ప్లీజ్‌ కాపాడండి.. స్టేషన్‌ ఎదుటే 40 నిమిషాల పాటు.. | Raj Kumar death outside UP police station help for 40 minutes | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ కాపాడండి.. స్టేషన్‌ ఎదుటే 40 నిమిషాల పాటు..

Jul 14 2026 12:15 PM | Updated on Jul 14 2026 12:16 PM

Raj Kumar death outside UP police station help for 40 minutes

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్(22) సుమారు 40 నిమిషాల పాటు ప్రాణాల కోసం సహాయం కోరినా, సకాలంలో వైద్య సహాయం అందక మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. జూలై 12న ఆటో చార్జీ విషయంలో డ్రైవర్‌తో రాజ్‌కుమార్‌కు వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమీపంలోని పోలీసుల పింక్ బూత్ వద్దకు వెళ్లి సహాయం కోరాడు. అయితే బూత్ మూసి ఉండటంతో లోపల ఉన్న సిబ్బంది దృష్టికి తీసుకెళ్లేందుకు గాజు తలుపును బలంగా కొట్టాడు. దీంతో గాజు పగిలి అతని చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న రాజ్‌కుమార్ దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే పడి సహాయం కోసం వేడుకున్నా ఎవరూ వెంటనే ఆస్పత్రికి తరలించలేదని తెలిపారు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘాజియాబాద్ పోలీసులు మాత్రం రాజ్‌కుమార్, ఆటో డ్రైవర్ ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని, గాయపడిన వెంటనే ఆస్పత్రికి తరలించామని చెబుతున్నారు. దీంతో, ఈ ఘటనపై ఘాజియాబాద్ డీసీపీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల స్పందన, వైద్య సహాయం అందించడంలో జరిగిన ఆలస్యం, వైరల్ వీడియోలతో పాటు ఘటన మొత్తం మీద సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement