తాతయ్య కంటే మనవడికే బీపీ ఎక్కువ.. | Silent Threat High Blood Pressure Rising Rapidly Among Young Indian Adults | Sakshi
Sakshi News home page

తాతయ్య కంటే మనవడికే బీపీ ఎక్కువ..

Jul 14 2026 1:25 PM | Updated on Jul 14 2026 1:36 PM

Silent Threat High Blood Pressure Rising Rapidly Among Young Indian Adults

యువతలో రక్తపోటు (హైపర్‌టెన్షన్) కేసులు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే కనిపించే ఈ సమస్య, ప్రస్తుతం 20, 30 ఏళ్ల వయసు వారిలోనూ ఎక్కువగా బయటపడుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్ అలవాట్లే దీనికి ప్రధాన కారణాలని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో 15 ఏళ్లు పైబడిన వారిలో 19.4% మహిళలు, 22.1% పురుషులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ‘ఐసీఎమ్ఆర్’ అధ్యయనం ప్రకారం, ప్రతి నలుగురు భారతీయులలో ఒకరికి హైపర్‌టెన్షన్ ఉంటోంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఈ వ్యాధి ఎలాంటి లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లేదా కిడ్నీ వ్యాధులు వచ్చే వరకు చాలామందికి తమకు బీపీ ఉందనే విషయమే తెలియడం లేదు.

అందుకే ఇంట్లోనే డిజిటల్ డివైజ్‌ల ద్వారా తరచూ బీపీని పరీక్షించుకోవాలని, వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ, తక్కువ ఉప్పు వాడకం, పండ్లు-కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వంటి జీవనశైలి మార్పుల ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement