నల్లమల గిరుల నుంచి నమఃశివాయ పంచాక్షరి మంత్రం ప్రతిధ్వనిస్తోంది.
పాతాళ గంగలో భక్తి కెరటం ఎగిసిపడుతోంది. ఎటు చూసినా..
ఎక్కడ చూసినా అంతా శివ మయం. పాదయాత్రగా శివయ్య దండు తరలివస్తోంది.
శ్రీగిరిలో అడుగు పెట్టగానే మల్లన్న స్పర్శించాడనే అనుభూతికి లోనవుతున్నారు.
శివరాత్రి ఉత్సవాల వేళ శ్రీశైలం భక్తజనసంద్రమైంది.
కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్నను దర్శించుకునేందుకు క్యూలో బారులుదీరుతున్నారు.
మరో వైపు భక్తుల సేవలో దాతలు తరిస్తున్నారు. ఫొటోలు : వడ్డె శ్రీనివాసులు, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


