అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడం నేరం.. ఏపీ వార్షిక బడ్జెట్‌పై బుగ్గన సెటైర్లు | Buggana Rajendranath Comments On AP Budget For The Financial Year 2026–27, Calls Figures And Claims False | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడం నేరం.. ఏపీ వార్షిక బడ్జెట్‌పై బుగ్గన సెటైర్లు

Feb 14 2026 4:34 PM | Updated on Feb 14 2026 4:54 PM

buggana rajendranath comments on Budget for the financial year 2026–27

సాక్షి,తాడేపల్లి: ఏయే రంగాలకు బడ్జెట్‌లో ఎంత కేటాయించారో చెప్పలేదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు.శనివారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఆ బడ్జెట్‌పై బుగ్గన మీడియా మాట్లాడారు.

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడమంటే పెద్ద నేరం. బడ్జెట్‌ స్పీచ్‌లో అసత్యాలు చెప్పారు. సూపర్‌ సిక్స్‌ అంటూ ప్రజల్ని ఆశపెట్టి  అధికారంలోకి వచ్చారు. బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు లేవు. గతేడాది బడ్జెట్‌ బుక్‌ చూసినట్టే ఉంది. ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్‌ను రూపొందించారు. అసలు అప్పు ఎంత ఉందో చెప్పడం లేదు. 

మా హయాంలో 9శాతం వృద్ధి సాధించాం. గతేడాది ఆదాయం లక్షా 28 వేల 126కోట్లు చూపించారు. సవరించిన ఆదాయం లక్షా 11 వేల 865 చూపించారు. మూడు నెలల్లో 44,500 కోట్లు వస్తుందని చెప్పడం నమ్మేలా లేదు.  మా పాలనలో లక్షా35 వేల మంది యువకులకు ఉపాధి కల్పించాం. మా హయాంలో 10,032 విలేజ్‌ క్లీనిక్‌లు ఏర్పాటు చేశాం. 10,775 రైతుల భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి రూ.3700కోట్లు ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement