Chandrababu Naidu
-
రైతులను రౌడీలుగా చూపిస్తూ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, గుంటూరు: ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరిట ఉద్రిక్తతలకు కారణమైనవాళ్లను వదిలేసి.. అమాయక ప్రజలపై, రైతులపైనా కేసులు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేయిస్తున్న మరో దుర్మార్గమని ఎక్స్లో మండిపడ్డారాయన. చంద్రబాబు గారూ.. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా?. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు. కాని ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన.. అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది?. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా?.. .. పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా?. ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారూ?. రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా…, రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’’ అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు..@ncbn గారూ పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2025 -
‘తల్లికి వందనం’లో ట్విస్ట్.. సర్పంచ్ల పిల్లలకు కట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సర్పంచ్ల పిల్లలకు తల్లికి వందనం(Talliki vandanam) పథకానికి అర్హత లేదని కూటమి ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. వారు ప్రతి నెలా రూ.3 వేలు గౌరవ వేతనం తీసుకుంటున్నందున, వారిని ఉద్యోగుల కేటగిరీ కింద లెక్కేసి.. వారి పిల్లలను అనర్హుల జాబితాలో చేర్చింది. దీంతో, వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నేలగొండ గ్రామ సర్పంచి పాటిల్ భాగ్యమ్మ భర్త చిన్న రైతు. వీరికి ఇద్దరు పిల్లలు. మొత్తంగా నలుగురు సభ్యుల కుటుంబం. వీరికి తల్లికి వందనం పథకం పొందే అర్హత ఉంది. అయితే, సర్పంచ్గా ఆమె ప్రతి నెలా రూ.3 వేలు గౌరవ వేతనం పొందుతున్నారనే కారణంతో ప్రభుత్వం అనర్హుల జాబితాలో పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,325 మంది గ్రామ సర్పంచ్లతో పాటు 9 వేల మందికి పైగా ఎంపీటీసీ, 660 మంది జెడ్పీటీసీ సభ్యులు, 660 దాకా మండల పరిషత్ అధ్యక్షులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి నెలా రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు గౌరవ వేతనం చెల్లిస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం మేరకు వీరి పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించదు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇతరత్రా నిబంధనల ప్రకారం అర్హులుగా ఉంటే చాలు.. అన్ని పథకాలకు వీరిని అర్హులుగా పేర్కొంటూ లబ్ధి కలిగించింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సంఘం నేతలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించడంతో పాటు అందులో అంతర్గతంగా ఆయా సామాజిక వర్గాల వారీగా 50 శాతం సీట్లను మహిళలకు ఇచ్చారు. వీరంతా మామూలు కుటుంబాల వారు. చాలా మంది ఉపాధి పనులకు సైతం వెళుతున్నారు.తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాకిచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. సవాలక్ష నిబంధనలు విధించి.. ఇంకా కోత కోయనుంది. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇచ్చే రూ.13 వేలకు అనేక నిబంధనల ఆంక్షలు పెట్టింది.వీరందరూ అనర్హులు⇒ ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నట్లయితే, అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు.⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికీ పథకం రద్దు. ⇒ కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు.⇒ కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు.⇒ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. ⇒పట్టణాలల్లో 1000 చ.అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ⇒ ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం రాదు.⇒ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు వేతనం పొందుతున్న వారికి పథకం రాదు. ⇒ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీృమెట్రిక్, పోస్ట్ృమెట్రిక్ స్కాలర్షిప్ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి, మిగిలిన నగదును మాత్రమే ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లిస్తారు. ⇒ సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులొస్తే పథకాన్ని ఆపేస్తారు. -
నవ్వితేనే అరెస్టు చేస్తారా?... సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్రావు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
-
బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు రూ.81,398 కోట్లు
చెరువు గట్టున మర్రి చెట్టు కింద వేటాడే సత్తువ లేని ఓ ముసలి పులి కూర్చొని ఉండేది. చేతితో బంగారు కడియం పట్టుకుని.. అటుగా వెళ్తున్న బాటసారులను బంగారు కడియం ఇస్తా నా వద్దకు రా అంటూ పిలుస్తూ ఉండేది. ఒక రోజున చెరువు గట్టుపై నుంచి వెళ్తున్న బాటసారిని ముసలి పులి నా వద్దకు రా అంటూ పిలిచింది. బాటసారి భయపడి పారిపోతుంటే.. ‘భయపడకు.. నా చేతిలో బంగారు కడియం చూశావా.. నీలాంటి పుణ్యాత్మునికి ఈ బంగారు కడియం ఇస్తే నాకు స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది’ అంటూ ఆశ పెట్టింది. ‘నువ్వేమో క్రూర జంతువు.. నిన్నెలా నమ్మేది?’ అంటూ ఆ బాటసారి అనుమానం వ్యక్తం చేస్తే.. ఆ ముసలి పులి పక్కనే ఉన్న నక్క జోక్యం చేసుకుంటూ ‘పండు ముసలి పులి పరుగెత్తలేదు.. పళ్లూడిపోయాయి.. మాంసం తినడం ఎప్పుడో మానేసింది.. చెరువులో శుభ్రంగా స్నానం చేసి రా.. బంగారు కడియం తీసుకో’ అంటూ ఊరించింది.బంగారు కడియంపై ఆశపడ్డ బాటసారి.. నక్క చెప్పినట్టే చెరువులో స్నానం చేసి, మర్రి చెట్టు కింద కూర్చున్న ముసలి పులి వద్దకు వెళ్లాడు.. ముసలి పులి ఒక్కసారిగా బాటసారిపై పడి చంపేసి కడుపు నిండా తినేసింది.. మిగిలిపోయిన బాటసారి మాంసాన్ని నక్క తినేసింది. ఇదీ పంచతంత్రం నీతి కథ. ఈ కథ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది.ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలను టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చారు. ఆ హామీల అమలు పూచీపత్రం ఇదిగో అంటూ ‘బాబు ష్యూరిటీృభవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఏటా పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఒనగూరే లబ్ధిని వివరిస్తూ ఇంటింటా బాండ్లను పంపిణీ చేశారు. గత చరిత్రను చూసి చంద్రబాబును ప్రజలు నమ్మరేమో అనే భయంతో.. ఆ హామీల అమలు పూచీ నాదీ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.వైఎస్ జగన్ పథకాలను కొనసాగించడంతోపాటు రెండింతలు సంక్షేమం అధికంగా ఇస్తామంటూ చంద్రబాబు, పవన్ నమ్మబలికారు. ఆ మేరకు ఎల్లో మీడియా కూడా ఊదరగొట్టింది. ఆ హామీలతో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే తొలి ఏడాది సూపర్ సిక్స్లో ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. మిగతా హామీలకు దిక్కే లేదు. ఆ హామీలన్నీ మోసాలుగా మిగిలాయి. సూపర్ సిక్స్, ఇతర పథకాల ద్వారా తొలి ఏడాది లబ్ధిని ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ లెక్కన చంద్రబాబు మొదటి ఏడాది మోసాల ఖరీదు రూ.81,397.83 కోట్లు.సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.. అనే సామెతను అవపోసన పట్టిన సీఎం చంద్రబాబు, అధికారం చేపట్టిన వెంటనే తన నైజాన్ని చాటిచెప్పారు. సూపర్ సిక్స్ సహా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే.. సంపద సృష్టించే రహస్యం చెవిలో చెప్పండి.. సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా.. అంటూ ఎదురు దాడికి దిగుతూ వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఏడాదిలోనే రూ.1,58,604 కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించారు. అయినా సరే ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయకపోవడం గమనార్హం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, దీపం, ఉచిత బస్సు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి, మత్స్యకార భరోసా, ఉచిత పంటల బీమా పథకాల కిందే రూ.81,397.83 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. తద్వారా చంద్రబాబును నమ్మి ఓటేయడమంటే చంద్రముఖిని మళ్లీ నిద్రలేపడమేనని ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అప్రమత్తం చేస్తూ నాటి సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలు అక్షర సత్యమని నిరూపితమైందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.అది మేనిఫెస్టో.. ఇది మాయఫెస్టో రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో నాలుగే నాలుగు పేజీలతో కూడిన మేనిఫెస్టోను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారు. తొలి ఏడాదే 95 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా తొలి ఏడాదే 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.40,627 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఐదేళ్ల పాలనలో రూ.2,73,756.17 కోట్లను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1,84,604.32 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాలు కలిపితే ఐదేళ్లలో పేదలకు మొత్తం రూ.4,58,360.49 కోట్ల ప్రయోజనం కలిగించారు. మేనిఫెస్టో అమలు అంటే ఇదీ అని నిరూపించారు. కానీ.. సూపర్ సిక్స్ సహా 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి ఏడాది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా మేనిఫెస్టోను మాయఫెస్టోగా మార్చారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామంటూ నమ్మబలికి, అంతకంటే రెండింతలు సంక్షేమం ఇస్తామని నమ్మించి ప్రజలను నట్టేట ముంచారు.మోసాలుగా మిగిలిన హామీలు » సూపర్ సిక్స్ పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది. వీరికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. మొదటి ఏడాది ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు రూ.32,400 కోట్లు ఎగ్గొట్టారు. » దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే.. రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు.» మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే నెలకు రూ.275 కోట్ల చొప్పున ఆర్టీసీకి ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఈ హామీని అమలు చేయలేదు. అంటే.. ఉచిత బస్సు రూపంలో మహిళలకు రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు. ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండింటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతికి వెళ్లి చూసొచ్చే వారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ నగరానికి వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేర లేదు. » 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది పెన్షన్ ఇవ్వకుండా రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు.» తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడీఐఎస్ఈ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్–యూడైస్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు.» 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు.» ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు.» వైఎస్ జగన్ అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. 2023–24లో పంటలు సాగు చేసిన రైతులకు బీమా ప్రీమియం చెల్లించకుండా ఎగ్గొట్టారు. దాంతో రైతులకు బీమా పరిహారం రూ.1,385 కోట్లు రాలేదు.» మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ.. మొదటి ఏడాది మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇవ్వకుండా రూ.265 కోట్లు ఎగ్గొట్టారు.సూపర్ సిక్స్ ఇచ్చేశా అంటూ హూంకరింపు కూటమి సర్కార్ రెండో ఏడాదిలోకి అడుగు పెట్టాక తల్లికి వందనం పథకం కింద 87,41,885 మందికి రూ.15 వేల వంతున ఇవ్వాల్సి ఉండగా 54,94,703 మందికి మాత్రమే రూ.13 వేల చొప్పున జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే 32,47,182 మందికి ఎగనామం పెట్టి తల్లికి వందనం పథకాన్ని మహా మోసంగా మార్చారు. ఈ పథకంపై మీడియాతో మాట్లాడుతూ పీృ4కు ఆడబిడ్డ నిధి, స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ భృతి అనుసంధానం చేశానని.. 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15న ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. మొత్తంగా సూపర్ సిక్స్ అమలు చేసేశానని, ఇంకెవరైనా దీని గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప మరోటి కాదంటూ హూంకరించారు. 32,400 కోట్లు18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ. 18 వేల చొప్పున ఎగ్గొట్టిన ఆడబిడ్డ నిధి లబ్ధిదారులు 1.80కోట్లు3,218.48 కోట్లుదీపం2 పథకం కింద మహిళలకు టోకరాలబ్ధిదారులు 1.59 కోట్లు13,112.82 కోట్లుతల్లికి వందనం పథకం కింద మహిళలకు రూ. 15 వేల చొప్పున టోపీలబ్ధిదారులు 87,41,8851,385 కోట్లుపంటల బీమా పరిహారం చెల్లించకుండా రైతులకు కలిగించిన నష్టం లబ్ధిదారులు53 లక్షలు9,600 కోట్లు50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ. 4 వేలు చొప్పున ఇవ్వని పింఛన్ సొమ్ము లబ్ధిదారులు 20 లక్షలు10,716.53 కోట్లుఅన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ. 20 వేల చొప్పున అన్యాయం లబ్ధిదారులు 53,58,266265 కోట్లుమత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద రూ. 24 వేల చొప్పున తొలి ఏడాది ఎగవేసిన మొత్తం 7,200 కోట్లునిరుద్యోగ భృతి కింద యువతకు రూ. 36 వేల చొప్పున దగాలబ్ధిదారులు 20 లక్షలు3,500 కోట్లుఉచిత బస్సు కింద మహిళలకు మోసం లబ్ధిదారులు 2.7 కోట్లు -
పీహెచ్సీల్లో ఉచిత మందులు కరవు
చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ కుప్పకూలింది. వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంతో పాటు, ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన పీహెచ్సీల్లో (ప్రైమరీ హెల్త్ సెంటర్) మందులకు తీవ్ర కొరత నెలకొంది. వైద్యం కోసం పీహెచ్సీలకు వెళ్లిన వారిలో సగం మందికి పైగా రోగులకు ఉచిత మందులను ప్రభుత్వం అందించలేకపోతోంది. ఈ విషయం ప్రభుత్వం నిర్వహించిన తాజా ఐవీఆర్ఎస్ సర్వేలోనే వెల్లడైంది. ఉమ్మడి 13 జిల్లాల వారీగా చేపట్టిన సర్వేలో ఏకంగా 43 నుంచి 55 శాతం మంది రోగులు ఉచిత మందులు అందలేదని స్పష్టం చేశారు. అదే విధంగా పీహెచ్సీల్లో అందుతున్న వైద్య సేవలపైనా 40 శాతం వరకూ రోగులు అసంతృప్తిగా ఉన్నారు. –సాక్షి, అమరావతిసీఎం సొంత జిల్లాలో అధ్వాన్నంఏడాది పాలనలో ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే క్షేత్ర స్థాయిలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం పీహెచ్సీల్లో 200 రకాలకు పైగా ఉచిత మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, సగానికిపైగా మందులను ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో రోగులు మందులను బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది.స్వయంగా సీఎం చంద్రబాబు సొంత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 48 శాతం మంది రోగులకు ఉచిత మందులు అందలేదని వెల్లడైంది. ఇక వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంత జిల్లాలో ఏకంగా 55 శాతం మంది రోగులు తమకు ఉచిత మందులు అందలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తేలింది. ఇక పీహెచ్సీల్లో అందుతున్న వైద్య సేవల విషయంలో చిత్తూరు జిల్లాలో 36 శాతం, అనంతపురం జిల్లాలో 40 శాతం మంది రోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌరులు, మేధావులు, పాత్రికేయుల వాక్ స్వాతంత్య్ర హక్కును హరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను తప్పుపట్టింది. లైవ్ షోలో ఓ ప్యానలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్ చేసేస్తారా?’’ అంటూ మండిపడింది. నవ్వడమే తప్పయితే, తాము కూడా ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటామంటూ గుర్తు చేసింది. లైవ్ షోలో ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. ఓ జర్నలిస్టుగా లైవ్ న్యూస్ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని, తద్వారా ఆయన వాక్ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఈ నెల 8న నమోదు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. బెయిల్ మంజూరు సందర్భంగా షరతులు విధించాలని కింది కోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.అరెస్ట్... రిమాండ్ను సవాల్ చేసిన కొమ్మినేనికొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే కేఎస్సార్ లైవ్ షోలో పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి రాజధాని గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో కృష్ణంరాజు, కొమ్మినేనిపై టీడీపీకి చెందిన కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొమ్మినేని, కృష్ణంరాజుపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయనను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో కొమ్మినేని తన అరెస్ట్, రిమాండ్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కొమ్మినేని తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, పొన్నవోలు సుధాకర్రెడ్డి, అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. » ఈ నెల 6న కొమ్మినేని లైవ్ షో నిర్వహించారని, అందులో ప్యానలిస్ట్గా పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ అమరావతి గురించి వ్యాఖ్యలు చేశారని సిద్ధార్థ దవే ధర్మాసనానికి వివరించారు. ఈ వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన ఎవరి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని నివేదించారు. ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు.. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని బాధ్యుడిగా చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు.మరొకరు చేసిన వ్యాఖ్యలకు యాంకర్ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన జస్టిస్ మన్మోహన్... అలా అదుపులోకి తీసుకునేందుకు చట్టం అనుమతిస్తుందా? అని ప్రశ్నించారు. ఏ నిబంధన మేరకు అరెస్టు చేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రాలను ప్రశ్నించారు. చర్చలో ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని నవ్వారని, ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషించారని వివరించారు. ఆయన మాట్లాడేటప్పుడు అడ్డుకోకుండా నవ్వారని రోహత్గీ బదులిచ్చారు. ఈ వాదనపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. నవ్వడం నేరమా? నవ్వితే అరెస్ట్ చేస్తారా? అంటూ నిలదీసింది. ఎవరైనా నవ్వొచ్చేలా మాట్లాడితే ధర్మాసనంపై ఉన్న తాము కూడా నవ్వుతామన్న జస్టిస్ మన్మోహన్.. అంతమాత్రాన తప్పుడు కేసులు అంటగట్టేస్తారా? అని ప్రశ్నించారు. జస్టిస్ మిశ్రా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ... ప్రతి రోజూ ఇలా జరుగుతూనే ఉంటుందని అన్నారు. కొమ్మినేని చర్చలో ప్రేక్షకుడు కాదని రోహత్గీ చెప్పగా... ఆయన ఆ వ్యాఖ్యలు చేయలేదు కదా? అని జస్టిస్ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. పిటిషనర్ స్వయంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే, అవమానకర వ్యాఖ్యలు చేయలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. లైవ్ షోలో ఆయన పాత్రికేయ భాగస్వామ్యం రక్షణకు అర్హమైనదని, ఇది వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడుతుందని తెలిపింది. కొమ్మినేని అరెస్ట్ ఎంతమాత్రం సహేతుకం కాదంటూ ఆయనను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు లోబడి ఈ నెల 8న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నంబర్ 108లో కొమ్మినేనిని బెయిల్పై విడుదల చేయాలని నిర్దేశించింది. తాను నిర్వహించే షోలో కొమ్మినేని ఎలాంటి పరువు నష్టం వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని, ఇతరులను అలాంటి ప్రకటనలు చేయడానికి అనుమతించడం గానీ చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు
సాక్షి, అమరావతి: ‘సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ‘ఎక్స్’ వేదికగా శుక్రవారం ఆయన పోస్టు చేశారు. ‘నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధిచెప్పింది.కొమ్మినేని అరెస్టు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు తీవ్ర భంగకరమని సుప్రీంకోర్టు చెప్పడం ముదావహం’ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘అమరావతి నిర్మాణం పేరిట రూ.వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు.అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి, చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని ‘సాక్షి’ మీడియా యూనిట్ ఆఫీసుల మీద, కార్యాలయాల మీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు. చంద్రబాబు తన తప్పు తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీకి, ‘సాక్షి’ మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడడంతోనే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర పన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో యాంకర్గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ ఇవాళ సుప్రీంకోర్టు ఇచి్చన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటుకావు. సత్యమేవ జయతే’ అని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇదొక హెచ్చరికకొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సంకెళ్లను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టింది. కొమ్మినేని అరెస్ట్ అక్రమం అని దేశం మొత్తం తెలిసింది. సాక్షి కార్యాలయాలపై తన కార్యకర్తలను, నాయకులను ఉసిగొల్పి దాడులు చేయించిన చంద్రబాబు అరాచకానికి తాజా తీర్పు ఒక హెచ్చరిక. చంద్రబాబు కుట్రపూరిత విధానాలను న్యాయస్థానం ఉత్తర్వులు ఎత్తిచూపాయి.– పూనూరు గౌతంరెడ్డి, వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడుబాబు సిగ్గుతో తలదించుకోవాలికొమ్మినేని అరెస్ట్ అక్రమమని తన తీర్పుతో కూటమి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు బుద్ధి చెప్పింది. చంద్రబాబు సర్కార్ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి హెచ్చరిక. ఇకనైనా చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. అక్రమ అరెస్టులను ఆపాలి. –పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీతల ఎక్కడ పెట్టుకుంటారు..కొమ్మినేని అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చంద్రబాబుకు చెంపపెట్టు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సంకెళ్లను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టింది. ఇప్పుడు చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటారు. – కల్పలత, ఎమ్మెల్సీసుప్రీం తీర్పుతోనైనా బాబు కళ్లు తెరవాలికొమ్మినేనిది అక్రమ అరెస్ట్ అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుతో అయినా చంద్రబాబు కళ్లు తెరవాలి. చంద్రబాబు మెప్పు కోసం రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్న పోలీసులు పునరాలోచన చేయాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే వారిని కోర్టుల్లో నిలబెడతాం. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యేరాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బకొమ్మినేని అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురురెబ్బ. కనీస నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేయడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం. – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేక్షమాపణ చెప్పాలి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన అంశంలో మంగళగిరి కోర్టు న్యాయమూర్తి, డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తాజాగా సుప్రీంకోర్టు జర్నలిస్టుల భావప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ వెంటనే విడుదల చేయాలని ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు. తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తప్పు పట్టడం కూడా ప్రభుత్వ నేతలను తలదించుకునేలా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ అందరూ కొమ్మినేని అరెస్టుతో ఆగకుండా సాక్షి కార్యాలయాలపై దాడులకు ప్రేరేపించినందుకు తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే కొమ్మినేని, కృష్ణంరాజులపై కేసులను ఉపసంహరించుకోవాలి. – ఈదర గోపీచంద్, సామాజిక విశ్లేషకులు -
బాబు సర్కార్ ఇప్పటికైనా.. దేవులపల్లి అమర్ వార్నింగ్
-
‘సుప్రీం తీర్పు’.. చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao)ను వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యున్నత న్యాయ స్థానం తీర్పుపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘సుప్రీం తీర్పు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం.అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడు వ్యాఖ్యలతో యాంకర్గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు’అని ట్వీట్లో పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు @ncbn గారికి పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2025 -
నా మేయర్ పదవి తొలగింపు కోసం టీడీపీ కక్ష సాధింపు రాజకీయాలు..
-
బడిపిల్లల్నీ మోసం చేశారు
-
డీజీపీ బాధితుల పక్షమా?.. దాడి చేసినవారి పక్షమా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర డీజీపీ బాధితుల పక్షాన ఉంటారో, దాడులు చేసిన చేసిన వారి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు అరుణ్కుమార్, వరుదు కళ్యాణి, ఇతర నేతలు స్పష్టంచేశారు. ఏపీలో అరాచక పరిస్థితులపై డీజీపీకి ఫిర్యాదు చేయటానికి వస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సాక్షి కార్యాలయాలపై దాడులు, పొదిలిలో రైతులపై అక్రమ కేసులు, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం, మాజీ సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాలకు భద్రత కల్పించకపోవడం, మహిళలపై అఘాయిత్యాలు తదితర అంశాలపై వారు గురువారం అదనపు డీజీ మధుసూదనరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదనపు డీజీకి చాలా అంశాలపై ఫిర్యాదు చేశాం. దర్శిలో మా వారిపై టీడీపీ గూండాలు దాడి చేస్తే, మా వారిపైనే 15 అక్రమ కేసులు పెట్టారు. బాధితులకు కాకుండా టీడీపీ గూండాలకే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్ పర్యటనలకి ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించడంలేదు. జగన్ కాన్వాయ్పై రాళ్ల దాడి చేసిన వారికి పోలీసులు అండగా నిలబడ్డారు.పొదిలి, గుంటూరు, రామగిరి, తెనాలి ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటనలో ప్రజలు భారీగా వచ్చినా, తగిన భద్రత కల్పించలేదు. ఇందులో లోకేశ్, టీడీపీ పాత్రపై విచారణ చేయాలి. జగన్ పర్యటనను అడ్డుకొనేందుకు వచ్చిన 40 మంది టీడీపీ మహిళా కార్యకర్తలకు మాత్రం 200 మంది పోలీసులను రక్షణగా పెట్టారు. మహిళలను ముందర పెట్టి విధ్వంసాలు సృష్టించి, జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని టీడీపీ కుట్ర చేస్తోంది.ఇవే విషయాలను అడిషనల్ డీజీకి వివరించాం. వైఎస్సార్సీపీ వారిపై కొందరు పోలీసులు చేస్తున్న దాడులపైనా చర్యలు తీసుకోవాలని కోరాం’ అని చెప్పారు. వైఎస్ జగన్ పర్యటనలకు భద్రత విషయంలో ఎవరు ఆదేశిస్తే ఇంత ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారో పోలీసు అధికారులే చెప్పాలని అరుణ్ కుమార్ అన్నారు. అడిషనల్ డీజీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నాయకులు మలసాని మనోహర్ రెడ్డి, ఏఎన్ఎన్ మూర్తి తదితరులు ఉన్నారు. -
ఏడాది పాలన అంతా అరాచకమే
సాక్షి, అమరావతి: ఏడాది పాలనలో తాను ప్రజలకు ఏం చేశానో చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ్టికీ చంద్రబాబు నిత్యం బురద చల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఏడాది పాలన అంతా అరాచకమే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావు, పి.అనిల్కుమార్ యాదవ్, మేరుగు నాగార్జున, పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. ‘క్రిమినౖలెజేషన్ ఆఫ్ పాలిటిక్స్’కు ఆద్యుడు చంద్రబాబే అనే సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రమంతా వేడుకలు నిర్వహించాలని ఆదేశించడమే కాకుండా, చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ యథావిథిగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, మాజీ సీఎం వైఎస్ జగన్పై నిందలు మోపుతూ.. నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రసంగమంతా ఆత్మస్తుతి.. పరనిందగా సాగిందని, డైవర్షన్ పాలిటిక్స్ను నమ్ముకుని ముందుకెళుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు గురువారం వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘వంగవీటి మోహన రంగా హత్య వెనుక ఎవరున్నారో నాడు రాష్ట్ర హోం మంత్రిగా పని చేసిన చేగొండి హరిరామజోగయ్య స్వయంగా చెప్పారు. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చి, వారిని దాచి పెట్టిన వ్యక్తి చంద్రబాబు కాదా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఆ కేసును ఉద్దేశ పూర్వకంగా రాజకీయంగా వాడుకుని, తామే హత్య చేశామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో చెప్పిన వారిని కూడా అప్రూవర్గా మార్చి, ఆ నెపాన్ని నిర్దోషుల మీద మోపి రాజకీయ విష క్రీడ ఆడుతున్నది ఎవరో ప్రజలకు తెలిసిందే. తెల్గీ స్టాంప్ పేపర్ల స్కామ్ మొదలు.. స్కిల్ స్కామ్, మద్యం స్కామ్ వరకు ఏ నేరం చూసినా సరే చంద్రబాబు పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది’ అని తెలిపారు. వారు ఇంకా ఏం చెప్పారంటే.. కూటమి ప్రభుత్వంలో 390 హత్యలు » ఏడాదిగా చంద్రబాబు అత్యంత హేయమైన పాలన సాగించారు. విపక్ష నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా హత్యలు, హత్యా యత్నాలు, ఆస్తుల విధ్వంసంతోపాటు టార్గెట్ చేసుకున్న వారిపై అక్రమ కేసుల బనాయింపునకు బరితెగించారు. » ఏడాదిలో 390 హత్యలు. హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది. కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు 198. ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. ఇద్దరు ప్రజా సంఘాల నాయకులు, ఎనిమిది మంది జర్నలిస్టులు జైలుకు వెళ్లారు. » విద్యార్థి దశలో ఉన్నప్పుడే తన సహచరులకు మద్యం పట్టించి ప్రత్యర్థులపైకి దండయాత్రకు పంపానని చంద్రబాబు స్వయంగా తన ఎల్లో మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మామ కాళ్లు పట్టుకుని టీడీపీలోకి వచ్చాక.. ఆయన చేసిన నిర్వాకాలన్నింటినీ ఆయన తోడల్లుడు చెప్పారు. జర్నలిస్ట్ పింగళి దశరథరాం హత్య వెనుక ఎవరున్నారో కూడా అందరికీ తెలిసిందే.» వైఎస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కోసం పొదిలి వెళితే టీడీపీ కార్యకర్తలతో దాడులు చేయించి, రాజకీయ హింసను రాజేసి ఆ మంటల్లో చలి కాచుకుందామని కుట్ర పన్నారు. అది ఫలించకపోవడంతో రైతులపై రౌడీలుగా ముద్ర వేసి, వారిపై కేసులు పెట్టి కక్ష సాధిస్తున్న చంద్రబాబువి నేరమయ రాజకీయాలు కావా?. -
‘చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి, హామీలను అమలు చేయాలనే గొంతులను మాత్రం ఏడాదిది నొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, జూన్ 12) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని గుర్తుచేశారు. ‘తల్లికి వందనం పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్నామని అబద్దం చెబుతున్నారు.రికార్డ్స్ ప్రకారం దాదాపు 87 లక్షల మందికి తల్లికి వందనం అమలు చేయాలి. పదమూడు వేల కోట్ల రూపాయిలు తల్లికి వందనం పథకానికి కావాలి. కానీ తల్లులను చంద్రబాబు మోసం చేశారు. తల్లికి వందనం కాదు తల్లికి వంచనగా మార్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం మోసం అని తెలియదా?, దీనిపై ప్రజలు ప్రశ్నించకూడదా?, దమ్ము దైర్యం ఉంటే ఈ ఏడాది కాలంలో మీరు అమలు చేసిన పథకాలను ముద్రించి ప్రజల ముందు ఉంచగలరా చంద్రబాబూ?, ప్రజా స్వామ్య విలువలు పాటించకపోతే ఇక ఈ ప్రభుత్వం ఎందుకు?, ఒక పథకాన్ని అమలు చేయడంలో ఇంత వంచనా?, ఇవ్వాల్సిన సొమ్ములో రెండు వేలు కట్ చేసి, తల్లికి వందనం సంపూర్ణం అని ఎలా చెబుతారు?, P4 అనేది ప్రణాళిక లేని కార్యక్రమం. దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు. దళితుల కుటుంబాలను జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తే మీకు కడుపు మంట ఎందుకు?, రాష్ట్రాన్ని రాజకీయ ఖైదీలకు నిలయంగా మార్చారు.శవాల దిబ్బగా రాష్ట్రాన్ని మార్చాలి అనుకుంటున్నారా?, ప్రభుత్వంపై ఏడాదిలోనే ఇంతగా రైతులు తిరగ బడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు.ప్రభుత్వం పై రైతులు తిరగబడితే రౌడి లా కనపడుతున్నారా?, రైతులను రౌడీలంటూ అగౌరవపరుస్తారా?, ఇదేనా మీ సంస్కారం?’ అని విమర్శించారు. -
చంద్రబాబుపై మరోమారు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఫైర్
సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై మరోమారు టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. గురువారం.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన-రైతాంగానికి ఇచ్చిన హామీలు- అమలు’పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఎం నాయకులు పి.మధు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైపోయిందని.. రైతులకు 20 వేలు సాయం చేస్తామన్నారు. ఎన్నికలయ్యాక ఒక ఖరీఫ్, ఒక రబీ సీజన్ అయిపోయాయి. కేంద్రం ఇచ్చేవి కాకపోయినా మీరు ఇస్తామన్న 14 వేలైనా ఇవ్వాలి కదా. గతంలోనూ రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రెండు కిస్తీలు ఎగ్గొట్టేశాడు...రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడా కనీస మద్దతు ధర దొరకడం లేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు బోనస్ రూపంలో రైతుకు కొంత సాయం చేస్తున్నాయి. చంద్రబాబు కనీసం రైతుల గురించి ఆలోచన చేయడం లేదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.‘‘ఏడాది నుంచి మెట్రో రైలు, రింగ్ రోడ్డు, ఐకానిక్ వంతెనలు అంటూ భజన చేస్తున్నారు. కృష్ణానదిపై 15 కిలోమీటర్లకు ఒక ఐకానిక్ వంతెన కట్టాలని ఓ ఛానల్లో చెబుతున్నారు. చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా పిచ్చి ఊహాలోకంలో విహరిస్తున్నాడు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదు. ఏదో స్వప్రయోజనం మనసులో పెట్టుకుని పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం ఆలోచన చేస్తున్నాడు. భూములను 22ఏలో చేర్చి చిన్ని చిన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారు. భూములు రైతుల వద్ద కాకుండా.. ప్రభుత్వం వద్దే ఉండాలనేది చంద్రబాబు ఆలోచన.అమరావతిలో భూములిచ్చిన రైతులకు హామీలిచ్చి మోసం చేశారు. గతంలో గ్రాఫిక్స్తో మూడేళ్ల పాటు కథ నడిపించారు. ఇప్పుడు మళ్లీ 45 వేల ఎకరాలు రాజధానికి తీసుకుంటామంటున్నారు. ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు కడతామంటున్నారు. గన్నవరంలో ఎయిర్పోర్టు ఉంటే అమరావతిలో మరో ఎయిర్ పోర్టు అవసరమా?. శ్రీకాకుళం ప్రజలకు కావాల్సింది తాగు, సాగునీరు కానీ.. ఎయిర్ పోర్టు కాదు. శ్రీకాకుళంలో ఎయిర్ పోర్టు కడితే సరిపోదు. ఎక్కేవాడు కావాలిగా.. ఇన్నేళ్ల అనుభవమున్న నిన్ను ఏమనుకోవాలి?. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజావ్యతిరేకమైన పిచ్చి ఆలోచనలను మానుకోవాలి’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. -
‘తన్మయి కేసు.. సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా?’
సాక్షి, అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకనా అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?.. మహిళలు, చిన్నారులపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గిరిజన ఇంటర్ విద్యార్థి తన్మయిది ప్రభుత్వ హత్యే. ఈనెల మూడో తేదీన ఫిర్యాదు అందితే.. ఎందుకు గాలింపు చర్యలు చేపట్టలేదు?. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా?. నలుగురు అనుమానితులు ఉంటే.. ఒకరిపైనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకనా?. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?. మహిళలపై అఘాయిత్యాలు పట్టించుకోరా? అని ప్రశ్నించారు.మరోవైపు.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణ హత్య జరిగింది. గిరిజన బాలిక తన్మయి మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బాధిత కుటుంబానికి పరిహారం, భూమి, ఇంటి స్థలం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు ఏడాది పాలన.. వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్
-
ఏడాది పాలన.. గందరగోళం.. రఫ్పాడించిన ఏపీ ప్రజలు
-
కూటమి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి, జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమే. కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రెడ్బుక్ రాజ్యాంగాన్నే అమలు చేశారు. దీనికి వాస్తవాలు, ఆధారాలతో వైఎస్సార్సీపీ పుస్తకాన్ని తెచ్చాం. ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించాం. ఆధారాలతో సహా అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి.జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం.. బుక్ కోసం క్లిక్ చేయండిజగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తులాంటిది. కానీ, ఈ ఏడాది చంద్రబాబు పాలన అంతా చీకటిమయమే. చంద్రబాబు దుష్టపాలన మొత్తం బుక్ వేస్తే కనీసం 5వేల పేజీలు అవుతుంది. చంద్రబాబు దుష్ట పాలనకు ముకుతాడు వేయాలి. ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అని ఆలోచించ కూడదు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని గట్టిగా ప్రశ్నించాలి. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి’ అని కోరారు. -
జగన్ టూర్ లో టీడీపీ కుట్ర.. ఎల్లో మీడియానే సాక్ష్యం
-
వైఎస్ జగన్ దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది.. రైతులు థాంక్స్ చెప్పాలి
-
ఇంటిపైకి ఎక్కి.. రాళ్లు, చెప్పులతో దాడి.. 3 కానిస్టేబుల్స్ తలకి గాయాలు
-
జనసంద్రాన్ని చూసి కూటమి వెన్నులో వణుకు మొదలైంది
-
బాబు పాలన రైతుకు శాపం
-
Thalliki Vandanam: ప్రతి తల్లీని, ప్రతి విద్యార్థినీ మోసం చేసిన సీఎం చంద్రబాబు
-
ఢిల్లీలో బాబు డాబు
సాక్షి, న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 20 సార్లు ఢిల్లీకి వచ్చారు. ప్రతిసారీ అభివృద్ధే అజెండా అంటూ ప్రచారం చేసుకుంటున్నా.. కొత్త అప్పులకు మద్దతు కోరడమే లక్ష్యంగా ఆయన పర్యటనలు సాగాయి. ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పెద్దలను కలుస్తూ వచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని ధ్వంసం చేసిందని విమర్శిస్తూ.. ఆ వంకతో కేంద్రం మద్దతుతో రూ.కోట్లు అప్పులు తెచ్చారు. అమరావతి పేరుతో ఇప్పటివరకు రూ.31 వేల కోట్లు తీసుకోవడం గమనార్హం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ.15 వేల కోట్లు పొందారు. ఇవికాక బడ్జెటేతర అప్పులు రూ.19,410 కోట్లు. ఏడాదిలో భారీగా అప్పు చేయడంలోనే చంద్రబాబు తన మార్క్ చూపారు. ఇకప్రతిసారీ చంద్రబాబు ప్రత్యేక విమానంలోనే ఢిల్లీ వచ్చారు. దాదాపు 15–17 సార్లు రెండు రోజుల పాటు మకాం వేశారు.ఐదుసార్లు ప్రధాని మోదీని, ఆరుసార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ఐదుసార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నట్లు కేంద్రం పేర్కొన్నా.. చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఎన్డీఏ నేతలు ఎవరూ నోరు మెదపలేదు. పైగా దీనిని వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ ఎంపీలపై కూటమి ఎంపీలు పార్లమెంట్లో వ్యక్తిగత దూషణలకు దిగారు. ఎత్తు తగ్గిస్తున్నట్లు కేంద్రం స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొందని మీడియా ప్రశ్నించినా... కూటమి నేతల నుంచి సమాధానం రాలేదు.మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ఈ విషయంలో ఒక్కోసారి ఒక్కోలా స్పందించారు. క్వింటాకు రూ.11,600 ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా... రూ.10,025 కంటే రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేది లేదని కేంద్రానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) తేల్చి చెప్పింది. అయినా మిర్చికి మద్దతు ధర లభించిందని, కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఏపీలో రేటు పెంచితే దేశం మొత్తం పెంచాల్సి వస్తుందని కేంద్రం చెప్పడంతో... చంద్రబాబు మళ్లీ ఈ విషయం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ దోబూచులాటల కారణంగా మిర్చి రైతులకు రూ.8,827 కోట్లు నష్టం వాటిల్లింది.సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆపై యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తల ద్వారానే సంపద సృష్టి జరుగుతుందని, వారు పెట్టుబడులు పెడితే తద్వారా వచ్చిన ఆదాయంతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించొచ్చు అని చెప్పుకొచ్చారు. -
బాబు కర్కశం.. రైతు ద్రోహి
-
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు శాపంగా మారింది... పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
-
పచ్చ మూకల పైశాచికత్వం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రజలు నీరాజనం పలకడంతో సీఎం చంద్రబాబు అండ్ గ్యాంగ్కు వణుకు పుట్టింది. అనూహ్యంగా వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తుండటం చూసి కన్ను కుట్టింది. ఎలాగైనా సరే జగన్ పర్యటనను అభాసుపాలు చేయాలని కుట్రకు తెర లేపారు. ఇందుకు పోలీసులూ సహకరించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్ఎస్ఆర్ పెట్రోలు బంకు వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు వైఎస్ జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి 2.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొగాకు వేలం కేంద్రానికి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. టీడీపీ నాయకుడు గుణిపూడి భాస్కర్ ఇంటి వద్ద 200 మంది పచ్చ మూకలు కాపు కాశారు. ర్యాలీ పట్టణంలోకి ప్రవేశించగానే ఖాళీ కుండలు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. అక్కడ నుంచి ర్యాలీ నవాబ్ పేటకు చేరుకోగాని మరో పచ్చ గుంపు రోడ్డుపైకి చొచ్చుకొచ్చింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం వెంట తెచ్చుకున్న రాళ్లతోపాటు జగన్ కాన్వాయ్ మీదకు చెప్పులు విసిరారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల పైకి రాళ్లు, చెప్పులు విసరడం ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో ముందుగానే తిష్ట వేసిన పచ్చ మూకలు.. డాబాల మీద నుంచి, ఇళ్లలోని కిటీకీల నుంచి రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్, కొందరు రైతులు, కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. రాళ్ల దాడి చేసిన పచ్చ మూకలను వదిలిపెట్టి.. రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసుల మద్దతుతోనే రాళ్ల దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. నిరసనలకు పోలీసుల అనుమతి వైఎస్ జగన్ పోరుబాట ర్యాలీ జరుగుతున్న సమయంలోనే టీడీపీ నిరసనలకు పోలీసులు అనుమతివ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలలుగా పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు రాక అల్లాడిపోతున్నారు. సరుకు కొనకుండా కంపెనీలు చేసిన కుట్రలకు మోసపోతున్నారు. కళ్లున్న కబోదిలా కూటమి ప్రభుత్వం పొగాకు రైతులు, ఇతర రైతులను పట్టించుకోకుండా కంపెనీలకు అండగా నిలబడింది.ఈ పరిస్థితిలో రైతులకు మద్దతుగా నిలిచేందుకు వైఎస్ జగన్ ర్యాలీగా వస్తున్న సమయంలోనే టీడీపీ నిరసనలకు పోలీసులు అనుమతి ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు రాళ్లను సిద్ధం చేసుకున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీస్తున్నారు. అధికార పార్టీతో కుమ్మక్కై పోలీసులు మిన్నకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసు స్టేషన్కు కూతవేటు దూరంలో మాజీ సీఎం కాన్వాయ్ మీద చెప్పులు విసరడం, ర్యాలీకి వ చ్చిన రైతులు, కార్యకర్తల మీద రాళ్లు రువి్వతే పోలీసులు ఏం చేశారన్న ప్రశ్నలకు సమాధానం లేదు. డాబాల మీదకు రాళ్లు ఎలా వెళ్లాయి? పోరుబాట ర్యాలీకి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ర్యాలీ దృశ్యాలను టాప్ యాంగిల్లో ఫొటోలు తీసుకోవడానికి ప్రెస్ ఫొటోగ్రాఫర్లను పోలీసులు అనుమతించ లేదు. కానీ ర్యాలీ పొడవునా డాబాల మీద టీడీపీ కార్యకర్తలు కాపుకాశారు. ఇళ్లపై నుంచి ర్యాలీకి తరలివచ్చిన రైతుల మీదకు రాళ్లు రువ్వారు. అసలు డాబాల మీదకు రాళ్లు ఎక్కడ నుంచి వచ్చాయన్న ప్రశ్నకు పోలీసులే బదులివ్వాలి. స్పెషల్ బ్రాంచి పోలీసులు, ఇంటిలిజెన్స్ పోలీసులు ఏం చేసినట్లు? అంటే పోలీసుల మద్దతుతోనే పచ్చ మూకలు రాళ్ల దాడికి ప్లాన్ చేశాయని ఇట్టే స్పష్టమవుతోంది. పోరుబాటలో అడుగడుగునా పచ్చమూకలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నించాయి. గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ మూకలు ఇంతగా కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు పూర్తిగా సంయమనం పాటించారు. రైతుల సమస్యలు పరిష్కారం కావడం ఇష్టం లేని టీడీపీ నేతలే కుట్ర పూరితంగా వ్యవహరించడం కనిపించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ఏరువాక సందడి ఏది?
సాక్షి, అమరావతి: ఏరువాక పౌర్ణమి.. మరోపేరు జ్యేష్ట పౌర్ణమి.. ఇది తెలుగు రైతుల పండుగ. తొలకరి పంట సాగుకు సన్నద్ధమయ్యే సందర్భంగా రైతులు సంప్రదాయబద్ధంగా ఉత్సాహంగా జరుపుకునే వేడుక.. కాడెద్దులను సిద్ధంచేసి వ్యవసాయ పరికరాలను అలంకరించుకుని పూజలుచేసి సాగును ఆరంభిస్తారు. అలాంటి సంప్రదాయ పండుగ వాతావరణం ఈ ఏడాది రైతుల లోగిళ్లలో ఎక్కడా కన్పించడంలేదు. గడిచిన ఏడాదిగా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి రాష్ట్రంలోని రైతులందరి పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ నిర్వాకంవల్ల సాగుభారంగా మారడంతో రైతులు తొలకరి సాగుకు ఉసూరుమంటూ బుధవారం ఏరువాకకు శ్రీకారం చుట్టారు.పెట్టుబడి సాయం లేకుండా ఏరువాక ఎలా?తాము అధికారంలోకి వస్తే ఏటా ప్రతీ రైతు కుటుంబానికి రూ.20వేల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో ఊదరగొట్టింది. ఎన్నికల్లో గెలిచాక 2024–25 సీజన్కు ఇవ్వాల్సిన రూ.10,717 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. కనీసం ఈ ఏడాదైనా సీజన్కు ముందు ఇస్తుందేమోనని రైతులంతా ఆశగా ఎదురుచూసారు. కానీ, ఇప్పటివరకు ఆ ఊసేలేదు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఇప్పటివరకూ జారీచేయలేదు. మరోపక్క.. గడిచిన ఖరీఫ్, రబీ సీజన్లలో వరదలు, అకాల వర్షాలు, కరువు ప్రభావంతో పంటలు నష్టపోయిన దాదాపు ఏడు లక్షల మంది రైతులకు రూ.850 కోట్లకు పైగా పంట నష్టపరిహారం సీజన్ ముగిసినా చెల్లించలేదు. రూ.వెయ్యి కోట్లకు పైగా ధాన్యం బకాయిలుఇక 48 గంటల్లోనే.. కాదు కాదు 24 గంటల్లోనే ధాన్యం సొమ్ములు జమచేస్తున్నామంటూ గొప్పలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. గడిచిన రబీ సీజన్కు సంబం«ధించి పేరుకుపోయిన రూ.1,000 కోట్ల బకాయిల చెల్లింపు ఊసెత్తడం లేదు. అలాగే, 2023–24 సీజన్కు సంబంధించి ప్రీమియం బకాయిలు రూ.930 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టడం వల్ల రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండాపోయింది. కనీసం ఖరీఫ్–2024 సీజన్కు సంబంధించిన పంటల బీమా ప్రీమియం మొత్తం రూ.838 కోట్లు చెల్లించి ఉంటే బీమా పరిహారమైనా ఈపాటికి చేతికొచ్చేది. ఇలా దాదాపు రూ.25 వేల కోట్లకు పైగా రైతులకు అందాల్సిన సాయం జమకాకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం మోకాలడ్డింది. పైగా.. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేసింది. స్వచ్ఛంద బీమా నమోదు చేయాలని చెప్పడంతో ఆ భారం భరించలేక రైతులెవరూ రబీలో నమోదు చేసుకోలేదు. మరోపక్క.. ధాన్యం, పత్తి, మిరప, పొగాకు, టమాటా ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వ నిర్వాకంవల్ల రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కనీసం అదునుకైనా విత్తనం అందించారా అంటే అదీ లేదు.విత్తనం అందక అగచాట్లుఇదిలా ఉంటే.. గత సీజన్ నుంచే నాన్ సబ్సిడీ విత్తన సరఫరాకు మంగళం పాడేశారు. 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా.. నిధులలేమి సాకుతో 5.38 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. వేరుశనగ విత్తనం 30 శాతానికి కుదించారు. కనీసం ఆ విత్తనమైనా సీజన్కు ముందు అందుబాటులో ఉంచారా అంటే అదీలేదు. ఇప్పటివరకు కనీసం 30 శాతం విత్తనాన్ని కూడా పొజిషన్ చేసిన పాపాన పోలేదు. రైతు సేవా కేంద్రాల్లో సబ్సిడీ విత్తనమే కాదు.. ఎరువులూ కానరావడంలేదు. అయినాసరే, ఏరువాక పౌర్ణమిని పండుగ వాతావరణంలో చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విస్మయానికి గురిచేస్తోంది. రైతులు చేసుకోవాల్సిన ఈ పండుగను అంతా బాగుందంటూ వారిని ఏమార్చి మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో కూటమి కార్యకర్తలు హంగామా చేశారు. -
తల్లికి వందనం 30 లక్షల మందికి ఎగనామం
సాక్షి, అమరావతి: ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు.. నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం.. అధికారంలోకి రాగానే తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం కింద ఈ మొత్తాన్ని జమ చేస్తాం’ అని ఊరూరా.. ఇంటింటా ఎన్నికల ముందు ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ గ్యాంగ్.. ఇప్పుడు మాట తప్పింది. ఏకంగా దాదాపు 30 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టనుంది. అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా.. రెండో ఏడాది తూతూ మంత్రంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. రూ.15 వేల స్థానంలో రూ.13 వేలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిందని తెలిసింది. రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. అయితే ఈ పథకం అమలు కోసం రూ.8,745 కోట్లు మాత్రమే కేటాయించినట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ లెక్కన ఈ మొత్తం 58 లక్షల మంది విద్యార్థులకే సరిపోతుంది. అంటే దాదాపు 30 లక్షల మందికి ఈ పథకాన్ని ఎగ్గొట్టడానికి రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ రూ.13 వేలను ఒకేసారి ఇస్తారా.. లేక వాయిదాల పద్దతిలో ఇస్తారా.. అన్నది ఇంకా స్పష్టం చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సూపర్ సిక్స్ అమలు చేయక పోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా.. ప్రజలు ఈ పథకం గురించి ఎక్కడికక్కడ ప్రశ్నిస్తుండటంతో అరకొరగా అమలు చేయనుందని తెలుస్తోంది. అయితే అంతుబట్టని అంకెల గారడీతో తల్లుల కళ్లకు ప్రభుత్వం గంతలు కట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులున్నట్టు చెబుతోంది. ఈ లెక్కన తీసుకున్నా, తలో రూ.15 వేల చొప్పున రూ.10,090.74 కోట్లకు పైగా అవసరం. కానీ కేటాయింపులు మాత్రం ఆ మేరకు కూడా లేక పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. తీరా నగదు జమ చేసే సమయానికి ఇంకెంత మందికి ఎగ్గొడతారోననే అనుమానం వ్యక్తమవుతోంది.గత ఏడాది ఎగ్గొట్టి.. ఈ ఏడాది కోతలు పెట్టి.. ‘‘ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి పథకాలు అందుకోండి’’ అంటూ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే హామీని ‘సూపర్–6’లోనూ పేర్కొన్నారు. అందరికీ తల్లికి వందనం ఇస్తామన్న హామీ ప్రకారం.. ఇప్పుడు చెప్పిన విద్యార్థుల సంఖ్య, నిధుల లెక్క సరిపోవడం లేదు. విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ లెక్కలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ లెక్కలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం.గతేడాది ఒక్క విద్యార్థికీ ఈ పథకం ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఈసారి విద్యార్థుల సంఖ్యలో కోత పెట్టి గొప్పలు చెబుతోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ నెలలో అమ్మఒడి జమయ్యేది. గతేడాది ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం రావడంతో పథకం ఆగిపోయింది. కానీ సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు. అలాగే, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామన్నారు. హామీ ప్రకారం రెండేళ్లకు ఒక్కో విద్యార్థికి రూ.30 వేల చొప్పున ఇవ్వాలని తల్లులు డిమాండ్ చేస్తున్నారు.నేడు ‘తల్లికి వందనం’ నిధులు జమసమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయంసాక్షి, అమరావతి: తల్లికి వందనం పథకాన్ని గురువారం నుంచి అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఈ పథకం అమలు, విధివిధానాలపై మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అధికారులతో సీఎం సమీక్షించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గురువారమే తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందనం నిధులను జమచేయాలని ఆయన ఆదేశించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామన్నారు. పథకాన్ని ఎలా అమలుచేయబోతున్నామనే విషయాన్ని వివరించారు. పథకం అమలుకు అవసరమైన నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద గురువారం నగదును తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. -
చంద్రబాబు మీది కూటమి ప్రభుత్వం కాదు.. వంచన ప్రభుత్వం
సాక్షి,విజయవాడ: ఏపీలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని.. వంచన ప్రభుత్వం అని మండిపడ్డారు శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ. తల్లికి వందనంపై ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం కాదు.. వంచన. మొత్తం పిల్లలు 87,41,885, ఇస్తామంటున్నది 67,27,164 మందికి, కాని ప్రకటించిన నిధులు ప్రకారం చూస్తే 58 లక్షల మందికే. అదికూడా పూర్తిగా ఇస్తారో లేదో?. దాదాపుగా 29 లక్షల మంది పిల్లలకు మోసమే కదా?. పథకం అమలుకు కావాల్సింది ఏడాదికి రూ.13,050 కోట్లు. గత ఏడాది పూర్తిగా ఎగనామం, రెండేళ్లకు ఇవ్వాల్సింది రూ.26,100 కోట్లు. ఈ ఏడాది రూ.8,745 కోట్లు ఇస్తామని ప్రకటన. ఇది వంచన కాదా?ఎన్నిలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలకు హామీలుఇచ్చి, వాటిని అమలు చేయకుండా ఏడాదికాలంపాటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అరాచకంగా పరిపాలన చేసింది. ఏడాది పాలన తర్వాతకూడా, చేసిన వాగ్దానాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడంలేదు. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తల్లికి వందనం అమలు చేసేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం జారీచేసిన ప్రకటన చూస్తే ప్రజలను ఏరకంగా వంచిస్తున్నారో అర్థం అవుతోంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం, ప్రతిఏటా క్రమం తప్పకుండా అమలవుతుంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపథకాన్ని రద్దుచేసి గత విద్యాసంవత్సరంలో తల్లులకు డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.రాష్ట్రలో మొత్తంగా ఉన్న పిల్లలు 87,41,885, కాని ప్రభుత్వం 67,27,164 మంది మాత్రమే ఇస్తామంటోంది. తీరా ప్రకటించిన డబ్బులు చూస్తే కేవలం 58 లక్షల మందికే. ఇది మోసం కాదా? వంచన కాదా?యూడీఐఎస్ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతినుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంటున్న విద్యార్థులు దాదాపుగా 87,41,885 మంది ఉన్నారు. చంద్రబాబునాయుడుగారు తన మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి రూ.15వేల చొప్పున ఇస్తామన్నారు. దీని ప్రకారం మొత్తంగా ఏడాదికి ఇవ్వాల్సింది రూ.13,050 కోట్లు. గత ఏడాది ఒక్కపైసా ఇవ్వలేదు.గత ఏడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది చెల్లించాల్సింది రూ.26,100 కోట్లు. కాని, ఈ ఏడాది రూ.8,745 కోట్లు మాత్రమే ఇస్తున్నట్టుగా విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ఇస్తే, ఈ డబ్బులు కూడా సంపూర్ణంగా ఇస్తే కేవలం 58లక్షల మందికే సరిపోతాయి. అంటే 29 లక్షల మంది పిల్లలకు ఎగనామం పెడుతున్నట్టేగా?మరోవైపు వైఎస్సార్సీపీ హయాంలో ప్రాంతం, మతం, కులం, పార్టీలు చూడకుండా అందరికీ పథకాన్ని వర్తింప చేస్తే, ఈ ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్థులకు మాత్రమే పథకాన్ని వర్తింపుచేస్తామని విద్యాశాఖమంత్రి చెప్తున్నారు. ఇది చాలా దారుణం. అలా చూసినాసరే ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున రూ.10,090.75 కోట్లు ఇవ్వాలి, కాని రూ.8,745 కోట్లు మాత్రమే ప్రకటించడం చూస్తే ఇది మోసమే అని తేలిపోయింది.ఈ అంకెలు చూస్తే ఏదోరకంగా మభ్యపెట్టేలా ప్రభుత్వ ధోరణి కనిపిస్తోంది. ఇది మహిళలను మోసం చేస్తున్నట్టు కాదా? తల్లులను వంచిస్తున్నట్టు కాదా? తల్లికి వందనం కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న వంచన ఇది’ అని దుయ్యబట్టారు. -
‘డైవర్షన్ పాలిటిక్స్కి మహిళలను పావులుగా వాడుకోవడం సిగ్గుచేటు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం మహిళలను పావులుగా వాడుకోవడం అత్యంత దారుణమని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాపై మహిళలను ఉసికొల్పి దాడులు చేయించే దిగజారుడు రాజకీయాలకు సీఎం చంద్రబాబే పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేయాలనే దుర్మార్గమైన పాలనలో భాగంగానే మహిళలను ముందు పెట్టి కుటిల రాజకీయానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఎమన్నారంటే..ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎక్కడికెళ్లినా ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి చంద్రబాబు, లోకేష్ ఓర్వలేక మహిళలను అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్కి తెగబడ్డారు. వారి దిగజారుడు రాజకీయాలకు మహిళలను పావులుగా వాడుకుంటున్నారు. మహిళల నిరసన పేరిట సాక్షి కార్యాలయాలను టార్గెట్ చేసుకుని గడిచిన మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలకు టీడీపీ కుట్ర చేసింది.మహిళలను ఆర్థికంగా ఆదుకోవడం, రక్షణ కల్పించడం వంటివి చేయకపోగా వారిని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయాలు చేయడం దారుణం. ఏలూరులో సాక్షి కార్యాలయం మీద దాడికి టీడీపీ కుట్ర చేసింది. ముందుగా మహిళా కార్యకర్తలను పంపించి, వారి వెనుక టీడీపీ కార్యకర్తలను పంపించి దాడులు చేయించింది. తిరిగి ఆ నెపం వైయస్సార్సీపీ మీదకు నెట్టాలని చూస్తున్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదుసాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలకు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేయడం సిగ్గుచేటు. చంద్రబాబులా మహిళల గురించి ఏనాడైనా వైఎస్ జగన్ చులకనగా మాట్లాడటం జరిగిందా? కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళల పుట్టుకనే అవమానించేలా మాట్లాడిందే చంద్రబాబు. దానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లూ మహిళలకు అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి పథకాలతో అండగా నిలిస్తే, చంద్రబాబు తన కుట్ర రాజకీయాలకు మహిళలను వాడుకుంటున్నాడు.ఈ ప్రభుత్వంలో మహిళలకు కనీస రక్షణ కూడా లేదు. డైవర్షన్ పాలిటిక్స్తో ఎంతోకాలం ప్రభుత్వాన్ని నడపలేరు. ఇలాంటి కుట్రలు, వక్రీకరణలు ఎంతోకాలం సాగవని గుర్తుంచుకోవాలి. కూటమి మోసపు హామీలు నమ్మి మోసపోయామని ఇప్పటికే మహిళలు ఆందోళనగా ఉన్నారు. పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది కాలంలోనే రూ.1.58 లక్షల కోట్లు అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయింది. మా ఐదేళ్ల పాలనలో చేసిన అప్పుల్లో 44 శాతం అప్పులు ఏడాదిలోనే చంద్రబాబు చేసేశాడు. మహిళలకు రక్షణ కల్పించలేని దుస్థితిలోకి కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఇప్పటికైనా చంద్రబాబు తన కుట్ర రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. -
Ambati: పోలీసుల వేధింపులు తట్టుకోలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు
-
నిరుద్యోగులకు బాబు వెన్నుపోటు.. ఎల్లుండి వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: ఎల్లుండి(జూన్ 13) వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలపాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు వైఎస్సార్సీపీ నిరసన చేపట్టనుంది. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు నిర్ణయించాయి.ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్.. అంటూ ఊదర గొట్టి తీరా అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించని పక్షంలో ప్రతినెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీపై పాలకులు మాట్లాడకపోవడంపై నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు.మరో వైపు, చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. -
వ్యవసాయాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు సర్కార్
-
టీడీపీ ప్రభుత్వంలో రైతులు అలాడి పోతున్నారు..
-
మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు: వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో(పరుచూరు, కొండెపి) ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కవకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో రైతు రాజ్యం నడిచింది. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. మా హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారు. గతేడాది రైతు భరోసా రూ.20 ఎగ్గొట్టారు. మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు మా హయాం.. రైతులకు స్వర్ణయుగంమా ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ప్రతీ రైతుకు అదనంగా రూ.10 వేలు ఇచ్చేవాళ్లం. పారదర్శకంగా ఉచిత బీమా అందించాం. మా హయాంలో రైతుకు వెన్నెముకగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాలు)లు నిలిచాయి. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మార్కెట్లో పోటీ పెరిగి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేది. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. రాష్ట్రం నుంచి అనేక పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుంటే ఆర్బీకే ద్వారా ఇచ్చేవాళ్లం. ఐదెకరాల మిర్చి రైతులకు రూ.4లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాది. మా హయాంలో రైతులకు సువర్ణ యుగం. ఏ రకంగానూ రైతును నష్టపోనివ్వలేదు.కూటమి పాలనలో అధ్వానంకూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. ఈ క్రాప్ వ్యవస్థను నీరుగార్చారు. కూటమి వచ్చాక ఇన్పుట్ సబ్సీడీని గాలికొదిలేశారు. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. 2023-24లో కేజీ పొగాకు రూ.366కి అమ్ముడుపోయేది. ఇప్పుడు రూ.240 కూడా అమ్ముడుపోవడం లేదు. క్వింటా పొగాకు రూ.24 వేలు తగ్గకుండా రైతు అమ్ముకున్నాడు. 220 మిలియన్ టన్నులు ప్రొక్యూర్ చేయాల్సి ఉంటే.. కేవలం 40 మిలియన్ టన్నులే ప్రొక్యూర్ చేశారు. హైగ్రేడ్ పొగాకుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పొగాకు బ్లాక్ బర్లీ రైతు ఎకరాకు రూ.80వేలు నష్టపోతున్నాడు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపం. మా హయాంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించాం. మార్క్ఫెడ్ రావడంతో మార్కెట్లో పోటీ పెరిగింది. మీరెందుకు ఆ పని చేయలేదు?. అసలు ప్రభుత్వం ఎందుకు మార్క్ఫెడ్ వేలంలో పాల్గొనలేదు. బాబు, దళారుల మధ్య సంబంధాలతో రైతులు నష్టపోతున్నారు. చంద్రబాబుకు జగన్ హెచ్చరికవ్యవసాయం దండగ అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోంది. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం జగన్ హెచ్చరికలు జారీ చేశారు. -
జగన్ రాకతో దిగొచ్చిన కూటమి..
-
చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ అప్పు చేసిన కూటమి ప్రభుత్వం
-
జైలుకు పంపాక కూడా కొమ్మినేనిపై మరో కుట్ర..
-
చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ లకు చురకలంటించిన వైఎస్ జగన్
-
ఏడాది కూటమి పాలనతో ఏపీలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం. పాఠశాలల్లో అటకెక్కిన నాడు-నేడు అభివృద్ధి పనులు. అమ్మ ఒడికి వీడ్కోలు.. ఇంగ్లిష్ మీడియంకు మంగళం
-
వారం వ్యవధిలోనే రూ.14 వేల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: కేవలం వారం వ్యవధిలోనే చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.14 వేల కోట్లు అప్పు చేసింది. గత మంగళవారం (3వ తేదీన) రూ.7,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కారు.. తాజాగా ఈ మంగళవారం మరో రూ.7,000 కోట్లు అప్పు చేసింది. 6.65 శాతం నుంచి 7.8 శాతం వడ్డీకి ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తం అప్పును ఆర్బీఐ సమీకరించింది. మంగళవారం చేసిన అప్పుతో ఏడాది పాలనలోనే చంద్రబాబు సర్కారు రాష్ట్ర ప్రజలపై రూ. 1,58,604 కోట్ల అప్పుల భారం మోపింది.ఇందులో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.1,08,194 కోట్లకు చేరగా.. బడ్జెట్ బయట అప్పులు మరో రూ.50,410 కోట్లకు చేరాయి. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో రూ.19,410 కోట్లు అప్పు చేశారు. ఇదికాకుండా రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ, హడ్కో నుంచి రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. రాజధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గనులపైనా అప్పులు గనుల శాఖ (ఏపీఎండీ)కు చెందిన 436 మైనర్ లీజుల విలువ రూ.1,91,000 కోట్లుగా చూపించి తద్వారా ప్రైవేట్ బాండ్లు జారీ ద్వారా రూ.9,000 కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే రూ.3,489 కోట్ల విలువైన బాండ్ల జారీ ద్వారా అప్పు చేసింది. మిగతా మొత్తాన్ని కూడా బాండ్ల జారీ ద్వారా సేకరించనుంది. ఏడాదిలోనే ఇంత పెద్దఎత్తున అప్పులు చేసిన ప్రభుత్వాలు గతంలో లేవు. చంద్రబాబు ప్రభుత్వానికే ఆ ఘనత దక్కింది. అయినా.. సూపర్ సిక్స్ పథకాలకు డబ్బుల్లేవట అప్పులు చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. అయినప్పటికీ సూపర్ సిక్స్తో పాటు ఇతర హామీలను అమలు చేయడం లేదు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే అప్పులు చేయకుండానే సంపద సృష్టించి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా మంగళవారం, మంగళవారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారు. మొత్తంగా ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా చేసిందంటే.. భారీగా అప్పులు చేయడం తప్ప ఏమీ లేదని స్పష్టమవుతోంది. -
వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేది?
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను ఎత్తిచూపుతూ.. మహిళలపై గతంలో చంద్రబాబు, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, లోకేశ్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోలను జత చేస్తూ.. వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేదంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహిళల గౌరవం కాపాడటం’ అనే ముసుగులో కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై చేస్తున్న దాడులను, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టును ఖండిస్తూ ‘ఎక్స్’లో మంగళవారం ఆయన పోస్టు చేశారు. అందులో ఏం చెప్పారంటే.. అది రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్టు‘పారదర్శకత, అవినీతి రహిత, న్యాయబద్ధమైన, విప్లవాత్మక సంక్షేమ పథకాలతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా పాలన చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలన మోసాలతోనే కొనసాగింది. రెడ్ బుక్తో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ నిరంకుశ పాలన సాగుతోంది. తన గొప్ప వాగ్దానాలను అమలు చేయలేని అసమర్థతతో ప్రజలను మోసగించిన చంద్రబాబు.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. ప్రజల దృష్టి మళ్లించేందుకు అలజడి సృష్టిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎప్పుడూ చేయని వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించి తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించారు. ఇది చట్టబద్ధంగా జరిగిన అరెస్టు కాదు. రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్టు. ఆయన చర్చను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారు.ఆయన చేయని వ్యాఖ్యలను చంద్రబాబు ప్రభుత్వం వక్రీకరించి కొమ్మినేనిని బాధ్యులుగా చేయడం ఎంత అన్యాయం? వాస్తవాలను వక్రీకరించి ఒక పథకం ప్రకారం మహిళల గౌరవాన్ని కాపాడటం అనే ముసుగులో సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ చంద్రబాబు, అమ్మాయి కన్పిస్తే వెళ్లి ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి.. అంటూ బాలకృష్ణ అన్న మాటలు.. అమ్మాయిలతో లోకేశ్ నృత్యం చేస్తున్న వీడియోలు.. వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడతామని చెప్పేది? ఈ వీడియోలు వారి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. మహిళల పట్ల వారికి ఉన్న గౌరవాన్ని, విలువను చాటిచెబుతున్నాయి. హామీ ఇచ్చిన భద్రత ఇదేనా? రాష్ట్రంలో ఏడాదిలోనే 188 అత్యాచారాలు, 15 అత్యాచార హత్యలు జరగడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థినిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని అడవిలో పడేశారు. ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికను టీడీపీకి చెందిన 14 మంది ఆరు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె గర్భవతి అయింది. తీవ్రమైన రాజకీయ ఒత్తిడి, పోలీసుల నిష్క్రియాపరత్వాల మధ్య ఆ బాధితురాలి కుటుంబం అదృశ్యమైంది. మహిళలకు వారు హామీ ఇచ్చిన భద్రత ఇదేనా? వారు కాపాడిన గౌరవం ఇదేనా? మహిళల పట్ల వారి చర్యలు, వైఖరి రెండూ అవమానకరంగా ఉన్నాయి. మహిళల గౌరవం కాపాడటం ముసుగులో కూటమి నేతలు పగ పెంచుకున్న వారిపై కేసులు నమోదు చేయడం అసహ్యకరం. -
మళ్ళీ మంగళవారం.. మరో 7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి,విజయవాడ: మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చింది.దీంతో అప్పుల ప్రభుత్వంగా సరికొత్త చెత్త రికార్డ్లను నమోదు చేసింది. తాజాగా, చంద్రబాబు ప్రభుత్వం మరో రూ. 7 వేల కోట్లు అప్పు చేసింది. దీంతో చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ అప్పు చేసిన ప్రభుత్వంగా నిలిచింది. వారం రోజుల్లోనే రూ.14 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం.. మంగళవారం (ఈరోజు) అప్పు రూ.7 వేల కోట్లు అప్పు తెచ్చింది.రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా అప్పును సమీకరించింది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్షా 58 వేల కోట్ల అప్పు చేసింది. సంపద సృష్టిలో తిరోగమనం.. అప్పుల సృష్టిలో రికార్డ్లు సృష్టించడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తిరగబడ్డ ఆడబిడ్డ.. కూటమి విఫల పాలనపై ఆగ్రహజ్వాలలు (చిత్రాలు)
-
వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేది?: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఏడాది కూటమి పాలనలో ఏపీలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా.. మహిళల గౌరవం పేరిట కూటమి నేతలు సాక్షి ఆఫీసులపై చేస్తున్న దాడులను, కొమ్మినేని అరెస్ట్ తదితర అంశాలను ఖండిస్తూ.. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్లకు ఆయన చురకలంటించారు.పారదర్శక, అవినీతి రహిత, న్యాయబద్ధమైన, అధికారులకు స్వేచ్ఛ.. అన్నింటికి మించి సంక్షేమ పథకాలతో సమర్థవంతంగా గత వైఎస్సార్సీపీ పాలన కొనసాగింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలన మోసాలతోనే గడిచిపోయింది. ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోగా.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, జనాల దృష్టి మరలించేందుకు అలజడి సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎలాంటి వ్యాఖ్యలు చేయని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఇది చట్టబద్ధంగా జరిగిన అరెస్ట్ కాదు.. రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్ట్... వాస్తవాలను వక్రీకరించి ఒక పథకం ప్రకారం సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. మహిళల గౌరవాన్ని రక్షిస్తున్నామన్న నినాదం వెనుక ఈ ప్రభుత్వ లక్ష్యం ఒక్కడే.. సొంత ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించడం!. అలాంటప్పుడు ఇది నిజమైన మహిళా గౌరవ రక్షణా?. ఈ ఘటనలు వారి అసలైన వైఖరిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజల ముందు ఒక ప్రచారాన్ని నిర్మించుకుంటూ.. నిజమైన విలువలను మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నారని కింద వీడియోలు వెల్లడిస్తున్నాయి..కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?: చంద్రబాబుఅమ్మాయిల వెంటపడమంటే ఊరుకుంటారా నా ఫ్యాన్స్. ఏమయ్యా.. ఊరుకోరు కదా. ఎళ్లి ముద్దైనా పెట్టాలి.. లేదా కడుపైనా చేసేయాలి అంతే.. అంతే కమిట్ అయిపోవాలి. ఏదో ఒకటి: నందమూరి బాలకృష్ణవిదేశీ యువతులతో డ్యాన్సులు వేస్తూ.. ఎంజాయ్ చేస్తున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్Previous government under YSRCP, notable for its efficiency, transparency, corruption-free administration, justice-driven approach, and groundbreaking welfare programmes, has been deceitfully replaced by @ncbn’s government which is seemingly a chaotic, authoritarian regime driven… pic.twitter.com/KpZbRPB6BW— YS Jagan Mohan Reddy (@ysjagan) June 10, 2025 ఏడాది కాలంలో 188 రేపులు, 15 హత్యాచారాలు ఇదేనా మహిళలకు రక్షణ కల్పించడం అంటే?. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిమండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై టీడీపీ నేతలే అత్యాచారానికి పాల్పడడం.. లాంటి ఘటనలు తాజా నిదర్శనాలు. ఇదేనా వాళ్లు ప్రజలకు ఇచ్చిన హామీ?. ఇదేనా వాళ్లు కాపాడుతున్న మహిళా గౌరవం?.. వాళ్ల చేతలు, మాటలు.. పొంతన లేకుండా పోతోంది. మహిళల పట్ల వీరి వైఖరి సిగ్గుచేటు. మహిళల గౌరవాన్ని రక్షిస్తున్నామన్న వంకతో కక్షసాధింపు చర్యలు తీసుకోవడం అత్యంత దారుణమైన చర్య’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
కూటమి సర్కార్ భారీ కుట్ర.. కొమ్మినేనిపై మరిన్ని కేసులు!
సాక్షి, విజయవాడ: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్(Kommineni Srinivasa Rao) పై కక్ష సాధించడం కోసం కూటమి ప్రభుత్వం అడ్డదారులను ఎంచుకుంటోంది. టీవీ డిబేట్లో తన జోక్యం, ప్రమేయం లేకుండా జరిగిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేయించి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు కక్ష చల్లారనట్లుంది!. అందుకే టీడీపీ నేతల(TDP Leaders)తో మరిన్ని కేసులు పెట్టిస్తున్నారు. తుళ్లూరు పీఎస్ కేసులో ఆయన సోమవారం అరెస్టు కాగా.. ఇవాళ మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు కొమ్మినేని విషయంలో ఒకే అంశంపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయి. విజయవాడ సత్యనారాయణ పురం, పడమట పీఎస్, సాలూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతల ఫిర్యాదులతో కొమ్మినేనిపై కేసులు నమోదయ్యాయి. అయితే..ఇప్పటికే కొమ్మినేనిపై దాఖలు చేసిన సెక్షన్ల విషయంలో మంగళగిరి కోర్టు(Mangalagiri Court) ఇవాళ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తూ.. ఆ సెక్షన్లను కొట్టేసింది. ఈ తరుణంలో ఆయనపై కేసు వీగిపోతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఒకవేళ ఈ కేసులో గనుక ఆయనకు బెయిల్ లభిస్తే.. మళ్లీ ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందన్న విషయం తాజా కేసులతో స్పష్టమవుతోంది. గతంలో పోసాని విషయంలోనూ ఇలాగే జరిగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్లపై అనుచిత పోస్టులు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కూటమి నేతలతో కేసులు పెట్టించారు. దీంతో ఆయన్ని పీటీ వారెంట్ కింద వివిధ జైళ్లకు తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే.కొమ్మినేనిపై మరో మూడు కేసులు ఎక్కడ?.. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఎవరు?.. టీడీపీ నాయకురాలు గుమ్మిడి సంధ్యా రాణిఏయే సెక్షన్లు?.. 79BNS,67A ITA-2000-2008,75(3) BNS సెక్షన్ల కింద కేఎస్సార్పై కేసుఎక్కడ?.. విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పెట్టింది ఎవరు?.. సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలుఏయే సెక్షన్లు?.. 196(1),352,353(1)(a),353(1)(b),61(2), r/w 3(5)BNS, 67A ITA 2000-2008 సెక్షన్ల కింద కొమ్మినేనిపై కేసుఎక్కడ?.. విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్లో పెట్టింది ఎవరు?.. ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఏయే సెక్షన్లు?.. 196(1),352,353(1),353(3)b, 61(2),r/w 3(5) BNS, 67A ITA2000-2008 సెక్షన్ల కింద కేఎస్సార్పై కేసు నమోదు -
చంద్రబాబు సర్కార్ పై మహిళల ఆగ్రహం
-
పత్రికా స్వేచ్ఛపై పైశాచికత్వం... ఆంధ్రప్రదేశ్లో ‘సాక్షి’ మీడియా సంస్థ కార్యాలయాలపై టీడీపీ కూటమి నేతల దాడులు... కార్యకర్తలు, రౌడీగ్యాంగ్లతో కలిసి బీభత్సం
-
‘కొమ్మినేని’ అరెస్ట్.. అరాచకాలకు పరాకాష్ట
సాక్షి, అమరావతి: సాక్షిటీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఒక పథకం ప్రకారం మూడు రోజులుగా చేస్తున్న కృత్రిమ ఆందోళనలకు పరాకాష్ట సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. వ్యాఖ్యలపై దుష్ప్రచారం సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి టీవీలో నిర్వహించిన డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ అన్న మాటలను ప్రణాళిక ప్రకారం వివాదం చేయాలనుకున్న టీడీపీ, కృష్ణంరాజు అమరావతి గురించి తప్పుగా వ్యాఖ్యలు చేశారనే దు్రష్పచారాన్ని చేపట్టింది. సీఎం చంద్రబాబు తన ట్వీట్లో కృష్ణంరాజు వీడియోను పోస్ట్ చేసి తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగానే టీడీపీ, ఎల్లో మీడియా అదేపనిగా రాద్ధాంతం చేశాయి.కృష్ణంరాజు క్షమాపణ చెప్పినా.. తన వ్యాఖ్యలపై కృష్ణంరాజు క్షమాపణలు చెప్పారు. టీవీ డిబేట్లలో ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా అది వారి వ్యక్తిగతమే. వాటిని టీవీ చానల్కుగానీ, ఆ కార్యక్రమ ప్రజెంటర్కుగానీ ఆపాదించడం తగదు. టీడీపీ అనుకూల చానల్స్లో వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నేతల వ్యక్తిత్వాలను హననం చేస్తూ వందలకొద్ది డిబేట్లు జరిగాయి. అధికారంలో ఉన్నప్పుడూ వైఎస్సార్సీపీ ఇలాంటి డిబేట్లను పట్టించుకోలేదు. ఏ టీవీపైనా, పేపర్పైనా కక్షపూరితంగా వ్యవహరించలేదు. అసమర్థ పాలకులే ఇలాంటి అంశాలతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడతారు. ప్రణాళిక ప్రకారం వ్యక్తిగత దాడిసాక్షి టీవీ డిబేట్ను ప్రణాళిక ప్రకారం వివాదం చేసిన టీడీపీ.. వైఎస్ జగన్, వైఎస్ భారతిపై వ్యక్తిగత దాడి ప్రారంభించింది. జర్నలిస్టు వ్యాఖ్యలను సమర్థించలేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని సాక్షి టీవీ చాలా స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ కూడా జర్నలిస్టు వ్యాఖ్యలను ఖండించింది. కొమ్మినేనీ క్షమాపణలు చెప్పారు. అయినా చంద్రబాబు కనుసన్నల్లోనే టీడీపీ సాక్షిటీవీ కార్యాలయాలపై దాడులకు తెగబడుతోంది. పరోక్షంగా అమరావతి పరువును టీడీపీనే బజారుకీడ్చింది. కొమ్మినేనిని గతంలోనూ ఎన్టీవీ ఉద్యోగం నుంచి చంద్రబాబు తొలగింపజేశారు. చంద్రబాబును పొగిడితేనే జర్నలిస్టులకు మనుగడ ఉంటుందనే సందేశం ఇస్తున్నారు. దీనిపై ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు, ప్రజాసంఘాలు గళమెత్తాలి. హామీలు నెరవేర్చే వరకూ నిరసన గళంఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ కూటమి ప్రభుత్వంపై నిరసన గళమెత్తుతూనే ఉంటామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం యువజన విభాగం రాష్ట్ర కమిటీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.క్రియాశీల పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి పాల్గొన్నారు. -
పాలనలో ఫెయిల్.. అందుకే ఈ డైవర్షన్
సాక్షి, అమరావతి: మహిళలు అంటే ఏమాత్రం గౌరవంలేని చంద్రబాబు, టీడీపీ నేతలు ఒక్కసారిగా నక్కజిత్తులతో సూక్తి ముక్తావళి వల్లిస్తుండటం తాజా రాజకీయ వైచిత్రి. తమ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుయుక్తిలో భాగంగానే ఈ పన్నాగానికి తెరతీశారు. అసలు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, బావమరిది బాలకృష్ణతో సహా ఆ పార్టీ నేతలు ఏనాడూ మహిళలకు తగిన గౌరవం ఇవ్వలేదనన్నది బహిరంగ రహస్యం. 2014–2019 మధ్య చంద్రబాబు సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ స్వయంగా వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైన తీరు అందరికీ గుర్తింది. ‘కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దంటుందా’ అని ఆయన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. తద్వారా కుమార్తెలను తక్కువ చేసి అవమానించారు. స్త్రీ పురుష సమానత్వం కోసం అందరికీ ఆదర్శవంతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారు. ఇక చంద్రబాబు బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తాను తన బావకంటే నాలుగాకులు ఎక్కువే చదివానన్నట్టుగా వ్యవహరించారు. ‘ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి’ అని ఓ సినిమా వేడుకలో వేదిక ఎక్కి మరీ అత్యంత జుగుప్సాకరంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ అటు తండ్రినీ ఇటు మామనూ మించిపోయారు. విదేశాల్లో ఆయన పలువురు యువతులతో స్విమ్మింగ్ పూల్లో సాగించిన వ్యవహారాలు ఫొటోలు, వీడియోలతో సహా వెలుగులోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. పైగా బాలకృష్ణ ఓ చానల్ కోసం నిర్వహించే రియాల్టీ షోలో పాల్గొన్న చంద్రబాబు తన కుమారుడి బాగోతాన్ని వెనకేసుకువచ్చారు. బాలకృష్ణ కూడా లోకేశ్కే వంతపాడారు. ప్రస్తుతం హోమ్ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గతంలో టీడీపీ సభల్లో ప్రసంగిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి గురించి అసభ్యకరంగా వ్యాఖ్యానించారు. ఓ మహిళ, అందులోనూ ప్రజాప్రతినిధిగా చేసిన ఆమె సాటి మహిళలను పత్రికల్లో రాయలేని భాషతో అసభ్యకరంగా మాట్లాడటం విభ్రాంతి కలిగించింది. అదే టీడీపీ సంస్కృతి అని ఆ పార్టీ వర్గాలు ఘనంగా చెప్పుకోవడం మరింత విస్మయానికి గురి చేసింది. అటువంటి చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్, అనిత ప్రస్తుతం ఒక్కసారిగా మహిళలపై లేని ఆపేక్షను చూపిస్తూ కొంగజపం చేస్తుండటం టీడీపీ కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనం.» టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ మహిళా తహశీల్దార్ జట్టు పట్టుకుని మరీ ఈడ్చుకొచ్చి దాడి చేశారు. అయినా సరే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఎమ్మెల్యే చింతమనేని అరచకానికి అండగా నిలిచారు. తహశీల్దార్ వనజాక్షిని బెదిరించి మరీ పంచాయతీ చేశారు.» 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు రాష్ట్రాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయినా సరే ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు.. వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం కోసం మాత్రం రోజుకో డ్రామాకు తెరతీస్తున్నారు.నివేదికలను ప్రస్తావించి.. మహిళలను కించపరిచిన ఈటీవీ..సాక్షి టీవీ చానల్ చర్చా గోష్టిలో ఆ టీవీ ప్రతినిధులు ఎవరూ మహిళలను కించపరిచేలా మాట్లాడనే లేదు. ఓ స్వతంత్ర విశ్లేషకుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల పత్రిక ప్రచురించిన నివేదికను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను వారించారు. సాక్షి టీవీ యాజమాన్యం వెంటనే స్పందించి ఆ స్వతంత్ర విశ్లేషకుడి వ్యాఖ్యలతో తమకే మాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ కూడా ఆయన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయినా సరే వక్రీకరిస్తూ సాక్షి టీవీ యాజమాన్యం, కొమ్మినేని శ్రీనివాసరావుపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పలువురు పరిశీలకులు గతంలో ఈటీవీ ప్రసారం చేసిన ఓ వార్తా కథనాన్ని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యభిచారం, ఎయిడ్స్ వ్యాప్తిపై ఓ నివేదిక వెల్లడించిందంటూ ఈటీవీ ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. యావత్ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా కథనాన్ని ప్రసారం చేయడం గమనార్హం. ఎవరో స్వతంత్ర విశ్లేషకుడు చెప్పింది కాదు.. ఈటీవీ స్వయంగా రూపొందించిన వార్తా కథనంగా ప్రసారం చేసింది. అసలు రాష్ట్రంలో మహిళలను కించపరిచేలా ఏదైనా చానల్ వార్త కథనాన్ని ప్రసారం చేసిందంటే అది ఈటీవీ మాత్రమేనని పరిశీకులు స్పష్టం చేస్తున్నారు. ఈటీవీ ప్రసారం చేసిన ఆ వార్తా కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటువంటి దిగజారుడు పాత్రికేయం చంద్రబాబుకు ఇంపుగా కనిపిస్తుంది. ఎందుకంటే అది తన రాజగురువు రామోజీ కుటుంబం నిర్వహిస్తున్న చానల్. కానీ ఎవర్నీ కించపరచకుండా, గౌరవమైన రీతిలో చార్చా గోష్టి నిర్వహించే సాక్షి టీవీపై మాత్రం అక్రమ కేసు నమోదు చేయడం టీడీపీ మార్కు కుతంత్రం.బాబు గుండెల్లో రైళ్లు» పతిపక్ష వైఎస్సార్సీపీ ఈ నెల 4న నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడంతో ప్రభుత్వ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీ కూటమి ప్రభుత్వ పుట్టి మునగడం ఖాయమని చంద్రబాబు గుర్తించారు. » డైవర్షన్ రాజకీయాల కోసం కాచుకుని ఉన్న చంద్రబాబు ఈ నెల 6న సాక్షి టీవీ నిర్వహించిన చర్చా గోష్టిని వక్రీకరిస్తూ కుట్రకు తెరతీశారు. సాక్షి టీవీలో చర్చా గోష్టి ముగిసిన 24 గంటల తర్వాత ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రానికి తెరతీశారు. బాబు ఆదేశాలతో టీడీపీ సోషల్ మీడియా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీకి, వైఎస్సార్సీపీకి ఆపాదిస్తూ టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని వైరల్ చేసింది. టీడీపీ అనుకూల టీవీ చానళ్లు ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి, టీవీ 5 తదితర చానళ్ల ద్వారా వైఎస్సార్సీపీపై విష ప్రచారానికి పాల్పడ్డారు. » చంద్రబాబు కుట్రలో భాగంగా మంత్రి లోకేశ్ తెరపైకి వచ్చారు. సాక్షి టీవీ, వైఎస్సార్సీపీపై నిరాధార ఆరోపణలు చేశారు. ఆ వెంటనే టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనల పేరుతో గూండాగిరీకి పాల్పడ్డాయి. చర్చా గోష్టిలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో తమకే మాత్రం సంబంధం లేదని సాక్షి టీవీ యాజమాన్యం ఖండించింది. వాస్తవానికి అంతటితో ఆ అంశం ముగిసిపోయినట్టే. కానీ చంద్రబాబు కుట్ర మరోలా ఉంది.» జూన్ 8 (ఆదివారం) కూడా ఈ అంశంపై రాద్ధాంతం కొనసాగేలా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్వయంగా ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో కామెంట్ పోస్టు చేశారు. ఫలితంగా అక్రమ కేసులు, సాక్షిపై దాడులు కొనసాగాయి. -
AP: పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి
నాణేనికి మరోవైపు కోణాన్ని నిర్భయంగా చూపుతున్న తెలుగు ప్రజల మనస్సాక్షి.. ‘సాక్షి’పై ముష్కర మూకలు దాడులకు తెగబడ్డాయి.. అదును కోసం నక్కిన గుంటనక్కలు లేగదూడపై ఆవురావురుమంటూ విరుచుకుపడిన చందంగా ఒక్కసారిగా సాక్షి కార్యాలయాలపై ఈ పచ్చమూకలు విరుచుకుపడ్డాయి.. గేట్లపై రాళ్లు, కోడిగుడ్లు విసిరి, బోర్డులను విరగ్గొట్టి, పేపర్లను తగులబెట్టి వికృతానాందాన్ని ఆస్వాదించాయి. ప్రజల వాణిగా.. వాస్తవాల వారధిగా సాక్షి నిలవడం నచ్చని ఉన్మాదులు ఈ దాడిలో అత్యుత్సాహం చూపడం ఆశ్చర్యపరచకపోయినా.. నచ్చని మాట అన్నారంటూ ఆగ్రహించిన అతివలు అత్యంత లాఘవంగా గేట్ల పైకెక్కడం చూసి జనం ముక్కున వేలేసుకున్నారు.. మహిళలను గౌరవించడంలో ముందుండే సాక్షి మీడియా వివాదానికి కారణమైన విశ్లేషకుడి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.. వాటిని సాక్షికి ఆపాదించవద్దని కోరింది. అయినా దీనిని ఓ అవకాశంగా మార్చుకోవాలన్న దుగ్ధతో, రాజకీయ కుట్రతో శ్రేణులను ఎగదోస్తూ దాడులకు ప్రేరేపించారు. సాక్షి కార్యాలయాలపై విధ్వంసానికి పురికొల్పారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సాగించిన ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామికవాదులు, పత్రికా స్వేచ్ఛను కాంక్షించే ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు. గత ఎన్నికల్లో గుప్పించిన సూపర్ సిక్స్ హామీలను ఏడాదైనా ఒక్కటీ నెరవేర్చలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలి‘ట్రిక్స్’ చేస్తోంది. అందులో భాగంగానే అడ్డగోలుగా అక్రమ అరెస్టులు, అనవసర రాద్ధాంతాలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు ఉసిగొలిపింది. తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా రాళ్లు రువ్వుతూ, కోడిగుడ్లు విసురుతూ రెచ్చిపోయారు. ‘సాక్షి’ యూనిట్ కార్యాలయాల వద్ద నేమ్ బోర్డులను పెకిలించేశారు. ‘సాక్షి’ పత్రిక ప్రతులతో పాటు, ‘సాక్షి’ నేమ్ బోర్డులను తగులబెట్టారు. బయటి వ్యక్తి వ్యాఖ్యలతో సంబంధంలేదని ‘సాక్షి’ చెప్పినప్పటికీ రెచ్చిపోయిన టీడీపీ మూకలు నానా బీభత్సం సృష్టిస్తూ, ‘సాక్షి’ సిబ్బందిని భయాందోళనలకు గురిచేశారు. విజయవాడలో ‘సాక్షి’ ఏపీ ప్రధాన కార్యాలయంపై దాడిఈ దాడుల్లో భాగంగా.. విజయవాడ ఆటోనగర్లో ఉన్న ‘సాక్షి’ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపైనా పచ్చమూకలు విరుచుకుపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు భార్య అనురాధ, ఆయన కొడుకు గద్దె క్రాంతికుమార్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్, పొట్లూరి సాయిబాబు, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు, అల్లరిమూకలు ఉ.11 గంటలకు ‘సాక్షి’ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని గేటు ముందు బైఠాయించారు. ‘సాక్షి’ పత్రికకు, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడితో సరిపెట్టకుండా, కొందరు అత్యుత్సాహంతో కార్యాలయం గేటుపైకెక్కి లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. కార్యాలయంలోకి వెళ్లి విధ్వంసం చేయాలని శతధా ప్రయత్నించారు. అది సాధ్యంకాక గుడ్లు, రాళ్లు తెచ్చి కార్యాలయంపైకి విసిరారు. దీంతో అక్కడ రక్షణ కల్పిస్తున్న పోలీసులకు అవి తగిలాయి. మహిళా పోలీసులపై కోడిగుడ్లు పడ్డాయి. అప్పటికీ శాంతించని కూటమి నేతలు ‘సాక్షి’ నేమ్ బోర్డును తొలగించి, కొంత భాగాన్ని మురుగుకాలువలో పడేశారు. మిగతా భాగాన్ని గేటు ముందుకు తెచ్చి కాళ్లతో తొక్కారు. పత్రిక ప్రతులతో పాటు నేమ్ బోర్డుకు నిప్పుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు ఈ విధ్వంసకాండ కొనసాగింది. ఆ సమయంలో విధుల్లోకి వెళ్లాల్సిన ‘సాక్షి’ సిబ్బంది రోడ్డుపైనే మండుటెండలో ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. కూటమి నేతల దుశ్చర్యలకు ఆటోనగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనచోదకులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతిలో టీడీపీ నాయకులు సోమవారం పోలీస్ చట్టం సెక్షన్–30ని ఉల్లంఘించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఎల్లోగ్యాంగ్ అరాచకం ఇలా..» శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ‘సాక్షి’ కార్యాలయం ఆస్తులను టీడీపీ మూకలు నిరసనకారుల ముసుగులో ధ్వంసం చేశాయి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు బావ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు తదితరులు సుమారు మూడు గంటలపాటు విధ్వంసకాండకు పాల్పడ్డారు. కార్యాలయం నేమ్ బోర్డును పీకేసి తగలబెట్టారు. కార్యాలయంలోకి, ప్రహరీపై పేడ విసిరారు. ప్రహరీపై నుంచి లోపలికి దూకి కార్యాలయం లోపల గలాటా సృష్టించారు. గేటుకున్న తాళాన్ని సైతం పీకేశారు. కార్యాలయం ఎదుట రెండు టెంట్లు వేసి ధర్నా చేశారు. » విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ‘సాక్షి’ యూనిట్ కార్యాలయాల వద్ద టీడీపీ, జనసేన శ్రేణులు ఆందోళన నిర్వహించారు. » ఏలూరులోని ‘సాక్షి’ జిల్లా కార్యాలయంపైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు యత్నించారు. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో రభస సృష్టించారు. » గుంటూరు జిల్లా ఆత్మకూరులోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి జేఏసీ పేరుతో అమరావతి రైతులు, మహిళలు ధర్నా చేశారు. పలుమార్లు సాక్షి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. గేట్లు ఎక్కి రాళ్లు రువ్వారు. రాజధాని జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష, మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్య, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్, తాడికొండ మార్కెట్ యార్డ్ మాజీచైర్మన్, టీడీపీ నాయకులు బెల్లంకొండ నరసింహారావు, తాడేపల్లి టీడీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు అన్నె కుసుమ, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. గుంటూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట సాక్షి కార్యాలయాల ముందు కూడా ఆందోళన చేశారు. » నెల్లూరు, కర్నూలు, కడప, రేణిగుంటలోని సాక్షి యూనిట్ కార్యాలయాలపైనా టీడీపీ మూకలు కొందరు రౌడీలతో కలిసి దాడికి తెగబడ్డాయి. -
నేనంటే చంద్రబాబుకు పగ.. అందుకే కక్ష సాధింపు
సాక్షి, హైదరాబాద్: తన అరెస్టుపై సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ‘నేను సీనియర్ సిటిజన్ని ఎలా అరెస్టు చేస్తారు? సెర్చ్ వారెంట్ కూడా ఇవ్వలేదు. 70 ఏళ్ల వయసులో నాపైన ప్రభుత్వానికి ఇంత కక్ష దేనికి? కక్ష గట్టి చేస్తున్నారు. నా వల్ల ఎవరికి నష్టం కలిగిందో, ఇబ్బంది కలిగిందో చెప్పడం లేదు. పోలీసులు రూల్స్ పాటించకుండా ఐడీ కార్డులు చూపి తుళ్లూరు తీసుకువెళ్తామని చెప్పారు. ఇంటిలో పైకి వెళ్లి మందులు తెచ్చుకోవడానికి కూడా పోలీసులు ఒప్పులేదు. ఫిర్యాదు ఎవరు ఇచ్చారో చెప్పకుండా కావాలనే నాపై కక్ష గట్టి చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితేంటి? కేసు ఎవరు పెట్టారో చెప్పడం లేదు. సాక్షిలో నా డిబేట్లు రాకుండా చేయాలని చూస్తున్నారేమో. ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ వినిపించకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. జర్నలిస్టులను కూడా వదిలిపెట్టడం లేదు. రెడ్ బుక్లో ఇది కూడా భాగమేమో. గతంలో ఒక టీవీ చానెల్లో నేను పనిచేస్తున్నప్పుడు అమరావతి భూములపై నేను డిబేట్ చేస్తే యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి నన్ను తొలగించేలా చేశారు. అప్పటి నుంచి నాపై చంద్రబాబుకు కోపం ఉంది. ఆ తర్వాత నాకు వైఎస్ జగన్ సాక్షిలో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏ అవకాశం లేకపోయినా కావాలని నాపై పోలీసులు దొంగ కేసు పెట్టారు. నేను అనని విషయంపైన కేసు పెట్టడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అమరావతి మహిళలను ఎవరూ ఏమీ అనలేదు. కావాలని రెచ్చగొట్టి చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్కు కోపం వస్తే ఎవరైనా జైలుపాలు కావాల్సిందే’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో సోమవారం ఉదయం సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్టు చేయడంపై వైఎస్ జగన్ స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ పోస్టు చేశారు. అనని మాటలను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదిస్తూ, వాటిని వక్రీకరించి విషప్రచారం చేసి, ఆయనను అరెస్టు చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా ఒక పథకం ప్రకారం సాక్షి యూనిట్ కార్యాలయాలపైన దాడులు చేయించారని ధ్వజమెత్తారు. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా? అని మీరు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని మీ బావమరిది గతంలో అన్న మాటలు చూస్తే.. మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తోందని వైఎస్ జగన్ దునుమాడారు. ఇంకా ఈ పోస్టులో ఆయన ఏం తెలిపారంటే..» ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాదిగా తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టుచేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.» సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్కు ఏం సంబంధం? కొందరు అనుకూలంగానూ, మరికొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడంలేదా?» ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేనివాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014–19 మధ్య ఆ ఛానల్పై (గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.» చంద్రబాబూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగాలపై ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి.» చంద్రబాబూ.. రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ఏడాది పాలనలో మహిళలు, బాలికల పట్ల మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుకునే తమ కూతురు తన్మయి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి దారుణంగా హత్యకు గురై శవమై కనిపించింది. కనిపెట్టడానికి మీకు, మీ యంత్రాంగానికి చేతకాలేదు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో 9వ తరగతి విద్యార్థినిపై 6 నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 14 మంది అత్యాచారం చేస్తే, బాధితురాలు ఫిర్యాదు చేయనీయకుండా భయపెట్టారు. నేరం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం మీకు చేతకాలేదు. కొందరు చేస్తున్న అఘాయిత్యాలకు స్కూలుకు వెళ్తున్న బాలికలు గర్భం దాలుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మీ పాలన మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు, బాలికలు అత్యాచారాలకు గురైతే, 15 మందిని రేప్ చేసి చంపేశారు. వందలకొద్దీ మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, వేదింపులకు పాల్పడ్డారు. మీ ట్రాక్ రికార్డు ఇంత ఘోరంగా ఉంది.» చంద్రబాబూ.. మీరు వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయాయి, నిర్వీర్యం అయిపోయాయి. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. అధికారంకోసం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, తీరా సీట్లోకి వచ్చాక వారికి నిలువెల్లా వెన్నుపోటు పొడిచి, ఏడాది పాలన తర్వాత ప్రజలముందు దోషిగా నిలబడ్డారు. పాలనలో చతికిలపడ్డ, అసమర్థ, అవినీతి, అరాచక ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతో తప్పుడు ప్రచారం చేయించి, కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎంతోకాలం చెల్లవు చంద్రబాబూ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘చంద్రబాబు.. ఎల్లకాలం మీ ఆటలు సాగవు’
తిరుపతి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడాన్ని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఖండించారు. ఆయన ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా క్షమాపణలు చెప్పడం జరిగిందని, దీన్ని రాజకీయం చేస్తన్నారని నారాయణస్వామి మండిపడ్డారు. మహిళా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్ జగన్ అని, గత ఐదేళ్లలో మహిళా అభ్యున్నతి ఆయన కృషి చేశారన్నారు. కార్పొరేటర్లు, మేయర్, జడ్పి చైర్మన్, రాష్ట్ర స్థాయి పదవుల్లో 60 శాతం మహిళలకు అందించిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు. చంద్రబాబ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఆయన రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవని, చంద్రబాబ ఇది గుర్తుపెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు నారాయణస్వామి. -
Lakshmi Parvathi: చంద్రబాబు, లోకేష్ అరాచక పాలనకు కొమ్మినేని అరెస్టు నిదర్శనం
-
కొమ్మినేని అరెస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం: అంబటి రాంబాబు
-
చంద్రబాబు,పవన్,లోకేష్ కనుసన్నల్లోనే.. కొమ్మినేని అరెస్ట్ ముందు జరిగిన కుట్ర
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఏడాది పాలనా వైఫల్యాలతో పాటు అనంతపురంలో టీడీపీ కార్యకర్తల గ్యాంగ్ రేప్, ఇంటర్ విద్యార్థిని హత్యా ఘటనలతో ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీన్నినుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు సర్కారు కేఎస్ఆర్ లైవ్ షోను అడ్డం పెట్టుకుంది. తాను చేయని వ్యాఖ్యలకు.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయించింది. అయితే ఈ అరెస్ట్కు ముందుకు కొమ్మినేనిపై కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్రకు తెరతీసింది. ఆ కుట్రంతా లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది. అసలేం జరిగిందంటే? ఈ నెల 6న సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకులు కృష్ణం రాజు వ్యాఖ్యలను డిబేట్లో కొమ్మినేని వారించారు. ఇది జరిగిన 24 గంటల తర్వాత.. ఈ నెల 7న ఆ వ్యాఖ్యలను ఐటీడీపీ వైరల్ చేసింది. కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్కు ఆపాదిస్తూ విషప్రచారం చేయించింది. వెను వెంటనే పథకం ప్రకారం టీడీపీ అనుకూల వ్యక్తులతో అమరావతిలో లోకేష్ అమరావతిలో ప్రదర్శనలు చేయించారు.తాను చేసిన వ్యాఖ్యలపై కృష్ణం రాజు క్షమాపణ చెప్పినా.. వైఎస్ జగన్ కుటుంబసభ్యులపై అసభ్య వ్యాఖ్యలు, పోస్టింగ్లు పెట్టారు. నిన్న (ఆదివారం) టీడీపీ వారితో రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేయించారు.ఇది ఓ వైపు జరుగుతుండగా ప్రణాళికా బద్ధంగా నిన్న మధ్యాహ్నం 1.49కి సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు. దీనికి మద్దతుగా పవన్ ఆఫీస్ నుంచి మధ్యాహ్నం 3.40కి ప్రెస్ నోట్ విడుదలైంది. తర్వాత సాయంత్రం 6.45కి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోపే హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇలా చంద్రబాబు అండ్ కో.. ఏపీలో కొనసాగుతున్న దారుణల్ని, అరాచకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు కొమ్మినేని అరెస్ట్ చేశారంటూ ఏపీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టులు సైతం కూటమి ప్రభుత్వం తీరును ఖండిస్తున్నారు. -
నేనంటే చంద్రబాబుకు పగ.. అందుకే ఈ కక్ష సాధింపు
-
రాష్ట్రంలో రోజు రోజుకూ దిగజారుతున్న మహిళల భద్రత
-
ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో ఆగని అఘాయిత్యాల పర్వం... బాలికలు, మహిళలపై అత్యాచారాలతో భయానక పరిస్థితులు
-
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు జీవం తీస్తున్న కూటమి నేతలు
-
కీచక రాజ్యం.. ఆగని అఘాయిత్యాల పర్వం
సగటున రెండు రోజులకొక అత్యాచారం.. చంబల్ లోయ దురాగతాలను తలపిస్తున్న రాష్ట్రం చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. రెడ్బుక్ సేవలో తరిస్తున్న పోలీసు యంత్రాంగం రామగిరి మండలంలో 9వ తరగతి బాలికపై 14 మంది ఆరు నెలలపాటు అత్యాచారం.. బాధిత బాలికను స్వయంగా విచారించిన ఎస్పీ.. అయినా ఇప్పటిదాకా కేసే లేదు! మహిళలంటే టీడీపీ నేతలకు చిన్నచూపు.. అందుకే బాలికలు, మహిళల భద్రతకు కూటమి సర్కారు తిలోదకాలుసాక్షి, అమరావతి: కీచక చంద్రబాబు ప్రభుత్వం గురివింద నీతిని వల్లె వేస్తోంది. మహిళల పట్ల ఒక్కసారిగా మొసలి కన్నీరు కారుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో అసాంఘిక శక్తులు.. మహిళలు, బాలికలపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరోవైపు మహిళల భద్రత, గౌరవం, ఆత్మాభిమానం అంటూ వైఫల్యాన్ని కప్పిపుచ్చేకునేందుకు యత్నిస్తోంది.ఒకప్పటి చంబల్ లోయను తలపిస్తూ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై యథేచ్ఛగా అఘాయిత్యాలతో ఆంధ్రప్రదేశ్ అంతటా భీతావహ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని కట్టడి చేయడం చేతగాని చంద్రబాబు ప్రభుత్వం.. ఎవరో ఓ ప్రైవేటు వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీకి ఆపాదిస్తూ దుష్ప్రచారానికి తెగబడుతోంది. తమ ఏడాది పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కుట్రకు తెగిస్తోంది. కానీ, రాష్ట్రంలో రోజు రోజుకూ దిగజారుతున్న మహిళల భద్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రంబాలికలు, మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న అత్యాచార పర్వం యావత్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎంతగా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఏకంగా 188 మంది బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇందులో అత్యాచారం ఆపై హత్యకు గురైన వారు 15 మంది ఉన్నారు. మరో తొమ్మిది మంది బాలికలు, మహిళలు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ లెక్కన దాదాపు ప్రతి రెండు రోజులకు ఓ అత్యాచారం జరుగుతోందని పోలీసు రికార్డులే వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు చంబల్ లోయలో మహిళలపై ఈ తరహాలో అఘాయిత్యాలకు పాల్పడేవారని పత్రికలు ప్రచురించేవి. ఆనాటి చంబల్ లోయలోని దారుణ పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొనడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. మహిళల ఆక్రందనలు పట్టని చంద్రబాబు ప్రభుత్వంరాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత రోజు రోజుకూ దిగజారుతున్నా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. బాలికలు, మహిళల భద్రత గురించి నామమాత్రంగా కూడా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దిశ వ్యవస్థ ద్వారా మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆపదలో ఉన్నామని బాలికలు, మహిళలు ఆ యాప్ ద్వారా సమాచారం ఇస్తే చాలు కేవలం 5–10 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని భద్రత కల్పించేవారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం.. అక్రమ కేసులు నమోదు చేసి వేధించడమే పోలీసుల ఏకైక విధి అని స్పష్టం చేసింది. దాంతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. పోలీసులు శాంత్రి–భద్రతల పరిరక్షణ, మహిళా భద్రత వంటి కీలకమైన తమ విధులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతలకు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా, ఇతర కాంట్రాక్టులు లభించేలా ప్రత్యర్థులు, పోటీదారులను బెదిరించడమే తమ విధి అని భావిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధించడమే ఏకైక పనిగా పెట్టుకున్నారు.దాంతో రాష్ట్రంలో బాలికలు, మహిళా భద్రత గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతోంది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం, మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి, హోమ్ మంత్రి అనిత నియోజకవర్గం పాయకారావుపేట.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమైపోయాయి. విద్యార్థినులు బడికి వెళ్లి ఇళ్లకు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. టీడీపీ పెద్దల తీరే అంత.. అందుకే ఈ దుస్థితిటీడీపీ కూటమి పెద్దలు, కీలక నేతలే మహిళల గౌరవానికి భంగం కలిగిస్తూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం ప్రభుత్వ మైండ్ సెట్కు నిదర్శనం. ‘ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి’ అని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ‘కారు షెడ్డులో ఉండాలి.. ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి’ అని దివంగత కోడెల శివ ప్రసాదరావు తదితరుల వ్యాఖ్యలే రాష్ట్రంలో బాలికలు, మహిళల భద్రత పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి తార్కాణం. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకొని ఈడ్చి.. దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోక పోగా, సదరు బాధితురాలినే తప్పు పట్టడం తెలిసిందే. ఇక నారా లోకేశ్ విదేశాల్లో మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించిన వీడియోలు, ఫొటోలు గతంలోనే వెలుగులోకి వచ్చాయి. అప్పట్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే.14 మంది రేప్ చేస్తే కేసు కట్టరా?చీమ కుట్టినట్టుగా కూడా లేదా?హోం మంత్రి ఎక్కడ?ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పరిటాల సునీత సొంత ప్రాంతం రామగిరి మండలం పేరూరు పంచాయతి పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత బాలికపై 14 మంది యువకులు కొన్ని నెలలపాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్రంగా కలచి వేస్తోంది. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఆ దారుణం బయటకు పొక్కింది. అదే గ్రామానికి చెందిన బడగొర్ల అభిషేక్, బూడిద రాజేష్, బాసి గిరి, బాసి కార్తీక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజి, తలారి మురళి, రొద్దకంపల్లి మహేశ్, హెచ్.సురేశ్, హెచ్.హేమంత్ పేర్లు బయటపడ్డాయి. మరో ముగ్గురి పేర్లు తెలియరాలేదు. అందరూ టీడీపీ కార్యకర్తలే కావడంతో నిందితులకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తుండటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.బాధిత బాలిక తండ్రి గతేడాది టీడీపీ గెలిచిన సంబరాల్లో తప్పెట వాయించుకుంటూ బొలెరో నుంచి జారి కింద పడి చనిపోయారు. బాలిక తల్లికి మతి స్థిమితం లేదు. అలాంటి ఆ బాలికపై వీడియోలు చూపి బ్లాక్ మెయిల్ చేస్తూ 14 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లగా.. ఆరు నెలల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు.దీంతో బాలికను బంధువులు నిలదీయగా.. అసలు విషయం వెలుగు చూసింది. బాధిత బాలికను స్వయంగా ఎస్పీనే విచారించారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స, పరీక్షలు చేయిస్తున్నారు. ఇంత దారుణమైన ఘటనపై ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎవరు అడ్డు పడుతున్నారు? ఎంకా ఎన్నాళ్లు నాన్చుతారు? వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తున్న ఈ ఘటనలో ఇటు పోలీసులు, అటు పాలకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేకపోవడం దుర్మార్గం. స్థానిక మహిళా శాసన సభ్యురాలు సునీత, మహిళా హోం మంత్రి అనిత ఇప్పటి దాకా ఎందుకు నోరు విప్ప లేదు? కళ్లెదుటే ఎన్నో ఘటనలు..⇒ అనంతపురానికి చెందిన ఓ యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరుకు తీసుకువెళ్లి హత్య చేయడం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు తాజా ఉదాహరణ. ⇒ 2024 జూలై 7వ తేదీన నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. 11 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ బాలిక మృతదేహాన్ని కూడా గుర్తించలేకపోయారు. నిందితులను శిక్షించనే లేదు. ⇒ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేకుండాపోయింది. పిఠాపురం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ దుర్గాడ విజయలక్ష్మి భర్త, దుర్గాడ జాన్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇒ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం హిందూపురం మండలం తూమకుంట పరిధిలో 2024 ఆగస్టు 2వ తేదీన ఎనిమిదేళ్ల చిన్నారిని గంగాధర్ (45) అనే వ్యక్తి దారుణంగా చంపి ఇసుకలో పాతిపెట్టాడు. అంతకు ముందు అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.⇒ వైఎస్సార్ జిల్లా గోపవరం మండలంలో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేశాడు. బద్వేలు పట్టణంలోని రామాంజనేయనగర్కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినిని విఘ్నేష్ అనే వివాహితుడు ప్రేమ పేరుతో వేధించాడు. బాలికను గోపవరం మండలంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి.. అనంతరం వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పు అంటించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు, మేకల కాపరులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతిచెందింది.⇒ తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన భార్య, భర్త, తన ఇద్దరు పిల్లలతో కలిసి పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి చేరుకున్నారు. చిన్నారి మేనమామకు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. చిన్నారి తండ్రి, కుటుంబీకులు కలిసి సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో శల్య వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. ఏఎం పురానికి చెందిన సుశాంత్ చిన్నారికి చాక్లెట్ తీసిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. చిన్నారిని తిరిగి నివాసానికి తీసుకెళ్లకుండా.. పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కిరాతకుడైన సుశాంత్.. చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి చంపేశాడు.⇒ దర్శి సమీపంలోని గ్రామంలోని ఓ బాలికను టీడీపీ నేత కుమారుడు ఏనుగంటి చరణ్ సాయి తన స్నేహితుల రూమ్కు తీసుకుని వెళ్లి కూల్ డ్రింక్లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ⇒ అభంశుభం తెలియని చిన్నారులకు తెలుగుదేశం పార్టీకి చెందిన యువకులు మద్యం తాగించి, వారిని లైంగికంగా వేధించిన అమానవీయ ఉదంతం నంద్యాల జిల్లా డోన్ మండలం మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలైన యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడి వీడియోలు కూడా చిత్రీకరించారు. టీడీపీ నేత ఈడిగె వీరాంజనేయులు గౌడ్ కుమారుడు ఈడిగె రాంబాబుగౌడ్ తన ఇద్దరు స్నేహితులతో కలసి బాలికలను బెదిరించి మద్యం తాగించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. -
స్కూలింగ్ బీజేపీలో.. కాలేజీ చంద్రబాబు వద్ద.. ఉద్యోగం రాహుల్ వద్ద
సాక్షి, హైదరాబాద్: ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించే వారికే నాయకుడిగా గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారంతా నిరంతరం ప్రజల్లో ఉంటేనే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. తాను స్కూలింగ్ బీజేపీలో, కాలేజీలో టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద చేసి, ఉద్యోగం రాహుల్గాంధీ వద్ద చేస్తున్నా అని వ్యాఖ్యానించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్ హరిబాబు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, శ్రీనివాసవర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ. ‘ఇటీవల నీతి అయోగ్ సమావేశం అనంతరం భోజన సమయంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. నీ సహచరుడు అక్కడున్నాడు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూపించారు. అందుకు నేను స్పందిస్తూ.. నా స్కూలింగ్ అంతా మీ వద్ద (బీజేపీ) జరిగింది. కాలేజీ స్టడీ ఆయన (చంద్రబాబు) దగ్గర, ఇప్పుడు ఉద్యోగం రాహుల్గాంధీ వద్ద చేస్తున్నా అని బదులిచ్చాను. నాకు చాలామంది బీజేపీ నేతలతో స్నేహముందని వివరించాను’అని వెల్లడించారు. దత్తాత్రేయ ప్రజల మనిషి హోదాలతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉన్న వ్యక్తి బండారు దత్తాత్రేయ అని సీఎం రేవంత్ కొనియాడారు. ‘దత్తాత్రేయ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ప్రజల మనిషి. అందుకే అన్నిపార్టీల నేతలు ఈ కార్యక్రమానికి వచ్చారు. గౌలిగూడ నుంచి గవర్నర్ వరకు ఎన్నో పదవుల్లో కొనసాగిన దత్తాత్రేయ నిత్యం ప్రజలు, కార్యకర్తలతోనే ఉంటారు. హైదరాబాద్లో మాస్ నేతలు ఇద్దరే. ఒకరు పీ.జనార్ధన్రెడ్డి, మరొకరు బండారు దత్తాత్రేయ. నగర ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా వీరిలో ఒకరికి చెప్పుకునేవారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునేవారు వీళ్లను ఆదర్శంగా తీసుకోవాలి’అని సూచించారు. కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు: రామ్నాథ్ కోవింద్ ఉత్తర్ప్రదేశ్లో పుట్టి పెరిగిన తాను తెలుగు రాష్ట్రాలను రెండో ఇళ్లుగా పరిగణిస్తానని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. బండారు దత్తాత్రేయతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని తెలిపారు. దత్తాత్రేయ కేంద్ర కార్మీక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మీకుల కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, దేశవ్యాప్తంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ సేవలు మెరుగపర్చడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ‘దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి దత్తాత్రేయ. ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. కానీ, ఆయనను హరియాణా గవర్నర్గా నియమించారు. అక్కడ జీరో డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటప్పుడు ఎలా పనిచేస్తారని ఆయననే అడిగాను. ఎక్కడున్నా ప్రజలకు సేవ చేయడమే తన ధర్మమని దత్తాత్రేయ చెప్పారు’అని కోవింద్ వివరించారు. లేఖలకు బ్రాండ్ అంబాసిడర్: చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో కృషి చేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. నిబద్ధత, అంకితభావం, జాతీయత, సేవ, సమగ్రత కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. అలాయ్ బలాయ్ అంటేనే దత్తాత్రేయ గుర్తొస్తారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను సీఎంగా ఉన్నప్పుడు పలు అంశాలపై దత్తాత్రేయ పెద్ద సంఖ్యలో లేఖలు రాశారని, ఆయన లేఖలకు బ్రాండ్ అంబాసిడర్ అని చమత్కరించారు. దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితం లేదు: వెంకయ్యనాయుడు బండారు దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితమంటూ ఏమీ లేదని, ప్రజలే ఆయన జీవితమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ప్రస్తుత నాయకులు డైపర్స్ మార్చినట్టు పదవుల కోసం పార్టీలు మారుతుండటంతో రాజకీయాలు చులకన అయ్యాయని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని సూచించారు. కానీ, ఇప్పుడు వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయం: దత్తాత్రేయ రాజకీయాలంటే వృత్తి, వ్యాపారం కాదని బండారు దత్తాత్రేయ అన్నారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లు సమాజంతో మమేకం అవ్వాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడితే పదవులు అవే వస్తాయని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలే తన కుటుంబమని, వాళ్లే తన ఆస్తి అని చెప్పారు. అలాయ్బలాయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యకక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
తిరగబడ్డ టీచర్లు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ అభాసుపాలైన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తమ బదిలీలను సైతం ప్రహసనంగా మార్చేసిందని ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. సంఖ్యాపరంగా అధికంగా ఉన్న ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపడతామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆన్లైన్లోనే ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించడంపై వారు తిరుగుబాటు ప్రకటించారు. ఒక్కో ఎస్జీటీ 2,500కు పైగా ఆన్లైన్ ఆప్షన్లు ఇవ్వడం అసాధ్యమని, అదీ కేవలం 48 గంటల్లో పూర్తి చేయాలనడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్ కౌన్సెలింగ్ ఉంటుందని భావించిన వారికి శనివారం ఆన్లైన్ విధానం మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో కంగుతిన్నారు. దీంతో శనివారం బదిలీ కౌన్సెలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో నిరసన తెలిపిన ఎస్జీటీలు.. ఆదివారం బదిలీ కౌన్సెలింగ్ను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టరేట్లు, డీఈవో కార్యాలయాలను ముట్టడించారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో 1.79 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, ఎస్జీటీలు 1.20 లక్షల వరకు ఉన్నారు. ప్రస్తుత బదిలీల్లో సుమారు 65 వేల మందికి స్థాన చలనం కల్పించాలి. వీరిలో 35 వేల మంది వరకు ఎనిమిదేళ్లు పూర్తయ్యి, తప్పనిసరి బదిలీల్లో ఉన్నారు. విద్యా శాఖ గత నెలలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10వ తేదీతో ఎస్జీటీల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియాలి. కానీ ఆందోళన నేపథ్యంలో ఆ ప్రక్రియకు బ్రేక్ పడినట్టయింది. మాన్యువల్కు హామీ.. ఆన్లైన్కు ఉత్తర్వులు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గతేడాది సెప్టెంబర్ నుంచి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో విద్యా రంగంలో చేయాల్సిన మార్పులపై సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రతి శుక్రవారం విద్యాభవన్లో జరిగే ఈ సమావేశాల్లో ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్, 3–5 తరగతులు తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. గత 9 నెలల్లో 40కి పైగా సమావేశాలు నిర్వహించి, ప్రతి సమావేశంలోనూ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే, ప్రభుత్వం మార్చి నెలలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025’ తీసుకొచ్చింది. ఇందులో పలు అంశాలపై అభ్యంతరాలను లేవనెత్తి ఆందోళన వ్యక్తం చేయడంతో తుది చట్టంలో మార్పులు చేస్తామని నాడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఏప్రిల్లో చేసిన ‘ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం–2025’లో ఆన్లైన్ కౌన్సెలింగ్ అని పేర్కొన్నారు. గత నెలలో జరిగిన సమావేశంలో మాన్యువల్ కౌన్సెలింగ్పై పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చర్చలను బహిష్కరించి నిరసన తెలిపారు. అయితే, మరుసటి రోజే విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసి, ఎస్జీటీల డిమాండ్ మేరకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వు (జీవో నం.22)లో మళ్లీ ఆన్లైన్ విధానమే ఉంటుందని పేర్కొన్నారు. ఇలా ఉపాధ్యాయులను మభ్యపెడుతూ వచ్చిన ప్రభుత్వం, కౌన్సెలింగ్ ప్రక్రియ దగ్గర పడేసరికి ఉపాధ్యాయులు ఆన్లైన్లోనే ఆప్షన్లు పెట్టాలని, 48 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఒత్తిడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిలువునా మోసం చేశారు» సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ విధానంలోనే చేపడతామని ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. నమ్మించి మోసం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఆదివారం ఉపాధ్యాయులు ముట్టడించారు. వెబ్ కౌన్సెలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సెలింగ్ ముద్దు.. అంటూ ఉపాధ్యాయులు చేసిన నినాదాలతో డీఈఓ కార్యాలయాల ప్రాంగణాలు మార్మోగాయి. ఈ సందర్భంగా డీఈవోలను ఘెరావ్ చేశారు. » ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ను తప్పుల తడకగా నిర్వహించారని, ఎక్కువ పాయింట్లు వచ్చిన వారికి కాకుండా తక్కువ పాయింట్లు వచ్చిన వారికి క్లస్టర్ వేకెన్సీల్లో అవకాశం ఇచ్చారని ఈ సందర్భంగా పలువురు ఆరోపించారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపాధ్యాయులు జనరల్ ఆప్షన్లు పెట్టినా ప్లేసులు కేటాయించక పోవడం అన్యాయమన్నారు. » రాష్ట్ర ప్రభుత్వ తీరు చెప్పేదొకటి.. చేసేది మరొకటి అన్నట్లుగా ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఉపాధ్యాయుల హక్కులు, ఆత్మ గౌరవంతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్కు ఈ–మెయిల్, వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపాలన్నారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ప్రభుత్వ వైఖరి నశించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మాన్యువల్గా కౌన్సిలింగ్ నిర్వహించకపోతే ఎంత దూరమైనా పోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. చిత్తూరులో మండుటెండలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. » నిరసన కార్యక్రమంలో ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీయూఎస్, వైఎస్సార్ టీఏ, ఎస్టీఎఫ్, పీఈటీ అసోసియేషన్, ఎస్ఆర్టీఎఫ్, ఎన్టీఏ, ఎస్సీ, ఎస్టీ యూనియన్ తదితర సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఉపాధ్యాయుల కడుపు కొడుతున్న చంద్రబాబుఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు తనకు మద్దతుగా నిలవడంతో తన కడుపు నిండిపోయిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు ఉపాధ్యాయుల కడుపుకొడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా, ఉపాధ్యాయులు, ఉద్యోగుల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. వరల్డ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగానే సాల్ట్ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. – బొర్రా గోపిమూర్తి, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీఉద్యమం మరింత ఉధృతంఉపాధ్యాయుల బదిలీల్లో ఎస్జీటీలు, సమాన కేడర్ టీచర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్ కౌన్సెలింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యామాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలను ముట్టడించారు. సోమవారం ఆయా డీఈవో కార్యాలయాల వద్ద నిరహార దీక్ష చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ప్రభుత్వం అప్పటికీ దిగిరాకపోతే మంగళవారం విద్యా భవన్ (డైరెక్టరేట్)ను ముట్టడికి తరలి రావాలంది. -
‘అది డైవర్ట్ చేయడానికే టీడీపీ బురద చల్లుడు రాజకీయాలు’
సాక్షి, తాడేపల్లి: జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే, వాటిని వైఎస్సార్సీపీకి, సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తరువాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు, వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననానికి వాడుకుంటోందని మండిపడ్డారు.మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే సాక్షి టీవీ, వైఎస్సార్సీపీ సమర్థించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం వెన్నుపోటు దినం విజయవంతం ద్వారా బహిర్గతం అవ్వడంతో, దానిని నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రపూరితంగా టీడీపీ దానికి వంతపాడే ఎల్లోమీడియా, సోషల్ మీడియా ద్వారా పనిగట్టుకుని దుష్ప్రచారంకు దిగారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..గతంలో అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లలో, పబ్లిక్ మీటింగ్ల్లో కూర్చుని టీడీపీ సీనియర్ నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారంతా ఏమైపోయారు. ఈటీవీ, టీవీ 5, ఏబీఎన్ ఛానెళ్ల ముందు ఎందుకు ధర్నాలు నిర్వహించలేదు? ఆ పత్రికల ప్రతులను ఎందుకు తగలబెట్టలేదు? టీడీపీ నాయకులు మాట్లాడిన సందర్భాల్లో వారి మనోభావాలు దెబ్బతినలేదా?టీడీపీ నాయకులు, కిర్రాక్ ఆర్పీ, సీమ రాజా, చేబ్రోలు కిరణ్ మాట్లాడిన వీడియోలను కూడా ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాము. సాక్షాత్తు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత వైయస్ కుటుంబం గురించి, వారి ఇంటి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా వారి మీద ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. నాడు సీఎం వైయస్ జగన్ ను ఉద్దేశించి పదే పదే సైకో అని మాట్లాడిందే చంద్రబాబు. వైయస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాన్ నా కొడకల్లారా అని రెచ్చిపోయాడు. వారిద్దరి మీద కూడా ఎందుకు కేసులు పెట్టలేదు?ఐటీడీపీ పేరుతో రెచ్చిపోతున్న సైకోలువ్యక్తిత్వ హననం అనేది టీడీపీ జీన్స్ లోనే ఉంది. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి నేటి వైయస్ జగన్ వరకు వ్యక్తిత్వ హననం చేయడమే ఎజెండాగా సైకోలను ప్రోత్సహించడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లు వైయస్ కుటుంబంపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఐ-టీడీపీ పేరుతో నారా లోకేష్ ఒక సైకో వ్యవస్థను సృష్టించి డబ్బులిచ్చి పోషిస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతోనే వీడియోలు చేస్తున్నానని టీడీపీ సైకో చేబ్రోలు కిరణ్ స్పష్టంగా చెప్పాడు. అధికారం అండ చూసుకుని, రెడ్ బుక్ రాజ్యాంగం పొగరుతో ఏం చేసినా పోలీసులు మనల్ని ఏం చేయరులే అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోలు దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి చర్యలను వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. వైయస్ కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదు.మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టదుమహిళల మీద అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేస్తే ఇంతవరకు కేసు నమోదు చేసి నిందితులను శిక్షించలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ నియోజకవర్గాల్లో మహిళల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ముచ్చుమర్రిలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన జరిగి 9 నెలలు దాటినా ఇంతవరకు బాలిక మృతదేహాన్ని వెతికి తీయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైంది.రాష్ట్ర వ్యాప్తంగా దళిత మీద దాడులు నిత్యకృత్యమైపోయాయి. పిఠాపురంలో ఏకంగా దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా పవన్ కళ్యాణ్ దానిపై ఇంతవరకు నోరుమెదపలేదు. ఈ ఘోరాలపై నోరెత్తి మాట్లాడే తీరిక ప్రభుత్వ పెద్దలకు లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన డీజీపీ ఎక్కడున్నారో తెలియదు. రాజధాని పేరుతో అమరావతి భూములను దోచుకోవడమే అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నాడని రాజధాని రైతులు, మహిళలు గుర్తించాలి. అమరావతిలోని వందల ఎకరాల భూములను తన బినామీల కంపెనీలకు చంద్రబాబు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. గతంలో సేకరించిన భూములనే అభివృద్ధి చేయలేక చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు, మళ్లీ 44 వేల ఎకరాలు సేకరిస్తానని చెప్పడం భూములు దోచుకునే కుట్రలో భాగమే. -
కదం తొక్కిన టీచర్లు.. బాబుకు డెడ్ లైన్..
-
చంద్రబాబుకి కొత్త టెన్షన్.. రాజాంలో టీచర్ల ధర్నా
-
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం... ప్రభుత్వం చెప్పేదానికి కాగ్ నివేదికలు పూర్తి విరుద్ధం... చంద్రబాబు కూటమి ప్రభుత్వ విధానాలను తప్పుపట్టిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
కూటమి వైఫల్యాలు దృష్టి మళ్ళించేందుకే 'ఈనాడు' భజన కథనాలు
సాక్షి, శ్రీకాకుళం: అధికారం కోసం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఎల్లో మీడియా 'ఈనాడు'లో ఒక భజన కథనాన్ని రాయించుకున్నారని మండిపడ్డారు.చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపే ప్రయత్నంలో భాగంగా ఏడాదిలో చంద్రబాబు ప్రజలకు ఎంతో చేశారని, మిగిలింది ఎప్పుడంటూ ఈనాడు రాసిన కథనం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గత చరిత్ర చూసినా ఎన్నడూ చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమంటున్నారంటే..చంద్రబాబు సీఎంగా ఏడాది పాలనలో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలను ఇచ్చారు. ఇంకా కొంత పెండింగ్లో ఉంది. వాటిని కూడా ఇచ్చేయండీ అంటూ ఈనాడు పత్రిక చంద్రబాబు పాలనను కీర్తిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు 1999, 2014, 2024లో మేనిఫేస్టోలను పార్టీ పరంగా విడుదల చేశారు. ఈ మూడు సందర్భాల్లోనూ ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఎప్పుడూ తాను మేనిఫేస్టోలో ప్రకటించిన హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలే లేవు. ప్రతిసారీ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాష్ట్రం తిరోగమనంలోనే ఉంది.పెన్షన్ల పథకం అమలులోనూ మోసంకూటమి పాలనలో ప్రధానంగా ఇచ్చిన సూపర్ సిక్స్, అలాగే 143 హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలి. పెన్షన్ల గురించి చెబుతున్న చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు యాబై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామని చెప్పలేదా? ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలి. అలా ఇచ్చినట్లయితే అదనంగా 20 లక్షల మంది కొత్త పెన్షన్లరు పెరగాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న 66 లక్షల పెన్షన్లకు అదనంగా మరో 20 లక్షలు కలిస్తే, మొత్తం 86 లక్షల పెన్షన్లను ప్రతినెలా ఇవ్వాల్సి ఉంటుంది.కానీ అలా జరుగుతోందా? పైగా వైయస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటి ఉన్న పెన్షన్ల నుంచి ఏకంగా నాలుగు లక్షల పెన్షన్లకు కోత పెట్టారు. ఈ తొలగించిన పెన్షన్ల మొత్తాన్ని మిగిలిన పెన్షన్లకు కలిపి, వెయ్యి రూపాయల చొప్పున పెంచానని అబద్దాలు చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లను కూడా భారీగా తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దివ్యాంగ పెన్షన్లు, మెడికల్ పెన్షన్లను తీసేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఇళ్ళ వద్దే పెన్షన్లు అని చెబుతున్నా కూడా వాస్తవానికి వారిని టీడీపీ నేతల ఇళ్ళకు పిలిపించుకుని, వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా పంపిణీ చేస్తున్నారు.అధ్వాన్నంగా శాంతిభద్రతలురాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక దాడులు, కక్షసాధింపులు కనిపిస్తున్నాయి. రాజ్యాంగబద్దమైన పాలన జరగడం లేదు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఏదైనా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే చాలు వెంటనే దానిపై డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభిస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెచ్చి, బురదచల్లుతున్నారు. రాష్ట్రంలో ఇలా పెట్టుబడిదారుపై దాడులు, బెదిరింపులు ఎప్పుడూ చూడలేదు.కానీ కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలపై మామూళ్ళ కోసం దాడులు, వేధింపులతో ఒక భయోత్పాతంను సృష్టించారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రూవరీస్ కంపెనీని వేధించారు. అలాగే రాయలసీమలో సిమెంట్ కంపెనీలపై, పోర్ట్ల్లో రవాణా వాహనాల నుంచి మామూళ్ళ కోసం దౌర్జన్యాలకు పాల్పడ్డారు. వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో ఎంఓయులు చేసుకున్న పెట్టుబడిదారులే ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలను ప్రారంభిస్తున్నారు. కూటమి హయాంలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా వచ్చిన దాఖలాలు లేవు. దావోస్కు వెళ్ళి వట్టి చేతులతో తిరిగి వచ్చారు.పథకాల అమలుపై స్పష్ట ఏదీ?రాష్ట్రంలో 1.60 కోట్ల దీపం కనెక్షన్లకు ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా ఇవ్వాలంటే రూ.4వేల కోట్లు కావాల్సి ఉంటే కేవలం రూ.869 కోట్లు కేటాయించారు. ఇవి వాస్తవం కాదా? ప్రజలను మోసం చేయడం కాదా? ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. 1.80 కోట్ల మంది అర్హులైన మహిళలు ఈ పథకం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు దీనిని అమలు చేస్తారు? ఏడాదికి సుమారు రూ.32,400 కోట్లు అవసరం. ఉచిత బస్సు అన్నారు, దాని అమలు ఊసే లేదు. యువగళం అంటూ నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.ఎంతమంది నిరుద్యోగులకు దీనిని ఇచ్చారు? రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వన్నీ ప్రజలను వెన్నుపోటు పొడవటం కాదా? అమ్మ ఒడి కింద గత ఏడాది పూర్తిగా దాదాపు 80 లక్షలకు పైగా విద్యార్ధులను, వారి తల్లులను దగా చేశారు. ఈ ఏడాది ఇస్తారో, ఎగ్గొడతారో తెలియదు. రైతులకు ఇస్తామన్న రైతుభరోసా ఏమయ్యిందీ? కేంద్రం ఇచ్చే దానితో కలిపి ఇచ్చే రైతుభరోసాపై గతంలో చంద్రబాబు పలుసార్లు వైయస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే దానితో కలిపే ఇస్తామని సిగ్గు లేకుండా ఎలా చెబుతున్నారు? కనీసం అలా అయినా ఇస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. అవి కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు.రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన వైఎస్ జగన్గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను సర్వ నాశనం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి స్టేట్మెంట్ను ఈనాడులో ప్రచురించారు. ఇప్పటికే రాష్ట్రం అప్పులపాలైంది, చేయగలిగినంత అప్పులు చేసేశాము. కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జూన్ 1న జీతాలు ఎల్లా చెల్లిస్తుందని ఆయన మాట్లాడిన దానిని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినా కూడా సీఎం వైఎస్ జగన్ దానిని గాడిలో పెట్టారు. జీతాలు, పెన్షన్లను సకాలంలో చెల్లించారు. తొలి ఏడాదిలోనే వైఎస్సార్ వాహనమిత్ర, రైతు భరోసా, పెన్షన్ల పెంపు, సున్నావడ్డీ, లా నేస్తం, నేతన్ననేస్తం, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, కంటివెలుగు, విదేశీ విద్యాదీవెన, చేదోడు, వసతి దీవెన, విద్యాదీవెన, కాపునేస్తం, మత్స్యకార భరోసా పథకాలను 3,54,77,428 మంది లబ్దిదారులకు రూ.36,361 కోట్లు ఖర్చు చేస్తూ ఈ పథకాలను అమలు చేశాం.దీనిలో 1.76 మంది బీసీలు, 62 లక్షల మంది ఎస్సీలు, 18.5 లక్షల మంది ఎస్టీలు, మరో 18.5 లక్షల మంది మైనార్టీలు, ఇతరులు 76 లక్షల మంది ఉన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్లో వరుసగా మూడుసార్లు మొదటి స్థానంలో రాష్ట్రం నిలబడింది. అలాగే 2023-24 లో రాష్ట్రానికి రూ.46 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఇది 22 శాతం. పారిశ్రామిక, వ్యవసాయ గ్రోత్లో ప్రగతి సాధించాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూటమి పాలనలో జీడీపీ గ్రోత్ 22 శాతం తగ్గిపోయిందంటే వారి పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.2024-25కి సంబంధించి కూటమి ఏడాది పాలనలో స్టేట్ జీఎస్టీ రెవెన్యూ రూ.2652 కోట్లు అయితే, 2023-24 వైఎస్సార్సీపీ ఏడాది పాలనలో వచ్చిన రాష్ట్ర జీఏస్టీ రెవెన్యూ రూ.3499 వచ్చింది. అంటే సుమారు 24 శాతం ఆదాయం తగ్గిపోయింది. వైఎస్ జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చంద్రబాబు ప్రతిసారీ చెబుతూ ఉంటారు. 3.3 లక్షల కోట్లు వైయస్ జగన్ ప్రభుత్వంలో చేసిన అప్పులు అని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు. కానీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన అప్పులు రూ.1.50 లక్షల కోట్లు. ఏపీ చరిత్రలోనే అత్యధిక అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే. రాష్ట్రంలో కొత్త పోర్ట్లను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చిందే వైఎస్ జగన్. -
రేషన్ బియ్యం అక్రమ రవాణా కోసమేనా వాహనాలను తొలగించింది?
-
Seediri Appalaraju: అవ్వాతాతల ఉసురు ఊరికే పోదు
-
విజయవాడలో బలవంతంగా శాతవాహన కాలేజీని కూల్చివేశారు: మల్లాది
-
రైతుల గోడు పట్టదా?: కూటమి సర్కార్పై కారుమూరి ఫైర్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల గోడు వర్ణనాతీతంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు చేసే వారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెడుతున్నారని వెల్లడించారు. ఒక్క పొగాకే కాకుండా రాష్ట్రంలో కోకో, మామిడి, మిర్చి ఇలా ఏ పంట చూసినా రైతుల కష్టాలను ఆదుకునే వారే కనిపించడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండుగ అనే రీతిలోనే సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..పొగాకు రైతుల కష్టాల గురించి తెలుసుకుని, వారికి అండగా ఉండేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలి వెడుతున్నారని ప్రకటించగానే, కూటమి ప్రభుత్వం స్పందించి హడావుడిగా పొగాకు కొనుగోళ్ళ విషయంలో చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించి, చేతులు దులుపుకుంది. వర్షాల వల్ల వైఎస్ జగన్ ముందుగా ప్రకటించిన తేదీకి బదులుగా ఈ నెల 11వ తేదీన వెళ్ళేందుకు సిద్ధపడ్డారు.ఈ విషయం తెలియగానే మళ్లీ మంత్రులు ప్రెస్మీట్ పెట్టి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ హామీలు గుప్పిస్తున్నారు. కేవలం మాటలకే తప్ప చేతల పరంగా ఎటువంటి చర్యలు కనిపించడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో కొత్త హెలికాఫ్టర్లను కొనుగోలు చేసేందుకు చూపే శ్రద్ధలో కనీసం రైతులను ఆదుకునేందుకు రూ.1000 కోట్లతో అయినా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయలేరా అని రైతులే ప్రశ్నిస్తున్నారుసిండికేట్గా మారిన పొగాకు కంపెనీలురాష్ట్రంలో పొగాకు సాగు చేసిన రైతులు కొనుగోలు చేసేవారు లేక అల్లాడిపోతున్నారు. బర్లీ పొగాకును ప్రోత్సహించిన పలు కంపెనీలు తరువాత ఆ పొగాకును కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. రెండుమూడు బేళ్ళు కొనుగోలు చేసి, మిగిలిన దానిని వదిలిస్తుండటంతో రైతులు అన్యాయమైపోతున్నారు. మొత్తం ఏడు కంపెనీలు సిండికేట్గా మారి రేటు పెరగకుండా రైతులను దగా చేస్తున్నాయి. ఈ రోజు రైతుల వద్ద మొత్తం 55 మెట్రిక్ టన్నుల పొగాకు నిల్వలు ఉంటే, ఇప్పటి వరకు కేవలం 25 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోళ్ళు చేశారు.మిగిలిన పొగాకును దాచుకునేందుకు కూడా అవకాశం లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడులు పెట్టిన వారికి కనీసం పెట్టిన వ్యయం కూడా గిట్టుబాటు కావడం లేదు. తక్షణం మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి పొగాకు కొనుగోళ్ళు జరిపించాలి. గతంలో వైఎస్ జగన్ పాలనలో పొగాకు రైతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటే ఏకంగా రూ.100 కోట్లు కేటాయించి కొనుగోళ్ళు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. గతంలో ఈక్రాప్, ఇన్సూరెన్స్ కట్టించి, రైతులకు అండగా నిలిచారు. గతంలో ఒంగోలులో కందులు పండకపోతే ఈ-క్రాప్, ఇన్సూరెన్స్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.12000 పరిహారం అందింది.రైతుల వేదన అరణ్య రోదనరాష్ట్రంలో రైతుల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. రాష్ట్రంలో కోకో రైతులు రూ.900 రేటు కావాలంటే రూ.450 కొంటున్నారు. అదనగా రూ.50 కల్పిస్తామని చెప్పారే తప్ప అది కూడా కల్పించడం లేదు. గత ప్రభుత్వంలో రేటు పడిపోయిన సందర్భంలో రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, అవసరమైతే మార్క్ఫెడ్తో కూడా కొనుగోళ్ళు చేయించి రైతులను ఆదుకున్నాం. మిర్చి రైతులను ఆదుకున్న పరిస్థితి కనిపించడం లేదు. అమ్మబోతో అడవి, ప్రజలు కొనబోతే కొరివిలా తయారైంది.రాష్ట్రంలో దళారీ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారు. మామిడి, కోకో, పొగాకు పంటలకు గిట్టుబాటు రేటు కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని, 24 గంటల్లో సొమ్ము రైతుకు చెల్లిస్తామని చెప్పారు. ఏప్రిల్ 6న ధాన్యం కొనుగోలు చేసి, నేటికీ చెల్లింపులు చేయలేదు. మంత్రి దుర్గేష్ను రైతులు నిలదీసిన విషయం వాస్తవం కాదా? సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నారు? పదిలక్షల మెట్రిక్ టన్నులకు కానూ, 7 లక్షల మెట్రిక్ టన్నులకే పశ్చిమ గోదావరిజిల్లాలో కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. మిగలిన ధాన్యంను ఎవరికి అమ్ముకోవాలి? తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ ధాన్యం రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. పట్టుబడిన బియ్యం వివరాలు బయటపెట్టండివైఎస్ జగన్ హయాంలో ఇంటింటికీ రేషన్ను వాహనాల ద్వారా ఇస్తే పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది. అందుకోసం ఆ వ్యవస్థను రద్దు చేసి, రేషన్ షాప్ల వద్దకే వెళ్ళాలని ప్రజలకు సూచించింది. నేడు ఎండలకు రేషన్ కోసం వెళ్ళి క్యూలైన్లలో నిలబడి పేదలు వడదెబ్బ బారిన పడుతున్నారు. తాజాగా విశాఖలో అక్రమంగా తరలిస్తున్న రైస్ను పట్టుకున్నారు.ఎండీయు వాహనాల వల్లే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ వాహనాలను రద్దు చేసిన తరువాత కూడా అక్రమంగా బియ్యం రవాణా ఎలా జరుగుతోందో చెప్పాలి. అలాగే పట్టుబడిన బియ్యంను మా ప్రభుత్వంలో వేలం వేసే విధానం ఉండేది. కానీ కూటమి ప్రభుత్వంలో ఇలా పట్టుకున్న బియ్యం ఎక్కడికి వెడుతుందో తెలియడం లేదు. ఏడాది కాలంగా ఎంత బియ్యాన్ని పట్టుకున్నారు, ఆ బియ్యాన్ని ఎలా వేలం వేశారో వెల్లడించాలి. -
బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. ‘చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కు’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్ట్పై ఏపీతో కుమక్కు అయ్యారని మాజీ మంత్రి హరీష్ మండిపడ్డారు. కాళ్లేశ్వరం కమిషన్ విచారణపై శనివారం హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) చెప్పిన విషయాలను ప్రసావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చాం. అర్థికశాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదుఆర్థికశాఖకు సంబంధం లేకుండా ఉండదు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటీలో నేను, ఈటల,తుమ్మల ఉన్నాం. సబ్ కమిటీ రిపోర్ట్పై నాతో పాటు ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారు. తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై కూడా త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను.గోదావరి బనకచర్ల ప్రాజక్ట్ వలన తెలంగాణకు జరుగనున్న నష్టంపై కూడా ప్రజెంటేషన్ ఉంటుంది. బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీతో కుమక్కు అయ్యాడు. నా దగ్గర మరొక డాక్యుమెంట్ ఉంది. కమీషన్ దగ్గర అది బయట పెడతా. వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ రాత పూర్వకంగా ఇస్తాను’ అని హరీష్ రావు చిట్ చాట్లో తెలిపారు. -
అవసరానికి మించి అమరావతిలో భూసేకరణ: వడ్డే
-
అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు అంటూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడు దశల్లో నిర్మించేందుకు 35 ఏళ్లు పడుతుందని కూటమి ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుకు చెప్పింది. ఇప్పుడే అదే రాజధానిని రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు,నారాయణ ఎలా చెబుతారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం మరో 45వేల ఎకరాలు సేకరించేందుకు సిద్దమైన తరుణంలో కూటమి ప్రభుత్వం తీరును విమర్శిస్తూ శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ‘33 వేల ఎకరాలు ఇచ్చి రైతులు త్యాగం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పదేళ్లు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించుకునే అవకాశం ఉంది.అతి తెలివితేటలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికో డబ్బిచ్చి దొరికిపోయారు. మన ప్రాంతం నుంచే పాలించుకోవాలని ఏపీకి వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన చంద్రబాబు ఇల్లు ఏమైనా కట్టుకున్నాడా? ప్రజలకు అవసరమైన విధానాలను అమలు చేసేదే రాజధాని. ప్రజలను మెంటల్గా డైవర్షన్ చేయడానికి చంద్రబాబు, ఆయన మీడియా ప్రయత్నం చేస్తోంది.అమరావతి కోసం భూమి పూజ చేసిన వాడు నాలుగేళ్లలో రోడ్లు వేశారా?ఇప్పుడు మరో 45 వేల ఎకరాలు కావాలంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంటేనే పెట్టుబడులు వస్తాయంటున్నారు. భారతదేశం మొత్తం మీద ఎక్కువ భూమి ఉన్న ఎయిర్ పోర్టు శంషాబాద్ మాత్రమే.ఇప్పుడు అమరావతిలో 5 వేల ఎకరాలతో ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్ పోర్టులున్నాయి. అమరావతిలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కడతానంటున్నాడు.భోగాపురంలో ఎయిర్ పోర్టు కడుతుంటే.. శ్రీకాకుళంలోనూ ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వారికి తాగునీరు ఇవ్వకుండా ఎయిర్ పోర్టు కడతాననడానికి చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం లేదా?.మరో 45 వేల ఎకరాలు తీసుకోవాలనే ఆలోచనను చంద్రబాబు మానుకోవాలి. కుప్పం ప్రాజెక్టు చేసిన బిల్లీరావుతో చంద్రబాబుకు లింక్ ఏర్పడింది. హైదరాబాద్లో ల్యాండ్ ఇస్తే ఒలంపిక్స్ మెడల్స్ అన్నీ ఏపీకి తెచ్చేస్తానన్నాడు. సెంట్రల్ యూనివర్శిటీ పక్కన 400 ఎకరాల భూమిని ఎకరా 50 వేల చొప్పున అమ్మేశారు.శంషాబాద్లో 400 ఎకరాలు ఎకరా 25 వేల చొప్పున అమ్మేశారు. చంద్రబాబు 800 ఎకరాలు ఇస్తే వాడు స్టేడియం కూడా కట్టలేదు. వైఎస్సార్ సీఎం అయ్యాక ఆ భూముల ఒప్పందాన్ని రద్దు చేశారు. పొరపాటని తెలిసినా రాజకీయపార్టీలు మాట్లాడటం లేదు. దేశంలోనే అత్యంత సారవంతమైన భూములను నదీముఖ అభివృద్ధి పేరుతో తీసుకున్నారు. కృష్ణా కరకట్టకు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో బ్లూ&గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కట్టడానికి సాధ్యమని గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చింది.విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అక్క ఆరాటమే కానీ బావ బ్రతకడు సామెత మాదిరిగానే ఉంటుంది. లక్షల ఎకరాలు తీసుకుని కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. రైతులకు చేతులెత్తి మొక్కుతున్నా. చంద్రబాబు కోరుతున్న 45 వేల ఎకరాలను ఇవ్వాలనుకుంటున్న రైతులు వారి ఆలోచనను విరమించుకోండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలను ప్రజలంతా వ్యతిరేకించాలి’ అని పిలుపునిచ్చారు. -
కాగ్ నివేదికలను బయటపెట్టిన వైఎస్ జగన్
-
బాబును నమ్మొద్దు..! టీడీపీ మాజీ నేత సంచలన వ్యాఖ్యలు
-
ఆందోళనకరంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. కాగ్ లెక్కలతో వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వైఎస్ జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయని చెప్పారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా కాగ్ నివేదికలను బయటపెట్టారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.3,354 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ, ఇది అబద్దమని కాగ్ నివేదిక వాస్తవ లెక్కలను ప్రకటించింది. 2024 ఏప్రిల్తో పోల్చితే 2025 ఏప్రిల్లో ప్రభుత్వ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది.ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయట పెట్టగానే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.796 కోట్లు తగ్గిందనీ, అందువలన జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని ప్రకటించింది. నిజానికి సర్దుబాట్లన్నీ లెక్కించిన తర్వాతనే నికర జీఎస్టీని లెక్కగడతారు. కానీ, జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలను చేస్తోంది.టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయి. దాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉంది. గతేడాదితో పోల్చితే పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయి. పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయి. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశం’ అని చెప్పుకొచ్చారు. April 2025 fiscal performance indicates further distressThe CAG uploaded the Monthly Key Indicators for April 2025 and these figures bring to light a very disturbing picture regarding the State finances. On 1st May, the Government made a press release suggesting that the… pic.twitter.com/oGwLzKXzQZ— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2025 -
పొలిటికల్ బాసులు చెప్పినట్టు పోలీసుల వేధింపులు: సజ్జల
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో భయాందోళన సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్థాపం చెందారని తెలిపారు. పొలిటికల్ బాసులు చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు.రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం, సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది. ఎన్నికలకు ముందు వారి పాలన డిఫరెంట్గా ఉంటుందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రైవేటు ఆర్మీలా తయారు చేసి ప్రత్యర్దులపై దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారు. రోజుకు కనీసం పది తప్పుడు కేసులు పెడుతున్నారు. అరాచక శక్తులు, గూండాలు చేసే పనులు పోలీసులు చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫారం వేసినట్లుంది.లక్ష్మీనారాయణ ఏ పార్టీ అన్నది కాదు.. కులాన్ని తీసుకొచ్చారు. డీఎస్పీకి సివిల్ మ్యాటర్లో ఏం పని. ఫ్రెండ్లీ పోలీస్ మరిచి యాభై ఏళ్ల క్రితం ఎమర్జెన్సీకి తీసుకెళ్తున్నారు. రక్షించాల్సిన వారే అరాచక శక్తి అయితే ఎవరు ఏం చేయగలరు. శాతవాహన కాలేజీని అర్ధరాత్రి కూలగొట్టాల్సిన అవసరం ఏంటి. దీని వెనుక టీడీపీ నేత ఉన్నారు. సంఘ విద్రోహక శక్తుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. నిజాయితీ ఉన్న పోలీసులు లూప్ లైన్లో ఉన్నారు. వ్యవస్థ గాడి తప్పింది. ఒక్కరిపై చర్యలు లేవు. మరణవాంగ్మూలం కంటే ఏది ఎక్కువ కాదు.లక్ష్మీనారాయణ స్వయంగా పోలీసుల వేధింపుల గురించి చెప్పారు. కృష్ణవేణి, సుధారాణిలను వేధించారు. ఆర్గనైజ్డ్ అరాచకానికి చట్టాన్ని కాపాడే పోలీసులను అడ్డం పెట్టుకున్నారు. ఇంత కన్నా దిగజారడం ఉంటుందా?. చంద్రబాబు, లోకేష్లు పరిస్థితి గమనించాలి. అదుపు తప్పుతున్న వ్యవస్థలు రేపు మరింత డేంజర్ అవుతాయి. లక్ష్మీనారాయణ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి. వేధింపులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు కేసులు, వేధింపులపై కోర్టులు, మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. దాడులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉపేక్షించలేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
జగన్ గారి పాలనలో ఎంతో ప్రశాంతంగా ఉన్నాం..
-
ఏడాదికే బండి బోరుకొచ్చేసిందా.. బాబు సర్వేలో ఇదే తెలిసిందా?
నాచేతి మాత్ర.. వైకుంఠ యాత్ర.. అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పాలన తీరు. అధికారంలోకి రావడానికి నడవని అడ్డదారి లేదు.. కరవని అడ్డమైన గడ్డీ లేదు. మునుపటి ఎన్నికల్లో మోదీని నానామాటలూ అన్న బాబు మొన్నటి ఎన్నికలకు ముందు పొత్తుకోసం ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. అదీకాకుండా పవన్ కళ్యాణ్.. కాపు ఓట్లు.. వీటన్నిటికీ తోడు రాష్ట్రంలో కనిపించిన ప్రతివ్యక్తికి.. ప్రతి కులానికి.. ప్రతి వర్గానికి నోటికొచ్చిన హామీ ఇచ్చి గెలిచి ఏడాదైంది.ఏడాదిలో చాలా చేసేసాం అని బయటకు మేకపోతులా గాంభీర్యం చూపుతున్నా లోలోన బాబులు ముగ్గురిలోనూ గుబులు మాత్రం కలుగుతోంది. ముగ్గురు కలిసినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను 40 శాతం ఓట్ల నుంచి కిందకు రప్పించలేకపోయారు. జగన్ కన్నా వాళ్ళు గొప్పగా సాధించిన ఓట్లేమీ లేకున్నా సీట్లు గణనీయంగా వచ్చాయి. ఈసారి కూడా ప్రజలు ఇలాగే తమ గాలిమాటలు నమ్ముతారన్న గ్యారెంటీ లేదు. అందుకే ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సెల్ఫ్ చెక్ చేసుకుంటోంది.బాబు పాలన ఎలా ఉంది అంటూ ప్రజలకు ఐవీఆర్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏడాదిలోనే పనితీరును మదింపు చేసుకుంటున్నారు అంటే లోలోన చంద్రబాబు.. లోకేష్.. పవన్ కళ్యాణ్కు గట్టిగానే డౌట్ కొడుతోందని అర్థం అవుతోంది. ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా బాబు గారి పాలన ఎలా ఉంది అని ఫోన్లో అడుగుతున్నారు.. ప్రజలు ఆ కాల్ రాగానే.. తుపుక్.. తుపుక్ అని సమాధానాలు ఇస్తుండటంతో ఏం చేయాలో తోచడం లేదని తెలుస్తోంది. తల్లికివందనం.. ఆడబిడ్డ నిధి.. ఫ్రీ బస్సు.. నిరుద్యోగ భృతి.. రైతు భరోసా.. ఇలా ఏదీ అమలు చేయకపోవడంతో జనం ఘోరంగా తిడుతున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందట. పైగా అభివృద్ధి.. సంక్షేమం వంటి అంశాలను వదిలేసి కేవలం వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేయడం.. అనవసరమైన అంశాలను ప్రచారంలోకి తెచ్చి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం వంటి చిల్లర పనులను ప్రజలు ఏవగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కేకే సర్వే అనే సంస్థ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు భారీగా గెలుస్తారని చెప్పింది కూడా ఈ కేకే సర్వే సంస్థ. అయితే అదే సంస్థ ఇప్పుడు దాదాపు 70 మందికి పైగా ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పిఠాపురంలో గెలవడం కష్టమే అని అంటున్నారు. ఏడాదిలోనే ప్రజల్లో ఇంట నగుబాటు మొదలైందంటే రానున్న నాలుగేళ్లలో కూటమి నాయకులను వెంటాడి తరిమే పరిస్థితి ఉంటుందని కొందరు సర్వేలో చెబుతున్నారు. గ్రేటాంధ్ర.. ది తెలుగు న్యూస్.. జర్నలిస్ట్ సాయి వంటి వాళ్ళు పెట్టిన ఆన్లైన్ పోల్లో కూడా ఇలాగే దారుణమైన ఫలితాలు వచ్చాయి. గ్రామాల్లో నాయకుల దందాలు.. పెచ్చుమీరిన క్రైమ్.. రౌడీయిజం ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాయి. ఆ భయం లోలోన ఉండబట్టే ఐవీఆర్ఎస్ సర్వే చేయించారని అంటున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
రాష్ట్రాన్నిబట్టి న్యాయం మారుతుందా?
కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన ఘోర విషాదం క్రీడాభిమానులు అందరినీ విచారంలోకి నెట్టింది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో 18 ఏళ్ల ఎదురుచూపులు తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి కప్పు గెలవడంతో విజయోత్సవాలు జరిగాయి. అయితే జనం అంత స్థాయిలో వస్తారని ఊహించలేదో.. పోలీసుల నిర్లక్ష్యమో తెలియదు కాని 11 మంది నిండుప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనేక మంది గాయాలపాలయ్యరు. దీనిపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది. దీనిని స్వాగతించవచ్చు. కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరు జట్టు ప్రతినిధులను అరెస్టు కూడా చేసింది. సిటీ పోలీస్ కమిషనర్తో సహా ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది.ఈ ఘటన జరిగిన వెంటనే తెలుగు వారికి కొన్ని ఘటనలు గుర్తుకు వస్తాయి. రాజమండ్రి వద్ద పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కనీసం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అవ్వలేదు. అంత పెద్ద ఘటనపై అప్పట్లో న్యాయ వ్యవస్థ కూడా స్పందించలేదు. అంతేకాదు.. కందుకూరు, గుంటూరులలో జరిగిన టీడీపీ ర్యాలీలలో, తిరుపతి, సింహాచలం పుణ్యక్షేత్రాలలో జరిగిన ఘటనల్లో పలువురు మరణించినా తూతూ మంత్రపు చర్యలే జరిగాయి. న్యాయ వ్యవస్థ స్పందించినట్లు కనబడదు. పాలన, న్యాయ వ్యవస్థలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యవహరించవచ్చా?.బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట విషయానికి వస్తే, కొన్ని సందర్భాలలో ప్రజలు ఫ్రెంజీ అవుతారనిపిస్తుంది. చిత్రం ఏమిటంటే ఐపీఎల్ టోర్నమెంట్ జట్లలో స్థానికత నేతి బీరకాయ చందమే. బెంగుళూరు జట్టులో స్థానికులు లేదా కర్ణాటకకు చెందిన వారు అతి కొద్ది మంది. టోర్నీ మొత్తం వ్యాపారమే. క్రికెటర్లు కోట్ల రూపాయలకు అమ్ముడు పోతుంటారు. ఈ మొత్తాలు ఆట సమయంలో వారిని ఒత్తిడికి గురి చేస్తూంటాయి కూడా. బాగా ఆడలేకపోతే నిర్వాహకుల ఆగ్రహానికి గురవుతూంటారు. లక్నో జట్టుకు ఆడుతున్న సమయంలో కేఎల్ రాహుల్ను టీమ్ యజమాని బహిరంగంగా నిందించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇది కూడా ఒక కోణం. ఒక్కొక్క జట్టు రెండేసి సార్లు మరో జట్టుతో తలపడేలా ప్లాన్ చేశారు. పోటీల నిర్వహణ తీరును మనం తప్పు పట్టనక్కర్లేదు. సుమారు 18 ఏళ్లుగా దేశ ప్రజలను బాగా ఆకట్టుకున్న టోర్నీ ఇది. బెట్టింగులు కూడా జోరుగా సాగుతుంటాయని అంచనా. ఆటను ఆటగా చూడడం వరకు ఓకే కాని అది పిచ్చిగా మారకూడదు.బెంగుళూరు జట్టు గెలిచిన మాట నిజం. కానీ, అందులో ఎందరు ఆ నగరం లేదా రాష్ట్ర ప్లేయర్లు ఉన్నారు?. దానిని కూడా గమనించకుండా గెలిచిన జట్టును అభినందించడానికి వేలు, లక్షల సంఖ్యలో తరలి రావడం ఏమిటి?. ఫలితంగా తొక్కిసలాట జరగడం ఏమిటి?. అంతమంది మరణించడం ఏమిటి. కొన్ని యూరప్ దేశాలలో ఫుట్ బాల్ మ్యాచ్ తర్వాత ఘర్షణలు చోటు చేసుకుని అనేక మంది మరణించిన సందర్భాలు ఉన్నాయి. మన దేశంలో ఆ పరిస్థితి పెద్దగా కనిపించదు. అంతవరకు బాగానే ఉందనుకుంటే ఈ విజయోత్సవ కార్యక్రమం ప్రమాదం తెచ్చిపెట్టింది. ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు స్పందించి తొమ్మిది ప్రశ్నలు వేసి వివరంగా నివేదిక సమర్పించాలని కోరింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. నగర పోలీస్ కమిషనర్ దయానంద్, మరో ఐదుగురిని సస్పండ్ చేశారు. ఆర్సీబీ ప్రతినిధులను కూడా అరెస్టు చేశారు. యజమానులను అరెస్టు చేయాలని చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఒక థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి, ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఘటనలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి ఇందులో అర్జున్ తప్పు ఏ మేరకు ఉందన్న మీమాంస ఉంది. చంద్రబాబు గత టర్మ్లో రాజమండ్రి వద్ద పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు. ఆ తొక్కిసలాటకు కారణం చంద్రబాబు నాయుడు కుటుంబం. వీఐపీ ఘాట్ వద్ద కూడా సామాన్య ప్రజలకు కేటాయించిన ఘాట్లో స్నానం చేయడం, దానిని ప్రచార డాక్యుమెంటరీగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ చిత్రీకరించడం, ఆ క్రమంలో జనం పెరిగిపోయి గేట్లను ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట సంభవించడం జరిగింది.ఆ తర్వాత దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ కూడా మాయమైందని చెబుతారు. ఇంతమంది మృతి చెందిన ఘటనపై ఆనాటి న్యాయ వ్యవస్థ స్పందించలేదు. అలాగే పాలనా వ్యవస్థ కనీసం సీనియర్ అధికారులను కాదు కదా!.. ఒక్క కానిస్టేబుల్ ను కూడా సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే చంద్రబాబు చేసిన తప్పిదాలు కూడా బయటకు వస్తాయనే కదా! న్యాయ విచారణ కు ఆదేశం అంటూ ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో కమిషన్ వేశారు. ఆయనేమో ఇదంతా మీడియా ప్రచారం వల్ల అని తేల్చారు తప్ప చంద్రబాబు జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. దానిపై చాలా విమర్శలు వచ్చాయి. ఇక చంద్రబాబేమో ప్రమాదాలు ఎక్కడ జరగడం లేదు.. పూరీలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా.. అంటూ పుష్కరాల తొక్కిసలాట మరణాలను తక్కువ చేసే యత్నం చేశారు.అదే కాదు.. తిరుపతి శేషాచలం కొండలలో 20 మంది ఎర్ర చందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే కూడా న్యాయ వ్యవస్థ ఆశించిన రీతిలో స్పందించ లేదన్న విమర్శ ఉంది. ఆ కూలీలు తమిళులు కావడంతో అక్కడి ప్రభుత్వం వారికి పరిహారం ఇచ్చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం వారిని నేరస్తులుగా పరిగణిస్తే, ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వారిని గుర్తించింది. ఈ మధ్యనే తిరుపతి తొక్కిసలాట, సింహాచలం ఆలయ గోడ కూలిన ఘటనలపై న్యాయవ్యవస్థ సుమోటోగా తీసుకోలేదు. విశాఖపట్నంలో సుధాకర్ అనే డాక్టర్ తాగి రోడ్డుపై అల్లరి చేసి ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తుంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి పోలీస్ స్టేషన్కు తీసుకువెళితే అప్పట్లో హైకోర్టు ఏకంగా సీబీఐ విచారణకే ఆదేశించిందింది. అదేమీ తేలలేదు. అది వేరే విషయం.మరి కొద్ది రోజుల క్రితం తెనాలిలో ముగ్గురు దళిత, ముస్లిం యువకులను పోలీసులు నడిరోడ్డులో అరికాళ్లపై లాఠీలతో కొడుతూ హింసించి వీడియో తీస్తే న్యాయ వ్యవస్థ ఎందుకు అదే స్థాయిలో స్పందించలేదో తెలియదు. న్యాయ వ్యవస్థలు కొన్ని ప్రభుత్వాల పట్ల సానుకూల ధోరణితో, మరికొన్ని ప్రభుత్వాల పట్ల వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న భావన ప్రజలలో నెలకొంది. ప్రత్యేకించి ఏపీలో జగన్ టైమ్లో న్యాయ వ్యవస్థ స్పందించిన తీరుపై చాలా విమర్శలు వచ్చేవి. చంద్రబాబుకు ఎప్పుడో అరుదుగా తప్ప న్యాయ వ్యవస్థ నుంచి ఎలాంటి ఇబ్బందులు రావన్న భావన నెలకొంది. అలాగే ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలను బట్టి కాకుండా, ధర్మం, న్యాయాలను బట్టి వ్యవస్థలు స్పందించడం అవసరం అని చెప్పవలసి ఉంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
KSR Live Show: నీచంగా దిగజారుతున్న టీడీపీ.. శాతవాహన కాలేజీని కూల్చేసిన పచ్చ మాఫియా
-
బెడిసికొట్టిన బాబు సర్వే.. జగన్ కు జై కొట్టిన టీడీపీ ఓటర్లు
-
టీడీపీకి బిగ్ షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా
సాక్షి, అన్నమయ్య: ఏపీలో అధికార కూటమి పార్టీ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అన్నమయ్య జిల్లాలో సీనియర్ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను అందజేశారు. దీంతో, పచ్చ పార్టీకి బిగ్ షాక్ తగలినట్టు అయ్యింది.అన్నమయ్య జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తున్నట్ట ప్రకటించారు. ఈ మేరకు లేఖలో వెల్లడించారు. సుగవాసి సుబ్రహ్మణ్యం 2024లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడు సుబ్రహ్మణ్యం.తన రాజీనామా సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, మహానాడులో పాలకొండ్రాయుడికి నివాళులు సక్రమంగా అర్పించలేదని అన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను తొక్కేస్తున్నాడని గతంలో బహిరంగంగా సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు. ఇక, సుబ్రహ్మణ్యం రాజీనామాతో రాయచోటి, రాజంపేటలో టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ..‘ప్రజల అభిప్రాయాలను గౌరవించే పార్టీకి రాజీనామా చేశాను. రాజీనామా నిర్ణయం ఈరోజు తీసుకున్నది కాదు. ఐదారు నెలల నుంచే దీనిపై ప్రజాభిప్రాయాలు సేకరించాను. భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయాల్లో కోనసాగుతాను. ప్రజలకు తోడ్పాటు అందిస్తాను. నా రాజీనామా విషయం మా తండ్రితో ముందే చర్చించాను. ఆయన అనుమతి ఉన్నట్లే భావిస్తున్నాను’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. కూటమికి సర్వేల షాక్
-
Big Question: సర్వే తెచ్చిన కుంపటి.. టీడీపీ ఓటమి పక్కా.. నెక్స్ట్ జగనే
-
ఆంధ్రప్రదేశ్లో కుప్పకూలిన శాంతిభద్రతలు.. చంద్రబాబుతోపాటు టీడీపీ నేతల నేరపూరిత చర్యలే అందుకు కారణం.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మండిపాటు
-
సెల్ఫీ వీడియో వైరల్.. జగనన్న..ఈ అవమానం భరించలేను
-
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’
సాక్షి, అమరావతి: ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’ను ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని, 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనమిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలని పేర్కొన్నారు. వీటి కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ‘మూలపేట–విశాఖపట్నం, విశాఖపట్నం–కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని, వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని సీఎం చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని యత్నిస్తున్నామని సీఎం చెప్పారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంపై సమీక్షలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరు పోర్టులు, ఏడు మాన్యుఫాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్తో విశాఖ ఎకనమిక్ రీజియన్ను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్టు సీఎం చెప్పారు. దీనిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్, ఐఎస్ఈజీ ఫౌండేషన్ మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది. సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణ్యం, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం–బనకచర్ల హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడానికి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేశామని చెప్పారు. రూ.81,900 కోట్ల వ్యయంతో 50 శాతం రూ.40,950 కోట్లు ఈఏపీ(విదేశీ) రుణం, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్గా 20 శాతం రూ.16,380 కోట్లు సమకూర్చుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీగా 10 శాతం రూ.8,190 కోట్లు, హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ) విధానంలో మరో 20 శాతం రూ.16,380 కోట్లు ఖర్చు చేసేలా అధికారులు చేసిన ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదించారు. -
ధోకా బాబూ..!
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తోంది. ఒకవైపు వక్ఫ్ బోర్డు సవరణకు వత్తాసు పలికిన సర్కారు... మరోవైపు రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో ముస్లిం మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేయకుండా సాచివేత ధోరణి అవలంబిస్తోంది. ఏడాదిగా హామీల అమలు కోసం నిరీక్షించిన ముస్లింలు ఇప్పుడు హామీల అమలెప్పుడు బాబూ అంటూ గళమెత్తుతున్నారు. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా తోఫా కూడా అందించని కూటమి సర్కారు తాజాగా బక్రీద్(శనివారం) నాటికి కూడా హామీల అమలుకు కార్యాచరణ చేపట్టకపోవడంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది.టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీల కోసం ఇచ్చిన తొమ్మిది ప్రధాన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గతంలోను ఇదే మాదిరిగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు దగా చేసిన విషయాన్ని ముస్లింలు గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నవి, సభల్లో ప్రకటించిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కనీసం శ్రద్ధ చూపకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. –సాక్షి, అమరావతిఏడాదైనా అమలు కాని ముస్లింలకు ఇచ్చిన హామీలివే..» ముస్లిం మైనార్టీలకు 50ఏళ్లకే పెన్షన్» ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్లకు స్థలాలు కేటాయింపు » విజయవాడ సమీపంలో హజ్హౌస్ నిర్మాణం » నూర్బాషా కార్పొరేషన్ ఏర్పాటు, ఏటా రూ.వంద కోట్ల కేటాయింపు » మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణాలు » ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం బకాయిలతోసహా పూర్తిగా అందించే చర్యలు (వీటిని ఏడాదికి చెల్లిస్తున్నట్టు జీఓ ఇచ్చి 9నెలలకు సర్కారు సరిపెట్టింది. ఇంకా ఆరునెలలకు చెల్లించాల్సి ఉంది.)» అర్హత ఉన్న ఇమామ్లు ప్రభుత్వ ఖాజీలుగా నియామకం » మసీదుల నిర్వహణకు ప్రతినెలా రూ.5వేలు ఆర్థిక సాయం » హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు రూ.లక్ష (గత ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులూ 2024 హజ్ యాత్రకు వెళ్లిన వారికి చెల్లించకపోగా ఈ ఏడాది వెళ్లిన కూడా ఒక్క పైసా విదల్చలేదు.)జగన్ హయాంలో రూ.20,863కోట్ల లబ్ధి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శంగా నిలిచారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన 51,00,771 మందికి రూ.20,863.40కోట్ల లబ్ధి చేకూర్చారు. ఇమామ్లకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10వేలకు, మౌజన్లకు రూ.3 వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంచి ఆదుకున్నారు. ఆదాయంలేని మసీదుకు రూ.5వేలు చొప్పున అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఏడాదైనా దాని ఊసే ఎత్తడం లేదు. వడ్డీలేని రుణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఎన్డీఏ కూటమికి ఓట్లేసిన ముస్లింలు మరోసారి మోసపోయామని ఇప్పుడు బాధపడుతున్నారు. –షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడుమైనారిటీలపై కూటమి ప్రభుత్వం వివక్ష రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ఆదరిస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రభుత్వం ముస్లింలకు తీరని అన్యాయం చేసింది. రాష్ట్రంలో నూర్ బాషా, దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, రూ.వంద కోట్లు కేటాయిస్తానని 2014, 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు దగా చేశారు. –షేక్ దస్తగిరి, ముస్లిం దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యపై కూటమి సర్కారు నిర్లక్ష్యంఆంధ్రప్రదేశ్లో ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ విద్యా పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కూటమి ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల కలల్ని చిదిమేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి కేవలం రూ.20 కోట్లు కేటాయించినా దానిలో ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదు. జూన్, జూలై, ఆగస్టు నెల నుంచి విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నా విదేశీ విద్యా పథకానికి నోటిఫికేషన్ వెలువడకపోవడం వల్ల విద్యార్థులు అడ్మిషన్, వీసా ప్రక్రియల్ని కొనసాగించలేని దుస్థితిలో ఉన్నారు. –షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ -
కుప్పకూలిన శాంతిభద్రతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ (శాంతిభద్రతలు) కుప్పకూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందని, అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలను గుర్తు చేశారు. అధికారంలో ఉన్న వారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ ఎత్తిచూపారు. మీ పద్ధతి మార్చుకోకపోతే.. ప్రజలు ఎల్లకాలం చూస్తూ ఊరుకోరని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇస్తూ ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..1 అధికార పార్టీ.. పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య వాహనం డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో ఓ పోలీసు చలానా రాశాడు. దీంతో ఆ ఎమ్మెల్యే.. ఆ కానిస్టేబుల్ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్తో దాడి చేయిస్తారా? చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?2 రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం పరిపాటిగా మారింది. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు. లంచం ఇవ్వలేదని.. లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదేళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. చంద్రబాబు ఏడాది పాలనలో రెడ్బుక్ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది? అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? వ్యవస్థలు సక్రమంగా పని చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా? 3 ప్రజా సమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో మోది చంపేశారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా? అలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా? 4 శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. నిందితులకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక, తండ్రి లేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది.5 ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు. చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందిన వారు అని, ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు.. కేవలం పాలన మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబూ.. మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. -
మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు: వైఎస్ జగన్
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతిభద్రతపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలో ఉన్నవారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, చలానా రాసినందుకు ఆ ఎమ్మెల్యే ఆ కానిస్టేబుల్ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్తో దాడిచేయిస్తారా? , చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయింది‘రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు.. లంచం ఇవ్వలేదని లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.10 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. .@ncbn గారి పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి.… pic.twitter.com/9w3zBRhTub— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2025చంద్రబాబుగారి ఏడాదిపాలనలో రెడ్బుక్ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది?, అక్రమకేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?, వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా?, ప్రజాసమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో కొట్టి చంపేశారు.ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా?’ అని నిలదీశారు వైఎస్ జగన్. మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరుఅలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా? , శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడు గుర్రాకులపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదుకూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. నిందితులకు అధికారపార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక తండ్రిలేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది. ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు.చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందినవారని ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు కేవలం పాలనమాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీకూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబుగారూ మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది.’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
లిక్కర్ కేసు అంతా వట్టిదేనా?.. బాబుకు సీను అర్థమైపోయిందా?
అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారా..?వైఎస్ జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది.. మూడువేలకోట్ల అవినీతి జరిగిందని సొంతపేపర్లలో వార్తలు రాయించిందంతా నాటకాలేనా ... అసలువైఎస్ జగన్ హయాంలో కుంభకోణం జరగలేదని.. దానికి ఎలాంటి ఆధారాలూ లేవని బాబుకు ఇప్పుడు తెలిసొచ్చిందా ? అందుకే మొన్నటి కేబినెట్ భేటీలో పిల్లిలా సన్నాయినొక్కులు నొక్కారా ? అదే అనిపిస్తోంది. వాస్తవానికివైఎస్ జగన్ హయాంలో మద్యం వ్యాపారం మొత్తం బేవరేజెస్ కార్పొరేషన్ చేసింది.. లాభమంతా కార్పొరేషన్ కు వస్తుంది.. కార్పొరేషన్ అంటే ప్రభుత్వం .. అంటే సర్కారుకు లిక్కర్ వ్యాపారం ద్వారా భారీ ఆదాయం వచ్చింది.. పైగా వీధుల్లో ఇష్టానుసారం దుకాణాలు.. అక్రమ బెల్ట్ షాపులు కూడా లేకపోవడంతో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. మద్యం ద్వారా భారీ ఆదాయం రావడంతోవైఎస్ జగన్ కూడా సంక్షెమ పథకాలు దర్జాగా అమలు చేసారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ కుంభకోసం అనే కాన్సెప్ట్ ను ప్రజల్లోకి ఎక్కించేందుకు యాతన పడ్డారు. అనుకూల మీడియాలో రకరకాల వార్తలు రాయించారు..పనిలోపనిగా అప్పటి ఏపీ బీసీఎల్ ఎండీ వసుదేవరెడ్డిని ... రాజ్ కసిరెడ్డిని ఇంకొందరిని అరెస్ట్ చేసి అదేదో పెద్ద కుంభకోణం అన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు తపనపడ్డారు. ఇదే ఊపులో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అన్నట్లుగా లీకులు ఇచ్చారు. అయితే ఈ అంశం మీద చంద్రబాబు నిన్న వాస్తవాలు చెప్పేసారు. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయం మీద స్పష్టత ఇచ్చేసారు. "నన్ను స్కిల్ స్కాములోవైఎస్ జగన్ సర్కారు అరెస్ట్ చేసింది కదాని నేను ఆయన్ను లిక్కర్ కుంభకోణంలో ఎలా అరెస్ట్ చేస్తాను.. ఆధారాలు ఉండాలి కదా.. అవి లేకుండా అరెస్ట్ చేస్తే ప్రజలకు దొరికిపోతాం కదా." అనేసారు.. అంటే రాష్ట్రంలో ఆనాడు కుంభకోణమే జరగలేదని చంద్రబాబు అన్యాపదేశంగా కేబినెట్లో ఒప్పేసుకున్నారు. అంటే అది అసలు కుంభకోణమే కాదని.. కేవలంవైఎస్ జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మొదలెట్టిన దుష్ప్రచారం అని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లు కేబినెట్ సహచరులు చెబుతున్నారు. మరి ఏమీ లేనిదానికి ఇలా కుంభకోణం అని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంటే వచ్చి ఏడాది అయినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలుచేయలేని ఈ ప్రభుత్వం ఒక్కో నెల ఒక్కో అంశాన్ని జనంలోకి తీసుకెళ్లి వారి దృష్టిని మరల్చడానికి చేస్తున్నట్లు ఒప్పుకుంటున్నట్లు అర్థం అవుతోంది..-సిమ్మాదిరప్పన్న -
బాబుకు సీఎం రేవంత్ రెడ్డి దాసోహం: హరీష్ రావు ఫైర్
సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు దాసోహమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన క్యాబినెట్ సమావేశం వలన ఎటువంటి ప్రయోజనం లేకపోగా, తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిగా మరచిపోయిందని, రాష్టంలోని కాంగ్రెస్ నేతలు గాలి మోటార్పై తిరుగుతూ, గాలి మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. తాము ఏదో చేస్తున్నామని చెప్పుకునేందుకు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారని, అది తీవ్ర నిరాశనే మిగిల్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ ఇచ్చేందుకు ముచ్చటగా మూడు కమిటీలు వేశారని, దీనిపై క్యాబినెట్లో ఐదు గంటలపాటు చర్చించడం అవసరమా అని హరీష్ రావు ప్రశ్నించారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను నిట్ట నిలువునా ముంచుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు. సక్రమంగా పనిచేస్తున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్నదని, పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి, గ్రామాభివృద్ధికి పాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో సీఎం రెవంత్ రెడ్డిని మించిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది మాట్లాడిన అబద్ధమేనని, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమార్లు ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహం అయ్యారని హరీష్ రావు ఆరోపించారు.రైతులను దెబ్బతీసేలా క్రాఫ్ హాలీడేను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, 65 టీఎంసీల నీటిని ఉపయోగించకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. నీతి అయోగ్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదని హరీష్ రావు నిలదీశారు. అలాగే చంద్రబాబు ఎదురించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. గోదావరి బనకచెర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వెళ్లనున్నదని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. శ్రీశైలం రైడింగ్ పాజెక్టు పనులు నిలిపివేయాలని కోరారు. కాళేశ్వరం కుప్ప కూలిందని చెబుతున్న సీఎం రెవంత్ రెడ్డి గంగమళ్లకు నీటిని ఎక్కడి నుంచి తెస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల -
విశాఖలో రెచ్చిపోతున్న PDS రైస్ మాఫియా
-
తప్పు చేసినా అడగొద్దంటే ఎలా?
ఆరోపణలు ఉంటే విచారించి కోర్టుకు హాజరుపరచడం.. శిక్ష పడేలా చూడటం పోలీసుల బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ బాధ్యతను మరచినట్టున్నారు. తెనాలిలో ముగ్గురు యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలు ఝళిపించిన ఘటన గురించే ఈ ప్రస్తావన. పోలీసుల తీరు ఎలా ఉందంటే.. ‘‘దౌర్జన్యం చేసినా మమ్మలను ఎవరూ ప్రశ్నించకూడదు!.. రోడ్లపై ఎవరినైనా కొట్టే అధికారం మాకుంది’’ అన్నట్టుగా ఉంది!!. ఇప్పటికే.. టీడీపీ నేత, మంత్రి లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో మసకబారిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రతిష్ట తెనాలి ఘటనతో మరింత దిగజారింది! పోలీసుల దౌర్జన్యానికి బలైన యువకులపై ఉన్న నేరాభియోగాలను సమర్ధించడం లేదు కానీ.. నిందితులను ఇలా నడిరోడ్డుపైనే కొట్టడం మొదలుపెడితే అది వారితో మాత్రమే ఆగదు. సామాన్యులపై కూడా ఇష్టారీతిన దౌర్జన్యానికి దారితీస్తుందన్నది గుర్తించాలి. 👉తెనాలిలో మానవ హక్కులను ఉల్లంఘించి(Tenali Incident Human Rights Violation) మరీ జరిగిన దాష్టీకంపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రశ్నలు సంధిస్తే తట్టుకోలేని అధికారపక్షం, ఎల్లోమీడియా.. జగన్ నేరస్తులకు అండ అంటూ వక్రీకరిస్తోంది. పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి. తప్పు చేసిన పోలీసులపై చర్య తీసుకోవల్సిన హోం మంత్రి అనిత వారి దుశ్చర్యలకు మద్దతిస్తూ మాట్లాడడం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధ్వాన్న పాలనకు తాజా నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 👉చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కొన్ని పర్యటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సొంతపార్టీలో ఒకవర్గమే ఇంకో వర్గం నేత వీరయ్య చౌదరిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినా మృతుడి అంత్యక్రియలకు హాజరవడం వీటిల్లో ఒకటి. హత్యకు కారణం కూడా అక్రమ దందాలే!. అలాంటి పలు ఆరోపణలు ఉన్న వ్యక్తి హత్యకు గురైతే చంద్రబాబు, ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేశ్, హోంమంత్రి వారి ఇంటికి పరామర్శకు వెళ్లారు. అది దేనికి సంకేతం? నేరాభియోగాలకు గురైన వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయి నేత మద్దతు ఇచ్చినట్లు కాదా?. 👉తెనాలిలో పోలీసులు కొట్టిన ముగ్గురు యువకులపై కేసులు ఉంటే ఉండొచ్చు. వాటిల్లో కొన్నింటిని కోర్టులు కొట్టివేశాయనీ వార్తలున్నాయి. ఒక యువకుడిపై కేసులే లేవు. అయినా ఒక కానిస్టేబుల్ పై దాడి చేశారన్న కేసులో వీరిని నడిరోడ్డుపై హింసించారు. ఇదెక్కడి పద్ధతి?. విపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా హత్యకు గురైన చంద్రయ్య అనే కార్యకర్త పాడెను చంద్రబాబు మోశారు. వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు ముడిపెట్టి లబ్ది పొందే యత్నం చేశారు. మరి అది సరైనదేనా?. ఈ చర్య ఫ్యాక్షనిస్టులకు మద్దతు ఇచ్చినట్లా కాదా? పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తల రౌడీయిజానికి ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీస్ వ్యాన్ దగ్ధమైంది. అక్కడే ఉన్న చంద్రబాబు టీడీపీ వారిని వారించారా? కనీసం ఆ కానిస్టేబుల్ పట్ల సానుభూతి చూపారా? అదేమీ చేయలేదే. అంటే రౌడీయిజంకు అండగా చంద్రబాబు నిలబడ్డారని ఒప్పుకుంటారా?. 👉2014-19 మధ్యకాలంలో ఇసుక అక్రమ తవ్వకాన్ని అడ్డుకున్నందుకు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వనజాక్షి అనే ఎమ్మార్వోపై దౌర్జన్యం చేశారు. అప్పుడు చింతమనేనిని మందలించకపోగా, వనజాక్షిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసి రాజీ పడాలని చెప్పారు. అంటే చంద్రబాబు అప్పుడు ఇసుక మాఫియాకు అండగా నిలబడినట్లే కదా?. ఇటీవలికాలంలో ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలు ప్రతిపక్షంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గురజాల వద్ద హరికృష్ణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను స్థానిక సీఐ, టీడీపీ నేత వాహనంలో తరలించడమే కాకుండా, అతనిని తీవ్రంగా హింసించారు. ఇలా అనేక ఘటనలలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోంది. అలాంటప్పుడు జగన్ వాటిపై స్పందించకుండా ఎలా ఉంటారు? పోనీ ఈ మధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకుంటున్నారా? అదేమీ లేదు. పైగా వారికి అండగా ఉంటున్నారు. 👉బలం లేకపోయినా పలు మున్సిపాల్టీలలో, కార్పొరేషన్లలో బలవంతంగా తమ అధీనంలోకి తీసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ కిడ్నాప్ వంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు వారిని వారించలేదు. పైగా వారికి అండగా కనిపించారు. విశాఖపట్నం, తిరువూరు, తిరుపతిలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం.ఇక ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నా, ఎవరిపై పోలీసులు చర్య తీసుకోవడం లేదు. జమ్మలమడుగు, పిడుగురాళ్లల వద్ద సిమెంట్ కంపెనీలు మూతపడేలా ఎమ్మెల్యేలే ప్రవర్తిస్తే పోలీసులు ఏమైనా చర్య తీసుకున్నారా?. శ్రీకాకుళం వద్ద తమకు రెడీమిక్స్ ఉచితంగా సరఫరా చేయాలని, నిర్దిష్ట మొత్తం లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలు జరిగాయి. జమ్మలమడుగు వద్ద ఇద్దరు నేతలు బహిరంగంగా గొడవపడితే నో కేసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 👉జగన్ ప్రభుత్వ కాలంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చంద్రబాబు, ఎల్లో మీడియా విపరీతమైన హడావుడి చేసేవి. విశాఖలో మద్యం తాగి రోడ్డుపై నానా రగడ చేస్తున్న డాక్టర్ సుధాకర్ను ఒక పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేతులు వెనక్కి పెట్టి పోలీస్ స్టేషన్కు తీసుకువెళితే.. ‘‘దళితుడిపై అఘాయిత్యమా?’’ అని ప్రచారం చేశారు. తెనాలిలో ఇంత బహిరంగంగా దళిత, ముస్లిం యువకులను పోలీసులు కొడితే మాత్రం తప్పు కాదట!. రాజమండ్రి వద్ద ఏదో ఒక అభియోగంపై ఒక వ్యక్తికి శిరోముండనం చేయించిన పోలీసును అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేయించింది. అయినా టీడీపీ దీనిపై నానా యాగీ చేసింది. తెలుగుదేశం పార్టీ అన్నింటిలోనూ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుంటుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్సీపీలో ఉండగా... ఎంపీడీవోతో దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగానే జగన్ ప్రభుత్వం ఆయనపై కేసుకు ఆదేశించింది. అప్పట్లో ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కోటంరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం గత టర్మ్లో ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఆయనపై చంద్రబాబు, లోకేశ్లు పలు నిందారోపణలు చేశారు. క్లబ్లు నడుపుతున్నారని, భూ కబ్జాలు చేశారని ఇలా అనేకం చెప్పారు. తీరా ఎన్నికల సమయానికి కోటంరెడ్డిని, గుమ్మనూరును తమ పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చారు. ప్రస్తుత డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా తెనాలి ఘటనలో పోలీసుల చర్యను సమర్థించడం విస్మయం కలిగిస్తుంది. ఒకపక్క తనపై వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు అరెస్టు చేసి 125 సార్లు కొట్టారని చెబుతూ, మరో పక్క తెనాలిలో నిందితులను పోలీసులు కొట్టడాన్ని ఎలా సమర్థిస్తారు?. తెనాలి యువకులు నేరం చేసి ఉంటే అది ఆ ఊరికే పరిమితం. కానీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ అంటూ రోజూ టీవీల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న అభియోగంపై అరెస్టు చేశారు. ఇందులో ఎవరిది పెద్ద తప్పు, ఎవరిది చిన్న తప్పు అన్నది ఆలోచించుకోవాలి. ఎవరినైనా పోలీసులు కొట్టడాన్ని సమర్థించరాదు. నిజానికి చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలీసులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారనే అభిప్రాయం ఉంది. అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారన్న విమర్శ ఉంది. తిరుమల శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే ఒక్క పోలీసుపై కూడా చర్య తీసుకోలేదు. రాజమండ్రిలో పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందితే ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కాలేదు. ఒకరిపై చర్య తీసుకుంటే అది తన మెడకు కూడా చుట్టుకుంటుందన్న భయం కూడా ఉండి ఉండవచ్చు. చంద్రబాబు పాలనలో అయితే ప్రలోభాలు పెట్టడం, లేకపోతే పోలీసులను ప్రయోగించి అరాచకంగా పాలించడం సర్వ సాధారణమేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ తెనాలి వెళ్లడంపై విమర్శలు చేస్తున్న హోం మంత్రి అనిత తన ధర్మం ఏమిటో విస్మరించి పోలీసులు చేసిన హింసను సమర్ధిస్తూ మాట్లాడడం అంటే ఈమె చేతిలో ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. అంతే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వెన్నుపోటు వీరుడా.. చంద్రబాబు మీద సాంగ్ వైరల్
సాక్షి, అమరావతి: చంద్రబాబు మోసాలు, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పాటను రిలీజ్ చేసింది. వెన్నుపోటు వీరుడా.. అబద్ధాల శూరుడా.. నీకు నీవే సాటి రా.. అంటూ సాగే ఆ వీడియో సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో రిలీజ్ చేయగానే అత్యధికులు దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. తల్లికి వందనం, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, ధరల పెరుగుదల.. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ, ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారో ఆ సాంగ్ స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.Here is the teaser of "వెన్నుపోటు వీరుడా.. అబద్దాల శూరుడా!" song!Vennupotu Veerudaa.. Abaddhaala Shurudaa!🎧 Stay tuned for the full song, releasing today at 8 PM — launching on the @we_ysrcp YouTube channel!📲 👇🏻https://t.co/VOuzq3sSkA#VennupotuVeerudaa… pic.twitter.com/PFu655VgvZ— YSR Congress Party (@YSRCParty) June 4, 2025 -
ఇలాగైతే.. మాకు చావే గతి
సాక్షి, అమరావతి: “ఏడాదిగా మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. మాకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు ఇప్పుడు ఇవ్వలేమని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మా దగ్గర ఉన్న బస్సులు తగులబెట్టి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే గత్యంతర లేదు’ అని వాపోతున్నారు ఆర్టీసీకి అద్దె బస్సులు నడుపుతున్న ఎస్సీ, ఎస్టీ అద్దె బస్సుల యజమానులు. ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, తాము పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఏడాదిలో ఒక్క రూపాయైనా ఇవ్వలేదు ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “వైఎస్సార్ బడుగు వికాసం’ పథకం కింద వీరంతా బస్సులు కొనుగోలు చేసి ఏపీఎస్ ఆర్టీసీకి అద్దె బస్సులుగా నడుపుతున్నారు. 300 మందికిపైగా ఎస్సీ, ఎస్టీ యువత గత ప్రభుత్వ ప్రోత్సాహంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బస్సులు కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీరికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు నిలిపివేసింది. ఈ పథకం కింద లబ్ధి పొందిన ఎస్సీలకు సుమారు రూ.500 కోట్లు, ఎస్టీలకు రూ.150 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయకుండా కూటమి సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కేవలం వైఎస్సార్ బడుగు వికాసం పథకం కింద లబ్ధి పొందారన్న ఏకైక కారణంతో బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు లోకేశ్, టీజీ వెంకటేష్తోపాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, డైరెక్టర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్లను అనేకసార్లు కలిసి తమ కష్టాలు మొరపెట్టుకున్నా ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని వాపోయారు. కనీసం రుణాల చెల్లింపునకు సంబంధించి బ్యాంకులతోనైనా మాట్లాడండి అని కోరుతున్నా ఉపయోగం లేకుండా పోతోందంటున్నారు. ఏడాది కావస్తున్నా బకాయిలతో పాటు ఈ ఏడాది ప్రోత్సాహకాల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క అద్దె బస్సు నుంచి ప్రభుత్వానికి అన్ని ఖర్చులు పోనూ ప్రతినెలా రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తోందని బస్సు యజమానులు చెబుతున్నారు. ప్రతినెలా 300 అద్దె బస్సుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.9 కోట్లకుపైగా ఆదాయాన్ని బడుగు పారిశ్రామికవేత్తలు సమకూరుస్తున్నా ప్రభుత్వం తమపై కనికరం చూపించడం లేదని వాపోతున్నారు. ఈ నెల 27న అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ డే లోగా పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయాలని.. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేసి సీఎం ఇంటిని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమంటూ ఎస్సీ, ఎస్టీ అద్దె బస్సుల యజమానులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. డబ్బులు లేనప్పుడు హామీ ఎందుకిచ్చారు? చదువుకున్నా ఉద్యోగాలు లేని సమయంలో గత ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎంటర్ప్రెన్యూర్గా తయారవుదామన్న ఆశతో వైఎస్సార్ బడుగు వికాసం పథకం కింద బస్సు కొనుగోలు చేసి నెల్లూరు–పామూరు మధ్య తిప్పుతున్నాను. ఈ పథకం కింద ఇస్తామన్న రాయితీలు ఇవ్వకపోవడంతో నాలాగే అనేకమంది ఎస్సీ, ఎస్టీ యువకులు బ్యాంకు ఈఎంఐలు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను కలిస్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. రాయితీలు ఇప్పుడు ఇవ్వలేం అంటున్నారు. డబ్బులు లేనప్పుడు ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇందుకు ఇచ్చారు. – హరి, నెల్లూరు–పామూరు అద్దె బస్సు ఓనర్ మా గోడు వినేవారేరి? బడుగులు గోడు వినిపించుకునే అధికారులే కనిపించడం లేదు. ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ వంటి పెద్ద కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి వస్తున్న డబ్బులు మా ఎస్సీ, ఎస్టీలకు చెందిన చిన్న కంపెనీలకు వచ్చేసరికి ఎందుకు ఉండటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశాం. మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను కలిసి విజ్ఞప్తి చేశాం. అధికారులనైతే లెక్కలేనన్నిసార్లు కలిశాం. అయినా ఉపయోగం లేదు. బ్యాంకు వాళ్లు పెడుతున్న ఇబ్బందులతో మేం బస్సులు నడపలేకపోతున్నాం. తక్షణం ప్రోత్సాహకాలు ఇప్పించండి. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – రాపాక మహేష్, అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ -
వెన్నుపోటు దినం కేవలం ట్రైలర్ మాత్రమే.. రాచమల్లు శివప్రసాద రెడ్డి మాస్ కౌంటర్
-
‘లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినా, దాన్ని అధిగమించి ప్రజలు సక్సెస్ చేశారనే విషయం కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఈరోజు(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ఇప్పటికైనా చంద్రబాబు పాలన గురించి ఆలోచించాలని హితవు పలికారు. ‘ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించాం.వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనంనుంచి అద్బుతమైన స్పందన లభించింది.వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారు.ఏడాదిగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులుపెట్టి వేధించారు.సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదు.ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలి. దోచుకునే బ్యాచ్కే పండుగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలి .రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు-2 సమయానికి జనం తిరగబడొచ్చు.వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న నన్ను పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారు. సీఐకి మంత్రి లోకేష్ సపోర్ట్. బెదిరించి, భయపెట్టాలని చూశారు. అనివార్య పరిస్థితుల్లో ఎదురుతిరగాల్సి వచ్చింది. నేను చేసిన రెండు ఫిర్యాదుల గురించి అడిగితే సీఐ దురుసుగా మాట్లాడారు. లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాపై కేసు నమోదు చేశారు’ అని అంబటి స్పష్టం చేశారు. -
పదో తరగతి మూల్యాంకనంపై విచారణకు ఆదేశించాలి: ఆదిమూలపు సురేష్
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై తక్షణం సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ నిర్వాకంపై ఆశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లోకేష్తో సహా బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ప్రభుత్వపరంగా విద్యాసంస్థల్లో ఇచ్చే అడ్మీషన్లను వాయిదా వేయాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో తీవ్రస్థాయిలో తప్పులు జరిగాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిలోకం భగ్గుమంటోంది. అస్తవ్యస్తంగా పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం చేయించారు. విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన పదో తరగతి పరీక్షలను, జవాబు పత్రాల మూల్యాంకనంను లేనిపోని గొప్పలకు పోయి, అడ్డగోలుగా, నిర్లక్ష్యంగా నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఫలితాలను వెలువరిస్తామంటూ చేసిన హడావుడికి ఎందరో విద్యార్దులు నష్టపోయారు.పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం వరకు విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వారం రోజుల్లోనే మూల్యాంకనాన్ని పూర్తి చేయాలంటూ టీచర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా సోషల్ స్టడీస్ జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం అయిదు రోజుల్లో పూర్తి చేశారనే విషయం బయటపడింది. ఏప్రిల్ 1న పరీక్షలు పూర్తయితే, ఏప్రిల్ 23న ఫలితాలను వెలువరించారు. అంటే దాదాపు 21 రోజులు తీసుకున్నారు. 2022-23 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం 17 రోజుల్లోనే సమర్థంగా పరీక్షా ఫలితాలను విడుదల చేసింది.కార్పోరేట్ విద్యాంస్థలకు లబ్ధి చేకూర్చడానికే..కూటమి ప్రభుత్వంలోని విద్యాశాఖ కార్పోరేట్ ఇంటర్ కాలేజీలకు కొమ్ము కాయడానికే ఈ హడావుడి చేసింది. జేఇఇ, నీట్ కోర్సులకు ఎక్కువ రోజులు కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనికోసం ముందుగానే పదో తరగతి ఫలితాలను వెలువరించాలనే ఒత్తిడికి విద్యాశాఖ తలొగ్గింది. ముందుగానే విద్యార్ధులను జాయిన్ చేసుకోవడం ద్వారా తమ విద్యా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసుకోవాలని కార్పోరేట్ సంస్థలు భావించాయి. విద్యార్ధుల అడ్మీషన్లతో సొమ్ములు దండుకోవడం కోసం కార్పోరేట్ విద్యా సంస్థల తొందరపాటుకు అనుగుణంగా ఏపీలోని విద్యాశాఖ పనిచేసిందనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకోసం వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడింది. ఇంత జరుగుతున్న విద్యాశాఖా మంత్రి నోరు మెదపడం లేదు.స్వయంగా తన శాఖలోనే ఇంత అవతకవతకలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11వేల మందికి పైగా విద్యార్ధుల ఉత్తీర్ణతా మార్కులు మారాయి. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కోసం దాదాపు 60 వేల మంది దరఖాస్తు చేసుకుంటే, దానిలో 11 వేల మందికి పైగా విద్యార్దుల మార్కుల్లో తేడాలు కనిపించాయి. అంటే 30 శాతం పైచిలుకు జవాబుపత్రాల్లో తేడాలు కనిపించడం ఆందోళనకరం. ఇవి కేవలం దరఖాస్తు చేసుకున్న వారివే అయితే, ఇక దరఖాస్తు చేసుకోని వారు ఎంత మంది ఉంటారు? 20 మార్కులు వచ్చిన వారికి రీవాల్యుయేషన్లో 90 మార్కులు వచ్చాయి. అయిదు సబ్జెక్ట్లో పాస్ అయి, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వారికి రీవాల్యుయేషన్లో అత్యధిక మార్కులు వచ్చాయి. నెల్లూరుజిల్లాకు చెందిన సాయికుందన అనే విద్యార్ధినికి రీవాల్యుయేషన్ కు మందు 30 మార్కులు వస్తే, తరువాత 93 మార్కులు వచ్చాయి. దీనికి విద్యాశాఖ మంత్రి ఏం సమాధానం చెబుతారు? టీచర్లపై చర్యలతో చేతులు దులుపుకుంటున్నారుఈ వ్యవహారానికి టీచర్లను బాధ్యులను చేసి, చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. దీనిపై కనీసం ఒక సమగ్ర విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించకపోవడం దారుణం. ఇటువంటి తప్పుల వల్ల పదోతరగతి విద్యార్ధులు నష్టపోకుండా కోరిన ప్రతి విద్యార్ధి జవాబుపత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి. దరఖాస్తు చేసుకోని వారికి కూడా గడువును పొడిగించాలి. తుది ఫలితాలు వచ్చే వరకు పాలిటెక్నిక్, రెసిడెన్షియల్, ట్రిపుల్ ఐటీల అడ్మిషన్లను వాయిదా వేయాలి. దీనికి బాధ్యులైన విద్యాశాఖ మంత్రితో సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలి. రీవెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ ఫీజ్ను విద్యార్ధులకు రీఫండ్ చేయాలి.ఈ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నిస్తుంటే, విద్యాశాఖ మంత్రి ఈ సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుల తడకగా ఉన్న ఒక నోట్ను జారీ చేశాడు. పరీక్షల నిర్వహణ సరిగా లేదని నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. మార్చి 7వ తేదీన పరీక్షకు అరగంటకు ముందు ప్రశ్నాపత్రం లీకయ్యిందని నాగార్జన యూనివర్సిటీ అధికారులు గుర్తించి, అదే పరీక్షను మార్చి 12వ తేదీన తిరిగి నిర్వహించారు. ఇది మీశాఖ అసమర్థత కాదా?మేం తెచ్చిన సంస్కరణలను నీరుగారుస్తున్నారు..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యారంగంలో అనే సంస్కరణలను తీసుకువచ్చాం. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, బైజూస్ ట్యాబ్లు, టోఫెల్ శిక్షణ ఇలా అనే కార్యక్రమాలను కక్షకట్టి నీరుగార్చారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ఐబీ గురించి నేడు ఎల్లో మీడియాలో వ్యంగ్యంగా ప్రకటనలు చేస్తున్నారు. ఐబీ అమలు రిపోర్ట్ కోసం అయిదు కోట్లు ఖర్చు పెట్టారు, ఐబీని తీసుకువచ్చినట్లు కలలు కంటున్నారని మాట్లాడుతున్నారు. పలు ఇంగ్లీష్ జాతీయ పత్రికల్లో ఏపీ ప్రభుత్వం స్విట్జర్ల్యాండ్ ఇంటర్నేషనల్ బ్యాకలరీయేట్ ఆర్గనైజేషన్తో ఎంఓయు చేసుకుందనే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించిన విషయం వాస్తవం కాదా?దానికి సంబంధించి ఆనాడు పలు జాతీయ దినపత్రికలు ప్రచురించిన వార్తలను కూడా మీ ముందు ఉంచుతున్నాం. దీని గురించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అవగాహన లేదు. ఐబీ సిలబస్ ద్వారా విద్యార్ధుల విద్య, వ్యక్తిగత, సామాజిక నైపుణ్యాలను పెంపొందించవచ్చనే విషయం వారికి తెలియదు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఐబీ కరిక్యులమ్ ఉపయోగపడుతుంది. వైఎస్ జగన్ ప్రపంచ స్థాయిలో ఏపీ విద్యార్ధులు రాణించాలనే మంచి ఉద్దేశంతో ఈ కరిక్యులమ్ను ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావాలనే గొప్ప ఆలోచనతో ముందుడుగు వేశారు.దీని కోసం 2024-25లో ఉపాధ్యాయుల సామర్థ్యం, నైపుణ్యం పెంచే కార్యక్రమం, 2025-26లో ఒకటో తరగతి నుంచి విద్యార్ధులకు ఐబీ కరిక్యులమ్ అమలు చేస్తూ ప్రతి విద్యా సంవత్సరంలో ఒక్క తరగతి చొప్పున దానిని వర్తింప చేస్తూ పోవాలని ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతికి ఐబీ కరిక్యులమ్ను అమలు చేయడంను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలోని 150 దేశాల్లోని 5000 స్కూళ్ళలో ఈ సిలబస్ను అమలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ కరిక్యులమ్ అమలు లేదు. ఇలా గొప్ప విప్లవాత్మక మార్పులను మేం తీసుకువస్తే, నేడు కూటమి పార్టీలు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
ఏపీలో రెచ్చిపోతున్న పచ్చ కీచకులు
-
Buchepalli Sivaprasad: దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్, నీకు పాలన చేతకాకపోతే దిగిపో
-
ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?
ఏడాదికాలంగా ఏపీ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపడితే.. కూటమి నేతలు , ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రంలో ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. ఎవరు సత్యం చెబుతున్నారు? ఎవరు అసత్యం చెబుతున్నారు?. ఈ ఏడాదికాలంగా జరిగిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది వాస్తవం అని ఆధారసహితంగా కనిపిస్తోంది. అదే టైంలో ప్రజలకు పండగ కాదు కాని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్ కల్యాణ్లకు మాత్రం పండగే అని ఒప్పుకోవాలి. ఈ ముగ్గురితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కూటమి నేతల అక్రమ సంపాదనకు రహదారి వేసిందని కూడా అంగీకరించాలి. అందువల్ల వీరికి కూడా పండగే అని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట.. ఎల్లోమీడియా పంట కూడా బ్రహ్మాండంగా పండుతోంది. వారి సంపాదనకు తిరుగులేదు కనుక వారికే పండగే!. కూటమి నేతలుకాని, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిర్దిష్టంగా ఫలానా కారణాల వల్ల ప్రజలు పండగ జరుపుకుంటారని చెప్పలేకపోతున్నారు. అందుకే గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ముందుగా ఏ రకంగా ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందో విశ్లేషిద్దాం.ఏపీలో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు భారీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లు ప్రకటించారు. ఆ ప్రకారం తాము అమలు చేశామని వీరు ఎక్కడైనా చెప్పగలరా?. వృద్దాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో లక్షల పెన్షన్లు కోత పెట్టింది నిజమే కదా!. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తామని చెప్పి ఒక్కటి మాత్రం ఇచ్చారు. అది కూడా అందరికి అందలేదన్నది నిజం. ఈ రెండూ తప్ప ఫలానా ఘన కార్యాలు సాధించామని కూటమి నేతలు కాని, ఎల్లో మీడియా కాని చెప్పలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో కూటమి వాగ్దానాలపై వ్యంగ్య పాటలు, వ్యాఖ్యలు భారీగా కనిపిస్తున్నాయి.సూపర్ సిక్స్ లో బాగంగా యువతకు నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇచ్చారా?లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. జగన్ టైంలో ఏర్పర్చిన వలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని.. పైగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారా?లేదా?. అధికారంలోకి వచ్చాక.. ఏవో దొంగ కారణాలు చూపుతూ ఆ వ్యవస్థకు మంగళం పాడారా?లేదా?. దాంతో రెండున్నర లక్షల మందికి గౌరవ వేతనం రాకుండా పోయింది. ఇది యువతకు వెన్నుపోటు పొడిచినట్లే కదా!. జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు,వ్యవస్థలు అన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు,పవన్ లు పదే,పదే ప్రకటించారు. కాని పవర్ వచ్చిన వెంటనే ప్రజలకు ఇళ్లవద్దే అందే సేవలను దాదాపు రద్దు చేశారు. చివరికి రేషన్ బియ్యం తదితర సరుకులు అందించే వాహనాలను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు ఇరవైవేల మంది వాహన నిర్వాహకులు, వారి కుటుంబాలు వీధినపడ్డాయి. రేషన్ కోసం ప్రజలు ముఖ్యంగా పేదలు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడి ఉండాల్సి వస్తోంది. ఇది వెన్నుపోటు కాదా!. అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయల చొప్పున జగన్ ఇస్తుంటే.. చంద్రబాబు ఏమని అన్నారు. జగన్ ఒక్క విద్యార్దికే ఇస్తున్నారు..అది అన్యాయం.తాము వస్తే ప్రతి విద్యార్ధికి పదిహేనువేల చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి ఇస్తామని అన్నారు. జనం అమాయకంగా నమ్మారు. కాని అధికారం వచ్చి ఏడాది అయినా దాని అతీగతి లేదు. ఈ జూన్ లో ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఇప్పటికే ఒక ఏడాది ఎగవేశారు కదా?ఇది వెన్నుపోటే కదా!. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.ఇది వెన్నుపోటే కదా!అలాగే మహిళలకు ఉచిత బస్, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదీ జరగలేదు. దీనిని వెన్నుపోటు కాదని అనగలరా?. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లించి వారి సర్టిఫికెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు?. ఉచిత ఇసుక విధానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా?. ఇసుకను కూటమి నేతలకు ఆదాయవనరుగా మార్చడం ప్రజలకు వెన్నుపోటా ?కాదా?. పండగ కానుకలు వస్తాయని, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని, పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని, ఇలా ఒకటేమిటి! చేతికి ఎముక లేని చందంగా చంద్రబాబు పధకాలు అమలు చేస్తారేమోలే అని భావించిన ప్రజలకు అవేవి చేయకపోవడం వెన్నుపోటు అవ్వదా?. అసలే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటులో సిద్దహస్తుడు అనే పేరు ఉంది. తన మామ ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఆయన ప్రత్యర్ధులు ఈ విషయాన్ని తరచూ చెబుతుంటారు. 2014-2024లలో ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి హామీల విషయంలో చేసిన వెన్నుపోటు ఒక రకం అయితే.. ప్రభుత్వాన్ని నడపడంలో, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. నేతలపై కేసులు పెడుతూ రెడ్ బుక్ అంటూ లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకం మరో ఎత్తుగా ఉంది. జగన్ రూ. 14 లక్షల కోట్ల అప్పు చేశారని అంటూ పచ్చి అబద్దాలు చెబుతూ.. అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించడం తెలుసునని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలనే అడగడం వెన్నుపోటే అవుతుంది కదా!. ఏకంగా ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడం ప్రజలను మోసం చేసినట్లు కాదా?. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడం ద్వారా దేవదేవుడిని కూడా వెన్నుపోటు పొడవడానికి వెరవలేదే!. ఇలా ఒకటేమిటి?.. అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సమీకరించి, లక్షల కోట్లు ఆ గ్రామాలలోనే ఖర్చు పెట్టడానికి తయారవుతున్న తీరు చూస్తే ఇతర ప్రాంతాల ప్రజలను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అర్దం అవుతుంది కదా!. దీనికన్నా ప్రభుత్వానికి అవసరమైన పదివేల ఎకరాలో, అంతకు కాస్త ఎక్కువో భూమిని మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి ఉంటే లక్షల కోట్లు ఆదా అయ్యేవి కదా అనేదానికి సమాధానం దొరకదు. ఉర్సా వంటి ఊరుపేరులేని కంపెనీలకు విశాఖలో విలువైన భూములు కట్టబెట్టడం ఆ ప్రాంతానికి వెన్నుపోటు అవుతుందా? కాదా?. ఆర్థికంగా బలంగా ఉన్న టీసీఎస్ కంపెనీ తనకు లీజుకు భూమి ఇవ్వాలని అడిగితే 99 పైసలకే భూమి అమ్మేస్తామని ఉదారంగా చెప్పడం ప్రజలకు వెన్నుపోటు కాదా!. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పోలీసులు కొందరు ఇష్టారాజ్యంగా పెడుతున్న కేసులు బహిరంగంగా చట్టంతో సంబంధం లేకుండా నిందితులను దారుణంగా హింసిస్తున్న వైనం ఇవన్ని వెన్నుపోటుకు బోనస్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన ప్రభుత్వం తమకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ రకంగా కూటమి నేతలకు పండగ అని చూస్తే.. ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షల టన్నుల ఇసుకను ఊదేసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించగలిగారు. అది ఏ స్థాయిలో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుల దందాను అరికట్టాలని కోరుతున్నానని, అలా చేయడానికి లంచం ఇవ్వడానికి కూడా సిద్దమని చెప్పి ,లక్షన్నర రూపాయల ఇవ్వడానికి సిద్దపడ్డారు!. దీనిని ఏమని అనుకోవాలి?. ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. మద్యం మాఫియా ఎలా విజృభిస్తోందో, లిక్కర్ షాపులలో కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు, ఊరూరా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలకు పండగే కావొచ్చు. చంద్రబాబు, లోకేష్, పవన్లు తమ పదవులను ప్రజాసేవకు కాకుండా తమ ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల దర్జాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అది వారికి పండగే కదా?. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగితే కనీసం పలకరించకుండా సనాతని వేషం కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పవన్కు పండగే కదా?. పైళ్లను భారీగా పెండింగ్ లో పెట్టి, షూటింగ్ లలో కాలం గడుపుతున్న ఆయనను ప్రశ్నించేదెవ్వరు. అందుకే ఆయనకు ఇది పండగే. అమరావతి నిర్మాణాల వ్యయం రెట్టింపు చేసి కాంట్రాక్టర్లకు పందెం చేస్తున్నందున వారికి పండగే. టీడీపీ కార్యకర్తల పెండింగ్ అక్రమ బిల్లుల పేరుతో వందల కోట్లను ఇస్తూ పండగ చేసుకోండని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ల కన్నా తానే పవర్ ఫుల్ అని రెడ్ బుక్ పాలన చేస్తున్న లోకేష్ కి వీరిద్దరి కన్నా పెద్ద పండగగానే ఈ ఏడాది సాగిందని ఒప్పుకోవాలి. ఏతా వాతా చూస్తే ప్రజలకు వెన్నుపోటు, కూటమి నేతల అక్రమార్జనకు పండగే అని చెప్పొచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు హామీలపై కేతిరెడ్డి మాస్ ర్యాగింగ్
-
వెన్నుపోటుపై జనాగ్రహం!
సాక్షి నెట్వర్క్: ‘కూటమి ప్రభుత్వం ఏడాది పాలనంతా నయవంచన, ద్వేషం, కక్షపూరితం. నమ్మి ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. సూపర్ సిక్స్ పథకాలని ఊదరగొట్టి.. ఉత్తచేయి చూపారు. అందుకే ఏడాదిలోనే కూటమి ప్రభుత్వాన్ని జనం ఛీ కొడుతున్నార’ని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. కూటమి ఏడాది పాలన.. ప్రజలకు చేసిన మోసంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో వేలాది మందితో ర్యాలీలు చేపట్టారు. దగా ప్రభుత్వ తీరును ఎండగడుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీకి వేలాది మంది హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన గళం వినిపించారు. స్థానిక సీఎంఆర్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ సాగింది. అనంతరం ఇన్చార్జి తహసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఎంపీపీ మామిడి.అప్పలనాయుడు, జెడ్పీటీసీ కెల్ల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైంది. చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురం పెట్రోల్ బంక్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా మూడురోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు హాజరైన ర్యాలీలో దాదాపు 5 వేల మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వ మోసపూరిత పాలన, ఇచ్చిన హామీలు అమలుచేయక పోవడం తగదంటూ తహసీల్దార్ ఎన్.రాజారావుకు వినతిపత్రం అందజేశారు. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వెన్నుపోటు దినం ర్యాలీ సాగింది. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో పార్టీ శ్రేణులు, ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తక్షణమే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ పథకం, మహిళలకు ఉచిత బస్సు వంటి హామీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఐదు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు పాల్గొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ పోస్టాఫీస్ నుంచి ప్రారంభమైన వెన్నుపోటు దినం ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది.అబద్ధపు హామీ లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. కూటమి మోసపూరిత పాలనపై తహసీల్దార్ తాడ్డి గోవింద్కు వినతిపత్రం అందజేశారు. రాజాం నియోజకవర్గ కేంద్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. రాజాం పట్టణ కేంద్రంలో నిర్వహించిన వెన్నుపోటుదినం కార్యక్రమానికి వేలాదిగా వైఎ స్సార్సీపీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. పాలకొండ రోడ్డులోని సన్రైజ్ ఆస్పత్రి నుంచి శ్రీకాకుళం రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఎస్.కె.రాజుకు వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి తలే రాజేష్, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు. హామీలను నమ్మి ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని ఏలే హక్కు లేదని, సీఎం డౌన్డౌన్ అంటూ ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు నినదించారు. ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో ఆకుల డిపో నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో పార్టీ నేతలు శోభాహైమావతి, వేచలపు చినరామునాయుడు, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి పాలనలో కష్టాలు, నష్టాలు, అదనపు విద్యుత్ చార్జీలు, ఇంటి పన్నుల భారం తప్ప చేసినది శూన్యమని ప్రజలు విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో సాగిన వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొని కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ శ్రీనుకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ అక్రమాలకు కొమ్ముకాస్తున్న బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. టీడీపీ చేపడుతున్న రెడ్బుక్ పాలన వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నా, బీజేపీ నాయకులు చూసీచూడనట్లు వ్యవహరించడం సిగ్గుచేటు. సూపర్సిక్స్ హామీలు అమలు చేయకపోడంతో ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారు. – బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ నమ్మించి ‘వెన్నుపోటు’ ఉత్తుత్తి హామీలతో నమ్మించారు. ఓట్లు దండుకున్నారు. తీరా హామీలు అమ లు చేయమని అడి గిన జనంపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఇది అన్యాయం. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్సిక్స్ పథకాలను వెంటనే అమలుచేయాలి. ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకోవాలి. – కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే, ఎస్.కోటకూటమి పాలనలో ప్రజలకు కష్టాలే.. అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ వ్యవస్థను రద్దుచేసి వేలాది మందిని నిరుద్యోగులుగా మార్చింది. ఇప్పుడు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసింది. చిరుద్యోగులపై వేధింపులకు పాల్పడుతోంది. ప్రజాసంక్షేమ పథకాలకు కోత పెట్టింది. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలు, నష్టాలే ఎదురవుతున్నాయి. ఏడాది పాలనపై ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతోంది. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యేమేనిఫెస్టో అంటే లెక్క లేదు.. ఎన్నికల మేనిఫెస్టో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లెక్క లేదు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. – బొత్స సత్యనారాయణ,శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి -
వెన్నుపోటు దినం నిరసన హోరు.. ఇది ట్రైలర్ మాత్రమే!
-
Vennupotu Dinam: పెల్లుబికిన ప్రజాగ్రహం
సరిగ్గా ఏడాది క్రితం అబద్ధపు హామీలతో అధికారాన్ని దొరకబుచ్చుకున్నారు. ప్రజల నుంచి ఓట్లు దండుకుని.. వారికే పంగనామాలు పెట్టారు. ఇచ్చిన హామీలు కాకుండా.. ఏడాది కాలంగా కొత్త కథలు చెబుతూ నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారంటూ జనం రోడ్లపైకి వచ్చారు. వెన్నుపోటు సర్కారుపై నిరసన ప్రకటిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజావాహిని నిరసనల జోరుతో ఊరూవాడా దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం వెన్నుపోటు దినం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రోజిది. ఓట్లేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచిన రోజిది. అప్పుడు మామ ఎనీ్టఆర్కు వెన్నుపోటు పోడిచారనుకుంటే.. ఏడాది కాలంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు’ అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి జిల్లా ప్రజలు గొంతెత్తారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలనపై కదం తొక్కారు. కిలోమీటర్ల మేర పాదయాత్రగా ర్యాలీ చేశారు. నిరసన ర్యాలీలతో జిల్లా హోరెత్తిపోయింది. కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా ఎక్కడా తగ్గలేదు. అన్నింటిని అధిగమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. నిరసనపై ఉక్కుపాదం మోపేందుకు గత వారం రోజులుగా అనుమతుల విషయంలో కుట్ర పన్నినా పారలేదు. వైఎస్సార్సీపీ కేడర్తో పాటు సామాన్య జనం నిరసన ర్యాలీల్లో వేలాదిగా పాల్గొన్నారు. దీంతో పారీ్టలో నూతనోత్తేజం కనిపించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.మహిళా ద్రోహి చంద్రబాబు ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పడం.. అధికారం చేపట్టాక మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైపోయింది. చంద్రబాబు బూటకపు హామీలను నమ్మి మహిళలంతా ఓటేసి మోసపోయాం. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి అమాయక ఆంధ్రా ప్రజలకు వెన్నుపోటు పొడవడం పెద్ద వింతకాదు. సూపర్సిక్స్ హామీలు అమలుచేయకుండా వెన్నుపోటు పొడిచారు. – బెండి పూర్ణ, పాత్రునివలస జగనన్న కాలనీ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.. నమ్మిన ప్రజలను నట్టేట ముంచారని జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చి నినదించారు. వేలాది మంది ఏడు రోడ్ల కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. దీంతో ప్రధాన రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ర్యాలీ అనంతరం తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. నిరసన ప్రదర్శనలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, రాష్ట్ర తూర్పు కాపు విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర కళింగ వైశ్య విభాగం అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, చిట్టి జనార్ధన్ రావు, అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో.. ఇచ్ఛాపురంలోని దాసన్నపేట జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ నిరసన ప్రదర్శన చేశారు. వేలాది మంది తరలిరావడంతో ఇచ్ఛాపురం కిటకిటలాడింది. హామీల అమలు చేసేదెప్పుడు? రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రతి విద్యార్థికి నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు అని చెప్పారే తప్ప ఏడాదవుతున్నా ఇవ్వలేదు. మిగిలిన అన్ని వర్గాలను మోసం చేశారు. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పాతపట్నంలో.. పాతపట్నంలోని పాతబస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. కోర్టు కూడలి, వైఎస్సార్ విగ్రహం జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన చేసి, ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు.. చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త రెడ్డి శాంతి నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్లకార్డులు పట్టుకుని కూటమి ప్రభుత్వం తీరుపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తహశీల్దార్కు వినతి పత్రం అందజేశారు. -
చంద్రబాబు, లోకేష్ కు నాగార్జున యాదవ్ ఓపెన్ ఛాలెంజ్
-
KSR Comment: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే
-
వెన్నుపోటు దినం సూపర్ హిట్టు.. టెన్షన్ లో బాబు, పవన్
-
‘వెన్నుపోటు దినం’ జయప్రదం
సూపర్ సిక్స్తో సహా అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదు. ప్రజా సంక్షేమం విస్మరించి అరాచక పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో కడుపు మండిన ప్రజలు కూటమి సర్కారు వంచనపై గర్జించారు. కూటమి నేతల కుట్రలను ఛేదించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘వెన్నుపోటు’ దినం కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి ఉప్పెనలా కదం తొక్కారు. అధికారులకు వినతిపత్రాలతో నిరసన తెలియజేశారు. అనంతపురం కార్పొరేషన్: కూటమి సర్కారు నయ వంచనను ఎండగట్టేందుకు,చంద్రబాబు సర్కార్ను మేలుకొలిపేందుకు వైఎస్సార్ సీపీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది.అనంతపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వ ర్యంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. పాతూరు చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది. అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమే‹Ùగౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర తదితరులు పాల్గొన్నారు. ట నార్పలలో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ స్థానిక వాలీ్మకి ఆలయం నుంచి ప్రారంభమై తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. శైలజానాథ్ మాట్లాడుతూ చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీలు భాస్కర్, బోగాతి ప్రతాప్రెడ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆధ్వర్యంలో రాప్తాడులో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. ⇒ ఉరవకొండలో సమన్వయకర్త వై. విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఉరగాద్రి ఆలయం నుంచి టవర్ క్లాక్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సూపర్సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ⇒ గుంతకల్లులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి ఆ«ధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమికి డిపాజిట్లు రావన్నారు.కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భవాని, వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి, గుంతకల్లు ఎంపీపీ మాధవి, గుత్తి పట్టణ కనీ్వనర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ⇒ రాయదుర్గంలో సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ వినాయక సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది.ఎమ్మెల్సీ శివరామి రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెడుతోందన్నారు. సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ మహిళలు, రైతులు, యువత ఇలా అన్ని వర్గాలకూ చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. ⇒ కళ్యాణదుర్గంలో సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. రంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో ముందుకెళ్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. ఏడాదిగా ఒక్క హామీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రాజ్కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి, నేతలు ఉమా, వెంకటేశులు, తిమ్మరాయడు పాల్గొన్నారు. ⇒ యాడికి మండల కేంద్రంలో ‘వెన్నుపోటుదినం’ నిరసన ర్యాలీ... కార్యక్రమ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆధ్వర్యంలోజరిగింది. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. సుధాకర్ బాబు మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్ సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు హర్షవర్దన్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడలు వంచుతాం.. అనంతపురంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులతో కాలయాపన చేసిందని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్తో పాటు 143 హామీలను గుప్పించి ఇంత వరకు ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరే‹Ùకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. హంద్రీ –నీవా కాలువ సామర్థ్యాన్ని 3,800 క్యూసెక్కులకే పరిమితం చేసి భవిష్యత్తులో నీటి అవసరాలకు తీవ్ర ఇబ్బంది తలెత్తేలా చేశారన్నారు. -
చంద్రబాబు అబద్ధాలపై తిరగబడ్డ ప్రజలు జగన్ పిలుపుతో దద్దరిల్లిన ఏపీ
-
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు... వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలకు ఉప్పెనలా తరలివచ్చిన జనం
-
బాబును నమ్మితే.. వెన్నులో కత్తి గ్యారెంటీ
-
17 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ సంవత్సర పాలన పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని.. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి అర్హులైన 17 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఈ భేటీ ఇందుకు ఆమోదం కూడా తెలిపింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు క్షమాభిక్ష ద్వారా విడుదలైన ఖైదీలు ప్రతీ మూడు నెలలకొకసారి ప్రొబేషన్ అధికారి, దాని పరిధిలోని పోలీసుస్టేషన్లో హాజరుకావాల్సి ఉంటుంది. మళ్లీ ఏదైనా నేరాలకు పాల్పడితే క్షమాభిక్ష రద్దుచేస్తారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. స్రత్పవర్తన కలిగిన జీవిత ఖైదీలకే క్షమాభిక్ష మంజూరుచేశారని, ఇందులో రాజకీయాలకు తావులేదని ఆయన చెప్పారు. మంత్రి వెల్లడించిన మరిన్ని నిర్ణయాలు ఏమిటంటే.. » 248 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి.. » ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో మహిళలు రాత్రిపూట కూడా పనిచేసేందుకు వీలుగా కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, బీమా వైద్యసేవ చట్టాల్లో పలు సెక్షన్ల సవరణకు ఆమోదం. దీనివల్ల మహిళల పనిగంటలు పెరుగుతాయి. ఓవర్టైమ్ కూడా పెరుగుతుంది. వ్యవస్థీకృత రంగంలో లింగ వివక్ష లేకుండా రాత్రిపూట తగిన భద్రత, రవాణా సౌకర్యాలతో మహిళలు రాత్రిపూట పనిచేసేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తాయి. » ప్రతీ శాసనసభ నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ఆమోదం. వీటిల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ నుంచి నిధుల కేటాయింపునకు గ్రీన్సిగ్నల్. » అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటుకూ ఓకే. » గత టీడీపీ ప్రభుత్వంలో ఉద్దానం, కుప్పంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటుచేసిన కాంట్రాక్టర్లకు నష్టం వచ్చినందున వారికి రూ.5.75 కోట్లు, రూ.8.22 కోట్లు చొప్పున వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేందుకు అంగీకారం. » ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి గ్రామాల్లోని 94.50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా హోంశాఖకు ఇచ్చేందుకు గ్రీన్సిగ్నల్. » వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ జారీచేసిన నోటిఫికేషన్కూ ఆమోదం. » విశాఖపట్నంలోని హరిత హోటల్ యాత్రీనివాస్ ఆధునీకరణకు చేపట్టిన పనులకు ఇప్పటికే సవరించి అమలుచేసిన పనులకు గ్రీన్సిగ్నల్. » ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సిటీస్ అభివృద్ధిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వేమవరం గ్రామంలోని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులు పూర్తికి లైన్క్లియర్. » ఏలూరు జిల్లాలో నిర్మిoచదలచిన ఐ ఇన్స్టిట్యూట్ కోసం ఐఏఎస్ అధికారి దమయంతి దానంగా ఇవ్వనున్న 10.88 ఎకరాల భూమి బదలాయింపునకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపునకు ఆమోదం. » గతంలో సూరత్లో 1.53 లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును అధిగమించేలా జూన్ 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని, రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందితో ఈ యోగా డేను నిర్వహించాలని నిర్ణయం. ఇక ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యే సమయానికి 25 కాగిత రహిత ఈ–కేబినెట్ సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రికి మంత్రివర్గం అభినందనలు తెలిపింది. అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్ను కూడా అభినందించారు. -
ఆలూరులో వెన్నుపోటు దినం
-
‘వెన్నుపోటు దినం’ సక్సెస్పై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ‘వెన్నుపోటు దినం’ సక్సెస్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సంవత్సరం క్రితం చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ, హామీని కానీ అమలు చేయలేదు. తనను నమ్మిన రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారు. అందుకే ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమానికి పిలుపునిచ్చాం. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తీవ్ర ఆవేదన, కోపాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు.. మోసం చేస్తే మౌనంగా ఉండరనే శక్తివంతమైన సందేశాన్ని ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారు...బాధిత ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజల న్యాయబద్దమైన హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Exactly a year ago, on June 4, Chandrababu Naidu came to power with grand promises, but not a single one has been fulfilled. Instead, he has betrayed the very people who believed in him. His false statements, broken assurances, and blatant backstabbing have pushed the state into… pic.twitter.com/H5Q80sjqrd— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025 -
వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ
-
ప్రజల చేతికి చిప్ప తప్పు... బాబు, లోకేష్ పై రోజా సంచలన వ్యాఖ్యలు
-
ప్రజా శంఖారావం.. ఇది ఆరంభం మాత్రమే!
-
Sajjala Ramakrishna: బాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సుస్పష్టం
-
Vennupotu Dinam: చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు
-
కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు రోజా
-
బాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సుస్పష్టం: సజ్జల
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందని, ఇవాళ అది స్పష్టంగా కనిపించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) అన్నారు. వైఎస్సార్సీపీ ఇవాళ(బుధవారం, జూన్ 4) చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతమైనట్లు మీడియా ముఖంగా ప్రకటించారాయన. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏడాది గడిచినా అమలు కాలేదు. ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ఇవాళ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్సీపీ కష్టాల నుంచే పుట్టింది. మా హయాంలో 15 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధి.. మూడేళ్లలోనే జరిగింది. అధికారంలోకి రాగానే మేం తొలి ఏడాదిలోనే 99 శాతం హామీలు అమలు చేశాం. కోవిడ్ రెండేళ్లలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశాం. మిగిలిన మూడేళ్లలోనే 10, 15 ఏళ్ల అభివృద్ధి చూపించాం. విద్య, వైద్య, వ్యవసాయం రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. కానీ.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు అన్నీ సర్వనాశనం అయ్యాయి. తొలి ఏడాదిలోనే రికార్డ్ స్థాయిలో(రూ.లక్షా 50వేల కోట్లకు పైగా) చంద్రబాబు అప్పులు చేశారు. ఆ అప్పు ఏం చేశారో తెలియదు. ఏడాదిలోనే రైతులను సంక్షోభంలోకి నెట్టేశారు. పంటలకు కనీస మద్ధతు ధరలు లేవు. ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు కట్ చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలను సైతం ఎత్తేశారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది’’ అని సజ్జల అన్నారు. -
ఏపీకి ట్రబుల్ మేకర్గా చంద్రబాబు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్ మోహన్రెడ్డి అందించిన సంక్షేమం కంటే ఎక్కువే అందిస్తానంటూ ఏపీ ప్రజలను చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా.. బుధవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార శైలి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించాడు. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమయ్యారు. జగన్ అందించిన నవరత్నాలను పూర్తిగా నాశనం చంద్రబాబు చేశారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని ప్రజలను మోసం చేశారు. చంద్రబాబువి మోసపూరితమైన హామీలు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. మరి ఇప్పుడు ఏడాది పాలనకే రూ.లక్షా 60 వేల కోట్ల అప్పు చేశారు. అలాంటప్పుడు ఏపీ ఇప్పుడేం అవుతుంది?. రైతులు, వలంటీర్లు, ఎండీయూ వాహనదారులు.. ఇలా అందరినీ దగా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయడం దుర్మార్గం. .. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. తెనాలిలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలను పోలీసులు రోడ్లమీద కొట్టడం దారుణం. అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతాం.... విజయవాడ నగరాన్ని చెత్త నగరంగా మార్చింది కూటమి ప్రభుత్వమే. బుడమేరుకు వరద వస్తుందని తెలిసి కూడా ప్రజలకు ఎలాంటి సమాచారం అందించలేదు. శాతవాహన కాలేజీకి ప్రిన్సిపల్ కిడ్నాప్ వ్యవహారం కూటమి ప్రభుత్వంలోనే సంచలనగా మారింది. ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ సిక్స్, ఇంటింటికి రేషన్ ఇవన్నీ గోవిందా!. అప్పట్లో ఎన్టీఆర్ను ఎలా మోసం చేశారో.. ప్రజలను కూడా చంద్రబాబు ఇవాళ అలాగే మోసం చేశారు. ఈ రోజు వెన్నుపోటు దినం.. వంచన దినం. కాపుల ఉద్యమాన్ని కూటమి ప్రభుత్వం అణచివేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఇసుక కొట్టేసిన కూటమి నేతలు హ్యాపీగా ఉన్నారు. రాష్ట్రమంతా అవినీతిమయంగా మారింది అని వెల్లంపల్లి అన్నారు. డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సంవత్సర కాలంలో ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ సిక్స్లో ఇప్పటిదాకా ఎన్ని హామీలు నెరవేర్చారు?. చంద్రబాబే స్వయంగా చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని.. పథకాలు ఇవ్వలేనని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. మల్లాది విష్ణు ఆధ్వరంలో ధర్నా చౌక్ నుండి గాంధీనగర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. -
రండి బాబూ రండి! తాగండి.. రోడ్లపై పొర్లండి
కర్నూలు: పూటుగా మద్యం తాగి పొర్లుతున్న ఈ దృశ్యాలు కూటమి పాలన తీరుకు అద్దం పడుతున్నాయి. సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త సీసాలో పాత సారా వ్యాపారాన్ని కొనసాగిస్తూ పేదల ఒళ్లు, ఇళ్లను గుళ్ల చేస్తోంది. డోర్ పట్టణంలో ఎక్కడ చూసినా మద్యం మత్తులో రోడ్లపై పడివున్న మందుబాబులే కనిపిస్తున్నారు. డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా 16 మద్యం షాపులతో పాటు రెండు గీతా కార్మికుల మద్యం దుకాణాలున్నాయి. వీటికి తోడు కూల్డ్రింక్ షాప్లు, హోటళ్లు, కిల్లీ కొట్లలో సైతం మద్యాన్ని విక్రయిస్తూ టీడీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. సిట్టింగ్కు అనుమతి లేకపోయినప్పటికీ ప్రతి మద్యం దుకాణం పక్కనే అదనపు గదులను ఏర్పాటుచేసి అందులో వాటర్ప్యాకెట్లు, స్నాక్స్ మద్యం ప్రియులకు అంటగట్టి జలగల్లా మద్యపానీయుల రక్తం పీల్చుతున్నారు. ప్రతి గ్రామంలోనూ ఏడెనిమిది బెల్టుషాపులను ఏర్పాటు చేసుకునేందుకు టీడీపీ నాయకుడొకడు.. ఒక్కో బెల్ట్షాప్కు రూ.25 వేల చొప్పున విక్రయదారుల నుంచి వసూలు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. టీడీపీ అగ్రనాయకునితో పాటు ఎక్సైజ్, సివిల్ పోలీసులకు మామూళ్లు ముట్టజెప్పేందుకే డిపాజిట్లు వసూలు చేశామని ఆ పార్టీ నాయకులు బాహాటంగా చెబుతుండటం గమనార్హం. -
వెన్నుపోటు దినం గ్రాండ్ సక్సెస్.. భారీగా జన సంద్రం..
-
అప్పుడు.. మళ్లీ ఇప్పుడు.. అధికారం కోసమే బాబు వెన్నుపోటు: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: ఏడాది కాలంలో చేసిన అప్పులకు చంద్రబాబులో జవాబుదారితనం లేదని.. కానీ, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరులో ఆయన ఆధ్వర్యంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. తహసీల్దార్కు వినతిపత్రం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారు. దీనిని బట్టే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అర్థమవుతోంది. అప్పుడు చంద్రబాబు అధికారంకోసం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం ఉచిత హామీలు పేరుతో ఏడాది కాలంగా ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు. ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు తెచ్చిన లక్షా 51వేల కోట్ల రూపాయాల అప్పులకు జవాబు చెప్పే పరిస్థితిలో ఆయన లేరు. కానీ, ప్రజలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు కాగ్ కూడా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలిపింది. .. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్ విలాసాలకు హెలికాప్టర్లను, విమానాలను కొనుగోలు చేశారు. సాయంత్రం కాగానే హైదరాబాద్కు, పగలు అమరావతికి తిరుగుతున్నారు. సెకీతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యూనిట్ కు సోలార్ ఎనర్జీ 2.49 పైసలు ఒప్పందం చేసుకుంటే పెద్ద రాద్దాంతం చేసిన ఎల్లో మీడియా.. ఇవాళే చంద్రబాబు సర్కారుకు యూనిట్ కు 4.60 పైసల కు కొనుగోలుకు ఒప్పందం చేసుకుని 11వేల కోట్లు అవినీతికి పాల్పడింది. ఏడాది కాలంలో ఎన్నికోట్లు ఉచిత గ్యాస్ కు ఖర్చు చేశారో వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం సొంత జిల్లాలో మామిడి రైతులు సరైన ధర లేక పొలాల్లో మామిడి పంట విడిచి పెట్టేశారు. పొగాకు, మిర్చి , టమోటో రైతులుది ఇదే పరిస్థితి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల్ని టార్గెట్ చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారు. పార్టీకి చెందిన దళిత నేతలు ను తప్పుడు కేసులతో అరెస్ట్ చేయిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి 26 లక్షలు మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఎంతో సక్రమంగా ఫలితాలు పారదర్శకంగా ప్రకటించారు. కానీ, ఇవాళ పదో తరగతి పరీక్షలు ఫలితాలు తప్పడు తడకగా ప్రకటించి విద్యార్ధులు జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హయంలో పదో తరగతి పరీక్షలు ఫలితాల్లో తప్పిదాలు జరిగితే.. నాటి మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడితో రాజీనామా చేయించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పదో తరగతి తప్పుడు ఫలితాలు పై కొడుకు మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయించాలి అని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. వెన్నుపోటు దినం నిరసనల్లో అనీషా రెడ్డి, పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
వెన్నుదినంలో పెద్ద ఎత్తున పాల్గొన్న నెల్లూరు ప్రజలు
-
పులివెందులలో దుమ్మురేపుతున్న వెన్నుపోటు దినం ర్యాలీ..
-
ఏం చేశారని దీపావళి చేసుకోవాలి.. వెన్నుపోటుపై వినూత్న నిరసన
-
ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం మొదలైంది: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి పాలనలో జరిగిన అన్యాయాలపై పేద ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవోకు ఆయన కూటమి ప్రభుత్వ హామీల వినతి పత్రం సమర్పించారు. వంచన, మోసం ఏడాది కాలంలో తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు. 143 హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ నేతలపై ఇప్పటిదాకా 2,466 కేసులు పెట్టారు. ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. ప్రజలకు జరిగిన అన్యాయం పై పేద ప్రజలు పక్షనా పోరాటాలు కొనసాగిస్తాం.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పూరించిన సమరశంఖంలో ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభం అయ్యింది అని భూమన అన్నారు. ఈ కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
సిగ్గు లేదు మీకు! కౌంట్ డౌన్ మొదలైంది.. గుర్తు పెట్టుకో చంద్రబాబు
-
చీపురుపల్లిలో బొత్స నిరసన
-
అలాంటి నీచ చరిత్ర చంద్రబాబుది: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: ఏడాది కాలంలో ఎన్నో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక పథకం అందించలేకపోయిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారాయన. ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. కానీ, ఏడాది తిరిగేలోపే.. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలోని ఐదేళ్లలోని ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్షా 55,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇంత అప్పు చేసినా ప్రజలకు ఒక పథకం అందిచలేకపోయింది. .. మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజ్కి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుది. పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తి అయితే.. మిగిలిన పది శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం చేయలేదు’’ అని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. కూటమి వైఫల్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీలు ఎక్కడ.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి?
-
అవకాశవాదమే పవన్ సిద్ధాంతం!
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ద్వారా తనదైన రాజకీయ క్రీడ సాగిస్తోందా? కొంతకాలం క్రితం తమిళనాడు పర్యటన సందర్భంగా పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అవుననే అనిపిస్తోంది. బీజేపీ అవసరాలకు తగ్గట్టుగా మాట్లాడేందుకు పవన్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ అవసరాల కోసం ఒక సామాజిక వర్గాన్ని ఎలా వాడుకున్నారో అందరూ చూశారు. ఈ అవకాశవాదాన్నే బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కరుణ తనపై ఉంటే రాజకీయాల్లో ఢోకా ఉండదన్న ధీమాతో పవన్ అనుకుంటున్నారు. అలాగే తమిళనాట పవన్ సినిమా గ్లామర్ తనకు ఓట్లు తెచ్చిపెడుతుందని బీజేపీ కూడా భావిస్తోంది. అన్నాడీఎంకేతో పెట్టుకున్న పొత్తుతో తమిళనాడులో పాగా వేయాలన్నది బీజేపీ ఎత్తుగడ. పవన్ కళ్యాణ్ బీజేపీ అజెండాను భుజాన వేసుకుని తిరుగుతుండడం చూస్తుంటే, భవిష్యత్తులో ఏపీలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి కొత్త ప్లాన్ అమలు చేస్తాయా అన్న సందేహం కలుగుతుంది. గత అనుభవాల రీత్యా టీడీపీ రాష్ట్రంలో బీజేపీను అంటిపెట్టుకుని ఉండడానికే ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అయినా వచ్చే కాలంలో బీజేపీ, జనసేనలు ఏపీలో కూడా సొంత అజెండాతో ముందుకు వచ్చి టీడీపీని వెనక్కి నెట్టినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి దీనికి ప్రాతిపదిక కనిపించక పోవచ్చు. కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చెన్నై వెళ్లి జమిలి ఎన్నికలపై మాట్లాడి వచ్చారు. దేశ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బాగుకు జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓకే కానీ.. పవన్ గతంలో దీనికి పూర్తి వ్యతిరేక భావజాలమున్న పార్టీలతో కలిసి పనిచేశారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై ఒకసారి మంచిదని.. ఇంకోసారి అవి మోడీ నియంతృత్వ ఆలోచన అని వ్యాఖ్యానించారు. ప్రజలు వీటిలో దేన్ని నమ్మాలి? ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు కనుక వారి భావజాలానికి మద్దతు ఇస్తున్నారు. గతంలో పవన్, చంద్రబాబు అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ 2019లో కమ్యూనిస్టులు, బీఎస్పీలతో కలిసి పోటీ చేశారు. ఆ పార్టీలు బీజేపీ సిద్దాంతాలకు పూర్తి వ్యతిరేకం. జమిలి ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని, రాష్ట్రాల హక్కులను హరించడానికే ఈ ప్రతిపాదన అని కమ్యూనిస్టులు విమర్శిస్తుంటారు. అప్పుడు ఆ పార్టీలతో కలిసి పోటీచేసి ఓడిపోయిన తర్వాత మొత్తం ప్లేట్ తిప్పేసి పవన్ కళ్యాణ్ బీజేపీని బతిమలాడుకుని వారితో కలిశారు. సినీ నటుడు కనుక ఎందుకైనా పనికి వస్తారులే అని బీజేపీ కూడా ఓకే చేసింది. చంద్రబాబు నాయుడు అయితే జమిలి ఎన్నికలు మంచిదేనని 2004 కి ముందు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు అనేవారు. ఆ తర్వాత కాలంలో ఆయన కూడా కమ్యూనిస్టులతోను, టీఆర్ఎస్తోను జత కట్టారు.అప్పుడు ఫలితం దక్కకపోవడంతో తిరిగి బీజేపీ చెంతకు చేరారు. 2014లో అధికారంలోకి వచ్చినా, 2018 నాటికి బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు.ఆ సమయంలో ప్రధాని మోడీని వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, బీజేపీ విధానాలన్నిటిని తీవ్రంగా దుయ్యబట్టేవారు. ఆ క్రమంలో కాంగ్రెస్,తదితర బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి జమిలి ఎన్నికలను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన రాగం ఆలపించారు. పశ్చిమ బెంగాల్ లో షర్మిష్ట అనే యూట్యూబర్ను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేయడంపై ఆయన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి మళ్లీ ప్రస్తావించారు. ఏపీలో సోషల్ మీడియాపై ప్రభుత్వం దాడులు చేస్తుంటే పవన్ ఎన్నడూ పట్టించుకోలేదు. తిరుమల లడ్డూపై అపచారపు మాటలతో సహా అనేక సందర్భాలలో పవన్ కళ్యాణే సనాతన ధర్మం కాదు కదా.. అసలు ధర్మమే పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వేరే రాష్ట్రంలో సనాతనం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఒక సిద్దాంతం అంటూ ఏమీ లేదు. అవకాశవాదమే తమ సిద్దాంతంగా వీరు మలచుకుని రాజకీయాలు చేస్తూ కొంత సఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో పవన్కు ఏవో కొత్త ఆశలు కలిగి ఉండాలి. ప్రధాని మోడీ ఈయనకు పిలిచి మరీ చాక్ లెట్ ఇచ్చిన ఉత్సాహం ఎటూ ఉంది. దాంతో ఆయన తమిళనాడు వెళ్లి డీఎంకేకి వ్యతిరేకంగా ప్రచారం ఆరంభించారు. జమిలి ఎన్నికలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మద్దతు ఇవ్వాలని కోరారు. కరుణానిధి జమిలిని సపోర్టు చేశారని, ఇప్పుడు అందుకు విరుద్దంగా ఆయన కుమారుడు ఎలా వెళతారని పవన్ ప్రశ్నించడం ఆశ్చర్యమే. అందుకే పవన్ పై సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యానాలు వచ్చాయి. తన తండ్రి కమ్యూనిస్టు ని పవనే చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు బీజేపీతో ఎలా స్నేహం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే,ఆయనను గౌరవించి ఎందుకు ఆ పార్టీలో చేరలేదని మరొకరు ప్రశ్నించారు. స్టాలిన్ ను విమర్శించే ముందు తను చేసిందేమిటో గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే తమిళనాడు ప్రజలకు ఈ విషయాలు పెద్దగా తెలియకపోవచ్చన్నది ఆయన విశ్వాసం కావచ్చు. అలాగే ఈవీఎంల గురించి పవన్ మాట్లాడడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. 2019లో ఈవీఎంల వల్ల కూడా వైసీపీ గెలిచి ఉండవచ్చని చెప్పిన ఈయన 2024లో మాత్రం ఈవీఎంలను సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారు. బహుశా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మాదిరి మాటలు మార్చిన వారు ,ఎప్పుడు ఏది అవసరమైతే దానిని మాట్లాడేవారు దేశ రాజకీయాలలో మరొకరు ఉండకపోవచ్చు. జమిలి ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం చదివినట్లు అనిపిస్తుంది. మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. ఆ విషయం వేరే చెప్పనవసరం లేదు. అదే సందర్భంలో సనాతన ధర్మంపై అడిగిన ప్రశ్నకు ఈ భూమి సనాతన ధర్మానిది అని, భారతీయ సంస్కృతిలోనే ఉందని ఆయన అన్నారు. వినడానికి, చెప్పడానికే బాగానే ఉంటుంది. కాని ఆచరణలో పవన్ ధర్మంగా ఉంటున్నారా అన్న ప్రశ్న వస్తుంది. సడన్ గా సనాతని వేషం దాల్చి తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అపచారపు మాటలు ,అబద్దాలు చెప్పాలని ఏ ధర్మం చెబుతుందో ఆయనకే తెలియాలి. కులం, మతం అన్ని విషయాలలో పవన్ ఎన్ని అసత్యాలు చెప్పారో పలు వీడియోలు తెలియ చేస్తాయి. కొందరు ఇస్లాం, క్రిస్టియానిటిపై దాడి చేయరట. హిందూ మతంపైనే దాడి చేస్తారట. ఎల్లో మీడియాలోనే ఈ కథనం వచ్చింది. ఇది చదివితే ఏమనిపిస్తుంది.అన్ని మతాలు సమానం.. ఎవరూ ఎవరిపై దాడి చేయవద్దని చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి అచ్చంగా బీజేపీ భాషను అరువుకు తీసుకుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం కావలిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంతకాలం సహిస్తాం...హిందువులకు ఉన్నది ఒకటే దేశం..అదే ముస్లింలపై దాడి జరిగితే ఊరుకుంటారా..అంటూ యుద్దం చేయాలన్నట్లుగా మాట్లాడిన ఆయన, తదుపరి ఒకటి,రెండు రోజులకే ఏమని అన్నారు.. భారతదేశం శాంతి కోరుకుంటుంది.. సంయమనంగా ఉంటుంది..అని మాట మార్చేశారే. పనిలో పని ఆయన 1985, 1986 ప్రాంతంలో కశ్మీర్లో షూటింగ్ లలోపాల్గొన్నట్లు ఏదో కూడా చెప్పారు కదా! దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వచ్చిన వార్తలు చూస్తే నవ్వు వస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టింది 1971లో అయితే 15 ఏళ్లకే ఎప్పుడు సినిమాలలో నటించారని నెటిజన్లు ప్రశ్నించారు. ఇలా అనేక విషయాలలో రెండు నాలుకల దోరణి అవలంభించే పవన్ కళ్యాణ్ కు పెద్దగా సిద్దాంత, రాద్దాంతాల పని ఉండదన్న భావనతో బీజేపీ ఈయనను తన గేమ్ లో ఒక పావుగా మార్చుకుని ప్రచారానికి వాడుకున్నట్లు ఉంది.ఆంధ్ర ప్రజల మాదిరి తమిళ ప్రజలు ఈ మాటలకు బోల్తా పడతారా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమిపై తిరుగుబాటు.. బాబుకు కౌంట్ డౌన్
-
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలను ఖూనీ చేసిన పాలకులు
-
Vennupotu Dinam: వెన్నుపోటుకు ఏడాది.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
-
అయ్యా నారా వినపడుతుందా.. ఏకిపారేసిన అంబటి..
-
చంద్రబాబు సీఎం అయ్యాక రికార్డ్ స్థాయిలో అప్పులు
-
నేడు ఏపీవ్యాప్తంగా వెన్నుపోటు నిరసనలు
-
తెనాలి సాక్షిగా బయటపడ్డ.. జగన్ పై మరో భారీ కుట్ర