న్యూఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పరీక్షల అక్రమాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’(సీజేపీ) చేపట్టిన నిరసనల్లోనూ, భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలమైన కేరళలోని వయనాడ్లోనూ ఆయన కనిపించకపోవడంపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.
వయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వాద్రా బాధితులను పరామర్శించకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వయనాడ్ ప్రజలకు రాహుల్, ప్రియాంక పలు హామీ ఇచ్చారని, కానీ క్షేత్రస్థాయిలో ఎవరూ అందుబాటులో లేరని రాజ్యసభ ఎంపీ సుధాంశు త్రివేది ఆరోపించారు. మరోవైపు నీట్ వంటి పరీక్షల అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ‘ఛాత్రోన్ కీ గూంజ్’ పేరుతో సొంతంగా ప్రచారం చేస్తోందే తప్ప, సోనమ్ వాంగ్చుక్ నేతృత్వంలోని నిరసనలో పాల్గొనకపోవడం గమనార్హం. జులై 17న డెహ్రాడూన్లో జరగనున్న విద్యార్థి సమావేశంలో రాహుల్ పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా, క్లిష్ట సమయంలో రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడం రాజకీయంగా పెద్ద వివాదంగా మారింది.
ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ భీకర దాడి: హమాస్ కీలక కమాండర్లు హతం!


