Tollywood
-
వినూత్న ప్రేమకథతో..
ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ తమ తొలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరలక్ష్మీ పప్పుల సమక్షంలో, కనకదుర్గారావు పప్పుల నిర్మాణంలో, దర్శకుడు భాను రూపొందించిన ఈ చిత్రం ఒక సరికొత్త ప్రేమకథతో యువతను ఆకట్టుకోనుంది. సామాజిక స్పృహ, సందేశాత్మక చిత్రాలకు పేరుగాంచిన భాను, మొదటిసారి స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించారు. 49 రోజుల నాన్స్టాప్ షూటింగ్తో పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.జూన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యువతను విపరీతంగా ఆకట్టుకునే ఐదు అద్భుతమైన సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఒక పెద్ద సంగీత కుటుంభం నుండి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు, అలాగే ఒక కొత్త టాలెంటెడ్ రైటర్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. డెబ్భై ఐదు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ గా చేసిన ఒక అబ్బాయి, పదహారణాల తెలుగు అమ్మాయి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి నిర్వాహణ మర్రి రవికుమార్. ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ సంస్థ లో నిర్మాత కనకదుర్గారావు పప్పుల ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను యూనిట్ సభ్యులు విడుదల చేయబోతున్నారు. -
ఓటీటీకి డేవిడ్ వార్నర్ చిత్రం... ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్హుడ్. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో తేలిపోయింది. ఈ మూవీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం కెమియో పాత్రలో మెరిశారు. వార్నర్ కోసమైనా థియేటర్లకు వస్తారనుకున్నప్పటికీ అది కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.ఇప్పటికే ఈ సినిమా విడుదలై నెలరోజులు పూర్తవ్వడంతో ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడొస్తుందా అభిమానులు ఎదురు చూస్తున్నారు. గతంలో మే 4న ఓటీటీ వస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరోవైపు వచ్చేనెల 10 నుంచి స్ట్రీమింగ్ కానుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి వస్తున్నాం తరహాలో ఓకేరోజు టీవీలతో పాటు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.రాబిన్హుడ్ కథేంటంటే..'రాబిన్ హుడ్' విషయానికొస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ. అనాథశ్రమాల కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన నీరా (శ్రీలీల)కు సెక్యూరిటీగా ఉంటాడు. ఓరోజు నీరాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి రామ్, నీరాని ఎలా రక్షించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
పహల్గామ్ ఉగ్రదాడి.. ఇదే సరైన సమయమన్న మెగా కోడలు!
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిపై అగ్ర సినీతారలంతా పెద్దఎత్తున స్పందించారు. ఈ దాడిని ఖండిస్తూ మెగాస్టార్తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ట్వీట్ చేశారు. ఈ మారణకాండ దేశవ్యాప్తంగా పెద్దఎత్తను పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో రోడ్లపై పాక్ జాతీయ జెండాలను అంటించి తొక్కుకుంటూ వెళ్లారు.అలా హిమాచల్ ప్రదేశ్లోనూ రోడ్లపై పాక్ జాతీయ జెండాలను అతికించారు. అందరూ వాటిపై నడుచుకుంటూ వెళ్తంటే ఓ యువతి మాత్రం పాక్ జెండాలను తీసేందుకు యత్నించింది. ఇది చూసిన కొందరు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి కాస్తా ఘాటుగా స్పందించింది.మన సైనికులు తమ ప్రాణాలు అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుతుంటే.. కొందరు మాత్రం మనదేశంలోనే ఉంటూ దేశానికి హాని కలిగించే వారికి మద్దతు ఇవ్వడం చూస్తుంటే చాలా బాధగా ఉందని రాసుకొచ్చింది. ఇలాంటి సమయంలో శత్రుదేశంపై దాడి చేయడం మాత్రమే కాదు.. మనదేశం లోపల నుంచి కూడా శుద్ధి చేయాల్సిన సమయం కూడా వచ్చిందని లావణ్య ట్విటర్లో పోస్ట్ చేసింది. While our soldiers protect the nation with their lives, it’s disheartening to see some supporting those who harm it.It’s time to cleanse the country from within. https://t.co/Tl98IkwgRB— Lavanyaa konidela tripathhi (@Itslavanya) April 29, 2025 -
అమ్మ చనిపోయి 5 నెలలు.. వీడియో డిలీట్ చేయమని అడుక్కున్నా: సోహైల్
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవాళ్లందరినీ ఉగ్రవాదుల ఖాతాలో వేశాడు ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ నా అన్వేషణ. బిగ్బాస్ షోలో పాల్గొన్న సోహైల్ (Syed Sohel Ryan), మెహబూబ్.. ఇలా ఎంతోమందిని ఉగ్రవాదులుగా పేర్కొన్నాడు. ఈ కామెంట్లపై నటుడు, తెలుగు బిగ్బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ సోహైల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు మాట్లాడుతూ.. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి పాల్పడ్డవాడు ఎక్కడికో పారిపోయాడు. వాడిని దొరకబట్టడం మానేసి మనదాంట్లో మనం కొట్టుకుచస్తున్నాం. నేను భారతీయుడినిఎక్కడో జరిగినదానికి నన్ను ఉగ్రవాదిగా చిత్రీకరించడమేంటి? బెట్టింగ్ యాప్స్ గురించి నన్ను తిట్టు.. అంతేకానీ ఉగ్రవాది అని ముద్ర వేయడమేంటి? వాడెవడో చెప్పినంత మాత్రాన నేను టెర్రరిస్టు అయిపోను. నేను భారతీయుడిని. కులమత బేధాలు లేకుండా పెరిగాను. శివుడికి పాలాభిషేకం చేశాను. సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. రంజాన్ ఉంటే హిందూ స్నేహితులు నాతోపాటు నమాజ్ చదివేవాళ్లు. క్రిస్టియన్ ఫ్రెండ్తో కలిసి చర్చికి వెళ్లేవాళ్లం. వాడి ప్లాన్ సక్సెస్.. నువ్వు ఫెయిల్మా ఇరుగుపొరుగువారితో కలిసి కొండగట్టుకు వెళ్లిన రోజులున్నాయి. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింలు చాలామంది ఉన్నారు. అందులో నేనొకడిని. ఒక భారతీయుడివై ఉండి నన్ను ఉగ్రవాది అంటున్నావ్. నిజమైన ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా.. వాళ్ల మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ప్లాన్ సక్సెస్ అయినట్లే.. భారతీయుడిగా నువ్వు ఫెయిల్ అయినట్లే!అడుక్కున్నా..మొన్న ఒక మహిళ.. భర్తను ముక్కలుముక్కలుగా నరికేసి డ్రమ్లో వేసింది. ఆ క్రూరత్వాన్ని టెర్రరిజం అనాలి. నేను పుట్టించిన మనిషిని చంపే హక్కు నీకు లేదు అని ఇస్లాంలో రాసుంది. ఆ ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదు. నా తల్లిని పోగొట్టుకుని ఐదారునెలలవుతోంది. ఇంతలో నాపై ఇలాంటి కామెంట్లు వినేసరికి చాలా బాధపడ్డాను. నాపై చేసిన వీడియో డిలీట్ చేయమని ఆ యూట్యూబర్ (నా అన్వేషణ)ను అడుక్కున్నాను. 'మా అమ్మ గతేడాది చివర్లో చనిపోయారు. మా అమ్మపై బూతులు మాట్లాడావు. గుర్తుపెట్టుకో, నీకు కూడా తల్లి ఉంది. మీ తల్లిలాంటిదే నా తల్లి కూడా!మీ వ్యూస్ కోసం నన్ను తిట్టుకోండినేను కూడా నిన్ను తిరిగి బూతులు అనొచ్చు. కానీ, అనను. మీ తల్లిదండ్రులను బాగా చూసుకో' అంటూ వీడియో డిలీట్ చేయమని మెసేజ్ చేశాను. కావాలంటే నన్ను తిట్టుకో, వ్యూస్ కోసం నన్ను ఎంతైనా తిట్టుకోండి. కానీ తల్లుల్ని తిట్టొద్దు. వాళ్లేం పాపం చేశారు. అందరికీ ఒకటే చెప్తున్నా.. మీ మతాన్ని ప్రేమించండి. మిగతా మతాల్ని గౌరవించండి అని సోహైల్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఫేమస్ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్ నాకొద్దని..: నాని -
నా కొడుకుకి హిట్ 3 సినిమా చూపించను : నాని
నాని(Nani) హీరోగా నటించిన హిట్ 3(HIT 3 ) సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రమిది. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్ హీరోగా నటించారు. ఇక మూడో భాగంలో అర్జున్ సర్కార్గా నాని అలరించబోతున్నాడు. అయితే మొదటి రెండు భాగాలు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కాగా.. హిట్ 3 మాత్రం యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఇందులో రక్తపాతం అధికంగా ఉండబోతుందట. అందుకే సెన్సార్ సభ్యులు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) కొన్ని మార్పులు చేయాలని చిత్రబృందానికి సూచించింది. ఈ లెక్కన సినిమా వయోలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. హీరో నాని కూడా వయోలెన్స్ ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు పిల్లలు ఎవరూ ఈ సినిమా చూడొద్దని విజ్ఞప్తి చేశాడు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. ‘హిట్ 3లో వయోలెన్స్ ఎక్కువగానే ఉంటుంది. నా పిల్లలకు ఈ చిత్రం చూపించను. టీజర్, ట్రైలర్ కూడా చూపించలేదు. వాళ్లకు హిట్ 3 అనే ఒక సినిమా వస్తుందని తప్పా..అందులో నేను ఎలా నటించాననే విషయం తెలియదు. మీరు(ప్రేక్షకులు) కూడా మీ పిల్లలకు ఈ సినిమా చూపించకండి. 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ సినిమాకి రండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అని నాని చెప్పారు. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. -
ఫేమస్ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్ నాకొద్దని..: నాని
హీరోహీరోయిన్లు సినిమా కోసం ఎంతైతే కష్టపడుతున్నారో ప్రమోషన్ల కోసం కూడా అంతే కష్టపడుతున్నారు. నాని (Nani), శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్ 3: ది థర్డ్ కేస్. ఈ సినిమా రేపు (మే 1న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నాని దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేస్తున్నాడు. ఇటీవల ముంబైలో ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని తన భయాన్ని బయటపెట్టాడు.మారిపోతానేమోనని భయంనాని మాట్లాడుతూ.. పాపులారిటీ పెరిగితే నేనేమైనా మారిపోతానేమో, నన్ను నేను కోల్పోతానేమో అన్న భయం ఉండేది. నా ఆలోచనల్లో, నా ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందేమో అన్న అనుమానం కలిగేది. ఎందుకంటే నా చుట్టూ ఉన్న కొందరు నిజంగానే వారి స్థాయి పెరిగేకొద్దీ మారిపోయారు. అయితే ఏళ్లు గడిచేకొద్దీ.. ఫేమ్ వచ్చినంతమాత్రాన మనలో మార్పు రాదని తెలుసుకున్నాను. అసలు పాపులారిటీకి, మన వ్యక్తిత్వానికి సంబంధమే లేదని అర్థమైంది. రానురానూ అర్థమైందిమనం ఆ క్రేజ్ను ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కొందరేమంటారంటే.. మొన్నటివరకు బాగుండేవాడు, ఇప్పుడు ఫేమస్ అవగానే మంచిగా ఉన్నట్లు నటిస్తున్నాడంతే.. అని కామెంట్లు చేస్తుంటారు. నిజానికి పాపులారిటీ మనల్ని మార్చదు. మనమే మారిపోతుంటాం. ఆ ఒక్క విషయం నేను బాగా అర్థం చేసుకున్నాను. అందుకే నన్ను నేను కోల్పోతానేమో అన్న భయం నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చాడు.సినిమాహిట్ 3 సినిమా విషయానికి వస్తే.. హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రమిది. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్ పోలీస్గా నటించగా ఇప్పుడు మూడో పార్ట్లో నాని.. అర్జున్ సర్కార్ అనే పోలీసాఫీసర్గా కనిపించబోతున్నాడు. శ్రీనిధి శెట్టి ఈ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్కు పరిచయమవుతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.చదవండి: విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని చెప్పానా? -
హీరోయిన్ గా 'గుప్పెడంత మనసు' జగతి.. గ్లింప్స్ రిలీజ్
తెలుగులో 2020-24 మధ్య 'గుప్పెడంత మనసు' అనే సీరియల్ ప్రసారమైంది గుర్తుందా? ఇందులో జగతి మేడమ్ గా నటించి, ఆకట్టుకున్న జ్యోతిరాయ్ ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఈమె చేసిన తెలుగు సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే గ్లింప్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు) గతంలో కన్నడలో పలు సినిమాలు, సీరియల్స్ చేసిన జ్యోతిరాయ్.. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఒకటి రెండు మూవీస్ తెలుగులోనే చేస్తోంది. అందులో ఒకటే కిల్లర్. తాజాగా ఈ చిత్ర టీజర్ నే విడుదల చేశారు.వైమానిక శాస్త్రం అని కాన్సెప్ట్ తో ఈ మూవీని తీశారు. ఇందులో జ్యోతి రాయ్ గ్లామరస్ గా కనిపించింది. అదే టైంలో రోబో తరహా పాత్ర కూడా చేయడం విశేషం. త్వరలో రిలీజ్ సహా ఇతర వివరాలు వెల్లడిస్తారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో.. ఇలాంటి ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.(ఇదీ చదవండి: పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!) డి బౌండ్ అనే డిజార్డర్ తో బాధపడుతున్న హీరోయిన్.. పూర్తిగా కోలుకుంటే పునర్జన్మ ఎత్తినట్లే అని, అప్పుడు ఆమెకు ఎదురు నిలవడం ఎవరి వల్లా కాదని గ్లింప్స్ లో చూపించారు. సూపర్ షీ క్యారెక్టర్ లో జ్యోతి రాయ్ స్టన్నింగ్ యాక్షన్ చేసింది. మరి ఈ సినిమాకు ముందు మొదలైందో, తర్వాత మొదలైందో గానీ కిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించిన పూర్వజ్ తో జ్యోతి ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తన పేరు చివర పూర్వజ్ అని మార్పు చేసుకుంది. గతంలో ఈమెకు పెళ్లవగా ఓ కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఏదేమైనా సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమా హీరోయిన్ కావడం అంటే విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు అంటూ నానితో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెగ తిరిగేశారు. వరస ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ అంటూ చాలా కష్టపడ్డారు. ఫలితం ఏంటనేది మరికొన్ని గంటల్లో తెలుస్తోంది.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) హిట్ 3 సినిమాలో హీరోగా చేసిన నానినే.. నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇతడికి చెందిన వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. బడ్జెట్ గురించి రకరకాల నంబర్స్ వినిపించాయి. రూ.60 కోట్లు అని రూ.80 కోట్లు అని కూడా అన్నారు. దీని గురించే ఓ ఇంటర్వ్యూలో నానిని అడగ్గా.. ఈ మూవీ కోసం ఎంత ఖర్చు పెట్టాననేది తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.నిర్మాణ వ్యవహారాలు చూసుకునేందుకు ఓ టీమ్ ఉందని, వాళ్లు అడిగిన దానికోసం ఖర్చు పెట్టడం తప్పితే బడ్జెట్ గురించి తనకు అస్సలు తెలియదని నాని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 'హిట్' ఫ్రాంచైజీలో వచ్చిన గత రెండు చిత్రాలు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కాగా.. ఈసారి విపరీతమైన యాక్షన్ జోడించారు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) తెలుగులో హిట్ 3 తప్పితే వేరే సినిమాలేం రిలీజ్ కావట్లేదు. మరోవైపు తమిళంలో సూర్య 'రెట్రో', హిందీలో అజయ్ దేవగణ్ 'రైడ్ 2' చిత్రాలు మే 1న థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుందనేది చూడాలి?హిట్ 3 విడుదలకు సిద్ధం చేసిన నాని.. త్వరలో 'ప్యారడైజ్' షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇది అయిన తర్వాత సుజీత్ తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నిర్మాత కూడా నానినే. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్ గా ఉంది.(ఇదీ చదవండి: పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!) #Nani Said I’m the PRODUCER Of #HIT3 Film But I Don’t Know the BUDGET of the Film. pic.twitter.com/GfhSLToShQ— GetsCinema (@GetsCinema) April 30, 2025 -
‘స్పిరిట్’ వెనక్కి.. సందీప్కి ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కొన్నేళ్లపాటు ఫుల్ బిజీ! ఇప్పటికే ఆయన అరడజను సినిమాల వరకు బాకీ ఉన్నాడు. వాటిల్లో ముందుగా రాబోయేది మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా. పిపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’(ప్రచారంలో ఉన్న టైటిల్) చేయబోతున్నాడు. ఆ తర్వాత యానిమల్ ఫేం సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’(Spirit) చేయాల్సింది. ఈ రెండు పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్తో పాటు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కూడా సినిమా చేయాలి. కానీ ఇప్పుడు ఈ ఆర్డర్ మారినట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్’ని వెనక్కినెట్టి ప్రశాంత్ వర్మ సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.‘స్పిరిట్’కి బ్రేక్కి కారణం ఏంటి?సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ స్క్రిప్ట్ను పూర్తి చేసి, లొకేషన్లు కూడా ఫైనల్ చేస్తున్నాడు. కానీ, ఈ సినిమా కోసం సందీప్ విధించిన కండీషన్లే ప్రభాస్ను కాస్త వెనకడుగు వేయించాయని టాక్. 65 రోజుల వరుస కాల్షీట్స్, డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయాలన్న సందీప్ షరతులకు ప్రభాస్ మొదట ఓకే చెప్పినప్పటికీ, ఇప్పుడు మాత్రం ప్రశాంత్ వర్మ సినిమాను ప్రాధాన్యతగా తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా భాగ్యశ్రీ భోర్సే నటించనుందని బజ్.డబుల్ షూటింగ్తో బిజీ! ‘రాజాసాబ్’ షూటింగ్ పూర్తయిన వెంటనే హను రాఘవపూడి ‘ఫౌజీ’తో పాటు, ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్లోనూ ప్రభాస్ పాల్గొననున్నాడట. ప్రస్తుతం ఇటలీ టూర్లో ఉన్న ప్రభాస్, తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై క్లారిటీ రానుంది. మరి, ఈ షెడ్యూల్ మార్పు వెనుక అసలు కథేంటో తెలియాలంటే, మరికొన్ని రోజులు ఆగాల్సిందే! -
పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!
పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్.. కొన్నిరోజుల క్రితం సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్కూల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగేసరికి మార్క్ కి గాయాలు కాగా కొన్నాళ్ల పాటు అక్కడే చికిత్స అందించి హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదట పడిందనే అందరూ అనుకున్నారు. కానీ మరో ట్రీట్ మెంట్ కూడా జరుగుతోందని పవన్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్) పహల్గామ్ మృతులకు నివాళి ఆర్పించడంలో భాగంగా తాజాగా మంగళగిరిలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తన కొడుకు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి కూడా బయటపెట్టారు.అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో బ్రాంకోస్కోపీ చేయించారు. తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చేశారు. అయితే తన కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఆ ఘటన నుంచి తేరుకోలేకపోతున్నాడని, రాత్రుళ్ల నిద్రలో నుంచి భయపడి లేస్తున్నాడని చెప్పారు.(ఇదీ చదవండి: నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో) బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయినట్లు తన కొడుకు మార్క్ శంకర్ కి కలలు వస్తున్నాయని పవన్ అన్నారు. ఈ ట్రామా, భయాన్ని తగ్గించేందుకు సైకియాట్రిస్ట్ ట్రీట్ మెంట్ ప్రస్తుతం చేయిస్తున్నామని చెప్పుకొచ్చారు.పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతానికి రెండింటికి పనిచేస్తున్నారు. అవే హరిహర వీరమల్లు, ఓజీ. వీటిలో పవన్ కి సంబంధించిన షూటింగ్ పెండింగ్ లో ఉంది. మరి వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారో దానిబట్టి రిలీజ్ చేస్తామని నిర్మాతలు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..) -
ఏడాదిలో ఎనిమిది!
నవీన్ చంద్ర హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘లెవెన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. రేయా హరి కథానాయికగా నటించిన ఈ మూవీలో అభిరామి, రవి వర్మ కీలక పాత్రలు చేశారు. ఏఆర్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన ఈ సినిమా మే 16న విడుదల కానుంది.ఈ చిత్రం ట్రైలర్ని నటుడు కమల్హాసన్ విడుదల చేశారు. ‘వైజాగ్లో లాస్ట్ వన్ ఇయర్లో ఎనిమిది హత్యలు జరిగాయి.. సీరియల్ కిల్లింగ్స్’ అంటూ పోలీస్ ఆఫీసర్గా నవీన్ చంద్ర చెప్పే డైలాగుతో ట్రైలర్ ఆరంభమైంది. రుచిర ఎంటర్ౖటెన్మెంట్స్ అధినేత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమేరా: కార్తీక్ అశోకన్. -
జూన్లో ఫిక్స్
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) గురించి కీలక అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాని 2026 జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు మేకర్స్. ‘ఆర్ఆర్ఆర్, దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్, సలార్’ వంటి హిట్స్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘ఎన్టీఆర్ నీల్’.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించింది యూనిట్. అయితే తాజాగా ఆ తేదీకి కాకుండా 2026 జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు కొత్త తేదీని ప్రకటించారు. ‘‘ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మా సినిమా అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్లో బాక్సాఫీస్ విధ్వంసమయ్యే అనుభూతికి సిద్ధంకండి. 2026 జూన్ 25న థియేటర్లు దద్దరిల్లే సౌండ్స్ మీరు వింటారు. మాస్లకే మాస్ అయిన ఎన్టీఆర్ పుట్టినరోజున (మే 20) ప్రత్యేక గ్లింప్స్తో వస్తాం’’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. ఈ చిత్రానికి కెమేరా: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రూర్. -
వాటర్లో వార్
వెండితెర నీటిమయం కానుంది. ఎందుకంటే నీటిలో వీరోచిత యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నారు కొందరు తెలుగు హీరోలు. కొందరు నీటి పై... మరి కొందరు నీటి లోపల వాటర్ సీక్వెన్స్ చేస్తున్నారు. ఇలా ప్రత్యర్థులతో ‘వాటర్లో వార్’ చేస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.బురదలో ఫైట్ వాటర్లో ఫైట్ సీక్వెన్స్లను చాలా సినిమాల్లో చేశారు చిరంజీవి. కానీ... తొలిసారిగా కాస్త బురద ఉండే వాటర్ ఫైట్ సీక్వెన్స్ను ‘విశ్వంభర’ సినిమా కోసం చేశారాయన. ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని, ఈ ఫైట్ను ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా డిజైన్ చేశారని సమాచారం. ఈ చిత్రంలో ఆంజనేయ స్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రను చిరంజీవి పోషిస్తున్నారని తెలిసింది.త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్ లేదా ఆగస్టులో ‘విశ్వంభర’ విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. పడవలో ఫైట్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులు. మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేస్తుండగా, హీరోయిన్గా పంచమి అనే పాత్రలో నిధీ అగర్వాల్ నటిస్తున్నారు.ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఓ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని తెలిసింది. ఈ సీన్ సినిమా ఆరంభంలోనే వస్తుందట. ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. పడవల్లో గొడవ పడవ ప్రయాణంలో ప్రత్యర్థులతో గొడవ పడుతున్నారట మహేశ్బాబు. ఇది ఏ రేంజ్ గొడవ అనేది థియేటర్స్లో చూడాలి. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఇటీవల హైదరాబాద్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించారట రాజమౌళి. ఈ చిత్రంలో ప్రధాన తారాగణమైన మహేశ్బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొనగా, వీరితో పాటు దాదాపు మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని సమాచారం. ఈ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ను ఓ భారీ సెట్లో చిత్రీకరించారట. ఈ బోట్ యాక్షన్ సీక్వెన్స్ని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేశారని భోగట్టా. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుందని సమాచారం.సముద్రంలో దేవర తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రి దేవరగా, కొడుకు వరగా ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను మెప్పించింది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘దేవర’ తొలి భాగంలో సముద్రంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్లను చూశాం. అలాగే ‘దేవర 2’లోనూ ఆ తరహా వాటర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలిసింది. తొలి భాగంలో సముద్రం అడుగు భాగాన కొన్ని అస్థిపంజరాలు ఉన్నట్లుగా చూపించారు.వీటి వెనక దాగి ఉన్న యాక్షన్ ఎపిసోడ్ ‘దేవర 2’లో ఉంటుందని తెలుస్తోంది. ఇంకా రెండో భాగం షూటింగ్ ఆరంభం కాలేదు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో ప్రకాశ్రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. కల్యాణ్రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ ‘దేవర’ చిత్రాన్ని నిర్మించారు. ఈ నిర్మాతలే ‘దేవర 2’ని కూడా నిర్మిస్తారని ఊహించవచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చాక ‘దేవర 2’ షూట్లో పాల్గొంటారని తెలుస్తోంది. సాహసాల సూపర్ యోధ సూపర్ యోధగా సాహసాలు చేస్తున్నారు తేజ సజ్జా. ఈ సాహసాల విజువల్స్ ఆగస్టులో థియేటర్స్లో చూడొచ్చు. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ అనే ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ రూపొందుతోంది. ఈ సినిమాలో ఓ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉందని భోగట్టా. యాక్షన్తో పాటు ఆధ్యాత్మిక అంశాలు కూడా మిళితమై ఉన్న ఈ సినిమాకు చెందిన ఓ లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ శ్రీలంకలో జరిగింది.ఆ షెడ్యూల్లో ఓ వాటర్ యాక్షన్ సీక్వెన్స్తో పాటు ఓ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ కూడా తీశారని సమాచారం. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కానుంది. ఇలా వాటర్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్తో మరికొన్ని చిత్రాలు రానున్నాయి. -
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకున్నారు. ఇవాళ బాలుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం బాలుడిని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని.. 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వెల్లడించారు. మనుషుల్ని గుర్తు పట్టట్లేదని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ 4 నెలల 25 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 146 రోజుల తర్వాత డిశ్చార్జ్ అవుతున్నారు. శ్రీ తేజకు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించి ఇంటికి తీసుకెళ్లొచ్చవని వైద్యులు సూచించారు.గతేడాది డిసెంబర్లో ఘటనకాగా.. గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ను చూసేందుకు వెళ్లింది. అయితే విపరీతమైన క్రౌడ్ రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్కు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
అభినయమే ఆభరణం.. నటీనటులకు నగలతో అనుబంధం
పెళ్లి అయినా పేరంటమైనా అయినా నగలు అలంకరించుకోవాల్సిందే అంటారు ఆభరణాల ప్రియులు.. అభినయమైనా, ఆభరణమైనా నటులు ఉండాల్సిందే అంటున్నారు ప్రచార వ్యూహాల రూపకర్తలు. తారలు ఆభరణాల లేబుల్ల మధ్య అనుబంధం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పాలి. కళ్యాణం అనగానే పెళ్లి మాత్రమే కాదు కళ్యాణ్ జ్యుయలర్స్ ప్రకటన కూడా గుర్తొస్తుందంటే కారణం... నాగార్జున అని చెప్పొచ్చు, అమితాబ్ బచ్చన్ అని కూడా చెప్పొచ్చు. దేశంలోని బంగారు ఆభరణాల వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాలు దాదాపు 37% వాటాను కలిగి ఉన్న నేపధ్యంలో ఈ బ్రాండ్ తమిళనాడులో ప్రభు గణేషన్, తెలుగు రాష్ట్రాల కోసం అక్కినేని నాగార్జున, కన్నడిగుల్ని మెప్పించడానికి...శివరాజ్కుమార్, మంజు వారియర్... ఇలా నలుగురు ప్రధాన తారలతో ఒప్పందం కుదుర్చుకుంది .నమూనాలు, శైలులు, సున్నితత్వాలు ప్రాధాన్యతలు మన దేశంలో ఉన్న భాషలు మాండలికాలు విభిన్నంగా ఉంటాయి. అందుకే మా బ్రాండ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతీయ బ్రాండ్ అంబాసిడర్ని ఎంపిక చేసిందని కళ్యాణ్ జ్యువెలర్స్ మార్కెటింగ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ అంటున్నారు. భారతీయ బంగారు ఆభరణాల మార్కెట్లో పశ్చిమ భారత రాష్ట్రాలు 32% వాటా కలిగి ఉన్నందున ఇదే బ్రాండ్ బాలీవుడ్ నుంచి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కత్రినా కైఫ్లను ఎంపిక చేసింది. గతంలో ఈ బ్రాండ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోనమ్ కపూర్ వంటి వారితో కూడా జట్టు కట్టింది.బంగారం వెలిగిపోతోంది.. ఆభరణాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే తారలతో ఆభరణాల బ్రాండ్స్ అనుబంధం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. టాలీవుడ్ హీరో యంగ్టైగర్ ఎన్టీయార్ మలబార్ గోల్డ్లో మెరిశారు. ఇక రామ్ చరణ్ భీమా జ్యుయలర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా కనిపిస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు కుమార్తె సితార సైతం ప్రముఖ ఆభరణ బ్రాండ్ పిఎంజె జ్యుయల్స్కు అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. గతంలో గానీ ప్రస్తుతం గానీ... చూసుకుంటే బ్రాండ్ అంబాసిడర్స్గా కావచ్చు కలెక్షన్లను ఆవిష్కరించిన సెలబ్రిటీలుగా కావచ్చు... ర్యాంప్ మీద ఆభరణాలను ప్రదర్శించి కావచ్చు..విభిన్న రకాలుగా అనేక మంది నటీనటులు నగధగలకు తమ స్టార్ డమ్ మెరుపులను జత చేశారు.ఒక్కసారి పరిశీలిస్తే...నటి తమన్నా భాటియా వైట్ అండ్ గోల్డ్ బ్రాండ్ను స్వయంగా లాంచ్ చేసింది. అంతేకాదు ఆమె హెడ్ డిజైనర్గానూ పనిచేస్తోంది. గతంలో ఓ ఆభరణాలను తాకట్టుపెట్టుకునే మరో బ్రాండ్కు ఆమె ప్రచారం చేసింది. బాలీవుడ్ నటి దిశా పటానీ రిలయన్స్ జ్యువెల్స్ రూపొందించిన మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబింబించే ’వింధ్య కలెక్షన్’ను ఆవిష్కరించారు. త్రిభువన్ దాస్ భీమ్జీ జువేరీ తమ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ను నియమించుకుంది. భీమా జ్యువెలర్స్కు మొదటి బ్రాండ్ అంబాసిడర్గా టాలీవుడ్, బాలీవుడ్ నటి పూజా హెగ్డే పనిచేస్తే, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది. అంతగా పాప్యులర్ కాని ఓ మోస్తరు నటీమణులను సైతం బ్రాండ్స్ ఎంపిక చేసుకోవడం విశేషం. వెడ్డింగ్ పులావ్, గులాబీ లెన్స్ వంటి సినిమాల్లో పలు వెబ్సిరీస్లలో నటించిన అనుష్కా రంజన్ వరుణ డి జానీ అనే ఆభరణ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా మెరిసింది. ఖన్నా జ్యువెలర్స్ నగల ప్రచారంలో నటి చిత్రాంగద సింగ్ పనిచేసింది.కలెక్షన్స్ విడుదల్లోనూ...బ్రాండ్ అంబాసిడర్గా చేయడంతో పాటు కేవలం ఒక కలెక్షన్స్ను మాత్రమే ప్రదర్శించడం, విడుదల చేయడం వంటివి కూడా తారలు చేస్తున్నారు.తాప్సీ పన్ను రిలయన్స్ జ్యువెల్స్ ’తంజావూర్ కలెక్షన్’ను లాక్మీ ఫ్యాషన్ వీక్లో ప్రదర్శించారు. జాన్వీ కపూర్ సైతం అంతకు ముందే ఈ తంజావూర్ కలెక్షన్ను పరిచయం చేశారు. బెంగాలీ నటి రితాభారి చక్రబర్తి గత ఏడాది కల్యాణ్ జ్యువెలర్స్ అక్షయ తృతీయ ప్రత్యేక కలెక్షన్స్ను ప్రారంభించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి పిసి జ్యువెలర్స్ బంగారు ఆభరణాలు సతీసమేతంగా ప్రదర్శించాడు. బంగారు ఆభరణాలను మాత్రమే కాదు బంగారంతో అనుబంధం ఉన్న ప్రతీ దాంట్లో తారలు తళుక్కుమంటున్నారు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్ అయిన ప్లస్ గోల్డ్ కు సోనాక్షి సిన్హా ప్లస్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసింది. అలాగే బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకునే ముత్తూట్ ఫైనాన్స్కు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ జట్టు కట్టారు.ప్రతి పండుగ సీజన్లో మాదిరిగానే అక్షయ తృతీయ రోజున ప్రింట్ మీడియా సిటీ హోర్డింగ్లలో గోల్డ్ ఫీవర్ కనిపిస్తుంది. విలాసవంతమైన, మెరిసే ఆభరణాలను ధరించిన బాలీవుడ్, దక్షిణ భారత సినిమాలకు చెందిన తారల ప్రకటనలతో నిండిపోతాయిు. అయితే ఒక సెలబ్రిటీ పని బ్రాండ్ తాజా కలెక్షన్స్ను ప్రదర్శించేందుకు పోజులివ్వడమే కాదు – ఇది సీజన్ ట్రెండ్లు సమయాలు సందర్భాలను దృష్టిలో ఉంచుకుని వీరు తప్పనిసరిగా సోషల్ మీడియాలో బ్రాండ్ గురించి మాట్లాడాలి బ్రాండ్ ఆభరణాలను ధరించి ఈవెంట్స్లో కనిపించాలి. ఒప్పందాల గోప్యత కారణంగా సెలబ్రిటీ ఎండార్స్మెంట్ల కోసం కేటాయించిన ఖర్చుల గురించి చాలా బ్రాండ్లు పెదవి విప్పడం లేదు. అయితే ప్రతి ప్రచారానికి సెలబ్రిటీని బట్టి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 1 కోటి అంతకంటే ఎక్కువ ముట్టచెబుతారని పరిశ్రమలోని సీనియర్లు చెబుతున్నారు. -
'అలా చేయకపోతే అస్సలు జీవితమే కాదు'.. గొప్ప మనసు చాటుకున్న బిగ్బాస్ బ్యూటీ!
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలా క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లోనూ ఛాన్స్లు కొట్టేశారు. అలాంటి వారిలో అశ్విని శ్రీ కూడా ఒకరు. బిగ్బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది.అయితే ఇటీవల తన బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది అశ్విని శ్రీ. ఈ సందర్భంగా తనలో అందమే కాదు.. మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంది ముద్దుగుమ్మ. తన పుట్టిన రోజు వేడుకను ఓ అనాథాశ్రమంలో జరుపుకుంది. అక్కడే ఉన్న పిల్లలకు నాన్ వెజ్ వంటకాలు తానే స్వయంగా వడ్డించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతరుల కోసం జీవించకపోతే.. అసలు అది జీవితమే కాదు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు అశ్విని శ్రీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని బిగ్బాస్ బ్యూటీకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
బీచ్ ఒడ్డున అందాలన్నీ ఆరబోస్తున్న మలైకా అరోరాకళ్లజోడుతో స్టైలిష్ పోజులిస్తున్న దుషారా విజయన్డ్యాన్స్ డే వీడియోలతో మౌనీ రాయ్, ఆదితీ రావువయ్యారాలు ఒలకబోస్తున్న రెజీనా కసాండ్రాచీరలో అలా నడిచొస్తూ మాయ చేసేస్తున్న అనసూయపాలరాతి శిల్పంలా తెల్లగా మెరిసిపోతున్న ప్రణీతకొండల్లో విహార యాత్రకు వెళ్లిన యాంకర్ విష్ణుప్రియ View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
పహల్గాం ఘటన.. ఆ రోజులన్నీ కళ్లముందు తిరిగాయి: నభా నటేష్
పహాల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని చెప్పింది హీరోయిన్ నభా నటేష్. ఉగ్రదాడులు హేయమైన చర్య అని దేశమంతా బాధితులకు సంఘీభావంగా ఉంటామని నభా పేర్కొంది. అందమైన పహల్గాంలో తాను షూటింగ్ చేశానని, అందమైన అహ్లాదకరమైన ప్రదేశమని నభా నటేష్ తెలిపింది. పహాల్గాంలో షూటింగ్ చేసిన జ్ఞాపకాలను ఆమె షేర్ చేసుకుంది.నభా నటేష్ స్పందిస్తూ - పహాల్గాం బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ నేను నటించిన డార్లింగ్ మూవీ షూటింగ్ చేశాం. చుట్టూ 5 కిలోమీటర్ల మేర అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపాం. భూతల స్వర్గమైన పహాల్గాంలో ఉగ్రదాడి జరపడం హేయమైన చర్య. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇలాంటి దాడులు జరిగాక ఫిలింమేకర్స్ పహాల్గాం వెళ్లాలంటే ఆలోచిస్తారు. స్థానిక ప్రజలు చాలా మంచివారు, మా టీమ్ కు స్నేహితులుగా మారిపోయారు. పహాల్గాం దాడి ఘటన గురించి వినగానే నాకు అక్కడ షూటింగ్ చేసిన రోజులన్నీ కళ్లముందు తిరిగాయి. అని చెప్పింది. -
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారు. వాళ్లలో ఒకడు బెల్లంకొండ శ్రీనివాస్. పదేళ్లకు పైనే ఇండస్ట్రీలో ఉన్నాడు కానీ చెప్పుకోదగ్గ సినిమాలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. చివరగా 2023లో ఛత్రపతి చిత్రాని హిందీలో రీమేక్ చేసి ఘోరంగా ఫెయిలయ్యాడు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా) దీంతో చాలా గ్యాప్ తీసుకుని ఒకేసారి నాలుగు సినిమాల్ని రెడీ చేస్తున్నాడు. అందులో 'భైరవం' త్వరలో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 'కిష్కిందపురి' అని మరో మూవీ ప్రకటించాడు. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.పాడుబడ్డ పెద్ద భవంతి, అందులో హీరో అండ్ గ్యాంగ్ వెళ్తారు. తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే అంశాలతో ఈ 'కిష్కిందపురి' తీసినట్లు అనిపిస్తుంది. గతంలో బెల్లంకొండ హీరోతో 'రాక్షసుడు' సినిమాలో నటించిన అనుపమ.. ఇందులో హీరోయిన్.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) తొలిసారి హారర్ జానర్ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ రాబోతున్నాడు. ఈ వర్షాకాలంలోనే మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. మరి ఈసారైనా బెల్లంకొండ హిట్ కొడతాడా?ఈ గ్లింప్స్ చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చివర్లో హీరో... అహం మృత్యు అని చెప్పిన డైలాగ్, ఆ టైంలో కళ్లు దెయ్యం కళ్లలా ఉండటం చూస్తుంటే ఈసారి ప్రేక్షకుల్ని భయపెడతారనిపిస్తోంది. గతంలో అనుపమతో థ్రిల్లర్ మూవీ చేయగా.. ఇప్పుడు హారర్ చేశాడు శ్రీనివాస్.(ఇదీ చదవండి: అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్) -
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
‘బలగం’ తర్వాత దర్శకుడు వేణు(venu yeldandi) చాలా గ్యాప్ తీసుకున్నాడు. తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ (Yellamma Movie) అని ప్రకటించి చాలా రోజులైంది కానీ, ఇంకా పట్టాలెక్కలేదు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తొలుత నాని హీరోగా నటిస్తారనే ప్రచారం జరిగింది. నాని కూడా వేణుతో సినిమా చేస్తానని చెప్పారు. ఏం జరిగిందో తెలియదు కానీ నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నాడు. చివరకు ఈ కథ అటు తిరిగి ఇటు తిరిగి నితిన్ (Nithiin) దగ్గర వెళ్లింది. కథ బాగా నచ్చడంతో నితిన్ ఈ చిత్రాన్ని వెంటనే ఓకే చేశాడు. డేట్స్ కూడా అరేంజ్ చేసుకున్నాడు. నిర్మాత దిల్ రాజు కూడా సినిమా షూటింగ్ స్టార్స్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. కానీ ఈ సినిమాకు కీలకమైన హీరోయిన్ మాత్రం దొరకడం లేదట. ‘ఎల్లమ్మ’ కోసం అటు దిల్ రాజు, నితిన్.. ఇటు వేణు తెగ వెతుకుతున్నారట.బలగం మాదిరే ఈ కథ కూడా రూరల్ నేపథ్యంలోనే సాగుతుదంట. దర్శకుడు వేణు చాలా పకడ్బంధీగా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. కథ మొత్తం ఆమె చుట్టునే తిరుగుతుంది. అందుకే ఓ స్టార్ హీరోయిన్ని ఆ పాత్రకు తీసుకోవాలనుకున్నారట. తొలుత సాయి పల్లవి అయితే బాగుంటందని ఆమెను సంప్రదించారు. అయితే సాయి పల్లవి ఈ సినిమా చేయలేనని చెప్పేసిందట. దీంతో మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ అయితే ‘ఎల్లమ్మ’కు న్యాయం చేస్తుందని ఆమెను సంప్రదించారట. అయితే కథ, పాత్ర బాగా నచ్చినప్పటికీ.. డేట్స్ ఖాలీగా లేకపోవడం నో చెప్పేసిందట. శ్రీలీలను తీసుకుందామంటే.. అల్రెడీ నితిన్తో రెండు సినిమాలు చేసింది. అవి కూడా ఫ్లాప్ అవ్వడంతో దిల్ రాజు వెనకడుకు వేస్తున్నాడట. ఇక రష్మిక, సమంత లాంటి హీరోయిన్లు కూడా ఖాలీగా లేరు. నితిన్ ఎప్పుడైన తన సినిమాలకు ట్రెండింగ్ హీరోయిన్ని తీసుకుంటాడు. కానీ ఈ సారి మాత్రం అది వర్కౌట్ అయ్యేలా లేదు. స్టార్ హీరోహీరోయిన్లు అంతా బిజీగా ఉన్నారు. మరి ‘ఎల్లమ్మ’గా ఎవరు ఎంట్రీ ఇస్తారో చూడాలి. -
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇదివరకే హైదరాబాద్, ఒడిశాలో షూటింగ్ చేశారు. త్వరలో మరో షెడ్యూల్ కూడా మొదలుపెట్టబోతున్నారు. కానీ SSMB 29 గురించి అధికారికంగా మాత్రం ప్రకటించలేద. మహేశ్ అయితే పూర్తిగా బయట కనిపించడమే మానేశాడు.కొన్నిరోజుల క్రితం షూటింగ్ లో బ్రేక్ దొరకగానే కుటుంబంతో కలిసి మహేశ్.. ఇటలీ వెళ్లాడు. కానీ తన ఫొటో గానీ, లుక్ గానీ బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఎయిర్ పోర్ట్ లోనూ తలపై క్యాప్, కళ్లజోడు ఉండటం వల్ల మహేశ్ లుక్ సరిగా రివీల్ కాలేదు.(ఇదీ చదవండి: అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్) మరి తాజాగా ఎవరితోనూ ఏదో డిస్కషన్ చేస్తున్న టైంలో మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ బయటపడింది. గుబురు గడ్డంతో, పొడవైన జుత్తుతో మహేశ్ కనిపించాడు. గతంలో మహేశ్ హెయిర్ పెంచాడు గానీ రాజమౌళితో మూవీ కోసం మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడని ఈ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది.గతంలో ఒడిశాలో షూటింగ్ చేస్తున్న టైంలో మహేశ్ క్లిప్ ఒకటి లీకైంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా కనిపించాడు. మరోవైపు ఇదే సినిమాలో ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్ర చేస్తోంది. వీళ్ల లుక్స్ కూడా బయటకు రాకుండా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ మూవీ 2027లో థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) -
మరో ఓటీటీకి టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. కేవలం వారి కోసమే!
శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓం భీమ్ బుష్'. గతేడాది మార్చి 22న థియేటర్స్లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. లాజిక్తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు శ్రీహర్ష దర్శకత్వం వహించారు. అయితే ఈ సూపర్ హిట్ మూవీఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ దాదాపు ఏడాది తర్వాత మరో ఓటీటీలో సందడి చేయనుంది. మే నెల 2వ తేదీ నుంచి సింప్లీ సౌత్ అనే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. అయితే కేవలం ఈ ఓటీటీలో విదేశాల్లో నివసించే వారు మాత్రమే చూడొచ్చు. ఇండియాలో ఉండే వారికి సింప్లీ సౌత్లో స్ట్రీమింగ్ కాదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. #OmBheemBush, streaming in Telugu, Tamil and Malayalam on Simply South from May 2 worldwide, excluding India., pic.twitter.com/km7om16Zlf— Simply South (@SimplySouthApp) April 29, 2025 -
అభిమానులకు గుడ్న్యూస్ చెప్పిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా (#NTRNEEL) నుంచి కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఎన్టీఆర్ ప్రకటించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీని అత్యంత భారీ బడ్జెట్తో పీరియాడికల్ స్టోరీతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి షూటింగ్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్.. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ ఇలా ఇద్దరూ తెలుగులో కలిసి చేస్తున్న చిత్రమిదే కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అభిమానులకు ఎన్టీఆర్ శుభవార్త చెప్పారు. (#NTRNEEL) చిత్రాన్ని 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విధ్వంసమే జరగనుంది. ఆ అనుభూతి పొందేందుకు సిద్ధకండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. వచ్చే సమ్మర్లో బాక్సాఫీస్ వద్ద ఫుల్ సందడి వాతావరణం కనిపించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.మొదట వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, కథ వల్ల వీఎఫ్ఎక్స్ పనులతో పాటు చిత్రీకరణ విషయంలోనూ మరింత స్ట్రాంగ్గా ప్లాన్ చేయడం వల్లే కాస్త ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. తారక్ నటిస్తోన్న 31వ చిత్రమిది. షూటింగ్లో భాగంగా కొద్దిరోజుల క్రితమే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్డ్రాప్లో ఓ ప్రత్యేక సెట్ను సిద్ధం చేసి అక్కడ కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. అయితే, ఎన్టీఆర్తో తెరకెక్కించబోయే సీన్లు మాత్రం కాస్త ఆలస్యంగా ప్రారంభించారు. శ్రీలంకలోని కొలంబోలో కూడా ఎన్టీఆర్తో షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ యూనిట్లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్ను ఫైనల్ చేశారని తెలిసింది. See you in cinemas on 25 June 2026…. #NTRNeel pic.twitter.com/SkMhyaF71c— Jr NTR (@tarak9999) April 29, 2025 -
సల్మాన్ ‘సౌత్’ వ్యాఖ్యలపై స్పందించిన నాని!
‘దక్షిణాది అభిమానులు మాపై(బాలీవుడ్ హీరోలు) చూపిస్తున్న ప్రేమను థియేటర్ వరకు తీసుకెళ్లరు’ అని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) చేసిన వ్యాఖ్యలు ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నాని(Nani) స్పందిస్తూ..బాలీవుడ్ చిత్రాలను దక్షిణాది ప్రేక్షకులు తరతరాలుగా ఆదరిస్తున్నారని గుర్తు చేశారు. ఒకవేళ వారంతా నిజంగానే ఆదరించరనేదే నిజమైతే వాళ్లు(బాలీవుడ్ హీరోలు) సూపర్ స్టార్స్ ఎలా అయ్యారని ప్రశ్నించారు. ‘దక్షిణాది చిత్రాలు ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. కానీ అంతకంటే ముందు హిందీ చిత్రాలను అందరూ ఆదరించారు. ఎన్నో దశాబ్దాలుగా సౌత్ ఆడియన్స్ బాలీవుడ్ సినిమాలపై ఆదరాభిమానాలు చూపిస్తూనే ఉన్నారు. బాలీవుడ్ హీరోలకు ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అమితాబ్ నటించిన ఎన్నో చిత్రాలు సౌత్లో సూపర్ హిట్గా నిలిచాయి. సల్మాన్ ఖాన్కు ఇక్కడ(సౌత్) చాలా మంది అభిమానులు ఉన్నారు.‘హమ్ ఆప్కే హై కౌన్’ సినిమా నాకు చాలా ఇష్టం. ‘దీదీ తేరా దీవానా’ పాట ఇక్కడి పెళ్లిళ్లలో ఎన్నోసార్లు విన్నాం. ఆయన నటించిన చిత్రాలెన్నో ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి. అందరూ ఆదరించారు కాబట్టే వాళ్లు సూపర్ స్టార్స్ అయ్యారు. బహుశా సల్మాన్ వ్యాఖ్యలను మనం తప్పుగా అర్థం చేసుకున్నామేమో. బాలీవుడ్ సినిమాలకు సౌత్లో మంచి ఆదరణ ఉంటుంది’ అని నాని చెప్పుకొచ్చారు. కాగా, సికిందర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ.. ‘సౌత్ హీరోల సినిమాలు బాలీవుడ్లో మంచి విజయం సాధిస్తున్నాయి. రజనీకాంత్, చిరంజీవి, సూర్య, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలు అక్కడ(బాలీవుడ్) మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఎందుకంటే వారి సినిమాను మేమంతా థియేటర్స్కి వెళ్లి చూస్తాం. కానీ వారి అభిమానులు మాత్రం మా(హిందీ )సినిమాలు చూడడానికి అంతగా ఆసక్తి చూపించరు. నేను రోడ్లపై కనిపిస్తే..‘భాయ్..భాయ్’ అంటూ ప్రేమను చూపిస్తారు కానీ..అదే ప్రేమతో థియేటర్స్కి వెళ్లి సినిమా చూడరు’ అని అన్నారు. ఇక నాని సినిమాల విషయానికొస్తే.. ఆయన హీరోగా నటించిన ‘హిట్ 3’(HIT 3) మే 1న విడుదల కాబోతుంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ఈ మూడో సినిమా ఇది. శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. -
కుర్రాళ్ల సినిమా.. మనోళ్లకు ఎక్కేసింది!
తెలుగు ఇండస్ట్రీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. స్ట్రెయిట్ చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే థియేటర్లకు జనాలు సరిగా రావట్లేదు. కొందరు దర్శక నిర్మాతలేమో రివ్యూయర్లదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ కంటెంట్ లో పొరపాట్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.(ఇదీ చదవండి: 'ది ఫ్యామిలీ మ్యాన్-3' నటుడు అనుమానాస్పద మృతి) ఎందుకంటే కంటెంట్ సరిగా ఉండి ఎంటర్ టైన్ చేస్తే మనది కాదా అనే విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. గతవారం 'సారంగపాణి' సినిమాతో పాటు జింఖానా, తుడురమ్ అనే డబ్బింగ్ చిత్రాలు కూడా థియేటర్లలో రిలీజయ్యాయి. స్ట్రెయిట్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పెద్దగా రావట్లేదు.అదే టైంలో 'ప్రేమలు' హీరో నస్లేన్ నటించిన 'జింఖానా'కు మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ.. కామెడీ కనెక్ట్ అయ్యేలా ఉండటం దీనికి కలిసొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి రూ.2.70 కోట్ల మేర వసూళ్లు వచ్చాయని టాక్.(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?) చాలా తెలుగు సినిమాలతో పోలిస్తే 'జింఖానా'పై పెద్దగా అంచనాల్లేవు. కానీ ఈ కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలకు లాభాలు రావడం గ్యారంటీ అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు విడుదల వరకు దీనిపై పెట్టుబడి కూడా అంత ఎక్కువ పెట్టి ఉండరుగా!జింఖానా విషయానికొస్తే.. అలెప్పీకి చెందిన కొందరు కుర్రాళ్లు.. ఇంటర్ ఫెయిలవుతారు. స్పోర్ట్స్ కోటాలో డిగ్రీ సీటు సంపాదించాలని బాక్సింగ్ నేర్చుకుంటారు. లోకల్ పోటీల్లో ఎలాగోలా గెలిచేస్తారు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు రెడీ అవుతారు. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు గెలిచారా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) -
బన్నీ,చెర్రీ ఫైట్..ఫ్యాన్స్ ‘కోలా’హలం తప్పదా?
ఇది వేసవి సూర్యుడు ప్రచండ భానుడై ప్రతాపం చూపే సమయం. దాంతో జనమంతా చల్లని పానీయాలకు జై కొట్టే సమయం. సాధారణంగానే కూల్ డ్రింక్స్ అమ్మకాలు పీక్స్లో ఉండే ఈ టైమ్లో అత్యధిక వ్యాపారాన్ని దక్కించుకోవాలని కోలా బ్రాండ్స్ తహతహలాడుతాయి. రకరకాల ప్రకటనల ద్వారా దాహార్తి నిండిన గొంతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. దాంతో ఈ సీజన్ ఆసాంతం ప్రకటనల ‘కోలా’హలంతో నిండిపోతుంది.వేసవి వచ్చినప్పుడల్లా కూల్ డ్రింక్స్ బ్రాండ్స్ మధ్య ఆధిపత్య పోరు ఆటోమేటిక్గా వేడెక్కడం కోలా కంపెనీల్లో రివాజు. అది ఈ సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ సారి ఆధిపత్య పోరు బ్రాండ్స్తో ఆగేటట్టుగా లేదు. ఇప్పటికే ఇద్దరు టాలీవుడ్ అగ్రనటుల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు దీనికి జతయ్యేట్టుగా ఉంది. దానికి కారణం పుష్ప, పెద్దిలే...అదేనండీ.. అల్లు అర్జున్, రామ్చరణ్లే.పుష్ప తో ఆల్ ఇండియా స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun) ఇమేజ్ని క్యాష్ చేసుకోవాలని ఎన్నో కంపెనీలు ఉవ్విళ్లూరాయి. అదే క్రమంలో ప్రముఖ కూల్ డ్రింక్ బ్రాండ్ థమ్స్ అప్ తన దక్షిణాది బ్రాండ్ అంబాసిడర్గా అల్లు అర్జున్ ని ఎంచుకుంది. పుష్పరాజ్తో... చాలా ఉత్తేజకరమైన ఎనర్జిటిక్ వీడియోలను తయారు చేసి విడుదల చేసింది. అవి బాగా జనంలోకి దూసుకెళ్లాయి కూడా. అయితే ఇప్పుడు థమ్స్ అప్కి ప్రత్యర్ధిగా ఉన్న క్యాంపా కోలా...బన్నీకి ధీటైన మరో నటుడి గురించి సాగించిన అన్వేషణ మరో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఆగింది. తాజా ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఈ కోలా బ్రాండ్ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది.ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్చరణ్ (Ram Charan) ను క్యాంపాకోలా తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం కూల్గా మాట్లాడుకోవాల్సిన కూల్ టాపిక్ను వేడి వేడిచర్చలకు కేంద్ర బిందువైన హాట్ టాపిక్గా మార్చింది.ప్రస్తుతం మెగా , అల్లు కుటుంబాల బంధం మధ్య బన్నీ, చెర్రీలనే అడ్డుగీతలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. రామ్ చరణ్, అల్లు అర్జున్ పరస్పరం ఎడముఖం పెడముఖంగా ఉన్నారు అనడం చాలా చిన్నమాట. బయటకు చెప్పకున్నా, సోషల్ మీడియాలో అన్ఫాలోల దగ్గర నుంచి ఫాలోయర్స్, ఫ్యాన్స్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం వరకూ బన్నీ, చెర్రీల వార్... గట్టిగా నడుస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో రెండు బలమైన కూల్ డ్రింక్ బ్రాండ్స్ కాంపా కోలా, థమ్స్ అప్ లకు వారు అంబాసిడర్లుగా ఎంపిక కావడంతో ఈ వైరం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ రెండు బ్రాండ్స్ భవిష్యత్తులో రూపొందించే ప్రకటనలు ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తాయో.. ఎంత హీట్ తెస్తాయో.....చూడాలి.మరోవైపు క్యాంపా కోలా ప్రకటనలు రామ్ చరణ్ స్టార్ స్టేటస్పై ఎక్కువగా ఆధారపడి రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా మగధీర, ఆర్ఆర్ఆర్ లలోని ప్రసిద్ధ సినిమా సన్నివేశాలను ఇవి వాడుకుంటున్నాయి. -
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్పై డీఎంకే నేత, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమకు పోటీ కేవలం డీఎంకే పార్టీ మాత్రమేనని విజయ్ ఇప్పటికే సందేశం పంపాడు. కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి స్టాలిన్పై విమర్శలు చేస్తున్నారు కూడా.. అధికార పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు తాను ఉన్నానంటూ విజయ్ పలు వేదికలపై చెబుతున్నారు. దీంతో డీఎంకే మంత్రి పన్నీర్ సెల్వం తాజాగా విజయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా జరిగిన రాజకీయ సమావేశంలో విజయ్ పార్టీ గురించి మంత్రి పన్నీర్ సెల్వం కామెంట్స్ చేశారు. 'బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి మాకు అవినీతి గురించి పాఠాలు చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన తీసుకునే డబ్బు (రెమ్యునరేషన్) అంతా బ్లాక్ మనీ అని అందరికీ తెలిసిందే.' అని ఆయన అన్నారు. ఆపై వేదికపై నుంచే విజయ్ పార్టీ (TVK) అంటే ఏంటి..? దానికి సమాధానం చెప్పాలని జనసమూహాన్ని పన్నీర్ సెల్వం కోరారు. వెంటనే వారు (T-త్రిష, V- విజయ్, K- కీర్తి సురేష్) అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మీరంతా బ్రిలియంట్స్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తామని చెబుతుంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదని ఆయన అన్నారు.రాష్ట్రాన్ని నడపటం అంటే సినిమాలో నటించడం అంత సులభం అనుకుంటున్నారా.? అని మంత్రి ప్రశ్నించారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట డీఎంకే పార్టీతో స్టాలిన్ తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం అక్కడ మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా స్టాలిన్ ఉన్నారని జాతీయ స్థాయి సర్వేలు కూడా తేల్చేశాయి. తర్వాతి రెండో స్థానంలో విజయ్ పార్టీ ఉందని ఆ సర్వేలు చెప్పాయి. అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో 2026 ఎన్నికల్లో విజయ్తో స్టాలిన్కు గట్టిపోటీ తప్పదని తెలుస్తోంది. -
'ది ఫ్యామిలీ మ్యాన్-3' నటుడు అనుమానాస్పద మృతి
ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన భారతీయ వెబ్సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టాప్లో ఉంటుంది. అయితే, సీజన్- 3లో నటించిన నటుడు రోహిత్ బస్ఫోర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అస్సాంలోని ఓ జలపాతం వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతన్ని గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.స్నేహితులతో సరదాగా గడిపేందుకు అస్సాం గర్భంగ అటవీప్రాంతంలోని జలపాతం వద్దకు రోహిత్ బస్ఫోర్ వెళ్లినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ కుటుంబానికి కావాల్సిన వారే ఈ హత్యకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం పార్కింగ్ విషయంలో రంజిత్ బాస్ఫోర్, అశోక్ బాస్ఫోర్, ధరమ్ బాస్ఫోర్ అనే ముగ్గురు వ్యక్తులు తమ కుమారుడితో గొడవ పడ్డారని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి వద్దే ఉన్న రోహిత్ను ట్రిప్కు వెళ్దాం అంటూ జిమ్ యజమాని అమర్దీప్ ఆహ్వానం మేరకే వెళ్లాడని వారు పోలీసులకు తెలిపారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే తమ కుమారుడిని హత్య చేశారని వారు చెబుతున్నారు. గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నిర్వహించిన శవపరీక్షలో అతని శరీరంపైనే కాకుండా తల, ముఖం ఇతర భాగాలపై అనేక గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ బస్ఫోర్ నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ త్వరలో విడుదల కానుంది. -
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన చిత్రం '28 డిగ్రీస్ సెల్సియస్'(28°C Movie).. 2025 ఏప్రిల్ 4న విడుదలైన ఈ చిత్రం సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ థ్రిల్లర్ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేశారు. పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు.హారర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన '28 డిగ్రీస్ సెల్సియస్' చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా? అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో(Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం నెలరోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.కథేంటంటే..?కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
చిత్రపరిశ్రమలో రాణించాలంటే హిట్లు తప్పనిసరి.. అలా అయితేనే ఇక్కడ నిలదొక్కుకుంటారు. ముఖ్యంగా ఈ రూల్ హీరోయిన్లకు ఎక్కువగా వర్తిస్తుంది. ఫ్లాప్ ఇచ్చిన హీరోయిన్స్కు మళ్లీ అవకాశాలు రావడం కాస్త కష్టమే.. ఒకట్రెండు హిట్లు కొట్టి ఆ తర్వాత ప్లాపులు రావడంతో చాలామంది హీరోయిన్స్ కనిపించకుండా పోయారు. అయితే, ఆ జాబితాలోకి డింపుల్ హయతి(Dimple Hayathi) కూడా చేరిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ తలుపుతట్టింది. మళ్లీ తన గ్లామర్తో ప్రేక్షకులకు దగ్గర కానుంది. ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే, మళ్లీ పలు సినిమాల్లో తప్పకుండా అవకాశాలు రావచ్చని చెప్పవచ్చు.హీరో శర్వానంద్(Sharwanand) కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాకు అంతా సిద్ధమైంది. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్నంది దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ మూవీ ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మరో కీలకమైన పాత్ర కోసం డింపుల్ హయాతిని దర్శకుడు సంపత్నంది ఎంపిక చేశారు. 2022, 2023లో (ఖిలాడీ, రామబాణం) వరుసగా ఫ్లాపులిచ్చిన డింపుల్ హయతికి మళ్లీ ఛాన్సులు దక్కలేదు. ఈ గ్యాప్లో రోజూ జిమ్కు వెళ్లి తన గ్లామర్ను కాపాడుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ మరింత స్లిమ్గా అయింది. రెగ్యూలర్గా తన గ్లామర్ ఫోటోలను సోషల్మీడియాలో విడుదల చేస్తూ ఎప్పుడూ ప్రేక్షకులతో టచ్లో ఉంటూ వచ్చింది. అలా ఇప్పడు ఛాన్సులు దక్కించుకుంది.1960లో ఉత్తర తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని మేకర్స్ ప్రకటించారు. షూటింగ్కు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Dimple 🌟 (@dimplehayathi) -
బాలకృష్ణ విలన్ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
విజయ్ సేతుపతి- పూరీ జగన్నాథ్ కాంబినేషన్ సినిమాలో ప్రముఖ కన్నడ హీరోకు ఛాన్స్ దక్కింది. ఈమేరకు ఒక ఫోటోను కూడా పూరీ పంచుకున్నారు. కన్నడ పరిశ్రమలో పాపులర్ హీరోగా గుర్తింపు పొందిన దునియా విజయ్ (Duniya Vijay) బాలకృష్ణతో వీరసింహారెడ్డి (Veera Simha Reddy) మూవీతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. అందులో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో ఆయన దుమ్మురేపారని చెప్పవచ్చు. ఆయనకు గతంలోనే టాలీవుడ్ నుంచి ఎన్నో ఛాన్సులు వచ్చాయి. కానీ, ఆ సమయానికి తను హీరోగా వేరే చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశాలు వదులుకున్నాడు. అయితే, బాలకృష్ణ సినిమాతో ఇక్కడ బాగా గుర్తింపు పొందాడు. దీంతో ఆయన భారీ సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి.విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్( Puri Jagannadh) దర్శకత్వంలో ‘బెగ్గర్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రానుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్లో ఆరంభం అవుతుంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో దునియా విజయ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.మరోవైపు దాదాపు ఐదు సంవత్సరాల విరామం తరువాత 'టబు' ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇస్తుంది. కేవలం మంచి పాత్రలు దొరికితేనే నటిస్తానన్న టబు(Tabu) పూరీ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా, వైవిద్యంగా, బలంగా ఉంటుందని తెలిపింది. రాధికా ఆప్టే కూడా చాలా కాలం తర్వాత టాలీవుడ్లోకి ఇదే మూవీతో రానుందన ప్రచారం జరుగుతుంది. తెలుగుతో పాటు హింది, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చూస్తుంటే ఈ సారి పూరీ ఏదో కొత్తగా ప్లాన్ చేసినట్టే ఉన్నాడు. -
సరికొత్తగా...
శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనున్నారు. లక్ష్మీ రాధా మోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనేప్రారంభం కానుంది. శర్వానంద్ కెరీర్లోని ఈ 38వ సినిమా 1960ల కాలం నాటి నేపథ్యంతో ఉత్తర తెలంగాణ– మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఉంటుంది.కాగా ఈ సినిమాలోని ఓ కీలకపాత్రకు హీరోయిన్ డింపుల్ హయతిని ఎంపిక చేసినట్లు సోమవారం చిత్రయూనిట్ ప్రకటించింది. ఆమె సరికొత్తపాత్రలో కనిపిస్తారని, కథలో చాలా ముఖ్యమైనపాత్రను డింపుల్ చేయనున్నారని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
బాహుబలి రిటర్న్స్
వెండితెరపైకి బాహుబలి తిరిగొస్తున్నాడు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్బస్టర్ మూవీ ‘బాహుబలి’. అనుష్కా శెట్టి, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న, రెండోభాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ 2017 ఏప్రిల్ 28న విడుదలయ్యాయి.ఈ రెండు చిత్రాలూ బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. కాగా ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ–రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ–రిలీజ్ చేయనున్నాం.ఇండియాలోనే కాదు.. ఇంటర్నేషనల్గా కూడా ఈ రీ–రిలీజ్ ఉంటుంది. కొన్ని సర్ప్రైజ్లూ ఉంటాయి. బాహుబలి రిటర్న్స్’’ అంటూ ఆయన పేర్కొన్నారు. ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ సినిమా విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రీ రిలీజ్ విషయాన్ని మేకర్స్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే రీ–రిలీజ్ విడుదల తేదీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు మేకర్స్. -
శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?
అక్కినేని హీరో నాగచైతన్య.. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ ఉండడు. సినిమాల రిలీజ్ టైంలో తప్పితే పోస్టులు కూడా పెద్దగా పెట్టడు. కానీ రీసెంట్ గా ఆదివారం ఇలా గడిచింది అని ఓ రెండు మూడు ఫొటోలు పోస్ట్ చేశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తర్వాతే అకస్మాత్తుగా ఓ రూమర్ బయటకొచ్చింది.గతంలో హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. కొన్నాళ్ల పాటు సింగిల్ గానే ఉన్నాడు. కానీ గతేడాది డిసెంబరులో తెలుగమ్మాయి, హీరోయిన్ శోభితని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతానికైతే వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) అయితే సడన్ గా శోభిత ప్రెగ్నెంట్ అయ్యిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు ఈ పుకారు ఎవరు ఎందుకు సృష్టించారో గానీ సడన్ గా అంతటా వైరల్ అవుతోంది.శోభిత విషయానికొస్తే గతేడాది మంకీ మ్యాన్, లవ్ సితార అనే సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ గానీ వెబ్ సిరీసులు గానీ చేయట్లేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి క్లారిటీ వస్తే తప్ప ఈ రూమర్స్ ఆగవేమో!(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) -
మ్యూజికల్ డ్రామా 'నిలవే' టీజర్ విడుదల
అందరూ కొత్త వాళ్లతో తీసిన తెలుగు సినిమా 'నిలవే'. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించారు. అతి పెద్ద మ్యూజికల్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహించారు. తాహెర్ సినీ టెక్తో సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) సోమవారం ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. అర్జున్ (సౌమిత్ రావు) ఒంటరి జీవితాన్ని కష్టంగా గడుపుతూ ప్రేమ కోసం తాపత్రయ పడుతుంటాడు. అలాంటి అతని జీవితంలోకి శ్రేయాసి ప్రవేశించి అతని జీవితంలో కొత్త కాంతిని తీసుకొస్తుంది. ఆ అమ్మాయి కోసం అతను ఎంత దూరం వెళ్లాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) -
సమంత కాదు మాతాజీ.. ప్రియుడితో యానిమల్ బ్యూటీ!
శుభం మూవీలో మాతాజీగా సమంత.. ఫన్నీ లుక్ప్రియుడితో ట్రిప్ వేసిన యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిబార్ లో పార్టీ చేసుకుంటున్న హాట్ బ్యూటీ సుప్రీతకల్కి బ్యూటీ అన్నా బెన్ క్యూట్ నెస్ చూడతరమాఇటలీలో తెగ తిరిగేస్తున్న లైగర్ పాప అనన్య పాండేట్రెండింగ్ కనిమా పాటకు మంచు లక్ష్మీ స్టెప్పులుమేకప్ లేని లుక్ లో హీరోయిన్ సంయుక్త View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Anna Ben 🌸 (@benanna_love) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
'పాడుతా తీయగా' షో గురించి గాయని ప్రవస్తి ఆరాధ్య పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రాంలో జడ్జెస్గా ఉన్న కీరవాణి, సునీత, చంద్రబోస్లు వారికి నచ్చినోళ్లను మాత్రమే ఎంకరేజ్ చేస్తారని ప్రవస్తి కామెంట్ చేసింది. ఆపై షోలో ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ బాడీ షేమింగ్ వంటి వ్యాఖ్యలతో బాధపెట్టారని ఆమె వాపోయింది. ఆపై సింగర్ సునీతకు పలు ప్రశ్నలతో వీడియో కూడా విడుదల చేసింది. అయితే, ఈ వివాదంపై తాజాగా సింగర్ గీతామాధురి తన అభిప్రాయాన్ని వీడియో ద్వారా పంచుకుంది.ప్రవస్తిని ఉద్దేశిస్తూ.. గీత మాధురి ఇలా మాట్లాడింది. 'కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితి కూడా ఇబ్బందులు తీసుకొస్తుంది. ప్రవస్తి చాలారోజులుగా పోటీలో ఉంది. దీంతో కాస్త ఒత్తిడిలో ఉండొచ్చు. ఆమెకు అందరం అండగా ఉంటాం. ఇంతవరకు జరిగిన వాటిని హార్ట్కు తీసుకోకు. నీకు తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి. ఇతరులు చేస్తున్న కామెంట్లు అన్నీ నీకు నువ్వే ఆపాదించుకోవద్దు. మేము నీకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇలాంటి షోస్ నుంచే నేను కూడా వచ్చాను. ఒకరి ఒటమిని చూసి చంద్రబోస్ , సునీత, ఎం ఎం కీరవాణి ఎంజాయ్ చేయాలని అనుకోరు. వారికి అందరూ ఒక్కటే. ఒక్కోసారి వారు చేసిన కామెంట్లు ఇబ్బంది పెట్టొచ్చు కానీ, వాటిని మనం తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా విజయానికి మెట్లు అనుకోవాలి. ఒక్కోసారి ఎవరు ఏ పాట పాడితే బాగుంటుందని ఎంపిక చేయడంలో మేనేజ్మెంట్ ప్రమేయం ఉంటుంది. ఇలా ఎన్నో డిస్కషన్స్ సెట్స్లో అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు వాళ్లే కన్విన్స్ అయిపోయి వీళ్లకు నచ్చిన పాటలను కూడా పాడనిస్తారు. ఇలాంటివి అన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి.జడ్జీలుగా ఉన్న ఆ ముగ్గురిలో ఒక్కరూ కూడా.. పలాన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవాలి అనుకునే వ్యక్తులు కాదు. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాతే వారు ఈ స్థాయికి వచ్చారు. కానీ, కంటెస్టెంట్ స్థానంలో ఉన్న వారిపై ఒక చిన్న కామెంట్ చేసినా వారికి డిస్టర్బ్గా అనిపించడం సహజమే. అదే సమయంలో వారు ఇచ్చే చిన్న కాంప్లిమెంట్ కూడా మళ్లీ మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటివి అన్నీ ఉంటాయి. వాటిని మనకు పాజిటివ్గా మలుచుకోవాలి. ఇలాంటి సమయం కోసం ఎదురుచూసిన కొందరు దానిని ఆసరాగా తీసుకొని వారిని తిట్టడం కూడా మొదలుపెట్టారు. ఎప్పుడు లేని నెగటివిటిని వినాల్సి వస్తుంది. ప్రవస్తీని తిట్టినా.. జడ్జెస్ను తిట్టినా నాకు బాధగానే ఉంది. ఇది నా ఒపీనియన్.' అంటూ గీత మాధురి చెప్పుకొచ్చింది. -
పద్మ భూషణ్ పురస్కారాల్ని అందుకున్న హీరోలు
కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ అవార్డులని ప్రకటించింది. ఈ పురస్కారాల ప్రదానోత్సవం.. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు.తెలుగు హీరో బాలకృష్ణ(Nandamuri Balakrishna), తమిళ హీరో అజిత్.. పద్మ భూషణ్ (Padma Bhushan 2025) అవార్డులని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. బాలయ్య.. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో కనిపించారు. అజిత్(Ajith Kumar).. బ్లాక్ కలర్ సూట్ వేసుకున్నారు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) బాలకృష్ణ ప్రస్థానం చూస్తే.. తాతమ్మ కల (1974) సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. 14 ఏళ్ల వయసులో తండ్రి రామారావుతో కలిసి నటించారు. సాహసమే జీవితం సినిమాతో హీరోగా మారారు. వందకు పైగా సినిమాలు చేశారు. రీసెంట్ టైంలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్గానూ సేవలందిస్తున్నారు.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) Nandamuri Balakrishna Receives Prestigious Padma Bhushan from President Droupadi Murmu | TFPC #nandamuribalakrishna #balayya #padmabhushan #padmaawards pic.twitter.com/M63oQSS4Lj— Telugu Film Producers Council (@tfpcin) April 28, 2025Padma Awards 2025: Ajith Kumar's Iconic Moment with President Murmu#ajith #PadmaAwards #PadmabhushanAjithKumar pic.twitter.com/miV0K0x3Px— Telugu Film Producers Council (@tfpcin) April 28, 2025 -
రాజమౌళి చేతుల మీదుగా 'ముత్తయ్య' ట్రైలర్ రిలీజ్
'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ముత్తయ్య'. ఇదివరకే పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు కూడా దక్కించుకుంది. ఇప్పుడు దీన్ని ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ట్రైలర్ ని రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. (ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధాకర్ రెడ్డితో పాటు అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఓ తెలుగు ఓటీటీ యాప్ లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. నటుడు కావాలనేది 60 ఏళ్ల ముత్తయ్య కల. తన ఊరు చెన్నూరుకు ఏ సినిమా షూటింగ్ వాళ్లు వచ్చినా తనకో క్యారెక్టర్ ఇమ్మని అడుగుతుంటాడు. సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ చేస్తాడు. నాటకాల్లో మంచి ప్రతిభ ఉంది. కుటుంబం, స్నేహితుల నుంచి సరైన ప్రోత్సాహం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ముత్తయ్య నటుడు అయ్యాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) -
నేను డైలాగ్స్ మింగేయడమే బెటర్.. లేదంటే
శ్రీ విష్ణు అనగానే మంచి హీరో, ప్రయోగాత్మక, ఫన్ ఎంటర్ టైనర్ సినిమాలు చేస్తుంటాడు కదా అనే పేరుంది. అదే టైంలో సోషల్ మీడియాలో కుర్రాళ్లని అడిగితే శ్రీ విష్ణు.. ఎంత బాగా సెన్సార్ బోర్డ్ నుంచి తప్పించుకుంటాడనేది చెబుతారు. ఇప్పుడు దాని గురించే మీడియా అడగ్గా.. శ్రీ విష్ణు ఆసక్తికర సమాధానమిచ్చాడు.శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ '#సింగిల్'. తాజాగా ట్రైలర్ లాంచ్ జరిగింది. గతంలో ఇతడు నటించిన బ్రోచెవారెవరురా, సామజవరగమన, ఓం భీమ్ బుష్ చిత్రాల్లో కొన్ని బూతులా అనిపించే డైలాగ్స్ ఉన్నాయి. కానీ వాటిని శ్రీ విష్ణు చెప్పిన విధానం వల్ల అవి అలాంటివి అని సందేహం రాదు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) తాజాగా రిలీజైన '#సింగిల్' ట్రైలర్ చివర్లోనూ ఓ డైలాగ్ ఉంటుంది. అది కూడా బూతులానే అనిపిస్తుంది కానీ కాదు. ఇప్పుడు ఈ తరహా డైలాగ్స్ గురించి శ్రీ విష్ణుని మీడియా అడగ్గా.. నేను డైలాగ్స్ మింగేయడమే బెటర్, లేదంటే సంస్కృతం డైలాగ్స్ చెప్పినా డబుల్ మీనింగ్ అనుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు.తాను మాట్లాడేవి డబుల్ మీనింగ్ బూతులు కాదని, అది సంస్కృతం అని, మీకు ఉన్న ఫలంగా సంస్కృతం నేర్పించలేనని తనదైన శైలిలో కామెడీగా శ్రీ విష్ణు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) -
నచ్చిన వారితో శృంగారం.. అజిత్పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
కోలీవుడ్ హీరో అజిత్కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్గా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో అజిత్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆపై కొద్దిరోజుల క్రితమే అజిత్, అతని భార్య షాలిని తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో నటి హీరా రాజగోపాల్ కూడా తన ప్రేమకథతో పాటు విడిపోవడం గురించి చెబుతూనే తన మాజీ ప్రియుడిపై ఆమె షాకింగ్ ఆరోపణలు చేశారు. 1990లో నటి హీరా రాజ్గోపాల్తో అజిత్ నడపిన ప్రేమాయణం అప్పట్లో టాక్ ఆప్ ది టౌన్గా ఉండేది. పలు గొడవల వల్ల బ్రేకప్ చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు అజిత్ పేరును ఆమె ప్రస్తావించకుండానే ఒక నటుడు అంటూ సెన్సేషనల్ కామెంట్లు చేశారు.హీరా రాజగోపాల్ తన బ్లాగులో ఇలా చెప్పుకొచ్చారు.. 'ఒక నటుడు నాకు ద్రోహం చేయడమే కాకుండా తన అభిమానులతో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేశాడు. అతని వల్ల నేను చాలా అవమానంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఒకసారి తన వెన్నెముకకు గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నానని నాకు చెప్పాడు.. ఆ సమయంలో నేను అతనితోనే ఉండి ఎన్నో సపర్యలు చేశాను. కానీ, అతను ఆరోగ్యం విషయంలో కూడా అబద్ధం చెప్పాడని తర్వాత తెలుసుకున్నాను.' అని హీరా రాసుకొచ్చారు. ఆపై వివాహం గురించి కూడా ఆ నటుడు తనతో చెప్పిన మాటలను ఇలా చెప్పంది 'నేను పనిమనిషిలా కనిపించే స్త్రీని వివాహం చేసుకోబోతున్నాను. అప్పుడు ఎవరూ ఆమెను చూడరు. కానీ, నేను మాత్రం నాకు నచ్చిన స్త్రీతో శృంగారంలో పాల్గొంటాను' అని హీరాతో ఆ నటుడు చెప్పినట్లు తన బ్లాగ్లో పోస్ట్ చేశారు.1990లో నటి హీరా రాజ్గోపాల్తో అజిత్ నడపిన ప్రేమాయణం భారీగా వైరల్ అయింది. కాథల్ కొట్టై అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించిన అజిత్ - హీరా షూటింగ్ సమయంలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత 'తోడారమ్' అనే మరో చిత్రంలోనూ కలిసి నటించారు. అయితే వీరి ప్రేమ బంధం పెళ్లిదాకా మాత్రం వెళ్లలేదు. వీరి వివాహానికి హీరా తల్లి నో చెప్పిందని, దీంతో వీరి లవ్ స్టోరికి ఫుల్స్టాప్ పడినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. కానీ, అజిత్నే తనను వదిలించుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. కాగా కొన్నేళ్లకు అజిత్.. నటి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అనోష్కా, ఆద్విక్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నటిగా కెరియర్లో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్న షాలిని ఆ తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది. Actress #Heera has made serious allegations against #AjithKumar, accusing him of betrayal, character assassination and orchestrating violence through fans. She also claimed he staged medical issues for sympathy and bribed media to control narratives. pic.twitter.com/4WBPVNEPTn— Mʀꜱ.Kᴇᴇʀᴛʜɪ (@MrsKeerthi85) April 28, 2025 -
ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం
దక్షిణాది ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లకు అభిమానం ఎక్కువ. ఎంతలా అంటే పక్కనోళ్ల కంటే సినిమా వాళ్లని దేవుళ్ల కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. కొందరైతే అంతకు మించి అనేలా ప్రవర్తిస్తారు. దీనికి నిదర్శనమే ఆంధ్రప్రదేశ్ లో సమంత కోసం అభిమాని కట్టిన గుడి.తమిళనాడులో ఖుష్బూ, జయలలిత, హన్సిక లాంటి హీరోయిన్లకు అభిమానులు దేవాలయాలు కట్టారు. అదే తరహాలో ఆంధ్రలోని బాపట్లలో ఓ వీరాభిమాని.. సమంత కోసం 2023లో గుడి కట్టాడు. అప్పట్లో ఓ విగ్రహం ఏర్పాటు చేయగా.. ఇప్పుడు గోల్డెన్ కలర్ సామ్ విగ్రహాన్ని పెట్టాడు.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) సోమవారం సమంత పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజాలు చేసి కేక్ కట్ చేశాడు. పలువురు అనాథ పిల్లలకు సదరు అభిమాని.. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత చేసిన ఛారిటీ వర్క్స్ నచ్చే ఆమెకు ఈ గుడి కట్టానని సదరు అభిమాని చెప్పడం విశేషం.కొన్నాళ్ల ముందు వరకు వరస సినిమాలు చేసిన సమంత.. నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధి బారిన పడిన దగ్గర నుంచి పూర్తిగా మూవీస్ చేయడం మానేసింది. గతేడాది 'సిటాడెల్' చేసింది గానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నిర్మాతగా 'శుభం' అనే సినిమాని విడుదలకు రెడీ చేసింది.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) -
శ్రీ విష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్.. బుల్లిరాజు కూడా
తెలుగు హీరోల్లో శ్రీ విష్ణు కాస్త డిఫరెంట్ మూవీస్ చేస్తూ అలరిస్తుంటాడు. గతేడాది 'స్వాగ్' అనే ప్రయోగాత్మక సినిమా చేశాడు. కానీ ఇది జనాలకు నచ్చలేదు. దీంతో తనకు అచ్చొచ్చిన కామెడీనే మళ్లీ నమ్ముకున్నాడు. అలా చేసిన మూవీ 'సింగిల్'.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) మే 9న రిలీజ్ కాబోతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమా ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. దీనిబట్టి చూస్తే.. సింగిల్ గా ఉండే శ్రీ విష్ణు జీవితంలోకి ఇద్దరమ్మాయిలు వస్తారు. తర్వాత వాళ్లతో ప్రేమ, రొమాన్స్, గొడవలు.. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్ లో కామెడీ బాగుంది. జోకులు బాగానే పేలాయి. చూస్తుంటే శ్రీ విష్ణు మరో హిట్ కొడతాడేమో అనిపిస్తుంది. రీసెంట్ గా వైరల్ అయిన బుల్లిరాజు అలియాస్ రేవంత్ ఈ సినిమాలోనూ నటించాడు. గీతా ఆర్ట్స్ సంస్థ దీన్ని నిర్మించగా.. కార్తీక్ రాజ్ దర్శకుడు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లు.(ఇదీ చదవండి: ఓటీటీలో మరోసారి మ్యాజిక్ చేస్తారా?) -
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బుల్లితెర నటి దీపికా రంగరాజు (Deepika Rangaraju).. ఎప్పుడూ గలగలా మాట్లాడుతుంది. నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉంటుంది. లోపల ఎంత బాధ ఉన్నా అది పైకి కనపడనీయకుండా జాగ్రత్త పడుతుంది. అలాంటిది మొదటిసారి దీపిక తన కష్టాలను బయటపెట్టింది. ఆహాలో ప్రసారమవుతున్న కాకమ్మ కథలు షోలో దీపిక మాట్లాడుతూ.. మనం ఏ పని చేసినా వెన్ను తట్టి ప్రోత్సహించేవాళ్లుండాలి. ముఖ్యంగా అమ్మానాన్న మన వెనకాల నిలబడాలి. స్నేహితులు, దగ్గరివాళ్లు.. ఇలా ఎవరో ఒకరు మోటివేట్ చేసేవాళ్లుండాలి. కానీ, అలా నాకంటూ ఎవరూ లేరు.అలాగైతే సంతోషిస్తారుఇప్పటికిప్పుడు నేను యాక్టింగ్ మానేసి ఇంట్లో ఉంటాను, చదువుకుంటాను, ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాను లేదా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాను అని చెప్తే అమ్మవాళ్లు చాలా సంతోషిస్తారు. ఇంట్లో కూర్చుని బాగా చదువుకో అని నాకు స్వాగతం పలుకుతారు. యాక్టింగ్ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టలేదు కానీ.. నాకు సపోర్ట్గా నిలబడలేదు. వావ్, సూపర్ దీపికా.. చాలా బాగా చేస్తున్నావ్, రెండేళ్లలో చాలా పాపులారిటీ వచ్చింది. ఒంటరి ప్రయాణంఇంకా బాగా చేయు అని ప్రోత్సహిస్తే నేను ఏదైనా చేయగలుగుతాను. ఇంకా ఎదుగుతాను. కానీ ఇప్పుడు నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకోవాలి. కొన్నిసార్లు అది బోర్ కొడుతుంది. ఎవరూ లేకుండా నేను ఒక్కదాన్నే మోటివేషన్ చేసుకుని ముందుకెళ్లాలా? అని బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీపికా.. బ్రహ్మముడి అనే సీరియల్ చేస్తోంది.చదవండి: నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి -
అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయన్
తెలుగు చిత్రం సీతారామంతో వెలుగులోకి వచ్చిన నటి మృణాల్ ఠాకూర్. అంతకుముందు హిందీ, మరాఠీ తదితర చిత్రాల్లో నటించారు. అయితే సీతారామం చిత్రం ఈమెని తెలుగులో స్టార్ హీరోయిన్ను చేసింది. అంతేకాకుండా తమిళం లోను పాపులర్ చేసింది. ఆమె నటించిన మరో చిత్రం హాయ్ నాన్న. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం నిరాశ పచడంతో క్రేజ్ ఒకసారిగా తగ్గిపోయింది. దీంతో అవకాశాలు కూడా మొఖం దాటేసాయి. అదేవిధంగా హిందీలో లస్ట్ స్టోరీస్ చిత్రంలో మెప్పించిన ఈ బ్యూటీ తెలుగులో అడివి శేష్ చిత్రం డెకాయిట్లో నటిస్తున్నారు. తాజాగా ప్రభాస్కు జతగా స్పిరిట్ చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మడికి మరో లక్కీ సాంగ్స్ వరించిందని తాజాగా సామాజి మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప– 2 చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్నే మార్చేశారు. ఆయనకు డైరెక్ట్గా కోలీవుడ్లొ ఒక చిత్రం చేయాలన్న కోరిక చాలాకాలంగా ఉంది. అలా లింగు స్వామి దర్శకత్వంలో చిత్రం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే, కారణాలు ఏమైనా ఆ చిత్రం సెట్ పైకి వెళ్లలేదు. అలాంటిది తాజాగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం చేయడానికి అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకలు ఉంటారని సమాచారం. అందుకోసం జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటానితో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ లిస్టులో నటి మణాల్ ఠాగూర్ ముందు వరుసలో చేరినట్లు తెలిసింది. ఈమె ఈ క్రేజీ చిత్రంలో నటించడం దాదాపు ఖరారు అయినట్టు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?
శ్రీలీల(Sreeleela) పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. అప్పట్లో పల్సర్ బండి పాటకు.. రీసెంట్ గా పుష్ప 2లో(Pushpa 2 Movie) కిస్సిక్ అంటూ స్టెప్పులేసి అదరగొట్టేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె గురించి ఇప్పుడో విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?తెలుగు మూలాలున్న అమ్మాయి శ్రీలీల. పుట్టి పెరిగింది అమెరికాలో గానీ ప్రస్తుతానికైతే బెంగళూరులో తల్లితో కలిసి ఉంటుంది. షూటింగ్ లేనప్పుడు తన ఇంట్లో చేసే అల్లరిని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. యాక్టింగ్ పరంగా శ్రీలీలపై చిన్న చిన్న విమర్శలు వస్తుంటాయి. ఓ విషయంలో మాత్రం ఈమె అందరి మనసులు దోచేసింది.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల.. ఓవైపు హీరోయిన్ గా చేస్తోంది. ఇది అందరికీ తెలుసు. కానీ 2022లో ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు.. దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. వాళ్లని దత్తత తీసుకుంది(Adopted). వాళ్ల ఆలనపాలన చూసుకుంటోంది.తన కుటుంబంలోకి మరో పాప వచ్చిందని శ్రీలీల తాజాగా పోస్ట్ పెట్టింది. ఇందులో ఓ చిన్న పాపకు ముద్దులు పెడుతూ కనిపించింది. నెటిజన్ల అయితే ఈ పాప ఎవరా అని మాట్లాడుకుంటున్నారు. కొందరు మాత్రం మరో బిడ్డని దత్తత తీసుకుంది అని అంటున్నారు. లేదంటే బంధువులమ్మాయి అనేది శ్రీలీల చెబితే గానీ క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి
అమాయకపు అమ్మ పాత్రలు, కామెడీ రోల్స్తో అందరికీ చేరువైంది నటి ఊర్వశి (Urvashi). చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ఊర్వశి తర్వాత హీరోయిన్గా, అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. దక్షిణాదిలో వందలాది సినిమాలు చేసిన ఈమెకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. త్వరలోనే కూతురు కూడా సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందని ఇటీవలే వెల్లడించింది.నటిని మాత్రమేఅయితే అంతకన్నా ముందు ఆమె భర్త శివప్రసాద్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'ఎల్. జగదాంబ 7th క్లాస్ బి' అనే సినిమా చేశాడు. ఊర్వశి లేకుండా ఈ సినిమా ఎలా ఉంటుంది? తాజాగా ఈ సినిమా విషయాలను ఊర్వశి పంచుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సెట్స్లో అడుగుపెట్టాక నేను నటిని మాత్రమే! దర్శకుడు నా భర్తే కదా అని రిలాక్స్ అయిపోను. కెమెరా ముందు ఆయన చెప్పినట్లు నటించడమే నా పని.నటి ఊర్వశి, కూతురు తేజ లక్ష్మినా పరిస్థితి కూతురికి రాకూడదుఅయితే ఈ సినిమాల వల్ల నేను చదువు మధ్యలో మానేయాల్సి వచ్చింది. నా కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నాను. ముందు తన చదువు పూర్తి చేయమన్నాను. మంచి ఉద్యోగం సంపాదించమన్నాను. ఆ తర్వాతే సినిమాలపై ఆసక్తి ఉంటే ఈ ఇండస్ట్రీకి రావాలన్నాను. తన కాళ్లపై తను నిలబడిన తర్వాతే సినిమాల గురించి ఆలోచించమని చెప్పాను.ఆఫర్స్ వస్తున్నాయ్ఈ మధ్యే నా కూతురి పైచదువులు పూర్తయ్యాయి. ఇప్పుడు తనకు నచ్చినట్లు చేసుకోనీ.. మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తనే స్వయంగా కథ విని, చేయాలా? వద్దా? అని నిర్ణయించుకుంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు కెరీర్, జీవితం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తను నటనను ఎంచుకుంటే తల్లిగా అది నాకు సంతోషమే అని చెప్పుకొచ్చింది.పర్సనల్ లైఫ్నటి ఊర్వశి, నటుడు మనోజ్ జయన్ను 2000లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు తేజ లక్ష్మి సంతానం. మనోజ్తో విభేదాలు రావడంతో అతడి దగ్గర విడాకులు తీసుకుంది. అనంతరం 2013లో శివ ప్రసాద్ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇషాన్ అనే కుమారుడు సంతానం ప్రస్తుతం అతడితోనే కలిసి జీవిస్తోంది. కానీ తేజలక్ష్మి మాత్రం తన తండ్రి మనోజ్తో కలిసి ఉంటోంది.చదవండి: దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి -
ఓటీటీలలో అలాంటి కంటెంట్ వద్దు.. సుప్రీంకోర్టు నోటీసులు జారీ
ఓటీటీ ప్లాట్ఫామ్లలో ప్రసారం అవుతున్న కంటెంట్ పట్ల కేంద్రం ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది. ఏ రేటింగ్ ఉన్న కంటెంట్తో పాటు అశ్లీల కంటెంట్ను కూడా అందుబాటులో ఉంచడం చట్టరిత్యా నేరం అని, వీటిని కట్టడి చేసేలా నిబంధనలను రూపొందించాల్సింది కేంద్రమే’నని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఇప్పటికే పేర్కొంది. అయితే తాజాగా అశ్లీల కంటెంట్ ప్రసారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటీటీ సంస్థలకే కాకుండా పలు సామాజిక మాధ్యమాల హ్యాండిళ్లకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఉల్లు, ఆల్ట్టీ ఓటీటీతో పాటు ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లకు సుప్రీమ్ కోర్టు నోటీసులిచ్చింది.సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్ను అడ్డుకోవాలని గతంలో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనల అనంతరం అశ్లీల కంటెంట్పై కేంద్రం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆన్లైన్ వేదికల్లో లైంగిక, అశ్లీల కంటెంట్ తీవ్రమైన విషయమని, వెంటనే ఈ అంశంపై విచారణ జరపాలని న్యాయవాది జైన్ విజ్ఞప్తి చేశారు. చట్టం ప్రకారం నిషేధించిన ఏ కంటెంట్ను ఓటీటీ ప్లాట్ఫామ్లలో ప్రసారం చేయకుండా ఉండేలా చూడాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. -
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
మే నెలలో రెట్టింపు వినోదాన్ని పంచేందుకు సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు రిలీజవుతుండగా ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు విడుదల కానున్నాయి. మరి మే మొదటివారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే..నాని హీరోగా నటించిన 'హిట్ 3' - మే 1సూర్య హీరోగా నటించిన 'రెట్రో' - మే 1అజయ్ దేవ్గణ్ 'రైడ్ 2' - మే 1సంజయ్దత్, సన్నీ సింగ్ల 'భూతిని' - మే 1ఓటీటీ రిలీజెస్..నెట్ఫ్లిక్స్🎬 చెఫ్స్ టేబుల్: లెజెండ్స్ (సిరీస్) - ఏప్రిల్ 28🎬 ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ద బిగ్ ఫైట్ (మినీ సిరీస్) - ఏప్రిల్ 30🎬 ఎక్స్టెరిటోరియల్ - ఏప్రిల్ 30🎬 ద ఎటర్నాట్ - ఏప్రిల్ 30🎬 టర్నింగ్ పాయింట్: ద వియత్నాం వార్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 30🎬 ద రాయల్స్ (వెబ్ సిరీస్) - మే1🎬 యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ - మే 1🎬 ద బిగ్గెస్ట్ ఫ్యాన్ - మే 1🎬 ద ఫోర్ సీజన్స్ (వెబ్ సిరీస్) - మే 1🎬 బ్యాడ్ బాయ్ (వెబ్ సిరీస్) - మే 2అమెజాన్ ప్రైమ్ వీడియో🎥 అనదర్ సింపుల్ ఫేవర్ - మే1జీ5🎬 కొస్టావో - మే 1హాట్స్టార్🎥 కుల్ల్: ద లెగసీ ఆఫ్ ద రైసింగ్స్ (వెబ్ సిరీస్) - మే 2🎥 ద బ్రౌన్ హార్ట్ (డాక్యుమెంటరీ) - మే 3ఆహా🎬 వేరేలెవల్ ఆఫీస్ రీలోడెడ్ - మే 1సోనీలివ్🎥 బ్రొమాన్స్ - మే 1🎥 బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ (వెబ్ సిరీస్) - మే 1ఎంఎక్స్ ప్లేయర్🎬 ఈఎమ్ఐ - మే1టుబి🎥 సిస్టర్ మిడ్నైట్ - మే 2యాపిల్ టీవీ ప్లస్🎬 కేర్ మీ - ఏప్రిల్ 30చదవండి: దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి -
టిఎస్ఆర్ మూవీ మేకర్స్ మరో క్రేజీ సినిమా ప్రారంభం
టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 3 పేరుతో ఒక చిత్రం రానుంది. ప్రేమ, కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హార్ట్టచ్ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా, ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. హరికృష్ణ హీరోగా, భవ్య శ్రీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు భావోద్వేగపు అనుభవాన్ని అందించనుంది.ఈ చిత్రం ప్రేమ, త్యాగం, కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోంది. హరికృష్ణ, భవ్య శ్రీ మధ్య సహజమైన కెమిస్ట్రీ, కథలోని భావోద్వేగాలను మరింత లోతుగా చూపిస్తుందని భావిస్తున్నారు.విపిన్ వి రాజ్ సినిమాటోగ్రఫీ దృశ్యాలు, గౌతమ్ రవిరామ్ సంగీతం, విజయ్ కందుకూరి సంభాషణలు పాత్రల భావాలను సహజంగా ఆవిష్కరించేలా ఉంటాయని తెలిపారు. ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, వారి సవాళ్లు, విజయాలను కూడా హృదయానికి హత్తుకునేలా చూపించారు. దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి ఈ చిత్రం ద్వారా మంచి కుటుంబ జోనర్ ఉన్న కథను ఎంపిక చేసుకున్నారు.దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ.. TSR మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా ప్రేమికులకు మరో విజయవంతమైన చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. గతంలో ఎన్నడూ చూడని ఒక వైవిధ్యమైన ప్రేమ కథని చూపించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో ఈ బ్యానర్లో తికమక తాండ, కొబలి వంటి వైవిధ్యమైన సినిమాలు వచ్చాయని గుర్తుచేశారు.కొబలి సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అయిన హాట్స్టార్ లో బాగా ట్రెండ్ అయ్యిందన్నారు. అలాంటిది ఈ బ్యానర్లో ఇప్పుడు మరో అదిరిపోయే సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుందని చెప్పారు. -
నేడు పద్మభూషణ్ అందుకోనున్న బాలకృష్ణ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో నేడు (ఏప్రిల్ 28) పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పద్మభూషణ్ అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను అనౌన్స్ చేసింది.బాలకృష్ణ ప్రస్థానంనందమూరి బాలకృష్ణ.. తాతమ్మ కల (1974) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. 14 ఏళ్ల వయసులో తండ్రి రామారావుతో కలిసి నటించారు. సాహసమే జీవితం సినిమాతో హీరోగా మారారు. వందకు పైగా సినిమాలు చేశారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం అఖండ 2 మూవీ చేస్తున్నారు. ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్గానూ సేవలందిస్తున్నారు.చదవండి: ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు -
విచారణకు రానన్న మహేశ్.. ఈడీ స్పందనపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఆ సంస్థ ప్రచారకర్త మహేశ్బాబు (Mahesh Babu)ను ఈడీ (Enforcement Directorate) విచారణకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే! అయితే షూటింగ్స్తో బిజీగా ఉన్న కారణంగా నేడు (ఏప్రిల్ 28) విచారణకు రాలేనని, మరో తేదీ ఇవ్వాలని మహేశ్ అధికారులకు లేఖ రాశాడు. దీనిపై ఈడీ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. మరి నేటి విచారణకు ఈడీ మినహాయింపు ఇస్తుందా? విచారణ కోసం మరో తేదీ కేటాయిస్తుందా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.ఏం జరిగింది?సాయిసూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేశ్బాబుకు రూ.3.5 కోట్లు చెక్ ద్వారా, రూ.2.4 కోట్లు క్యాష్ రూపంలో డబ్బు చెల్లించినట్లు ఆధారాలు సేకరించింది. మహేశ్బాబుకు అందిన డబ్బుపై ఆరా తీసేందుకు ఈడీ అతడిని విచారణకు రమ్మని ఆదేశించింది. కానీ రాజమౌళి సినిమా (SSMB29) షూటింగ్తో బిజీగా ఉన్నందున నేడు విచారణకు రాలేనని మహేశ్ ఈడీకి లేఖ రాశాడు. మరి దీనిపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి!చదవండి: హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని -
ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు
బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ (Paresh Rawal) ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన యూరిన్ తాగి ఓ గాయం నుంచి త్వరగా కోలుకున్నట్లు తెలిపాడు. 'లాలంటాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరేశ్ రావల్ మాట్లాడుతూ.. ఓసారి నేను మోకాలి గాయంతో ముంబైలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాను. అప్పుడు అజయ్ దేవ్గణ్ (Ajay Devgn) తండ్రి వీరు దేవ్గణ్ (Veeru Devgan) నన్ను చూసేందుకు వచ్చాడు.దానివల్లే కోలుకున్నా..త్వరగా కోలుకునేందుకు ఓ సలహా ఇచ్చాడు. ఉదయం నిద్ర లేచిన వెంటనే నా యూరిన్ తాగమని చెప్పాడు. అలాగే మందు, మాంసం, సిగరెట్ తాగడం వంటి అలవాట్లు మానేయమన్నాడు. ఆయన సలహాను పాటించాలనుకున్నాను. పదిహేను రోజులపాటు నా యూరిన్ను బీర్లా తాగాను. ఆ తర్వాత డాక్టర్ ఎక్స్రే తీసి చూసినప్పుడు షాకయ్యాడు. ఇంత త్వరగా గాయం ఎలా నయమవుతోంది అని ఆశ్చర్యపోయాడు. రెండున్నర నెలల తర్వాత డిశ్చార్జ్ అవ్వాల్సిన నేను వీరు దేవ్గణ్ చెప్పిన సలహా వల్ల నెలన్నరకే డిశ్చార్జ్ అయ్యాను. ఆయన సలహా నాకొక మ్యాజిక్లా పని చేసింది అని చెప్పుకొచ్చాడు.సినిమాపరేశ్ రావల్.. క్షణక్షణం, రిక్షావోడు, బావగారు బాగున్నారా?, శంకర్దాదా ఎంబీబీఎస్, తీన్మార్, ఆకాశమే హద్దుగా వంటి తెలుగు చిత్రాల్లో నటించాడు. హిందీలో సర్, వో చోక్రీ, మోహ్రా, రాజా, బందిష్, హీరో నెం.1, చాచీ 420, హీరా ఫెరి, ఆంఖెన్, యే తెరా ఘర్ యే మేరా ఘర్, హంగామా, హల్చల్, ఫిర్ హీరా ఫేరి, కూలీ నెం.1 ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా 'ద స్టోరీటెల్లర్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో కిట్టీ, భూత్ బంగ్లా, థామా, హీరా ఫేరి 3తో కలుపుకుని ఏడెనిమిది సినిమాలున్నాయి.గమనిక: ఇది కేవలం నటుడి అభిప్రాయం/ అనుభవం మాత్రమే. ఆరోగ్యపరమైన విషయాల్లో వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.చదవండి: హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని -
హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని ఇరికించేశాడుగా!
నేచురల్ స్టార్ నాని (Nani) యాక్షన్ అవతార్లో కనిపించనున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3: థర్డ్ కేస్ మూవీ (HIT: The Third Case) మే 1న విడుదల కానుంది. ఆదివారం (ఏప్రిల్ 27) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అలాగే హిట్ 1 హీరో అడివి శేష్, హిట్ 2 హీరో విశ్వక్ సేన్ అతిథులుగా వచ్చారు.ప్రేమగా హగ్ ఇచ్చారంటే..ఈ వేదికపై నాని మాట్లాడుతూ.. నా ప్రతి సినిమా మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం అన్నారంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్కి వెళ్లకపోవడంతో ఈ అలవాటుకు కాస్త బ్రేక్ పడింది.సొంత సినిమాలా ప్రమోషన్స్..ఈ మే 1న రాజమౌళి (SS Rajamouli) మార్నింగ్ షో చూడాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ రోజు ఆయనకు ఏదైనా పనులుంటే తన పాస్పోర్ట్ లాగేసుకుంటాను. శ్రీనిధి శెట్టి గురించి చెప్పాలి. మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలకు సినిమాలో సగం లవ్స్టోరీనే ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ, అలాంటిదేం ఉండదు. ప్రమోషన్స్ కూడా ఒక్కటీ మిస్ అవకుండా తన సొంత సినిమాలా చేసింది. సినిమా సక్సెస్ ఈవెంట్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను.హిట్ 3 నచ్చకపోతే..కోర్ట్ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పాను. ఈసారి ఎవరిని తాకట్టుపెడదాం అని చూస్తున్నాను. హిట్ 3 మీ అంచనాలను అందుకోలేకపోతే వచ్చే ఏడాది రిలీజవుతున్న SSMB29 (సూపర్స్టార్ మహేశ్బాబు- రాజమౌళి కలయికలో వస్తున్న మూవీ)ని చూడొద్దు.. సరదాగా అంటున్నాను. ఆ సినిమాను తాకట్టు పెట్టినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఆ సినిమా ప్రపంచమంతా చూసి తీరాల్సిందే! మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తానని నేను ప్రామిస్ చేస్తున్నా అని నాని అన్నాడు. ఇక ఇదే స్టేజీపై ఫైట్ మాస్టర్ సతీశ్.. శ్రీనిధి శెట్టికి ఒక ఫైట్ సీన్ కూడా ఉందన్న విషయాన్ని లీక్ చేసేశాడు. దీంతో శ్రీనిధి షాకై నోరెళ్లబెట్టింది. వెంటనే అక్కడున్న సుమ.. కథంతా చెప్పేసేలా ఉన్నారని వారించింది. చదవండి: కోర్ట్ తర్వాత సారంగపాణి జాతకం నాకో వరం: ప్రియదర్శి -
ప్యాషన్తో నిర్మించిన పేషన్ హిట్టవ్వాలి: దర్శకుడు శేఖర్ కమ్ముల
‘‘కొత్త ఫ్లేవర్తో వచ్చిన సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ ‘పేషన్’ సినిమాను కూడా అంతే అద్భుతంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. సుధీష్, అంకిత హీరో, హీరోయిన్లుగా అరవింద్ జాషువా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పేషన్’. నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ – ‘‘ఆనంద్’ సినిమా నుంచే నాకు అరవింద్ జాషువా పరిచయం. తనలో మంచి స్టోరీ టెల్లింగ్ క్రియేటర్ ఉన్నాడని అప్పుడే అనిపించింది. తను రాసిన పేషన్ నవలను చదివా. చాలా బాగుంది. ఇక అరవింద్ రూపొందించిన ఈ ‘పేషన్’ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. కొత్త నిర్మాతలు ప్యాషన్తో ఈ మూవీ తీశారు’’ అన్నారు.‘‘శేఖర్ కమ్ములగారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఈ మూవీ అయ్యేది కాదు. ‘పేషన్’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ‘‘శేఖర్ కమ్ములగారికి నేను ఏకలవ్య శిష్ణుడ్ని. ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యే కథతో ‘పేషన్’ తీశాం. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని అన్నారు అరవింద్ జాషువా. -
ఊరంతా తెలిసిన సీక్రెట్...
హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మించిన తొలి చిత్రం ఇది. అలాగే ఈ సినిమాలో ఓ కీలకపాత్రలోనూ నటించారు సమంత. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.‘ఆ సీరియల్ టీవీలో వస్తున్నంత సేపు నా పెళ్ళాం చాలా తేడాగా ప్రవర్తించింది రా.., ఇంత జరుగుతుంటే ఊళ్లో ఒక్కడన్నా బయటకు వచ్చి చెప్పాడ్రా... అసలు ఒరేయ్... ఊరంతా తెలిసిన సీక్రెట్ రా ఇది... మొత్తం మగవాళ్ళ పరువంతా డేంజర్లో పడింది’ అనే సంభాషణలు ‘శుభం’ ట్రైలర్లో ఉన్నాయి. ఓ ఊర్లో మహిళలందరూ టీవీలో ఓ సీరియల్ చూసి, వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా అష్టకష్టాలు పడుతుంటారు. అప్పుడు ఓ మాతాజీలా సమంత వస్తారు. ఆ నెక్ట్స్ ఏం జరిగింది? అనే కథాంశంతో ‘శుభం’ సినిమా రూపొందిందని విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది. -
కోర్ట్ తర్వాత సారంగపాణి జాతకం నాకో వరం: ప్రియదర్శి
‘‘కోర్ట్’ తర్వాత ‘సారంగపాణి జాతకం’ చిత్రం నాకు ఓ వరంలా దొరికింది. ఇలాంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. శనివారం ‘సారంగపాణి జాతకం’ సినిమా సెలబ్రిటీ షో వేశాం. సెలబ్రిటీలు, ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేశారు’’ అని ప్రియదర్శి అన్నారు. ప్రియదర్శి, రూపా కొడవయూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అయింది. ఆదివారం జరిగిన ఈ సినిమా ‘ఫన్’టాస్టిక్ సక్సెస్ సెలబ్రేషన్స్లో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘నేను అనుకున్నదాని కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రియదర్శి నటించాడు. శివలెంక కృష్ణప్రసాద్గారితో నేను ‘సమ్మోహనం, జెంటిల్మ్యాన్’ సినిమాలు చేశాను. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ సినిమా చేశాం. ఈ మూడూ ప్రేక్షకులు పది కాలాలపాటు గుర్తుపెట్టుకునే చిత్రాలు’’ అని తెలిపారు.‘‘మేం ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన ఈ సినిమాను అందరూ చూసి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘దర్శికి మంచి జడ్జ్మెంట్ ఉంది. అప్పట్లో ఆమిర్ ఖాన్గారికి ఇలాంటి జడ్జ్మెంట్ ఉండేది. ఇంద్రగంటిగారితో పనిచేస్తే చాలు... రిజల్ట్తో అవసరం లేదు’’ అని చెప్పారు ‘వెన్నెల’ కిశోర్. ‘‘దర్శి ఆల్రౌండర్ నటుడు’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. ఇంకా నటుడు వైవా హర్ష, కెమెరామేన్ పీజీ విందా మాట్లాడారు. -
త్రీడీలో జగదేక వీరుడు అతిలోక సుందరి
చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాను 35 ఏళ్ల తర్వాత రీ–రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మే 9న ఈ చిత్రం రీ రిలీజ్కు సిద్ధమైంది. అది కూడా 2డీతో పాటు 3డీ వెర్షన్లోనూ విడుదల కానుంది. ‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం అప్పట్లోనే విజువల్ వండర్గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వెర్షన్తో ఆడియన్స్కు సరికొత్త అనుభూతినివ్వబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఇళయరాజా. -
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
‘‘నాని ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్ 3: థర్డ్ కేస్’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్ 2’లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్ 1, హిట్ 2, కోర్ట్’... ఆల్ సక్సెస్. వంద శాతం సక్సెస్ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్ 3’ సక్సెస్ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్... చాలా కేస్లు ఉండొచ్చు. శైలేష్ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ‘హిట్ 3’ ప్రమోషనల్ కంటెంట్ చూశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే వైబ్ని క్రియేట్ చేసింది. మే1 థియేటర్స్లో... అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. హిట్ ది థర్డ్ కేస్’’ అని రాజమౌళి అన్నారు.కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్’’ అని రాజమౌళి చెప్పారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్ వచ్చింది.ఈసారి ‘హిట్ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ కలిస్తే అది ‘హిట్ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను నానిప్రామిస్ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్ 3’ సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్ సేన్ వ్యక్తం చేశారు. శైలేష్ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
గత కొన్నిరోజులుగా 'పాడుతా తీయగా' షో వివాదం నడుస్తోంది. ప్రవస్తి ఆరాధ్య అనే సింగర్.. జడ్జిలైన కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై షాకింగ్ ఆరోపణలు చేసింది. తనని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని చెప్పుకొచ్చింది. దీనిపై పలువురు సింగర్స్ తమ తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. గీతాకృష్ణ అనే దర్శకుడు కీరవాణిపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆయన్ని ఇక ఆపమని చెబుతూ సంగీత దర్శకుడు కోటి ఓ వీడియో రిలీజ్ చేశారు.'గీతాకృష్ణ.. మీరు నా ఫేవరెట్ డైరెక్టర్. అప్పట్లో కొత్త రకమైన ఆలోచనలతో సినిమాలు చేశారు. కె.విశ్వనాథ్ దగ్గర శిష్యరికం కూడా చేశారు.కానీ ఈ మధ్య మీకు కొంచెం మ్యాటర్ ఎక్కువవుతోంది. కీరవాణి, చంద్రబోస్, సునీత గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మనందరం ఓ ఫ్యామిలీ. ఇక్కడ తప్పేం జరిగిపోలేదు. తప్పు జరిగిందా లేదా అనేది మీడియా చూసుకుంటుంది'(ఇదీ చదవండి: మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు) 'కానీ ఇలా వ్యక్తిగతంగా మనుషులపై కామెంట్స్ చేస్తూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి. ప్రతి దానిలో చిన్న అవాంతరాలు వస్తుంటాయి. నేను చేసిన వాటిలోనూ వచ్చాయి. అక్కడితో మర్చిపోతారు. వాళ్లు వాళ్లు హ్యాపీగా ఉంటారు. దీనికి ఇంత రచ్చ అవసరం లేదు. దయచేసి వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి. నాకు బాధేస్తోంది''ప్లీజ్.. ఇక ఈ విషయంలో ఏదీ మాట్లాడకండి. నాకు బాధగా ఉంది. ఇంకా ఏం చెప్తారో, ఏం వినాల్సి వస్తుందోనని నాకు భయమేస్తోంది' అని కోటి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) -
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
శేఖర్ మాస్టర్ తో అనసూయ ఫన్నీ పోజులుసితారకు అక్కలా అనిపిస్తున్న తల్లి నమ్రతపట్టుచీరలో ముచ్చటైన నవ్వుతో మీనాక్షి చౌదరిబంధువుల పాపతో శ్రీలీల ముద్దు మురిపెంచీరలో తెగ సిగ్గుపడిపోతున్న పూజా హెగ్డేజలకన్య తరహా డ్రస్సులో రకుల్ ప్రీత్ అందాల జాతరటామ్ బాయ్ లా మారిపోయిన రష్మిక మందన్నా View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by HT City Showstoppers (@htcityshowstoppers) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) -
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
బాహుబలి 2 సినిమా చూశారా? అందులో కుంతల రాజ్యానికి అనుష్క అలియాస్ దేవసేన యువరాణిగా ఉంటుంది. ఆమెకు వదినగా చేసిన నటి కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఆమెనే ఆశ్రిత వేమగంటి. చూస్తే వయసు మళ్లినట్లు కనిపిస్తుంది కానీ ఈ మూవీ చేసేటప్పటికీ ఆమెకు 27 ఏళ్లే. స్వయానా ఆమెనే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఏం చెప్పిందంటే?'బాహుబలి సినిమా చేసేటప్పటికి నా వయసు 27 ఏళ్లే. కానీ కాస్త పెద్దదానిలా చూపించారు. దీంతో ఇప్పటికీ ఎవరైనా నన్ను కలిస్తే మీరు బయట చాలా యంగ్ గా ఉన్నారని అంటుంటారు. అవును ఇదే నేను అని వాళ్లతో చెబుతుంటాను. చాలామంది నన్ను స్క్రీన్ పై చూసి నాది పెద్ద వయసు అనుకున్నారు. ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడేసుకుంటున్నారు'(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 'ఇలా కాస్త ప్లస్ సైజులో ఉండటం వల్ల నాకు నచ్చిన పాత్రలు దాదాపు నేను చేయలేను. ఎందుకంటే ప్లస్ సైజులో ఉంటే గౌరవప్రదమైన రోల్స్ కోసం మాత్రమే తీసుకుంటారు. సదరు దర్శకులకు నా నిజమైన వయసు గురించి చెప్తే.. పాత్రకు వయసు ఎక్కువున్నా సరే చాలా పవర్ ఫుల్ అదీ ఇదీ అని చెప్పి నన్ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు' అని ఆశ్రిత చెప్పుకొచ్చింది.స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఈమె.. బాహుబలి 2 సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత మహర్షి, MCA, క్రాక్, డియర్ కామ్రేడ్, యాత్ర, యానిమల్ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో కీలక పాత్ర చేస్తోంది.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) -
‘హిట్’ డైరెక్టర్తో నాగార్జున కొత్త సినిమా
‘నా సామిరంగ’ సినిమా తర్వాత నాగార్జున హీరోగా నటించనున్న చిత్రంపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత లేదు. గత ఏడాది సంక్రాంతికి (జనవరి 14) విడుదలైన ‘నా సామిరంగ’ చిత్రం హిట్గా నిలిచింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఏ సినిమానూ సెట్స్లో లేదు కానీ, రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంతో పాటు ధనుష్తో కలిసి ‘కుబేర’ సినిమాలో నటిస్తున్నారు. కాగా సోలో హీరోగా చేసేందుకు పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నప్పటికీ అధికారికంగా ఎవరికీ పచ్చజెండా ఊపలేదు ఆయన. ఇదిలా ఉంటే... ‘హిట్, హిట్ 2, సైంధవ్’ తదితర చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయనున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని భోగట్టా. గతంలో నాగార్జునకి వినిపించిన ఓ కథకి మరిన్ని మార్పులూ చేర్పులూ చేసి, తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ని వినిపించారట శైలేష్. ఈ కథ నాగార్జునకి నచ్చడంతో ఓకే చెప్పారట. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఓ హత్య ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని టాక్. నాగార్జున పాత్ర పవర్ఫుల్గా ఉండేలా శైలేష్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి... నాగార్జున సోలో హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇక నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ మే 1న విడుదల కానుంది. -
సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్
నాగచైతన్య-సమంత బంధం ముగిసిన అధ్యయం. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ నాలుగేళ్లకే విడిపోయారు. ఇది జరిగి చాన్నాళ్లు గడిచినా అప్పుడప్పుడు వీళ్ల గురించి మాట్లాడుకునే సందర్భం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చైతూ పెట్టిన ఓ పోస్ట్ మరోసారి చర్చకు కారణమైందని చెప్పొచ్చు.సమంత నుంచి విడిపోయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న నాగ చైతన్య.. గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితం ప్రారంభించాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. సరే అసలు విషయానికొస్తే సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే యాక్టివ్ గా ఉండే చైతూ చాన్నాళ్ల తర్వాత ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) సమంతతో కలిసున్న టైంలో హాష్ అనే ఫ్రెంచ్ బుల్ డాగ్ ని పెంచుకున్నారు. ఇప్పుడది చైతూ దగ్గరే ఉంది. తాజాగా చైతన్య.. ఆదివారం ఇలా గడిచింది అని ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో తన కారుని రిపేర్ చేసుకోవడంతో పాటు శోభిత- పెట్ డాగ్ హాష్ కలిసున్న ఫొటోని కూడా షేర్ చేశాడు.అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న సమంత ఫ్యాన్స్.. చిత్రవిచిత్రమైన కామెంట్స్ పెడుతున్నారు. సామ్ పెంచుకున్న కుక్క.. శోభితతో ఏం చేస్తోందని ఒకరంటే.. 'శుభం' ట్రైలర్ రిలీజైందని, రేపు సమంత పుట్టినరోజు కావడంతో కావాలనే చైతూ ఈ పోస్ట్ పెట్టాడని మరికొందరు అంటున్నారు. సమంత లానే హాష్ కూడా ఒంటరిది అయిపోయిందని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
‘పేషన్’ విజయం సాధించాలి: శేఖర్ కమ్ముల
యంగ్ టాలెంట్ సుధీస్, అంకిత హీరో హీరోయిన్లుగా అరవింద్ జాషువా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘పేషన్’. REDANT క్రియేషన్ బ్యానర్పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ను క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.., అరవింద్ జాషువా రాసిన ‘పేషన్’ నవల చదివాను, అది చాలా అథెంటిక్గా ఉంది. ఈ చిత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. అరవింద్లో స్టోరీ టెల్లింగ్, రైటింగ్ స్కిల్స్ అద్భుతం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.అరవింద్ జాషువా మాట్లాడుతూ, ఫ్యాషన్ కాలేజీలో సామాన్యుడి అనుభవాల నుంచి స్ఫూర్తి పొందిన కథ ఇది. శేఖర్ కమ్ముల నా గురువు, ఆయన స్ఫూర్తితోనే ఈ సినిమా తీశాను. నిర్మాతలు, సాంకేతిక బృందం అద్భుతంగా సహకరించారు. ఈ జనరేషన్కు కనెక్ట్ అయ్యే కథతో సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది అన్నారు.ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, శేఖర్ కమ్ముల సపోర్ట్కు ధన్యవాదాలు తెలిపారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన నవల స్ఫూర్తితో ఈ సినిమా రూపొందిందని చెప్పారు. సినిమా గొప్ప విజయం సాధించాలని టీమ్ ఆకాంక్షిస్తోంది. -
విచారణకు రాలేను.. ఈడీకి మహేశ్బాబు లేఖ
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో విచారణకు రాలేనంటూ మహేశ్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశాడు. షూటింగ్ కారణంగా రేపు (ఏప్రిల్ 28) ఈడీ ఎదుట హాజరు కాలేనని తెలిపాడు. విచారణ కోసం మరో తారీఖును ఫిక్స్ చేయాలని కోరాడు.ఎందుకీ విచారణ?సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు.. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయితులసి ఎన్క్లేవ్, షణ్ముఖ నివాస్ పేరుతో వెంచర్లు వేశాయి. సాయిసూర్య డెవలపర్స్ ఒక్కో ప్లాట్కు రూ.3.25 కోట్ల చొప్పున కొనుగోలుదారులతో ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్స్గా రూ.1.45 కోట్ల చొప్పున వసూలు చేసింది. నెలలు గడుస్తున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు గత నవంబర్లో సైబరాబాద్ ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు.రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు11 కేసులు నమోదు చేసిన పోలీసులు సాయిసూర్య డెవలపర్స్ ప్రొప్రైటర్ కె. సతీష్చంద్ర గుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రమోటర్ నరేంద్ర సురానాను నవంబర్లోనే అరెస్ట్ చేశారు. ఒకరికి విక్రయించిన ప్లాట్ను మరికొందరి పేర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఏప్రిల్ 16న ఈడీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించింది. రూ.74.5 లక్షలు నగదు సీజ్ చేసింది. ప్రచారకర్తగా మహేశ్ ఉన్నందువల్లే..సాయిసూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న మహేశ్బాబుకు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు ఆధారాలు సేకరించింది. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని మహేశ్బాబుకు ఈడీ నోటీసులు పంపింది. విచారణకు వచ్చే సమయంలో పాన్కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్బుక్స్ను తీసుకురావాలని సూచించింది. కానీ రాజమౌళి సినిమాతో (#SSMB29) బిజీగా ఉండటంతో మహేశ్ విచారణకు రాలేనని తాజాగా లేఖ రాశాడు.చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి: దర్శకుడు -
ఐటమ్ సాంగ్స్లో స్టార్ హీరోయిన్లు.. అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికంటే..?
