breaking news
Social Media
-
రూ. 11.5 కోట్ల ఆస్తి, 38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్లాన్సా? నెట్టింట ఒకటే చర్చ
పూణేకు చెందిన డింక్ కపుల్ (DINKడబుల్ ఇన్కమ్, నో కిడ్స్) 38 ఏళ్లకే రిటైర్ మెంట్ ప్రకటించారు. రూ. 11.5 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ, వచ్చే మూడేళ్లలో రిటైర్ కావాలని నిర్ణయించుకోవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అధిక పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా కెరీర్ కంటే వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యతనిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ దంపతులు.ఒత్తిడికి దూరంగా వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు సమాచారం. వీరి కథను ఒక బంధువు ఎక్స్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా వీరి ఆస్థులు, జీవనశైలిపై నెట్టింట ఆసక్తి నెలకొంది. ఈ జంట సంవత్సరాల తరబడి సంపదను కూడ గట్టుకున్నారని, కానీ ఇప్పుడు నిజంగా ఎంత డబ్బు సరిపోతుందని ప్రశ్నించుకుంటున్నారని ఆ బంధువు పేర్కొన్నారు.ఆ పోస్ట్ ప్రకారం, ఈ జంట మొత్తం ఆస్తి రూ.11. 5 కోట్లు. ఈ ఆస్తులలో రియల్ ఎస్టేట్లో సుమారు రూ. 3.2 కోట్లు, ఇండియన్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో రూ. 1.8 కోట్లు, యూఎస్ ఈక్విటీలలో రూ. 5 కోట్లు, నగదు, పదవీ విరమణ పొదుపుల రూపంలో దాదాపు రూ. 1.5 కోట్లు ఉన్నాయి. వారి వార్షిక గృహ ఖర్చులు సుమారు రూ. 22 లక్షలుగా అంచనా. అయితే పదవీ విరమణ చేసిన తమ తల్లిదండ్రులకు అండగా ఉండటం కోసం, ఈ జంట మొదట్లో తమ సంపదను పెంచుకుంటూనే ఉండాలని ప్రణాళిక వేసుకున్నారని ఆ పోస్ట్ పేర్కొంది. అయితే, ఎక్కువ పని గంటలు, నిరంతర ఒత్తిడి,పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు వారి ప్రాధాన్యతలను పునరాలోచించుకునేలా చేశాయట. అందుకే తాము రిటైర్ అయ్యే ముందు మరో రెండు, మూడేళ్లు పనిచేసి మరికొంత సొమ్మును దాచుకోవాలని భావిస్తున్నారు.ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్నెటిజన్ల రియాక్షన్స్ ఈ నిర్ణయం ఆన్లైన్లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొందరు నెటిజన్లు రూ. 11.5 కోట్ల నెట్వర్త్ , పిల్లలు లేని కుటుంబానికి రూ. 22 లక్షల వార్షిక ఖర్చుల దృష్ట్యా ఈ రిటైర్మెంట్ ప్లాన్ సరైనదేనని సమర్థించారు. మరికొందరు ముందస్తు రిటైర్మెంట్ (Early Retirement)కు సుదీర్ఘమైన ఆర్థిక ప్రణాళిక, నిరంతర క్యాష్ ఫ్లో అవసరమని హెచ్చరించారు. కెరీర్ పురోగతి కంటే ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం , సమయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నేటి యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని చాలామంది అభిప్రాయపడటం విశేషం.ఇదీ చదవండి: 33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్కు సర్ప్రైజ్ ఎమోషనల్ వీడియోఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలు -
పాల ప్యాకెట్ల కింద లిక్కర్ బాటిల్స్!.. క్లాస్రూంలోనే దావత్!!
యువతను మత్తు పదార్థాల బారినుంచి దూరం చేయడమే లక్ష్యంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సమయంలో.. అదే రాష్ట్రంలో ఓ గవర్నమెంట్ స్కూల్లో ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. క్లాస్రూంలో.. అదీ అమ్మాయిలు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విజయ్ సర్కార్ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కన్యాకుమారి జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. తరగతి గది సమీపంలో ఇద్దరు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ పాఠశాలలో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తరగతులు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు పాఠశాలలోనే ఉండగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.విజయ్ ప్రభుత్వం యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా స్థాయిలో నిఘా వ్యవస్థలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తుక్కలై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.వైరల్ వీడియోతో కదిలిన యంత్రాంగంమద్యం సేవిస్తున్న దృశ్యాలను మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో కన్యాకుమారి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. విద్యార్థినులు ఎవరు? పాఠశాల ప్రాంగణంలోకి మద్యం ఎలా వచ్చింది? పర్యవేక్షణలో లోపం జరిగిందా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా ఎవాంజెలిన్ను మరో పాఠశాలకు బదిలీ చేశారు. విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.రాజ్కుమార్ అరెస్ట్విద్యార్థినులకు మద్యం అందించింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత తోటి విద్యార్థులపై అనుమానం వ్యక్తమైనప్పటికీ.. వారి ప్రమేయం లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత తక్కలై ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల రాజ్కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పాలు సరఫరా చేసే వ్యక్తిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ విద్యార్థినికి పరిచయస్తుడైన రాజ్కుమార్.. ఆమె కోరడంతో మద్యం కొనిచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.కౌన్సెలింగ్కు ఆదేశాలుఘటన అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థినులకు కూడా మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. మరోవైపు.. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల నియంత్రణ, పర్యవేక్షణ మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువతను మత్తుకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఇలాంటి ఘటనలు మరింత అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. -
20 మంది మహిళలను మోసం చేసి.. లగ్జరీ లైఫ్
హైదరాబాద్: లగ్జరీ కార్లలో తిరగడం..ఖరీదైన దుస్తులు వేసుకోవడం..ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టుచేయడం.. స్నాప్ ఛాట్లో మహిళలతో పరిచయాలు పెంచుకోవడం.. స్నేహం చేయడం.. ఆ తరువాత వారిని మోసం చేసి బంగారు ఆభరణాలు చోరీ చేయడం.. ఇదీ వారి వ్యవహారం. ఇలా ఇద్దరు వ్యక్తులు కలిసి 20 మంది మహిళలను మోసం చేసి 40 తులాల ఆభరణాలను మాయం చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు వరికి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏసీపీ శంకర్రెడ్డి వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన సాగర్ చౌదరి అలియస్ సాయిసునీల్(25), శివాంగుల భరత్కుమార్(28) ఖరీౖదైన కార్లను అద్దెలకు తీసుకుని స్నాప్ చాట్ వేదికగా పరిచయం పెంచుకుని మహిళలతో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. ఈ నే«పథ్యంలో పలువురు మహిళలను నమ్మిం వారి నుంచి 40 తులాల వరకు బంగారు ఆభరణాలను చోరీలకు పాల్పడ్డారు. భరత్కుమార్ తనకున్న పరిచయాల ద్వారా ఆభరణాలను నగల దుకాణదారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ఆగడాలపై పలువురు మహిళలు ఫిర్యాదులు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. ఆర్సీ పురం, ఎల్బీనగర్, పేట్ బషీరాబాద్ పరిధిలో పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు సాగర్ చౌదరి గతంలో అత్యాచారం కేసులో అరెస్టు కూడా అయ్యాడు. ఇప్పటి వరకు వీరి బారిన పడి మోసపోయిన 20 మంది బాధితులను పోలీసులు గుర్తించారు. మరికొంత మంది బాధితులు ఉండే అవకాశముందని, వీరిని రిమాండ్కు తరలించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ శంకర్రెడ్డి పేర్కొన్నారు. -
‘మరీ ఇలా ఉన్నారేంటి!’.. ఇజ్రాయెల్ సెటిలర్ల దుశ్చర్య
ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం కేవలం భూమి, సరిహద్దులకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు నీటి వనరులపై ఆధిపత్య పోరు కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. సహజ ఊటలను ఇజ్రాయెలీ సెటిలర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా నిలిచిపోవడంతో తమ వ్యవసాయం, జీవనాధారం దెబ్బతింటోందని కన్నీరు పెడుతున్నారు. అయితే మరో వాదనతో ఇజ్రాయెలీ వర్గాలు తమ చర్యలను సమర్థించుకుంటున్నాయి.జోర్డాన్ లోయలోని ఫసాయిల్ గ్రామం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. తరతరాలుగా స్థానిక రైతులకు ఆధారంగా ఉన్న ఓ సహజ ఊట నీటిని ఇజ్రాయెల్ సెటిలర్లు మళ్లించుకున్నారు. ఆ సమీపంలోని ఓ పురాతన కొలనును నింపి.. ఈతలు కొడుతూ వినోదం పొందుతున్నారు. అదే సమయంలో కొందరు.. ఉత్త పుణ్యానికే ట్యాంకర్లలో ఊట నీటిని నింపి దారి పొడవునా పారబోసుకుంటూ పోవడం, నిర్జన ప్రదేశంలో వదిలేయడం లాంటి దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాలస్తీనా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.Israeli settler terrorists deliberately emptied Palestinian water tanks onto the ground in Ein al-Hilweh, in the northern Jordan Valley of the occupied West Bank.Palestinians in this herding community struggle every day for water after Israeli settlers seized their main spring… pic.twitter.com/EzRjMz621l— Ihab Hassan (@IhabHassane) August 10, 2026ఈ నీటితో గతంలో తమ పొలాల్లో వంకాయలు, సొరకాయలు, పుచ్చకాయలు వంటి పంటలు పండించేవారమని.. ఇప్పుడు సాగు నిలిచిపోయిందని వాపోతున్నారు. “నీరు లేకపోవడంతో మా పొలాలు ఎండిపోయాయి. కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది” అని ఫసాయిల్కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి పైపులను స్వాధీనం చేసుకున్నారని, ఊట వైపు వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.కొలనుగా మారిన ఊట.. పర్యాటక ప్రాంతమా?స్థానికులు చెబుతోంది ఏంటంటే.. ఊట నీటిని మళ్లించి పురాతన కొలనును నీటితో నింపారు. అనంతరం దానిని పర్యాటక ఆకర్షణగా ప్రచారం చేశారు. అయితే ఇజ్రాయెల్కు చెందిన కొందరు సెటిలర్లు మాత్రం మరోలా వాదిస్తున్నారు. ఈ ప్రాంతం తమ చారిత్రక వారసత్వంలో భాగమని చెబుతున్నారు. కానీ ఇందులో నిజమెంత? అనేదానిపై పురావస్తు నిపుణులు మరోలా స్పందించారు.Israeli "settlers" in the occupied West Bank diverted a spring that had long served as a lifeline for the Palestinian village of Fasayil, redirecting its water to fill a pool at an archaeological site and turning it into a tourist attraction.Palestinian farmers said the loss of…— Clash Report (@clashreport) August 14, 2026ఈ ప్రాంత చరిత్రపై పూర్తి స్పష్టత లేదని అంటున్నారు. దీంతో చరిత్ర, పురావస్తు అంశాలను ఉపయోగించి వెస్ట్ బ్యాంక్పై ఆధిపత్య భావనను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.‘ఇది నీటి యుద్ధం’.. పాలస్తీనా ఆరోపణపాలస్తీనా అధికారులు మాత్రం నీటి వనరుల నియంత్రణను పెద్ద సమస్యగా చూస్తున్నారు. నీటిని నిలిపివేయడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. “ఇది శబ్దం లేని బుల్లెట్లాంటి నీటి యుద్ధం” అని పాలస్తీనా వాటర్ అథారిటీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. వెస్ట్ బ్యాంక్లోని పలు నీటి, పారిశుద్ధ్య వనరులపై ఈ ఏడాది దాడులు జరిగినట్లు నమోదైంది. ముఖ్యంగా జోర్డాన్ లోయ ప్రాంతాల్లో నీటి వనరులపై నియంత్రణ కోసం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అతిత్వరలో ఇది తాగునీటికి విస్తరించవచ్చనే ఆందోళన సైతం వ్యక్తమవుతోంది అక్కడ. గ్రామాలపై పెరుగుతున్న ఒత్తిడినీటి సమస్యతో పాటు సెటిలర్ల దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని పాలస్తీనియన్లు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని చెప్పారు. మరోవైపు.. ఇజ్రాయెల్ సెటిలర్లు మాత్రం అవంతా ఆరోపణలనే అంటున్నారు. ఈ ప్రాంతాలు తమ చారిత్రక, మతపరమైన వారసత్వంతో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. పురాతన ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహంలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సమర్థించుకుంటున్నారు.భవిష్యత్లో మరింత ఉద్రిక్తత?వెస్ట్ బ్యాంక్లో భూమి తర్వాత నీరు మరో ప్రధాన వివాద అంశంగా మారుతోంది. వ్యవసాయం, తాగునీరు, జీవనోపాధికి ఆధారమైన సహజ వనరులపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరు భవిష్యత్లో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
తాతను చంపేందుకు సోషల్ మీడియాలో సెర్చ్.. బాలుడి కిరాతకం
జైపూర్: రాజస్థాన్లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో యువకుడు తన తాతను కిరాతకంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని మూటలో కట్టి నదిలో పడేశాడు. అయితే ఈ హత్య ఏలా చేయాలో తెలుసుకోవడానికి అతను సోషల్ మీడియాలో వెతికాడు. నది ఒడ్డున మృతదేహం లభించడంతో పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయిటపడింది.పాలి జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా 16 ఏళ్ల బాలుడు తన 85 ఏళ్ల తాతను స్నేహితుడి సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని మూటలో కట్టి స్కూటర్పై నది సమీపానికి తీసుకెళ్లి నీటిలో పడేసినట్లు పేర్కొన్నారు. స్థానికులు నది సమీపంలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఛాతిపై కత్తిపోట్లు ఉండటంతో పాటు గొంతు నులిమిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులను విచారించడంతో కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.కుటుంబ సభ్యులు వృద్ధుడు కనిపించకపోయినా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించడంతో బాలుడు ఆందోళనకు గురై చివరకు హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కాగా ఈ హత్య కోసం బాలుడు ఆన్లైన్లో హత్య చేసే పద్ధతులు, మెడపై ఎలా దాడి చేస్తే ప్రాణాలు పోతాయనే అంశాలపై ఆ వెతికినట్లు దర్యాప్తులో గుర్తించారు. తన స్నేహితుడితో కలిసి స్క్రూడ్రైవర్, కత్తితో తాతపై దాడి చేసి, మృతదేహాన్ని ఓ గోనె సంచిలో పెట్టినట్లు బాలుడు చెప్పాడు. అనంతరం ఇద్దరూ ఆ సంచిని స్కూటర్పై నది సమీపానికి తీసుకెళ్లి మృతదేహాన్ని నీటిలో పడేసి తిరిగి ఇంటికి వచ్చి ఏమి తెలియనట్లు నిద్రపోయాడని పోలీసులు పేర్కొన్నారు.సోషల్ మీడియా ద్వారా తండ్రి మరణించిన విషయం తెలుసుకున్న ముంబైలోని ఇద్దరు కుమారులు పోలీస్ స్టేషన్లో హత్యపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి స్నేహితుడితో పాటు పొలంలో కాపలాదారుగా పనిచేసే 50 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. హత్యకు అసలు కారణం ఏమిటి, ఈ ఘటనలో ఇతరుల పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
పిరికిపందలు.. మా గొంతు నొక్కాలని చూశారు: దీప్కే సంచలన వ్యాఖ్యలు
ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం సంచలన ఆరోపణలు చేశారు. సీజేపీ ఉద్యమానికి సంబంధించిన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను మెటా తొలగించిందని ఆయన ఆరోపించారు. ఖాతా అందుబాటులో లేదని చూపిస్తున్న స్క్రీన్షాట్లను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే ఎక్స్లో స్పందిస్తూ.. ‘కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను తొలగించారు. పిరికిపందలు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన షేర్ చేసిన స్క్రీన్షాట్లలో సీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ అందుబాటులో లేదని, ‘User not found’ అనే సందేశం కనిపించింది. దీంతో మెటానే తమ ఖాతాను తొలగించిందని ఆయన ఆరోపించారు.ఈ పరిణామంపై సీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా కూడా స్పందించింది. తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను ఉదయం తొలగించారని, అయితే కొద్దిసేపటికే ఖాతాను విజయవంతంగా తిరిగి పొందామని వెల్లడించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజునే తమ గొంతును నొక్కేందుకు ప్రయత్నించారని పార్టీ ఆరోపించింది. తమను వ్యతిరేకించే వారు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించింది. ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. అయితే సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తాత్కాలికంగా ఎందుకు అందుబాటులో లేకుండా పోయిందనే విషయంపై మెటా నుంచి అధికారిక వివరణ వెలువడినట్లు సమాచారం లేదు.🚨CJP Instagram handle was taken down this morning 🚨But we have been able to successfully recover the account. What a shame that those who oppose CJP chose India’s Independence Day to try to muzzle our voice. We will not be intimidated by such cowardly acts! ✊ https://t.co/Wz3rhExHpu— Cockroach Janta Party - CJP (@Cockroachisback) August 15, 2026అభిజీత్ దీప్కే సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన వివాదం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని ఆయన ఆరోపించారు. తన ఖాతాలోకి ప్రవేశించలేకపోతున్నానని, తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదని అప్పట్లో ఎక్స్లో పేర్కొన్నారు. సీజేపీ కోసం ఉపయోగిస్తున్న బ్యాకప్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా మెటా తొలగించిందని ఆయన ఆరోపించారు.‘స్కూల్ ఠీక్ కరో’ ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సీజేపీ ‘స్కూల్ ఠీక్ కరో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని దీప్కే స్వగ్రామం సంతుక్ పింప్రిలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. శనివారం ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మరమ్మతులు చేయించి, విద్యార్థులకు బెంచీలు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సర్పంచ్ను కోరనున్నట్లు దీప్కే తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇతర గ్రామాలకూ విస్తరించేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామస్థులు, సర్పంచ్ల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలను స్వయంగా సందర్శించి, అక్కడ ఏవైనా సౌకర్యాల కొరత ఉంటే CJPకి సమాచారం ఇవ్వాలని దీప్కే పిలుపునిచ్చారు. దీంతో సోషల్ మీడియా ఖాతా వివాదం మధ్యే గ్రామీణ పాఠశాలల సమస్యలపై ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు CJP సిద్ధమవుతోంది. -
‘‘అనని మాటలూ అన్నట్టు చూపించారు’’
న్యూఢిల్లీ: కోర్టు విచారణల తాలూకూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందర్భ రహితంగా ప్రసారం అవుతూండటంపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కాక్రోచ్లంటూ తాను చేసిన వ్యాఖ్యను దురుద్దేశంతో తప్పుగా చిత్రీకరించి, వాడి దేశ యువతను తప్పుదారి పట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మే నెల 15న ఒక కేసు విచారణ సందర్బంగా సీజేఐ మాట్లాడుతూ నకిలీ డిగ్రీలున్న కొంతమంది వ్యక్తులు వ్యవస్థలపై దాడి చేసేందుకు ఆర్టీఐ కార్యకర్తలుగా/సోషల్ మీడియాగా మారుతున్న వారిని బొద్దింకలు (కాక్రోచెస్)గా వరి్ణంచారు. అయితే ఈ వ్యాఖ్యపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగడం, ‘కాక్రోచ్ జనతా పారీ్ట’పేరుతో ఆన్లైన్ వ్యంగ్య ఉద్యమం ప్రారంభం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐ దూరదర్శన్ న్యూస్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కాలంలో కోర్టు విచారణల తాలూకూ క్లిప్లు సందర్భ రహితంగా సోషల్ మీడియాలో ప్రసారమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘నా వ్యాఖ్యను వక్రీకరించారు. ఉపయోగించుకున్నారు. చెప్పనిదాన్ని కూడా చెప్పినట్టుగా చూపారు. ఇది చాలా దురదృష్టకరం. దేశ యువతను తప్పుదారి పట్టించేందుకు దురుద్దేశంతో చేసిన ప్రయత్నం’’అని చెప్పారు. జర్నలిస్టులు న్యాయ ప్రక్రియలకు సంబంధించిన రిపోరి్టంగ్కు బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించారు. సమాజంలో సామరస్య వాతావరణాన్ని కాపాడటం ప్రతి పౌరుడి కర్తవ్యమని అన్నారు. ‘‘మీరు సోషల్ మీడియాలో ఉన్నారు. లేదంటే ప్రింట్ మరో రకమైన మీడియా. అదీ కాదంటే మీరు ఓ సాధారణ పౌరుడైనా కావచ్చు. అందరికీ హక్కులున్నాయి. రాజ్యాంగపరమైన విధులు, బాధ్యతలూ ఉన్నాయి’’అని చెప్పారు. ‘‘హక్కుల గురించి మాట్లాడితే మనం మన బాధ్యతలను కూడా నిర్వర్తించే సామర్థ్యం కలిగి ఉండాలి. కాబట్టి వాళ్లు తమ బాధ్యతలను మనసులో ఉంచుకోవాలని కోరుతున్నా. సమాజంలో సామరస్యం నెలకొని ఉండేలా చూసేందుకు మనమందరం శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి’’అని వివరించారు. వ్యాపారం కోసం వాడుకున్నారు... కోర్టు ప్రక్రియలకు సంబంధించిన ఆడియో, వీడియోలను సరైన అనుమతుల్లేకుండా ప్రసారం చేయడం, పోస్ట్, అప్లోడ్ చేయడం, వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడంపై తాను ఇటీవల జారీ చేసిన ఆదేశాలను కూడా ప్రస్తావించిన సీజేఐ... న్యాయప్రక్రియల్లో పారదర్శకత అవసరమైనప్పటికీ అది వ్యాపారానికి దారి తీయకూడదని స్పష్టం చేశారు. పారదర్శకతకు కట్టుబడి ఉన్నందునే సు ప్రీంకోర్టులో ప్రత్యక్ష ప్రసారాలను మొదలుపెట్టామని, అయితే దీన్ని కూడా దుర్వినియోగం చేశారని, వ్యాపారం కోసం వాడుకున్నారని.. కొంతమంది చి న్న క్లిప్పులను (విచారణకు సంబంధించినవి) వ్యక్తిగత లాభాల కోసం దుర్వినియోగం చేశారని, మరికొందరు వ్యాపారం కోసం వాడుకున్నారని ఆయన చెప్పారు. దీనికి అడ్డుకట్ట పడాల్సిందేనన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సీజేపీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్మంతర్లో నెల రోజులపాటు నిరసన ప్రదర్శనలు జరగడం జూలై 20న ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు తలెత్తడం తెలిసిందే. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. నిరసన కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది కూడా. -
ఆస్తి దాహం.. కొడుకు చేసిన పని వైరల్
ఆస్తి కోసం బంధాలను మరిచిపోయిన ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. మంచాన పడ్డ తండ్రికి వైద్యం చేయిస్తానంటూ అందరినీ నమ్మబలికి తన వెంట తీసుకెళ్లాడు. ఆపై ప్రాణం పోయాక.. ఛీ కొట్టే పనికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో వైరల్ అవుతోంది. యూపీ లక్నోలోని ఖరౌహా గ్రామానికి చెందిన ఛత్రపాల్ (75)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకు మహేంద్ర, కోడలు లక్ష్మి ఛత్రపాల్ను వేధించసాగారు. దీంతో ఆయన తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ జీవనం సాగించారు. ఈ క్రమంలో.. ఓరోజు తన ఆస్తిని కూతుళ్లకు సమానంగా పంచుతున్నానని, కొడుకు-కోడలును బహిష్కరిస్తున్నట్లు పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ పరిణామంతో మహేంద్ర, అతని భార్య రగిలిపోయారు. అయితే జులై 7న ఛత్రపాల్ ఆరోగ్యం క్షీణించడంతో మహేంద్రకు అతని సోదరి సమాచారం ఇచ్చింది. దీంతో మహేంద్ర తన కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి, వైద్యం చేయిస్తానంటూ తండ్రిని తన వెంట తీసుకెళ్లాడు. ఆ రెండు రోజులకే అంటే జులై 9న ఛత్రపాల్ మృతి చెందారు.తండ్రి అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకున్న కుమార్తెలకు మరో షాక్ ఎదురైంది. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మహేంద్ర తన మృత తండ్రి బొటనవేలిని ఖాళీ కాగితాలపై ముద్రిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ పత్రాలపై తీసుకున్న వేలిముద్రలను భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగించుకుంటారోనని అనుమానం వ్యక్తం చేశారు.ఆపై ఊహించిందే జరిగింది. ఆస్తంతా తనదేనంటూ గొడవకు దిగాడు మహేంద్ర. దీంతో ఛత్రపాల్ కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. తండ్రి శవంతో ఖాళీ పేపర్లపై వేలిముద్ర వేయించుకున్న దృశ్యాల్ని పోలీసులకు సమర్పించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైరల్గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
10 ఏళ్లకు స్టైల్ మార్చిన ఇన్స్టా, నెటిజన్ల స్పందన వైరల్
సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ (Instagram) తన స్టైల్ మార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తన వర్డ్మార్క్ లోగో (అక్షరాల శైలి)ను రీఫ్రెష్ చేసింది. ఈ విషయాన్ని మెటా ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆదమ్ మోస్సేరి ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ వైరల్గా మారాయి. గత 10 ఏళ్లుగా యాప్ పైన ఉండే వర్డ్మార్క్ మారలేదు. అందుకే ఈ మార్పు చేశాం. ఇది మరింత క్లీన్గా, మోడరన్గా ఉంటూనే ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ శైలిని ప్రతిబింబిస్తుంది అంటూ ఆదమ్ మోస్సేరి ఈ మార్పుపై వివరణ ఇచ్చారు. View this post on Instagram A post shared by Adam Mosseri (@mosseri) ఇన్స్టాగ్రామ్ పేరులోని అక్షరాల రూపాన్ని (Typography) పునఃరూపకల్పన చేశారు. పాత స్క్రిప్ట్ శైలినే కొనసాగిస్తూనే, అక్షరాలను మరింత స్పష్టంగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే అందరికీ సుపరిచితమైన రంగుల గ్రాడియంట్ కెమెరా ఐకాన్ (Camera Icon)లో ఎలాంటి మార్పు లేదు. 2016లో క్లాసిక్ బ్రౌన్ కెమెరా స్థానంలో ఈ గ్రాడియంట్ ఐకాన్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనఈ కొత్త డిజైన్పై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్ అసలుగుర్తింపు దెబ్బతినకుండా చక్కగా మోడరనైజ్ చేశారని కొందరు యూజర్లు మెచ్చు కుంటున్నారు. మరికొందరు ఈ డిజైన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రూపొందించినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. వర్డ్మార్క్లోని 'r' అక్షరం చూడటానికి 'z' లాగా కనిపిస్తోందని, ఇన్స్టాగ్రామ్ కాస్త "Instagzam" లా మారింది అంటూ మరికొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. స్టేషన్లో పెళ్లి.. గంటలోనే విషాదం!
ఇన్స్టాగ్రామ్లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ ప్రేమ కోసం కుటుంబాన్ని ఎదిరించింది. ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరకు రైల్వే స్టేషన్లోనే అతడి చేత సింధూరం పెట్టించుకుంది. కొత్త జీవితంపై ఎన్నో కలలు కంటూ.. ఆ పెళ్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పెళ్లైన కొన్ని గంటల్లోనే ఆమె జీవితం విషాదంగా ముగిసింది.బీహార్లోని పూర్ణియా జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 19 ఏళ్ల మానిషా కుమారి బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. దిల్ఖుష్ కుమార్ అనే 20 ఏళ్ల యువకుడితో ఆమెకు ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ ప్రేమకు కుటుంబం నుంచి అంగీకారం లభించలేదు. మానిషాకు మరో యువకుడితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మానిషా.. ప్రియుడు దిల్ఖుష్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఆగస్టు 10న దిల్ఖుష్ మానిషాను అరారియా నుంచి తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ పూర్ణియా జంక్షన్కు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు లేరు.. బంధువులు లేరు.. పెళ్లి సందడి లేదు. అయినా తమ ప్రేమే తమకు అండగా భావించిన ఆ జంట.. రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే పెళ్లి చేసుకున్నారు. దిల్ఖుష్ మానిషా పాపిట్లో సింధూరం పెట్టాడు. ఇద్దరూ భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ ఆనంద క్షణాలను కెమెరాలో బంధించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కానీ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించిన కొద్దిసేపటికే కథ ఒక్కసారిగా మారిపోయింది.పెళ్లి తర్వాత ఇద్దరూ రాంబాగ్ నుంచి సిటీ కాళీ ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ఎండ తీవ్రంగా ఉంది. మార్గమధ్యంలో మానిషాకు ఒక్కసారిగా కళ్లు తిరిగాయి. దీంతో, ఆమెను హుటాహుటిన పూర్ణియా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. మరోవైపు.. కుటుంబ సభ్యులు తమ కూతురి కోసం వెతుకుతున్నారు. ఇంతలో ఆసుపత్రిలో విషాద వార్త వినిపించింది. చికిత్స పొందుతూనే మానిషా మృతి చెందింది. కొన్ని గంటల క్రితం భర్త పక్కన నిలబడి సింధూరంతో పెళ్లి ఫొటో దిగిన యువతి.. అదే రోజు విగతజీవిగా మారింది. మానిషా కుటుంబ సభ్యులు ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోలు చూసి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎక్కడుందో తెలుసుకునేలోపే.. ఆమె మరణవార్త కుటుంబానికి చేరింది.మానిషాకు అకస్మాత్తుగా ఏమైంది?ఎండ కారణంగానే ఆమె అస్వస్థతకు గురైందా? లేక ఆమె మరణం వెనుక మరేదైనా కారణం ఉందా? యువతి ఆకస్మిక మరణం అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేహాట్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. మానిషా భర్త దిల్ఖుష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరారియా నుంచి బయలుదేరినప్పటి నుంచి.. స్టేషన్లో జరిగిన పెళ్లి.. ఆలయానికి వెళ్తున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడం.. ఆసుపత్రిలో మృతి చెందడం వరకు జరిగిన మొత్తం పరిణామాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మానిషా మృతికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడనుంది. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో మొదలైన ప్రేమ.. చివరకు రైల్వే స్టేషన్లో పెళ్లిగా మారింది. ఆ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో మెరిసిన కొన్ని గంటల్లోనే.. అదే కథ విషాదంగా ముగిసింది. -
అదంతా ఫేక్?.. జెన్జీ ముసుగు వెనుక షాకింగ్ ‘లెక్క’!
సోషల్ మీడియాలో ఓ తరం.. వీధుల్లో మరో శక్తి.. అంటూ జెన్ జీ గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. భారత్లోనూ పరీక్షల వ్యవహారాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యవస్థలపై ప్రశ్నలతో జెన్ జీ యువత ఆందోళనలు చేపట్టిన సందర్భాలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. అయితే పోరాటాలు, ట్రెండ్స్, సోషల్ మీడియా యాక్టివిజంతో ఎప్పుడూ వార్తల్లో కనిపించే ఈ తరం.. తమ వ్యక్తిగత జీవితంలో డబ్బు విషయంలో ఎలా వ్యవహరిస్తోంది?.. ఓ తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రావెల్, లైఫ్స్టైల్, ఎక్స్పీరియన్స్లకు ప్రాధాన్యం ఇచ్చే తరం అంటూ కనిపించే జెన్ జీ.. నిజ జీవితంలో మాత్రం డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందట!. భారీ కొనుగోళ్లు, విహారయాత్రల కంటే రోజువారీ అవసరాలు, బిల్లులు, ఆర్థిక బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది.శాలరీసే(SalarySe) నిర్వహించిన ఈ అధ్యయనం కోసం 5.2 లక్షల మందికి పైగా జీతం పొందుతున్న Gen Z వినియోగదారుల యూపీఐ లావాదేవీలను విశ్లేషించారు. సాధారణంగా జెన్జీ అంటే ప్రయాణాలు, డిజిటల్ లైఫ్, అనుభవాల కోసం ఎక్కువ ఖర్చు చేసే తరం అనే అభిప్రాయం ఉంది. కానీ వాస్తవ ఖర్చుల లెక్కలు మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి.70 శాతం ఖర్చు.. ఈ ఐదు కేటగిరీలకే!జెన్జీ తమ నెలవారీ ఖర్చుల్లో ఎక్కువ భాగం అవసరాలకే వెళ్తోంది. బిల్లులు, సబ్స్క్రిప్షన్లు అత్యధికంగా 20.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత కిరాణా సరుకుల కోసం 15.7 శాతం ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ సంబంధిత చెల్లింపులకు 12.2 శాతం, షాపింగ్కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతం ఖర్చవుతోంది. ఈ ఐదు విభాగాలు కలిపి నెలవారీ ఖర్చుల్లో 70 శాతానికి పైగా ఆక్రమిస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో కనిపించే గ్లామర్ లైఫ్ కంటే.. జీవితంలోని సాధారణ అవసరాలే వారి బడ్జెట్లో పెద్ద భాగాన్ని తీసుకుంటున్నాయి.ట్రావెల్కు కేవలం 5 శాతంజెన్జీకు ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టం అనే ప్రచారం ఉన్నప్పటికీ.. వారి నెలవారీ ఖర్చుల్లో ట్రావెల్ వాటా కేవలం 5 శాతమేనని అధ్యయనం చెబుతోంది. ప్రయాణాలు, అనుభవాలపై ఆసక్తి ఉన్నా.. అవి వారి రెగ్యులర్ బడ్జెట్ను పెద్దగా ప్రభావితం చేయడం లేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ముందుగా బిల్లులు, అవసరాలు, ఆర్థిక నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే వినోదం, ప్రయాణాలపై ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.OTTలకు కూడా చోటుడిజిటల్ వినోదానికి Gen Zలో ఆదరణ కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సబ్స్క్రిప్షన్ ఖర్చుల్లో జియోహాట్స్టార్ 12.4 శాతంతో ముందంజలో ఉండగా.. నెట్ఫ్లిక్స్ 10.7 శాతం, స్పాటిఫై 5.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. యూపీఐ, ఆటోపే వంటి డిజిటల్ చెల్లింపు విధానాలు యువత ఆర్థిక అలవాట్లను మార్చుతున్నాయని అధ్యయనం పేర్కొంది. బిల్లులు ఆటోమేటిక్గా చెల్లించడం, సబ్స్క్రిప్షన్లు డిజిటల్గా కొనసాగడం వంటి విధానాలు Gen Z జీవితంలో సాధారణంగా మారాయి.వయసు పెరిగేకొద్దీ..అధ్యయనం 18–23 ఏళ్ల వయసు, 24–29 ఏళ్ల వయసు ఉన్న Gen Z గ్రూపులను కూడా పరిశీలించింది. ఆసక్తికరంగా.. ఇరు వర్గాల్లోనూ విచక్షణతో చేసే ఖర్చులు (డిస్క్రెషనరీ స్పెండింగ్) 32 శాతంగానే ఉన్నాయి. అయితే వయసు పెరిగేకొద్దీ అవసరాలపై ఖర్చు పెరుగుతోంది. 18–23 ఏళ్ల వయసు వారిలో అవసరాల ఖర్చు 50 శాతం ఉండగా.. 24–29 ఏళ్ల వయసు వారిలో అది 59 శాతానికి పెరిగింది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు పెరిగేకొద్దీ ఖర్చుల ప్రాధాన్యతలు మారుతున్నాయని ఇది సూచిస్తోంది.డిజిటల్ ఫైనాన్స్ వైపు Gen Zశాలరీసే సహ వ్యవస్థాపకుడు పీయూష్ బగారియా ప్రకారం.. భారత జెన్జీ పూర్తిగా డిజిటల్ ఆధారిత ఆర్థిక జీవనశైలిని అభివృద్ధి చేసుకుంటోంది. యూపీఐ విస్తృతి కారణంగా డబ్బు నిర్వహణ, చెల్లింపుల విధానం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు.మొత్తంగా చూస్తే.. సోషల్ మీడియాలో కనిపించే ట్రావెల్, లైఫ్స్టైల్ ఇమేజ్కు భిన్నంగా జెన్జీ వాస్తవ ఖర్చుల తీరు కనిపిస్తోంది. కలలు, అనుభవాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. ముందుగా బిల్లులు, అవసరాలు, ఆర్థిక భద్రతకే యువత ప్రాధాన్యం ఇస్తోందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. -
‘ఆపండి.. ప్లీజ్’.. క్షణక్షణానికీ పెరిగిన భయం.. ర్యాపిడో బైక్ నుంచి దూకిన యువతి
ఆఫీసుకు వెళ్లేందుకు బుక్ చేసుకున్న ర్యాపిడో బైక్.. కొద్దిసేపటికే ఆమెకు భయానక ప్రయాణంగా మారింది. తెలిసిన రోడ్డు కాస్తా నిర్మానుష్యమైన మార్గంగా మారింది. గమ్యం వైపు వెళ్తున్నామా.. లేక ఎక్కడికో తీసుకెళ్తున్నారా అన్న అనుమానం మొదలైంది. ‘బైక్ ఆపండి.. మరో రూట్లో వెళ్లండి’ అంటూ ఆమె ఎంత చెప్పినా డ్రైవర్ ఆపలేదని బాధితురాలు ఆరోపించారు. చివరకు ప్రాణాలపై భయంతో కదులుతున్న బైక్ నుంచే దూకేశారు. అనంతరం, ఓ వీడియో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది.వీడియో ప్రకారం.. బాధితురాలు ఆయేషా శ్రీవాస్తవ ఆఫీసుకు వెళ్లేందుకు ర్యాపిడో బైక్ను బుక్ చేసుకున్నారు. తొలుత ప్రయాణం సాధారణంగానే సాగింది. కానీ కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ తాను గుర్తించలేని, నిర్మానుష్యంగా కనిపించే మరో మార్గంలోకి బైక్ను మళ్లించడంతో ఆమెకు అనుమానం వచ్చింది. చుట్టూ చూస్తే పెద్దగా జనసంచారం కనిపించకపోవడంతో భయపడినట్లు ఆమె తెలిపారు. డ్రైవర్ను ప్రశ్నించగా.. అది విశ్వవిద్యాలయానికి వెళ్లే నేరుగా ఉన్న దారేనని చెప్పినట్లు ఆయేషా పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమెకు నమ్మకం కలగలేదు. మరో మార్గంలో వెళ్లాలని, లేదంటే బైక్ను ఆపాలని పలుమార్లు కోరినప్పటికీ డ్రైవర్ స్పందించలేదని ఆరోపించారు.Gig worker shcoker: A Terrifying Ride: Demand for Accountability In Delhi Ayesha Srivastav had to jump off a moving Rapido bike. The driver ignored her requests, took an isolated route and refused to stop. She suffered injuries from the jump.Shockingly Rapido took action… pic.twitter.com/J463SCdg0B— Ramesh Tiwari (@rameshofficial0) August 12, 2026పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన ఆమె.. డ్రైవర్ను ఆపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. దీంతో తన భద్రతపై తీవ్ర భయానికి గురై.. చివరకు కదులుతున్న బైక్ నుంచి దూకేశారు. రోడ్డుపై పడిపోవడంతో ఆయేషా చేతులు, కాళ్లు, తలకు గాయాలయ్యాయి. వైద్య చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఘటన తర్వాత కూడా తనకు సరైన స్పందన లభించలేదని ఆమె ఆరోపించారు. ర్యాపిడో కస్టమర్ సపోర్ట్ను సంప్రదించినా సకాలంలో స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాను ఆశ్రయించారు. View this post on Instagram A post shared by ✩⋆ 🖤 𝒜𝓎𝑒𝓈𝒽𝒶 𝓈𝓇𝒾𝓋𝒶𝓈𝓉𝒶𝓋 🖤 ⋆✩ (@ayesha_srivastav96) ‘వేలాది మంది మహిళలు ప్రతిరోజూ ర్యాపిడోలో ప్రయాణిస్తున్నారు. మహిళల భద్రత విషయంలో మీరు ఏం చేస్తున్నారు? డ్రైవర్ వివరాలు ఇవ్వండి. అతడిపై చర్యలు తీసుకోండి’ అంటూ ఆమె సంస్థను ప్రశ్నించారు. ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ర్యాపిడో స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపిన సంస్థ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్ను తమ ప్లాట్ఫామ్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. డ్రైవర్ వివరాలను ఆయేషాకు అందజేసినట్లు, అవసరమైన న్యాయపరమైన చర్యల్లో ఆమెకు సహకరిస్తామని తెలిపింది. వైద్య లేదా చట్టపరమైన సహాయం అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. -
‘ఆయనకేం.. చెత్తబుట్టలో కూడా దాక్కుంటారు!’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించిన రహస్య ఆపరేషన్ అంతర్జాతీయ చర్చకు దారితీసింది. టర్కీలోని అంకారాలో నాటో సదస్సు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆయన్ని మరో చిన్న విమానంలోకి మార్చిన ఘటనపై విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ మీడియా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ ఘటన అమెరికా అధ్యక్షుడి భద్రతా ఆందోళనలను బయటపెట్టిందంటూ వ్యాఖ్యానించింది.నాటో సదస్సు కోసం టర్కీ వెళ్లిన ట్రంప్ తిరుగు ప్రయాణం సందర్భంగా ఎయిర్ఫోర్స్ వన్పై క్షిపణి (shoulder-fired missile) దాడి ముప్పు ఉందన్న సమాచారంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది. ముప్పు నమ్మదగినదిగా, తక్షణ చర్య అవసరమయ్యే స్థాయిలో ఉందని భావించి ఈ రహస్య మార్పిడి చేపట్టినట్లు సమాచారం.ఇరాన్ మీడియా వ్యంగ్యంఈ ఘటనను ఇరాన్ ప్రభుత్వ మీడియా తమ ప్రచారానికి ఉపయోగించుకుంది. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సైనిక శక్తికి భయపడుతున్నారనే సంకేతంగా ఈ విమాన మార్పిడిని చిత్రీకరించింది. ట్రంప్ తాజా “స్కాండల్”గా అభివర్ణిస్తూ.. ఇది ఆయనకు అవమానకర పరిస్థితి అని ఇరాన్ టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఇరాన్ దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్రంప్ను కేటరింగ్ బాక్స్లో దాచినట్లు చూపించే మీమ్ను కూడా షేర్ చేసింది. “త్వరలో చెత్త బుట్టలో దాచాల్సి వస్తుంది” అనే వ్యాఖ్యను జోడించింది.He will be hidden in a trash can before long. pic.twitter.com/ZTkAahNIKw— Iran Embassy SA (@IraninSA) August 11, 2026Brave American hero, or a coward hiding in a catering truck? pic.twitter.com/t1vcmrdcHw— Iran Embassy SA (@IraninSA) August 12, 2026కేటరింగ్ వాహనంలో రహస్య తరలింపుజూలై 8న అంకారా నుంచి బ్రిటన్కు బయలుదేరే సమయంలో ట్రంప్, ఆయనతో ఉన్న కొద్దిమంది సిబ్బందిని కేటరింగ్ ట్రక్కు ద్వారా పెద్ద విమానం నుంచి చిన్న ప్రభుత్వ విమానం C-32Aలోకి మార్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అదే సమయంలో అసలు ఎయిర్ఫోర్స్ వన్ వేరుగా బయలుదేరింది. అందులో సీనియర్ అధికారులు, వైట్హౌస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఉన్నారు.ఈ ఆపరేషన్ వివరాలను తొలుత వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ట్రంప్ ప్రయాణ వివరాలు, ఆయన అంకారాలో ఉన్న హోటల్ అంతస్తు వరకు ఇరాన్కు తెలిసినట్లు అమెరికా అధికారులు ఆందోళన చెందారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అలాగే ఇలాంటి డీకాయ్ ఆపరేషన్లు(మోసపూరిత భద్రతా వ్యూహం) సర్వసాధారణమేనని వ్యాఖ్యానించింది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఘటనఅమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్పై గతంలోనూ దాడి కుట్ర ఆరోపణలు వచ్చాయి. 2024లో ట్రంప్ అప్పటి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆయన హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ ఓ ఇరానియన్పై కేసు నమోదు చేసింది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్ల యుద్ధం మొదలైంది. అయితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులకు శాశ్వత ముగింపు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటికీ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విమాన మార్పిడి ఘటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.భద్రతా చర్యా? రాజకీయ ప్రచారమా?అమెరికా వర్గాల ప్రకారం ఇది అధ్యక్షుడి భద్రత కోసం తీసుకున్న ముందస్తు జాగ్రత్త మాత్రమే. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సమాచారంతోనే డీకాయ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే కేవలం ఒక ఏజెన్సీ సమాచారంతోనే.. అదీ ధృవీకరణ చేసుకోకుండానే అమెరికా భద్రతా బలగాలు ట్రంప్ను అలా తరలించారని తర్వాత తెలిసింది. ఏది ఏమైనా.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరాన్ మాత్రం దీన్ని అమెరికా బలహీనతకు సంకేతంగా చూపిస్తూ ప్రచారం చేస్తోంది. ట్రంప్ను రక్షించేందుకు చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి కొత్త కారణంగా మారింది. -
ఫోన్ వల్లే ఇదంతా... మీ పిల్లలు జాగ్రత్త!
‘అవసరానికి మించి మొబైల్ వాడకండి. పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు, వాళ్లు మాట వినకుండా మారాం చేసేటప్పుడు ఫోన్ మాత్రం వాళ్లకు ఇవ్వకండి... అనుభవంతో చెబుతున్నా.. మొబైల్ వల్ల నరకం చూశా.’ అని ప్రముఖ నటి షకీల సోషల్ మీడియాలో తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. కొన్ని వందల సినిమాల్లో నటించిన షకీల సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు.. అయితే గంటల తరబడి ఫోన్ చూడడం, ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించేముందు ఫోన్ పక్కకు ఉంచి దానినే చూస్తూ పడుకోవడం వల్ల ఆమె ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఇటీవలే ఆమె మెడకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకుని డిచార్జ్ అయ్యారు. ఈ ఆపరేషన్కు లక్షల ఖర్చయిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఆమె నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గేమ్స్ ఆడడం, రీల్స్ చూడడం, యూట్యూబ్ కంటెంట్తో కాలక్షేపం చేయడం, అవసరం లేకున్నా ఏదో ఒకటి సర్ఫ్ చేస్తూ ఉండడం వల్లే ఈ వ్యాధి సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. మొబైల్ వాడకం అవసరమే.. కాని అవసరానికి మించి వాడడం వల్లే తనకీ దుస్థితి వచ్చిందని షకీల పేర్కొన్నారు. విపరీతమైన మెడనొప్పి వల్ల తీవ్రమైన బాధను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని, మొబైల్కి వారిని దూరంగా ఉంచండంటూ షకీలసోషల్ మీడియాలో పిల్లల తల్లిదండ్రులను కోరారు. -
టీచర్కు అండగా.. చుక్కలు చూపించిన జెన్ఆల్ఫా
దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు మరీ వయొలెంట్గా ఉండడంతో.. నెట్టింట ఆసక్తికరమైన చర్చా నడుస్తోంది. కొత్త తరం పిల్లలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం, తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. జార్ఖండ్లోని గర్వా జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి బదిలీని వ్యతిరేకిస్తూ హైస్కూల్ విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. కాండీ బ్లాక్ పరిధిలో విద్యార్థుల ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన బ్లాక్ చీఫ్ పింకు పాండే.. ఓ విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అసలు ఏం జరిగిందంటే..గర్వా జిల్లాలోని హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీ కావడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీని నిలిపివేయాలంటూ మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వీళ్లకు తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. మొదట జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఆందోళన.. తర్వాత కాండీ బ్లాక్ వరకు విస్తరించింది. రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.ఈ తరుణంలో విద్యార్థులతో మాట్లాడేందుకు బ్లాక్ చీఫ్ పింకు పాండే అక్కడికి చేరుకున్నారు. అయితే చర్చ జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థిని ఆయన చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. పాండే వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీసి పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.ఆ తర్వాత విద్యార్థులు కూడా పోలీస్ స్టేషన్కు చేరుకుని.. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.జెన్ ఆల్ఫా గళం.. స్కూల్ రోడ్డు కోసం పోరు!ఉత్తరప్రదేశ్లోని చందూపూర్ గ్రామంలో జెన్ ఆల్ఫా విద్యార్థులు తమ సమస్యపై గళమెత్తారు. స్కూల్కు వెళ్లేందుకు సరైన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, బ్యానర్లతో విద్యార్థులు తమ డిమాండ్ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో మట్టి రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలోనూ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ చాలాసార్లు విజ్ఞప్తి చేసినా తాత్కాలికంగా మట్టి పోసి వదిలేశారని, వర్షాలతో మళ్లీ దారంతా బురదగా మారిందని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారు తమ నిరసనను కొనసాగించారు. విద్యార్థుల పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు.జెన్ ఆల్ఫా అంటే ఎవరు?జెన్జీ తర్వాతి తరమే జెన్ ఆల్ఫా (Generation Alpha). సాధారణంగా 2010 నుంచి 2024 మధ్య జన్మించిన వారిని జెన్ ఆల్ఫాగా పరిగణిస్తారు.ఈ తరం పిల్లలు చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ మధ్య పెరిగారు. అందుకే వీరిని కొందరు “డిజిటల్ నేటివ్స్” అని కూడా పిలుస్తారు. వీరికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో భయం తక్కువగా ఉంటుందని, సామాజిక అంశాలపై వేగంగా స్పందించే స్వభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటు మధ్యప్రదేశ్ జబల్పూర్లోనూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ కొందరు పిల్లలు రోడ్డెక్కడం గమనార్హం.#Jabalpur में Gen Alpha का धरना प्रदर्शन.चीन-अमेरिका हमारे देश की शिक्षा व्यवस्था सुधारने के लिए इन छात्रों को Funding कर रहा है- कट्टर अंधभक्त pic.twitter.com/3IVFzMuuFC— NEYU MADHYAPRADESH (@NEYU4MP) August 13, 2026ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా యువత నిరసనలు, సామాజిక ఉద్యమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ జీ (సుమారు 1997–2012 మధ్య జన్మించిన తరం) ఉద్యమాలు వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు చిన్న వయసులోనే తమ హక్కులు, న్యాయం, విద్యా సమస్యలపై స్పందిస్తున్న జెన్ ఆల్ఫా పిల్లలు కూడా చర్చలోకి వస్తున్నారు. జార్ఖండ్ ఘటనలో విద్యార్థులు తమ ఉపాధ్యాయుడి కోసం ఏకంగా రోడ్డెక్కడం.. ఈ కొత్త తరం వైఖరిపై మరోసారి చర్చకు తెరతీసింది. -
ప్రియుడి వేధింపులు తాళలేక.. వివాహిత ఆత్మహత్య
తెనాలి రూరల్: సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు ఓ వివాహితతో సాన్నిహిత్యం పెంచుకుని ఆమె నుంచి నగదు, ఆభరణాలు తీసుకోవడమే కాకుండా ఇంకా డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సేకరించిన వివరాల ప్రకారం... మండలంలోని జగ్గడిగుంట పాలెంకు చెందిన లక్ష్మీతిరుపతమ్మకు సోషల్ మీడియాలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన బాజీ, నాగరాజు పరిచయమయ్యారు. ఈ పరిచయం సాన్నిహిత్యానికి దారి తీసింది. ఆమె నుంచి వారిద్దరూ నగదు, ఆభరణాలు తీసుకున్నారు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలతో బెదిరిస్తూ ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు బాజీ, నాగరాజు బెదిరింపులకు భయపడి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ రాసింది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న ఆమె మృతదేహాన్ని బుధవారం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
బీజేపీ ఆఫీస్లో అలా.. రైల్వే ఉద్యోగి ఇలా!
పంద్రాగస్టు వేడుకలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. జాతీయ పతాకం గౌరవంపై రెండు ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కేరళలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పతాకాలు మూలన పడేసినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో వివాదం రేగింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరో వీడియో ద్వారా జాతీయ జెండా పట్ల గౌరవం, బాధ్యతపై చర్చ మొదలైంది.కేరళలోని కాసర్గోడ్ బీజేపీ జిల్లా కార్యాలయంలో కొన్ని త్రివర్ణ పతాకాలు ఒక మూలన పడేసినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ డీవైఎఫ్ఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.జాతీయ పతాకాన్ని అవమానించడం చట్టం ప్రకారం ‘Prevention of Insults to National Honour Act, 1971’ కింద నేరమని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే వైరల్ వీడియోపై బీజేపీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.BJP faces allegations of disrespecting Indian flag in Kerala's KasaragodSeveral Indian national flags were allegedly found piled up at the BJP district office in Kasaragod after a Tiranga Yatra under the Har Ghar Tiranga campaign. DYFI sought strict action and filed a complaint… pic.twitter.com/munNIIQwcJ— South First (@TheSouthfirst) August 12, 2026మరోవైపు.. రైల్వే ఉద్యోగి చేసిన ఓ చిన్న పని మాత్రం ప్రశంసలు అందుకుంది. దుమ్ముతో నిండిపోయిన రైలింజిన్ ముందు భాగంలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఓ ఉద్యోగి నీటితో శుభ్రం చేసి, వస్త్రంతో తుడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాతీయ పతాకం పట్ల చూపిన గౌరవానికి నెటిజన్లు అభినందనలు తెలిపారు. సాధారణ విధుల్లో భాగంగా చేసిన పని అయినప్పటికీ.. జాతీయ చిహ్నాల పట్ల బాధ్యతను గుర్తుచేసేలా ఉందని పలువురు స్పందించారు.Yes, there may be dirt on the locomotive but the flag should be clean. Small gesture, big message! 🙏🤎 #HarGharTiranga #IndianRailways pic.twitter.com/iGlLXEtMM3— Ananth Rupanagudi (@AnanthOnTrack) August 12, 2026ఒకవైపు పతాకాల నిర్లక్ష్యంపై వివాదం.. మరోవైపు పతాకానికి గౌరవం తెలిపిన చర్య.. జాతీయ జెండా పట్ల మన బాధ్యతపై మరోసారి చర్చకు దారితీశాయి. -
ఇల్లు రెంట్ కోసం వెళ్లారు.. ఒక్కసారిగా నరకం చూశారు!
ఇల్లు చూసేందుకు వెళ్లారు.. గేటు తెరిచారు.. అంతే! ఒక్కసారిగా లోపలి నుంచి దూసుకొచ్చిన పిట్బుల్ కుక్క భార్యపై విరుచుకుపడింది. ఆమెను కాపాడేందుకు భర్త ముందుకొచ్చినా.. అతడినీ వదల్లేదు. క్షణాల్లోనే ఆ ప్రదేశం భీతావహంగా మారిపోయింది. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న దంపతులు.. చేతుల్లో కర్రలు పట్టుకుని కుక్కను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు.. చివరకు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన భార్యాభర్తలు. ఈ భయానక ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పంజాబ్లోని పాటియాలాలో ఘుమన్ నగర్లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.వివరాల మేరకు.. పాటియాలాకు చెందిన అంకిత్ సభర్వాల్ తన భార్య షిఫాలితో కలిసి ఓ ప్రాపర్టీ డీలర్తో ఇంటిని చూసేందుకు అక్కడికి వెళ్లారు. ఇంటి గేటు తెరవగానే లోపలి నుంచి పిట్బుల్ ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చి షిఫాలిపై దాడి చేసినట్లు అంకిత్ తెలిపారు. కుక్క ఆమె చేతితో పాటు శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రంగా దాడి చేయడంతో లోతైన గాయాలయ్యాయి. గాయాల తీవ్రత కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన అంకిత్పైనా కుక్క దాడి చేసింది. అతడి కాళ్లు, వీపుపై లోతైన కాటు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించినట్లు ప్రచారంలో ఉన్న సీసీటీవీ వీడియోలో కుక్క దంపతులపై దాడి చేస్తుండటం కనిపిస్తోంది. వారు దాని నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కుక్క వారిని వదలకుండా వెంటపడినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇక, కుక్క దాడిని ఆపేందుకు స్థానికులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. ఓ మహిళ చేతిలో కర్రతో ఇంటి నుంచి బయటకు వచ్చి కుక్కను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కర్రలతో అక్కడికి చేరుకుని కుక్కను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు తీవ్రంగా గాయపడిన దంపతులను దాని నుంచి దూరంగా తీసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.Patiala | A couple was attacked by a pit bull when they went to see a house for rent. pic.twitter.com/wANMStPzJZ— Gagandeep Singh (@Gagan4344) August 12, 2026ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు అంకిత్ తెలిపారు. కుక్కను స్వేచ్ఛగా బయటకు రానిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇంటి గేటు తెరిచిన వెంటనే ఇంతటి ప్రమాదకర దాడి జరగడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పాటియాలా మేయర్ కుందన్ గోగియా కూడా స్పందించారు. నగరంలో పిట్బుల్ వంటి దూకుడు స్వభావం కలిగిన కుక్క జాతులను పెంపుడు జంతువులుగా పెంచడాన్ని నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ సమావేశంలో చర్చించి ప్రత్యేక తీర్మానం తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఏపీ ప్రభుత్వానికి ‘సోషల్ మీడియా ఫోబియా’
విజయవాడ: కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియా ఫోబియా’ పట్టుకుంది. మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై మరిన్ని కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,200 పోలీస్ స్టేషన్లకు చెందిన దాదాపు 1,650 మంది ఎస్హెచ్ఓలు, సీఐ స్థాయి అధికారులతో సీఎం నేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.సాధారణంగా ఉన్నతాధికారులతోనే జరిగే సమీక్షలకు భిన్నంగా, ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయి సీఐలు, ఎస్హెచ్ఓలతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు ఇవ్వడంపై పోలీస్ అధికారులు సైతం విస్తుపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకునేందుకే ఈ తరహా ఆదేశాలు ఇచ్చారని, భావప్రకటన స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
హెడ్ కానిస్టేబుల్పై ఇద్దరు యువకులు కత్తితో దాడికి యత్నం
-
ట్రంప్కే షాక్ ఇచ్చిందా? ఐయామ్ ప్రెగ్నెంట్ అంటూ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ఈసారి కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయం కాదు.. ఆయన పక్కన నిల్చున్న ఓ మహిళ. ట్రంప్ కీలక ఆదేశంపై సంతకం చేస్తున్న సమయంలో ఆయన పక్కన కనిపించిన మహిళపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వైరల్ అయ్యాయి. చివరకు ఆ మహిళే స్పందించి అసలు విషయం వెల్లడించాల్సి వచ్చింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో వ్యాక్సినేషన్ విధానానికి సంబంధించి కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేస్తున్నారు. ఆ సమయంలో ఓ మహిళ ఆయన పక్కన నిల్చున్నారు. వీడియోలో ఆమె పదేపదే తల ఊపుతూ, ఒక చేయిని తన పొట్టపై ఉంచుకున్నట్లు కనిపించింది. ఆ వెంటనే మత్తులోకి జారుకున్నట్లు కనిపించిన ట్రంప్.. హఠాత్తుగా అప్రమత్తం అయ్యారు. దీంతో కొందరు సోషల్ మీడియా యూజర్లు విచిత్రమైన వాదనలు మొదలుపెట్టారు.Claims she has a button fitted on her belly, and when she gets the nod that he’s asleep she moves her hand and presses a button that wakes him. They’re calling her The Zapper. No idea if it’s true but it *appears* to line up. pic.twitter.com/hgx4x6iQp6— Tim Brannigan (@tim_brannigan) August 11, 2026ట్రంప్కు షాక్ ఇచ్చిందా?..కొందరు నెటిజన్లు ఆమె చేతిలో ఏదో పరికరం ఉందని, ట్రంప్ను అప్రమత్తం చేసేందుకు విద్యుత్ షాక్ ఇచ్చిందంటూ ఊహాగానాలు ప్రచారం చేశారు. ఈ ప్రచారం వేగంగా వ్యాపించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె పేరు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ (Jayme Leagh Franklin). ఆమె అమెరికాలోని కన్జర్వేటివ్ మీడియా, లైఫ్స్టైల్ బ్రాండ్ ది కన్జర్వేటర్ (The Conservateur) వ్యవస్థాపకురాలు, సీఈవో.నెట్టింట వస్తున్న వింత ఆరోపణలపై స్పందించిన ఫ్రాంక్లిన్.. తాను గర్భవతినని వెల్లడించారు. తన పొట్టపై చేయి పెట్టుకోవడానికి కారణం అదే అని స్పష్టం చేశారు. “నేను కేవలం గర్భవతిని మాత్రమే” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ట్రంప్కు తాను షాకిచ్చి అప్రమత్తం చేశానంటూ తనపై వస్తున్న ఊహాగానాలను చూసి ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపారు.ఆ కార్యక్రమంలో ఎందుకు ఉన్నారు?వైట్హౌస్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ట్రంప్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ల మధ్య ఫ్రాంక్లిన్ నిల్చున్నారు. బాలల వ్యాక్సినేషన్ సిఫార్సుల్లో మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేస్తున్న సమయంలో ఈ వీడియో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఫ్రాంక్లిన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ట్రంప్తో కలిసి ఓవల్ ఆఫీస్లో ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎవరు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్?జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ గతంలో ట్రంప్ పాలనలో పనిచేశారు. నార్త్ కరోలినాకు చెందిన ఆమె కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ నుంచి 2020లో పట్టా పొందారు. 2019లో అమెరికా సెనేట్లో లెజిస్లేటివ్ ఇంటర్న్గా పనిచేసిన ఆమె.. 2020 ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కోయలిషన్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. అనంతరం ట్రంప్ తొలి వైట్హౌస్ పాలనలో కరస్పాండెన్స్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె నడుపుతున్న ది కన్జర్వేటర్.. రాజకీయాలు, సంస్కృతి, విశ్వాసం, ఫ్యాషన్, బ్యూటీ అంశాలపై కంటెంట్ అందించే కన్జర్వేటివ్ మీడియా సంస్థగా కొనసాగుతోంది. అదీ అసలు ముచ్చట. -
యువతిపై రేప్.. ఈ ఒక్కసారి క్షమించండి అంటూ ఏడుపు!
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. భవనంలోని టెర్రస్పై ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు సదరు భవనంలో సెక్యూరిటీ గార్డుగా నాలుగు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు. ఓ యువతిని టెర్రస్పైకి తీసుకెళ్లి ఆమె గొంతు నొక్కి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమెను టెర్రస్పైనే ఉంచి తలుపులకు తాళం వేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట ‘‘ఏక్ బార్ మాఫ్ కర్ దో.. ఫిర్ సే నహీం కరూంగా’’ అంటూ వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘‘ఒక్కసారి క్షమించండి.. మళ్లీ ఇలా చేయను’’ అంటూ అతడు క్షమాపణలు కోరుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. యువతిపై అత్యాచారం కేసులో నిందితుడిని పట్టుకున్న పోలీసులుపీఎస్లో ఒక్కసారి క్షమించండి అంటూ ఏడుపునాలుగు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరిన సెక్యూరిటీ గార్డు#Ahmedabad లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన సెక్యూరిటీ గార్డు#RapeCase #SecurityGuard #Gujarat #viralvídeo #Anntelugu pic.twitter.com/4jVl94lgQe— ANN Telugu (@ANN_Telugu) August 11, 2026 -
జెన్జీపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్ మీడియా, రీల్స్ యుగంలో పెరుగుతున్న యువతకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. జీవితంలో విజయాన్ని సాధించేందుకు షార్ట్కట్స్ వెతకవద్దని.. అది ఎంతో ప్రమాదమని.. కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.బుధవారం ఉదయం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలం సోషల్ మీడియా, రీల్స్ యుగంగా మారిందని ప్రధాని అన్నారు. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంటూ.. తక్షణ ఫలితాల కోసం ప్రయత్నించడం సరైన మార్గం కాదని చెప్పారు.“ఇది రీల్స్ కాలం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటారు. కానీ ఈ షార్ట్కట్ యుగంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. రైల్వే స్టేషన్లలో రాసి ఉంటుంది.. ‘షార్ట్కట్స్ విల్ కట్ యూ షార్ట్’” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే యువత తమకు నచ్చిన గొప్ప వ్యక్తుల ఆత్మకథలను చదవాలని సూచించారు. వారి ప్రయాణం, కష్టాలు, విజయాల నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు.ప్రధాని మోదీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించింది తెలిసిందే. జంతర్ మంతర్ నీట్ నిరసనల తర్వాత.. తొలిసారి సెల్ఫీ వీడియో సందేశం ఇచ్చారు ఆయన. ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వివిధ అంశాలపై వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యువతను ఆకట్టుకోవాలని మంత్రులకు, ఎంపీలకు సైతం ఆయన సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జెన్జీపైనా వివిధ కార్యక్రమాల్లో వరుసగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కోవింద్ జీవితం యువతకు స్ఫూర్తిఇవాళ్టి కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ కేవలం వ్యక్తిగత విజయాల కథ కాదని.. అది భారత ప్రజాస్వామ్యం, సమాజం అందించిన అవకాశాలకు ప్రతిబింబమని ప్రధాని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించారని గుర్తు చేశారు. ఆయన జీవితంలోని పోరాటాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.పదవి నుంచి దిగినా దేశ సేవ కొనసాగింపురాష్ట్రపతి పదవి ముగిసిన తర్వాత కూడా కోవింద్ విశ్రాంతి తీసుకోకుండా కీలక అంశాలపై పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’(వన్నేషన్.. వన్ ఎలక్షన్) అంశంపై ఆయన చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఈ అంశానికి పరిష్కారం లభిస్తే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని మోదీ అన్నారు.కోవింద్ వినయం.. భారత విలువలకు ప్రతీకమాజీ రాష్ట్రపతి వినయం, భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని కూడా ప్రధాని గుర్తు చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉన్న సమయంలోనూ ప్రోటోకాల్ను పక్కన పెట్టి తనను కారు వరకు వచ్చి సాగనంపేవారని చెప్పారు. అలాగే తన గ్రామం పర్యటనలో కోవింద్ తన గురువుల పాదాలకు నమస్కరించిన ఘటనను ప్రస్తావిస్తూ.. అది భారతీయ సంస్కృతి విలువలను ప్రపంచానికి చాటిందని అన్నారు.“విజయాలు వ్యక్తిగతం కాదు.. సమాజం భాగస్వామ్యం”ఒక వ్యక్తి విజయాలను తన సొంత ఘనతగా భావించడం సాధారణమని.. కానీ సమాజం అందించిన సహకారాన్ని గుర్తించే వ్యక్తులే గొప్పవారని మోదీ అన్నారు. కోవింద్ ఆత్మకథలో ఇదే భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. ఆయన పోరాటాలు వ్యక్తిగతమైనప్పటికీ.. వాటి నుంచి వచ్చిన విజయాలు భారత ప్రజాస్వామ్య విజయాలని అభివర్ణించారు.రీల్స్ వేగంలో జీవిత ప్రయాణాన్ని చిన్నదారిలో ముగించాలని చూస్తున్న యువతకు, మరీ ముఖ్యంగా జెన్జీకి.. అనుభవాల నుంచి నేర్చుకోవాలనే ప్రధాని మోదీ సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ప్రియాంక ఘటనలో ఎందుకీ గోప్యత? తెర వెనుక ఎవరు?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థిని ప్రియాంకను ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడం.. రోజుల తరబడి మృత్యువుతో పోరాడి ఆమె మృతి చెందిన ఘటనలో ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ జవాబు లేనివిగానే కనిపిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించిన ఈ దారుణం రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద ఈ నెల 3వ తేదీ రాత్రి చోటు చేసుకుంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఈ విషయం వెలుగులోకి రాలేదు. దీనికి తెర వెనుక అధికార పార్టీ నగర నాయకులు కథ నడిపారనే విమర్శలు వచ్చాయి. వారెవరనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ అపవాదును తుడుచుకునేందుకు అటు పోలీసులు, ఇటు నగర ప్రజాప్రతినిధులు పోటీ పడిన తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రియాంక తీవ్రంగా గాయపడి, చావుబతుకుల్లో ఉన్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆమె బంధువులు ఈ నెల 5వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సాక్షికి ఈ సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తెర వెనుక వ్యక్తులెవరు? ఆ రోజు ప్రసాదిత్య మాల్ వద్ద సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఎడ్వర్డ్ మద్యం తాగి, తమ కారుతో ప్రియాంక ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఉద్దేశపూర్వకంగానే మూడుసార్లు ఢీకొన్నారు. అనంతరం, ఆమె తలపై నుంచి కారు ఎక్కించి, అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘోరంపై అదే రోజు రాత్రి పోలీసులకు సమాచారం అందింది. ఆ రోజు రాత్రి స్థానిక స్వతంత్ర ఆసుపత్రికి వెళ్లి, ఈ సంఘటనలో గాయపడిన ప్రియాంక స్నేహితుడి వాంగ్మూలం సేకరించారు. ప్రియాంకను ఢీకొన్న వెంటనే అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయిన కారును పోలీసులు ఆ మర్నాడు కానీ సీజ్ చేయలేదు. తీవ్రమైన ఈ సంఘటన సమాచారాన్ని పోలీసులు తొలుత బహిర్గతం చేయలేదు. దీంతో, కొంత మంది కూటమి నాయకులు వారిపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణాన్ని చిన్న ప్రమాదంగా కూడా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని, దీని వెనుక ఉన్న పెద్దలెవరనే ప్రశ్నలు సర్వత్రా వస్తున్నాయి. ఆ సమయంలో దర్యాప్తు అధికారికి వచ్చిన ఫోన్లపై సైతం పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాదం పెద్దది అవుతూండటంతో పోలీసులు ఎట్టకేలకు నిందితుల్ని అరెస్టు చేసి, ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసి, స్టేషన్ వద్ద ప్రదర్శనకు పెట్టారు. ఆ సమయంలో కారు నంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు నిందితులు ప్రయతి్నంచారనే విషయం స్పష్టమవుతోంది. ప్రసాదిత్య మాల్లో సీసీ కెమెరాల్లో ఈ సంఘటన నమోదై ఉండకపోతే ఈ సంఘటన వెలుగులోకే వచ్చేది కాదని పలువురు అంటున్నారు. ఒకరిపై ఒకరు నింద వేస్తూ.. కారు ఢీకొన్న సమయంలో అక్కడే కొందరు మీడియా ప్రతినిధులున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వారెవరనేది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. నిందితుల్లో ఒకరు విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో.. ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణ ఘటనలో అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనను చిన్నదిగా చూపించేందుకు ఎవరి ప్రయత్నం వారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రియాంక తండ్రి విలేకర్లతో మాట్లాడిన రోజే ఆయనను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హడావుడిగా హైదరాబాద్కు వెంట పెట్టుకుని వెళ్లారని, దీనిలో ఆంతర్యమేమిటనే ప్రశ్న కూడా జవాబు లేనిదిగానే మిగిలింది. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిగితేనే అసలు విషయాలన్నీ వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకేనా హైదరాబాద్కు?కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను స్వతంత్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యులతో చికిత్స అందించారు. ఈ దారుణాన్ని సాక్షి మొదటిసారి వెలుగులోకి తీసుకువచ్చింది. అనంతరం, సోషల్ మీడియాలో కారు ఢీకొన్న ఘటన వీడియో క్లిప్పింగ్లు హల్చల్ చేయడంతో విద్యార్థి వర్గాలు ఆవేదన, ఆపై ఆగ్రహంతో రగిలిపోయాయి. ఇది మరింత ముదిరి ఆందోళనకు దారి తీస్తుందనే భయంతోనే ప్రియాంకను మెరుగైన చికిత్స పేరుతో హైదరాబాద్కు పంపించారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రధాన ఆసుపత్రి అయిన జీఎల్ఎస్ ట్రస్టు ఆ మాత్రం వైద్యం అందించలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమెను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి నుంచి తరలించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఆమె కండక్టర్తో వెళ్లిపోయింది.. అంతే!
వివాహేతర సంబంధాల మోజులో.. నేరాలు-ఘోరాలు జరుగుతున్న కాలం ఇది. కట్టుకున్న బంధాలను పక్కన పెట్టి క్షణిక సుఖాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. అనుమానాలు, ఆవేదనలు, ఆగ్రహాలతో పలు ఘటనలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి.. అందునా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి, అందమైన తన భార్య ఓ కండక్టర్కి మనసిచ్చి వెళ్లిపోయిందంటూ నేరుగా వీడియో రిలీజ్ చేయడం సంచలన చర్చకు దారి తీసింది.మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటుడు అఖిల్ NRD వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తన భార్య మేఘా ఓ కండక్గర్తో వెళ్లిపోయిందని నేరుగా ఆయనే వీడియో విడుదల చేయడం నెటిజన్లను షాక్కు గురి చేసింది. నైటీలో లగేజీతో ఆమె స్పీడ్గా వెళ్లి.. ఓ వ్యక్తితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వివాహేతర సంబంధాల నేరాల నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. CCTV visuals are currently going viral on social media, claiming that Kerala YouTuber Akhil NRD's wife, Megha Nair, has run away with a bus conductor. Watch the video to see the reality behind it! 👇 pic.twitter.com/N9WUns571W— Vijitha (@Vijitha96) August 11, 2026అయితే భర్తను చంపకుండా వదిలేసి వెళ్లిపోయింది ఆమె గ్రేట్ అంటూ కొందరు.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇదేం పని? అని మరికొందరు.. ఆ కండక్టర్లో ఆమెకేం నచ్చిందో అని మరికొందరు ఇలా కామెంట్ల రచ్చతో చర్చకు దారి తీశారు. ఈ నేపథ్యంలో.. ఈ పరిణామంపై అఖిల్ స్నేహితుడు, మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ సాయి కృష్ణ స్పందించడంతో మరింత ఆసక్తి నెలకొంది. అఖిల్-మేఘా వివాహానికి తాను హాజరయ్యానని చెప్పిన సాయి కృష్ణ.. ఈ వార్త విని తాను షాక్కు గురయ్యానని తెలిపారు. ఈ విషయంపై అఖిల్తో మాట్లాడానని, అయితే ఈ విషయంలో ఎవరినీ నిందించేందుకు అఖిల్ ఇష్టపడటం లేదని పేర్కొన్నారు.“ఆమె వెళ్లిపోయింది.. అంతే!”భార్య చేసిన నమ్మక ద్రోహంపై అఖిల్ రియాక్షన్ను సాయి కృష్ణ మీడియాకు వెల్లడించాడు. ఆమె వెళ్లిపోయింది అంతే అని ఒక్క ముక్కలో తేల్చేశాడు. ‘‘ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టను..నిందించను. దేవుడు నాకు ఇలా రాసిపెట్టాడు. ఇలాంటి పరిస్థితులు ఎవరి జీవితంలోనైనా ఎదురవుతాయి. నా తల్లిదండ్రులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిననే అనుకుంటున్నా. ఈ విషయాన్ని మరింతగా చర్చించడం ఇష్టం లేదు’’ అంటూ అఖిల్ అన్నాడట.సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై వస్తున్న చర్చలపై కూడా సాయి కృష్ణ స్పందించారు. పరిచయమైన వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటిని సంచలనంగా మార్చకుండా, కొంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.మెర్చంట్ నేవీ నుంచి సోషల్ మీడియా స్టార్..అఖిల్ ఎన్ఆర్డీ ప్రయాణం కూడా ప్రత్యేకమైనదే. తొలుత ఆయన మెర్చంట్ నేవీలో పనిచేశాడు. ఆ తర్వాత డిజిటల్ కంటెంట్పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టాడు. టిక్టాక్ ద్వారా వీడియోలు చేయడం ప్రారంభించి.. కామెడీ వీడియోలు, లైఫ్స్టైల్ కంటెంట్, వ్లాగ్స్తో భారీగా ఫాలోవర్స్ను సంపాదించుకున్నాడు. తర్వాత యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానల్కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా పాపులారిటీతో నటుడిగానూ అవకాశాలు అందుకున్నాడు.సినిమాల్లోకి ఎంట్రీసోషల్ మీడియా స్టార్ నుంచి మాలీవుడ్లో చిన్నాచితకా అవకాశాలు అందుకున్నాడు అఖిల్. 2026లో మలయాళ చిత్రం ‘ఆశకల్ ఆయిరం’ ద్వారా నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘మహారాజా హాస్టల్’ చిత్రంలోనూ నటించాడు. సోషల్ మీడియా స్టార్ నుంచి సినిమా నటుడిగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది.2024లో వివాహం..అఖిల్, మేఘా కొంతకాలం ప్రేమలో ఉన్న అనంతరం 2024లో వివాహం చేసుకున్నారు. మేఘా కూడా అఖిల్ సోషల్ మీడియా పోస్టుల్లో కనిపించేవారు. వీరి జంటకు అభిమానుల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జరిగిన దానిపై మేఘగానీ, ఆమె కుటుంబంగానీ ఇంకా స్పందించలేదు. అయితే.. అఖిల్ వీడియో రిలీజ్ చేశాక ‘‘ఇది కూడా సోషల్ మీడియా స్టంటేనా?’’ అని కొందరు అనుమానం సైతం వ్యక్తం చేశారు. -
సోషల్ మీడియాపై రణభేరి!
సామాజిక మాధ్యమాలు వచ్చాక ప్రపంచ పరిణామాలన్నీ వెంటవెంటనే అందరికీ చేరుతున్నాయి. అవి భావవ్యక్తీకరణ విస్తృతిని పెంచి కోట్లాదిమందికి గొంతునిస్తు న్నాయి. ఇన్నాళ్లూ మౌనంగా, నిస్సహాయంగా వీక్షించినవారంతా నిక్కచ్చిగా, నిర్మొహ మాటంగా తమ అభిప్రాయాలు వినిపిస్తున్నారు. కానీ మంచితోపాటే చెడు కూడా ఇందులో కలగలిసివుంది. వాటి కారణంగా అనవసర వదంతులు వ్యాపించి ఎందరో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన దేశం వరకే తీసుకుంటే దొంగ లుగా ముద్రపడి కొన్నిచోట్ల, గోవుల్ని తరలిస్తున్నారని ఆరోపణలొచ్చి మరికొన్నిచోట్ల ఉన్మాద గుంపులు దాడులు చేసి హతమార్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. టీనేజర్లు, పిల్లల మనసుల్లో ఈ వేదికల దుష్ప్రభావం కూడా నానాటికీ పెరుగుతోంది. మానసిక ఒత్తిళ్లకూ, రుగ్మతలకూ అవి కారణమవుతున్నాయి. అమెరికా అప్పీళ్ల కోర్టులో మెటా, ఆల్ఫాబెట్, స్నాప్చాట్, టిక్టాక్ తదితర సంస్థలపై సోమవారం 3,000కు పైగా పిటిషన్లు దాఖలు కావటాన్ని ఈ నేపథ్యంలో చూడాలి. ‘పబ్లిక్ న్యూసెన్స్’ కింద దాదాపు 40 రాష్ట్రాలతోపాటు మున్సిపాలిటీలు, పాఠశాలలు, వ్యక్తులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి మొన్న మార్చిలోనే లాస్ ఏంజెలెస్కి చెందిన న్యాయస్థానం సామాజిక మాధ్యమ వేదికల్ని యువతకు హానికరమైన రీతిలో రూపొందించటాన్ని తప్పుబట్టింది. చిన్న వయసులో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లు తనను బానిసగా మార్చాయనీ, ఇందువల్ల తీవ్రంగా నష్టపోయాననీ ఆరోపిస్తూ కోర్టుకెక్కిన 20 యేళ్ల యువతికి 60 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని ఆ న్యాయస్థానం తీర్పునిచ్చింది. న్యూమెక్సికోలో సైతం మెటాపై ఈ తరహా తీర్పే వెలువడింది. వేదికకు సంబంధించిన భద్రత విషయంలో వినియోగదారుల్ని అది తప్పుదోవ పట్టించిందని న్యాయస్థానం నిర్ధారించింది. 37.5 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని సంస్థను ఆదేశించింది. చాన్నాళ్లక్రితమే టీనేజర్లపైనా, పిల్లలపైనా సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం ఎలా ఉన్నదో ప్రభుత్వాలు గుర్తించాయి. ఆస్ట్రేలియా పదహారేళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునే బాధ్యతను టెక్ సంస్థలపైనే పెట్టింది. దీన్ని పాటించనట్టయితే దాదాపు 5 కోట్ల ఆస్ట్రేలియా డాలర్లు జరిమానా చెల్లించాలని చట్టం నిర్దేశించింది. బ్రిటన్, ఫ్రాన్స్ సైతం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్(ఈయూ) హానికర మైన పోస్టుల్ని తొలగించటంలో జాప్యం జరిగితే గ్లోబల్ టర్నోవర్లో 6 శాతం మొత్తాన్ని జరిమానా విధించే చట్టం తీసుకొచ్చింది.తెలిసో తెలియకో ఏదైనా వీడియో చూస్తే ఆ వెనువెంటనే అటువంటివే కుప్పలు తెప్పలుగా వచ్చిపడేలా ఆ మాధ్యమాలు అల్గారిథమ్లు రూపొందిస్తున్నాయి. తెలిసీ తెలియని వయసులో ఉన్న పిల్లల్ని వ్యామోహాల బారిన పడేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలొచ్చినప్పుడల్లా ఈ మాధ్యమాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాము కేవలం ఒక వేదిక మాత్రమే కల్పిస్తున్నామనీ, అందులో వేరెవరో ఉంచే కంటెంట్కు తామెలా బాధ్యులమనీ ప్రశ్నిస్తున్నాయి. ఏటా వేలాదికోట్ల డాలర్ల లాభాలు ఆర్జించే ఉద్దేశంతోనే ఈ సంస్థలు జుగుప్సాకర, హింసాత్మక అంశాలున్న వీడియోల్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు భావప్రకటనా స్వేచ్ఛకు అనువైనవి. కానీ అవి దుర్వినియోగమైన పక్షంలో కఠినచర్యలుండాలి. మన దేశం ఈ విషయంలో వెనకబడే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, పాలకుల్ని కించపరిచేవిధంగానో పోస్టులున్నప్పుడే తక్షణ స్పందన కనిపిస్తోంది. తెలంగాణలో ఆన్లైన్ చానెళ్లు నిర్వహిస్తున్న మహిళా పాత్రికేయులపై అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు లేవు. ఆంధ్రప్రదేశ్లో పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్టుచేసినందుకే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టుచేస్తున్న ప్రభుత్వం... ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ, ఇతర నేతలనూ కించపరుస్తూ పోస్టులు పెట్టే టీడీపీ నేతలనూ, కార్యకర్తలనూ చూసీచూడనట్టు వదిలేస్తోంది. అందుకే అమెరికాలో మాదిరి మన దేశంలో కూడా మాధ్యమాల, ప్రభుత్వాల జవాబుదారీతనాన్ని పెంచే చట్టాన్ని తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి పెడధోరణులు ఆగుతాయి. -
34 ఏళ్ల క్రితం ప్రేమికులుగా.. కాలం మారిందంతే!
నాగార్జునసాగర్ కేవలం ఓ పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన సతీమణి గీత జీవితంలో ఓ ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచిపోయిన ప్రదేశం. మూడు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా.. ఆ ప్రాంతంతో ముడిపడిన అనుబంధం మాత్రం వాళ్లకు అలాగే ఉండిపోయింది. అందుకే ఆ జ్ఞాపకాలను మరోసారి ఆ జంట గుర్తు చేసుకుంది.34 ఏళ్ల క్రితం యువకుడు రేవంత్రెడ్డి, గీత దంపతుల జీవితంలో ప్రేమ జ్ఞాపకాలకు వేదికైన నాగార్జునసాగర్.. ఇప్పుడు మరోసారి వారిని ఆకర్షించింది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం. అప్పట్లో సాధారణ జీవితంలో ఉన్న వారు.. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అదే ప్రాంతానికి చేరుకున్నారు.వరుణయాగం తర్వాత.. సోమవారం నాగార్జునసాగర్లో నిర్వహించిన వరుణయాగంలో సీఎం రేవంత్రెడ్డి, ఆయన సతీమణి గీత పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం దంపతులు విజయవిహార్ అతిథిగృహం వద్ద కృష్ణానది తీరానికి వెళ్లారు. ఆ ప్రాంతంలో గడిపిన క్షణాలు, అప్పటి జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు తమ జీవితంలో ప్రత్యేకమైన అధ్యాయానికి వేదికైన ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మళ్లీ సందర్శించడం భావోద్వేగ క్షణంగా మారింది.ఒక ఫొటో.. రెండు కాలాల కథఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలకు సంబంధించిన పాత ఫొటోతో పాటు.. ప్రస్తుతం సీఎం దంపతులు సాగర్ వద్ద ఉన్న ఫొటోను కలిపి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. “అప్పుడు ప్రేమ ప్రయాణం మొదలైన చోటే.. ఇప్పుడు జీవిత ప్రయాణంలో మరో మైలురాయి” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజకీయాలకతీతంగా ఓ వ్యక్తిగత క్షణంసాధారణంగా రాజకీయ నేతల ప్రతి అడుగు రాజకీయ కోణంలోనే చర్చకు వస్తుంది. కానీ నాగార్జునసాగర్ పర్యటనలో మాత్రం రేవంత్రెడ్డి దంపతుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం తెరపైకి వచ్చింది. రాజకీయ పోరాటాలు, పదవులు, బాధ్యతలకు అతీతంగా.. జీవితంలో కొన్ని ప్రదేశాలు ప్రత్యేక గుర్తులుగా మిగిలిపోతాయి. నాగార్జునసాగర్ కూడా రేవంత్–గీత దంపతులకు అలాంటి ఓ భావోద్వేగ ప్రదేశంగా నిలిచింది.ప్రేమ నుంచి బాధ్యతల వరకు.. సాగర్ సాక్షిగాయువకుడిగా ఉన్న రేవంత్రెడ్డి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో మలుపులు వచ్చాయి. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం కాలంతో మారవు. ప్రేమకు సాక్షిగా నిలిచిన నాగార్జునసాగర్.. ఇప్పుడు ముఖ్యమంత్రి దంపతుల పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసిన వేదికగా మారింది. -
సోషల్ మీడియా దిగ్గజాలకు కోర్టులో చుక్కెదురు
పిల్లలు, యువతను తమ ప్లాట్ఫారమ్లకు బానిసలుగా మార్చేలా అల్గోరిథమ్లను రూపొందించాయనే ఆరోపణలపై బిగ్ టెక్ దిగ్గజాలు మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), ఆల్ఫాబెట్ (గూగుల్/యూట్యూబ్), బైట్డాన్స్ (టిక్టాక్), స్నాప్చాట్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థలపై నమోదైన 3,000కు పైగా ఫెడరల్ దావాలను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్లను శాన్ఫ్రాన్సిస్కోలోని ‘9వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ అఫ్ అప్పీల్స్’ తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులన్నీ విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.వీగిపోయిన ‘సెక్షన్ 230’ రక్షణ కవచంయూజర్ల కంటెంట్కు ప్లాట్ఫారమ్లు బాధ్యత వహించవని పేర్కొనే ‘కమ్యూనికేషన్స్ డిసెన్సీ యాక్ట్ - సెక్షన్ 230’ కింద తమకు విచారణ నుంచి మినహాయింపు ఉందని టెక్ సంస్థలు వాదించాయి. అయితే, సెక్షన్ 230 విచారణలో ఒక వాదన మాత్రమే తప్ప, కేసుల ప్రారంభంలోనే పూర్తి రక్షణ కల్పించదని, ఈ అప్పీలు సమయానుకూలంగా లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్లాట్ఫారమ్ల రూపకల్పన, వాటికే అలవాటు పడేలా చేసే ఫీచర్ల వల్ల కలిగే నష్టాలపై దావాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.మానసిక ఆరోగ్య సంక్షోభంపై ఆందోళనవివిధ రాష్ట్రాల అటార్నీ జనరళ్లు, పాఠశాలల బోర్డులు, తల్లిదండ్రులు వేసిన ఈ దావాల్లో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగుచూశాయి. పిల్లలలో డిప్రెషన్, ఆందోళన, శారీరక స్థితిపై అభద్రతాభావం, చివరికి ఆత్మహత్య ధోరణులు పెరగడానికి ఈ సోషల్ మీడియా డిజైన్లే ప్రధాన కారణమని పిటిషనర్లు ఆరోపించారు. ఇటీవల న్యూమెక్సికోలో మెటాకు 567 మిలియన్ డాలర్ల జరిమానా విధించడం, లాస్ ఏంజిల్స్ కోర్టులో బాధితురాలికి 6 మిలియన్ డాలర్ల పరిహారం ప్రకటించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.పరిశ్రమపై ప్రభావంకేవలం వినియోగదారుల ఎంగేజ్మెంట్కు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా 'ఇన్ఫినిట్ స్క్రోలింగ్', 'ఆటోప్లే' వంటి ఫీచర్లను ప్రవేశపెట్టిన టెక్ సంస్థల బాధ్యతారాహిత్యానికి ఈ తీర్పు ఒక హెచ్చరికని నిపుణులు చెబుతున్నారు. లాభాల కంటే పిల్లల డిజిటల్ భద్రతే ప్రాధాన్యమని నిరూపించే దిశగా ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగాన్ని ఇది సరికొత్త నియంత్రణల వైపు నడిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: గౌతమ్ అదానీకి భారీ ఊరట -
‘వారణాసి’లో హనుమంతుడిగా రామ్ చరణ్?
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కథ త్రేతాయుగం నేపథ్యంలో జరిగే సన్నివేశాల కోసం మహేశ్ బాబును శ్రీరాముడిగా చూపించనున్నట్లు ఇప్పటికే రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘట్టానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఇందులో హనుమంతుడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.మొదట్లో ఈ పాత్ర కోసం ప్రముఖ నటుడు మాధవన్ పేరు వినిపించింది. అయితే ఆ పాత్రకు అవసరమైన ఇంటెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ దృష్ట్యా రామ్ చరణ్ అయితే హనుమాన్ పాత్ర తెరపై మరింత ప్రభావవంతంగా ఉంటుందని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జక్కన్న 'మగధీర' ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలను చరణ్తో చేశాడు. ఆ చిత్రాల అనుభవం కూడా ఈ కాంబినేషన్పై ఆసక్తిని మరింత పెంచుతోంది. అయితే రామ్ చరణ్ ‘వారణాసి’లో హనుమంతుడిగా నటిస్తున్నారనే వార్తపై 'వారణాసి' చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం. -
మమితా బైజు సంచలన నిర్ణయం.. కారణం ఇదే!
మలయాళ నటి మమితా బైజు వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ‘డ్యూడ్’, ‘జన నాయకన్’ వంటి చిత్రాలతో బిజీగా మారారు. త్వరలో స్టార్ హీరో సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.‘సోషల్ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. నా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను వ్యక్తిగతంగా కాకుండా పీఆర్ టీమ్ ద్వారా వెల్లడిస్తా’ అని స్పష్టం చేశారు. తన అభిమాన హీరో గురించి మాట్లాడుతూ.. తాను అల్లు అర్జున్కు వీరాభిమానినని మమితా తెలిపారు. ఆయన నటించిన సినిమాల్లో ‘ఇద్దరమ్మాయిలు’ సినిమా ఇష్టమన్నారు. ఆ సినిమాలో ఉపయోగించిన వాచ్, ధరించిన టీషర్ట్ స్టైల్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు. తాను కూడా ఆ స్టైల్ను కాపీ చేసేదాన్నని చెబుతూ నవ్వులు పూయించారు. -
‘అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’
స్పెయిన్ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు రోడ్రి చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రోడ్రి ప్రస్తుతం జీవిత భాగస్వామి, లాంగ్టైమ్ గర్ల్ఫ్రెండ్ లారా ఇగ్లేసియాన్తో కలిసి ఇబిజాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇబిజాలో టూరిస్ట్ స్పాట్కు తన గర్ల్ఫ్రెండ్తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న రోడ్రి, అటు పక్కనుంచి ఒక యువతి బికినీ వేసుకొని ఎదురుగా నడుస్తూ వచ్చింది. Photo Credit: Twitterదీంతో రోడ్రి గర్ల్ఫ్రెండ్ పక్కనుండగానే అటుగా వెళ్లున్న బికినీ యువతిని అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు. తనను దాటి వెళ్లిపోయినా కూడా రోడ్రి మాత్రం వెనక్కి తిరిగి మాత్రం ఆమె అందాన్ని కనులారా ఆస్వాధిస్తూ ముందుకు సాగడం విశేషం. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. చాలా మంది రోడ్రి చర్యను స్పానిష్ ఫోటోగ్రాఫర్ ఆంటోనియో గిల్లెం తీసిన 2015 నాటి ప్రసిద్ధ ‘డిస్ట్రాక్టడ్ బాయ్ఫ్రెండ్’ ఫొటోతో పోలుస్తున్నారు. ఆ ఫోటోలో, చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి, ఎర్రటి టాప్ ధరించి నడుచుకుంటూ వెళ్తున్న ఒక యువతిని చూడటానికి వెనక్కి తిరుగుతాడు, అదే సమయంలో అతడి పక్కనే ఉన్న తన గర్ల్ఫ్రెండ్ మాత్రం అతడి చర్యకు ఆశ్చర్యానికి లోనవుతోంది. Photo Credit: Twitterఈ ఫొటో అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసి ఒక మీమ్ మెటిరీయల్గా మారిపోయింది. తాజాగా రోడ్రి కూడా తన గర్ల్ఫ్రెండ్ పక్కన ఉండగానే బికినీ వేసుకున్న యువతిని అదే పనిగా చూడడాన్ని ‘డిస్ట్రాక్టడ్ బాయ్ఫ్రెండ్’ మీమ్ ఫొటోతో పోల్చకుండా ఉండలేకపోతున్నారు. ‘అయినా అంత అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాను చిత్తు చేసింది చాంపియన్గా నిలిచింది. 16 సంవత్సరాల తర్వాత రెండో ఫిఫా టైటిల్ సాధించిన స్పెయిన్ జట్టులో రోడ్రి సభ్యుడిగా ఉన్నాడు.Rodri really recreated the meme 😭🤣 pic.twitter.com/YXNn25wEVZ— Not Match of the Day (@NOT_MOTD) August 9, 2026Read: ‘రోబోలు కాదు’.. ఆటగాళ్ల గాయాలపై లక్ష్మణ్ ఆగ్రహం! -
సింపుల్.. ఈ 7 టిప్స్ పాటిస్తే వందేళ్లు బతికేయొచ్చు!
మనిషి వందేళ్లు జీవించాలనే కల ఎప్పటినుంచో ఉంది. కానీ మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఆ కల అందరికీ సులభంగా నెరవేరడం లేదు. అయితే ఆరోగ్యంగా, చురుగ్గా శతాధిక వయసు దాటిన ఓ బామ్మ మాత్రం సుదీర్ఘ జీవితానికి పెద్ద పెద్ద రహస్యాలు అవసరం లేదంటోంది. రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లే ఆరోగ్యానికి పునాది అని బంగారు మాట చెబుతోంది.ఆమె వయసు 111 ఏళ్లు. ఇంకా ఆరోగ్యంగానే ఉంది. ఉత్సాహంగా, చురుగ్గా ఉన్న ఈ బామ్మ జీవన విధానం నెట్టింట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వయసు పెరిగినా.. శరీరాన్ని కదిలిస్తూ ఉండటమే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెబుతోంది. అంతేకాదు.. తాను పాటించే ఏడు సూత్రాలే తన దీర్ఘాయుష్షుకు కారణమని చెబుతున్నారు. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం, పరిమితంగా ఆహారం తీసుకోవడం, ప్రశాంతమైన మనసుతో జీవించడం వంటి సాధారణ అలవాట్లే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అని ఆమె నమ్మకం.తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని రుగావో ప్రాంతానికి చెందిన వాంగ్ గైయింగ్ అనే ఈ బామ్మ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచారు. వందేళ్లు దాటిన వారి సంఖ్య ఎక్కువగా ఉండే ప్రాంతంగా రుగావోకు పేరుంది. ఐదు తరాల కుటుంబంతో కలిసి జీవిస్తున్న వాంగ్.. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పొలాల్లో పనులకు సాయం చేసేవారు. వేరుశెనగలు, పుచ్చకాయల కోత వంటి పనుల్లో పాల్గొనేవారు.ప్రస్తుతం వయసు కారణంగా పనులు తగ్గించినా.. ఇంట్లో చిన్న చిన్న పనులు మాత్రం స్వయంగా చేసుకుంటారు. టేబుళ్లు తుడవడం, బట్టలు మడతపెట్టడం వంటి పనులను వ్యాయామంగా భావిస్తారు. “శరీరం కదులుతూ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది” అనేది ఆమె నమ్మకం.ఆహారంలోనూ అదే సూత్రంవాంగ్ ఎప్పుడూ కఠినమైన డైట్ను పాటించలేదు. అన్ని రకాల ఆహారాలను సమతుల్యంగా తీసుకోవడమే తన అలవాటు అని చెబుతారు. కుడుములు, ఆవిరితో ఉడికించిన బన్స్ వంటి సాధారణ ఆహారాలతో పాటు చేపలు ఆమెకు ఎంతో ఇష్టం. జీర్ణం కావడానికి సులభంగా ఉండటంతో చేపలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఎంత ఇష్టమైన ఆహారమైనా అతిగా తినకూడదనేది ఆమె సూత్రం.కోపానికి దూరం.. ప్రశాంతతకు దగ్గరదీర్ఘాయుష్షుకు ఆహారం మాత్రమే కారణం కాదని వాంగ్ చెబుతారు. మంచి మనసు, ప్రశాంతమైన ఆలోచనలు కూడా ఎంతో ముఖ్యమని అంటారు. ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలని ఆమెకు ఓ నియమం ఉంది. అది కుటుంబ సభ్యులను అభినందించడం కావచ్చు.. పాత స్నేహితుడికి ఓ మెసేజ్ పంపడం కావచ్చు. ఎవరితోనైనా గొడవ జరిగినా ఎక్కువసేపు ఆలోచిస్తూ బాధపడకుండా నిద్రపోతే ఉదయం అంతా సర్దుకుంటుందని ఆమె నమ్మకం.12 గంటల నిద్ర.. క్రమబద్ధమైన జీవనంవాంగ్ రోజువారీ జీవితం కూడా చాలా క్రమబద్ధంగా ఉంటుంది. రాత్రి 7 గంటలకే నిద్రకు వెళ్లి.. ఉదయం 7 గంటలకు నిద్ర లేస్తారు. మధ్యాహ్నం ఒకటి లేదా రెండు చిన్న కునుకులు కూడా తీసుకుంటారు. ఆమె జీవన విధానం చూస్తే.. దీర్ఘాయుష్షు కోసం ఖరీదైన పద్ధతులు, ప్రత్యేక మందులు అవసరం లేదని తెలుస్తోంది. శరీరాన్ని చురుగ్గా ఉంచడం, పరిమితంగా తినడం, ప్రశాంతంగా జీవించడం వంటి సాధారణ అలవాట్లే ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు వేస్తాయని ఈ 111 ఏళ్ల బామ్మ చెబుతోంది. వయసు పెరగడం సహజం.. కానీ ఆరోగ్యంగా, ఆనందంగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించడం మన అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందేమో!బామ్మ చెప్పిన జీవన రహస్యాల్లో ప్రధానంగా 7 పాయింట్లు.. 1. బద్ధకించకూడదుబద్ధకం ఏ వయసు వాళ్లకైనా మంచిది కాదు. వయసు పెరిగినా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. ఇంటి పనులు కూడా ఒకరకంగా వ్యాయామమే!.2. బ్యాలెన్స్డ్ ఫుడ్సుదీర్ఘమైన ఆయుషు కోసం కఠినమైన డైట్ లాంటి వేవీ అక్కర్లేదు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం.3.అతిగా తినకూడదుఇష్టమైన ఆహారం అయినా మితంగా తీసుకోవాలన్నది ఆమె సూత్రం.4. సులభంగా జీర్ణమయ్యే ఆహారానికి ప్రాధాన్యంఈ తరహా ఆహారం.. ఆరోగ్యానికి మంచివి5. మంచి మనసుతో జీవించాలిప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలన్నది ఆమె అలవాటు.6. కోపం, ఆందోళనకు దూరంగా ఉండాలిసమస్యలను ఎక్కువగా మదిలో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండటం.7. క్రమబద్ధమైన నిద్ర అలవాటురాత్రి త్వరగా నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం.. మధ్యలో విశ్రాంతి తీసుకోవడం. అది ఏడు గంటలా?, 8 గంటలా? అనేది మీ ఇష్టం.కొసమెరుపు.. వాంగ్ గైయింగ్ నివసించే రుగావో ప్రాంతం దీర్ఘాయుష్షుకు పేరుగాంచింది. అక్కడ 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు గణనీయంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ప్రాంతంలో 672 మంది శతాధికులు (100 ఏళ్లు దాటిన వారు) ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ ప్రాంత ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు దీర్ఘాయుష్షుకు కారణాల్లో ఒకటిగా పరిశోధకులు భావిస్తున్నారు. -
మొజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతుందా? ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో చుట్టుముడుతున్న అనుమానాల మధ్య ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మోజ్తబా ఖమేనీకి సంబంధించిన మరిన్ని వీడియోలు, ఫొటోలను త్వరలో విడుదల చేస్తామని వెల్లడించింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరోసారి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.అసలు ఏం జరుగుతోంది?తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి అనంతరం మార్చిలో ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన తాజా, స్పష్టమైన దృశ్యాలు పెద్దగా బయటకు రాకపోవడంతో ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే, ఇటీవల ఇజ్రాయెల్ మీడియా సైతం మోజ్తబా ఖమేనీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి వచ్చిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.‘త్వరలో మరిన్ని వీడియోలు’బసీజ్ ఆర్గనైజేషన్ డిప్యూటీ అధికారి ఖాసెమ్ ఖొరైషీ మాట్లాడుతూ.. మొజ్తాబా ఖమేనీ ప్రజల్లో ఉన్న దృశ్యాలు, వీధుల్లో పర్యటిస్తున్న వీడియోలు, సాయుధ దళాల కమాండర్లతో సమావేశాల దృశ్యాలను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న అనుమానాలు, విమర్శలకు సమాధానం చెప్పేందుకే ఈ దృశ్యాలను బయటకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.ఆగస్టు 9న ఓ వీడియో విడుదలఇప్పటికే ఆగస్టు 9న ఇరాన్కు చెందిన సెమీ-అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ ఖమేనీకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. అయితే ఆ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయాన్ని వెల్లడించలేదు. వీడియోలో ఖమేనీ తన అనుచరులతో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారనే సందేశాన్ని ఇవ్వడమే ఈ వీడియో ఉద్దేశంగా కనిపించింది.మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. జూలై 21న మోజ్తబా ఖమేనీతో తన సంప్రదింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. కానీ ఆగస్టు ప్రారంభంలో మాత్రం.. ఖమేనీతో కమ్యూనికేషన్ “చాలా కష్టంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. ఈ రెండు భిన్న వ్యాఖ్యలు ఆయన వాస్తవంగా ఎంతవరకు ప్రభుత్వ వ్యవహారాల్లో చురుకుగా ఉన్నారనే ప్రశ్నలకు దారితీశాయి. కాగా, జూలై చివర్లో మసూద్ పెజెష్కియన్.. మొజ్తాబా ఖమేనీని కలిసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ సమావేశంలో సైనిక వ్యవహారాలతో పాటు విదేశీ మారకద్రవ్య నిర్వహణ, ఇంధన వినియోగం, అంతర్జాతీయ భాగస్వాములతో ఆర్థిక సంబంధాల వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.అందరి చూపూ ఆ వీడియోలపైనే!ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ఇరాన్ ప్రభుత్వం మరిన్ని దృశ్యాలను విడుదల చేయనున్న నేపథ్యంలో.. ఆ వీడియోలు ఎప్పుడు చిత్రీకరించబడ్డాయి? ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ఎంత చురుకుగా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా.. ఇప్పటివరకు విడుదలైన వీడియోలు ఎక్కువగా తేదీ వెల్లడించనివే కావడంతో, కొత్తగా విడుదలయ్యే దృశ్యాలను అంతర్జాతీయ పరిశీలకులు నిశితంగా గమనించే అవకాశం ఉంది. -
బ్యాంకు కాటుకు రైతు దెబ్బ!
టిట్ ఫర్ ట్యాట్ అనండి.. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనండి.. ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి. హాసన్ జిల్లా సకలేశ్పుర కెనెరాబ్యాంకులో జరిగిన ఈ ఘటన మాత్రమిప్పుడు సోషల్ మీడియాలో పిచ్చవైరల్ అవుతోంది. ‘‘రైతన్నా.. పొగరుబోతు బ్యాంకుకు భలే బుద్ధి చెప్పావు’’అన్న కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే... చొక్కన గౌడ అనే రైతు కెనెరాబ్యాంకు నుంచి యాభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఠంచనుగా తిరిగి కట్టేశాడు కూడా. హమ్మయ్య అప్పు బాధ తీరిందిలే అనుకుని ఇంటికెళితే.. కొంత కాలానికే బ్యాంకు నుంచి ఒక నోటీసొచ్చింది. ఇదేమిటబ్బా అని చూస్తే అతడికి షాక్.. ‘‘ఇంకో 9.34’’రూపాయలు బాకీ ఉన్నావు. కట్టూ అంటూ బ్యాంకు తాఖీదు. బ్యాంకు అధికారుల అతికాకపోతే.. రూ.యాభై వేలు కట్టినోడికి తొమ్మిది రూపాయల ముప్ఫై నాలుగు పైసలు ఎక్కువవుతుందా? చొక్కన గౌడ కూడా ఇలాగే ఫీలయ్యాడు. సరే అనుకుని బ్యాంకుకు వెళ్లాడు. మిగిలిన బాకీ వివరాలతో పే ఇన్ స్లిప్ నింపాడు. పది రూపాయల నోటు జత చేసి బ్యాంకు అధికారికి ఇచ్చాడు. వాళ్లేమో భలే నిక్కచ్చిగా పనిచేశాము మేము అనుకుని భుజాలు చరుచుకుని సీలు వేసిన స్లిప్ను చొక్కనగౌడకు రిటర్న్ ఇచ్చాడు. అక్కడ మొదలైంది తకరారు. ‘‘పది రూపాలిచ్చా. మీకివ్వాల్సింది రూ.9.34. ఆ విషయమే స్లిప్లో రాశా. మీరు సీల్ కూడా వేశారు. మరి... బాకీ 66 పైసల మాటేమిటి?’’అన్నాడు చొక్కనగౌడ. నోట మాట రాలేదు బ్యాంకు అధికారులకు. ఈ ఘటన ఫిబ్రవరిలోనే జరిగినప్పటికీ తాజాగా మరోసారి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యింది. కొసమెరుపు ఏమిటంటే.. చొక్కనగౌడ డిమాండ్కు తలొగ్గిన బ్యాంకు 66 పైసల మొత్తాన్ని అతడి ఖాతాలోకి జమ చేయడం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
26 ఏళ్ల మిలియనీర్ కుక్కలా మారేందుకు రూ. 220 కోట్లు? వీడియో వైరల్
ఎవరైనా అందంగా మారాలనుకుంటారు. మంచి ఒడ్డూ పొడుగు, శరీర సౌష్టవంతో ఆకర్షణీయంగా కనిపించేందుకు ఎత్తు పెరగాలని లేదా బరువు తగ్గాలని కోరుకుంటారు. కానీ జపాన్కు చెందిన ఒక వ్యాపారవేత్త కుక్కలా మారేందుకు అనేక సర్జరీలు చేయించు కున్నారు. ఇందుకోసం ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాడనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందులో నిజమెంత?సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న "జాసో (Jaso)" అనే 26 ఏళ్ల మిలియనీర్ వ్యాపారవేత్త దాదాపు రూ.220 కోట్లు ఖర్చు చేశాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కోటీశ్వరుడికి కుక్కలంటే మక్కువ ఎక్కువట. అందుకే కుక్కలా బాడీ మోడిఫికేషన్, ఆపరేషన్లు అంటూ పెద్ద మొత్తంలో ఖర్చుచేశాడనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆన్లైన్ పోస్టులు , వీడియోల ప్రకారం, జపాన్కు చెందిన "జాసో" అనే 26 ఏళ్ల యువ మిలియనీర్, అత్యంత ఖరీదైన శస్త్రచికిత్సల ద్వారా తనను తాను కుక్కలా మార్చుకున్నాడని, దీనికోసం రూ.220 కోట్లు ఖర్చు అయిందంటున్నవైరల్ వీడియోలలో ఒక వ్యక్తి కుక్క దుస్తులలో, కుక్కలాగే కదులుతున్నట్లు కనిపిస్తున్నాడు.ఇదీ చదవండి: 8 అడుగుల జుట్టు : ఇండియన్ యూట్యూబర్ వరల్డ్ రికార్డ్, ఎన్నేళ్ల కష్టమో తెలుసా? इंसान से 'कुत्ता' बनने के लिए उड़ा दिए ₹220 करोड़🐕🦺ये कहानी सुन के होश उड़ जायेगे 😱सोशल मीडिया पर जापान के 26 साल के करोड़पति जासो का एक वीडियो है, जासो को कुत्ते जैसा दिखने और कुत्ते जैसी जिंदगी जीने का इतना शौक चढ़ा कि उन्होंने इसके लिए करीब ₹220 करोड़ खर्च कर दिए।जासो… pic.twitter.com/KEulnMShgO— Sachin Verma🐦 (@itSachinverma) August 8, 2026ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ ఫ్యాక్ట్ చెక్ఈ వార్తలో ఎలాంటి నిజం ఉన్నట్లు ఆధారాలు లేవు. "జాసో" అనే వ్యక్తి గుర్తింపు, ఆయన వయస్సు (26), ఆయన వ్యాపారవేత్త రూ. 220 కోట్లు ఖర్చు చేశారనే వాదనలకు సంబంధించి ఎటువంటి విశ్వసనీయమైన సాక్ష్యాలు లేవని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు తేల్చారు. ఇది పూర్తిగా కల్పితం. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ లైక్స్ కోసం క్రియేట్ చేసిన ఫేక్ స్టోరీలలో ఇది ఒకటని, ఇప్పటివరకు రూ,220 కోట్ల ట్రాన్స్ఫర్మేషన్ వార్తకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదని స్పష్టమవుతోంది. ఇక ఈ క్లిప్లలో కనిపిస్తున్న జంతువు మనుషుల చర్మం లాంటి రూపం కలిగిన ఒక అరుదైన, ప్రాచీన 'హెయిర్లెస్' కుక్క జాతికి చెందినది.ఇదీ చదవండి: డ్యూప్లెక్స్ ఇంట్లో అస్తిపంజరమై తేలిన 57 ఏళ్ల దాక్షాయణి'జాసో డాగ్ ట్రాన్స్ఫర్మేషన్' స్టోరీ నిస్సందేహంగా ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి వివాదాస్పద స్టోరీలపై అధికారిక ప్రకటనలు లేదా విశ్వసనీయమైన నివేదికలు ఈ రెండు కథనాలలో దేనినైనా ధృవీకరించే వరకు అప్రమత్తంగా ఉండాలి.ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్కి రూ. 6 లక్షల రింగ్ : లవర్ చేసిన పని ఇదే! -
కాక్రోచ్ పార్టీలో కాకరేపిన అసంతృప్తి.. తెరపైకి కొత్త ట్విస్ట్!
కొత్తగా జాతీయ స్థాయి కమిటీని ప్రకటించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)లో అప్పుడే అసంతృప్తి భగ్గుమంది. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి.. వ్యవస్థాపకుడికి సన్నిహితంగా ఉన్నవారికే కీలక పదవులు కట్టబెట్టారంటూ అహ్మదాబాద్కు చెందిన యువకుడు మణీష్ బ్రహ్మభట్ నిరవధిక నిరాహార దీక్షకు దిగాడు. జంతర్ మంతర్ విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కోఆర్డినేటర్లు, వాలంటీర్లకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నివాసం ఎదుట కూడా నిరసన చేపట్టాడు.సీజేపీ తన తొలి నేషనల్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన మరుసటి రోజే ఈ వివాదం తెరపైకి వచ్చింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన పలువురు వాలంటీర్లు, కోఆర్డినేటర్లను నాయకత్వ ఎంపికలో పట్టించుకోలేదని బ్రహ్మభట్ ఆరోపించాడు. దీప్కేకు దగ్గరగా ఉన్నవారికే కొత్త కమిటీలో పదవులు దక్కాయని విమర్శించాడు. కోర్ కమిటీ సమావేశానికి తాను, మరికొందరు వాలంటీర్లు హాజరైనప్పటికీ.. సమావేశంలో పాల్గొనే అవకాశం ఇవ్వలేదని బ్రహ్మభట్ చెప్పాడు. రోజంతా అక్కడే ఉన్నప్పటికీ తమను లోపలికి పిలవలేదని, మొదట తాము సమావేశ ప్రదేశానికి రాలేదంటూ వాట్సాప్లో సమాచారం ఇచ్చారని ఆరోపించాడు. ఆ తర్వాత ఆశుతోష్ను సంప్రదించినా స్పందన రాలేదని పేర్కొన్నాడు.సమావేశం జరుగుతున్న సమయంలో సభ్యుల ఫోన్లను బయటే ఉంచేడంతో తాము బయట వేచి ఉన్న విషయం లోపల ఉన్నవారికి తెలియలేదని కొందరు తర్వాత చెప్పినట్లు బ్రహ్మభట్ తెలిపాడు. మరుసటి రోజు ఉదయం రావాలని తమకు సూచించినట్లు చెప్పాడు. ఇక తాను ప్రతిపాదించిన ప్రచార కార్యక్రమాన్ని కూడా తనకు క్రెడిట్ ఇవ్వకుండా మరో పేరుతో ప్రారంభించారని బ్రహ్మభట్ ఆరోపించాడు. దేశవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను చెప్పుకునేలా ‘ఏక్ రీల్ దేశ్ కే నామ్’ పేరుతో ప్రచారం నిర్వహించాలని తాను సూచించానని తెలిపాడు. అయితే అదే తరహా కార్యక్రమాన్ని సీజేపీ ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో ప్రారంభించిందని, తన ప్రతిపాదనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించాడు.Chhatrapati Sambhajinagar, Maharashtra: Jantar Mantar protester Manish Brahmbhatt began a hunger strike over the CJP core committee dispute, alleging volunteers were excluded and only Abhijit Dipke’s close associates were included.Manish Brahmbhatt, Ahmedabad youth sitting on… pic.twitter.com/jFsuRBNcyy— IANS (@ians_india) August 7, 2026ఈ నేపథ్యంలో మరో సీజేపీ వాలంటీర్తో కలిసి అభిజిత్ దీప్కే ఇంటి ముందు బ్రహ్మభట్ నిరసనకు దిగాడు. జంతర్ మంతర్ ఉద్యమంలో పనిచేసిన కోఆర్డినేటర్లకు పార్టీ నాయకత్వంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశాడు. మరోవైపు, ఛత్రపతి సంభాజీనగర్లోని దీప్కే నివాసంలో రెండు రోజుల పాటు జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం సీజేపీ తన తొలి జాతీయ నాయకత్వాన్ని ప్రకటించింది. వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను నేషనల్ కన్వీనర్గా నియమించగా.. చీఫ్ స్పోక్స్పర్సన్ సౌరవ్ దాస్, స్పోక్స్పర్సన్ ఆశుతోష్ రంకాలను కో-కన్వీనర్లుగా నియమించింది.అజింక్య షిండేను నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా, దీపక్ బలియాన్ను ఆర్గనైజేషన్ కో-ఇన్ఛార్జ్గా, ఆఫ్రీన్ నవాజ్ను నేషనల్ సెక్రటరీగా ప్రకటించింది. విజయ్ రెడ్డి మల్లంగి మీడియా లీడ్గా, రత్నా సింగ్ లీగల్ అఫైర్స్ లీడ్గా, వైష్ణవి గౌర్ రీసెర్చ్ అండ్ పాలసీ లీడ్గా, రోహన్ దేశ్పాండే టెక్నాలజీ లీడ్గా, యోగేశ్ ఇంగలే ఫైనాన్స్ లీడ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, ఈశాన్య, పశ్చిమ జోన్లకు కూడా నాయకత్వ బాధ్యతలు కేటాయించారు. -
గుజరాత్ అలల బావి మిస్టరీ వీడింది..!
సాధారణంగా బావుల్లో నీరు నిశ్చలంగా ఉంటుంది. గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఓ వ్యవసాయ బావి మాత్రం మొత్తం దేశం దృష్టిని ఆకర్షిచింది. సముద్రపు అలలను తలపించేలా నీరు రోజుల తరబడి ఊగుతూ కనిపిస్తోంది. అది చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఇది భూకంపానికి ముందస్తు సంకేతమేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే బావిని నిపుణులు పరిశీలించాక.. దీని వెనక కారణం ఏంటన్నది తెలిసిపోయింది!. విర్పర్డా గ్రామంలోని ఈ వింత బావి గురించి కొన్నిరోజులుగా దేశం చర్చించుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. అతీత శక్తులంటూ.. ఎవరికి తోచిన కథనాలు వాళ్లు ఇచ్చి పడేస్తున్నారు. అయితే బావిలో ఈ వింత వెనుక సైన్స్ తప్ప మరేయితర కారణాలు లేవని నిపుణులు తేల్చేశారు. అంతేకాదు.. ఎలాంటి ప్రకృతి విపత్తు కూడా రాబోవని అంటున్నారు. ఈ తరహా అలలు ఏర్పడడానికి సరైన కారణం ఏంటన్నది చెబుతున్నారు. An unusual mystery in India: water wildly swaying inside a well in Morbi, and no one can explain whyStrange phenomenon continues for a FIFTH DAY, baffling locals as authorities investigate pic.twitter.com/GykyazKKXi— RT (@RT_com) August 7, 2026సముద్రంలా ఎందుకు ఊగుతోందంటే..భారీ వర్షాల తర్వాత భూమిలోకి పెద్ద మొత్తంలో నీరు చేరుతుంది. ఈ నీరు భూగర్భంలోని రాళ్ల పొరలు, ఖాళీ ప్రదేశాలు, జలాశయ ప్రాంతాల్లోకి ప్రవహిస్తుంది. ఈ సమయంలో భూమి లోపల ఉన్న గాలి, నీటి ఒత్తిడిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ ఒత్తిడి మార్పుల ప్రభావంతో బావిలోని నీరు పైకి కిందికి కదులుతూ అలల మాదిరిగా కనిపిస్తోంది. ముఖ్యంగా లోతైన బావుల్లో ఇలాంటి కదలికలు ఎక్కువగా గమనించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.‘వెల్ సీష్’ కూడా ఓ కారణమేనా?ఈ ఘటనకు మరో శాస్త్రీయ వివరణగా ‘వెల్ సీష్’ (Well Seiche). ఒక నిర్దిష్ట ఆకారం, లోతు కలిగిన నీటి నిల్వలో చిన్నపాటి కదలిక కూడా సహజ తరంగాలుగా మారినప్పుడు.. నీరు కొంత సమయం పాటు ముందుకు వెనక్కి ఊగుతుంది. సరస్సుల్లో కనిపించే ఈ తరహా కదలికలు కొన్ని సందర్భాల్లో బావుల్లోనూ కనిపించవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.मोरबी के वीरपरडा गांव में एक कुएं में अचानक पानी छलकने और हिलने-डुलने लगा, जिसे देखने के लिए बड़ी संख्या में लोग इकट्ठा हो गए। इसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। #Morbi #GujaratNews #ViralVideo pic.twitter.com/hAd95ETbia— Bhoomi (@TheBPnova) August 6, 2026భూకంపం భయం..మోర్బీ ప్రాంతానికి భూకంప చరిత్ర ఉండటంతో ఈ బావిలోని వింత కదలికలు ప్రజల్లో భయాన్ని కలిగించాయి. ముఖ్యంగా 2001లో గుజరాత్ను కుదిపేసిన భారీ భూకంపం జ్ఞాపకాలు ఇంకా ప్రజలను వెంటాడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బావిలో కనిపిస్తున్న నీటి కదలికలకు భూకంప కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు, భూగర్భ శాస్త్ర నిపుణులు స్పష్టం చేశారు. ప్రాంతంలో ఎలాంటి సీస్మిక్ యాక్టివిటీ లేదంటే క్రియాశీల ఫాల్ట్ లైన్ గుర్తించలేదని తేల్చేశారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు.సముద్రపు ఆటుపోట్ల ప్రభావమా?మోర్బీ అరేబియా సముద్రానికి పూర్తిగా దూర ప్రాంతం కాదు. దీంతో కొందరు స్థానికులు బావి నీరు సముద్రపు ఆటుపోట్ల ప్రభావంతో కదులుతోందని భావించారు. భూగర్భ జల మార్గాలు సముద్రంతో అనుసంధానమై ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే దీనికి ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు. స్థానిక భౌగోళిక పరిస్థితులు, భూగర్భ జలాల ఒత్తిడి మార్పులే దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.🚨 GUJARAT | MYSTERIOUS WELLAn unusual phenomenon has drawn crowds to Virparda village in Gujarat's Morbi district where water inside a roadside well has been continuously moving from one side to the other.According to local reports nearby wells remain completely calm while… pic.twitter.com/rJHvXjOZ8V— contentkikamii (@contentkikamii) August 6, 2026ఇలాంటి వింతలు ప్రపంచంలోనూ ఉన్నాయిబావులు, సరస్సుల్లో నీరు అసాధారణంగా కదలడం ఇదే మొదటిసారి కాదు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. సరస్సుల్లో నీరు ఒకే దిశలో ఊగడం, భూగర్భ జలాల్లో ఒత్తిడి మార్పులతో నీటి స్థాయిలు మారడం వంటి పరిణామాలను శాస్త్రవేత్తలు సహజ ప్రక్రియలుగానే వివరిస్తున్నారు. అయితే బావిలో నీరు కదలడం ఆధారంగా భూకంపాలను అంచనా వేయడం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. మన దేశంలో ఇలాంటివి జరిగినా.. ఇప్పుడు సోషల్ మీడియా జమానా కారణంగా మోర్బీ బావి ఉదంతం హైలైట్ అయ్యిందంతే!.భయపెట్టిన బావి.. ఇప్పుడు ఆకర్షణగా మారిందిమొదట ఈ దృశ్యం గ్రామస్తులను భయపెట్టినా.. ఇప్పుడు అదే బావి ఆసక్తికరంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వింతను చూసేందుకు వస్తున్నారు. అధికారులు మాత్రం ప్రజలు ఎలాంటి అపోహలు, పుకార్లను నమ్మవద్దని సూచిస్తున్నారు. గుజరాత్ మోర్బీ బావిలో కనిపిస్తున్న ఈ ‘సముద్రపు అలలు’ భూమి లోపల ఏదో పెద్ద మార్పు జరుగుతోందనే సంకేతం కాదు.. ప్రకృతి తనదైన రీతిలో చూపిస్తున్న అరుదైన జల భౌగోళిక పరిణామం మాత్రమే. -
నా ఇంట్లో మీ పెత్తనం ఏంటి?.. అభిజిత్ దీప్కే ఫైర్!
భద్రత కోసం వచ్చిన పోలీసు అధికారి తనపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అబిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. తన నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఛత్రపతి శంభాజీనగర్లోని వాలుజ్ ఎంఐడీసీ ప్రాంతంలోని దీప్కే నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బెదిరింపుల నేపథ్యంలో, అలాగే ఆయనను కలిసేందుకు భారీగా ప్రజలు వస్తుండటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ను అక్కడ నియమించారు. అయితే ఆ అధికారి తన ఇంటికి వచ్చే వారిని నియంత్రిస్తున్నారని దీప్కే ఆరోపించారు.‘ఎవరిని కలవాలో మీరు నిర్ణయిస్తారా?’వైరల్గా మారిన ఓ వీడియోలో.. సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారితో దీప్కే వాగ్వాదం చేస్తూ కనిపించారు. తన ఇంటికి ఎవరు రావాలి.. ఎవరిని కలవాలి అనే విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. “నా ఇంట్లో మీ పెత్తన ఏంటి?. నేను ఎవరినైనా ఇంట్లోకి రావాలని చెబుతున్నప్పుడు.. వారిని ఎందుకు ఆపుతున్నారు? ఢిల్లీ పోలీసుల్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పటివరకు ఎలాంటి సమస్య జరగలేదు. ఎవరిని కలవాలి.. ఎవరిని కలవకూడదో పోలీసులు నాకు చెప్పలేరు” అంటూ దీప్కే ప్రశ్నించారు.అంతేకాకుండా.. “మీరు బయటకు వెళ్లండి. నాకు మీ అవసరం లేదు” అంటూ ఆ పోలీసు అధికారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.Chhatrapati Sambhajinagar - Abhijit Dipke has made strong allegations against CID officers, accusing them of arrogant and rude behaviour towards people who come to meet him.Dipke, who flared up against the police officers, claimed that visitors arriving for meetings with him are… pic.twitter.com/5hCF6s7p8Y— NextMinute News (@nextminutenews7) August 7, 2026ఉన్నతాధికారికి ఫోన్లో ఫిర్యాదుమరో వీడియోలో దీప్కే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడారు. సురేశ్ అనే పీఎస్ఐ తనను కలిసేందుకు వచ్చే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వారిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని, అలాంటి అధికారి తనకు వద్దని పేర్కొన్నారు. వెంటనే అతడిని అక్కడి నుంచి తొలగించాలని కోరారు. “నా ఇంటికి వచ్చే వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది కావాలనే చేస్తున్నారా?” అంటూ ఆయన ప్రశ్నించినట్లు వీడియోలో వినిపిస్తోంది.నిఘా ఆరోపణలుతన నివాసం సమీపంలో సీఐడీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో నిఘా పెట్టారని కూడా దీప్కే ఆరోపించారు. ఓ రిపోర్టర్ తనకు ఈ విషయం తెలిపారని చెప్పారు. ఓ సీఐడీ సిబ్బంది ఫోన్లో ‘హిట్ స్ప్రే’ పేరుతో వాట్సాప్ గ్రూప్ కనిపించిందని, అక్కడి నుంచి నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. అయితే దీప్కే చేసిన ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక స్పందన వెంటనే రాలేదు. వాలుజ్ ఎంఐడీసీ పరిధి డీసీపీ పంకజ్ అతుల్కర్ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదు. మరోవైపు.. అభిజిత్ యాటిట్యూడ్పైనా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల నిరసనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన అబిజీత్ దీప్కే.. తాజాగా తన ఇంటి వద్ద భద్రతా సిబ్బందితో జరిగిన ఈ వివాదంతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. భద్రత పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించకూడదన్నది దీప్కే వాదన కాగా.. భద్రతా ఏర్పాట్లలో భాగంగానే పోలీసులు వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. -
ఫేక్ఆట కట్టించే లా
ఒకప్పుడు సెలబ్రిటీల చుట్టూ మాత్రమే తిరిగిన ‘డీప్ఫేక్’ విష సర్పం... ఇప్పుడు సామాన్యుల జీవితాల్లోకి కూడా వచ్చింది. స్విచ్ వేసి లైట్ వెలిగించినంత తేలిగ్గా ‘మాయా సాంకేతికత’ అందుబాటులోకి వచ్చింది. డీప్ఫేక్ దెబ్బకు...పచ్చని సంసారాల్లో చిచ్చు రేగుతుంది. పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. ఒక్కటా... రెండా... ఎన్నో ఎన్నెన్నో! ఏ.ఐ. టెక్నాలజీ సృష్టించిన డీప్ఫేక్, హానికరమైన సింథటిక్ కంటెంట్కు మరింత పకడ్బందీగా అడ్డుకట్ట వేయడానికి కేంద్రప్రభుత్వం నడుం బిగించింది. డీప్ఫేక్ డిటెన్షన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. పదమూడు ఏఐ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్లకు ఆమోదం తెలిపింది...డీప్ఫేక్ కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ఎలక్ట్రానిక్స్–ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మెటా, ఎక్స్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను దృష్టిలో పెట్టుకొని కఠినమైన నియమాలను రూ΄÷ందించింది. ‘ఏఐ వాడకం పెరగడం వల్ల నకిలీ ఫొటోలు, వీడియోలు, ఆడియోలను సృష్టించడం సులువైంది. వీటిని సైబర్ నేరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. డీప్ఫేక్లకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చట్టాలను పటిష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియటరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్–2021)ని సవరించింది’ అంటున్నారు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్.వేగంగా చర్యలు తీసుకోవచ్చుచట్టవిరుద్ధమైన ఏఐ కంటెంట్పై ఇకపై ఆన్లైన్ ప్లాట్ఫామ్లు వేగంగా చర్యలు తీసుకోవచ్చు. గతంలో ఉన్న 36 గంటల గడువుకు బదులుగా, మూడు గంటల లోపే తొలగించాలి. చట్ట విరుద్ధమైన ఏఐ కంటెంట్ను గుర్తించడానికి, ఆటోమేటెడ్ సాధనాలతో సహా తగిన సాంకేతిక చర్యలను అమలు చేయాలని ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలను కోరింది. సవరించిన నిబంధనల ప్రకారం ఏఐ ద్వారా రూ΄÷ందించిన కంటెంట్ను స్పష్టంగా లేబుల్ చేయాలి. సింథటిక్ కంటెంట్ను మరింత సులభంగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. డీప్ఫేక్ల ద్వారా ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశాలను తగ్గిస్తుంది.‘సాక్ష్య’ సహకారంతో...నియంత్రణా పరమైన మార్పులతో ΄ాటు డీప్ఫేక్ డిటెన్షన్ టెక్నాలజీని మెరుగుపరచడానికి విద్యాసంస్థలలో పదమూడు ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ ప్రాజెక్ట్లను ప్రభుత్వం ఆమోదించింది. ఐఐటీ, జో«ద్పూర్, ఐఐటీ, మద్రాస్ అభివృద్ధి చేస్తున్న మల్టీ– ఏజెంట్ డీప్ఫేక్ డిటెక్షన్ ఫ్రేమ్వర్క్ ‘సాక్ష్య’ ఈ కార్యక్రమాలలో కీలకమైనది. మరొక ప్రాజెక్ట్...ఏఐ విశ్లేషక్. నకిలీ ఆడియో, వీడియోలను గుర్తించడానికి దీన్ని రూ΄÷ందించారు. మీడియాఫైళ్లను విశ్లేషించడానికి, వాటిని తారుమారు చేశారా అనేది తెలుసుకోవడానికి ‘ఏఐ విశ్లేషక్’ ఉపయోగపడుతుంది. ఐఐటీ, ఖరగ్పూర్ రియల్–టైమ్ వాయిస్ డీప్ఫేక్ డిటెన్షన్ సిస్టమ్పై పనిచేస్తోంది. ఏఐ సృష్టించిన మాటలను ఇది గుర్తించగలదు. తద్వారా వాయిస్ స్కామ్లు, ఆర్థిక మోసాలు జరగకుండా నిరోధించవచ్చు.యూట్యూబ్ లైక్ డిటెక్షన్ఏఐ–ఆధారిత పోలికను గుర్తించే ్రపోగ్రామ్కు 18 ఏళ్లు పైబడిన యూజర్లు అందరికీ యాక్సెస్ విస్తరిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. దీంతో తమ పోలికతో ఏఐ ద్వారా సృష్టించబడిన డీప్ఫేక్లపై చర్య తీసుకోవచ్చు. యూట్యూబ్లోని లైక్ డిటెక్షన్ టూల్ అనేది పోలికలను కనిపెడుతుంది. ఒకవేళ ఈ టూల్ పోలిక కనుగొంటే, ఎవరి పోలిక అయితే గుర్తించబడిందో ఆ యూజర్కు ఒక హెచ్చరిక(అలర్ట్) పంపబడుతుంది. దీంతో ఆ కంటెంట్ను తొలగించమని యూట్యూబ్ను అభ్యర్థించే అవకాశం బాధితులకు దొరుకుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఏఐ ద్వారా సృష్టించబడిన చాలా డీప్ఫేక్లు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ సామాన్యులకు సంబంధించి కూడా ఇది ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో వారికి లైక్ డిటెక్షన్ టూల్ ఉపయోగపడుతుంది.ఎలా గుర్తించవచ్చు?డీప్ఫేక్ కొత్తగా వచ్చిన రోజుల్లో ఆ సాంకేతికత పరిపూర్ణంగా ఉండేది కాదు. తారుమారు చేసినట్లు స్పష్టమైన సంకేతాలు చూపించేది. వీడియోలలో కనిపించే వ్యక్తులు అసహజంగా కనురెప్పలు ఆర్పడం లాంటివి అందులో ఒకటి. తరువాత రోజుల్లో టెక్నాలజీ మెరుపడడంతో డీప్ఫేక్లను గుర్తించడం కష్టమైంది. అయినప్పటికీ కొన్ని సంకేతాలతో వాటిని గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు...→ సహజత్వం లోపించిన డీప్ఫేక్ ఫొటోలు ఎలక్ట్రానిక్ మెరుపును కలిగి ఉంటాయి → చిత్రంలోని వ్యక్తి స్పష్టమైన ఫోకస్లో ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లోని అంశాలు వాస్తవికంగా అనిపించవు → సాధారణ డీప్ఫేక్ పద్ధతులలో ముఖాలను మార్చడం ఫేస్–స్వాపింగ్) ఒకటి. ముఖం అంచులను నిశితంగా చూడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖంలోని చర్మపు రంగు శరీరంలోని మిగిలిన భాగంతో సరిపోలుతుందా? ముఖం అంచులు స్పష్టంగా ఉన్నాయా లేదా చూడాలి → వీడియోలో ఉన్న వ్యక్తి పెదాల కదలికలు ఆడియోతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయా... లేదా అనేది చూడాలి → పళ్లు సహజంగా ఉన్నాయా... అసహజంగా ఉన్నాయా అనేది పరిశీలించాలి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ నార్టన్ ప్రకారం ఒక్కోపంటిని సృష్టించేంత అధునాతనమైన అల్గారిథమ్లు ఇంకా అభివృద్ధి చెందలేదు → ఫొటోలు లేదా వీడియోలు మార్ఫింగ్ చేయబడ్డాయా లేదా అనేది తెలుసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఒక అథంటికేటర్ టూల్ను అభివృద్ధి చేసింది. చిప్ మేకర్ ఇంటెల్ ‘ఫేక్క్యాచర్’ ఫొటో లేదా వీడియో నిజమైనదా కాదా అని తెలుసుకోవడానికి, పిక్సెళ్ళను విశ్లేషించడానికి అల్గారిథమ్లను ఉపయోగిస్తుంది. -
10 నెలల క్రితమే ప్రేమ పెళ్లి : రీల్స్ చేస్తోందని చంపేశాడు!
కలకాలం కలిసి ఉందామని బాస చేశాడు. తల్లిదండ్రులను కూడా మరిపించి సుమారు 10 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కన్న ఊరు వదిలి బెంగళూరులో మకాం పెట్టాడు. అంతలోనే తననుపట్టించుకోవడంలేదనీ, ఎక్కువ సమయం రీల్స్చేయడంతోనే గడుపుతోందంటూ అసహనం పెంచుకుని భార్యను మట్టు బెట్టాడు.పోలీసుల వివరాల ప్రకారం, బిహార్కు చెంది 24 ఏళ్ల ధీరజ్ కుమార్, రీమా కుమారి ప్రేమించాడు. 10 నెలల క్రితం వీరు వివాహం చేసుకున్నారు. రీమా కుటుంబ సభ్యులకు చెప్పకుండా వీరిద్దరూ బెంగళూరు వచ్చి కుంబళగోడు (Kumbalgodu) పట్టణంలో నివాసం ఉంటున్నారు. అయితే భార్య రీమాను గొంతు నులిమి హత్య చేసి స్వగ్రామమైన బిహార్కు పారిపోయాడు. చివరకు పోలీసులు ధీరజ్ కుమార్ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు కీలక విషయాలను వెల్లడించాడు.బెంగళూరు వచ్చాక రీమాకు తనపై ఆసక్తి తగ్గిందని, రోజంతా సోషల్ మీడియాలో 'రీల్స్' (Reels) చేస్తూ గడిపేదని ధీరజ్ పోలీసులకు తెలిపారు. సఅలు తనతో శారీరక సంబంధానికి నిరాకరించడంతో పాటు, కేవలం తన కోసమే వంట చేసుకుని, అతనికి వడ్డించేది కాదని పేర్కొన్నాడు. తిరిగి బీహార్ వెళ్దామని పట్టుబట్టడంతో వీరి మధ్య రోజూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో జూలై 25న ధీరజ్ ఇంటికి వచ్చేసరికి అతనికి ఆహారం సిద్ధం చేయలేదు. దీనిపై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ధీరజ్ ఆమెను పడుకోమని చెప్పగా, రీమా నిరాకరించి కలప కర్రతో అతనిపై దాడి చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ధీరజ్, ఆమె చున్నీతోనే (Dupatta) ఉరివేసి చంపేశాడు. హత్య అనంతరం ఆమె ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి, మృతదేహాన్ని బెడ్ షీట్లో చుట్టేసి, గదికి తాళం వేసి బీహార్కు పారిపోయాడు.ఇదీ చదవండి : ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్గా ఘనతఆమె మృతదేహం కుళ్లి ఆ గది నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో, ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. జూలై 29న పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో రీమా మృతదేహం లభ్యమైంది. హత్య, సాక్ష్యాల నాశనం కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి నిందితుడిని కుంబళగోడు పోలీసులు బిహార్లో అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్నిఅంగీకరించాడని, సీసీటీవీ ఫుటేజ్ వైజ్ఞానిక ఆధారాలను కూడా సేకరించామని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ -
గుజరాత్లో మిస్టరీ.. ఐదు రోజులుగా బావిలో ఏం జరుగుతోంది?
ఆ గ్రామంలోని ఓ సాధారణ బావి.. గత ఐదు రోజులుగా ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేదు. గాలి లేదు.. వర్షం లేదు.. ఎవరూ తాకడం లేదు.. అయినా బావిలోని నీరు సముద్రంలా అలలు ఎగురేస్తూనే ఉంది. ఈ వింతను చూసిన గ్రామస్థులు మొదట భయంతో వణికిపోయారు. భూకంపం రాబోతోందా? అంటూ ఆందోళన చెందారు.గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఉన్న ఒక 18 అడుగుల లోతైన బావి గత ఐదు రోజులుగా నిరంతరం అలలు, తరంగాలతో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో, వార్త క్షణాల్లో వ్యాపించడంతో వందలాది మంది అక్కడికి చేరుకుని, ఆ అద్భుతాన్ని తమ కళ్లారా వీక్షిస్తున్నారు. మరోవైపు.. బావి యజమాని ప్రాంజీవన్ సదారియా తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 2న ఆయన పొలానికి వెళ్లినప్పుడు బావిలోని నీరు అలలతో కదులుతూ బయటకు పొర్లిపోతున్నట్లు గమనించారు. మూడు నెలల క్రితమే ఈ బావిని తవ్వినట్టు చెప్పుకొచ్చారు.అయితే, ఈ మిస్టరీకి నిపుణులు ఇచ్చిన వివరణ మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు వేగంగా నిండిపోయాయి. రాళ్ల మధ్య చిక్కుకున్న గాలి బయటకు రావడంతో బావిలో నిరంతరం అలలు ఏర్పడుతున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. అయినా ఈ వింత వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి గాంధీనగర్ నుంచి నిపుణుల బృందం రంగంలోకి దిగుతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన బావి... ఇప్పుడు అలలతో ఉప్పొంగుతోంది. ఇది ప్రకృతి సృష్టించిన అద్భుతమా? లేక ఇంకా వెలుగులోకి రాని మరో రహస్యమా? సమాధానం కోసం అందరి చూపు ఇప్పుడు ఆ బావిపైనే ఉంది!Well Water Continues to Oscillate in #Morbi Village; Collector Orders Probe#Gujarat #India 🇮🇳 pic.twitter.com/eZYwUKNvqV— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) August 7, 2026ఇక, మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే ఈ ఘటనపై వెంటనే స్పందించి, బావిలో ఐదు రోజులుగా కనిపిస్తున్న అలల విషయాన్ని గుజరాత్ ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ ఘటనకు గల అసలు కారణాన్ని శాస్త్రీయంగా గుర్తించేందుకు గాంధీనగర్ నుంచి భూగర్భ శాస్త్ర నిపుణుల బృందాన్ని ఘటన స్థలానికి పంపించాలని ఆదేశించారు. నిపుణుల బృందం బావిని పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించిన తర్వాతే ఈ వింతకు గల ఖచ్చితమైన కారణాన్ని అధికారికంగా వెల్లడిస్తామని జిల్లా యంత్రాంగం తెలిపింది. -
చెత్తలో పారేసిన లాటరీ టికెట్..ఏకంగా అన్ని కోట్లా..! కన్నీళ్లు పెట్టుకున్న మహిళ
ఒక్కోసారి పొరపాటున లేక ఏమరపాటున పెద్ద వాల్యు చేయదని పడేసిన లాటరీ టికెట్ ఒక్కోసారి ఊహకందని రేంజ్లో డబ్బును గెలుచుకుంటుంది. నిజమా కల అనిపించేంత సొమ్ముని అందిస్తుంటుంది. అయితే ఆ లాటరీ మన వద్ద ఉంటే..ఆ అదృష్టం మన చెంతే.. అదే చేజార్చుకుంటూ ఆ బాధ మాటలకందనిది. ఇక్కడొక మహళ కూడా చేజేతులారా లాటరీ టికెట్ని పోగోట్టుకుంది. కట్చేస్తే అది ఎంత మొత్తం గెలుపొందిందంటే..ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. దక్షిణ ఇటలీలోని బిటోంటోలో ఒక దుకాణంలో తన లాటరీ నంబర్లను సరిచూసుకున్నప్పుడు, అది అనర్హమైనది, (నాన్ పేబుల్) అని సందేశం రావడంతో మరో ఆలోచన లేకుండానే పారేసింది. నిజానికి అలా దుకాణం వద్ద చెల్లించలేనంత భారీ సోమ్ముని గెలుపొందినప్పుడే ఇలాంటి సందేశం వస్తుంది. అయితే సదరు మహిళ దుకాణం నుంచి ఇంటికి తిరిగి వచ్చాక..ఆమె తరుచుగా ఆడే నంబర్లే ఆమెను విజేతగా నిలిపాయని, కటుంబ సభ్యులు చెప్పాకగానే తెలియలేదు అసలు విషయం. ఆమె ఎంచుకునే నంబర్లన్నీ అత్యంత ఆప్తులైన వారికి సంబధించినవే. దీంతో ఆమె వెంటనే ఆ టికెట్ కోసం దుకాణానికి పరిగెత్తింది. అప్పటికే ఆ టికెట్ చెత్తలో పారేయబడటం, చెత్తను తరలించే వాహనంలో వెళ్లిపోవడం చకచక జరిగిపోయాయి. ఎలాగైనా టికెట్ని తిరిగిపొందేందుకు..ఆమె కుటుంబ సభ్యులు వ్యర్థాల నిర్వహణ సంస్థ 'SANB' నిర్వాహకుడు రాబర్టో నికోలా టోస్కానోను సంప్రదించారు. చెత్తను తీసుకువెళ్లే ట్రక్ అప్పటికే దానిని తీసుకెళ్లిపోవడంతో, అది దొరుకుతుందనే పెద్దగా ఆశ లేకుండానే టోస్కానో అతని బృందం ఆ ట్రక్ని గుర్తించి ఆపారు. చెత్తలో ప్రమాదకరమైన పదార్థాలు ఉండే అవకాశం ఉన్నందున, ప్రత్యేక సంరక్షణా సౌకర్యాలున్నా..సంస్థకు తరలించి, అక్కడి పారిశుధ్య కార్మికుల సాయంతో జల్లెడ పట్టారు. చివరికి ఆశ్చర్యకరంగా ఆ టికెట్ని గుర్తించారు. అదృష్టవశాత్తు చెక్కు చెదరకుండా ఉండటంతో ఆ విషయాన్ని టోస్కానో సదరు మహిళకు తెలియజేశారు. పాపం ఆ మహిళ ఒక్కసారిగా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఆమెకు అదృష్టం తిరిగి వరించినా..ఒక షరతు వర్తిస్తుందామెకు. ఎందుకంటే..SANB ఒక ప్రభుత్వ సంస్థ కావడంతో, ఆ అన్వేషణ ప్రక్రియకు అయిన అదనపు ఖర్చులన్నింటినీ భరించేందుకు ఆ మహిళ ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ టికెట్ ఎంత సొమ్ము గెలుపొందిదంటే..అక్షరాల రూ. 11 కోట్లు. ఏదీఏమైతేనేం కాలదన్నుకున్నది కోట్లు తెచ్చిపెట్టింది..తిరిగి చెంతకు చేరింది. రాసి పెట్టుంటే..అది మన చెంతకు ఏదో విధంగా వచ్చి తీరుతుంది అంటే ఇదే కదూ..!(చదవండి: షాపింగ్ కోసం ఏకంగా హెలికాప్టర్..!విస్తుపోయిన అధికారులు) -
ఒంటరిగా ఉన్నా యువతితో డెలివరీ బాయ్ వికృత చేష్టలు!
యశవంతపుర: బెంగళూరులో మద్యం మత్తులో డెలివరీ బాయ్ యువతి ఇంట్లో రచ్చ చేశాడు. బాధిత యువతి అనేరి ఠక్కర్ ఇన్స్టాలో వివరించింది. ఆమె ఒక్కరే ఉండగా డెలివరీ బాయ్ వచ్చాడు. ఆమెతో అతి ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాడు, మొబైల్లో చార్జింగ్ పెట్టుకుంటానని, ఇక్కడే ఉండి సిగరెట్ తాగుతానని ఆమెను ఒత్తిడి చేశాడు. ఇంట్లోకి చొరబడడానికి యత్రించాడని యువతి వాపోయింది. చివరకు ఎలాగో అతన్ని వెనక్కి పంపించినట్లు, అతడు పనిచేసే కంపెనీకి ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తామని చెప్పారని పేర్కొంది. View this post on Instagram A post shared by Aneri Thakkar | Growth Mindset | People skills | Relationships (@anerithakkar_) -
కన్నప్రేమకు కన్నీటి పరీక్ష.. విషాదకర ఘటన!
ఒక తండ్రి... కన్న బిడ్డలను అల్లారుముద్దుగా పెంచాడు. తన రెక్కలు ముక్కలు చేసుకుని జీవితాంతం కష్టపడి సంపాదించాడు. వారిని గొప్పగా చదివించి, ఉన్నత స్థానాల్లో నిలబెట్టాడు. కానీ చివరికి తన జీవిత ప్రయాణం ముగిసే సమయానికి ఆయన పక్కన నిలిచింది మాత్రం ఆ కుటుంబం కాదు... ఓ వృద్ధాశ్రమం.హరియాణాలోని సోనిపట్కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త చివరి రోజులు ఒంటరితనంతో గడిపారు. జీవితమంతా కుటుంబం కోసం శ్రమించిన ఆయన, చివరికి వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే? ఆయన అంత్యక్రియలకు సొంత కుమార్తెలు కూడా రాలేదు.వీడియో కాల్ పెట్టండి...కన్నతండ్రి మరణించారని తెలుసుకున్న కుమార్తెలు కడసారి చూపుకైనా రాలేకపోయారు. తండ్రి చివరి ప్రయాణాన్ని వీడీయో కాల్రూపంలో మొబైల్ స్క్రీన్లో చూసేశారు. అలోచిస్తేనే బాధతో గుండెభారంగా మారుతున్న ఈ ఘటనలో.. చివరికి వారు తండ్రి అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5,100 పంపించి తమ బాధ్యత ముగిసిందని భావించినట్లుగా ఈ వీడియోలో వారి సన్నివేశం కనిపిస్తోంది. అయితే, ఈ సంఘటన ప్రస్తుతం ఒక ప్రశ్నగా మారి సమాజం ముందు నిలబెడుతోంది.బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?!రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే… pic.twitter.com/CCMMyqFMhl— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 5, 2026సాంకేతికత మనుషులనే కాకుండా.. పూర్తిగా మనసులను మరింత దూరం చేసింది. ఎన్ని కోట్లు సంపాదించినా... ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా... తల్లిదండ్రుల చివరి క్షణాల్లో వారి పక్కన నిలబడలేకపోతే ఆ విజయం విలువ ఏమిటి? జీవితాంతం మన కోసం కష్టపడిన వాళ్లకు చివరి వీడ్కోలు కూడా ఇవ్వలేకపోతే అది అభివృద్ధా? లేక అనుబంధాల ఓటమా? అనే ఆలోచనలు ఇలాంటి ఘటనలు పదే పదే గుర్తు చేస్తున్నాయి.వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి... వీడియో కాల్స్, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు పెరుగుతున్నాయి... కానీ ఆప్యాయత, మమకారం, బాధ్యత కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయా అనే ప్రశ్న కూడా వెంటాడుతోంది. తల్లిదండ్రులు కోరుకునేది కోట్ల ఆస్తులు కాదు... వద్దాప్య చివరి రోజుల్లో నాలుగు ఓదార్పు మాటలు, పక్కన నిలిచే సొంత మనుషులు మాత్రమే. ఒకప్పుడు పిల్లల కోసం తమ జీవితాన్నే అంకితం చేసిన తల్లిదండ్రులు... నేడు వృద్ధాశ్రమాల్లో ఒంటరిగా కన్నుమూయాల్సి వస్తే, అది ఒక్క కుటుంబం వైఫల్యం మాత్రమే కాదు... సమాజమంతా ఆలోచించాల్సిన అంశం కూడా. -
ఏంది సామీ ఈ రచ్చ!.. బీజేపీ ఎంపీ 'క్రేజ్' ఖండాంతరాలు దాటింది!
లక్నో: అబ్బే ఇవ్వేం అయ్యే పనుల్లా కనిపించట్లేదే. పైగా.. ఫిజికల్గాను,మెంటల్గాను స్ట్రెయినూ,ఎవర్రా మీరంతా, నువ్వురా ఫ్రెండ్ అనే మీమ్ సోషల్ మీడియాలో కామన్ . కానీ ఇప్పుడు హెడ్క్వార్టర్స్ అనే సరికొత్త మీమ్ ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. మార్కెట్లోకి సరికొత్త ‘మీమ్ గాడ్' వచ్చేశారు! "నేను ఆడా ఉంటా.. ఈడా ఉంటా" అన్న రేంజ్లో సోషల్ మీడియా ప్రపంచాన్ని ఒంటిచేత్తో ఊపేస్తున్నారు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు.. సినిమా స్క్రీన్ నుంచి ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ గ్రౌండ్ వరకు.. ఎటు చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్సే వినబడుతున్నాయి.ఇంతకీ నెటిజన్లను ఇంతలా పిచ్చెక్కిస్తున్న ఆ 'యాక్సిడెంటల్ మీమ్ గాడ్' ఎవరో కాదు.. ప్రముఖ సినీ నటుడు, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ రవి కిషన్. ఈ వైరల్ క్రేజ్పై ఆయన స్పందిస్తూ.. అయ్యో.. ఆ మహాదేవుడి మీద ఒట్టు, నేనెందుకు ఇంతలా వైరల్ అవుతానో నాకే తెలియదు’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.‘ది అలయన్స్’షో.. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ సునామీ!అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల వచ్చిన ది అలయన్స్ రియాలిటీ షోతోనే ఈ మీమ్స్ కథ మొదలైంది. రవి కిషన్ తన కుమార్తె రివా కిషన్తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. అయితే, తన నియోజకవర్గంలో పనుల కారణంగా ఆయన ఈ షో నుంచి మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది.ఆ సమయంలో ఆయన సెలవు తీసుకుంటూ.. తనకు దేశ సేవ కోసం హెడ్క్వార్టర్స్ నుంచి పిలుపు వచ్చిందని, వెంటనే వెళ్లాలని చెప్పిన స్టైల్ మీమర్ల చేతికి చిక్కింది. దీనికి తోడు, అదే షోలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనబోయి పొరపాటున హోమ్ ఫ్రమ్ వర్క్ అని ఆయన అనడం ఇన్స్టాగ్రామ్ను ఊపేసింది. ఈ రెండు క్లిప్పింగులు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్తో ట్రెండ్ అయ్యాయి.సరిహద్దులు దాటిన క్రేజ్.. రవి కిషన్ డైలాగ్స్కు ఫుట్బాల్ స్టార్స్ స్టెప్పులు!రవి కిషన్కు లభించిన ఈ మీమ్ పాపులారిటీ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు.గ్లోబల్ లెవెల్కు రీచ్ అయింది. ఇన్స్టాగ్రామ్లో ఈ ఆడియో ఎంతలా వైరల్ అయిందంటే.. యూరప్లోని ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్బులు సైతం ఈ ట్రెండ్లోకి చేరాయి!.ఇటలీకి చెందిన ఐకానిక్ క్లబ్ జువెంటస్ జర్మనీకి చెందిన ప్రసిద్ధ క్లబ్ బోరుస్సియా డార్ట్మండ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో రవి కిషన్ డైలాగ్స్ను ఉపయోగించుకున్నాయి.Lord Ravi Kishan supremacy 🗿😎😭❤️JUVENTUS really posted Ravi Kishan 😭🖤🤍One of the biggest and most successful football clubs in Italy and Europe. Lord Ravi Kishan supremacy. pic.twitter.com/dzYplDzGvp— 𝙅𝙍𝙅49 (@jrj_49) August 4, 2026ఈ క్లబ్బులు తమ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్స్ ప్రాక్టీస్ వీడియోలు, గోల్స్ కొట్టిన విజువల్స్కు రవి కిషన్ హెడ్క్వార్టర్స్,హోమ్ ఫ్రమ్ వర్క్ ఆడియోలను బ్యాక్గ్రౌండ్లో ఎడిట్ చేసి పోస్ట్ చేశాయి. జువెంటస్ క్లబ్ ఒక అడుగు ముందుకేసి, రవి కిషన్కు సంబంధించిన మోస్ట్ పాపులర్ వైరల్ క్లిప్స్ అన్నింటినీ కలిపి ఒక క్రేజీ కంపైలేషన్ వీడియోను విడుదల చేసింది. ఒకే ఒక్క మీమ్ దేశీయ సెలబ్రిటీని గ్లోబల్ ఐకాన్గా ఎలా మార్చగలవో చెప్పడానికి ఈ హెడ్క్వార్టర్స్ ట్రెండే ఒక సూపర్ ఎగ్జాంపుల్! -
'సినిమాల్లో ఛాన్స్.. దయచేసి అమ్మాయిలు రావొద్దు'
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సినీ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నామని చాలామంది నటీమణులు బయటికి చెబుతుంటారు. ఏదో ఒక సందర్భంలో తాము కూడా క్యౌస్టింగ్ కౌచ్కు గురైనట్లు పలువురు స్టార్స్ సైతం ఈ విషయంపై గతంలో మాట్లాడారు. అలా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవాళ్లకు సైతం ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి.తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయరన్సర్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సీరియల్స్, ఫోక్ సాంగ్స్లో అవకాశాల కోసం తాను హైదరాబాద్కు వచ్చానని తెలిపింది. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నాయని.. కానీ కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్ ఇస్తారని ఓపెన్గా చెప్పేసింది. మహిళలు సినీరంగంలో వచ్చారంటే కమిట్మెంట్ లేకుండా జరగదని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఛాన్స్ కోసం మూడోసారి హైదరాబాద్కు వచ్చానని.. మళ్లీ అదే రిపీట్ అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా మన ఇన్ స్టా రీల్స్ కానీ.. యూట్యూబ్ ఛానల్ కానీ చూసి సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటే అస్సలు నమ్మొద్దని మహిళలకు విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ఇన్ఫ్ల్యూయన్సర్ వీడియోలో మాట్లాడుతూ.. 'మన ఇన్స్టా వీడియోస్ చూసి సీరియల్స్, సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్లో ఆఫర్ ఇస్తామంటే నమ్మి హైదరాబాద్కు రావొద్దు. ఎందుకంటే ఇక్కడ కమిట్మెంట్ తప్పనిసరి. అది లేనిదే అమ్మాయికీ అవకాశం ఇవ్వరనేది తెలిసిపోయింది. ఒక్కసారి కాదు.. నాకు అలా మూడుసార్లు జరిగింది. నాకు ఫోక్ సాంగ్లో ఛాన్స్ ఇస్తానని పిలిచాడు. తీరా వచ్చాక గంటల కొద్దీ కూర్చోబెట్టి ఆఖరికి మగ బుద్ధి చూపించాడు. దయచేసి గుడ్డిగా నమ్మి ఎవరూ హైదరాబాద్కు రావొద్దు. ఒక అమ్మాయి సినీ ఫీల్డ్లో సెటిల్ అయ్యిందంటే దాని వెనుక కమిట్మెంట్ ఇచ్చే ఉంటుంది. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేసినా ఫర్వాలేదు. నా లైఫ్లో సినీ ఫీల్డ్ జోలికి వెళ్లను. నా ఊర్లోనే ఉంటూ రీల్స్ చేసుకుంటూ బిజినెస్ చూసుకోవాలని డిసైడ్ అయ్యా.' అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరలక్ష్మి అనే ఇన్ స్టా పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.పడుకుంటే కానీ పని జరగదు !అమ్మాయిలు ఈ సినిమా ఇండస్ట్రీలో కి రావద్దు. #Tollywood pic.twitter.com/STHKFkdoOW— TVR Media 🚩🚩🚩 (@Tvr_Media7) August 4, 2026 -
ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ సందేశం
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్, లడఖ్ల ప్రయాణంలో ఆర్టికల్ 370 రద్దు ఒక ‘నిర్ణాయక నూతన అధ్యాయం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఆయన ఈ చారిత్రక నిర్ణయాన్ని గుర్తు చేసుకున్నారు. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ము కశ్మీర్ను జాతీయ ప్రధాన స్రవంతిలో పూర్తిగా విలీనం చేసింది. ఈ ప్రత్యేక హోదా రద్దు ద్వారా దశాబ్దాలుగా ప్రాథమిక రాజ్యాంగ హక్కులకు దూరంగా ఉన్న మహిళలు, అట్టడుగు వర్గాలకు సాధికారత లభించిందని ప్రధాని పేర్కొన్నారు. Seven years ago, on this day, Articles 370 and 35(A) became history, marking a decisive new chapter in the journey of Jammu and Kashmir as well as Ladakh.Since then, the lives of the people of J&K and Ladakh have witnessed wide-ranging transformation. Infrastructure has…— Narendra Modi (@narendramodi) August 5, 2026‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, ఏడేళ్ల కిందట ఇదే రోజున ఆర్టికల్ 370, 35(ఏ) చరిత్రలో కలిసిపోయాయని, నాటి నుంచి జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు వచ్చాయని అన్నారు. మౌలిక వసతులు విస్తరించడంతోపాటు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో, క్రీడల్లో నూతన అవకాశాలు మెరుగయ్యాయని చెప్పారు. నేడు దేశం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో ఈ ఆగస్టు 5వ తేదీకి మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.ఇది కూడా చదవండి: ఎంబీబీఎస్ గైనకాలజీ పేపర్ లీక్? -
దుబాయ్లో భారీ పేలుళ్లు: జెబెల్ అలీని కమ్మేసిన దట్టమైన పొగ!
జెబెల్ అలీ: దుబాయ్లోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జెబెల్ అలీలో బుధవారం ఉదయం భారీ పేలుళ్లు సంభవించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ ప్రాంతం నుండి దట్టమైన పొగ ఎగిసిపడుతున్న దృశ్యాలు ఆన్లైన్లో వైరల్గా మారాయి.స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:40 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో ఒక భవనంలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దుబాయ్ నగర కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం నుంచి, సమీపంలోని అల్ ఫుర్జాన్ నివాస ప్రాంతం నుంచి కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియోల్లో నివాస ప్రాంతాలు, తాటి చెట్ల మధ్య నల్లటి పొగ కమ్ముకోవడం కనిపిస్తోంది. Iran / USA / EmirateIn den Emiraten/Dubai ist das Hafengebiet, Jabal Ali in die Luft geflogen.🧐Es kam innerhalb von 20 Minuten zu etwa 9 schweren Explosionen!Vor der Küste ist außerdem ein Gasfeld explodiert und in der Straße von Hormuz brennt ein Tanker. pic.twitter.com/mjnXfuzDxF— Hai Stein (@Stein3Hai) August 5, 2026ఈ పొగ పారిశ్రామిక ప్రమాదం వల్ల వచ్చిందా లేక మరేదైనా కారణమా అనే దానిపై యూఏఈ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో జెబెల్ అలీని లక్ష్యంగా చేసుకున్నట్లు కొందరు సోషల్ మీడియా ఖాతాల్లో ఆరోపించినప్పటికీ, దీనికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. గతంలో కూడా ఇటువంటి వదంతులు వచ్చినప్పుడు దుబాయ్ మీడియా కార్యాలయం వెంటనే స్పందించి ఖండించింది. ప్రస్తుతం తాజా ఘటనపై అధికారుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.ఇది కూడా చదవండి: ‘జపాన్ అంతు చూస్తాం’.. కిమ్ సోదరి హెచ్చరిక! -
రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు
ఒక నాయకుడి అసలైన బలం.. జనం. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ పర్యటనకు వెళ్లినా ప్రజా స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంటుంది. జగన్ పర్యటనలను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ముందుంచి ఆంక్షలు విధిస్తోంది. అయితే, ప్రతిసారీ ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆ ప్రయత్నాలకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పర్యటన మరోసారి ఇదే చర్చకు వేదికైంది. గత రెండేళ్లుగా.. కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారంటూ వారి సమస్యలను తెలుసుకునేందుకు జగన్ దేవరపల్లి పర్యటన చేపట్టారు. రైతులను పరామర్శించడంతో పాటు పొగాకు యార్డ్ను పరిశీలించారు. అయితే ఈ పర్యటనకు పోలీసులు పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. జనసందోహం మాత్రం తగ్గలేదు.బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు, నియంత్రణ చర్యలు ఉన్నప్పటికీ జగన్ను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రోడ్ల వెంట, పర్యటన మార్గాల్లో జనం బారులు తీరడం కనిపించింది. ఈ క్రమంలో.. ఓ మహిళ ప్రదర్శించిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. “ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు” అంటూ జగన్ చిత్రాన్ని చూపించడం సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీసింది. చుట్టుపక్కల మహిళలు, కార్యకర్తలు ఆ ఫొటోను పైకి ఎత్తి పట్టుకోగా.. పలువరు ఆ ఫొటోతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అదే సమయంలో.. రాసిపెట్టుకోండి 2029లో జగనే సీఎం, వైఎస్ జగన్ మా దేవుడు అంటూ కొందరు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. తమ నాయకుడిపై ఉన్న ఆదరణకు ఇదే నిదర్శనమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.జగన్ పర్యటనలపై ప్రభుత్వం గత రెండేళ్లుగా ఆంక్షలు విధిస్తోంది. కేసులు పెడతామని నేతలను, ఆ వైపు వెళ్లనీయకుండా సాధారణ ప్రజలను ఇబ్బండి పెడుతోంది. అదేసమయంలో సరైన భద్రత కల్పించకుండా.. డ్రామాలు ఆడుతోంది. అయితే బారికేడ్లు, ఫెన్సింగ్లు ఏర్పాటు చేసినా ప్రజల అభిమానం మాత్రం తగ్గడం లేదు. రాజకీయంగా చూస్తే.. ప్రతి పర్యటనలోనూ కనిపిస్తున్న జన స్పందన వైఎస్సార్సీపీకి బలాన్ని చేకూరుస్తోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నాయకుడిపై అభిమానం ఉంటే జనాలు స్వచ్ఛందంగా తరలివస్తారనే వాదనకు జగన్ పర్యటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. -
మెటా గ్లోబల్ టీమ్కు ప్రభుత్వం సమన్లు
న్యూఢిల్లీ: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్మీడియా సంస్థల మాతృసంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం తాఖీదులు జారీ చేసింది. చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ నిర్వహణలో లోపాలు ఒకానొక ప్రముఖ ఖాతాపై తప్పుడు చర్య వంటి అంశాలపై వివరణ ఇచ్చేందుకు మెటా గ్లోబల్ టీమ్తో నేడు, రేపు సమావేశం కానున్నట్లు కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ మంగళవారం తెలిపారు. ఏఐ4భారత్ సిద్ధం చేసిన స్వతంత్ర ఏఐ మోడళ్ల పరీక్ష ప్లాట్ఫామ్ ఆవిష్కరణ సందర్భంగా ఐఐటీ మద్రాస్లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో కృష్ణన్ విలేకరులతో మాట్లాడారు.సాంకేతికత విషయంలో అగ్రగామిగా ఉన్న మెటా ఇలాంటి తప్పులు జరక్కుండా చూసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ చట్టాల గురించి మెటా లాంటి ప్లాట్ఫామ్స్కు సరైన అవగాహన ఉండాలని, వాటి అమలు తీరు ఎలా ఉండాలో కూడా తెలిసి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టు ఐదు, ఆరు తేదీల్లో మెటా గ్లోబల్ టీమ్, ఉన్నతాధికారి జోయెల్ కప్లాన్ భారత్లోనే ఉంటారని అంచనా. మెటా గ్లోబల్ టీమ్తో సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ జెన్–జీని ఉద్దేశిస్తూ చేసిన ఒక రీల్ ఫేస్బుక్లో కొద్దిసేపు బ్లాక్ అయ్యింది. కొంత సమయం తరువాత రీల్ పోస్ట్ అయినప్పటికీ కేంద్రం మెటా సంస్థ ఉన్నతాధికారులను ప్రధాని కార్యాలయానికి పిలిపించి వివరణ కోరింది. సాంకేతిక పరమైన సమస్యతోనే ఈ పొరబాటు దొర్లినట్టు వివరణ ఇచ్చిన మెటా అందుకు క్షమాపణలు కోరింది. అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ వివరణతో సంతృప్తి చెందలేదు. ఇన్స్టా గ్రామ్ ప్రకటనల్లో కొన్నింటిలో పిల్లల లైంగిక శోషణ, పోర్నోగ్రఫీ కనిపిస్తోందన్న ఆరోపణలు మెటాపై ఉన్నాయి. ఈ అంశంపై మెటా ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం మెటాకు ఇప్పటికే నోటీసు జారీ చేసిందని, ఏ చర్యలు తీసుకున్నారో తెలుసుకునేందుకు ఆగస్టు ఐదునాటి సమావేశం ఉపయోగపడుతుందని కృష్ణన్ చెబుతున్నారు.దీంతోపాటు ఇతర అంశాలు చర్చకు వస్తాయని చెప్పారు. కృత్రిమంగా తయారైన సమాచారం విషయంపైనా చర్చ జరుగుతుందన్నారు. వీటితోపాటే ధ్రువీకరించిన ఖాతాల నుంచి కంటెంట్ను ఏకపక్షంగా తొలగించడం వంటి అంశాలపై కూడా మెటా అధికారులతో మాట్లాడతామని కృష్ణన్ మీడియాతో చెప్పారు. మెటాలో కొన్ని అంశాలు అవి పనిచేయాల్సిన విధంగా ఎందుకు చేయడం లేదో వారితోనే మాట్లాడి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవాలని తాము భావిస్తున్నట్లు కృష్ణన్ వెల్లడించారు. -
ఇదీ మన మధ్యతరగతి పిల్లల పరిస్థితి
చదువు కోసం చాలామంది చిన్నారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఓ ప్రాంతంలో కొందరు ఎన్నో కిలోమీటర్లు నడుస్తారు. మరో ప్రాంతంలో ఇంకొందరు కొండలు, అడవులు దాటి పాఠశాలకు చేరుకుంటారు. మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో పాఠశాల విద్యార్థులు అంతకంటే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ బడికి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ పాఠశాల చిన్నారులు ప్రతిరోజు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బేత్వా నదిని కాలినడకన దాటి పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలువురు చిన్నారులు నది మధ్యలో ఉన్న ఇరుకైన స్టాప్ డ్యామ్పై సమతుల్యం పాటిస్తూ నడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉద్ధృ తంగా ప్రవహిస్తున్న నీరు, మరోవైపు పాఠశాలకు చేరాల్సిన అవసరం. చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ప్రమాదాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు?జిల్లా పాలనాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వీడియో విదిశా జిల్లాలోని పాలోహ్ గ్రామానికి చెందింది. వీడియోలో కనిపిస్తున్న చిన్నారులు కరువా గ్రామ నివాసులు. వారు పాలోహ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వీరు రహదారి మార్గంలో పాఠశాలకు వెళ్లాలంటే ప్రతిరోజూ అదనంగా 8 నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణించాలి. అందుకే స్టాప్ డ్యామ్ దాటి పాఠశాలకు చేరుకుంటున్నారు.గత 4-5 ఏళ్లుగా ఇదే దారితాము గత 4- 5 ఏళ్లుగా ఇదే దారిలో పాఠశాలకు వెళ్తున్నామని చిన్నారులు చెప్పారు. ఇదే అతి దగ్గర దారి అని, మరో మార్గంలో వెళ్తే చాలా దూరం ఉండటంతో ప్రతిరోజు ఆ దారిలో వెళ్లడం కష్టమని వివరించారు. వీడియో వైరల్ అయిన తర్వాత పాలనాధికారులు స్పందించారు. విదిశా ఉప విభాగ పాలనాధికారి క్షితిజ్ శర్మ మాట్లాడుతూ.. చిన్నారులు సురక్షిత మార్గంలో పాఠశాలకు వెళ్లి రావడానికి సైకిళ్లు ఇస్తామని చెప్పారు. నదిపై తాత్కాలిక వంతెన నిర్మాణానికి ప్రతిపాదన పంపినట్టు చెప్పుకొచ్చారు. ప్రభావిత గ్రామాల దగ్గర కొత్త పాఠశాల ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, చిన్నారులు ప్రాణాలకు ముప్పు తెచ్చుకుని నది దాటాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షంవీడియో బయటకు వచ్చిన తర్వాత పాలనాధికారులు, విద్యాశాఖపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తారు. చిన్నారులు ఇన్నేళ్లుగా ఇలాగే పాఠశాలకు వెళ్తుంటే ముందే చర్యలు ఎందుకు తీసుకోలేదని పలువురు ప్రశ్నించారు. వీడియో వైరల్ అయ్యేవరకు పాలనాధికారులు ఎందుకు వేచి చూశారని, ఇంతకు ముందే ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ బస్సులో మహిళ తీసిన వీడియో.. క్షణాల్లో వైరల్!
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ(TSRTC)బస్సులో ఓ మహిళ చిత్రీకరించిన చిన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.ఆ మహిళ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సీట్ల పైన ఉన్న ఒక సూచన బోర్డును గమనించారు. దానిపై ‘పురుషులను గౌరవించటం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం‘ అని స్పష్టంగా రాసి ఉంది. సాధారణంగా బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్ల గురించి లేదా మహిళల భద్రతకు సంబంధించిన బోర్డులను ఎక్కువగా చూస్తుంటాం. కానీ, పురుషుల సీట్ల కేటాయింపు మరియు వారికి ఇవ్వాల్సిన గౌరవం గురించి ఆర్టీసీ బస్సులో ఇలాంటి సందేశం కనిపించడంతో ఆమె దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం.. నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయిఓ మహిళ TGSRTC బస్సులో ఉన్న ఓ సందేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు."పురుషులను గౌరవించటం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం."ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.#Men… pic.twitter.com/rKP8nAiYK1— Orugallu Adda (@OrugalluAdda) August 3, 2026 ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ‘ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి పథకం) అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకడం గగనంగా మారింది. సాధారణ సీట్లలో కూడా మహిళలు కూర్చోవడం వల్ల పురుషులు నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది. పురుషుల హక్కులను, వారి శ్రమను గుర్తించి ఆర్టీసీ ఇలాంటి బోర్డులు పెట్టడం అభినందనీయం‘ అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.ప్రయాణంలో స్త్రీ, పురుషులనే తేడా లేకుండా పెద్దవారు, గర్భిణులు, చిన్న పిల్లలతో ఉన్నవారికి సీటు ఇవ్వడమే అసలైన సంప్రదాయమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీట్ల కేటాయింపు కంటే పరస్పర అవగాహన, గౌరవం ముఖ్యమని పేర్కొంటున్నారు.మొత్తానికి ఆర్టీసీ బస్సులోని ఆ ఒక్క సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో ’పురుషుల సీట్ల కేటాయింపు ప్రయాణికుల బాధ్యత’పై పెద్ద చర్చకే తెరలేపింది. -
కింద రొమాన్స్.. పైన హారర్!
పెళ్లి అనేది జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. ఆ క్షణాలను మరింత అందంగా మలుచుకునేందుకు ఇప్పుడు చాలా మంది జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకమైన లొకేషన్లు, అద్భుతమైన విజువల్స్ కోసం కొందరు వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తూ.. దేశాలు దాటి మరీ ఫొటోషూట్లు చేయించుకుంటున్నారు. ప్రేమను, అనుబంధాన్ని అందమైన ఫ్రేమ్లలో బంధించేందుకు చేసే ఈ ప్రయత్నాలు ఒక్కోసారి ఊహించని మలుపులు తీసుకుంటాయి. అలాంటి ఓ ప్రీ వెడ్డింగ్ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందమైన ప్రేమ దృశ్యంగా ఉండాల్సిన ఆ చిత్రం.. చూసిన వారిని కాసేపు భయపెట్టించింది. ఫొటోలో కనిపించిన ఓ వింత దృశ్యం.. “అక్కడ ఎవరైనా వేలాడుతున్నారా?” అనే అనుమానాన్ని రేకెత్తించింది. అయితే అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఇదంతా కెమెరా యాంగిల్ చేసిన మాయ అని తేలింది. అసలు ఆ ఫొటోలో ఏం కనిపించింది? నెటిజన్లు ఎందుకు షాక్ అయ్యారు?బాలికి చెందిన ఫొటోగ్రఫీ సంస్థ లెమురియాంట్స్(Lemuriarts).. టెడ్డీ, స్టెఫానీ అనే జంట ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా తీసిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందమైన ప్రదేశంలో ఆ జంట నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఫొటో మొదటి చూపులో చాలా సాధారణంగానే కనిపించింది. కానీ ఫొటో పైభాగాన్ని గమనించిన కొందరు నెటిజన్లకు మాత్రం ఓ వింత విషయం కనిపించింది. ఆకాశంలో గాల్లో వేలాడుతున్నట్లుగా కనిపించిన రెండు కాళ్లు అందరి దృష్టిని ఆకర్షించాయి.“ఎవరైనా వేలాడుతున్నారా?”ఫొటో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. “అక్కడ ఎవరో వేలాడుతున్నట్లు కనిపిస్తోంది” అంటూ కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు “మొదటిసారి చూసినప్పుడు భయమేసింది” అంటూ తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ ఫొటో ఎక్స్ (X)లోనూ వైరల్గా మారింది. లక్షలాది మంది వీక్షించడంతో.. ఆ వింత దృశ్యంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.రొమాన్స్ కింద.. హారర్ పైన!ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. “ఒకే ఫొటోగ్రాఫర్.. కింద రొమాన్స్, పైన హారర్” అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేశారు. మరికొందరు “ఇది క్రైమ్ సీన్ ఫొటోలా కనిపిస్తోంది” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అసలు నిజం ఏంటంటే..అయితే ఫొటోను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అసలు విషయం బయటపడింది. అవి ఎవరో వేలాడుతున్న కాళ్లు కాదని, కెమెరా యాంగిల్ వల్ల అలా కనిపించాయని నెటిజన్లు గుర్తించారు. కొంతమంది ప్రకారం.. ముందుభాగంలో నిచ్చెనపై నిలబడి ఉన్న వ్యక్తి కాళ్లు, ఫొటో తీసిన కోణం కారణంగా గాల్లో వేలాడుతున్నట్లుగా కనిపించాయి. జంటపై ఫోకస్ చేయడం, బ్యాక్గ్రౌండ్ దూరం కారణంగా ఈ వింత భ్రమ ఏర్పడింది.కెమెరా యాంగిల్ చేసిన మాయనిజానికి ఈ ఫొటోలో ఎలాంటి భయానక ఘటన లేదని స్పష్టమైంది. కేవలం సరైన కోణంలో పడిన చిత్రం.. వేలాది మందిని క్షణం పాటు అయోమయానికి గురిచేసింది. ప్రేమ జంట జ్ఞాపకంగా తీసిన ఓ ప్రీ వెడ్డింగ్ ఫొటో.. చివరకు సోషల్ మీడియాలో “మిస్టరీ ఫొటో”గా మారడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
మీ వాట్సాప్ పని చేస్తోందా?
మీ వాట్సాప్ పని చేస్తోందా?. మెసేజ్లు వెళ్లకపోయినా.. అందుకోకపోయినా కంగారుపడకండి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో పలువురు యూజర్లు అనూహ్య సమస్యను ఎదుర్కొన్నారు. భారత్తో పాటు పలు ప్రాంతాల్లోని వాట్సాప్ అకౌంట్లు సోమవారం రాత్రి ఒక్కసారిగా ‘అకౌంట్ ఇన్ రివ్యూ’ అంటూ కనిపించడంతో యూజర్లు ఆందోళనకు గురయ్యారు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ సమస్య మొదలైనట్లు పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే తమ అకౌంట్లు నిలిచిపోయాయని, మెసేజ్లు పంపడం, ఇతర ఫీచర్లు ఉపయోగించడం సాధ్యం కావడం లేదని తెలిపారు. అయితే.. రివ్యూ పూర్తయ్యే వరకు వాట్సాప్లోని ఫీచర్లు అందుబాటులో లేకుండా పోయాయి.వాట్సాప్ స్క్రీన్పై “Account in review” అనే సందేశం కనిపించింది. యూజర్ల అకౌంట్ యాక్టివిటీ, డివైస్ వివరాలను తమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, సాధారణంగా 24 గంటల్లో ఫలితం తెలియజేస్తామని అందులో పేర్కొంది.ఈ పరిణామంపై వాట్సాప్ ప్రతినిధి స్పందిస్తూ.. సేవలను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో భాగంగా కొన్ని అకౌంట్లను నిషేధిస్తామని తెలిపారు. అయితే కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశం ఉందని, అలాంటి సందర్భాల్లో వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి యూజర్లను తిరిగి చాటింగ్కు అనుమతిస్తామని చెప్పారు.కొంతమంది యూజర్లు తమ అకౌంట్లు ఎలాంటి కారణం లేకుండా డిసేబుల్ అయ్యాయని, అప్పీల్ చేసినా సాధారణ మెసేజ్ మాత్రమే వస్తోందని సోషల్ మీడియాలో వాపోయారు. అధికారిక వాట్సాప్ యాప్ మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ తమ అకౌంట్ నిలిపివేయడం అన్యాయమని కొందరు పేర్కొన్నారు.ప్రస్తుతం ప్రభావితమైన అకౌంట్లను వాట్సాప్ పరిశీలిస్తోంది. 24 గంటల్లో సమీక్ష పూర్తయిన తర్వాత అకౌంట్లను తిరిగి యాక్టివేట్ చేసే అవకాశం ఉంది. ఈ సమస్య మీ వాట్సాప్కూ ఎదురైందా? లేదా సాధారణంగా పనిచేస్తోందా అనే విషయాన్ని యూజర్లు చెక్ చేసుకోవచ్చు.అయితే ఈ పరిణామంపై కొంతమంది యూజర్లు తమ వ్యక్తిగత సమాచారం భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇది ప్రైవసీ ఉల్లంఘనకు సంబంధించిన సమస్యగా ఎలాంటి ఆధారాలు లేవు. వాట్సాప్ నిబంధనల ఉల్లంఘన, అనుమానాస్పద యాక్టివిటీ వంటి అంశాల ఆధారంగా అకౌంట్లను ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్ల వ్యక్తిగత చాట్లు లేదా మెసేజ్లను పరిశీలిస్తున్నట్లు ఎలాంటి సమాచారం లేదు. -
UPI వాడకం ఆపేశా.. దెబ్బకు నా దశ తిరిగింది
న్యూఢిల్లీ: డిజిటల్ విప్లవం వచ్చాక రూపాయి చాక్లెట్ కొనాలన్నా.. వేల రూపాయల షాపింగ్ చేయాలన్నా అందరం ‘యూపీఐ’నే వినియోగిస్తున్నాం. అయితే, ఈ డిజిటల్ చెల్లింపుల వల్ల పర్సు ఖాళీ అవ్వడం లేదు కానీ.. బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్టే కరిగిపోతోంది. సరిగ్గా ఇదే సమస్యను గమనించిన ఢిల్లీకి చెందిన ‘సదఫ్’ అనే యువతి ఒక క్రేజీ నిర్ణయం తీసుకుంది.గత మూడు నెలలుగా ఆమె యూపీఐ వాడకాన్ని దాదాపు నిలిపివేసి, పాత పద్ధతిలో కేవలం నగదు మాత్రమే వాడుతోంది. దీంతో దెబ్బకు తన దశ తిరిగినట్లు చెప్పుకొచ్చింది.తన ఆర్థిక జీవితంలో వచ్చిన మార్పులను వివరిస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.చేతితో డబ్బులు ఇస్తుంటే ఆ నొప్పి తెలుస్తోంది!తన అనుభవాన్ని పంచుకుంటూ.. గత ఆరు నెలల్లో తాను సాధించిన అతిపెద్ద విజయం ఇదేనని సదఫ్ పేర్కొంది. యూపీఐ ఉన్నప్పుడు రూ. 50, రూ. 100 చొప్పున ఐదారు సార్లు ఈజీగా స్కాన్ చేసేస్తాం. అది పెద్ద మొత్తంగా అనిపించదు. తీరా చూస్తే రోజు ముగిసేసరికి తెలియకుండానే రూ. 1,000 ఖర్చయిపోతుంది.కానీ, వాలెట్ నుండి రూ.500 నోటు తీసి అవతలి వ్యక్తికి ఇచ్చేటప్పుడు డబ్బు మన చేతిలోంచి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. నా చేతిలో ఎంత ఉంది, ఎంత ఖర్చయింది అనేది స్పష్టంగా కళ్లముందు కనిపిస్తుంది. ఈ ఒక్క మార్పు నా అనవసరపు ఖర్చులను పూర్తిగా అడ్డుకుంది అని ఆమె వివరించింది.అయితే ఈ రోజుల్లో వంద శాతం యూపీఐ లేకుండా బతకడం ప్రాక్టికల్ కాదు కాబట్టి, ఆమె ఒక కొత్త పద్ధతిని పాటిస్తోంది. రోజువారీ అవసరాలన్నింటికీ 80శాతం కేవలం చేతిలోని నగదునే వాడుతుంది. చిల్లర సమస్య ఉన్నప్పుడు, లేదా క్యాష్ తీసుకోవడానికి షాపుల వారు నిరాకరించినప్పుడు మాత్రమే 20శాతం యూపీఐ వాడుతుంది.ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చాలా మంది ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నిజమే.. బ్యాంక్ అకౌంట్ చూస్తే డబ్బులు మాయమవుతున్నాయి కానీ.. పర్సులో పెడితే మాత్రం అలాగే ఉంటున్నాయి’ అని ఒక యూజర్ అంటుంటే మధ్యలో అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయనే వార్తల వల్ల నేను కూడా యూపీఐ తగ్గించాను అని మరొకరు పేర్కొన్నారు.ఇప్పుడు చాలా మంది వ్యాపారులు, మాల్స్ వాళ్లు రూ. 5, రూ. 10 చిల్లర ఇవ్వడం లేదు. చిల్లర దొరకడమే పెద్ద టాస్క్ అయిపోయింది’అని కొందరు నెటిజన్లు పెదవి విరిచారు. సమస్యలు ఎలా ఉన్నా, డిజిటల్ యుగంలో క్రేజీగా ఖర్చు పెట్టే ఈ తరానికి.. ఈ ఢిల్లీ యువతి ఐడియా మాత్రం ఒక మంచి ఆర్థిక పాఠం అని చెప్పక తప్పదు! View this post on Instagram A post shared by Sadaf (@rockstarz.gf) -
‘మోదీనే బెస్ట్’ అంటూ వ్యాఖ్యలు.. సీజేపీ నేత దాస్ ‘పోస్ట్’ కలకలం
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్కు సంబంధించిన 2015 నాటి ఓ పాత సోషల్ మీడియా పోస్ట్ మళ్లీ వైరల్గా మారింది. అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై విమర్శలు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ప్రస్తుతం సీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుండటంతో, సౌరవ్ దాస్ గత వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ ప్రస్తావిస్తున్నారు.2015లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి సౌరవ్ దాస్ చేసిన పోస్టులో, "ఆప్కు ఏమైంది? పూర్తిగా మారిపోయింది. ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. మీరు కూడా కాంగ్రెస్లాగే మారిపోయారు. మోదీజీ చాలా మెరుగైన నాయకుడు... ఆయనే బెస్ట్" అని పేర్కొన్నారు. ఆ పోస్టు స్క్రీన్షాట్లు ప్రస్తుతం పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పాత పోస్టును ఆధారంగా చేసుకుని నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు గతంలో మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండడాన్ని ప్రస్తావిస్తుండగా, మరికొందరు రాజకీయ నాయకుల అభిప్రాయాలు కాలక్రమేణా మారవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.Whats wrong with AAP?completely changed. Double standards. U too are like congress. modiji is far better.. the best one. @ArvindKejriwal— Saurav Das (@SauravDassss) December 19, 2015సౌరవ్ దాస్ ప్రస్తుతం అభిజీత్ దిప్కే స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమాలు, విద్యా సంస్కరణలు తదితర అంశాలపై పార్టీ తరఫున తరచూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇటీవల సీజేపీ కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వంపై పార్టీ వైఖరి చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన పాత సోషల్ మీడియా పోస్టులు కూడా మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అయితే వైరల్ అవుతున్న ఈ పాత పోస్టుపై సౌరవ్ దాస్ గానీ, సీజేపీ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అలాగే, 2015లో చేసిన ఆ వ్యాఖ్యలపై ఆయన ప్రస్తుత వైఖరి ఏమిటన్న విషయంపైనా ఎలాంటి స్పష్టీకరణ వెలువడలేదు. -
దోమలు, నల్లులు.. హైదరాబాద్ ఐఐటీలో చేదు అనుభవం!
భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ హైదరాబాద్లో చేరిన ఓ జపాన్ విద్యార్థిని అనుభవాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. భారత్కు వచ్చిన ఆనందంతో పాటు.. హాస్టల్ వసతిలో ఎదురైన సమస్యలను కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకోవడంతో ఈ అంశం వైరల్గా మారింది.ఐఐటీ హైదరాబాద్లో తాను తొలి జపాన్ విద్యార్థినినని చెప్పుకున్న హిరో(Japan Student Hiro).. భారత్లో తన మొదటి వారం అనుభవాలను వీడియో రూపంలో పంచుకుంది. విమాన ప్రయాణం నుంచి క్యాంపస్ చేరుకునే వరకు జరిగిన విషయాలను వివరించిన ఆమె.. ఐఐటీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ నుంచి లభించిన స్వాగతంపై ప్రశంసలు కురిపించింది. భారత్కు రావడం ఎంతో ఉత్సాహంగా అనిపించిందని చెప్పిన హిరో.. క్యాంపస్లో తనకు మంచి స్వాగతం లభించిందని పేర్కొంది. కొత్త స్నేహాలు, కొత్త వాతావరణం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చాయని తెలిపింది.అయితే ఈ ఆనందంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని ఆమె వెల్లడించింది. హాస్టల్ గదిలో సమస్యలు ఉన్నాయని, మంచంపై చనిపోయిన పురుగులు కనిపించాయని చెప్పింది. అంతేకాకుండా దోమకాట్ల కారణంగా తీవ్ర ఇబ్బంది పడ్డానని, నల్లులతో అలర్జీ రావడంతో భారత్లో తొలిసారి ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని వివరించింది.తన హాస్టల్ గది పరిస్థితులను చూపిస్తూ ఆమె చేసిన వీడియోలో వసతి సమస్యలను ప్రస్తావించింది. అయితే ఐఐటీ హైదరాబాద్ మొత్తం అనుభవాన్ని ప్రతికూలంగా చూపించకుండా.. ఒకవైపు సంస్థ నుంచి లభించిన సహకారాన్ని, మరోవైపు ఎదురైన సవాళ్లను సమతుల్యంగా వివరించింది. హిరో ఈ వీడియోతో పాటు తన అనుభవానికి సంబంధించిన రెండో భాగాన్ని కూడా త్వరలో పంచుకుంటానని తెలిపింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.హిరో వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆమెకు పలు సూచనలు చేశారు. కొత్త దేశంలో చదువుకునేందుకు వచ్చినప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను ఓపికగా ఎదుర్కోవాలని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఐఐటీ హైదరాబాద్ యాజమాన్యం, అంతర్జాతీయ విద్యార్థుల విభాగం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పరువు లాంటి సదుపాయాలు విద్యార్థులే ఏర్పాటు చేసుకుంటారని.. ఆమె కొన్న పరుపు సరైంది ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు.. హాస్టల్ పరిశుభ్రత, వసతి సమస్యలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే త్వరగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అలాగే భారతీయ సంస్కృతి, వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని హిరోకు సూచించారు. అదే సమయంలో ఇంకొందరు నెటిజన్లు మాత్రం విదేశీ విద్యార్థులు ఎదుర్కొనే ఇలాంటి సమస్యలపై విద్యాసంస్థలు మరింత శ్రద్ధ పెట్టాలని అభిప్రాయపడ్డారు.ఐఐటీ హైదరాబాద్ స్వాగతానికి ఫిదా అయిన జపాన్ విద్యార్థిని.. హాస్టల్లో ఎదురైన దోమలు, పురుగుల సమస్యలను బయటపెట్టడంతో ఆమె అనుభవం ఇప్పుడు వైరల్గా మారింది. దీనిపై నిర్వాహకులు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. -
రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్.. ఉదయం లేవగానే భారీ షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఒక మురికివాడలో నివసించే మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు. అయితే, అంతలోనే ఆయన ఖాతాను యూట్యూబ్ తొలగిచింది. దీనిపై యూట్యూబ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అయితే ఇర్ఫాన్ పేజీ ‘మెయిన్ ఇర్ఫాన్’ను తెరవడానికి ప్రయత్నిస్తే.. “గూగుల్ సేవా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ ఖాతాను తొలగించాం” అనే సందేశం కనిపిస్తోంది.ఇర్ఫాన్ కూడా ఎక్స్లో స్పందించారు. ఖాతా తొలగింపు “ఏదో పొరపాటు” వల్ల జరిగి ఉంటుందని చెబుతూ, దానిని సరిచేయాలని యూట్యూబ్ను కోరారు. “నా ఛానల్ పూర్తిగా కొత్తది. యూట్యూబ్ మార్గదర్శకాలను నేను నిజాయితీగా పాటించాను” అని ఇర్ఫాన్ పేర్కొన్నారు. “ప్రజలు నా కంటెంట్ను ఎంతో ఇష్టపడ్డారు. అందుకే సబ్స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. మీ ఆటోమేటిక్ వ్యవస్థ వల్ల పొరపాటు జరిగి ఉండొచ్చు. దయచేసి నా ఛానల్ను మరోసారి పరిశీలించి పునరుద్ధరించండి” అని అన్నారు.ఇర్ఫాన్ ఛానల్కు సీనియర్ జర్నలిస్టు అజిత్ అంజుమ్ బహిరంగంగా మద్దతు తెలిపారు. ఛానల్ యాక్టివ్గా ఉన్న సమయంలో, అది తొలగించిన తర్వాత కూడా ఆయన ఎక్స్లో పలుసార్లు పోస్టులు చేశారు.“ఢిల్లీలోని ఒక మురికివాడలో నివసించే మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు మా సహకారంతో నిన్ననే తన యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు” అని అజిత్ అంజుమ్ ఆదివారం ఎక్స్లో పోస్టు చేశారు. “నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకూ అతని ఛానల్కు 70,000 మందికి పైగా సబ్స్క్రైబర్లు వచ్చారు. ఈ ఉదయం అకస్మాత్తుగా అతని యూట్యూబ్ ఛానల్ను తొలగించారు. ఆ యువకుడు ఇంత తక్కువ సమయంలో ఇంతమంది సభ్యులను ఎలా సంపాదించాడు? అదే ఒక అసాధారణ విజయం. మరి యూట్యూబ్ అతని ఛానల్ను ఇంత హఠాత్తుగా ఎందుకు తొలగించింది?” అని ప్రశ్నించారు.ఇంకా పలువురు సోషల్ మీడియా యూజర్లు కూడా ఇర్ఫాన్ పేజీకి మద్దతుగా పోస్టులు చేశారు. ఆ కంటెంట్, ఛానల్ నిజమైనవేనని, గూగుల్కు చెందిన యూట్యూబ్ ఆటోమేటెడ్ వ్యవస్థల పొరపాటు వల్లే ఖాతా తొలగింపు జరిగిందని పేర్కొన్నారు. ఈ సమస్యను సరిచేయాలని యూట్యూబ్ను కోరారు.A young man named Mohammad Irfan, who lives in a slum in Delhi, started his YouTube channel just yesterday with our support. From yesterday evening until this morning, his channel gained more than 70,000 subscribers.suddenly this morning, his YouTube channel was terminated.How… https://t.co/AoQeeMKEog— Ajit Anjum (@ajitanjum) August 2, 2026 -
హార్దిక్ మాజీ భార్యపై తీవ్ర విమర్శలు!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ ప్రవర్తన పట్ల సోషల్ మీడియాలో అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. బిచ్చగాళ్లతో నటాషా ప్రవర్తించిన తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయంలోకి వెళితే.. నటాషా స్టాంకోవిచ్ తన బాయ్ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్తో కలిసి ఒక హోటల్కు వెళ్లింది. లంచ్ అనంతరం బయటికి వస్తున్న నటాషాతో కొంతమంది ఫొటోలు దిగారు. ఇదే సమయంలో అక్కడికి పిల్లలతో కలిసి బిక్షాటన చేస్తున్న మహిళల వచ్చారు. తమకు సాయం చేయమని నటాషాను అడిగినప్పటికీ, వారిని పట్టించుకోకుండా తన కారు ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోవడం కెమెరాలకు చిక్కింది. ఇంకేముంది, అసలే తమ అభిమాన క్రికెటర్ను మోసం చేసి తెగదెంపులు చేసుకున్న నటాషా ఎక్కడ దొరుకుతుందా అని కాచుకు కూర్చుకున్న కొంతమంది విమర్శల వర్షం కురిపించారు. 'ఇదేం పద్దతి.. ఫొటోలకు ఫోజివ్వడం తెలుసు కాని ఒక రూపాయి ధర్మం చేయాలన్న కనీస జ్ఞానం లేదా' అని కామెంట్ల రూపంలో నటాషాను దెప్పిపొడిచారు. అయితే గతంలో పాండ్యాతో కలిసి ఉన్నప్పుడు ఇదే నటాషా పేద వాళ్లకు సాయం చేయడంలో ముందు వరుసలో ఉండడం గమనార్హం.సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ 2013లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలో ఆ పరిచయం ప్రేమగా మారింది. హార్దిక్, నటాషా ప్రేమలో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉండగానే ఆమె గర్భం దాల్చింది. తండ్రి కాబోతున్నట్లు హార్దిక్ పాండ్యా అధికారికంగా ప్రకటించి, అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత 2020లో హార్దిక్ పాండ్యా, నటాషా వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన నటాషా కుమారుడి పెంపకంపైనే దృష్టి సారించింది.వివాహం తర్వాత కొంత కాలం వీరి జీవితం ఆనందంగా సాగింది. ట్రిప్పులు, అగస్త్యతో ఆటలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. వివాహం అయిన నాలుగేళ్ల తర్వాత (2024)లో పాండ్యా, నటాషా మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో హార్దిక్ పాండ్యా ‘విడాకుల’పై అధికారిక ప్రకటన చేశాడు. భార్య నటాషా స్టాంకోవిచ్తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. 4 ఏళ్ల దాంపత్య జీవితం అనంతరం నటాషా, తాను విడిపోవడానికే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు.విడిపోయినప్పటికీ తమ కుమారుడు అతస్త్యకు కో-పేరెంట్స్గా ఉంటామని స్పష్టత ఇచ్చాడు. हार्दिक पांड्या की पूर्व पत्नी नताशा अब पहले जैसी नहीं रहीं। Natasa अपने बॉयफ्रेंड "Aleksandar Alex Ilic' के साथ एक होटल से बाहर निकली।तभी वहां मौजूद कुछ भिखारियों ने उनसे मदद के लिए पैसे मांगे।लेकिन नताशा बिना रुके सीधे अपनी गाड़ी में बैठकर वहां से निकल गईं।भिखारी बस… pic.twitter.com/RfBOplXnxV— ʀᴜᴅʜʀᴀ ʏᴀᴅᴀᴠ🇮🇳 (@Rudhrayadav001) August 1, 2026Read: 'అసంపూర్ణంగా భారతదేశ చిత్రపఠం.. ఎందుకీ వివక్ష?' -
అసలెప్పుడు విడిపోయారు.. కలిసిపోవడానికి?
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా.. టీమిండియా క్రికెటర్లయిన పాండ్యా బ్రదర్స్కు సెపరేట్ ఫ్యాన్బేస్ ఉంది. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అన్నదమ్ముల్లో తమ్ముడైన హార్దిక్ టీమిండియాలో ఒక వెలుగు వెలుగుతున్నాడు. తమ్ముడంత కాకపోయినా కృనాల్ కూడా ఐపీఎల్ ద్వారా బాగానే గుర్తింపు పొందాడు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. అటు పాండ్యా కూడా ఈ రికార్డులో ముందువరుసలో ఉన్నాడు. మరి ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. తాజాగా హార్దిక్, కృనాల్లు కలిసిపోయారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ముంబై ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ బయటకి వస్తున్న ఫొటోలో సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. అయితే రియాల్టీలో ఇది పాత వీడియో అని, ఇప్పుడు కూడా హర్దిక్, కృనాల్ పాండ్యాలు మాట్లాడుకోవడం లేదని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై కొంతమంది ఫ్యాన్స్ మాత్రం 'అసలెప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలవడానికి’ అని కామెంట్ పెట్టారు.ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో హార్దిక్ ఔటైనప్పుడు కృనాల్ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి తోడు, ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత హార్దిక్ తన సోదరుడిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది.ఈ ఊహాగానాలపై కృనాల్ స్పందిస్తూ, "మేమిద్దరం కలిసే క్రికెట్ ఆడాం. ఆటలోని వ్యూహాలు, టెక్నిక్ గురించి ఎప్పుడూ చర్చించుకుంటాం. మా మధ్య ఆరోగ్యకరమైన చర్చే ఉంటుంది. ఒకే క్రీడలో ఇద్దరు సోదరులు ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తారు. దేవుడి దయవల్ల పాండ్య కుటుంబంలో 10 ఐపీఎల్ ట్రోఫీలు ఉండటం చిన్న విషయం కాదు" అని వివరించాడు. హార్దిక్ 5, తాను 5 ఐపీఎల్ టైటిళ్లు గెలిచామని తెలిపాడు.ఇక టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తొడ కండరాల గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెక్స్ (సీవోఈ)లో రీహాబిలిటేషన్లో ఉన్న పాండ్యా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. 2027 వన్డే వరల్డ్కప్ దృష్టిలో పెట్టుకొని పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.It's hard to understand what changed between Hardik Pandya and Krunal Pandya. There was a time when the Pandya brothers were always seen together. But for the last two years, they haven't been seen together, and they don't talk to each other anymore. pic.twitter.com/Q71CCwo6HU— Sonu (@Cricket_live247) August 1, 2026Read: రేపే భారత్, పాక్ మ్యాచ్.. ఫెవరెట్గా గబ్బర్ సేన! -
కాపాడాల్సిన పోలీసే కాటేశాడు..!
వరంగల్ క్రైం: సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ కటకటలపాలయ్యాడు. ఈమేరకు శుక్రవారం సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్ 2014 బ్యాచ్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్. సోషల్ మీడియా వేదికగా మహిళలతో పరిచయం పెంచుకుంటూ.. వారిని మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. 2025లో ఫేస్ బుక్ ద్వారా శ్రీకాంత్ ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఆమెతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. అతడు జమ్మికుంటలో పనిచేస్తుండగా ఆమె వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని బలవంతంగా లొంగదీసుకున్నాడు. అనంతరం బాధితురాలి వ్యక్తిగత ఫొటోలతో బెదిరించడం, వీడియో కాల్స్ ద్వారా అసభ్యకరంగా వేధించి, డబ్బులు వసూలు చేశాడు. ఇచ్చిన డబ్బులు అడిగితే బెదిరించాడు. ఈమేరకు బాధితురాలు హనుమకొండలోని సుబేదారి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ కొనసాగుతుండగా.. నాలుగు నెలల నుంచి నిందితుడు అరెస్ట్కు భయపడి గోవా, హైదరాబాద్, నిజామాబాద్ పలు ప్రాంతాల్లో తలదాచుకుంటూ తిరిగినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ వెల్లడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చివరికి సిమ్కార్డులు కూడా ధ్వంసం చేసి వై–ఫై ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించాడు. సాంకేతిక «ఆధారాలు, విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా, హనుమకొండ మూడో అదనపు కోర్టు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్కు తరలిస్తున్న ట్లు ఉత్తర్వులు జారీ చేశారని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
గుండెపోటు అనుకుని ఎడాపెడా సీపీఆర్.. ఆసుపత్రిలో బిగ్ ట్విస్ట్!
ఓ ప్రాణాన్ని కాపాడాలన్న ఆత్రం.. ఓ పొరపాటు అంచనా.. చివరకు ఊహించని గాయాలకు దారితీసింది. రోడ్డుపై కుప్పకూలిన ఓ టీచర్ను గుండెపోటు వచ్చిందని భావించిన ఇద్దరు యువకులు ఆమెకు వెంటనే CPR చేశారు. కానీ, ఆసుపత్రికి వెళ్లాక అసలు విషయం బయటపడింది. ఆమెకు గుండెపోటు రాలేదు.. అయితే తప్పుడు విధానంలో చేసిన CPR కారణంగా రెండు పక్కటెముకలు విరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కైలారస్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, తీవ్ర ఎండ వేడిమి కారణంగా టీచర్ లలిత స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా తల తిరిగింది. దీంతో, వాహనంపై నుంచి అదుపుతప్పి కిందపడిపోయారు. క్షణాల్లోనే ఆమె చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడే ఉన్న ఇద్దరు యువకులు పరిస్థితిని చూసి ఆమెకు గుండెపోటు వచ్చిందని భావించారు. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని అనుకుని వెంటనే CPR చేయడం ప్రారంభించారు. ప్రాణాలు కాపాడాలనే ఆందోళనలో పదేపదే ఛాతీపై ఒత్తిడి చేశారు.Madhya Pradesh: A teacher, Lalita, collapsed from her scooter in Kailaras due to extreme heat. Bystanders mistook it for a heart attack and began CPR without checking her condition. Doctors later confirmed she had not suffered a heart attack, and unnecessary CPR allegedly left… pic.twitter.com/4BP0oGpVU8— investmoneymag.com (@InvestMoneyMag) July 31, 2026కానీ, వారికి CPR చేసే సరైన పద్ధతి తెలియకపోవడంతో అదే ఆమెకు మరో సమస్యగా మారింది. కొంత సమయం తర్వాత లలితను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. గుండెపోటు ఆనవాళ్లు కనిపించలేదు. ఎండ వేడి, నీరసం కారణంగానే ఆమె స్పృహ కోల్పోయినట్లు గుర్తించారు. అయితే, వైద్య పరీక్షల్లో మరో విషయం బయటపడింది. CPR సమయంలో అధిక ఒత్తిడి కారణంగా ఆమెకు రెండు పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు గుర్తించారు.ప్రాణం కాపాడాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఆమెకు ఇలా ఊహించని గాయాలకు దారితీసింది. అత్యవసర పరిస్థితుల్లో CPR ఎంతో కీలకమైనప్పటికీ, దాన్ని సరైన పద్ధతిలో చేయడం అంతే ముఖ్యం. శిక్షణ లేకుండా చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ప్రాణాలను కాపాడటానికి బదులుగా కొత్త సమస్యలను సృష్టించే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.हे भगवान..चक्कर आने से गिरी शिक्षिका को हार्ट अटैक समझकर CPR दिया गया, जिससे उनकी दो पसलियां टूट गईं।मध्य प्रदेश के कैलारस में शिक्षिका ललिता गर्मी के कारण स्कूटी से गिर गईं। वहां मौजूद दो युवकों ने उन्हें हार्ट अटैक समझकर लगातार CPR देना शुरू कर दिया।#MPNews #मध्यप्रदेश… pic.twitter.com/ghvAmrxVuh— Om singh (@ompratapsingh0) July 31, 2026 -
మటన్ నల్లీ వివాదంలో నలిగిన పెళ్లి!
‘పెళ్లి బాజాలు మోగాయి.. తలంబ్రాలు పడాల్సిందే.. కానీ, ఇంతలోనే పన్నీర్ ముక్క ప్లేట్లో పడలేదు! మటన్ నల్లీ కనబడలేదు! ఇంకేముంది.. అప్పటి వరకు సందడిగా కనిపించిన వివాహ వేదిక.. ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. ఫైనల్గా పెళ్లి క్యాన్సిల్. ఒక్కటి కావాల్సిన జంట చెరోదారిన వెనుదిరిగింది. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఈ మధ్యకాలంలో ఇలాంటి అనూహ్యమైన విచిత్రాలు, ఊహించని వివాదాలు తరచుగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉన్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు..మటన్ నల్లీ వివాదం.. తెలంగాణలో జరిగిన ఈ సంఘటనలో వధువు తరఫు వారు ఏర్పాటు చేసిన నాన్ వెజ్ మెనూలో మటన్ బోన్ మ్యారో లేకపోవడమే గొడవకు ప్రధాన కారణం. దీనిని తమకు అవమానంగా భావించిన వరుడు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో జీవితాంతం ఒక్కటిగా ఉండాల్సిన బంధం పెళ్లిపీటల దగ్గరే తెగిపోయింది.మటర్ పన్నీర్లో ‘పన్నీర్’ ఏది?సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ సంఘటనలో మటర్ పన్నీర్ కూర ఘర్షణకు దారితీసింది. అతిథులు ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ డిష్లో అసలు పన్నీర్ ముక్కలే కనిపించకపోవడంతో వివాదం మొదలైంది. వధువు, వరుడి తరఫు బంధువుల మధ్య చిన్నగా ప్రారంభమైన మాటల యుద్ధం కాస్తా .. దాడిచేసుకునే వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది.స్నేహితుల మాటతో పెళ్లి క్యాన్సిల్స్నేహితుల సలహాతో వధువు తన వివాహాన్ని రద్దు చేసుకున్న విచిత్ర సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతికి ఆమె కుటుంబ సభ్యులు 30 ఏళ్ల మేనబావతో వివాహం నిశ్చయించారు. అయితే తన స్నేహితులతో చర్చించిన అనంతరం, ఈ సంబంధం సరికాదని భావించిన వధువు పెళ్లిని రద్దు చేసుకుంది.డబ్బులు లెక్కించలేదని!ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో డబ్బులు లెక్కపెట్టలేని వరుడిని చూసి వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. వివాహ తంతు జరుగుతుండగా వరుడి ప్రవర్తనపై పూజారికి అనుమానం వచ్చి వధువు కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. సందేహంతో వరుడికి కొన్ని కరెన్సీ నోట్లు ఇచ్చి లెక్కపెట్టమనగా, అతడు లెక్కపెట్టలేక నిలబడిపోయాడు. దీంతో వరుడి మానసిక స్థితి సరిగ్గా లేదనే నిజాన్ని అతని కుటుంబం దాచిపెట్టిందని గ్రహించి వధువు వివాహాన్ని రద్దు చేసుకుని పెళ్లిపీటల నుంచే వెళ్లిపోయింది.డ్యాన్స్ వద్దనడంతో..పెళ్లి ఊరేగింపులో వధువు డ్యాన్స్ చేయడాన్ని వరుడు నిరాకరించాడని.. పెళ్లిని రద్దు చేశాడు వధువు తండ్రి. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో చిన్న విషయంలో మొదలైన వివాదం పెళ్లి ఆగిపోయేలా చేసింది. పెళ్లి వేడుకలో భాగంగా ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు డ్యాన్స్లు చేస్తుండగా.. వధువరులిద్దరినీ డ్యాన్స్ చేయాల్సిందిగా వారి స్నేహితులు కోరారు. దీనికి వరుడు నిరాకరించడంతో పాటు వధువు డ్యాన్స్ చేయడాన్ని కూడా వరుడు నిరాకరించాడు. దీంతో వధువు తండ్రి పెళ్లిని రద్దు చేశాడు. విందులో వంటకాల పట్ల వచ్చిన చిన్నపాటి అసంతృప్తులు హాస్యంగా అనిపించినప్పటికీ, పెళ్లి సంబంధాల్లో పారదర్శకత లోపించడం, నిజాలు దాచడం వంటి విషయాలు పీటల మీద పెళ్లిళ్లు ఆగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. -
‘ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టండి’
తాడేపల్లి :ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియాను గ్రామస్థాయి నుంచి విస్తృతంగా వాడుకోవాలన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 31వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం సమావేశం నిర్వహించారు సజ్జల. దీనికి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ, నగర అధ్యక్షులు హాజరయ్యారు.దీనిలోభాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ అసభ్య పదజాలం, మార్ఫింగ్ కంటెంట్కు తావివ్వకూడదు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టండి. గ్రామస్థాయి నుంచి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి. అక్రమ కేసులు, వేధింపులన్నీ ‘డిజిటల్ డైరీ’ లో నమోదు చేయాలి. ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వివరణలు ఇచ్చే పరిస్థితి నుంచి అటాకింగ్ మోడ్లోకి రావాలి. సోషల్ మీడియా కార్యకర్తలు ఒక వన్ మ్యాన్ ఆర్మీలా పని చేయాలి. పదునైన కంటెంట్తో నిజాన్ని పదిమందికి చేరవేయాలి. ప్రజల గొంతుకగా, క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రతినిధులుగా పని చేయాలి. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, సిద్ధాంతాలను, లైన్ ఆఫ్ థింకింగ్ను వదులుకోకుండా నిలబడాలి. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగాన్ని తొలిసారిగా ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థగా గ్రామ స్థాయి వరకు బలోపేతం చేశాం. చంద్రబాబుకు ప్రజాబలం లేదు.. కేవలం భ్రమలు కల్పించే మీడియా వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, కుట్రలతో అధికారం చలాయిస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న మనపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను తీవ్ర అప్పుల ఊబిలోకి నెట్టి, అబద్ధాలతో స్వర్గం చూపిస్తున్నది. పాలనలో విఫలమై, ప్రశ్నించే వారిపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల ఆకాంక్షలే శ్రీరామరక్షగా మన పార్టీ ధృఢంగా నిలబడింది.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేయడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. నాయకత్వ నిబద్ధత, కార్యకర్తల కృషితో 2029లోభారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం’ అని స్పష్టం చేశారు. -
మన వాళ్లే సార్! యూత్ని ఆకర్షించడానికి ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు!
మన వాళ్లే సార్! యూత్ని ఆకర్షించడానికి ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు! -
నరసాయమ్మ.. మరో గీతాంజలి కాకూడదు!
రాజకీయాల్లో మాటలు ఒక్కోసారి ఆయుధాలుగా మారుతాయి. ఒకరి వ్యాఖ్యలు మరొకరి ప్రచారానికి అస్త్రాలవుతాయి. కానీ ఆ మాటల వెనుక ఉన్న మనిషి జీవితం, ఎదుర్కొన్న పరిస్థితులు మాత్రం చాలాసార్లు కనిపించవు. భోగాపురం ఎయిర్పోర్టు వ్యవహారంలో ఇప్పుడు చర్చకు వచ్చిన నరసాయమ్మ విషయంలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది.దాదాపు పదేళ్ల క్రితం భోగాపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన.. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం చంద్రబాబు సర్కార్ చేపట్టిన భూసేకరణ, రైతులకు పరిహారం అంశాలను ప్రస్తావిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే..నరసాయమ్మ తన భూమి కోల్పోతున్న ఆవేదనను వేదికపై వ్యక్తం చేసింది. ఎర్రబస్సు రాని చోటుకి ఎయిర్బస్ ఎందుకు? సర్.. అంటూ మాట్లాడింది( ఈ వ్యాఖ్యలనే జగన్ ప్రస్తావిస్తే.. జగనే ఆ మాట అన్నారని టీడీపీ మీడియా, సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది). ఆనాడు అయ్యన్నపాత్రుడి భూముల జోలికి పోకుండా.. ప్రభుత్వం తన కుటుంబానికి ఉన్న రెండెకరాల భూమి బాబు సర్కార్ లాక్కుంటుందనే విషయం ప్రస్తావించి.. న్యాయం కావాలని జగన్ సమక్షంలో వేడుకుంది.అయితే భోగాపురం ఘనత ఎవరిది? అనే ప్రస్తుత చర్చ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు, ప్రచారాలకు వేదికగా మారాయి. ఎయిర్పోర్టు విషయంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరి నిర్ణయాల వల్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లింది? ఎలా పూర్తైంది? అనే క్రెడిట్ వార్లో నరసాయమ్మ పేరు కూడా తెరపైకి వచ్చింది. నరసాయమ్మ ఎక్కడ?.. ఎయిర్బస్సు వచ్చింది చూడమ్మా?.. జగన్ నీ నెత్తిన చెయ్యి పెట్టాడు.. అంటూ ఇలా ఆమెపై అభ్యంతకర సందేశాలు కనిపిస్తున్నాయి పలు పేజీల్లో.భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో వైస్సార్సీపీ, కూటమి నేతలు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు భూసేకరణలో మార్పులు చేసి రైతులకు న్యాయం చేశామని, పరిహారం సైతం ఇప్పించామని, శంకుస్థాపనతో పనులు ప్రారంభించిందే తమ ప్రభుత్వమని వైఎస్సార్సీపీ లెక్కలతో చెబుతుంటే.. మరోవైపు ప్రాజెక్టు ప్రతిపాదన చేసింది తమదే కాబట్టి ఎంటైర్ క్రెడిట్ తమదేనని చంద్రబాబు పార్టీ చెబుతోంది. వాస్తవానికి విశాఖ ఎయిర్పోర్ట్ ఉండగా.. బలవంతపు భూసేకరణతో రైతులకు అన్యాయం చేయడం ఎందుకని? మాత్రమే జగన్ అన్నారు. అంతేగానీ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో ఏమాత్రం కాదు. ఆ ఉద్దేశమే ఉంటే.. ఉత్తరాంధ్రను అసలు పట్టించుకునేవారే కాదు కదా!. అధికారంలోకి రాగానే భోగారం ఎయిర్పోర్ట్ భూసేకరణను తగ్గించి.. నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇప్పించి.. అన్ని అనుమతులతో శంకుస్థాపన చేసే వారా?.. అయితే ఈ రాజకీయ వాదోపవాదాల మధ్య పాపం నరసాయమ్మ సోషల్ మీడియాకు ఎక్కింది.గతంలో తెనాలికి చెందిన గీతాంజలి ఘటనను గుర్తు చేసుకుంటే.. సోషల్ మీడియా చర్చలు, ట్రోలింగ్లు ఒక వ్యక్తి జీవితంపై ఎంతటి ప్రభావం చూపగలవో అర్థమవుతుంది. వైఎస్ జగన్ వల్లే తన కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరిందని చెప్పినందుకు.. ఆమెను నెట్టింట తెగ ట్రోల్ చేశారు. అది చేసింది ఎవరో అందరికీ తెలుసు. అది తట్టుకోలేక మనస్థాపంతో బలన్మరణానికి పాల్పడిందామె. అంతకు ముందు బెండపూడి విద్యార్థిని విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు.. నరసాయమ్మను ఆ స్థాయిలోనే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సాధారణ మహిళ మాట్లాడిన మాటలను రాజకీయ కోణంలో చూసి వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రమాదకర ధోరణి. భోగాపురం విషయంలోనూ నరసాయమ్మను ఒక రాజకీయ ప్రతీకగా మార్చకుండా.. ఆమె ఒక సాధారణ మహిళ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.. రాజకీయ విమర్శలు ఉండొచ్చు.. కానీ ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం సాగకూడదు.క్రెడిట్ కోసం ఒక మహిళను పావుగా మార్చే రాజకీయ ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, నరసాయమ్మ విషయంలోనైనా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త అవసరం. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకునే సంస్కృతి ఎంతటి పార్టీకైనా, ఏ వర్గానికైనా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు విధానాలపై ఉండాలి కానీ వ్యక్తుల జీవితాలపై కాదు. రాజకీయ లాభాల కోసం ఆమెను తెరపైకి తీసుకొచ్చి, తమకు అనుకూలమైన కథనాన్ని నిర్మించే ప్రయత్నాలు జరిగితే అది మరో అన్యాయమే అవుతుంది. -
ఎన్ఆర్ఐలు పార్టీకి సేవలు అందించాలి
సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్ఆర్ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్రీచ్ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు -
తండ్రి అంత్యక్రియలకు అడ్డుపడ్డ బిడ్డలు!
కన్నతండ్రి చివరి ప్రయాణానికి కూడా ఆస్తి లెక్కలు అడ్డుగా నిలిచాయి. జీవితాంతం పిల్లల కోసం కష్టపడిన ఓ తండ్రి మృతదేహం.. వారసుల మధ్య వివాదానికి సాక్షిగా మారింది. ఆస్తి పంపకాలపై పేచీ తేలేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ కొడుకులు పట్టుబట్టడంతో.. సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన సమాజంలో బంధాల విలువపై తీవ్ర చర్చకు దారితీసింది.సాక్షి, సూర్యాపేట: అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుడిగ భద్రయ్య మృతి చెందగా.. ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదం అడ్డుగా మారింది. ఆస్తి పంపకాల విషయంలో స్పష్టత వచ్చే వరకు తండ్రి అంత్యక్రియలు జరగనివ్వబోమని కన్నబిడ్డలు పట్టుబట్టారు.చివరి వీడ్కోలుకూ వారసత్వ వివాదం అడ్డంసాధారణంగా తల్లిదండ్రుల చివరి చూపు కోసం కుటుంబం మొత్తం ఒక్కటవుతుంది. కన్నీళ్లతో వీడ్కోలు పలకాల్సిన సమయంలో.. ఇక్కడ మాత్రం ఆస్తి తగాదా తెరపైకి వచ్చింది. తండ్రి మృతదేహం ముందు కూడా వివాదం పరిష్కారం కాకపోవడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.పురుగుల మందు డబ్బాలతో.. వివాదం తీవ్రరూపం దాల్చడంతో కొందరు వారసులు పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడతామని బెదిరించారు. దీంతో ఆ విషాద వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. పంచాయితీ పెద్దలు, బంధువులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.బంధాల కంటే ఆస్తే ముఖ్యమా?జీవితమంతా పిల్లల భవిష్యత్ కోసం శ్రమించిన తల్లిదండ్రులకు చివరి దశలో కూడా ప్రశాంతత దక్కకపోవడం విషాదకరం. ఆస్తులు, ఆస్తి పంపకాల కోసం బంధాలు బలహీనపడుతున్నాయా? అనే ప్రశ్నను ఈ ఘటన మరోసారి తెరపైకి తెచ్చింది. తండ్రి అంతిమ సంస్కారాలు సైతం వివాదానికి వేదికగా మారడం స్థానికుల్లో ఆవేదన కలిగించింది. -
మోదీపై వ్యాఖ్యల వివాదం.. ఎవరీ రుచికా సింగ్?
ఢిల్లీలోని జంతర్ మంతర్లో నీట్ నిరసనల సందర్భంగా రెచ్చిపోయిన యువతికి పెద్ద షాక్ తగిలింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమెపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘రాజ్యాంగ పదవి గౌరవాన్ని ఆమె వ్యాఖ్యలు దెబ్బతీశాయని.. ప్రజా శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని’’ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న ఆ యువతి.. జూలై 23-24 తేదీల మధ్య ఈ వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. మోదీని గద్దె దిగిపోవాలని.. యువత ఆ పని చేయాలంటూ అసభ్య పదజాలంతో దూషించింది. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు ఆమెను సెల్ఫోన్లతో వీడియోలు తీసిన మరింత రెచ్చిగొట్టినట్లు కనిపించింది. అవి విపరీతంగా వైరల్ కావడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వచ్చందంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.జీరో ఎఫ్ఐఆర్ నమోదుసుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్ప్రెస్వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా ప్రజా శాంతికి భంగం కలిగించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో.. సదరు యువతి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ వీడియోలో ఆమె ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. ఎవరీ అమ్మాయి?.. జంతర్ మంతర్ నిరసనల్లో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన యువతిని నోయిడాకు చెందిన రుచికా సింగ్గా గుర్తించారు. 25 ఏళ్ల రుచిక.. విద్యార్హతలు ఏంటో స్పష్టత లేదు. అయితే ఆమె మోడల్గా, ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నట్లు సమాచారం. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన ఈ నిరసనలో భాగంగా ఆమె.. ఇలా అభ్యంతరక వ్యాఖ్యలతో దేశ ప్రధానిని తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఢిల్లీ పోలీసులకు బదిలీజంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో నోయిడాలో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఐఎఫ్ఎస్ఓ (Intelligence Fusion and Strategic Operations) పరిశీలిస్తోంది. నిరసనకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులుఈ వ్యవహారంలో ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన, పరువునష్టం కలిగించే కంటెంట్ను షేర్ చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ (X) వేదికకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి సంబంధిత పోస్టులను తొలగించడం లేదంటే వాటి యాక్సెస్ను నిలిపివేయడం, దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని కోరినట్లు సమాచారం. -
ఎలుక ఎంత పనిచేసింది.. 10 లక్షల వజ్రాల నగలు..
సాక్షి, బెంగళూరు: తలుపులు పగలలేదు.. షట్టర్కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు. కానీ ఉదయం వచ్చి చూసేసరికి రూ.10 లక్షల విలువైన వజ్రాల నగలు మాయమయ్యాయి. దీంతో నగల దుకాణం యజమాని గుండె ఆగినంత పనైంది. చివరకు సీసీటీవీ ఫుటేజీ చూస్తే అసలు దొంగను చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఎందుకంటే ఆ 'మాస్టర్మైండ్' ఒక చిన్న ఎలుక!కర్ణాటకలోని తుమకూరు నగరంలోని కాల్టెక్స్ సర్కిల్లో ఉన్న విశ్వాస్ జ్యువెలరీలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని, కౌంటర్పై ఉన్న 50 గ్రాములకు పైగా వజ్రాల నగలు, 10 ఉంగరాలు, మూడు నెక్లెస్లు కనిపించకపోవడంతో షాక్కు గురయ్యారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు.ఎవరూ లోపలికి రాకపోవడంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. రాత్రి వేళ గోడలోని చిన్న రంధ్రం గుండా లోపలికి వచ్చిన ఓ ఎలుక, ఒక్కో నగను నోటితో లాక్కెళ్లి తన బొరియలో దాచిపెడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఎలుక జాడను అనుసరించి బొరియను తవ్వి చూడగా.. కనిపించకుండా పోయిన 10 ఉంగరాలు, మూడు నెక్లెస్లు సహా అన్ని వజ్రాల నగలు అక్కడే లభించాయి. దీంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. నగలన్నీ తిరిగి దొరకడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సినిమాల్లోనే కనిపించే సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.🐀 Rat becomes 'gold thief' near Bengaluru, drags ₹10 lakh worth of jewellery into its burrow; all ornaments recovered! pic.twitter.com/QYZlFeM9zz— HOSUR UPDATES (@hosurupdates) July 30, 2026 -
పదవి వదిలేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారండి
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో విద్యార్థులతో సంప్రదింపుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాను వినియోగించుకోవడంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకొని, దానికి బదులుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారా లని సూచించారు. నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా వ్యవహరించడానికే సరిగ్గా సరిపోతారని ఎద్దేవా చేశారు. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని, దేశాన్ని నడిపే బాధ్యతను మరొకరికి అప్పగించాలని అన్నారు. నీట్ పేపర్ లీక్పై ఆందోళనను విరమించినప్పటికీ నిరసనకారులపై వేధింపులు ఆగడం లేదని దీప్కే ఆరోపించారు. నిరసనల్లో పాల్గొన్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన నిరసన కారుల ఆగ్రహం చల్లారలేదని తేల్చిచెప్పారు. యువత ఆగ్రహాన్ని బీజేపీ ఎందుకు అర్థం చేసుకో లేకపోతోందని ప్రశ్నించారు. -
నేను చెప్పింది చెయ్! లేదంటే నీ ఫొటోలు అందరికీ..
ఆంధ్రప్రదేశ్, బాపట్ల: ఆన్లైన్లో ఏర్పడిన పరిచయం వేధింపులు ఆపై దాడికి దారితీసిన ఘటన బుధవారం సాయంత్రం చీరాల మండలం జాండ్రపేట సమీపంలోని అక్కయ్యపాలెం రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాజమండ్రికి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బలుకూరి సత్యవాణి (32) టైలర్గా పని చేస్తోంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం మరణించగా అనంతరం సోషల్ మీడియా ద్వారా చీరాల మండలం జాండ్రపేటకు చెందిన జోగాబత్తుని వెంకట కిరణ్తో పరిచయం ఏర్పడింది. కొంత కాలం తర్వాత నిందితుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె అతనికి దూరంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను నిందితుడు ఆమె బంధువులకు పంపడంతో బాధితురాలు అతనిపై రాజమండ్రిలో క్రిమినల్ కేసు నమోదు చేసింది.వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు..కొంతకాలం అనంతరం మళ్లీ ఆమెకు ఫోన్ చేసి తనతో కలిసి ఉండాలని, లేకపోతే ఫొటోలను అందరికి పంపిస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుడి ప్రవర్తన గురించి అతని తల్లిదండ్రులతో మాట్లాడేందుకు బాధితురాలు మంగళవారం చీరాల వచ్చారు.సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అక్కయపాలెం రోడ్డులో వెళుతుండగా వెంకట కిరణ్ అతని స్నేహితులతో కలిసి ఆమెను అడ్డగించి అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని తెలిపింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఆటోడ్రైవర్ జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా చీరాలకు తీసుకువచ్చినట్లు సమాచారం. అనంతరం ఆమె బుధవారం చీరాల వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఈ వయసులో మళ్లీ పెళ్లి!
తాతకు మళ్లీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందన్న ఓ మనవడి చిలిపి ఆలోచన ఆరు దశాబ్దాల వివాహ జీవితాన్ని ఒక్కసారిగా నెమరేసుకునేలా చేసింది.అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఫిలిప్ విన్హామ్ తన తాతయ్య అమ్మమ్మలకు జీవితాంతం గుర్తుండిపోయే సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. డేవిడ్, బెకీ రోచ్లకు 1967లో పెళ్లయింది. అప్పటి పెళ్లి ఫొటోలను ఎప్పుడు చూసినా వారిరువురు మురిసిపోతుంటారు.ఇది గమనించిన విన్హామ్ ఆ పాతబడ్డ ఫొటోలను తీసుకుని వారిరువురు ఇప్పుడు ఈ వయసులో మళ్లీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందా... అని ఆలోచించాడు. ఆ ఫొటోలను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలా షేర్ చేసిన కొద్దిగంటల్లోనే ఈ ఫొటోలకు వేలకొద్దీ కామెంట్లు వచ్చిపడ్డాయి. వయసు శరీరానికే కాని ప్రేమకు కాదని, ఆరు దశాబ్దాలైనా బంధం ఇంకా దృఢంగానే ఉందంటూ నెటిజెన్లు మెచ్చుకున్నారు. -
బోరున వర్షం.. వీఐపీనే గొప్ప!
జోరున వర్షం.. బస్ షెల్టర్లో నిల్చున్న ప్రజలు.. ఇంతలో వీఐపీ కాన్వాయ్ వస్తుందనే సమాచారం. అక్కడ ఉండకూడదంటూ ప్రజల్ని పోలీసులు పక్కకు తరిమేసిన దృశ్యాలు. దీనికి సంబంధించిన 23 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వర్షం కురుస్తున్న సమయంలో బస్ షెల్టర్లో ఆశ్రయం పొందుతున్న ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులను పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతూ బయటకు పంపించారు. కొందరిని నెట్టివేస్తున్నట్లు వీడియోలో కనిపించడం వివాదానికి కారణమైంది. రాజస్థాన్ జైపూర్లోని జేఎల్ఎన్ మార్గ్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.వీఐపీ ప్రోటోకాల్.. ప్రజల హక్కుల కంటే పెద్దదా?ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన బస్ షెల్టర్లోనే ప్రజలకు చోటు లేకుండా చేయడం ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వీఐపీ భద్రత పేరుతో సామాన్యుల ఇబ్బందులను పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.Indian policemen are removing people from under the shed because some lowlife VIP is about to pass by. Feudalism is not a system. It is about the DNA. People don't rebel and vote for psychopaths. Policemen from the lower caste implement what they claimed to have suffered.…— Jayant Bhandari (@JayantBhandari5) July 29, 2026సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ స్పందిస్తూ..“ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన బస్ స్టాప్లో కూడా ప్రజలు నిలబడలేని పరిస్థితి వచ్చింది. కారణం.. వీఐపీ ప్రోటోకాల్” అంటూ విమర్శించింది. “భారీ వర్షంలో తలదాచుకునేందుకు బస్ షెల్టర్లో ఉన్న పాదచారులు, బైక్ రైడర్లను ప్రజల రక్షకులుగా ఉండాల్సిన పోలీసులే బయటకు పంపించడం సిగ్గుచేటు. వీఐపీ ప్రోటోకాల్ మానవత్వం కంటే గొప్పదా? లేక సామాన్యుడికి ఆశ్రయం పొందే హక్కు లేదా?” అంటూ ప్రశ్నించింది.సోషల్ మీడియాలో దుమారంఈ ఘటనపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను వీఐపీ రాకపోకల కోసం అడ్డుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీఐపీ భద్రత అవసరమే అయినప్పటికీ.. సాధారణ ప్రజల పట్ల కనీస మానవత్వం, గౌరవం పాటించాల్సిందేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ ఘటనపై రాజస్థాన్ పోలీసుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అలాగే ఆ కాన్వాయ్ ఎవరిదన్న వివరాలు కూడా ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. -
కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలపై, నేటి యువతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జెన్ జీ వర్గం అనుచిత భాషను వాడిందని, వారి ప్రవర్తన బాగోలేదని ఆమె ఆరోపించారు. కాగా కంగనా వ్యాఖ్యలపై ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, సింగర్ విశాల్ దద్లానీ తీవ్ర స్థాయిలో స్పందించారు.ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జీలు, హింసాత్మక ఘటనలను ఆయన గుర్తు చేశారు. ‘చెడు భాష గురించా? మీరు రోడ్లపై పిల్లలను కొట్టారు, వారిపై రాళ్లు రువ్వారు, పైగా వారినే నిందిస్తున్నారు! వారిపై కాల్పులు జరుపుతున్నారు, బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. వారి ముఖాలపై పెల్లెట్ గన్లు వాడుతున్నారు. మీ పెయిడ్ గూండాలు ఇప్పటికీ తిరుగుతూ, వారిని బెదిరిస్తున్నారు, కొడుతున్నారు! ఈ తిట్లను మీరే స్వయంగా సంపాదించుకున్నారు.. మై ఫ్రెండ్’ అంటూ విశాల్ దద్లానీ మండిపడ్డారు.ఈ పోస్ట్ క్యాప్షన్లో.. ‘పెయిడ్ స్టోరీలు, ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు నిర్వహించడం వల్ల మీ దిగజారుడుతనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విశాల్ దద్లానీ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. మరోవైపు, కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో నిరసనలకు సంబంధించిన ఒక పోస్ట్ను షేర్ చేస్తూ తీవ్ర పదజాలం వాడారు. ‘నా జీవితంలో ఇంతటి అసహ్యకరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. జెన్ జీ నిరసనల రీల్స్ చూస్తే వాంతి వస్తోంది. వారు మాట్లాడే తీరు, వాడే భాష అత్యంత హేయంగా ఉన్నాయి’ అని ఆమె పేర్కొన్నారు. ఈ నిరసనకారులను ‘జనరేషన్ గటర్’ అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదువుసంధ్యలు లేని వీరు వ్యవస్థకు ఏమాత్రం ఉపయోగపడరని, కనీసం ఇంటిని కూడా చక్కదిద్దలేరని ఆమె విమర్శించారు. కాగా, ఈ వివాదం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
కాక్రోచ్ నిరసనల ఎఫెక్ట్.. ఢిల్లీ వీధుల్లో టెన్షన్!
నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ముగిసిన తర్వాత ఢిల్లీలో కొత్త వివాదం మొదలైంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం, భద్రతా సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరికొన్ని వీడియోలు చర్చకు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు నీట్ పేపర్ లీక్, పరీక్షా వ్యవస్థలో లోపాలపై ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలు తీవ్రతరం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అనంతరం నిరసనలపై భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న వారిపై దాడులు జరిగినట్టు తాజాగా వీడియోలు బయటకు వస్తున్నాయి. పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.As Soon as Dharmendra Pradhan’s Resignation is Confirmed……• Sonam Wangchuk has left.• Abhijeet Deepke and Saurabh Das are celebrating.Meanwhile, in Delhi, the Sangh Parivar has put their most Notorious and Riotous Group, the Bajrang Dal, out on the Streets.They are… pic.twitter.com/yLa72eEdBA— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) July 28, 2026ఇటీవల సత్యం పండిట్ అనే వ్యక్తి ఇద్దరు నిరసనకారులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన వీడియో చర్చకు వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు చూపించే మరికొన్ని వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో చిత్రీకరించినట్లు చెబుతున్న ఓ వీడియోలో, మైక్ పట్టుకున్న ఓ వ్యక్తి కొందరు నిరసనకారులను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నిస్తూ నిలదీసినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అతడి మెడపై చేయి వేసి మాట్లాడుతున్నట్లు, క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆ వ్యక్తి క్షమాపణ చెప్పినట్లు వీడియోలో కనిపిస్తుంది.जो काॅकरोच जंतर-मंतर पर सनातन धर्म और मोदी जी को गाली दे रहे थे उनकी दिल्ली मेट्रो में जमकर धुलाई हो रही है...🤣😏 pic.twitter.com/XHtgERs9Hx— राजपूत सवित सिंह (@Savit12) July 29, 2026 మరో వీడియోలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు వెంబడించి కొట్టినట్లు, తన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకొక వీడియోలో ఓ మహిళను పలువురు వ్యక్తులు చుట్టుముట్టి ప్రశ్నిస్తూ, ఆమెను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలపై నిరసనలకు మద్దతు ఇస్తున్న వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని లేదా విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగమని, నిరసనకారులను బెదిరించడం, దాడి చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొంటున్నారు.బీజేపీ అనుకూల వర్గాల వాదనమరోవైపు, బీజేపీకి మద్దతు ఇస్తున్న వర్గాలు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, పోలీసులపై అనుచిత నినాదాలు చేసినట్లు చూపించే కొన్ని వీడియోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిరసనల పేరుతో చట్టపరమైన, సామాజిక పరిమితులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నిరసనల్లో పాల్గొన్న వ్యక్తుల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేశాయి. అయితే, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవాల్సింది చట్టపరమైన వ్యవస్థ మాత్రమేనని, వ్యక్తులు లేదా ప్రైవేట్ గుంపులు స్వయంగా చర్యలకు దిగడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.THIS IS SHAMEFUL !!!If this is what young Indians have to face simply for supporting a protest then what kind of democracy are we becoming?This video appears to show Satyam Pandit confronting and slapping two youths on their way to the Jantar Mantar protest has sparked… pic.twitter.com/8zDPBMb1at— Ravi Prakash Official (@raviprakash_rtv) July 26, 2026ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం పౌరుల హక్కు. అదే సమయంలో నిరసనల సమయంలో హింస, బెదిరింపులు, దాడులు లేదా చట్ట ఉల్లంఘనలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు, న్యాయ వ్యవస్థలపై ఉంటుంది. కాగా, నీట్ నిరసనలు ముగిసినా, వాటి చుట్టూ రాజకీయ వాదోపవాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఒకవైపు నిరసనకారులపై దాడుల ఆరోపణలు, మరోవైపు నిరసనల్లో జరిగిన అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. The police have started their job. The Students movement is over. Now who will come forward to help these students?Unity of students is required. #cjpprotesters #india #arrested #students #police pic.twitter.com/6o7LxWowhb— भारतीय (@ramanswall) July 27, 2026 -
ఈ జెన్జీ భాష కనిపెట్టింది ఎవరో తెలుసా?
నిన్నటి వరకు సోషల్ మీడియా మీమ్స్, చాటింగ్ల్లో మాత్రమే కనిపించిన జెన్ జీ భాష.. ఇప్పుడు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలోనూ వినిపించింది. రాజకీయ విమర్శలకు యువత వాడే స్లాంగ్ పదాలను ఎంపీలు ఉపయోగించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ఆన్లైన్ సంభాషణల్లో కనిపించే పదాలు.. తాజాగా లోక్సభ చర్చలోనూ చోటు దక్కించుకున్నాయి.నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన చర్చలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే తొలుత Gen Z పదజాలాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షాల నిరసనలను విమర్శిస్తూ.. ‘MIA’ (Missing In Action), ‘FOMO’ (Fear Of Missing Out), ‘Delulu’ (Delusional) వంటి పదాలను ఉపయోగించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ కూడా ‘Clock it’ అనే పదాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. తేజస్వి సూర్య సైతం ‘Delulu’, ‘source code’ వంటి పదాలను ఉపయోగిస్తూ తన వాదనను వినిపించారు.It's raining Gen Z lingo in Loksabha.BJP MP Bansuri Swaraj said that PM Modi clocked by bringing a bill against the Paper leak. https://t.co/ovC4uz8QKs pic.twitter.com/o2cNJtUT4k— Political Kida (@PoliticalKida) July 28, 2026 "Congress was having FOMO and staying in DELULU".Dr. Shrikant Shinde of Shivsena just bodied Congress in Loksabha in GenZ style! 😂 pic.twitter.com/LMN5IRUQmt— Political Kida (@PoliticalKida) July 28, 2026 అయితే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈ కొత్త భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది విద్యా వ్యవస్థలోని సమస్యలపై అని.. కేవలం కొత్త పదాల ప్రదర్శన కోసం కాదని సూచించారు. అయితే ఆ తర్వాత ఆమె కూడా ‘Delulu’ పదాన్ని ఉపయోగిస్తూ.. యువత మొత్తం తమవైపే ఉందని భావించొద్దని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.'Delulu' takes over #LokSabha: #TejasviSurya, #SupriyaSule clash over who has Gen Z's support🌍 Catch the day's latest news here ➠ https://t.co/40gdOz6FIS 🗞️ pic.twitter.com/B9cr59wJTm— Economic Times (@EconomicTimes) July 28, 2026అసలు ఈ Gen Z భాష పుట్టింది ఎక్కడ?Gen Z స్లాంగ్ అనేది ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టిన భాష కాదు. ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియా, మీమ్ సంస్కృతి, డిజిటల్ జీవనశైలి కలిసి సృష్టించిన కొత్త భాషా రూపం. సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని Gen Zగా పిలుస్తారు. ఈ తరం చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాతో పెరిగింది. అందుకే వీరి సంభాషణల్లో వేగం, సంక్షిప్తతకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది.ఎక్కువ భావాన్ని తక్కువ పదాల్లో చెప్పడం, సరదాగా స్పందించడం, ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం కోసం కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. మొదట చిన్న ఆన్లైన్ గ్రూపులు, గేమింగ్ కమ్యూనిటీలు, సోషల్ మీడియా చర్చల్లో మొదలైన ఈ పదాలు.. TikTok, Instagram, YouTube వంటి వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.మీమ్స్తో మొదలై..జెన్జీ భాష వ్యాప్తిలో మీమ్ కల్చర్ కీలక పాత్ర పోషించింది. ఒక సంఘటనను లేదంటే ఒక భావాన్ని సీరియస్గా కాకుండా సరదాగా చెప్పేందుకు యువత కొత్త పదాలను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు కొత్త పదాలు సినిమాలు, టెలివిజన్, సంగీతం ద్వారా ప్రజల్లోకి వెళ్లేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఆ స్థానాన్ని తీసుకుంది. ఒక వైరల్ వీడియో, ఒక మీమ్ లేదంటే ఒక ట్రెండ్ ద్వారా పుట్టిన పదం కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇలా డిజిటల్ ప్రపంచంలో పుట్టిన పదజాలం ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారం, ప్రకటనలు వంటి రంగాల్లోకి కూడా ప్రవేశించింది.యువత ఎందుకు ఇష్టపడుతోంది?ఈ భాషలో కొన్ని పదాలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ‘Delulu’ అంటే వాస్తవానికి దూరమైన ఊహల్లో ఉండటం, ‘FOMO’ అంటే ఏదైనా అవకాశం కోల్పోతామేమో అన్న భయం, ‘MIA’ అంటే కనిపించకుండా పోవడం, ‘Clock it’ అంటే ఒక విషయాన్ని గుర్తించడం లేదా నిజాన్ని బయటపెట్టడం. ‘Rizz’ అంటే ఆకర్షించే వ్యక్తిత్వం, ‘Slay’ అంటే అద్భుతంగా చేయడం, ‘No cap’ అంటే నిజం చెబుతున్నాను అనే అర్థం. సోషల్ మీడియా, మీమ్ కల్చర్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదాలు ఇప్పుడు యువత సంభాషణల్లో భాగమయ్యాయి.జెన్జీ భాషకు ప్రధాన ఆకర్షణ దాని సరళత, వేగం. సుదీర్ఘమైన భావాలను ఒకే పదంతో వ్యక్తం చేసే అవకాశం ఈ స్లాంగ్ ఇస్తోంది. అంతేకాదు.. ఒకే తరానికి చెందిన వారు ఒకే రకమైన పదాలను ఉపయోగించడం ద్వారా తమ మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ఏర్పరుచుకుంటున్నారు. ఇది కేవలం మాట్లాడే విధానంలో మార్పు కాదు.. డిజిటల్ యుగంలో ఒక తరం తన గుర్తింపును వ్యక్తం చేసుకునే మార్గంగా మారింది.వ్యాపారాలకు కూడా ఉపయోగమే..ఇప్పుడు కేవలం యువత సంభాషణలకే ఈ భాష పరిమితం కాలేదు. యువ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకునే కంపెనీలు, బ్రాండ్లు కూడా ఈ పదజాలాన్ని గమనిస్తున్నాయి. ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల్లో యువతకు దగ్గరగా ఉండే భాషను ఉపయోగించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఒక తరం ఎలా ఆలోచిస్తోంది, ఎలా స్పందిస్తోంది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ స్లాంగ్ ఒక సాధనంగా మారింది.విమర్శలు కూడా..అయితే Gen Z భాషపై విమర్శలు కూడా ఉన్నాయి. అధికారిక వేదికల్లో ఇలాంటి స్లాంగ్ పదాలను ఉపయోగించడం సరైనదేనా అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా విద్య, విధానాలు వంటి తీవ్రమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో భాష మరింత గంభీరంగా ఉండాలని కొందరి అభిప్రాయం.భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు కొత్తగా అనిపించిన ఎన్నో పదాలు ఇప్పుడు సాధారణ వాడుకలోకి వచ్చాయి. టెక్నాలజీ, సినిమాలు, వీధి సంస్కృతి నుంచి గతంలో పదాలు వచ్చినట్లే.. ఇప్పుడు సోషల్ మీడియా కొత్త పదాలకు వేదికగా మారింది. Gen Z భాష వెనుక అసలు కథ కొన్ని విచిత్రమైన పదాల కథ కాదు. ఇంటర్నెట్ యుగంలో పెరిగిన ఒక తరం తన భావాలను, ఆలోచనలను, గుర్తింపును వ్యక్తం చేసుకునేందుకు సృష్టించుకున్న కొత్త శైలి. అందుకే మీమ్స్, చాటింగ్ల నుంచి మొదలైన ఈ భాష.. ఇప్పుడు పార్లమెంట్ చర్చల వరకూ చేరింది.:::వెబ్ ప్రత్యేకం -
అది ఉత్తుత్తి పెళ్లి...
అమ్రోహా: ఒకే వ్యక్తిని ముగ్గురు పెళ్లాడిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, దీనిపై ఆన్లైన్లో పెద్ద దుమారమే చెలరేగింది. స్పందించిన యూపీ మహిళా సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ) అధికారులు ఆ ముగ్గురినీ సోమవారం పిలిపించారు. విచారణలో వారు చెప్పిన విషయాలను విని అధికారులు నోరెళ్లబెట్టారు. అదంతా వైరలయ్యేందుకు తీసుకున్న వీడియో మాత్రమేనని వారు అసలు విషయం వెల్లడించారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు తీసిన ప్రాంక్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అయితే, తమపై ఆన్లైన్ ట్రోలింగ్ ఘోరంగా ఉందని వాపోయారు. అది నిజంగా పెళ్లేనంటూ అబద్ధం చెప్పినందుకు పశ్చాత్తాప పడుతున్నారు. ఇకనైనా వేధింపులను ఆపాలని వారు వేడుకున్నారు.ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వీడియోలో కనిపించిన ముగ్గురిలో ఒకరు మైనర్ అంటూ తమకు మూడు రోజుల క్రితం అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు సీడబ్ల్యూసీ చైర్మన్ అతులేశ్ కుమార్ భరద్వాజ్ వివరించారు. ముగ్గురి నుంచి వాంగ్మూలాలను సేకరించామని, వీరిలో ఒకరు మైనర్ అని రూఢీ అయ్యిందని చెప్పారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామన్నారు. యూపీలోని అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన దేవిక, ఛావి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు, వారి బంధువు మెహర్పూర్కు చెందిన ఆల్కా కలిసి శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కును హసన్పూర్లోని చాముండ ఆలయంలో వివాహమాడినట్లు ఆన్లైన్లో వీడియో ప్రత్యక్షమైంది.వీరు నలుగురూ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, ఆన్లైన్లో బాగా ఫాలోయింగ్ ఉన్న వాళ్లు. ఆరు నెలలుగా వికాస్ ముగ్గురికీ భర్తగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నాడు. అయితే, ముగ్గురు యువతులు ఒక్కరినే వివాహమాడటం సనాతన ధర్మానికి విరుద్ధమంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తాము మైనర్లమనీ, ఇష్టం వచ్చిన వారిని పెళ్లాడే హక్కు తమకుందని, పురాణాల్లోనూ ఇలాంటి ఉదాహరణలున్నాయంటూ వారు మొదట్లో కొట్టిపారేశారు.అదేవిధంగా, ముగ్గురు యువతులు, ఒక యువకుడి పెళ్లి తాను జరిపించలేదని చాముండ ఆలయ పూజారి స్పష్టం చేస్తున్నారు. వివాదాస్పద వీడియోలో ఉన్న ఆ నలుగురినీ ఈ నెల 23వ తేదీన పిలిపించి, వారి వయస్సును నిర్ధారించే పత్రాలను సమరి్పంచాలని, లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కోరామని హసన్పూర్ సీనియర్ ఎస్సై అమిత్ కుమార్ తెలిపారు. అయితే, వారింకా వాటిని ఇవ్వలేదన్నారు. -
CJP సంబరాలపై వాంగ్చుక్ రియాక్షన్ ఇదే..
నీట్ ఉద్యమం నేపథ్యంలో తెరపైకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుల సంబరాల వీడియోలపై ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ స్పందించారు. సీజేపీ నిరసనలకు మద్దతుగా ఆయన 26 రోజులపాటు దీక్ష కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాక CJP సభ్యులు పార్టీ చేసుకున్న వీడియోలు వైరల్గా మారిన వేళ.. వాంగ్చుక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.సీజేపీ పార్టీ సంబురాలపై వాంగ్చుక్ స్పందించారు. విజయాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. దాన్ని గౌరవం, నియంత్రణ, బాధ్యతతో స్వీకరించడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. “విజయానికి వినయం తోడవ్వాలి” (Victory must be accompanied by humility) అని సోనమ్ వాంగ్చుక్ పేర్కొన్నారు. CJP నిర్వహించిన నెల రోజులకుపైగా సాగిన నీట్ నిరసనల అనంతరం ఈ సంబరాలు జరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఈ వేడుకలపై విమర్శలు చేయగా.. మరికొందరు ఇది యువత నిరసన వ్యక్తీకరణలో భాగమని సమర్థించారు.సోనమ్ వాంగ్చుక్ పాత్రఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమానికి సోనమ్ వాంగ్చుక్ మద్దతుగా నిలిచారు. నిరాహార దీక్ష చేపట్టిన ఆయన.. పోలీసులు ఆసుపత్రికి తరలించే వరకు నిరసనకారులతోనే ఉన్నారు. అనంతరం ప్రభుత్వం నుంచి హామీలు రావడంతో 26 రోజుల దీక్షను విరమించారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై నమోదైన కేసులు, బాధిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై జరిగిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన దీక్ష విరమణను స్వాగతిస్తూనే.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్షతో తమకు సంబంధం లేదని.. తమ డిమాండ్లు నెరవేరే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. అదే సమయంలో.. Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026CJP సంబరాలపై విమర్శలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన తర్వాతి దీప్కే ప్రసంగంలో సోనమ్ వాంగ్చుక్ పేరు ప్రస్తావనకు రాకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు.. ఎక్స్ ఖాతా నుంచి సోనమ్ వాంగ్చుక్ సపోర్ట్గా వేసిన డీపీని దీప్కే తొలగించగా.. అధికార ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలు అలాగే కొనసాగించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై ఢిల్లీలోని అభిజిత్ దీప్కే నివాసానికి సమీపంలోని ఓ హోటల్లో CJP సభ్యులు డ్యాన్స్లు చేస్తూ సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉద్యమం వెనుక విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యల విషాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వేడుకలు సరైన సందేశం ఇవ్వవని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం కొత్త తరం పోరాట విధానంలో ఉత్సాహం, సృజనాత్మకత కూడా భాగమేనని పేర్కొన్నారు.“ఇదే జెన్ జీ స్టైల్”.. విమర్శలపై CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ.. తమ వేడుకలు యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అంతేకాదు పోరాటంలో పాల్గొన్న ఎవరీని తాము విస్మరించలేదని.. వలంటీర్ల గౌరవార్థమే ఈ పార్టీ ఇచ్చామని చెప్పారు. “ఎంతకాలమైనా రోడ్డుపై కూర్చొని పోరాడగలం.. అదే సమయంలో పాటలు పాడుతూ నిరసన చేయగలం. కాఫీ తాగుతూ ఉద్యమాన్ని నిర్వహించగలం. ఇదే కొత్త తరం శైలి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజకీయ విమర్శకులను అంకుల్స్, ఆంటీస్ అంటూ ఎద్దేవా చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ ఆరోపణలుసంబరాల వీడియోలపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందిస్తూ.. CJP నాయకత్వం ఫైవ్ స్టార్ హోటల్లో విజయోత్సవం చేసుకుందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఖర్చులు ఎవరు భరించారంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఆరోపణలను సౌరవ్ దాస్ ఖండించారు. అది ఖరీదైన వేడుక కాదని, సాధారణ హాల్లో జరిగిన కార్యక్రమమని తెలిపారు. వాంగ్చుక్ వ్యాఖ్యలతో కొత్త చర్చCJP సంబరాలపై కొనసాగుతున్న వివాదం మధ్య సోనమ్ వాంగ్చుక్ చేసిన “విజయానికి వినయం తోడవ్వాలి” అనే వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఇది విమర్శలా? లేదంటే ఉద్యమానికి ఇచ్చిన సూచనా? అనే అంశంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మోదీ సెల్ఫీ వీడియో తొలగింపుపై మెటా వివరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే. రికార్డు స్థాయి వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి వాటికి. అయితే ఫేస్బుక్ నుంచి ఆ వీడియోలు కాసేపు కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకు తొలగించారంటూ ఫేస్బుక్పై నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఈ ‘తాత్కాలిక’ వ్యవహారంపై మెటా వివరణ ఇచ్చింది. ఆ వీడియోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెబుతూ.. దాన్ని పునరుద్ధరించామని కూడా వెల్లడించింది.నీట్ వివాదంపై కొనసాగిన విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రధాని మోదీ జులై 23న ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జెన్ జీ విద్యార్థులతో మోదీ చేసిన తొలి ప్రత్యక్ష సంభాషణగా ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది.అయితే జులై 28 తెల్లవారుజామున కొంతసేపు ఈ వీడియో భారతీయ వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది. వీడియో స్థానంలో ‘‘చట్టపరమైన అభ్యర్థన కారణంగా మీ ప్రాంతంలో ఈ మీడియా అందుబాటులో లేదు’’ అనే సందేశం కనిపించింది. దీంతో రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.మెటా ఏమంది?వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని స్పష్టం చేసింది. పొరపాటున వీడియోను పరిమితం చేశామని, గుర్తించిన వెంటనే దాన్ని పునరుద్ధరించామని తెలిపింది. వీడియోను తొలగించడానికి కారణమైన ప్రక్రియలో తప్పిదం జరిగిందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని మెటా పేర్కొంది.భగ్గుమన్న బీజేపీ, అభిమానులుప్రధాని మోదీ అధికారిక ఖాతాలో ఉన్న వీడియోను ఫేస్బుక్ పరిమితం చేయడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది భారతీయులకు చేరాల్సిన ప్రధానమంత్రి సందేశాన్ని ఒక సోషల్ మీడియా సంస్థ ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన నేతలు మెటాను ట్యాగ్ చేస్తూ పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తారు. కంటెంట్ నియంత్రణ పేరుతో రాజకీయ పక్షపాతం చూపుతున్నారా? అనే చర్చకు ఈ ఘటన కారణమైంది.జెన్ జీ ఉద్యమం సమయంలో వీడియోనీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల నిరసనల సమయంలో ప్రధాని మోదీ ఈ వీడియో విడుదల చేశారు. పేపర్ లీక్లను అరికట్టేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వీడియోకు భారీగా వ్యూస్ రావడంతో పాటు యువతలో చర్చకు దారితీసింది. ఇలాంటి సమయంలో వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడం మరింత ఆసక్తిని రేపింది.వివాదం టు వివరణ వరకుసోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. ఇన్నేళ్లలో పోస్ట్ చేసిన తొలి సెల్ఫీ వీడియో ఇదే కావడం గమనార్హం. అదీ నీట్ నిరసనలతో జెన్ జీ చేసిన ఆందోళనలపై కావడంతో ప్రపంచవ్యాప్తంగా దానిని కోట్ల మంది వీక్షించారు. అయితే ఉన్నట్లుండి ఆ వీడియో ఎందుకు తొలగించబడిందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చట్టపరమైన అభ్యర్థన కారణమా? అనే ప్రశ్నా తలెత్తింది. అయితే మెటా తాజాగా ఇచ్చిన వివరణతో ఇది సాంకేతిక పొరపాటేనని తేలింది. ప్రస్తుతం ప్రధాని మోదీ వీడియో మళ్లీ ఫేస్బుక్లో అందుబాటులోకి వచ్చింది.మెటాకు కేంద్రం నోటీసులుమెటా క్షమాపణలు చెప్పినప్పటికీ.. కేంద్రం మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్బుక్ వీడియో తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) స్పందించింది. ఈ అంశంపై వివరణ కోరుతూ మెటా గ్లోబల్ హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
జనసేన నేత అనుమానాస్పద మృతి
సాక్షి,తిరుపతి: జనసేన పార్టీ రాజంపేట సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శివకుమార్ (48) తిరుపతిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనడీ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నూనెవారిపల్లికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.శివకుమార్ ఈనెల 26న తన ఇంటి నుండి బయలుదేరి తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించారు. అనంతరం తిరుపతి కెనడీ నగర్లో ఉంటున్న తన బంధువు చింతల రమణమూర్తి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇంటి బాత్రూంలో శివకుమార్ ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు మృతుడి భార్య కళ్యాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఈస్ట్ ఎస్ఐ రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.మృతిపై ముసురుతున్న అనుమానాలు శివకుమార్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు పర్యటనలో ఉన్న సమయంలో పెరియపాలెంలో ద్విచక్ర వాహనాన్ని వదిలేశారని, అక్కడే ఇద్దరు వ్యక్తులు తమ సిమ్ కార్డులను పారేసినట్లు శివకుమార్ బంధువు పవన్ తెలిపారు. నిన్న తిరుపతిలోని రమణమూర్తి ఇంటికి శివకుమార్, పవన్ కలిసి వచ్చారు. ఈరోజు ఉదయం వైఫై కనెక్ట్ అవ్వడంతో, వాట్సాప్ కాల్ ద్వారా పవన్తో శివకుమార్ భార్య కళ్యాణి మాట్లాడారు. ఆ మాట్లాడిన కొద్దిసేపటికే శివకుమార్ బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. -
గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్ మొదలైందా?
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ గురించి గత కొన్నాళ్లుగా నడుస్తున్న రచ్చ(చర్చ) సంగతి తెలిసిందే. అయితే నీట్ వ్యవహారంతో ఇన్నాళ్లు ఈ అంశం కాస్త పక్కకు జరిగిపోయింది. అయితే.. ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చుట్టూ కొత్త వివాదం మొదలైంది. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్(E20) విధానంతో గడ్కరీ కుటుంబం లాభపడుతోందని.. ఆయన కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. E20 పెట్రోల్ విధానం కేవలం స్వార్థపూరితంగా ఆయన తెచ్చారని.. దాని వల్ల ఆయనకు, తన కుటుంబానికి లాభాలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. తప్పుడు పోస్టులు, డీప్ఫేక్ కంటెంట్పై బాంబే హైకోర్టును ఆశ్రయించారు.వీటిని పరువు నష్టం కలిగించే ప్రచారంగా పేర్కొన్న గడ్కరీ.. సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేసేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ విధానం వల్ల తనకు పైసా లాభం లేదని.. తమ కుటుంబం నిర్వహిస్తున్న చెరకు వ్యాపారంతో లాభాలు కూడా పెద్దగా రావని అందులో వివరించారు.సమగ్ర కథనం: ఇథనాల్ అంశం.. నా వాటా ఎంతంటే..: గడ్కరీబాంబే హైకోర్టును ఆశ్రయించిన గడ్కరీగడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన బాంబే హైకోర్టు.. కేసు దాఖలుకు అనుమతి ఇచ్చింది. తనపై ప్రచారం జరుగుతున్న కంటెంట్ ముంబైలోనూ అందుబాటులో ఉందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై నాగ్పూర్లో ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ20 ఇథనాల్ విధానానికి సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత.. గడ్కరీనే టార్గెట్?ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో.. సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. తదుపరి టార్గెట్ నితిన్ గడ్కరీనే అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ20 ఇంధనంపై గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం, వాహనదారుల నుంచి వస్తున్న అభ్యంతరాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్చ మరింత వేడెక్కింది. అయితే గడ్కరీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇటు కేంద్రం కూడా ఇథనాల్ పెట్రోల్ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేవని అంటోంది కూడా.అసలు ఈ20పై వివాదం ఏంటి?కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ20 ఇంధనం అంటే.. 80 శాతం పెట్రోల్కు 20 శాతం ఇథనాల్ను కలిపిన మిశ్రమం. ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు ప్రయోజనం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు మాత్రం పాత వాహనాలపై ఈ20 ప్రభావం, మైలేజీ తగ్గుదల వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.కోర్టు బాట పట్టిన గడ్కరీతనపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు గడ్కరీ తీసుకున్న న్యాయపరమైన చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ20పై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. తప్పుడు ప్రచారాలపై చట్టపరంగా ఎదుర్కొంటాననే సంకేతాన్ని ఆయన ఇచ్చినట్లు కనిపిస్తోంది. -
నన్ను అడగొద్దు.. డిలీట్ చేయను: బీజేపీ ఎంపీ కూతురి సంచలన పోస్ట్
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆయన స్వంత రాష్ట్రం ఒడిశాకే చెందిన ఓ బీజేపీ ఎంపీ కూతురు సంచలన పోస్ట్తో రాజకీయ దుమారం రేపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సంబురంగా ఆమె ఓ పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్ తొలగించాలంటూ తనపై ఒత్తిడి వస్తోందంటూ ఆమె అందులో పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సారంగి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఓ వార్తా హెడ్డింగ్ స్క్రీన్షాట్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన అర్చిత.. ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. “డీపీ (ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశించి..) పీఏ నా తల్లికి మెసేజ్ చేసి ఈ స్టోరీని డిలీట్ చేయమని అడుగుతారని తెలుసు.. కానీ నేను డిలీట్ చేయను. ఇలాంటి విషయం ఇంతకుముందు కూడా జరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. కాబట్టి అడగాల్సిన అవసరం లేదు.. నేను డిలీట్ చేయను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయినట్లు సమాచారం.ఎవరీ తల్లీకూతుళ్లు?అర్చిత సారంగి తల్లి అపరాజిత సారంగి ఒడిశాకు చెందిన బీజేపీ నాయకురాలు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో భువనేశ్వర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న అపరాజిత సారంగి.. బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక అర్చిత ఎంబీఏ పూర్తి చేసుకుంది. అంతకు మించి ఆమె గురించి వివరాలేవీ నెట్టింట సమాచారం. అయితే తన కుమార్తె చేసిన పోస్ట్ విషయంలో ఆమె మాత్రం ధర్మేంద్ర ప్రధాన్కు మద్దతుగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమె సమర్థిస్తూ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత తీసుకోవడం నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.Our daughter, Archita, has been selected for the MBA course at UNIVERSITY OF OXFORD. We convey our deep sense of gratitude to all our friends and well wishers.Jai Jagannath ! 🙏 pic.twitter.com/sNejUZYf6s— Aparajita Sarangi, MP,( Lok Sabha) Bhubaneswar (@AprajitaSarangi) March 9, 2024ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు?ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ అవకతవకలపై విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నెల రోజులకు పైగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆయన.. విద్యార్థుల ఆకాంక్షలు, భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.కొత్త చర్చకు కారణంమంత్రికి మద్దతుగా ఆమె తల్లి నిలబడగా.. అదే సమయంలో కుమార్తె మాత్రం రాజీనామా వార్తను షేర్ చేయడం, దాన్ని తొలగించనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అటు అస్సాంలోనూ ఎన్డీయే కూటమి మంత్రి కేశబ్ మహంతా(అస్సాం గణ పరిషత్ పార్టీ) కూతురు దిసాబా కూడా ఇలాగే నీట్ నిరసనల్లో ధర్మేంద్ర రాజీనామా కోరుతూ నినాదాలు చేశారు. ఇలా కుటుంబంలోనే.. అదీ అధికార పార్టీలకు చెందిన వాటిలో భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. -
రాజీనామా ఖుషీ.. హుషారుగా స్టెప్పులేసిన సీజేపీ లీడర్స్
నీట్ పేపర్ లీకేజీ.. విద్యార్థుల ఆత్మహత్యలు.. మంత్రి రాజీనామా అంశంతో ఆందోళనలు చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ తమ డిమాండ్లు నెరవేరడంతో రిలాక్స్ అయ్యింది. గత రాత్రి ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఆ పార్టీ నేతలు, పలువురు స్టూడెంట్స్ గ్రాండ్గా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. రకరకాల వంటకాలతో.. డీజే పాటలతో హుషారెత్తించే స్టెప్పులేశారు. అయితే.. ఖుషీగా వాళ్లు చేసిన ఆ పార్టీపై ఇప్పుడు దుమారం రేగుతోంది.కొందరు అమ్మాయిలు(సీజేపీ ప్రతినిధులు/నీట్ అభ్యర్థులు?!) జోష్గా డ్యాన్సులు చేయగా.. అటు చర్చల్లో పాల్గొన్న అశుతోష్ రాంకా, సౌరబ్ దాస్ ఇద్దరూ కూడా హుషారుగా వాళ్లతో కలిసి స్టెప్పులు కలిపారు. అందరూ కలిసి హోటల్లో సంబురాల్లో మునిగిపోయారు. మరోవైపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఓ మూలన కూర్చుని పార్టీ చూస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రాజీనామా సందర్భంగా ఖుషీ అంటూ ఆ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచే ఈ వీడియో(Resignation की ख़ुशी) పోస్ట్ కావడం గమనార్హం.Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026అయితే ఈ వీడియోపై పలువురు అభ్యంతరాలు.. ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థులకు పార్లమెంట్ మార్చ్ సందర్భంగా గాయాలైన సంగతి తెలిసిందే. వాళ్లు కోలుకోకముందే కాక్రోచ్ నాయకత్వంలో ఉన్నవాళ్లు ఇలా పార్టీ చేసుకోవడానికి కొందరు తీవ్రంగా తప్పు బడుతున్నారు. నీట్ కారణంగా దేశవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అసలు ఉద్యమం ఉద్దేశాన్ని నీరుగార్చేలా వీళ్ల తీరు ఉందంటూ మండిపడుతున్నారు.అదే సమయంలో యాంటీ నెటిజన్లు మాత్రం.. ఇది కాక్రోచ్ల నిజ స్వరూపం అంటూ మండిపడుతున్నారు. నిరసనల్లో ఆందోళనకారులకు అరటిపండ్లు, బ్రెడ్ పకోడీలు పంచుతూ గుర్తింపు పొందిన జునైద్ అనే యువకుడి గురించి కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘అభిజీత్ దీప్కే నా కాల్స్కు స్పందించడం లేదు’.. అంటూ అతను కంటతడి పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. షాదాబ్ సైఫీ సైతం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ జోష్ పార్టీలో కనిపించకపోవడంతో.. ఇలాంటి కొందరిని కేవలం తమ అవసరాలే దీప్కే వాడుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాంగ్చుక్ ప్రస్తావన లేకుండానే.. గత రెండ్రోజులుగా సీజేపీ వ్యవహరిస్తుండడమూ విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. అభిజీత్ దీప్కే తనకు టైఫాయిడ్ సోకిందని ట్రీట్మెంట్ ఫొటోలను వైరల్ చేశాడని.. కానీ సాయంత్రానికే ఇంటికి దగ్గర్లో ఉన్న హోటల్లో పన్నీర్ టిక్కా తింటూ ఎంజాయి చేస్తున్నాంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. అయితే ఇటు ఈ యువతకు మద్దతుగా పోస్టులు చేసేవాళ్లు కొందరు కనిపిస్తున్నారు. -
20ల్లో చేసే తప్పులు.. 30ల్లో కరిగిపోతున్న కలలు!
