breaking news
Social Media
-
బేబీ హీరోయిన్ లేటేస్ట్ లుక్..శారీలో సింగర్ మధు ప్రియ..!
ఈషా ఫౌండేషన్ ఈవెంట్ జ్ఞాపకాల్లో తమన్నా..జిమ్లో కష్టపడుతోన్న సుకుమార్ సతీమణి తబిత..శారీలో సింగర్ మధు ప్రియ..బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లేటేస్ట్ లుక్..హీరోయిన్ రంభ గ్లామరస్ లుక్.. View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Rambha💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) -
ఫేక్, ఏఐ కంటెంట్ నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ఫేక్ కంటెంట్ను అరికట్టడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంటెంట్కే పరిమితం కాకుండా, అన్ని రకాల కంటెంట్పై వర్తించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంటర్నెట్ యుగంలో వ్యక్తుల గోప్యత ఉల్లంఘన, నకిలీ సమాచారం, డీప్ఫేక్ వీడియోలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అందుబాబులోకి తెచ్చింది. తద్వారా వినియోగదారులు ఎవరైనా సంబంధిత సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లో చూసిన ఫేక్ కంటెంట్ గురించి సంబంధిత ఫ్లాట్ఫామ్ యాజమాన్యానికి నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెసులు బాటు కల్పించింది. ఉదాహరణకు, ఫేస్బుక్లో గోప్యత ఉల్లంఘించే వీడియో కనిపిస్తే, ఫేస్బుక్ గ్రివెన్సెస్ ఆఫీసర్కి ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా దాన్ని ఫ్లాట్ఫామ్ నుంచి తొలగిస్తుంది. అంతేకాదు, అశ్లీల కంటెంట్, పిల్లల లైంగిక నేరాలు, కులం లేదా మతం ఆధారిత ద్వేషం, నకిలీ సమాచారం వంటి వాటిని 36 గంటల్లో, వ్యక్తిగత నగ్నత్వం, లైంగిక సంపర్కం, డీప్ఫేక్ వీడియోలు వంటి వాటిపై ఫిర్యాదు వస్తే 2 గంటల్లో చర్య తీసుకోవాలి. కాపీరైట్, పేటెంట్, ట్రేడ్మార్క్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు అయితే 7 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాలపై కంటెంట్ తొలగించడానికి గడువు 36 గంటల నుండి 3 గంటలకు తగ్గించారు. జాతీయ భద్రత, శాంతిభద్రతలు, పరువు నష్టం వంటి అంశాలకు ఇది వర్తిస్తుంది.మీరు ఫిర్యాదు చేసినా సదరు సోషల్ మీడియా యాజమాన్యం పట్టించుకోకపోతే 30 రోజుల్లో ప్రభుత్వ Grievance Appellate Committee (GAC)ని సంప్రదించవచ్చు. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. వెబ్సైట్ gac.gov.inలో మొబైల్ నంబర్, OTP, ఆధార్ ద్వారా నమోదు చేసి, ‘File New Appeal’ ద్వారా వివరాలు సమర్పించాలి. కమిటీ నిర్ణయం తప్పు అని భావిస్తే, కంటెంట్ తొలగించాలని ఆదేశించవచ్చు. ఏఐ కంటెంట్పై ప్రత్యేక నియంత్రణలు కూడా ఉన్నాయి. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్కి తప్పనిసరిగా లేబుల్ (నోటీసు) ఇవ్వాలి. ఆడియో లేదా వీడియోలో ప్రారంభంలోనే ఇది AI కంటెంట్ అని స్పష్టంగా చూపించాలి. అశ్లీల కంటెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ, నకిలీ పత్రాలు, డీప్ఫేక్లు ఉత్పత్తి కాకుండా ఆటోమేటెడ్ టూల్స్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కంటెంట్ అప్లోడ్ చేసే సమయంలో వినియోగదారుల నుండి అఫిడవిట్ తీసుకోవాలి.ఇప్పటివరకు సోషల్ మీడియా సంస్థలకు సేఫ్ హార్బోర్ ప్రొటెక్షన్ ఉండేది. కొత్త నిబంధనలతో, ప్లాట్ఫారమ్లు కంటెంట్ తొలగించడంలో విఫలమైతే ఈ రక్షణ కోల్పోతాయి. అంటే, వినియోగదారులు రాసిన పోస్ట్పై కూడా కంపెనీలు న్యాయపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఒకవైపు గోప్యత రక్షణను బలపరుస్తాయి, మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేలా రూపొందించబడ్డాయి. AI కంటెంట్కి ప్రత్యేక నియంత్రణలు ఉండటం వల్ల భవిష్యత్తులో డీప్ఫేక్లు, నకిలీ వీడియోలు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. -
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో సెన్సేషన్గా అందాల ‘ఐరా’
క్రికెట్ మ్యాచ్లు జరుగుతుఉన్నపుడు కేవలం ఓవర్లు పరుగులు, బాల్స్, వికెట్స్, విజయాలు, రికార్డులు మరికొంతమంది కూడా విశేషంగా మారిపోతుంటారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా అవతరిస్తారు. ఇటీవల భారతదేశం , అమెరికా మధ్య జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాయ్లో ఇలాంటి విశేషమే చోటు చేసుకుంది. ఒక అందాల ముందు గుమ్మ ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయింది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ 3వేల 3.77 లక్షలకు పెరిగిందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.ICC పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తళుక్కున మెరిసింది ఐరా రావత్ (Aira Rawat). ఆ క్షణం ఆన్లైన్లో సంచలనం సృష్టించింది. ఇండియా vs USA మ్యాచ్ సందర్భంగా కెమెరా ప్యాన్ అవుతూన్న సందర్భంలో ఒక యువతి వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతే నిమిషాల్లోనే, ఇంటర్నెట్ ఆమె ఫోటోలు, వీడియోలతో నిండిపోయింది. మ్యాచ్ రోజున ఆమె నీలం రంగు టీ-షర్టు, తెల్లటి షార్ట్ స్కర్ట్ ధరించి స్టేడియంలో సందడి చేసింది. ఉత్కంఠగా జరుగుతున్న మ్యాచ్ మధ్యలు ఆమె హావభావాలు మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. టీమిండియా పట్ల అమె అభిమానానికి,ఆమె క్రికెట్ వైబ్స్కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆసక్తికరంగా, తోటి క్రికెట్ ప్రేమికులతో కలిసి గ్రూప్ సెల్ఫీ తీసుకుంటున్న రావత్ ఫోటోలు కూడా వైరల్గా మారాయి.ఇదీ చదవండి: తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్ ఎవరీ ఐరాఇరా రావత్ నిజమైన వ్యక్తినా లేక AI-జనరేటెడ్ ఐడెంటిటీనా అన్న ఊహాగానాలకు భారీగా వ్యాపించాయి. ఐరాకు క్రికెట్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టమట. ఇన్స్టాగ్రామ్ పేజీలో, క్రికెట్ స్టేడియంలో పోజులిచ్చిన కొన్ని ఫోటోలను చూడవచ్చు. ప్రత్యక్ష మ్యాచ్లను చూడటానికి రావత్ తరచుగా స్టేడియాలలో వాలిపోతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లకు ఆమె వీరాభిమాని. నిజానికి, ఒకసారి విరాట్ కోహ్లీని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని కూడా చెప్పింది రావత్. విరాట్ అనుష్క శర్మను వివాహం చేసుకున్నప్పుడు రావత్ వయసు దాదాపు 18 సంవత్సరాలు. అంతేనా ఐరా రావత్ మంచి ఫ్యాషన్ ఐకాన్ కూడా. అందుకే తన బయోలో తనని తాను ఫ్యాషన్ డ్రీమర్ అని పేర్కొంది. ఫ్యాషన్ , స్టైలింగ్ పట్ల ఆసక్తి ఎక్కువటఇరా రావత్ గురించి నిజం ఏమిటంటే..ఇరా రావత్ నిజమైన వ్యక్తినా లేక AI-జనరేటెడ్ ఐడెంటిటీనా అనే దానిపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ విడుదల కాలేదు. అయితే, కొన్ని AI డిటెక్షన్ టూల్స్ , డిజిటల్ విశ్లేషకులు ఆమె వైరల్ చిత్రాలను "అనుమానాస్పదంగా" ఫ్లాగ్ చేయడంతో ఇవి ఏఐమాయాజాలమే అనే ఊహాగానాలకు మరింత పెరిగాయి. AI-జనరేటెడ్ కంటెంట్ వాస్తవికంగా మారుతున్న నేటి డిజిటల్ యుగంలో, అసలైన, వర్చువల్ ఐడెంటిటీల మధ్య రేఖను గుర్తించడం చాలా కష్టతరంగామారింది. అందుకే గుడ్డిగా నమ్మకుండా వినియోగదారులు ఇలాంటి ప్రొఫైల్స్ను ఫాలో అయ్యేముందు ప్రామాణికతను ధృవీకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.(కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్) View this post on Instagram A post shared by Aira Rawat (@aira_rawat_) -
పోలీస్ వేషం, వీడియో కాల్ : నమ్మితే మునిగినట్టే!
బెట్టింగ్ యాప్లు, సైబర్ మోసాలు, స్కాంలపై అలుపెరుగని పోరు సల్పుతూ, నిరంతరం ప్రజల్లో అవగాహ కల్పించే, పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరో ఇంట్రస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవలి కాలంలో విద్యావంతులు కూడా డిజిటల్ అరెస్ట్ స్కాం బారిన పడి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్న కేసులను అనేకం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలపై అవగాహన కల్పిస్తూ వచ్చిన ఒకవీడియోను ఎక్స్లో షేర్ చేశారు. దీంతో పాటు తన సందశాన్ని కూడా జోడించారు.‘‘పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.దయచేసి గమనించండి... పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపరు, డబ్బులు అడగరు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు. ఇలాంటి కాల్స్ వస్తే ఆందోళన చెందకండి.హైదరాబాద్ పోలీసులు చేపట్టిన 'జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియోను షేర్ చేసి, మీ వారికి కూడా అవగాహన కల్పించండి’’ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.దయచేసి గమనించండి...… pic.twitter.com/mzA6JNKBrk— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 14, 2026 -
స్వయంభూ హీరోయిన్ లేటేస్ట్ స్టిల్స్.. రెడ్ డ్రెస్లో మెగా డాటర్ నిహారిక..!
స్వయంభు స్టిల్స్ షేర్ చేసిన సంయుక్త మీనన్..వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ అనిఖా సురేంద్రన్..మెగా డాటర్ నిహారిక కొణిదెల లేటేస్ట్ పిక్స్..మెడికల్ గ్రాడ్యుయేషన్ పిక్స్ షేర్ చేసిన శ్రీలీల.. View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
నెలకు రెండున్నర లక్ష : సొంత బిజినెస్, ఐటీ మేనేజర్ కంటే మేలే!
ఎవరో వస్తారని...ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కూచుంటే జీవితం ముందుకు సాగదు. అందుబాటులో ఉన్న వనరులనే ఉపయోగించుకొని అడుగు ముందుకు వేయాలి. మన ప్రయత్నాలకు అదృష్టం కూడా కలిసి వస్తే..ఇంకేముంది విజయం మనముందు సాగిల పడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీ ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది.. ఒక మధ్య తరగతి జంట ఆలోచనా దృక్పథంలో వచ్చిన మార్పు గొప్ప విజయానికి నాంది పలికింది. ఎవరా జంట? ఏమా బిజినెస్ తెలుసుకుందాం.నళిని ఉనగర్ అనే కంటెంట్ క్రియేటర్ 'ఎక్స్' వేదికగా తాను క్రమం తప్పకుండా సందర్శించే డ్రై-క్లీనింగ్ దుకాణం యజమానితో జరిగిన సంభాషణను వివరించారు. డ్రై క్లీనింగ్ వ్యాపారాన్ని భార్యాభర్తలిద్దరూ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వీరికి తోడు మరో ఇద్దరు అదనపు ఉద్యోగులున్నారు. ఇండియాలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్తో సమానమైన నెలవారీ ఆదాయాన్ని పొందుతున్నారని ఉనగర్ తన పోస్ట్లో పేర్కొన్నారు. దీనికి వారికి ఖర్చులన్నీ పోను నెలవారీ లాభం రూ.2.37 లక్షల లాభం వస్తుంది. సగటున, వారు ప్రతి నెలా రూ. 2 లక్షలకు పైగా సంపాదిస్తారట.Yesterday, I was talking with the dry cleaning shop owner near my house, where I regularly go. He and his wife both work together, and they have two helpers on salary. I was shocked when they said they earn around ₹2,00,000 per month, which is equal to a 10+ years experienced… pic.twitter.com/BjPddpb9Me— Nalini Unagar (@NalinisKitchen) February 9, 2026నెటిజన్ల స్పందనహైదరాబాద్లోని ఇడ్లీ-దోస విక్రయించే అనేకమంది విజయగాథలను చూశాను. తన ఏరియాలో అలాంటి ఒక వ్యక్తి ఇంటి ఖరీదు కోటికిపైమాటేననీ, తాను గల్ఫ్లో దశాబ్దాలు కష్టపడినా అద్దె ఇల్లే. స్వంత వ్యాపారం చేయడం చాలా గ్రేట్ అని ఒకరు వ్యాఖ్యానించారు. వైట్-కాలర్ ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు అనే చట్రంలో ఇరుక్కుపోయాం. కానీ ఇలాంటి కథలు చిన్నదో పెద్దదో ఒక వ్యాపారాన్ని కలిగి ఉండటం నిజమైన సంతృప్తితోపాటు, కొన్నిసార్లు చాలా ఎక్కువ ప్రతిఫలదాయకం కూడా అని ఒకరు, ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏముంది అనుకూలమైన వ్యాపార వాతావరణం ఉంటే చిన్న వ్యాపారమైనా, లాభాలు మెండు అని మరొకరు కామెంట్ చేశారు. కాగా ఈ లెక్కలపై పెదవి విరిచిన వారు లేకపోలేదు. ‘‘నేను నా ఇంటి దగ్గర దుకాణం నడుపుతున్న నా డ్రై-క్లీనింగ్ భయ్యాతో కూడా మాట్లాడాను. అతను ఆ వైరల్ పోస్ట్ పూర్తిగా తప్పుదారి పట్టించేది అని చెప్పాడు. రూ. 2.37 లక్షల లాభం గురించి కలలు కనకండి. వాస్తవానికి, అన్ని ఖర్చుల పోనూ వాస్తవ లాభం నెలకు దాదాపు రూ. 60వేలు ఉంటుందని ఒక యూజర్ లెక్కలు చెప్పారు.ఇదీ చదవండి: ప్రియురాలు రిజెక్ట్ చేసిందని..శపథం చేసి కొట్టాడు సక్సెస్!వైట్ కాలర్ జాబ్స్ అని, మంచి ఆదాయం అని మన గొప్ప వాళ్లం అని మురిసిపోవాల్సిన అవసరం లేదు. కష్టపడే తత్వం, వ్యాపార మెళకువలు ఉంటే ఏ పనైనా గౌరవప్రదమే, లాభదాయకమే. భారీ ఆదాయం మాట ఎలా ఉన్నా.. ఉద్యోగ భయం. ఆందోళన, అధికార్ల వేధింపులు. శని, ఆదివారాలు కూడా లాప్టాప్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఏమంటారు..! -
అమలాపాల్ ఫుల్ గ్లామరస్.. సంయుక్త మీనన్ బ్యూటిఫుల్ పిక్స్..!
ఫుల్ గ్లామరస్తో మెరిసిపోతున్న హీరోయిన్ అమలా పాల్..స్వయంభూ బ్యూటీ సంయుక్త మీనన్ లేటేస్ట్ పోజులు..యూకేలో చిల్ అవుతోన్న కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ..బ్లాక్ డ్రెస్లో కల్యాణి ప్రియదర్శన్ గ్లామరస్ పిక్స్.. స్టైలిష్ హెయిర్ లుక్లో హీరోయిన్ ప్రియమణి.. View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by SEERATH SHEIK | MAKE-UP ARTIST (@seerathmystique) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
సోషల్ మీడియా జమానా.. బాబు బుక్ అయినట్టేనా?
చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని అంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రను సోషల్ మీడియా వెలికితీస్తున్న వైనమిప్పుడు ఒక రకంగా సంచలనం సృష్టిస్తోంది. హిందూ మతోద్ధారకుడిగా తరచూ ప్రచారం చేసుకుంటున్న ఆయన అసలు రూపాన్ని బయటపెట్టాయి ఈ పోస్టులు.తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందంటూ దిక్కుమాలిన వివాదాన్ని సృష్టించి వైఎస్సార్సీపీపై రుద్దేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. పైగా.. ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నిర్దిష్ట ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు తొమ్మిది మంది నేతలతో సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది బాబుగారికి. అక్కడ కూడా మరోసారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు కల్తీ అంటూ ఏదో మాట్లాడబోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పించుకుని డబ్బుకోసం ఈ కల్తీ జరిగిందని తనకు తోచిన సలహాను చంద్రబాబు చెవిలో చెప్పేయత్నం చేశారు. దానిని అంగీకరించని చంద్రబాబు అవినీతి కాదు.. హిందూమతంపై దాడి చేయడానికి జరిగిన కుట్ర అని ప్రకటించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా చెప్పారని, అప్పుడు తాను దానికి వ్యతిరేకంగా మెట్ల ద్వారా తిరుమల వెళ్లి దానిపై వారి పక్షాన క్షమాపణ కోరానని అన్నారు. నిజంగా ఆయన అలా చేశారా? అన్నది గుర్తు లేదు కాని కొంతమంది సోషల్ మీడియా ప్రముఖులు చూపిన ఆధారాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది మొదలు టీడీపీ మీడియా, ఇతరత్రా వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు ఆరంభించాయి. హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయాలని ప్లాన్ చేశారు. పంచాయితీ ఎన్నికలు సందర్భంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పవిత్రమైన తిరుమల ప్రాంతంలో ఎన్నికలు జరపడం సరికాదన్న భావనతో వందేళ్లుగా తిరుమల కొండలుగా భావిస్తున్న ప్రాంతంలో ఎన్నికలు జరపవద్దని ఒక జీవో ఇచ్చారు. పచ్చ తమ్ముళ్లు దీన్ని ఓ అవకాశంగా తీసుకుని సహచర ఎల్లో మీడియా సాయంతో వివాదాన్ని సృష్టించారు. ఆ జీవోను వైఎస్కు అంటకట్టి అందులోని వివరాల ప్రకారం రెండు కొండలే పరిధిలోకి వస్తాయని, ఏడు కొండలు రావని అంటూ గొడవ మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న రాజశేఖరరెడ్డి తిరుమల విస్తీర్ణంపై ఉన్న అస్పష్టతను వెంటనే తొలగిస్తూ మొత్తం ఏడు కొండలూ వచ్చేలా కచ్చితమైన జీవో ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలో 18 ప్రముఖ హిందూ దేవాలయాలున్న ప్రాంతాలను టెంపుల్ సిటీలుగా ప్రకటించి ఆయాచోట్ల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అన్యమత ప్రచారంపై నిషేధం విధిస్తూ మరో జీవో జారీ చేశారు.అంతేకాదు... వైఎస్ తన హయాంలో తిరుమల విశిష్టతను కాపాడేలా, హిందు మత విశ్వాసాలను పరిరక్షించేలా అనేక చర్యల తీసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలలో ఎస్వీబీసీ ఛానెల్ పెట్టి స్వామివారి ప్రచారం చేయాలని సంకల్పిస్తే చంద్రబాబు దాన్ని అసెంబ్లీలోనే వ్యతిరేకించారు. ఆ ఛానెల్కు రూ.40 కోట్లు వృథా అని అని వాదించారు. 2009 ఎన్నికలకు ముందు గుంటూరు వద్ద జరిగిన బైబిల్ మిషన్ ఉత్సవాల్లో చంద్రబాబు చేసిన ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఏడు కొండలూ తిరుమలేశుడివే అని, అన్యమత ప్రచారం నిషేధిస్తూ వైఎస్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తామని ఆ సభలో ప్రకటించారు. ఈ జీవోల వల్ల క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని కూడా చంద్రబాబు అన్నారట. ఇప్పుడేమో తాను రెండు కొండలు, ఏడు కొండలు పోరాటం చేశానని చెబుతున్నారు. అప్పుడేమో హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధించే జీవోను రద్దు చేస్తామన్నారు. 2019-24 మధ్యలో అన్యమత ప్రచారం జరిగిపోతుందన్నట్లు వదంతులు సృష్టించి టీడీపీ మీడియా ప్రచారం చేసేది. ఎంత ఆత్మవంచన.2009లో ప్రముఖ హిందూవాది టి.హనుమాన్ చౌదరి ఒక లేఖ రాస్తూ చంద్రబాబు తీరును తప్పు పట్టారు. అన్యమత ప్రచారానికి అవకాశం ఇచ్చే విధంగా జీవో ఇస్తానని చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. క్రిస్టియన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. క్రిస్టియన్లుగా మారిన ఎస్సీ, ఎస్టీ హిందువులకు కూడా రిజర్వేషన్లు వర్తింప చేస్తామని చంద్రబాబు ఇచ్చిన మరో హామీని కూడా ఆయన విమర్శించారు. క్రిస్టియన్ ఓట్ల కోసం, మత మార్పిడులను ప్రోత్సహించేలా చంద్రబాబు ఇలాంటి హామీలు ఇచ్చారని విమర్శిస్తూ 2009 ఫిబ్రవరి మూడున రాసిన లేఖ సోషల్ మీడియా యాక్టివిస్టులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఇది రాకపోతే చంద్రబాబు చెప్పే మాటలు నిజమేనేమో, ఈయన హిందుత్వ కోసం కట్టుబడి ఉండే వ్యక్తేమో అన్న భావన ఉండేది కదా!.1996 ఎన్నికల సమయంలో చంద్రబాబు కమ్యూనిస్టులతో పొత్తులో ఉండేవారు. ప్రచార సభలో బీజేపీని మతతత్వ పార్టీగా, మసీదులు కూల్చే పార్టీగా ధ్వజమెత్తేవారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనని మహానాడులో ప్రకటించారు. కానీ, ఆ తర్వాత జరిగిన సంగతులు తెలిసినవే. గుజరాత్లో జరిగిన మత కలహాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి మోదీని పదవి నుంచి దించాలని డిమాండ్ చేసి, తదుపరి లోక్సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఓటింగ్ వరకు ఉండకుండా జారుకున్నారు. 2019లో ప్రధాని మోదీపై వ్యక్తిగత పరుష వ్యాఖ్యలు చేసింది ఇటీవలి చరిత్రే. 2024 వచ్చేసరికి మోదీ ప్రపంచానికి మార్గదర్శి అని, దేశానికి ఆయన గొప్ప సేవలు చేస్తున్నారని ప్రకటించారు. ఇప్పటికీ కూడా ప్రధానిని అదే తరహాలో పొగుడుతున్నారు.ఇక లడ్డూ వివాదంలో తను చేసిన ఆరోపణ నిజమని జనాన్ని నమ్మించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఈయన మాటలను సీరియస్గా తీసుకుంటున్నట్లు లేదు. అందువల్లే ఢిల్లీ టూర్లో మీడియా లడ్డూ గురించి అడిగినా స్పందించలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో హెరిటేజ్ పెరుగు నాణ్యతపై వచ్చిన ఆరోపణలు, ఫుడ్ సేఫ్టీ సంస్థ రూ.లక్ష జరిమానా విధించిన సమాచారం రాగానే చంద్రబాబుకు చెందిన ఆ కంపెనీ స్పందించిన తీరు చర్చనీయాంశంగా ఉంది. ల్యాబ్ పరీక్షల తీరుపై హెరిటేజ్ సంస్థ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో సరైన ప్రొసీజర్ ఫాలో కాలేదని అభిప్రాయపడింది. సీల్డ్ ప్యాకెట్ల నుంచి పెరుగు సాంపుల్ తీశారా? లేక లుజ్గా తీసుకున్నారా? అన్న సందేహం వ్యక్తం చేసింది.డెయిరీ ఉత్సత్తులలో వివిధ కారణాల వల్ల స్వల్పంగా విశ్లేషణలలో తేడా రావచ్చని, ఇందులో ప్రమాదకరమైనవి కాని, ప్రజారోగ్యానికి భంగం కలిగించేవి ఏవీ లేవని పేర్కొంది. ఒక ప్రైవేటు సంస్థ అయిన హెరిటేజ్ ఇంత కంగారుపడి ఈ ప్రకటన చేసిందే. మరి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తదితరులు పదే పదే జంతు కొవ్వు, పంది మాంసం వంటివి లడ్డూలో కలిశాయని చెబుతున్నారే. అధి ధర్మమేనా ? అంటే తన సంస్థ కైతే ఒక రూల్స్.. అదే ప్రజలందరూ కొలిచే దైవం విషయంలో మరో రకంగా ప్రవర్తిస్తారా? తన దాకా వస్తేకాని తత్వం బోధపడదని అంటారు! ఇదే అన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
శారీలో మెరిసిపోతున్న పాయల్ రాజ్పుత్.. జ్యోతి పూర్వాజ్ హాట్ లుక్స్..!
శారీలో మెరిసిపోతున్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్..ఎనిమిది వసంతాలు హీరోయిన్ అనంతిక లేటేస్ట్ పిక్స్..టాలీవుడ్ హీరోయిన్ లయ స్మైలీ లుక్స్..పింక్ శారీలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా అందాలు..బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ పోజులు.. View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
'మొహమ్మద్ దీపక్' కష్టాలు!
'మొహమ్మద్ దీపక్' గుర్తున్నాడా? జనవరి 26న జరిగిన సంఘటనతో అతడు పేరు దేశం మొత్తం మారుమోగింది. 70 ఏళ్ల ముస్లిం వ్యక్తికి అండగా నిలబడి వార్తల్లో నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ (video viral) కావడంతో అతడి గురించి అందరికీ తెలిసింది. అతడి ధైర్యాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. పలువురు రాజకీయ నాయకులు కూడా మెచ్చుకున్నారు.38 ఏళ్ల దీపక్ కుమార్ ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్లో హల్క్ పేరుతో జిమ్ నడుపుతున్నాడు. రిపబ్లిక్ డే నాడు బజరంగ్ దళ్కు చెందిన కొంతమంది.. దుకాణం పేరు మార్చాలంటూ ముస్లిం వృద్ధుడిపై ఒత్తిడి తెచ్చారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ముసలాయన కొంచెం సమయం కావాలని వారిని అభ్యర్థించాడు. అయినా వారు వినిపించుకోకుండా వాదనకు దిగడంతో అక్కడే ఉన్న దీపక్ కుమార్ కలగజేసుకున్నాడు. బజరంగ్ దళ్ కార్యకర్తలు తన పేరేంటని అడగడంతో మొహమ్మద్ దీపక్ (Mohammad Deepak) అని సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. బీబీసీ సహా పలు వార్తా సంస్థలు అతడిని ఇంటర్వ్యూ చేశాయి. మానవత్వంతోనే ముస్లిం వృద్ధుడికి అండగా నిలబడ్డానని దీపక్ చెప్పాడు. మనుషులంతా సమానమేనని, మనమంతా సోదర భావంతో మెలగాలని ఆకాంక్షించాడు.జనం చప్పట్లు కొట్టరుజనవరి 26 ఘటన తర్వాత దీపక్కు ప్రశంసలతో పాటు చిక్కులు ఎదురయ్యాయి. కోట్ద్వార్లో (Kotdwar) సంఘీభావంతో పాటు నిరసనను ఎదుర్కొవాల్సి వచ్చింది. కొంత మంది అతడిని సమర్థించగా, మరికొంత మంది వ్యతిరేకించారు. జనవరి 31న, బజరంగ్ దళ్ సభ్యులు దీపక్ను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ''కోట్ద్వార్ పట్టణంలో సగం మంది నన్ను సమర్థిస్తారు, కానీ మీరు మంచి పనులు చేసినప్పుడు ప్రజలు చప్పట్లు కొట్టరు. నిజాయితీకి మూల్యం చెల్లించాల్సి రావచ్చు" అని ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.150 నుంచి 15కు డౌన్మరోవైపు దీపక్ జిమ్ను వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు రోజుకు 150 మంది వచ్చేవారని, ఇప్పుడు కనీసం 15 మంది కూడా రావడం లేదని దీపక్ వాపోయాడు. ''ఆ ఘటన తర్వాత నా జిమ్కు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. వాళ్ల భయం నాకు అర్థమైంది. నెలకు రూ. 40,000 అద్దెతో జిమ్ (Gym) నిర్వహిస్తున్నాను. అదీగాక ఈ మధ్యనే ఇల్లు కూడా కట్టుకున్నాను. దీనికి నెలవారీ రూ. 16,000 రుణాన్ని చెల్లిస్తున్నాను. నాకున్న ఆదాయమార్గం జిమ్ ఒకటే. సభ్యుల సంఖ్య బాగా తగ్గడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంద''ని దీపక్ వాపోయాడు.జాన్ బ్రిట్టాస్ సంఘీభావం దీపక్ కుమార్కు రాజ్యసభలో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నాయకుడు జాన్ బ్రిట్టాస్ (John Brittas) సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 8న కోట్ద్వార్ పట్టణానికి వచ్చి దీపక్తో పాటు మొహమ్మద్ బాబా డ్రెస్ షాప్ యజమాని వకీల్ అహ్మద్ను కలిశారు. మతతత్వ శక్తుల బెదిరింపుల కారణంగా దీపక్ జిమ్కు వచ్చే వారి సంఖ్య తగ్గడంతో తాను సభ్యత్వం తీసుకున్నట్టు ఎక్స్లో వెల్లడించారు జాన్ బ్రిట్టాస్.చదవండి: మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?''మత సామరస్యాన్ని గౌరవించే రాష్ట్రమైన కేరళ తరపున శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను కోట్ద్వార్ పట్టణానికి వెళ్లాను. దీపక్ను మాత్రమే కాకుండా అతడి తల్లి, భార్య, బిడ్డను కూడా కలిశాను. జీవనోపాధి కోసం టీ అమ్ముకునే అతని తల్లి అందించే వేడి అల్లం టీ తాగాను. మతపరమైన అంశాల బెదిరింపుల కారణంగా ఇప్పుడు నిర్జనమై ఉన్న అతని జిమ్ను సందర్శించి సభ్యత్వం తీసుకున్నాను. ముహమ్మద్ బాబా వస్త్ర దుకాణాన్ని కూడా సందర్శించి కొన్ని కొనుగోళ్లు చేశాను. దీపక్పై కేసు నమోదు చేసిన కోట్ద్వార్ పోలీస్ స్టేషన్లో బలమైన నిరసన తెలియజేశాను. 'ముహమ్మద్' దీపక్గా రూపాంతరం చెందిన దీపక్ కుమార్ కేవలం ఒక వ్యక్తి కాదు.. అతడు భవిష్యత్ విశ్వాసానికి వజ్ర-ప్రకాశవంతమైన కాంతి'' అంటూ జాన్ బ్రిట్టాస్ ఎక్స్లో పేర్కొన్నారు. "Deepak Kumar, now known as 'Muhammad' Deepak... is a beacon of hope in the struggle against the Hindutva communalism .Deepak Kumar entered the scene in Kotdwar, in the foothills of the Himalayas, when Bajrang Dal activists began harassing an elderly man named Muhammad. This… pic.twitter.com/ZVuA5VwgGb— John Brittas (@JohnBrittas) February 8, 2026 -
క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియో
దేశం కాని దేశంలో మనకు సంబంధించిన వస్తువులను చాలా ఆందోళన కలిగించే అంశం. మరీ ముఖ్యంగా వీసా, పాస్పోర్ట్, క్రెడిట్ కార్డు అత్యంత ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకోవడం తీవ్ర ఒత్తిడికి కారణమవుతుంది. కానీ మన దేశంలో అలా కాదు. క్రెడిట్ కార్డును కోల్పోయిన మహిళను స్నేహితులు సేవ్ చేసారు. దీనికి సంబంధించి ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అదేంటో చూద్దామా.బెర్లిన్కు చెందిన జెన్నిఫర్ అనే 29 ఏళ్ల యువతి భారత పర్యటనకు వచ్చింది. అయితే ఊహించని క్రమంలో క్రెడిట్ కార్డులు. కార్పొరేట్ ఐడి క్రెడిట్ కార్డు ఉన్న పర్స్ ఎక్కడో పారేసుకుంది. దీంతో ఆమె పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. కానీ ఈ సమయంలో ఒక్క సెకను కూడా చింతించిలేదనీ, దీనికి కారణంగా భారత్లో ఉన్న తన స్నేహితులేనని చెప్పుకొచ్చింది. వారంతా కష్టకాలంలో అండగా నిలిచి గట్టెక్కించారనీ, ట్రూ స్టోరీ పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేసింది. అలాగే జెన్నిఫర్ తన స్నేహితులతో తన వాట్సాప్ సంభాషణల స్క్రీన్షాట్లను షేర్ చేసింది.తన టూర్ పూర్తయ్యేవరకు తన ఫ్రెండ్స్ తనకు కావాల్సిన డబ్బును ఏర్పాటు చేసి తాను ఎలాంటి ఆందోళన పడకుండా చూసుకున్నారని, ఇలాంటి మద్దతు లభిస్తుందని తాను అస్సలు ఊహించలేదని పేర్కొంది. అంతేకాదు ఎవరి డబ్బులు వారికి తిరిగి ఇచ్చేస్తాను. భారతీయుల స్నేహాన్ని, ఆతిథ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదని వెల్లడించించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజనులు కూడా ఆనందాన్ని ప్రకటించారు. View this post on Instagram A post shared by Jennifer (@jennijigermany) నెటిజన్ల స్పందనబెంగళూరులోని బస్సులో పర్సును (క్రెడిట్ కార్డులు , కార్పొరేట్ ఐడీ కార్డ్ ఉన్న) పోగొట్టుకున్నా.. ఆ మరుసటి రోజు ఉదయం దానిని తిరిగి ఇవ్వడానికి తన కార్యాలయానికి వచ్చాడంటూ తన అనుభవాన్ని ఒకరు పంచుకున్నారు. స్నేహం,స్నేహితులు అంటే అదే కదా.. జాతి, జాతీయత, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆదుకుంటారు అని మరొకరు వ్యాఖ్యానించారు. -
నెట్టింట 'డీప్గా' నకిలీలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీల డీప్ఫేక్ ప్రకటనలు, క్లోన్డ్ వాయిస్లు, వీడియోలు సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నాయి. 2025లో ఏకంగా 80 లక్షల డీప్ఫేక్ ఫైల్స్ ఆన్లైన్లోకి చొచ్చుకుపోయాయి. ఈ వీడియోల కారణంగా బాధితుల కీర్తిప్రతిష్టలకు భంగం కలగడంతోపాటు సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇటువంటి కంటెంట్కు సోషల్ మీడియా వేదికలు ‘ఏఐతో రూపొందించినది’ అని యూజర్లకు కనిపించేలా ప్రసారం చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. – సాక్షి, స్పెషల్ డెస్క్సైబర్ నేరగాళ్ల లక్ష్యం ఎవరంటే..» ఫేక్ యాడ్స్, గౌరవానికి భంగం కలిగించే డీప్ఫేక్ వీడియోల్లో 40% సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నారు.» వేధింపులు, మోసాలకు సంబంధించిన వీడియోలతో బాధితులుగా మిగిలిన వారిలో 35% మంది ప్రైవేట్ వ్యక్తులు.» ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు, డీప్ఫేక్ కంటెంట్తో సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్న వారిలో 99% మంది మహిళలే.» వ్యాపారులు లక్ష్యంగా నకిలీ ప్రొఫైల్స్, బ్రాండ్ పేరుతో 40% మోసాలు జరుగుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ కంటెంట్ విస్తృతి ఇలా..» గతేడాది 80 లక్షలకుపైగా డీప్ఫేక్ ఫైల్స్ ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయని అంచనా.» ఏటా ఈ కంటెంట్ 900% అధికం అవుతోంది.» 2023తో పోలిస్తే డీప్ఫేక్ ఫైల్స్ గత ఏడాదికి 1,500% పెరిగాయి. » ఇటువంటి కంటెంట్ ఉత్తర అమెరికాలో ఏకంగా 1,740%, ఆసియా పసిఫిక్లో 1,530% పెరిగింది.» డీప్ఫేక్ కంటెంట్లో సింహభాగం వీడియోలు కైవసం చేసుకున్నాయి.డీప్ఫేక్తో అంతర్జాతీయంగా ఆర్థిక మోసాలు..» డీప్ఫేక్ కంటెంట్ను ఆసరాగా చేసుకుని జరుగుతున్న మోసాలు ఏడాదిలో 3,000% అధికం అయ్యాయి.» వాయిస్ క్లోనింగ్ విధానం సైబర్ నేరగాళ్ల మోసాల్లో సర్వసాధారణం» డీప్ఫేక్ కంటెంట్ కారణంగా గరిష్టంగా ఒక బాధితుడు నష్టపోయిన మొత్తం రూ.2.18 కోట్లు.» కంపెనీలు, ఫైనాన్స్ టీమ్స్, కుటుంబాలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. డీప్ఫేక్ ఖాతాలు ప్రపంచవ్యాప్తంగా ఇలా..సంవత్సరం సంఖ్య2019 15,0002022 5 లక్షలు2023 10 లక్షలుడీప్ఫేక్ దుర్వినియోగంపై అంతర్జాతీయంగా నమోదైన కేసులు..సంవత్సరం కేసుల సంఖ్య2024 1502025 జనవరిృమార్చి 179(ఆధారం: లాత్వియాకు చెందిన ఫోరెన్సిక్ డివైజెస్, ఐడెంటిటీ వెరిఫికేషన్ సొల్యూషన్స్ కంపెనీ రెగ్యులా) -
మరింత హాట్గా జ్యోతి పూర్వాజ్.. శారీలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల..!
బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ పోజులు..టాలీవుడ్ నటి పూర్ణ బేబీ బంప్ ఫోటోలు..గ్రీన్ శారీలో ఫుల్ గ్లామరస్గా ఐశ్వర్య రాజేశ్..పూల లాంటి డ్రెస్లో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల.. బాయ్ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్లో పాయల్ రాజ్పుత్.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by BRIDAL JEWELRY RENTAL DUBAI, UAE (@rahz_allure_jewelry_rental_uae) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
క్లబ్బుల్లో భక్తి పారవశ్యం.. 20 వేల కోట్లకు పైగా బిజినెస్
సాక్షి స్పెషల్ డెస్క్: మసక వెలుతురు, దట్టమైన పొగలు, నియాన్ లైట్లు, తెల్లవార్లూ సాగే ‘టకీలా’ షాట్ల సేవనం.. ఇవన్నీ ఇప్పుడు పాత కాలపు యూత్ ఫ్యాషన్. కొత్త ట్రెండ్ ఏమిటో తెలుసా? ‘ఆధ్యాత్మిక ఓలలాట’! భక్తి భావనల ‘దమ్ మారో దమ్’! నైట్ క్లబ్బుల్లో జరుగుతున్నఈ ‘సోబర్ రేవ్’ (మందు లేని మత్తు) పార్టీలు తాజా ఇండియన్ ట్రెండ్! అక్కడ డీజే బేస్ చప్పుళ్ల బదులు.. వేద మంత్రాల వైబ్రేషన్లు వస్తుంటే, దేహం తాదాత్మ్యం చెంది స్టెప్పులేస్తుంది.ఆలయాలు దాటిన పారవశ్యంఇప్పటి వరకు, ప్రశాంతత అలుముకుని ఉండే గుడులకు, ఇంట్లో జరిగే జాగరణలకు మాత్రమే పరిమితమైన మన భక్తి ధ్యానం.. ‘ఎరీనా ఎరా’ (స్టేడియం రేంజ్ స్టేజ్) లోకి అడుగుపెట్టింది. భక్తికి కార్పొరేట్ గ్లామర్ తోడై, భజన్ క్లబ్బింగ్ అనే కాన్సెప్ట్ జీవం పోసుకుంది.కాక్టైల్స్కు బదులుగా తేనీరు జెన్–జెడ్ మెట్రో కుర్రకారు పూర్తిగా పంథా మార్చేశారు. మూస నైట్ క్లబ్ల గందరగోళాన్ని వదిలేసి, ఆధ్యాత్మిక క్లబ్బులలోకి క్యూ కడుతున్నారు. చేతిలో కాక్టెయిల్ గ్లాసులకు బదులు వేడి వేడి కుల్హద్ చాయ్ పట్టుకుని.. రాధికా దాస్, కేశవమ్ వంటి కళాకారుల భజన పాటలకు చిందులేస్తున్నారు.‘సన్ బర్న్’ కే సవాలుగా నిలిచి..!అంతర్జాతీయ స్థాయి ఎల్.ఈ.డి స్క్రీన్లు, మెరిసిపోయే స్ట్రోబ్ లైట్లు, అదిరిపోయే సౌండ్ సిస్టమ్తో ఈ భజన్ క్లబ్బింగ్ జరుగుతోంది. ఎంతలా అంటే ఈ ఈవెంట్స్ ఇప్పుడు ‘సన్ బర్న్’ వంటి పాశ్చాత్య శైలి ఇండియన్ మ్యూజిక్ ఫెస్టివల్స్కు గట్టి పోటీ ఇస్తున్నాయి.పెరుగుతున్న ఆదరణ– మూస క్లబ్ కంటే భజన్ ఈవెంట్లలో జనం ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. స్పాన్సర్ చేసే బ్రాండ్లకు కూడా ఈ కాన్సెప్ట్ లాభదాయకంగా ఉంటోంది.– ఆల్కహాల్, గొడవలు లేని ఈ వాతావరణం కుటుంబాలను, యువత ఇద్దరినీ ఆకట్టుకుంటోంది.– భారత ప్రభుత్వం 2026 బడ్జెట్లో ఇలాంటి ‘కల్చరల్ ఎకానమీ’ని దేశ ఆర్థికాభివృద్ధికి ఒక చోదక శక్తిగా గుర్తించటం కూడా భజన్ క్లబ్బింగ్కు ప్రాధాన్యం తెచ్చిపెట్టింది.సాంస్కృతిక సునామీ పరిశ్రమ దిగ్గజాలు ఈ భజన్ క్లబ్బింగ్ కల్చర్ను ముద్దుగా ‘భారత్కోర్’ అని పిలుస్తున్నారు. ఇదేమీ చిన్న మార్పు కాదు, ఏకంగా రూ. 20,000 కోట్ల లైవ్ ఈవెంట్స్ మార్కెట్ను ముంచెత్తుతున్న ఒక సాంస్కృతిక సునామీ!మార్చిలో సాజ్–ప్రఖర్ టూర్2026 మార్చిలో ‘సాజ్–ప్రఖర్’ బృందం దేశవ్యాప్త టూర్ ప్రారంభం కానుంది. ఢిల్లీ, ముంబై, జైపూర్ లుధియానా వంటి నగరాలను సాజ్, ప్రఖర్ దంపతులు భక్తి మత్తులో ముంచేయనున్నారు. సంప్రదాయ భక్తి సంగీతానికి (భజనలు) ఆధునిక క్లబ్ శైలిని సమ్మిళతం చేయటం వీరి ప్రత్యేకత.‘మన్ కీ బాత్’లో ప్రస్తావన!2026 జనవరి 25న ప్రసారం అయిన 130 వ ‘మన్ కి బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రెండ్ గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన సైతం ఈ కొత్త ఒరవడిని ‘భజన్ క్లబ్బింగ్’ గా పేర్కొనటంతో దీనికి ఎక్కడ లేని ప్రాముఖ్యం లభించింది.ప్రధాని ఏమన్నారంటే..‘‘మన దేశంలో భజనలు, కీర్తనలు శతాబ్దాలుగా మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. అయితే నేటి జెన్–జెడ్ యువత ఆ భక్తిని తమదైన శైలిలో, ఆధునిక జీవన విధానానికి అనుగుణంగా మార్చుకోవడం విశేషం. ఇది ఆధునికత, సంప్రదాయాల అద్భుతమైన సమ్మేళనం’’ -
హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ.. నటాషా స్టాంకోవిచ్ బోల్డ్ లుక్స్..!
ఫ్రెండ్ హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ..మరింత హాట్ హాట్గా నటి నటాషా స్టాంకోవిచ్..పాయల్ రాధాకృష్ణ స్టన్నింగ్ వీడియో..గతవైభవ మూవీ జ్ఞాపకాల్లో ఆషిక రంగనాథ్..గోవాలో చిల్ అవుతోన్న హీరోయిన్ శ్రద్ధా దాస్.. View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
రీల్ చేస్తుండగా ఉరి బిగుసుకుని..
బాందా(యూపీ): సోషల్ మీడియాలో ఉరికి సంబంధించిన వీడియోల కోసం పదేపదే సెర్చ్ చేసిన ఓ మహిళ.. తానూ అలాంటి ఓ వీడియో తీసి పోస్ట్ చేయాలనుకుంది. ఇందుకోసం చీరను పైకప్పుకు కట్టి, మెడకు ఉరి బిగించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. తన నాలుగేళ్ల కూతురికి సెల్ఫోన్ ఇచ్చి, వీడియో స్టార్ట్ చేసి తగు సూచనలు చేసింది. చీరతో ఉరి వేసుకున్నుట్ల నటించడం మొదలుపెట్టింది. ఇంతలోనే అనుకోకుండా ఆమె కాలు జారి ఉరి బిగుసుకుంది. షూట్ చేస్తున్న చిన్నారి ఇదంతా నటనే అనుకుంది. కొద్ది సేపటికి తల్లి చీరకు వేలాడుతుండటంతో ఏడ్వడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వారు వచ్చి, కిందికి దించారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా మోహిని అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. యూపీలోని బాందా జిల్లా బబెరు పట్టణంలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. -
‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల
పట్నా(బిహార్): జన్ శక్తి జనతా దళ్ (జేజేడీ) అధినేత, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తనతో సంబంధం ఉన్నట్లు ప్రచారంలో ఉన్న ఓ మహిళ ఒక బిడ్డ జన్మనిచ్చిందని, దానికి తానే కారకుడిని అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు.ఇది తన వ్యక్తిత్వాన్ని దిగజార్చడానికి జరుగుతున్న కుట్ర అని, ఆ బిడ్డతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేజ్ ప్రతాప్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుట్ర వెనుక తన రాజకీయ ప్రత్యర్థులతో పాటు తన సొంత వర్గానికి చెందిన ఐదుగురు నేతలు ఉన్నారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. ముకేశ్ రౌషన్, సంజయ్ యాదవ్, శక్తి సింగ్ యాదవ్, రమీజ్, సునీల్ సింగ్లను ఆయన ఇందుకు కారకులుగా ఆరోపించారు. వీరిలో ఒక రాజ్యసభ ఎంపీ, ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారని పేర్కొంటూ, వీరంతా కలిసి తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.తన పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపారని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. గత ఏడాది ఒక మహిళతో తేజ్ ప్రతాప్ ఉన్న ఫోటోలు ఫేస్బుక్లో వైరల్ కావడంతో ఆయనను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నుండి బహిష్కరించారు. అయితే, తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయ్యిందని, కొందరు వ్యక్తులే ఆ పని చేశారని నాడు తేజ్ ప్రతాప్ ఆరోపించారు. అనుష్క యాదవ్, ఆకాష్ భాటి అనే వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ, ఆ బిడ్డకు అసలైన తండ్రి ఎవరో తనకు తెలుసని తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తన పేరును ఈ వివాదంలోకి లాగి, మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యానని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తానని అన్నారు. నిందితులపై కోర్టులో దావా వేస్తానని, న్యాయం కోసం పోరాడతానని పేర్కొన్నారు. బిహార్ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
వివాదంలో సీఎం హిమంత.. పాయింట్ బ్లాక్లో తుపాకీతో..
దిస్పూర్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వివాదంలో చిక్కుకున్నారు. ముస్లింలను తుపాకితో కాలుస్తున్నట్టుగా ఉన్న వీడియోను హిమంత షేర్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను బీజేపీ తొలగించింది. ఈ విషయంలో సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్వ ఇప్పటికే ముస్లింల జనాభాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముస్లిం వర్గం ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా మరోసారి వివాద చర్యలకు దిగారు. అసోం బీజేపీ ట్విట్టర్ పేజీలో హిమంత.. ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ముస్లింలను పాయింట్ బ్లాక్లో తుపాకితో కాలుస్తున్నట్టుగా ఉంది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు.. ఈ వీడియోపై ప్రతిపక్షాల, సోషల్ మీడియా నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. వెంటనే వీడియోను డిలీజ్ చేసింది. మరోవైపు.. ఈ చర్యతో ఆయనను అరెస్ట్ చేయాలని పలువురు విపక్ష నేతలు డిమాండ్ చేశారు.అంతేకాకుండగా.. సీఎం శర్మ ఎయిర్ రైఫిల్ పట్టుకుని ఉన్న అసలు ఫుటేజ్ను ఏఐ ద్వారా సృష్టించిన వీడియోలకు కలిపారు. రైఫిల్ తూటాలు, పుర్రె టోపీలు, గడ్డాలు ఉన్న పురుషుల చిత్రాలను తాకుతున్నట్టు వీడియోలో కన్పించింది. కనికరం లేదు, మీరు పాకిస్థాన్కు ఎందుకు వెళ్లలేదు? వంటి అస్సామీ టెక్స్ మెసేజ్లు కూడా ఉన్నాయి. -
మన ఓణీకి రాణింపు!
మనం దేన్నయితే ‘ఓల్డ్ ఫ్యాషన్’అని అలుసుగా చూస్తున్నామో.. దేన్నయితే కేవలం తల దాచుకోవడానికో, మొహం తుడుచుకోవడానికో వాడుతున్నామో.. అదే ఇప్పుడు అమెరికాలో ఒక ‘స్టైల్ బాంబ్’లా పేలింది! ‘ఓణీని కనిపెట్టిన భారతీయులారా.. మీకు పాదాభివందనం’.. అంటూ ఒక అమెరికన్ యువతి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదే.. మన ఇంటి ఓణీ అవును, మనం ఓణీ అనో.. చున్నీ లేదా దుపట్టా అని పిలిచే ఆ రెండు మీటర్ల వస్త్రమే ఇప్పుడు గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్గా మారిపోయింది. అమెరికాకు చెందిన కెమి అనే యువతి, తన పాశ్యాత్య దుస్తులపై భారతీయ యువతలు ధరించే ఓణీని వేసుకుని ఒక్కసారిగా మురిసిపోయింది. ‘నా అందం ఒక్కసారిగా పది రెట్లు పెరిగిపోయింది.. ఇది కదా అసలైన ఫ్యాషన్ అంటే!’.. అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మురిసిపోతున్న అమెరికా అమ్మడు మనం మోడ్రన్ పిచ్చితో చున్నీలను అటకెక్కించి జీన్స్, టీషర్టులకు అలవాటు పడుతుంటే.. ఆ అమెరికా అమ్మాయి మాత్రం మన ఓణీని భుజంపై వేసుకుని మురిసిపోతోంది. ‘ఈ కాన్సెప్్టను కనిపెట్టిన భారతీయులకు నా పాదాభివందనం. ఇది కేవలం వస్త్రం కాదు, ఒక అద్భుతం!’అంటూ ఆమె కొనియాడుతోంది. మనం విదేశాల వైపు వ్యామోహంతో చూస్తుంటే, వాళ్లు మాత్రం మన సంస్కృతిలోని చిన్న చిన్న విషయాలను పట్టుకుని వావ్ అంటున్నారు. మన ఇంటి ఓణీకి ఇప్పుడు అమెరికా వీధుల్లో ఎర్ర తివాచీ స్వాగతం దక్కుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దగ్గుకు బ్రాందీ, దురదకు విస్కీ.. తాతయ్య షాక్!
నల్గొండ జిల్లా : మెడికల్ షాపు అనుకొని పక్కనే ఉన్న వైన్స్లోకి వృద్ధుడు వెళ్లగా.. అతడికి దగ్గు మందు అని చెప్పి వైన్స్ సిబ్బంది బ్రాందీ, విస్కీ బాటిళ్లు ఇస్తూ ఆటపట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. శాలిగౌరారం మండలం ఎన్జి కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఒంట్లో నలతగా ఉందని రెండు రోజుల క్రితం మండల కేంద్రంలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చూపించుకుని పక్కనే ఉన్న మెడికల్ షాపులో మందులు కొనుక్కునేందుకు వెళ్లాడు. అయితే మెడికల్ షాపు, ఫస్ట్ఎయిడ్ సెంటర్, వైన్స్ పక్కపక్కనే ఉండటంతో ఆ వృద్ధుడు పొరపాటున మెడికల్ షాపు అనుకొని వైన్స్లోకి వెళ్లాడు. వైన్స్ సిబ్బంది ఒకరు టేబుల్పై వరుసగా మద్యం బాటిళ్లు పెట్టుకొని వైద్యుడి గెటప్లో ఏమైందని వృద్ధుడిని అడుగుతూ చేయి పట్టుకొని పరిశీలించగా.. ఇదంతా మరో వ్యక్తి వీడియో తీశాడు. దగ్గు వస్తుందని, ఒళ్లంతా దురద ఉందని ఆ వృద్ధుడు చెప్పడంతో అతడికి దగ్గుకు ఒక బ్రాందీ సీసా, దురదకు ఒక విస్కీ సీసా ఇచ్చి ఎంత మోతాదులో తాగాలో కూడా చెప్పాడు. వారం రోజుల తర్వాత మళ్లీ వచ్చి మరో రకం బ్రాందీ తీసుకెళ్లాలని ప్రిస్కిప్షన్ కూడా రాసి ఇచ్చాడు. ఏం తినాలో.. ఏం తినవద్దో కూడా వృద్ధుడికి వివరించాడు. ఇదంతా తెలియని వృద్ధుడు అతడు ఇచ్చిన మద్యం బాటిళ్లు సిరప్లు అనుకొని అతను చెప్పేదంతా తల ఊపుతూ విన్నాడు. ఈ వీడియోపై కొందరు వ్యంగంగా తీసుకోగా.. మరికొందరు మాత్రం వృద్ధుడితో అలా చేయడం సరికాదని విమర్శిస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై సంబంధిత వైన్స్ సిబ్బందిని అడుగగా.. ఆ వృద్ధుడు తమకు వరుసకు తాత కావాలని, అతడు మద్యం కొనేందుకు వైన్స్ షాపు వద్దకు రావడంతో సరదాగా వీడియో తీశామన్నారు. -
ఓ తల్లి మూర్ఖత్వంపై సజ్జనార్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చితో కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఫేమ్ అవడం, వ్యూస్ పిచ్చిలో పడిపోయి.. ఏం చేస్తున్నారో తెలియక కొన్ని పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఓ మహిళ తన్న బిడ్డల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. బావిపై నిలుచుని ప్రమాదకరంగా వీడియో తీసింది. ఈ వీడియోపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సీపీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా..‘ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట!. కన్న బిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యా సదృశ్యం. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పిచ్చిని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించకండి అంటూ హెచ్చరించారు. ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట!కన్నబిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యాసదృశ్యం. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పిచ్చిని… pic.twitter.com/azXf7hZcBz— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 6, 2026 -
నా పార్టీ వాళ్లే తిట్టినా సరే.. సారీ చెప్పను
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన మొండితనం ప్రదర్శించారు. మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీలను కించపరుస్తూ చేసిన పోస్ట్ను సమర్థించుకునే రీతిలో మాట్లాడారు. ఈ క్రమంలో క్షమాపణలు చెప్పాలన్న సొంత పార్టీ నేతల డిమాండ్ను ఆయన తోసిపుచ్చారు.శనివారం ఎయిర్ ఫోర్స్ వన్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జర్నలిస్టులతో మాట్లాడారు. ‘‘ఆన్లైన్లో పెట్టిన వీడియో క్లిప్లోని ఒక భాగాన్ని నేను ముందే చూశా. కానీ, మొత్తం వీడియోను చూడలేదు. 2020 ఎన్నికల మోసానికి సంబంధించిన పోర్షన్ మాత్రం చూశాను. సాధారణంగా నేను ఏ వీడియో అయినా సరే నా సిబ్బందికి ఇస్తా. వారు మొత్తం క్లిప్ను పరిశీలించి పోస్ట్ చేస్తారు. కానీ ఈసారి ఎవరూ చూడకపోయి ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు.డెమొక్రట్లతో పాటు రిపబ్లికన్లూ ట్రంప్ క్షమాపణలు కోరాలని చేస్తున్న డిమాండ్పై ట్రంప్ స్పందిస్తూ.. నేను వేలాది విషయాలు చూస్తుంటా. ఏ తప్పూ చేయలేదు. ఇంక క్షమాపణలు ఎందుకు చెప్పడం అని అన్నారాయన.గురువారం రాత్రి ట్రంప్ తన ట్రూత్ సోషల్లో నిమిషం నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. అందులో ది లయన్ స్లీప్స్ టునైట్ అనే పాట బ్యాక్డ్రాప్లో వినిపిస్తుంటే.. ఒబామా జంటను అవమానించినట్లు(కోతులతో పోలుస్తూ) కంటెంట్ ఉంది. తీవ్ర విమర్శలు రావడంతో.. ప్రెస్ సెక్రటరీ కరోలీనా లెవిట్ట్ స్పందించారు. మీమ్ వీడియోను పోస్ట్ చేయడంలో తప్పేంటి? అని సమర్థించుకున్నారు.ఆ ఏఐ వీడియోపై డెమొక్రట్లే కాదు.. రిపబ్లికన్లు కూడా తీవ్రంగా స్పందించారు. అది జాత్యాంహకారాన్ని సూచించేలా ఉందని.. తక్షణమే తొలగించి అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలని రిపబ్లికన్ సెనేటర్ టిమ్ స్కాట్ డిమాండ్ చేశారు. ఫేక్ అయినా కూడా అలాంటివి చేయడం సరికాదని సౌత్ కరోలీనా రిపబ్లికన్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే 12 గం. తర్వాత ఆ వీడియోను టైం లైన్ నుంచి గాయబ్ అయ్యింది. వైట్హౌజ్ ఆ పోస్ట్పై వివరణ ఇస్తూ.. పొరపాటున అది పోస్ట్ అయ్యిందని.. అందుకే తొలగించామని పేర్కొంది.2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో మోసాలు జరిగాయని.. డొమీనియన్ వోటింగ్ సిస్టమ్స్(Dominion Voting Systems) ద్వారా ఓట్లు దొంగిలించబడ్డాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే డెమొక్రటిక్ నేత అయిన ఒబార్ ఒబామాను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇదే కాదు.. గతంలో ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి రావడంపైనా ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటోడికి ఇచ్చి.. తనకు ఎందుకు ఇవ్వలేదంటూ నోబెల్ పీస్ కమిటీని ఆయన తిట్టిపోశారు కూడా. -
అర్జున్ రెడ్డి బ్యూటీ బోల్డ్ లుక్.. థాయ్లాండ్లో శ్వేతామీనన్ చిల్..!
భర్తతో ప్రియాంక చోప్రా రొమాంటిక్ పిక్స్..అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే బోల్డ్ లుక్స్..థాయ్లాండ్లో చిల్ అవుతోన్న శ్వేతామీనన్..పాట పాడుతూ హీరోయిన్ మాధవి చిల్..బాలీవుడ్ బుల్లితెర భామ మౌనీ రాయ్ లేటేస్ట్ పిక్స్.. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) -
బైకర్పై దూకి.. లాక్కెల్లి చంపిన పెద్దపులి
అరుణాచల్ ప్రదేశ్లో అరుదైన విషాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్పై పెద్దపులి దాడి చేసి ప్రాణం తీసింది. అయితే ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే ఓ పులి అనూహ్యంగా తుపాకీ తూటా గాయంతో చనిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో ఇది కానిస్టేబుల్ మరణానికి ప్రతీకార దాడినా? లేదంటే వేటగాళ్ల పనా? అనే అనుమానాలు తలెత్తాయి. అరుణాచల్ ప్రదేశ్ పోలీస్ విభాగంలో చిక్సెంగ్ మాన్పుంగ్ రేడియో ఆపరేటర్గా విధులు నిర్వహించాడు. లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా మయోడియాలో ఆయన డ్యూటీ నిర్వహించేవాడు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం అనిని నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో.. రోయింగ్ రహదారిపై ఘోరం జరిగింది. బైక్పై వెళ్తున్న టైంలో ఓ పెద్దపులి హఠాత్తుగా ఆయనపై దాడి చేసింది. ఆ దారిన వెళ్లే వాహనదారులు.. రోడ్డు పక్కన బైక్ పడి ఉండడం చూసి యాక్సిడెంట్ కావొచ్చని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. తెల్లవారి అటుగా వెళ్లిన వాళ్లకు.. పక్కన పొదల్లో రక్తపు మడుగులో ఆయన మృతదేహం కనిపించింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా.. అది పెద్దపులి చేసిన దాడిగా నిర్ధారించుకున్నారు. చిక్సెంగ్ మరణంతో పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ ఆడపులి మూడు కూనలతో ఆ ప్రాంతంలో సంచరిస్తుందని గుర్తించారు. కూనల్ని రక్షించుకునే క్రమంలోనే అది దాడి చేసి చంపి ఉంటుందని భావించారు. అరుణాచల్ ప్రదేశ్లో మనుషులపై పులులు దాడులు చేయడం అత్యంత అరుదు. దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది. A female tiger was found unalive with a gunshot injury near Mayudia in Arunachal Pradesh’s Lower Dibang Valley, just two days after a police head constable was attacked and lost his life on the Roing–Anini road. Authorities are probing who shot the tiger, why it was harmed and… pic.twitter.com/EIQWPpSf7W— The Sentinel (@Sentinel_Assam) February 6, 2026 ఈ ఘటనతో మయోడియా ప్రాంతంలో రాత్రి పూట ద్విచక్ర ప్రయాణాలపై నిషేధం విధించారు. అయితే.. రెండు రోజుల తర్వాత అదే ప్రాంతంలో ఒక పులి మృతదేహం తుపాకీ గాయాలతో కనుగొన్నారు. ఇది ప్రతీకార చర్య కావచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వేటగాళ్ల దాడి అయ్యి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.ఈ మధ్యకాలంలో మయోడియా–మెహావో వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం పరిసరాల్లో పులుల సంచారం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే.. చిక్సెంగ్ మాన్పుంగ్ను చంపింది చనిపోయిన పులినేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. సోషల్ మీడియాలో రోడ్డు మీద పులులు రాత్రి పూట సంచరించడం, వాహనాలను వెంబడించడం వైరల్ అవుతోంది. బైకర్ల మీదకు పులి దూకిన వీడియోను చిక్సెంగ్ మాన్పుంగ్ దాడి వీడియో అంటూ వైరల్ చేస్తున్నారు. అటుగా ఓ వాహనంలో వెళ్లే వాళ్లు ఆ వీడియో తీసినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారులు ఇవేం అధికారిక వీడియోలు అని చెప్పడం లేదు. వైరల్ అవుతున్న పులి వీడియోలు ఏఐవి కావని.. వేరే సందర్భాల్లో తీసినవని తెలుస్తోంది. ⚠️ Stay Alert, Stay Alive 🐅Suspected tiger attack claims life ofpolice constable in Arunachal Pradesh. pic.twitter.com/7Dg4DA0CaV— अक्स (@Vickyaarya007_) February 6, 2026 -
ర్యాపిడో డ్రైవర్కు షాకిచ్చిన మహిళ.. ఇదో వింత కథ!
ర్యాపిడో.. వాడుకున్న వాళ్లకి వాడుకున్నంత అంటే ఇదేనేమో. ఇప్పటి వరకు మనుషుల డ్రాపింగ్, పికప్, పార్సిల్, ఫుడ్ సర్వీసులకే బైక్లను బుక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ, తాజాగా ఓ మహిళ చేసిన పనికి ర్యాపిడో బైక్ డ్రైవర్ ఖంగుతిన్నాడు. చెత్త బాక్స్ను ఇచ్చి.. పడేయమని చెప్పడం వివాదానికి దారి తీసింది. దీంతో, సదరు మహిళపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ ఘటనకు సంబంధించి కరణ్ నిషాద్ అనే యువకుడు ఈ వింత అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీడియో ప్రకారం..‘ర్యాపిడో పోర్టర్ సర్వీస్ ద్వారా ఒక మహిళ బైక్ బుక్ చేసింది. అనంతరం, సదరు మహిళ వద్దకు వచ్చిన డెలివరీ బాయ్కు ఒక సీలు చేసిన కార్డ్బోర్డ్ బాక్స్ను అప్పగించింది. లోపల వస్తువులు ఉన్నాయని భావించిన కరణ్.. పేమెంట్ గురించి అడిగాడు. ఇంతలో పేమెంట్ ఆన్లైన్లో చెల్లించినట్లు ఆమె సమాధానమిచ్చింది. అనంతరం, అతను ఆ పార్శిల్ను తీసుకుని డ్రాప్ లొకేషన్కు బయలుదేరాడు.తీరా లోకేషన్కు చేరుకోగానే.. అక్కడ ఎవరూ కనిపించలేదు. అక్కడంగా నిర్మానుష్యంగా చెత్తా చెదారాలతో నిండిపోయి ఉంది. ఒక పెద్ద చెత్త కుప్ప మాత్రమే ఉంది. దీంతో, ఎవరికి పార్సిల్ ఇవ్వాలో అర్థం కాక అతను వెంటనే సదరు మహిళకు ఫోన్ చేశాడు. ‘మేడమ్, ఇక్కడ ఎవరూ లేరు.. ఈ ప్యాకెట్ ఎవరికి అందజేయాలి?’ అని ప్రశ్నించాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం విని అతను షాక్కు గురయ్యాడు. ‘అందులో ఉన్నదంతా చెత్తే.. అక్కడ పారేయండి’ అని ఆమె చాలా నిర్లక్ష్యంగా బదులిచ్చింది. ఆమె మాటలు విన్న కరణ్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. మనం ఏ కాలంలో ఉన్నాం? ఇప్పుడు ఇతరుల ఇంటి చెత్తను కూడా మేమే డెలివరీ చేయాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Karan Nishad (@karannishadd1)దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. డెలివరీ యాప్లను ఇలాంటి పనులకు వాడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం మండిపడుతున్నారు. కష్టపడి పని చేసే డెలివరీ భాగస్వాములను ఇలా తక్కువ చేసి చూడటం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. కనీస మర్యాద ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం మాత్రం తెలియరాలేదు. -
కలర్ఫుల్ శారీలో బిగ్బాస్ దివి అందాలు.. జిమ్లో వరలక్ష్మీ శరత్కుమార్..!
జిమ్లో చిల్ అవుతోన్న వరలక్ష్మీ శరత్కుమార్..స్విమింగ్ పూల్లో నటాషా స్టాంకోవిచ్ చిల్...పింక్ శారీలో బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్స్..బ్లూ డ్రెస్లో బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ హోయలు..ట్రేడిషనల్ డ్రెస్లో సురేఖవాణి కూతురు సుప్రీత అందాలు.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pragyaa Kapoor (@pragyakapoor_) -
'మూడేళ్లుగా వేధింపులు.. తట్టుకోలేకపోతున్నా': నటి ఆవేదన
'లవ్ టుడే', 'మామన్నన్' లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి రవీనా రవి. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫేమస్ అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ,మలయాళం సినిమాలకు ఆమె తన వాయిస్ ఇచ్చింది. తెలుగులో ఓకే బంగారం, ప్రేమమ్, 2.0, నవాబ్ వంటి సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేసింది. చెన్నైకి చెందిన రవీనా రవి మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాల్లో కూడా నటించింది.అయితే తాజాగా తాను వేధింపులకు గురైనట్లు రవీనా వెల్లడించింది. సోషల్ మీడియాలో మూడేళ్లుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు కుటుంబ సభ్యులను, స్నేహితులను వేధిస్తున్న వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రాస్తూ.. "ప్రజలందరికీ అవగాహన కోసమే చెబుతున్నా.. దయచేసి ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. మూడేళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నాడు. నా కుటుంబాన్ని, స్నేహితులను, నన్ను నేను రక్షించుకోవడానికి ఈ పోస్ట్ చేస్తున్నా. పోలీసు ఫిర్యాదులు, హెచ్చరికలతో ఇదంతా ఆగిపోతుందని ఆశించి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నా. కానీ సబరీష్, అతని సోదరుడు నాపై, నా కుటుంబంపై వేధింపులు కొనసాగిస్తున్నారు. అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారు. నన్ను మాత్రమే కాకుండా నాకు దగ్గరగా ఉన్నవారిని కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. నా వల్ల ఈ పరిస్థితిని వచ్చినందుకు నా స్నేహితులుస, కుటుంబ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. మేము చట్టపరమైన మార్గాలను ప్రయత్నించాము, కానీ వేధింపులు ఆగలేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.అతను పలు నకిలీ ఖాతాల నుంచి నన్ను మాత్రమే కాకుండా.. ఇతర మహిళా నటీమణులను, ఆర్టిస్టులను కూడా వేధిస్తున్నాడని రవీనా రవి ఆరోపించింది. మేము ఇప్పటికే కలిశాం..మాకు పెళ్లి కుదిరింది అంటూ వంటి కల్పిత కథలను సృష్టిస్తున్నాడని తెలిపింది. ఈ నీచుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ అందరూ కూడా బ్లాక్ చేయాలని సన్నిహితులకు విజ్ఞప్తి చేసింది. చెన్నై నగరం మహిళలకు అత్యంత సురక్షితమైందిగా భావిస్తారని.. ఇది నిరూపించాలంటే ఈ నీచులపై అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది. అంతేకాకుండా సీఎం స్టాలిన్తో పాటు చెన్నై పోలీసులకు ట్యాగ్ చేసింది. ఇది ప్రస్తుతం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.కాగా...రవీనా రవి జవాన్ సినిమాలో దీపికా పదుకోన్కు తెలుగు వాయిస్ అందించింది. లవ్ టుడే, మామన్నన్ వంటి సినిమాల్లో కీలకమైన పాత్రలలో మెరిసింది. నయనతార, త్రిష,నిధి అగర్వాల్.మాళవిక మోహన్,శ్రీనిధి శెట్టి, అమలా పాల్,రాశీ ఖన్నా,కాజల్ అగర్వాల్, సమంత వంటి స్టార్ హీరోయిన్లకు వివిధ భాషలలో డబ్బింగ్ చెప్పింది. View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) -
నాలుక మడతేసిన పవన్.. నాగబాబు కొత్తరాగం..
కొత్తగా మతం మారినవాళ్లకు నామాలు ఎక్కువ అన్న సామెత మెగా బ్రదర్స్కు సరిగ్గా సరిపోయేలా ఉంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ సైతం తేల్చి చెప్పడంతో ఈ విషయంలో గాయిగత్తర చేసి అర్జెంట్గా సనాతని గెటప్ వేసుకుని మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడల్లా జనంలోకి వచ్చి టాపిక్ డైవర్ట్ చేసిన పవన్ ఇప్పుడు లడ్డు విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో ఏం చేయాలో.. ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక తికమకపడుతున్నారు.దీంతో ఇప్పుడు తాను లడ్డు విషయంలో ఆనాడు చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం వేరని, తాను ఫలానా వాళ్లు అందులో కొవ్వు కాలిపారని అనలేదని ఏదేదో మాట్లాడుతూ తప్పించుకోవాలని చూశారు. వాస్తవానికి పవన్ తనకు తానూ ఓ కమ్యునిస్ట్ అని, తనకు దేవుడిపై నమ్మకం లేదని పలుమార్లు రాజకీయ వేదికల మీద చెప్పారు. తన తండ్రి మరీ పెద్ద కమ్యూనిస్ట్ అని, తన తల్లి దేవుడికి హారతి ఇస్తే ఆ హారతిలో సిగరెట్ వెలిగించుకునేవారని రాజకీయ వేదికలమీద చెప్పారు. ఇక తిరుమల లడ్డులో కొవ్వు కలిసింది అని, సనాతని గెటప్ వేసుకుని మెట్లు కడిగేశారు. తీరా ఇప్పుడు సీబీఐ నివేదికలో ఆ కొవ్వు అంశం లేకపోవడంతో ఏం చేయాలో తెలీక ఏదేదో మాట్లాడి పరిస్థితిని తన వైపునకు తిప్పుకునేందుకు యాతనపడుతున్నారు. ఇన్నాళ్లు అబద్ధాల మిషన్ సినిమాల్లో చూడటమే కానీ ఇలా మానవరూపంలో చూడడం ఇదే మొదటి సారి అంటూ నెటిజెన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.I am sorry to use this statement నువ్వు బ్రతికేది కుడా ఒక బ్రతుకేనా @NagaBabuOffl 👊💦ఏ మూల నుండి నువ్వు హిందువువి అయ్యావ్ ❓దేవుడునే నమ్మని నువ్వు ఎట్టా సనాతనివి అవుతావ్ ❓👊కష్టపడి పైకి వచ్చిన చిరంజీవి గారు, ఏ రోజు రాజకీయాలు కోసం ని తమ్ముడు లగా ని లాగా లుచ్చా మాటలు… pic.twitter.com/G6Ghrb5JZc— Ravindra 🙏❤️ (@kurapati1005) February 4, 2026ఇక ఎమ్మెల్సీ నాగబాబు అయితే మరింత ఎక్కువ యాక్టింగ్కు దిగిపోయారు. గతంలో అసలు దేవుడే లేడు.. అదొక మిథ్య.. ప్రజలు.. తమ సౌకర్యం కోసం దేవుడిని సృష్టించుకున్నారు. నేనైతే దేవుణ్ణి నమ్మను అని చెప్పిన నాగబాబు ఇప్పుడు తానూ సనాతన వాదిని అని, హిందూ ధర్మానికి రక్షకుడిని అని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములను గుత్తకు తీసుకుని మరబొమ్మను ఆడించినట్లు ఆడిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా నిలదీయడంతో ఇక ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది. గురువారం చంద్రబాబు.. మంత్రులు.. నాయకులు కలసికట్టుగా మీడియాతో మాట్లాడి మళ్ళీ లడ్డు అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుకు లడ్డు అంశం ఒక ఆయుధంగా మారిందని.. రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేనట్లుగా ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. -సిమ్మదిరప్పన్న. -
కడపలో ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సోషల్ మీడియాలో లైకులు, షేరులు.. పాపులారిటీ కోసం కొందరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ యువకుడు రీల్స్ పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ముబారక్(20) తన స్నేహితుడితో కలిసి బైక్ స్టంట్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. వాటికి కొద్ది కొదద్దిగా వ్యూస్ రావడం ప్రారంభించింది. దీంతో ఎక్కువ వ్యూస్ రావాలనే ఆశతో మితిమీరి స్టంట్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. బైక్పై విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటనలో ముబారక్ అక్కడికక్కడే మరణించాడు. వెనకాల కూర్చున్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనలో స్కూటీ తక్కుతుక్కుగా ధ్వంసం కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. -
జగనన్న 2.0 లోడింగ్
సాక్షి, అమరావతి: ‘జగనన్న 2.0 లోడింగ్’.. అంటూ సామాజిక మాధ్యమాల్లో వైఎస్ జగన్ పేరు హోరెత్తిపోతోంది. మాజీ మంత్రి అంబటిపైనా, ఆయన ఇంటిపైనా కూటమి రౌడీ మూకల దాడి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్ బుధవారం గుంటూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఉవ్వెత్తున జన అభిమాన తరంగం ఎగిసిపడింది. కార్యకర్తలకు జగన్ అండగా ఉంటాడని, ఎవరికీ భయపడేది లేదనే మీమ్స్ను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. జగన్ కాన్వాయ్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. జగన్ పర్యటనకు జనం భారీ స్థాయిలో రావడం అనేది సహజం. కానీ అంతే స్థాయిలో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆయనకు మద్దతు లభిస్తుండటం, వాట్సప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో, వాటి గ్రూపుల్లో లెక్కకు మించి జగన్ పర్యటనపై పోస్టులను నెటిజన్లు షేర్ చేస్తుండటం విశేషం. -
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
దర్శకుడు రాజమౌళి సినిమాలకు పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో హడావుడి చేయడం ఆయన స్టైల్. తాజాగా వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ తర్వాత కేవలం రెండు ఫ్లెక్సీలు వారణాసిలో కట్టడం ద్వారా సోషల్ మీడియాలో భారీ చర్చ రేపారు. విడుదల ఇంకా ఏడాది దూరంలో ఉన్నప్పటికీ, ఇప్పటికే ఓటీటీ అమ్మకాలపై మార్కెటింగ్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ చిన్నది కాదు. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. సినిమాకు మాక్సిమమ్ రాబడి ఓటీటీ రైట్స్ ద్వారానే వస్తుంది. వరల్డ్ వైడ్ రైట్స్ రూపంలో అమ్మకం జరిగాలి. దానికి నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలే ఆ స్థాయి డీల్ క్లోజ్ చేయగలవు. లేదా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో జియో, హాట్స్టార్ వంటి సంస్థలు ముందుకు రావచ్చు. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డౌన్లో ఉంది. ఏడాది క్రితం అయితే భారీ రేటు సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ సమయంలోనే డీల్ క్లోజ్ కావాల్సింది. కానీ అది జరగలేదు. నెలలు గడిచిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటించారు. అంతేకాక రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఓటీటీ డీల్ కోసం జరుగుతోందని అనుకోవాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో వారణాసి ఓటీటీ రైట్స్ 600 కోట్లకు పైగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ ఓటీటీ డీల్ 170 కోట్లుగా టాక్ ఉంది. అది కూడా పాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్. కానీ పాన్ వరల్డ్ స్థాయికి చేరలేదు. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా క్రేజ్ వేరే. రాజమౌళి సినిమాల స్పాన్ వేరే అయినప్పటికీ లెక్కలు వేసుకుంటే 340–440 కోట్ల మధ్యే డీల్ సాధ్యపడొచ్చని అంచనా.650 కోట్ల రేంజ్లో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. అవి కేవలం క్రేజ్ కోసం పుట్టినవే. నిజంగా అలాంటి హెవీ డీల్ జరిగితే, అమౌంట్ బయటకు రాకపోయినా, డీల్ ఫైనల్ అయిన వార్త మాత్రం ముందుగానే బయటకు వచ్చేది. డీల్ క్లోజ్ అయితే సినిమా చకచకా ఫినిష్ చేయడంపై టీమ్ దృష్టి పెట్టేది. ప్రస్తుతం వారణాసి ఓటీటీ రైట్స్ 600–650 కోట్ల రేంజ్లో క్లోజ్ అయ్యాయని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇది సోషల్ మీడియా హైప్ మాత్రమే. వాస్తవానికి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో 400 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయితే అదే పెద్ద డీల్ అని చెప్పొచ్చు. -
బంగారంలా మెరిసిపోతున్న కాజోల్.. పొట్టి డ్రెస్లో జ్యోతి పూర్వాజ్ అందాలు..!
బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన వితికా శేరు..పొట్టి డ్రెస్లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ హోయలు..బంగారంలా మెరిసిపోతున్న బాలీవుడ్ భామ కాజోల్..అమ్మకు బర్త్ డే విషెస్ చెప్పిన హీరోయిన్ శ్రీలీల..టాలీవుడ్ నటి సాహితి దాసరి లేటేస్ట్ పిక్స్.. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
యువతికి ఆకలేసింది.. స్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టింది!
ఫుడ్ డెలివరీ బాయ్ల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరైన సమయానికి.. సరైన అడ్రస్లో ఫుడ్ డెలివరీ చేయటం కోసం ఎంతో కష్టపడుతుంటారు. తాజాగా, ఓ ఫుడ్ డెలివరీ బాయ్కి భయంకరమైన అనుభవం ఎదురైంది. శ్మశానంలో ఫుడ్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అతను భయంతో గజగజ వణికి పోయాడు..చివరికి ఆర్డర్ను డెలివర్ చేయకుండానే అక్కడినుంచి వెళ్లిపోయాడు.ఇప్పుడీ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతూ నెటిజన్లకు ఆశ్చర్చాన్ని కలిగిస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే.. ఒక డెలివరీ బాయ్ ..ఎప్పటి లాగే.. అతనికి ఒక ఫుడ్ ఆర్డర్ వచ్చింది. బిర్యానీ పార్శిల్ తీసుకుని ఫుడ్ డెలివరీ చేయాల్సిన అడ్రెస్కి వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టిన యువతికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి కొంచెం ముందుకు రమ్మంది. కానీ అతను ముందుకు వెళ్లగా… ఆ లోకేషన్ చూసి షాక్ అయ్యాడు.ఆ వ్యక్తి రాగా అక్కడ శ్మశానం కనిపించింది. ఆ అమ్మాయి శ్మశానం లోపలికి రమ్మంది. అతడు షాక్ అయ్యాడు. తాను లోపలికి రాలేనని, బయటకు వచ్చి పార్శిల్ తీసుకోవాలని అన్నాడు. దానికి ఆ అమ్మాయి..తాను చాలా లోపల ఉన్నానని, బయటకు రాలేనని ..తాను స్మశానంలో ఫ్రెండ్స్తో లోపల పార్టీ చేసుకుంటున్నాం” అని చెప్పింది. ఈ మాటలు విన్నాక రైడర్ పూర్తిగా హడలెత్తిపోయి, ఆర్డర్ క్యాన్సిల్ చేసి, అక్కడినుంచి వెంటనే వెళ్లిపోవాల్సి వచ్చింది.ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగినదో స్పష్టంగా తెలియడం లేదు. కొందరు ఇది ఫేక్ వీడియో అని, మరికొందరు AI ద్వారా తయారైన వీడియో అని చర్చ చేస్తున్నారు. అయినా, రాత్రి సమయాల్లో ఇలాంటి అడ్రస్లకు డెలివరీ చేయడం ఎంత భయంకరమో ఈ వీడియో అందరికీ చూపిస్తుంది. -
Thanuja : ప్లీజ్ అలా అనడం మానేయండి.. నరకం అనుభవిస్తున్నా..
-
సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీసులు గీత దాటొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేసే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక హక్కుల రక్షణ కోసమే హైకోర్టు ఆ నిబంధనలు పెట్టిందని.. వాటిని పోలీసులు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. అసలేం జరిగింది? సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల పోస్టుల ఆధారంగా యాంత్రికంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించరాదని సూచించింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పాటించాల్సిన మార్గదర్శకాలను తీర్పులో పొందుపరిచింది. అయితే ఈ మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం సుప్రీం ధర్మాసనం ముందు వాడీవేడిగా వాదనలు జరిగాయి. పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛకు మార్గదర్శకాలు అడ్డంకిగా ఉన్నాయి: లూథ్రా విచారణ ప్రారంభం కాగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు మెరిట్స్పై తాము వాదించడం లేదని.. కానీ హైకోర్టు విధించిన కొన్ని షరతులు ఇబ్బందికరంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘హైకోర్టు తీర్పులోని పేరా 29లో ఇచ్చిన మార్గదర్శకాలపై మాకు అభ్యంతరం ఉంది. ముఖ్యంగా గైడ్లైన్ నంబర్ 7, 8 పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయి. రాజకీయ ప్రసంగాలు లేదా సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇది ప్రాసిక్యూషన్ వ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. ప్రాసిక్యూషన్ వేరు, దర్యాప్తు వేరు కదా?. కానీ గైడ్లైన్ నంబర్ 4, 7 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఫిర్యాదులు నిరాధారమని తేలితే కేసు క్లోజ్ చేయాలని చెబుతున్నారు. అది కేవలం సాక్ష్యాధారాల లేమి వల్లే కాదు.. ఇతర కారణాల వల్ల కూడా క్లోజ్ చేయొచ్చు కదా?’అని అన్నారు. తప్పేంటి?: సుప్రీం ధర్మాసనందీనిపై జస్టిస్ పార్దివాలా జోక్యం చేసుకుంటూ ‘అసలు హైకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడంలో తప్పేముంది? పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి, యాంత్రికంగా కేసులు పెట్టకుండా ఉండటానికి ఆ మాత్రం జాగ్రత్తలు అవసరం లేదా? ఒక హైకోర్టు జ్యుడీíÙయల్ ఆర్డర్ ద్వారా కొన్ని మార్గదర్శకాలు ఇస్తే సంబంధిత అధికారులు వాటిని పాటించాల్సిందే. మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు కనిపించడం లేదు. చాలా కోర్టులు ఇలాంటి మార్గదర్శకాల కోసమే ఎదురుచూస్తున్నాయి కూడా. హైకోర్టు కేవలం విస్తృతమైన మార్గదర్శకాలనే జారీ చేసింది. వాటిని పాటించండి’అని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేసింది. పోలీసులకు హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఇవీ.. ముందస్తు పరిశీలన: సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ముందుగా ప్రాథమిక విచారణ జరపాలి. న్యాయ సలహా: రాజకీయ విమర్శలు, సున్నితమైన అంశాలకు సంబంధించిన పోస్టుల విషయంలో కేసు నమోదు చేసే ముందు తప్పనిసరిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలి. నిరాధారమైతే రద్దు: విచారణలో ఫిర్యాదు నిరాధారమైనదిగా లేదా దురుద్దేశపూర్వకమైనదిగా తేలితే వెంటనే కేసు మూసేయాలి. -
కోటి సంపాదించే టెకీ జీవితానికే విలువ లేదు : వ్యాపారవేత్త పోస్ట్ వైరల్
బెంగళూరులో జరిగిన ఒక 'హిట్ అండ్ రన్' (Hit-and-Run) ఘటన సంబంధించి పోలీసుల నిర్లక్ష్యంపై ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోటి సంపాదిస్తున్న తన సోదరి ప్రాణానికి విలువ లేకుండాపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన తీరు నెట్టింట వైరల్గా మారింది.బెంగళూరు పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Overlayy అనే AI స్టార్టప్ వ్యవస్థాపకుడు స్నేహిల్ సలూజా, తన సోదరి , ఆమె స్నేహితురాలికి ఎదురైన భయానక అనుభవాన్ని ట్విటర్ ద్వారా పచుకున్నారు. అసలేం జరిగిందంటే..స్నేహిల్ కారులో ఆయన సోదరి, ఆమె స్నేహితురాలు ప్రయాణిస్తున్నారు. బెంగళూరులోని ఒక రెడ్ లైట్ సిగ్నల్ పడినపుడు, స్నేహిల్ సోదరి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఒక మినీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు కానీ, తమకుజరిగిన అన్యాయం, ట్రక్కు యజమానిపట్ల పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ఆ విషయం హైవే పోలీసులకు , ట్రక్కు యజమానికి కూడా తెలుసని, అయినా ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ను అరెస్టు చేయలేదనీ కనీసం FIR (ప్రథమ సమాచార నివేదిక) నమోదు చేయడానికి కూడా పోలీసులు నిరాకరించారని స్నేహిల్ ఆరోపించారు.ఇదీ చదవండి: 6 వేల మీటర్ల లోతులో జపాన్ ఘనత : ప్రపంచంలోనే తొలిసారిపోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలుప్రమాదంలో ఎవరూ చనిపోలేదు కదా, కేసు ఎందుకు? ఇన్సూరెన్స్తో సెటిల్ చేసుకోమని పోలీసులు బాధితులకు సూచించారనేది ఆయన వాదన. మరోవైపు ట్రక్కు యజమానులు పోలీసులకు క్రమం తప్పకుండా లంచాలు ఇస్తుంటారని, అందుకే వారిపై ఎలాంటి చర్యలు ఉండవని ఒక అధికారి బాధితులతో అన్నట్లు స్నేహిల్ పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత తన సోదరి బెంగళూరు రోడ్లపై తిరగాలంటేనే భయపడుతోందని, సామాన్య పౌరులకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలపై నమ్మకం పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు పూర్తిస్థాయి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలు చూపి క్లెయిమ్ను కూడా తిరస్కరించినట్లు తెలిపారు.ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?చట్టాన్ని గౌరవించే, పన్ను చెల్లించే నిపుణులను కూడా రక్షించడంలో వ్యవస్థ విఫలమైందని స్నేహిల్ పేర్కొన్నాడు. బాధితుల్లో ఒకరు ప్రధాన డేటా కంపెనీలో పనిచేస్తున్న, ఉన్నత IIT-JEE ర్యాంక్ కలిగిన యువ AI ఇంజనీర్. "ఇది 2025లో బెంగళూరు. ఇది 2025లో భారతదేశం" అని ఆయన రాసుకొచ్చారు. కోటి రూపాయల ఆర్జించి పన్నులు కట్టే వారి పరిస్థితి ఇలా ఉంటే, ఇక సాధారణ పౌరులు వ్యవస్థను ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు.A 1 crore earning techie's life has no value in Bengaluru.And if you're not earning that much? Your life has even less.My sister and her friend were driving home in my car. They stopped at a red light - the logical thing anyone does. A drunk driver in a mini-truck didn't feel…— Snehil Saluja (@mesnhl) February 2, 2026 నెటిజన్ల స్పందనఅధికంగా పన్నులు కట్టే నిపుణులకు కూడా దేశంలో రక్షణ లేకపోతే ఎలా అని నెటిజన్లు కూడా విమర్శించారు.ఈ సంఘటనను సిగ్గుచేటు అని అభివర్ణించారు.ఇటువంటి పరిస్థితుల వల్లే ప్రతిభావంతులైన యువత విదేశాలకు వెళ్ళిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బెంగళూరు సిటీ పోలీస్ లేదా ట్రాఫిక్ పోలీస్ విభాగం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా? -
Budget 2026 : సోషల్ మీడియాలో మీమ్స్ పండగ
ఫిబ్రవరి 1 ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026 చాలామందిని నిరాశపర్చింది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొమ్మిదో యూనియన్ బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా, ప్రతిపక్ష నాయకులు, ఇతర పలువురు రాజనీయ నాయకులు, ఆర్థిక వేత్తలు మాత్రం సామాన్యులకు ఒరిగిందేమీ లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అటు సోషల్మీడియాలోవ్యంగ్యోక్తులు, విమర్శలు వెల్లువెత్తాయి.నిర్మలా సీతారామన్ ప్రసంగం బడ్జెట్ ముగిసిన వెంటనే, టాక్స్ విధానంలో ఎలాంటి ఉపశమనం రాకపోవడంతో సోషల్ మీడియాలో కామెడీ మీమ్స్ వెల్లువెత్తాయి.సెలబ్రిటీలు, వేతన జీవులు మధ్యతరగతి ఆందోళనల వరకు ఫన్నీ, క్రియేటివ్ మీమ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: దురంధర్ రంభ హో ఫీవర్ 70 ఏళ్ల వయసులో స్టన్నింగ్ డ్యాన్స్ వైరల్ వీడియోసీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ఉద్దేశించి, "ఫిబ్రవరి నెల మొత్తం మూడ్ ఒకే మహిళపై ఆధారపడి ఉంటుంది" అని ఒక మీమ్ పేర్కొనగా, మరో మీమ్లో, "మీ ఫండ్ నుండి కొంచెం డబ్బు వస్తే చాలా బాగుంటుంది" అంటూ ఇంకో మీమ్ను చూడవచ్చు. బడ్జెట్ 2026 అసలీ జాంజ్..పర్సు బరువు, సహనానికి పరీక్ష, మీమ్స్ పండుగ". అనే మరో ఫన్నీ మీమ్ కూడా ఉంది.మరోవైపు తాజా బడ్జెట్పై బెంగాల్ సీఎం మమతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్, జైరాం రమేష్ మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం పారదర్శకంగా లేదని, కీలక కార్యక్రమాలు , పథకాలకు బడ్జెట్ కేటాయింపుల గురించి ఎలాంటి సమాచారం లేదని విమర్శించారు.మరో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ సామాన్య ప్రజల కోసం కాదని, పెద్ద కార్పొరేట్ల కోసం అని, ఇందులో ఏమీ లేనప్పుడు ప్రజలు దీనిని ఎలా స్వాగతించగలరని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ఏమీ లేదు. ఇది పూర్తిగా డొల్ల అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: దిశా నిర్దేశంలేని కేంద్ర బడ్జెట్ : ధ్వజమెత్తిన మమతా బెనర్జీBudget Memes - A thread 🧵 Nirmala Sitharaman to Middle Class people pic.twitter.com/XOl1QDWCOO— Phunsuk Wangdu (@Phunsukwangduji) February 1, 2025కేంద్ర బడ్జెట్ 2026ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 11.2 లక్షల కోట్ల నుండి 2027 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం లక్ష్యాన్ని రూ. 12.2 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు. టైర్-2 , టైర్-3 నగరాలతో సహా దేశంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఆమె అనేక చర్యలను కూడా ప్రకటించిన సంగతి విదితమే.BCOM students trying to understand the budget pic.twitter.com/JpUTLsVEoV— Phunsuk Wangdu (@Phunsukwangduji) February 1, 2025Government to salaried people during every budget#Budget2025 pic.twitter.com/VnfvuKYolM— Finance Memes (@Qid_Memez) February 1, 2025 -
ఘోస్ట్ ఎంట్రీ!
సుశిక్షితులైన వేలాది మంది సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారంటూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (జేఈఎం) చీఫ్ మసూద్ అజర్ చేసిన ప్రసంగం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఉగ్రవాది కొన్నేళ్ల క్రితం కశ్మీర్లో అరెస్టు అయ్యాడు. ఇతడిని విడిపించడానికే ‘కాందహార్ హైజాక్’గా పిలిచే ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఐసీ 814 విమానం హైజాక్ జరిగింది. అజహర్ జైల్లో ఉండగా ఏర్పడిన పరిచయాలతోనే కోల్కతాలో ఖాదిమ్స్ సంస్థ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్ జరిగింది. బర్మన్ను విడుదల చేయడానికి డిమాండ్ చేసిన రూ.3 కోట్లు హైదరాబాద్ నుంచే చేతులు మారాయి. ఈ మొత్తం నుంచి రూ.కోటి అమెరికాలో జరిగిన 9/11 దాడుల కోసం వినియోగించారు. బర్మన్ కిడ్నాప్లో పాల్గొన్న ముఠా నుంచే కాలక్రమంలో దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పుట్టింది. గోకుల్చాట్– లుంబినీ లేజేరియంల్లో 2007, దిల్సుఖ్నగర్లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్ల్లో 2013ల్లో జరిగిన విధ్వంసాలకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థే. ఈ ఎపిసోడ్స్ అన్నింటికీ మూలం– అజహర్ మసూద్ భారత్ రావడం, తిరిగి వెళ్లడమే!పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న బహవల్పూర్కు చెందిన ముహమ్మద్ మసూద్ అజర్ అల్వీ అక్కడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కుమారుడు. పాఠశాల విద్యను ఎనిమిదో తరగతిలోనే వదిలేసిన ఇతగాడు కరాచీలోని ఇస్లామిక్ యూనివర్సిటీ జామియా ఉలూమ్–ఉల్–ఇస్లామియాలో చేరాడు. 1989లో ఆలీమ్గా పట్టభద్రుడై ఓ మదర్సాలో ఉపాధ్యాయుడిగా మారాడు. పాకిస్తాన్కు చెందిన జిహాదీ గ్రూప్ హర్కత్ ఉల్ అన్సారీ అప్పట్లో అఫ్గానిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో జిహాదీ శిక్షణ శిబిరాలు నిర్వహించింది. ఇలాంటి ఓ శిబిరంలో చేరిన మసూద్ ఆ శిక్షణ పూర్తి కాకుండానే సోవియట్–అఫ్గాన్ యుద్ధంలో పాల్గొన్నాడు. తీవ్రంగా గాయపడి పాకిస్తాన్ చేరిన అజర్ హర్కత్లో యువత చేరేలా ప్రేరేపించే విభాగాన్ని పర్యవేక్షించాడు. ఆపై పాకిస్తాన్కే చెందిన ఉగ్రవాది ఫజల్ ఉర్ రెహ్మాన్ ఏర్పాటు చేసిన హర్కత్ ఉల్ ముజాహిదీన్లో (హెచ్యూఎం) చేరాడు. ఇక్కడే అజర్ భారత్లోకి రావడానికి మార్గం ఏర్పడింది. అప్పట్లో కశ్మీర్లో వేర్పాటు వాదాన్ని ప్రేరేపించిన ఉగ్రవాద సంస్థ హర్కత్–ఉల్–అన్సార్లో విభేదాలు ఏర్పడతాయి. దీంతో ఇది హర్కత్–ఉల్–జిహాద్ అల్–ఇస్లామీ, హర్కత్–ఉల్–ముజాహిదీన్ అనే రెండు గ్రూపులుగా మారింది. వీరి మధ్య స్పర్థలు 1993లో తారస్థాయికి చేరాయి. ఫలితంగా కశ్మీర్లో తన ఆపరేషన్స్ కుంటుపడ్డాయని హర్కత్ ఉల్ అన్సార్ భావించి, ఈ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను అజర్కు అప్పగించింది. దీంతో 1994లో పోర్చుగీస్ పాస్పోర్టు తీసుకున్న అజర్, నేరుగా ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లోని దేవ్బంద్, అయోధ్య సహా అనేక ప్రాంతాల్లో తిరిగాడు. చివరకు కశ్మీర్ చేరుకుని రెండు గ్రూపుల మధ్య సమావేశాలు ఏర్పాటు చేసి సయోధ్య కుదిర్చాడు. అత్యంత కీలక ఉగ్రవాది అయిన అజర్కు హర్కత్–ఉల్–అన్సార్ సంస్థ కశ్మీర్లో ఓ గన్మెన్ను కేటాయించింది. అజర్ అదే ఏడాది ఫిబ్రవరి 11న ఓ కారులో హెచ్యూఎం చీఫ్ కమాండర్ సజ్జద్ అఫ్గానీ, తన గన్మ్యాన్తో కలిసి కారులో ప్రయాణిస్తుంటే, అనంత్నాగ్లోని కనాబాల్ చౌక్ వద్ద కారు పాడయింది. దీంతో అక్కడ నుంచి వీళ్లు ఆటోలో బయలుదేరారు. ఆటో అక్కడి కప్రాన్ అటవీ ప్రాంతం వద్దకు చేరుకునే సమయానికి జమ్మూ–కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా వాహన తనఖీలు నిర్వహిస్తున్నాయి. అక్కడ అది నిత్యం జరిగేదే అయినా, హడావుడి చూసి భయపడిన అజర్ గన్మ్యాన్ తుపాకీతో కాలుస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఆర్మీ అప్రమత్తమై అతడితో పాటు అజర్, సజ్జద్లను అదుపులోకి తీసుకుంది. శ్రీనగర్ తరలించి విచారణ ప్రారంభించింది. తొలుత వీరితో పాటు స్థానిక పోలీసులూ అజర్ను సాధారణ వేర్పాటువాదిగా భావించారు. కొందరు అనుమానితులు పట్టుబడిన విషయం శ్రీనగర్ చేరుకునే ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) టీమ్ చేపట్టిన విచారణలోనే అజర్ పూర్వాపరాలు బయటకు వచ్చాయి. దీంతో అరెస్టు చేసిన పోలీసులు కొన్నాళ్లు జమ్మూలోని కోట్ భల్వాల్ జైలులో ఉంచి, తర్వాత ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. అజర్ను విడిపించడం హర్కత్–ఉల్–అన్సార్ సంస్థ ఇల్యాస్ కశ్మీరీ, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్లను రంగంలోకి దింపింది. ఈ ద్వయం 1994లోనే ‘ఆపరేషన్ అల్–హదీద్’ పేరుతో ప్రత్యేక ఉగ్రవాద చర్య చేపట్టింది. ఢిల్లీలో ఇద్దరు గైడ్స్తో పాటు నలుగురు విదేశీ పర్యాటకులను అపహరించి, నిర్బంధించింది. వారిని సురక్షితంగా విడుదల చేయడానికి మసూద్ అజర్ సహా మరికొందరు ఉగ్రవాదుల్ని వదలాలంటూ షరతు విధించింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు వీరి స్థావరంపై దాడి చేశాయి. ఫలితంగా ఒమర్ సయీద్ షేక్ గాయపడి చిక్కగా, ఇల్యాస్ కశ్మీరీ తప్పించుకుని పారిపోయాడు. బందీలుగా ఉన్న టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ పోలీసులు ఒమర్ సయీద్ షేక్ని కూడా తీహార్ జైలుకు తరలించింది. (తీహార్ జైలు నుంచే మరో కథ మొదలైంది. అక్కడే తరచు కలుసుకున్న అజర్, ఒమర్ సయీద్ షేక్ సాధారణ కొందరు నేరగాళ్లను ఉగ్రవాదం వైపు మళ్లించారు. వీళ్లే ఖాదిమ్స్ సంస్థ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ను కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన ‘పార్ట్–2 ‘జైల్ టు జీహాద్’ వచ్చే వారం) -
హైఎండ్ కార్లు, చాపర్ రైడ్స్ : ఎందుకు సీజే రాయ్ ఆత్మహత్య?
బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, సీజే రాయ్ అలియాస్ చిరియాంకందత్ జోసెఫ్ మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం సెంట్రల్ బెంగళూరులోని తన నివాసంలో మృతి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోరారాజులా వెలిగిన రాయ్ ఆత్మహత్యకు గల కారణాలేంటి? హై-ఎండ్ లగ్జరీ కార్లు, హెలికాప్టర్ రైడ్లు, ప్రయణాలతో, చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపిన రాయ్ గురించి కొన్ని ఆసక్తి కర సంగతులను పరిశీలిద్దాం57 ఏళ్ల CJ రాయ్ మరణం బెంగళూరు రియల్ ఎస్టేట్ , వ్యాపార వర్గాల్లో తీవ్ర అలజడి రేపింది. రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్, తమ చైర్మన్ సీజే రాయ్ పై తీవ్ర ఒత్తిడి కారణంగానే ఈ దారుణమైన చర్య తీసుకున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐటీ నిఘా నీడలోఉన్న బడా బడా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి ప్రశ్నలు లేవనెత్తాయి. ఆయన మరణం వెనుక ఉన్నకారణాలపై పోలీసులు కారణాలు దర్యాప్తులో ఉన్నాయి.రాయ్ తన కరీర్ ప్రారంభంలో, రాయ్ టెలివిజన్ రియాలిటీ షోల డీల్స్, విజేతలకు బహుమతులివ్వడం, బ్రాండింగ్ వ్యూహంగా ఉపయోగించాడు. విజేతలకు రియల్ ఎస్టేట్ బహుమతులను అందించేవాడు. మీడియాతో ఎక్కువ సంబంధాలను కలగి ఉండేవాడు. ఇది అతని కంపెనీ పబ్లిక్ ప్రొఫైల్ను గణనీయంగా పెంచింది. అలా తన సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా, ముఖ్యంగా బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలలో పేరున్న సంస్థగా తీర్చిదిద్దాడు. రాయ్ సోషల్ మీడియా ఉనికిని పెంచుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అతనికి దాదాపు 1.3 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. ఫీడ్లో కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రాజెక్టులను ప్రదర్శించే పోస్ట్లతో పాటు, హై-ఎండ్ లగ్జరీ కార్లు, హెలికాప్టర్ రైడ్లు, ఇతర ప్రయాణ స్టోరీలను క్రమం తప్పకుండా తన ఫాలోయర్లతో పంచుకునేవాడు. అతని చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. View this post on Instagram A post shared by Dr Roy Chiriankandath Joseph (@dr.roy.cj) జనవరి 30న సెంట్రల్ ఆదాయపు పన్ను శాఖకు వాంగ్మూలం ఇవ్వడానికి రాయ్ బెంగళూరులోని లాంగ్ఫోర్డ్ రోడ్లోని కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయానికి జోసెఫ్తో కలిసి వచ్చారు. ఆ తర్వాత రాయ్ తన క్యాబిన్కు వెళ్లి తన తల్లితో మాట్లాడారు. ఆ తర్వాత తన క్యాబిన్లోకి ఎవ్వరినీ అనుమతించవచ్చని సెక్యూరిటీకి చెప్పాడు. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది క్యాబిన్ తలుపు లోపలి నుండి లాక్ చేయబడిందని గ్రహించి,బలవంతంగా క్యాబిన్ తలుపు బలవంతంగా తెరిచారు. తుపాకీ గాయాలతో పడిపోయి కనిపించారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు కేరళకు చెందిన ఆదాయపు పన్ను అధికారుల ఒత్తిడి కారణంగా రాయ్ కుటుంబం ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల ప్రకారం, డిసెంబర్ 3, 6, జనవరి 28 తేదీల్లో బెంగళూరు , ఇతర ప్రాంతాలలో రాయ్ మరియు అతని వ్యాపార ప్రయోజనాలకు సంబంధించిన సోదాలు అనేక సందర్భాల్లో జరిగాయి. దీనిపై బెంగళూరులోని అశోక్నగర్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో, కాన్ఫిడెంట్ గ్రూప్ ఎండీ రాయ్ మరణానికి దారితీసిన సంఘటనలపై వివరణాత్మక దర్యాప్తు చేయాలని కోరారు. సోదాల సమయంలో జరిగిన సంఘటనల క్రమం సహా అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.భూమి కొనండి, ఇంట్రస్టింగ్ రాయ్ సందేశంరాయ్, తాను 25 ఏళ్ల వయసులో 1994లో కొనుగోలు చేసిన తన తొలి కారును కనిపెట్టిన వారికి 10 లక్షల బహుమతిని ప్రకటించాడు. ఎర్ర మారుతి 800ను చివరకు తిరిగి పొందారు.1994లో, తన సొంత డబ్బులతో ఆ కారును రూ.1.10 లక్షలకు కొనుగోలు చేశాడట. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు 27 సంవత్సరాల తర్వాత దానిని తిరిగి సాధించాడట. 1997లో ఈ మారుతి 800 కారును అమ్మేసి, మారుతి ఎస్టీమ్ కొనుగోలు చేశాడు. అప్పటికి భారతీయ రోడ్లపై అత్యంత ఖరీదైన , ఉత్తమమైన కారు. తానెపుడూ ఎప్పుడూ కారు ప్రేమికుడినే కానీ ఫస్ట్ కారు ప్రేమే వేరు అని ఒక పోస్ట్లో వెల్లడించడం విశేషం ఈ రోజు విలాసవంతమైన రోల్స్ రాయిస్ కార్లు ఉన్నప్పటికీ, తన మొదటి మారుతి 800 అతని అత్యంత విలువైన జ్ఞాపకంగా మిగుల్చుకున్నాడు.ఆయన ఇంకో విషయం కూడా చెబుతారు. తన తొలి కారు కొన్నిసమయంలో ఆ డబ్బుతో సర్జాపూర్లో 2 ఎకరాల భూమిని కొనుగోలు చేయగలిగేవారు. ఈ రోజు, ఆ 2 ఎకరాల విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుందని ఒక సందర్బంగా చెప్పాడు. కారు కొనండి.. కారుతోపాటు, ఎంతో కొంత భూమిని కూడా కొనండి. భూమి కుటుంబ సంపదగా మారుతుంది అనేది ఫిలాసఫీ. View this post on Instagram A post shared by Dr Roy Chiriankandath Joseph (@dr.roy.cj) -
ఎప్స్టీన్ ఫైల్స్లో మస్క్ తాజా ఈమెయిల్స్ కలకలం
సంచలనం ఎప్స్టీన్ ఫైల్స్లో టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ పేరు మరోసారి మారు మోగుతోంది.దీనికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ కొత్త ఫైళ్లను వెలికి తీసింది. ఎలోన్ మస్క్ జెఫ్రీ ఎఎప్స్టీన్ మధ్య ఈమెయిల్ మార్పిడి జరిగినట్టు చెబుతోంది. 2012- 2013లో ఎప్స్టీన్ తన ప్రైవేట్ వర్జిన్ దీవులకు మస్క్ను ఆహ్వానించినట్లు ఈ మెయిళ్ల సారాంశం. దాదాపు 30 లక్షలకు పైగా కొత్త పేజీల ఎప్స్టీన్ ఫైల్స్ను విడుదల చేసింది. అయితే ఎప్స్టీన్ ద్వీపానికి తనను రమ్మని ఆహ్వానించి నప్పటికీ, తానెప్పుడూ వెళ్లలేదని గతంలోనే మస్క్ ఖండించాడు.తాజాగా విడుదలైన US న్యాయ శాఖ పత్రం, మస్క్ జెఫ్రీ మధ్య ఈమెయిల్స్ ద్వారా చాలా పెద్ద చర్చే జరిగినట్టు గుర్తించింది. ఎప్స్టీన్ ఐలాండ్కు మస్క్ణు ఆహ్వానించినట్టు, మస్క్ అక్కడి వెళ్లినట్టుగా వాదిస్తోంది. వీటిలో షెడ్యూల్ తేదీలు, లాజిస్టిక్స్, ఇతర ప్లాన్స్ ఉన్నాయిన వాదిస్తోంది. 2012 క్రిస్మస్ నాటి ఇమెయిల్లో, తన ద్వీపాన్ని సందర్శించమని మస్క్ను ఆహ్వానించాడు ఎప్స్టీన్. అయితే, మస్క్ వెళ్లినట్టు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ మరోసారి ఈ వార్తలు నెట్టింట చర్చకు దారి తీశాయి. అయితే ఎప్స్టీన్ ఆఫర్ను మస్క్ తిరస్కరించాడు. దీనికి ప్రతిస్పందనగా, ఎప్స్టీన్ మస్క్ సంకోచాన్ని అర్థం చేసుకున్నానని, గర్ల్ఫ్రెండ్తో స్వేచ్ఛగా ఉండవచ్చనే నిగూఢార్థంతో మరో సందేశాన్ని పంపాడు. కొన్ని వారాల తర్వాత, ప్రయాణ ఏర్పాట్ల కోసం మస్క్ను అడుగుతూ ఒక ప్రత్యేక ఇమెయిల్లో పంపాడు. “మీరు హెలికాప్టర్ ద్వీపానికి ఎంత మంది ఉంటారు?”మరుసటి రోజు ప్రతిస్పందనగా, మస్క్ ఇలా వ్రాశాడు, “బహుశా తాలూలా,తాను మాత్రమేనని, మీ ద్వీపంలో పగలు/రాత్రి హార్డెస్ట్ పార్టీ ఉంటుందా అని మస్క్ అడిగాడు. ఆ తరువాత 1-8వ తేదీ వరకు ఏ రోజునా, ఎపుడూ మీకోసం సిద్ధంగా ఉంటుందని మరో ఈయిల్ పంపాడు.కరేబియన్ పర్యటనలోమస్క్ ఇక్కడికి వెళ్లి ఉంటాడని భావించే2013 ఇమెయిల్ మార్పిడి కూడా ఫైల్లో ఉంది. “సెలవులలో BVI/సెయింట్ బార్ట్స్ ప్రాంతంలో ఉంటాను. సందర్శించడానికి మంచి సమయం ఉందా?” మస్క్ 2013, డిసెంబర్ 13 నాటి ఇమెయిల్లో రాశారు. ఇలా పలు దఫాలుగా మారి మధ్య ఈమెయిల్స్ ద్వారా సంభాషణ జరిగిందని చెబుతోంది. కానీ మస్క్ ఎపుడు అక్కడికి వెళ్లాడు అనేదానిపై రికార్డులు స్పష్టమైన ధృవీకరణ లేదు.ఎప్స్టీన్తో మస్క్ ఈమెయిళ్ళ వార్త వెలువడిన వెంటనే, సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువెత్తాయి. సందర్భాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. బిలియనీర్లు బ్రిటిష్ వర్జిన్ దీవులలో సెలవుల్లో ఉండటం సర్వసాధారణం. ఉన్నత స్థాయి ఆర్థికవేత్తను కలవమని అడగడం నేరం కాదు. మస్క్ గతంలోనే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని, అక్కడికి ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు. ఈ ఫైల్స్లో లక్షలాది ఈమెయిళ్ళు ఉన్నాయి, ఒకరి ఇన్బాక్స్లో పేరు ఉన్నంత మాత్రాన వారి నేరంలో భాగస్వాములైనట్లు కాదు. ఇది కేవలం మస్క్ను వేధించడానికి చేస్తున్న మరో ప్రయత్నం మాత్రమే అని ఒకరువ్యాఖ్యానించారు. అప్పట్లో ఎప్స్టీన్కు ఈమెయిల్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ సందర్భం ముఖ్యం. ఏదైనా నిర్ధారణకు వచ్చే ముందు పూర్తి సంభాషణలను పరగణనలోకి తీసుకోవాలని మరొకరు రాశారు. తాను ఎప్స్టీన్తో సంభాషించలేదని మస్క్ ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి ఎప్స్టీన్ నిర్వహించిన అనేక 'లంచ్లకు' వెళ్లాడు. తలులా రిలే ఒకసారి ఎప్స్టీన్ న్యూయార్క్ సిటీ పెంట్హౌస్ను సందర్శించాడు. ఈ విషయం తలులా ఎక్స్లో ఇప్పటికీ ఉన్న ఒక పోస్ట్లో పేర్కొన్నారు. కూడా అని మరొకరు అభిప్రాయ పడ్డారు. -
దారిలేదు.. ముగ్గురం చనిపోయేట్టు ఉన్నాం!
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: ‘హలో... అన్నా, అన్నా.. మర్జాతే అన్నా. జగా నహీహై అన్నా’ నాంపల్లి స్టేషన్ రోడ్లోని సాయి బిశ్వాస్ చాంబర్స్లో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో గత శనివారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన ఆ షాపు ఆటో డ్రైవర్ మహ్మద్ ఇంతియాజ్ మాటలు ఇవి. సెల్లార్లో ఉన్న చిన్నారుల్ని రక్షించడానికి వెళ్లి, తప్పించుకునే దారిలేక, చిక్కుకుపోయిన అతడు అక్కడి నుంచే అదే దుకాణంలో పనిచేసే తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఈ కాల్లో అతడు మాట్లాడుతుండగా..వెనుక చిన్నారుల అరుపులు, ఏడుపులు సైతం వినిపించాయి. సదరు స్నేహితుడి ఫోన్లో రికార్డు అయిన ఈ కాల్ శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్గా మారి అనేక మందిని కన్నీరు పెట్టించింది. ఈ ఫోన్ సంభాషణను పరిశీలిస్తే ఆ దుకాణంలోని సెల్లార్, సబ్ సెల్లార్ సరుకుతో నిండిపోయి ఉండటం, ఎటూ కదలడానికి ఖాళీ లేకపోవడం, తలుపులు, గ్రిల్స్కు తాళాలు వేసి ఉండటం తదితర పరిస్థితులు స్పష్టంగా తెలుస్తున్నాయి. మంటలు చుట్టుముడుతుండటం ఇంతియాజ్, చిన్నారులు భయంతో, పొగ నిండిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక వారు పడిన ఇబ్బంది కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇది అనేక సిటీజనుల హృదయాలను కలచివేసింది. ఈ కాల్లో మాట్లాడింది దుకాణ యజమానే అని తెలుస్తోంది. అయితే దీనిని అధికారులు ధ్రువీకరించట్లేదు. ఇదీ జరిగింది... ఈ దుకాణం సెల్లార్లో రెండు చిన్న గదులు ఉన్నాయి. ఒకదాంట్లో గుల్బర్గా నుంచి వలసవచ్చి బచ్చాస్ సంస్థలో స్వీపర్గా పనిచేస్తున్న బేబీ, తన కుమారుడు సమీర్తో కలిసి మరో గదిలో వాచ్మన్ తోకల యాదయ్య, తన భార్య లక్షి్మ, కుమారులు ప్రణీత్, అఖిల్లతో కలిసి ఉన్నారు. సుభాన్నగర్కు చెందిన మహ్మద్ ఇంతియాజ్ , శాస్త్రీపురం వాసి హబీబ్ బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఆటోడ్రైవర్లుగా పని చేసేవారు. వినియోగదారులకు సంబంధించిన సరుకు డెలివరీ వీరి బాధ్యత. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దుకాణం ఎదుట ఉన్న ఇంతియాజ్, హబీబ్ అప్రమత్తమయ్యారు. సెల్లార్లో ఉన్న బేబీతో పాటు ప్రణీత్, అఖిల్లను రక్షించడానికి సిద్ధమయ్యారు. దుకాణంలో ఉన్న ఫైర్ ఎక్స్టింగి్వషర్లు తీసుకొని సెల్లార్లోకి వెళ్లారు. ఇంతియాజ్ చిన్నారులు ఉన్న గదిలోకి, హబీబ్... బేబీ ఉంటున్న గదిలోకి వెళ్లారు. ఈ ఐదుగురూ అక్కడే అసువులు బాశారు.ఇంతియాజ్, స్నేహితుడి మధ్య ఉర్దూలో జరిగిన సంభాషణ తెలుగులో...ఇంతియాజ్: హలో అన్న.. అన్న.. చనిపోతాం అన్న. ఎక్కడా దారి లేదు అన్న. స్నేహితుడు: అరె ఇటు ఎందుకు వచ్చావు? అటు నుంచి వెనుక వైపు నుంచి రా ఇం: ఎక్కడా స్థలం లేదు అన్న. చనిపోతాం అన్న. తలుపు మూసి ఉంది స్నే: ఏ తలుపు మూసి ఉంది? ఇం: వెనుకాల ఉన్న తలుపు మూసి ఉంది స్నే: అదెలా మూసి ఉంది ఇం: నాతోపాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు... ముగ్గురం చనిపోతాం అన్న స్నే: ఇంతియాజ్ ముందు నా మాట విను. ఇటు నుంచి రా బయటకు ఇం: ఎటు నుంచీ అవకాశం లేదు అన్నా అన్నీ మూసి ఉన్నాయి స్నే: అక్కడ గ్రిల్ గేట్ ఉంది కదా... దాని నుంచి బయటకు రా ఇం: అంతా చూశాను ఎక్కడ నుంచీ బయటకు రావడానికి ఆస్కారం లేదు స్నే: గ్రిల్ గేట్... గ్రిల్ గేట్.. సెకండ్ సెల్లార్లోకి వెళ్లిపో ఇం: ఏదీ తెరుచుకోవట్లేదు అన్న స్నే: తెరుచుకోవట్లేదా..? సెకండ్ సెల్లార్లోకి వెళ్లు ఇం: ఇక్కడ ఏం చేయలేను అన్న స్నే: ఏదో ఒకటి చేసి సెకండ్ సెల్లార్లోకి దూకెయ్ ఇంతియాజ్.. లేదంటే ఇబ్బంది అయిపోతుంది. ఇం: లేదు అన్న.. ఏం కనిపించట్లేదు స్నే: అక్కడ ఉన్న వస్తువులు పక్కకు పడేృయ్ (ఈ సమయంలో ఇంతియాజ్, చిన్నారులు ఊపిరి అందక ఆయాస పడటంతోపాటు దగ్గుతున్నట్లు రికార్డు అయింది) ఇం: నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతకీ కనిపించట్లేదు స్నే: అదే చెబుతున్నా... ఇంతియాజ్ సెకండ్ సెల్లార్లోకి దూకెయ్ ఇం: వెనుక ఉన్న తలుపు తీయమని చెప్పు అన్న స్నే: ఇంతియాజ్ మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. కిందకు వెళ్లే పరిస్థితి లేదు ఇం: అన్న నేనేం చేయలేను.. కనిపించట్లేదు.. సమీర్ని వాళ్ల రూమ్ తలుపు తీయమని చెప్పు (ఈ అగ్నిప్రమాదంలో చనిపోయిన బేబీ కుమారుడే సమీర్) స్నే: మంటలు ఎక్కువగా ఉన్నాయి అక్కడకు వెళ్లడం కుదరదు. సెకండ్ సెల్లార్లోకి దూకెయ్ ఇం: ఎక్కడా స్థలం లేదు... నేను బయటకు రాలేను స్నే: పిల్లల్ని తీసుకొని సెకండ్ సెల్లార్లోకి వెళ్లిపో... ఇం: అన్నా... నేను వెళ్లలేను... అంతా చీకటి, ఏం కనిపించట్లేదు స్నే: టార్చ్ వేసుకో... ఏదో ఒకటి వేసుకో... సమీర్ గది తలుపు దగ్గరే మంట అంటుకుంది ఇం: వెళ్లలేం అన్న స్నే: ఎవరెవరు ఉన్నారు కింద ఇం: ముగ్గురం ఉన్నాం స్నే: ఆగు నేను పంపిస్తాను -
బ్లాక్ శారీలో బిగ్బాస్ దివి పోజులు.. సాహితి స్టన్నింగ్ గ్లామరస్ పిక్స్!
బ్లాక్ శారీలో బిగ్బాస్ దివి అందాలు..టాలీవుడ్ నటి సాహితి దాసరి స్టన్నింగ్ గ్లామర్ పిక్స్..డిఫరెంట్ డ్రెస్ల్లో రెజీనా కసాండ్రా లుక్స్..సముద్రపు ఒడ్డున చిల్ అవుతోన్న ఆండ్రియా జెరెమా..పింక్ శారీలో బాలీవుడ్ భామ నైరా బెనర్జీ అదిరిపోయే గ్లామర్.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nyrraa M Banerji (@nyra_banerjee) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) -
ఎర్ర రంగు ఏందయ్యా డిఎస్పీ?
తలలో తెల్లవెంట్రుకలను కవర్ చేయడానికి కలర్ వేయడం ఇప్పుడు కామనైపోయింది. తెల్లబడిన జట్టును నల్లగా మార్చడానికి ఎక్కువ మంది హెయిర్డై పెట్టుకుంటారు. మరికొందరు గోరింటాకు పేస్టు కూడా తలకు అప్లై చేస్తుంటారు. కాస్త భిన్నంగా కనిపించాలని తాపత్రయపడేవారు రకరకాల రంగులు ట్రై చేస్తుంటారు. ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా ఇలాగే చేసి చిక్కుల్లో పడ్డారు. ఇంతకీ ఎవరాయన?రష్మి రంజన్ దాస్.. ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్నారు. 49 ఏళ్ల రంజన్ దాస్కు స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరుంది. అసాంఘిక శక్తులపై ఆయన కఠినంగా వ్యవహరిస్తారని అంతా అనుకుంటూ ఉంటారు. బుధవారం నాడు (జనవరి 28) ఆయన ఫొటో ఒకటి విపరీతంగా వైరల్ (Viral) అయింది. ఈ ఫొటోలో తలకు ఎర్రరంగుతో ఆయన డిఫరెంట్గా కనిపించారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై మీమ్స్, జోక్స్ (Jokes) పోటెత్తాయి. ఫలితంగా ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు.పోలీసు విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరు యూనిఫాంను గౌరవించాలని.. క్రమశిక్షణ, హుందాతనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్స్పెక్టర్ జనరల్ (సెంట్రల్ రేంజ్) సత్యజిత్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రష్మి రంజన్ దాస్ వ్యవహారం తన దృష్టికి వచ్చిన వెంటనే చర్య తీసుకున్నట్టు తెలిపారు. హ్యుమన్రైట్స్ ప్రొటెక్షన్ సెల్కు దాస్ను ఎటాచ్ చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడడానికి దాస్ నిరాకరించారు.ముందే హెచ్చరించినా..తలకు ఎరుపు రంగు తీసివేయాలని గతంలోనూ ఉన్నతాధికారులు అనధికారికంగా దాస్ను హెచ్చరించినట్టు సహచర ఉద్యోగులు తెలిపారు. పై అధికారుల మాటలను అతడు ఖాతరు చేయకపోవడంతో తాజాగా చర్య తీసుకున్నట్టు చెప్పారు. పోలీసు మాన్యువల్లో(Police Manual) హెయిర్ స్టైల్స్కు సంబంధించి స్పష్టమైన నియమాలు లేనప్పటికీ.. గౌరవ భావం కలిగేలా క్రమశిక్షణగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. మొత్తానికి దాస్ వివాదంతో.. క్రమశిక్షణ, హుందాతనం విషయంలో ఉల్లంఘనలకు పాల్పడితే సహించబోమని సందేశాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చారు.చదవండి: ఏసీబీలో పనిచేస్తూనే.. రూ.20 కోట్లు పోగేశాడు -
‘కుక్కను చూసినా వదిలిపెట్టడు’
‘‘వీడు కుక్కను చూసినా వదిలిపెట్టడు అని నాకు అర్థమైంది’ అంటూ రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ని ఉద్దేశించి కూటమి నేత ఒకరు చేసిన వ్యాఖ్య నెట్టింట వాయిస్ కాల్ రూపంలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగిని ఒకరిని శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారంలోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర పేరిట వాయిస్ కాల్ ఒకటి గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. బాధితురాలితో మాట్లాడినట్టు ఉన్న ఆ కాల్లో ‘‘మీరేదైనా మాట్లాడాలనుకున్నప్పుడు నాతో చెప్పండి. నేను మాట్లాడుతాను. శ్రీధర్కు చపలత్వం ఎక్కువ. రాంగ్ట్రాక్లో పోతున్నాడు. మనోడు ఇన్స్టాలో వచ్చిన మెసేజ్లకూ తప్పుగా స్పందించాడు. పిల్ల చేష్టలు. వాళ్ల పెద్దోళ్లకు కూడా నీ గురించి చెప్పా. మీవాడికి చపలత్వం ఎక్కువుంది జాగ్రత్త అని చెప్పా..’’ అంటూ తాతంశెట్టి బాధితురాలికి సర్దిచెప్పారు.దీనికి బాధితురాలు దీటుగా బదులివ్వడంతో ‘‘వీడు(శ్రీధర్) కుక్కను చూసినా వదిలి పెట్టడు అని నాకు అర్థమైంది’’ అంటూ ఫోన్ పెట్టేశారు. ప్రస్తుతం నెట్టింట ఇందుకు సంబంధించిన క్లిప్ తెగ వైరల్ అవుతోంది.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్లు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు..వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని బాధితురాలు చెబుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ::: సాక్షి, రైల్వే కోడూరు -
చిట్టి గౌనులో జ్యోతి పూర్వాజ్ అందాలు.. మార్నింగ్ మూడ్లో బిగ్బాస్ దివి..!
టాలీవుడ్ నటి అభినయ లేటేస్ట్ లుక్..కలర్ఫుల్ శారీలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్..వైట్ డ్రెస్లో శ్రియా శరణ్ అందాలు..పొట్టి గౌనులో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ స్టన్నింగ్ పిక్స్..బ్లాక్ డ్రెస్లో అనుపమ పరమేశ్వరన్ బ్యూటీఫుల్ లుక్స్..మార్నింగ్ మూడ్లో బిగ్బాస్ దివి.. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
వింటర్ వండర్ గడ్డకట్టిన నయాగరా, వైరల్ వీడియోలు
ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాలలో ఒకటైన నయాగరా జలపాతం కారణంగా గడ్డకట్టింది. పోలార్ వోర్టెక్స్ వద్ద ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ దిగువకు పడిపోవడంతో నయాగరాజలపాతం ఫ్రీజ్ మోడ్లోకి జారిపోయింది. దీంతో టూరిస్టులు, స్థానికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.గడ్డకట్టిన నయాగరా జలపాతానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రెయిలింగ్లు, నదీ తీరాలకు అతుక్కుపోయిన మందంగా మంచు పేరుకుపోయినప్పటికీ జలపాతాల హోరు మాత్రం ఆగలేదు.నయాగరా జలపాతం గడ్డకట్టి, అద్భుతమైన దృశ్యాలతో అలరారుతోంది. నయాగరా నది అంచుల దగ్గర పాక్షికంగా గడ్డకట్టినట్లు కనిపిస్తుంది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ లక్షలాది లీటర్ల నీరు జలపాతంపై ప్రవహిస్తుంది.ప్రతి సెకనుకు లక్షలాది లీటర్ల నీరు అంచుల నుండి ఉరుములు మెరుపులతో ఉప్పొంగుతూనే ఉంది. శీతలగాలులు, పొగమంచుకి విరుద్ధంగా, ప్రవహించే నీరు, ఘనీభవించిన ఉపరితలాలు పక్కపక్కనే వీడియోలు నెట్టింట సందడిగామారాయి.సాధారణంగా, శీతాకాలంలో కూడా జలపాతం నుండి వచ్చే పొగమంచు కొద్దిసేపు ద్రవంగా ఉంటుంది. అయితే సూపర్-కూల్డ్ గాలి పొగమంచులోని నీటి బిందువులు చల్లని ఉపరితలాలను తాకిన క్షణంలో సంభిస్తోంది. గంటలు ,రోజులలో, మంచు నెమ్మదిగా రాళ్ళు, చెట్లు, నడక మార్గాలు , పరిశీలనా కేంద్రాల వెంట మందపాటి క్రస్ట్లు, శిల్పకళా కళాకృతులు దర్శనిమిచ్చాయి. ఫలితంగా అరుదైన దృశ్య విరుద్ధంగా కనిపిస్తుంది.కింద గర్జించే నీరు, పైన నిశ్శబ్దంగా, గడ్డకట్టిన ప్రపంచం.ఈ వింటర్ వండర్ను చూసి నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్థానికులు , సందర్శకులు ఈ దృశ్యాన్ని "మరోప్రపంచం"గా అభివర్ణించారు.❄️| Extreme cold freezes the iconic Niagara Falls.pic.twitter.com/oyCw7mlTCe— Earth (@earthcurated) January 26, 2026 నయాగరా జలపాతం ఎప్పుడూ ఘనీభవించదు, ఆర్కిటిక్ గాలులు, విపరీతమైన చలి ఈ ప్రభావాన్ని పెంచుతుంది. శక్తివంతమైన పోలార్ వెర్టిక్స్ చుట్టు పక్కల ప్రాంతాలపై తక్షణమే మంచు వేగంగా పేరుకు పోయేలా చేస్తుంది. దీంతో ఈ దృశ్యం ఫోటోగ్రాఫర్లు , వింటర్ టూరిస్టులను కనివిందు చేస్తోంది. View this post on Instagram A post shared by Erhun Abbasli (@erhunabbasli) -
సోషల్ మీడియాలో కొత్త సెన్సేషన్ ‘అప్స్క్రోల్డ్’ అసలేంటిది?
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సెన్సేషన్ సృష్టిస్తున్న యాప్ అప్స్క్రోల్డ్ (UpScrolled) ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్,టిక్టాక్లాంటి యాప్లకు ప్రత్యామ్నాయంగా దూసుకుపోతోంది. అసలేంటీ అప్స్క్రోల్డ్, ఎందుకు పాపులర్ అవుతోంది? తెలుసుకుందాం.ఎటాంటి సెన్సార్షిప్ లేదా దూకుడు అల్గారిథమ్లు లేని సురక్షితమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ప్రకటించుకుంటోంది యాజమాన్యం. యూజర్ డేటాను థర్డ్ పార్టీలకు అమ్మబోమని హామీ ఇస్తోంది. దీంతో యాక్టివిస్టులు, రాజకీయవేత్తలు సహా పలువురు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. టాప్లో దూకుడు, ఏకంగా సర్వర్లు క్రాష్ఆపిల్(iOS) యాండ్రాయిడ్ యాప్ స్టోర్లో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన యాప్గా ఇది నిలిచింది. జనవరి 2026 నాటికి, అమెరికాలో ఈ యాప్ ఆపిల్ యాప్ స్టోర్లో టాప్-10 లోకి చేరింది. టిక్టాక్ , మెటా (ఫేస్బుక్/ఇన్స్టాగ్రామ్) లపై అసంతృప్తిగా ఉన్న యాక్టివిస్టులు, క్రియేటర్లు ఈ ప్లాట్ఫారమ్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సార్షిప్లేని కంటెంట్ కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. పారదర్శకత ,న్యాయమైన కంటెంట్ను అందించే ప్లాట్పాం ప్రత్యామ్నాయాలన కోసం చూస్తున్నారు.ఆపిల్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్లో టిక్టాక్ను దాటేసింది. అంతేకాదు డౌన్లోడ్ల తాకిడికి జనవరి 26 న ప్లాట్ఫామ్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. టిక్టాక్ ప్లాట్ఫామ్ యాజమాన్య మార్పు తర్వాత సెన్సార్షిప్ ఆరోపణల మధ్య టిక్టాక్ను వదిలివేసి అప్స్క్రోల్డ్కు మారిపోతున్నారు.అప్స్క్రోల్డ్ ఎక్కడిది?ఆస్ట్రేలియాకు చెందిన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్. దీనిని పాలస్తీనా-ఆస్ట్రేలియన్ డెవలపర్ ఇస్సాం హిజాజీ (Issam Hijazi) 2025,జూన్లో ప్రారంభించారు. ఇటీవల అమెరికాలో టిక్టాక్ యాజమాన్య మార్పుల నేపథ్యంలో, చాలామంది యూజర్లు ఈ యాప్ వైపు మళ్లుతున్నారు. దీని ‘‘ఎబౌట్" పేజీ ప్రకారం, పక్షపాతం, షాడోబ్యానింగ్ లేదా "అన్యాయమైన" అల్గారిథమ్ల ప్రమాదం లేకుండా యూజర్లందరూ తమ అభిప్రాయాలను పంచుకోవడానికి అనుమతించడమే అప్స్క్రోల్డ్ లక్ష్యం.కంపెనీ తమ మార్గదర్శకాలనుఉల్లంఘించే కంటెంట్ను మాత్రమే పరిమితం చేస్తుందట. అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ద్వేషపూరిత ప్రసంగం, బెదిరింపు, వేధింపులు, అశ్లీలం, లైసెన్స్ లేని కాపీరైట్ కంటెంట్ లేదా "హాని కలిగించడానికి ఉద్దేశించినది". UpScrolled కూడా మీకు తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడూ నిషేధించదని అని కూడా చెపుతోంది. ప్లాట్ఫారమ్ ఉంచి వీడియోలను లేదా మీ ఖాతాను తొలగిస్తే, ఎందుకు తొలగించిందో కూడా వివరిస్తుంది. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లతో పోలిస్తే దీని ప్రధానమైన తేడా దాని అల్గోరిథం. Discover Feedని ఉపయోగించవచ్చు డిస్కవర్ ఫీడ్, ఫాలోయింగ్ పీడ్ అని రెండు రకాలుగా యాప్ ఫీడ్లను విభజిస్తుంది. Following Feed అంటే మనం ఫాలో అయ్యే వ్యక్తుల పోస్ట్లు మాత్రమే వరుసగా కనిపిస్తాయి. Discover Feed అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న కంటెంట్ను చూడవచ్చు.ఇదీ చదవండి: కాబోయే సుప్రీం మొజ్తబా ఖమేనీ..దిమ్మదిరిగే వ్యాపార సామ్రాజ్యండిస్కవర్ ఫీడ్ అనేది వివిధ రకాల కంటెంట్ల మిశ్రమం, కానీ ప్రస్తుత ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణకు సంబంధించిన కంటెంట్తో నిండిపోతోంది. వాస్తవానికి, ప్రధాన స్రవంతి సోషల్ మీడియా యాప్లు ఈ రకమైన పోస్ట్లను సెన్సార్ చేస్తున్నాయనే ఆరోపణలకు ప్రతిస్పందనగా, చాలా మంది వినియోగదారులు ఈ ప్లాట్ఫామ్ను పాలస్తీనాకు మద్దతు ఇచ్చే కంటెంట్ కోసం దీన్ని ఒక వేదికగా ఎంచుకుంటున్నారు. దీంతోపాటు క్రీడలు, వార్తలు, గేమ్లు, సినిమాలు, సంగీతం, టెక్నాలజీ , ట్రావెల్ వంటి అనేక విభిన్న రకాల కంటెంట్లను అందిస్తామని వెల్లడించింది. టిక్టాక్, ఇన్స్టాలా కాకుండా, Discover Feed కొన్ని దూకుడు, వ్యక్తిగతీకరించిన అల్గారిథమ్ను ఉపయోగించదు. దీనికి బదులుగా, ఇది లైక్లు, కామెంట్స్, షేర్స్ మీదధారపడి ఉంటుంది.ముఖ్యమైన ఫీచర్లుప్రస్తుతం ఆండ్రాయిడ్ (Google Play Store, ఐఫోన్ (App Store) రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఇందులో ఫోటోలు, చిన్న వీడియోలు (Short-form videos) , టెక్స్ట్ పోస్ట్లను షేర్ చేయవచ్చు. స్నేహితులతో నేరుగా చాట్ చేసే సదుపాయం కూడా ఉంది. ప్రధాన సోషల్ మీడియా సంస్థలు కొన్ని రకాల కంటెంట్ను (ముఖ్యంగా రాజకీయ అంశాలను) సెన్సార్ చేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో, "సెన్సార్షిప్ లేని ప్లాట్ఫారమ్"గా తనను తాను ప్రకటించుకుంది.షాడో బ్యానింగ్ (Shadowbanning) అంటే యూజర్ల పోస్ట్లను రహస్యంగా అణచివేయడం ఉండదు. ఇతర యాప్లలాగా యూజర్లను అడిక్ట్ చేసే క్లిష్టమైన అల్గారిథమ్స్ కాకుండా, సాధారణమైన క్రోనలాజికల్ (సమయానుకూల) ఫీడ్ను ఇది అందిస్తుంది.అయితే ఇది తన సేవా నిబంధనలను దూకుడుగా కొత్త ట్రాకింగ్తో అప్డేట్ చేస్తోందని, కొన్ని కంటెంట్ రకాలను బ్లాక్ చేస్తోందని, కొత్త పోస్ట్లను "షాడోబ్యాన్" చేస్తోందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి! -
అకౌంట్లో డబ్బులు పడ్డాయంటూ ఫేక్ ప్రచారం
చిత్తూరు జిల్లా: ‘రాండొక్కో చంద్రన్న మన ఆడోళ్లకు మనిషికి రూ.15 వేల చొప్పున అకౌంట్లో వేశాడంట.. పోస్టాఫీసులో అకౌంట్ ఉండేవాళ్లు చెక్ చేసుకోండి’ అని ప్రచారం సాగింది. దీంతో వందలాది మంది మహిళలు పట్టణంలోని పోస్టాఫీసు వద్దకు చేరుకుని ఖాతాల్లో డబ్బులు పడలేదని ఉసూరుమంటూ వెనుదిగాల్సి వస్తోంది. పలమనేరు హెడ్పోస్టాఫీసు కొద్దిరోజులుగా మహిళలతో నిండిపోతోంది. ఖాతాలు తెరిచేందుకు కొందరు, డబ్బులు పడ్డాయేమో చెక్ చేసుకునేందుకు పోస్టాఫీసు వద్దకు వస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారం ఎవరు చేశారో గాని ఏమి సమాధానం చెప్పాలో తెలియక పోస్టల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
పట్టాలు తప్పని పారిశుధ్యం!
సాధారణంగా మన ఊళ్లలో రైల్వే స్టేషన్ అంటే ఎలా ఉంటుంది? ప్లాట్ఫాం నిండా పల్లీల తొక్కలు, పాన్పరాగ్ ఉమ్ములు, పట్టా ల మీద ప్లాస్టిక్ కవర్లు, దుర్గంధం.. ప్రయాణికులకు అనుభవమే. కానీ, సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఒక వీడియో చూస్తే.. ‘ఇది మన దేశంలోనేనా?’.. అని ముక్కున వేలేసుకోవడం ఖాయం! మచ్చుకైనా కానరాని చెత్త అస్సాంకు చెందిన రేజావుల్ అనే యువకుడు కేరళలోని కన్నూర్ రైల్వే స్టేషన్కు వెళ్లినప్పుడు అక్కడి దృశ్యాలు చూసి ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. వెంటనే కెమెరా తీసి ప్లాట్ఫాం నుంచి రైలు పట్టాల వరకు మొత్తం వీడియో తీశాడు. ప్లాట్ఫాం మీద అద్దంలా మెరుస్తున్న పలకలు ఒకెత్తయితే, సాధారణంగా చెత్తాచెదారంతో నిండిపోయే పట్టాల మీద.. కనీసం చిన్న కాగితం ముక్క కూడా కనిపించకపోవడం విశేషం. ‘ఏక్ భీ కచ్రా నహీ మిలేగా’ (ఇక్కడ ఒక్కటంటే ఒక్క చెత్త ముక్క కూడా మీకు దొరకదు!)’అని ఆ కుర్రాడు తన వీడియోలో కొనియాడాడు. మిలియన్ల వ్యూస్.. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల్లోనే వైరలై మిలియన్ల వ్యూస్ను కొల్లగొట్టింది. ఇది కేవలం రైల్వే అధికారుల ఘనత మాత్రమే కాదు, అక్కడి ప్రజల పౌర బాధ్యత (సివిక్ సెన్స్)కు నిదర్శనమని నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసి నా, ప్రజలు సహకరించకపోతే ఏ ప్రాంతం శుభ్రంగా ఉండదని ఈ వీడియో నిరూపించింది. శుభ్రత అనేది వనరుల మీద కాదు, మనుషుల ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుందని కేరళ ప్రజలు చాటిచెప్పారు. మిగతా రాష్ట్రాల వారు కూడా కన్నూర్ స్టేషన్ను ఆదర్శంగా తీసుకోవాలంటూ నెటిజన్లు వ్యాఖ్యలతో హోరెత్తిస్తున్నారు. పాలనా యంత్రాంగం పని కాదిది.. మన అందరి బా ధ్యతని కన్నూర్ స్టేషన్ గట్టిగా నినదిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సర్వస్వం త్యాగం : అజిత్ పవార్ చివరి పోస్ట్ వైరల్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఎన్సీపీనేత అజిత్ పవార్ అకాలమరణం రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. బుధవారం తెల్లవారుజామున బారామతిలో విమానం ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలడంతో ఆయన ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. అయితే విమాన ప్రమాదానికి కొన్ని గంటల ముందు చేసిన దేశభక్తి, త్యాగం అంటూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పలువురి చేత కంటతడి పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.విమాన ప్రమాదానికి కొన్ని గంటల ముందు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న అజిత్ పవార్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. స్వాతంత్ర్య సమరయోధుడు లాలాలజపతి రాయ్ జయంతి సందర్భంగా తన చివరి ఫేస్బుక్ పోస్ట్లో ఆయనకు నివాళులు అర్పించారు. లజపత్ రాయ్ దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేశారని, ఆయన దేశభక్తి తరతరాలకు స్ఫూర్తి నిస్తుందని పవార్ రాశారు. అలాగే పవార్ మంగళవారం రాత్రి ఎక్స్ (గతంలో ట్విటర్)లో సీఎంఓ మహరాష్ట్ర ట్వీట్ను రీట్వీట్ చేశారు. ఒక ఫోటోతో పాటు క్యాబినెట్ సమావేశం, కీలక ప్రభుత్వ నిర్ణయాల గురించి చర్చించామని తన చివరి ట్వీట్లో పేర్కొన్నారు.🔸 CM Devendra Fadnavis chaired a meeting of the Cabinet Committee on Infrastructure. DCM Ajit Pawar, Minister Chandrashekhar Bawankule, and concerned officials were present. 🔸 मुख्यमंत्री देवेंद्र फडणवीस यांच्या अध्यक्षतेखाली मंत्रिमंडळ पायाभूत सुविधा समितीची बैठक. यावेळी… pic.twitter.com/WzYkVZocYf— CMO Maharashtra (@CMOMaharashtra) January 27, 2026 ;ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్ : అమెజాన్లో వేలాది మంది ఉద్యోగులపై వేటుఅజిత్ పవార్ అస్తమయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ రోజు రాష్ట్రానికి అత్యంత కష్టమైన రోజు అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప స్నేహితుడ్ని కోల్పోయానని, పవార్ కుటుంబానికి ఇది తీరని లోటు అంటూ నివాళులర్పించారు. రాష్ట్రంలో మూడు రోజుల రాష్ట్ర సంతాప దినాలను బుధవారం సెలవు దినాన్ని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో కలిసి బారామతికి వెళ్లారు. అక్కడ పవార్ కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ను కలిసి తమ సంతాపాన్ని ప్రకటించారు. (Ajit Pawar jet crash : హాట్ టాపిక్గా ఆ ఇద్దరు పైలట్లు ) కాగా రాబోయే జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడానికి తన సొంత నియోజకవర్గమైన బారామతికి వెడుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం, బారామతిలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుండగా, రన్వే సమీపంలో కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. Governor Acharya Devvrat, CM Devendra Fadnavis, Deputy CM Eknath Shinde, met Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar, in Baramati.Ajit Pawar died in a crash landing of a charter plane in Baramati this morning. pic.twitter.com/HEOwpsVfKr— ANI (@ANI) January 28, 2026ఇదీ చదవండి: నిజాయితీకి మూల్యం, అజిత్ పవార్ మృతిపై రాజ్ థాకరే వ్యాఖ్యలు -
అజిత్ దాదా.. ఆనాడు మరణం గురించి సరదాగా..!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత (ఎన్సీపీ), మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్ దాదా అని ముద్దుగా పిలుచుకునే కార్యకర్తలు, అభిమానులు ఇక ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు నాలుగు దశాబ్దాలుగా ఆయనతో అనుబంధం ఉన్న నేతలు కూడా బోరున విలపిస్తున్న దృశ్యాలు నెట్టింట కనిపిస్తున్నాయి.అయితే గతంలోనూ అజిత్ పవార్కు ఓ ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని చాలాకాలం ఆయన ఎవరికీ చెప్పలేదు. చివరకు తన సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా తెలియజేశారాయన. పైగా ఈ విషయాన్ని అప్పటిదాకా తన భార్య, తల్లికి కూడా ఆయన చెప్పలేదట. ముందే అందరికి చెప్పి ఉంటే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యేదంటూ చమత్కరించారు. పైగా ఆయన ఈ ఘటన గురించి సరదాగా చెబుతుంటే అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు.అసలేం జరిగిందంటే.. ఓ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమం కోసం ఆయన వెళ్లారట. ఆ సమయంలో ఆయన ఎక్కిన లిఫ్ట్ 4వ అంతస్తు నుంచి పడిపోయింది. అదే లిఫ్ట్లో అజిత్ పవార్తోపాటు, ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు కూడా ఉన్నారట. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం అదేసమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తర్వాత తేలింది. అదృష్టవశాత్తూ.. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనపై అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘ ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో భవనం లోని మూడో అంతస్తు నుంచి నాలుగో అంతస్తుకు మెట్ల ద్వారా వెళ్లేందుకు సిద్ధమయ్యాం. అయితే మాతో పాటు 90 ఏళ్ల డాక్టర్ ఉండడంతో మేం లిఫ్ట్ ఎక్కాం. నాల్గవ అంతస్తుకి లిఫ్ట్లో వెళుతుండగా అకస్మాత్తుగా కరెంటు పోయింది. చుట్టూ చిమ్మచీకటి. అదే సమయంలో నాల్గో అంతస్తు నుంచి లిఫ్ట్ హఠాత్తుగా నాలుగో అంతస్తునుంచి కిందకు పడిపోయింది. నాతో పాటు ఉన్న వ్యక్తి లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరిచి నన్ను బయటకు లాగాడు. ఆ తర్వాత డాక్టర్ను కాపాడాం. నాకు ఎలాంటి గాయాలు కాలేదు. డాక్టర్కు స్వల్ప గాయాలు అయ్యాయి.. .. ఇదేదో కథకాదు. నేను అబద్ధం చెప్పడం లేదు. మాకు ఏమైనా అయ్యింటే ఈ రోజిది శ్రద్ధాంజలి కార్యక్రమంగా అయుండేది. ఈ విషయం నేను దాచుకోలేకపోతున్నాను.. మీరు కూడా నా కుటుంబ సభ్యులే. అందుకే ఈ విషయం మీతో చెప్పాను’ అని అజిత్ పవార్ అన్నారు. 2023 జనవరి 16న మహారాష్ట్రలోని పూణెలో హార్దికర్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. -
కశ్మీర్లో విరుచుకుపడ్డ మంచు గడ్డలు.. వీడియో వైరల్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న మంచు, శీతల గాలుల కారణంగా స్థానికులు గజగజా వణికిపోతున్నారు. బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు.. కశ్మీర్లోని సోన్మార్గ్లో మంచు గడ్డలు విరిచిపడ్డాయి. దీంతో, అక్కడున్న టూరిస్ట్ రిసార్ట్ దెబ్బతిన్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సోన్మార్గ్లో మంగళవారం రాత్రి తీవ్రస్థాయిలో హిమపాతం సంభవించింది. మంచు గడ్డలు, పెళ్లలు (అవలాంచీ) ఏర్పడ్డాయి. రాత్రి 10:12 గంటల సమయంలో సెంట్రల్ గందర్బల్ జిల్లాలోని రిసార్టుల మీద అవలాంచీ విరుచుకుపడ్డింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉప్పెనలా అవలాంచీ భవనాలను కప్పేయడం ఇందులో కనిపిస్తోంది.అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. రిసార్టుల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో ప్రమాదకర అవలాంచీ సంభవించే అవకాశం ఉందని సోమవారం నాడే హెచ్చరికలు జారీ అయ్యాయి. 24 గంటలుగా సోన్మార్గ్తో పాటు కశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ హిమపాతం సంభవించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు.. హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, అనంతనాగ్, కార్గిల్, సోన్మార్గ్, కుప్వారా, పుల్వామా, బేతాబ్ వ్యాలీ, పట్నిటాప్, పూంఛ్, కిష్తవార్ ప్రాంతాల్లో రోడ్ల మీద రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోతోంది.Dapaan there's been an avalanche in Sonamarg. Praying for everyone's safety. 🙏🏻 pic.twitter.com/aIqALHSq21— Basharat Rehan🇵🇸 (@BasharatRehan1) January 28, 2026శ్రీనగర్లో భారీగా మంచు కురుస్తున్న కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఓ ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయంలో వాతావరణం ప్రతికూలంగా ఉందని, మంచు కురుస్తూనే ఉందని ఏఏఐ పేర్కొంది. దీంతో శ్రీనగర్కు రావాల్సిన 25.. అక్కడి నుంచి బయలుదేరాల్సిన మరో 25 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. విమానాల రద్దు కారణంగా అక్కడికి వెళ్లిన అనేక మంది పర్యాటకులు శ్రీనగర్లోనే చిక్కుకుపోయారు. -
15 ఏళ్లలోపు ‘బ్యాన్’
పారిస్: సామాజిక మాధ్యమాల సుడిగుండంలో పడి విద్యారోగ్యాలను పాడుచేసుకుంటున్న చిన్నారులను కాపాడే లక్ష్యంతో ఫ్రాన్స్ ముందడుగువేసింది. 15 ఏళ్లలోపు చిన్నారుల సోషల్మీడియా వినియోగంపై నిషేధం విధిస్తూ ఫ్రాన్స్ చట్టసభ సభ్యులు సంబంధిత బిల్లుకు ఆమోదముద్ర వేశారు. సోమవారం అర్ధరాత్రి దాటాక ఫ్రాన్స్ పార్లమెంట్ దిగువసభలో జరిగిన ఓటింగ్లో 130–21 మెజారిటీతో బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు.సెప్టెంబర్లో మొదలయ్యే నూతన విద్యాసంవత్సరం నుంచి ఈ నిషేధాన్ని అమల్లోకి తేనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. అయితే ఈ బిల్లు ఇంకా ఎగువసభ అయిన సెనేట్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. వచ్చే కొద్దివారాల్లో దీనిని సెనేట్లోనూ ఆమోదింపజేసుకుంటామని మేక్రాన్ ధీమా వ్యక్తంచేశారు. బిల్లు దిగువసభలో ఆమోదంపొందడంతో మేక్రాన్ సంతోషం వ్యక్తంచేశారు. -
హీరోయిన్ హోటల్ ముందు భారీ క్యూ
నచ్చిన వాటిని దక్కించుకోడానికి 'క్యూ' కట్టడం మన దేశంలో సర్వ సాధారణం. అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు టికెట్ల కోసం ధియేటర్ల ముందు క్యూలో ఉంటాం. కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆపిల్ దుకాణాల ముందు నిల్చుంటాం. క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం కిలోమీటర్ల వరకు క్యూ కట్టేస్తాం. ఈ మధ్యన బట్టలు కొనేందుకు కూడా షాపుల ముందు నించుంటున్నారు జనం. ఇక మద్యం దుకాణాల ముందు మందుబాబుల క్యూ ఎవర్గ్రీన్. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలో కనిపిస్తున్న క్యూ కూడా దాదాపు అలాంటిదే. కానీ డబ్బులిచ్చి కొనేందుకు కాదు.. ఫ్రీగా తినేందుకు. ఇంతకీ అక్కడ ఏం పెడుతున్నారు, అంత ఫేమస్సా?ముంబై మహానగరంలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న అమ్మకై అనే రెస్టరెంట్ (AmmaKai Restaurant) ముందు జనం క్యూ కట్టిన వీడియోను ఎక్స్లో డీజీ పేరుతో ఉన్న పేజీలో షేర్ చేశారు. కొత్తగా ప్రారంభమైన అమ్మకై రెస్టరెంట్.. రిపబ్లిక్ డే సందర్భంగా ఉచిత అల్పహారం ఆఫర్ చేసింది. సోమవారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ పెడతామని ప్రకటించింది. ముందుగా వచ్చిన వారికి మాత్రమే వడ్డిస్తామని షరతు పెట్టింది. ఇది చూసిన జనం రెస్టరెంట్ ముందు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు.బిచ్చగాళ్ల మాదిరిగా..ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేసిన యూజర్.. జనం తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఉచితంగా అల్పాహారం పెడతామంటే జనం బిచ్చగాళ్ల మాదిరిగా రెస్ట్రెంట్ తెరవడానికి 2 గంటల ముందే క్యూ కట్టారని ఫైర్ అయ్యారు. లైనులో నిల్చున్న వారిని చూస్తే.. ఎవరూ పేదవారులా కనిపించలేదన్నారు. కనీసం రెండుమూడు కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లలో నివసిస్తున్న లక్షధికారుల్లా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. ఫ్రీగా వస్తుందంటే చాలు వెనుకాముందు చూడకుండా ఎగేసుకుని వచ్చేస్తారంటూ నిష్టూరమాడారు. ఒక ప్లేట్ బ్రేక్ఫాస్ట్ కోసం సిగ్గు లేకుండా రోడ్డుపై గంటల తరబడి కిలోమీటర్ల మేర క్యూలో నిలబడ్డారని ధ్వజమెత్తారు. 'ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నందుకు ప్రభుత్వాలను తప్పుబడతాం. కానీ దానికి మన బాధ్యత ఉందని అనుకోం. మన ఆలోచనలు మారకపోతే, దేశం ఇలాగే ఉంటుంద'ని ఎక్స్లో రాశారు. ఫ్రీగా వస్తుందంటే జనం ఇలాగే ఎగబడతారని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. అమ్మకైగా మారిన బాస్టియన్ఇంతకీ అమ్మకై రెస్టరెంట్ ఎవరిదో తెలుసా? ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిదే ఈ హోటల్. మూడేళ్ల క్రితం బాస్టియన్ బాంద్రా పేరుతో రంజిత్ బింద్రాతో కలిసి ఈ రెస్టరెంట్ ప్రారంభించారు. గతేడాది సెప్టెంబర్లో దీన్ని మూసివేస్తున్నట్టు ఎక్స్లో శిల్పా శెట్టి ప్రకటించారు. ఎందుకు మూసివేస్తున్నారనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. 60 కోట్ల మోసం కేసులో ఇరుక్కున్నందుకే శిల్పాశెట్టి ఈ హోటల్ మూసేస్తున్నారని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ హెటల్ను కొత్తగా మార్చి అమ్మకై పేరుతో మళ్లీ ప్రారంభించారు. ప్రమోషన్ కోసం ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఆఫర్ (Free Breakfast Offer) పెట్టారని ముంబై జనం అనుకుంటున్నారు. చదవండి: ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. అమ్మాయి ప్లాటయింది!AmmaKai,a newly launched restaurant by Shilpa Shetty in Bandra announced free breakfast for anyone and everyone with first come first serve basis and this is how the people responded like absolute beggars,standing in que since 7.00 A.M in the morning,2 hours before the… pic.twitter.com/AAz8iqdcFU— DG (@RetardedHurt) January 27, 2026 -
మువ్వన్నెల గౌరవం!
జెండా పడిపోవచ్చు.. కానీ భారతీయుడి దేశభక్తి ఎప్పుడూ తలవంచుకోదు!.. అని ఓ ఆటో డ్రైవర్ నిరూపించాడు. గణతంత్ర దినోత్సవాల వేళ సోషల్ మీడియాను ఫిదా చేస్తున్న అద్భుత దృశ్యమిది. ఆకాశమంత దేశభక్తికి ఆస్కారం అక్కర్లేదు.. చిన్నపాటి గౌరవం చాలని చాటి చెప్పిన క్షణమది.చిన్నారి కళ్లలో వెలుగుఅనన్య సింగ్ అనే యువతి తన రాపిడో ఆటోలో వెళ్తుండగా.. పక్కనే ఒక కారు కిటికీలోంచి ఓ చిన్నారి ఉత్సాహంగా జాతీయ జెండాను ఊపుతోంది. వేగంగా వెళ్తున్న ఆ కారు గాలికి అకస్మాత్తుగా ఆ పాప చేతిలో ఉన్న త్రివర్ణ పతాకం జారి రోడ్డుపై పడిపోయింది. క్షణం కూడా ఆలోచించకుండా ఆ రాపిడో డ్రైవర్ తన ఆటోను ఆపాడు. కిందపడిన జెండాను అత్యంత భక్తితో చేతుల్లోకి తీసుకున్నాడు. దానిపై ఉన్న ధూళిని దులిపి, ఎంతో ప్రేమగా తిరిగి ఆ చిన్నారికి అందజేశాడు. తన జెండా దక్కగానే ఆ చిన్నారి ముఖంలో విరిసిన ఆనందం, దాన్ని అందిస్తున్నప్పుడు ఆ డ్రైవర్ కళ్లలో కనిపించిన సంతృప్తి.. ‘వందేమాతరం’ ఆత్మను ప్రతిబింబించాయి.అది అద్భుతం‘నా రాపిడో డ్రైవర్ ఆ జెండాను తీసి, తుడిచి, అంత ప్రేమతో తిరిగి ఇచ్చిన తీరు అద్భుతం’.. అంటూ అనన్య సింగ్ వీడియోను ఎక్స్లో షేర్ చేయగా అది వైరల్గా మారింది. ఈ ఏడాది ‘వందేమాతరం – 150 ఏళ్లు’ థీమ్తో భారత్ గణతంత్ర వేడుకలను జరుపుకొంటోంది. కర్తవ్య పథ్లో సైనిక కవాతులు ఒకవైపు దేశ బలాన్ని చాటుతుంటే, రోడ్డు మీద సామాన్య ఆటో డ్రైవర్ చూపిన ఈ ‘జన భాగీదారీ’ (ప్రజల భాగస్వామ్యం) దేశపు సంస్కారాన్ని చాటిచెప్పింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బెడ్రూమ్ నుంచి సరాసరి పీఎస్కు..
ఓరీ నా కొడకో.. నీకు ఎంత కష్టం వచ్చిందిరో అంటూ ఆ తల్లి పరిగెత్తుకుంటూ కొడుకు బెడ్రూమ్ వైపు గబగబా పరుగులు తీసింది. అక్కడ కనిపించిన దృశ్యంతో ఆమె, గ్రామస్తులు షాక్ తిన్నారు. అతన్ని ఓ మంచానికి కట్టేసింది అతని భార్య. ముదనష్టపుది అంటూ కోడలి గురించి గొణుక్కుంటూనే ఆ అత్త పెద్దమనుషుల సాయంతో కొడుకు చేతులకు కట్టిన తాడుల్ని విడిపించింది. ఇక్కడి నుంచి అసలు హైడ్రామా నడిచింది.. ఉత్తర ప్రదేశ్ అలీగఢ్లో నేరుగా బెడ్రూమ్ నుంచి టప్పల్ పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన కొడుకును కోడలు హింసిస్తోందని.. తాజాగా మంచానికి కట్టేసిందని.. గట్టిగా మందలిస్తే తనకు తుపాకీ చూపించిందంటూ ఓ ఫొటోను పోలీసులకు అందించిందా అత్త. అందులో కోడలు యిస్టైల్గా పిస్టల్తో ఫోజు ఇచ్చింది. దీంతో.. కోడలిని పీఎస్కు పిలిపించుకున్న పోలీసులు అసలు విషయంపై ఆరా తీశారు. అయితే తాను అలా చేయడానికి బలమైన కారణం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. రోజూ తాగి వచ్చి తన భర్త ప్రదీప్ తనను హింసిస్తున్నాడని.. ఇరుగుపొరుగువాళ్లనూ బండ బూతులు తిడుతున్నారని సోనీ వాపోయింది. నాలుగేళ్ల కిందట తమ వివాహం అయ్యందని.. గత రెండేళ్లుగా కట్నం కోసం వేధిస్తూ వస్తున్నాడని చెప్పింది. ఈ క్రమంలోనే తాగుబోతు భర్త తీరుతో విసిగిపోయి అలా మంచానికి కట్టేశానని చెప్పిందామె. అదే సమయంలో ఆ తుపాకీ నకిలీదని తేలింది. దీంతో ఆ అత్త షాక్ తింది. దీంతో.. ఆ అత్తాకోడళ్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే.. నెట్టింట ప్రదీప్ను మంచానికి కట్టి అత్తతో సోని గొడవపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.UP Woman Ties Husband To Bed, Mother-In-Law Shows Cops Her Pic With Gun https://t.co/8I6zGHEmMl pic.twitter.com/uCp3h2XqJK— NDTV (@ndtv) January 23, 2026 -
తడిచి ముద్దైన ఢిల్లీ : చిల్ అయిన సింగపూర్ హైకమిషనర్
న్యూఢిల్లీ : దేశరాజధాని నగరం ఢిల్లీలో శుక్రవారం ఉన్నట్టుండి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో కాలుష్య భూతంతో విలవిల్లాడుతున్న ఢిల్లీ వాసులకు చాలా ఉపశమనం లభించింది. గాలి నాణ్యత మెరుగుపడుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ వాతావరణాన్ని భారతదేశంలోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ ఎంజాయ్ చేయడం విశేషంగా నిలిచింది.ఢిల్లీ వాతావరణం చల్లగా ఉండటంతో సైమన్ వాంగ్ ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వేడి వేడి చాయ్ కప్పును పకోడీలు, వర్షంతో తడిచిన పచ్చగా మెరుస్తున్న పచ్చిక బయలులో వర్షాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. చాయ్, పకోడితో ఈ ఏడాదిలో (2026) చాయ్ పకోడీతో ఇదే ఫస్ట్ బారిష్ను సెలబ్రేట్ చేసుకుంటున్నా.. నాతో చేరండి?” అనే క్యాప్షన్తో ఈ ఫోటోలను షేర్చేశారు.దీంతో నెటిజన్లు కూడా వర్షంలో తడిచిపోయినంత సంతోష పడ్డారు. చాలా బాగుంది... నేను కూడా వస్తున్నా అని ఒకరు, ఉల్లి పకోడి అయితే సూపర్గా ఉంటుంది సార్. అని ఒకరు కమెంట్ చేయగా, “సర్, నేను తయారుచేసిన టీని మీరు తప్పక తాగండి అని మరొకరు కామెంట్ చేయడం విశేషం.Celebrating first #baarish in 2026 with #chai #pakora. Come join me? 😁 HC Wong pic.twitter.com/Yvd1NYj0vk— Singapore in India (@SGinIndia) January 23, 2026దిగి వస్తున్న కాలుష్యంఢిల్లీ-NCR శుక్రవారం ఉదయం చల్లని శీతాకాల పరిస్థితుల మధ్య 2026లో తొలిసారి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. IMD ప్రకారం, రాబోయే 24 గంటల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గేఅవకాశం ఉంది. జనవరి 23న, కనిష్ట ఉష్ణోగ్రత 12°C వద్ద నమోదైంది, గరిష్ట ఉష్ణోగ్రత ఇక్కడ నమోదైంది 19°C. వర్షం తర్వాత గాలి నాణ్యత మెరుగుపడింది, రోజుల తరబడి ప్రమాదకర కాలుష్యం తర్వాత AQI 'సంతృప్తికరమైన' 201-300 స్థాయికి చేరింది. సైమన్ వాంగ్2020న జూన్ 30న భారత రిపబ్లిక్కు హై కమిషనర్గా సైమన్ వాంగ్ వీ కుయెన్ను నియమించింది సింగపూర్. ముందు, అతను జూలై 2015 నుండి జనవరి 2020 వరకు తైవాన్కు సింగపూర్ వాణిజ్య ప్రతినిధిగా ఉన్నారు. -
ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. సూపర్బ్!
ప్రేమలో పడటం సులభమే కానీ.. ఆ ప్రేమను వ్యక్తపరచడమే ఒక పెద్ద టాస్క్! మన వీరేంద్ర కువేల్కర్ మాత్రం రొటీన్కు భిన్నంగా ఆలోచించి, తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక అదిరిపోయే ‘బైక్ డ్రామా’ ప్లాన్ చేశాడు. ఇన్స్ట్రాగామ్లో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.అసలేం జరిగింది? సాదాసీదాగా బైక్ మీద షికారు వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు వీరేంద్ర. పాపం ఆ అమ్మాయి వెనకాల కూర్చుని ప్రశాంతంగా గాలి పీల్చుకుంటోంది. కానీ వీరేంద్ర మాత్రం అటు ఇటు దిక్కులు చూస్తూ ఏదో ‘సిగ్నల్’ కోసం వెయిట్ చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే.. ముందుగా ఒక బైకర్ వచ్చి ఓవర్టేక్ చేసి ముందు నిలబడ్డాడు. అతని టీషర్ట్ వెనకాల ‘విల్’అని ఉంది. వెంటనే రెండోవాడు వచ్చాడు.. అతని టీ షర్ట్పై ‘యూ’అని ఉంది. మరో ఇద్దరు తోడయ్యారు.. వారి టీ షర్టులపై ‘మ్యారీ’, ‘మి’అని ఉంది. అక్షరాలు కలిపి చదివితే.. టడడడాయ్! ‘విల్ యూ మ్యారీ మీ’.. అని ఒక గాలిలో తేలే ప్రపోజల్ సిద్ధమైంది. ఆ నలుగురు బైకర్లు వరుసగా కళ్లముందు వెళ్తుంటే, ఆ అమ్మాయి షాక్ నుంచి తేరుకుని నవ్వే లోపే.. మన హీరో వీరేంద్ర జేబులోంచి మెరిసే ఉంగరం తీసి ఆఫర్ ఇచ్చేశాడు! మాకూ ఇలాంటి గ్యాంగ్ కావాలి ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా బైకర్స్ కమ్యూనిటీ అంతా ‘బ్రదర్హుడ్ అంటే ఇదీ!’అంటూ పండగ చేసుకుంటున్నారు. ‘రింగు తెచ్చాడు.. దానికి థ్రిల్ కూడా అటాచ్ చేశాడు!’.. అని ఒకరు.. ‘ఆయన హ్యాపీ, ఆమె హ్యాపీ, బైకర్స్ అందరూ హ్యాపీ!’.. అని మరొకరు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ సెటప్లు లేకపోయినా.. నలుగురు దోస్తులు, రెండు లీటర్ల పెట్రోల్ ఉంటే చాలు, ఇలాంటి అందమైన జ్ఞాపకాలను సృష్టించవచ్చని ఈ జంట నిరూపించింది.చదవండి: తెల్లవారుజాము నుంచే క్యూ కడతారు.. ఒకటి మాత్రమే అమ్ముతారు! View this post on Instagram A post shared by VIRENDRA KUVELKAR |🇮🇳 (@greek_god_26) -
వీడియో: చిన్నోడా.. అలసిపోయి ఉంటావ్!
ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బహిరంగ సభకు హజరైన జనాల్లో ఓ పిల్లాడు చేసిన పని మోదీ దృష్టిని ఆకర్షించింది. అంతే.. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. తిరువనంతపురంలో శుక్రవారం ప్రధాని మోదీ సభ జరిగింది. అయితే ఒక చిన్న పిల్లాడు ప్రధాని మోదీ డ్రాయింగ్ ఫోటోను ఎత్తిపట్టి చాలా సేపు నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రధాని మోదీ.. తన ప్రసంగాన్ని ఆపి ఆ బాలుడిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘చిన్నోడా, నువ్వు చాలా సేపు ఫోటో పట్టుకుని నిలబడ్డావు. అలసిపోయి ఉంటావ్. ఆ ఫోటోను నాకు ఇవ్వు. దాని వెనకాల నీ చిరునామా రాయు. నేను నీకు వ్యక్తిగతంగా లేఖ రాస్తాను’’ అని అన్నారు. ఈ క్రమంలో.. ఆ పిల్లాడి చేతుల్లోని ఫొటోను జాగ్రత్తగా తీసుకోవాలని తన ప్రత్యేక రక్షణ బృందం (SPG)కి సూచించారు. అది ఆ బాలుడి ప్రేమ, ఆశీర్వాదాల ప్రతీక. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో సభ ఒక్కసారి చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ సమయంలోనే.. మరో మహిళ ఓ పెద్ద పుస్తకాన్ని ఎత్తి మోదీ వైపు ప్రదర్శించింది. మోదీ ఆమెను కూడా గుర్తించి.. ఆమె కూడా నాకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు. పెద్ద పుస్తకం తయారు చేసి తీసుకొచ్చారు అని అనడంతో నవ్వులు పూశాయి. ఇక కేరళ సభలో మోదీ రాజకీయ ప్రసంగంలో.. సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలో మార్పు అవసరమని.. అందుకు బీజేపీని ఆశీర్వదించాలని కేరళ ప్రజలను ఆయన కోరారు. ఇప్పటికే ఆ మార్పు మొదలైందని.. ప్రజల ఆశీస్సులతోనే కేరళలో కమల వికాసం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఈ పర్యటనలోనే ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, కొత్త రైలు సేవలను ప్రారంభించారు. కేరళ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని కేరళ ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారాయన. प्रधानसेवक मोदी जी के प्रति केरला के बच्चों का प्रेम pic.twitter.com/u0tKKimQsw— Dr Neetu Dabas 🇮🇳 (@INeetuDabas) January 23, 2026 -
సోషల్ మీడియా సెన్సేషన్.. ఎవరీ అభినవ భగత్ సింగ్!
ప్రశ్నిస్తాం.. ప్రశ్నిస్తాం..అన్న నేతలే పారిపోతుంటే, ఓ బాలుడు మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తున్నాడు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అవినీతి చూసి ‘ఆ నాకెందుకులే’ అని పక్కకు తప్పుకోకుండా, ప్రశ్నిస్తున్నాడు. విమర్శిస్తున్నాడు. ఇందుకోసం పాఠ్య పుస్తకాలే కాదు, లా పుస్తకాలు కూడా తిరగేస్తున్నాడు. అధికారులకు, నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. నెటిజన్లు అతన్ని ‘యూపీ భగత్ సింగ్’గా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన 14 ఏళ్ల బాలుడు అశ్వమిత్ గౌతమ్. సాధారణంగా 14ఏళ్ల బాలుడు అంటే తొమ్మిది, లేదంటే పదోతరగతి పుస్తకాలతో కుస్తీ పడతారు. మార్క్స్,ఎగ్జామ్స్,పర్సంటేజ్ పేరుతో క్షణం తీరికి లేకుండా స్కూల్,ట్యూషన్,ఇల్లే జీవితంగా గడిపేస్తుంటారు. కానీ ఈ ఛోటా భగత్ సింగ్ అలా కాదు. సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన గౌతమ్ ఇన్స్టాగ్రామ్లో ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ను సంపాదించాడు. రాజకీయాలు, నేతలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, మీడియా, వ్యాపారవేత్తల స్కాంలు వంటి అంశాలపై ఆధారాలతో మాట్లాడుతున్నాడు. ప్రజలు అతన్ని అభినవ భగత్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్తో పోలుస్తున్నారు. ఈ చైతన్యం పాలకులను, అధికారులను అసహనానికి గురి చేసింది. మైనర్ అని కూడా చూడకుండా అతనిపై సెక్షన్ 151 ప్రయోగించి అరెస్టు చేశారు. కొద్దిసేపటికే విడుదల చేసినా, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతని వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతూ, ప్రభుత్వాలపై అతను సంధించిన ప్రశ్నలు ప్రజల్లో చైతన్యం రేపుతున్నాయి.వెరసీ అతడిని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలపై విమర్శాత్మక వీడియోలు పోస్ట్ చేసినందుకు ఈ చర్య తీసుకోవడం పిల్లల హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలపై కేసులు నమోదు చేయడం ప్రత్యేక నిబంధనలతో మాత్రమే సాధ్యం. ఈ కేసు చట్టపరమైన సరళతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. న్యాయవేత్తలు పిల్లలపై ఇలాంటి చర్యలు భయపెట్టే ప్రయత్నం’ అని వ్యాఖ్యానిస్తున్నారు.అశ్వమిత్ గౌతమ్ కథ ఒక చిన్నారి ధైర్యానికి ప్రతీక. వయసు చిన్నదైనా, ఆలోచనలు పెద్దవిగా మారి సమాజాన్ని కదిలిస్తున్నాయి. పిల్లలపై ఇలాంటి చర్యలు చట్టపరంగా సరైనవా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సత్యం, న్యాయం కోసం ప్రశ్నించే స్వరం ఎప్పటికీ ఆగదు. ఈ బాలుడి ధైర్యం కొత్త తరం యువతకు ప్రేరణగా నిలుస్తోంది. -
‘ధురంధరుడీ’ పెళ్లికొడుకు!
గుర్రం ఎక్కలేదు.. కారు రాలేదు.. అక్షయ్ ఖన్నాలా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు ఓ పెళ్లికొడుకు. పెళ్లంటే కాస్త హడావుడి, బోలెడంత సందడి ఉండాలి. కానీ ఈ పెళ్లి కొడుకు చేసిన పనికి సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఏకంగా ధురంధర్ సినిమాలోని క్రేజీ డాన్స్ స్టెప్పును దించేసి, నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు. ఏమిటా ‘ధురంధర్’ మాయ? షోయబ్ ఖురేషీ అనే వ్యక్తి తన పెళ్లి బారాత్లో ‘ధురంధర్ ’సినిమాలోని అక్షయ్ ఖన్నా ఐకానిక్ డాన్స్ వాక్ను పునఃసృష్టించాడు. ఎఫ్ఏ9ఎల్ఏ పాటకు ఎంతో క్యాజువల్గా, భుజాలు ఎగరేస్తూ అతను వేసిన అడుగులు చూసి బంధుమిత్రులే కాదు, ఇంటర్నెట్ లోకం కూడా ఫిదా అయిపోయింది. ఎందుకీ సీన్ అంత ప్రత్యేకం? నిజానికి సినిమాలో అక్షయ్ ఖన్నా ఆ స్టెప్పును ఏ ప్రణాళిక లేకుండా అప్పటికప్పుడే ఏదో అలా సరదాగా వేసేశారట. అదే ఇప్పుడు ఒక ‘మీమ్’ మెటీరియల్గా మారి ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు మన వరుడు కూడా అదే ఆత్మవిశ్వాసంతో పెళ్లి వేదిక మీదకు వస్తుంటే.. నెటిజన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ‘పెళ్లి కూతురు గారూ.. మీరు ఒక లైఫ్ టైమ్ ఎంటర్టైనర్ని పెళ్లి చేసుకున్నారు!’.. అని ఒకరు, ‘నువ్వు తోపు బ్రదర్.. అందరికీ స్ఫూర్తి ఇచ్చావు’.. అని మరొకరు ప్రశంసించారు. పాప్ సంస్కృతిని పాకెట్లో పెట్టుకుని, పక్కా స్టైల్తో వరుడు ఇచి్చన ఎంట్రీ ఇప్పుడు వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ప్రపంచంలో ఒక కొత్త మైలురాయి. గుర్రాలు, ఏనుగులు కంటే ఈ ‘ధురంధర్’నడకే వెరీ వెరీ స్పెషల్! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పోస్టు చేసేముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం!
సోషల్ మీడియా ట్రోలింగ్లు... డిజిటల్ విచారణలు ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయో కేరళలో చోటుచేసుకున్న ఓ ఘటన కళ్లకు కడుతోంది. ఓ మహిళ ఒక వ్యక్తిపై బహిరంగంగా ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల మనస్తాపంతో అతను ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది. 35 ఏళ్ల శింజిత ముస్తఫా కేరళకు చెందిన ఒక ఇన్ఫ్లూయెన్సర్. ఇటీవల ఆమె తాను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు దీపక్ అనే వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్చేసింది. ఈ వీడియో సుమారుగా 20 లక్షల వ్యూస్తో వైరలయ్యింది. నిజానిజాలు తెలుసుకోకుండా నెటిజన్లు పెట్టే కామెంట్లు అతన్ని కలచి వేశాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయిన దీపక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వ్యూస్ కోసమేనా?దీపక్ ఆత్మహత్య చేసుకున్న వార్త బయటకు రాగానే శింజిత సోషల్ మీడియాలో తాను ఆరోపణలు చేసిన వీడియోని డిలీట్ చేయడమే గాక తన చర్యను సమర్థించుకుంటూ మరో వీడియోని అప్లోడ్ చేసింది. కానీ అప్పటికే.. వ్యూస్ కోసమే శింజిత ఇలా చేసినట్లు ఆమెపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ వీడియోని కూడా ప్రైవేట్మోడ్లోకి మార్చేసింది. దీనంతటినీ సీరియస్గా తీసుకున్న పోలీసులు శింజితను అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సైతం దీనిపై విచారణకు ఆదేశించింది. ఒక ఇన్ ఫ్లుయెన్సర్గా పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నవారు చేసే పోస్టుల పర్యవసానాల పట్ల మరింత బాధ్యతగా ఉండాలని నిపుణులు అభి్రపాయపడుతున్నారు. -
శారీలో దిశా పటానీ అందాలు.. మెరిసిపోతున్న మృణాల్ బ్యూటీ!
శారీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అందాలు..బ్యూటీఫుల్ డ్రెస్లో మృణాల్ ఠాకూర్ స్మైలీ లుక్స్..పాలరాతి బొమ్మలా తమన్నా హోయలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్..వైట్ డ్రెస్లో మరింత అందంగా అనుపమ పరమేశ్వరన్.. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
దూసుకొచ్చిన ప్యాసింజర్ రైలు.. లారీ నుజ్జునుజ్జు..!
రాంచీ: జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడకపోవడంతో ట్రాక్పై వెళ్తున్న వాహనాలను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జార్ఖండ్లోని దేవోబంద్లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. గోండా-అసన్సోల్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో దేవోబంద్ వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేయకపోవడంతో రోహిణి-నవాడిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల మీదుగా పలు వాహనాలు వెళ్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రైలు గేటు వరకు వచ్చింది. కానీ, వాహనాలు మాత్రం ట్రాక్పైనే నిలిచిపోయి ఉన్నాయి. దీంతో, ట్రాక్పై ఉన్న లారీని రైలు ఢీకొట్టింది.A tragic incident occurred on the Jasidih-Madhupur section of the Eastern Railways.Who's at fault here? #IndianRailways pic.twitter.com/DDzAezLxwD— Trains of India 🇮🇳 (@trainwalebhaiya) January 22, 2026అయితే, అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న లోకోపైలట్.. రైలుకు బ్రేకులు వేసి మెల్లగా రానిచ్చాడు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని మెల్లగా ఢీకొట్టి ఆగింది. ఆ లారీ ఒక పక్కకు ఒరిగింది. రెండు బైకులను అది ఢీకొట్టింది. అయితే ఆ బైకులపై ఉన్నవారు తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరోవైపు రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుమిగూడిన జనాన్ని వెళ్లగొట్టారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రైళ్ల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరించారు.అయితే సిగ్నల్ క్లియరెన్స్ లేనప్పటికీ ఆ రైలు ముందుకు కదిలిందని గేట్ మ్యాన్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో గేట్ పడకపోవడం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
వాట్ ఏ కమిట్మెంట్ బ్రో.. వైరల్ వీడియో
ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని తన కెమెరాలో బంధించేందుకు కెమెరామెన్లు పడే కష్టం మామూలుది కాదు. ప్రోగ్రాం ఏదైనా కీలకమైన అంశాలను కవర్ చేస్తూ నానా కష్టాలు పడుతూ ఉంటారు. పండుగైనా, వేడుకైనా వీడియో గ్రాఫర్లది చాలా ప్రత్యేక మైన పాత్ర. ఇందులో సందేహమేలేదు. ఉద్యమం అయినా, ఉపద్రవం అయినా, వానొచ్చినా, వరదొచ్చినా వెరవకుండా నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి నిబద్ధతకు సంబంధించి ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.పెళ్లికూతుర్ని వేదికకు వద్దకు తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు. సిగ్గుల మొగ్గవుతూ, కాబోయే భర్తను చూస్తూ మెల్లిగా అడుగులు వస్తోంది అమ్మాయి. మరోవైపు ఈ క్షణాలకోసమే ఎదురు చూస్తున్నా అన్నట్టు వరుడు కూడా ముందుకునడిచివస్తున్నాడు. ఈ అపురూపమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధిస్తూ వీడియో తీస్తున్నాడు ఒక కెమెరామెన్. అతని దృష్టి అంతా అక్కడున్న వేడుక మీదే. ఏ చిన్న మెరుపు క్షణాన్ని కూడా మిస్ అవ్వకూడదు. అదీ అతని కమిట్మెంట్. ఈ ధ్యాసలో వెనుక వున్న పూల్ని చేసుకోలేదు. దీంతో కాలు పట్టు తప్పి ఒక్క ఉదుటున అందులో పడిపోయాడు. కానీ ఏమాత్రం తొట్రుపడలేదు. పైగా ‘‘మీరు కానివ్వండి...’’ అంటూ వధూవరులకు, ఇతరులకు ఆదేశాలిస్తూ, తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. దీంతో అతనికి సాయం చేద్దామని వచ్చిన మరో కెమెరామెన్ తన పనిలో మునిగిపోయాడు. అటు పెళ్లి కొడుకు కూడా కెమెరామెన్ ఇచ్చిన ధైర్యంతో వధువుకి ఉంగరం తొడిగే పనిలో ముందుకు కదిలాడు. ఈ వీడియో ఫన్నీ కమెంట్లతో నెట్టింట వైరల్ అవుతోంది. వాట్ ఏ కమిట్మెంట్ బ్రో అని నీ డెడికేష్కి సలాం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లుఇదీ చదవండి : అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత? The way he said "you guys carry on" Shows the level of passion 🤍 pic.twitter.com/PeR4mB15W6— .. (@Superoverr) January 22, 2026 -
కొత్త లోకా బ్యూటీ ఢిల్లీ టూర్.. కృతి శెట్టి గ్లామరస్ లుక్..!
కొత్త లోకా బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ఢిల్లీ టూర్..స్టైలిష్ డ్రెస్లో శ్వేతా మీనన్ గ్లామరస్ లుక్స్..బాలీవుడ్ భామ కుబ్రా సైత్ డిఫరెంట్ లుక్..ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గ్లామరస్ పోజులు..కలర్ఫుల్ డ్రెస్లో హీరోయిన్ కీర్తి సురేశ్.. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) View this post on Instagram A post shared by Shwetha Menon (@shwetha_menon) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
పబ్లిసిటీ పిచ్చి ఎంత పని చేసింది!
పాకిస్థాన్లో విపరీతమైన పబ్లిసిటీ ఉన్న మంత్రిగా రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్కు ఓ పేరుంది. ఏది పడితే ఆ ఈవెంట్కు హాజరవుతూ నిత్యం వార్తల్లో.. సోషల్ మీడియాలో కనిపిస్తూ.. విమర్శలు ఎదుర్కొంటారాయన. ఈ క్రమంలో.. ఆ పబ్లిసిటీ పిచ్చి ఆయన పరువు తీసేసింది.పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తాజాగా సియాల్కోట్లో పిజ్జా హట్ అవుట్లెట్ను ప్రారంభించారు. కొద్దిగంటలకే ఆ కార్యక్రమం ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది షరా మామూలే కదా అనుకున్న నెటిజన్లకు.. కాసేపటికే ఓ పోస్ట్ విపరీతమైన నవ్వు తెప్పించింది.పిజ్జా హట్ బ్రాండ్ సదరు అవుట్లెట్ గురించి ఒక ప్రకటన చేసింది. దాంతో తమకుగానీ.. యమ్ బ్రాండ్స్కుగానీ ఎలాంటి సంబంధం లేదని.. అది ఫేక్ ఔట్లెట్ అని క్లారిటీ ఇచ్చింది. ఈ షాపుపై సంబంధిత విభాగంలోనూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. దేనికి పడితే దానికి వెళ్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేస్తున్నారు.Defence Minister Khawaja Asif just inaugurated a fake Pizza Hut outlet in Sialkot 😃 pic.twitter.com/sLPnQuBGqi— Adeel Raja (@adeelraja) January 20, 2026 -
భార్య మారథాన్ రన్, ప్రముఖ వ్యాపారవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్
జెరోధా వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ తన భార్య క్యాన్సర్ సోకడం, చికిత్స, కోలుకోవడం గురించి మరోసారి సోషల్ మీడియాద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా టాటా ముంబై మారథాన్లో వైకల్యాన్ని చేర్చడంపై సంతోషాన్ని ప్రకటించారు. టాటా ముంబై మారథాన్లో పరుగెత్తిన దివ్యాంగులలో ఉన్న ఉత్సాహం, ఉద్వేగం మాటల్లో చెప్పలేనిదని ఆయన ప్రశంసించారు. అన్నీ సవ్యంగా ఉన్నా జీవితంలో ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేసే ముందు ఆలోచించేలా చేస్తుందన్నారు. అదే సమయంలో తన భార్య క్యాన్సర్ కోలుకున్న తీరు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. క్యాన్సర్ నుండి బయటపడిన తర్వాత దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 57 నిమిషాల్లో 10 కి.మీ పరిగెత్తారని వివరించారు. అలాగే మారథాన్లో పాల్గొన్న తన భార్య సీమా కామత్ ఫోటోలతో పాటు, ఆమె రాసిన వ్యక్తిగత బ్లాగుకు వ్యాఖ్యలలో లింక్ను పంచుకున్నారు.ఇదీ చదవండి: నోయిడా టెకీ విషాదం : కీలక పరిణామం The excitement and enthusiasm among people with disabilities running the Tata Mumbai Marathon today were beyond words. Makes you think about what right you have to complain about anything in life.On a personal note, Seema (wife, see the link in comments) ran 10km in ~57… pic.twitter.com/8YEDVwf0WE— Nithin Kamath (@Nithin0dha) January 18, 2026సీమా కామత్ తన బ్లాగులో అందించిన వివరాలు ప్రకారం 2021 నవంబరులో స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ. ఎలాంటి లక్షణాలు, ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే, చాలా క్రమశిక్షణగా, ఫిట్గా చాలా ఆరోగ్యంగా ఉండే ఆమె కేన్సర్ బారిన పడ్డారు. సాధారణంగా చేసుకునే ఫుల్ బాడీ టెస్ట్లో భాగంగా జరిగిన మమోగ్రామ్ టెస్ట్లో ఆమె కుడి రొమ్ములో గడ్డను గుర్తించారు. ఆ తరువాత బయాప్సీ, PET స్కాన్ లాంటి పరీక్షల ద్వారా ఆమెకు క్యాన్సర్ సోకిందని నిర్ధారించారు.దీంతో తాను షాక్కు గురయ్యారు. మొదట కుటుంబ సభ్యులు , కొంతమంది స్నేహితులతో తప్ప మిగతా ఎవ్వరితోనూ దీని గురించి చర్చించలేదు. అదేదో తప్పు అనే భావం ఉండటం వల్లే ఇది జరిగిందనీ, "మానసిక అనారోగ్యంలాగే, క్యాన్సర్ కూడా మన దేశంలో నిషిద్ధం" అని చెప్పుకొచ్చారు. కానీ అవగాహనతో ఉండి, ముందస్తు పరీక్షలతో దీన్ని జయించవచ్చు అన్నారామె.ఇదీ చదవండి: మంచులో రీల్స్..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్ వీడియోమాస్టెక్టమీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లతో "ఎమోషనల్ రోలర్ కోస్టర్" లా గడించిందన్నారు. ఈ రోజుల్లో క్యేన్సర్ను ముందుగా గుర్తిస్తే నివారణే సాధ్యమే అన్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండే వారు కూడా వైద్యులు రొటీన్ స్క్రీనింగ్ చాలా అవసరమని సీమా రాశారు. తీవ్రమైన అనారోగ్యాలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకే ప్రతీవవారికి ఆరోగ్య బీమా అవసరమన్నారు. చికిత్స సమయంలో కుటుంబ, సామాజిక మద్దతు ప్రాముఖ్యతను కూడా ఆమె నొక్కి చెప్పారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకు మనం చేయాల్సిందంతా చేయాలని సూచించారు. గతంలో తన క్సేన్సర్ రికవరీ జర్నీగురించి మాట్లాడిన సీమ జుట్టు ఊడిపోవడం లాంటి కీమో థెరపీ కష్టాలను పంచుకున్నారు. ఆ బాధలు భరించలేక చనిపోతే మేలు అనుకునేదాన్నని చెప్పారు. ఈ సమయంలో భర్త నితిన్, తన కొడుకు గుండు చేయించుకొనిధైర్యాన్ని నింపారన్నారు. చికిత్సతోపాటు, ఆహారం, వ్యాయామంతో క్యాన్సర్ను జయించానని వెల్లడించారు. వ్యాధినుంచి కోలుకున్న తరువాత క్యాన్సర్పై అవగాహన కల్పించడం, ప్రపంచ పర్యటనలు, మారథాన్రన్ లాంటి కార్యకల్లాపాలతో బిజీగా ఉంటున్నారు సీమ. -
సోషల్ మీడియాలో ఇదేం తొండాట(డబుల్ గేమ్)?!
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అనే సామెత ఒకటి ఉంటుంది. కేరళ ఘటనలో తప్పెవరిది అనేది తేలకున్నా.. ఇప్పుడు చాలామంది ఈ సామెతను అన్వయింపజేస్తున్నారు. బస్సులో తనను లైంగికంగా వేధించాడని ఓ ఇన్ఫ్లుయెన్సర్ పోస్టు చేసిన వీడియో.. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన సంగతి తెలిసిందే కదా.. ఈ ఘటనలో ఏం జరిగిందో మరోసారి చూద్దాం. కోజికోడ్కు చెందిన దీపక్(42) బస్సులో వెళ్తున్నప్పుడు ఓ యువతి పక్కనే నిలబడి వీడియో తీసింది. అందులో దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ ఆ వీడియోను తన ఫాలోవర్స్కు చేరవేసింది. అంతే.. సదరు వ్యక్తిని తిట్టిపోస్తూ ట్రెండింగ్ నడిచింది. ఈ విషయం తనదాకా చేరడంతో ఆ వ్యక్తి భరించలేకపోయాడు. శుక్రవారం(జనవరి 16) ఈ ఘటన జరిగింది. శనివారం దీపక్ పుట్టినరోజునే ఈ వీడియో వైరల్ కావడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం బలన్మరణానికి పాల్పడి ఈ తతంగాన్ని ఇంతటితో ముగిద్దాం అనుకున్నాడు. కానీ, నెటిజన్స్ మాత్రం ఊరుకోలేదు. తిట్టిపోసిన అదే సోషల్ మీడియా ఈసారి ప్రాణాలతోలేని దీపక్కు మద్దతు ప్రకటించింది. సదరు యువతి ఫాలోయింగ్ను పెంచుకోవాలనే అలా చేసి ఉంటుందా?... పాపులారిటీ కోసం పాకులాడిందా? అనే అనుమానాలతో చర్చ మొదలుపెట్టారు. అయితే దీపక్ ఫ్యామిలీ ఈ డబుల్ గేమ్ సపోర్టును తిరస్కరించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంటర్నెట్లో అలా ఎలా విచారణ జరుపుతారని.. తమ బిడ్డది తప్పని తేలుస్తారని దీపక్ తల్లి అంటోంది. ఆ యువతి కంటే నెటిజన్లే డేంజర్ అని అంటోంది. షిమ్జితా ముస్తాఫా.. యాక్టివిస్ట్గానూ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గానూ గుర్తింపు దక్కించుకుంది. దీపక్ వేధింపుల వీడియోను పోస్ట్ చేశాక.. ఆమెకు అభినందనలు కురిశాయి. అయితే.. దీపక్ మరణం తర్వాత ఆమె ట్రోలింగ్కు గురైంది. పలువురు నెటిజన్లు ఆమెను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ వీడియోను తొలగించింది. తన చర్యను సమర్థించుకుంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది(దానికి కామెంట్లు చేయకుండా ప్రైవసీ పెట్టుకుంది). పైగా ఈ విషయంలో తనకు పోలీసుల సపోర్ట్ లభించిందని చెప్పుకొచ్చింది. కానీ.. మగ ప్యాసింజర్లకు, మగ కండక్టర్లకు ఇవి తప్పవా?మూడు రోజుల క్రితం చేయని తప్పుకు తన మీద వీడియో తీసి తనను అవమానించినందుకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంగా, కేరళ బస్సుల్లో మగవారు అట్టపెట్టెలను అడ్డం పెట్టుకుని బస్సులో వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. pic.twitter.com/AXUEYp5Dfc— greatandhra (@greatandhranews) January 20, 2026కేరళ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. షిమ్జితా నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని క్లారిటీ ఇచ్చారు. పైగా ఆత్మహత్యకు ఉసిగొల్పిందంటూ దీపక్ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో షిమ్జితాపైనే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. ఆమె కోసం స్పెషల్ టీంలు గాలింపు జరుపుతున్నాయి. ఆమె దొరికితేనే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. నెటిజన్ల దెబ్బకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లు కూడా డిలీట్ చేసేసుకుందని తెలుస్తోంది. ఆన్లైన్ వేధింపులు ఎంతటి విషాదాలకు దారి తీస్తుందో ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని అంటున్నారు. కేరళ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. కొందరు పురుషులు (వయసు తారతమ్యం లేకుండా పెద్దవాళ్లతో సహా..) బస్సుల్లో ఎక్కి ఆడవాళ్ల మధ్యలో నిల్చుని తమను అనుమానించొద్దు అంటూ సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. -
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే: సీఆర్పీఎఫ్ జవాన్ భావోద్వేగ ఘట్టం
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనంటారు. అలా ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తాను ఆ ఉద్యోగం సాధించిన విషయాన్ని తల్లికి చెప్పిన తీరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్ల ప్రశంసలు పోందుతోంది.మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాకు చెందిన గోపాల్ సావంత్ ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. కుటుంబానికి ఆసరాగా తన తల్లి కుడాల్నగర్ వద్ద రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతుంటుంది. తన తల్లి కష్టాన్ని బాల్యం నుంచి చూసిన గోపాల్ సావంత్ కఠోర దీక్షతో, కృషితో సీఆర్పీఎఫ్ జవానుగా ఎంపికయ్యాడు. అయితే ఈ సంతోషకరమైన విషయాన్ని తన తల్లికి చెప్పిన విధానమే పలువురి మన్ననలు పోందుతోంది. గోపాల్ తన తల్లికి ఇంటి వద్ద చెప్పకుండా.. ప్రతిరోజూ ఆమె రోడ్డు పక్కన కూరగాయలు విక్రయించేప్రాంతానికి వెళ్లి చెప్పాడు. ఆ విషయం చెప్పగానే ఆ తల్లి భావోద్వేగానికి లోనై, నీళ్లు నిండిన కళ్లతో కొడుకును గుండెలకు హత్తుకుంది. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఈ వీడియోని ఇప్పటి వరకు 1.2 కోట్ల మందికి పైగా వీక్షించారు. తల్లీ, కొడుకుల అనుబంధానికి ఫిదా అయిపోతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Vilas Kudalkar (@vilas.kudalkar.52) -
మంచులో రీల్స్..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్ వీడియో
సోషల్ మీడియా, రిల్స్ మోజులో పడి వింత వింత పోకడలు పోతున్నారు. ప్రాణాలు పోతున్నా, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా గడ్డకట్టిన మంచులో రీల్స్ చేయడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చకున్న ఒక మహిళ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సాధారణంగా మంచు కురిసే ప్రదేశాలకు వెళ్లడం, అక్కడమంచుతో ఆడుకోవడం సరదాగానే ఉంటుంది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అంటే చలికి తట్టుకోగలిగే ఇన్సులేట్ దుస్తులు ధరించడం, ఎక్కువ సేపు అక్కడ ఉండకపోవడం లాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా వెళితే మాత్రం, అందరిలో కాకపోయినా, కొందరిలో సమస్యలు తప్పవు. ఈ వైరల్ వీడియోను పరిశీలిస్తే అదే విషయం అవగతమవుతుంది.వీడియోతో పాటు షేర్ అయిన వివరాల ప్రకారం, మంచుతో కప్పబడిన ఎత్తైన ప్రదేశంలో ఇద్దరు మహిళలు డ్యాన్స్ రీల్ను షూట్ చేస్తున్నారు. ఒకరు ఎరుపు చీరలో, మరొకరు గులాబీ రంగులో ఉన్నారు. వీరిలో ఒకామె చలితీవ్రతకు ఇబ్బంది పడుతున్నమనం చూడొచ్చు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో తల తిరగడం, బ్లాక్అవుట్ లాంటి సంకేతాలతో ఇబ్బంది పడింది. ఒక దశలో ఆమె ఏడుస్తూ కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడున్న వారు స్పందించి సహాయం అందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్ సిరప్ బ్యాన్Self-Harm Kalesh (Girl risked her life for reels: shot video in freezing heavy snow wearing almost nothing just for views. Soon oxygen dropped → started feeling dizzy, severe headache, blackout coming. Broke down crying in the snow.) pic.twitter.com/jooV7P02uO— Ghar Ke Kalesh (@gharkekalesh) January 18, 2026దీంతోనె టిజన్లు ఆమె యోగక్షేమాలపై ఆరా తీశారు. ఫాలోయర్లను పెంచుకునేందుకో, లేదా వారిని ఎంటర్టైన్ చేసేందుకో ఇలాంటి కంటెంట్ను సృష్టించే సందర్భంలో ఆరోగ్య ప్రమాదాలపై ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా చలి లేదా ఎత్తైన ప్రదేశాలకు అలవాటు లేని వారు, ఇలాంటి పరిస్థితులను తట్టుకోలేని వారు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్కు దూరంగా ఉండాలని సూచించారు. .చలిని నుంచి రక్షించే సరైన దుస్తులు లేకుండా తీవ్రమైన చలికి గురికావడం తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో తగినంత రక్షణ లేకపోవడం అనేది అల్పోష్ణస్థితికి దారి తీస్తుందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. -
వందే భారత్ రైళ్లకు పెరిగిన ‘చెత్త’ తాకిడి
మనోళ్లు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే. గంటలో అమెరికాను అనకాపల్లిని చేసేస్తారు.. ఓ తెలుగు సినిమాలో సరదా సంభాషణ కోసం ఉపయోగించిన డైలాగ్ ఇది. అయితే.. మనోళ్ల చేతలు ఎలా ఉంటాయో చెప్పే ఉదాహరణ ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాస్త కాస్ట్లీ ప్రయాణంగా చెప్పుకుంటున్న వందే భారత్ రైళ్లను క్రమక్రమంగా చెత్త కుప్పలుగా మార్చేస్తున్నారు. మొన్నీమధ్యే దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హౌరా–గువాహటి మధ్య పట్టాలపై ఇది పరుగులు పెట్టింది. ఈ నెలల 22 నుంచి పూర్తి స్థాయిలో ఇది నడవనుంది. అయితే ప్రారంభించిన కొన్ని గంటలకే ఆ రైలు చెత్తాచెదారంతో నిండిపోయింది. సివిక్ సెన్స్(పబ్లిక్ ప్లేస్ల్లో ఎలా వ్యవహరించాలనే స్పృహ) అనేది మరిచి.. ప్లాస్టిక్ ప్యాకెట్లు, స్పూన్లను బోగీల్లోనే పడేశారు అందులో ప్రయాణించినవాళ్లు. విదేశాల్లోలా మన దగ్గరా రైళ్లు.. దేశంలో హైటెక్ రైలు అంటూ సోషల్ మీడియాలో వందే భారత్ స్పీర్ ఎక్స్ప్రెస్ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో ఇటు ఈ వీడియో వైరల్ కావడం గమనార్హం. పబ్లిక్ ప్రాపర్టీకి గౌరవించేవాళ్లు.. మాన్సర్స్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ రైళ్లలో ప్రయాణించాలి అంటూ రైల్వే అధికారులు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. కానీ, పైసలు కాస్త ఎక్కువైనా ఫర్వాలేదని ప్రయాణిస్తున్నవాళ్లు తమ అలవాట్లను మాత్రం కొనసాగిస్తున్నారు. వందే భారత్ రైళ్లలో చెత్త వ్యవహారంపై సోషల్ మీడియాలో ఇలా చర్చ నడుస్తోంది.. ఇది కాస్ట్లీ ప్రయాణమే అయినా.. చీప్ మెంటాలిటీ వల్ల చెత్త కుప్పగా మారుతోందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సివిక్ సెన్స్ లేకపోతే ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కూడా వేస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. కొత్త వందే భారత్ స్లీపర్ రైలు రోడ్డు పక్కన ఉన్న చెత్త బుట్టలా మారింది అని ఇంకొకరు అన్నారు. వందే భారత్ స్లీపర్ వైరల్ వీడియోపై రైల్వే అధికారి ఒకరు స్పందిస్తూ.. రైళ్ల శుభ్రత విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడం తగదని.. అదే సమయంలో శుభ్రత కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను కట్టడిచేయాలంటే కఠిన మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారాయన. View this post on Instagram A post shared by I LOVE BONGAIGAON (@ilovebongaigaon) -
పిల్లలకు సోషల్ మీడియా వద్దు!
లండన్: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ బ్రిటన్లోని అధికార లేబర్ పార్టీకి చెందిన 61 మంది ఎంపీలు ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధాని సర్ కీర్ స్టామర్ను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో, పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.డెన్మార్క్, ఫ్రాన్స్, నార్వే, న్యూజిలాండ్, గ్రీస్ వంటి దేశాలు ఇప్పటికే ఇలాంటి చట్టాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయని ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. బ్రిటన్ కూడా ఈ దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.ఈ అంశంపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కన్జర్వేటివ్ పార్టీతో పాటు లిబరల్ డెమోక్రాట్లు కూడా తమ మద్దతు ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీ నేత కెమి బాడ్నోచ్ ఇటీవల పార్లమెంట్లో మాట్లాడుతూ, తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 16 ఏళ్లలోపు పిల్లలందరికీ సోషల్ మీడియాపై నిషేధం విధిస్తామని ప్రకటించారు.ఈ పరిణామాలతో అధికార లేబర్ ఎంపీల డిమాండ్కు ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీనిపై స్పందించిన ప్రధాని కీర్ స్టామర్, ప్రభుత్వం ఈ అంశాన్ని ఓపెన్ మైండ్తో పరిశీలిస్తోందని, అన్ని అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తామని తెలిపారు. -
బ్లూ డ్రెస్లో ఐశ్వర్య రాజేశ్.. సావిత్రి బేబీ బంప్ లుక్..!
బ్లూ డ్రెస్లో ఐశ్వర్య రాజేశ్ అందాలు..టాలీవుడ్ నటి అభినయ అదిరిపోయే లుక్..బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ సావిత్రి..ఫుల్గా వర్కవుట్స్ చేస్తోన్న బాలీవుడ్ భామ ఖుషీ కపూర్..చిల్ అవుతోన్న సమంత, మంచు లక్ష్మీ.. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) -
వివాదంలో ‘ఖైదీ’ ఎమ్మెల్యే.. సిగరెట్ వీడియో వైరల్
పాట్నా: బీహార్లో అధికార జేడీ(యూ)కు చెందిన ఎమ్మెల్యే అనంత్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే అనంత్ సింగ్.. ఓ ఆసుపత్రిలో సిగరెట్ తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆసుపత్రిలో సిగరెట్ తాగుతూ రీల్స్ చేస్తున్నాడా? ఏం సందేశం ఇచ్చారంటూ నేతలు మండిపడుతున్నారు.వివరాల మేరకు.. జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్.. పాట్నాలోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజిఐఎంఎస్)కు వైద్య చికిత్సల కోసం వెళ్లారు. ఈ సందర్భంగా అనంత్ సిగరెట్ తాగారు. ఆసుపత్రి లోపలే ధూమపానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.JDU MLA Anant Singh smokes Ciggerate in Patna HospitalPublic hospital turned into personal ashtrayIndian Civic sense on Display pic.twitter.com/4qaDm9N5my— Nehr_who? (@Nher_who) January 19, 2026మరోవైపు.. ఈ వీడియోను ఆర్జేడీ ప్రతినిధి ప్రియాంక భారతి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ..‘నితీశ్ కుమార్కు ప్రియమైన నేత అనంత్ సింగ్ సిగరెట్ పొగతో బీహార్లో సుపరిపాలనను తీసుకువస్తున్నాడని ఎద్దేవా చేశారు. అలాగే, నితీశ్ గారాల పెంపుడు విలన్.. ఆసుపత్రిలో సిగరెట్ తాగుతూ రీల్స్ చేస్తున్నాడా? అని ప్రశ్నించారు. ఈ వీడియోపై నెటిజన్లు సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉండి ఇలాంటి ప్రవర్తన ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బీహార్ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనంత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. జన్ సూరజ్ పార్టీ ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనంత్ సింగ్ విజయం సాధించారు. మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీకి చెందిన వీణా సింగ్పై 28,206 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం ఆయనపై 28 క్రిమినల్ కేసులు ఉన్నాయి. -
పచ్చని పొలాల్లో బిగ్బాస్ దివి.. శారీలో ఫుల్ గ్లామరస్గా నివేదా..!
సంక్రాంతి సినిమా పోజుల్లో ఆషిక రంగనాథ్..వైట్ శారీలో మరింత అందంగా నివేదా థామస్..హల్దీ ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ భామ నుపుర్ సనన్..పచ్చని పొలాల్లో బిగ్బాస్ దివి హోయలు..వైట్ డ్రెస్లో బాలీవుడ్ హీరోయిన్ కాజోల్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
మెడికల్ కాలేజీలకు నిధులుండవు.. ఎర్టీఆర్ విగ్రహానికి రూ.1,700 కోట్లా?
జంగారెడ్డిగూడెం: సీఎంచంద్రబాబు పాలనను ఎండగడుతూ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన నాయకుడు బల్లె మురళికి సంబంధి రెండు సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు, కాపు కార్పొరేషన్కు నిధులుండవు కానీ, ఎన్టీఆర్ విగ్రహానికి ఉంటాయా? చంద్రబాబు వైఖరి మార్చుకుంటే చాలా మంచిది. సోషల్ మీడియా వచ్చింది. ఎల్లో మీడియాను నమ్మరు. మీరు చెప్పే అబద్ధాలు, నిర్లక్ష్యాన్ని సహించే పరిస్థితి లేదు. మాలాంటి వారితో జనసేనలో మార్పు మొదలైంది’ అంటూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘రూ.1,700 కోట్లతో ఎర్టీఆర్ విగ్రహం పెడతారంట. ప్రభుత్వ నిర్ణయం ఘోరాతి ఘోరం. దీన్ని జనసైనికులంతా వ్యతిరేకించాలి.పవన్కళ్యాణ్కు మద్దతుగా ఎన్నికల్లో కాపు యువత సొంత డబ్బు రూ.లక్ష–రూ.2 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు కాపు కార్పొరేషన్ ద్వారా లోన్ ఇస్తారేమో అని చూస్తున్నారు. కార్యకర్తలు రాకుండా పార్టీ ఆఫీస్కు తాళం వేశారు. ఈ ప్రభుత్వంలో జన సైనికులకు ఒరిగింది ఏమీ లేదు. అమరావతి సెల్ఫ్ ఫండ్ ప్రాజెక్టు, టీడీపీ సెల్ఫ్ ఫండ్ పార్టీ అన్నారు కదా. ఎర్టీఆర్ విగ్రహం కూడా అలాగే కట్టండి. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ (యూకే) అన్నీ మా చేతుల్లో ఉన్నాయని చెప్పుకొనే టీడీపీ వారు ఎర్టీఆర్ విగ్రహాన్ని ప్రజల సొమ్ముతో కట్టడం ఏంటి? చంద్రబాబు హైదరాబాద్ కట్టేశాడంట.. అమరావతి కట్టలేకపోతున్నాడు. అది మునిగిపోయే ప్లేస్. అట్టర్ ఫ్లాప్. ఒక్క పరిశ్రమ రాదు. వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అంటున్నారు. ఆంధ్రాలో రోడ్లన్నీ గోతులమయం.పవన్.. మీరు చంద్రబాబుకు చేసే భజన చూసి సిగ్గుపడుతున్నాం. ఇంత దిగజారతామా?’ అని మురళి ధ్వజమెత్తారు. మొదటి వీడియో సంచలనంగా మారడంతో రెండో వీడియో విడుదల చేశారు. ‘ఎర్టీఆర్ విగ్రహం ప్రజల సొమ్ముతో కట్టడానికి జనసేన వ్యతిరేకం. దీనిపై సోషల్ మీడియాలో నన్ను తిడుతున్నారు. నా నంబర్ ఉంది. దమ్ముంటే కాల్ చేయండి. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఒక్కొక్కడి చర్మం తీస్తా. వైఎస్ జగన్కు భయపడి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ వారు పారిపోయారు. అప్పుడు పోటీ చేసింది జనసేన. మేం లేకపోతే మిమ్మల్ని జగన్ ఆడుకుంటారు. కానీ, మీరు పదవిలోకి వచ్చాక జనసేనను జీరో చేయాలని చూస్తున్నారు. కాపు కార్పొరేషన్ నిధులు ఆపేశారు. ఇది టీడీపీ చేస్తున్న తప్పు’ అని పేర్కొన్నారు. -
మధ్యతరగతి కల… కొడుకు ప్రేమతో నిజమైంది
మధ్య తరగతి వారికి విమాన ప్రయాణం ఒక తీరని కల. ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆ వైపుగా ఆలోచన కూడా చేయరు. కానీ .. ఓ కుమారుడు తల్లిదండ్రుల కోసం ఆ కలను నిజం చేస్తే..? ఆ భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ అందరి మనసుల్ని గెలుచుకుంటోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక యువకుడు, ఇప్పుడు తన తల్లిదండ్రులకు ఆ మేఘాలపై విహరించే ఆనందాన్ని అందించాడు.తన తల్లిదండ్రులని విమానాశ్రయం వద్దకి తీసుకువెళ్లగానే భారీ విమానాశ్రయ భవనం, అక్కడి వెలుగులను చూసి వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఉత్సాహంతో΄ాటు, విమానం ఎక్కే ముందు కొంచెం కంగారుగా కనిపించినా.. తమ కుమారుని చేయి పట్టుకుని విమానంలోకి ప్రవేశించినపుడు వారి ఆందోళన అంతా పోయి ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. ఆ క్షణం ఎంతో విలువైనది. తన తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని చూసి, ఆ కుమారుడి ముఖంలో ఎంతో తృప్తి, గర్వం. దీనికి సంబంధించిన వీడియోని చూసిన నెటిజనులు తల్లిదండ్రుల కల నెరవేరిన సంతోష సమయం అనీ... కొడుకు కళ్లల్లో ఆనందం వెల కట్టలేనిది అనీ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hey Vishnu👨💻 (@vishh.mms) -
అవును నా ప్రియుడే.. అయితే తప్పేంటి?
వివాహేతర సంబంధాలను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న పలు సందర్భాలు నెట్టింట లేదంటే వార్తల రూపంలో వైరల్ అయ్యేది చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో తమ భాగస్వాముల మోసాన్ని.. పరాయి వాళ్లతో ఆ స్థితిలో చూసి భరించలేక దాడులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. ఇక్కడ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధమైన దృశ్యాలు కనిపించడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.‘‘హలో.. పోలీస్ స్టేషన్ ఆ నా భార్య నన్ను మోసం చేస్తోంది. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. మీరు వస్తే వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు’’ అంటూ ఫోన్ చేశాడు ఓ భర్త. ఆ కాల్ అందుకుని ఆగమేఘాల మీద ఓ హోటల్కు చేరుకున్నారు. అప్పటికే పోలీసుల కోసం ఎదురు చూస్తున్న ఆ భర్త.. వాళ్లను చూడగానే ఉరుకుల మీద రూమ్ నెంబర్ 113 తలుపును విరగొట్టాడు. లోపల ఏకాంతంగా గడుపుతున్న ఓ జంట.. ఆ అలజడికి ఉలిక్కి పడింది. వెంటనే మంచం మీద ఉన్న వ్యక్తి.. మంచం కిందకు దూరాడు. ఈలోపు ఆ భర్త గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది, రోడ్డు మీద పోతున్న వాళ్లు అక్కడికి చేరారు. మంచం కింద దాక్కున్నవాడ్ని బయటకు లాగారు. వాళ్లందరిరి సమక్షంలో తనని తిట్టిపోస్తున్న భర్తను ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొందామె. ‘‘అవును.. ఇతను నా ప్రియుడే. నా ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చా. నేను నా భర్త రెండేళ్లుగా దూరంగా ఉంటున్నాం. అందుకే అతనింకా నా జీవితంలో భాగం కాదని ఫిక్స్ అయ్యా. అందుకే నాకిష్టమైన వ్యక్తితో జీవించాలని ఫిక్స్ అయ్యా. అందుకే నా భర్త నుంచి విడాకులు కోరుతున్నా’’ అంటూ పోలీసులకు సమాధానం ఇచ్చింది. ఈలోపు.. భర్త పోలీసులకు తన వాదన వినిపించడం మొదలుపెట్టాడు. పెళ్లైనప్పటి నుంచే తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని.. 2023లో భార్య తరఫు వాళ్లు కేసు పెట్టినా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకున్నామని, కానీ ఆమె మళ్లీ గొడవ పెట్టుకుని వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి మరో వ్యక్తికి దగ్గరైందని.. ఇప్పుడు విడాకుల కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేస్తోందని వాపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ పోటాపోటీగా వాదించుకోవడంతో పోలీసులు వాళ్లను పీఎస్కు తీసుకెళ్లారు. ఇద్దరి వాంగ్మూలాలు తీసుకుని.. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ నగరంలోని నవాబాద్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.. 🚨 होटल ड्रामा, VIDEO वायरल 🚨🏨 पत्नी प्रेमी संग, पति 👮♂️ पुलिस के साथ पहुंचा😱 पकड़े जाने पर बोली— “तलाक दे दूंगी”📍 वायरल वीडियो झांसी (UP) बताया जा रहा#Jhansi #UPNews #ViralVideo #BreakingNews pic.twitter.com/yX4Z3ggciQ— Mr Kushal Gupta,( K G ) (@g94897659) January 16, 2026 -
ఆషిక రంగనాథ్ సంక్రాంతి వైబ్స్.. పతంగులు ఎగరేసిన అనసూయ..!
సంక్రాంతి వైబ్లో హీరోయిన్ సాక్షి అగర్వాల్..సంక్రాంతి స్టన్నింగ్ అవుట్ఫిట్లో ఆషిక రంగనాథ్..లంగా ఓణిలో మన్మధుడు హీరోయిన్ అన్షు హోయలు..పతంగులు ఎగరేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ..హ్యాపీ పొంగల్ అంటోన్న అనిఖా సురేంద్రన్..సంక్రాంతి ఫెస్టివ్ మూడ్లో భాగ్యశ్రీ బోర్సే View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) -
లాయర్తో వివాహేతర సంబంధం! భర్తను సర్వం దోచేసి..
గుంటూరు రూరల్: భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తూ, తనను జైలుకు పంపి, ఇబ్బందులకు గురిచేస్తోందనే మానసిక వేదనకు గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్ తెలిపిన, మృతుడు వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం మేరకు.. ఏటీ అగ్రహారానికి చెందిన వెంకటేశ్వర్లు కారు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. మొదటి భార్య మృత్యువాతకు గురవ్వటంతో అడవితక్కెళ్లపాడు టిడ్కో హౌస్లలో నివాసం ఉండే వెంకటరమణను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కుమార్తె లాయర్ డిగ్రీ పూర్తి చేసుకుని వేముల బాలాజీ అనే వ్యక్తి వద్ద ప్రాక్టీస్కు చేరింది. కుమార్తె ప్రాక్టీస్కు వెళుతున్న సమయంలో ఆమెకు తోడుగా వెళ్లే వెంకటరమణ, బాలాజీ లాయర్తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయమై వెంకటేశ్వర్లు, వెంకటరమణల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండేవి. వివాదాల నేపథ్యంలో వెంకటరమణ, లాయర్ బాలాజీలు ఇరువురు తనపై గతంలో తొమ్మిదికి పైగా అక్రమ కేసులు బనాయించి, తనను జైలుకు కూడా పంపారని వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ముందు చేసిన వీడియో ద్వారా తెలిపాడు. తనపై కేసులు మోపటంతోపాటు తన అన్నదమ్ములు, మొదటి భార్య బిడ్డలపై కూడా అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు. లాయర్ బాలాజీ అండతో తనను తన భార్య చిత్రహింసలకు గురిచేస్తోందని, తాను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో పేరేచర్లలోని జగనన్న కాలనీలో ఇంటిని కొనుక్కున్నానని, అయితే అందులోకి కూడా తనను వెళ్లకుండా చేసి ఆ ఇంటిని లాయర్, తన భార్య గెస్ట్ హౌస్గా వాడుకుంటున్నారని వీడియో ద్వారా వాపోయాడు. గతంలో తనపై పెట్టిన కేసుల్లో జైలు నుంచి వచ్చాక రాజీ కోసం ప్రయత్నించి తన సొంత ఇంటిని అమ్మి డబ్బులు కూడా తన భార్య వెంకటరమణకు ఇవ్వడం జరిగిందని తెలిపాడు. అనంతరం మళ్లీ తనకు ఫోన్ చేసి రూ. 20 లక్షలు ఇస్తే డైవోర్స్ ఇస్తాను, తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని ఆ లాయర్, తన భార్య వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన చావుకు కారణం లాయర్ బాలాజీ, భార్య వెంకటరమణలే కారణమని పేపర్పై రాసి, వీడియోద్వారా తెలిపాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఘటనకు కారణమైన వెంకటరమణను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. లాయర్ బాలాజీ పరారీలో ఉన్నాడని అతడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
‘విద్వేషం’పై ఉక్కుపాదం!
సాక్షి, హైదరాబాద్: విద్వేష పూరిత ప్రసంగాలు, వార్తల ప్రచారాన్ని కట్టడి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. ప్రభుత్వంలో ఉండే కీలక వ్యక్తులు, అధికారులే లక్ష్యంగా ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో ప్రసారమయ్యే నిరాధార ఆరోపణలు, విమర్శలకు చెక్ పెట్టేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన బిల్లు (విద్వేష పూరిత ప్రసంగాలు, ద్వేష పూరిత నేరాల (నివారణ) బిల్లు, 2025) తరహాలో ప్రత్యేక చట్టం తేవాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇప్పటికే ఈ అంశాలను పరిశీలించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై ఆరోపణలతో ఓ న్యూస్ చానల్లో ప్రసారమైన వార్త, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూప్లలో ప్రచారం చేయడంపై నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీస్స్టేషన్లో వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగిస్తూ డీజీపీ బి.శివధర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విద్వేష పూరిత ప్రచారాలపై ప్రభుత్వం సీరియస్గా ఉందనే విషయం ఈ సిట్ ఏర్పాటుతో స్పష్టం అవుతోంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇలాంటి కేసులు ఏవైనా నమోదయ్యాయా అని సిట్ బృందం పరిశీలించే అవకాశం ఉంది. నిరాధార ఆరోపణలు చేయడానికి కారణాలు ఏంటి..? తెరవెనుక ఇంకెవరైనా వ్యక్తులు ఉండి చేయిస్తున్నారా? అన్నది నిగ్గు తేల్చే దిశగానే సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు అయ్యిందని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. సిట్ బృందం గుర్తించే అంశాలను ఆధారంగా చేసుకుని కర్ణాటక తరహాలో చట్టం తేవడానికి అవకాశం ఉందని ఆయన చెప్పారు. కర్ణాటక బిల్లులో ఏముంది..? కర్ణాటక ‘హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ నివారణ బిల్లు–2025’లో అనేక కీలక అంశాలున్నాయి. సమాజంలో మతం, కులం, జాతి, లింగం, భాష తదితర అంశాల ఆధారంగా విద్వేషాలు, ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యలను అరికట్టే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. విద్వేష పూరిత ప్రసంగాలు, నేరాలను నియంత్రించడంతోపాటు అటువంటి నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు విధించడం, బాధితులకు తగిన పరిహారం అందించడం లక్ష్యంగా దీనికి రూపకల్పన చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.బహిరంగ ప్రదేశాల్లో లేదా ఎల్రక్టానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మాటలతో, రాతలతో, సంకేతాలతో లేదా దృశ్య రూపాల్లో వ్యక్తి లేదా వర్గంపై ద్వేషం, శత్రుత్వం, వైరం రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసే వ్యాఖ్యలను ‘విద్వేష ప్రసంగం’గా పరిగణిస్తామని బిల్లులో పేర్కొన్నారు. మతం, జాతి, కులం, లింగం, లైంగిక అభిముఖ్యత, జన్మస్థలం, నివాసం, భాష, వైకల్యం, గిరిజన గుర్తింపు వంటి అంశాలపై పక్షపాతం చూపితే అది నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్ని కాగి్నజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు.ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ కోర్టులో విచారణ జరుగుతుంది. ద్వేష నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ముందుగానే గుర్తిస్తే ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్ లేదా డిప్యూటీ ఎస్పీ హోదాకు తక్కువ కాని పోలీసు అధికారి ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. ద్వేషాన్ని ప్రోత్సహించే కంటెంట్ను సోషల్ మీడియా, ఎల్రక్టానిక్ మీడియా నుంచి తొలగించేందుకు లేదా బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ద్వేష నేరానికి ఏదైనా సంస్థ లేదా సంఘం పాల్పడితే, ఆ సంస్థతో పాటు దాని నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారిపై కూడా కేసులు నమోదు చేస్తారు.కఠిన శిక్షలు⇒ ద్వేష నేరానికి పాల్పడితే కనీసం ఒక సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారు. ⇒ అదే నేరాన్ని పునరావృతం చేస్తే కనీసం రెండేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ.1 లక్ష జరిమానా ఉంటుంది. ⇒ బాధితులకు నష్టం తీవ్రతను బట్టి న్యాయస్థానం తగిన పరిహారం ఇవ్వవచ్చు. -
బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతున్న రకుల్.. సాక్షి అగర్వాల్ ఫిట్నెస్ మంత్ర..!
వైట్ డ్రెస్లో బాలీవుడ్ భామ కాజోల్ హోయలు..బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్..ఫిట్నెస్ ముఖ్యమంటోన్న హీరోయిన్ సాక్షి అగర్వాల్..సంక్రాంతి మూడ్లో యాంకర్ శ్రీముఖి..రెడ్ శారీలో కవ్విస్తోన్న బుల్లితెర భామ జ్యోతిపూర్వాజ్.. View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
రాజాసాబ్ 'బాడీ డబుల్' ఎఫెక్ట్.. ప్రభాస్పై ట్రోలింగ్
‘రాజాసాబ్’ సినిమా విడుదలైన తర్వాత హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఈ విమర్శలకు కారణం సినిమాలో బాడీ డబుల్ను అధికంగా వాడారనే భావన ప్రేక్షకుల్లో కలగడమే. ప్రభాస్ సీన్లలో ఎక్కువగా హెడ్ రీప్లేస్మెంట్ టెక్నిక్ ఉపయోగించి బాడీ డబుల్తో చిత్రీకరించారని ప్రేక్షకులు అంటున్నారు. దీంతో ఆయన స్వయంగా యాక్షన్, డ్యాన్స్ సీన్లలో పాల్గొనలేదనే అభిప్రాయం బలపడుతోంది.అయితే ఇదే సమయంలో విడుదలైన 'మన శంకర వరప్రసాద్' సినిమాలో 70 ఏళ్ల మెగాస్టార్ ప్రతి సీన్లోనూ స్వయంగా పాల్గొన్నారు. డ్యాన్స్లు, ఫైట్లు అన్నీ ఆయనే చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అవి మరీ అంత క్లిష్టమైన సీన్లు కాకపోయినా, ఒక్క సీన్ కూడా డూప్కు వదలకుండా మెగాస్టార్ స్వయంగా చేశారని ప్రేక్షకులు ఆ రెండు సినిమాలను పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 70 ఏళ్ల చిరంజీవి ఒక్క సీన్ కూడా డూప్కు వదలకుండా చేస్తే మరి 40 ఏళ్లు దాటిన ప్రభాస్ మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఫ్యాన్స్ కూడా బలంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. కారణం ‘రాజాసాబ్’లో టెక్నికల్ లోపాలు లేదా నిర్లక్ష్యం వల్లనో కానీ హెడ్ రీప్లేస్మెంట్ షాట్లు స్పష్టంగా కనిపించడం సినిమా చూసిన ప్రేక్షకులకు తెలిసిపోవడమే. -
పార్టీలో జాన్వీ కపూర్ చిల్... గోల్డెన్ గ్లోబ్లో ప్రియాంక చోప్రా లుక్..!
మలేసియాలో టాలీవుడ్ నటి రోహిణి..పార్టీలో చిల్ అవుతోన్న జాన్వీ కపూర్..బికినీ పోజుల్లో బాలీవుడ్ బ్యూటీ నికితా శర్మ..గోల్డెన్ గ్లోబ్స్లో మెరిసిన ప్రియాంక చోప్రా..బీచ్లో ఫ్యామిలీతో బిపాసా బసు చిల్..సముద్రంలో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ప్రణీత.. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
అనంతపురం రైల్వేస్టేషన్ డెలివరీబాయ్ ఘటన
అనంతపురం రైల్వేస్టేషన్లో ఏజెంట్ ఒకరు ప్రమాదానికి గురవడంపై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ స్పందించింది. రైలు ప్రయాణీకుడు ఒకరి ఫుడ్ ఆర్డర్ డెలివరీ కోసం ఓ ఏజెంట్ అనంతపురం రైల్వే స్టేషన్కు వెళ్లినప్పుడు.. కదులుతున్న రైల్లోంచి దిగేందుకు చేసిన ప్రయత్నంలో కిందపడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో స్విగ్గీ స్పందించింది.ఏజెంట్ల భద్రతకు తాము పూర్తి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. రైల్లోంచి కింద పడ్డ ఏజెంట్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు తెలిపింది. అయితే స్విగ్గీ నిబంధనల ప్రకారం కదిలే రైళ్లను ఎక్కడం లేదా దిగడంపై ఇప్పటికే నిషేధం విధించామని తెలిపింది. ‘‘ఆ ఘటనను మేమూ పరిశీలించాం. హాని కలిగించే విషయాల నుంచి దూరంగా ఉండేందుకు మేము భద్రతపై ఇచ్చే శిక్షణను మరింత బలోపేతం చేశాం. ఇది చాలా తీవ్రమైన భద్రత సమస్య. రైలు డోర్/ప్లాట్ఫారమ్ నుంచి ఆహారాన్ని డెలివరీ చేయమని కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలి. ప్రోటోకాల్ పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలి’’ అని ఏజెంట్లను కోరింది.ఏం జరిగిందంటే..ఈ నెల ఆరో తేదీన రాత్రి ఏపీలోని అనంతపురం రైల్వేస్టేషన్లో ఏసీ కోచ్ లోని ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి స్విగ్గీ ఏజెంట్ రైలెక్కాడు. ఇంతలో రైలు కదలడంతో.. కంగారులో రన్నింగ్ ట్రైన్ నుంచి ప్లాట్ ఫామ్ పైకి దిగబోయాడు. ట్రైన్ వేగం ఎక్కువగా ఉండడంతో డెలివరీ బాయ్ ప్లాట్ ఫామ్ పై పడిపోయాడు. ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో జరిగిన ఈ ఘటనను బిజయ్ ఆనంద్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు.“హాల్ట్ కేవలం 1-2 నిమిషాల మాత్రమే. ప్రయాణికుడు 1ACలో ఉన్నాడు. ఫుడ్ అందించే సమయానికి రైలు స్టార్ట్ అయింది. డెలివరీ బాయ్.. ఇంకా డెలివరీ చేయడానికి ఇతర ఆర్డర్లు ఉండడం, అతని బైక్, ఫుడ్ బ్యాగ్ స్టేషన్ బయట ఉండిపోవడంతో.. కదులుతున్న రైలు దిగాల్సిన పరిస్థితి. జీవనోపాధి కోసం డెలివరీ ఏజెంట్ తన ప్రాణాలను ప్రమాదంలో పడేసుకున్నాడు” అని బిజయ్ ఆనంద్ కామెంట్ చేశారు.At #Anantapur station, a #Swiggy delivery boy went to deliver food to a train. The train stopped for just 1-2 minutes and then started moving. His bike and bag were outside, and he had more orders to deliver.So, he panicked and tried to get off the moving train,1/3 pic.twitter.com/5R8xqnQa90— Siraj Noorani (@sirajnoorani) January 9, 2026నెటిజన్ల విమర్శలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై ఇప్పుడు చాలామంది స్పందిస్తున్నారు. ఫుడ్ డెలివరీల వేగం పెంచాలని ప్లాట్ఫామ్స్ వర్కర్లను ఒత్తిడి చేయడం సరికాదని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ఇంకో వ్యక్తి మాట్లాడుతూ 10 నిమిషాల డెలివరీ టార్గెట్ను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోకరు స్పందిస్తూ.. ప్రయాణికుడు పార్శిల్ను స్వీకరించడానికి కనీసం రైలు డోర్ వద్దకు వచ్చి ఉండాలని అభిప్రాయపడ్డారు. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు ఈ మధ్యకాలంలో తమ కష్టాలపై గళమెత్తుతున్న విషయం తెలిసిందే. గతనెల చివరిలో కొన్ని రాష్ట్రాల గిగ్వర్కర్లు సామూహిక సమ్మెకు కూడా దిగారు. కొన్ని రాష్ట్రాల్లో గిగ్ వర్కర్లకు బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తూండగా.. మిగిలిన చోట్ల వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదన్న విమర్శలు ఉన్నాయి. -
జస్ట్ మిస్ భయ్యా.. అదృష్టం అంటే వీరిదే..
బెంగళూరు: కొన్ని సందర్భాల్లో నువ్వు లక్కీ ఫెలో రా.. అని అంటుంటాం కదా.. సరిగ్గా అలాగే ఓ బ్యాచ్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎందుకు అనుకుంటున్నారా?.. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను దాటుకుని వెళ్లి వారి వైపు దూసుకొచ్చింది. సెకన్ల వ్యవధిలో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఇందిరానగర్లో డెరిక్ టోనీ(42) ఫుల్లుగా మద్యం సేవించి తన స్కోడా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఇంతలో మద్యం మత్తులో కారుపై నియంత్రణ కోల్పోయి.. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా నేరుగా డ్రైవ్ చేశాడు. దీంతో, అతి వేగంలో ఉన్న కారు ఒక్కసారిగా డివైడర్పై నుంచి సినిమా రేంజ్లో జంప్ చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది.ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్రమాదం శుక్రవారం రాత్రి 11:35 గంటల సమయంలో కొందరు వ్యక్తులు రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని బయట నిలబడి ఉన్నారు. వారిపై కారు దూసుకెళ్లినప్పటికీ సెకన్ల వ్యవధిలో అప్రమత్తమైన బ్యాచ్.. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.ఇక, ఈ ఘటనలో కారు ఢీకొట్టిన బైక్ను నడుపుతున్న జాబిర్ అహ్మద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన డెరిక్ టోనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
అమ్మాయిల నోట్లో సిగరెట్.. చేతిలో లైటర్..
టెహ్రాన్: ఇరాన్లో నిరసనలు పీక్ స్టేజ్కు చేరుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. మరోవైపు.. ఆందోళనల్లో యువతులు సిగరెట్లు తాగుతూ.. ఖమేనీ ఫొటోలను మంటల్లో కాల్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.ఇరాన్లో సుప్రీం లీడర్ ఖమేనికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా దేశం అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న కరెన్సీ విలువ, విదేశీ మారకం నిల్వలతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో.. అక్కడ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ప్రజలు రోడ్డెక్కుతున్నారు. 1979 ఇరాన్ విప్లవం తర్వాత అంతటి స్థాయిలో మళ్లీ అక్కడ విప్లవ జ్వాలలు రగులుతున్నాయి.మరోవైపు.. మహిళలు తమ హక్కులపై పోరాటం చేస్తున్నారు. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. హిజాబ్ (బురఖా) లేకుండా బయటకు రావద్దనే కఠిన నిబంధనలున్న దేశంలో.. స్కర్టులు, మిడ్డీలు వేసుకుని యువతులు, మహిళలు నిరసనల్లో పాల్గొంటున్నారు. అంతటితో ఆగకుండగా.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని ఏళ్లుగా ఉన్న సిగరెట్ నిషేధాన్ని కాదని.. ఏకంగా సుప్రీం లీడర్ ఫొటోతో సిగరెట్ అంటించుకోవడంపై చర్చ జరుగుతోంది. అక్కడి మహిళలు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. An Iranian girl burns a picture of Ayatollah Khamenei and lights her cigarette, a new trend in Iran! Young Iranian women are leading the revolution against the Islamic regime.pic.twitter.com/UIFYHMPBGA— Dr. Maalouf (@realMaalouf) January 10, 2026అయితే, ఇరాన్లో సుప్రీం లీడర్ ఫొటోను కాల్చడం అక్కడి చట్టాల ప్రకారం పెద్ద నేరం. అది కూడా ఫొటోతో సిగరేట్ అంటించుకోవడం ఆ చట్టాల ప్రకారం క్షమించరాని నేరం. అయితే ఈ చర్య ద్వారా మహిళలు ప్రభుత్వానికి, భవిష్యత్ నాయకులకు స్పష్టమైన మెసేజ్ పంపినట్లు స్పష్టమవుతోంది. అక్కడి పురాతన చట్టాలను ధిక్కరిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. మహిళా హక్కులు, స్వేచ్ఛపై ఇస్లాం చట్టాలు విధిస్తున్న నిర్బంధాల గోడలను కూల్చేస్తున్నామని వాళ్లు.. అంత ధైర్యంగా.. తెగింపుతో ఈ విధంగా నిరసనలకు దిగారు. ఇదిలా ఉండగా.. ఖమేనీకి వ్యతిరేకంగా చేసే చర్యలను ఉపేక్షించేది లేదని అధికార వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ.. మహిళలు తిరస్కార ధోరణిలో ఇలాంటి చర్యలకు దిగటం.. మహిళలపై అణచివేతను ఎప్పటికీ సహించేది లేదని వాదనను బలంగా వినిపిస్తున్నట్లు ప్రపంచానికి సందేశం పంపుతున్నట్లు తెలుస్తోంది.Iranian women burning their hijabs in Tehran tonight. Protesters are also torching property linked to Islamic regime forces, including vehicles, mosques, and even their residences.This is a message not only to the regime, but for the who world to see#Iran #IranRevolution2026 pic.twitter.com/A910OUoJSL— acpcrf (@acpcrf) January 10, 2026ఇక, డిక్టేటర్ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు. ఇరాన్ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పారిశ్రామీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్ ఈస్ట్ పారిస్గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.These Iranian women are showing their faces, no burkas, no fear...inside Iran....calmly smoking while burning a photo of Khamenei.That takes more courage than the entire Western left-wing feminist class combined.These women aren’t posting slogans or trying to run over law… pic.twitter.com/dZItOJzwzw— Flopping Aces (@FloppingAces) January 9, 2026 -
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు.. మంత్రి కోమటిరెడ్డి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా, ఛానెల్స్లో మహిళా అధికారులపై పనికట్టుకుని వార్తలు ప్రసారం చేయడాన్ని, రాయడాన్ని ఖండిస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర వార్తలు వస్తే ఇంట్లో వాళ్లు ఇబ్బందులు పడతారు. బాధ పడుతారని ఆలోచన చేయాలంటూ హితవు పలికారు. ఇదే సమయంలో తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను అంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అధికారుల బదిలీలు సీఎం, సీఎస్ పరిధిలో మాత్రమే ఉంటుంది. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరు. ఐఏఎస్, IPS కావాలంటే ఎంతో కష్టపడాలి. ఐఏఎస్ అధికారులకు సెలవులు ఉండవు. ఐఏఎస్, IPS అధికారుల బదిలీలు సర్వసాధారణం. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్న.. మీకు కుటుంబాలు ఉంటాయి. రాసే వారికి భార్య పిల్లలు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. ఐఏఎస్ అధికారులకు కుటుంబాలు ఉంటాయి.. మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో సీఎం పై విమర్శలు వచ్చాయి.. లిమిట్ లేకుండా పోయింది.ఆ ఐఏఎస్ అధికారి స్థానంలో ఉండి మీరు ఆలోచన చేసుకోండి. మహిళలు ఉద్యోగాలు చేయడమే తప్పా!. మంత్రుల ఇళ్లలో ఇబ్బందులు పెట్టి.. మహిళా అధికారులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు. మమ్మల్ని ఇబ్బందులు పెడతాం అనుకుంటే వేసుకోంది. ఫోన్ మాట్లాడకపోతే.. ఫోన్ ఎత్తకపోతే అసత్య వార్తలు రాస్తారా?. ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే అధికారులతో రివ్యూ ఎప్పుడు చేయాలి. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా... ఇలాంటి వార్తల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎదుటివాడు బాధపడితే స్పందించే గుణం నాది. నాలాంటి వాడిని ఏడుపిస్తా అనుకుంటే ఏడిపించండి. ఇప్పటికే కొడుకును కోల్పోయి ఏడుస్తున్నాను.సినిమాపై క్లారిటీ.. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను. పుష్పా సినిమా వివాదం తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం బంద్ చేసాను. రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతి ఫైల్ నా దగ్గరకి రాలేదు. నాకు తెలియకుండానే రెండు సినిమాల జీవోలు వచ్చాయి. నేను సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టలేదు.. పెట్ట దల్చుకోలేదు. నిప్పులాగా బతికిన వాడిని ఇలా మానసికంగా బాధ పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్లను దేవుడే శిక్షిస్తాడు. జిల్లా మంత్రిగా రివ్యూ పెడితే అధికారులు పక్కన కూర్చోవడం తప్పా?. ఎన్నో విమర్శలు వచ్చినా ఆరుసార్లు గెలిచాను. వెంకట్ రెడ్డి ఉండొద్దు అంటే ఇంత విషం ఇచ్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
మాఘమేళా మనోహరి!
గత సంవత్సరం ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పూసల దండలు అమ్ముకునే మోనాలిసా సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అయింది. చివరికి సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి. తాజా విషయానికి వస్తే... ప్రయాగ్రాజ్ మాఘమేళా 2026లో మరో మోనాలిసా తెర మీదికి వచ్చింది. ఈ అమ్మాయి పేరు అఫ్సాన పవార్. ఈమె కూడా పూసల దండలు అమ్ముతుంది. అందువల్ల ఆ మోనాలిసాకు, ఈ అఫ్సానాకు మధ్య ఉన్న సారూప్యతల గురించి పోస్ట్లు పెడుతున్నారు నెటిజనులు. మరీ ముఖ్యంగా... ఆకట్టుకునే వారి కళ్ల గురించి ప్రస్తావిస్తున్నారు.పవార్ పూసల దండలు అమ్ముతున్న వీడియోలు ఆన్లైన్లో వైరల్ కావడంతో, మాఘమేళాకు వచ్చిన వారిలో కొందరు ఆమెతో సెల్ఫీలు దిగుతూ కనిపించారు.‘నేను ప్రతి మేళాకు వెళుతుంటాను. ఇక్కడ నెలరోజులు ఉంటాను. ఎంతోమంది నన్ను మోనాలిసాతో ΄ోల్చుతూ ఆమెలాగే నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది’ అంటుంది పవార్.‘భవిష్యత్తులో కూడా ఇలాగే దండలు అమ్ముకుంటారా? ఆ మోనాలిసా మాదిరిగా సినిమాలలో నటించే అవకాశం ఏమైనా ఉందా?’ అనే ప్రశ్నకు....అందమైన నవ్వులతో పవార్ చెప్పిన జవాబు అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే...‘అందరి ఆశీస్సులు, సహకారం ఉంటే తప్పకుండా నేను కూడా ఫిల్మ్స్టార్ అవుతాను’ అని! -
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ది రాజాసాబ్ వచ్చేశాడు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ప్రీమియర్స్తో ఫ్యాన్స్ ముందుకొచ్చేశాడు. ఏపీలో ది రాజాసాబ్ ప్రీమియర్స్తో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. ఈ మూవీ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.ది రాజాసాబ్లో ప్రభాస్ నటన అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంజయ్ దత్ ఎంట్రీ చాలా భయానకంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉందని ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.హీరోయిన్ రిద్ది కుమార్ దాదాపు 5 నిమిషాల పాటు కనిపిస్తుందని.. నిధి అగర్వాల్ మొదటి 30 నిమిషాల తర్వాతే ఎంట్రీ ఇచ్చిందని పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరి లుక్, నటన అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక మోహనన్ ఎంట్రీ ఆలస్యమైనా అద్భుతంగా నటించిందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్లో చివరి 30 నిమిషాల్లో కనిపించిన మాళవిక ఫైట్ సీన్లో అదరగొట్టేసిందని అంటున్నారు.సెకండాఫ్లో కూడా అలరించిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మొసళ్లతో ఫైట్ అదిరిపోయిందని పోస్ట్ చేస్తున్నారు. చివరి 30 నిమిషాలు క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ అని రాసుకొస్తున్నారు. ప్రభాస్ ఫర్మామెన్స్తో అదరగొట్టేశాడని చెబుతున్నారు. చివరి 40 నిమిషాల్లో ఎస్ఎస్ తమన్ బీజీఎం అద్భుతమని అంటున్నారు. Hospital sequence ➡️ crocodile fight ➡️ climax 🔥The last 30 minutes are the SOUL of the film.#Prabhas delivers a performance with par excellence 👌 Trying something different and nailing it.Brilliant writing by @DirectorMaruthi 👌 Truly surprising!@MusicThaman is the…— Suresh PRO (@SureshPRO_) January 8, 2026 #TheRajaSaab – First Half Review— STORY – #RajaSaab is about the hero’s journey in search of his grandfather.— #Prabhas’ performance is good. Each reaction he gives works well.Prabhas’ intro scene is superb.— #RiddhiKumar appears for about 5 minutes so far. Her look is… pic.twitter.com/Mj8iHpZbc9— Movie Tamil (@_MovieTamil) January 8, 2026 Musk changed like ❤️ button to celebrate 🔥🔥🔥 the release of #TheRajaasaab #TheRajaSaab #Prabhas𓃵 @prabhas pic.twitter.com/OmVMnJVyWS— R A J (@dune1411) January 8, 2026 -
నీ ఆటలు సాగవు.. తస్మాత్ జాగ్రత్త! చంద్రబాబు, లోకేష్పై నిప్పులు చెరిగిన జూపూడి
-
లోకేష్.. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తారా?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఖాళీలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సొంత రాజ్యాంగం అమలు చేస్తామంటే కుదరదు అని హెచ్చరించారు. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉల్లంఘిస్తారా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాపై నియంత్రణ పేరుతో గొంతులు నులుమాలంటే కుదరదు. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సొంత రాజ్యాంగం(రెడ్బుక్ రాజ్యాంగం) చేస్తారా?. దీనిపై ప్రజా పోరాటం చేస్తాం. అసలు సోషల్ మీడియా మీద సమీక్షలు, చర్యలకు మంత్రి లోకేష్కు ఏం అర్హత ఉంది?. సకల శాఖా మంత్రిగా లోకేష్ వ్యవహరించటం సబబు కాదు. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉల్లంఘిస్తారా?.వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వేధించటానికే సోషల్ మీడియా నియంత్రణా?. సాక్షి మీడియా, ప్రశ్నించే గొంతులను నులుమేయటమే మీ పనా?. ఆర్టికల్-19కి విరుద్ధంగా వ్యవహరించే వారందరిపై చర్యలు తీసుకోవాలి. ప్రత్యర్థి పార్టీ నేతల కుటుంబాలపై ఐ-టీడీపీ పెడుతున్న పోస్టులపై ఏం చర్యలు తీసుకున్నారు?. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పేరుతో ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించినా కేసులు పెట్టటం ఏంటి?. ఐ-టీడీపీ, కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై కోర్టుకు వెళ్తాం. లోకేష్ గురివింద గింజ సామెత లాగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఏపీలో అమలు చేయని వైనంపై కోర్టులోనే తేల్చుకుంటాం. అభ్యంతరకర పోస్టులన్నీ టీడీపీ సోషల్ మీడియా నుండే వస్తున్నాయి. లోకేష్ ముందుగా వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
ధర్మరాజు లేకుండానే.. అలుపెరుగని ప్రయాణం
మహాభారతంలో ధర్మరాజుతో కడదాకా నడుస్తుంది ఓ శునకం. ఆ మధ్య వచ్చిన పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్లో హతోడి త్యాగి అనే సుపారీ కిల్లర్ పాత్రకు వీధికుక్కలతో ముడిపెట్టిన సీక్వెన్స్ ప్రేక్షకుల్ని ఒకింత భావోద్వేగానికి గురి చేసింది. అయితే విశ్వాసం, కరుణ మాత్రమే కాదు.. శాంతి కోసమూ నాలుగు కాళ్ల అలోకా అలుపెరగని ప్రయాణంతో అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇంటర్నెట్లో రీల్స్ చూసేవాళ్లకు అలోక అనే పేరు తెలియక పోవచ్చు. కానీ స్క్రోలింగ్ చేసే సమయంలో ఎక్కడో ఒక దగ్గర కచ్చితంగా తారసపడుతుంది. అమెరికాలో పర్యటిస్తున్న బౌద్ధభిక్షువులతో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోందీ అలోక. దీనికి దక్కిన ఫేమ్తో ఏకంగా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్నే ఓపెన్ చేశారు. ఒకటి రెండు బిస్కెట్లు వేస్తేనే కృతజ్ఞతలు చూపించే కుక్క మాదిరే.. తనను కాపాడిన వాళ్లను వీడేదే లేదంటూ వెంట తిరుగుతోంది. స్వర్గాన్ని కాదని.. మహాప్రస్థాన ఘట్టంలో ధర్మారాజు భార్యాసహోదరులు స్వర్గానికి వెళ్తారు. అయితే తనతో వచ్చిన కుక్కను విడిచిపెట్టడానికి నిరాకరించడం వల్ల స్వర్గానికి వెళ్ళలేక కొద్దిసేపు నరకంలో గడపాల్సి వస్తుంది. తనతో పాటు ఉన్న జీవిని విడిచిపెట్టలేనని చెబుతాడాయన. అయితే.. ఆ కుక్క రూపంలో ఉన్నది ధర్మదేవతే అని తెలుసుకున్నాక చివరికి స్వర్గానికి చేరుకున్నాడు. ఈ కథ.. ధర్మరాజు యొక్క నిస్వార్థత, సత్యనిష్ఠ, విశ్వాసపాత్రత, అన్ని జీవుల పట్ల కరుణను తెలియజేస్తుంది. పాతాళ్ లోక్లో.. 2020 కరోనా టైంలో అమెజాన్ ప్రైమ్లో వచ్చిన వెబ్ సిరీస్ పాతాళ్ లోక్. అందులో హతోడి త్యాగి అనే సుపారీ కిల్లర్ పాత్ర ఉంటుంది. సుత్తిని ఉపయోగించి భయంకరంగా చంపే పాత్రలో అభిషేక్ బెనర్జీ ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. క్రూరమైన పాత్ర అయినప్పటికీ కుక్కల పట్ల జాలి చూపించే వ్యక్తిగా అతనిలోని మానవీయ కోణాన్ని చూపించారు ఇందులో. ఆ కోణమే కథలో ఓ కీలక మలుపునకు కూడా కారణమవుతుంది. అలా ప్రేక్షకులు హతోడి త్యాగిని మరింత గుర్తుంచుకున్నారు. భూమ్మీద అలోకా.. కొందరు బౌద్ధ భిక్షువులు తమ శాంతి సందేశాన్ని వినిపించేందుకు భారత్లో పర్యటిస్తున్న సమయంలో ఓ కుక్క వారి కంటపడింది. కారు ఢీకొనడంతో గాయాలపాలైన ఆ కుక్కను వారు కాపాడారు. దానికి అలోక అని పేరు పెట్టి(పాలి భాషలో వెలుగు అని అర్థం) బాగోగులు చూసుకున్నారు. తనను కాపాడినందుకు వారి పట్ల ఎనలేని కృతజ్ఞత పెంచుకున్న ఆ శునకం నాటి నుంచీ వారి వెంటే సంచరిస్తోంది. ఇక అలోకా కథ తెలుసుకుని అమెరికాలో అనేక మంది ఆశ్చర్యపోయారు. శునకానికి కావాల్సిన వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు అనే డైలాగ్ ఉంది కదా.. అలా ఐక్యత, సహృద్భావం, శాంతిసామరస్యాలు వంటివి ప్రోత్సహించేందుకు బౌద్ధబిక్షువులతో పాటు ఈ పర్యటనలో అలోకా కూడా భాగమైందన్నమాట. -
Vreels - సోషల్ మీడియాకు సరికొత్త నిర్వచనం
డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న ఈ రోజుల్లో, యూజర్ డేటా గోప్యతా సమస్యలు, స్పష్టతలేని అల్గోరిథమ్స్, మరియు కొద్ది మంది మాత్రమే లాభపడే ఆదాయ వ్యవస్థలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో, Vreels (www.vreels.com) ఒక కొత్త దృష్టికోణాన్ని తీసుకొని వచ్చింది. ఇది యూజర్ గోప్యత, పారదర్శకత, సమాన అవకాశాలు, మరియు కమ్యూనిటీ ఇంటరాక్షన్పై ఆధారపడి రూపుదిద్దబడిన వేదిక.యూజర్కు అనుగుణంగా రూపొందిన వేదికVreels ప్రత్యేకత ఏమిటంటే - ఇది యూజర్ల కోసం మాత్రమే కాకుండా, యూజర్లతో కలిసి నిర్మించబడుతున్న వేదిక. మీటప్లు, ఓపెన్ ఫోరమ్ల ద్వారా కంటెంట్ క్రియేటర్లను, యూజర్లను నేరుగా కలుసుకుంటూ, వారి అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకుని ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది.ప్రతిభకు సమాన ప్రాధాన్యత, వ్యక్తీకరణ స్వేచ్ఛ, నైతిక ఆదాయ విధానం, మరియు యూజర్ నియంత్రణ వంటి అంశాలే ఈ వేదిక అభివృద్ధికి దిశానిర్దేశకాలు. అల్గోరిథమ్ ప్రయోజనాలకన్నా, కమ్యూనిటీ అవసరాలే ఇక్కడ ప్రధానంగా పరిగణించబడతాయి.విద్యార్థులు మరియు కొత్త ప్రతిభలకు ప్రోత్సాహంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న అపారమైన సృజనాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు Vreels ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. క్యాంపస్ స్థాయిలో నిర్వహిస్తున్న కంటెంట్ కార్యక్రమాలు విద్యార్థులను సురక్షిత వాతావరణంలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రోత్సహిస్తున్నాయి.విద్యాసంస్థను వెరిఫై చేసిన యూజర్లు ఇతర కళాశాలల విద్యార్థులతో కనెక్ట్ అవుతూ, దీర్ఘకాలిక సామాజిక మరియు వృత్తిపరమైన నెట్వర్క్లను నిర్మించుకోగలరు. గోప్యతా రక్షణలు, కంటెంట్ నియంత్రణలు యువతలోని సందేహాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ప్రారంభ దశలోనే ఆదాయ అవకాశాలుసోషల్ మీడియా రంగంలో అరుదైన అడుగు వేస్తూ, Vreels ఒక స్పష్టమైన మైల్స్టోన్ ఆధారిత ఆదాయ విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం:• ప్రతి 10,000 ఫాలోవర్లకు ₹10,000 చెల్లింపు • గరిష్ట ఆదాయ పరిమితి లేదు (ప్రోగ్రామ్ అమలులో ఉన్నంత వరకు)పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా మారకముందే, యూజర్ల శ్రమకు విలువ ఇస్తూ, ప్రారంభ దశ నుంచే ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం ఈ విధాన ప్రత్యేకత.సోషల్ కామర్స్ దిశగా అడుగు - Vreels Shop2026 తొలి త్రైమాసికంలో Vreels Shop ప్రారంభం కానుంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వ్యాపారాలు, కొత్త బ్రాండ్లు యూజర్లతో నేరుగా కనెక్ట్ కావచ్చు. ప్రస్తుతం వెండర్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.ఇది క్రియేటర్లు, వ్యాపారులు, బ్రాండ్లకు కొత్త ఆదాయ మార్గాలను తెరవనుంది.వ్యక్తిగత అనుభూతికి ప్రాధాన్యం ఇచ్చే ఫీచర్లుVreelsలోని ప్రత్యేకమైన ఫీచర్ Memory Capsule — మీరు ఎంచుకున్న ఫోటోలు, వీడియోలు లేదా సందేశాలను, నిర్ణయించిన సమయానికి, ఎంపిక చేసిన వ్యక్తికే షేర్ చేసే అవకాశం ఇస్తుంది. ఇది పబ్లిక్ షేరింగ్కు భిన్నంగా, వ్యక్తిగత భావోద్వేగాలకు విలువ ఇస్తుంది.PixPouch ఫీచర్ ద్వారా యూజర్లు తమ విజువల్ జ్ఞాపకాలను సక్రమంగా భద్రపరచుకుని, కావాలనుకున్నప్పుడే ఎంపిక చేసిన వారికి షేర్ చేయవచ్చు.ఒకే యాప్లో సంపూర్ణ అనుభవం• Vreels ఒకే వేదికలో: షార్ట్ వీడియోలు (Reels) • రియల్టైమ్ చాట్ • వాయిస్ & వీడియో కాల్స్అన్నీ అందిస్తూ, యూజర్లు యాప్ల మధ్య మారాల్సిన అవసరాన్ని తొలగిస్తోంది.గోప్యతే పునాదిప్రకటనల ఆదాయంపై ఆధారపడే వేదికలతో పోలిస్తే, Vreels గోప్యత మరియు డేటా భద్రతను తన మౌలిక నిర్మాణంలోనే సుస్థిరంగా ఏర్పాటు చేసింది. యూజర్ల కంటెంట్, పరస్పర చర్యలపై పూర్తి నియంత్రణ యూజర్లకే ఉంటుంది.ప్రపంచ దృష్టికోణంఅమెరికా ఆవిష్కరణా దృక్పథ్వం మరియు భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభ కలయికతో రూపొందిన Vreels, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అనేక టెక్నాలజీ పేటెంట్లు దాఖలయ్యాయి. ప్రాంతీయ భాషల మద్దతు కూడా నిరంతరం విస్తరిస్తోంది.Vreels — మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా — మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒక్కే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels - భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comక్రింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్లలో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదా డౌన్లోడ్ కోసం క్రింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి. -
ఇది బాబు ఫ్రీ బస్సండీ.. ఆగదండి
విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఆ ప్రయాణం గమ్యం చేరుతుందా అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా కనిపిస్తున్నాయి. బస్సు ఎక్కితే సీట్ల కోసం తగాదాలు, దిగితే తోపులాటలే కనిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తుంటే, అసలు బస్సు ఎక్కడం కూడా మహిళలకు ఒక ‘గగన యాత్ర’లా మారిందనిపిస్తోంది. సంక్రాంతి పండగ హడావుడి మొదలైంది.జగదాంబ సెంటర్ నుంచి పూర్ణామార్కెట్ వరకు ఇసుక వేస్తే రాలనంత జనసంచారం. షాపింగ్లు, పనుల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు సంచులతో నిలబడి ఉన్నా ఆ సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు కనీసం అపలేదు. దీనిని బట్టి చూస్తే చంద్రబాబు కల్పించింది ఫ్రీ బస్సు ప్రయాణం ఎలా ఉందో ఆర్థమవుతోందని విమర్శలు వెల్లువెత్తాయి. -
మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
నటుడు శివాజీ కారుకూతల పైత్యం పెద్ద దుమారాన్నే రాజేసింది. ప్రత్యక్షంగా హీరోయిన్లపైనా, పరోక్షంగా మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన శివాజీపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అలాగే శివాజీకి అనూహ్యంగా మద్దతు కూడా లభించింది. ఈ దుమారం ఇలా కొనసాగుతుండగానే, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో రాసిన వ్యాసం కొత్త దుమారాన్ని రాజేసింది. ఇలాంటి వివాదాల పట్ల మీడియా బాధ్యతను, వ్యవహరించాల్సిన తీరును గుర్తు చేసింది.భూమిక ఫౌండర్, రచయిత్రి, సామాజికవేత్త కొండవీటి సత్యవతి ఈ ఆర్టికల్పై తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది కొత్త పలుకు కాదు. మహిళల పరంగా చెత్త పలుకు. శివాజీని వెనకేసుకొచ్చిన ఈ పెద్దమనిషి గతంలో సినీనటుడు చలపతిరావుతో 'మీకు నిజంగా రేప్ చేయ్యాలనిపించలేదా?.. అని అసహ్యంగా అడిగినపుడు నేను డైరెక్ట్గా అతనికే ఫోన్ చేసి నిలదీసినపుడు మర్నాడు ఆంధ్రజ్యోతిలోనే సారీ చెప్పారు. అయినా ఇలాంటి వాళ్ళు మారతారని నేను అనుకోను. శివాజీకి కానీ, రాధాకృష్ణకి కానీ మహిళల వస్త్రధారణ మీద వ్యాఖ్యానించే అర్హత ముమ్మాటికీ లేదు. మీ వ్యవహారాలు మీరు చక్కబెట్టుకోండి. మాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి సాహసించకండి. మీకా అర్హత లేదు. మీ వ్యాఖ్యలు చుట్టవిరుద్ధమే కాదు రాజ్యాంగ విరుద్ధం’’ అంటూ ఆమె ఫేస్బుక్లో మండిపడ్డారు. అలాగే సీనియర్ జర్నలిస్టు కృష్ణజ్యోతి కూడా సోషల్మీడియాలో దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విక్టిమ్ బ్లేమింగ్, entitlement, మేల్ ప్రివిలేజ్, మేల్ dominance, control, body & gender politics ఈ ఆర్టికల్ అద్దంపడుతోందన్నారు. మీడియాతో సహా మహిళల విషయాల పట్ల అందరికీ కొంతైనా జెండర్ sensitisation ఉండడం చాలా ముఖ్యమని.. కానీ ఇందులో ఆ స్పృహ, ఆలోచన, ఆసక్తి, కించిత్ బాధ్యత లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే సిద్ధార్థ సుభాష్ చంద్రబోస్ ఈ వ్యాసంపై స్పందిస్తూ స్త్రీలు ఎటువంటి దుస్తులు వేసుకోవాలో తెలియజేస్తూ ఒక పత్రిక సంపాదకీయం రాయడం దారుణం అని వ్యాఖ్యానించారు. ‘‘స్త్రీలు మన కొలతల ప్రకారం శరీరం చూపే జంతువులు కాదు. వాళ్ల సౌకర్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ల దుస్తులు వాళ్లు ఎంపిక చేసుకునే హక్కుని అంగీకరించాలి. చూడలేకపోతే కళ్ళు మూసుకుని పక్కకు తప్పుకోవాలి, లేకపోతే గుహల్లో బ్రతకాలి. ఒక స్త్రీని దుస్తులని చూసి దాడి చేయాలనుకోవడం మగవాడి బలహీనతకు చిహ్నమే గాక, అది అతడు నాగరికంగా ఎదగలేకపోయిన వెనకబాటుని చూపిస్తుందనీ, రాజ్యాంగం సూచించిన స్వేచ్చా, సమానత్వాన్ని అంగీకరించని చట్టవిరుద్దమైన విషయమనీ, అలా గాకుండా ఇక్కడ ఏకంగా చేతులేస్తాం, రేపులు చేస్తామనడం తిరోగమనతత్వమని హితవు చెప్పి వుంటే అది "కొత్తపలుకు" అనే పదానికి అర్థవంతంగా వుండేది.. అంటూ బాగానే వాతలు పెట్టడం గమనార్హం.రాధాకృష్ణ వ్యాసంలో ఏముంది? డ్రెస్ కోడ్లతో మొదలైన అహంకారం, నిండు సభలో ఒక మహిళ చీర లాగినందుకు మహాభారత సంగ్రామం జరిగింది. అది ద్వాపర యుగం. కలియుగంలో మహిళలు జన సమూహంలోకి వెళ్లినప్పుడు చీర కట్టుకుంటే మంచిది అన్నందుకు మాటల యుద్ధం జరుగుతోందన్న సోషల్ మీడియా.. పలువురు వాడిన కాపీ డైలాగ్స్తో ఈ వ్యాసం సాగుతుంది.అభినవ కందుకూరి వీరేశలింగం అంటూ అంతేకాదు స్త్రీ జనోద్ధారకుడు, గొప్ప రచయిత కందుకూరి వీరేశలింగాన్ని కూడా అవమానపరుస్తూ, అభినవ కందుకూరి వీరేశలింగం పంతుళ్లు కొద్దిమంది మహిళల తరఫున వత్తాసు పలుకుతున్నారంటూ తన కుంచిత బుద్ధని ప్రకటించుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తన అజ్ఞానాన్ని, అహంకారాన్ని ప్రదర్శించకున్నాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.ఆకతాయిలను రెచ్చగొడుతున్న వైనం‘‘చిట్టి పొట్టి దుస్తులతో ఒక మహిళా ప్రజాప్రతినిధి జనంలోకి వెళ్లడాన్ని ఊహించగలమా? వెళ్లకూడదా? అని గద్దిస్తే ఏం చెబుతాం? వెళ్లవచ్చు. కాకపోతే పర్యవసానాలకు కూడా సిద్ధం కావాలి. జరగరాని పరాభవం జరిగితే చింతించకూడదు’’ అంటూ పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలను ఏం చేసేనా పరవాలేదనే పైత్యాన్ని నూరిపోస్తున్న ఒక మీడియా సంస్థ అధిపతి వైఖరి విమర్శలకు తావిస్తోంది.ఎవరి వల్ల ఎవరికి కష్టం? ఎవరిని శిక్షించాలి? ‘‘వస్త్రధారణ విషయంలో స్వేచ్ఛ అంటే అది కష్టాలు తెచ్చి పెట్టేదిగా ఉండకూడదు. తిండి, బట్ట విషయంలో స్వేచ్ఛ అనేది మనకు మేలు మాత్రమే చేయాలి. ఈ రెండు విషయాలలో నియమ నిబంధనలు పెట్టుకోవడం మనకే మంచిది!’’ అంటూ పెద్ద ముక్తాయింపు ఒకటి. ఇక్కడ ఎవరి వల్ల ఎవరికి కష్టం. దుస్తుల పేరుతో మహిళలపై, సెలబ్రిటీలపై ఆంబోతులపై ఎగబడుతున్నది ఎవరు అని ప్రశ్నించారు నెటిజన్లు. మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా ప్రస్తుతం శివాజీ పరిస్థితి తయారైంది అంటూ శివాజీకి మద్దతు పలకడాన్ని మహిళలు తీవ్రంగా ఖండించారు.అసందర్భ ప్రేలాపనమోరల్ పోలీసింగ్ అంటే అర్థం తెలియని వాగాడంబరం ఎలా ఉందంటే ‘‘జంక్ ఫుడ్ తింటే ఊబకాయం వస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధ పడతారు’ అని వైద్యులు చెబుతారు కదా! జంక్ ఫుడ్ తినవద్దని చెప్పడానికి మీరెవరు? అని ప్రశ్నించడం ఎంత అహేతుకంగా ఉంటుందో దుస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించడాన్ని తప్పుపట్టడం కూడా అంతే అహేతుకం. జాగ్రత్తగా ఉండాలనడం మోరల్ పోలీసింగ్ అవుతుందని విమర్శించడం ఏమిటి?’’ అంటూ రాసుకు రావడం విడ్డూరంగా నిలిచింది. అల్లు అర్జున్పై దాడి గురించి ఏమంటారో?హైదరాబాద్లో హైటెక్ సిటీలోని ప్రసిద్ధ నిలోఫర్ కేఫ్కు టీ కోసం వెళ్లిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి రాధాకృష్ణ ఏమంటారు? సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా రెచ్చిపోతున్న యువకులను సమర్ధిస్తారా?. సెల్ఫీల కోసం ఎగబడి ఒక ఆడకూతుర్ని ఇబ్బంది పెట్టిన వైనంపై ఏమంటారో?. ఏ దుస్తులు వారిని అలా ప్రొవోక్ చేశాయి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘వస్త్రధారణ స్వేచ్ఛే.. మహిళా సాధికారతా?’’ పేరుతో మగ దురహంకారంతో రాసిన రాతలు తప్ప మరొకటి కాదని రాధాకృష్ణ ఆర్టికల్పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల వస్త్రధారణపై చర్చ అంటూ అవాస్తవాలు, అవాకులు చెవాకులతో, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే విధంగా ప్రచురించిన ఈ వ్యాసంపై రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. -
భర్తపై దాడి, భార్యను వేధించి.. కొడుకును నగ్నంగా మార్చి..!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా ఓ వ్యక్తిపై దాడి చేసి, అతడి భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా.. వారి కుమారుడిని నగ్నంగా నిల్చోబెట్టి వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన జనవరి రెండో తేదీన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలోని లక్ష్మీనగర్లో రాజేష్ గార్గ్ అనే వ్యక్తి తన ఇంటి బేస్మెంట్పై జిమ్ నిర్వహిస్తున్నాడు. జిమ్ బాధ్యతను సతీష్ యాదవ్ అనే వ్యక్తి చూసుకుంటున్నాడు. అయితే, సదరు జిమ్ హక్కుల విషయంలో ఇరువురి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో రాజేష్, అతడి భార్య.. సతీష్పై ఆరోపణలు చేశారు. సతీష్ యాదవ్ తమను మోసం చేశారని, తమ ఆస్తిని స్వాధీనం చేసకున్నాడని ఆరోపించారు. దీని గురించి ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు.A youth was allegedly assaulted, stripped naked and dragged away by neighbours in Delhi’s Laxmi Nagar area. Recounting the incident, his mother, Reeta Garg, said the attack began when she and her husband were standing outside their own property. She alleged that Shubham Yadav… pic.twitter.com/w6mKdpXM3E— IndiaToday (@IndiaToday) January 5, 2026అనంతరం, విషయం పెద్దది కావడంతో సతీష్ ఆగ్రహంతో రగిలిపోయాడు. జిమ్పై తమ హక్కు గురించి ప్రశ్నించినందుకు దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో రెండో తేదీన సతీష్ యాదవ్ మరో ముగ్గురితో కలిసి వచ్చి.. రాజేష్ కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. రాజేష్పై దాడి చేసిన దుండగులు.. అతడి భార్య జుట్టుపట్టుకుని లాగి, దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఇది గమనించిన తమ కొడుకు అక్కడికి రాగా.. అతడిపై కూడా దాడి చేసి, కొంతదూరం తీసుకెళ్లి దుస్తులు విప్పించారు. వీధిలోకి లాక్కెళ్లి ఇనుప రాడుతో దాడి చేయగా, తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటనలో గార్గ్ తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు సతీష్ యాదవ్ను అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితులు వికాస్ యాదవ్, శుభం యాదవ్, ఓంకార్ యాదవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ట్రంప్ స్నేహితురాలి పోస్ట్ కలకలం.. గ్రీన్ లాండ్కు గ్రీన్ స్నిగ్నల్?
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా కొనసాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు గ్రీన్ లాండ్ భవిష్యత్తు దిశగా కదులుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ భార్య, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేటీ మిల్లర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.గ్రీన్ లాండ్ భూభాగాన్ని అమెరికా జెండాతో కప్పేసిన మ్యాప్ను షేర్ చేసిన కేటీ మిల్లర్ దానికి ‘త్వరలో’ (Soon) అనే క్యాప్షన్ను జోడించారు. వెనెజువెలాపై అమెరికా దాడుల నేపథ్యంలో, ట్రంప్ సర్కార్ తదుపరి లక్ష్యం గ్రీన్ లాండ్ భూభాగమేనన్న సంకేతాలను ఈ పోస్ట్ మరింత బలపరుస్తోంది. కాగా కేటీ మిల్లర్ పోస్ట్పై డెన్మార్క్ రాయబారి జెస్పర్ మోలర్ సోరెన్సెన్ స్పందించారు. అమెరికా, డెన్మార్క్ దేశాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి రక్షణ, స్నేహపూర్వక సంబంధాలను ఆయన గుర్తు చేశారు.గ్రీన్ లాండ్ ఇప్పటికే నాటో (నాటో)లో భాగమని, ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రత కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని జెస్పర్ మోలర్ సోరెన్సెన్ పేర్కొన్నారు. అమెరికా భద్రతలో గ్రీన్ లాండ్, డెన్మార్క్ల పాత్ర కీలకమని చెబుతూనే, ఆయన ఆ రెండు దేశాలు పరస్పరం గౌరవించుకుంటూ, మిత్రదేశాలుగా మెలగాలని సూచించారు. ఇదే సమయంలో గ్రీన్ లాండ్ ప్రీమియర్ జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు.కేటీ మిల్లర్ షేర్ చేసిన ఫొటోపై విస్మయం వ్యక్తం చేస్తూ, గ్రీన్ లాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకానికి సిద్ధంగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా సోషల్ మీడియా పోస్టులు తమ దేశ భవిష్యత్తును నిర్ణయించలేవని, అయితే ఇలాంటి చర్యలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయ చట్టాలు, పరస్పర గౌరవం ప్రాతిపదికన దేశాల మధ్య సంబంధాలు ఉండాలని ఆయన హితవు పలికారు.కాగా గ్రీన్ లాండ్ విలీనంపై జరుగుతున్న ఈ చర్చ కేవలం ఒక పోస్ట్కే పరిమితం కాలేదు. గతంలో ట్రంప్.. అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్ లాండ్ అవసరమని పేర్కొన్నారని, ఆయన ఏదైనా చెబితే, అది కచ్చితంగా చేసి చూపిస్తారని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో వ్యాఖ్యానించారు. ఏడాది క్రితం ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ గ్రీన్ లాండ్లో పర్యటించడం ‘రెక్కీ’లో భాగమేనన్న అనుమానాలను బలపరుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: వెనెజువెలా: ఇప్పుడైతే యుద్ధం.. రోజూ రాత్రి వేళ లక్ష మెరుపులు! -
ఈ పెళ్లికి యాచకులే వీఐపీలు!
పెళ్లికి బంధువులు, స్నేహితులను పిలవడం కొత్తేమీ కాదు. అయితే ఉత్తర్ప్రదేశ్లోని ఘాజిపూర్కు చెందిన సిద్దార్థ్ తన సోదరి వివాహానికి యాచకులను స్పెషల్ గెస్ట్లుగా ఆహ్వానించాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.తన సోదరి వివాహనికి హాజరైన యాచకులను సిద్దార్థ్ ఆత్మీయంగా ఆహ్వాస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. వారు విందుభోజనాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఈ వీడియో క్లిప్లో కనిపిస్తాయి.అలాంటి ఖరీదైన, రుచికరమైన భోజనాన్ని తినడం వారిలో చాలామందికి అదే మొదటిసారి.కడుపు నిండా భోజనం చేసిన యాచకులలో కొందరు సంతోషంతో నృత్యం చేశారు!వివాహానికి కొన్నిరోజుల ముందు సిదార్థ్ వివిధ ప్రాంతాలకు పనిగట్టుకుని వెళ్లి మరీ యాచకులను ఆహ్వానించాడు.‘ఈ యాచకులలో ఎంతమంది అర్ధాకలితో ఉన్నారో, ఎంతమంది కొన్నిరోజుల పాటు భోజనానికి దూరమయ్యారో. ఇలాంటి దీనులకు వరంలాంటి పెళ్లివిందు ఇది’‘అంతులేని ఆడంబరాలతో, అనవసర ఖర్చుతో మన దేశంలో వివాహ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఒక్క రోజైనా పెళ్లి విందు రూపంలో దీనుల కడుపు నింపడం అద్భుతమైన పని’‘విందు భోజనాల సమయంలో యాచకులు కనిపిస్తే విసుక్కుంటూ వారిని దూరంగా తరిమే దృశ్యాలను చాలా చూశాను. ఇలా మనసును కదిలించే దృశ్యం చూడడం ఇదే తొలిసారి’‘మానవత్వానికి అద్దం పట్టే అరుదైన వీడియో’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వెల్లువెత్తాయి. -
అసభ్య కంటెంట్ను తక్షణమే తొలగించాలి
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ సారథ్యంలోని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో మహిళల అశ్లీల చిత్రాలు ప్రచురితమవ్వడంపై కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చట్ట వ్యతిరేక, అసభ్యకర కంటెంట్ను వెంటనే తొలగించాలని ఎక్స్ను ఆదేశించింది. ముఖ్యంగా ఏఐ యాప్ గ్రోక్తో ఇలాంటి కంటెంట్ జనరేట్ చేయడం, ప్రచురించడం వెంటనే ఆపేయడంతోపాటు తీసివేయాల్సిందేనంది. లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. భారత్లో ఎక్స్ ఆపరేషన్స్ భాధ్యతలు చూసే చీఫ్ కంప్లయెన్స్ అధికారికి శుక్రవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఈ మేరకు నోటీసు పంపింది. అభ్యంతరకర కంటెంట్ను తొలగించడానికి, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించడానికి 72 గంటల గడువిస్తున్నట్లు పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2020, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు– 2021లోని నిబంధనలను పాటించడం లేదని తమ పరిశీలనలో తేలిందని అందులో పేర్కొంది. ‘చట్టాలను ఉల్లంఘిస్తూ ఇప్పటికే రూపొందించిన, ప్రచురించిన మొత్తం కంటెంట్ను తక్షణమే తొలగించాలని ఎక్స్ను ఆదేశిస్తున్నాం. అదేవిధంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారాలను ధ్వంసం చేయరాదని ఈ నెల 2వ తేదీనాటి ఉత్తర్వులో పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో ఎలాంటి నోటీసు లేకుండానే ఎక్స్పైన, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించని పక్షంలో లీగల్ ఇమ్యూనిటీ సైతం రద్దవుతుందని పేర్కొంది. యూజర్లు చేసే తప్పులకు కూడా నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎక్స్కు తెలిపింది.సోషల్ మీడియాదే బాధ్యతసామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్కు సంబంధిత వేదికలే బాధ్యత వహించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇటువంటి కంటెంట్ ప్రసారమయ్యే సామాజిక వేదికలపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ఇటీవల సిఫారసు చేసిందన్నారు. ఏఐ యాప్ గ్రోక్ అసభ్యకర దృశ్యాలను జనరేట్ చేస్తోందంటూ వస్తున్న వార్తలపై ఆయన ఈమేరకు స్పందించారు. -
విషసర్పం సౌందర్యానికి నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్
అరుదైన భారతదేశపు అత్యంత విషపూరిత సర్పం ఓ కెమెరాకు చిక్కింది. అయితే అది భయాందోళనలను కలగించడానికి బదులుగా వన్యప్రాణుల పట్ల ఆసక్తిని, ఆరాధనను పెంచేలా ఉండడం విశేషం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాస్వాన్ రాత్రి గస్తీ సమయంలో అత్యంత విషపూరితమైన బ్యాండేడ్ క్రైట్ (కట్లపాము)(Banded krait)ను చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేశారు. ఇది భారత దేశంలో అరుదుగా కనిపించే వన్యప్రాణుల వైవిధ్యభరిత వీక్షణ అవకాశాన్ని నెటిజన్స్కు అందించి, స్వల్ప వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ గా మారింది.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి కాస్వాన్ రాత్రి గస్తీ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతం గుండా వెళుతుండగా ఆయనకు ఈ పొడవైన విషసర్పం ఎదురైంది. ఫుటేజ్లో పాము ఎక్కడా దూకుడును ప్రదర్శించలేదు. ఆ చీకటిలో బ్యాండేడ్ క్రైట్ ప్రశాంతంగా కదులుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. దాని ముదురు పసుపు నలుపు చారలు స్పష్టంగా ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. కాస్వాన్ తన పోస్ట్లో స్పష్టమైన రూపాన్ని చారలను విలక్షణంగా వర్ణించారు. ఈ కట్లపాము భారతదేశంలోని అత్యంత విషపూరితమైన పాములలో (poisonous snake) ఒకటి అయినప్పటికీ, ఇది చూడడానికి కూడా అంతే అందమైన అద్భుతమైన రూపం కలిగి ఉండడాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. బురద నీటిలో ఎదురీదుతూ అది కదులుతున్నప్పుడు పాకుతున్న దాని వంటి మీది చారలు స్పష్టంగా కనిపించాయి. చుట్టుపక్కల ఉన్న గడ్డి పాము గుర్తులను మరింత హైలైట్ చేసింది. ఈ వీడియో చూసేవారిని కన్నార్పనీయకుండా చేస్తోంది. నెటిజన్ల స్పందన...ఈ వీడియోను చూసిన తర్వాత దానిపై వచ్చిన రకరకాల స్పందనలు వన్యప్రాణుల పట్ల ఆసక్తికి అద్దం పట్టాయి. చాలా మంది వీక్షకులు పాము రంగు ప్రాముఖ్యతను ఎత్తి చూపారు. వారు దీనిని అపోస్మాటిజం (తమను వేటాడే జంతువుల నుంచి రక్షించుకోవడానికి, వాటికి హెచ్చరిక సంకేతాలను అందించడం కోసం ప్రకాశవంతమైన రంగులు ఉండడం) తాలూకు క్లాసిక్ కేస్గా వివరించారు. ఈ మనుగడ వ్యూహం ప్రమాదాన్ని స్పష్టంగా సూచిస్తాయి. ఆన్లైన్లో వీక్షణకు వీలుగా స్పష్టత చాలా బాగుందని వినియోగదారులు ప్రశంసించారు. మరొక వీక్షకుడు (Viewer) ఆ చారల గుర్తులను రోడ్ డివైడర్లతో పోల్చారు. మొత్తంగా విజువల్స్ను అద్భుతమైనవిగా వర్ణించారు.Those beautiful bands. Banded krait is highly venomous snake found in India. Found this randomly during night patrolling. How nature provided them so distinct bands !! pic.twitter.com/it2s1vf8yY— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 28, 2025అటవీ అధికారుల విధి నిర్వహణపై అవగాహనవీడియో భారీ సంఖ్యలో ప్రశంసలతో పాటు అనేక అంశాలపై చర్చను రేకెత్తించింది. సౌందర్యంతో పాటు అంతకు మించి ఈ క్లిప్ అటవీ అధికారుల కఠినమైన విధులను హైలైట్ చేసింది. ప్రమాదకరమైన వన్యప్రాణుల మధ్య నిర్వహించే రాత్రి గస్తీని వీరు ఎంత సవాలుతో కూడిన పరిస్థితులలో నిర్వహిస్తారనేది కూడా వెల్లడించింది. ఈ వీడియో రాత్రిపూట జీవవైవిధ్యాన్ని (Bio Diversity) గుర్తు చేస్తుంది. వన్యప్రాణులు మానవ ప్రదేశాలకు ఎంత దగ్గరగా ఉన్నాయో కూడా ఇది చూపించింది. -
హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్
పాము తన బిడ్డలను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తింటుంది. అదే తరహాలో మనిషీ ప్రవర్తిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా.. అదీ కొత్త ఏడాది తొలిరోజునే జరిగిన రెండు ఘటనలు ‘‘అయ్యో పాపం’’ అనుకునేలా చేశాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో తల్లి పిల్లలకు విషం పెట్టగా.. ఏపీలో కన్న తండ్రి తన ముగ్గురు బిడ్డల విషయంలో అదే పని చేశాడు. ఈ రెండు ఘటనలపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఎమోషనల్ స్పందించారు.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో పిల్లలతో సహా విషపూరిత ఆహారం తల్లి, కుమార్తె మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలో కన్న తండ్రి ముగ్గురు బిడ్డలకు విషమిచ్చి.. తానూ బలవన్మరణం పొందారు. ఈ ఘటనలపై హైదరాబాద్ సీపీ సజ్జానార్ ఇవాళ (శుక్రవారం) ఎక్స్ వేదికగా స్పందించారు.నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి.. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయని, గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారని పేర్కొన్నారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసి ప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు? అని ప్రశ్నించారు. నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని ఆ చిన్నారులకు ఏం తెలుసు? అమ్మ కొంగు ఉరితాడవుతుందని ఆ అమాయకులకు ఏం ఎరుక? అని ఆవేదన చెందారు. కష్టాలు సునామీలా వచ్చినా సరే.. ఎదురీదాలే తప్ప, ఇలా పసిమొగ్గలను చిదిమేయడం పిరికితనం, పాపం, క్షమించరాని నేరం.. నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయి. గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసిప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు?నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని… pic.twitter.com/LZCLiepwxs— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 2, 2026చనిపోవడానికి ఉన్న ధైర్యం.. బ్రతకడానికి, పోరాడటానికి ఎందుకు సరిపోవడం లేదు? అని సజ్జనార్ ప్రశ్నించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు.. అది మీపై ఆధారపడిన వారికి తీరని ద్రోహం.. అని తెలిపారు. దయచేసి ఆలోచించండి.. క్షణికావేశంలో నూరేళ్ళ జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. బ్రతికి గెలవండి.. పారిపోయి ఓడిపోవద్దు.. అని ట్వీట్లో పేర్కొన్నారు. న్యూఇయర్ రెజల్యూషన్గా.. నూతన సంవత్సరాన్ని వృద్ధాశ్రమంలో తన సిబ్బందితో గడిపిన నగర కమిషనర్.. ఈ ఉదయం మరో పోస్ట్ చేశారు. నూతన సంవత్సర వేడుకల భద్రతా ఏర్పాట్లలో నిన్నటివరకు పూర్తిగా నిమగ్నమైన ఈ పోలీస్ అధికారి.. ఈ రోజు తన సంకల్పాలను ప్రజలతో పంచుకున్నారు. ఆయన మాటల్లో.. జీవితం అనేది వృత్తి బాధ్యతలు మరియు వ్యక్తిగత కర్తవ్యాల మధ్య సమతుల్యం. పోలీస్ అధికారిగా తన ప్రధాన సంకల్పం నగరాన్ని మరింత సురక్షితంగా, భద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే. ఈ ఏడాది సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు వంటి కొత్త తరహా నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, కఠినమైన అమలు చర్యలు తీసుకోవడం ప్రాధాన్యతగా ఉంటుందది. అదే సమయంలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, మానసిక ధైర్యం అత్యంత కీలకం. వారి సంక్షేమం నా ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది. ప్రజలతో నిరంతర సంబంధం కారణంగా వ్యక్తిగత సమయం తగ్గిపోతున్నా, చదువుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా వృత్తిలో సమకాలీనంగా ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపే సమయం అత్యంత ముఖ్యం. వారి సహకారం వల్లే సమాజానికి అంకితభావంతో సేవ చేయగలుగుతున్నాం. చివరగా.. శారీరక దృఢత్వం కోసం స్థిరమైన వ్యాయామ పద్ధతిని అవలంబించాలని, నిజాయితీగా చెప్పాలంటే ఈసారి జిమ్లో చేరతానంటూ ఆ పోస్ట్లో పేర్కొన్నారాయన. Having been fully engaged until yesterday with New Year security and arrangements alongside my dedicated and committed team, I felt today was the right moment to share my New Year resolutions with my extended family—you.Life, as we know, is a balance between professional… pic.twitter.com/WroFZxqDqu— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 2, 2026 -
శారీతో ఆదితి గౌతమ్ ఫుల్ గ్లామర్.. జ్ఞాపకాల్లో తేలిపోతున్న రష్మిక..!
బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ న్యూ ఇయర్ చిల్..బ్లూ డ్రెస్లో హీరోయిన్ సదా అందాలు..శారీలో హీరోయిన్ ఆదితి గౌతమ్ హోయలు..క్యూట్ బేబీతో రేణు దేశాయ్ న్యూ ఇయర్ పిక్.. గతేడాది జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రష్మిక మందన్నా.. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Sadaa Sayed (@sadaa17) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
ఆ ఊళ్లో ఏడైతే అంతే!
మీరు గుడి గంటలు విని ఉంటారు.. లేదంటే బడి గంటలు! మరి.. చదువు గంటలు! ఇవి వినాలంటే మాత్రం.. కర్ణాటకలోని బెళగావి జిల్లా హలగా గ్రామానికి వెళ్లాల్సిందే!.ఈ కాలపు పిల్లలు అందరిలో సామాన్యమైన విషయం ఒకటుంది. మీరెప్పుడైనా గుర్తించారా? అదేనండి.. పొద్దస్తమానం మొబైల్ఫోన్ పట్టుకుని ఉండటం. ‘‘ఈ పిల్లలు ఎంత చెప్పినా వినరు’’.. ‘‘చదువుకోమంటే.. రీల్స్ చూస్తూ గడిపేస్తారు’’ అని తిట్టని తల్లిదండ్రులుండరు. ఇంటికొస్తే కనీసం మాట్లాడకుండా ఆ ఫోన్ చూస్తూండటం ఏమిటని సణుక్కోని బంధువూ ఉండడు. అయినా సరే.. ఈ మొబైల్ ఫోన్ జాడ్యం పిల్లల్ని వదిలిపోనంటుంది. అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హలగా గ్రామ ప్రజలు కలిసికట్టుగా తీసుకున్న ఒక నిర్ణయం అక్కడి పిల్లల భవిష్యత్తును మార్చేస్తేంది. మంచికే లెండి!.హలగా గ్రామ జనాభా సుమారుగా 8500 మాత్రమే. చాలా కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. అయితే బయటి ప్రపంచం ప్రభావమో.. ఇంకోటో తెలియదు కానీ.. వీళ్లు కూడా మొబైల్ ఫోన్ లేదంటే టీవీలకు అతుక్కుపోయేవారు. చదువుతోపాటు వారి ఏకాగ్రత కూడా దెబ్బతింటూ వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామ పెద్దలు ఇక లాభం లేదనుకున్నారు. చెక్ పెట్టాల్సిందేనని తీర్మానం చేసుకున్నారు. పంచాయితీ పెట్టి.. గ్రామస్తులందరితోనూ చర్చించి ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.What a meaningful behavioural change! Halaga village in Belagavi practises a two-hour digital detox every evening. This can significantly enhance connections with family and friends and improve sleep quality. Such positive behavioural shifts should be encouraged during… pic.twitter.com/PrdY5HLlrc— Shreyas S P (@sp_shreyas_) December 24, 2025రోజూ రెండు గంటలు...గ్రామస్తుల నిర్ణయం గత నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం కచ్చితంగా ఏడు గంటలకు గ్రామంలో ఒక సైరన్ మోగింది. అంతే.. ముందుగా అనుకున్నట్లు పిల్లలు అందరూ అలర్ట్ అయిపోయారు. మొబైల్ఫోన్లు, టీవీలు వదిలేశారు. ఆటపాటలూ కట్టిపెట్టి బుద్ధిగా పుస్తకాలు పట్టుకున్నారు. ‘‘రెండు గంటలపాటు కచ్చితంగా చదువుకోవాలి’’ అన్న గ్రామస్తుల నిర్ణయం.. సైరన్ మోతల ప్రభావం అన్నమాట. మోడర్న్ భాషలో చెప్పాలంటే.. ఆ గ్రామస్తులు పిల్లలకు ‘డిజిటల్ డీటాక్స్’ను పరిచయం చేశారు. అప్పటి నుంచి ప్రతిరోజూ సాయంత్రం ఏడు గంటలకు సైరన్ మోగడం.. పిల్లలు చదువు బాట పట్టడం సాగిపోతోంది. ఇంకో ఆసక్తికరమైన సంగతి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్లు కూడా టీవీలు బంద్ పెట్టాలి. మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో మొదలైన ‘డిజిటల్ ఆఫ్’ ప్రయోగమే హలగాలోనూ మొదలైనట్లు వార్తా పత్రికల కథనాల ద్వారా తెలుస్తోంది.మళ్లీ మునుపటి రోజులు...టీవీ, ఫోన్లు లేని సమయాల్లో పొద్దుపోయాక గ్రామాల్లో మాటల వెలుగులు విరబూసేవి. పల్లె నడిబొడ్డున ఉండే రచ్చబండ వద్దో లేక ఇళ్ల చావిళ్లలోనో బోలెడన్ని ముచ్చట్లు గలగల పారేవి. ‘చదువు సైరన్’ మొదలైన తరువాత హలగాలోనూ ఇదే సందడి కనిపిస్తోందంటున్నారు. పిల్లల చదువులకు అంతరాయం కలక్కుండా తల్లిదండ్రులు కూడా ఫోన్, టీవీలను కట్టేస్తూండటంతో మాట్లాడుకోవడం ఎక్కువైంది. ఇది బాంధవ్యాలను మరింత పెంచేదే. పైగా స్క్రీన్టైమ్ తగ్గిపోవడంతో.. అది కూడా నిద్రకు కొంచెం ముందు కావడంతో పిల్లలు గాఢంగా నిద్రపోగలుగుతునారు. ఇది కాస్తా వారు బడుల్లో ఏకాగ్రతతో ఉండేందుకు, చురుకుగా ఆలోచించేందుకూ ఉపయోగపడుతోంది. ఈ ట్రెండ్ ఒక్క హలగాలోనే కాదు.. ప్రతి ఊళ్లోనూ కనిపించాలని కోరుకుందాం.సాక్షి.కాం తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! - గిళియారు గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ న్యూస్ ఎడిటర్. -
న్యూ ఇయర్ రెజల్యూషనా?.. ఛా అవతలికి పో!
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. సాధారణంగానే.. ఈ టైంలో ‘రెజల్యూషన్స్’ తెరపైకి రావాలి. కానీ, ఈసారి ఎందుకనో ఆ హడావిడి లేదు. ఇటు సోషల్ మీడియాలో ఆ పదం ఎక్కడో అరుదుగా కనిపిస్తోంది. ఎవరినైనా మైక్ పెట్టి కదిలిస్తే దాంతోనే కొట్టేలా కనిపిస్తున్నారు. అదే సమయంలో.. నెట్టింట వైరల్ అవుతున్న ఓ పాత వీడియో గురించి చర్చించుకుంటున్నారు. న్యూఇయర్ అనగానే కొత్తగా ‘రెజల్యూషన్స్’ షురూ అవుతాయి. అప్పుడైతే ఉత్సాహం టన్నులకొద్దీ ఉంటుంది. మంచి అలవాట్లు మొదలుపెట్టి.. పాడు పద్ధతులను పాతరేయాలనుకుంటారు. నాలుగు రోజులు గడిచాయా.. ఉత్సాహం ఉసూరుమంటుంది. నెల తిరిగేసరికల్లా ‘ఇక మనవల్ల కాదులే’ అని చేతులెత్తేస్తారు.. మోటివేషన్ సూత్రాలు ఇక్కడ ఏమాత్రం పని చేయవు. ఒకప్పుడు.. కనిపించిన దృశ్యాలివి. 1997లో శేఖర్ సుమన్ లేట్నైట్ టాక్ షో Movers and Shakers కోసం ప్రజల వద్దకు వెళ్లి వారి న్యూఇయర్ రెజల్యూషన్స్ అడిగారు. వారు నిర్మోహమాటంగా చెప్పిన సమాధానాలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. చాలామంది “స్ట్రిక్ డైట్ పాటిస్తాం” అన్నారు. ఒక యువతి “ఎక్కువ మంది బాయ్ఫ్రెండ్స్ సంపాదించుకుంటా” అని చెప్పగా, ఇంకో యువకుడు “నెలకో గర్ల్ఫ్రెండ్ మార్చేస్తా” అంటూ సరదాగా స్పందించాడు.“ఈ ఏడాదిలో అయినా జీన్స్, టీషర్ట్స్ కొనుక్కుంటా” అని ఓ యువకుడు, “ఈ ఏడాదిలోనైనా బడికి బండెడు పుస్తకాలు మోయకూడదనుకుంటున్నా” అంటూ ఓ పిలగాడు ఇచ్చిన సమాధానాలు చిరునవ్వు తెప్పించాయి. ఎలాగైనా ఖర్చులు తగ్గించుకుంటాం అంటూ చెప్పిన సమాధానాలు ఇప్పుడు చాలామందికి కనెక్ట్ అవుతున్నాయి. నిజాయితీతో కూడిన ఆ సమాధానాలు నేటి నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by The90sIndia🤩 (@the90sindia)మరి ఇప్పుడో.. గత కొన్నేళ్లుగా కొత్త ఏడాది తీర్మానాలు (Ne Year Resolutions) విషయంలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. డిజిటల్ ఎరాలో డైరీల్లో రాసుకోవడం, బొమ్మలు గీసుకుని గోడలకు తగిలించుకోవడం నామోషీ అయిపోయింది. మొదలు పెట్టిన జోష్ను పాత అలవాట్లు మింగేయడం.. బిజీ లైఫ్స్టైల్తో కొన్ని వారాలకే మరిచిపోవడం.. సాధ్యం కాని పెద్ద ప్లాన్లు పెట్టుకోవడం వాటిని మధ్యలోనే వదిలేసేలా చేస్తున్నాయి. ఆఖరికి.. ఆరోగ్యంగా ఉండాలి అనే ఆర్డినరీ రెజల్యూషన్ను కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు మీ న్యూఇయర్ రెజల్యూషన్స్ ఏది? అని అడిగితే.. ఛా అవతలికి పో అనే సమాధానం ఎక్కువగా వినిపించదంటారా? ఆరోజుల్లో.. సాధారణంగా వినిపించిన రెజల్యూషన్స్బరువు తగ్గాలిజిమ్కి క్రమం తప్పకుండా వెళ్లాలిడైట్ పాటించాలి (స్ట్రిక్ డైట్ చాలా పాపులర్)పొగ తాగడం మానేయాలిచదువు & కెరీర్పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలికొత్త స్కిల్ నేర్చుకోవాలిఉద్యోగంలో కష్టపడి ప్రమోషన్ పొందాలిమంచి స్నేహితులు సంపాదించుకోవాలిసరైన బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్ సంపాదించుకోవాలికుటుంబంతో ఎక్కువ సమయం గడపాలిఖర్చు తగ్గించుకోవాలిపొదుపు చేయాలిఅప్పులు తీర్చేయాలిమద్యం తగ్గించుకోవాలికొత్త పుస్తకాలు చదవాలికొత్త ప్రదేశాలు చూడాలికొత్త హాబీ మొదలుపెట్టాలి (ఫోటోగ్రఫీ, మ్యూజిక్ వంటివి)ఆరోజుల్లో.. రెజల్యూషన్స్ ఎక్కువగా వ్యక్తిగత ఆరోగ్యం, చదువు, సంబంధాలు, డబ్బు చుట్టూ తిరిగేవి. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం వల్ల ప్రజలు తమ రెజల్యూషన్స్ను నేరుగా చెప్పేవారు, టీవీ షోలు, పత్రికలు, డైరీల్లో రాసుకునేవారు. సోషల్ మీడియా వాడకం పెరిగాక.. పోస్టులు కూడా చేసి చాటి చెప్పుకునేవారు. మరి ఇప్పుడో.. ఈ డిజిటల్ యుగంలో ప్రైవేట్గా ఉంచుకోవడమో లేదంటే అసలు పెట్టుకోవడమే బెస్ట్గా ఫీలవుతున్నారు. -
15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!
సోషల్ మీడియాతో ప్రయోజనాలే కాదు.. అనర్థాలూ పొంచి ఉన్నాయి. ఆ ప్లాట్ఫారమ్లలో అసభ్యకరమైన కంటెంట్ను చూడటం, వేధింపులకు గురికావడంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాన్ని పలు దేశాలు ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నాయి..నిన్న డిసెంబర్లో ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. అయితే.. ఇప్పుడు మరో దేశం ఇప్పుడు ఈ రూట్నే ఎంచుకుంది. 15 ఏళ్లలోపు వాడకుండా త్వరలో ఫ్రాన్స్ ఓ చట్టం చేయబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను(డ్రాఫ్ట్)ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.పిల్లలను డిజిటల్ స్క్రీన్ల దుష్ప్రభావాల నుండి రక్షించడమే ఈ చట్టం తీసుకురావడం వెనుక ఉద్దేశమని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ చెబుతున్నారు. ప్రతిపాదనల్లో.. 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించడం, అలాగే సెకండరీ స్కూల్స్లో మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం ఉన్నాయని తెలిపారాయన. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే..పిల్లలను స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లకు దూరం చేయాలనే ఫ్రాన్స్ ప్రయత్నం కొత్తేం కాదు. 2018లో ప్రీ-స్కూల్, మిడిల్ స్కూల్లలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఆదేశాలు తీసుకొచ్చింది. అయితే ఆ సమయంలో అది కఠినంగా అమలు కాలేదు. అయితే 2023లో ఇదే రూల్కు ఓ చిక్కు వచ్చిపడింది. “డిజిటల్ లీగల్ ఏజ్” కింద ఫోన్ వాడాలంటే 15 ఏళ్లుగా ఈయూ రూల్ తెచ్చింది. దీంతో ఫ్రాన్స్లో ఆ ఆదేశాలను తేలికగా తీసుకున్నారు.అయితే.. పిల్లలకు డిజిటల్ రక్షణను ప్రాధాన్యంగా తీసుకుని ఫ్రాన్స్ ఈసారి మరో రూట్లో వస్తోంది. నేరుగా నిషేధం అని చెప్పకుండా.. సోషల్ మీడియా, మొబైల్ వినియోగంపై కఠిన నియంత్రణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. సెనేట్ ప్రతిపాదనలో 13 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు నేషనల్ అసెంబ్లీ ఆమోద ముద్ర పడాల్సి ఉంది.ఇంటర్నెట్లో యథేచ్ఛగా అశ్లీల చిత్రాలు లభిస్తున్నాయి. వీటిని ఎవరైనా చూసే వీలుంది. ఇవి చిన్నారుల జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాయనే వాదనతో ఏకీభవిస్తున్నాం. ఇలా ఎవరిపడితే వారు అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడకుండా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే అవసరం ప్రభుత్వాలపై ఉంది. అలాగే, ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం అంశాన్ని పరిశీలించాలి. అప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బాలల హక్కుల కమిషన్ దీనిపై అవగాహన కల్పించే బాధ్యతను తీసుకోవాలి..::మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తాజా వ్యాఖ్యలుఇప్పటిదాకా .. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా నియంత్రిస్తున్నాయి. ఆస్ట్రేలియా పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఈ స్ఫూర్తితో.. యూరోపియన్ యూనియన్ అంశాన్ని పరిశీలిస్తోంది. మరి కొన్ని దేశాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. సోషల్ మీడియా వాడకంపై వయస్సు పరిమితులు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ధోరణిగా మారుతోందన్నమాట. -
గోవాలో చిల్ అవుతున్న సారా.. చేతిలో బీర్ బాటిల్..
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) ప్రస్తుతం గోవా వెకేషన్లో ఉన్నారు. గోవా ట్రిప్లో సారా.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.గోవాలో పబ్లిక్గా బీరు బాటిల్తో సారా కనిపించడం విమర్శలకు దారి తీసింది. సోషల్ మీడియాలో వీడియో ప్రకారం.. సారా టెండుల్కర్ తన ఫ్రెండ్స్తో గోవా వీధుల్లో వెళ్తున్నారు అటుగా వెళ్తున్న ఓ బైకర్.. వారికి వీడియో తీశారు. అయితే, ఆ సమయంలో సారా చేతుల్లో బీర్ బాటిల్ ఉండటం గమనార్హం. దీంతో సారా టెండూల్కర్ బీర్ తాగుతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. తండ్రి ఆదర్శాలకు విరుద్ధంగా కూతురి ప్రవర్తన ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం సారాకు మద్దతు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ కాలంలో మందు తాగడం చాలా కామన్ గురూ అని కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం.. ఎంజాయ్ చేయాలి బ్రో అంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఇక మరి కొంతమంది తాగడం అవసరమా అని నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. అయితే, సచిన్ మాత్రం ‘తాను ఎప్పుడూ మద్యం, పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయనని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. Sachin Tendulkar : I will never promote alcohol and tobacco.Le his daughter Sara on streets of Goa with 🥲: pic.twitter.com/QDeQ8YGMoW— Career247Official (@Career247Offici) December 31, 2025ఇక, సారా టెండుల్కర్ హీరోయిన్కు మించిన అందం అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. ఆమె నిత్యం ఏదో ఒక ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.Sara Tendulkar chilling with a budwiser in Goa.#ShubmanGill #SaraTendulkar pic.twitter.com/QL8sATkFS2— AuraFarmer (@TheCricPundit) December 31, 2025 Sara Tendulkar isn’t going viral today because she is someone’s daughter,but because her simplicity, confidence, and grace truly resonate with people.There is a lot of noise on social media,but what is natural is what really reaches the heart. pic.twitter.com/AFW4C86RlY— Shalini Singh (@Bahujan_Era) December 24, 2025 -
సోషల్ మీడియాలో ‘ఫైనల్ ఇమేజ్- 2025’ హంగామా
ఈ రోజు(డిసెంబర్ 31, బుధవారం)తో 2025 ముగియబోతోంది. దీంతో ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో, సోషల్ మీడియా వేదికలలో కొత్త ఉత్సాహం పెల్లుబుకుతోంది. ప్రతి ఏటా జనవరి ఒకటిన శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి నెటిజన్లు ఒక వినూత్నమైన ట్రెండ్ను తెరపైకి తెచ్చారు. అదే ‘ఫైనల్ ఇమేజ్ ఆఫ్ 2025’ (2025 చివరి చిత్రం). పాత జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ, ఈ ఏడాదిలో తాము దిగిన ఆఖరి ఫోటోను షేర్ చేస్తూ, నెటిజన్లు సందడి చేస్తున్నారు.ఈ వైరల్ ట్రెండ్ ప్రధానంగా ‘ఎక్స్’, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర ప్లాట్ఫారమ్లలో విరివిగా కనిపిస్తోంది. యూజర్స్ తమ వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ సభ్యులతో దిగిన చిత్రాలు లేదా ప్రకృతి దృశ్యాలను ‘My Final Image of 2025’ అనే క్యాప్షన్తో పోస్ట్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు ఈ ట్రెండ్లో భాగస్వాములవుతున్నారు. గడిచిన ఏడాదిలో తాము సాధించిన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకుంటూ ఈ ఫోటోలను షేర్ చేయడం విశేషం.ఈ ట్రెండ్ కేవలం ఫోటోల షేరింగ్కే పరిమితం కాలేదు. ఇది నెటిజన్లలో ఒక రకమైన భావోద్వేగ అనుబంధాన్ని పెంచుతోంది. ఒక వైపు ఈ ఏడాది ముగిసిపోతున్నదనే బాధ, మరోవైపు కొత్త ఏడాదిపై ఉన్న ఆశలు.. ఈ పోస్ట్లలో ప్రతిబింబిస్తున్నాయి. లక్షలాది మంది ఈ ట్రెండ్ను అనుసరించడంతో సోషల్ మీడియా సర్వర్లు బిజీగా మారాయి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, భవిష్యత్తుపై సానుకూల దృక్పథాన్ని నింపడంలో ఈ చిన్న ప్రయత్నం పెద్ద ప్రభావాన్నే చూపుతోంది.ఇలాంటి ట్రెండ్స్ సోషల్ మీడియాలో సరదాను నింపుతున్నప్పటికీ, వ్యక్తిగత గోప్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోటోలను షేర్ చేసేటప్పుడు లొకేషన్ వివరాలు లేదా సున్నితమైన సమాచారం బయటపడకుండా చూసుకోవడం ముఖ్యం. ఏదిఏమైనప్పటికీ 2026 నూతన సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమైంది.ఇది కూడా చదవండి: ఎయిర్వేస్లో జాత్యహంకారం? .. ప్రయాణికురాలి మండిపాటు -
2025 చివరి సూర్యోదయం చూశారా?
మరికొద్ది గంటల్లో.. 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం ఉత్సాహంతో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో.. చివరి సూర్యోదయం వీక్షించేందుకు తమిళనాడు కన్యాకుమారి సముద్ర తీరానికి జనం పోటెత్తారు. ప్రతిసారిలాగే.. ఈ ఏడాది చివరి రోజు ఉదయం ప్రముఖ పర్యాటక కేంద్రం కన్యాకుమారి సందర్శకులు, భక్తులతో కిక్కిరిసిపోయింది. తిరువల్లువర్ విగ్రహం, వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల నుంచి సూర్యోదయాన్ని వేలమంది వీక్షించారు. నారింజ రంగులో ఆకాశంలో కనిపించిన ఆ సుందర దృశ్యాలను కెమెరాలు, మొబైల్ ఫోన్లలో బంధించారు. 2025ன் கடைசி சன்ரைஸ்.. குமரியில் கண்டு ரசித்த சுற்றுலா பயணிகள் #kanyakumari #sunrise #newyear2026 #sun pic.twitter.com/f7U5H4FzpI— Thanthi TV (@ThanthiTV) December 31, 2025ప్రత్యేకం ఎందుకంటే.. కన్యాకుమారి భారతదేశ దక్షిణ అంచున ఉంది. ఇక్కడి సూర్యోదయం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం చివరి రోజు, కొత్త సంవత్సరం మొదటి రోజు ఇక్కడి సూర్యోదయాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు, పర్యాటకులు చేరుతారు. అందుకు కారణం.. అరేబియా సముద్రం, బెంగాల్ ఖాతం, భారత మహాసముద్రం కలిసే అరుదైన ప్రదేశం కాబట్టి. ఈ సంగమం వద్ద సూర్యోదయం చూడటం ఒక ప్రత్యేక అనుభవం. అలాగే సూర్యాస్తమయం కూడా. దేశంలో చాలా అరుదుగా ఒకే ప్రదేశంలో సముద్రంపై సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ వీక్షించగల అవకాశం ఇక్కడ ఉంది. అయితే అరుదైన ప్రదేశాల్లో ఒకటిగానే కాకుండా.. ఆధ్యాత్మిక ధోరణిలోనూ ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. సూర్యోదయాన్ని దైవానుభూతిగా భావించే భక్తులు.. సంవత్సరాంతం, ఏడాది తొలిరోజు.. పండుగల సమయంలో ప్రత్యేకంగా సముద్ర స్నానాలు చేస్తారు. సుందర దృశ్యాలు.. ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు ఆకాశంలో నారింజ, బంగారు, ఎరుపు రంగులతో కాంతులు కనిపిస్తాయి. సముద్రపు అలలపై ఆ ప్రతిబింబం పడటంతో ఆ దృశ్యాన్ని మరింత అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే నిత్యం ఆ సుందర దృశ్యాలను వీక్షించేందుక పనిగట్టుకుని పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. -
మంచంపై పులిరాజా.. ఓ చేదు నిజం!
గ్రామంలోకి చొరబడిన ఓ పెద్దపులి.. జనాలను బెంబేలెత్తించింది. ఓ వ్యక్తిపై దాడి చేశాక.. ఆరుబయట ఉన్న మంచంపై తీరికగా సేద తీరింది. ఆ దృశ్యాన్ని కొందరు ఫోన్లలో బంధించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటన వెనుక ఉన్న చేదు నిజం గురించి చర్చ మాత్రం జరగడం లేదన్న అభిప్రాయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్ బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్(Bandhavgarh Tiger Reserve) ప్రాంతంలో గ్రామంలోకి చొరబడింది. అక్కడ ఆరుబయట సంచరిస్తుండగా దానిపై రాళ్లతో దాడి చేశారు. భయంభయంగానే అది దాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అది అక్కడే కట్టేసిన ఉన్న పశువుల జోలికి పోలేదు(గ్రామస్తులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు). అయితే రాళ్లు తగిలిన కోపంతో.. ఓ గ్రామస్తుడ్ని నేలకేసి కొట్టింది. ఆపై మరో ఇంట్లోకి వెళ్లి కొన్ని గంటలపాటు మంచంపై కూర్చుని సేదదీరింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సుమారు 8 గంటలపాటు శ్రమించి పులిని బంధించారు. పులి బోనులోకి చేరడంతో పాటు గాయపడిన వ్యక్తికి కూడా ప్రాణాపాయం తప్పడంతో.. ఆ ఊరి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. आज मैं गाँव में पंचायत लगाकर सभी की सुनवाई करूँगा, क्यूँ मेरा जीना हराम कर रहे हो, मेरे जंगल में कब्ज़ा कर, मेरा इलाका ख़त्म करके ..??#MadhyaPradesh #bandhavgarh #umaria #tiger #viral #highlight pic.twitter.com/0rG8TAvwnk— DEEPAK YADAV (@YadavDeepakya22) December 29, 2025అయితే.. వేటగాళ్లకు భయపడే పులులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఆ ఊరి ప్రజలు చెబుతుండడం ఇక్కడ చర్చించాల్సిన విషయం. టైగర్ స్టేట్గా పేరొందిన మధ్యప్రదేశ్లో పెద్దపులుల మరణాల లెక్కలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా.. సగర్ జిల్లాలోని ధానా ఫారెస్ట్ రేంజ్లో 10 ఏళ్ల ఆడ పులి మృతదేహం దొరికింది. గత వారం రోజుల్లో రాష్ట్రంలో ఆరు పులులు మృత్యువాత పడగా.. ఈ ఒక్క ఏడాదిలోనే 55 పులులు మరణించడం గమనార్హం. बांधवगढ़ टाइगर रिजर्व में बाघ पर पत्थर बरसाएHuman-wildlife conflict management in Madhya Pradesh collapses 😔🐯 #tiger @CMMadhyaPradesh @PMOIndia @ntca_india @moefcc pic.twitter.com/OfWAFDo5zg— Ajay Dubey (@Ajaydubey9) December 29, 20251973లో మధ్యప్రదేశ్లో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పులులు అత్యధికంగా చనిపోయింది ఈ ఏడాదిలోనే. అందునా అసహజ మరణాలే 11 నమోదు అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే.. అటవీ శాఖ వీటిని ఎక్కువగా పులుల మధ్య గొడవలుగా పేర్కొంటున్నాయి. కానీ, క్షేత్ర పరిస్థితులు అవి కావనే చెబుతున్నాయి. వేట, కరెంట్ ఉచ్చులు.. పర్యవేక్షణ లోపాలు, నిర్లక్ష్యం ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా సంస్థ బయటపెట్టిన అటవీ శాఖ నివేదికలో.. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం, సరైన ఫోరెన్సిక్ పరిశీలన లేకపోవడం బయటపడ్డాయి. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఉన్న వన్యప్రాణి అక్రమ రవాణా నెట్వర్క్ ప్రధాన సూత్రధారి యాంగ్చెన్ లఖుంపా ఇటీవలె సిక్కిం బార్డర్లో అరెస్టు అయ్యాడు. మధ్యప్రదేశ్లో పులులను చంపి.. వాటి చర్మం, గోళ్లు పళ్లు.. అక్రమ రవాణా చేసిన అభియోగాలు అతనిపై ఉన్నాయి. సంరక్షణవాదులు(Conservationists) వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని, సంస్కరణలు లేకపోతే మరణాలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు. మద్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం.. ప్రతి పులి మరణాన్ని సీరియస్గా తీసుకుంటామని, నిపుణుల బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని ఒక్క మాటతో తేల్చేస్తోంది. -
అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)
-
సోషల్ మీడియా వినియోగం.. ఇండియన్ ఆర్మీ కొత్త రూల్స్!
భారత సైన్యం.. తమ సిబ్బందికి సోషల్ మీడియా వినియోగంపై ఉన్న నిబంధనలను పాక్షికంగా సవరించింది. గతంలో ఉన్న కఠినమైన నిషేధాలను సడలిస్తూ, ఎంపిక చేసిన కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో నిష్క్రియాత్మక భాగస్వామ్యాన్ని(Passive Participation) అనుమతిస్తూ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (డీజీఎంఐ) రూపొందించిన ఈ నూతన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.ఏమిటీ నిష్క్రియాత్మక భాగస్వామ్యం?కొత్త విధానం ప్రకారం.. సైనిక సిబ్బంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్ఫామ్లను సమాచారం తెలుసుకోవడానికి లేదా కంటెంట్ను చూడటానికి మాత్రమే ఉపయోగించవచ్చు. అయితే.. ఈ ప్లాట్ఫామ్లలో ఎటువంటి యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉండకూడదు. అంటే..➤పోస్ట్లు పెట్టడం, ఫొటోలు అప్లోడ్ చేయడం చేయకూడదు.➤ఇతరుల పోస్టులపై వ్యాఖ్యానించడం (Commenting) నిషేధం.➤లైక్ చేయడం, షేర్ చేయడం లేదా పోస్టులకు రియాక్ట్ అవ్వడం వంటివి చేయకూడదు.➤డైరెక్ట్ మెసేజ్లు పంపడంపై కూడా నిషేధం కొనసాగుతుంది.ఇన్స్టాగ్రామ్కు అధికారిక అనుమతిఈ అప్డేట్లో భాగంగా ఇన్స్టాగ్రామ్ను అధికారికంగా.. ‘పరిమిత వినియోగ’ సోషల్ మీడియా జాబితాలో చేర్చారు. కేవలం నిఘా, సమాచార సేకరణ ప్రయోజనాల కోసం మాత్రమే దీన్ని వాడాలని, వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి వీల్లేదని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లువాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్కైప్ యాప్లను సాధారణ స్థాయి సమాచార మార్పిడికి ఉపయోగించవచ్చు. అయితే, గ్రహీత ఎవరో కచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే కమ్యూనికేట్ చేయాలి. దీనికి పూర్తి బాధ్యత సదరు సిబ్బందిదే. లింక్డ్ఇన్ వృత్తిపరమైన అవసరాల కోసం, అంటే రెజ్యూమ్లు అప్లోడ్ చేయడం లేదా ఉద్యోగ సమాచారం కోరడం వంటి పనులకు మాత్రమే దీన్ని అనుమతిస్తారు. యూట్యూబ్, కోరా(YouTube, Quora) వీటిని కేవలం జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మాత్రమే వాడాలి.కఠినమైన హెచ్చరికలుసౌలభ్యాలను కల్పిస్తూనే సైన్యం కొన్ని అంశాలపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. క్రాక్డ్ సాఫ్ట్వేర్లు, ఉచిత మూవీ పోర్టల్స్, టొరెంట్, వెబ్ ప్రాక్సీలు, వీపీఎన్ సర్వీలకు వాడకూడదు. చాట్ రూమ్లు, ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్ల జోలికి వెళ్లవద్దని సూచించింది. క్లౌడ్ ఆధారిత డేటా సేవల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.2020లో 89 యాప్లపై నిషేధంజులై 2020లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, సైబర్ భద్రతా ముప్పుల నేపథ్యంలో.. భారత సైన్యం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా 89 యాప్లను తక్షణమే తొలగించాలని తన సిబ్బందిని ఆదేశించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 59 చైనా యాప్లు కూడా ఉన్నాయి. తాజా సవరణలు సైనిక భద్రతను కాపాడుతూనే మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా సిబ్బందికి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. -
2025లో 'వైరల్' వయ్యారి వీళ్లే..
ఈ ఏడాది బాగా క్లిక్కయిన సాంగ్స్లో వైరల్ వయ్యారి ఒకటి. యంగ్ హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు.. పాట రిథమ్.. అన్నీ సరిగ్గా సెట్టయ్యాయి. అందుకే ఆ పాట అంత వైరల్ అయింది. ఈ సాంగ్లో.. ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోయింగు చూశావంటే మైండ్ బ్లోయింగు.. ఫాలోవర్స్ అందరికీ నేనే డార్లింగు నేనేమీ చేసినా ఫుల్లు ట్రెండింగు అన్న లిరిక్స్ ఉంటాయి. అన్నట్లుగానే కొందరు పూసలమ్ముకుని ఫేమస్ అయితే మరికొందరు సెలబ్రిటీలతో లవ్లో పడి వైరల్ అయ్యారు. అలా ఈ ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళలెవరో చూసేద్దాం..మోనాలిసామోనాలిసా.. మొన్నటివరకు పూసలమ్ముకునే అమ్మాయి. కానీ ఇప్పుడు సినిమా హీరోయిన్. మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా.. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో పూసల దండలు అమ్ముకునేందుకు వెళ్లింది. కానీ తన తేనెకళ్లతో అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోకి ఎక్కింది. ఇంకేముంది రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. ఒక సాంగ్లో నటించడంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో హీరోయిన్గా సినిమాలు చేస్తోంది.ఆర్యప్రియ భుయన్కేవలం ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో వైరల్ అయిపోయింది ఆర్యప్రియ భుయన్. ఈ ఏడాది ఏప్రిల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్కు అందరిలాగే ఆర్యప్రియ కూడా హాజరైంది. మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ అయినప్పుడు ఆమె కోపంతో ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కెమెరామన్ దాన్ని క్యాప్చర్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇట్టే జరిగిపోయింది. అలా ఒక్క వీడియోతో ఓవర్నైట్ స్టార్ అయింది.గౌరీ స్ప్రాట్బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇదివరకే రెండు పెళ్లిళ్లవగా.. ఇద్దరు భార్యలకు విడాకులిచ్చేశాడు. మూడో పెళ్లి ఆలోచన లేదంటూనే ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆవిడే గౌరీ స్ప్రాట్. ముంబైలో ఓ సెలూన్ నడుపుతూ ప్రైవేట్ లైఫ్ గడుపుతున్న గౌరీ.. ఆమిర్తో ప్రేమ వ్యవహారం వల్ల సెన్సేషన్గా మారింది.అలీషా ఓరీఈమె కూడా ఐపీఎల్ మ్యాచ్ ద్వారా క్లిక్ అయిన బ్యూటీనే! అలీషా కేకేఆర్ (కోల్కతా నైట్ రైడర్స్) అభిమాని. వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోతో కలిసి అలీషా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఎవరీ మిస్టరీ గర్ల్ అని నెటిజన్లు తెగ వెతికేసి తనను వైరల్ చేశారు. అలీషా మోడల్, మేకప్ ఆర్టిస్ట్. తను 2021లో మిసెస్ ఇండియా లీగసీ టైటిల్ గెల్చుకుంది. 2023లో జరిగిన మిసెస్ యూనివర్స్ 2022 పోటీల్లో మిసెస్ పాపులర్ 2022 టైటిల్ అందుకుంది. Alisshaa Ohri 'Eid ka Chand' girl with DJ Bravo was unexpected but exciting to see pic.twitter.com/QN98UJMURO— Kashish (@kaha_jaa_rhe) April 9, 2025 మహికా శర్మక్రికెటర్ హార్దిక్ పాండ్యా 2024లో భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మహికా శర్మ అనే మోడల్తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బోలెడున్నాయి. అలా క్రికెటర్తో ప్రేమ కారణంగా మహికా ఒక్కసారిగా వైరల్ అయింది.చదవండి: 'విగ్ కావాలా? ధురంధర్ నటుడికి పొగరు తలకెక్కింది' -
ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది!
ఆఫీస్ అయ్యాక మెట్రో రైలులో ఆ యువతి తాను ఉంటున్న ప్లేస్కు బయల్దేరింది. రద్దీలో ఎలాగోలా సీటు సంపాదించుకుని ఇద్దరు మగాళ్ల మధ్య కూర్చోగలిగింది. ఈలోపు.. తన పక్కన కూర్చన్న వ్యక్తి దిగిపోయి.. మరొకతను ఎక్కాడు. నెమ్మదిగా అతనిలోని కామోన్మాది బయటపడ్డాడు. ఒక్క నిమిషం ఆమెకు గుండె ఆగినంత పనైంది. అయితే ఆ వెంటనే ధైర్యం తెచ్చుకున్న యువతి ఆ మృగాడి చెంపలు చెడామడా వాయించింది.డిసెంబర్ 23 సాయంత్రం నమ్మా మెట్రో(బెంగళూరు) ప్రయాణిస్తున్న ఒక యువతి, తనకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘నా ప్రయాణం అప్పటిదాకా సాఫీగా సాగింది. మధ్యలో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దిగిపోవడంతో, మరో వ్యక్తి వచ్చి పక్కన కూర్చున్నాడు. నా మీద పడడం, శరీర భాగాలకు తాకడంతో ఇబ్బంది పడ్డా. అయితే రద్దీ కాబట్టి యాదృచ్ఛికమని భావించా. ఈలోపు.. అతని తీరు మారింది. కావాలనే చేస్తున్నాడని అర్థమైంది. ఇదేమిటన్నట్లు చూస్తే వెకిలినవ్వులు నవ్వాడు. ఇంతలో.. నేను దిగాల్సిన స్టేజ్ వచ్చింది. అతను మరికొందరిని కూడా ఇలాగే వేధించే అవకాశం ఉందని భావించా. అతని చెంప పగలకొట్టి లేవమన్నా. స్టేషన్ బయటకు వచ్చాక మరోసారి చెంప పగలకొట్టా. కెంపగౌడ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ సిబ్బంది అది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు సర్దుకుపోవాల్సిన అవసరం ఏ అమ్మాయికీ లేదు’’ అంటూ ఆమె వీడియో ఉంచింది. ఈ ఘటనపై ఆ యువతి ఉప్పారపేట పీఎస్లో ఫిర్యాదు చేసింది. అతని పేరు ముత్తప్ప (48) అని తెలిసింది. తర్వాత తప్పయిపోయిందంటూ అతడు యువతి పాదాలపై పడి క్షమాపణలు చెప్పాడు. యువతి అంగీకరించడంతో అతనిని మందలించి పంపించివేశారు. లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్న యువతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. Namma Metro Harassment Case | ನಮ್ಮ ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಕಾಮುಕ ಅಂಕಲ್ ಕಾಟ | Bengaluru....#NammaMetro #MetroHarassment #BengaluruNews #WomenSafety #MajesticMetro #PublicSafety #HarassmentCase #bengaluru pic.twitter.com/YaNsNgACW4— Sanjevani News (@sanjevaniNews) December 26, 2025 -
‘హెచ్–1బీ’ కష్టాలపై అమెరికాతో చర్చిస్తాం
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా ఇంటర్వ్యూలు హఠాత్తుగా వాయిదా పడడం, తద్వారా అమెరికా ప్రయాణాలు ఆగిపోవడం పట్ల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలు నాలుగైదు నెలలపాటు వాయిదా పడ్డాయి. వేలాది మంది భారతీయుల ఇబ్బందులకు గురవుతున్నారు. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ను, వారు చేసిన పోస్టులను నిశితంగా పరిశీలించడానికి వీలుగా ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత వారం జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మే నెల దాకా వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి ఈ–మెయిల్ సందేశాలు రావడం గమనార్హం. దాంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం స్పందించారు. దరఖాస్తుదారుల కష్టాలను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా సంప్రదింపులు జరుపుతామని వివరించారు. వీసా దరఖాస్తుదారుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అందుతున్నాయని తెలిపారు. ఇంటర్వ్యూల విషయంలో ఆలస్యాన్ని భారీగా తగ్గించాలన్నదే తమ ప్రయత్నమని వెల్లడించారు. ఇబ్బందులకు త్వరలోనే తెరపడుతుందని రణ«దీర్ జైస్వాల్ ఆశాభావం వ్యక్తంచేశారు. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి హెచ్–1బీ వీసాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. మొదట మూడేళ్ల కాలానికి ఈ వీసా జారీ చేస్తారు. తర్వాత మరో మూడేళ్లు పొడిగిస్తారు. హెచ్–1బీ వీసాలు స్వీకరించినవారిలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉంటున్నారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంబంధిత ఉత్తర్వుపై సంతకం చేశారు. రాబోయే రోజుల్లో ఈ వీసాలు పొందడం కష్టతరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఇదెక్కడి హిపోక్రసీ?.. గాజా కోసం కన్నీళ్లా!.. మరి బంగ్లా ఘటనలపై..
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో.. బంగ్లాదేశ్ శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ మైనారిటీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. దీపూ చంద్ర దాస్ ఉదంతం మరవకముందే మరో హిందూ వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ పరిణామాలపై సినీ ప్రముఖులు స్పందించడం మొదలుపెట్టారు.గాజాలో జరిగిన పరిణామాలను అయ్యో.. పాపం అనుకున్న భారతీయులు, పొరుగు దేశం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా మౌనం వీడాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మూక దాడులను.. హత్యలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. దీపు దాస్ ఉదంతానని ఘోరమని.. అమానవీయమని పేర్కొంటున్నారు. హిందువులు ఇకనైనా మేల్కొనాలంటూ పిలుపు ఇస్తున్నారు.మౌనం ప్రమాదకరంయువ నటి జాన్వీ కపూర్ తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలు అమానుషమైనవి.. క్రూరమైనవి. ఇలాంటి ఘటనల పునరావృతం కావడం దారుణం. దీపు చంద్ర దాస్ను ప్రజల మధ్యలోనే అమానుషంగా లించ్ చేసిన ఘటన గురించి చదవాలని, వీడియోలు చూడాలని, ఘటనపై నిలదీయాలి. మనం ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాలపై కన్నీళ్లు కారుస్తూ, మన సొంత సోదరులు, సోదరీమణులు ఇక్కడే కాల్చి చంపబడుతున్నప్పుడు మౌనం వహించడం ప్రమాదకరమని అన్నారు. ఇంతటి దారుణం జరిగినప్పటికీ మనలో ఆగ్రహం రాకపోతే.. అదే ద్వంద్వ వైఖరి (hypocrisy) మనల్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు.హిందువులారా మేల్కొండి..హీరోయిన్ కాజల్ అగర్వాల్ మొన్నీమధ్యే ఈ పరిణామాలపై ఓ పోస్ట్ చేశారు. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అంటూ పోస్టర్ సోషల్ మీడియాలో ఉంచారు. అక్కడి మత అతివాదం వల్ల హిందువులు భయాందోళనలో బతుకుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులారా ఇకనైనా మేల్కొండి.. మౌనం మిమ్మల్ని రక్షించదు అంటూ పిలుపు ఇచ్చారామె. అందుకే ప్రశ్నిస్తున్నా..సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద సైతం ఈ ఘటనలపై స్పందించారు. జరుగుతున్న పరిణామాలతో తన హృదయం ద్రవించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారామె. భావోద్వేగాల్ని నియంత్రించుకుని తాను మాట్లాడుతున్నానని.. మూకహత్యలు హిందు మతంపై జరుగుతున్న దాడేనని.. అందుకే మౌనంగా ఉండలేక ప్రశ్నిస్తున్నానని ఓ వీడియో మెసేజ్లో అన్నారామె.హెరా ఫెరీ నటుడు మనోజ్ జోషి.. గాజా, పాలస్తీనా కోసం ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చారని, అలాంటిది పక్క దేశంలో అదీ హిందువులపై దాడులు జరుగుతుంటే ఎవరూ సోసల్ మీడియాలోనైనా ముందుకు రారా? అని ప్రశ్నించారు. ఇది చాలా దురదృష్టకరమని.. దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారాయన.సింగర్ టోనీ కక్కర్ తన కొత్త ఆల్బమ్ చార్ లోగ్(ఆ నలుగురు)లో.. దీపు దాస్ హత్యోదంతాన్ని ప్రస్తావించాడు. మనుషులు ఇకనైనా మత వివక్షను విడిచిపెట్టాలని, మానవత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చాడు.ఇటీవల మయమన్సింగ్ జిల్లాలో దీపూ చంద్ర దాస్ అనే యువకుడు మూక దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మత వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో.. కొందరు అతనిపై దాడి చేసి హత్య చేసి.. అనంతరం నగ్నంగా చెట్టకు వేలాడదీసి కాల్చేశారు. ఆపై సగం కాలిన ఆ మృతదేహాన్ని రోడ్డు మీద పడేసి పోయారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో యూనస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇది మరువక ముందే..బుధవారం రాత్రి రాజ్బర్ జిల్లా పంగ్షా సర్కిల్లో మరో ఘటన చోటుచేసుకుంది. అమృత్ మొండల్ (29) అలియాస్ సామ్రాట్ అనే హిందూ యువకుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. అయితే ఇది మత కోణంలో జరిగిన దారుణం కాదని.. అతనొక గ్యాంగ్స్టర్ అని, డబ్బు వసూళ్లకు పాల్పడడంతో గ్రామస్థులు అతడిపై దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. అయితే.. దీపూ చంద్రదాస్పై దాడి తర్వాత ఓ మైనారిటీ వ్యక్తిపై మూకదాడి జరగడం ఈ ఘటనపై అనుమానాలకు తావిస్తోంది. -
ప్రియా ప్రకాశ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. మీరా జాస్మీన్ ఫెస్టివ్ వైబ్స్..!
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ప్రియా ప్రకాశ్..ఉదయ్పూర్ కోటలో బాలీవుడ్ భామ మౌనీ రాయ్..హీరోయిన్ మెహరీన్ క్రిస్మస్ లుక్స్..క్రిస్మస్ సెలబ్రేషన్స్లో బాలీవుడ్ నటి రవీనా టాండన్..ఫెస్టివల్ వైబ్స్లో హీరోయిన్ మీరా జాస్మిన్.. View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mahe Ayyappan (@maheswari_actress) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) -
క్రిస్మస్ కాంతులు.. భిన్నస్వరాలు!
ప్రేమ, శాంతి, దయ అనే సార్వత్రిక విలువలు ప్రతిబింబించేది క్రిస్మస్ పండుగ. అందుకే ప్రపంచవ్యాప్తంగా.. అన్నిమతాల వాళ్లు ఈ పండుగను గౌరవిస్తారు. భారత్లోనూ క్రిస్మస్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలు.. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక క్రిస్మస్ ట్రీలు, బహుమతులు, కేక్ల హడావిడి.. చాలా ఇళ్లలో కనిపిస్తోంది. అదే సమయంలో.. కొన్నిచోట్ల అసాధారణ దృశ్యాలు కనిపించాయి. ఒకవైపు శాంటాక్లాజ్ వేషధారణలో క్రైస్తవులు ర్యాలీగా వెళ్తున్నారు. అదే సమయంలో.. వాళ్లకు అనుకోని దృశ్యం తారసపడింది. కేరళ సంప్రదాయ వాయిద్యం చండా వాయిస్తూ ఆ ఎదురు రోడ్డులో మరో ఊరేగింపు వచ్చింది. పైగా శాంటాక్లాజ్ టోపీలతో చండా బృందం సంప్రదాయ పంచెకట్టులో కనిపించింది. అది చూసి అవతలివాళ్లలో కొందరు నిర్ఘాంతపోగా.. మరికొందరు మాత్రం ఆ వైబ్కు ఊగిపోతూ కనిపించారు. May Christmas bring renewed hope, warmth and a shared commitment to kindness.Here are highlights from the Christmas morning service at The Cathedral Church of the Redemption. pic.twitter.com/BzvKYQ8N0H— Narendra Modi (@narendramodi) December 25, 2025During a Christmas procession, Chande Vadya used by players wearing traditional Panche & Shallya!Looks like converts won’t stop until they convert Jesus to Hinduism😭😭😭 pic.twitter.com/5KD2dZ0UBQ— Sree Harsha (@AapathBandhava) December 24, 2025మరో ఘటనలో.. అస్సాం పినాగావ్ నల్బరి ఏరియాలో హిందూ సంఘాల ఓ క్రిస్టియన్ స్కూల్లోకి చొరబడి.. అక్కడి క్రిస్మస్ వేడుకల సామాగ్రిని తగలబెట్టారు. ఆ సమయంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు జై శ్రీరామ్.. జై హిందూ రాష్ట్ర నినాదాలు చేశారు. On Christmas Eve, Vishva Hindu Parishad and Bajrang Dal goons entered St. Mary’s School in Panigaon, Nalbari, chanting slogans like “Jai Shri Ram” and “Jai Hindu Rashtra.” They destroyed and set fire to all Christmas decorations prepared at the school. pic.twitter.com/LQHV7FWUvz— Mohammed Zubair (@zoo_bear) December 24, 2025This is why @RahulGandhi said to BJP You can never rule TamilNadu 🔥 pic.twitter.com/WXyqyzjrCy— BAKWAS FELLOW (@bakwasfellow) December 24, 2025స్వామి వివేకానంద బాటలోనే.. బేలూరు రామకృష్ణ మఠం నిర్వహకులు పయనిస్తున్నారు. ప్రతీ ఏడులాగే.. ఈసారి క్రిస్మస్కు జీషూ పూజ నిర్వహించారు. Every Xmas Eve Jishu Puja is organised by the monks of Ramakrishna Mission at Belur & at all their missions the world over in memory of Swami Vivekananda who celebrated it! Peace and Joy from the city of Joy to you all!pic.twitter.com/qTsYm2z1d5 ప్రపంచమంతా ప్రశాంతంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకుంటోంది. అయితే పైన చెప్పుకున్న దృశ్యాలు కలిసినప్పుడు మనకు కనిపించేది భిన్నత్వంలో ఏకత్వం. ఇదే కదా మన భారతం..! pic.twitter.com/SqZomQJSeg— Codex_Indîa (@Codex_India6) December 24, 2025 -
సెలెబ్రిటీలను మించిపోయిన క్రియేటర్లు!
బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని టెండూల్కర్ చెప్పాల్సిన పని లేదు.. అందమైన చీరలు షూటింగ్ షర్టింగులు అంటూ విజయశాంతి ఊయలూగుతూ చెప్పే అవసరం లేదు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అంటూ కాజల్ అగర్వాల్ గోడలు అద్దాలు బద్దలుకొట్టుకుని రావాల్సిన అవసరం లేదు.. ఇంకా ఇప్పుడు పట్టణాలు.. నగరాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్ లు కటవుట్లు .. ఫ్లెక్సీలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు.. కాలం మారింది.. మారుతోంది.. ఇంకా మారనున్నది.. వివిధ ఉత్పత్తుల ప్రచారం కోసం సెలబ్రిటీలు.. సినిమా నటులు.. క్రీడాకారులు మాత్రమే యాడ్ ఫిలిమ్స్ లో నటించాలని రూలేం లేదు.. వాళ్లకు లక్షలు.. కాదు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది.. మున్ముందు ఇంకా మారుతుంది.సోషల్ మీడియా.. ముఖ్యంగా ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్ ఫారాలు వచ్చాక కమర్షియల్స్ .. అంటే యాడ్ ఫిలిమ్స్ రూపకల్పన తీరు మారిపోతోంది. దీనికోసం సెలబ్రిటీలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు పాతిక లక్షలమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సిద్ధంగా ఉన్నారు.. వీరు సినిమా సెలబ్రిటీలు.. స్పోర్ట్స్ పర్సన్స్ కాదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే ప్రచారం చేస్తారు.ఐదారేళ్ళ క్రితం వరకుఒకప్పుడు భారతదేశంలో మార్కెటింగ్ అంటే హోర్డింగులు, సెలబ్రిటీ ఎండా ర్సుమెంట్లు, మెరుపువెలుగుజిలుగులు.. తళుక్కుమనే టీవీ ప్రకటనలే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో రీల్స్ చేసేవాళ్ళు.. నేరుగా కష్టమర్లతో మాట్లాడే వారే వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. వారు ఏం కొనాలి.. ఎందుకు కొనాలన్నది ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వివరించి చెబుతున్నారు.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) అనే ఒక ప్రఖ్యాత మార్కెట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారత కంటెంట్ క్రియేటర్ ఎకానమీ కీలక మలుపు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 నుంచి 25 లక్షల మంది డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు యాక్టివ్గా ఉన్నారు. వీరంతా సొంత రీల్స్, కంటెంట్ పోస్ట్ చేస్తూనే వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఆదాయం కూడా పొందుతున్నారు.వీరి ప్రభావంతో వినియోగదారుల కొనుగోలు నిర్ణయాల్లో 30 శాతానికి పైగా మార్పు వస్తుండగా, వార్షికంగా రూ. 350–400 బిలియన్ డాలర్ల (సుమారు లక్షల కోట్ల రూపాయల) వ్యయం ఈ క్రియేటర్ల ప్రభావంలో జరుగుతోంది. 2030 నాటికి ఈ సంఖ్య 1 ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశముందని అంచనా.ఈ వీరి ప్రభావం మరింత విస్తృతం అవుతుందని బీసీజీ అంచనా వేస్తోంది. ఇది ఇకపై వైరల్ డ్యాన్స్ వీడియోలు లేదా మేకప్ ట్యుటోరియల్స్కే పరిమితం కాదు. ఫ్యాషన్, టెక్నాలజీ, బ్యూటీ, రోజువారీ అవసరాలు వంటి అన్ని విభాగాల్లోనూ ఈ క్రియేటర్లు దూసుకుపోతున్నారు.BCG అధ్యయనం ప్రకారం:60 శాతం మంది వినియోగదారులు క్రమం తప్పకుండా క్రియేటర్ కంటెంట్ను చూస్తున్నారు.30 శాతం కంటే ఎక్కువ మంది తమ కొనుగోలు నిర్ణయాలకు క్రియేటర్లే కారణమని చెబుతున్నారు. ఎవరెవరో సినిమా నటులు, క్రికెటర్లు చెప్పే ప్రకటనలకన్నా కమ్యూనిటీ ఆధారిత నమ్మకమే ఇప్పుడు ప్రధానంగా మారింది. మనకు తెలిసినవాళ్ళు చెప్పే ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు మక్కువ చూపుతున్నారని తెలుస్తోంది.ఇకముందు ఈ 'కంటెంట్ క్రియేటర్లను తాత్కాలిక ప్రచార సాధనంగా కాకుండా, దీర్ఘకాల భాగస్వాములుగా చూసే బ్రాండ్లే విజేతలుగా నిలుస్తాయి. వాళ్ళ ఉత్పత్తులే ఎక్కువగా మార్కెట్లోకి వెళ్తాయి అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు అయితే క్రియేటర్లను కేవలం తమ ఉత్పత్తుల ప్రచారం కోసమే కాకుండా అమ్మకాలు పెంచుకోవడం, ఇంకా ధరను కూడా వారిద్వారానే నిర్ణయించేలా వ్యూహాలు రూపొందించి సక్సెస్ అవుతున్నారు. వీరితో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుని తమ వ్యాపారాలు పెంచుకుంటున్నాయి. ఎంత ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే అంతపెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా వారిని గుర్తిస్తూ తమ వ్యాపారంలో భాగస్వాములను చేస్తున్నారు.--సిమ్మాదిరప్పన్న -
పసుపు పోస్టింగులు
సాక్షి, అమరావతి: ఓ నిరుపేద వృద్ధురాలికి పింఛను ఇవ్వడానికి చేతులు రావు.. ఓ వికలాంగుడికి పింఛను మంజూరు చేయడానికి మనసొప్పదు.. పేద విద్యార్థికి ఫీజు కట్టడానికి డబ్బులుండవు.. రైతుకు మేలు చేసే ఆలోచనే ఉండదు.. కానీ, తన ప్రచారం కోసం.. తన కుమారుడి రాజకీయ లబ్ధి కోసం ఉన్నవీ లేనివీ కల్పించి పొగడ్తలతో ముంచెత్తడం, ప్రత్యర్థులపై గోబెల్స్ ప్రచారం చేయడం కోసం నెలనెలా వేలాది రూపాయలు చెల్లిస్తూ పార్టీ వారికి రకరకాల పోస్టులు కట్టబెడుతున్నారు సీఎం చంద్రబాబు. సోషల్, డిజిటల్ మీడియా పేరుతో వందల మందిని నియమించారు. చేసే పని చంద్రబాబును, ఆయన కుమారుడిని కీర్తించి, ప్రత్యర్థులపై రాళ్లేయడమే అయినా, వారికి చెల్లించేదంతా ఖజానా నుంచే. అంటే ప్రజాధనమే. ఇక కన్సల్టెంట్ల పేరుతో తన వారిని ఇబ్బడిముబ్బడిగా నియమించేస్తూ వారికీ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియా, యువ నిపుణులు, కన్సల్టెంట్ల పేరుతో చంద్రబాబు తన పార్టీకి చెందిన వారికి ఖజానా నుంచి భారీ వేతనాలతో పోస్టులు కట్టబెడుతున్నారు. నెల నెలా రూ.కోట్లలో చెల్లింపులు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇలా వందల మందిని నియమించారు. తాజాగా సోషల్ మీడియా పేరుతో ఇద్దరు ప్రచార కన్సల్టెంట్ల నియామకానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. కాంట్రాక్టు విధానంలో నియామకానికి ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నెలకు రూ.75 వేల చొప్పున వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మంత్రుల పేషీల్లో 24 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, 24 సోషల్ మీడియా అసిస్టెంట్లు.. మొత్తం 48 పోస్టులను సృష్టించి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారు. తొలుత ఏడాది పాటు అంటూ ఆదేశాలు జారీ చేసి, ఇటీవల మంత్రులు ఎంతవరకు ఉంటే అంతవరకు వీరు కొనసాగుతారని చంద్రబాబు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ప్రచారం కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో భారీ వేతనాలతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో 85 మందిని నియమించారు. తాజాగా వారిని మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో 58 మందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించారు. వీరిలో సోషల్ మీడియా ప్రత్యేక ఆఫీసర్కు నెలకు రూ.1.20 లక్షలు, 12 మంది కంటెంట్ డెవలపర్స్కు నెలకు రూ.75 వేల చొప్పున, 30 మంది సోషల్ మీడియా ఎనలిస్ట్లకు నెలకు రూ.30 వేల చొప్పున, 15 మంది డిజిటల్ ప్రచారకులకు నెలకు రూ, 25 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. కాంట్రాక్టు విధానంలో నియమితులైన మరో 27 మందిలో డిజిటల్ డైరెక్టర్కు నెలకు రూ.1.75 లక్షల వేతనం చెల్లిస్తారు. క్రియేటివ్ కన్సల్టెంట్కు నెలకు రూ.1 లక్ష చొప్పున, మిగతా వారికి నెలకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రచార కార్యక్రమానికి ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్కు రూ.100 కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ. 74 కోట్లు ఖర్చు చేసేశారు. మరోపక్క పీ–4 పేరుతో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున యువ నిపుణులంటూ 175 మంది టీడీపీ వారికి ఖజానా నుంచి భారీగా డబ్బు ముట్టజెపుతున్నారు. వీరికి ఏడాదికి రూ.12.60 కోట్లు చొప్పున నాలుగేళ్ల పాటు రూ.50.40 కోట్లు ప్రజాధనం చెల్లిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీలో 71 మంది కన్సల్టెంట్లకు లక్షల్లో వేతనాలు ఇస్తూ నియమించారు. అలాగే రాష్ట్ర ఆదాయం పెంచే పేరుతో 11 మంది కన్సల్టెంట్లను నియమించి, రూ.3.28 కోట్లు చెల్లిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి బోర్డులో ఆరుగురు కన్సల్టెంట్లను రూ.3.66 కోట్లతో నియమించారు. మంత్రుల పేషీల్లో, డిజిటల్ కార్పొరేషన్లో, మిగతా చోట్ల నియమితులైన వారంతా టీడీపీకి చెందిన వారే. టీడీపీ ప్రచార దళమే. -
పట్టు శారీలో ఉప్పెన బ్యూటీ.. బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతున్న నివేదా థామస్..!
పట్టు శారీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి..వైట్ డ్రెస్లో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ హోయలు..డిసెంబర్ మూడ్లో కోలీవుడ్ భామ ఆదితి గౌతమ్..బ్లాక్ బ్యూటీలా మెరిసిపోతున్న నివేదా థామస్..లిటిల్ హార్ట్స్ జ్ఞాపకాలను షేర్ చేసిన శివాని నాగారం.. View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Sai Kamakshi Bhaskarla (@saikamakshibhaskarla) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
‘మేమిద్దరమే… దేశం విడిచి పారిపోయిన అతిపెద్ద ఆర్థిక నేరగాళ్లం’
లండన్: ఆర్థిక నేరాల కేసులో భారత్ నుంచి పరారైన లలిత్ మోదీ, విజయ్ మాల్యాలు మరోసారి వార్తల్లో నిలిచారు. దేశం విడిచి పారిపోయినా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న వీరిద్దరూ తాజాగా లండన్లో ఎంజాయ్ చేస్తూ ఓ వీడియోలో కనిపించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా భారత్పై వ్యంగ్యగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లండన్లో మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీ, పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో బయటపడింది. ఈ వీడియోలో లలిత్ మోదీ.. ‘భారత్ నుంచి పరారీలో ఉన్న అతిపెద్ద నేరగాళ్లు మేమిద్దరమే’ అని వ్యంగ్యంగా పరిచయం చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.అంతేకాదు సంబంధిత వీడియోను లలిత్ మోదీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఇంటర్నెట్ను మరోసారి భారత్లో బ్రేక్ చేద్దాం. హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్ విజయ్ మాల్యా లవ్వ్యూ’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వ్యాఖ్యలు, వీడియోలో కనిపించిన ధోరణిపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వీరిద్ధరపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. 🚨 🇮🇳 UNBELIEVABLE! Embezzler of billions Lalit Modi brags on camera about being India’s top fugitive on the run!Vijay Mallya there but stays silent, skipping the shameless tirade.These audacious criminals must be extradited back to India at any cost! pic.twitter.com/ijeNYZM4wB— Uday Singh (@udaysinghkali) December 23, 2025 -
చిల్ అవుతోన్న మ్యాడ్ బ్యూటీ.. ఫుల్ గ్లామరస్గా భాగ్యశ్రీ బోర్సే..!
డిసెంబర్లో మూడ్లో బాలీవుడ్ భామ మలైకా అరోరా..గులాబీలా మెరిసిపోతున్న కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్..మ్యాడ్ బ్యూటీ రెబా మోనికా జాన్ చిల్..మరింత గ్లామరస్గా కింగ్డమ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే..హీరోయిన్ ప్రణీత బ్యూటీఫుల్ లుక్స్.. View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్పై నిఘా
కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో చారిత్రాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. ఆదాయపు పన్ను బిల్లు, 2025 ద్వారా ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను శాఖకు పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్, ఇతర డిజిటల్ ఖాతాలను యాక్సెస్ చేసే అధికారం లభించనుంది. పన్ను ఎగవేతను అరికట్టడానికి, ఆర్థిక పారదర్శకతను పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ విస్తరణప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలు కేవలం బ్యాంకు ఖాతాలకు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఆన్లైన్ వేదికల ద్వారా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ అనే నిర్వచనాన్ని విస్తరించింది. దీని పరిధిలోకి..సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు (Facebook, Instagram, X మొదలైనవి)వ్యక్తిగత కమ్యూనికేషన్.. ఈమెయిల్ రికార్డులు.ఆన్లైన్ ఖాతాలు.. క్లౌడ్ స్టోరేజ్, ట్రేడింగ్ ఖాతాలు, ఇన్వెస్ట్మెంట్ పోర్టల్స్ వస్తాయి.పన్ను చెల్లింపుదారులు ప్రకటించిన ఆదాయానికి, వారి వాస్తవ జీవనశైలికి మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించడం ఈ చర్య ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మార్పులు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయని గమనించాలి. కొందరు పన్ను చెల్లింపుదారులు తక్కువ ఆదాయాన్ని చూపిస్తూ విదేశీ పర్యటనలు చేయడం లేదా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి ప్రతిపాదిత మార్పుల ద్వారా నిఘా పరిధిలోకి వస్తాయి.ఈ డిజిటల్ పర్యవేక్షణ ద్వారా పన్ను చెల్లింపుదారులలో బాధ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో భారీ డేటాను విశ్లేషించి పన్ను ఎగవేతను ముందస్తుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.గోప్యతా ఆందోళనలు.. చట్టపరమైన సవాళ్లుఈ సంస్కరణ అమలుపై న్యాయ నిపుణులు, పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా గోప్యత ప్రాథమిక హక్కు అనే అంశంపై చర్చ జరుగుతోంది. కోర్టు అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం అధికారులకు ఇవ్వడం దుర్వినియోగానికి దారితీయవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. క్లౌడ్ స్టోరేజ్ నుంచి వ్యక్తిగత సందేశాల వరకు యాక్సెస్ ఉండటం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఫాక్స్కాన్ ప్లాంట్లో 30,000 మంది నియామకం -
ఈ సూర్యుడికి సడన్గా ఏమైంది?
ఈ సూర్యుడికి సడన్గా ఏమైంది?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి చాలామంది వేస్తున్న ప్రశ్న ఇది. సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం ఏర్పడి.. రంగుల కాంతి చుక్కలు, ఇంద్రధనుస్సు వలె మెరుస్తూ కనిపించిన దృశ్యం.. వావ్ అనిపిస్తోంది. అయితే.. అది రెయిన్బో ఏమాత్రం కాదు. ఈ అద్భుత దృశ్యం కనిపించింది స్వీడన్ జామ్ట్లాండ్లో. శాస్త్రవేత్తలు దీనిని సన్ హాలో అని పిలుస్తారు. సూర్యుడి చుట్టూ 22 డిగ్రీల వ్యాసార్థంతో ఇది ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా చల్లని ప్రాంతాల్లో.. అందునా శీతాకాలంలో సూర్యుడు ఆకాశంలో తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.ఈ హాలో ఏర్పడటానికి కారణం.. ఆకాశంలో 5–10 కి.మీ ఎత్తులో ఏర్పడే సిరస్ మేఘాలు. వీటిలో ఉండే చిన్న హెక్సగాన్ ఆకారపు మంచు స్ఫటికాలు సూర్యకిరణాలు తాకి 22 డిగ్రీల కోణంలో వంగిపోతాయి. అలా.. లక్షలాది కిరణాలు ఒకే విధంగా వంగి కలిసిపోవడం వల్ల సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం ఏర్పడుతుంది. అలా ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, పర్పుల్ రంగులు బయటకు విస్తరిస్తూ ఇంద్రధనుస్సు వలె మెరుస్తాయి. అదే సమయంలో.. [07] A spectacular sun halo in Jämtland, Sweden.pic.twitter.com/YhLl9nF8nV— 𝘀𝗶𝘆𝗲𝗡𝗴𝗼 (@Mrsiyengo) December 21, 2025సన్ డాగ్స్/పార్హీలియా అనే ప్రకాశవంతమైన చుక్కలు సూర్యుడి రెండు వైపులా ఏర్పడి ఆకాశాన్ని అందంగా మార్చుతుంది. టాంగెంట్ ఆర్క్స్.. హాలో పైభాగంలో వంగిన కాంతి రేఖలు, సర్కంహొరిజాంటల్ ఆర్క్స్.. ఇంద్రధనుస్సు వలె అడ్డంగా కనిపించే కాంతి రేఖలు కూడా ఉంటాయి. సో.. ఇదేం మాయా జాలం కాదు, పూర్తిగా సైన్స్(ఫిజిక్స్). అయినా కూడా నెటిజన్స్ సూర్యుడికి ప్రకృతి తొడిగిన కిరీటం అని అభివర్ణిస్తున్నారు. హాలోకి.. ఇంద్రధనుస్సు బోలెడు తేడా ఉంది. ఇంద్రధనుస్సు వర్షపు నీటి బిందువుల వల్ల ఏర్పడుతుంది. కానీ హాలో మంచు స్ఫటికాల వల్ల ఏర్పడుతుంది. హాలోలు అర్కిటిక్ ప్రాంతాలు, స్కాండినేవియా, హిమాలయాలు వంటి చల్లని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో సిరస్ మేఘాలు ఏర్పడడం తక్కువ కాబట్టి చాలా అరుదుగా కనిపించొచ్చు. కొన్ని దేశాల సంస్కృతుల్లో సన్ హాలోను దైవ సంకేతంగా భావిస్తారు. మరికొన్ని దేశాల్లో శుభసూచకంగా చూస్తారు. చైనాలో మాత్రం వాతావరణ మార్పు సూచనగా చూస్తారు. హాలోలు కనిపించడం అంటే వాతావరణంలో తేమ పెరుగుతోందని.. త్వరలో వర్షం లేదంటే మంచు కురిసే అవకాశం ఉందని సంకేతాం అన్నమాట. సూర్యుడి విషయంలోనే కాదు.. చంద్రుడి విషయంలోనూ ఇలా జరుగుతుంది. సూర్యుడి స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు, అదే విధంగా మంచు స్ఫటికాల వల్ల చంద్రుడి చుట్టూ ఇదే తరహాలో వలయం ఏర్పడుతుంది. -
చివరి ఊపిరి… ట్రక్కు కిందే!
చలికాలం.. మిట్ట మధ్యాహ్నాం.. సూర్యుడి వెచ్చని కిరణాల్ని ఆస్వాదిస్తూ తన ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చున్నాడు ఆ పెద్దాయన. కానీ, ఒక్క నిమిషంలోనే ఆయన జీవితం తలకిందులైంది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.మధ్యప్రదేశ్ గ్వాలియర్లో 90 ఏళ్ల గిర్రాజ్ శర్మ అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఒక ట్రక్కు కింద నలిగిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నెట్టింటకు చేరాయి. డిసెంబర్ 19వ తేదీన మధ్యాహ్నాం 12-1 గంట మధ్య ఈ ఘటన జరిగింది.గిర్రాజ్ శర్మ తన ఇంటి వరండాలో కూర్చుని ఉన్నారు. ఇంతలో కంకర లోడ్తో వెళ్తున్న ట్రక్కు.. ఆయన ఇంటి ముందు నుంచి మలుపు తిరిగింది. అయితే ఆ టర్నింగ్లో రోడ్డు సరిగ్గా లేక టైర్ పేలిపోయింది. ఈ పరిణామంతో వాహనం కంట్రోల్ కాకపోవడంతో.. పక్కకు ఒరిగి గిర్రాజ్ మీదకు ఒరిగిపోయింది. అలా ఊహించలేని దుర్ఘటన ఆ వృద్ధుడి ప్రాణం తీసింది.ఆరోగ్యంగా ఉన్న గిర్రాజ్ ఇలా అనూహ్యంగా ప్రాణం పొగొట్టకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు.. రోడ్డు భద్రత, భారీ వాహనాల నిర్వహణపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. 𝑵𝒐 𝒐𝒏𝒆 𝒌𝒏𝒐𝒘𝒔 𝒘𝒉𝒆𝒏 𝒅𝒆𝒂𝒕𝒉 𝒘𝒊𝒍𝒍 𝒂𝒓𝒓𝒊𝒗𝒆…In Gwalior, Madhya Pradesh, 90-year-old Girraj Sharma was simply sitting outside his home, quietly soaking in the winter sun. In a cruel twist of fate, a gravel-laden dumper lost control after a tyre burst and… pic.twitter.com/uAdXECIaxM— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 21, 2025 -
రఘురామ ఒక 420.. కఠిన శిక్ష గ్యారెంటీ!
సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు ఓ ‘420’ అని, మూడు బ్యాంక్ల నుంచి రూ.945 కోట్లు లూటీ చేశారని సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై ఆయనపై సీబీఐ ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), నేరపూరిత కుట్రతోపాటు 120బీ (కుట్ర) కింద కేసు నమోదు చేసిందని చెప్పారు. ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. గౌరవ ప్రదమైన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఈ కేసులో జైలుకు వెళితే మన రాష్ట్ర పరువు ఏమవుతుందని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా సీనియర్ ఐపీఎస్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. సెల్ఫీ వీడియోతోపాటు సీబీఐ కేసు ఎఫ్ఐఆర్ కాపీలు ఫేస్బుక్, ఎక్స్లో పోస్ట్ చేశారు. సునీల్ కుమార్ పేర్కొన్న అంశాలు క్లుప్తంగా.. ‘బాధ్యత కలిగిన సీనియర్ అధికారిగా, డీజీపీ ర్యాంకులో ఉన్న ప్రభుత్వ అధికారిగా ఎలాంటి ఆధారం లేకుండా ఏది పడితే అది మాట్లాడను. నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. సీబీఐ పెట్టిన కేసుకు సంబంధించి 20 పేజీల ఎఫ్ఐఆర్ డాక్యుమెంట్ను ఫేస్బుక్, ఎక్స్లో పోస్ట్ చేశాను. మీరు మొత్తం అందులో చూడొచ్చు. ఈ కేసు ఖచ్చితంగా రుజువు అవుతుంది. ఆ కేసులో ఉన్నవారందరికీ కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, పీఎన్బీల నుంచి లూటీ చేసిన ప్రజల డబ్బు అది. సీబీఐ కేసు పెట్టిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లి ఆయన స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే వల్లే ఇన్ని రోజులు అరెస్టు కాకుండా ఉన్నారు. ఇటీవలే స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. ఇవాళో.. రేపో ఆయన అరెస్టు కాక తప్పదు. ఇంకా ఆయనపై నమోదు కావాల్సిన అనేక కేసులున్నాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి. వాటి తాలూకా డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. వాటన్నింటిని కూడా నేను ఫాలోఅప్ చేస్తాను. కేసులు పెట్టకపోతే ఇందుకు సంబంధించి రిట్ పిటిషన్లు వేస్తాను. కేసులు సజావుగా జరుగుతున్నవీ లేనిదీ చూస్తుంటాను. ఆ కేసుల్లో నేను కూడా అవసరమైతే ఇంప్లీడ్ అవుతాను. ఆయన ఇప్పుడు గౌరవ ప్రదమైన ఉపసభాపతి స్థానంలో ఉన్నారు. ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి అరెస్టయితే మన రాష్ట్ర పరువు ఏం కావాలి? పెద్ద ఆర్థిక నేరగాడు కీలకమైన ఉపసభాపతిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుంది?’ అని సునీల్ కుమార్ ప్రశి్నంచారు. అందువల్ల తక్షణం ఆయనను ఉపసభాపతి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
సృజనాత్మకత, గోప్యతకు పెద్దపీట.. యూజర్ నియంత్రణకే ప్రాధాన్యం
డిజిటల్ ప్లాట్ఫామ్స్ క్రియేటర్ల సంక్షేమాన్ని, వినియోగదారుల గోప్యతను పరిగణించకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో వీరీల్స్(Vreels) క్రియేటర్లకు ప్రాధాన్యమిస్తూ, విశ్వసనీయమైన, సృజనాత్మకమైన ప్లాట్ఫామ్గా రూపొందుతోంది. భారత్లోని క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయడం, సురక్షిత వాతావరణం, ఆదాయం అవకాశాలు, క్రియేటర్ల కోసం సమగ్ర మద్దతు అందించడం వీరీల్స్(Vreels) ప్రత్యేకత.క్రియేటర్లతో నేరుగా చర్చలుసోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సాధారణంగా ఫీచర్లను రూపొందించిన తర్వాతే వినియోగదారుల అభిప్రాయాన్ని తీసుకుంటాయి, కానీ Vreels (www.vreels.com) టీం భారత్లోని క్రియేటర్లను నేరుగా కలిసి మీటప్స్, కమ్యూనిటీ చర్చలు నిర్వహిస్తోంది. క్రియేటర్లు కోరుకునేది ఏమిటో గ్రహించడం.. సృజనాత్మక స్వేచ్ఛ, గుర్తింపు, నైతిక విలువలు, ఆదాయం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టూల్స్ వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్లాట్ఫామ్ను రూపొందించినట్లు చెప్పింది.కళాశాలల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ప్రతిభను కనుగొనడంలో Vreels ముందడుగు వేస్తోంది. కంటెంట్ పోటీలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను, సృజనాత్మకతను ఎలాంటి భయం లేకుండా వ్యక్తపరిచే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా, Vreels గోప్యత, భద్రతపై అత్యంత దృష్టి పెట్టడం వల్ల యూజర్లు తాము సృష్టించిన కంటెంట్పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇది ఇతర పెద్ద ప్లాట్ఫామ్స్లో సాధ్యం కాని విషయమని వీరీల్స్ చెప్పింది. యూజర్లు తమ ప్రొఫైల్లో వారి విశ్వవిద్యాలయం లేదా కళాశాల పేరును అప్డేట్ చేస్తే భవిష్యత్తులో వీరీల్స్ ద్వారా వారు తమ కళాశాల లేదా ఇతర కళాశాలల విద్యార్థులతో సులభంగా కనెక్ట్ కావొచ్చు. తమ నెట్వర్క్ను విస్తరించుకోవచ్చు.సులభమైన ఆదాయ అవకాశాలుVreels ప్లాట్ఫామ్లో 10,000 ఫాలోవర్స్ను చేరిన యూజర్లు తమ ఖాతాను మోనిటైజ్ చేయడానికి అర్హత పొందుతారు. ముఖ్యంగా, ఎవరైతే 10,000 ఫాలోవర్స్ చేరుకుంటారో వారికి రూ.10,000 చెక్కు అందిస్తామని వీరీల్స్ తెలిపింది. దీనికి ఎలాంటి పరిమితి లేదని చెప్పింది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానంలో భవిష్యత్తులో మార్పులు చేయవచ్చని తెలిపింది.Vreels షాప్.. 2026 క్యూ1లో ప్రారంభంVreels షాప్ 2026లో ప్రారంభం కానుంది. ప్రారంభ విక్రేతలు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ పొందగలుగుతారు. ఇది చిన్న వ్యాపారాలు, బ్రాండ్లకు కొత్త ఆదాయ అవకాశాలను తెరుస్తుంది.వీడియోలు వీక్షిస్తూ దీని ద్వారా ప్రోడక్ట్స్ కొనవచ్చు లేదా మెరుగైన ధరల కోసం బిడ్డింగ్ వేయవచ్చు.వ్యాపారవేత్తలు తమ రీల్స్, ఫోటోలు, కథల ద్వారా బ్రాండ్ను ప్రోత్సహించి, ఆదాయాన్ని పొందవచ్చని వీరీల్స్ చెప్పింది.నమ్మకమైన ఈ సిస్టమ్ ద్వారా వెండర్లు తమ ఉత్పత్తులను భద్రంగా విక్రయించవచ్చని పేర్కొంది. వినోదం, వాణిజ్యం కలిసే కొత్తదనాన్ని అనుభూతి చెందవచ్చని తెలిపింది.దీనిపై మరిన్ని విశేషాలు త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.మెమొరీ క్యాప్సుల్.. ప్రత్యేకమైన, వ్యక్తిగత డిజిటల్ అనుభవంVreels లోని మెమొరీ క్యాప్సుల్ ఫీచర్ ఏ ఇతర ప్లాట్ఫామ్లో లేని ప్రత్యేకమైన ఫీచర్. యూజర్లు ప్రత్యేక కంటెంట్ను రహస్యంగా భద్రపరిచి, నచ్చిన వారికి తీపిగుర్తుగా సర్ప్రైజ్ అందించవచ్చు. ఇది కేవలం మీరు ఎంపిక చేసిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది. దీని కారణంగా Vreels కేవలం సాధారణ సోషల్ మీడియా వేదిక లాగా కాకుండా వినియోగదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవాలను అందించే వేదికగా కూడా ఉంటుంది.ఈ ఫీచర్ ద్వారా మీరు మీ జ్ఞాపకాలను భద్రంగా ఉంచి, కావలసిన సమయానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు. వర్చువల్ టైమ్ లాక్ సిస్టమ్ వల్ల మీరు సృష్టించిన జ్ఞాపకాలు సరైన సమయంలో మాత్రమే బయటకు వస్తాయి.Reels, చాట్, కాల్స్, PixPouch..వీరీల్స్ Reels, చాట్, కాల్స్, PixPouch.. అన్ని అనుభవాలను ఒకే వేదికలో అందిస్తోంది. ఇందులో షార్ట్ వీడియోలు, రియల్ టైం చాట్, వాయిస్/వీడియో కాల్స్, PixPouch ద్వారా ఫోటోలు సులభంగా సేకరించటం వంటి ఫీచర్లున్నాయి. ఇది వినియోగదారులకు సృజనాత్మక స్వేచ్ఛ, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.గోప్యత, డేటా భద్రతకు మొదటి ప్రాధాన్యతVreelsలో డేటా భద్రత, గోప్యత ముఖ్య ప్రమాణాలు. ఇతర ప్లాట్ఫామ్లు వినియోగదారుల డేటాపై సరైన జాగ్రత్త చూపడంలో విఫలమవుతున్నాయి. కానీ Vreels వినియోగదారులకు వారి కంటెంట్పై పూర్తి నియంత్రణ, రక్షణ, భద్రతా సౌలభ్యాలను ప్రధానంగా అందిస్తుంది. యూజర్ల డేటాను ఎవరు చూడాలో అనే పూర్తి నియంత్రణ కూడా తమ చేతుల్లోనే ఉంటుంది.డేటా లీక్ భయం అనవసరంఈ రోజుల్లో AI ఆధారిత డేటా లీక్ భయం పెరుగుతోంది. కానీ Vreelsలో ఎన్క్రిప్షన్ ద్వారా ప్రతి చాట్, వీడియో, ఫోటో, డేటా భద్రంగా ఉంటుందని కంపెనీ చెప్పింది. యూజర్ల వీడియోలు, ఫోటోలు, పోస్ట్లు.. ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో స్వయంగా పూర్తిగా నియంత్రించవచ్చు.స్థానిక ప్రతిభ నుంచి ప్రపంచ స్థాయి ప్రతిభ వరకుVreels ఇప్పటికే 22 దేశాల్లో బీటా వర్షన్ యాప్ను రిలీజ్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. క్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికులైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.Vreels మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels: భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comకింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్ల్లో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదాడౌన్లోడ్ కోసం కింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి. -
ఎంత ధైర్యం?.. పుతిన్ ముందే అలా చేస్తావా?
ప్రపంచంలో శక్తివంతమైన నేతల్లో వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. ఆయన అలవాట్లు.. మేనరిజం.. ప్రోటోకాల్.. అన్నీ ఎంతో ప్రత్యేకంగానే ఉంటాయి. అలాంటిది ఆయన సమక్షంలో ఓ యువకుడు.. తన ప్రియురాలికి ప్రపోజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఆ ప్రపోజల్కు ఆ యువతి ఏం చేసింది.. దానికి పుతిన్ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా?.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 ఏడాది ముగింపు నేపథ్యంతో.. విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రిపోర్టర్లు పలు ప్రశ్నలు అడగ్గా.. దానికి పుతిన్ బదులిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కిరిల్ బజానోవ్ అనే 23 ఏళ్ల యువ జర్నలిస్టు వంతు వచ్చింది. ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని ప్లకార్డును పట్టుకున్న అతను.. పుతిన్ ముందే తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ‘నా స్నేహితురాలు దీన్ని చూస్తోంది. ఓల్గా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో.. నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా’ అని అన్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు. వెంటనే ఆ ప్రాంగణంలోని వారంతా చప్పట్లు కొట్టారు. ‘Vladimir Vladimirovich, Breaking News’ — host interrupted Putin‘She said yes’ — Kirill Bazhenov’s girlfriend accepted the proposalPreviously journalist proposed in the middle of the live Q&A pic.twitter.com/WI1PMftowG— RT (@RT_com) December 19, 2025అనంతరం అతడు.. రష్యాలో జీవన వ్యయం పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశాడు. తాను, తన స్నేహితురాలు ఎనిమిదేళ్లుగా కలిసి ఉంటున్నామని అయితే, విస్తృత ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు పుతిన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇక, సమావేశం కొనసాగుతుండగా.. ప్రోగ్రామ్ హోస్ట్ కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టు కిరిల్ బజానోవ్ ప్రపోజల్ను అతడి స్నేహితురాలు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో పుతిన్తో సహా అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తంచేస్తూ చప్పట్లు కొట్టారు. అయితే కిరిల్ లాంటి యువ కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్.. విరాళాల రూపంలో అయినా ఇలాంటి పెళ్లిళ్లకు సాయం అందించాలని పిలుపు ఇచ్చారు. ఈ సమయంలో తమ పెళ్లికి రావాలంటూ కిరిల్ రష్యా అధినేతను ఆహ్వానించగా.. ఆయన నుంచి ఎలాంటి బదులు రాలేదు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
పెళ్లిలో వధువు ల్యాప్టాప్ పట్టుకుని..
వృత్తి నిబద్ధత అనే మాట వినబడుతుందేగానీ కనిపించడం అరుదు. అలాంటి అరుదైన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘కోయల్ ఏఐ’ అనే కంపెనికీ కో–ఫౌండర్ గౌరీ అగర్వాల్.ఆరోజు ఆమె పెళ్లి... వధువుగా పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్న ఆమెకు ‘కోయల్లో ఏఐలో బగ్ ప్రాబ్లమ్’ అంటూ ఒక వార్త వినిపించింది. ‘ఎవరికైనా చెప్పండి’ అని విసుక్కోకుండా... వేదికలో ఒక పక్కకు వెళ్లి... ల్యాప్టాప్ తీసుకొని క్రిటికల్ బగ్ను పది నిమిషాల్లో సాల్వ్ చేసింది గౌరీ అగర్వాల్.‘ఎక్స్’లో ఆమె తమ్ముడు మెహుల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ పోస్ట్ బోలెడు లైక్లతో దూసుకుపోతోంది. ‘స్టార్టప్ల గురించి చాలామంది గొప్పగా మాట్లాడుతుంటారు. అయితే అది అనుకున్నంత తేలిక కాదు. ఎప్పడూ అప్రమత్తంగానే ఉండాలి. విజేతల వృత్తి నిబద్ధత ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ వీడియో క్లిప్ను షేర్ చేశాను’ అని రాశాడు గౌరీ అగర్వాల్ (Gauri Agarwal) సోదరుడు మెహుల్.అయితే సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు గౌరీ అగర్వాల్కు జై కొట్టారు.కొందరు ‘ఇది సరికాదేమో!’ అన్నట్లుగా కామెంట్ పెట్టారు.‘నేను కూడా వృత్తిని బాగా ప్రేమిస్తాను. అందుకోసం అపురూప క్షణాలను మాత్రం వృథా చేసుకోవాలనుకోను’ అని ఒకరు రాశారు. చదవండి: 20 ఏళ్లకే రీసైకిలింగ్ కింగ్..!People romanticize startups but it is a lot of work.This is my sister & co-founder @gauri_al at her own wedding, 10 minutes after ceremony, fixing a critical bug at @KoyalAI.Not a photo op, parents yelled at both of us.When people ask why we won, I'll point to this. pic.twitter.com/ee3wTEYwXG— Mehul Agarwal (@meh_agarwal) December 16, 2025 -
ట్రాఫిక్.. గీఫిక్.. జాన్తా నై!
రూల్స్ ఉండేవే బ్రేక్ చేయడానికి అన్న వాదన నుంచి పుట్టిన సిద్ధాంతం మనది. అందుకే ఎప్పుడు రూల్స్ గురించి మాట్లాడినా.. రాద్ధాంతం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ రూల్స్ అంటారా.. ఇది మరీ విడ్డూరం. దేశంలో ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటిస్తూ అందరితో శభాష్ అనిపించుకున్న.. అందరూ కాకపోయినా ట్రాఫిక్ పోలీసుల మెప్పు పొందిన వారిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. రూల్స్ పాటించడమంటేనే చేతకాని తనానికి నిదర్శనమని త్రికరణశుద్ధిగా నమ్ముతుంటాం. అందుకే ఎదుటి వారికి చెప్పేటందుకే రూల్స్ ఉన్నాయి.. డోంట్ కేర్ అంటూ ఏఎన్నార్ లెక్కన పాటలు పాడుకుంటూ నిర్లక్ష్యంగా తిరిగే వారే ఎక్కువ. ఏదైన రూల్ ఉందంటే అది రాజుగారి గదిలాంటిది. రాజుగారి గదిలోకి మాత్రం వెళ్లకండి అంటే.. కచ్చితంగా అందులోకే వెళ్లడం సగటు భారతీయుని నైజం. ఇదీ అంతే.. రూల్స్ అంటూ ఎవరైనా మాట్లాడితే.. ఆ చెప్పొచ్చావులే పేద్ద.. రూల్స్ అంట రూట్స్.. అని ఆరున్నొక్క రాగాల దీర్ఘం తీయడం మనకు అలవాటై పోయింది.గీ ట్రాపిక్ పురాణం పొద్దుపొద్దులా మాకెందుకు బై అంటే.. జర ఆగుండ్రి మరి.. మన సివిక్ సెన్స్ చూసి విదేశీయులే నోరెల్ల బెడ్తుండ్రంట. పుణెలో ఓ విదేశీయుడు మనోళ్లు ఫుట్పాత్ల మీదికెళ్లి మోటార్ బైకులు చెలాయిస్తూంటే వారిని ఆపి.. ఏందిది? అని అడుగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అందుకే.. ఇక్కడే కాదు.. దేశంలో చాలా చోట్ల విదేశీయులు మన భారతీయుల ఉల్లం‘ఘనుల’ను చూసి.. అరే ఎంత దర్జాగా రూల్స్ వదిలేసి తిరుగుతుండ్రని నోళ్ళు నొక్కుకుంటుండ్రు. మన దేశ రాజధాని ఢిల్లీలో సైకిల్ తిరగాల్సిన చోట వాహనాలు హల్ చల్ చేస్తుంటే.. చూస్తున్న విదేశీయులు రంగప్రవేశం చేసి జనాలకు బాబూ దీన్ని బైసైకిల్ లేన్ అంటారు. ఇక్కడ కేవలం సైకిల్స్ తిరగాలి అంతేకానీ.. ఎడాపెడా పెద్ద వాహనాలు రాకండి అంటూ నిలబడి మరీ చెప్పడం ప్రారంభించారు.కొందరు వీరి మాటలు వింటున్నట్లు నటించినా.. మరి కొందరు బేఫికర్గా వారి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అరే మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ గురించి విదేశీయులు అర్థం చేసుకుని ఇలా పాటించాలి బాబూ అంటున్నా.. వినకుండా వారు అలా చెబుతున్నందుకు విసుక్కొంటున్నారట. పాపం విదేశీయులకు మన థియరీ అర్థం కాలేదు. అరే వీరేందిర బై రూల్స్ అన్నాక ఫాలో కావాలి కదా. పనిగట్టుకుని మరీ రూల్స్ బ్రేక్ చేస్తే వీరికి మాత్రం ఒరిగేదేంటి? అని లోలోపల మదనపడుతున్నారట. విదేశీయులు మన భారతీయులకు ట్రాఫిక్ రూల్స్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.🚨 A foreigner is forcing riders to move out of footpath in Pune. 🙏 pic.twitter.com/XYIqB9AzVs— Indian Tech & Infra (@IndianTechGuide) December 19, 2025మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.అరే ఇదేందిర బై వన్ వే అంటూ రాసిండు గదా.. ఇట్టే వస్తున్నవేంది? అని ఎవరైనా అడిగితే... చుట్టూ ఎలితే లంబా అవుతది గందుకే షార్ట్ గా ఈ తొవ్వలో వస్తుండ అంటూ యమ కూల్ గా సమాధానం చెబుతారు. హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు జర ఫోర్స్ చేసిండ్రు అంటే.. గదేంది సర్ పొద్దునే ఈ రూట్ లో ఇట్టే వెళ్ళా.. గప్పుడు కూడా లేదు.. ఇప్పుడు అడుగుడేంది అంటూ ఉల్టా ప్రశ్న వేస్తుంటే సదరు పోలీసు నోరెళ్ళబెట్టాల్సిందే. ఇగ హారన్ కొట్టుడు అంటే మనకు మస్త్ మజా వస్తది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నా.. హారన్ దంచుతునే ఉంటం.. అరె బై ఆ సప్పుడేంది.. ట్రాఫిక్ ఉంది కదా అని విసుక్కొన్నారో.. హారన్ సౌండ్ మరింత పెరుగుతుంది. అదే విదేశాల్లో హారన్ కొట్టడం అంటే న్యూసెన్స్ గా భావిస్తారు.విదేశాల్లో ఇలా అంటే చాలు ఆ మా బాగా చెప్పొచ్చావులే.. అక్కడికే వెళ్ళలేకపోయావా అంటూ వ్యంగ్యం దట్టించి మరీ మాటలు వదులుతుంటారు. కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే.. యూరోపియన్ దేశాల్లో అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ పట్టింపు చాలా ఎక్కువ. రోడ్డుపై టూవీలర్, ఫోర్ వీలర్ తోపాటు సైకిల్ పై వెళ్లే వారికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. ప్రభుత్వ బస్సులు నడపడానికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. పాదచారులకు వారు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. పెడస్ట్రియన్ సిగ్నల్ పడిందంటే.. ఎన్ని వాహనాలైనా సరే అటూ ఇటూ నిలిచి వేచి చూడాల్సిందే. అలాగే స్కూల్ జోన్ వద్ద సైలంట్ జోన్ అని ఉంటుంది. అక్కడ హారన్ మోగిస్తే ఫైన్ కట్టాలి. అలాగే స్కూల్, హాస్పిటల్ వద్ద స్పీడుగా వెళ్ళినా పెనాల్టీ డబుల్ ఉంటుంది. టొరంటోలో ట్రాఫిక్ ఎప్పుడూ హెవీగానే ఉంటుంది. కానీ ప్రమాదాల శాతం చాలా తక్కువ. మనకూ ట్రాఫిక్ రూల్స్ బోలెడన్ని ఉన్నాయ్.. పాటించేవారి సంఖ్యే తక్కువ. రూల్స్ బ్రేక్ చేయడమంటే మనకు వెన్నతో పెట్టిన విద్య. అది తప్పని కూడా అనుకోం. పాపం ఢిల్లీలో విదేశీయులు మన అరాచకం చూసి అల్లాడిపోయారు. కనీసం రూల్స్ చెబితే పాటిస్తారేమోనని అనుకుని చెప్పడం ప్రారంభించారు. వారిది ఎంత దురాశో కదా.-ఆరెం. -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ కొత్తరూల్ను తీసుకొచ్చింది. హ్యాష్ట్యాగ్ల వినియోగంపై పరిమితి విధిస్తున్నట్లు తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఇక మీద వాటిని పోస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్లకు సూచిస్తోంది.ఇన్స్టాగ్రామ్లో చేసే పోస్ట్ లేదంటే రీల్కు ఇక నుంచి గరిష్ఠంగా ఐదు మాత్రమే హ్యష్ట్యాగ్లు పెట్టుకునే అవకాశముందని ఆ ప్రకటనలో పేర్కొంది. తక్కువ యాష్ ట్యాగ్ల వల్ల పోస్టు బలంగా యూజర్లలోకి వెళ్తుందని.. తద్వారా రీచ్ బాగా అవుతుందని చెబుతోంది. ఇంతకుముందు ఇన్స్టాలో 30 హ్యాష్ట్యాగ్లు పెట్టుకోవడానికి అవకాశముండేది. అయితే.. ఎక్కువ, అసాధారణమైన హ్యాష్ట్యాగ్లు (#reels, #explore) వాడటం వల్ల కంటెంట్ పనితీరు తగ్గుతుంది. అదే తక్కువగా.. అదీ నిర్దేశిత హ్యాష్ట్యాగ్లు వాడడం వల్ల కంటెంట్ డిస్కవరీకి ఎక్కువ అవకాశం ఉంటుందని ఇటు నిపుణులూ సూచిస్తున్నారు. ఉదాహరణ: బ్యూటీ క్రియేటర్లు తమ కంటెంట్కు సంబంధించిన బ్యూటీ హ్యాష్ట్యాగ్లు వాడితే.. ఆ కంటెంట్ను ఆసక్తి ఉన్నవారు సులభంగా కనుగొంటారు. వంట చానెల్స్ నడిపే వాళ్లు.. వాళ్లు చేసే వంటకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ మాత్రమే ఉపయోగించడం బెటర్. ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఏ హ్యాష్ ట్యాగ్ను పడితే ఆ హ్యాష్ట్యాగ్తో పోస్ట్ చేస్తే మొదటికే మోసం రావొచ్చు. ఈ నెల ప్రారంభంలో కేవలం 3 హ్యాష్ట్యాగ్లే ఉపయోగించాలని ఇన్స్టాగ్రామ్ తన యూజర్లను అలర్ట్ చేయాలనుకుంది. కానీ, ఇప్పుడు అధికారికంగా 5 హ్యాష్ట్యాగ్ల పరిమితి అమలు చేయాలని నిర్ణయించింది.హ్యాష్ట్యాగ్లంటే(#).. కంటెంట్ డిస్కవరీకి ఉపయోగపడేవి. సంబంధిత టాపిక్ సెర్చ్లలో, ట్రెండింగ్ లిస్టుల్లో, సెర్చ్ (Explore) ఫీడ్లో కనిపించే అవకాశం ఉంటుంది. సరైన హ్యాష్ట్యాగ్లు వాడితే మీ కంటెంట్ను నిజంగా ఆసక్తి ఉన్నవారు చూసే అవకాశం పెరుగుతుంది. కానీ సంబంధం లేనివి.. అడ్డగోలుగా ఎక్కువ వాడితే కంటెంట్ పనితీరు తగ్గి.. ఎవరికి పడితే వాళ్లకు వెళ్తుంది. అలాగే ఇన్స్టా ఆల్గారిథమ్ ప్రకారమూ స్పామ్గా పరిగణించి రీచ్ తగ్గుతుంది. కాబట్టి ఇన్స్టాలో మాత్రమే కాదు.. ఇతర సోషల్మీడియా ప్లాట్ఫారమ్లోనూ తక్కువగా, సంబంధిత హ్యాష్ట్యాగ్లు వాడటం ఉత్తమని నిపుణులు చెబుతుంటారు. -
తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయం ముందు ఓ రాజకీయ పోస్టర్ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అతి చర్యలకు దిగారు. అన్నాడీఎంకే కార్యకర్తలు ఆలయ పరిసరాల్లో జయలలిత, పళని స్వామి చిత్రాలతో కూడిన పోస్టర్ను పెట్టి రీల్స్ తీశారు. పోస్టర్లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ సీఎం పళని స్వామి చిత్రాలు ఉండటం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆలయ పరిసరాల్లో రాజకీయ చిహ్నాలు, ప్రసంగాలు, ప్రచారం నిషేధం ఉన్నప్పటికీ, కార్యకర్తలు అత్యుత్సాహంతో ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను పట్టించుకోని టీటీడీ భద్రతా అధికారులు విమర్శలకు గురవుతున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలు కఠినంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై టీటీడీ అధికారులు స్పందించారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
లిటిల్ హార్ట్స్ బ్యూటీ గ్లామరస్ లుక్.. సెల్ఫీ పోజులతో ఉప్పెన భామ కృతి శెట్టి!
మరింత హాట్హాట్గా లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివాని..బ్లాక్ డ్రెస్లో మెరిసిన భూమిక చావ్లా..సెల్ఫీ మూడ్లో నాసామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్..క్రిస్మస్ సెలబ్రేషన్స్లో బాలీవుడ్ భామ మలైకా అరోరా..ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సెల్ఫీ లుక్స్.. View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
కూతురు ఆపరేషన్ కోసం వచ్చిన.. శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్
-
పోస్టు ఫార్వర్డ్ చేశాడని 26 కేసులు
బద్వేలు అర్బన్/సాక్షి, హైదరాబాద్ సిటీ బ్యూరో: సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు ఏడాదిన్నర క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్టును ఫార్వర్డ్ చేశాడని నమోదైన ఓ కేసులో వైఎస్సార్ కడప జిల్లా బద్వేలుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు బత్తలపల్లి శ్రీనివాసులరెడ్డిని సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప చిన్న చౌక్ పోలీసులకు అప్పగించారు.బతుకుదెరువు నిమిత్తం దుబాయ్కు వెళ్లిన శ్రీనివాసులరెడ్డి.. కుమార్తె ఆపరేషన్ ఏర్పాట్ల కోసం దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లుకౌట్ నోటీసు ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ కుమారుడికి ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బద్వేలులోని తెలుగుగంగ కాలనీ రోడ్డులో నివసించే రమణారెడ్డి, లక్షుమ్మ కుమారుడైన శ్రీనివాసులరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వైఎస్సార్సీపీ అభిమాని అయిన శ్రీనివాసులరెడ్డి సామాజిక మాధ్యమాల్లో వచ్చే కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను షేర్ చేస్తుంటారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఆయనపై కడపలోని ఓ పోలీసు స్టేషన్తోపాటు బాపట్ల, రేపల్లె, తదితర పోలీసు స్టేషన్లలో ఏకంగా 26 కేసులు నమోదైనట్టు తెలిసింది.కుమార్తె ఆపరేషన్ కోసం వచ్చి..శ్రీనివాసులరెడ్డికి సుహిత, సుబ్బారెడ్డి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో సుహిత మూగ, అంధత్వంతో బాధ పడుతోంది. ఏడాదిన్నర క్రితం హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఒక కంటికి చికిత్స చేయించారు. మరో కంటికి చికిత్స చేయించేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇందుకోసం దుబాయ్ నుంచి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో వెంటనే శ్రీనివాసులరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బద్వేలులోని ఆయన తల్లిదండ్రులు, భార్య కన్నీటి పర్యంతమయ్యారు.తన కుమారుడికి ఏ పాపం తెలియదని, అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఏజెంట్గా కూర్చోవడమే తమ కుమారుడు చేసిన తప్పా అని వాపోయారు. కాగా, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అధైర్య పడొద్దని, పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే డాక్టర్ సుధ పేర్కొన్నారు. ఎమ్మెల్యే, పార్టీ లీగల్ సెల్ న్యాయవాది శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. -
మంచు పేరిట ముంచేశారు!
మంచు అందాలను ఆస్వాదించడానికి మనాలీకి వెళ్లే పర్యాటకులకు షాకింగ్ నిజం బయటపడింది. అక్కడి గైడ్లు.. పర్యాటకుల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసి, కృత్రిమ మంచుతో మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్న ఒక పర్యాటకుడి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.ట్రక్కుల్లో మంచును తరలించి..ట్రక్కుల్లో మంచును తరలించి, దానిని నేలపై పోసి, పర్యాటకులతో ఆటలు ఆడిస్తుండటాన్ని ఈ వీడియో బయటపెట్టింది. అతుల్ చౌహాన్ అనే పర్యాటకుడు ఇన్స్ట్రాగామ్లో షేర్ చేసిన ఈ వీడియోలో, మనాలీలో జరుగుతున్న ’స్నో స్కామ్’ను బట్టబయలు చేశారు. ‘చివరికి, మనాలీలో మంచు ఎలా కురుస్తుందో మీకు చూపిస్తాను. చూడండి.. ఈ వ్యక్తులు మంచును ట్రక్కుల్లో తీసుకువచ్చారు. ఇక్కడ కుమ్మరిస్తున్నారు. ఆ తర్వాత ఈ మంచుపై పర్యాటకులతో ఆడిస్తారు’.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో సహజమైన మంచు ఏ మాత్రం లేదని, పరిసరాలు బీడు భూమిలా కనిపిస్తున్నాయని వీడియో స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు ట్రక్కుల నుంచి పారలతో కృత్రిమ మంచును దించి, నేలపై చల్లడం కనిపించింది. పర్యాటకులు కృత్రిమ మంచుపైనే స్కేటింగ్ చేస్తూ, ఆటలాడుతూ కనిపించారు.గ్లోబల్ వార్మింగ్ఈ వీడియో ఇంటర్నెట్లో కలకలం సృష్టించింది. చాలా మంది నెటిజన్లు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధిక అడవుల నిర్మూలన, అనియంత్రిత నిర్మాణాల కారణంగా.. సహజంగా మంచు కురవడం తగ్గిపోయిందని, ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రభావమని కొందరు వ్యాఖ్యానించారు. మరొకరు స్పందిస్తూ, ‘పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మంచు ఉంటుందని చెప్పి, స్నో సూట్ల కోసం అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. కానీ పర్యాటకులు చివరకు చూసేది చిన్న మంచు ప్యాచ్ మాత్రమే. దానికి అంత డబ్బు, శ్రమ అవసరం లేదు’.. అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ’స్నో స్కామ్’ ఘటన.. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాన్ని, మరోవైపు పర్యాటక రంగంలో జరుగుతున్న మోసాలను బట్టబయలు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అహ్మద్.. అసలైన హీరో
సిడ్నీ: సిడ్నీ బీచ్లో అమాయక యూదులపై ఇష్టారీతిగా తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తున్న ఉగ్రవాది సాజిద్ను సాహసోపేతంగా నిలువరించిన 43 ఏళ్ల అహ్మద్–అల్–అహ్మద్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ధైర్యసాహసాలతో సాజిద్ చేతుల్లోంచి తుపాకీ లాక్కుని పలువురి ప్రాణాలను అహ్మద్ కాపాడారంటూ అతడిని జనం వేనోళ్ల పొగుడుతున్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక్క ఉదుటున సాజిద్పైకి దూకిన వైనం వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్మీడియాలో వైరల్గా మారడంతో అతని ధైర్యసాహసాల గురించే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.కాపాడే క్రమంలో కన్నుమూశాడని చెప్పు...దాడి జరిగినప్పుడు ఆదివారం ఉదయం అదే బాండీ బీచ్లో అహ్మద్ తన స్నేహితుడితో కలిసి రోడ్డు పక్కన కాఫీ తాగుతున్నాడు. ఉగ్రవాది సాజిద్ అక్కడివారిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతుంటే అహ్మద్ హతాశుడయ్యాడు. వెంటనే తేరుకుని ఎలాగైనా సాజిద్ను అడ్డుకుందామని నిశ్చయించుకున్నాడు. పక్కనే ఉన్న స్నేహితుడితో.. ‘‘ వాడిని అడ్డుకునేందుకు వెళ్తున్నా. ఒకవేళ చనిపోతానేమో. నా కుటుంబాన్ని చూసుకో. అహ్మద్ ఎలా చనిపోయాడని నా వాళ్లు అడిగితే ప్రజల్ని కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు అర్పించాడని చెప్పు’’ అని అనేసి వెంటనే రంగంలోకి దూకాడు. కారు చాటుగా దాక్కుంటూ నెమ్మదిగా సాజిద్ వద్దకు చేరుకుని వెంటనే అతడి చేతిలోని పెద్దరైఫిల్ను పెనుగులాట తర్వాత లాక్కున్నాడు. సాజిద్కు రైఫిల్ను గురిపెట్టి అక్కడి నుంచి దూరంగా వెళ్లేలా చూశాడు. తర్వాత రైఫిల్ను కిందపెట్టేశాడు. అయితే దూరంగా ఉండి కాల్చుతున్న సాజిద్ కొడుకు నవీద్ ఇదంతా చూసి అహ్మద్ పైకి కాల్పులు జరపడం మొదలెట్టాడు. దీంతో పక్కన చెట్టుకు పెట్టిన రైఫిల్ను మళ్లీ చేతుల్లోకి తీసుకుని ప్రతిదాడి చేయబోయాడు. అయితే అప్పటికే టెలిస్కోపిక్గా సూటిగా కాలుస్తున్న నవీద్ బుల్లెట్ల ధాటికి అహ్మద్ నిలవలేకపోయాడు. నవీద్ పేల్చిన బుల్లెట్లు అహ్మద్ భుజం, చేయి, అరచేతిలోకి దూసుకెళ్లాయి. ఆలోపు పోలీసులు రంగప్రవేశం చేయడంతో అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికే రక్తమోడుతున్న అహ్మద్ను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. న్యూసౌత్వేల్స్ అగ్రనేత క్రిస్ మిన్స్సహా పలువురు నేతలు, ఉన్నతాధికారులు అహ్మద్ను ఆస్పత్రిలో పరామర్శించారు.గతంలో సైన్యంలో పనిచేసిన అహ్మద్!అహ్మద్ స్వస్థలం సిరియాలోని ఇడ్లిబ్ పట్టణం. 2006లో శరణార్థిగా ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవలే ఇతన తల్లిదండ్రులు సైతం సిరియా నుంచి ఇతని వద్దకు వచ్చేశారు. అహ్మద్ సిడ్నీ సమీప సదర్లాండ్లో సొంతంగా పండ్ల వ్యాపారం చేస్తున్నారు. అహ్మద్ గతంలో సైన్యంలో పనిచేసినట్లు వార్తలొచ్చాయి. అయితే సిరియాలోని అసద్ అల్ బషీర్ ప్రభుత్వంలోనా లేదంటే ఆస్ట్రేలియాలో సేవలందించారా అనేది తెలియాల్సి ఉంది. ప్రాణాలు ఎదురొడ్డి పలువురిని కాపాడిన అహ్మద్ ఇప్పుడు ఆస్పత్రిపాలవడంతో చికిత్స ఖర్చుల కోసం పలువురు దాతలు ముందుకొచ్చారు. ఆన్లైన్లో గోఫండ్మీ క్యాంపెయిన్ మొదలెట్టారు. ఇప్పటికే దాదాపు రూ. 8.61 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ‘‘సైన్యంలో చేసిన నా కుమారుడికి ప్రాణాల విలువ తెలుసు. అందుకే కాపాడేందుకు ఒక్క నిమిషం కూడా ఆలస్యంచేయకుండా పరుగెత్తాడు’’ అని అహ్మద్ తండ్రి మొహమ్మద్ ఫతే అన్నారు. -
లావణ్య బర్త్ డే.. భర్త వరుణ్ తేజ్ లవ్లీ పోస్ట్ (ఫొటోలు)
-
మెస్సీ భాయ్.. మరి నీ లంగ్స్కు ఇన్సూరెన్స్ చేయించావా?
ఫుట్బాల్ రారాజు లియోనెల్ మెస్సీ భారత పర్యటన చివరి అంకానికి చేరుకుంది. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా దేశ రాజధానిలో ఇవాళ ఈ స్టార్ ప్లేయర్ పర్యటించబోతున్నారు. అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న వేళ.. ఈ పర్యటనపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఢిల్లీ పొల్యూషన్ గ్యాస్ ఛాంబర్ను తలపిస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో.. విద్యాసంస్థలకు, ఆఫీసులకు ఊరట ఇచ్చే నిర్ణయాలు తీసుకుంది అక్కడి అధికార యంత్రాంగం. ఈ తీవ్ర వాయుకాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. చాలా చోట్ల జీరో విజిబిలిటీతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల మధ్య అర్జెంటీనా ఫుట్బాల్ వీరుడు రావడంపై జోకులు ఇలా ఉన్నాయి.. 🤧మెస్సీ బాయ్.. ఢిల్లీకి మీకు స్వాగతం. మీ ఎడమ కాలిని 900 మిలియన్ డాలర్లకు((దాదాపు ₹7,500 కోట్లకు పైగా) ఇన్సూరెన్స్ చేయించారని విన్నా. ఇంతకీ మీ ఊపిరితిత్తులకు ఇన్సురెన్స్ చేయించారా?😬విరాట్ కోహ్లి.. మెస్సీ.. ఇది గోట్లు కలిసి చేయబోయే సందడి కోసం ఢిల్లీ ఎదురు చూస్తోంది. కానీ, ఆ దృశ్యం ఇలా ఉండొచ్చు.. అంటూ మసకగా ఉన్న ఇద్దరి ఫొటోను ఓ నెటిజన్ పోస్ట్ చేశాడుFans are waiting to see Virat Kohli and Leo Messi together in Delhi.Meanwhile, this is how the photo would probably look in Delhi air. 😭 pic.twitter.com/xvln8edSu8— Selfless⁴⁵ (@SelflessCricket) December 14, 2025😓మెస్సీ తన కెరీర్లో ఇప్పటిదాకా 896 గోల్స్ చేశారు.. ఇప్పుడు ఢిల్లీ ఏక్యూఐ(వాయు నాణ్యత) ఆ రికార్డును బద్ధలు కొడుతుందేమో! 😎మెస్సీకి పొగ తాగే అలవాటు లేదు. కానీ, ఈ ఒక్కరోజే ఆయన 20 సిగరెట్లు తాగుతారేమో!.. అంటూ ఢిల్లీ పొల్యూషన్ను అన్వయించి సెటైర్లు వేస్తున్నారు. కోల్కతా మినహాయించి హైదరాబాద్, ముంబైలో మెస్సీ పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఫుట్బాల్ అభిమానుల కోలాహలం నడుమ స్టేడియంలో మెస్సీ సందడి చేశాడు. ఇక్కడి అభిమానానికి ముగ్దుడైనట్లు ప్రకటించాడు. నేటితో ఈ టూర్ ముగియనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ ఈవెంట్కు ప్రధాని మోదీ సైతం హాజర కావొచ్చనే ప్రచారం వినిపించినప్పటికీ.. విదేశీ పర్యటనల నేపథ్యంలో అది జరగకపోవచ్చనే తెలుస్తోంది.లియోనెల్ మెస్సీ ఎడమ కాలికి సుమారు 900 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆయన ఎడమ కాలే ఆటలో ప్రధాన బలం. గోల్స్, ఫ్రీకిక్స్, డ్రిబ్లింగ్ అన్నీ ఎక్కువగా ఎడమ కాలుతోనే చేస్తారు. ఒకవేళ ఏదైనా గాయమై ఆట కొనసాగించలేని పరిస్థితి వస్తే.. క్లబ్లు, స్పాన్సర్లకు ఆర్థిక రక్షణ లభించేందుకు ఇంత భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించారు. అసలు ఈ భారీ ఇన్సూరెన్స్ కారణంగా, మెస్సీ ఇండియా టూర్ 2025లో పూర్తి మ్యాచ్ ఆడలేకపోతున్నారు. ఎందుకంటే.. ఆయనకు అనుమతి ఉన్నది కేవలం అర్జెంటీనా జాతీయ జట్టు, తన క్లబ్ (Inter Miami) తరఫున మాత్రమే పూర్తి మ్యాచ్లు ఆడటానికి. ఎగ్జిబిషన్ మ్యాచ్లు లేదా ఇతర ఈవెంట్లలో పూర్తి స్థాయిలో ఆడితే, ఇన్సూరెన్స్ నిబంధనలు ఉల్లంఘన అవుతాయి.మెస్సీ మాత్రమే కాదు.. ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు ఇతర క్రీడాకారులకు కూడా ఉన్నాయి. ఫుట్బాల్ హీరోలు క్రిస్టియానో రొనాల్డో తన కాళ్లకు, డేవిడ్ బెక్హమ్ తన ముఖానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అయితే.. మెస్సీ ఎడమ కాలు ఇన్సూరెన్స్ విలువ ప్రపంచంలోనే అత్యధికంగా భావించబడుతోంది. -
H-1B వీసా: భారతీయుల విషయంలో ఏం జరగొచ్చు!
న్యూఢిల్లీ: హెచ్–1బీ, హెచ్–4 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్ను, వారు చేసిన పోస్టులను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా తనిఖీ చేయబోతోంది. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశాయి. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల విషయంలో ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోంది. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిసెంబర్ 15, 2025 నుంచి హెచ్–1బీ, హెచ్–4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలించనుంది. ఇది ఇప్పటికే విద్యార్థులు మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్లకు అమలులో ఉన్న నిబంధనను విస్తరించడం ద్వారా జరుగుతోంది.కొత్త నిబంధన వివరాలుఈ కొత్త విధానం ప్రకారం, వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ను “పబ్లిక్” సెట్టింగ్స్లో ఉంచాలి. కనీసం గత ఐదు సంవత్సరాల పోస్టులు, కామెంట్లు, వీడియోలు, ఫోటోలు వంటి సమాచారం పరిశీలనకు వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విటర్), లింక్డిన్.. తదితర ప్రధాన ప్లాట్ఫార్మ్లలోని కంటెంట్ను కాన్సులర్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి అవుతుంది.ప్రభావం-ఆందోళనలుఈ చర్యతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రభావితమవుతారు, ఎందుకంటే హెచ్–1బీ వీసా హోల్డర్లలో 70% పైగా భారతీయులే ఉన్నారు. వీసా ఇంటర్వ్యూలు లేదంటే స్టాంపింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా వీసా ఆమోదం ఆలస్యం కావొచ్చు. ఒక్కోసారి తిరస్కరించబడే ప్రమాదం ఉంది. నిపుణులు దీనిని ప్రైవసీ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు, కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసం అవసరం అని చెబుతోంది.ఇప్పటికే అమలులో ఉన్న విధానం విస్తరణఇప్పటికే విద్యార్థులు (F-1 వీసా) మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్ల (J-1 వీసా) సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే విధానం అమలులో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని తాత్కాలిక ఉద్యోగ వీసాలు (H-1B), వాటి ఆధారిత వీసాలు (H-4) వరకు విస్తరించారు. ఈ మార్పు వల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసే విదేశీ ప్రొఫెషనల్స్ మరింత జాగ్రత్తగా సోషల్ మీడియా వాడకాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. -
చిట్కాలున్నా... చికిత్సే ముఖ్యం!
సోషల్ మీడియా వచ్చాక ఓ ఉత్పాతమూ వచ్చిపడింది. ‘పాత పేషెంట్ కొత్త డాక్టర్తో సమాన’మంటూ అప్పట్లో ఓ సామెత లాంటి వాడుక ఉండేది. దాన్ని నిజం చేస్తూ పాత పేషెంట్లూ అంతకుమించి పాపులర్ సెలిబ్రిటీలైన సోనాలీ బెంద్రే, మనీషా కోయిరాలా, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్, హాలీవుడ్ మోడల్ లీజా రే వంటి జనాల్లో మంచి క్రేజ్ ఉన్న వ్యక్తులు... ‘ఆటోఫేజీ’ అనే ఓ సైంటిఫిక్ పదాన్ని... ఇటీవలి పాపులర్ చిట్కా మంత్రా పదమైన ‘వెల్నెస్ చికిత్స’తో కలగలిపి ‘వెల్నెస్’ అద్భుతాల తాలూకు ప్రభావాలను సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఉపవాసాలూ, డీటాక్స్ విధానాల్లాంటివే అద్భుత మాయా–మంత్రాలంటూ ప్రజలకు ఇంపుగా ప్రజెంట్ చేస్తున్నారు. అసలు అన్నం కంటే పక్కన అంచుకుపెట్టుకుని నంజుకునే చిరుతిండినే నిజభోజనంగా వర్ణిస్తున్నారు. వాళ్ల మాటల మాయల్లో పడుతున్న జనాలు... అసలు వాస్తవాల కంటే అద్భుతాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా ఈ ‘మిరాకిల్స్ థెరపీ’లను ఎక్కువగా నమ్ముతూ ఉండే అదే క్యాన్సర్కు అద్భుత చికిత్సేమోనంటూ అమాయక ప్రజలు అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై క్యాన్సర్ నిపుణులైన డాక్టర్ల మాటేమిటో చూద్దాం.వాళ్లు క్యాన్సర్ను జయించిన యోధులే. అద్భుత మనోబలంతో క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొన్న మహామహులే. తాము క్యాన్సర్ను అధిగమించాక తాము అనుసరించిన చిట్కాలను వెల్లడిస్తూ వాళ్లు చెబుతున్న కొన్ని మాటలేమిటో చూద్దాం. → ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ (రోజుకు నియమిత వేళల్లోనే తిని... మిగతా సమయమంతా ఉపవాసంలో గడపడం), యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామంతో తాను క్యాన్సర్నుంచి బయటపడ్డానంటోంది ప్రముఖ బాలీవుడ్– టాలీవుడ్ ఫేమ్ సోనాలి బెంద్రే. → క్లీన్ ఈటింగ్ ప్రాసెస్ చేయని, రిఫైన్ చేయని, పొట్టుతీయని ముడి ధాన్యాలతో వండిన భోజనం)తో పాటు యోగా, ప్రాణాయామం వంటి వాటితో క్యాన్సర్ను జయించానన్నది ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట. → కీమోతో పాటు... క్రమశిక్షణతో కూడిన జీవనమూ భోజనమూ, దేహంలోని విషాలను శుభ్రపరిచే డీ–టాక్స్ ఆహార విహారాలూ తననుంచి క్యాన్సర్ను దూరం చేశాయంటాడు క్రికెటర్ యూవీ (యువరాజ్ సింగ్). → శాకాహారంతో కూడిన భోజనం, ధ్యానం (మెడిటేషన్), యోగా ఆయుర్వేద మార్గాల పయనం వల్లనే తనకు క్యాన్సర్ నయమయ్యిందంటోంది ప్రముఖ మోడల్, లీజా రే. ఇక్కడ ఈ ప్రముఖులు చెప్పిన చిట్కాలన్నీ ‘ఆటోఫేజీ’ అనే ప్రక్రియను వేగవంతం చేశాయనీ... అందువల్లనే తమకు క్యాన్సర్ వేగంగా, ప్రభావపూర్వకంగా నయమైందంటూ చెబుతున్న సోషల్ మీడియా వేదికగా చెబుతున్న మాటలు సాధారణ ప్రజల మెదళ్లలోకి తేలిగ్గా ఎక్కుతున్నాయి. వాళ్ల మనసుల్లోకి సులువుగా వెళ్తున్నాయి. అయితే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులైన ఆ వెల్నెస్ మార్గాలు మంచివే. కానీ అవే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయలేవని అంటున్నారు. ‘ఆటోఫేజీ’ అనే ఇటీవలి సైంటిఫిక్ పరిభాషకు చెందిన ఆ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నది వైద్యప్రముఖుల మాట. దాంతోపాటు ‘అపాప్టోసిస్’, ‘ ప్రోటీయోజోమ్’ అనే పదాలకు అర్థాలు వాటి వెనక పరమార్థాలూ తెలుసుకుంటే కేవలం అద్భుతాలనిపించే చికిత్సప్రక్రియలు... (మిరాకిల్ రెమిడీలు) మాత్రమే కాకుండా వాస్తవ చికిత్సలకు తోడుగా... ఈ అనుబంధ మార్గాలూ జతగూడినప్పుడే అసలు ఫలితాలు వస్తాయంటున్న డాక్టర్ల మాటల ఆంతర్యాలను తెలుసుకుందాం...అసలు ‘ఆటోఫేజీ’ అంటే ఏమిటి? దేహంలో ఎప్పటికప్పుడు కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అందులో చనిపోయిన కణాలతో పాటు కొన్ని నిరర్థకమైనవీ, వ్యర్థమైనవీ ఉంటాయి. మన దేహంలోని శుభ్రం చేసే వ్యవస్థ ఇలాంటి మృతకణాలూ, నిరర్థక, వ్యర్థకణాలను తొలగిస్తూ ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైన కణాల మనగడను సుగమం చేస్తూ, ఈ మృత, వ్యర్థ, నిరర్థక కణాలను తినేసే ప్రక్రియనే ‘ఆటోఫేజీ’ అంటారు. ఈ సెలిబ్రిటీల మాటేమిటంటే... పైన చెప్పిన ఉపవాసాలూ, ప్రాణాయామ ధ్యానాలూ, డీటాక్స్ ప్రక్రియల వంటి వెల్నెస్ మార్గాల ద్వారా మన ఆరోగ్యకరమైన కణాలన్నీ ‘క్యాన్సర్ కణాలనే’ తినేస్తే? అప్పుడు క్యాన్సర్ హరించుకుపోయి ఆరోగ్యం దక్కుతుందనేలా వారి సోషల్ మీడియా సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి. అంతకంటే సంక్లిష్టమైనది ఆటోఫేజీ...నిజానికి ‘క్యాన్సర్ బయాలజీ’లో ఆటోఫేజీ ప్రక్రియ అంతకంటే చాలా సంక్లిష్టమైనది అంటున్నారు ఆధునిక వైద్యచికిత్సకులు. ఒకసారి అదేమిటో చూద్దాం. ∙కణంలో మరిన్ని సూక్షమైన అంతర్గతమైన భాగాలు (ఆర్గనెల్స్) దెబ్బతిన్నప్పుడు ఆ కణం మనుగడ కష్టం. అది చనిపోయే ప్రక్రియలో దేహం దాన్ని శుభ్రం చేసి తొలగిస్తుంది. అందులోని ప్రోటీన్ శిథిలాలను ఒకచోట చేర్చి ఊడ్చేస్తుంది. అలా చనిపోయిన లేదా బలహీనపడి నిరర్థకం కాబోతున్న కణాలను దేహం తొలగించివేస్తుంది. దీన్నే ‘ఆటోఫేజీ’ అంటారు.అదీ మరచిపోతున్న ముప్పు... ఇదీ చేస్తున్న తప్పు... ఇక్కడ సెలిబ్రిటీలు ఒక విషయం మరచిపోతున్నారు. తమకున్న పరిమితమైన వైద్యపరిజ్ఞానంతో అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నప్పుడు తన జీవక్రియల కోసం దేహంలోని కణాలు తమకు కావాల్సిన ఆహారం కోసం మృత/వ్యర్థకణాలనూ, క్యాన్సర్ కణాలనూ తినేస్తాయని భావిస్తున్నారు. కానీ ఇక్కడ వారు ఒక ముప్పును విస్మరిస్తున్నారు. క్యాన్సర్ కణం కూడా ఒక కణమే. దానికీ ఆహారం కావాలి. ఉపవాసం ద్వారా దానికి అవసరమైన ఆహారాలు అందనప్పుడు అది కూడా ఆరోగ్యకరమైన కణాలనూ తినేయడం మొదలుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... మామూలు కణం కంటే కూడా అది మరింత చురుగ్గా, మరింత వేగంగా ఆరోగ్యకరమైన కణాలను కబళించవచ్చు. పైగా ఆహారం అందకపోవడంతో దేహాన్ని రక్షించుకునే వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత బలహీనపడితే క్యాన్సర్ కణజాలాలే మామూలు ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం ప్రారంభిస్తే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి! అంటే ఉపవాసం వల్ల క్యాన్సర్ ఎండిపోవడానికి (ఫాస్టింగ్ స్టార్వ్స్ క్యాన్సర్) బదులుగా తామే ఆకలితో మాడాల్సి వస్తుందని తెలిసినప్పుడు క్యాన్సర్ కణాలు ఇంకా ఇంకా కుతంత్రాలతో (కన్నింగ్గా) ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం మొదలుపెట్టే ప్రమాదలెన్నో పొంచి ఉంటాయి.ఆటోఫేజీ లాంటిదే ఆటాప్టోసిస్... సెలిబ్రిటీలు ఆటోఫేజీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం వల్ల దాని గురించి మామూలు ప్రజలకు తెలియరావచ్చు. కానీ... ఈ రంగంలో ఇలా ఆటోఫేజీలా పనిచేస్తూ క్యాన్సర్ కణాలను తినేసేందుకు దోహదపడే పరిశోధనలూ, అలాంటి పరిజ్ఞానాలూ, పరిభాషా... ఇలాంటివి వాళ్లకు తెలియని అంశాలెన్నో ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు అటాప్టోసిస్, యూబిక్విటిన్– ప్రోటియోజోమ్ సిస్టమ్ వంటివి. ఉదాహరణకు అటాప్టోసిస్ అంటే ఏమిటో చూద్దాం. ఎవరినైనా బాగా కించపరిచి, కోలుకోలేనంతగా నిందిస్తే వాళ్లేం చేస్తారు? తట్టుకోలేక ఆత్మహత్యకూ ఒడిగట్టవచ్చు కదా! అచ్చం అపాప్టోసిస్ ప్రక్రియలో కూడా అలాంటిదే జరుగుతుంది.యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ సిస్టమ్ అంటే... యుబిక్విటిన్ అనేది ఏ ప్రోటీన్కు అంటుకుంటుందో దాన్ని కాలపరిమితి ముగిసిపోయిన లేదా చెడిపోయిన / లోపభూయిష్టమైన ప్రోటీన్గా గుర్తించవచ్చు. అది కణంలో ఉన్నప్పుడు కణం సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే యుబిక్విటిన్ ప్రోటీన్ కణం నుంచి తొలగిపోవాలి. అప్పుడే కణం చురుగ్గా నార్మల్ కణంగా ఉంటుంది. అలా కణం నుంచి యుబిక్విటిన్ను తొలగించడానికి తోడ్పడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ... అంటే యుబిక్విటిన్ ప్రోటీన్ను ధ్వంసం చేసేందుకు తోడ్పడే వ్యవస్థే ప్రోటియోజోమ్ వ్యవస్థ. అంటే ప్రోటియోజోమ్ అన్నది ప్రోటీన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ అన్నమాట. ఈ యుబిక్విటిన్ అనేది అలాగే ఉంటే అది చెడిపోయిన కణానికి అమరత్వం ఇస్తుంది. ఒకవేళ ఆ చెడిపోయిన కణాలకు అమరత్వం ఉంటే అవి తొలగిపోవు. కాబట్టి ఈ ప్రోటియోజోమ్... తన డబుల్ నెగెటివ్ మార్గంలో వాటిని గుర్తించి ధ్వంసం చేస్తుంది. అలా చెడుకణాలూ లేదా దెబ్బతిన్న/లోపభూయిష్టమైన కణాలను తొలగిస్తుంది. ఇతి జరిగేందుకు దోహదపడేదే ‘యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ వ్యవస్థ’గా చెబుతారు.కొన్ని మందులతో ప్రోటీయోజోమ్ ప్రక్రియను అడ్డుకుని క్యాన్సర్ను తగ్గించడం ఇలా... ఈ యుబిక్విటిన్– ప్రోటియోజోమ్ ప్రక్రియను గుర్తించిన వైద్య శాస్త్రవేత్తలు ‘బార్టెజోమిబ్’ అలాగే ‘కార్ఫిల్జోమిబ్’ వంటి ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లను తయారు చేసి ప్రయోగించారు. ఈ మందులతో ‘మైలోమా’ అనే క్యాన్సర్ నయం కావడం మొదలైంది. ఇలాంటి మందులను ( ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్ను) మరిన్ని కనుగొనడం ద్వారా అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చూసినప్పుడు ఆటోఫేజీ, అపాప్టోసిస్, ప్రోటీయోజోమ్ అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. అవి కొనసాగే మార్గాలను (పాత్ వేస్) అనేక మందుల సహాయంతో నిర్వహితమయ్యేలా చేయడం వల్ల క్యాన్సర్ కణం తనంతట తాను మటుమాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఇది ‘మైలోమా’లోనే సఫలీకృతమైంది. కానీ ఇంకా కొన్ని క్యాన్సర్ల (సాలిడ్ ట్యూమర్స్) విషయంలోనూ, మరిన్ని క్యాన్సర్లలోనూ విజయవంతం కావాల్సి ఉంది. ఇందుకోసం రకరకాల కాంబినేషన్లలో అపాప్టోసిస్ మాడ్యులేటర్లు, ఇమ్యూనో, టార్గెట్ థెరపీ ప్రక్రియలూ, ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లు రూపొందించడంలో వైద్యశాస్త్రజ్ఞులు నిమగ్నమై ఉన్నారు.ఆ అపోహలన్నీ అలా ఆవిర్భవించినవే... ఎన్నో ఏళ్లుగా అటాప్టోసిస్ ప్రక్రియను క్యాన్సర్ను జయించేందుకు ఒక ప్రత్యామ్నాయ ‘నేచర్ క్యూర్’ ప్రక్రియగా జనం అపోహపడుతున్నారు. కొన్ని ఆహారాల ద్వారా క్యాన్సర్ లాంటి లోపభూయిష్టమైన కణాలు తమంతట తామే తమ మరణశాసనం రాసుకునేలా చేయడం (యాక్టివేటెడ్ / ప్రోగ్రామ్డ్ సెల్ డెత్)గా చాలామంది పొరబడుతుంటారు. కానీ అది పొరబాటు. క్యాన్సర్ కణాలు ఎంత జిత్తులమారివి అంటే... అవి ‘అటాప్టోసిస్’నూ తప్పించుకోగలవు. అదెలాగంటే... సెల్ను అపాప్టోసిస్కు గురిచేసే ప్రక్రియలో క్యాన్సర్ కణంలోని పవర్హౌజ్ అయిన మైటోకాండ్రియాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ‘బీసీఎల్–2’ అనే కుటంబానికి చెందిన మరో ప్రోటీన్ విడుదలై అది యాంటీ అపాప్టోటిక్ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియాలోకి రసాయనాలు వెళ్లకుండా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది.చివరగా... ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన క్యాన్సర్ చికిత్సలు రేడియోథెపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్సలే. వీటి తర్వాతే ఉపవాసాలూ, యోగా, ధ్యానం, డీ–టాక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలూ, పోషకాహారాలూ, నేచురోథెరపీలను అనుబంధంగా ఉపయోగించుకోవాలి. ఏ సెలిబ్రిటీలు చెప్పినా అవి ప్రత్యామ్నాయ చిట్కాలే తప్ప ప్రధాన చికిత్సలు కావని అందరూ తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.అపాప్టోసిస్ అంటే... క్యాన్సర్ అంటేనే అది చెడిపోయిన / నార్మల్గా ఉండని కణం అన్న విషయం తెలిసిందే. ఏవైనా రసాయనాల ద్వారా ఓ చెడిపోయి దెబ్బతిన్న కణాన్ని మరింతగా అవమానించేలా చేస్తే అది బాగా కుంగి కుచించుకుపోయి నశించిపోయే పరిస్థితే ‘అపాప్టోసిస్’ అని చెప్పవచ్చు. నిజానికి చాలా సంక్లిష్టమైన జీవరసాయన పద్ధతికి ఇక్కడ చెప్పినది మామూలు ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఇదో సింపుల్ వివరణ అనుకోవచ్చు. అంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి ఓ కణాన్ని అవమానించడం ద్వారా దాని మరణాన్ని అదే తెచ్చుకునే ‘ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్’ కార్యక్రమం ఈ అపాప్టోసిస్.నిర్వహణ: యాసీన్ -
సోషల్ మీడియా పోస్టులపై ఈటెల రాజేందర్ అసహనం
సాక్షి, హన్మకొండ: బీజేపీ నేత ఈటెల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎంపీ బండి సంజయ్ PRO సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.నేను బీజేపీ పార్టీ ఎంపీని. నేను కూడా కొన్ని పోస్టులు చూశాను. అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అసలు అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతాడా? ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలు తేల్చుకుంటారు. వీటిపైన పార్టీ తేలుస్తుంది.. టైమ్ విల్ డిసైడ్. ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెప్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. రెండో, మూడో విడత ఎన్నికలు అయ్యాక జరిగిన పరిణామాలన్నీ అధిష్ఠానానికి చెప్తానని ఈటెల పేర్కొన్నారు.అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టులపై ఈటెల అసహనం వ్యక్తం చేయడం, పార్టీ లోపల విభేదాలు ఉన్నాయనే సంకేతాలను ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సోషల్ మీడియా నిషేధంపై కోర్టుకు
మెల్బోర్న్: పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆన్లైన్ వేదిక రెడ్డిట్ సవాలు చేసింది. ఈ అమెరికన్ ఆన్లైన్ ఫోరమ్ శుక్రవారం హైకోర్టులో దావా వేసింది. యువతను రక్షించాలనుకుంటే ప్రభుత్వానికి మరింత మెరుగైన మార్గాలున్నాయని, కానీ సోషల్ మీడియా కనీస వయసు చట్టం వల్ల రాజకీయ చర్చల నుంచి వేరుచేయడం అవుతుందని, ధ్రువీకరణ ప్రక్రియ కూడా అంత సురక్షితం కాదని రెడ్డిట్ తెలిపింది. 16 ఏళ్ళలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. పిల్లల ఆన్లైన్ భద్రతరీత్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఆస్ట్రేలియా పిల్లల ఖాతాలను తొలగించకపోతే రెడ్డిట్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, కిక్, స్నాప్చాట్, త్రెడ్స్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్లకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ కొత్త నిబంధనలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే.. దీనిపై ఇప్పటికే ఇద్దరు బాలికల తరపున సిడ్నీకి చెందిన హక్కుల వేదిక డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్టు గత నెలలో కేసు వేసింది. కాలిఫోరి్నయాకు చెందిన రెడ్డిట్ దానిని అనుసరించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని రెండు వాజ్యాలు పేర్కొన్నాయి. -
‘సోషల్’స్వరాలు మూగబోయిన దేశాలు
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది ఒక కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు.. జీవితంలో ఒక అంతర్భాగం. Facebook, Instagram, YouTube, X (గతంలో Twitter) తదితర ప్లాట్ఫారమ్లు కుటుంబ సభ్యుల ఫోటోలను పంచుకోవడం మొదలు.. సామాజిక ఉద్యమాలను నిర్వహించడం వరకు నెరవేరుస్తూ.. ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల పౌరులకు ఈ డిజిటల్ స్వేచ్ఛ అందుబాటులో లేదు. పలు దేశాలు జాతీయ భద్రత, నైతికత తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, సామాజిక నెట్వర్క్లపై కఠినమైన నిబంధనలను విధించడం లేదా పూర్తి నిషేధాలను కొనసాగించడం చేస్తున్నాయి. ఏఏ దేశాలు ఈ తరహా వైఖరిని కలిగివున్నాయి? ఎటువంటి చర్యలు చేపట్టాయనే వివరాల్లోకి వెళితే..చైనాలో ‘గ్రేట్ ఫైర్వాల్’ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఇంటర్నెట్ నియంత్రణలను అమలు చేస్తున్న దేశం చైనా. ‘గ్రేట్ ఫైర్వాల్’ విధానంతో Facebook, X, Instagram, YouTube వంటి ప్రధాన అంతర్జాతీయ ప్లాట్ఫారమ్లను చైనా పూర్తిగా బ్లాక్ చేసింది. దేశీయ ప్రత్యామ్నాయాలు (WeChat, Weibo వంటివి) ఉన్నప్పటికీ, అవి ప్రభుత్వ పర్యవేక్షణ, సెన్సార్షిప్కు లోబడి ఉంటాయి. జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వం పేరుతో ఈ ఆంక్షలను విధిస్తోంది. ఫైర్వాల్ను దాటేందుకు వీపీఎన్లను వాడటం సాంకేతికంగా చట్టవిరుద్ధం. ఫలితంగా జరిమానాలు లేదా నిర్బంధంలాంటి శిక్షలు ఉంటాయి.ఉత్తర కొరియా.. బాహ్య కమ్యూనికేషన్కు దూరం ప్రపంచ ఇంటర్నెట్ యాక్సెస్పై ఉత్తర కొరియా పూర్తి నిషేధం విధించింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఏవీ ఈ దేశంలో అందుబాటులో లేవు. పౌరులకు విదేశీ వార్తలు లేదా బాహ్య కమ్యూనికేషన్కు ఎలాంటి యాక్సెస్ ఉండదు. దేశీయ కమ్యూనికేషన్ కోసం ప్రభుత్వం ఆమోదించిన కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వీటిలో కఠినంగా నియంత్రించిన ఇంటర్నెట్ను మాత్రమే ఉపయోగిస్తారు. బాహ్య ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేసే స్థానికులకు కఠిన శిక్షలు ఉంటాయి.ఇరాన్.. కానరాని అంతర్జాతీయ సోషల్ మీడియాఇరాన్ దేశం పలు అంతర్జాతీయ సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది. Facebook, YouTube, X వంటివాటికి చాలా పరిమితమైన యాక్సెస్ ఉంటుంది. 2022 సామూహిక నిరసనల తర్వాత Instagramను కూడా నిషేధించారు. టెలిగ్రామ్, వాట్సాప్ తదితర మెసేజింగ్ యాప్లపై తరచూ నిబంధనలను విధిస్తుంటారు. ప్రజా నైతికత, జాతీయ భద్రత, నకిలీ వార్తల వ్యాప్తిని నిరోధించేందుకు ఈ ఆంక్షలు అవసరమని ప్రభుత్వం తెలిపింది. అయితే బ్లాక్ చేసిన ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేసేందుకు ఇరానియన్లు వీపీఎన్లపై ఆధాపడుతుంటారు. అటువంటి సందర్భాల్లో వారికి ప్రభుత్వం జరిమానాలు వడ్డిస్తుంటుంది. వీపీఎన్ అంటే ‘వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్’. దీని ద్వారా ఇంటర్నెట్ను రహస్యంగా వినియోగిస్తుంటారు.తుర్క్మెనిస్తాన్.. నిత్యం పర్యవేక్షణ తుర్క్మెనిస్తాన్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ యాక్సెస్కు అనేక పరిమితులున్నాయి. Facebook, వాట్సాప్, X వంటి ప్లాట్ఫారమ్లను తరచూ బ్లాక్ చేస్తుంటారు. అలాగే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రొవైడర్ల ద్వారా ఫిల్టరింగ్తో పర్యవేక్షిస్తుంటారు. వీపీఎన్ల ద్వారా బ్లాక్ చేసిన ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేయడం సర్వసాధారణం అయినప్పటికీ, ఇది జరిమానాలకు దారితీసే అవకాశం ఉంది.ఆఫ్ఘనిస్తాన్.. ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు పెరిగాయి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై నిత్యం నిఘా ఉంటుంది. కొన్ని ప్రావిన్సులలో అధికారులు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. నైతిక లేదా మతపరమైన పాలనా నియమాలకు విరుద్ధమైన కంటెంట్పై పూర్తి నిషేధం అమలులో ఉంది.టర్కీ.. జాతీయ విలువల కోసం.. దేశంలో రాజకీయ అశాంతి, నిరసనలు, భద్రతా సంక్షోభాల సమయంలో టర్కీ.. సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం విధిస్తుంటుంది. ఉగ్రవాద దాడులు, రాజకీయ ప్రదర్శనల సమయంలో వాట్సాప్, యూట్యూబ్, ‘ఎక్స్’ లాంటి ప్లాట్ఫారమ్లను కొన్ని రోజుల పాటు బ్లాక్ చేశారు. భద్రత, తప్పుడు సమాచారం నివారణ లేదా జాతీయ విలువలను కాపాడేందుకు ఇలా చేశామని అధికారులు తెలిపారు. టర్కీ చట్టాల ప్రకారం ఈ ప్లాట్ఫారమ్లు దేశంలో తమ ప్రతినిధులను నియమించాలి. స్థానికంగానే డేటాను నిల్వ చేయాల్సి ఉంటుంది.మయన్మార్.. తిరుగుబాటు తర్వాత.. 2021 ప్రారంభంలో జరిగిన తిరుగుబాటు తరువాత, మయన్మార్ సైనిక పాలన నిరసనలు లేదా అశాంతియుత కాలంలో సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లపై (ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మొదలైనవి) నిషేధం విధించింది. ఈ నిషేధం.. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకేనని ప్రభుత్వం తెలిపింది. రష్యా.. వీడియో కాలింగ్పై నిషేధంరష్యాలో సోషల్ మీడియాపై నిషేధాలు తక్కువే అయినప్పటికీ, పలు పరిమితులు ఉన్నాయి. చట్ట అమలుకు సహకరించడం లేదనే ఆరోపణలతో WhatsApp, టెలిగ్రామ్ వంటి విదేశీ మెసేజింగ్ యాప్లలోని వాయిస్ లేదా వీడియో కాలింగ్ ఫీచర్లు పరిమితం చేశారు. ఆయా ప్లాట్ఫారాలు స్థానిక కార్యాలయాలను తెరవాలని, తీవ్రవాద కంటెంట్ను నియంత్రించాలని రష్యా డిమాండ్ చేస్తున్నది.నేపాల్.. పునరాలోచనసోషల్ మీడియా కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో విఫలం కావడంతో Facebook, Instagram, YouTube, ‘ఎక్స్’ తో సహా 26 ప్రధాన ప్లాట్ఫారమ్లపై నిషేధాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం నిరసనలకు దారితీసింది. దీంతో ఈ నిషేధాన్ని కొద్ది రోజుల్లోనే ఎత్తివేశారు. అయితే ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేస్తున్నదని సమాచారం.ఇది కూడా చదవండి: వణికిస్తున్న సూపర్ఫ్లూ.. రికార్డు స్థాయి కేసులు -
ఆస్ట్రేలియా టీనేజర్లకు స్క్రీన్ లాకౌట్
మెల్బోర్న్ (ఆస్ట్రేలియా): పదహారేళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించడా న్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బ నీస్ స్వాగతించారు. ప్రపంచంలోనే మొట్టమొ దటిదైన ఈ నిషేధం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే నిషేధం అమలు కష్టంతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు. నిషేధం అమలుతో తమ ఖాతాలు మూతపడినట్లు తెలుసుకున్న పిల్లలు బాధ పడ్డారని తల్లిదండ్రులు తెలిపారు. కొందరు చిన్న పిల్లలు తమ ముఖాలపై మీసాలు, గడ్డం చిత్రించుకుని, సోషల్ మీడియా ప్లాట్ఫాంల వయసు అంచనా సాంకేతికతను మోసం చేయగలిగారని వెల్లడించారు. తల్లిదండ్రులు, అన్నలు లేదా అక్కలు కూడా.. కొంతమంది పిల్లలకు ఈ ఆంక్షలను తప్పించుకోవడానికి సహాయం చేస్తారని భావిస్తున్నారు.కన్నవారికి మనశ్శాంతి తథ్యం‘బిగ్ టెక్ కంపెనీల నుంచి ఆస్ట్రేలియా కు టుంబాలు అధికారాన్ని తిరిగి పొందే రోజు ఇది. పిల్లలు పిల్లల్లా ఉండటానికి, తల్లిదండ్రులకు మరింత ప్రశాంతత లభించడానికి నిషేధం ఉపకరిస్తుంది’.. అని అల్బనీస్.. ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్ప్తో వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా పిల్లలు.. వారి బాల్యాన్ని హాయిగా గడిపేందుకు వీలు కల్పిస్తుంది. ఆస్ట్రేలియా తల్లిదండ్రులకు మరింత మనశ్శాంతినిస్తుంది. ఆస్ట్రేలియా చేయగలిగితే, మనం ఎందుకు చేయలేం?’ అని ప్రపంచ సమాజం ఆస్ట్రేలియా వైపు చూస్తుంది’.. అని అల్బనీస్ చెప్పారు. ఒక బిడ్డ ఆత్మహత్యకు సోషల్ మీడియా కారణమని ఆరోపించే తల్లిదండ్రులతో సహా, సోషల్ మీడియా సంస్కరణ మద్దతుదారుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఉల్లంఘిస్తే భారీ జరిమానాబుధవారం నుంచి 16 ఏళ్లలోపు ఆస్ట్రేలియా పిల్లల ఖాతాలను తొలగించడానికి సహేతుక మైన చర్యలు తీసుకోకపోతే, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, కిక్, రెడ్డిట్, స్నాప్చాట్, థ్రెడ్స్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్ వంటి ప్లాట్ఫాంలు గరిష్టంగా 49.5 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే.. సుమారు 32.9 మిలియన్ల అమెరికన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.క్రిస్మస్ నాటికి నివేదికఈ నిషేధాన్ని ఆస్ట్రేలియాలోని ఈ–సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ అమలు చేస్తారు. వయస్సు పరిమితిని కచ్చితత్వంతో అమలు చేయడానికి ప్లాట్ఫాంల వద్ద ఇప్పటికే సాంకేతికత, వారి వినియోగదారుల వ్యక్తిగత డేటా అందుబాటులో ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. వయసు పరిమితిని ఎలా అమలు చేస్తున్నారు?, ఎన్ని ఖాతాలు మూతపడ్డాయి? అనే అంశంపై సమాచారం ఇవ్వాలని కోరుతూ లక్షిత పది ప్లాట్ఫాంలకు గురువారం నోటీసులు పంపుతానని వెల్లడించారు. ‘ఈ వయస్సు పరిమితులు ఎలా అమలు అవుతున్నాయో, అవి ప్రాథమికంగా పనిచేస్తున్నాయో లేదో క్రిస్మస్ లోపు ప్రజలకు సమాచారం అందిస్తాం’.. అని ఇన్మాన్ గ్రాంట్ చెప్పారు. కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ మాట్లాడుతూ, బుధవారానికి ఆస్ట్రేలియాలో 200,000 కంటే ఎక్కువ టిక్టాక్ ఖాతాలు నిలిపివేసినట్లు వివరించారు. -
డల్లాస్లో హీరోయిన్ శ్రీలీల చిల్.. బ్లాక్ డ్రెస్లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ అందాలు..!
డల్లాస్లో హీరోయిన్ శ్రీలీల సందడి..బ్లాక్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఆలియా భట్ అందాలు..టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ అలాంటి లుక్స్..కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోదావరి టూర్..బ్యూటీఫుల్ డ్రెస్లో ప్రియమణి హోయలు..డిఫరెంట్ డ్రెస్లో రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ పిక్స్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
బోరుగడ్డ అనిల్కుమార్ మా పార్టీ కాదు: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: బోరుగడ్డ అనిల్కుమార్ అనే వ్యక్తి తమ పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని.. అతనితో ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ స్పష్టత ఇచ్చింది. పలు ఇంటర్వ్యూలలో అనిల్ పలువురు నేతలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగానూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘బోరుగడ్డ అనిల్కుమార్తో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అతను మా పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. అతని మీద టీవీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఎలాంటి సంబంధం లేదు. బోరుగడ్డతో మాపార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’ అని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్పై పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో.. పోలీసులు రోడీ షీటర్గా గుర్తించారు. ఇంతకు ముందు పలు కేసుల్లో అరెస్ట్ కూడా అయ్యాడు. అయితే.. ఆ సమయంలోనూ తాను వైఎస్సార్సీపీ మనిషినంటూ ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతనికి సంబంధించిన ఇంటర్వ్యూలలోనూ పార్టీ ప్రస్తావన తేవడంతో వైఎస్సార్సీపీ ఓ స్పష్టత ఇచ్చింది. -
విజయ్ ర్యాలీలో గర్జించిన లేడీ సింగం
కరూర్ విషాదం నేపథ్యంలో.. టీవీకే సభలు, ర్యాలీలకు షరతులు, పరిమితులతో నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా పుదుచ్చేరిలో జరిగిన విజయ్ ర్యాలీ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పరిమిత సంఖ్యలో కార్యకర్తలు(అభిమానుల్ని) అనుమతించడంతో కొందరు బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే లేడీ సింగం గర్జించింది.. మంగళవారం ఉదయం ఉప్పలం ఎక్స్పో గ్రౌండ్ వద్ద విజయ్ ర్యాలీ జరుగుతున్న సమయంలో టీవీకే నేత బస్సీ ఆనంద్.. బారికేడ్ల వద్దకు వచ్చి ‘‘లోపల స్థలం ఉంది.. రండి..’ అంటూ జనాల్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఐపీఎస్ అధికారిణి ఇషా సింగ్ వెంటనే ఆయన చేతిలో ఉన్న మైక్ను లాగిపడేశారు. 40 మంది ప్రాణాలు పోయాయి కదా.. మళ్లీ అలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారా? అని ఆయన్ని ఆమె నిలదీశారు. ఈ క్రమంలో.. అనుమతించిన సంఖ్యకు మించి ఒక్కరినీ కూడా లోపలికి అనుమతించబోమని కుండబద్ధలు కొట్టారామె. దీంతో.. ఆయన మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కరూర్ ఘటన తర్వాత పుదుచ్చేరి పోలీసులు కఠిన నియమాలు అమలు చేశారు. రోడ్షోకు అనుమతి లేదు, ప్రజల సంఖ్యను 5,000కి పరిమితం చేశారు. QR కోడ్ పాస్ ఉన్నవారికే ప్రవేశం ఇచ్చారు. అయితే అంత జాగ్రత్తలు పాటించినా కూడా ఓ వ్యక్తి తుపాకీతో రావడం కలకలం రేపింది.Isha Singh IPS: UT: 2021 Gets Promotion To SSP Rank. She brings a rare combination of legal expertise and enforcement experience to her role. Read: https://t.co/D9i27rqJBi@HMOIndia @PuducheryPolice @iamishasingh @RajeshwarS73 pic.twitter.com/szTgMDL0Xx— Witness In The Corridors (@witnesscorridor) September 1, 2025 ఇషాసింగ్(28) 2020లో యూపీఎస్సీ ఆల్ ఇండియా 191 ర్యాంకర్. 2021 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఇషా సింగ్.. ప్రస్తుతం పుదుచ్చేరి పోలీస్ సూపరింటెండెంట్. ఆమె తండ్రి మాజీ ఐపీఎస్ వైపీ సింగ్(ముంబై పోలీస్ కమిషనర్గానూ పని చేశారు). తల్లి అభాసింగ్ లాయర్, సామాజిక కార్యకర్త. ఇషా సింగ్ నేషనల్ లా స్కూల్నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐపీఎస్ కాకముందు.. లాయర్గా ప్రాక్టీస్ చేశారు.தவெக தொண்டர்களால் பாராட்டு பெற்ற Isha Singh IPS 🔥புதுச்சேரியில் விதித்த கட்டுப்பாடு தமிழ்நாட்டில் விதித்தால் உடனே தமிழ்நாடு அரசாங்கம் இடையூறு செய்கிறது என்று குற்றம் சொல்லுவான் தற்குறி விஜய்.🤦🏽♀️கரூர் சம்பவம் மூலம் விஜய் கூட்டத்தை எப்படி கெடுபிடிகள் செய்து நடத்தவேண்டும் என்று… pic.twitter.com/3DTUksgxqY— நந்தினி ❣️ (@Nandhini1360381) December 9, 2025