పాటలు నృత్యాలు. అలాగే డ్యాన్స్ నంబర్లు 30వ దశకంలో టాకీల రోజుల నుంచే భారతీయ చలనచిత్రంలో భాగమయ్యాయి . వ్యాంప్ కేరెక్టర్లకు పరిమిమైన వారు మాత్రమే కాకుండా ఏకంగా హీరోయిన్లు ఈ తరహా నృత్యాలు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి వీటిని కాస్త హుందాగా ఐటెమ్/స్పెషల్ సాంగ్స్ లేదా ప్రత్యేక నృత్యాలుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్(Item Song)లు సినిమాల విజయాలకు చాలా కీలకమైనవిగా మారాయి. దాంతో పాటే ఈ తరహా నృత్యాల కోసం డ్యాన్సర్లు, హీరోయిన్లు వసూలు చేసే రెమ్యూనరేషన్ కూడా ఆకాశాన్ని అంటింది.బాలీవుడ్కి చెందిన నోరా ఫతేహి వంటి ప్రముఖ డ్యాన్సర్లు ఒక్కో పాటకు 2 కోట్ల రూపాయల చొప్పున, సన్నీ లియోన్ కూడా అంతే మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్లో కెవ్వు కేక అంటూ కేక పెట్టించిన మలైకా అరోరా పాటకు రూ. 50 లక్షల నుంచి 1కోటి వరకు వసూలు చేస్తూ ఇప్పుడు కాస్త వెనకడుగులో ఉంది.ప్రముఖ నటీమణులు ఈ డ్యాన్స్ నంబర్లకు వసూలు చేస్తున్న మొత్తాలు వారి డ్యాన్స్ సామర్థ్యాల కంటే చాలా ఎక్కువ అనేది వాస్తవం. అయితే డ్యాన్స్ ప్రతిభ కన్నా తమ స్టార్ పవర్ను వీరు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరీనా కపూర్ ఐటెం సాంగ్ చేసేటప్పుడు రూ. 1.5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసేదట. , కత్రినా కైఫ్ ఒక్కో పాటకు 2 కోట్ల రూపాయలకు పైగా అందుకుందట. ఈ తరహా పాటలకు పేరొంది అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రతి పాటకు రూ. 3 కోట్లు తీసుకుంటుంది. దబిడి దిబిడి భామ ఊర్వశి రౌతాలా కూడా అంతే మొత్తం అడిగేది..ఇప్పుడు మరింత ఎక్కువ డిమాండ్ చేస్తోంది. సినీ పండితుల సమాచారం ప్రకారం, తమన్నా భాటియా, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, తాప్సీ పన్ను వంటి వారు ఇప్పుడు ఐటమ్ నెంబర్స్లో డిమాండ్లో ఉన్నారు.ఈ కోవలో నిన్నా మొన్నటి దాకా అత్యధిక పారితోషికం అందుకున్న రికార్డ్ నటి సమంత పేరిట ఉంది. ఆమె పుష్ప ది రైజ్లో ఊ అంటావా పాట కోసం అత్యధిక మొత్తం వసూలు చేసినట్లు సమాచారం. ఒక సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ చేయడం ద్వారా ఆ సినిమా మొత్తం కనిపించిన హీరోయిన్ కన్నా ఎక్కువ మొత్తం అందుకుందీమె. పుష్పలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్న మొత్తం సినిమాకి కేవలం రూ. 2 కోట్లు మాత్రమే తీసుకుంటే. అయితే ఊ అంటావా పాట కోసం సమంత రూ. 5 కోట్ల పారితోషికాన్ని రాబట్టిందట.ఇటీవలి కాలంలో తమన్నా ఐటమ్ ట్రెండ్స్లోకి అనూహ్యంగా దూసుకొచ్చింది. తెలుగులో స్వింగ్ జర స్వింగ్ జర అంటూ జూనియర్ ఎన్టీయార్ పక్కన మెలికలు తిరిగిన ఈ మిల్కీ బ్యూటీ అలా మొదట్లో రూ.కోటిలోపే తీసుకుంటూ అప్పుడప్పుడు ఐటమ్గాళ్ గా కనిపించినా...ఇప్పుడు స్పెషల్ సాంగ్ అంటే తానే గుర్తొచ్చేంతగా ఎదిగిపోయింది. దీనికి వరుసగా ఆమె ఐటమ్ సాంగ్స్ హిట్ కావడమే కారణం. రూ.3కోట్లు తీసుకుని జైలర్ లో ‘నువ్వు కావాలయ్యా..దా’ పాటలో ఊపేసిన తమన్నా సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోలకు బోలెడంత ఫీడ్ అందించింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా స్త్రీ 2 ఆమెని మరింత అందనంత ఎత్తుకి తీసుకెళ్లింది. ఆ సినిమాలోని ఆజ్కి రాత్... పాట ఉత్తరాది ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోవడంతో తాజాగా రైడ్ 2లో చేసిన ఐటమ్ సాంగ్ కోసం రూ.5కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ చేసే హీరోయిన్లలో తమన్నా భాటియా అత్యధిక మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్గా నిలిచింది. -
RAPO 22: మోహన్లాల్ కాదు...ఉపేంద్ర?
రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో ఉపేంద్ర ఓ లీడ్ రోల్ చేయనున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. రామ్ హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వంలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ ఫిల్మ్లో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాగర్ పాత్రలో రామ్, మహాలక్ష్మి పాత్రలో భాగ్య శ్రీ బోర్సే కనిపిస్తారు. కాగా.. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో, కన్నడ స్టార్ ఉపేంద్రను సంప్రదించారట. ఈ పాత్ర చేసేందుకు ఉపేంద్ర సుముఖంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఉపేంద్ర చేయనున్నది సినిమా హీరో క్యారెక్టర్ అని సమాచారం. మరి... రామ్ సినిమాలో సినిమా హీరోగా ఉపేంద్ర నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 15న రామ్ బర్త్ డేకి ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమా గురించిన అప్డేట్ రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
75 వసంతాల ‘పల్లెటూరి పిల్ల’.. తెలుగు తెరపై చెరగని ముద్ర!
జయాపజయాల స్థాయితో సంబంధం లేకుండాకొన్ని సినిమాలకు చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.వాటికి ఉండే అనేకానేక ఇతర విశేషాల తాలూకు ఘనత అది. కాలం గడిచిన కొద్దీ చిత్ర కథ, కథనాల కన్నా ఆ విశేషాల వల్ల సదరు సినిమా మైలురాయిగా మిగిలిపోతుంది. ఈ ఏప్రిల్ 27తో సరిగ్గా 75 వసంతాలు(ప్లాటినమ్ జూబ్లీ) నిండిన ‘పల్లెటూరి పిల్ల’ అలాంటిదే.అప్పట్లో ఘన విజయం సాధించి, 7 కేంద్రాల్లో నేరుగా శతదినోత్సవం జరుపుకొన్న ఈ సినిమా ప్రత్యేకతలు పుష్కలం. ఆనాటి ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం చెరిగిపోని తన ముద్రలను ఈనాటికీ గుర్తు చేస్తూనే ఉంది.ఎన్టీఆర్ అసలు మొదటి సినిమా ఇదే! నటుడిగా మొదలై ప్రజానేతగా ఎదిగిన ఎన్టీ రామారావు తొలి సినిమా అనగానే ‘మన దేశం’ (1949) అనుకుంటాం కానీ, అసలు ఆయన నటుడిగా తొలిసారిగా ఎంపికైనదీ, తొట్టతొలిసారిగా కెమెరా ముందు నిల్చున్నదీ ఈ ‘పల్లెటూరి పిల్ల’తోనే! అయితే, రిలీజులో మొదట ‘మన దేశం’ వస్తే, రెండోది ‘షావుకారు’, మూడోది ‘పల్లెటూరి పిల్ల’ అయ్యాయి. నిజానికి, ఎన్టీఆర్ను ఈ ‘పల్లెటూరి పిల్ల’ దర్శక – నిర్మాత బి.ఏ. సుబ్బారావు వద్దకు తీసుకువెళ్ళింది కూడా ‘మన దేశం’ దర్శకుడు ఎల్వీ ప్రసాదే! అందగాడు, స్ఫురద్రూపి అయిన ఎన్టీఆర్ను చూస్తూనే, తన తొలి సినిమా హీరో ఇతనే అని సుబ్బారావు తేల్చేశారు. అయితే, తొలి సినిమా రూపొందిస్తూ, తొలిసారి కెమెరా ముందుకు వస్తున్న నటుణ్ణి హీరోగా పెట్టడం భారమేనంటూ ప్రసాద్, ఈలోగా తన సినిమాలో ఒక సహాయక పాత్ర ఇస్తానన్నారు. అదే – ఎన్టీఆర్ తొలిసారి తెరపై కనిపించిన ‘మన దేశం’లోని పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర అన్న మాట!తెలుగు సినిమా పరిశ్రమ పురోగతిలో ఇవాళ్టికీ ధ్రువతారలుగా చెప్పుకొనే ఎన్టీఆర్ – ఏయన్నార్ అనే ఇద్దరు అగ్రనటులు కలసి తొలిసారిగా నటించిన చిత్రం కూడా ‘పల్లెటూరి పిల్లే’. అప్పటి దాకా మీర్జాపురం రాజా వారి ‘శోభనాచల’ సంస్థలో ప్రొడక్షన్ నుంచి డైరెక్షన్ దాకా వివిధ శాఖల్లో, స్థాయుల్లో పనిచేస్తున్న బి.ఏ. సుబ్బారావు ఆసక్తి కొద్దీ, ఆ సంస్థ అండదండలతో దర్శకుడిగా, నిర్మాతగా మారిందీ ఈ సినిమాతోనే. 1948 మొదట్లోనే షూటింగ్ ఆరంభమైనా, ఆర్థిక ఇబ్బందులతో చిత్రనిర్మాణం విపరీతంగా జాప్యమైంది. ఆఖరికి మళ్ళీ రాజా వారి చేయూతతోనే 1950 మొదట్లో సినిమా పూర్తి చేశారు. అందుకే, ‘బి.ఏ. సుబ్బారావు, శోభనాచల పిక్చర్స్ జాయింట్ ప్రొడక్షన్’ అంటూ నిర్మాణసంస్థగా రెండు పేర్లూ వేశారు. ఎట్టకేలకు నాటి ప్రసిద్ధ పంపిణీ సంస్థ పూర్ణా పిక్చర్స్ ద్వారా విడుదల చేయించారు.గాంధీ ఆశయం చూపే జానపదం జానపద చిత్రాలకే డబ్బు వస్తుందనీ, సాంఘికాలు సహా తక్కినవి ఏవి తీసినా ఆర్థికంగా నష్టం వస్తుందనీ తెలుగు చిత్రసీమలో భావిస్తున్న రోజులవి. నిర్మాతలంతా జానపదాల వైపు, మంత్రతంత్రాల కాకమ్మకథల వైపు పరుగులు తీస్తున్న కాలమది. అలాంటి వాతావరణంలో అనారోగ్యకరమైన అంశాలను ప్రేక్షకుల మీద రుద్దకుండా, అభ్యుదయానికి దోహదం చేస్తూనే విజయవంతమయ్యే ఫోక్లోర్ సినిమా తీయడం సాధ్యమేనని ‘పల్లెటూరి పిల్ల’ ఋజువు చేసింది. కత్తులూ కటార్లూ వాడినా, మాయలూ మంత్రాలూ లేని ఈ జానపదం మన తెలుగు ప్రాంతాల్లో ప్రభువుల పక్షాన పాలన చేసిన పాలెగాళ్ళ సంస్కృతిని తెరపై చూపింది. గ్రామాలను కాపు కాయాల్సిన వాళ్ళు కొన్నిసార్లు నిరంకుశంగా, పల్లెల్ని దోచుకు తినే వైనానికి విలన్ కంపన దొర (నటుడు ఏ.వి. సుబ్బారావు) పాత్ర ప్రతిరూపం. అయితే, ఈ చిత్రానికి మూలం మాత్రం 18వ శతాబ్దిలోకెల్లా ప్రాచుర్యం పొందిన నాటకాల్లో రెండోదైన షెరిడాన్ ఆంగ్ల రచన ‘పిజారో’. అధికారం, అత్యాశ, నమ్మకద్రోహం లాంటి ఎన్నో మిళితమైన విషాదాంత డ్రామా ఇది. దాన్ని ఆధారంగా తీసుకొని, తాపీ ధర్మారావు, ఆదినారాయణరావు, సదాశివబ్రహ్మం, చిత్రపు నారాయణమూర్తి, బి.ఏ. సుబ్బారావు... ఇలా అందరూ కలసి మన నేటివిటీకి తగ్గట్టుగా వండిన వంటకం ‘పల్లెటూరి పిల్ల’. మూడు ముక్కల్లో చెప్పాలంటే, ఒక గ్రామాన్ని స్వాధీనం చేసుకోవడానికి కంపన దొర అనే ముఠా నేత ప్రయత్నాలను గ్రామస్థులంతా ఏకమై ప్రతిఘటించడమే కథా వస్తువు. దుర్మార్గుడైన ముఠా నేతకు చివరలో హృదయ పరివర్తన కలుగుతుంది. ‘‘జీవితకాలమంతా గాంధీజీ కలవరించిన గ్రామ పునర్నిర్మాణమును ప్రత్యక్షంగా నిరూపించే మహత్తర చిత్రము’’ అంటూ అప్పట్లో ప్రచారం చేశారు.కంపన దొర అనుచరుడిగా ఉండి, పల్లెటూరి పిల్ల (అంజలీదేవి) దెబ్బతో మనిషిగా మారి, గ్రామం కోసం పోరాడే హీరో పాత్ర ఎన్టీఆర్ది. సదరు పల్లెటూరి పిల్లకు వరసైన వాడైనా, హీరో హీరోయిన్ల సాన్నిహిత్యం చూసి, తన ప్రేమను వదులుకొని పక్కకు తప్పుకొని, ఆఖరులో వారి కోసం, ప్రజాక్షేమం కోసం ప్రాణమే త్యాగం చేసి మహాత్ముడిగా నిలిచే కీలక పాత్ర ఏయన్నార్ది. తాపీ ధర్మారావు రాసిన మాటలు, ‘శాంత వంటి పిల్ల లేదోయి...’ లాంటి పాటలు అప్పట్లో జనానికి పట్టాయి.ఇటు ఎన్టీఆర్... అటు ఎమ్జీఆర్! ఇవాళ ఇంతగా చెప్పుకుంటున్న ఈ ‘పల్లెటూరి పిల్ల’ నిర్మాణమే కాదు, రిలీజ్ కూడా ఆలస్యమే. రకరకాల రిలీజ్ తేదీలు మారింది. ఆఖరి క్షణంలోనూ 1950 ఏప్రిల్ 20 నుంచి ఎందుకనో ఓ వారం వాయిదా వేశారు. ఆఖరికి ఏప్రిల్ 27న మద్రాసు సహా తెలుగు నాట అంతటా జనం ముందుకొచ్చింది. ఎన్టీఆర్ హీరోగా చేసిన తొలి చిత్రమిదే అయినా, ఆయన హీరోగా తర్వాత మొదలైన విజయా వారి ‘షావుకారు’ జనం ముందుకొచ్చి, సక్సెస్ఫుల్గా 3 వారాలవుతున్న వేళ ఈ ‘పల్లెటూరి పిల్ల’ విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ నాటికే ఒకపక్క విజయా వారి ‘పాతాళభైరవి’ షూటింగ్ జోరుగా సాగుతోంది. మరోపక్క వాహినీ వారి ఆణిముత్యం ‘మల్లీశ్వరి’ కొంత పూర్తయింది. రిలీజుకు ముందే ఆ ఏడాది తమిళ ఉగాది నాడు ఉదయం మద్రాసులోని ‘మినర్వా’ థియేటర్లో ఈ ‘పల్లెటూరి పిల్ల’ ప్రివ్యూ వేశారు. గమ్మత్తేమిటంటే, ఒక పక్కన ఎన్టీఆర్ సినిమా చూపిస్తుంటే, అదే రోజున అదే సమయంలో ‘సాగర్’ టాకీస్లో ఎమ్జీఆర్ కొత్త తమిళ చిత్రం ‘మరుదనాడ్ ఇళవరసి’ ప్రెస్షో వేయడం. (ఆ తమిళ చిత్రం మిగిలిన కేంద్రాల కన్నా 12 రోజులు ఆలస్యంగా ఆ రోజే మద్రాస్లో రిలీజైంది). యాదృచ్ఛికమే అయినా ఆ రెండు చిత్రాల ప్రివ్యూలు జరిగిన సరిగ్గా ఆ ఉగాది నాటి రాత్రే 8.47 గంటలకు తిరువణ్ణామలైలో భగవాన్ రమణ మహర్షి సమాధిగతులయ్యారు. హీరోగా ఎన్టీఆర్కు అదే తొలి సినిమా కానీ, ఎమ్జీఆర్కు మాత్రం అప్పటికే హీరోగా కొంత పేరుంది. ఇటు ఎన్టీఆర్ తెలుగు సినిమా, అటు ఎమ్జీఆర్ తమిళ సినిమా... రెండూ జానపదాలే. రెండూ హిట్టే. కాలగతిలో ఇద్దరూ ఆయా భాషల చిత్రసీమలకు మకుటం లేని మహారాజులయ్యారు. ఆపైన పార్టీలు పెట్టి, జనరంజక పాలకులూ అయ్యారు.ఆఖరు దాకా... ఆనాటి మంచితనం! రిలీజులో ఆలస్యమైనా, హీరోగా ఎన్టీఆర్కు తొలి రోజులైనా, ‘పల్లెటూరి పిల్ల’ హిట్టయింది. హీరోగా ఎన్టీఆర్, దర్శక – నిర్మాతగా సుబ్బారావు స్థిరపడ్డారు. మూడు దశాబ్దాల పైగా ఇద్దరూ ఎవరికి వారు వెండితెరపై వెలిగారు. ‘రాజు –పేద’, ‘చెంచులక్ష్మి’, ‘భీష్మ’, ‘రాణీ రత్నప్రభ’, ‘మోహినీ భస్మాసుర’ లాంటి అనేక చిత్రాలను సుబ్బారావు స్వీయ నిర్మాణంలో రూపొందించారు. తెరపై తొలి అవకాశమిచ్చారన్న కృతజ్ఞతతో ఎన్టీఆర్ ‘సతీ సావిత్రి’, ‘మావారి మంచితనం’ వరకు సుబ్బారావుతో సినిమాలు చేస్తూనే వచ్చారు. కుమారులు హరికృష్ణ – బాలకృష్ణలు తొలిసారిగా కలిసి నటించిన ‘రామ్ – రహీమ్’ (1974)కు కూడా సుబ్బారావే డైరెక్టర్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయనను ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ)లో రాష్ట్ర ప్రభుత్వ న్యూస్రీల్స్ రూపకల్పన బాధ్యతలు అప్పగించడం విశేషం.దిలీప్ కుమార్కు ఫ్లాపు... అమితాబ్కు హిట్టు! ఎన్టీఆర్ – బి.ఏ. సుబ్బారావుల తొలి ప్రయత్నం ‘పల్లెటూరి పిల్ల’ 1990ల దాకా రీరిలీజ్ అవుతూ, అభిమానుల్ని అలరించింది. తొలి రిలీజప్పుడే ఈ సినిమా తమిళంలో ‘గ్రామ పెణ్’గా అనువాదమైంది. (తమిళంలో అనువాదమైన తొలి తెలుగు సినిమా ఏయన్నార్ ‘కీలుగుర్రం’ అయితే, రెండో తెలుగు సినిమా ఎన్టీఆర్ ‘పల్లెటూరి పిల్ల’). తరువాత కొన్నేళ్ళకు ప్రసిద్ధ నిర్మాత ‘జెమినీ’ వాసన్ ఇదే కథను దేవానంద్, దిలీప్కుమార్లతో హిందీలో ‘ఇన్సానియత్’ (1955) పేరిట రీమేక్ చేశారు. హిందీ చలనచిత్ర చరిత్రలో ఆ అగ్రతారలిద్దరూ కలసి నటించిన ఏకైక సినిమా అది. హాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా జిప్పీ అనే చింపాజీని రప్పించి, ఈ హిందీ వెర్షన్లో నటింపజేయడం విశేషం. హీరోల కన్నా ఈ హాలీవుడ్ చింపాజీకి ఇచ్చిన పారితోషికం, చేసిన ఖర్చే ఎక్కువ. జెమినీ వారి హిందీ హిట్స్ ‘చంద్రలేఖ’ వగైరాలతో పోలిక లేదు కానీ, పబ్లిసిటీ ప్రభంజనంలో ‘ఇన్సానియత్’ సో సో అనిపించుకుంది. చిత్ర మేమంటే, వీటన్నిటికీ మూలమైన ‘పిజారో’ నాటక ఇతివృత్తం స్ఫూర్తితో రకరకాల మార్పులతో తర్వాత అనేక భాషల్లో సినిమాలొచ్చాయి. జాగ్రత్తగా గమనిస్తే, చిరస్మరణీయ బాక్సాఫీస్ సూపర్హిట్ ‘షోలే’కు కూడా ఇదే ప్రేరణ. త్యాగంలో దిలీప్ కుమార్ పాత్రకూ, అమితాబ్ పాత్రకూ పోలికలు కనిపిస్తాయి. ఆ క్యారెక్టరైజేషన్ దిలీప్కు ఫ్లాపైతే, అమితాబ్కు సూపర్ హిట్.ఏయన్నార్ అలా వచ్చారు! ‘పల్లెటూరి పిల్ల’ రూపకల్పన ప్రస్థానం ఆది నుంచి అనేక మలుపులు తిరిగింది. కాకినాడలో ప్రసిద్ధ ‘యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్’ నాటకాల రోజుల నుంచి బి.ఏ. సుబ్బారావుకు సుపరిచితులైన అంజలీదేవి, ఆదినారాయణరావులు చిత్ర హీరోయిన్, సంగీత దర్శకులుగా ఓకే. మొదట ఎన్టీఆర్తో పాటు ఉండే మరో హీరో పాత్రకు ఈలపాట రఘురామయ్యను అనుకున్నారు. రఘురామయ్యతో కొద్దిగా షూటింగ్ కూడా చేశాక, చిత్రనిర్మాణం విపరీతంగా ఆలస్యమైంది. ఆఖరికి ఆ పాత్ర ఏయన్నార్కు దక్కింది. అప్పటికే, ‘బాలరాజు’ (1948 ఫిబ్రవరి 26) వచ్చేసింది. శోభనాచల వారి ‘కీలుగుర్రం’ (రిలీజ్ 1949 ఫిబ్రవరి 19) పట్టాలెక్కింది. అలా హీరోగా పేరు తెచ్చుకున్న ఏయన్నార్ ఈ చిత్రంలో హీరోయిన్ లేకుండా, ఆఖరికి ప్రాణాలు కూడా వదులుకొనే త్యాగమయ పాత్రకు ఒప్పుకోవడం విశేషమే. స్టార్డమ్ ఇంతగా ప్రబలని ఆ రోజుల్లో రంగస్థల, సినీ నటీనటులకు తాము పోషించే పాత్ర తాలూకు ప్రాధాన్యమే తప్ప, ఇమేజ్ పట్టింపులు ఉండేవి కాదనడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఏయన్నార్ రాకతో, అంతకు ముందు రఘురామయ్యతో తీసిన సీన్లను రీషూట్ చేశారు. మానిన గాయాల మధురస్మృతులుఈ ‘పల్లెటూరి పిల్ల’తో మొదలైన ఎన్టీఆర్, ఏయన్నార్ల టాప్ స్టార్ కాంబినేషన్ మాత్రం మరెక్కడా లేని విధంగా మొత్తం 15 చిత్రాల్లో కొనసాగింది. ఈ చిత్రంలోనే ఏయన్నార్ మీదకు వచ్చే ఎద్దుతో ΄పోరాడే సీన్లో రియలిస్టిక్గా నటించినప్పుడు ఎన్టీఆర్ కుడి చేతి ఎముక విరిగింది. అలా ఆ తొలి చిత్రం నుంచి సినీ కెరీర్లో మొత్తం 7 సందర్భాల్లో వివిధ సినిమాల షూటింగుల్లో అదే చేతికి దెబ్బ తగిలి, ఎన్టీఆర్కు ఫ్రాక్చరైంది. అలా జరిగినప్పుడల్లా ఆయన పుత్తూరు రాజుల కట్టువైద్యాన్ని ఆశ్రయించి, ఆరోగ్యవంతులయ్యారు. తొలిచిత్రం ‘పల్లెటూరి పిల్ల’ ఫైట్ సీన్లోనే ఆస్ట్రేలియన్ ఎద్దు కొమ్ము విసిరినప్పుడు గాయమై, ఎన్టీఆర్ ఎడమ కన్ను కింద చిన్న గాటు పడింది. ముఖం మీద ఆ చిరుగాటు మచ్చ కెరీర్కు అవరోధమవుతుందని అందరూ భావించారు కానీ, అవేవీ ఎన్టీఆర్ ప్రస్థానానికి అడ్డు కాలేదు. ఆ చిరుగాటునే ‘కొండవీటి సింహం’ (1981)లో ఎన్టీఆర్ వేసిన ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ పాత్రకు తగ్గట్టుగా మేకప్లో పెద్దదిగా చేసి, ఎఫెక్టివ్గా వాడుకోవడం విశేషం. తొలి సినిమా ‘పల్లెటూరి పిల్ల’ ఇచ్చిన గుర్తులు ఎన్టీఆర్కే కాదు... సినీ ప్రియులకూ ఇవాళ్టికీ ఇలా మిగిలాయి.– రెంటాల జయదేవ -
ట్రైలర్: సీరియల్స్ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న సమంత!
హీరోహీరోయిన్లు ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ చూస్తున్నారు. నాని ఇటీవలే నిర్మాతగా కోర్టు మూవీతో విజయం అందుకున్నాడు. తాజాగా హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) కూడా ప్రొడ్యూసర్గా సత్తా చూపించేందుకు సిద్ధమైంది. ఆమె కొత్తగా ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ను స్థాపించింది. ఈ బ్యానర్లో శుభం అనే సినిమా తెరకెక్కింది. కొత్తవారితో కలిసి చేసిన ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రెగుల దర్శకత్వం వహించాడు.సీరియల్స్ చూస్తున్నంతసేపు ఒంట్లో దెయ్యంఆదివారం (ఏప్రిల్ 27) నాడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆడవాళ్లు సీరియల్స్కు బానిసైపోతారు. ఏం చేస్తున్నా సరే సీరియల్ టైం అవగానే టీవీ ముందు కూర్చుంటారు. వాళ్లను డిస్టర్బ్ చేశారంటే వాళ్ల పని అధోగతే! సీరియల్స్ చూస్తున్నప్పుడు వారి శరీరంలోకి ఓ దెయ్యం వచ్చినట్లే ప్రవర్తిస్తున్నారు. దీంతో మగవాళ్లు చివర్లో ఓ మాతను కలుస్తారు. ఇక్కడ మాత స్థానంలో ఉన్నది మరెవరో కాదు సమంత. ఊర్లో ఉన్న మగవాళ్లందరినీ కాపాడమని వాళ్లు ఆమె శరణు కోరతారు.మే 9న రిలీజ్మరి సమంత ఏం చేసింది? వాళ్లను కాపాడిందా? లేదా? అన్నది తెలియాలంటే మే 9న ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే! ఈ విచిత్రమైన కథను చచ్చినట్లు చూడాల్సిందే అని ట్రైలర్లోనే నొక్కి చెప్పారు. ఏదేమైనా ఈ మూవీలో సమంతను చూసి అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తున్న సామ్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి -
పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి
కోర్ట్ సినిమాలో న్యాయవాదిగా సీరియస్ పాత్రలో మెప్పించిన ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ఇప్పుడు నవ్వించే పనిలో పడ్డాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన సారంగపాణి జాతకం (Sarangapani Jathakam Movie) ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.హర్టయిన రామజోగయ్య శాస్త్రిఈ క్రమంలో చిత్రయూనిట్ సెలబ్రిటీల కోసం స్పెషల్ షో వేశారు. డైరెక్టర్లు హరీశ్ శంకర్, కోన వెంకట్, నందినీ రెడ్డి, సింగర్ సమీరా భరద్వాజ్ సహా పలువురు తారలు ఈ షోకు హాజరయ్యారు. ఈ వీడియోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసి ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి హర్టయ్యారు.పిలిస్తే రానన్నానా?'నన్ను మర్చిపోయారుగా.. పిలిస్తే రానన్నానా? అంతేలే.. సరేలే, కానివ్వండి' అంటూ సారంగపాణి జాతకం నిర్మాత కృష్ణవేల్ను ట్యాగ్ చేశారు. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి! సారంగపాణి జాతకం సినిమా విషయానికి వస్తే.. ఇందులో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించారు. ఆదిత్య 369 ఫేమ్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఎన్నో హిట్ సాంగ్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి.. సారంగపాణి జాతకంలో థీమ్ సాంగ్, చిత్రగుప్త పాటలకు సాహిత్యం అందించాడు.యాక్టర్ కాలేవ్!సారంగపాణి జాతకం మూవీలో ప్రియదర్శి.. జాతకాలను నమ్మే వ్యక్తిగా కనిపిస్తాడు. అయితే నిజ జీవితంలో అతడు జాతకం చూపించుకున్నప్పుడు అసలు నటుడయ్యే యోగమే లేదని చెప్పారట! అయినా అవేమీ నమ్మకుండా తనపై నమ్మకంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. బలగం, మల్లేశం, కోర్ట్ వంటి చిత్రాలతో మంచి నటుడిగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఇతడు ‘ప్రేమంటే, మిత్ర మండలి’ సినిమాలు చేస్తున్నాడు. నన్ను మరిచిపోయారుగా పిలిస్తే రానన్నానా @krishnasivalenk అంతేలే..సరేలే..కానీండిలే https://t.co/cIa1WrftKo— RamajogaiahSastry (@ramjowrites) April 26, 2025 చదవండి: పాక్పై మనం దాడి చేయాల్సిన పనే లేదు.. వాళ్లే తిరగబడతారు: -
టాలీవుడ్ సినిమా రివ్యూలు.. డైరెక్టర్ త్రినాథరావు ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన సినిమాకు రివ్యూలు రాయరని అనుకున్నానని అన్నారు. చౌర్యపాఠం మూవీకి చాలామంది బాగానే రాశారని తెలిపారు. అందరూ కూడా మేచ్యూర్డ్గానే రాసినందుకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇటీవల టాలీవుడ్లో రివ్యూలపై హీరో నాని సైతం మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతకుముందు నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం మూవీ రివ్యూలపై చాలా సందర్భాల్లో మాట్లాడారు. గత కొద్దికాలంగా రివ్యూలపై టాలీవుడ్లో పెద్దఎత్తున చర్చ జరుగుతన్న వేళ త్రినాథరావు చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.కాగా.. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం చౌర్యపాఠం(Chaurya Paatam Movie). ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, చూడామణి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో త్రినాథరావు రివ్యూలపై స్పందించారు. -
'నా హైట్తో సమస్య.. నాతో ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు'.. మీనాక్షి చౌదరి
గత ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’.. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇలా వరుస సంక్రాంతి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి వచ్చి, హ్యాట్రిక్ హిట్తో అలరిస్తానంటున్న నటి మీనాక్షి చౌదరీ చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.. ఇంకేందుకు ఆలస్యం చదివేయండి.పెద్ద పెద్ద స్టార్స్తో చేసిన సినిమాలు కొంత నిరాశపరచిన మాట నిజమే! కొందరు వాటి ఫ్లాప్స్కి నన్ను బాధ్యురాలిని చేస్తూ కామెంట్స్ చేశారు. ఫ్లాప్కి బాధపడను, ఎందుకంటే మన పని మాత్రమే మనల్ని ముందుకి తీసుకెళ్తుంది. తెలుగులో నా ఫస్ట్ పిక్చర్ ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ వర్కవుట్ కాకపోయినా.. ఖిలాడీ సినిమాలో ఛాన్స్ రావడానికి అదే కారణం!లక్కీ భాస్కర్ సినిమాతో నా లక్ మారిందని చాలామంది అంటున్నారు. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. కానీ.. ఇక ముందు పిల్లల తల్లి పాత్ర వస్తే నో చెప్పేస్తాను. నేను పంజాబీ అమ్మాయిని. మా నాన్న బీఆర్ చౌదరి ఆర్మీలో కర్నల్. ఆయన క్రమశిక్షణకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. నన్ను తరచు తిడుతుండే వారు. ఇప్పుడు షూటింగ్కి అందరి కన్నా ముందు వచ్చి కూర్చోవడానికి ఆయనే కారణం. నువ్వు కొంచెం లేట్గా రావచ్చు కదా అంటారు యూనిట్ వాళ్లు. ∙చిన్నప్పుడు నేను చాలా ఇంట్రావర్ట్ని. కాలేజీలోకి వచ్చేటప్పటికే, నా ఎత్తు 6.2. దీంతో, అమ్మాయిలు కూడా నాతో కలిసి నడవటానికి, మాట్లాడటానికి ఇష్టపడే వాళ్లు కాదు. రకరకాల కామెంట్స్ చేసేవారు. చాలా బాధగా అనిపించేది. మా నాన్నకి చెప్పినా నీ సమస్యలు నువ్వే సాల్వ్ చేసుకోవాలి అనే వారు. బుక్స్ విపరీతంగా చదివేదాన్ని. అవే నా ఫ్రెండ్స్. అందాల పోటీల్లో, స్పోర్ట్స్ కాంపిటీషన్లో పాల్గొనడానికి నలుగురు కలుస్తారనేదే కారణం. నేను బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో ఛాంపియన్ని. మయాన్మార్లో జరిగిన అందాల పోటీల్లో నేను ఫస్ట్ రన్నర్గా వచ్చాను. ఈ మధ్య మయాన్మార్ లో భూకంపం వచ్చినప్పుడు నా మనసు కలచివేసినట్లయింది.∙సీనియర్ హీరోలతో నటించడంలో నాకెలాంటి ప్రాబ్లెమ్స్ లేవు. అదో జోనర్గా భావిస్తాను. వెంకటేష్గారితో సంక్రాంతికి వస్తున్నాం చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగారితో విశ్వంభర చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. నా మీద రూమర్స్ వచ్చినప్పుడు కోపం వస్తుంది. నేను సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఏదన్నా ఉంటే నేనే అనౌన్స్ చేస్తాను. పంజాబీ అమ్మాయిని అయినప్పటికీ.. సౌత్ ఇండియన్ కల్చర్ బాగా నచ్చుతుంది. చీరలు కట్టుకోవడం చాలా కంఫర్ట్గా ఉంటుంది. నేను డెంటిస్ట్ని. ఎవరిని అయినా ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు వెంటనే వాళ్ల దంతాలనే గమనిస్తుంటాను. నిజానికి డెంటిస్ట్గా ప్రాక్టీసు మొదలు పెట్టాను. కాని, హీరోయిన్గా బిజీ కావడంతో సాధ్యపడలేదని అంటోంది మీనాక్షి చౌదరి. -
పాక్పై మనం దాడి చేయాల్సిన పనే లేదు.. వాళ్లే తిరగబడతారు: విజయ్ దేవరకొండ
కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆ ఘటనను తలచుకుంటేనే చాలా బాధగా ఉందన్నారు. ఎవరైతే వారి ఆప్తులను కోల్పోయారో వారి బాధ తీవ్రత ఎంత అనేది అర్థం చేసుకోలగను అన్నారు. హైదరాబాద్లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరై దేవరకొండ పహల్గామ్ దాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నా. మేమంతా మీకు అండగా ఉంటాం. మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా.. మేమూ దాన్ని అనుభవిస్తున్నాం. కశ్మీర్లో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు కారణం కేవలం చదువు లేకపోవడమే. వాళ్లందరికీ చదువు చెప్పించి బ్రెయిన్వాష్ కాకుండా చూడాలి . ఇలాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో నాకైతే తెలియదు. కశ్మీర్ ఎప్పటికీ ఇండియాదే.. కశ్మీరీలు కూడా మనవాళ్లే. రెండేళ్ల క్రితమే అక్కడ ఖుషీ సినిమా షూటింగ్కు కూడా వెళ్లా. పాకిస్థాన్లో నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పాకిస్థాన్పై మనం దాడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకే విరక్తి వచ్చి ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారు. వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులే ఇవన్నీ. ఇలాంటి సమయంలో మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. మనం జీవితంలో ముందుకెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గం. మనం, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుంది' అని అన్నారు.అనంతరం సూర్య గురించి మాట్లాడుతూ..' నాకు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న అగరం ఫౌండేషన్ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. -
కాలి నడకన తిరుమలకు కేజీఎఫ్ బ్యూటీ, నాని.. వీడియో వైరల్
నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్-3. ఈ మూవీ హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేడే సందర్భంగా 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.కాగా.. అంతకుముందు కాలి నడకన శ్రీవారి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా.. ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చూస్తే ఫుల్ వయోలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Exclusive visuals of @NameisNani , @SrinidhiShetty7 reaching at Tirumala Tirupati Devasthanam on foot #HIT3 #NaturalStarNani pic.twitter.com/eqztW8zfit— Telugu Film Producers Council (@tfpcin) April 26, 2025 -
టాలీవుడ్ డైరెక్టర్తో సూర్య సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ హాజరయ్యారు.ఈ ఈవెంట్లో హీరో సూర్య ఫ్యాన్స్కు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన వచ్చే మూవీని టాలీవుడ్ డైరెక్టర్తోనే తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్యనే స్వయంగా ప్రకటించారు. దీంతో సూర్య టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.సూర్య గజిని సినిమా వచ్చినప్పుడు నా ఇంజినీరింగ్ పూర్తయిందని దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. ఆ సినిమాను థియేటర్లో చూసి ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించిందన్నారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చూసినప్పుడు.. లవ్, ఫెయిల్యూర్, క్రమశిక్షణ నేర్పిన సినిమా సార్ అది అని వెంకీ అన్నారు. #Suriya46 💥💥@Suriya_offl - #VenkyAtluri - @Vamsi84 - @SitharaEnts ❤️🔥❤️🔥 🎥 pic.twitter.com/CD7XEkRz6h— Sithara Entertainments (@SitharaEnts) April 26, 2025 -
ఆ సినిమాని నేను తిరస్కరించలేదు
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘హిట్ 3: ది థర్డ్ కేస్’. ఈ సినిమాలో మృదుల అనే పాత్ర చేశాను. ముందు నా క్యారెక్టర్కు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్తో డబ్బింగ్ చెప్పించారు. కానీ నేనే డబ్బింగ్ చెబితే బాగుంటుందని భావించి, దర్శకుడు శైలేష్గారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అలా నా తొలి తెలుగు సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను’’ అని శ్రీనిధీ శెట్టి అన్నారు. నాని హీరోగా నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనిధీ శెట్టి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘హిట్ 3: ది థర్డ్ కేస్’లో స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయి మృదులగా నటించాను. అర్జున్ సర్కార్ (సినిమాలో నాని క్యారెక్టర్ పాత్ర)కు పూర్తి భిన్నమైన మనస్తత్వం మృదులది. సినిమాలో అర్జున్ ఎవరి మాటన్నా వింటాడంటే అది మృదల మాటే. ‘హిట్ 3’లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు స్కోప్ తక్కువ ఉండొచ్చనుకుంటారు. కానీ ఈ మూవీలో మృదుల పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఇక నా కెరీర్లో ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలే ఉన్నాయి. ‘కేజీఎఫ్’ సినిమాలో ఉన్న డైలాగ్ మాదిరి... ‘ఐ డోంట్ లైక్ వయొలెన్స్... బట్ వయొలెన్స్ లైక్స్ మీ’ (నవ్వుతూ) అన్నట్లు నాకు యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ మూవీ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘హిందీ ‘రామాయణ’ సినిమాలోని సీత పాత్రకు ఆడిషన్ ఇచ్చాను. అప్పటికే ఈ పాత్ర కోసం మేకర్స్ ఆలియా భట్, సాయిపల్లవిలను కూడా సంప్రదించారు. సాయిపల్లవి ఫైనలైజ్ అయ్యారు. అంతేకానీ... నేను ఆ సినిమాను రిజెక్ట్ చేయలేదు. కానీ నేను రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంత పెద్ద సినిమాను నేనెందుకు తిరస్కరిస్తాను’’ అన్నారు. -
తవ్వకం ఆరంభం
కొత్త సినిమా కోసం సరికొత్తగా మారిపోయారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ మిథికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఎన్సీ (నాగచైతన్య) 24–ది ఎక్స్కవేషన్ బిగిన్స్’ (తవ్వకం ఆరంభం) అంటూ ఈ సినిమాకు చెందిన స్పెషల్ వీడియోను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రీప్రొడక్షన్ వర్క్స్, సెట్ వర్క్స్, రిహార్శల్స్, సాంకేతికమైన పనుల ప్రీ వర్క్స్ వంటి విజువల్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ‘‘ఈ సినిమా కోసం నాగచైతన్య శారీరకంగా, మానసికంగా కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అద్భుతమైన కథ, అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో ఓ మైలురాయిలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అజనీష్ బి. లోక్నాథ్, కెమేరా: నీల్ డి. కున్హా. -
నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేరింది
‘‘నేను యాక్టర్ కావాలనుకున్నప్పుడు సూర్య అన్నని కలవాలనుకునేవాణ్ణి. ‘గజినీ’ సినిమా చూసి.. ఆ బాడీ ఏంటి? డ్యాన్స్ ఏంటి? నటన ఏంటి? ఏం చేస్తే ఇవన్నీ వస్తాయో తెలుసుకునేందుకు ఆయన్ని కలవాలని చాలాసార్లు అనిపించేది. కలవాలనే కోరిక ఉన్నా కలవలేకపోయాను. నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేర్చిన ఈ మూమెంట్, ఈ ‘రెట్రో’ సినిమా నా జీవితంలో మరపురాని అనుభూతి’’ అని హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘రెట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నాను.. మేమంతా మీకు అండగా ఉంటాం. నా లైఫ్లో ఒక సినిమాటిక్ మెమొరీ అంటే ‘చంచల...’ (సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమా) పాట వచ్చినప్పుడు... ఆ రోజు నాకు కలిగిన అనుభూతిని ఈరోజు వరకు మరచిపోలేదు. ఇప్పటికీ ఆ పాటని వింటూ నా బాల్యంలోకి వెళుతుంటాను. నాకు ‘పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి’ సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న ‘అగరం ఫౌండేషన్’ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక కశ్మీర్ మనదే.. కశ్మీరీయులు మనవారే. ఇండియా.. పాకిస్తాన్ మీద దాడి చేయాల్సిన పనే లేదు. ఈ దాడులు ఇలానే కొనసాగితే పాకిస్తాన్ వాళ్లకే విరక్తి వచ్చి వారి ప్రభుత్వంపై దాడి చేస్తారు. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను’’ అన్నారు. సూర్య మాట్లాడుతూ–‘‘కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలోప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకుశాంతి చేకూరాలి. ఇలాంటి సంఘటన మళ్లీ ఎప్పుడూ జరగకూడదు. ‘రెట్రో’లో లవ్, కామెడీ, యాక్షన్, ఇంటెన్సిటీ.. అన్నీ ఉంటాయి. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. నాగవంశీగారిది లక్కీ హ్యాండ్ అంటుంటారు. నా తదుపరి చిత్రాన్ని నాగవంశీగారి నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాను. మే 1న విడుదలవుతున్న నాని ‘హిట్–3’ కూడా విజయం సాధించాలి. విజయ్ ‘కింగ్ డమ్’ సినిమా కూడా సక్సెస్ కావాలి. ‘అగరం ఫౌండేషన్’ గురించి విజయ్ మాట్లాడాడు.. అయితే చిరంజీవిగారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మా ‘అగరం ఫౌండేషన్’కి ఎందరో తెలుగువారు అండగా ఉన్నారు’’ అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ–‘‘రెట్రో’ సినిమాని తెలుగులో పంపిణీ చేసే అవకాశం ఇచ్చిన సూర్య సర్కి థ్యాంక్స్. ఈ సినిమాతో మీకు ఇక్కడ బ్లాక్ బస్టర్ ఇస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో ‘రెట్రో’ చిత్ర సహ నిర్మాత కార్తికేయన్ సంతానం, డైరెక్టర్ వెంకీ అట్లూరి, పాటల రచయిత కాసర్ల శ్యాం, నటుడు కరుణాకరన్ మాట్లాడారు. -
ఇదెక్కడి అభిమానం రా బాబు.. ఏకంగా పెళ్లి కార్డుపై మహేశ్
తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. చిన్నా పెద్దా అని సంబంధం ఉండదు. మన భాష పరభాష అనేది పట్టించుకోరు. సినిమా నచ్చితే చాలు.. ఆ మూవీని, సదరు హీరోల్ని గుండెల్లో పెట్టేసుకుంటారు. ఇకపోతే తెలుగులోనూ కొందరు స్టార్ హీరోలకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్లలో కొందరు అప్పుడప్పుడు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. కర్నూలుకు చెందిన సాయి చరణ్ అనే కుర్రాడు.. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వీరాభిమానిలా ఉన్నాడు. ఎందుకంటే వచ్చే నెలలో తన పెళ్లి ఉంది. దీనికోసం ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ పంచుతున్నాడు. అందరిలా కాకుండా తన పెళ్లి పత్రికపై దేవుళ్ల ఫొటోలతో పాటు తను ఎంతో అభిమానించే మహేశ్ బాబు పిక్ కూడా ప్రింట్ చేశాడు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!) దీన్ని కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదెక్కడి అభిమానం రా బాబు అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇదే కాదు గతంలోనూ ఓసారి ఇలానే ఓ అభిమాని.. తన పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫొటోని ముద్రించాడు. అప్పట్లోనూ దాని గురించి మాట్లాడుకున్నారు.మహేశ్ బాబు సినిమాల విషయాలనికొస్తే.. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. 2027లో ఇది రిలీజ్ అవ్వొచ్చని అంటున్నారు. కానీ రాజమౌళితో మూవీ అంటే ఎప్పుడొస్తుందో చెప్పలేం. ప్రస్తుతానికైతే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మే నెలలో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) -
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
అప్పట్లో తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న బబ్లూ పృథ్వీరాజ్.. చాన్నాళ్ల పాటు టాలీవుడ్ కి దూరమైపోయారు. మళ్లీ ఏ క్షణాన 'యానిమల్'లో నటించారో గానీ వరసగా తెలుగు మూవీస్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో తండేల్, సంక్రాంతికి వస్తున్నాం, అర్జున్ సన్నాఫ్ వైజయంతి తదితర చిత్రాల్లో నటించారు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!) కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో పృథ్వీకి మంచి రోల్ పడింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది గానీ పృథ్వీ క్యారెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతేడాది తనకెదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు.'గతేడాది రిలీజైన ఉత్సవం సినిమాలో నేను కూడా నటించా. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నాకు కాల్ వచ్చింది. వేరే షూటింగ్స్ లో ఉంటే అనుమతి తీసుకుని ఇక్కడికి వచ్చా. తీరా ఈవెంట్ కి వచ్చి దర్శకనిర్మాతలని పలకరిస్తే నన్ను సరిగా పట్టించుకోలేదు. సరేలే బిజీలో ఉన్నారేమో అని స్టేజీ ముందు సీట్ లో కూర్చున్నాను. వేరే వాళ్లొచ్చిన ప్రతిసారి నన్ను పక్కకు జరిపేశారు. అలా ఆ వరసలో చివరకెళ్లిపోయా'(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) 'యాక్టర్స్ తో పాటు నా పక్కనే కూర్చున్న సాంగ్ రైటర్, మేకప్ ఆర్టిస్టుని కూడా స్టేజీపై పిలిచారు, నన్ను మాత్రం పట్టించుకోలేదు. ఈవెంట్ చివరలో గ్రూప్ ఫొటో రమ్మని పిలిస్తే స్టేజీపైకి వెళ్లా. అతిథిగా వచ్చిన అనిల్ రావిపూడితో మాట్లాడుతుంటే ఆయన్ని లాక్కెళ్లిపోయారు. ఫొటో దిగుతుంటే వెనక్కి వెళ్లి నిలబడమన్నారు. యానిమల్ మూవీతో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా. కానీ ఇక్కడేంటి ఎవరూ పట్టించుకోవట్లేదేంటి అనుకున్నా. ఆ రోజు మాత్రం చాలా బాధపడ్డాను' అని పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.దిలీప్ ప్రకాశ్ అనే కొత్త కుర్రాడిని పరిచయం చేస్తూ తీసిన సినిమా ఉత్సవం. రెజీనా హీరోయిన్. బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, ప్రియదర్శి, నాజర్, ఆమని, పృథ్వీరాజ్.. ఇలా చాలామంది స్టార్స్ నటించారు. కానీ మూవీ ఫ్లాప్ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) -
హీరోయిన్లు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరన్నది నిజం: సిమ్రాన్
రెండు కొప్పులు ఒకచోట ఇమడవు అంటుంటారు. అది నిజమే అంటోంది హీరోయిన్ సిమ్రాన్ (Simran). ఈమె ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అతిథి పాత్రలో నటించింది. సినిమా రిలీజయ్యాక జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. నేను ఆంటీ రోల్స్ చేస్తున్నానని ఓ నటి ఎగతాళి చేసిందని తెలిపింది. పనికిమాలిన డబ్బా పాత్రల్లో నటించడం కంటే అమ్మ, ఆంటీ రోల్స్ చేయడం ఎంతో ఉత్తమం అని స్టేజీపైనే నటికి కౌంటర్ ఇచ్చింది.లైలా? జ్యోతిక? ఎవరన్నారు?లైలా గురించే సిమ్రాన్ ఈ కామెంట్స్ చేసిందన్న ప్రచారం జరిగింది. మరికొందరేమో డబ్బా అన్న పదం వాడిందంటే డబ్బా కార్టెల్ సిరీస్లో నటించిన జ్యోతికపై ఈ వ్యాఖ్యలు చేసిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా సిమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ఆమె మాటల వల్ల నాకు నిజంగా బాధేసింది. అందుకే నా బాధను చెప్పుకున్నాను. కెరీర్ ఆరంభం నుంచే నేను ఆంటీ పాత్రలు చేస్తున్నాను. ఆంటీ అనే పదం ఇష్టంఆంటీ అనే పదాన్ని అవమానంగా ఫీలవను.. ఇష్టంగానే భావిస్తాను. ఆ పాత్రలు చేయడం తప్పేం కాదు. ఇదంతా జరిగాక నాకో విషయం అర్థమైంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లెప్పుడూ ఫ్రెండ్స్ కాలేరని రుజువైంది. ఫ్రెండ్ అనుకున్నవాళ్లే మనపై అలాంటి కామెంట్లు చేస్తే మనసుకు బాధగా అనిపిస్తుంది. ఆమె తర్వాతిరోజు క్యాజువల్గానే మాట్లాడింది. కానీ మా స్నేహం మునుపటిలా మాత్రం కొనసాగదు అని సిమ్రాన్ చెప్పుకొచ్చింది. కానీ తనపై సెటైర్లు వేసిందెవరన్నది మాత్రం సిమ్రాన్ వెల్లడించలేదు.చదవండి: తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు -
స్టైల్ మార్చిన బేబీ.. చీరలో అనసూయని ఇలా చూశారా?
చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ అనసూయస్టైల్ మార్చి సరికొత్తగా తయారైన బేబి వైష్ణవి చైతన్యచీరలో నడుము అందాలు చూపించేస్తున్న శ్రీముఖిపొట్టి డ్రస్సులో రచ్చ లేపుతున్న దిశా పటానీబ్లూ కలర్ డ్రస్సులో హీరోయిన్ సమంత క్లాస్ లుక్రోజురోజుకీ హాట్ నెస్ పెంచేస్తున్న ఈషా రెబ్బాబీచ్ ఒడ్డున హాట్ హాట్ లుక్ లో సుప్రీత View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
మే 9.. మెగా ఫ్యాన్స్ కి రెండు ట్రీట్స్
మే 9న అనగానే తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిన రోజు అని అంటారు. ఎందుకంటే అదే రోజున రిలీజై హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా చిరు చిత్రాలు ఆ రోజున రిలీజైనవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి. ఇప్పుడు అదే తేదీన మెగా ఫ్యాన్స్ కి రెండు ట్రీట్స్ ఉండబోతున్నాయి.మొదటి దాని విషయానికొస్తే రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతడి మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మే 9నే ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాల్ని పెట్టగా.. ఇప్పుడు చరణ్ ఆ లిస్టులోకి చేరబోతున్నాడు.(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) మరోవైపు చిరు కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఒకటి. దీన్ని మే 9న రీ రిలీజ్ చేయబోతున్నారు. 2డీ, 3డీ వెర్షన్ తో ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గతంలో మే 9నే ఈ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇలా ఒకేరోజున మెగా అభిమానులకు రెండు ట్రీట్స్ రాబోతున్నాయనమాట. లెక్క ప్రకారం మరొకటి కూడా ఉండాలి. అదే 'హరిహర వీరమల్లు'. పవన్ కల్యాణ్ నటించిన ఈ లేటెస్ట్ చిత్రాన్ని మే 9నే రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఈసారి కూడా వాయిదా గ్యారంటీ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) -
ఆసక్తికరంగా ‘యముడు’ కొత్త పోస్టర్
ప్రస్తుతం మైథలాజికల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్నాధ పిక్చర్స్ బ్యానర్పై జగదీష్ ఆమంచి హీరోగా, దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘యముడు’. ఈ చిత్రానికి ‘ధర్మో రక్షతి రక్షితః’ ఉపశీర్షిక. శ్రావణి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ సరికొత్త పోస్టర్ విడుదలైంది.గతంలో విడుదలైన ‘యముడు’ టైటిల్ పోస్టర్, దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ఈ కొత్త పోస్టర్ మరింత శక్తివంతంగా, ఆకర్షణీయంగా ఉంది. జగదీష్ యముడి రూపంలో భయంకరంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేశారు. వెనుక ఉన్న మహిషాకారం, యముడి చేతిలోని సంకెళ్లు వంటి విజువల్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.హీరోయిన్ను యమపాశంతో బంధించిన దృశ్యం, యముడి ఆహార్యంలో జగదీష్ కనిపించిన తీరు రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది. -
పారితోషికంగా నోట్ల కట్టలు.. హైదరాబాద్ కింగ్ నేనే అన్నట్లు తిరిగా: నాని
తొలి సంపాదన ఎవరికైనా ప్రత్యేకమే.. చాలామంది మొదటి జీతంతో అమ్మానాన్నకు ఏదైనా గిఫ్ట్ ఇస్తుంటారు. లేదంటే వారికోసమే ఏదైనా వస్తువు, దుస్తులు కొనుక్కుంటారు. అదీ కాదంటే భద్రంగా దాచిపెట్టుకుంటారు. తాజాగా హీరో నాని (Nani) తన తొలి సంపాదన గురించి ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చాడు. నాని మాట్లాడుతూ.. నా మొదటి జీతం రూ.2,500. క్లాప్ అసిస్టెంట్గా పని చేసినందుకుగానూ రెండున్నర వేలు ఇచ్చేవారు. కాకపోతే అది డబ్బు రూపంలో కాకుండా చెక్ ఇచ్చారు.చెక్ బౌన్స్..అయితే ఆ నిర్మాణ సంస్థ ఏదో కారణాల వల్ల వేరే బ్యాంకుకు మారిపోయింది. అప్పటికే అందరూ చెక్లో రాసిన మొత్తాన్ని బ్యాంకులో వేసుకున్నారు. నేను మాత్రం చెక్ చూపించుకుంటూ తిరిగాను. 20 రోజుల తర్వాత డబ్బులు డ్రా చేద్దామంటే చెక్ బౌన్స్ అయింది. తర్వాత వెళ్లి అడగడం ఇష్టం లేక దాన్నలాగే దాచుకున్నాను. ఆ డబ్బులు నాకు రాకపోయినా మంచి జ్ఞాపకంగా ఉండిపోయింది.తొలి పారితోషికం..రెండో సినిమా అల్లరి బుల్లోడుకు (అసిస్టెంట్ డైరెక్టర్గా) మొదటి నెల రూ.4000 పారితోషికం ఇచ్చారు. చెక్ మాత్రం వద్దని చెప్తే వంద రూపాయల నోట్లు ఇచ్చారు. ఆ నోట్ల కట్టను జేబులో పెట్టుకుని నేనే హైదరాబాద్ కింగ్ అన్నట్లుగా తిరిగాను. నా ఫ్రెండ్స్ను బయటకు తీసుకెళ్లాను. దానితోపాటు తర్వాతి మూడు నెలల జీతం దాచిపెట్టి అమ్మానాన్నకు ఉంగరాలు చేయించాను అని చెప్పుకొచ్చాడు.అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయాణంనాని.. అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ మొదలుపెట్టాడు. రాధా గోపాలం, అల్లరి బుల్లోడు, అస్త్రం, ఢీ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారాడు. స్నేమితుడా, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, జెంటిల్మన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, జెర్సీ, శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న.. ఇలా అనేక సినిమాలు చేశాడు.నెక్స్ట్ ఏంటి?చివరగా సరిపోదా శనివారం సినిమాతో అలరించాడు. ప్రస్తుతం హిట్ 3 మూవీ చేస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా యాక్ట్ చేసింది. మరోవైపు నాని.. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ద ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు.చదవండి: ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడింతేనేమో! -
కాపీ రైట్స్ కేసు.. దిల్రాజుకు మధ్యంతర రక్షణ కొనసాగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (Dil Raju)కు ఇచ్చిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు కొనసాగించింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాపీరైట్ వివాదానికి సంబంధించి నిర్మాత వి.వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇప్పటికే మధ్యంతర రక్షణ ఇచ్చింది. అంతేగాక తదుపరి విచారణ వరకు దిల్ రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. శుక్రవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా మధ్యంతర రక్షణను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏమిటీ కేసు?‘నా మనసు నిన్ను కోరే నవల‘ ఆధారంగా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్ముడి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. దీంతో మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న సిటీ సివిల్ కోర్టు, సాక్ష్యాలను పరిశీలించి దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని 2019లో ఆదేశించింది. మధ్యంతర రక్షణఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దిల్రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. దిల్ రాజుపై చర్యల విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను కొనసాగించిన జస్టిస్ జె.బి.పార్ధీవాలా ధర్మాసనం, తదుపరి విచారణను వాయిదా వేస్తూ.. అప్పటి వరకు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.చదవండి: ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో! -
ఆపరేషన్ అనంతరం వెకేషన్లో యాంకర్ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో!
యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఇటీవల తీవ్ర అనారోగ్యంపాలైంది. రక్తస్రావం, భుజం నొప్పి సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఆపరేషన్ కూడా అయింది. గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ (గడ్డలు)ను ఆపరేషన్ చేసి తొలగించారని రష్మీ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఏప్రిల్ 18న తనకు శస్త్ర చికిత్స జరిగిందని.. ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. డాక్టర్ల సూచన మేరకు మూడువారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపింది.బాలి దీవుల్లో రష్మీఅయితే పనికి ఎలాగో బ్రేక్ ఇచ్చిన రష్మీ.. ఈ మండుటెండల్లో కాస్త సేద తీరేందుకు విహారయాత్రకు వెళ్లింది. ఫ్రెండ్స్తో కలిసి బాలి దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. పండ్లు, కేక్ ఇష్టంగా ఆరగిస్తోంది. అవే కాకుండా డాక్టర్ రాసిచ్చిన మందుల్ని కూడా క్రమం తప్పకుండా వేసుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటోలన్నింటినీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. "రెండు నెలల క్రితం ఈ ట్రిప్ ప్లాన్ చేశాం. కాకపోతే ఆటలుపాటలు.. ఇలా ఫుల్ ఎంజాయ్ చేయాలనుకున్నాం.దేవుడే ఇలా చేస్తాడేమో!తీరా చూస్తే ఇప్పుడు తినడం, పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం.. వీటితోనే సరిపెట్టుకుంటున్నాం. విహారయాత్రల్లో ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదు. బహుశా దేవుడు.. మనకు జీవితంలో అన్నీ తెలుసుకునేందుకు ఇలా చేస్తాడేమో! ప్రస్తుతం బాలిలోని ఓ విల్లాలో నా ఫ్రెండ్స్ గ్యాంగ్తో సేద తీరుతున్నా.." అని రష్మీ క్యాప్షన్లో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) చదవండి: ప్రియదర్శికి స్టార్ హీరో దంపతుల సర్ప్రైజ్.. ఇంతకీ అదేంటంటే? -
'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇటీవల తన కొరియోగ్రఫీతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. డాకుమహారాజ్ దబిడి దిబిడి సాంగ్పై కూడా విమర్శలొచ్చాయి. ఆ తర్వాత మరో సాంగ్ విషయంలోనూ ఇదే జరిగింది. అలా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కాస్తా శృతి మించిపోయిందని చాలా మంది కామెంట్స్ చేశారు. అలాగే ఆయన ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ షోలో జాను లిరిని అభినందించడంతో ఆయనపై పలు రూమర్స్ వచ్చాయి. వీరిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. ఈ విషయంపై తాజాగా ఓ పాడ్కాస్ట్లో స్పందించారు. దీనిపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మహిళా డ్యాన్సర్ జాను విషయంలో తనని ఉద్దేశించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ఎంతో బాధించాయని ఆయన తెలిపారు.ఈ వివాదంపై జానీ మాస్టర్ మాట్లాడుతూ.. 'కొరియోగ్రాఫర్లకు పని విషయంలో ఒత్తిడి ఉంటుంది. అయితే టీవీ షోలకు విషయం అలా ఏం ఉండదు. ఒక షోలో జడ్జ్గా వ్యవహరించడం రిలాక్స్గానే ఉంటుంది. నేను ఆ సీట్లో కూర్చున్నప్పుడు చాలా నిజాయితీగా ఉండాలి. అప్పుడు ఆ షోకు వచ్చిన వాళ్లలో ఆ అమ్మాయి బాగా చేసిందనిపించింది. అందుకే జాను బాగా చేశావని చెప్పా. దాన్ని పట్టుకుని జనాలు నేనేదో చేశానని అంటున్నారు. కానీ ఆ అమ్మాయికి టాలెంట్ ఉంది కాబట్టే విన్నర్ అయింది.. అది జరిగిందక్కడ. దాన్ని కొంతమంది వేరుగా అర్థం చేసుకున్నారు. మా మధ్య ఏం లేదని మా యూనిట్ అందరికీ తెలుసు. అక్కడ ఏదైనా ఉంటే మీరు అనండి. అసలు ఆ షో తర్వాత అమ్మాయి ఎవరో కూడా తెలియదు. సోషల్మీడియాలో నా పోస్టులకు ఆమె గురించి కామెంట్స్ పెట్టేవారు. ఆ సమయంలో నేను ఎంతో బాధపడ్డా. ఆమెకు కుటుంబం ఉంది.. నాకు ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు' అని అన్నారు. సినీ ఇండస్ట్రీలో సైతం కొరియోగ్రాఫర్ల మధ్య ఎలాంటి గొడవలు లేవని శేఖర్ మాస్టర్ తెలిపారు. -
ప్రియదర్శికి స్టార్ హీరో దంపతుల సర్ప్రైజ్.. ఇంతకీ అదేంటంటే?
టాలీవుడ్ హీరో ప్రియదర్శి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే కోర్ట్ మూవీతో సక్సెస్ అందుకున్న ప్రియదర్శి మరో మూవీతో ప్రేక్షకులు ముందుకొచ్చారు. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో వచ్చిన సారంగపాణి జాతకం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే సక్సెస్ టాక్ రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.ఇదిలా ఉండగా కోర్ట్ మూవీలో ప్రియదర్శి లాయర్ పాత్రలో అభిమానుల ముందుకొచ్చారు. ఈ పాత్రలో తనదైన నటనతో అందరినీ కట్టిపడేశారు. ఈ మూవీపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ మూవీలో ప్రియదర్శి నటనపై కోలీవుడ్ స్టార్ దంపతులు సైతం ఫిదా అయ్యారు. తాజాగా సూర్య, జ్యోతిక జంట ప్రియదర్శి నటనను కొనియాడారు. ప్రియదర్శికి ఓ ఫ్లవర్ బొకేతో పాటు చిన్న లెటర్ను పంపించారు. ఈ విషయాన్ని ప్రియదర్శి ట్విటర్లో షేర్ చేశారు.ప్రియదర్శి తన పోస్ట్లో రాస్తూ.. 'మీరు పంపిన సందేశం, పువ్వులు అందుకోవడం నా హృదయాన్ని తాకింది. ఈ ఫీలింగ్ను మాటల్లో చెప్పలేను. ఇద్దరు న్యాయవాదులు చంద్రు, వెంబా వెనక నుంచి గర్వంగా తట్టినట్లుగా అనిపించింది. నన్ను బాగా ప్రేరేపించిన ఆ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. కాగా..కోర్ట్ మూవీలో జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ప్రియదర్శి కనిపించారు. Dear @Suriya_offl Anna, #Jyothika maam,Receiving your message and flowers filled my heart beyond words. It felt like getting a proud pat on the back from Advocates Chandru and Venba — the two who inspired me the most. Thank you so much ❤️Humbly in Surya Teja words - Ungaloda… pic.twitter.com/6fsspU6tAf— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) April 25, 2025 -
‘మన ఇద్దరి ప్రేమ కథ’ ఎలా ఉందంటే..
ఇక్బాల్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన ఇద్దరి ప్రేమ కథ’. ప్రేమ కథలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది. హీరోహీరోయిన్లతో సంబంధం లేకుండా..మంచి లవ్స్టోరీ అయితే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే యంగ్ డైరెక్టర్స్ ఎక్కువగా ప్రేమ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. వాటిలో చాలా వరకు సక్సెస్ సాధించాయి. అలా ఈ వారం వచ్చిన తాజా ప్రేమ కథ చిత్రమే ‘మన ఇద్దరి ప్రేమ కథ’. ఇక్బాల్ హీరోగా నటించి, దర్శకత్వం వహించి నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాంకథేంటంటే..నాని(ఇక్బాల్), శృతి(మోనికా) అనాథలు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇద్దరు కలిసి బీచ్కి వెళ్తారు. అక్కడ అను(ప్రియా జస్పర్)తో నానికి పరిచయం ఏర్పడుతుంది. ఆమె రాకతో ఇద్దరి మధ్య బంధం బలహీనపడుతుంది. అదే సమయంలో నాని, అను ఇద్దరి సన్నిహిత వీడియో వైరల్ అవుతుంది. దీంతో సమీప గ్రామస్తులు వారిద్దరికీ వివాహం జరిపిస్తారు. అయితే శృతిని ప్రేమించిన నాని.. అనుకోకుండా పెళ్లి చేసుకున్న అనుతో కాపురం చేశాడా? ఈలోగా నాని ఎలాంటి పోరాటాలను ఎదుర్కొంటాడు? క్లైమాక్స్ సన్నివేశాల్లో షాకింగ్ డెవలప్మెంట్ ఏమిటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..‘మన ఇద్దరి ప్రేమకథ’ అనేది మెసేజ్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీ. క్లైమాక్స్ షాకింగ్గా ఉండడంతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తుంది. డైరెక్టర్, హీరో అయిన ఇక్బాల్ కథ రాసుకున్న విధానం బాగుంది. దానికితోడు కథను నడిపించిన విధానం కూడా బాగుంది. ఎన్నో ముఖ్యమైన అంశాలతో కథను విజయవంతంగా నడిపించిన ఇక్బాల్ను అభినందించాలి.ఇక ఈ సినిమాలో లోపాలు , హైలెట్స్ విషయానికి వస్తే రియలిస్టిక్ కథ తో చేసిన ప్రయత్నం బాగుంది కానీ కథనం కాస్త సాగదీత అనిపిస్తుంది. ఫస్టాఫ్ రొటీన్గా సాగుతుంది. సెకండాఫ్లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్లో ఇచ్చిన సందేశం అందరిని ఆలోచింపజేస్తుంది.ఎవరెలా చేశారంటే..పక్కింటి అబ్బాయి పాత్రలో ఇక్బాల్ నటన బాగుంది. అతని ముఖ కవళికలు, హావభావాలు చాలా సహజంగా ఉంటాయి. ఇక్బాల్ తన నటనతో సినిమాను ప్రేక్షకుల గుండెల్లో నిలిచేలా చేశాడు. హీరోయిన్ ప్రియా జస్పర్ తెరపై ముద్దుగా ఉంది. తన నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రను ఆకట్టుకునే విధంగా చేసింది. మరో హీరోయిన్ మోనికా కూడా అంతే బాగుంది. మాజీ ప్రేమికుల పాత్రలో బాగానే నటించింది.సాంకేతిక విషయాలకొస్తే.. సంగీత దర్శకుడు రాయన్ సినిమా కు పెద్ద ఏసెట్ అనుకోవచ్చు... ఇక సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. సినిమాలో సహజమైన లొకేషన్లను చక్కగా చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదునుపెట్టాల్సింది. పరిమిత బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా నిర్మాణ విలువలు కొంతవరకు బాగున్నాయి. -
బన్నీకి రౌడీ హీరో సర్ప్రైజ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీలో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ.. మన బన్నీకి మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు అభిమానం చాటుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్కు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు విజయ్.తాజాగా విజయ్... తన రౌడీ బ్రాండ్ స్టోర్ను హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీకి రౌడీ బ్రాండ్ టీషర్ట్స్ను, పిల్లల కోసం కొన్ని బర్గర్లను పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను పంచుకున్న బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్ అంటూ అని తన స్టోరీస్లో రాసుకొచ్చారు. కాగా.. గతంలోనూ అల్లు అర్జున్కు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా పుష్ప పేరుతో కూడిన టీ షర్ట్లను పంపారు.మరోవైపు పుష్ప-2 తర్వాత బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో జత కట్టనున్నారు. జవాన్ మూవీతో హిట్ అందుకున్ అట్లీ దర్శకత్వంలో నటించునున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది. -
ఆ అనుబంధానికి పేరు పెట్టలేను!:సమంత
‘‘జీవితంలో మనం తీసుకునే ఒక నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఎవరైనా అలా నిర్ణయిస్తే అది అబద్ధమే అవుతుంది. తెలిసీ తెలియక తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కెరీర్పై ప్రభావం చూపుతాయి’’ అని సమంత అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల నిర్వహించిన ‘గోల్డెన్ క్వీన్’ పురస్కారాల్లో’ గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకున్నారు సమంత.అనంతరం ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. నా అదృష్టంతోపాటు నేను పడిన కష్టమే ఈరోజు ఇంతమంది అభిమానం సంపాదించుకోవడానికి కారణం అయింది. ఇది దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను’’ అని చె΄్పారు సమంత. ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నా ఆరోగ్యం బాగాలేనప్పుడు రాహుల్ రవీంద్రన్ (నటుడు, దర్శకుడు) ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు.మా అనుబంధానికి పేరు పెట్టలేను. ఫ్రెండా? సోదరుడా? కుటుంబ సభ్యుడా? రక్త సంబంధీకుడా? అనేది చెప్పలేను’’ అన్నారు. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే... ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. అలాగే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న రిలీజ్ కానుంది. -
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
పవన్ కల్యాణ్ ఏళ్లకేళ్లుగా చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. నాలుగైదేళ్లుగా సెట్స్ మీదే ఉంది. మే 9న పక్కా థియేటర్లలోకి వస్తామని పోస్టర్స్ మీద పోస్టర్లు వదిలారు. తీరా చూస్తే ఇప్పుడు సౌండ్ లేదు. దీంతో వాయిదా లాంఛనమే. మరోవైపు ఈ తేదీని ఇప్పుడు మరికొన్ని తెలుగు మూవీస్ పట్టేస్తున్నాయి. (ఇదీ చదవండి: రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్) మే 9 టాలీవుడ్ కి చాలా అచ్చొచ్చిన తేదీ. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి.. ఇలా చెప్పుకొంటూపోతే ఆ రోజున థియేటర్లలో రిలీజై హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. 'హరిహర..' కూడా అదే తేదీ అనేసరికి ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ఇప్పుడు మే 23న లేదంటే జూన్ 4న రావొచ్చని టాక్ వినిపిస్తుంది.పవన్ సినిమా వాయిదా లాంఛనమే అని తెలియడానికి మరోలా కూడా క్లారిటీ వచ్చింది. కొన్నిరోజుల క్రితం సమంత నిర్మించిన 'శుభం' మూవీ ఇదే తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు శ్రీ విష్ణు '#సింగిల్' కూడా మే 9న థియేటర్లలోకి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇలా వరస చిత్రాలు ఆ తేదీన రాబోతున్నాయంటే పవన్ మూవీ మరోసారి వాయిదా పడ్డట్లేగా.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
తెలుగులో చాలామంది సీరియల్ యాక్టర్స్ ఉన్నారు. కాకపోతే వీళ్లలో చాలామంది ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్స్, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో అంజలి ఒకరు. గతంలో 'మొగలిరేకులు' సీరియల్ నటించిన ఈమెకు ఇదివరకే కూతురు ఉండగా.. ఇప్పుడు మరోసారి శుభవార్త చెప్పింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 'మొగలిరేకులు'లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అంజలి.. దీని తర్వాత రాధా కల్యాణం, దేవత, శివరంజని తదితర సీరియల్స్ చేసింది. వీటితో పాటు మరికొన్నింటిలో నెగిటివ్ పాత్రల్లోనూ నటించింది. అలానే లెజెండ్, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన ఈమె.. 2017లో సంతోష్ పవన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు చందమామ అనే కూతురు కూడా ఉంది.కొన్నేళ్ల క్రితం భర్తతో కలిసి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన అంజలి.. తన కూతురితో తీసుకున్న వీడియోలు, మిగతా వాటిని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది. ఇప్పుడు తన భర్తకు ప్రెగ్నెన్సీ విషయమై సర్ ప్రైజ్ ఇచ్చింది. అంతకు ముందు కూతురికి తమ్ముడు కావాలా? చెల్లి కావాలా? అని అడిగిన అంజలి.. భర్తకు దీని గురించి సర్ ప్రైజ్ ఇచ్చి ఎమోషనల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఛానెల్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈమె సహ నటీనటులు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: శోభాశెట్టి నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?) -
చీరలో అనసూయ ఇలా.. అంజలి ఏమో అలా
చీరలో ముత్యంలా మెరిసిపోతున్న అనసూయవయసుతో పాటు అందాన్ని పెంచేస్తున్న అంజలిఅమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేలా రీతూవర్మనెదర్లాండ్స్ ట్రిప్ లో యాంకర్ కమ్ హీరోయిన్ దీపిక పిల్లిడార్క్ లైట్ పోజుల్లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్పెట్ క్యాట్ తో కలిసి ట్రెండింగ్ రీల్ చేసిన పాయల్ రాజ్ పుత్వజ్రంలా మెరిసిపోతున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) -
నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?
బిగ్ బాస్ షోలో ప్రతిసారి 15 మందికి పైగా పాల్గొంటారు. కానీ అందులో ఒకరో ఇద్దరో మాత్రం పాపులారిటీ సంపాదిస్తాడు. అలా ఏడో సీజన్ లో పాల్గొని తనదైన మాటలతో గుర్తింపు తెచ్చుకుంది శోభాశెట్టి. 'కార్తీకదీపం' మోనితగా ఎంత విలనిజం చూపించిందో.. షోలోనూ అలానే కనిపించింది.శోభాశెట్టి స్వతహాగా కన్నడ అమ్మాయి. అయితేనేం సొంత భాషతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసింది. మంచి ఫేమ్ సంపాదించుకుంది. అదే ఊపులో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ లో పాల్గొంది. షో వల్ల ఈమెపై బాగా నెగిటివిటీ పెరిగిపోయింది. తర్వాత తెలుగులో కొత్తగా సీరియల్స్ ఏం చేయలేదు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) షోలో ఉన్నప్పుడే ఈమె ప్రేమ విషయం బయటపడింది. తనతో పాటు సీరియల్స్ చేసిన తెలుగు నటుడు యశ్వంత్ రెడ్డితో ఈమె చాలాకాలంగా ప్రేమలో ఉంది. కానీ బిగ్ బాస్ షోలో నాగార్జున దీన్ని బయటపెట్టాడు. అలా శోభా లవ్ స్టోరీ అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే గతేడాది వీళ్లిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. శోభా కొత్తగా ఇల్లు కూడా కట్టుకుంది.తాజాగా తన నిశ్చితార్థం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మరోసారి ఆ ఫొటోలు పోస్ట్ చేసింది. తొలి వార్షికోత్సవం అని రాసుకొచ్చింది. ఐదేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామనే విషయాన్ని బయటపెట్టింది. అంతా బాగానే ఉంది కానీ పెళ్లెప్పుడు చేసుకుంటారనేది మాత్రం చెప్పలేదు. మరి ఈ ఏడాది ఏమైనా శుభవార్త చెబుతారా? లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: భర్తతో కలిసి కాస్ట్ లీ కారు కొన్న హీరోయిన్) -
‘కొరగజ్జ’ కోసం కొత్త ప్రయోగం చేశా: సంగీత దర్శకుడు గోపీ సుందర్
‘కొరగజ్జ’చిత్రానికి సంగీతం కంపోజ్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సంగీతంలో కొత్త ప్రయోగాల్ని చేయాల్సి వచ్చింది. గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకే కాస్త ఎక్కువ సమయం పట్టింది’అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు గోపీ సుందర్. త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్పై సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొరగజ్జ’. కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలలో పూజించబడే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పారు.‘ఈ చిత్రానికి సంగీతం కంపోజ్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సంగీతంలో కొత్త ప్రయోగాల్ని చేయాల్సి వచ్చింది. గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకే కాస్త ఎక్కువ సమయం పట్టింది. నాటి ఆచారాలను, సంప్రదాయాల్ని అర్థం చేసుకున్న తర్వాత నాకు ఈ ట్యూన్స్ వచ్చాయి. దర్శకుడికి నా పని నచ్చినందుకు, నేను ఇచ్చిన మ్యూజిక్ నచ్చినందుకు సంతోషంగా ఉంది. ‘కొరగజ్జ’ కథాంశం కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి, కొత్త శైలిని కనిపెట్టడానికి నాకు వీలు కల్పించింది. ఈ చిత్రం నాకు ఎంతో సవాలుగా అనిపించింది’ అని అన్నారు.ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయి, వీటిని వివిధ శైలి, భాషల్లో స్వరపరిచారు. ఈ పాటలకు సుధీర్ అత్తవర్ స్వయంగా సాహిత్యం అందించారు. ఈ చిత్రంలో శ్రేయ ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, స్వరూప్ ఖాన్, అర్మాన్ మాలిక్ వంటి ప్రతిభావంతులైన గాయకులు పాటలు పాడారు. నాటి ఆచారాలను, సంప్రదాయాల్ని అర్థం చేసుకున్న తర్వాత నాకు ఈ ట్యూన్స్ వచ్చాయి. దర్శకుడికి నా పని నచ్చినందుకు, నేను ఇచ్చిన మ్యూజిక్ నచ్చినందుకు సంతోషంగా ఉంది. ‘కొరగజ్జ’ కథాంశం కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి, కొత్త శైలిని కనిపెట్టడానికి నాకు వీలు కల్పించింది. ఈ చిత్రం నాకు ఎంతో సవాలుగా అనిపించింది’ అన్నారు."కాంతార" సినిమా కంటే ఎంతో భిన్నంగా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. వేల దేవతలకు నిలయమైన కర్ణాటక, కేరళ గొప్ప సాంస్కృతిక వారసత్వంలో ‘కాంతార’ ఒకరిని మాత్రమే చూపించింది. దీనిపై EP శ్రీ విద్యాధర్ శెట్టి సహాయంతో దర్శకుడు సుధీర్ అత్తవర్ పరిశోధన చేశారు. ‘కాంతార’ తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మల్టీ లాంగ్వేజెస్లో విడుదల కానుంది.ఇందులో కబీర్ బేడి, ప్రఖ్యాత కొరియోగ్రాఫర్లు సందీప్ సోపార్కర్, గణేష్ ఆచార్య, దక్షిణాది అగ్ర నటులు భవ్య, శ్రుతి మరెంతో అద్భుతమైన సమిష్టి తారాగణం పని చేసింది. మనోజ్ పిళ్ళై సినిమాటోగ్రఫీ, జిత్ జోషి, విద్యాధర్ శెట్టి ఎడిటింగ్, బిబిన్ దేవ్ సౌండ్ డిజైనింగ్, మూడుసార్లు కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకున్న డిఐ కలరిస్ట్ లిజు ప్రభాకరన్ డిఐ, లవన్-కుషన్ విఎఫ్ఎక్స్ & గ్రాఫిక్స్ వంటి అసాధారణ సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేసింది. ఇక ఈ మూవీ ఆడియో రైట్స్ కోసం భారీ రేటుని చెల్లించేందుకు పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి. -
నాన్సెన్స్ అంటున్నా... కుర్రహీరోయిన్లతో ఆగని సీనియర్ హీరోల రొమాన్స్..!
‘‘అవును రష్మికతో చేస్తున్నా..తర్వాత ఆమె కుమార్తెతో కూడా నటిస్తా..మీకేంటి ప్రాబ్లమ్?’’ అంటూ తీవ్ర స్వరంతో అడిగిన సల్మాన్ఖాన్ ప్రశ్నలో విసుగును గమనించారా? మన దేశంలో అనేక భాషలకు చెందిన వయసు పైబడిన హీరోలు అందరిలో పైకి కనపడని చిరాకులకు అది ప్రతిరూపంగా చెప్పొచ్చు. కొంత కాలంగా సీనియర్ హీరోలు తమకు జోడీ కడుతున్న హీరోయిన్ల విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్కు గురవుతున్నారు.వృధ్ధాప్యానికి చేరువలో ఉన్న నటులు తమకన్నా చాలా తక్కువ వయస్సు గల మహిళా కథానాయకులతో జతకట్టడం అనేది ఇటీవల తరచూ వివాదాలు విమర్శలకు కారణమవుతోంది. కొందరు దీనిని దీనిని వృత్తి పరమైన అంశంగా సమర్థిస్తున్నారు. మరికొందరు, ఇది హానికరమైన మూస పద్ధతులను కొనసాగిస్తుందని వయసు పెరిగిన నటీమణులకు అవకాశాలను పరిమితం చేస్తుందని వాదిస్తున్నారు.తమ కన్నా బాగా తక్కువ వయసు ఉన్న వారితో రొమాంటిక్ పాత్రలలో పెద్ద వయసున్న మగవాళ్లు నటించడం అనేది ఈనాటిది కాదు ఇది ఎప్పటి నుంచో సర్వసాధారణంగా మారింది.. అయితే చర్చా వేదికలు పెరగడం, భావ వ్యక్తీకరణ మార్గాలు విస్త్రుతం కావడంతో ఇప్పుడు ఈ తరహా రొమాన్స్ను నాన్సెన్స్గా తిట్టిపోయడం కూడా పెరుగుతోంది.ఒకప్పుడు సీనియర్ హీరోలుగా ఉన్న ఎన్టీయార్, ఏయన్నార్లు తమ కన్నా చాలా చిన్న వయసు అమ్మాయిల పక్కన నటించినా...ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనపడవు. అదేపని ఇప్పుడు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలు చేస్తే మాత్రం విమర్శకులు నోళ్లకు పదను పెడుతున్నారు. అందుకే బాలకృష్ణ గత కొంత కాలంగా హీరోయిన్లతో రొమాన్స్ చేసే పాత్రలకు బదులు తన వయసుకు తగ్గ పాత్రలతో సరిపెట్టుకుంటున్నాడు. వయసు కనపడనీయని నాగార్జున మన్మధుడు 2లో రకుల్కి ముద్దొచ్చాడేమో కానీ... మరోవైపు విమర్శకుల నోటికి బాగా పనిచెప్పాడు. అలాగే హీరో రవితేజ కూడా గత కొంత కాలంగా ఇదే విషయంలో విమర్శలు ఎదుర్కుంటున్నాడు.హీరోలు తమకన్నా కనీసం 20 ఏళ్ల వయసు తక్కువ ఉన్న యువతులతో నటించడం బాలీవుడ్లో సర్వసాధారణం. ఎప్పుడో 1980లలోనే దయావన్ లో వినోద్ ఖన్నా తనకన్నా 21 ఏళ్ల చిన్నదైన మాధురి దీక్షిత్తో ఆన్స్క్రీన్ రొమాన్స్ చేశాడు. నిశ్శబ్ద్లో, సీనియర్ అమితాబ్ బచ్చన్ తన కంటే 46 ఏళ్లు చిన్న వయస్సులో ఉన్న జియాఖాన్ తో కలిసి నటించాడు. ఇక దీపికా పదుకొణె ఓం శాంతి ఓం చిత్రంలో తనకన్నా 20 ఏళ్ల సీనియర్ షారూఖ్ ఖాన్ పక్కన తెరంగేట్రం చేసింది. కాగా, రబ్ నే బనా ది జోడిలో అరంగేట్రం చేసిన అనుష్క శర్మ షారూఖ్ కంటే 23 ఏళ్లు చిన్నది. గజినిలో అమీర్ ఖాన్, సహ నటి కంటే 20 సంవత్సరాలు పెద్దవాడు. 44 ఏళ్ల అజయ్ దేవగన్ 23 ఏళ్ల తమన్నాతో కలిసి హిమ్మత్వాలా చేశాడు.ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో సినిమాలు కనిపిస్తాయి. అయితే ఈ ట్రెండ్ తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోన్నట్టు కనిపిస్తోంది. సల్మాన్ఖాన్ ఏక్ థా టైగర్లో తనకన్నా 19 ఏళ్లు చిన్నదైన కత్రినా కైఫ్తో నటించాడు. దబాంగ్లో 20 ఏళ్ల చిన్నదైన సోనాక్షి సిన్హా తో నటించాడు. ఇప్పుడు ఏకంగా తనకన్నా 32ఏళ్ల చిన్నదైన రష్మిక మందన్నతో జోడీ కట్టాడు. మరోవైపు మన మెగాస్టార్ చిరంజీవి కూడా తన సమకాలీకుడైన కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్తో స్టెప్స్ వేయడం చూశాం.ఈ పరిస్థితి మారాలని, హీరోలు వయసుకు తగినట్టుగా తమ జోడీలను ఎంచుకోవాలనే డిమాండ్ ఎప్పుడూ లేనంత స్థాయిలో వినిపిస్తోంది. పాత చింతకాయ పచ్చడి లాంటి రొడ్డకొట్టుడు ధోరణికి చెక్ పెట్టాలని, వయసు పెరుగుతున్న నటీమణులకు అవకాశాలను పరిమితం చేయడం సరైంది కాదని అంటున్నారు. ఇప్పటికీ మాధురీ దీక్షిత్ నటిస్తున్నా ఆమె సల్మాన్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాల్లేవు అలాగే సుహాసిని, రాధిక తదితరులు ఉన్నా వారు చిరంజీవి, బాలకృష్ణల పక్కన హీరోయిన్స్గా ఎంపిక కాలేదు.. ఈ పరిస్థితి హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ డాళ్ అనే పాత కాలపు ధోరణికి బలం చేకూరుస్తోందనే వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. ఏదేమైనా ఎప్పుడూ లేనంత బలంగా వినిపిస్తున్న విమర్శలు... సీనియర్ హీరోల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో...చూడాలి. -
'హిట్ 3' కోసం అనిరుధ్.. వీడియో సాంగ్ రిలీజ్
నాని(Nani) హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ హిట్ 3(HIT 3 Movie). మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ముంబయి, కేరళ అంటూ నాని తెగ తిరిగేస్తున్నాడు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా నుంచి ఇప్పుడో పాట రిలీజ్ చేశారు. దీన్ని అనిరుధ్ పాడటం విశేషం.హిట్ 3 మూవీ నుంచి ఇదివరకే ప్రేమ వెల్లువ, అభీ బార్ అర్జున్ సర్కార్ అనే పాటలు రిలీజయ్యాయి. ఇప్పుడు 'తను..' అంటే సాగే గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ స్టేషన్ లో ఉన్న నాని.. హీరోయిన్ కోసం పాడే సాంగ్ ఇదని అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) దీన్ని మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పాడాడు. స్వతహాగా సినిమాలకు కంపోజ్ చేసే అనిరుధ్.. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. కానీ పాడటానికి మాత్రం రూపాయి కూడా తీసుకోడు. గతంలో అతడే ఈ విషయం చెప్పాడు. ఇప్పుడు కూడా నాని కోసమే అనిరుధ్ ఈ పాట పాడినట్లు అనిపిస్తుంది. గతంలో నాని 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. నెక్స్ట్ రాబోయే 'ప్యారడైజ్' కూడా ఇతడే సంగీతమందించబోతున్నాడు. అలా వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ దృష్ట్యా హిట్ 3లో అనిరుధ్ పాట పాడినట్లున్నాడు.(ఇదీ చదవండి: పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్) -
పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వల్ల 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎలాగైనా సరే సదరు ఉగ్రవాదుల్ని చంపాల్సిందే అని ప్రతి ఒక్క భారతీయుడు కోపంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ సింగర్ చిన్మయి వివాదాస్పద పోస్ట్ పెట్టింది. కులం ఆధారంగా తక్కువ చేసి చూసేవాళ్లూ టెర్రరిస్టులతో సమానమని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: భర్తతో కలిసి కాస్ట్ లీ కారు కొన్న హీరోయిన్) ఇంతకీ ఏం జరిగింది?దక్షిణాదిలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి.. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయమై ట్వీట్, పోస్ట్ పెడుతూ వివాదాలు కొనితెచ్చుకునే చిన్మయి.. ఇప్పుడు కూడా అలాంటి పోస్ట్ పెట్టింది.చిన్మయి పోస్టులో ఏముంది?'నేను షెడ్యూల్ కులానికి చెందిన అమ్మాయిని. సోకాల్డ్ హిందువులు.. నేను వాళ్లలో ఒకరినే అనే విషయాన్ని మర్చిపోయారు. ఎందుకంటే నా చిన్నతంలో మా ఊరి దేవాలయానికి వెళ్లేదాన్ని. పూజారి మాత్రం నాకు నేరుగా ప్రసాదం ఇచ్చేవారు కాదు. నా కాలేజీ రోజుల్లోనూ అంతే. రిజర్వేషన్ల వల్ల మీరంతా మా నెత్తిపై కూర్చున్నారని మా లెక్చరర్ అనేవారు. ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాను''చెప్పడానికి బాధగా ఉన్నా.. నా చుట్టూ ఉంటే అగ్ర కులానికి చెందినవాళ్లు, కులం ఆధారంగా తక్కువ చేసే చూసేవాళ్లందరూ కూడా టెర్రరిస్టులతో సమానమే. ఎందుకంటే వీళ్లందరూ నా మానసిక పరిస్థితిని బాగా ఇబ్బంది పెట్టాడు. కులం చూసి కొందరు చంపేస్తున్నారు. కులం ఆధిపత్యం చూపించి మరికొందరు మానసికంగా హింసించి చంపేస్తున్నారు' అని చిన్మయి తన పోస్టులో రాసుకొచ్చింది.సమయం సందర్భం లేకుండా చిన్మయి ఇలాంటి పోస్ట్ పెట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెని నోటికొచ్చినట్లు అంటున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
బాలీవుడ్ సినిమా ప్రేక్షకలోకానికి ఆషికి అనే సినిమా ఓ గొప్ప ప్రేమ కావ్యం. ఆ సినిమా విజయం ఎంత గొప్పది అంటే.. ఆ సినిమా పేరు గుర్తుకురాగానే ఆ సినిమాలో జీవించిన నటీనటులు కళ్ల ముందు సిసలైన ప్రేమ చిహ్నాల్లా మెరుస్తారు. ఆ సినిమా, ఆడియో ఆల్బమ్ వయసు పాతికేళ్లు కానీ... ఇప్పటికీ ఆ పాటల్ని వినకుండా ఉండలేని ప్రేక్షక–ప్రేమాభిమానులు ఎందరో..నటీ నటులు అనుఅగర్వాల్, రాహుల్ రాయ్లతో సహా ఆ చిత్రంలో పాలు పంచుకున్న ఎందరికో ఆషికి తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది.అంత చరిత్ర ఉన్న ఆషికికి ఇప్పటికే ఒక సీక్వెల్ వచ్చి విజయవంతం అయింది. ఇప్పుడు మరోసారి ఆ సినిమాకి సీక్వెల్ తయారవుతోంది. ఈ ఆషికి 3(Aashiqui 3 Movie )లో బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగిన శ్రీలీల(sreeleela) నటిస్తోంది. ఈ నేపధ్యంలోనే తొలి ఆషికి సినిమా కధానాయిక నటి అను అగర్వాల్(Anu Agarwal), తన ఆలోచనలను పంచుకున్నారు. తనకు ఆషికి లో పాత్ర ఎంతగా మనసుకు హత్తుకు పోయిందో వెల్లడించారు. ఆషికి అనేది కేవలం తెరపై నటించిన మరో పాత్ర మాత్రమే కాదని– అది తన హృదయ స్పందన అని ఆమె పేర్కొన్నారు.తాను ఆషికీలో తొలిసారి భాగంగా మారినప్పుడు ఆ సమయంలో అది అంత గొప్ప చిత్రం కాదనీ. అప్పటికి దర్శకుడు మహేష్ భట్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్గా పేరు తెచ్చుకోలేదనీ, తన మొదటి మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్లోకి అడుగుపెట్టిన ఒక ఆర్ట్ హౌస్ డైరెక్టర్. మాత్రమే నని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆషికి నేను పనిచేసిన ఓ చిత్రం మాత్రమే కాదు, ఇది నన్ను నేను రూపొందించడంలో నన్ను నేను నిర్మించుకోవడంలో సహాయపడింది. అది నా వ్యక్తిగత జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.‘ అంటూ ఉద్విగ్నంగా చెప్పారు.అటువంటి ఐకానిక్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎంపికైనందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని ఆషికి 3 నటీనటులకు ఆమె సూచించారు. ‘ఇది అహంకారంతో చెబుతున్నది కాదు, ఆషికీ సిరీస్లో చేరిన ఎవరైనా ఓ ఘనమైన వారసత్వంలో భాగమవుతున్నారు. ఆ వారసత్వంలోకి అడుగుపెట్టిన మరు క్షణమే, సగం విజయం సాధిస్తారు. ప్రేక్షకులు మిమ్మల్ని ఆషికి వారసులుగా చూసేందుకు వస్తారు. అందుకే నటీనటులు తమకు లభించిన అవకాశం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఆ వారసత్వాన్ని గొప్ప గౌరవంగా భావించాలి.‘ అంటూ ఆమె ఉద్భోధించారు. ప్రేమ అనేది విశ్వవ్యాప్తం కాలాతీతం అని అను అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రేమ చిత్రణ సమకాలీన సున్నితత్వాలకు అనుగుణంగా ఉండవచ్చు, అయితే ప్రేమను నిర్వచించే ప్రాథమిక భావోద్వేగాలు అనుభవాలు ఎల్లప్పుడూ అలాగే ఉంటాయని తాను నమ్ముతానంది.ఆషికి తర్వాత పొడగరి సుందరి, డస్కీ బ్యూటీగా 1990 ప్రాంతంలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న అనుఅగర్వాల్ 1999 ప్రాంతంలో అనూహ్యంగా ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై వెండితెరకు దూరమయ్యారు. కొన్నేళ్లపాటు చికిత్స తర్వాత ప్రస్తుతం కోలుకున్నప్పటికీ..సినిమాల్లో ఇంకా అవకాశాలు రావడం లేదు. ఆమె తమిళ దర్శకుడు మణిరత్నం దొంగ దొంగ చిత్రంలో కొంచెం నీరు కొంచెం నిప్పు పాట ద్వారా దక్షిణాది ప్రేక్షకులకూ చిరపరిచితమయ్యారు. -
2064లో అసలేం జరగనుంది?.. తెలుసుకోవాలంటే ఈ ట్రైలర్ చూసేయండి!
శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం 'కలియుగం-2064'. ఈ సినిమాకు ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చేనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను ఆర్కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ బ్యానర్లపై కేఎస్ రామకృష్ణ, కే రామ్ చరణ్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ చూస్తే రాబోయే కాలంలో 2064లో మనుషులు ఎలా ఉంటారనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. భయంతో, ఆకలితో చద్దామా.. లేదంటే పోరాడి చద్దామా? అనేది మన చేతుల్లో ఉంది అనే డైలాగ్ వింటే మానవుడు తన మనుగడే చేసే పోరాటంగా చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతోంది. 2064లో మనుషులు పరిస్థితి ఏంటనే కోణంలోనే ఈ సినిమాకు రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి డాన్ విన్సెంట్ సంగీతమందిస్తున్నారు.Kaliyugam doesn't ask for your attention.It takes it.It burns the screen.It screams through your bones.Witness the world of Kaliyugam on May 9th 2025! Release by @MythriRelease ❤️🔥'Kaliyugam 2064' trailer out now :https://t.co/r3iFWGNqUl#kaliyugam2064… pic.twitter.com/U99L2fLPmH— Mythri Movie Distributors LLP (@MythriRelease) April 25, 2025 -
ప్రియదర్శి 'సారంగపాణి జాతకం'.. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించాడా?
టైటిల్: సారంగపాణి జాతకంనటీనటులు: ప్రియదర్శి, రూప కొడువాయూర్, వీకే నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, హర్ష చెముడు తదితరులుదర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటినిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్నిర్మాణ సంస్థ: శ్రీదేవి మూవీస్సినిమాటోగ్రఫీ: పీజీ విందాసంగీత దర్శకుడు: వివేక్ సాగర్ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్విడుదల తేదీ: ఏప్రిల్ 25, 2025ఇటీవలే కోర్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు. కోర్టు సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే మరో మూవీ థియేటర్లలో పడిపోయింది. వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్లో ప్రియదర్శి నటించిన తాజా చిత్రం సారంగపాణి జాతకం. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన సారంగపాణి జాతకం ప్రేక్షకులను నవ్వించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.సారంగపాణి జాతకం కథేంటంటే..సారంగ(ప్రియదర్శి) ఓ కార్ల కంపెనీలో సేల్స్ మెన్. చిన్నప్పటి నుంచి యావరేజ్ మార్కులతో పాసైన సారంగకు ఆ జాబ్ సాధించడం గొప్పే అని సారంగ తల్లిదండ్రుల ఫీలింగ్. ముఖ్యంగా ఇదంతా మనోడి జాతకం తెగ నమ్మేస్తుంటారు. అలా చిన్నప్పటి నుంచి జాతకాలపై సారంగకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అయితే అదే కంపెనీలో మేనేజర్గా పనిచేస్తోన్న మైథిలి(రూప కొడువాయూర్)తో మన సారంగకు లవ్ మొదలవుతుంది. ఆమెకు సారంగ ప్రపోజ్ చేద్దాం అనుకునేలోపే మైథిలినే ఊహించని సర్ప్రైజ్ ఇస్తుంది. అలా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలై చివరికీ పెళ్లి వరకు తీసుకెళ్తుంది. అంతా ఓకే అనుకుంటుండగానే సారంగకు చేతి రేఖలు చూసి భవిష్యత్తును డిసైడ్ చేసే జిగ్గేశ్వర్(అవసరాల శ్రీనివాస్)ను అనుకోకుండా కలుస్తాడు. ఆయన చేతిరేఖల జాతకంలో ఫేమస్ కావడంతో అతని వద్దకు సారంగ వెళ్తాడు. ఆ తర్వాత సారంగ చేయి చూసిన జిగ్గేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) చేతి రేఖలు చూసి అతని జాతకంలో ఉన్న ఓ షాకింగ్ విషయం చెప్తాడు. ముందు నుంచి జాతకాలు తెగ నమ్మే సారంగ ఆ విషయం తెలుసుకుని తెగ బాధపడిపోతుంటాడు. ఆ పని పూర్తయ్యాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో తన ఫ్రెండ్ చందు(వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. ఇద్దరు కలిసి సారంగ జాతకం ప్రకారం ఆ పని కోసం తమ మాస్టర్ మైండ్స్తో స్కెచ్ వేస్తారు. మరి అది వర్కవుట్ అయిందా? అసలు సారంగ జాతకంలో ఉన్న ఆ షాకింగ్ విషయం ఏంటి? దాని కోసం చందుతో కలిసి వేసిన ప్లాన్స్ సక్సెస్ అయ్యాయా? చివరికీ సారంగ.. తన ప్రియురాలు మైథిలిని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే సారంగపాణి జాతకం చూడాల్సిందే.ఎలా ఉందంటే..సాధారణంగా మనదేశంలో జాతకాలంటే జనాలకు ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. మన గ్రామాల్లో అయితే ఇలాంటివీ విపరీతంగా నమ్మేస్తుంటారు. అలా జాతకాలను తెగ నమ్మేసే ఓ యువకుడి స్టోరీనే మన ముందుకు తీసుకొచ్చారు మోహనకృష్ణ ఇంద్రగంటి. చేతి రేఖల జాతకం అనే కాన్సెప్ట్తో తీసుకొచ్చిన ఈ కథ ఆడియన్స్కు వివరించే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ప్రేక్షకులను నవ్వించేందుకు జాతకం అనే కాన్సెప్ట్ను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అలా ఫస్ట్ హాఫ్లో లవ్, కామెడీతో ఇంద్రగంటి కట్టిపడేశారు. ప్రతి సీన్లో పంచ్లు, ప్రాసలు, అక్కడక్కడ అడల్డ్ జోక్స్తో ప్రేక్షకున్ని నాన్స్టాప్గా నవ్వించేశారు డైరెక్టర్. తన జాతకం ప్రకారం జరగాల్సిన ఆ పనిని ముందే చేస్తే ఎలా ఉంటుంది? ఆ పని కోసం హీరో(సారంగ) ప్లాన్స్ చూస్తే థియేటర్లలో నవ్వుకోని వాళ్లు ఉండరేమో? అలా ఫస్ట్ హాఫ్లోనే తన కామెడీ పంచ్లతో సగటు ప్రేక్షకున్ని సీట్ నుంచి కదలకుండా చేసేశాడు. సరదాగా వెళ్తున్న కథలో ఓ సీరియస్నెస్ తెప్పించే ట్విస్ట్ ఇచ్చిన ఇంద్రగంటి ఇంటర్వెల్ బ్యాంగ్ పడేశాడు. ఫస్ట్ హాఫ్తోనే ప్రేక్షకులను తెగ నవ్వించేసిన డైరెక్టర్.. సెకండాఫ్లో కొత్త పాత్రలతో కథను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేశాడు. కొత్త క్యారెక్టర్స్తో ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీని మరో రేంజ్కు తీసుకెళ్లాడు. హర్ష చెముడు, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ చేసే కామెడీ ఆడియన్స్కు హిలేరియస్గా అనిపిస్తుంది. సెకండాఫ్లో కథ మొత్తం ఓ హోటల్ చుట్టే ప్లాన్ చేశాడు డైరెక్టర్. హోటల్లో జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల ఉహకందేలా ఉన్నప్పటికీ కామెడీతో ప్రేక్షకుడిని కట్టిపడేయడంలో ఇంద్రగంటి ఫుల్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్లో తనికెళ్ల భరణి(అహోబిలం రావు) ఎంట్రీతో ఆడియన్స్లో మరింత ఆసక్తి పెంచేశాడు. కథలో ఊహించని ట్విస్ట్లతో ఎక్కడా కూడా ప్రేక్షకుడికి బోరింగ్ అనే పదం గుర్తు రాకుండా చేశాడు దర్శకుడు. జాతకం అనే కాన్సెప్ట్తో ఇంద్రగంటి చేసిన కామెడీ.. రోటీన్ కంటే భిన్నంగా ఉందని సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఫీలవుతాడు. క్లైమాక్స్లో వచ్చే ఓ సీరియస్ సీన్లోనూ నవ్వులు పూయించడం ఆయనకే సాధ్యమైంది. సందర్భాన్ని బట్టి అక్కడక్కడా కొన్ని అభ్యంతరకర పదాలు వాడినప్పటికీ.. కామెడీ ఎంటర్టైనర్గా కావడంతో ప్రేక్షకులు అంతగా ఇబ్బందే పడే లా అయితే లేవు. ఓవరాల్గా జాతకం అనే కాన్సెప్ట్తో డైరెక్టర్ చేసిన కామెడీ తీరు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉందనడంలో సందేహం లేదు. ఎవరైనా ఫ్యామిలీతో కలిసి కడుపుబ్బా నవ్వాలనుకుంటే మీరు కూడా సారంగపాణి జాతకంపై ఓ లుక్కేయండి.ఎవరెలా చేశారంటే..ప్రియదర్శి నటన, కామెడీ టైమింగ్తో మరోసారి అదరగొట్టేశాడు. మిస్టర్ ప్రెగ్నెట్ హీరోయిన్ రూప మరోసారి తన అందం, నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. వెన్నెల కిశోర్, అవసరాస శ్రీనివాస్, హర్ష చెముడు, వీకే నరేశ్, తనికెళ్ల భరణి తమ పాత్రల్లో ఆడియన్స్ను అలరించారు. సాంకేతికత విషయానికొస్తే పీజీ విందా సినిమాటోగ్రఫీ బాగుంది. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ ఫర్వాలేదు. కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. వివేక్ సాగర్ నేపథ్యం సంగీతం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు శ్రీదేవి మూవీస్ సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్కు జంటగా..!
అనుష్క శెట్టి (Anushka Shetty).. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన 'సూపర్' చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. 'విక్రమార్కుడు' మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసింది. ఈ క్రమంలో వచ్చిన అరుంధతి ఆమెను స్టార్ హీరోయిన్గా మార్చింది.ఆ సినిమా కోసం లావైపోయిన అనుష్కబిల్లా, వేదం, పంచాక్షరి, ఖలేజా, మిర్చి, బాహుబలి, భాగమతి.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగింది కూడా! ఆ తర్వాత పెరిగిన బరువును తగ్గించుకునేందుకు అనుష్క నానా తిప్పలు పడింది. 2023లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. రెండేళ్లుగా మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ఏడు సినిమాలు?ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఘాటి అనే లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఉంది. అలాగే మలయాళంలో కథనార్ మూవీ చేస్తోంది. ఇవి రిలీజ్కు రెడీ అవుతున్నాయి. అయితే ఈ రెండింటిని కలుపుకుని అనుష్క చేతిలో మొత్తం ఏడు సినిమాలున్నాయంటూ ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. అనుష్క చేతిలో ఏడు సినిమాలున్నాయని.. కాకపోతే వాటి గురించి దర్శకనిర్మాతలెవరూ బయటకు చెప్పొద్దని కోరిందట! అందుకే సైలెన్స్సినిమా రిలీజ్కు ముందు జరిగే ప్రమోషన్స్లో మాత్రమే తన పాత్ర గురించి వెల్లడించాలని.. అప్పటిదాకా ఈ విషయాలేవీ బయటకు రాకూడదని నిర్మాతలను ఆదేశించినట్లు సమాచారం. ఆమె సైన్ చేసిన ఏడు ప్రాజెక్టుల్లో తెలుగులో 3, తమిళంలో 2, మలయాళంలో 2 సినిమాలున్నాయని తెలుస్తోంది. అందులో ఒక మూవీలో ప్రభాస్ (Prabhas)తో కలిసి నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!చదవండి: లేడీ ఓరియంటెడ్ సినిమాకు సాయిపల్లవి గ్రీన్సిగ్నల్? -
ఆ ఆశ, ఆలోచన నాకు లేదు: త్రినాథరావు నక్కిన
‘‘పన్నెండేళ్ల నా కెరీర్లో ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించాను. అయితే వేగంగా సినిమాలు చేసి, డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన, ఆశ నాకు లేదు. నంబర్లు తక్కువ అయినా మంచి సినిమాలు తీయాలన్నదే నా ఆకాంక్ష. అందుకే నిదానంగా చేసుకుంటూ వెళుతున్నాను’’ అని త్రినాథరావు నక్కిన చెప్పారు. ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా రూపొందిన చిత్రం ‘చౌర్య పాఠం’. కార్తీక్ ఘట్టమనేని కథ అందించిన ఈ సినిమా ద్వారా చందు మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన నిఖిల్ గొల్లమారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్పై డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో త్రినాథరావు విలేకరులతో పంచుకున్న విశేషాలు.→ కార్తీక్ ఘట్టమనేని తండ్రి ఐజీగా చేశారు. ఆయన హయాంలో జరిగిన ఓ చిలిపి దొంగతనం కేసు గురించి కార్తీక్ చెప్పినప్పుడు సరదాగా అనిపించింది. ఈ నేపథ్యంలో సినిమా చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ కేసుని స్ఫూర్తిగా తీసుకొని ఫిక్షన్ యాడ్ చేసి, ఈ కథ రాశాడు కార్తీక్. ఈ సినిమాకి దర్శకుడిగా నిఖిల్ గొల్లమారి పేరుని తనే చెప్పాడు. ‘కార్తికేయ’ సినిమా షూటింగ్లో తన చురుకుదనం, ప్రతిభని గుర్తించాను. దీంతో ఓకే చెప్పాను. తను ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. క్లైమాక్స్ని మాత్రం మూడుసార్లు మార్పించాను. ఆ తర్వాత ఫైనల్ కాపీ చూసుకున్నాక చాలా బాగుందనిపించింది. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ కథకి రెండింతలు న్యాయం చేశాడు. ఈ చిత్రం దొంగతనం చేయాలనుకునే వారికి ఓ పాఠంలా ఉంటుంది (నవ్వుతూ). → కొత్తవాళ్లకి ఒక వేదిక సృష్టించి, అవకాశాలు ఇవ్వాలన్నది నా కల. ఎప్పటి నుంచో ఉన్న ఆ కల ‘చౌర్యపాఠం’తో నెరవేరింది. నిర్మాతగా మారి డబ్బులు సంపాదించాలనే ఆలోచన లేదు. కేవలం కొత్తవారికి అవకాశం కల్పించా లనే మంచి ఉద్దేశంతోనే నిర్మాతగా మారాను. మేం అనుకున్నదాని కంటే పది శాతం బడ్జెట్ పెరిగింది. మా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో రాజీ పడకుండా మంచి క్యాలిటీతో తీశాం.→ ఇంద్ర రామ్ ఈ కథకి సరిగ్గా సరి΄ోయాడు. కొత్తవాడు కదా సరిగ్గా చేస్తాడో? లేదో అనుకున్నాం. సెట్స్కి వెళ్లాక రెండు రోజులు కంగారు పడినా, ఆ తర్వాత బాగా నటించాడు. అలానే ΄ాయల్ రాధాకృష్ణ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా చక్కగా నటించింది. → ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్కి రావడం తగ్గించడానికి చాలా కారణాలున్నాయి. వాళ్లని థియేటర్స్కి రప్పించే సినిమాలు తీయడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం హవీష్ హీరోగా నా డైరెక్షన్లో చేస్తున్న సినిమా 25 శాతం పూర్తయింది. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, ‘దిల్’ రాజుగారి బ్యానర్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్లో సినిమాలు చేయాల్సి ఉంది. -
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
టైటిల్ : సోదరా నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సంజోష్, ఆర్తి గుప్తా, ప్రాచి బన్సాల్, బాబు మోహన్, బాబా భాస్కర్ తదితరులునిర్మాణ సంస్థలు: క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: చంద్ర చగన్లాఎడిటింగ్: శివ శ్రావణి దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లిసంగీతం: సునీల్ కశ్యప్ విడుదల: ఏప్రిల్ 25, 2025డిఫరెంట్ కామెడీ సినిమాలతో నవ్వించి మెప్పించే సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu ) మొదటిసారి రియల్ ఎమోషన్ చేశాను, న్యాచురల్ కామెడీ సినిమా చేశాను అంటూ ఈ సినిమాని ప్రమోట్ చేశారు. అన్నదమ్ముల అనుబంధాన్ని చూపించాం అంటూ మూవీ యూనిట్ చెప్పుకొచ్చారు. మరి ఈ సోదరా సినిమా ఎలా ఉందొ రివ్యూలో తెలుసుకుందాం(Sodara Movie Review )కథేంటంటే..తెలంగాణలోని ఓ పల్లెటూరులో చిరంజీవి(సంపూర్ణేష్ బాబు), పవన్(సంజోష్) అన్నదమ్ములు. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. చిరంజీవి సోడా బిజినెస్ చేస్తూ ఉంటాడు. చిరంజీవి ఏజ్ పెరిగినా ఇంకా పెళ్లవ్వట్లేదని, వచ్చిన 99 సంబంధాలు ఫెయిల్ అయ్యాయని బాధపడుతున్న సమయంలో చిరంజీవి ఎదురింట్లోకి దివి(ఆర్తి గుప్తా) ఫ్యామిలీ వస్తుంది. దివిని చూసి అన్నదమ్ములు ఇద్దరూ ఇష్టపడతారు. ఇద్దరూ దీవిని ట్రై చేస్తారు. ఈ విషయంలో ఇద్దరికీ బేధాభిప్రాయాలు వస్తాయి. అదే సమయంలో కాలేజీలో చదువుకోడానికి చిరంజీవి తమ్ముడు పవన్ ని వేరే ఊరు పంపిస్తాడు. అక్కడ కాలేజీలో భువి(ప్రాచీ బన్సాల్)తో ప్రేమలో పడతాడు పవన్. ఓ సారి పవన్ ఇంటికి వచ్చినప్పుడు దివి తన అన్నయ్యని రిజెక్ట్ చేసిందని తెలిసి మరోసారి నీ ప్రేమని చెప్పు అంటూ అర్ధరాత్రి తన అన్నయ్యని దివి ఇంటికి వెళ్లేలా చేస్తాడు. అది దివి తండ్రి చూడటంతో పెద్ద గొడవ అయి రెండు కుటుంబాలు కొట్టుకునే దాకా వెళ్తారు. ఈ గొడవతో దివి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. తమ్ముడి వల్లే ఇదంతా జరిగిందని చిరంజీవి పవన్ కి దూరంగా ఉంటాడు. మరి చిరంజీవి - పవన్ మళ్ళీ అన్నదమ్ములుగా క్లోజ్ అవుతారా? దివి చిరంజీవి కోసం తిరిగి వస్తుందా? చిరంజీవి 100వ పెళ్లిచూపులు జరుగుతాయా? పవన్ లవ్ స్టోరీ ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కామెడీ కథలు చేసే సంపూర్ణేష్ బాబుతో మరో హీరోని పెట్టి అన్నదమ్ముల సినిమాతో పాటు ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా పూర్తిగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఆ తెలంగాణ మట్టి వాసన, స్లాంగ్, జనాలు కాస్త రియలిస్టిగా చూపించే ప్రయత్నం చేసారు. అయితే ఫస్టాఫ్ బాగా సాగదీసారు. కాలేజీ ఎపిసోడ్స్ కాస్త బోర్ కొడతాయి. ప్రథమార్థం సింపుల్ గా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ కి ఎవరూ ఊహించని అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో సెకండాఫ్పై ఆసక్తి నెలకొంటుంది. సెకండాఫ్లో కామెడీ, ఎమోషన్ పండించడానికి బాగానే కష్టపడ్డారు. కొన్ని సీన్స్ హిలేరియస్ గా నవ్వుకుంటాం. ఓ పక్క లవ్ ఎమోషన్, మరో పక్క అన్నదమ్ముల ఎమోషన్ ని బాగానే చూపించే ప్రయాతం చేశారు. క్లైమాక్స్ లో కూడా మళ్ళీ ట్విస్టులు ఇచ్చి కథ ముగిస్తారు. అయితే అన్నదమ్ముల ఎమోషన్ ని లవ్ స్టోరీలు డామినేట్ చేశాయి అనిపిస్తాయి. ఎవరెలా చేసారంటే.. ఇన్నాళ్లు నవ్వించిన సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ఓ విలేజ్ లో సోడాలు అమ్ముకునే కుర్రాడి పాత్రలో సింపుల్ గా బాగానే నటించాడు. ఎమోషన్ పండించడానికి బాగానే ట్రై చేసాడు. సంజోష్ కూడా తెలంగాణ యువకుడి పాత్రలో యాక్టివ్ గా కనపడ్డాడు. ఆర్తి గుప్తా కాసేపే కనపడినా పర్వాలేదనిపిస్తుంది. ప్రాచి బన్సాల్ తన అందంతో అలరిస్తూనే నటనతో మెప్పిస్తుంది. బాబు మోహన్, గెటప్ శ్రీను, బాబా భాస్కర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రా పరిధి మేరకు నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే చూపించారు. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ ఇంకా ట్రిమ్ చేస్తే బాగుంది. సినిమాలో కొంతమందికి డబ్బింగ్ సెట్ అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే మెప్పిస్తుంది. పాటలు మాత్రం యావరేజ్. మొదటి సినిమా అయినా డైరెక్టర్ మంచి కథ తీసుకొని ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు. -
లేడీ ఓరియంటెడ్ సినిమాకు సాయిపల్లవి గ్రీన్సిగ్నల్?
నయనతార, కీర్తీ సురేష్ వంటి వారు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్లుగా నటిస్తూనే, వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కానీ కథానాయిక సాయిపల్లవి (Sai Pallavi) మాత్రం ఈ ట్రాక్లో కాస్త స్లోగా ఉన్నారనుకోవాలి. హీరోయిన్గా బిజీగా ఉంటున్న సాయి పల్లవి ‘గార్గి’ అనే డిఫరెంట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేశారు. 2022లో విడుదలైన ఈ సినిమా తర్వాత మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్కి సాయి పల్లవి గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని తెలుస్తోంది. ఓ సీనియర్ రచయిత ఓ పవర్పుల్ స్టోరీ రెడీ చేశారని, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్కు ఈ కథ నచ్చిందని, ఈ సినిమాలోని మెయిన్ లీడ్ కోసం సాయిపల్లవిని సంప్రదించారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మరి... సాయిపల్లవి మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ చిత్రంతో బిజీగా ఉన్నారు సాయిపల్లవి. అలాగే ఆమె నటించిన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) విడుదలకు సిద్ధమవుతోంది. చదవండి: పాక్ నటుడికి బాలీవుడ్ బ్యూటీ సపోర్ట్.. వారిపై బ్యాన్ -
పహల్గాం బాధితుడి ఇంటికి అనన్య నాగళ్ల.. నెట్టింట ప్రశంసలు
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది అసువులు బాశారు. వారిలో నెల్లూరుకు చెందిన మధుసూధనరావు ఒకరు. ఓ ఈవెంట్ కోసం నెల్లూరు వెళ్లిన హీరోయిన్ అనన్య నాగళ్ల.. మధుసూధనరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించింది. అతడి భౌతికకాయానికి నివాళులు అర్పించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తీవ్రంగా ఖండించాలిపహల్గామ్ సంఘటన నాకెంతో బాధ కలిగించింది. నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను. మతం పేరు తెలుసుకుని మరీ చంపేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. శ్రీ మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి.సోషల్ మీడియాలో సంతాపాలు..భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అని అనన్య (Ananya Nagalla) ట్వీట్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉగ్రదాడిలో మరణించినవారికోసం సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు తప్పితే ఏ ఒక్కరూ వారి ఇంటికెళ్లి కుటుంబాలను పరామర్శించలేదు. మీరే నిజమైన హీరోయిన్కానీ మీరు మాత్రం నేరుగా బాధితుడి ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మీరు నిజమైన హీరోయిన్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అనన్య నాగళ్ల గతంలోనూ తన మంచి మనసు చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వానికి విరాళాలు అందించి ప్రశంసలు అందుకుంది.తెలుగమ్మాయి సినీ కెరీర్అనన్య నాగళ్ల తెలుగమ్మాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి తన స్వగ్రామం. నటనపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి షార్ట్ ఫిలింస్లో నటించింది. షాదీ అనే లఘు చిత్రం తనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. 2019లో మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మళ్లీ పెళ్లి, తంత్ర, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి పలు చిత్రాలతో అలరించింది. బహిష్కరణ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. పహల్గామ్ సంఘటన నాకెంతో బాధను కలిగించింది. ఈ రోజు నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను… ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను… మతం పేరు తెలుసుకుని మరి చంపేయడాన్ని నేను తిసుకోలేకపోతున్నాను..శ్రీ మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి… pic.twitter.com/q2ZuMj2G8M— Ananya Nagalla (@AnanyaNagalla) April 24, 2025 చదవండి: పాక్ నటుడికి బాలీవుడ్ బ్యూటీ సపోర్ట్.. వారిపై బ్యాన్ కరెక్ట్ కాదు -
పహల్గామ్ ఘటనపై మరోసారి స్పందించిన మెగాస్టార్..!
పహల్గామ్ ఉగ్రదాడిపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి స్పందించారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అమాయక ప్రజలను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాక్షసుల ఆకృత్యానికి ఎంతోమంది బలైపోయారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని తన బాధను వ్యక్తం చేశారు. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు మెగాస్టార్ తెలిపారు.ఈ ఘటనకు కారణమైన వారిని ఎవరినీ విడిచిపెట్టొద్దని మెగాస్టార్ చిరంజీవి కోరారు. ఈ దాడిపై అంతకుముందే చిరు ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది అమాయక ప్రజలతో పాటు పర్యాటకులను కాల్చి చంపడం క్షమించరాని క్రూరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ దారుణమైన దాడి చాలా భయంకరమైందని.. ఈ ఘటనకు సంబంధించిన విషయాలను చూస్తుంటే గుండె పగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నష్టాన్ని ఏదీ పూడ్చలేదని పోస్ట్లో రాసుకొచ్చారు. -
ప్రభాస్ ది రాజాసాబ్.. టీజర్ రిలీజ్పై హింట్ ఇచ్చిన డైరెక్టర్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమాను రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ రెబల్ స్టార్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్కు సంబంధించిన ఓ హింట్ ఇచ్చారు డైరెక్టర్ మారుతి. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.హై అలర్ట్.. హీట్ వేవ్స్ మరింత పెరగనున్నాయి అని ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.దీంతో వచ్చేనెలలోనే ది రాజాసాబ్ టీజర్ విడుదల కానుందని హింట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ టీజర్కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయని.. విదేశాల నుంచి ప్రభాస్ తిరిగి రాగానే తనతో డబ్బింగ్ పూర్తి చేసి టీజర్ విడుదల తేదీని రివీల్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి సందడి చేయనుంది.HIGH ALERT…‼️HEAT WAVES gonna rise even higher from mid May! 🔥🔥🔥 pic.twitter.com/EdEdtMCq6E— Director Maruthi (@DirectorMaruthi) April 23, 2025 -
ఎన్టీఆర్తో శృతీ హాసన్ స్పెషల్ డ్యాన్స్?
ఎన్టీఆర్తో స్పెషల్ డ్యాన్స్ చేయనున్నారట శ్రుతీహాసన్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా, మలయాళ నటుడు టొవినో థామస్ విలన్గా నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, ఈ పాటకు శ్రుతీహాసన్ అయితే బాగుంటారని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నారట. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ‘సలార్’ మూవీలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో ఓ హీరోయిన్గా నటించారు శ్రుతీహాసన్. మరి... ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీలోని శ్రుతి స్పెషల్ సాంగ్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘డ్రాగన్’ చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారని తెలిసింది. మూడు రోజుల క్రితం మొదలైన ఈ షెడ్యూల్ మే రెండో వారం వరకు జరుగుతుందని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గతంలో వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ, ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్. -
ట...ట...ట... నిజమౌనా?
ఫలానా హీరో–హీరోయిన్ కాంబినేషన్ కుదిరింద‘ట’... ఓ పాట సెట్ కోసం ఐదువందల మందికి పైగా పని చేస్తున్నార‘ట’... ఆ డైరెక్టర్ 60 రోజుల్లోనే సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాడ‘ట’... ఆ స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ హీరో విలన్గా ఫిక్స్ అయ్యాడ‘ట’... ఇలా సినిమా పరిశ్రమ గురించి రోజుకో ‘ట...ట...ట...’ అంటూ వార్తలు ప్రచారంలో ఉంటాయి. మరి... ఈ ప్రచారంలో ఉన్న ఈ ‘ట’లు నిజమౌనా? అనేది తెలియాలంటే మాత్రం యూనిట్ చెప్పాల్సిందే. ఇక ప్రస్తుతం ఆ నోటా ఈ నోటా విహారం చేస్తున్న కొన్ని ‘ట’ల గురించి ఓ లుక్కేద్దాం.హీరో మహేశ్బాబు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పంథాకి భిన్నంగా ఈ చిత్రాన్ని అతి వేగంగా పూర్తి చేసేం దుకు రాజమౌళి షూటింగ్ ప్లాన్ చేశారని టాక్. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే హై ఓల్టేజ్ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ఉన్న మహేశ్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్గా మారాయి. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలోని కోరాపుట్లో రెండు షెడ్యూల్స్ని మెరుపు వేగంతో పూర్తి చేసిన రాజమౌళి మూడవ షెడ్యూల్కి సిద్ధం అయ్యారు. ఇందుకోసం హైదరాబాద్లో ఓ భారీ సెట్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సెట్ కోసం దాదాపు 550 మంది పని చేస్తున్నారని టాక్. ఈ సెట్లో త్వరలోనే ఓ భారీ సాంగ్ని చిత్రీకరించనున్నారట రాజమౌళి. ఈ పాట సినిమాలో హైలైట్ అవుతుందని ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు కూడా గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రజనీకాంత్కి విలన్గా... రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ చిత్రంలో ఫాహద్ది పాజిటివ్ క్యారెక్టర్. ఒక రకంగా చెప్పాలంటే రజనీ పాత్రకు హెల్ప్ఫుల్గా ఉండే పాత్ర. అయితే ఇప్పుడు రజనీకాంత్కి విలన్గా మారారట ఫాహద్. ఏ సినిమాలో అంటే ‘జైలర్ 2’లో అని సమాచారం. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా ఇదే కాంబినేషన్లో ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఫాహద్ని విలన్గా ఎంపిక చేశారని టాక్. ఇటీవల కేరళలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. తదుపరి షెడ్యూల్లో ఫాహద్ పాల్గొంటారట. అప్పుడు ఈ చిత్రంలో ఫాహద్ విలన్గా నటిస్తున్న విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించాలని అనుకుంటోందని సమాచారం. సూర్య–కీర్తి మళ్లీ కుదిరేనా? సూర్య–కీర్తీ సురేష్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటోంది తమిళ పరిశ్రమ. ఈ ఇద్దరూ జంటగా ‘తానా సేంద కూట్టమ్’ (2018) అనే చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో సినిమా రూపొందనుందనే ప్రచారం జరుగుతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్యకి జోడీగా కీర్తీ సురేష్ నటించనున్నారని ఫిల్మ్నగర్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందనున్న ఈ చిత్రానికి ‘796 సీసీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ‘సార్, లక్కీ భాస్కర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రీ ్రపొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా కీర్తీ సురేష్ను ఎంపిక చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి... ఈ వార్తలపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి. తమిళ దర్శకుడితో... హీరో కల్యాణ్ రామ్ జోరు మీదున్నారు. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ఈ నెల 18న విడుదలై, హిట్గా నిలిచింది. తన తర్వాతి చిత్రాన్ని తమిళ దర్శకుడు గిరీశాయతో చేయనున్నారట కల్యాణ్ రామ్. తెలుగులో బ్లాక్బస్టర్గా నిలిచిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేశారు గిరీశాయ. ఈ సినిమా కోలీవుడ్లోనూ హిట్గా నిలిచింది. కాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ (2022) సినిమాతో టాలీవుడ్కి పరిచయమయ్యారు గిరీశాయ. తాజాగా కల్యాణ్ రామ్ కోసం ఓ కథని సిద్ధం చేశారట ఆయన. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సాగే ఈ కథ కల్యాణ్ రామ్కి కూడా నచ్చిందట. దీంతో తన తర్వాతి మూవీని గిరీశాయ దర్శకత్వంలో చేయనున్నారని ఫిల్మ్నగర్ టాక్. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తర్వాత ‘బింబిసార 2’ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే డైరెక్టర్ వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీంతో ‘బింబిసార 2’ మొదలయ్యేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈలోపు గిరీశాయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కల్యాణ్ రామ్ ఆసక్తిగా ఉన్నారని టాక్. ఇక కల్యాణ్ రామ్, గిరీశాయ కాంబినేషన్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అరవై రోజుల్లో... డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టైలే వేరు. సినిమాలను జెట్ స్పీడ్లో తెరకెక్కిస్తారనే పేరుంది ఆయనకి. ఎంత పెద్ద సినిమా అయినా మూడు నాలుగు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేస్తుంటారు. అయితే తన తాజా చిత్రాన్ని కేవలం అరవై రోజుల్లోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట పూరి. ఆయన దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటించనున్నారు. కాగా ఈ మూవీకి ‘బెగ్గర్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. పూరి సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారట. అందుకే ‘బెగ్గర్’ అనే టైటిల్ను లాక్ చేశారని టాక్. మే లేదా జూన్లో సెట్స్పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని కేవలం అరవై రోజుల్లో పూర్తి చేయాలన్నది పూరి జగన్నాథ్ ఆలోచన అట. ఎందుకంటే వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి ‘బెగ్గర్’ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పూరీని కోరారట. అందుకు తగ్గట్టు జెట్ స్పీడ్లో షూటింగ్ పూర్తి చేసేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట పూరి జగన్నాథ్. రీమేక్ చిత్రంతో... వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు రాజశేఖర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన తర్వాతి సినిమా ఏంటి? అన్నదానిపై క్లారిటీ లేదు. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘శేఖర్’. ఆయన భార్య జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 మే 20న విడుదలైంది. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ (2023) సినిమాలో కీలక పాత్రలో కనిపించారు రాజశేఖర్. ఆ చిత్రం విడుదలై ఏడాదిన్నర దాటినా రాజశేఖర్ తర్వాతి సినిమాపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన లేదు. ఇదిలా ఉంటే... తమిళంలో ఘన విజయం సాధించిన ‘లబ్బర్ పందు’ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు రాజశేఖర్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ‘లబ్బర్ పందు’ చిత్రం గత ఏడాది సెప్టెంబరు 20న తమిళంలో రిలీజై, సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు హక్కులు కొనుగోలు చేశారట రాజశేఖర్. పెళ్లీడుకి వచ్చిన కూతురు ఉన్న ఒక వ్యక్తికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయిని ప్రేమించే అబ్బాయికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్, ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం కోలీవుడ్లో హిట్గా నిలిచింది. ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథ, కథనంలో మార్పులు చేసి, రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజశేఖర్. మరి... ఈ వార్తల్లో వాస్తవం ఏంటన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.– డేరంగుల జగన్ మోహన్ -
బీచ్లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్బాస్ దివి!
బీచ్లో చిల్ అవుతోన్న సురేఖవాణి కూతురు సుప్రీత..కళ్లతోనే మాయ చేస్తోన్న బిగ్బాస్ దివి..న్యూయార్క్లో బాలీవుడ్ భామ మలైకా అరోరా చిల్..సెల్ఫీలతో మురిసిపోతున్న నా సామిరంగ బ్యూటీ ఆషిర రంగనాథ్..మరింత స్టెలిష్గా మెరిసిపోతున్న పుష్ప భామ పావని.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Pavani Karanam (@livpavani) -
నాని హిట్-3.. సెన్సార్ బోర్డ్ కట్స్ ఇవే!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్ సిరీస్లో వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వంలోనే తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఇందులో మోస్ట్ వయోలెన్స్తో నాని కనిపించారు. సినిమా రిలీజ్కు రెండు వారాల ముందే ట్రైలర్ విడుదల చేసిన మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సూపర్ హిట్ అవుతుందని నాని ఫుల్ ధీమాగా ఉన్నారు.తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ట్రైలర్లోనే ఓ రేంజ్లో వయోలెన్స్ చూపించడంతో సెన్సార్ ఏ సర్టిఫికేట్ మాత్రమే జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని సీన్స్ మార్పులు చేయాలని సూచించింది. అలాగే అభ్యంతరకర పదాలు మ్యూట్ చేయాలని ఆదేశించింది. రక్తం కనిపించే సన్నివేశాల్లో రెడ్ కలర్ను డార్క్ చేయాలని సూచించింది. కాగా.. ఈ మూవీ రన్ టైమ్ దాదాపు రెండుగంటల 37 నిమిషాలుగా ఉండనుంది. అలా మార్పులు చేయడంతోనే సెన్సార్ బోర్ట్ ఓకే టెప్పింది. కాగా.. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
గోపిచంద్ కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ హీరో గోపిచంద్ మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయారు. ఇటీవలే ఓ సినిమా ప్రకటించిన కొత్త డైరెక్టర్తో జతకట్టారు. కుమార్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ లాంఛనంగా ఇవాళ ప్రారంభమైంది. ఈ చిత్రంలో మలయాళ భామ మీనాక్షి దినేశ్ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాను థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీమ్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గోపీచంద్ హీరోగా మార్చిలో ప్రారంభమైన సినిమాకి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. The man of grit is back @YoursGopichand 😎This time in a new dimension of Chills 🤟🏻@SVCCOfficial's Production No.39 kickstarts with a Grand Pooja Ceremony Today 🪔Directed by @MysticBoom 🎬Visuals by @ShamdatDOP 🎥Rolling on floors soon 🔥 pic.twitter.com/RgcprG5LjT— SVCC (@SVCCofficial) April 24, 2025 The relentless team that’s all set to give you a BLOCKBUSTER ride 💥💥@SVCCOfficial’s ProductionNo.39 has officially begun with an auspicious pooja ceremony ❤️🪔Here’s a glimpse of the blissful moments that marked the beginning ✨ @YoursGopichand #MeenakshiDineshDirected… pic.twitter.com/NAoLUdwA8P— SVCC (@SVCCofficial) April 24, 2025 -
రాజేంద్రప్రసాద్ మనవరాలి 'ఎర్రచీర'.. కథ గెస్ చేస్తే రూ.5 లక్షలు మీవే!
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'ఎర్రచీర'. 'ది బిగినింగ్' అనేది ట్యాగ్ లైన్. సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో కీలక పాత్రను పోషించారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు సాంకేతిక కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను మే రెండో వారంలో విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాత సుమన్ బాబు తెలిపారు.మేలో రిలీజ్ఆయన మాట్లాడుతూ ‘’ఈ నెల 25న రిలీజ్ కావాల్సిన ఎర్రచీర కొన్ని టెక్నికల్ కారణాలతో వాయిదా పడింది. మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. కంటెంట్ మాత్రం ఖతర్నాక్గా ఉంటుంది. కామెడీ, హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్.. అన్నీ కలగలిపి ఉండే ఈ మూవీ ఎక్కడా బోర్ కొట్టదు. సినిమా చూసే ప్రేక్షకులు కన్నీళ్లతో బయటికి వెళ్తారు అని చెప్పగలను. కథ గెస్ చేస్తే రూ.5 లక్షల బహుమతిసెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి అభినందించారు. భలే సినిమా చేశారన్నారు. ఈ సినిమాకి ఒక పోటీ ప్రకటిస్తున్నాం. సినిమా కథ కరెక్టుగా రిలీజ్కు ముందు గెస్ చేస్తే ఐదు లక్షలు ప్రైజ్ మనీ ఇస్తాం. 8019246552 నంబర్కు కరెక్ట్ కథ చెప్పినవారికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐదు లక్షలు బహుమానంగా ఇస్తాం’’ అని అన్నారు. చదవండి: పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి -
చాహల్ మాజీ భార్య టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?
ధనశ్రీ వర్మ పేరు దాదాపు అందరికీ సుపరిచితమైన పేరు. ఇటీవలే భారత క్రికెటర్ చాహల్తో విడాకులు తీసుకుంది. 2020లో చాహల్ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగమ్మ ఐదేళ్లకే తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పేసింది. అయితే కెరియర్ పరంగా ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫర్గా రాణిస్తున్నారు. ఆమె త్వరలోనే ఓ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంతకీ ఆ సంగతులేంటో చూసేద్దాం.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశి కుమార్ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లో బలగం తర్వాత హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారానే ధనశ్రీ వర్మ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ సెట్స్లో ధనశ్రీ వర్మ కనిపించింది. ఈ సినిమాలో చాహల్ మాజీ భార్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.కాగా.. ముంబయిలో పుట్టి పెరిగిన ధనశ్రీ డెంటిస్ట్గా వైద్య రంగంలో వృత్తిని కొనసాగించారు. నృత్యంపై తనకున్న అభిరుచితో లెజెండరీ కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత తానే సొంతంగా డ్యాన్స్ అకాడమీని స్థాపించారు. ధనశ్రీ వర్మ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో తన డ్యాన్స్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వ్యక్తిగత జీవిత విషయానికొస్తే ధనశ్రీ డిసెంబర్ 22, 2020న భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ను వివాహం చేసుకుంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇటీవలే విడాకులు తీసుకున్నారు. -
కుటుంబ సమేతంగా పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన పుష్పకు సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం బన్నీ జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఓ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి చేశారు. తన కజిన్ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ పెళ్లికి అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలను టీమ్ అల్లు అర్జున్ ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Bunny anna : Yesesaava 😳🤣@alluarjun #AA22 pic.twitter.com/6MWEZ36JjK— Allu Babloo AADHF (@allubabloo) April 24, 2025 Icon Star @alluarjun attended his cousin’s wedding, joining the family in the special celebration. ✨#AlluArjun pic.twitter.com/HFR29rUZp1— Team Allu Arjun (@TeamAAOfficial) April 23, 2025 -
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు రాజమౌళి.. మహేశ్ బాబు సినిమా కోసమేనా?
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఆయన తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేందుకు ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఎస్ఎస్ఎంబీ మూవీ షూటింగ్ షెడ్యూల్ ఇటీవలే ఒడిశాలో పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో షూటింగ్ కోసమే తన డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చినట్లు సమాచారం. డ్రైవింగ్ లైసెన్స్ కోసం రాజమౌళి సంతకం చేసి, ఫొటో దిగారు. అనంతరం అధికారులు ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ను అందజేశారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నిర్మాత ఎస్కేఎన్
పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమా కూడా విజయం సాధించాలని కోరుకునే నిర్మాతలతో ఎస్కేఎన్ ఒకరు. వీలున్నంత వరకు చిన్న సినిమా ప్రమోట్ అవ్వడానికి తన వంతు సహాయం అందిస్తుంటాడు. ఇప్పుడు ఈ కోవలోనే ఇటీవల సంపూర్నేష్ బాబు, సంజోష్లు హీరోలుగా నటించిన సోదరా ట్రైలర్ విడుదల వేడుకకు అతిథిగా హాజరైన ఎస్కేఎన్, ఈ చిత్రం ఓ స్పెషల్ ప్రీమియర్ను తను సొంతంగా థియేటర్ బుక్ చేసుకుని, తన స్నేహితులకు, శ్రెయోభిలాషులకు ఈ సినిమా చూపిస్తానని హామీ ఇచ్చాడు. అయితే సాధారణంగా సినీ పరిశ్రమలో మాట మీద నిలబడటం చాలా తక్కువగా ఉంటుందని, ఒకవేళ ఏదైనా సపోర్ట్ చేస్తామని చెప్పిన అది ప్రకటనల వరకు పరిమితం అవుతుందనే అపోహ కొందరిలో ఉంటుంది. అయితే ఎస్కేఎన్ మాత్రం తను ఒక సారి మాట ఇస్తే తప్పకుండా నేరవేరుస్తుంటాడు. ఈ కోవలోనే ఎస్కేఎన్ సోదరా చిత్రం స్పెషల్ ప్రీమియర్ను తన సొంత ఖర్చుతో ఈ రోజు అనగా గురువారం ఏప్రిల్ 24న సాయంత్రం ఏషియన్ అల్లు అర్జున్ '(AAA) మల్టీప్లెక్స్ థియేటర్లో ఏర్పాటు చేశాడు. సోదరా చిత్రాం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా ఎస్కేఎన్ ఎవరికైనా ఆపద ఉందని తెలిసినా ఆర్థికంగా ఆదుకున్న సందర్బాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలోని ప్రతి హీరో అభిమానులకు కూడా వారికి ఏదైనా ఆపద ఉంటే ట్విట్టర్లో స్పందించి వారిని ఆదుకున్న ఘటనలు కూడా ఉన్నాయి -
బిగ్బాస్ షో హోస్ట్గా మళ్లీ..? నాని ఆన్సర్ ఇదే!
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)ను తెలుగులో మొదలుపెట్టింది జూనియర్ ఎన్టీఆర్. తొలి సీజన్కు తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరించి షోను సక్సెస్ చేశాడు. కానీ తర్వాత మాత్రం ఆ షో నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో హీరో నాని (Nani) ధైర్యం చేసి యాంకర్గా మారాడు. ఇది రియాలిటీ షో అన్న విషయం మర్చిపోయి గేమ్ షోనే కదా.. హోస్ట్ చేసేద్దాం అనుకున్నాడు. తన యాంకరింగ్ కూడా బాగానే ఉండేది.రెండో సీజన్ హోస్ట్ నానికానీ కంటెస్టెంట్ల అభిమానులు మాత్రం నానిపై విమర్శలు చేసేవారు. తన జడ్జిమెంట్లో ఏమాత్రం తేడా వచ్చినా ఆన్లైన్లో విపరీతంగా ట్రోల్ చేసేవారు. ఇదంతా చూసి నానికి దిమ్మతిరిగిపోయింది. ఏదో హోస్ట్గా వచ్చిన పాపానికి చెడుగుడు ఆడేసుకుంటున్నారని అప్సెట్ అయ్యాడు. తెలుగు బిగ్బాస్ రెండో సీజనే.. తన ఆఖరి సీజన్ అని ప్రకటించాడు. ఇంకెప్పుడూ ఈ రియాలిటీ షో జోలికి వెళ్లనన్నాడు.అదే ఆఖరి రోజుప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3 మే 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బిగ్బాస్ షో గురించి స్పందించాడు. నాని మాట్లాడుతూ.. నా జీవితంలో బిగ్బాస్ చాప్టర్ ముగిసిపోయింది. మళ్లీ దాని జోలికి వెళ్లే ప్రసక్తే లేదు. రెండో సీజన్ చివరి ఎపిసోడ్ రోజే బిగ్బాస్ హోస్ట్గా నా జీవితంలో ఇదే ఆఖరి రోజు అని పోస్ట్ పెట్టాను. బయటి ప్రపంచం తెలిసిందిబిగ్బాస్.. బయటి ప్రపంచం ఎలా ఉంటుందనేది నాకు కళ్లకు కట్టినట్లు చూపించింది. నన్ను మరింత టఫ్గా మార్చింది. ఒక గేమ్ షో అనుకుని వెళ్లాను. ఆ గేమ్ వెనకాల ఇన్ని ఎమోషన్స్ ఉంటాయా? అనిపించింది. అయితే చాలామంది అభిప్రాయాలు షో అయిపోగానే మారిపోతాయ్.. అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బిగ్బాస్ వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడటం లేదని నాని చెప్పకనే చెప్పాడు.చదవండి: పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి -
బాలకృష్ణ, నాగార్జున, బన్నీ..అందరికీ అదే పిచ్చి!
సినిమా తారలంటే చాలా మందికి డెమీ గాడ్స్ లెక్క. మరీ ముఖ్యంగా హీరోలనైతే ఆరాధ్యదైవాలగానే కొలుస్తారు. వారి కోసం తన్నడానికి , తన్నించుకోవడానికి, వాళ్ల సినిమాలకు ప్రచారం చేయడానికి మాత్రమే కాదు వాళ్ల కోసం ప్రాణాలిచ్చేయడానికి కూడా సై అంటారు. అంతటి ఆదరణ అభిమానాలు పొందినప్పుడు సహజంగానే పేరు ప్రఖ్యాతులతో పాటు దండిగా డబ్బు, సంపద వస్తుంది. దాంతో సెంటిమెంట్స్ కూడా బాగా ఎక్కువే ఉంటాయి.జ్యోతిష్యాన్ని, వాస్తును, ముహుర్తాలను విపరీతంగా నమ్మే హీరోలు మనకు ఎందరో ఉన్నారు. వీరిలో పలువురు సంఖ్యాశాస్త్రాన్ని కూడా బాగా విశ్వసిస్తారు. ఆ విశ్వాసంతోనే తమ వాహనాల నెంబర్ల విషయంలో రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన వాహనం కోసం అత్యంత డిమాండ్ ఉన్న ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్ను రూ.7.75 లక్షలకు దక్కించుకుని బాలకృష్ణ వార్తల్లో నిలిచారు. అదే విధంగా గ్లోబల్ స్టార్ హీరో జూ.ఎన్.టి.ఆర్ సైతం ఫ్యాన్సీ నెంబర్ల వేటలో ముందున్నారు. ఆయన తన లంబోర్గిని ఉరూస్ వాహనం కు టిఎస్09ఎఫ్ఎస్ 9999 నెంబర్ ను రూ.17లక్షలు ఖర్చు పెట్టారు. ఎన్టీయార్ దాదాపుగా తన అన్ని కార్లకూ 9999 నెంబర్నే ఎంచుకుంటారు. సూపర్ స్టార్ మహేష్బాబు తన వాహనాలైన రేంజ్ రోవర్, మెర్సిడెస్ జిఎల్ ఎస్ ల కోసం Výటిఎస్09 ఇకె 600, టిఎస్09జిఒ600 లను కొనుగోలు చేశారు. నాగార్జున బిఎండబ్ల్యూ 7 సిరీస్ కోసం ఎపి 09బిడబ్ల్యు 9000ను వేలంలో దక్కించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రేంజ్రోవర్, వోల్వో ఎక్స్సి 90ల కోసం టిఎస్07 జిఇ9999 నెంబర్ లపై రూ.10లక్షలు పైనే ఖర్చు చేశారు. సీనియర్ హీరో రవితేజ కూడా తన ఎలక్ట్రిక్ వాహనం బివైడి అట్టో 3 నెంబరు టిఎస్09జిబి 2628 కోసం రూ.17,628 వెచ్చించారు.అమితాబ్ ఆద్యుడు అనుకోవాలేమో...స్టార్డమ్ కి దేశంలోనే అందరికీ బిగ్ బి అని పేర్కొనదగ్గ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కు కూడా నెంబర్ సెంటిమెంట్ ఎక్కువే. ఆయన తన వాహనాలన్నింటికీ 11 నెంబర్ వచ్చేలా చూస్తారు. ఆయన పుట్టిన రోజు కూడా అదే కావడం విశేషం. అలాగే తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కి ఇష్టమైన నెంబర్ 2222, ధనుష్ 106 నెంబర్ని ఇష్టపడతారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 2727 నెంబర్ని ఎంచుకుంటారు. షారూఖ్ ఖాన్ 555, సంజయ్ దత్ 4545 తమ వాహనాలకి తరచూ కోరే నెంబర్స్. ఈ తరహా సెంటిమెంట్స్ హీరోయిన్స్కు పెద్దగా లేకపోవడం ఆసక్తికరం. హీరోలు నెంబర్ల వేటలో రూ.లక్షలు వెచ్చిస్తున్నప్పటికీ.. వారితో ధీటుగా ఫాలోయింగ్ అందుకుంటున్న హీరోయిన్లు మాత్రం ఈ నెంబర్ల పిచ్చికి దూరంగా ఉండడం విశేషం. -
శివ శంభో లాంటి సినిమాలను గౌరవించాలి: గోరటి వెంకన్న
‘‘భక్తి, సంగీతం, సాహిత్యం, నృత్యం నేపథ్యంలో రూపొందిన అరుదైన సినిమా ‘శివ శంభో’. ఇటువంటి చిత్రాలను మనమంతా గౌరవించాలి. అభిరుచి గల ప్రేక్షకులు ఈ తరహా చిత్రాలను తప్పక ఆదరిస్తారు’’ అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. తనికెళ్ల భరణి, సుమన్, కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి, కేశవర్థిని బేబీ రిషిత ప్రధాన పాత్రల్లో నర్సింగ్ రావు దర్శకత్వం వహించిన భక్తిరస చిత్రం ‘శివ శంభో’. అనంత ఆర్ట్స్ బ్యానర్పై బొజ్జ రాజగోపాల్, దోరవేటి సుగుణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘శివ శంభో’ లాంటి భక్తి చిత్రాలు అరుదుగా వస్తాయి. సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది’’ అని నర్సింగ్ రావు తెలి΄ారు. ‘‘థియేటర్కు వెళ్లి మా సినిమాని చూడాలి’’ అని నిర్మాత, రచయిత, సంగీత దర్శకుడు సుగుణ దోరవేటి కోరారు. ఈ వేడుకలో బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్, బర్దీపుర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర గిరి స్వామీజీ, ఫిల్మ్ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
ప్రభాస్ ఫౌజీ సినిమా హీరోయిన్ ఇమాన్వి (Imanvi)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror attack) జరిగిన నేపథ్యంలో.. పాకిస్తాన్పై జనం ఆక్రోశంతో ఉన్నారు. ఈ క్రమంలో హీరోయిన్ ఇమాన్వి కుటుంబానిది పాకిస్తాన్ నేపథ్యం అని ఓ వార్త వైరలవుతోంది. ఇమాన్వి తండ్రి గతంలో పాకిస్తాన్ మిలటరీలో పని చేశాడని.. వీళ్లది కరాచీ అని సదరు వార్త సారాంశం. చాలా మంది ఇదే నిజమని భ్రమపడి.. పాక్ అమ్మాయి అయిన ఇమాన్వీని ఫౌజీ నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు.తీవ్రంగా ఖండిస్తున్నా..ఈ క్రమంలో సదరు వార్తలపై ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది. "పహల్గామ్లో జరిగిన విషాద సంఘటన పట్ల నేను హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే సమయంలో నా గురించి, నా కుటుంబం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనుకుంటున్నాను. నా కుటుంబంలో ఎవరికీ పాకిస్తానీ మిలిటరీతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ద్వేషాన్ని రగిలించడం కోసమే ఇలా అబద్ధాలు పుట్టించారు.దుష్ప్రచారందీన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ఆ అబద్ధాలను వ్యాప్తి చేయడం బాధాకరం. నా పై దుష్ప్రచారం చేశారు. నేను భారతీయ మూలాలున్న అమెరికన్ వాసిని. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను. నా తల్లిదండ్రులు యువతగా ఉన్నప్పుడు అమెరికాకు వలస వచ్చారు. తర్వాత అమెరికా పౌరులుగా మారారు. నేను లాస్ ఏంజిల్స్.. కాలిఫోర్నియాలో జన్మించాను.నా రక్తంలోనూ..USAలో నా యూనివర్సిటీ విద్య పూర్తి చేసిన తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్గా, డ్యాన్సర్గా కళారంగంలో వృత్తిని కొనసాగించాను. అనంతరం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశాలను అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను. సినిమా నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది. భారతదేశంపై ప్రేమ, భక్తి నా రక్తంలోనూ ప్రవహిస్తోంది" అని ఇమాన్వి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) చదవండి: ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్! -
'గేమ్ ఛేంజర్' డిజాస్టర్పై సుబ్బరాజ్ కామెంట్లు.. ఫ్యాన్స్ ఫైర్
రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ గురించి కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్( Karthik Subbaraj) పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన కొత్త సినిమా 'రెట్రో' ప్రమోషన్స్లో భాగంగా 'గేమ్ ఛేంజర్' ఫలితం గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాకు సుబ్బరాజే కథ అందించారు. ఇదే విషయాన్ని దర్శకుడు శంకర్ కూడా పలు వేదికల మీద చెప్పారు. అయితే, తాజాగా ఈ సినిమాలో తన ప్రమేయం ఏమీ లేదని ఆయన చెప్పడం విశేషం.'గేమ్ ఛేంజర్' గురించి కార్తీక్ సుబ్బరాజ్ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. 'నేను కేవలం వన్ లైన్ మాత్రమే గేమ్ఛేంజర్ కోసం ఇచ్చాను. గ్రౌండెడ్గా ఉండే ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ పాయింట్తో స్టోరీ ఇస్తే చివరకు అది చాలా మార్పులకు లోనైంది. ఆ కథలో చాలామంది రచయితలు వేలు పెట్టడంతో చివరికి మరో రకంగా అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా విషయంలో ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఎవరూ ఊహించలేరు. జయాపజయాలు ఎప్పటికీ మనచేతుల్లో ఉండవు.' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.అయితే, ఇదే మాట సినిమా విడుదల సమయంలో ఎందుకు చెప్పలేదంటూ కార్తీక్ సుబ్బరాజ్ను మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రిలీజ్కు ముందు మాత్రం కథ మొత్తం నాదే అంటూ చెప్పి.. ఇప్పుడు సినిమా ఫలితం అనుకున్నంతగా లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అందరూ కలిసి చరణ్ను తీవ్రంగా నష్టపరిచారని వారు చెబుతున్నారు. 'గేమ్ ఛేంజర్' విడుదలకు ముందు సుబ్బరాజ్ ఏమన్నారంటే.. 'గేమ్ ఛేంజర్' స్టోరీ రాశాగానీ అది పక్కా శంకర్ విజన్తో రూపొందించబడుతుందని బహిరంగంగానే సుబ్బరాజ్ చెప్పారు. తన కథను తెరపైకి శంకర్ తీసుకొస్తే ఎలా ఆనందంగా ఉంటుందన్న దానికి గేమ్ ఛేంజర్ సినిమా నిదర్శనం అంటూ చెప్పారు. తన కథతో శంకర్ మూవీ తీయడం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం అంటూ సుబ్బరాజ్ పేర్కొన్నారు. "I have given only one liner of #GameChanger story to Shankar sir. In my version IAS officer was grounded, was excited to see Shankar sir's version. Many writers came onboard and so story & screenplay has been changed. Yes film didn't work audience🙁"-KSpic.twitter.com/DKNuUPh48G— AmuthaBharathi (@CinemaWithAB) April 24, 2025 -
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)ని భారత్తో సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కూడా పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, అల్లు అర్జున్తో పాటు బడా హీరోలంతా ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా సాయి పల్లవి(Sai Pllavi) కూడా ఉగ్రదాడి పై స్పందిస్తూ ఎక్స్లో సుధీర్ఘ పోస్ట్ పెట్టింది.‘పహల్గాం దాడిలో జరిగిన నష్టం, కలిగిన బాధ, ఏర్పడిన భయం నాకు వ్యక్తిగతంగా జరిగినట్లు అనిపిస్తోంది. చరిత్రలో జరిగిన భయంకరమైన నేరాల గురించి తెలుసుకుని.. ఇప్పటికీ అలాంటి అమానవీయ చర్యలకు సాక్షిగా ఉండడం వల్ల.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏమి మారలేదని అర్థమవుతుంది. ఆ జంతువుల సమూహం మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి ఆశను తుడిచిపెట్టేసింది. కుటుంబంతో జ్ఞాపకాలను సృష్టించాలనుకునే మనస్తత్వం నుంచి, మీ ఎమోషన్స్, మీ కుటుంబం మీ ముందే కోల్పోవడం చూడడం వరకు.. ఇది నన్ను మన మూలాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. నిస్సహాయంగా, శక్తిహీనులుగా, కోల్పోయిన అమాయక జీవితాలు, వేదనకు గురైన కుటుంబాల కోసం నా హృదయపూర్వక సంతాపాన్ని , ప్రార్థనలను అందిస్తున్నాను’ అని సాయి పల్లవి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. చాలా మంది నెటిజన్స్ సాయి పల్లవిని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కారణం గతంలో ఇండియన్ ఆర్మీ గురించి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలే. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ సమయంలో సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కశ్మీర్ పండితుల మీద జరిగిన దాడి.. గోవుల పేరిటి చేసే వాటిని రెండింటిని ఒకే విధంగా పోల్చారు. ఆ సమయంలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్ట్ పెడితే.. ఆ పాత వీడియోను షేర్ చేస్తూ సాయి పల్లవిపై మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సాయి పల్లవికి మద్దతు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. The loss, pain and fear feels personal. Learnt of horrific crimes in history and still a witness to such inhuman acts shows nothing has changed. A group of animals have wiped out hope.From a mindspace of wanting to create memories with family, to being thrown off your senses,…— Sai Pallavi (@Sai_Pallavi92) April 23, 2025 -
ఓటీటీలోకి సడెన్గా వచ్చేసిన 'హన్సిక' సినిమా
హన్సిక నటించిన గార్డియన్ సినిమా ఏడాది తర్వాత సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే మేకర్స్ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హన్సిక ఒక అందమైన యువతిగా, దెయ్యంగా ద్విపాత్రాభినయం చేసింది. ఫిలిం వర్క్స్ పతాకంపై విజయ్చందర్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్ దర్శకత్వం వహించారు. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. అయితే, ఈమూవీ బిగ్ డిజాస్టర్గా నిలిచింది. ఈ మూవీలో సురేష్ చంద్రమీనన్, శ్రీమాన్ కీలక పాత్రలలో నటించారు.ఔట్డేటెడ్ హారర్ మూవీగా ప్రేక్షకులు ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. అయితే, గతేడాది మే నెలలో విడుదలైన ఈ చిత్రం సడెన్గా 'ఆహా' తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత హన్సికకు మరో ఛాన్స్ దక్కలేదు. తెలుగులో చివరగా 105 మినట్స్ అనే మూవీలో ఆమె నటించింది. ప్రస్తుతం నషా పేరుతో తెలుగులో ఓ వెబ్సిరీస్ చేస్తున్న ఈ బ్యూటీ పలు టీవీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది.అసలు కథేంటంటే..రోటీన్ హారర్ స్టోరీగా దర్శకుడు శబరి గురుశరవణన్ తెరకెక్కించారు. అపర్ణ (హన్సిక) ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తుంది. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహాయంతో సిటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారిపై ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది? అసలు ఆ ఆత్మ ఎవరు? అపర్ణ శరీరంలోకి ఆ ఆత్మ ఎలా ప్రవేశించింది? ఆ ఆత్మ కారణంగా అపర్ణ జీవితంలో ఎలా చిక్కుల్లో పడింది అన్నదే అసలు కథ. -
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'అఖండ2'లో లేడీ సూపర్స్టార్ విజయశాంతి(Vijayashanti ) నటిస్తున్నారనే వార్తలు సోషల్మీడియాతో పాటు ప్రధాన మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అందులో ఆమె నటిస్తే సినిమాకు మరింత బజ్ క్రియేట్ అవుతుందని మేకర్స్ కూడా ప్లాన్ చేశారని టాక్ వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఆమె రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా కల్యాణ్రామ్తో అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో దుమ్మురేపారు. దీంతో ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారేమోనని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ బాలకృష్ణ( Nandamuri Balakrishna), చిరంజీవిలతో సినిమాలు చేస్తారని అభిమానులు భావించారు. అయితే, విజయశాంతి ఆలోచనలను భట్టి చూస్తే జరిగే పని కాదని చెప్పవచ్చు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి ఆమె మాట్లాడారు.తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయశాంతికి ఇలా ఒక ప్రశ్న ఎదురైంది. 'చిరంజీవితో 19, బాలకృష్ణతో 17 సినిమాలు చేశావట కదా.. మళ్లీ వారితో చేస్తావా..? ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చెరో సినిమా చేశాక మంత్రివైపోయి ఆ బిజీలో తిరుగు' అనే ప్రశ్నకు ఒక సెకను కూడా ఆలోచించకుండా విజయశాంతి సమాధానం ఇచ్చారు. 'నటించే చాన్స్ లేదు, ఎమ్మెల్సీగానే టైమ్ సరిపోదు… పనిచేయాలి కదా.. అసలు కుదరదు' అని చెప్పారు. ఆ ప్రశ్నే పూర్తిగా అసంబద్ధం అనిపించేలా విజయశాంతి సమాధానం ఇచ్చారు.విజయశాంతికి టైమ్ ఉన్నా కూడా చిరంజీవి(Chiranjeevi )తో సినిమా చేయదని సోషల్మీడియాలో కొందరు చెప్పుకొస్తున్నారు. గతంలో ఒక సినిమాకు సంబంధించి వారిద్దరి మధ్య కాస్త దూరం పెరిగిందని గుర్తుచేస్తున్నారు. అయితే, చిరంజీవి, బాలకృష్ణ కూడా విజయశాంతితో నటించడానిక ఇష్టపడకపోవచ్చు. దానికి ప్రధాన కారణం గతంలో వారికి సమానంగా స్టేటస్ను ఆమె అనుభవించారు. ఇప్పుడు వారి సినిమాల్లో ఆమెకు పాత్ర ఇవ్వాలంటే సమానమైన రోల్ ఇవ్వాలి. అందుకు వారిద్దరూ ఒప్పుకోరు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో మరో పాత్ర ప్రధానంగా హైలెట్ అవడం చాలా తక్కువని చెప్పవచ్చు. వారిద్దరి కంటే ప్రాముఖ్యత తక్కువగా ఉన్న రోల్ విజయశాంతికి ఇస్తే ఎట్టిపరిస్థితిల్లోనూ ఒప్పుకోరు. అందుకే ఈ కాంబినేషన్ను సెట్ చేయడం అంత సులభం కాదని నెటిజన్ల అభిప్రాయం.ఇప్పటి తరం యూత్కు అంతగా విజయశాంతి ఇమేజ్ గురించి తెలియకపోవచ్చు. ఒకప్పుడు హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో ఆమెకు కూడా అంతే స్థాయిలో ఇమేజ్ ఉండేది. అలాంటి స్టేటస్ను ఆమె అనుభవించారు. అందుకే రీసెంట్గా జరిగిన సినిమా వేడుకలో ఎన్టీఆర్తో పాటు కల్యాణ్రామ్ ఆమె పట్ల చాలా గౌరవంగానే మెలిగారు. కర్తవ్యం సినిమాకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డ్ అందుకోవడంతో పాటు 4 నంది, 6 ఫిలింఫేర్ అవార్డ్స్ను అందుకున్నారు. 1989లోనే ఆమె బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటడమే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషల్లో మెప్పించారు. సుమారు 200 సినిమాల్లో ఆమె నటించారు. బాలయ్య, చిరుతో సహా ఆ నంబర్స్కు దగ్గర్లో లేరు. -
చిరంజీవి సినిమాలో విలన్గా టాలీవుడ్ యంగ్ హీరో!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi,), అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగాస్టార్ కెరీర్లో గుర్తిండిపోయేలా సినిమా ఉంటుందని అనిల్ చెబుతున్నాడు. ఇందులో చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వింటేజ్ చిరంజీవి ఇందులో చూపించబోతున్నాడట. కామెడీతో పాటు మెగా ఫ్యాన్స్ ఆశించే యాక్షన్ కూడా ఇందులో ఉంటుందట. ఇందుకోసం అనిల్ బలమైన సీన్లు రాసుకున్నాడట. అంతేకాదు చిరంజీవిని ఢీకొట్టే విలన్గా ఓ యంగ్ హీరోని చూపించబోతున్నారట. అతనెవరో కాదు మెగాస్టార్ వీరాభిమాని కార్తికేయ(Kartikeya Gummakonda).ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు కార్తీకేయ. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో విలన్గానూ నటించాడు. నాని ‘గ్యాంగ్ లీడర్’ తో పాటు అజిత్ ‘తెగింపు’లో కార్తికేయ విలన్గా నటించి అందరిని మెప్పించాడు. ఇప్పుడు మళ్లీ చిరంజీవి సినిమాలో నెగెటివ్ రోల్ చేయనున్నాడు. అయితే ఇందులో విలన్ కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కామెడీ కూడా చేస్తాడట. ఈ పాత్రకు కార్తికేయ అయితేనే న్యాయం చేస్తాడని అనిల్ అతన్ని సంప్రదించారట. చిరంజీవి సినిమా అనగానే కార్తికేయ కథ వినకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా టాలీవుడ్లో వినిపిస్తున్న రూమర్స్ మాత్రమే. చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కార్తికేయ కూడా దీనిపై స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చిరంజీవితో కలిసి నటించాలనుకున్న కార్తికేయ డ్రీమ్ ఫుల్ ఫిల్ అయినట్లే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందట. విక్టరీ వెంకటేశ్ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతిథి పాత్రలో ఆయన నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. -
భారీ ట్విస్ట్లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ నటుడు నాజర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'ది అకాలీ'(The Akaali).. ఏడాది క్రితం తమిళ్లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ ఓటీటీలో రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీలో కథ, కథనాలతో పాటు భారీ ట్విస్ట్లు ఉంటాయి. ముఖ్యంగా నాజర్ పర్ఫార్మెన్స్కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో నాజర్తో పాటు వినోద్ కిషన్, తలైవాసల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు మహ్మద్ అసిఫ్ హమీద్ హారర్ థ్రిల్ మూవీగా దీనిని తెరకెక్కించారు.సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు. అయితే, ఇప్పటికే తమిళ వర్షన్ ఆహా(AHA) ఓటీటీలో రావడంతో చాలామంది చూసిన తర్వాత మూవీ బాగుందంటూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అదే ఓటీటీలో ఈ నెల 26 నుంచి తెలుగు ఆడియో అందుబాటులో ఉండనుంది. డార్క్ హారర్ థ్రిల్లర్గా ఈ మూవీ ఉండటంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.జానిస్ అనే అమ్మాయి తనకున్న అతీంద్రియ శక్తుల సహాయంతో వరుసగా హత్యలు చేస్తుంటుంది. అందులో దాగి ఉన్న మిస్టరీని ఛేదించేందుకు హమ్జా అనే పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇస్తాడు. సంబంధిత కేసును ఛేదించే క్రమంలో పోలీసు అధికారికి విస్తుపోయే విషయాలు తెలుస్తాయి. ఈ కేసు విషయంలో అతను తెలుసుకున్న షాకింగ్ నిజాలేమిటి..? మరి, జానిస్ ఎందుకు మర్డర్స్ చేయాల్సి వచ్చింది..? జానిస్ పూజలను హమ్జా ఎలా అడ్డుకున్నాడు? వంటి అంశాలు ఆసక్తిని పెంచుతాయి. -
24 క్రాఫ్ట్ వస్తేనే ఇండస్ట్రీ అభివృద్ధి సాధ్యం: ఆర్.నారాయణమూర్తి
‘కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్. ఎంతోగొప్పతనం ఉన్న మంచి మనిషి. 24 క్రాఫ్ట్స్ ఫెరడేషన్ ఏర్పాటు కోసం 1991లో ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది డ్యాన్సర్స్ అసోసియేషన్ స్థాపించడం. ఆ తర్వాత ఒక్కో యూనియన్ వచ్చాయి. నా ప్రతి సినిమాలోనూ ముక్కురాజు మాస్టర్ పని చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం దక్కడం నా అదృష్టం’ అన్నారు ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి. డాన్సర్స్ యూనియన్ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ‘24 క్రాఫ్ట్ వస్తేనే ఇండస్ట్రీ అభివృద్ధి సాధ్యం. తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాలను తలదన్నే స్థాయికి వచ్చిందంటే దానికి కారణం ముక్కురాజు మాస్టర్ లాంటి మహానుభావులే. ఈ అసోసియషన్లో ప్రస్తుతం 600 మంది డ్యాన్సర్స్ ఉన్నారంటే ముక్కురాజు మాస్టర్ వేసిన బలమైన పునాదే కారణం. సినీ పరిశ్రమలోని కార్మికులందరికీ చిత్రపురి కాలనీలో పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవిస్తున్నా’ అన్నారు‘ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఈరోజు ఫిల్మ్ ఫెడరేషన్ లేదు. డ్యాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్ లేకుండా ఫెడరేషన్ పూర్తి అయ్యేది కాదు. ఆ టైమ్లో ఏ నమ్మకంతోనో ముక్కురాజు మాస్టర్ వచ్చి డ్యాన్సర్స్ యూనియన్ స్టార్ట్ చేశారు. వీళ్ల కష్టంతోనే ఇవాళ అసోసియేషన్ ఉంది.ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఈ కమిటీకి నా అభినందనలు’ అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వల్లభనేని అనిల్ కుమార్, టీఎఫ్టీడీడీ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అలాంటి సినిమాలు చేయను : వశిష్ట ఎన్. సింహ
‘‘హారర్, కాలేజ్ లవ్స్టోరీ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా నాకు అలాంటి కథలు చెప్పాలనుకుంటే సమయం వృథా చేసుకోవద్దని చెబుతాను. ‘ఓదెల 2’ చిత్రం హారర్ ఫిల్మ్ కాదు.. దైవానికి, దుష్ట శక్తికి మధ్య వైరం. ఈ మూవీలో నేను ఓ ఆత్మ పాత్ర చేశాను. హీరో, విలన్ అని కాదు.. ప్రేక్షకుల చేత మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం’’ అని వశిష్ఠ ఎన్ . సింహా (Vasishta N. Simha) చెప్పారు. తమన్నా భాటియా లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’(Odela 2 Movie). దర్శకుడు సంపత్నంది సూపర్ విజన్లో అశోక్ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన వశిష్ట ఎన్ . సింహా బుధవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కిరాక్ పార్టీ’ (2018) సినిమాలోని ‘నీచమైన..’ అనే పాటను పాడి, సింగర్గా తెలుగులోకి వచ్చాను నేను. కన్నడలో నన్ను సింగర్గా పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్గారే తెలుగులోనూ గాయకుడిగా పరిచయం చేశారు. ఇక ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సినిమా తర్వాత ఓ రోజు సంపత్ నందిగారు కాల్ చేసి, ‘ఓదెల 2’ గురించి, నా పాత్ర గురించి చెప్పినప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. ఈ తరహా దెయ్యం పాత్ర నేను ఎప్పుడూ చేయలేదని వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమాలోని సమాధి శిక్ష సీక్వెన్స్ సవాల్గా అనిపించింది. ‘ఓదెల 2’ లో స్క్రీన్ పై తిరుపతి ఉన్నా లేకపోయినా అతని నామస్మరణ మాత్రం సినిమాలోని క్యారెక్టర్స్ చెబుతూనే ఉంటాయి. అలా ఈ సినిమాకు ఎవరైనా హీరో ఉంటే అది తిరుపతి పాత్రే. తమన్నాగారు నాగసాధువుగా అద్భుతంగా నటించారు. సంపత్నందిగారు ‘ఓదెల 2’ కథను అద్భుతంగా రాశారు. అశోక్ తేజ మంచి విజన్ ఉన్న డైరెక్టర్. డి.మధుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. డిఫరెంట్ రోల్స్తో ఆడియన్స్ నన్ను గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలని ఉంది’’ అని అన్నారు. -
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
గాయని ప్రవస్తి (Pravasthi) రీసెంట్గా ఒక వీడియోతో సింగర్ సునీతకు పలు ప్రశ్నలు సందించారు. వాటికి సమాధానం చెప్పాలని ఆమె కోరారు. మూడురోజులుగా ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం చుట్టూ పలు విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రోగ్రాంలో ఉన్న జడ్జెస్ వారికి నచ్చినోళ్లను మాత్రమే ఎంకరేజ్ చేస్తారని ప్రవస్తి కామెంట్ చేశారు. వారికి నచ్చన కంటెస్టెంట్స్ పట్ల వివక్ష చూపుతున్నారని చెప్పుకొచ్చారు. తనను బాడీషేమింగ్ కూడా చేశారని ఆమె అన్నారు. అయితే, ఇందులో ఎలాంటి నిజం లేదని సింగర్ సునీత ఒక వీడియోను విడుదల చేశారు. ఆపై వెంటనే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సింగర్ సునీత మరో వీడియోను తన సోషల్మీడియాలో షేర్ చేశారు. అయితే, ప్రవస్తి గురించి కాదు. మనిషి జీవితానికి అవసరమైన మోటివేషన్ ఇచ్చే లిరిక్స్తో ఆ పాట ఉంది. గోపీచంద్ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలోని సాంగ్ను ఆమె పంచుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఆ పాటకు కీరవాణి సంగీతం అందించడమే కాకుండా ఆలపించారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్ అందులో ఉన్నాయి. సింగర్ ప్రవస్తి గురించే సునీత ఈ పాటను పోస్ట్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి.‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) ప్రోగ్రాం వల్ల తెలుగు చిత్రపరిశ్రమకు చాలామంది సింగర్స్ పరిచయం అయ్యారు. ఒకరకంగా ఈ వేదికపై పాటలు పాడిన చాలామంది నేడు రాణిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఈ వేదిక మీద తమ గాత్రాన్ని వినిపించాలని పోటీ పడిన సింగర్స్ ఎందరో ఉన్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం ‘పాడుతా తీయగా’ జడ్జెస్గా ఉన్న సునీత, కీరవాణి, చంద్రబోస్లపై గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలతో సంచలనంగా మారింది. జడ్జిమెంట్ విషయంలో వివక్ష చూపుతున్నారని ప్రవస్తి తెలిపింది. కొందరి కంటెస్టెంట్స్ పట్ల జడ్జెస్ చాలా బాగుంటారని, వారు తప్పుగా పాడినా ఫైనల్ వరకు తీసుకొచ్చారని కొన్ని ఆధారాలతో ప్రవస్తి బయటపెట్టింది. అయితే, సింగర్ సునీత, నిర్మాత ప్రవీణ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇలా పలుమార్లు వివరణలు ఇవ్వడం ఎందుకని సునీత అనుకున్నట్లు ఉన్నారు. అందుకే ఒక సినిమా పాటతో ఆమె ఫుల్స్టాప్ పెట్టినట్లు ఉన్నారు. జీవితం అంటే ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా తెలుసుకోవాలని సునీత చెప్పినట్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
వాటి కంటే అభిమానులే నాకు ముఖ్యం: సాయిపల్లవి
మాలీవుడ్లో కథానాయకిగా కెరీర్ను ప్రారంభించిన నటి సాయిపల్లవి(Sai Pallavi ). తొలి చిత్రం ప్రేమమ్తోనే నటిగా తానేమిటో నిరూపించుకున్న ఈమె ఆ తరువాత తెలుగు, తమిళం, తాజాగా హిందీ అంటూ ఇండియన్ సినిమాను చుట్టేస్తున్నారు. సాధారణంగా ఒక్క అవకాశం అంటూ నటీమణులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అవకాశాలే సాయిపల్లవి కోసం ఎదురు చూస్తుంటాయి. అలాగని అల్లాటప్పా పాత్రల్లో నటించడానికి ఈమె ససేమిరా అంటారు. అది ఎంత భారీ చిత్రం అయినా, ఎంత స్టార్ హీరో చిత్రం అయినా సరే. తన పాత్రకు కథలో ప్రాధాన్యత ఉందా, అందులో నటనకు అవకాశం ఉందా అన్నది ఆలోచించి మరీ చిత్రాలు చేసే నటి సాయిపల్లవి. మణిరత్నం లాంటి దర్శకుడే ఈమెతో చిత్రం చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారంటే మామూలు విషయం కాదుగా. ఇటీవల సాయిపల్లవి కథానాయకిగా శివకార్తికేయన్ సరసన నటించిన అమరన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటూ ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. అదేవిధంగా నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా హిందీలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రామాయణంలో సీతగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈమె ఓ భేటీలో అవార్డుల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తనకు అవార్డుల కంటే అభిమానుల అభిమానమే ముఖ్యం అన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు తన కథా పాత్రలను చూసి అందులోని ఎమోషన్స్తో లీనమైతేనే చాలని అదే పెద్ద విజయంగా భావిస్తానని పేర్కొన్నారు. పాత్రల ద్వారా యదార్ధతను చెప్పే లాంటి పాత్రలను తాను ఎప్పుడూ కోరుకుంటానన్నారు. తాను భావించినట్లు ఆ కథాపాత్రల్లోని ఎమోషన్స్కు ప్రేక్షకులు కనెక్ట్ అయితే అదే పెద్ద విజయంగా భావిస్తానని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. అందుకే అవార్డుల కంటే అభిమానుల ప్రేమాభిమానాలే ముఖ్యం అన్నారు. అభిమానుల ఆదరాభిమానాలను పొందడానికే తాను ప్రాధాన్యతనిస్తానని స్పష్టం చేశారు. -
డాన్తో జోడీ?
బాలీవుడ్ కొత్త డాన్ రణ్వీర్ సింగ్ సరసన కృతీసనన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ ‘డాన్ ’ ఫ్రాంచైజీలో రూపొందనున్న కొత్త చిత్రం ‘డాన్ 3’. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించను న్నారు. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించనున్న ఈ మూవీని 2023 ఆగస్టులోనే ప్రకటించారు. కానీ, వివిధ కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. ఈ వేసవి నుంచి షూటింగ్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. కానీ, ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉండటంతో ఈ మూవీలో హీరోయిన్ గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ‘డాన్ 3’ కోసం కొత్త హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు ఫర్హాన్ అక్తర్. అందులో భాగంగా ఇటీవల శర్వారీ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా కృతీసనన్ పేరు బాలీవుడ్లో వినిపిస్తోంది. మరి.. ‘డాన్ 3’ లో రణ్వీర్ సింగ్ సరసన కృతీసనన్ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. కాగా హిందీలో వచ్చిన ‘డాన్ ’ (2006), ‘డాన్ 2’ (2011) సినిమాల్లో షారుక్ ఖాన్ హీరోగా, 1978లో వచ్చిన ‘డాన్ ’లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. -
నేను చెప్పేది మీరంతా వినాలి!
మోహన్ లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తుడరుమ్’. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన హీరోయిన్ గా నటించారు. ఎం. రంజిత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. కాగా, దీపా ఆర్ట్స్పై పి. శ్రీనివాస్ గౌడ్ ఈ చిత్రాన్ని ఈ నెల 26న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఆ గడ్డాన్ని ముట్టుకుంటే చేయి నరికేస్తా..., అన్నా.. మీరు ఇలా గడ్డం తడుముకుంటూ అయ్యోపాపం అని తిరిగితే ఎలా.., హేయ్.. ఈ గడ్డం ఉంటే ఎవరికిరా..ప్రాబ్లమ్.., ఓరేయ్ ఎందరో మహానుభావులు ఎక్కిన బండిరా ఇది.., ఈ కారు కోసం నువ్వు ఫ్యాన్లా ఈ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి, ఇక నేను చెప్పేది మీరంతా వినాలి!’ వంటి డైలాగ్స్ ‘తుడరుమ్’ ట్రైలర్లో ఉన్నాయి. ఓ ట్యాక్సీ డ్రైవర్ కుటుంబం, అతని కారు ΄ోలీస్స్టేషన్ లో చిక్కుకోవడం, ఆ తర్వాత వచ్చే సంఘటనల సమాహారంగా ఈ మూవీ ఉండబోతున్నట్లుగా ట్రైలర్ స్పష్టం చేస్తోంది. మణియంపిల్ల రాజు, బిను పప్పు, ఇర్షాద్ అలీ, ఫర్హాన్ ఫాజిల్ , థామస్ మాథ్యూ, షైజో ఆదిమాలి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ స్వరకర్త. -
కథ నచ్చితే ఆ తేడా చూడను: హరీష్ శంకర్
‘‘నాకు సినిమా కథ నచ్చితే భాష, చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా చూడకుండా ప్రమోట్ చేయడానికి ముందుంటాను. ‘జింఖానా’ చిత్రం ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాని అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు. నస్లెన్, లుక్మాన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్ ముఖ్య తారలుగా ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అలప్పుజ జింఖానా’. ఖలీద్ రెహమాన్, జోబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న మలయాళంలో విడుదలై, హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్పై సుబ్బారెడ్డి తెలుగులో ‘జింఖానా’ పేరుతో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ శంకర్ మాట్లాడుతూ–‘‘జింఖానా’ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న సుబ్బారెడ్డిగారికి అభినందనలు. నైజాంలో మైత్రీ మూవీస్ శశిగారు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తిరుగుండదు’’ అన్నారు. డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా నేను చూశాను.. చాలా బాగుంది. స్పోర్ట్స్ కామెడీ నేపథ్యంలో చాలా బాగా తీశారు’’ అని చెప్పారు. ‘‘స్పోర్ట్స్ కామెడీ ఫిల్మ్ ‘జింఖానా’. చాలా మంచి యాక్షన్ సీక్వెన్ ్సలు, పాటలుంటాయి’’ అని ఖలీద్ రెహమాన్ తెలిపారు. హీరో నస్లెన్ మాట్లాడుతూ–‘‘నేను నటించిన ‘ప్రేమలు’ సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన స΄ోర్ట్ మర్చి΄ోలేను. ‘జింఖానా’ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ఈ వేడుకలో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, డైరెక్టర్స్ సాగర్ కె. చంద్ర, సుజీత్, సందీప్, నటీనటులు బేబీ జీన్, లుక్మాన్ అవరన్, సందీప్ ప్రదీప్ మాట్లాడారు. -
పహల్గాం ఘటనను ఖండించిన హీరో కృష్ణసాయి
జమ్మూ కశ్మీర్ పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాద ఛాయలను నింపింది. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్టు నిర్వహకులు, టాలీవుడ్ హీరో కృష్ణసాయి చలించిపోయారు. ఈ ఘటనపై తీవ్రంగా ఖండించారు. 'అత్యంత క్రూరంగా వెంటాడి చంపారు. ఇండియన్ పారమిటరీ ఫోర్స్ ఏదో సైలెంట్గా ఉందని ఉగ్రవాదులు అనుకుంటే పొరపాటే, భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు ప్రపంచం ఆశ్చరపోయేలా భారత్ గట్టిబదులిస్తుంది. వారిని వెంటాడి ప్రతీకార చర్య ఉంటుంది. శాంతి కోరుకునే దేశాన్ని సహనం పరీక్షించేలా వ్యవహరించవద్దు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా దేశమంతా ఒక్కటిగా నిలవాలి' అని కృష్ణసాయి పిలుపునిచ్చారు.పహల్గామ్ మంగళవారం ఒక్కసారిగా రక్తసిక్తంగా మారింది. పర్వతాల మధ్య ప్రశాంతతను చీల్చిన ఉగ్రవాద దాడి దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ క్రమంలో పర్యాటకం కోసం వెళ్లిన అమాయకుల ప్రాణాలను ఉగ్రదాడి బలితీసుకుంది. -
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
సాధారణంగా సినిమాలు హిట్ అయినప్పుడు, కోట్లాది రూపాయల వసూళ్లు వచ్చినప్పుడు ఆనందం కొద్దీ నిర్మాతలు.. దర్శకులు, హీరోలకు లగ్జరీ బహుమతులు ఇస్తుంటారు. ఒకవేళ ఇస్తే దాన్ని చాలామంది చెప్పుకొంటారు. కానీ నాని మాత్రం దీని గురించి ఏ మాత్రం బయటపెట్టలేదట.హీరోగా వరస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్న నాని.. మరోవైపు నిర్మాతగానూ సక్సెస్ అందుకుంటున్నాడు. గత నెలలో థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'కోర్ట్' నిర్మించింది నానినే. అయితే ఈ సినిమా కోసం రూ.10 కోట్ల బడ్జెట్ పెడితే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: పహల్గామ్ ఉగ్రదాడి.. ప్రభాస్ సినిమాపై ఎఫెక్ట్!) అయితే ఈ సినిమా అద్భుతమైన హిట్ అయ్యేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయిన నాని.. 'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చాడట. ఈ విషయాన్ని సదరు డైరెక్టర్ రామ్ జగదీశ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నాని చేతుల మీదుగా కారు బహుమతిగా అందుకోవడం ఒక అచీవ్ మెంట్ అని రామ్ జగదీష్ చెప్పుకొచ్చాడు. గిఫ్ట్ ఇచ్చినట్లు బయటకు చెప్పుకోవడం నానికి ఇష్టం లేదని.. అందుకే ఎవరికీ చెప్పలేదని, లేదంటే గట్టిగా అరిచి తనకు కారు కొనిచ్చాడని చెప్పేవాడినని అన్నాడు.(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) -
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
పహల్గామ్ ఉగ్రదాడిలో మన దేశ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. దీని ఎఫెక్ట్ ఇప్పుడు ప్రభాస్ సినిమాపై కూడా పడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే హీరోయిన్ ఇమాన్వీని ఫౌజీ మూవీ నుంచి తీసేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది?ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'ఫౌజీ' వర్కింగ్ టైటిల్ తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే వేసవిలో రిలీజ్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ఇమాన్వీ అనే కొత్తమ్మాయి హీరోయిన్. పహల్గామ్ దాడి వల్ల ఈమెని మూవీ నుంచి తొలగించాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) ఇమాన్వీ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ.. ఈమె తండ్రి గతంలో పాక్ మిలటరీలో పనిచేశారని, వీళ్లది కరాచీ అని, ఇమాన్వీ పూర్తి పేరు ఇమాన్ ఇక్బాల్ ఇస్మాయిల్ అని అంటున్నారు. ఇమాన్వీలో పాకిస్థాన్ మూలాలు ఉన్నాయని అంటున్నప్పటికీ.. ఈమె ఢిల్లీలోనే పెరిగింది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు ఇమాన్వీది నిజంగా దాయది దేశమా లేదా అనేది క్లారిటీ రావాలి. మరోవైపు బాలీవుడ్ లోనూ వాణీ కపూర్ నటించిన 'అబిర్ గులాల్' సినిమాని కూడా నిషేధించాలనే డిమాండ్స్ వినిపించాయి. ఇందులో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించడమే కారణం. దీంతో పాక్ నటుల్ని మన దగ్గర ప్రోత్సాహించడం సరికాదని కొందరు అంటున్నారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. 10 రోజులు తాగుతూనే ఉన్నాం!) -
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
చీరలో అందమైన యువరాణిలా నిధి అగర్వాల్ఫొటోలతో మత్తెక్కించేస్తున్న ఆషికా రంగనాథ్నిషా కళ్లతో మాయ చేసేస్తున్న నేహాశెట్టిక్యూట్ రీల్ తో కిర్రాక్ అనిపించేలా మమిత బైజునాభి అందాలతో షాకిచ్చిన హీరోయిన్ వేదికమేకప్ వీడియో పోస్ట్ చేసిన శ్రుతి హాసన్హిమాచల్ ప్రదేశ్ ట్రిప్ లో యాంకర్ విష్ణుప్రియ View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
నిఖిల్ మళియక్కల్ (Nikhil Maliyakkal).. సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఇతడు తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో పాల్గొన్నాడు. ఈ షోలో టాస్కులతో అదరగొట్టిన ఇతడు సీజన్ విజేతగా నిలిచాడు. షోలో ఉన్నప్పుడు తన ప్రేమ కావ్యాన్ని చెప్తూ ఎమోషనలయ్యాడు. నటి కావ్య (kavyashree)ను తలుచుకుంటూ తమకు బ్రేకప్ అయిందన్న విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఎప్పటికైనా తనే భార్య అని.. కాళ్లు పట్టుకుని బతిమాలైనా సరే తన జీవితంలోకి తిరిగి రమ్మంటానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సీరియల్లో ఎంట్రీకట్ చేస్తే షో అయిపోయాక కావ్య తనపై ఎంత కోపంగా ఉందో గ్రహించాడు. తను ఎదురుపడితే చాలు ఆగ్రహంతో భగభగా మండిపోతున్నట్లు తెలుసుకున్నాడు. తను తిరిగి జీవితంలోకి రాదని అర్థమై.. ఆమెకు దూరంగా ఉంటున్నాడు. అయితే కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లో నిఖిల్ ఇటీవలే ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఎపిసోడ్లలో కనిపించి తర్వాత కనుమరుగయ్యాడు. మరోపక్క అభిమానులేమో నిఖిల్, కావ్యను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు.మీ ప్రేమ మర్చిపోలేనుఈ వ్యవహారానికి ఎలాగైనా ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నాడు నిఖిల్. తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో.. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. కాకపోతే నాదో చిన్న విన్నపం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. ఎవరి జీవితాలు వాళ్లు గడిపేస్తున్నాం. కాబట్టి దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి. మీ ప్రేమ, సపోర్ట్ నాకెప్పటికీ ఇలాగే కావాలి. నన్ను వేరేవాళ్లతో లింక్ చేయొద్దునేను చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి. పని పరంగా కాకుండా ఇంకా ఏ ఉద్దేశంతో అయినా సరే.. నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి, ఎవరి పోస్టులకూ నన్ను ట్యాగ్ చేయకండి. మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఐ లవ్యూ ఆల్.. అని రాసుకొచ్చాడు. మరి ఇప్పటికైనా నిఖిల్, కావ్య అభిమానులు ఈ జంటను బలవంతంగా కలపడం మానేస్తారేమో చూడాలి!చదవండి: ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్? -
సినిమా హిట్.. 10 రోజులు తాగుతూనే ఉన్నాం!
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరికీ తెలుసు. అయినా సరే తాగుతుంటారు. సామాన్యుల సంగతి పక్కనబెడితే సెలబ్రిటీలు కూడా మద్యం తాగుతుంటారు. కానీ ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ తెలుగు యువ నటుడు మాత్రం తన డ్రింకింగ్ అలవాటు గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) 'మ్యాడ్'(MAD Movie) ఫ్రాంచైజీలో మనోజ్ పాత్రలో ఆకట్టుకున్న నటుడు రామ్ నితిన్(Ram Nithin). లవర్ బాయ్ గా మంచి యాక్టింగ్ చేశాడు. ప్రేక్షకుల్ని అలరించాడు. అయితే తొలి భాగం హిట్ అయిన తర్వాత వరసగా 10 రోజుల పాటు తాను, సంగీత్ కలిసి మందు తాగుతూనే ఉన్నామని రామ్ నితిన్ చెప్పుకొచ్చాడు. 2021లో తాను తొలిసారిగా మందు తాగానని చెప్పిన రామ్ నితిన్.. 'మ్యాడ్' హిట్ అయిన తర్వాత వరసగా 10 రోజుల పాటు తాగానని, మందు ఇంత బాగుంటుందని అప్పుడు అనిపించిందని చెప్పుకొచ్చాడు. అలానే హాఫ్ బాటిల్ వోడ్కా తాగి, సంగీత్ ఇంట్లోని బాత్రూమ్ వాంతు చేసుకున్న సందర్భాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఓల్డేజ్ ప్రేమకథ.. తెలుగులోనూ స్ట్రీమింగ్) రీసెంట్ గా 'మ్యాడ్ స్క్వేర్'(MAD Square Movie) హిట్ అయిన తర్వాత కూడా పార్టీ చేసుకున్నామని రామ్ నితిన్ చెప్పుకొచ్చాడు. ఇకపై సినిమా హిట్ అయితేనే మందు తాగాలని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సంగీత్ శోభన్, నార్నె నితిన్, విష్ణు, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. మార్చి 28న థియేటర్లలో రిలీజై హిట్ అయింది. దాదాపు నెల తర్వాత అంటే ఏప్రిల్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) "We drank alcohol for 10 days after the success of MAD," says Ram Nithin. pic.twitter.com/yPBkpkrvfY— Movies4u Official (@Movies4u_Officl) April 23, 2025 -
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
ఐదేళ్ల వయసులోనే పాటలు పాడటం మొదలుపెట్టింది ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aradhya). సరిగమప లిటిల్ ఛాంప్స్ రియాలిటీ షోలో విజేతగానూ నిలిచింది. చిన్నతనంలోనే పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొంది. తెలుగు, తమిళ భాషల్లో పలు రియాలిటీ షోలలో పాల్గొంది. ఇటీవల మరోసారి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ షోలో పార్టిసిపేట్ చేసింది. ఈ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. తనపై జడ్జిలు సునీత, కీరవాణి, చంద్రబోస్ వివక్ష చూపించారని ఆరోపించింది. సింగింగ్ కెరీర్కు ఫుల్స్టాప్తననొక చీడపురుగులా చూస్తూ ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. షో నిర్మాతలు కూడా కొన్నిసార్లు సరైన డ్రెస్సులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవారంది. షోలో జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన తనకు ఇక భవిష్యత్తు ఉండదని అర్థమై గాయనిగా కెరీర్కు ఫుల్స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే పాటలంటే ప్రాణమున్న నువ్వు సంగీతాన్ని విడిచిపెట్టొద్దని.. సింగర్గా కొనసాగాలని గాయని మాళవిక (Singer Malavika) అభ్యర్థించింది. కష్టమంతా బూడిదపాలుఅందుకు ప్రవస్తి స్పందిస్తూ.. నాపై విషం కక్కుతూ ఉంటే ఇంకా ఈ ఫీల్డ్లో ఎలా కొనసాగగలను? మీరందరూ నేను పాడాలని కోరుకుంటున్నారు. కానీ నా కష్టం, ప్రతిభ అంతా బూడిదలో కలిసిపోతుంటే ఎలా తట్టుకోగలను? వివక్ష చూపిస్తుంటే ఎలా భరించగలను? అని ప్రశ్నించింది. మరోవైపు ప్రవస్తిపై సింగర్ హారిణి ఇవటూరి (Harini Ivaturi) ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ డ్రామాలు చాలు.. ప్రశంసల కోసం పాకులాడినప్పుడు విమర్శలు స్వీకరించే ధైర్యం కూడా ఉండాలి. చదవండి: 'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీఇంకా ఎంతవరకు లాగుతావ్?పాడుతా తీయగా షోలో చాలా ఎపిసోడ్లు చూశాను. కొన్ని చోట్ల నిన్ను నువ్వు ఇంకా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నీ పొరపాట్లను సరిదిద్దుకోవడం మానేసి అనుభవజ్ఞులైన జడ్జిలను ప్రశ్నిస్తున్నావా? నీకేదైనా అన్యాయం జరిగిందంటే అది షోలోనే తేల్చుకోవాలి. షో అయిపోయాక ఇలా పబ్లిక్లో మాట్లాడటం సరికాదు. జడ్జిల క్యారెక్టర్లను తప్పుపట్టడం అన్యాయం. నువ్వు నిరాశలో ఉన్నావని... దాన్ని ఇలా లాగుతూనే ఉంటావా? నీకు నిజంగా దమ్ముంటే వారితోనే నేరుగా మాట్లాడతావ్.టాలెంట్తోనే ఆన్సర్..ఇంత రచ్చ చేసి ఏం సాధించాలనుకుంటున్నావో నాకు తెలియట్లేదు. నీకంత బాధ ఉంటే నీ టాలెంట్తోనే సమాధానం చెప్పాలి. నా సొంత అనుభవమే చెప్తా.. ఒకసారి చివరి నిమిషంలో నేను పాడాల్సిన పాట మార్చేశారు. అయినా సరే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని పాడా.. బెస్ట్ పర్ఫామెన్స్ గెలుచుకున్నా! ఛాలెంజ్లు లేకుంటే మన ఎదుగుదల ఆగిపోతుంది. రియాలిటీ షోలలో ఒత్తిడి భరించలేకపోతున్నావంటే అవి నీకు సెట్టవవు. నీకేదైనా డ్రెస్ నచ్చలేదంటే అప్పుడే ముక్కుసూటిగా చెప్పేయాలి. అప్పుడే పోరాడాల్సిందిఅంతేకానీ ఇప్పుడెందుకు చెప్పడం? నీ ఎలిమినేషన్ అప్పుడు మీ తల్లి.. జడ్జిలతో ఎంత గట్టిగా మాట్లాడిందో.. నీకు జరుగుతున్న బాడీ షేమింగ్ గురించి మేనేజ్మెంట్ దగ్గర అంతే గట్టిగా చెప్పాల్సింది. ఇప్పుడు ప్రదర్శిస్తున్న ధైర్యం అప్పుడేమైంది. పబ్లిక్గా వాళ్లను విమర్శించడం దేనికి? అని ఆగ్రహించింది. ఈ పోస్ట్పై ప్రవస్తి స్పందిస్తూ.. అక్కా, దయచేసి నా బాధను డ్రామా అని పిలవొద్దు. నేను పిరికిదాన్ని అని కూడా అన్నారు. నిజంగా పిరికిదాన్నయితే పవర్ఫుల్ వ్యక్తుల గురించి మాట్లాడను. నేరుగా మాట్లాడొచ్చుగా అని ఇంకో పాయింట్ అన్నారు.నాకు ఛాన్స్ ఇస్తేగా!వాళ్లు నాకు అవకాశం ఇస్తే కదా నేరుగా మాట్లాడేది. స్టేజీ మీద ఉన్నప్పుడు నేను అడిగే ప్రశ్నలకు వాళ్లు ఏ సమాధానం చెప్పలేదు. నిజంగా పిరికిదాన్నయితే మీరందరూ నాకు వ్యతిరేకంగా మారిపోతారని తెలిసి కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు కదా! అని కౌంటర్ ఇచ్చింది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనకు జరిగిన ఓ మంచిని సైతం పొందుపరిచింది. ఇండస్ట్రీలో చెడు ఉన్నట్లే మంచి కూడా ఉందని పేర్కొంది. సంగీత దర్శకుడు తమన్ 'బ్రో' మూవీలో ఇతర సింగర్స్తో కలిసి వెనకాల కోరస్ పాడే అవకాశం ఇచ్చారని పేర్కొంది. View this post on Instagram A post shared by Harini Ivaturi (@hariniivaturi)చదవండి: ఆడవారికి ముద్దులు.. ఆయనది వంకరబుద్ధి.. నేనైతే -
‘కర్మణి' ప్రారంభం
నాగమహేష్, రూపాలక్ష్మి, 'బాహుబలి' ప్రభాకర్, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ‘కర్మణి’. రమేష్ అనెగౌని దర్శకత్వంలో, మంజుల చవన్, రమేష్గౌడ్ అనెగౌని నిర్మాతలుగా, రామారాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా దేవుని చిత్రపటాలపై సీనియర్ నటుడు నాగమహేష్ క్లాప్ కొట్టారు. నిర్మాత మంజుల చవన్ కెమెరా స్విచాన్ చేశారు.2022లో డైరెక్టర్ రమేష్ అనెగౌని తెరకెక్కించిన 'మన్నించవా..' మూవీకి అప్పట్లో ప్రేక్షకుల నుంచి మంచి ఆధరణ లభించింది. అదే ఉత్సాహంతో, అదే టీమ్తో కలిసి చేస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ 'కర్మణి'. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు రమేష్ అనెగౌని మాట్లాడుతూ.. ''ఫిలింనగర్ దైవసన్నిధానంలో ప్రొరంభోత్సవం జరిగే సినిమాలు సూపర్ హిట్ కొడతాయి. ఈ సెంటిమెంట్ మా 'కర్మణి' సినిమాకు కూడా కలుగుతుందని విశ్వాసం ఉంది. మే మొదటి వారంలో తొలి షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే తెలియపరుస్తాం''. అని అన్నారు. నిర్మాత మంజుల చవన్ మాట్లాడుతూ.. ''ఫిలింనగర్ దైవసన్నిధానంలో మా 'కర్మణి' సినిమా ప్రొరంభోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంచి టాలెంట్ ఉన్న టీమ్తోనే సినిమా చేస్తున్నాం. ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.'' అని అన్నారు. -
ఆర్ఎక్స్ 100 నేను చేయాల్సిన సినిమా: యంగ్ హీరో
కోర్ట్, కమిటీ కుర్రాళ్లు సినిమాలు కూడా కొత్త వారితో తీసినవే. అవి మంచి విజయాల్ని సాధించాయి. అలాగే మా ‘చౌర్య పాఠం’ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. సెన్సార్ సభ్యులు సినిమాని అప్రిషియేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అన్నారు యంగ్ హీరో ఇంద్ర రామ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘చౌర్య పాఠం’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు ఈ చిత్రంతో ప్రొడక్షన్స్లోకి అడుగుపెడుతున్నారు.కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఇంద్ర రామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ మాది విజయవాడ. అక్కడే చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్శిటీ ఇంజనీరింగ్ చేశాను. చదువుతో పాటు జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ నేర్చుకున్నాను. సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇంట్రస్ట్ ఇటు వైపు తీసుకొస్తుందని భావిస్తున్నాను. నక్కిన గారు ఈ ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని తెలిసి ఆయన్ని కలిశాను. అలా ఈ జర్నీ మొదలైయింది. ఈ సినిమాలో కథే మెయిన్ హీరో. ఈ సినిమాని హానెస్ట్ గా చేశాం. నక్కిన త్రినాథ్ గారు చాలా పాషన్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు.⇢ ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు. కథా రచయిత కార్తిక్ వాళ్ళ ఫాదర్ ఐజి గా పని చేశారు. ఇలాంటి కేసుని ఆయన టేకాఫ్ చేశారు. ఒక వీధిలో బ్యాంక్ ఉంటే మరో వీధిలో రూమ్ ని తీసుకొని అక్కడ నుంచి టన్నల్ తవ్వి బ్యాంక్ లోకి చొరబడ్డ సంఘటన జరిగింది. దానికి ఫిక్షన్ జోడించి ఈ సినిమాని చేయడం జరిగింది.⇢ ఈ సినిమా కోసం చాలా హోం వర్క్ చేశాం. ఇలాంటి సినిమా చేయడానికి ఎలాంటి రిఫరెన్స్ ఉండదు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ సినిమాలో టన్నల్స్ క్రియేట్ చేయడానికి చాలా కేర్ తీసుకున్నారు. ఇదొక డిఫరెంట్ వరల్డ్. చాలా కష్టపడ్డాం. అది స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇందులో ఒక ఫిక్షనల్ విలేజ్ ని క్రియేట్ చేయడం జరిగింది.⇢ ఈ సినిమాకి విజయ సేతుపతి గారు, నాగచైతన్య గారు, వరుణ్ తేజ్ అన్న అందరూ సపోర్ట్ చేశారు. అలాగే సజ్జనార్ గారి ఇంటర్వ్యూ కూడా చాలా హెల్ప్ అయ్యింది.⇢ నాకు రామ్ గోపాల్ వర్మ గారు ఇష్టం. సినిమా అవకాశం కోసం ఆయన దగ్గరికి వెళ్లాను. వంగవీటి సినిమా సమయంలో ఓ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే దర్శకుడు అజయ్ భూపతితో నాకు జర్నీ వుంది. ఆర్ఎక్స్ 100 నేను చేయల్సిన సినిమా. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. కార్తికేయ అద్భుతంగా చేశాడు. -
‘నీ కోసమే’ అంటూ హైపర్ ఆది నన్ను ఫ్లర్ట్ చేశాడు : నటి
హైపర్ ఆది (Hyper Aadi).. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా తెలుసు. బబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ కమెడియన్.. తనదైన పంచు డైలాగులతో బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులను కూడా విపరీతంగా నవ్విస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీ కావడంతో జబర్దస్త్ షోకి గ్యాప్ ఇచ్చాడు కానీ ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షో ద్వారా మాత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ షో ద్వారా చాలా మంది నటీమణులను బుల్లితెరకు పరిచయం చేశాడు. సినిమాల్లో బాగా ఫేం తెచ్చుకున్న ఆర్టిస్టులను తీసుకొచ్చి.. ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ ద్వారా బుల్లితెరకు పరిచయం చేస్తుంటాడు. షోని రక్తికట్టించేందుకు వారితో ‘పులిహోర’ కూడా కలుపుతుంటాడు. అందుకే ఆదిపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తుంటాయి. పలాన నటితో ప్రేమలో ఉన్నాడని..పెళ్లి చేసుకోబోతున్నాడని నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. తాజాగా ‘జనతా గ్యారేజ్’ఫేం దీపు నాయుడు(Deepu Naidu)తో ఆది ప్రేమలో పడినట్లు రూమర్స్ వచ్చాయి. వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ వినిపించింది. తాజాగా ఈ రూమర్స్పై నటి దీపు నాయుడు స్పందించింది. హైపర్ ఆది తనకు మంచి స్నేహితుడని, సరదాగా తనను ఫ్లర్ట్ చేస్తాడు కానీ మా మధ్య ఏలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేసింది. ‘హైపర్ ఆది ప్రొఫిషినల్గానే నాకు పరిచయం అయ్యాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ఆయనతో కలిసి స్కిట్ చేశా. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. నన్ను ఎప్పుడూ ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు. నాతో రీల్స్ చేస్తుంటాడు. ‘నేను ఏ అమ్మాయి కోసం వీడియోలు చేయలేదు. నీ కోసం చేస్తున్నాను’, ‘ఒక అందమైన అమ్మాయి ఉంది చూపించనా’ అంటూ వీడియో తీస్తూ ఫ్లర్ట్ చేస్తుంటాడు. మొదట్లో నాకు పెద్దగా నచ్చకపోయేది కానీ, క్లోజ్ నెస్ పెరిగిన తర్వాత అదంతా లైట్ తీసుకున్నా. ఇప్పుడు నాకు ఆది మంచి ఫ్రెండ్’ అని దీపు నాయుడు చెప్పుకొచ్చింది. ఇక బిగ్బాస్ షో గురించి మాట్లాడుతూ.. ‘సీజన్ 3లో నాకు చాన్స్ వచ్చింది కానీ వెళ్లలేదు. ఆఫర్ వచ్చిన విషయం అమ్మకు చెబితే..‘నువ్వు ఆ గొడవలు పడలేవు’ అని చెప్పింది. అందుకే నేను నో చెప్పాను. కానీ కొన్నాళ్ల తర్వాత అనవసరంగా మంచి చాన్స్ మిస్ చేసుకున్నానే’అని అనిపించింది. ఇప్పుడు అవకాశం వస్తే..కచ్చితంగా ‘బిగ్బాస్’లోకి వెళ్తాను’ అని చెప్పింది.కేరాఫ్ గోదావరి చిత్రంలో ఇండస్ట్రీ ఏంట్రీ ఇచ్చిన దీపు అలియాస్ దేదిత్య నాయుడు. జనతా గ్యారేజ్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. నక్షత్రంతో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తోంది. View this post on Instagram A post shared by DEEPU NAIDU DEDEEPYA☀️ (@deepu_naidu_dedeepya)