేయడం..ఇలా ఉంది దిక్కుమాలిన లాజిక్కుల ప్రచారం.దీనివ్లలే వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోందన్న అభిప్రాయం కలుగుతుంది.కొందరు అధికారుల మీద చర్య తీసుకోవాలని దినేష్ కుమార్ కమిషన్ సిఫారస్ చేసినా ఎల్లో మీడియా సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు.మరి చంద్రబాబు ఏలా స్పందిస్తారో తెలియదు.ఏది ఏమైనా న్యాయం, ధర్మం అందరికి ఓకే మాదిరి కాకుండా టిడిపి హయాంలో స్కామ్ లు జరిగితే వాటిని సమర్ధించడం, వైరిపక్షం పాలనలో స్కామ్ జరిగినా, జరగకపోయినా, అబాంఢాలు వేసి రాజకీయ లబ్ది కోసం ప్రచారం చేయడం వల్ల ఏపీ ప్రతిష్ట,అందులోను తిరుమల ,తిరుపతి దేవస్థానం పరువును కూటమి నేతలు, ఎల్లోమీడియా దెబ్బతీస్తున్నారని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమికి షాక్.. బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: అమరావతిలో నిర్మాణాలపై జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి, పర్యావరణం విషయంలో కూటమి నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు.జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. అమరావతిలో నిర్మాణాలు నిబంధనలకు లోబడి నిర్మించాలి. రాజధాని నిర్మాణంలో 84 శాతం సాగు, పర్యావరణ భూములు ఉన్నాయి. అమరావతి పరిధిలో ఉన్న నదులు, కాలువలు, వాగులను పరిరక్షించాలి. అవినీతి, పర్యావరణంపై రాజీలేని పోరాటం చేస్తాను. ఈ విషయంలో కూటమి నేతలను కూడా వదిలిపెట్టను. రాజకీయ పార్టీలపై నమ్మకం పోయింది. ఈ సమాజాన్ని మీడియా కాపాడాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రభుత్వాలు పారిశ్రామిక వృద్ధి లేదా ఇతర ప్రాజెక్టుల పేరుతో పర్యావరణ నియమాలను విస్మరించినప్పుడు, యువత మరియు పౌర సమాజం ఒక బలమైన నిఘా శక్తిగా (Watchdog) మారడం అత్యవసరం. కేంద్ర సాధికార కమిటీ (CEC) వెల్లడించిన అంశాలు క్షేత్రస్థాయిలో ఉన్న భయంకరమైన వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. -
జగన్ విజన్ పర్ఫెక్ట్.. బాబుకు హైకోర్టు షాక్..
-
రగిలి పోతున్న కోడెల కొడుకు.. చుక్కలు చూపిస్తా అంటూ బాబుకి వార్నింగ్
-
విజయ్ ను చూసి JR. NTR పార్టీ పెడతారేమోనని చంద్రబాబు భయం
-
పేదల సొంతింటి కలపై నీళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వడంతోపాటు పక్కా ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పేదలకు గజం స్థలం, ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు చేయలేదు. అంతటితో ఆగకుండా గత వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేయకుండా కుట్రలు పన్నుతోంది. కనీసం కేంద్రం ఇచ్చిన నిధులు కూడా లబ్ధిదారులకు చెల్లించడానికి బాబు సర్కారుకు మనసొప్పడం లేదు. ఫలితంగా రూ.200 కోట్ల మేర నిధులు మురిగిపోయే పరిస్థితి వచ్చింది.వాటిని తిరిగి కేంద్రానికే అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అధికారుల ప్రణాళికకు అడ్డుపుల్ల! కేంద్రం పేదల ఇళ్ల కోసం విడుదల చేసిన రూ.200 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో రిజర్వ్ చేసి, ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించిన దశలు పూర్తయ్యాక విడుదల చేసేలా గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపినట్టు తెలిసింది. దీనివల్ల నిధులు రాష్ట్రంలోనే ఉండటంతోపాటు పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు లభించేది. కానీ, ఈ నిర్మాణాత్మక ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం కావాలనే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. బాబు హయాంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకపోవడంతో అధికారులు పంపిన ప్రతిపాదనలను కీలక ప్రజాప్రతినిధి తిరస్కరించినట్టు తెలుస్తోంది. బిల్లులు చెల్లించకుండా నిధులు వెనక్కుఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి ఆన్లైన్లో పొందుపర్చిన బిల్లులు రూ.30 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. నిధులు తిరిగి కేంద్రానికి వెనక్కి పంపకుండా బిల్లులు విడుదల చేస్తే పేదలకు మేలు జరుగుతుంది. అయితే ఇందుకు కీలక ప్రజాప్రతినిధి అడ్డు తగులుతున్నారని సమాచారం. పెండింగ్ బిల్లులు కూడా చెల్లించడానికి వీల్లేకుండా గృహ నిర్మాణ సంస్థలోని కీలక అధికారిని ప్రజాప్రతినిధి సెలవుపై పంపేశారని విమర్శలు వస్తున్నాయి. పెండింగ్ బిల్లులు ఇప్పుడు చెల్లిస్తే తమకు క్రెడిట్ దక్కదనే దురాలోచనతో ఈ కుట్రకు తెరలేపినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగాన్ని సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) విధానం నుంచి స్పర్శ్లోకి మార్చి రూ.200 కోట్లు తిరిగి కేంద్రానికి అప్పగించడానికే బాబు సర్కారు సిద్ధమైనట్టు సమాచారం. -
బలుసుకు మరో రూ.98.1 కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు మరో రూ.98.1 కోట్ల మేర ప్రయోజనాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేకూర్చింది. 220 కేవీ విద్యుత్ లైన్ మార్పు పనుల అంచనా వ్యయాన్ని రూ.1,082.44 కోట్ల నుంచి రూ.1,180.54 కోట్లకు పెంచేస్తూ ఈనెల 1న ఉత్తర్వులు జారీ చేసింది. సింగపూర్ సంస్థ సుర్బానా–జురాంగ్ రూపొందించిన రాజధాని మాస్టర్ ప్లాన్లో లోపాల వల్ల ఎన్ 10–ఈ1 జంక్షన్ నుంచి ఎన్ 13–ఈ1 జంక్షన్ వరకు 220 కేవీ ఈహెచ్వీ(ఎక్స్ట్రా హైవోల్టేజ్) లైన్ను మార్చాల్సి వచ్చింది. ఈ లైన్ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానంలో ఏర్పాటు పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి గతేడాది సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ ఎల్–1గా నిలిచింది. 2004 నవంబర్ 20న జారీ చేసిన జీవో 133 ప్రకారం కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధిక ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్ ఎల్–1గా నిలిస్తే ఆ టెండర్ను రద్దు చేసి మళ్లీ పిలవాలి.కానీ.. బలుసు శ్రీనివాసరావు ముఖ్యనేతకు సన్నిహితుడు కావడం, ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో నిబంధనలను తుంగలో తొక్కి ఆ టెండర్ను ఆమోదించారు. ఈ పనులను రూ.1,082.44 కోట్లకు బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు అప్పగిస్తూ 2025 మార్చి 19న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఖజానాపై రూ.89.19 కోట్ల భారం పడింది. ఆ మేరకు బలుసుకు ప్రయోజనం చేకూరింది. ఆర్సీసీ పవర్ డక్ట్ నిర్మించాలంటూ.. చంద్రబాబు సర్కారు అంతటితో ఆగలేదు సరి కదా.. బలుసుకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు తాజాగా మరో అడుగు ముందుకేసింది. 220 కేవీ ఈహెచ్వీ లైన్ ఏర్పాటుకు ఆర్సీసీ పవర్ డక్ట్› నిర్మించాల్సి వచ్చిందని.. ఆ మేరకు అంచనా వ్యయాన్ని రూ.1,180.54 కోట్లకు సవరించాలంటూ సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదించారు. దీన్ని గత నెల 23న జరిగిన సీఆర్డీఏ అథారిటీ 60వ సమావేశం ఆమోదించింది. సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన ప్రతిపాదనను అమలు చేయాలంటూ గత నెల 24న సీఆర్డీఏ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు.దాని ఆధారంగా 220 కేవీ ఈహెచ్వీ లైన్ మార్పు పనుల వ్యయాన్ని రూ.1,180.54 కోట్లకు పెంచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు అదనంగా మరో రూ.98.1 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని విద్యుత్రంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ విద్యుత్ లైన్ మారి్పడి పనుల్లోనే బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు రూ.187.29 కోట్ల ప్రయోజనం చేకూరిందని.. ముఖ్యనేతకు బలుసు సన్నిహితుడు కావడం వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. ప్రభుత్వ ఖజానాపై తీవ్ర భారం మోపుతూ సన్నిహితులకు ముఖ్యనేత లబ్ధి చేకూర్చుతున్నారంటూ విద్యుత్ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. -
‘ఇంగ్లిష్ మీడియం వద్దన్న వాళ్లంతా ఇప్పుడేమంటారు?’
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే మాతృభాషకు ద్రోహం చేస్తున్నారని విమర్శించిన కూటమి నాయకులు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం తప్పక ఉండాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖండించే దమ్ముందా? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలన్న ఆకాంక్షతో ప్రభుత్వ బడుల్లో ఐబీ, సీబీఎస్ఈ ప్రవేశపెడితే.. అధికారంలోకి వచ్చాక కేసులు వేస్తామని హెచ్చరించారని గుర్తుచేసుకున్నారు. తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్న కూటమి నాయకులు పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడని, పదో తరగతిలో వచ్చిన ఉత్తమ ఫలితాలకు వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో వేసిన ఫౌండేషన్ కారణమని చెప్పారు. కోట్ల రూపాయల పత్రికా ప్రకటనలిచ్చి క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. జీతాలు తగ్గిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా తమకు రావాల్సిన బకాయిలపై ఉద్యోగులంతా సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు.పీఆర్సీ, డీఏ, ఐఆర్లపై ప్రశ్నించకుండా జీతాలు తగ్గిస్తామని ఉద్యోగులను ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని ఉన్నట్టుండి నెల్లూరు జిల్లాకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారని జగన్పై విషం చిమ్మారు2019-24 మధ్య తన ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే దిక్సూచిలా నిలిచాయి. ప్రధానంగా నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియం బోధన ద్వారా పేద విద్యార్థులకు ఖరీదైన చదువులను ఉచితంగా అందించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా ఎంతోమంది కూటమి నాయకులు వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేశారు.ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తే తెలుగుభాషకు అన్యాయం జరుగుతుందంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించారు. కూటమి అధికారంలోకి వస్తే సర్కారు బడుల్లో ఆనాడు అమలవుతున్న ఐబీ, టోఫెల్ విధానాలపై కేసులు వేస్తామని హెచ్చరించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన చంద్రబాబు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యం. అమ్మ భాషను వైఎస్సార్సీపీ నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్సీపీ మాతృ భాషకి వ్యతిరేకి అని మండలి బుద్ధ ప్రసాద్ వంటి వారు ప్రచారం చేశారు. తెలుగుభాషను విచ్చిన్నం చేస్తున్నామని అన్నారు. మాతృభాషకు ముప్పు ఉందని, మాతృ భాషలోనే బోధన కొనసాగాలని సుప్రీం మాజీ సీజేఐ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు. ఇంగ్లిష్ మీడియం లేకుండా చేయడానికి చివరికి కోర్టులను కూడా ఆశ్రయించారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకే జగన్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. కానీ పేద బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందుతుంటే చూసి ఓర్వలేని కూటమి నాయకులు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చేయని కుట్రలు లేవు.ఆనాడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారుపేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందించాలని ముందుచూపుతో వ్యవహరించి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నేడు హైకోర్టు ధర్మాసనం కూడా సమర్థించింది. ఉన్నతంగా ఎదగాలంటే, నేటి సమాజంలో రాణించాలంటే ఇంగ్లిష్ ఎంతో ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేసింది. తెలుగు సబ్జెక్టును తప్పనిచేస్తూ 202-21లో ఆరో తరగతి వరకు మాత్రమే మొదటిసారి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారు.ఆ తర్వాత ఒక్కో ఏడాది పదో తరగతి వరకు పెంచుకుంటూ పోయారు. ఆరోజు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులంతా వారి పిల్లలను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే ఆనాడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నవాళ్లంతా ఇప్పుడు తమ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. హైకోర్టు తీర్పుతోనైనా కళ్లు తెరవాలి.జగన్ పాలనలో విద్యారంగంలో సంస్కరణలుపదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సర్కారు బడుల్లో వచ్చిన మార్కులతో ప్రభుత్వం భారీగా ఖర్చు చేసి మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చింది. ఈ పిల్లలు ఇంతటి విజయాలు సాధించడానికి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన కష్టానికి ఫలితమేనని కూటమి నాయకులు ఒప్పుకుని తీరాలి. నాడు -నేడు ద్వారా 38 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా తీర్చిదిద్దారు.తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్న పాఠశాలల్లో ఆర్వీ వాటర్ ప్లాంట్లు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఒక్కో ఐఎఫ్బీ ప్యానల్ బోర్డును లక్ష రూపాయలతో కొనుగోలు చేసి 62 వేల బోర్డులను ప్రతి క్లాసులోనూ ఏర్పాటు చేయడం జరిగింది.ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో 33,590 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. పిల్లలకు లెక్కలు బాగా రావాలని పాల్ ల్యాబ్స్ను తీసుకొచ్చారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ను ప్రవేశ పెట్టడంతోపాటు 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లతో పాఠాలు చెప్పించారు. జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, యూనిఫాం, సాక్సులు, షూ, నోట్ బుక్కులు అందించే కార్యక్రమానికి వైయస్ జగన్ గారు శ్రీకారం చుట్టారు. 8 వేల మంది టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్ ఇచ్చి మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచింగ్ మొదలు పెట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది.కార్పొరేట్ స్కూళ్లకు చంద్రబాబు దాసోహంకూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్వో ప్లాంట్ల నిర్వహణ గాలికొదిలేశారు. ట్యాబ్లు పాడైనా పట్టించుకోలేదు. ఆఖరుకి టాయ్లెట్ల నిర్వహణ సరిగా లేదు. గోరుముద్ద పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన మెనూతో పిల్లలకు భోజనం పెడితే ఇప్పుడు దానికీ దిక్కులేదు. ప్రభుత్వ స్కూల్స్, విద్యారంగం గురించి కూటమి ప్రభుత్వంలో ఒక్క గొప్ప నిర్ణయం తీసుకున్న పాపానపోలేదు. ఇవేమీ చేయకుండానే కోట్ల రూపాయలు వెచ్చించి పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవడం సిగ్గుచేటు.వైఎస్ జగన్ అమ్మ ఒడి పేరుతో అమలు చేసిన పథకానికి తల్లికి వందనంగా పేరు మార్చి లోకేష్ మదిలో నుంచి వచ్చిన ఆలోచన అని తండ్రికొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. వైయస్సార్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే దాన్ని ప్రైవేటీకరించాలని చూస్తున్న చంద్రబాబుకి విద్యారంగం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దాసోహమై వారి కోసం పనిచేస్తున్నాడే కానీ ప్రభుత్వ బడులను తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం లేదు.హామీలపై ప్రశ్నిస్తే ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్నారుఅధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు వేధిస్తున్నాడు. ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వంచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం డీఏలు ఇచ్చినా చంద్రబాబు మాత్రం 4 డీఏలు పెండింగ్లో పెట్టాడు. ఇంతవరకు పీఆర్సీ ఊసే లేదు. కనీసం పీఆర్సీ కమిషనర్ని కూడా లేకుండా చేశారు. ఐఆర్ గురించి కూడా ఆలోచన చేయడం లేదు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులంతా విజయవాడలో ధర్నా చేశారు. ఉద్యోగులంతా ప్రభుత్వంపై యుద్ధం చేస్తే తప్ప వారికిచ్చిన హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితి కనిపించడం లేదు.పీఆర్సీ, ఐఆర్, డీఏలపై ఉద్యోగులు ఒత్తిడి చేయడంతో శాలరీ కోతలంటూ కూటమి బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతోంది. ఏపీ హెచ్పీ అంటూ హిమాచల్ ప్రదేశ్లో మాదిరిగా ఉద్యోగాల జీతాలకు కోతలు విధిస్తామన్న హెచ్చరికలకు ప్రభుత్వ ఉద్యోగులు భయపడాల్సిన పనిలేదు. అందరూ సంఘటితపై ప్రభుత్వంపై పోరాడి హక్కులను సాధించుకోవాలి. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉద్యోగులను వైయస్సార్సీపీ ఆదుకుంటుంది. కూటమి పాలనపై సర్వేలు చేయించుకున్న చంద్రబాబు నెల్లూరులో ఒక్క సీటూ గెలిచే పరిస్థితి లేదని తెలిసి షాకయ్యాడు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో పెట్టాల్సిన మహానాడును నెల్లూరు జిల్లాకు చంద్రబాబు మార్చేశాడని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. -
చంద్రబాబు కాన్ఫరెన్స్ లు కాదు.. రైతుల కష్టాలు చూడు
-
జగన్ పై తప్పుడు కథనం పరువు పోగొట్టుకున్న జావా డిస్కవరీ ఛానల్
-
ఏమయ్యా చంద్రబాబు.. అకాల వర్షం వస్తే రైతుల పరిస్థితి ఏంటి?
-
పోసాని కృష్ణ మురళి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: అకారణంగా తనని, తన కుటుంబాన్ని తిడితే ఊరుకోనిని సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం తర్వాత గురువారం ప్రెస్మీట్లో పోసాని మాట్లాడారు. నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. నాకు నచ్చిన పార్టీలన్నింటికీ సర్వీస్ చేశాను. చంద్రబాబు మంచిగా ఉన్నప్పుడు ఆయనకూ సర్వీస్ చేశా. సినీ రంగానికి సేవల కోసమే నాకు ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. నిజం చెబితే ఎవరినైనా టార్గెట్ చేయడం సహజమే. అకారణంగా నన్ను, నా కుటుంబాన్ని తిడితే ఊరుకోను. నా కోపానికి ఎలాంటి హద్దులు ఉండవు’ అని వ్యాఖ్యానించారు. -
వర్మ ఏంటి ఈ కర్మ.. ఇంచార్జి పదవి నుంచి తొలగింపు
-
సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై టీడీపీ గుండాల దాడి
-
చంద్రబాబు అండతో భారీ భూ కబ్జా... గీతంకు హైకోర్టు నోటీసులు..
-
పవన్ ఫిర్యాదుతో వర్మకు బాబు వెన్నుపోటు
-
పిఠాపురం వర్మకు బాబు వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మకి తెలుగు దేశం పార్టీ అధిష్టానం షాకిచ్చింది. ఆయన్ని టీడీపీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఎంత విధేయంగా ఉన్నా వర్మ తీరుపై చంద్రబాబు ఎందుకనో తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. పిఠాపురంలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి టీడీపీ-జనసేన మధ్య విబేధాలు ఉన్నాయి. సీట్ల పంపకాల టైంలో అది తారాస్థాయికి చేరింది. వర్మకు కాకుండా పొత్తు ధర్మంలో భాగమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పిఠాపురం సీటును అప్పగించారు చంద్రబాబు. ఈ విషయంలో అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా అధినేత మాటకు లోబడి ఎస్వీఎస్ఎన్ వర్మ సైలెంట్గా ఉండిపోయారు. పవన్ తరఫున ప్రచారం చేయించి మరీ గెలిపించారు. అయితే గెలిచాక కూడా ఇరు పార్టీల మధ్య వర్గ పోరు కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా ఫ్లెక్సీ వార్ ఆ గొడవను తారాస్థాయికి చేరింది. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో లేకపోవడంతో హర్టైన వర్మ.. జనసేన వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఇది దాదాపుగా ఆయనపై దాడి చేసేంత దాకా వెళ్లింది. ఆ టైంలో.. చంద్రబాబు మాట మీద తాము మౌనంగా ఉన్నామని.. ఇక మీదట పరిస్థితి మరోలా ఉంటుందంటూ ఆయన ఆవేశంగా మాట్లాడారు. ఇది చంద్రబాబుకి ఎందుకనో సహించలేదు. పార్టీ మీటింగ్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా వర్మను మందలించారు కూడా. అయితే.. మొన్నీమధ్యే జనసేన అధినేత పవన్ కల్యాణ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో వర్మ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. వర్మ భావోద్వేగంఈ నిర్ణయం వెలువడ్డాక వర్మ పిఠాపురం టీడీపీ ఆఫీస్కు వచ్చారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. పార్టీ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా’’ అంటూ మాట్లాడారాయన.పిఠాపురంలో వర్మ పదే పదే రచ్చ చేస్తున్నారని పవన్ ఫిర్యాదు చేయడంతో.. ఇప్పుడు ఆయన్ని ఇంచార్జ్ బాధత్యల నుంచి తప్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. నియోజక వర్గంలో వ్యవహారాలను చూసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పరిణామంపై వర్మ అనుచరులు రగిలిపోతున్నారు. అధినేత కోసం వర్మ అంతలా ఆరాటపడితే.. పవన్ చెప్పుడు మాటలు విని ఇలా చేయడం ఏంటని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మ నిర్ణయం ఎలా ఉండబోతోందా? అనే ఉత్కంఠ పిఠాపురంలో నెలకొంది. -
ఎర్రచందనం దొంగలతో చంద్రబాబు, లోకేశ్ ఫోటోలు.. Liveలో ఆధారాలు
-
ప్యాలెస్ కోసం నారా వారి స్కెచ్.. ఎర్రచందనం దొంగలతో బాబు, లోకేశ్
-
ప్రభుత్వ స్థలంలో టీడీపీ ఆఫీసు భూమి పూజ బాబుపై SV మోహన్ రెడ్డి ఫైర్
-
తమిళనాడు పరిస్థితే ఏపీ లో రిపీట్... TVK విజయ్ విజయంపై చింతా మోహన్ రియాక్షన్
-
YS జగన్ పై తప్పుడు కథనం జావా డిస్కవరీకు లీగల్ నోటీసులు?
-
తమిళనాడులో రివర్స్ అయిన చంద్రబాబు విజనరీ!
-
‘అమరావతి పేరుతో చంద్రబాబు తప్పులపై తప్పులు’
సాక్షి, కాకినాడ జిల్లా: కలెక్టరేట్ వద్ద మాజీ ఎంపీ చింతా మోహన్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని ఎంత మంది ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబును అడుగుతున్నా? అంటూ నిలదీశారు. కాసేపు అమరావతి దేవతల రాజధాని అంటాడు. మరికాసేపు మనుషుల రాజధాని అంటాడు. రేపు ఏ రాజధాని అంటాడో తెలియదు’’ అంటూ చింతా మోహన్ మండిపడ్డారు.రాజధాని ప్రాంతంలో కర్ర తుమ్మలు కొట్టడానికే రూ.40-50 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయం భవనాలకు అద్దాలను బిగించేందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా చంద్రబాబు?. రాష్ట్రం అప్పల్లో ఉంది.. చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నాడు. సచివాలయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలు నుండి కూడా ఒక్కరు రావడం లేదు. రాజధానిని చంద్రబాబు తన సొంత ఆలోచనతో చేసుకుంటున్నాడు’’ అంటూ చింతా మోహన్ ధ్వజమెత్తారు. -
బాబొచ్చారు ఓటమి తెచ్చారు
-
అమరావతి ల్యాండ్ పూలింగ్ లో చంద్రబాబు భారీ అవినీతి
-
మరో 4వేల కోట్లు.. అప్పుల్లో ఆల్ టైం రికార్డు
-
మరో 4వేల కోట్లు.. అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆల్టైం రికార్డు
సాక్షి,విజయవాడ: ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు చేసింది. మంగళవారం రూ.4,400 కోట్లు అప్పు చేసింది. ఫలితంగా అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆల్ టైం రికార్డ్ సృష్టించారు. స్వల్ప కాలంలో చంద్రబాబు పాలన అప్పు రూ.3,62,855 కోట్లకు చేరింది. తద్వారా దేశంలో అన్ని రాష్ట్రాలకంటే చంద్రబాబు ప్రభుత్వం అత్యధిక అప్పులు చేసిన సీఎంగా అప్రతిష్టను మూటగట్టుకున్నారు.కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 3,62,855 కోట్లు అప్పు చేసింది. అంటే సగటున రోజుకి రూ.15,766 కోట్లు అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూ.2,02,964 కోట్లు బడ్జెటరీ అప్పులు, కార్పొరేషన్ల గ్యారెంటీ అప్పులు రూ.1,12,504 కోట్లు, రాజధాని అప్పులు 47,387 కోట్లుగా ఉన్నాయి. -
DMK, AIADMK పట్టిన గతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు
-
అమరావతి అప్పులు అందరికి... భూలాభం కొందరికే!
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తూంటే.. అప్పుచేసి పప్పు కూడు అన్న పాత సామెతను అప్పు చేసి అమరావతి సోకులు అని మార్చాల్సి వస్తుంది. పేదవాడికి అండగా నిలిచే లక్ష్యంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ గతి తప్పుతోంది. అమరావతిలో గత జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోట్లు వెచ్చించగల ధనికులకే పరిమితమన్న అభిప్రాయం బలపడుతోంది.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాజధాని గ్రామాలలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు కలుగుతుందన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అవసరానికి తగ్గట్టు నిర్మాణాలు జరిపేందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ... అవగాహన లేకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్టు ఒక నగరాన్ని సృష్టిస్తామన్న పాలకుల వ్యవహారమే మింగుడుపడటం లేదు.ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ నిర్ణయాలను పరిశీలిస్తే సామాన్యుడు ఎవరైనా విస్తుపోవాల్సిందే! అమరావతి నిర్మాణాల్లో కేవలం అద్దాలకు మాత్రమే రూ.2540 కోట్లు వెచ్చించాలని తీర్మానించింది మంత్రివర్గం. అసెంబ్లీ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ వంతెనలకు రూ.798 కోట్ల వ్యయం చేయున్నారు. విశేషం ఏమిటంటటే ఇక్కడ నిర్మాణాల టెండర్లను మంత్రివర్గంలో ఆమోదించారట.సాధారణంగా టెండర్ల ఆమోదం కేబినెట్ వరకు రాదు. కాని మంత్రులందరిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏదో సందేహం ఉండి ఉండాలి. ఒకవేళ వచ్చే ప్రభుత్వం ఈ దోపిడీపై విచారణ చేస్తే మంత్రివర్గ నిర్ణయంగా తోసివేయడానికి ఉపయోగపడుతుందన్న భావన కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని పేరుతో ఏ రాష్ట్రంలోను ఇంతలా డబ్బు వృథా చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం పార్లమెంటు భవన నిర్మాణానికి కేవలం రూ.1100 కోట్ల లోపు వ్యయం అయితే, ఏపీలో భవనాల అద్దాలకే రూ.2540 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కట్టిన తెలంగాణ సచివాలయ భవనానికి అయిన ఖర్చు కూడా రూ.వెయ్యి కోట్ల లోపే.డబ్బు ఉంటే ఎన్ని సోకులు అయినా చేసుకోవచ్చు. ఎవరూ తప్పుపట్టరు. కానీ... ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న ఆంద్రప్రదేశ్లో ఈ దుబారా చేయడం కచ్చితంగా బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఏ పని చేయాలన్నా, ఏ హామీ గురించి ప్రశ్నించినా, మెడికల్ కాలేజీల వంటి వాటిని ప్రైవేటు పరం చేయవద్దని చెప్పినా, డబ్బులు లేవని చెబుతారు. కాని అమరావతిలో మాత్రం లక్షల కోట్లు వ్యయం చేయడానికి రెడీ అయిపోయారు. ఇందుకోసం వేల కోట్ల అప్పులు చేసేశారు. రాజధానిలో సచివాలయ సిబ్బంది కూడా మూడువేల మందికి మించి ఉండరు.కాని సచివాలయం కోసం చదరపు అడుగుకు రూ.15 వేల వ్యయంతో నలభై, ఏభై అంతస్తుల భవనాలు నిర్మించడం అంటే అంతా విస్తుపోతున్నారు. నలభై ,ఏభై లక్షల చదరపు అడుగుల భవనం నిర్మించడమేమిటో తెలియకుండా ఉంది. ఇదంతా కాంట్రాక్టర్లను బాగు చేయడానికి, కిక్బ్యాక్లు పొందడానికే అని విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. అది చాలదన్నట్లుగా ప్లంబింగ్, డ్రైనేజీ, విద్యుత్ తదితర సదుపాయల కల్పనకు మరికొన్ని వేల కోట్లు, చివరికి అద్దాలు అమర్చడానికి రూ.2540 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు.ఈ భవనాల నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వపరంగా వాడుకోవడానికి ఆ స్థాయిలో సిబ్బంది ఉండకపోవచ్చు. అందువల్ల ఈ భవనాలలో అత్యధిక భాగం అద్దెకు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. జాతీయ రహదారికి నలభై కిలోమీటర్ల దూరం వచ్చి కంపెనీలు అద్దెకు తీసుకునే పరిస్థితి ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు.పైగా ప్రభుత్వ భవనాలలో ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. అలాంటప్పుడు ఇన్ని భారీ భవనాల నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో తెలియదు.ఇక అసెంబ్లీ భవన నిర్మాణానికి కూడా వేల కోట్ల వ్యయం జరుగుతుంది.నిజానికి అసెంబ్లీ సమావేశాలు జరిగేదే ఏడాదికి ముప్పై రోజులు కూడా ఉండడం లేదు. ఒకప్పుడు 45 రోజులైనా సభ జరగాలని అనేవారు. ఇప్పుడు అడిగేవారు కూడా లేరు. మొత్తం 300 లేదా 400 మంది కూర్చోవడానికి, భారీ స్థాయిలో భవంతి నిర్మించడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదు. పోనీ కమిటీ సమావేశాలకు అవసరమవుతాయని అనుకున్నా, అవి కూడా ఎంత మేర పని చేస్తాయో చెప్పలేం. ఆ సమావేశాలకు జరగడానికి రెండు లేదా మూడు సమావేశ మందిరాలు సరిపోతాయి. అయినా అసెంబ్లీ భవనానికి రకరకాల డిజైన్లు తయారు చేస్తున్నారు.అమరావతి భవనాల డిజైన్ కోసమే రూ.400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు.ఈ టవర్లపై ఎక్కి నగరాన్ని చూసే సదుపాయం కల్పిస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. దానికోసం ఇన్నివేల కోట్లు వ్యయం చేయాలా? ప్రభుత్వం తన సొంత భూములలో నిర్మాణం చేస్తే అదో పద్దతి. రైతుల నుంచి వారి ఇష్టపూర్వకంగానో,లేక బలవంతంగానో భూమి సమీకరించారు.వారికి కౌలుతోపాటు పలు హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చుతో లే అవుట్ లు వేసి, మౌలిక వసతులు కల్పించి ఇవ్వాలి.ఇందుకోసం ఒక ఎకరాకు రూ.రెండు కోట్లు అవుతుందని, ఏడేళ్ల క్రితమే చంద్రబాబు సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. కేంద్రం దీనిపై స్పందించలేదు. కాకపోతే ఈ టర్మ్లో ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. అప్పు తీర్చవలసిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే. అంటే ఏపీ ప్రజలు వడ్డీతో సహా అప్పులు చెల్లించవలసిందే. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారు ఐదు కోట్ల మంది ఈ మొత్తానికి బాధ్యులైతే, ఇక్కడ పెరిగే భూముల విలువ వల్ల లబ్ది పొందేది కొన్నివేల మంది మాత్రమే. ఇదంతా ఉపాధి కేంద్రం అవుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, ఆ స్థాయిలో ఇక్కడకు వస్తున్న కొత్త సంస్థలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలకు 99 పైసలకే భూములు ఇస్తున్న నేపథ్యంలో అమరావతిలో పరిశ్రమల స్థాపనకు ఎంతమంది ముందుకొస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ వచ్చినా ఇక్కడ కూడా అలాగే ఉచితంగా భూములు ఇవ్వగలుగుతారా? అలా చేస్తే అమరావతి ద్వారా ఆదాయం కూడా రాదు కదా! విశాఖలో కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. అమరావతిలో ఆ పరిస్థితి లేదు.దానికితోడు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని గొప్పగా చెప్పి రాజధాని పరువు తీశారు. ఇతర సామాజికవర్గాలలో ఆమెకు తెలియకుండానే వ్యతిరేకత సృష్టించారు. ఇది ఒక కోణం అయితే ఇప్పటికే ఉన్న అసెంబ్లీ, సచివాలయం వంటివాటిని మళ్లీ నిర్మించడం ద్వారా వృథా వ్యయం చేస్తున్నారన్న విమర్శ ఉంది.ఇవే కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలలో ఉన్న రైల్వేస్టేషన్లు కాదని అమరావతి గ్రామాలలో కొత్త రైల్వే స్టేషన్, గన్నవరంలో ఉన్న విమానాశ్రయం కాకుండా ఇంకో ఎయిర్ పోర్టు నిర్మించాలని తలపెట్టడం ఏ మేరకు తెలివైన నిర్ణయం అవుతుంది? టీడీపీకి గట్టి మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి వెంకటేశ్వరరావు రెండో దశ పూలింగ్ నిమిత్తం భూములు తీసుకోవడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించారు.అయినా ప్రభుత్వం వేల ఎకరాల సేకరణకు ముందుకు వెళుతుంటే రైతులు అల్లాడుతున్నారు.ఇంతవరకు తొలిదశ రైతులకు హామీ ఇచ్చిన రీతిలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు. మరో వైపు పేదలకోసం జగన్ ప్రభుత్వం ఇచ్చిన 50వేల ఇళ్ల స్థలాలను రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వ వైఖరి తెలియచేస్తుంది.రాజధానిలో పెద్ద, పెద్ద ప్లాట్లు మాత్రమే ఉండాలన్న వారి ధనిక మనస్తత్వానికి అద్దం పడుతున్నదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అమరావతి గ్రామాలలో భూములలో మట్టి స్వభావం కారణంగా పునాది నుంచి అధిక వ్యయం చేయవలసి వస్తోంది. చాలామంది విజయవాడ-గుంటూరు మద్య గట్టి నేలల్లో అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చినా వినకుండా చంద్రబాబు సర్కార్ తన ఇష్టారాజ్యంగా లక్షల కోట్లు ఒక ప్రాంతంలోనే ఖర్చు చేయడానికి సిద్దపడుతోంది.జగన్ చెప్పిన మావిగన్ కాన్సెప్ట్ వల్ల ఇన్ని లక్షల కోట్ల అవసరం ఉండదు.ఆ విషయం జనంలోకి వెళుతుండడంతో దానిపై వ్యతిరేక ప్రచారం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోంది. సాధారణంగా ఆర్థిక కష్టాలలో ఉన్నవారు పొదుపుగా వ్యవహరించాలని అంతా సలహా ఇస్తారు. కాని ప్రభుత్వమే ఇలా దుబారా వ్యయం చేస్తుంటే, ఎవరి మాట విననంటుంటే ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవల్సిందేనా? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు పాపం.. సీమకు శాపం
మార్కాపురం: చంద్రబాబు పాపం.. సీమకు శాపంగా పరిణమించిందని, రానున్న రోజుల్లో రైతులు, ప్రజలకు తీవ్ర నీటి కష్టాలు ఎదురుకానున్నాయని మాజీ మంత్రి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ఫోర్స్ చైర్మన్ సాకే శైలజానాథ్, వైఎస్సార్ సీపీ రీజినల్ కో– ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మార్కాపురంలో వైఎస్సార్సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షతన కృష్ణా జలాల పోరాట సమాలోచన, తాగు, సాగునీటి కోసం పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా శైలజానాథ్, కారుమూరి, ఇతర వక్తలు మాట్లాడుతూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లనుందని, దీనికి చంద్రబాబే కారణమని విమర్శించారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి తానే చంద్రబాబుతో మాట్లాడి సీమ ప్రాజెక్టును ఆపించానని చెప్పారని, దీనిని బట్టి చంద్రబాబు రేవంత్తో కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న విషయం స్పష్టమైందని ధ్వజమెత్తారు. సీమకు అడుగడుగునా ద్రోహం చంద్రబాబు సీమకు అడుగడుగునా ద్రోహం చేస్తున్నారని వక్తలు మండిపడ్డారు. రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారని, మెడికల్ కాలేజీలనూ పూర్తి చేయకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. నాడు శ్రీకృష్ణ కమిటీ దొనకొండను రాజధాని చేయాలని సిఫార్సు చేస్తే.. దానిని పక్కన పెట్టి తన బినామీలు, అనుచరుల కోసం అమరావతిని బాబు రాజధాని చేశారని ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని కోరితే పోలవరం నుంచి లిఫ్టు ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలు అందిస్తానని చెప్పడం ఎంత వరకు సబబని నిలదీశారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్ సీమ హక్కుల కోసం పోరాడారని గుర్తుచేశారు. వెలుగొండ ప్రాజెక్టుపై బాబు శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, ఆదెన్న, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి, ఒంగోలు ఇన్చార్జిలు డాక్టర్ దద్దాల నారాయణయాదవ్, చుండూరి రవిబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు షంషీర్ అలీబేగ్, కేవీ రమణారెడ్డి, వైవీ రావు మాట్లాడారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. -
అయ్యో ‘బాబు’!
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రచారం అసలు ఫలించలేదు. పైగా ఆయన ప్రచారం చేసిన చోటల్లా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. కోయంబత్తూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నాలుగింటిలో బీజేపీ, అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతలు పోటీ చేశారు. వీరికి మద్దతుగా సీఎం చంద్రబాబు ప్రచారం చేసినా ఫలితం శూన్యం. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ గెలుపొందగా ఎన్డీఏ కూటమికి చెందిన అన్నాడీఎంకే అభ్యర్థి అమ్మన్ అర్జునన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.కోయంబత్తూరు ఉత్తరం నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కూడా మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. పొల్లాచ్చిలో వి.జయరామన్ 2వ స్థానానికి పరిమితమయ్యారు. చెన్నై అన్నానగర్లో అన్నాడీఎంకే అభ్యర్థి గోకుల ఇందిర, సాత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్కు మద్దతుగా చంద్రబాబు రోడ్షోలు నిర్వహించారు. ఈ రెండుచోట్ల ఎన్డీఏ అభ్యర్థులకు ఓటమితప్పలేదు. ఇదిలా ఉంటే ఆవడిలో బీజేపీ అభ్యర్థి అశి్వన్కుమార్కు మద్దతుగా టీడీపీ కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించారు. -
అది రెడ్ బుక్ కాదు.. అది బ్లడ్ బుక్! తండ్రి కొడుకులపై రజిని ఫైర్
-
‘కట్టుకథలతో నాపై అట్రాసిటీ కేసు పెట్టారు’
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ వచ్చానని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని.. 70కి పైగా జర్నలిస్ట్లపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.‘‘మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఐఏఎస్లను కూడా రెడ్బుక్ వదల్లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే పోలీసులు దృష్టి పెట్టారు. అందుకే పోలీస్ శాఖ ర్యాంక్ పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించామంటూ నిరసన ర్యాలీ చేస్తే నాపై కేసు పెట్టారు. కట్టుకథలు అల్లీ మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. గుడికి వెళ్లి వస్తుంటే నా మీద దాడి చేసి.. కేసు కట్టారు...ప్రతిపక్ష గొంతు వినపడకూడదని కుట్రపన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. మీ అక్రమ కేసులకు మేం భయపడం. మీరు హామీలను నెరవెర్చకుంటే ఆందోళన చేస్తాం. నేను ఎందుకు భయపడాలి?. మీరు నాటిన విష విత్తనం వృక్షమైతే ఎలాంటి పరిస్థితులుంటాయో ఆలోచించుకోండి’’ అంటూ విడదల రజిని వ్యాఖ్యానించారు. -
రాజధాని అనేది ఫొటోలోనే.. నిజం అది మునిసిపాలిటీకి కూడా పనికిరాదు
-
‘చంద్రబాబు గుణపం పోట్లకు ఎవరూ అనర్హం కాదు’
సాక్షి, నెల్లూరు: ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పార్టీ.. గుణపం పోటు పార్టీ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. వివేకాను హత్య చేసిన వారిని మీ వెనుక వేసుకొని.. వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అనడం కాదన్నారు. చంద్రబాబు గుణపం పోట్లకు ఎవరూ అనర్హం కాదని కాకాణి ఎద్దేవా చేశారు.గుణపం చంద్రబాబు చేతిలో పెడితే సింబాలిక్గా వుంటుంది. అమరావతిని గుణపంతో తవ్వి కోట్లు కొల్లగొడుతున్నారు. దోపిడీ విజనరీతో అవినీతితో రాజ్యం ఏలుతున్నారు. చంద్రబాబు, లోకేష్ కలిసి అమరావతిలో నిర్మాణాల పేరుతో కోట్లు దోచుకుంటున్నారు. శాశ్వత సచివాలయం, ప్రభుత్వ భవనాలు పేరిట కాంట్రాక్టుల మాటున కొల్లగొడుతున్నారు’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి ధ్వజమెత్తారు. -
12 వేల కోట్లతో బుర్జు ఖలీఫా.. అమరావతిలో 3 బిల్డింగ్ కోసం 14 వేల కోట్లా?
-
నీకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య నువ్వా మా పార్టీ కోసం మాట్లాడేది
-
పబ్లిసిటీ ఫుల్, సంక్షేమం నిల్ అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల పెన్షన్ పై లేదు
-
మా బాధ వినండి చంద్రబాబు.. రోడ్డెక్కిన YSRCP నేతలు
-
నీ అబ్బా సొత్తా అమరావతి.. అమరావతికి నేను వ్యతిరేకినే..!
-
ఏపీ ఎన్నికలు ఇప్పటికీ ఓ మిస్టరీనే!
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై అనుమానాల్ని ఎందుకనో ఎన్నికల సంఘం ఇప్పటిదాకా నివృత్తి చేయలేకపోయిందని అన్నారాయన. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఓ మిస్టరీ. నేను లేవనెత్తిన అనుమానాలకు ఎన్నికల సంఘం నుంచి సమాధానాలు లేవు. సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అసలు 12 శాతం అదనంగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 100కు 132 శాతం పోలింగ్ నమోదైంది.. ఇది ఎలా సాధ్యం?. ఆ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల సంఘం పై లేదా?..సాధారణంగా.. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికే ఓటు అవకాశం ఉంటుంది. ఏపీలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం చెబుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా క్యూలైన్ లో ఉండి చివరగా ఓటు వేసిన వారు ఎవరు. అర్ధరాత్రి సమయంలో 8 గంటలు క్యూలైన్లో ఉండి ఓటు వేసిన వారి వివరాలు ఇస్తే... పాద పూజ చేస్తా అని ప్రభాకర్ అన్నారు. -
జగన్ ప్రభుత్వమే బెటర్, మా టీడీపీ ప్రభుత్వంలో నాపైనే కేసులు, మద్యంలో అవినీతి బట్టబయలు
-
నాకు భయం లేదు, బాధ కూడా లేదు కేవలం ఆవేదన మాత్రమే
-
మళ్లీ పెరిగిన ఏపీ అసెంబ్లీ నిర్మాణ వ్యయం
సాక్షి, విజయవాడ: అసెంబ్లీ నిర్మాణ వ్యయం మళ్లీ పెరిగింది. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే.కరకట్ట అభివృద్ధికి 443 కోట్ల నిధులను కేటాయిస్తూ.. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మట్టికట్ట ద్వారా అభివృద్ధికి 443 కోట్లు ఖర్చు చేయాలని, కృష్ణా రైట్ బ్యాక్ని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ గ్రామం సదుపాయాలకు 580 కోట్లు కేటాయించింది. అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, సీవరేజ్, విద్యుత్ , ఎస్టీపీ కోసం ఖర్చుచేయాలని నిర్ణయించింది.అమరావతి సచివాలయానికి భారీగా నిధులు ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 2540 కోట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హంగులు, అద్దాల కోసం భారీగా ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అద్దాలు, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కనోపి స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్ కోసం భారీగా ఖర్చు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ టవర్, టవర్ 1,2,3,4 లలో హంగుల కోసం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించింది. క్వాంటమ్ టవర్స్ కోసం 1208 కోట్లు ఖర్చు చేయాలని పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
బిల్డింగ్ అద్దాల కోసం 2 వేల కోట్లు.. మనిషివేనా..! చంద్రబాబును ఏకిపారేసిన కారుమూరి
-
సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకుడు, విలేజీ సర్వేయర్స్ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వలంటీర్లు లేని లోటును భర్తీ చేయడానికి 1.32 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను అడ్డంగా వాడుకుంటున్నారే తప్ప, కనీస హక్కులను పట్టించుకోవడం లేదన్నారు. ఇంక్రిమెంట్లు, కనీసం బేసిక్ పే సవరణ కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు.మరోవైపు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉద్యోగంలో చేరిన తమకు మరుగుదొడ్లు, పెట్రోల్ బంకుల వద్ద డ్యూటీలు వేయడం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు. సమస్యలు చెప్పుకుందామంటే ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అవకాశమే ఇవ్వడం లేదని పేర్కొన్నారు.పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలని, పదోన్నతులు కల్పించాలని.. సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లోకి డిప్యుటేషన్ మీద కాకుండా, శాశ్వత ప్రాతిపదికన విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్ధమవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగులు ‘చలో విజయవాడ’, నిరాహార దీక్షలకు పూనుకుంటామని పేర్కొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు
గంపలగూడెం: చంద్రబాబు, కూటమి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో పర్యటించి ధాన్యం కొనుగోలుపై రైతులను ఆరా తీశారు. స్థానిక మార్కెట్యార్డులో వారాల తరబడి మొక్కజొన్న, ధాన్యాన్ని ఆరబోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న రైతులతో మాట్లాడి చలించిపోయారు.అమ్మిరెడ్డిగూడెంలో పెద్ద ఎత్తున ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలంగాణలో మొక్కజొన్న క్వింటా రూ. 2400 వరకు కొనుగోలు చేస్తుంటే, ఇక్కడ రైతులకు రూ.1500 కూడా దక్కడం లేదన్నారు. ధాన్యం ఎక్కడపడితే అక్కడ రాశులు పోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలను పట్టించుకునే నాధుడు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు సైతం చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోందన్నారు.రైతుల ఇబ్బందులు పట్టవా?సాగు ఖర్చు పెరిగి, గిట్టుబాటు ధర లేక.. చివరికి పండిన పంటలు సైతం కొనేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం మలేసియా, సింగపూర్ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం తరలించడానికి వాహనాలు లేవు, సంచులు లేవు, రైతే ఖర్చు భరించి తరలించాలని అధికారులు సూచనలు చేయడం చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అన్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఆ మాటను నేడు నిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు.రైతులు కన్నీరు పెడుతుంటే మంత్రి లోకేశ్ జాడ తెలియడం లేదని, మిగతా మంత్రులు మాట్లాడే ధైర్యం లేక మౌనం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని అవినాష్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం స్పందించేంత వరకూ పోరాటాలు చేస్తామన్నారు. ఆయన వెంట తిరువూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఏలూరు శివాజీ, ఉపాధ్యక్షుడు అత్తనూరి వెంకట శివారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కావూరి వినయ్కుమార్, జెడ్పీటీసీ కోట శామ్యూల్, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ అద్దాలకు రూ.2,540 కోట్లా!?
సాక్షి, అమరావతి: అమరావతి పేరుతో ప్రజల కష్టార్జితాన్ని చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా దోచుకుంటోందని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ భవనాల అద్దాల కోసం ఏకంగా రూ.2,540 కోట్లు కేటాయించడంపై విస్మయం వ్యక్తంచేశారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.18,500 వరకు ఖర్చుచేయడం ఏ రకమైన పాలనని ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు తన అస్మదీయులకు సంపద సృష్టించేందుకు వేసిన నిరంతర దోపిడీ ప్లాన్ అని ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్కు ప్రజల్లో వస్తున్న సానుకూలతను తట్టుకోలేకే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులతో జర్నలిస్టులను, ప్రతిపక్ష నేతలను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని సజ్జల హెచ్చరించారు. ఆయనింకా ఏమన్నారంటే..చ.అడుగుకి రూ.18,500అమరావతిలో భవిష్యత్తులో కట్టబోయే అసెంబ్లీ బిల్డింగుల అద్దాల కోసమే రూ.2,540 కోట్లతో కాంట్రాక్టుకు రెడీ అయ్యారు. బిల్డింగ్ వర్క్, ప్లంబింగ్, డ్రైనేజీ వంటి పనులకు చదరపు అడుగుకి రూ.12 వేల నుంచి రూ.14 వేలు అనుకుంటే.. మున్ముందు ఇది ఎంతకు పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. రాజధానిలో నిర్మాణం చేపడుతున్న 52 లక్షల చదరపు అడుగులకి ఈ నిర్మాణ ఖర్చు కూడా కలుపుతుంటే.. చదరపు అడుగుకి రూ.18,500 వరకు ఖర్చవుతుంది. అలాగే, పాలవాగును టవర్స్ మధ్యలో తిప్పుతూ కృష్ణానదిలో కలిపేలా డిజైనింగ్ చేస్తారట. ఆ డిజైనింగ్కు మరో రూ.వందో, రెండు వందల కోట్లో ఇస్తారు.రైతుల సందేహాలకు సమాధానంలేదుఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఖర్చుపెడితే నాలుగైదేళ్లలో పూర్తయ్యే కొత్త మెడికల్ కాలేజీలకు డబ్బుల్లేవని చెబుతూ మరోవైపు.. అమరావతి కోసం ఇష్టారాజ్యంగా బరితెగిస్తున్నారు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, రైతులకు మద్దతు ధరల కోసం నిధుల్లేవని చెబుతూ అమరావతి దోపిడీకి మాత్రం భారీగా నిధులు విడుదల చేయడం విడ్డూరం. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే.. రెండో దశ భూములు తీసుకునే ప్రక్రియలో కూడా దోపిడీకి తెరలేపారు. కానీ, రైతులు తమ సందేహాలను అడిగితే వాటికి సమాధానంలేదు. పైగా.. తమకు కావాల్సిన వాళ్లకు, దగ్గరి వాళ్ల లేఅవుట్లకు మాత్రం ఎడాపెడా అనుమతులిచ్చేస్తున్నారు.అరెస్టులతో అణచివేయలేరుపూడి శ్రీహరిని సంబంధంలేని వ్యవహారంలో అరెస్టుచేశారు. ఈ విషయంలో చంద్రబాబు, లోకేశ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయలేరు. మిమ్మల్ని రాజకీయంగా సమాధిచేసే శక్తి వైఎస్సార్సీపీకి మాత్రమే ఉంది. ఇక పేదలకు కేటాయించిన 50 వేల ఇళ్ల పట్టాలను నిర్దాక్షిణ్యంగా రద్దుచేయడం చంద్రబాబుకు పేదలపై ఉన్న కక్షను తెలియజేస్తోంది. కాగా, మెంబర్షిప్, ఎస్ఐఆర్పై వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ఫోకస్ పెంచాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ కీలక నేతలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. -
‘అద్భుతం అంటూ నమ్మించి.. ఇలా దోచుకుంటున్నారు’
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుది దాపరికం లేని బహిరంగ దోపిడీ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిలో చిన్న చిన్న పనులకు వందల కోట్లు ఖర్చు చేయడం బహిరంగ దోపిడీకి నిదర్శమన్నారు. తన సంపద సృష్టికోసమే అమరావతినే చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ప్రజల సొమ్మును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ట్విన్ టవర్స్ పేరుతో మరో రూ. 12 వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం అసెంబ్లీ సచివాలయం భవనాల అద్దాల కోసం రూ. 3 వ వేల కోట్లు ఖర్చా?, చిన్న చిన్న పనులకే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. టెండర్లకు కేబినెట్ ఆమోదం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కేబినెట్ ఎప్పుడు జరిగినా ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు ఉండవు. భూముల కేటాయింపులు, రాజధాని నిధులపైనే నిర్ణయాలు ఉంటున్నాయి. అమరావతిని తన సంపద సృష్టికోసం వాడుకుంటున్నారు. తనకు కావాల్సిన వాళ్లు లే ఔట్లకు అనుమతులు ఇస్తున్నారు. అమరావతి అద్భుత నగరం కాబోతుందని నమ్మిస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే దళారీ వ్యవస్థ మొదలైంది. ఇప్పుడు బాబు హయాంలో దళారీ వ్యవస్థ తారాస్థాయికి చేరింది. ఈ దుబారా ఖర్చు తప్పితే ఇప్పటివరకూ రైతులకు మద్దతు ధర లేదు’ అని విమర్శించారు. సజ్జల ఏమన్నారంటే.. మావిగన్ ప్రతిపాదనకు ప్రజల్లో సానుకూలత వచ్చిందిఎల్లీ బ్యాచ్ దీన్ని తట్టుకోలేక జగన్, ఆయన కుటుంబ సభ్యులను దూషించారుమావిగన్ మొదటి రోజు నుండే రాజధానిగా మారుతుందిఅది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదని అందరికీ తెలిసిపోయిందిఅందుకే టీడీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేశారుఅమరావతిలో సెక్రటరియేట్ భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లా?దీనికి క్యాబినెట్ ఆమోదం తెలపటమా?ఇది చూసి జనం బిత్తరపోతున్నారుబిల్డింగుల నిర్మాణమే అడుగుకు ప్రస్తుతం రూ.12 నుంచి రూ 14 వేలు అయిందిఈ అద్దాలకు అయ్యే ఖర్చు అదనంఇదంతా కలుపుకుంటే రూ.18 వేలకు ఒక్కో అడుగుకు ఖర్చు అవుతోందిఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ లో కూడా ఇంత ఖర్చు కాదుపాలవాగు డిజైన్ త్వరలోనే రూపొందిస్తారటబిల్డింగుల చుట్టూ తిరుగుతూ పాలవాగు వెళ్తుందంటదానికి ఇంకెంత ఖర్చు చేస్తారో తెలియదుట్విన్ టవర్ పేరుతో మరో రూ.12 వందల కోట్లు ఖర్చునగిషీలు, డిజైన్లు, అద్దాలు.. ఖర్చులు ఇది నిరంతరమైన ప్రక్రియప్రజల సొమ్మును అమరావతిలో కృష్ణానదిలా పారిస్తున్నారుఅమరావతి పూర్తికాకూడదు, అది నిరంతర ప్రక్రియలా ఉండాలని చూస్తున్నారుదీని ద్వారా సంపద సృష్టించుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏంటో అర్థం కాదుగతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ అలా చేయలేదుప్రజలకు పనికి వచ్చే ఏ పని గురించి క్యాబినెట్ లో చర్చించలేదుఅమరావతిలో దోచుకోవటానికి అవకాశం కల్పించినందున అక్కడి రైతులు అదృష్టవంతులంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారురెండో దశ ల్యాండ్ పూలింగ్ 13వ తేదీనుంచి ప్రారంభించారుదానికంటే ముందే ఆరో తేదీన లే అవుట్లకు అనుమతులు ఎలా ఇస్తారు?రైతులు భూములు ఇచ్చిన వారికి ఏం ప్రయోజనం చేయలేదుకానీ తనకు కావాల్సిన వారి లేఅవుట్లకు ఎలా అనుమతులు ఇస్తారు?ఇంత బరితెగింపు దేశంలో ఎక్కడా జరగటం లేదుఈదోపిడీకి దేవతల రాజధాని అని అందమైన పేరు పెట్టుకున్నారుమెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇవ్వట్లేదురైతులకు మద్దతు ధర లేదుఫీజు రియంబర్స్ మెంట్ నిధులు లేవుకానీ అమరావతిలో దోచుకునేందుకు మాత్రం భారీగా నిధుల విడుదల చేస్తున్నారుఇంధన సంక్షోభం సృష్టించి మరీ దోపిడీ చేశారుఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ దోపిడీ చేస్తూనే ఉన్నారురాజధానిలో పేదలకు యాభై వేల ఇళ్ల పట్టాలు ఇస్తే దాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందిపేదల స్థలాలను నిర్దాక్షిన్యంగా లాగేసుకున్నారుచంద్రబాబు చేసే దోపిడీని అడ్డుకుంటున్నందుకు మమ్మల్ని విలన్ లాగా చూస్తున్నారువారిని ప్రశ్నించిందుకు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారుమేము అలాంటి వాటిపై స్పందించంప్రజా సమస్యలు, అవినీతిపై నిలదీస్తాంఅసలు అద్దాల కోసం రూ.2,540 కోట్లు ఖర్చు చేయటం ఏంటి?అమరావతిలో మీడియా వాళ్లు వెళ్లే పరిస్థితే ఎందుకు లేదు?అక్కడేమైనా అణుకేంద్రాలు కడుతున్నారా?ప్రజల సంక్షేమాన్ని వదిలేసి వారిని జలగల్లాగ పట్టి రక్తం పీల్చుతున్నారుపూడి శ్రీహరిపై ప్రభుత్వం వేధింపులకు దిగిందిఒకే ఇష్యూ మీద ఎన్ని కేసులు పెడతారు?దీనిపై హైకోర్టు ఒకటి కంటే ఎక్కవ ఎఫ్ఐఆర్ లు పెట్టవద్దని కూడా చెప్పిందిఐనప్పటికీ పోలీసులు బరితెగింపుకు నిదర్శనమేఆటోలో, అంబులెన్సులో ఎక్కించుకుని శ్రీహరిని తిప్పారుఇలాంటి బెదిరింపులకు ఎవరూ లెక్కచేయరుచంద్రబాబు, లోకేష్ గుర్తు పెట్టుకోండి.. మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తాంఆ శక్తి వైఎస్సార్సీపీకి ఉందితిరుమల లడ్డూపై చేసింది కల్పిత గాధదేవుని సొమ్ముని దోచుకోవటానికి అల్లిన కథ ఇదిదినేష్ కుమార్ కమిషన్ రిపోర్టులో మాపై ఆరోపణలు చేయలేదునెయ్యి కాంట్రాక్టును పెంచుకోవటానికే ఈ మొత్తం కథ నడిపారుఒక్క సంవత్సరంలోనే డబుల్ రేటు చేశారుధర పెంచి దేవుని సొమ్ము దోచుకోవటానికి పన్నిన కుట్రఅందుకోసం భక్తుల మనోభావాలను దెబ్బ తీశారుఅంత ఘోరాన్ని, నీచానికి చంద్రబాబు పాల్పడ్డారు -
‘మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి బరితెగింపునకు దిగిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం చర్యలను ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి భవనాల సోకుల గురించి, మంత్రులు సింగపూర్ పర్యటన గురించి మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారా? అని నిలదీశారు.ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఆటోలో తీసుకెళ్లడం కక్షపూరిత వైఖరికి నిదర్శనం. మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?, దీనికి సమాధానం చెప్పకుండా మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. వ్యవసాయమే లేని సింగపూర్ లో వ్యవసాయం పై ట్రైనింగా?, పరిశ్రమల మంత్రి లేకుండా పారిశ్రామికీకరణ పై శిక్షణా?, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేస్తున్నారు. పేదలకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వటానికి చేతులు రావు. కానీ వందల కోట్లు దుబారా చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగులకు రూ.2540 కోట్లు ఖర్చు చేస్తారా?, దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి వదిస్తారా?, పెద్దపెద్ద రాష్ట్రాల్లో కూడా చేయనంత అప్పులు చంద్రబాబు చేస్తున్నారు. డీజిల్, పెట్రోలు కొరతకు వైఎస్సార్సీపీనే కారణమంటారా?, క్యాబినెట్ మంత్రులకు కొద్దిగైనా సిగ్గు ఉండాలి. ఇంధన కృత్రిమ కొరత వెనుక రూ.150 కోట్ల స్కాం ఉంది. కూటమి ప్రభుత్వం పతనానికి సమయం ఆసన్నమైంది. అక్రమ కేసులకు భయపడేది లేదు’ అని హెచ్చరించారు. -
గొడ్డలి పార్టీ ఎవరిదో గూగుల్ ని అడిగితే సరి.. అడుగుదామా బాబూ ?
-
చంద్రబాబు 'మెంటల్' అనగానే బాలయ్య వైపు తిరిగిన కెమెరా..!
