ఆకాశం యుద్ధ విమానాల శబ్దాలతో దద్దరిల్లింది. నింగి నుంచి నిప్పులు కురుస్తుండగా, నేలపైన యుద్ధ ట్యాంకులు కవాతు చేశాయి.
సముద్రంపై హెలికాప్టర్లు చక్కర్లు కొడుతుండగా, తాడు సాయంతో మెరైన్ కమాండోలు మెరుపు వేగంతో కిందకు దిగారు..
ఇవన్నీ సాగర తీరంలో మన నావికాదళం ప్రదర్శించిన వీరోచిత విన్యాసాలు. ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, ఇండియన్ ఓషన్ నేషనల్ కాంక్లేవ్లు జరగనున్నాయి.