-
కిల్లర్ పార్టీ ?.. 23 నెలల్లో 740 దారుణ హత్యలు
-
పెట్రోల్, డీజిల్ సమస్య మన వల్ల రాలేదని చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమన్న వాస్తవం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ప్రభుత్వం దాన్నుంచి తప్పించుకొనేందుకు మల్లగుల్లాలు పడుతోంది. రాజధాని కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల కారణంగానే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత వచ్చిందన్న విషయం కేంద్ర ప్రభుత్వ లేఖలతో బయటపడింది. వారం రోజులుగా రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేస్తున్న పెట్రోల్ డీజిల్ కొరత వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఊరూవాడా తెలిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే రాజకీయ అంశాలపై మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత పెద్ద అంశంగా మారిందని, ఉన్నట్టుండి ఈ సమస్య రావడానికి ప్రభుత్వమే కారణమనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం. రాజధాని పనులు చేసే కాంట్రాక్టర్లకు రిటైల్ ధరలో బల్్కగా ఆయిల్ సరఫరా చేయాలని కంపెనీలను ఒత్తిడి చేయడం ద్వారా ప్రభుత్వమే ఈ సమస్య సృష్టించిందని ప్రజల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చను కొంతవరకైనా నివారించాలంటే మంత్రులు మాట్లాడాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. పెట్రోల్, డీజిల్ సమస్య ప్రభుత్వం వల్ల రాలేదని చెప్పాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఆయిల్ కంపెనీల వల్లే ఈ సమస్య వచ్చిందని, ఇందులో ప్రభుత్వం తప్పు లేదని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరినట్లు తెలిసింది.ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయిల్ కొరత ఉందని బలంగా ప్రచారం చేయాలని, అప్పుడే ప్రజలు కొంత శాంతిస్తారని చెప్పినట్లు సమాచారం. రాజధాని పనులకు అవసరమైన ఆయిల్ సరఫరా చేయాలని కేంద్రానికి రాసిన లేఖలు, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలు, ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం రాసిన లేఖల వివరాలు బయటకు ఎలా వెళ్లాయనే అంశంపైనా చర్చ జరిగింది. ఈ వివరాలన్నీ బయటకు వెళ్లడం వల్ల ఇబ్బంది వచ్చిందని, ఇలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా చూడాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం.9 మంది మంత్రులు ఒకేసారి సింగపూర్ పర్యటనకు వెళ్లడం, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, రాజధాని నిర్మాణాలకు అంచనాలకు మించి భారీ రేట్లతో పనులు చేస్తున్న అంశాలపై మంత్రులు స్పందించాలని చెప్పినట్లు తెలిసింది. ఎంత చెప్పినా కొందరు మంత్రులు ఇలాంటి విషయాలపై మాట్లాడటంలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తమ వల్లే వచ్చిందని వైఎస్సార్సీపీ చెబుతోందని, దాని క్రెడిట్ మొత్తం టీడీపీకే దక్కేలా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే నిజమైన విజేతలు: సీఎంటీమ్ ఏపీ పనితీరు వల్లే తనకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్–2025 అవార్డు వచ్చిందని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులే నిజమైన విజేతలని సీఎం చంద్రబాబు అన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిన సందర్భంగా చంద్రబాబు గురువారం మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్వోడీలకు ఆత్మీయ విందు ఇచ్చారు. వివిధ శాఖల్లో మంచి పనితీరు కనబరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా విందుకు ఆహ్వానించారు. తొలుత మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశమై రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై చర్చించారు. -
కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ
-
టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా
-
అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం
సాక్షి, విజయవాడ: అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణ వ్యయాలు మళ్లీ పెంపునకు నిర్ణయించింది. సచివాలయం అద్దాలు, హంగుల కోసం 2540 కోట్లు ఖర్చు పెట్టనుంది. సచివాలయం, జీఏడీ టవర్స్ గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కెనపీ, కాలమ్ క్లౌడింగ్, పీవీ ప్యానల్స్, స్కై లైట్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించిన కేబినెట్.. ఈ పనులన్నింటికీ 2,540 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే సచివాలయం నిర్మాణానికి అత్యధిక ధరను ప్రభుత్వం చెల్లిస్తోంది.తెలంగాణలో కేవలం 650 కోట్లతో సచివాలయం నిర్మాణం జరగ్గా.. ఏపీలో కేవలం సచివాలయం హంగులకే 2,540 కోట్ల ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అసెంబ్లీ నిర్మాణం వ్యయంలోనూ భారీగా పెంచేసింది. మరో 798 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిర్మాణ భవనానికి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జెస్ 798 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.సీఎం ఇంటిదగ్గర కరకట్టకు 443 కోట్లు ఖర్చుకి కేబినెట్ ఆమోదం తెలిపిన కేబినెట్.. రూ.443 కోట్లతో మట్టికట్టను విస్తరించాలని నిర్ణయించింది. కరకట్ట పొడవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 11 కిలోమీటర్ల కరకట్టను ఆధునీకరణతో పాటు.. క్వాంటమ్ ట్విన్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 43 అంతస్థుల 2 బిల్డింగ్ లు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయంఅమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేబినెట్.. ఆర్ 5 జోన్ భూములు సిఆర్డీయేకు అప్పగించనుంది. ఆర్ 5 జోన్లో వైఎస్ జగన్ ప్రభుత్వం.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అయితే, అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 50 వేల మంది పేదలకు ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం చూపలేదు.టీడీపీ ఆఫీస్లకు భూముల కేటాయింపుఏపీలో టీడీపీ ఆఫీస్లకు భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒంగోలు, విజయనగరం, తూర్పుగోదావరి, కర్నూల్, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో టీడీపీ ఆఫీస్లకు భూములు ఇవ్వడానికి నిర్ణయించింది. 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన భూముల కేటాయింపులు చేసింది. ఒక్కో ఆఫీస్ కి 1.5 ఎకరాల నుండి 2 ఎకరాల వరకు కేటాయింపు జరగనుంది. -
అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు
-
‘16 ఏళ్లలో ఒక్క కాలనీ అయినా నిర్మించారా?’
తాడేపల్లి : జగనన్న కాలనీలపై ఎల్లీ మీడియా తప్పుడు ప్రచారం చేయడంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. జగన్ 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇస్తే ఎల్లో మీడియా వాటిపై విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఒక్కరికి కూడా స్థలం ఇవ్వలేదని విమర్శించారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 30వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జోగి రమేష్.. స్థలాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్పై రోత రాతలు ఎందుకని నిలదీశారు. జగన్ 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చి.. కోటి మందికి నివాసం కల్పించారన్నారు. చంద్రబాబు 16 సంవత్సరాలు సీఎంగా చేసినా ఒక్క కాలనీ కూడా కట్టించలేదు. 17,005 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసిన గొప్ప ప్రభుత్వం జగన్ది.చంద్రబాబు, లోకేష్, ఎల్లో మీడియా ఎవరొచ్చినా వాటిని చూపిస్తాం. కొత్తగా ఊర్లనే ఏర్పాటు చేశాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా నేటికీ ఒక్క సెంటు స్థలం ఇచ్చారా?, ఇళ్ల స్థలాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించని ఎల్లో మీడియాకు జగన్ విమర్శించే అర్హత ఉందా?, జగనన్న కాలనీల్లో కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. జగన్ కట్టించిన ఇళ్లను చంద్రబాబు ఓపెన్ చేసి ఫోటోలు దిగారు. జగన్ క్రెడిట్ని చంద్రబాబు చోరీ చేస్తున్నారు’ అని విమర్శించారు. -
‘కూటమి నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్బుక్ పేరుతో అణచివేతలు కొనసాగిస్తున్నారని.. పౌర హక్కులను దారుణంగా హరిస్తున్నారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని వందేళ్ల వెనక్కి నెట్టారు. వ్యవస్థలను ఇష్టానుసారం వాడుకుంటున్నారు. నియంత పాలన రాష్ట్రంలో సాగుతోంది. పోలీసులు ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు జనం బాధ పడుతున్నారు’’ అని మనోహర్రెడ్డి పేర్కొన్నారు.‘‘యూరియా, డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఇలా అన్నిటికీ కరువు ఏర్పడినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కానీ సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులే మా లక్ష్యం అన్నట్టుగా పని చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అరెస్టు కూడా ఇదే కోవలోనిదే. టెర్రరిస్టును అరెస్టు చేసినట్టుగా రోడ్డుపై అటకాయించి అరెస్టు చేశారు. శ్రీహరి మీద 111 సెక్షన్ పెట్టటంపై కోర్టు కూడా ప్రశ్నించింది. కుప్పంలో శ్రీహరికి బెయిల్ రాగానే మరొక కేసు పెట్టి వేధిస్తున్నారు. కుప్పం, కొత్తపేట పీఎస్లలో ఒకే రకమైన ఫిర్యాదులు ఇవ్వటం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉంది. ఫిర్యాదులో లేకపోయినా పోలీసులు ఓవరాక్షన్తో వైఎస్సార్ సీపీ గూండాలు అంటూ నమోదు చేశారు.ప్రభుత్వ పెద్దలు ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేలాగ టీడీపీ నేతలే పోస్టులు పెడుతున్నారు. మరి వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. ప్రతిపక్షాలకు ఒక రాజ్యాంగం, అధికార పార్టీ వారికి ఇంకొక రాజ్యాంగం ఉందా?. నిజానికి శ్రీహరికి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాకు ఎలాంటి సంబంధం లేదు. జర్నలిస్టు శ్రీహరిపై అక్రమంగా కేసులు పెట్టారు’’ అంటూ మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబుపై చింతా మోహన్ సెటైర్లు.. రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి పెడుతున్నావ్
-
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్
సాక్షి,అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం (గురువారం) కుప్పం కోర్టు వైఎస్సార్సీపీ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే కొత్తపేట పోలీసులు ఆయనను మళ్లీ అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను కుప్పం నుంచి గుంటూరు జిల్లా కొత్తపేటకు తరలిస్తున్నారు. ఉదయం కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే నోటీసులు ఇచ్చి అక్రమంగా అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పూడి శ్రీహరిని నిన్న బెంగళూరు కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కుప్పం కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కానీ, బెయిల్ వచ్చిన కొన్ని గంటలలోనే గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చి మళ్లీ అరెస్టు చేశారు. -
జనంలో జగన్ ట్రెండ్.. దారికొచ్చిన బాబు, లోకేష్
-
నేను అనుభవించినదానికి కంటే 10రేట్లు ఎక్కువ అనుభవించేలా చేయకపోతే
-
ఎరువు మొత్తం.. డీజిల్లో కాలిపోయిందిగా!
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తీవ్రస్థాయిలో తలెత్తడానికి చంద్రబాబు ప్రభుత్వమే ప్రధాన కారణమనే విషయాన్ని మేధావుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు గుర్తించారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ఈ ప్రభుత్వాన్ని రాయడానికి కూడా వీలులేని విధంగా బూతులు తిడుతున్నారు. ఎన్నికల ముందు వారు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు బాగా బుద్ధి వచ్చిందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లను పోస్టింగ్లతో ఏకిపడేస్తున్నారు. ఎన్నికల ముందు ఇంధన ధరలపై తండ్రి, కొడుకు చేసిన ప్రసంగాల వీడియోలను బయటకు తెచ్చి ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ సెటైర్లు, మీమ్స్తో ఆడుకుంటున్నారు. అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చడానికి డీజిల్ను తక్కువ ధరకు వారికి మళ్లించి ప్రజల నోట్లో మట్టికొట్టడాన్ని మేధావులు సైతం తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా మరోసారి చంద్రబాబు, లోకేశ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరువు పూర్తిగా పోయింది. దీంతో ఆ పార్టీల కేడర్లో తీవ్ర నిరుత్సాహం కనిపిస్తోంది. ప్రజల దగ్గర తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందంటూ వారు మథనపడుతున్నారు.ఇదేం రాజకీయం.. విచిత్రంగా ఉంది ప్రజలు ఇబ్బందిపడితే పడనీ.. అమరావతి కాంట్రాక్టర్లు మాత్రం ఇబ్బంది పడకూడదు.. కార్పొరేట్ల లాభాలు పోకూడదు... సామాన్యుడి ఎకానమీ నాశనం అయినా పర్లేదు.. అని కూటమి ప్రభుత్వం అనుకోవడం విచిత్రంగా ఉంది. అమరావతి కాంట్రాక్టర్లకు డీజిల్ కొరత రాకూడదని, వారికి కష్టం రాకూడదని, ప్రజలు ఇబ్బందిపడినా పర్లేదనే ధోరణి కాదా ఇది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు ఇవ్వాల్సిన డీజిల్ను వారికి ఇవ్వకుండా బల్క్లో కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ఆదేశాలివ్వడం వల్ల ఇంధన కొరత ఏర్పడింది. కొరత వచ్చిన తరువాత కూడా కాంట్రాక్టర్లకు సరఫరా ఆగకూడదని ఆదేశాలివ్వడం దారుణం. సామాన్యుడి ఎకానమీ, పేదవాడి ఎకానమీ పడిపోయినా పర్లేదుగానీ కాంట్రాక్టర్ల ఎకానమీని మాత్రం కాపాడాలి. వారి లాభాలు మాత్రం నిరాటంకంగా కొనసాగాలి.. అనుకునేది ఏం రాజకీయం ఇది. సామాన్యులకు అనుకూలం అయిన రాజకీయం అయితే కాదు. పోనీ డీజిల్ను బల్క్లో మళ్లించకపోతే అమరావతి నిర్మాణం ఆగిపోతుందా? వారం ఆలస్యమవుతుందేమో, అంతకు మించి ఏమవుతుంది. అంటే ఈ డైవర్షన్ అమరావతి కోసం కూడా కాదు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం మాత్రమే. తక్కువ ధరలకు కాంట్రాక్టర్లకు డీజిల్ ఇస్తున్నప్పుడు నిర్మాణ ఖర్చులు కూడా తగ్గాలి కదా. కానీ ఇప్పటికే అమరావతి నిర్మాణానికి అధిక ఖర్చులపై అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నాయి. చదరపు అడుగుకు రూ.14 వేలు ఖర్చు అన్నారు కదా.. డీజిల్ తక్కువకు ఇస్తున్నందున రూ.12 వేలకు చేయమని అనగలరా. ఐఏఎస్ అధికారులు కనీస అవగాహన లేకుండా ఆదేశాలిస్తారా? వాటివెనుక కచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు, కారణాలు ఉన్నాయి. ఇంధన కొరతపై ముఖ్యమంత్రి సమీక్ష తరువాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. పనికిమాలిన ఆర్డర్ ఏంటిది, కాంట్రాక్టర్లు ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని సీఎం అడగాలి కదా. – ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు -
అరాచకం, అస్తవ్యస్త పరిస్థితులే బాబు సుపరిపాలన!
ఆంద్రప్రదేశ్లో సుపరిపాలన అందిస్తున్నారట. ఎకనమిక్ టైమ్స్ అవార్డును అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారి ప్రకటన ఇది. కానీ ఈ అవార్డు వార్తలు ఎల్లోమీడియాలో ప్రముఖంగా ప్రచురితమైన రోజు మీడియా మొత్తమ్మీద వచ్చిన వార్తలను పరిశీలిస్తే వాస్తవం అది కాదన్న విషయం స్పష్టమవుతుంది. రాష్ట్రంలో నాలుగు రోజులుగా పెట్రోలు, డీజిళ్లకు విపరీతమైన కొరత ఏర్పడింది. ప్రజలు నానా కష్టాలూ పడుతున్నట్లు కథనాలు వచ్చాయి.చంద్రబాబుకు నిత్యం బాకా ఊదే పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా డీజిల్, పెట్రో కొరతతో వచ్చిన కష్టాలపై కథనాలు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆశ్చర్యకరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డీజిల్ కొరత ఎందుకుందో? ఈ నేపథ్యంలో చమురు కంపెనీలపై చంద్రబాబు సీరియస్ అయినట్టు... నో స్టాక్ బోర్డులు కనిపించరాదని హుకుం జారీ చేసినట్టు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. నిజానిజాలు దేవుడికెరుక. మరి... దీన్ని సుపరిపాలన అందామా?గతంలో ప్రతిచిన్న సమస్యకూ ముఖ్యమంత్రి జగన్ కారణమని తెగ ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం తప్పు చమురు కంపెనీలదని అంటోంది. కొంత నిజం ఉండవచ్చు కానీ.. చమురు కంపెనీలతో వైసీపీ కూడా కుమ్మక్కు అయ్యిందని చెప్పడమే విడ్డూరం. ఇలా చెప్పడం ద్వారా ప్రభుత్వం చేతకానితనాన్ని ఒప్పుకున్నట్లే అవుతుంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ కొరత సమస్యపై ముందస్తు సమాచారం ఎందుకు లేదు? వచ్చినా పట్టించుకోలేదా? ఇదేనా రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాహనదారులు ఇంధన కొరతతో తీవ్రమైన సమస్యలలో పడ్డారు. ఆటోలవారు,క్యాబ్ ల వారికి ఉపాధికి ఆటంకం ఏర్పడింది. రైతులకు, చిన్న పరిశ్రమలకు కూడా అవసరమైన డీజిల్ లభ్యం కావడం దుర్లభం అయింది. కొన్నిచోట్ల రేషన్ పెట్టినా అది ఏ మూలకు సరిపోలేదు. ఇబ్రహింపట్నం వద్ద డీజిల్ అయిపోయిందని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ ప్రయాణీకులను నడిరోడ్డు మీద వదలిపెట్టి వెళ్లిపోయాడట. ఎర్రగొండపాలెంలో ఆయిల్ కోసం బంక్కు వెళ్లిన ఒక యువకుడిని పోలీస్ ఇన్్సపెక్టర్ లాఠీతో బాదారట. దీనిని ఏ తరహా పాలన అని అనాలి? పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి భారీ క్యూలు కనిపించాయి. ఈ పాపం చంద్రబాబు సర్కారుదే అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులలో ఇంధన కొరత ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఈ ప్రోబ్లం కొంత ఉన్నప్పటికీ మరీ తీవ్రం కాదు. విశేషం ఏమిటంటే ఏపీలో కొరత రీత్యా పలువురు సరిహద్దులలోని తెలంగాణ బంకులకు వెళ్లి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఆ ఒత్తిడి ప్రభావం ఈ రాష్ట్రంపై పడుతోందట. అధికారంలోకి రాగానే చంద్రబాబు, లోకేశ్లు పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.అలా చేయకపోగా, ఇప్పుడు సరఫరా కూడా సరిగా చేయడం లేదని జనం వాపోతున్నారు.ఇక వేరే విషయాలు చూద్దాం. అనంతపురం జిల్లాలో కారు ఆపారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిర్నేని సురేంద్రబాబు అనుచరులు టోల్గేట్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. మహిళా సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేస్తే చంద్రబాబు ఎమ్మెల్యే అనుచరులపై సీరియస్ అయ్యారట. ఎమ్మెల్యేని మాత్రం ఏమీ అనలేదన్నమాట. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు ఆరేడు గంటలపాటు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. తూతూ మంత్రంగా కేసు పెట్టి సరిపెట్టారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన టీడీపీ రౌడీలకు అలాగే రక్షణ కల్పించారు.మరో వైపు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏవైనా పోస్టు పెడితే కక్ష కట్టి అరెస్టు చేస్తున్నారు. కాని టీడీపీ వారు ఎలాంటి దారుణమైన పోస్టులు పెట్టినా పట్టించుకోవడం లేదు. ఇటీవల ఆంధ్రజ్యోతి యజమాని వైఎస్సార్సీపీ నేతల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే, దానిపై అనేక మంది ఫిర్యాదు చేసినా అరణ్య రోదనగానే మిగిలింది. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామని, డ్రగ్స్ లేకుండా చేస్తామని చంద్రబాబు, లోకేశ్లు పలుమార్లు చెప్పేవారు. ఇప్పుడు అవి విచ్చలవిడిగా లభిస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి.చివరికి మంగళగిరి, దుగ్గిరాల పోలీస్ స్టేషన్ ల పరిధిలో కూడా చిన్న, చిన్న గ్రామాలలో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించి కొందరిని అరెస్టు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిమిత్తం తర్లువాడ గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. వారికి పరిహారం చెల్లించకుండానే డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవడంపై రైతులు ఆందోళనకు దిగితే ఊరంతటిని దిగ్భందనం చేశారని వార్త వచ్చింది.ఇది ఏ రకమైన ధర్మం? డేటా సెంటర్ రావడాన్ని అంతా స్వాగతిస్తారు. కాని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడమే ఆశ్చర్యం. ఇక కొన్ని కంపెనీలకు 99 పైసలకే భూములు కట్టబెట్టి విశాఖ బ్రాండ్ ను దెబ్బతీస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులలో మందులు దొరకడం లేదని వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏభై రకాల మందులకు ఆరుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదట. ఈ విషయాన్ని ఎల్లో మీడియానే తెలిపింది. ఆ మీడియా మందుల సమస్యను కప్పిపుచ్చే యత్నం చేసినా, ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బిల్లులు సకాలంలో చెల్లించరన్న భయమో,మరే కారణమో కాని, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులలో అవసరమైన మందులు దొరకడం లేదన్నది వాస్తవం. ఇది సుపరిపాలనగా భావించాలి. రైతుల విషయానికి వస్తే జొన్న, మొక్కజొన్న, శనగ, అరటి, బొప్పాయి, ఉల్లి ,టమోటా తదితర పంటలకు మద్దతు ధర రావడం లేదు. దాంతో రైతులు దయనీయ పరిస్థితిలో ఉంటున్నారు.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆ మధ్య మొక్కజొన్న కొనుగోలు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఒకవైపు మూడున్నర లక్షల కోట్ల అప్పులతో దేశంలోనే రికార్డు సృష్టించడం ఏ తరహా సుపరిపాలన అన్నది తెలియదు.ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ, అరడజను మంత్రులను శిక్షణ పేరుతో సింగపూర్ పంపించడం, ఆయా సబ్జెక్ట్ లతో సంబంధం లేని మంత్రులు వెళ్లడం, ఇందుకోసం కోట్లు వెచ్చించడంపై ఎల్లో మీడియానే టిప్ టాప్ ట్రిప్పులు అంటూ ఎద్దేవ చేయడం విశేషం. అలాగే కన్సల్టెంట్ల రాజ్యంగా మారిందని కూడా ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. తాజాగా ఏడాది కాలానికిగాను 18 మంది కన్సల్టెంట్లను నియమించి రూ.76 లక్షల వ్యయం చేస్తున్నారు. ఇక కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా కప్పిపుచ్చుతున్నారు. మహిళలను వేధించారన్న ఆరోపణలు వచ్చినా ఆ ఎమ్మెల్యేల జోలికి వెళ్లడం లేదు. ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారని, తమకు అధికారాలు లేకుండా తొక్కివేస్తున్నారని గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ బహిరంగంగానే అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఇవన్ని చంద్రబాబు తాను సుపరిపాలన అందిస్తున్నానని చెప్పిన రోజు, ఇటీవలి కాలంలో వచ్చిన కథనాలే. గత రెండేళ్లుగా సాగిన అరాచకాలన్నిటి గురించి చెప్పాలంటే చాంతాడంత జాబితా అవుతుంది.ఇన్ని జరుగుతున్నా తాను సుపరిపాలన ఇస్తున్నానని చంద్రబాబు చెప్పుకోగలుగుతున్నారు.అదే ఆయన ప్రత్యేకత.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమిని కూలుస్తాం.. జగన్ను మళ్లీ సీఎం చేస్తాం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తప్పుడు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే దాకా తగ్గేదే లేదంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై బనాయించిన అక్రమ కేసుల విచారణలో భాగంగా గురువారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పని వైస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. తొలుత గండి వీరాంజనేయ దేవస్థానానికి వెళ్లిన అంబటి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ఘాట్ను సందర్శించి మహానేత రాజశేఖర్రెడ్డికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని.. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని.. వైఎస్సార్ సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నారాయన.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై అక్రమ కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఈ వ్యవహారంలో అంబటి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుని క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా వినకుండా టీడీపీ గూండాలు ఆయన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయకపోగా.. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంతో అంబటిపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రెండువారాల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి దాడి చేసిన వాళ్లపై, కస్టడీలో తనను టార్చర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు కోరుతూ ధర్మ పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుల విచారణలో భాగంగా.. వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో ఇవాళ విచారణకు అంబటి హాజరవుతున్నారు. -
జయము జయము చంద్రన్న పేరడీ సాంగ్ పాడి బాబుని ఏకిపారేసిన సీదిరి అప్పలరాజు
-
ఫ్రీ బస్సు ఉత్తుత్తిదే..!
అనంతపురం జిల్లా: చంద్రబాబు సర్కారు మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణమంటూ పథకాన్ని ఘనంగా ప్రారంభించినా..దానిలో చాలా కోతలు, నిబంధనలు పెట్టి దగా చేశారు. ఇప్పుడు ఉన్న బస్సులు కూడా మహిళలను ఎక్కించుకోకుండానే వెళ్లిపోతున్నాయి. మహిళలు ఉన్నచోట బస్సులు సరిగా ఆపడం లేదు. ఇందుకు అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనే తార్కాణం. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడుకు చెందిన మహిళలు బుధవారం అనంతపురం వెళ్లడానికి గుత్తి ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. బస్సులు పాయింట్లో ఆపలేదు. ఎదురు చూసిన మహిళలు ఆరా తీయగా బస్టాండ్ వెనుక వైపు నుంచే వెళ్లిపోతున్నట్టు గుర్తించారు. మహిళలు ఉన్న చోట బస్సులు ఆపడం లేదని వరలక్ష్మి, లక్ష్మి తదితర ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఫ్రీ బస్సు ప్రచారానికే పరిమితం కాకుండా.. మహిళలకు ప్రయోజనకరంఉండే విధంగా నడపాలని కోరారు. లేని పక్షంలో ఫ్రీ బస్సు ఎత్తేయండి అని మహిళలు వాపోయిన విషయాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. -
‘డీఎస్సీ డీల్స్’లో ప్రలోభాల పర్వం
సాక్షి, అమరావతి: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టుల కుంభకోణంలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాలు సాక్ష్యాలతో సహా బయటపడటంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత హేయంగా అంగడి సరుకులా డీఎస్సీ పోస్టులను సీఎం బంధువుగా చెప్పుకుంటూ అమ్మేసిన ‘మాస్టర్మైండ్’ మెడకు ఉచ్చు బిగుసుకోవడంతో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.మూడు రోజులకుపైగా విచారణ పేరుతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కాలయాపన చేసి కనీసం ప్రాథమిక నివేదికను కూడా సిద్ధం చేయలేకపోయింది. బుధవారం రాష్ట్ర క్రీడా సంఘాలను శాప్ ఎంపికల్లో ఎక్కడా తప్పు జరగలేదని, క్రీడాకారులు తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందలేదని స్టేట్మెంట్లు ఇవ్వాలని ‘మాస్టర్మైండ్’ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే, అవినీతికి కొమ్ముకాసి అభాసుపాలు కాలేమని, ప్రభుత్వం చెప్పినట్టు తలాడించలేమని క్రీడా సంఘాల ప్రతినిధులు తెగేసి చెప్పినట్టు తెలిసింది. దీంతో శాప్ పరువు పోతోందని, కాపాడాలని క్రీడా సంఘాలను వేడుకోవడం గమనార్హం. విచారణ పేరుతో పిలిచిన క్రీడాకారులు ఇంకా అదే ఉద్యోగంలో కొనసాగుతుండటం కొసమెరుపు. మాస్టర్మైండ్ గేమ్లో చిక్కుకున్నశాప్ ఉన్నతాధికారులు డీఎస్సీ డీల్స్లో కీలకమైన ‘మాస్టర్ మైండ్’ గేమ్లో శాప్ ఉన్నతాధికారులు సైతం చిక్కుకుపోతున్నట్టు శాప్ వర్గాలే విమర్శిస్తున్నాయి. మరోవైపు ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ ఎలా విచారణ చేస్తుంది? అందులో శాప్ అధికారులే కమిటీ సభ్యులుగా ఎలా ఉంటారు? ఈ ఒక్క విచారణతోనే నిజనిర్ధారణ చేసేస్తుందా? వాస్తవాలు బయటకు రావాలంటే కచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, రిటైర్డ్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తేనే ఇంటి దొంగలు బయటపడతారు’ అని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, డీఎస్సీలో స్పార్ట్స్ కోటా ఉపాధ్యాయ పోస్టుల అమ్మకం ద్వారా మాస్టర్మైండ్ ఏకంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లను దండుకున్నట్టు ఆరోపణలు రావడంతో శాప్లో జరుగుతున్న మరిన్ని అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయి. ఉన్న పోస్టులు రద్దు.. ఉద్యోగాలు అడగొద్దుచంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఖాళీగా ఉన్న సర్కారు పోస్టులను భర్తీ చేయకపోగా.. మంజూరైన పోస్టులను రద్దు చేయడమే లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు సర్కారు అదే బాటలో పయనిస్తోంది. సమాచార శాఖలో రెండు అటెండర్ పోస్టులను రద్దుచేసి.. వాటి స్థానే ఒక చీఫ్ ఫొటోగ్రాఫర్ పోస్టు భర్తీ చేసేందుకు అనుమతించింది. అంటే మంజూరైన నాలుగో తరగతి పోస్టుల్ని రద్దు చేసి నిరుద్యోగుల ఆశలకు గండికొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉండగా ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులన్నింటినీ రద్దు చేశారు. అవసరమైన చోట ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా 2014–19 మధ్య చంద్రబాబు సాధారణ పరిపాలన, పోలీసు శాఖలతోపాటు అనేక విభాగాల్లో మంజూరైన పోస్టులను రద్దు చేసి వాటి స్థానే ఔట్ సోర్సింగ్ విధానంలో కొన్ని మాత్రమే భర్తీ చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా పాలనను కొనసాగిస్తున్నారు. సమాచార శాఖలో ఖాళీగా ఉన్న రెండు డార్క్ రూమ్ అటెండర్ల పోస్టులను రద్దు చేస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వాటిస్థానే రూ.44,570–1,27,480 వేతన స్కేలుతో ఒక చీఫ్ ఫొటోగ్రాఫర్ పోస్టును మంజూరు చేశారు. ఇందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులనే రద్దు చేయడం అంటే శాశ్వతంగా ప్రభుత్వంలో నాలుగో తరగతి ఉద్యోగాలనేవి ఇక నిరుద్యోగులకు అందని ద్రాక్షగా మిగిలిపోనున్నాయి. -
పిఠాపురం వర్మపై దాడి.. సీఎం చంద్రబాబు రియాక్షన్
-
మాకు OCD, CCD వ్యాధుల.. మీకున్న వ్యాధి గురించి చెప్పమంటారా
-
‘బాబు రాజకీయ జీవితామంతా కుట్ర, వెన్నుపోటు’
సాక్షి, తిరుపతి: టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి ఖండించారు. వైఎస్సార్సీపీపై “హత్య రాజకీయాలు” ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుకు “మెగలోమానియా” అనే వ్యాధి ఉందని.. తనను తాను అతిశయోక్తిగా చూపించుకుంటారంటూ భూమన విమర్శించారు. మీడియా సంస్థలు చంద్రబాబును అతిగా పొగడ్తలతో ప్రోత్సహిస్తున్నాయంటూ భూమన మండిపడ్డారు.హింసా, కుల రాజకీయాలకు చంద్రబాబే తెర తీశారని.. పలు పాత హత్య ఘటనలపై చంద్రబాబు పాత్ర ఉందని భూమన ఆరోపించారు. వైఎస్ జగన్పై తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైలులో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, కేసులు పెరిగాయి. “సూపర్ సిక్స్” హామీలు అమలు చేయలేక ప్రభుత్వం విఫలమైంది, దేవుడిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ ప్రజల కోసం పనిచేసే నాయకుడని, చంద్రబాబు మేనేజ్మెంట్ రాజకీయాలపై ఆధారపడుతున్నారన్న భూమన.. 2029లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల నాయకుడిగా అభివర్ణించిన భూమన.. టీటీడీ భూములను కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.టీటీడీలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు పెరిగాయన్న భూమన.. ఇసుక, గ్రావెల్ దోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని భూమన కరుణాకర్రెడ్డి హెచ్చరించారు. -
అమరావతికి డీజిల్ తరలింపు.. ఏపీలో మాత్రమే ఇంధన కొరత
-
అధికారం ఉందని అహం చూపిస్తే.. పిఠాపురం వర్మకు చంద్రబాబు వార్నింగ్
-
పిఠాపురం వర్మపై దాడి సీఎం చంద్రబాబు రియాక్షన్
-
24 గంటల డెడ్ లైన్.. పెట్రోల్ బంకుల వద్ద YSRCP ధర్నా..
-
కూటమి సర్కార్కు వైఎస్సార్సీపీ అల్టిమేటం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నేత, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు, చులకనభావం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమా? రైతులకు అవసరం లేదా? అని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.డీజిల్ కొరత కారణంగా మంత్రి నాదేళ్ల మనోహర్ ప్రకటించిన కేటాయింపుల పట్టిలో రైతులకు, వ్యవసాయ రంగానికి స్థానం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటల్లో డీజిల్ సమస్యకు పరిష్కారం చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంకులను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రెస్మీట్లో వడ్డీ రఘురాం ఏమన్నారంటే..వ్యవసాయ రంగం అంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపురాష్ట్రంలో ఆక్వా రంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అంటే చిన్నచూపు, చులకన భావం మాత్రమే ఉంది. ఇవాళ డీజిల్ కొరత విపరీతంగా ఉంది. రాష్ట్రంలో 4510 బంకులు ఉంటే అందులో 70 శాతం బంకుల్లో డీజిల్ లేదు. డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులకు డీజిల్ అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమని కేంద్రానికి లేఖలు రాస్తున్నారు… రైతులకు అవసరం లేదా?. మన ఎంపీ కేంద్ర మంత్రిని కలిసి డీజిల్ కొరత ఉందని చెబితే, వాళ్లు అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు. ఇప్పుడు పంట కోత దశలో కూడా డీజిల్ కోసం బంకుల వద్ద క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నాదేళ్ల మనోహర్కు రైతులకు కనిపించలేదా?గతంలో కూలీలతో కోతలు కోసేవారు. ఇప్పుడు యంత్రాలతో కోతలు చేస్తున్నారు. కానీ ఆ యంత్రాలకు డీజిల్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మంత్రి నాదేళ్ల మనోహర్ మాత్రం బైక్కు 2 లీటర్లు, కారుకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, బస్సులకు 100 లీటర్లు మాత్రమే డీజిల్ ఇవ్వాలని ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో రైతుకు ఎంత డీజిల్ అవసరమో ఈ ప్రభుత్వం ప్రకటించలేదు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో దీన్నిబట్టి అర్థమవుతోంది. రాష్ట్రంలో రైతు లేడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే మంత్రి మాత్రం సింగపూర్లో షికార్లు కొడుతున్నారు. అక్కడి నుంచే ఏపీలో డీజిల్ కొరత లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారు.ఆక్వా రంగం ఎలా బాగుపడుంది?ఆక్వా రంగంలో ట్రంప్ ట్యాక్స్ పేరుతో టన్నుకు రూ.60–70 వేల వరకు తగ్గించారు. ఇరాన్–అమెరికా యుద్ధం సాకుగా మరోసారి రూ.30–40 వేల వరకు తగ్గించారు. ఇప్పుడు డీజిల్ కొరత పేరుతో టన్నుకు రూ.10 వేలు తగ్గించారు. ఇలాంటి పరిస్థితిలో ఆక్వా రంగం బాగుందా? సంక్షోభంలో ఉందా? మంత్రే చెప్పాలి. డాలర్ విలువ రూ.53 నుంచి రూ.96కి పెరిగినా, రొయ్య ధర మాత్రం కేజీకి రూ.10 తగ్గింది. వైయస్ జగన్ ఫీడ్ రేటు రూ.25 తగ్గించాలని డిమాండ్ చేస్తే, అప్పట్లో కేవలం రూ.4 మాత్రమే తగ్గించారు. ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలో ప్రభుత్వం కుమ్మక్కై రైతులను నష్టపరుస్తోంది. ప్రతిరోజూ 4 వేల టన్నుల చేపలు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తాయి. సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఈ 50 లీటర్లతో బెజవాడ దాకా వెళ్తుంది.. ఆ తర్వాత ఎలా?చేపలను కార్గో విమానాల్లో పంపాలా?గతంలో పాలీ కెమికల్ ప్రచారం వల్ల చేపల లోడ్లు ఆగిపోయినప్పుడు, వైయస్ జగన్ 24 గంటల్లో సమస్య పరిష్కరించి ఎగుమతులు పునరుద్ధరించారు. ఇప్పుడు డీజిల్ కొరత వల్ల ఎగుమతులు కష్టమయ్యాయి. ఇక చేపలను కార్గో విమానాల్లో పంపాలా?. ఆక్వా రైతులకు ప్రొక్యూర్మెంట్ జరుగుతోంది కానీ ప్రాసెసింగ్ పాయింట్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తే, ఆ రోయ్యలు ఆ పాయింట్లకు ఎప్పుడు చేరుతాయి?ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా?ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి సుమారు 64 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వైయస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు 4.64 లక్షల ఎకరాలు కల్చర్ చేసి, 3.57 లక్షల ఎకరాలను ఆక్వా జోన్లోకి తీసుకువచ్చి రూ.3600 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. కానీ ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి ఎంత సహాయం చేసింది?. అసెంబ్లీలో మాత్రం ‘సూపర్ సిక్స్… సూపర్ హిట్’ అంటున్నారు. కానీ అన్నింటిలో కమీషన్లు తీసుకోవడంలోనే ఈ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ రెండేళ్లలో ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా? చూపించండి.గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ రూ.2కే ఇస్తామని చెప్పి మోసం చేసింది. బకాయిలు పెట్టిపోతే, వైయస్ జగన్ వచ్చాక వాటన్నింటిని తీర్చి యూనిట్ రూ.1.50కే ఇచ్చారు. మొక్కజొన్న పంట విస్తారంగా వచ్చింది. తెలంగాణలో క్వింటాల్కు రూ.2400 ఇస్తుంటే, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు చెప్పాలి. డీజిల్ కొరత ఉందని ఈ ప్రభుత్వానికి తెలియదా? గతంలో ఆర్బీకేల ద్వారా పంట కోతల సమయంలో అవసరాలు, నష్టాలు, మద్దతు ధరలపై ముందుగానే సమాచారం ఇచ్చేవారు.కూటమి ప్రభుత్వానికి 24 గంటలే డేట్లైన్రాష్ట్రంలో 24 గంటల్లో డీజిల్ సమస్య పరిష్కరించకపోతే, వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంకులను ముట్టడిస్తాం. డీజిల్పై రూ.20 పెరుగుతుందని మీరే లీకులు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కొరత లేకపోతే ఇక్కడే ఎందుకు ఉంది? ఐవోసీ డీలర్లకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తోందా? మంత్రి నాదేళ్ల మనోహర్ స్పష్టం చేయాలి… డీజిల్, పెట్రోల్ ధరలు పెరగవని చెప్పగలరా? రేపు ధరలు పెరిగితే, ఈ సంక్షోభాన్ని కావాలనే సృష్టించారని ప్రజలు అర్థం చేసుకుంటారు.గతంలో పొగాకు, మామిడి, మిరప రైతుల సమస్యల్లో ఉంటే వైయస్ జగన్ పోరాటం చేస్తే తప్ప మీ ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇప్పుడు కోకో రైతులు తీవ్ర నష్టపోతున్నా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆక్వా రంగానికి తక్షణమే యూనిట్ ధరను రూ.1.50కు సబ్సిడీగా ఇవ్వాలి. సబ్సిడీ ఇవ్వకపోతే ఆక్వా రైతుల తరఫున ఉద్యమం తప్పదు. వైయస్ జగన్, వైయస్సార్సీపీ ఎప్పుడూ రైతులు, ఆక్వా రైతులకు అండగా ఉంటాయని వడ్డీ రఘురాం స్పష్టం చేశారు. -
‘కూటమి అసమర్థత వల్లే ఏపీలో ఇంధన కొరత’
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. త్రోవగుంట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద జీపీఎస్ ఫౌండేషన్ పేరుతో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు పక్క రాష్ట్రం తెలంగాణాకు పోయి అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ రాష్టంలో ఏర్పడిందని మండిపడ్డారు. అమరావతిలో వేల కోట్లు దోచుకోవటానికి తప్ప అమరావతిపై ప్రేమ లేదన్న వైవీ సుబ్బారెడ్డి.. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన వలన రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందని.. ఆంధ్రప్రదేశ్లో తప్ప ఏ రాష్ట్రంలో ఇంధన సమస్య లేదన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత వల్ల ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
బాబుకు బెస్ట్ రిఫార్మర్ అవార్డు ఎలా..? చేసింది గోరంత..చెప్పుకునేది కొండంత
-
అన్ని నేనే చేశా.. సొమ్మొకడిది.. సోకొకడిది..!
-
‘కు’ సంస్కరణలే బాబు మార్కు!
ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందజేసింది. అభినందించాల్సిందే కానీ.... అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలను చూస్తే మాత్రం ఆయన ఏ రకమైన రిఫార్మరో అర్థం కాదు. సంస్కరణలకు తానే ఆద్యుడని ఎంత ప్రచారం చేసుకున్నా.. అందులో నిజానిజాలేమిటో కూడా చూసుకోవాలి కదా? రెండేళ్లుగా ఆయన చేపట్టిన మహత్తర సంస్కరణలు ఏమిటన్నది ఎల్లోమీడియానైనా ఇస్తుందేమో అని చూశాను కానీ.. ఎక్కడా కనిపించలేదు. ‘‘రాజకీయ పాలన చేస్తామని, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేవారికి ఏ పని చేయవద్దు’’ అని రెడ్ బుక్ అరాచకాలతో టెర్రర్ సృష్టిస్తున్న చంద్రబాబు పాలన ఏపాటి సంస్కరణో, అవార్డు ఇచ్చిన వారికే తెలియాలి. వాస్తవానికి చంద్రబాబు తన వయసుకు తగ్గట్టు హుందాగా, అబద్దాలు చెప్పకుండా... నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్పై అసత్య ఆరోపణలు చేయడం కాకుండా... ఆయన సంస్కరణలు చేసినా, చేయకపోయినా అవార్డు ఇవ్వడం తప్పు కాదు. ఒక వైపు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్యం, పాలన రంగాలలో తీసుకు వచ్చిన అనేక సంస్కరణలను నీరుకార్చుతూ, ప్రజల కోసం సృష్టించిన సంపదను ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్న చంద్రబాబు రిఫార్మర్ అవుతారని ఆ మీడియా ఎలా ప్రకటించిందో, దానికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. కేంద్రం తీసుకువచ్చిన డ్వాక్రా మహిళల స్కీమ్, విద్యుత్ సంస్కరణలు తనవే అని ఆయన చెప్పుకుంటుంటారు. ఫర్వాలేదు..వాటికి కట్టుబడి ఉంటే ఒప్పుకోవచ్చు.2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నిటిని మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.అది ఏ రకమైన సంస్కరణ అవుతుంది?. అలాగే రైతుల రుణాలన్నిటిని రద్దు చేస్తామని, బ్యాంకులలో తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని విడిపించే బాధ్యత తనదే అన్నారు.అసలు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని కూడా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇలా చేసిన నేతను సంస్కరణల సారథి అని చెబితే ఎలా ఒప్పుకోవాలి? పోనీ వీటిని అమలు చేశారా అంటే అదేమీ లేదు. డ్వాక్రా రుణాలను అసలు రద్దు చేయలేదు. రైతు రుణాలను అరకొరగా మాఫీ చేసి, ‘‘అన్నీ చేసేశాంగా, రైతుల ఆశకు హద్దు ఉండాలి’’ అని విసుక్కోవడం కూడా మనం చూశాం. 1999లో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న విపక్ష కాంగ్రెస్ డిమాండ్పై ‘‘అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’’ అని వ్యాఖ్యానించింది కూడా ఈ చంద్రబాబే. అంతేకాక విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పెద్ద ఆందోళన వచ్చింది. బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిగాయి. నలుగురు యువకులు మరణించారు. ఆ తర్వాత 2004లో టీడీపీ ఓటమిపాలైంది. తదుపరి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ను అమలు చేసి చూపించారు. తద్వారా రైతులకు ఎంతో మేలు చేశారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు కూడా సంస్కరణ మాట వదలి, ఉచిత కరెంట్ ఘనత తనదేనని పాట ఆరంభించుకున్నారు.2014 టర్మ్లో, ప్రస్తుతం ఆయన కూడా ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే, 2019-2024 మధ్య కేంద్రం సూచించిన మేరకు రైతులు వాడే విద్యుత్ లెక్కల నిమిత్తం మోటర్లకు మీటర్లు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. మీటర్లు ఉన్నా, మొత్తం వ్యయం అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టంగా చెప్పినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లు కర్షకుల మోటార్లకు మీటర్లు పెడతారా అని గొడవ చేశారు. ఇది సంస్కరణ వాది చేసే పనే అవుతుందా? లోకేశ్ మరో అడుగు ముందుకువేసి మీటర్లను పగలగొట్టాలని పిలుపు ఇచ్చారు. 2024లో పవర్ సాధించిన తర్వాత దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అదేం లేదు. మోటర్లకు మీటర్లు పెట్టడానికి ఆదేశాలు ఇచ్చారు. పైగా గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతుంటే విజయనగరంలో ఒక ఇంటి యజమాని వాటిని పగలకొట్టి నిరసన తెలిపారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా భూముల రీసర్వే స్కీమ్ ను జగన్ చేపడితే, భూములు కాజేయడానికే అని అబద్దాలు నిత్యం ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అదే రీసర్వేని కొనసాగిస్తున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం పరస్పర విరుద్దంగా వ్యవహరించడం సరైనదేనా? విజన్ 2020 ఉమ్మడి ఏపీలో అమలు చేశామని ఆయన చెప్పుకున్నారు. అసలు విజన్ పేరుతో కథ నడిపిందే 2001-2002 ప్రాంతంలో అందులో ఉన్న విషయాలు చూసి ఐఎఎస్ లు, మేధావులు నవ్వుకునేవారు. ప్రచారం కోసం తప్ప ఆచరణ కానివని ఆ రోజుల్లో వారు వ్యాఖ్యానించేవారు. 2004లో చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది.ఆ తర్వాత విజన్ 2020 ఊసే లేదు. మరి ఉమ్మడి ఏపీలో ఆ విజన్ ఎప్పుడు అమలయ్యింది.దానివల్ల సాధించింది ఏమిటో తెలియదు. హైదరాబాద్ దాని ఫలితాలు చూస్తోందట. రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ తో కూడిన ఉమ్మడి ఏపీకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మాట నిజమే.కాని హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశానని, నగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటే అదెలా సాధ్యమో ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ఎందుకు అడగలేదో అర్థం కాదు. ఒక భవనం నిర్మించి దానికి హైటెక్ సిటీ అని, సైబరాబాద్ అని పేర్లు పెడితే నగర నిర్మాణం చేసినట్లా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లను ఆయన ప్రస్తావించారు. జగన్ టైమ్ లో ఈజ్ఆఫ్ డూయింగ్లో దేశంలో కొన్నిసార్లు నెంబర్ ఒన్ స్థానంలో ఉండేది. చంద్రబాబు పాలనలో ఎన్నిసార్లు నెంబర్ ఒన్ అయింది?అమరావతి ద్వారా మరో నగర నిర్మాణం చేసే అవకాశం వచ్చిందట. అంటే హైదరాబాద్ తానే నిర్మించానని చెప్పుకుంటున్నారా?దీనిపైనే తెలంగాణ నేతలు తీవ్ర ఆక్షేపణ చెబుతుంటారు.కులి కుతుబ్ షా 400 ఏళ్ల క్రితం నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అంతే తప్ప మొత్తం నగరాన్ని అంతటిని ఆయన నిర్మించలేదు. అలా చేస్తానని చెప్పుకోలేదు. మరి చంద్రబాబు మాత్రం పదే,పదే నగర నిర్మాణం తనదే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అమరావతి పేరుతో నగర నిర్మాణం చేపడుతున్నానని చెబుతున్నారు.దీనికోసం లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించడానికి వెనుకాడడం లేదు. ఏభైవేల కోట్ల అప్పు ఇప్పటికే చేశారు.ఇది ఏ రకమై సంస్కరణ అవుతుంది? ఏ రకమైన ప్రగతి అవుతుంది? అప్పు చేసి పప్పు కూడా తినడం సంస్కరణ అని అంటారా? హైదరాబాద్ లో అసెంబ్లీ, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, క్వార్టర్లు, బంగ్లాలు అన్ని కలిపి కేవలం 2250 ఎకరాలలో ఉన్నాయని మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ చెప్పారు.అది నిజమే.కేవలం ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కలిపి హైదరాబాద్ లో ఉన్నది 300 ఎకరాల లోపే. కాని అమరావతిలో 54 వేల ఎకరాలు సేకరించడమ కాక, మరో లక్షన్నర ఎకరాలు తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. ఎకరాకు రెండు కోట్ల చొప్పున ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా తయారు చేయడం ప్రజలకు ఎలా ప్రయోజనం అవుతుంది? ప్రభుత్వ ధనం ఈ రకంగా విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఏమిటని ఎకనమిక్ టైమ్స్ ఎందుకు ప్రశ్నించదు? వరదలను అరికట్టడానికి వేల కోట్ల వ్యయంతో పలు రిజర్వాయిర్లు, లిఫ్ట్ లు నిర్మించడం ఏ నగరంలో అయినా ఉందా?ఇవన్ని ఒక ఎత్తు అయితే ,ఇంత పెద్ద సంస్కరణవాది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ఏ రకమైన హామీలు ఇచ్చారు? ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తానని ప్రకటించడం రిఫార్మ్ అవుతుందా? పోనీ దానిని అమలు చేశారా? నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్న రూ.మూడు వేలు ఇవ్వకపోవడం సంస్కరణ అని చెప్పుకోవాలా? ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎగవేశారు. ఇలా అనేక హామీలు ఎండమావిగా మిగిలాయే! రూ.3.55 లక్షల కోట్ల అప్పు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించడం ఏ విధమైన సంస్కరణ? సంపద సృష్టికి సంస్కరణలే కీలకం అని చెబుతున్న చంద్రబాబు వాటిపై ఒక నిర్దిష్ట విధానం కలిగి ఉన్నారా? కేవలం అవకాశవాద రాజకీయాలతో ఎప్పటికప్పుడు తను చెప్పినవాటికి తానే విరుద్దంగా వ్యవహరిస్తూ సంస్కరణల గురించి మాట్లాడితే రిఫార్మిస్ట్ అయిపోతారా? ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేది రిఫార్మ్ అయితే చంద్రబాబుకు అవార్డు ఇవ్వడం తప్పుకాదు. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నీరజ్ మిట్టల్ ని కలిసినప్పుడు చెప్పిన మాటలు.. సంచలన నిజాలు బయటపెట్టిన అవినాష్ రెడ్డి
-
మళ్లీ ఫస్ట్ వస్తోంది.. ముందు నెల జీతాలే ఇవ్వలేదు...
సాక్షి, అమరావతి: రెండు రోజుల్లో మళ్లీ ఒకటో తేదీ వస్తోంది. కానీ రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ముందు నెల జీతాలే ఇంకా ఇవ్వలేదు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలకు సంబంధించిన పొదుపు సంఘాల కార్యక్రమాల్లో పనిచేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) విభాగంలోని సుమారు 4,500 మంది ఉద్యోగులెవరికీ ఏప్రిల్ ఒకటో తేదీన అందాల్సిన జీతం నెల పూర్తవుతున్నా అందనే లేదు.వీరికితోడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా శాఖ పరిధిలో జూనియర్ కాలేజీల్లో పని చేసే 3,600 మంది.. డిగ్రీ కాలేజీల్లో పని చేసే 900 మంది.. పాలిటెక్నికల్ కాలేజీల్లో పనిచేసే 500 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు సైతం ఏప్రిల్ ఒకటిన అందాల్సిన వేతనాలు ఇంకా రానే రాలేదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. వీరికితోడు పాఠశాల విద్య పరిధిలో పనిచేసే 4,500 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసే 1,600 మంది టీచింగ్ ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు కలిపి 2,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఏప్రిల్ ఒకటిన జీతాలు అందలేదని ఆయా ఉద్యోగ సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు.50 వేల మందిపై తీవ్ర ప్రభావంమొత్తం వందకు పైగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సుమారు 50 వేల మందికి పైగా ఉద్యోగులు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సెర్ప్ పరిధిలో గౌరవ వేతనంతో పనిచేసే 27 వేల మందికి పైగా గ్రామ సమాఖ్య సహాయకులకు (వీవోఏ – యానిమేటర్లు) సుమారు 4 నెలలుగా గౌరవ వేతనం విడుదల చేయలేదని ఆయా ఉద్యోగ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలో కూడా కాంట్రాక్టు లెక్చరర్లు, సెర్ప్ ఉద్యోగులతోపాటు చాలా విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు చాలా ఆలస్యంగానే జీతాలు ఇచ్చి నట్టు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ మాదిరిగా నెల ముగిసేంత వరకు జీతాలు అందని పరిస్థితి ఉండేది కాదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. -
చంద్రబాబు రాక... అప్పన్న భక్తులకు అవస్థలు
సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దర్శనానికి మంగళవారం సీఎం చంద్రబాబు రావడంతో పోలీసులు అడ్డగోలు ఆంక్షలు విధించారు. దాదాపు మూడు గంటలు మండుటెండలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి సింహగిరికి వచ్చారు. ఆయన రావడానికి గంటన్నర ముందు నుంచే కొండపైకి వెళ్లే రెండు టోల్గేట్ల వద్ద భక్తులు, విధులకు హాజరుకావాల్సిన దేవస్థానం ఉద్యోగులను పోలీసులు నిలిపివేశారు.ఘాట్రోడ్డులో బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించకపోవడంతో దర్శనం చేసుకున్న భక్తులు సింహగిరిపై బస్టాండ్ ప్రాంగణంలోనే గంటల తరబడి వేచి ఉన్నారు. చంద్రబాబు తిరిగి వెళ్లే వరకు క్యూలైన్లలో ఉన్నవారితోపాటు ఎక్కడ వారిని అక్కడే నిలిపివేశారు. అయితే, చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత కూడా గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగలేదు. మధ్యాహ్నం పవళింపు సేవ కావడంతో దేవస్థానం అధికారులు దర్శనాన్ని నిలిపివేశారు. చివరికి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. -
డేటా సెంటర్ సరే.. ఉద్యోగాల మాటేమిటి?
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో అదానీ – గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును వైఎస్సార్సీపీ స్వాగతిస్తోందని, కానీ ఆ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఎన్ని ఉద్యోగాలొస్తాయో చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ఆ పార్టీ పశ్చి మ గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అదానీ – గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్ సహా కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగాల కల్పన అంశాన్ని ప్రస్తావించకుండా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు.ఈ సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాల భూమితోపాటు రూ.22 వేల కోట్లు రాయితీలు ఇస్తోందని, ఇవేకాకుండా భారీ ఎత్తున నీరు, విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇంత భారీ స్థాయిలో రాయితీలు ప్రకటిస్తున్నా, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారనే దానిపై మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అక్టోబర్ నెలలో ఢిల్లీలో ఒప్పందం జరిగిన సందర్భంలో డేటా సెంటర్ ద్వారా 1.80 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు సహా మంత్రులు, కూటమి నాయకులు ప్రచారం చేశారని... అయితే ఒప్పందంలో మాత్రం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయనే అంశాన్ని గుర్తించి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలదీసినా.. కనీసం ఈ రోజు శంకుస్థాపన సందర్భంగానైనా సరే ఉద్యోగాల కల్పనపై ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. 25 వేల ఉద్యోగాలు వచ్చేలా నాడు ప్రణాళిక ‘‘గత వైఎస్సార్సీపీ హయాంలోనే విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 130 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు ఉద్యోగాల కల్పనకు వారి నుంచి ప్రభుత్వం హామీ తీసుకుంది. డేటా సెంటర్కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాలని నాడే(2021 మార్చి 9న) సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాశాం.డేటా సెంటర్తోపాటు ఐటీ పార్కు, రీక్రియేషన్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా అదానీతో ఒప్పందం చేసుకున్నాం. ఆ మేరకు 25 వేల మందికి ఉద్యోగాల కల్పనకు ఆ సంస్థను ఒప్పించాం. ఈ నేపథ్యంలోనే విశాఖలో 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న శంకుస్థాపన చేశాం’ అని చెప్పారు. ‘‘డేటా సెంటర్ శంకుస్థాపన వేదిక మీద కూడా మంత్రి నారా లోకేశ్ రాజకీయాలు మాట్లాడటం ఆయన అల్పబుద్ధిని సూచిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై గొడ్డలి, లడ్డూ అంటూ లోకేశ్ చేసిన ప్రసంగం ఆయన అవివేకానికి నిదర్శనం’ అన్నారు. -
భూములిచ్చిన ఊరినే బంధించి!
సాక్షి, విశాఖపట్నం: ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాగేసుకుని.. పైసా పరిహారం కూడా చెల్లించకుండానే భూములిచ్చిన ఊరిని పూర్తిగా బంధించి అదానీ గూగుల్ డేటా సెంటర్కు చంద్రబాబు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. తర్లువాడలో నిరసన జ్వాలలు రగలకుండా నలువైపులా పోలీసుల్ని కాపలా పెట్టి.. అట్టహాసంగా చేపట్టాల్సిన కార్యక్రమాన్ని ఆంక్షల నడుమ నిర్వహించింది. తొలుత 30 వేల మంది స్థానిక ప్రజలతో భారీ బహిరంగ సభ నడుమ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించింది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామానికి నలువైపులా పోలీసులను మోహరించి.. ఆ ప్రాంతాన్ని యుద్ధ ప్రాతిపదికన దిగ్బంధించారు. గెడ్డలు, వాగులు, వంకలు, చివరకు పొలాల్లోని మామిడి తోటలను కూడా వదలకుండా పోలీసులు పహారా కాశారు. తమ భూముల్ని బలవంతంగా లాక్కున్నారనే పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను కనీసం ఊరి పొలిమేరలు కూడా దాటకుండా నిర్బంధించడం చంద్రబాబు నిరంకుశ పాలనకు పరాకాష్టగా మారింది. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ కార్యక్రమం వద్ద రైతులు నిలదీయాలని భావించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో రెండు రోజుల నుంచి తర్లువాడ గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భూములిచ్చిన వందలాది మంది రైతులను దరిచేరనివ్వలేదు.శంకుస్థాపన కార్యక్రమం ముగిసే వరకు గ్రామం నుంచి ఎవరూ బయటకు రాకుండా.. బయటి వ్యక్తులు ఊరిలోకి వెళ్లకుండా అప్రకటిత నిర్బంధాన్ని విధించారు. పొలం పనులకు, తోటపనులకు వెళ్తామని వచ్చిన రైతుల్ని కూడా వెనక్కి పంపించేశారు. తర్లువాడ నుంచి కేవలం ఇద్దరు టీడీపీ నేతలకు మాత్రమే సభకు హాజరయ్యేందుకు పాస్లు ఇచ్చారు. ఏయూ విద్యార్థులు, ఐటీ సెజ్లోని కంపెనీల ఉద్యోగుల్ని సభకు తరలించారు. ప్రభుత్వ దమనకాండతో భీతిల్లిన రైతులు, గ్రామస్తులు నష్టపరిహారం చెల్లించే వరకూ గూగుల్ డేటా సెంటర్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
పక్క రాష్ట్రాల్లో లేని సమస్య మనకే ఎందుకుంది? ప్రభుత్వం నిద్రపోతుందా?
-
‘ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం’
తాడేపల్లి: పక్క రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ ఎక్కడ లేని పెట్రోల్, డీజిల్ కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని నిలదీశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కావాలనే ఏపీలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించిందని, అందుకు కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఏపీలోని పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ‘పెట్రోల్,డీజిల్ కొరతలో ఏపీలో ప్రజా జీవనం స్తంభించింది. ఏపీలో పెట్రోల్ కొరత తీవ్రంగా ఉంది. నాలుగైదు రోజులుగా పెట్రోల్ కొరత ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా అక్కడ కొరత లేదు.ఏపీలో పెట్రోల్,డీజిల్ కొరతకు కూటమి ప్రభుత్వమే కారణం. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం. ఇక్కడ పానిక్ భయంతో.. 0 సంక్షోభం అంతా మీరు క్రియేట్ చేసిందే. కావాలనే ఏపీలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారు. సమస్య పరిష్కరించకుండా ఏదో మాట్లాడుతున్నారు. 24న సివిల్ సప్లై కమిషనర్ ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారు. అమరావతి పనులకు పెట్రోల్, డీజిల్ కేటాయించాలని కోరారు. ఇది చట్టానికి విరుద్ధమని ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని కేంద్రం సూచించింది. మరో 20 ఏళ్ల రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లడంలో బాబు సిద్ధహస్తుడు. డీజిల్ తీసుకురాని వాళ్లు.. పరిశ్రమలు ఏం తీసుకొస్తారు?’ అని ప్రశ్నించారు. -
తుఫాన్ ను అరచేత్తో ఆపే సత్తా ఉన్న నువ్వు... డీజిల్ కొరతను నివారించలేవా?
-
చంద్రబాబు కాదు.. చేతకాని బాబు బాబుపై మహిళల ఉగ్రరూపం
-
ఆటోను ఎడ్లబండిపై ఎక్కించి వైఎస్సార్సీపీ వినూత్న నిరసన
-
ABN రాధాకృష్ణను ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్ చెయ్యాలి
-
బాబుకి బుద్ధి రావాలి... రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్ వద్ద YSRCP భారీ నిరసన
-
చేతకాని దద్దమ్మలు, నారా లోకేష్ ఎక్కడికో పారిపోయాడు
-
బాబు చేతకాని పాలన.. ఇంధన కొరతపై జగన్ ఆగ్రహం
-
నకిలీ విజనరీ నిర్లక్ష్యం.. ఏపీలో ఇంధన కష్టాలు
-
కృత్రిమ ఇంధన కొరత సృష్టిస్తున్న.. బాబు పాలనపై జగన్ ఫైర్