జీతం వస్తోంది.. ఖర్చవుతోంది. కానీ సంపద మాత్రం పెరగడం లేదు. ఇది నేటి యువత ఎదుర్కొంటున్న వాస్తవం. ఖరీదైన ఫోన్లు, వీకెండ్ ట్రిప్స్, క్రెడిట్ కార్డు షాపింగ్లు, సోషల్ మీడియా చూపించే లైఫ్స్టైల్...ఇవన్నీ తెలీకుండానే సంపద సృష్టించే అవకాశాలను యువతకు దూరం చేస్తున్నాయి. 20ల్లో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో కోట్ల రూపాయల నష్టంగా మారతాయి. అందుకే ఈ వయసులో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన దిశలో నడిపించడం అంతకంటే ముఖ్యం. ఈ ఏడు మనీ మిస్టేక్స్ను ఇప్పుడే గుర్తిస్తే యువత భవిష్యత్తు ఆర్థికంగా మరింత బలంగా మారుతుంది. నెలాఖరులో జీతం బ్యాంకు ఖాతాలో పడుతోంది. కానీ కొన్ని రోజుల్లోనే మాయమవుతోంది. ఈనెల నుంచి సేవింగ్స్ మొదలు పెడతా, ఈసారి జీతం పెరిగాక సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్) చేస్తా, ఈ ఈఎంఐ అయ్యాక పెట్టుబడులు ప్లాన్ చేస్తా ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ యువత తమ జీవితంలో అత్యంత విలువైన ఒక దశాబ్దాన్ని కోల్పోతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 20 ఏళ్ల వయసులో చేసే ఆర్థిక పరమైన తప్పులు పెద్దవేం కావు. కానీ వాటి ప్రభావం మాత్రం 30, 40 ఏళ్ల వరకు వెంటాడతాయి. చిన్న అలవాట్లు, చిన్న చిన్న నిర్లక్ష్యాలు, చిన్న ఆనందం కోసం వేసే వాయిదాలు భవిష్యత్తులో చేతికందాల్సిన కోట్ల రూపాయలను దూరం చేస్తాయి. 20ల్లో యువత చేసే తప్పులు ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడాలి ? పర్సనల్ ఫైనాన్స్ (వ్యక్తిగత ఆర్ధిక నిర్వహణ) గురించి ఎక్కడైనా చదివినా, సోషల్ మీడియాలో నిపుణుల సూచనలు విన్నా ఎక్కువమంది యువతే లక్ష్యంగా సలహాలు ఇస్తుంటారు. చిన్న వయసులోనే పొదుపు చేయండి, ఉద్యోగంలో చేరిన నెలనుంచే పెట్టుబడులు ప్రారంభించండి, అప్పులకు దూరంగా ఉండండి అంటూ అనేక సూచనలు ఇస్తుంటారు. పెట్టుబడులు ఎలా చేయాలో వివరిస్తుంటారు. కానీ 90 శాతం యువత ఈ సూచనలను పట్టించుకోరు. కారణం వారికి అవగాహన లేకపోవడం కాదు. కెరీర్ ప్రారంభ దశలో ఎదురయ్యే అనిశ్చితులు, ఆకర్షణలు, కొన్నాళ్ల తర్వాత మొదలెడదాంలే అనే భావన వారిని వెనక్కి నెడతాయి. అయితే 20 ఏళ్ల వయసు ప్రయోగాలు చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి, కలలు కనడానికి సరైన సమయం. అయితే యువత ఆనందానికి మాత్రమే ప్రాధాన్యమిస్తారు. కానీ ఆనందం కాస్త ప్రణాళికతో ఉండాలి, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. ఊహించని సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. లేకపోతే 30 ఏళ్ల తర్వాత ‘ఇప్పటిదాకా ఇంత సంపాదించాను, అంతా ఎక్కడికిపోయింది‘ అనే ప్రశ్న ఎదురవుతుంది. అప్పడు పెరిగినబాధ్యతలు, పెరుగుతున్న ఖర్చులు భవిష్యత్తు గురించి బెంగపడేలా చేస్తాయి.యువత భవిష్యత్తును మింగేస్తున్న 7 మనీ ట్రాప్స్ 1. జీతం పెరిగినపుడు జీవనశైలిని అప్గ్రేడ్ చేయడం చాలామంది యువత ఉద్యోగంలో చేరిన కొత్తలో జీతం పెరిగిన వెంటనే కొత్త కొత్త మొబైల్ ఫోన్లు, కొనడం, ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్లి వేలల్లో ఖర్చుచేయడం, నెలా నెలా విహార యాత్రలకు వెళ్లడం ద్వారా కొత్త లైఫ్ స్టైల్ను ఎంచుకుంటారు. ఒక్కోసారి ఇవన్నీ సహజంగానే అనిపిస్తాయి. కానీ ఈ అలవాట్లు భారీ ఖర్చులుగా మారతాయి. దీన్నే లైఫ్ స్టైల్ క్రీప్ అంటారు. జీతం పెరుగుతూ ఉంటుంది. పొదుపు మాత్రం పెరగదు. కానీ జీవన శైలి మారిపోతూ ఉంటుంది. ఫలితంగా పదేళ్లు గడిచేసరికి బ్యాంకు పొదుపు ఖాతాలో పదిరూపాయలు కూడా కనబడదు. దీనికి పరిష్కారం సులభమే. జీతం పెరిగిన ప్రతిసారీ ఆ పెరుగుదలలో కనీసం 50 శాతాన్ని నేరుగా పెట్టుబడి వైపు మళ్లించాలి. అప్పుడే ఆదాయం పెరుగుదల భవిష్యత్తులో సంపదగా మారుతుంది. 2. పెట్టుబడులను వాయిదా వేయడం‘ఈసారి జీతం పెరిగినపుడు పెట్టుబడి మొదలెడతా, వచ్చే ఇంక్రిమెంట్ అందుకున్నాక పొదుపు చేస్తా, ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేసి కాస్త స్థిరపడడ్డాక ఇన్వెస్ట్ స్టార్ట్ చేస్తా‘ యువత నుంచి సాధారణంగా వినిపించే మాటలు ఇవి. కానీ కాంపౌండింగ్ అనే అద్భుతం కాలాన్ని కోరుకుంటుంది. ఉదాహరణకు 22 ఏళ్ల వయసులో నెలకు రూ.5000తో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ప్రారంభించిన వ్యక్తి 55 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు రూ.2.2 కోట్ల సంపద కూడబెట్టగలడు (ఏడాదికి 12 శాతం రాబడి అంచనాతో). అదే సిప్ను 30 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే అది రూ.85 లక్షల వరకు మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ డబ్బు కన్నా ముందుగా ప్రారంభించడం వల్ల వచ్చిన కాల ప్రయోజనమే ప్రధాన కారణం. అందుకే పెట్టుబడి ఎంత చేశారు కాదు. ఎప్పుడు మొదలెట్టారు అన్నదే అత్యంత కీలకం. 3. క్రెడిట్ కార్డును అదనపు ఆదాయంగా భావించడం క్రెడిట్ కార్డు అనేది ఆదాయం కాదు. అది తాత్కాలిక రుణం మాత్రమే. స్వైప్ చేసినపుడు గర్వంగా అనిపిస్తుంది. కానీ బిల్లు వచ్చినపుడు అసలు వాస్తవం కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుంది. వాడిన మొత్తంలో కనీస బకాయి మాత్రమే చెల్లిస్తూ వెళితే ఏడాదికి 36 నుంచి 48 శాతం అదనపు వడ్డీ భారాన్ని మోసే పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా క్రెడిట్ కార్డు వాడకుండా ఉండాలంటే కనీసం 6 నుంచి 9 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. 4. తెలియని ఇన్వెస్ట్మెంట్ల వెంట పరుగులు తీయడంప్రతి కాలంలో ఏదో ఒక పెట్టుబడి రంగం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా, సంచలనంగా మారుతుంది. కొన్నేళ్ల క్రితం క్రిప్టో, తర్వాత డిఫెన్స్ స్టాక్స్, ఆ తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్స్, తర్వాత ఫ్లెక్సీ కాప్ ఫండ్లు ఇలా.. వాటిలో పెట్టుబడి పెట్టినవారు భారీ లాభాలు పొందారని, కోటీశ్వరులయ్యారని వార్తలు వస్తూంటాయి. యువతరం ఎక్కువగా ఆ ప్రచారంలో చిక్కుకుని, ఆ ట్రెండ్లో భారీగా నష్టపోతోంది. దీర్ఘకాలిక సంపద సృష్టించే పెట్టుబడులకంటే తక్షణ లాభాల ఆశతో ఆప్షన్స్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ వైపు యువరం ఆకర్షితులవుతోంది. సోషల్ మీడియాలో ఫిన్ఫ్లూయెర్స్ ప్రభావం, తక్కువ సమయంలో భారీ రాబడులు వస్తాయనే ప్రచారం ఈధోరణిని మరింత పెంచుతున్నాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ సంపదను సృష్టిస్తే డెరివేటివ్స్ ట్రేడింగ్ మూలధనాన్నే కరిగించేస్తాయి. ఇక్కడ సమస్య పెట్టుబడి ఎంపికలో కాదు. స్పష్టమైన లక్ష్యం లేకుండా సమయం చూడకుండా ఇన్వెస్ట్ చేయడంలోనే ఉంది. ప్రతిసారి పెట్టుబడి చేసే ముందు రెండు ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి ఈ డబ్బు ఏ అవసరానికి? రెండు.. ఎప్పుడు అవసరం అవుతుంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేకపోతే పెట్టుబడి వ్యూహం కాదు, జూదం అవుతుంది.5. ఇన్సూరెన్స్ను పెట్టుబడిగా కొనడంచాలా మంది ఫైనాన్స్ ఏజెంట్లు యూలిప్లు. ఎండోమెంట్ పాలసీలు, ఒకే ఉత్పత్తితో రక్షణతో పాటు రాబడి కూడా ఇస్తాయని చెబుతుంటారు. కానీ అవి ఆశించిన ఫలితం ఇవ్వవు. ఈ పాలసీల్లో ఇన్సూరెన్స్ కవరేజీ తక్కువ ఉంటుంది. పెట్టుబడి రాబడులు కూడా రకరకాల ఛార్జీల కారణంగా తగ్గిపోతాయి. అందుకే పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు టర్మ్ ఇన్సూరెన్స్ వేరు, పెట్టుబడులు వేరు అనే సూత్రాన్ని సూచిస్తారు. కుటుంబ రక్షణకు టర్మ్ పాలసీ, సంపద కోసం ముచువల్ ఫండ్లు, ఇతర పెట్టుబడులు ఎంచుకోవడం తెలివైన నిర్ణయమవుతుంది. 6. సోషల్ మీడియా ప్రభావంతో ఖర్చు చేయడంసోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్లు విదేశీ పర్యటనలు, ఖరీదైన రెస్టారెంట్లు, కొత్త కొత్త గాడ్జెట్లు, విలాసవంతమైన జీవితం మాత్రమే చూపిస్తారు. కానీ వాటి వెనక ఉన్న ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులు గురించి చెప్పరు. వీటిని తరచూ చూసే యువతరం వాటి ప్రభావంతో తమ ఆర్థిక సామర్థ్యాన్ని మించి ఖర్చు చేస్తారు. తాత్కాలిక ఆనందం కంటే ఆదాయానికి మించిన ఖర్చుతో పెరిగిన ఒత్తిడి తరువాతి రోజోల్లో అనుభవించిన ఆనందాన్ని గుర్తు లేకుండా చేస్తుంది. అందుకే ప్రతిసారి ఖర్చు చేసే ముందు ‘ఇది నిజంగా నాకు అవసరమా? లేక ఇతరులను చూసి చేస్తున్నానా? అని ఆలోచించుకోవడం అవసరం. 7. స్వీయాభివృద్ధికి పెట్టుబడి చేయకపోవడంయువతకు అత్యంత విలువైన ఆస్తి స్టాక్ పోర్ట్ ఫోలియో కాదు. సంపాదన సామర్ధ్యం ప్రధానం. ప్రమోషన్కు ఉపకరించే ఒక మంచి కోర్సు, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్, నైపుణ్యాన్ని పెంచుకునే సరైన పుస్తకాలుపై చేసే పెట్టుబడి కెరీర్ను పూర్తిగా మార్చగలవు. రూ.20000 జీతాన్ని లక్షలకు పెంచే అవకాశం కలుగుతుంది. అందువల్ల ఈ వయసులో సంపద సృష్టించడంలో ముఖ్యమైన పెట్టుబడి మీపై మీరు చేసేదే.అసలు సమస్య ఏమిటి? ఈ ఏడు తప్పిదాల్లో ఒక సామాన్య అంశం ఇమిడి ఉంది. ఇవన్నీ చెడు నిర్ణయాల వల్ల జరిగినవి కావు. నిర్ణయం సరిగా తీసుకోకపోవడం వల్ల జరిగేవి. డబ్బు ఎప్పుడూ ఎవరికోసం ఆగదు. జీతం వచ్చిన క్షణం నుంచి అది అనేక రకాలుగా అనేక మార్గాల్లో ఎటో వెళ్లిపోతుంది. కాబట్టి మంచి ఆర్థిక అలవాట్లను ఆటోమేటిక్గా ఏర్పాటు చేసుకోవడం అత్యంత ముఖ్యం.ఆటో డెబిట్ సిప్, ప్రత్యేక సేవింగ్స్ ఖాతా, సరైన టర్మ్ ఇన్సూరెన్స్ వంటి నిర్ణయాలు జీవితాన్ని సులభతరం చేస్తాయి. 20 ఏళ్ల వయసులు సంపద సృష్టించాలి అనుకునే వారికి ఎక్కువ ఆర్థిక నైపుణ్యం ఉండాల్సిన అవసరంలేదు. కానీ త్వరగా సరైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నవారు ముందంజలో ఉంటారు. ఈ దశలో తీసుకునే చిన్న ఆర్ధిక నిర్ణయాలు భవిష్యత్తులో కోట్ల రూపాయల తేడాను చూపిస్తాయి. అందుకే 20ల్లో డబ్బును నిర్లక్ష్యం చేయడం కాదు, దానికి సరైన దిశ చూపించడం అత్యంత అవసరం.సంపద సృష్టికి గుర్తుంచుకోవాల్సిన 5 గోల్డెన్ రూల్స్→ జీతం పెరిగినపుడల్లా కనీసం 50 శాతం పెట్టుబడికి మళ్లించండి → మొదటిజీతం నుండే సిప్ ప్రారంభించండి → 6 నుంచి 9 నెలల ఖర్చులకు ఎమెర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయండి → టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి → నైపుణ్యాలు పెంచుకునేందుకు కొంత ఖర్చు చేయండి – సాక్షి, వెల్త్ డెస్క్ -
భార్య జైనాబ్పై ట్రోలింగ్.. అఖిల్ స్పందన
గతేడాది జూన్లో అక్కినేని అఖిల్–జైనాబ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చాలా సాదాసీదాగా జరిగిన ఆ పెళ్లి వేడుక తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరిపై కొంతమంది ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా జైనాబ్ వయసు, ఆమె మతం వంటి అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. తాజాగా ఈ విషయంపై అఖిల్ స్పందించాడు. తనకు, తన భార్యకు మధ్య ఉన్న వయసు వ్యత్యాసం, ఆమె మతం వంటి విషయాలు తనకు అసలు సమస్యగా అనిపించలేదని ఆయన స్పష్టం చేశాడు. పెళ్లికి ముందే వీటిపై తామిద్దరం మాట్లాడుకున్నాం. అప్పట్లో కొన్ని నెలల పాటు తనపై, తన భార్యపై నడిచిన ట్రోలింగ్ గురించి ఆలోచించాలా.. లేక రాబోయే నా 50 ఏళ్ల జీవితం గురించి ఆలోచించాలా.. నేను నా జీవితం గురించి ఆలోచించాను. ఇవన్నీ నా దృష్టిలో చాలా చిన్నవి. తన భార్యగా మారిన తర్వాత ఇలాంటి నెగెటివ్ పోస్టులు వస్తాయని ముందే చెప్పాను.వాటిపై మానసికంగా సిద్ధంగా ఉండమని సూచించాను. జైనాబ్ అదే విధంగా పరిణతి చూపింది. తమ జంటపై వచ్చిన ప్రతి ట్రోలింగ్ను దీవెనగా తీసుకున్నాం. కులం, మతం, వయసు, ప్రేమ అన్నింటినీ దాటి తమ మధ్య అద్భుతమైన అవగాహన ఉందని చెప్పాడు. తాను మానసికంగా, శారీరకంగా కష్టకాలంలో ఉన్నప్పుడు జైనాబ్ అందించిన సపోర్ట్ను ఎప్పటికీ మరిచిపోలేను. అక్కడ్నుంచే తమ మధ్య అండర్స్టాండింగ్ మరింత బలపడింది. సోషల్ మీడియాలో కనిపించే ట్రోల్స్ నుంచి తనను రక్షించలేను. కానీ వాటిని తను ఎలా స్వీకరించిందనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో జైనాబ్ ఎంతో పరిణతి చూపింది. ఐదేళ్ల రిలేషన్షిప్లో తనను బాగా అర్థం చేసుకుందని అఖిల్ పేర్కొన్నాడు. అఖిల్ లెనిన్ మూవీతో సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అఖిల్.. ఎట్టకేలకు అయ్యగారే నంబర్వన్ అనిపించుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. -
మనిషి చనిపోయాక వాళ్ల డిజిటల్ డేటా ఏమవుతుంది?
ఒక ఇంటి పెద్ద మరణిస్తే ఆయన పేరిట ఉండే ఆస్తిపాస్తులు, బంగారం మొదలైన వాటిని వారసులు వీలునామా ప్రకారమో లేదా వాటాల ప్రకారమో పంచుకుంటారు. మరి అదే మనిషికి చెందిన సోషల్ మీడియా జ్ఞాపకాలు, వ్యక్తిగత ఈ–మెయిల్స్, ఫొటోలు, వీడియోలు మొదలైన డిజిటల్ డేటా, క్రిప్టో కరెన్సీ, యూపీఐ వాలెట్లలోని నగదు వంటి డిజిటల్ కరెన్సీ సంగతేంటి? పాస్వర్డ్ లేదా కీ తెలియకపోయినా వాటిని వారసులు పొందగలరా? చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయి?ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరిచినవి.. కంప్యూటర్, మొబైల్ లేదా ఇంటర్నెట్ ద్వారా ఎల్రక్టానిక్ పద్ధతిలో భద్రపరిచిన లేదా యాజమాన్య హక్కులు కలిగిన విలువైన సమాచారం లేదా డేటా, డబ్బు లేదా క్రిప్టోకరెన్సీలను డిజిటల్ ఆస్తిగా పరిగణిస్తున్నారు. అంటే ఒకరి పేరిట ఆన్లైన్లో ఉండే సామాజిక మాధ్యమ ఖాతాలు, బ్యాంకు ఖాతాలు, ఓటీటీ సబ్స్రి్కప్షన్లు... ఫొటోలు, వీడియోలు, ఈ–మెయిల్స్ వంటి ఫైళ్లు.. యూపీఐ వాలెట్లు, మ్యూచువల్ ఫండ్లు, క్రిప్టో వాలెట్ల వంటివి ఈ కోవలోకి వస్తాయి.గణాంకాలు ఏం చెబుతున్నాయి? 2024 నాటికి దేశంలో 90 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఒక సగటు వ్యక్తికి కనీసం 6 యాప్లలో ఖాతాలు, 2 బ్యాంక్ ఖాతాలు, 1 యూపీఐ ఐడీ ఉంటోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ నివేదిక ప్రకారం 68% మంది తమ పాస్వర్డ్లను కుటుంబంతో పంచుకోవడంలేదు. ఫలితంగా ఏటా సంభవించే మరణాల్లో ఇలాంటి వారికి చెందిన విలువైన డిజిటల్ ఆస్తులు స్తంభించిపోతున్నాయి. బెంగళూరులో 2022లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో మరణించే సమయానికి ఆయన వద్ద రూ. 2 కోట్ల విలువైన బిట్కాయిన్ వాలెట్ ఉండేది. కానీ అందుకు సంబంధించి ‘కీ’తెలియకపోవడం వల్ల ఆయన కుటుంబం కోర్టుకెళ్లినా ‘కీ’లేకుండా వాలెట్ తెరవడం సాధ్యం కాదని కోర్టు తేల్చిచెప్పింది. ముంబైలో 2023లో ఓ మహిళ మరణించగా ఆమె పేరిట ఉన్న యూపీఐ, 3 మ్యూచువల్ ఫండ్ ఖాతాలకు నామినీ లేకపోవడంతో వారసత్వం రుజువు చేసుకోవడానికి ఆ కుటుంబ సభ్యులు 8 నెలలపాటు బ్యాంకుల చుట్టూ తిరిగాల్సి వచ్చింది.విదేశాలు ఏం చేస్తున్నాయి? అమెరికాలో 48 రాష్ట్రాలు రివైజ్డ్ యూనిఫామ్ ఫిడ్యూషియరీ యాక్సెస్ టు డిజిటల్ అసెట్స్ యాక్ట్ (ఆర్యుఎప్ఏడీఏఏ) పేరిట ఒక చట్టం తెచ్చాయి. దీని ప్రకారం చనిపోయిన లేదా జీవచ్ఛవంలా మారిన ఒక వ్యక్తి గతంలో రాసిన వీలునామాలో పేర్కొన్న కుటుంబ సభ్యులకు కంపెనీలు డిజిటల్ డేటా అప్పగించాలి. యూరప్లో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) కింద డిజిటల్ లెగసీ ఆప్షన్ ఉంది. భారత్లో ఇంకా ప్రత్యేక చట్టం లేనప్పటికీ 2023 ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా కంపెనీలు ఈ తరహా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించాలి. ప్రస్తుతం మెటా, గూగుల్ లెగసీ కాంటాక్ట్, ఇన్ యాక్టివ్ అకౌంట్ మేనేజర్ ఫీచర్లు అందిస్తున్నాయి.డిజిటల్ డేటాకు భద్రతనిచ్చే 3 అడుగులుడిజిటల్ వీలునామాఒక వ్యక్తికి ఆన్లైన్లో ఉండే రకరకాల ఖాతాల వివరాలను పేర్కొనడంతోపాటు తన తదనంతరం వాటి యాక్సెస్ను ఎవరికి ఇవ్వాలనేది లాయర్ ద్వారా రిజిస్టర్ చేయించుకోవడమే డిజిటల్ వీలునామా.లెగసీ సెట్టింగ్స్ ఆన్ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో వారసత్వ సంప్రదింపు ఫీచర్, గూగుల్లో ఇన్ యాక్టివ్ అకౌంట్ మేనేజర్ సెట్టింగ్ను ఆన్లో పెట్టడం ద్వారా ఒక వ్యక్తి డిజిటల్ డేటాను తన తదనంతరం కుటుంబ సభ్యులు పొందేందుకు వీలు కల్పిస్తుంది. పాస్వర్డ్ మేనేజర్వన్ పాస్వర్డ్, బిట్ వార్డెన్ లాంటి డిజిటల్ వాల్ట్లలో అన్ని పాస్వర్డ్లు పెట్టి, మాస్టర్ పాస్వర్డ్ను నమ్మకమైన వ్యక్తికి తెలియజేయడం ద్వారా డిజిటల్ డేటాను తమ తదనంతరం కుటుంబ సభ్యులు పొందే అవకాశం కల్పించొచ్చు. -
కింగ్ కోబ్రానే గడగడలాడించిన పిల్లి..!
పాము–ముంగిసల పోరాటాలు తరచూ కనిపిస్తుంటాయి. కానీ ఓ చిన్న పిల్లి ఏకంగా కింగ్ కోబ్రానే వెనక్కి తగ్గేలా చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పడగ విప్పి దాడికి దిగిన కింగ్ కోబ్రాను పిల్లి చాకచక్యంగా ఎదుర్కొన్న వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.'ఘర్ కే కలేష్' అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కింగ్ కోబ్రా, చిన్న పిల్లి ఎదురెదురుగా నిలుస్తాయి. పిల్లిని గమనించిన వెంటనే కింగ్ కోబ్రా పడగ విప్పి దాడికి సిద్ధమవుతుంది. అయితే సాధారణంగా జరిగేదానికి భిన్నంగా పిల్లి ఏమాత్రం భయపడకుండా పాము ముందే ధైర్యంగా నిలబడుతుంది.Kalesh b/w Cat and Snake Cat Survives a Face Off With a Striking Cobra pic.twitter.com/3HAHwcHrLp— Ghar Ke Kalesh (@gharkekalesh) July 21, 2026ఒక్కసారిగా కోబ్రా కాటు వేయడానికి ముందుకు దూసుకురాగా, పిల్లి మెరుపు వేగంతో తప్పించుకుని వెంటనే తన పంజాతో ఎదురుదాడి చేస్తుంది. పిల్లి చూపిన చురుకుదనం, ధైర్యానికి కింగ్ కోబ్రా కూడా వెనక్కి తగ్గి అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది.ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు 48 వేలకుపైగా వీక్షణలు లభించగా, పిల్లి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. -
10 గంటల్లో 12 కోట్ల వ్యూస్.. సోషల్ మీడియాలో సీజేపీ సెన్సేషన్!
న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోషల్ మీడియాలోనూ భారీ ఆదరణ పొందుతోంది. సీజేపీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఓ వీడియో కేవలం 10 గంటల్లోనే 12 కోట్ల (120 మిలియన్) వ్యూస్ను సాధించి రికార్డు సృష్టించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నారనే సమాచారం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు ఫోన్లో అందిన క్షణాలను వీడియోగా చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. అది కాస్తా వైరలైంది. ఈ వీడియోకు వచ్చిన స్పందనతో సోషల్ మీడియాలో సీజేపీ ప్రభావం ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది.నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ప్రారంభమైన ఉద్యమం తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో యువతను ఆకర్షించింది. రాయిటర్స్ కథనం ప్రకారం, సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఇప్పటికే 2.2 కోట్ల మంది ఫాలోవర్లు చేరడం విశేషం. ముఖ్యంగా యువతతో అనుసంధానం కావడానికి ఇన్స్టాగ్రామ్ ఈ ఉద్యమానికి ప్రధాన వేదికగా మారింది.అయితే సోషల్ మీడియాలో వచ్చే వ్యూస్, లైక్లు ఉద్యమానికి ఉన్న రాజకీయ మద్దతును పూర్తిగా ప్రతిబింబించవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, భారత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఇదిలా ఉండగా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నకు సీజేపీ నాయకులు ఆసక్తికరంగా స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ భారత్లో దేనికీ 'నో' చెప్పకూడదు. ప్రస్తుతం మాత్రం మా దృష్టి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంపైనే ఉంది అని అన్నారు. DEMOCRACY WINS! 🇮🇳Education minister Dharmendra Pradhan has resigned. pic.twitter.com/DsB6hCHUzP— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026 -
ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్.. గంభీర్ రాజీమానాకు డిమాండ్!
నీట్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా యువతరం భగ్గుమనడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ఉద్యమానికి యువతరం పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో చివరకు కేంద్రం తలవంచాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత జట్టు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. నీట్ లీకేజీ వ్యవహారంలో తన బాధ్యతల్లో విఫలమైన ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లే.. గంభీర్ కూడా టీమిండియా వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ హెడ్కోచ్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ డిమాండ్ చేయడం ఆసక్తి కనిపించింది. విద్యార్థులు చేసిన ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చినట్లే.. గంభీర్ కూడా తమ నిరసనలకు దిగిరావాలని, లేకుంటే రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సి వస్తుందని హెచ్చరించడం గమనార్హం. గంభీర్ ఇలాగే కోచ్గా కొనసాగితే మాత్రం 2027 వన్డే ప్రపంచకప్లో భారత్ ఓటమి ఖాయమని కొందరు జోస్యం చెబుతున్నారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ హర్షిత్ రానా, సుందర్ లాంటి క్రికెటర్లకు తరచూ అవకాశాలు ఇస్తున్నాడని, సీనియర్లకు అవకాశాలు తగ్గేలా చేయడంలో గంభీర్దే కీలకపాత్ర అని విమర్శిస్తున్నారు. అయితే ఇటీవలే గంభీర్ హెడ్కోచ్గా ఐర్లాండ్ చేతిలో 2-0తో, ఇంగ్లండ్ చేతిలో 4-0తో ఓడిన టీమిండియా ఆ తర్వాత వన్డే సిరీస్ను కూడా 2-1తో కోల్పోయింది. దీంతో ప్రస్తుతం జింబాబ్వే టూర్కు గంభీర్కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ను మెంటార్గా జట్టుతో పంపించారు. కోచ్ మారగానే టీమిండియా టీ20 సిరీస్ను గెలుచుకోవడంతో పాటు, తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్ కూడా గంభీర్ను ట్రోల్స్కు గురయ్యేలా చేసింది. అయితే కొంతమంది గంభీర్ మద్దతుదారులు మాత్రం అతడి కోచింగ్ సారథ్యంలోనే టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిందన్న విషయం మరువకూడదని కామెంట్లు చేశారు. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్తో క్రికెట్ అభిమానుల నుంచి గంభీర్కు సెగ తగిలినట్లయింది. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ మాత్రమే కావడంతో బీసీసీఐ పెద్దగా పట్టించుకోలేదు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. Education Minister Dharmendra Pradhan resigned. pic.twitter.com/Ne2s3DMB50— TukTuk Academy (@TukTuk_Academy) July 25, 2026🚨 FAN PROTESTS GROW AGAINST GAMBHIR 🚨Growing frustration over Team India's recent performances has sparked fresh online campaigns and fan protests demanding Gautam Gambhir step down as head coach! 🇮🇳🏏🔥 pic.twitter.com/KlXfpDb364— CreaseBuzz (@CreaseBuzz) July 25, 2026Ab resignation aa gaya hai toh asli protest shuru karein?#CJP #dharmendrapradharesign pic.twitter.com/GmC7Ze5S5e— Tigerexch.ai (@Tigerexch_ai) July 25, 2026 -
పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!
టెక్నాలజీ దిగ్గజ సంస్థ జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు భారత్లో చిన్నారులపై సోషల్ మీడియా వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించాలని చేసిన సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వర్చువల్ ప్రపంచంలో అల్గారిథమ్ల ఉచ్చులో చిక్కుకుంటున్న పిల్లలను దాని నుంచి కాపాడాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నారులు స్మార్ట్ఫోన్ స్క్రీన్లకు పరిమితం కాకుండా పుస్తకాలు చదవడం, ఆటలు, ప్రకృతి వైపు మళ్లాలని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.ఈ ప్రతిపాదనకు బలాన్నిచ్చేలా ఇటీవల ఫ్రాన్స్ పార్లమెంట్ 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ కీలక చట్టాన్ని ఆమోదించింది. అంతకుముందే ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు బాలలపై ఆంక్షలు విధించగా యూకే, యూఏఈ, మలేషియా వంటి అనేక దేశాలు డిజిటల్ నియంత్రణలకు శ్రీకారం చుట్టాయి. అతిగా స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల చిన్నారుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి, డిజిటల్ వ్యసనం పెరగడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే, వెంబు వ్యాఖ్యలపై ఇంటర్నెట్ వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెంబు ఆలోచనను పలువురు విద్యావేత్తలు, తల్లిదండ్రులు సమర్థిస్తుండగా నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వస్తోంది. చిన్నారులకు ఆంక్షలు విధించడం సరే.. సమాజంలో నకిలీ వార్తలు, విద్వేషపూరిత సందేశాలను విచ్చలవిడిగా వ్యాప్తి చేసే ‘వాట్సాప్ అంకుల్స్’ (పెద్దల) సంగతేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం నిషేధాల ద్వారా సమస్యను పరిష్కరించలేమని, చిన్నారులకు డిజిటల్ అక్షరాస్యత నేర్పించడమే సరైన మార్గమని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఒక్క బ్యాంకూ లోన్ ఇవ్వకపోయినా ‘డీటీడీసీ’ ఎలా సాధ్యమైందంటే.. -
ఎన్డీయే మంత్రి కూతురు.. కేంద్రంపై నిరసన స్వరం
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతుండగా.. తాజాగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు.అస్సాం రెవెన్యూ మంత్రి కేశబ్ మహంతా కుమార్తె దిబిసా మహంతా గువాహటిలో జరిగిన విద్యార్థుల నిరసనలో పాల్గొందంటూ ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాచల్ ప్రాంతంలో గురువారం నిర్వహించిన ఈ ఆందోళనలో ఆమె విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.దిబిసా మహంతా నిరసనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసోం గణ పరిషత్ (ఏజీపీ)కు చెందిన కేశబ్ మహంతా.. బీజేపీ నేతృత్వంలోని అసోం ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. మిత్రపక్ష ప్రభుత్వంలో భాగమైన సీనియర్ నేత కుమార్తె.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై డిమాండ్లతో జరుగుతున్న నిరసనలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కూతురి నిరసనపై తండ్రి స్పందించాల్సి ఉంది. అయితే ఢిల్లీలో కొనసాగుతున్న నీట్ నిరసనలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం తాజాగా స్పందించారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, వారి డిమాండ్లు, వాదనలను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతం అసోం వరదలతో తీవ్రంగా ప్రభావితమైందని, ప్రకృతి విపత్తుపై కూడా అందరూ దృష్టి పెట్టాలని కోరారు.ఇదిలా ఉండగా, నీట్ నిరసనలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రాజకీయ, క్రీడా, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు.. ఆందోళనలకు మద్దతుగా విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నారు. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో నీట్ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యులపై చర్యలు, విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో నిరసనకారులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగానూ, సామాజికంగానూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.#WATCH: Assam Cabinet Minister Keshab Mahanta's daughter, Dibisa Mahanta, was among those who joined the CJP protest in Guwahati, where demonstrators demanded education reforms and the resignation of Union Education Minister Dharmendra Pradhan.#Assam #CJPProtest… pic.twitter.com/CJP2hjZFIc— Northeast Now (@NENowNews) July 24, 2026 -
మోదీ మ్యాజిక్ ఇలాగే ఉంటుంది మరి!
నరేంద్ర మోదీ.. ఈ పేరుకు ఉన్న గ్లోబల్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాల అధినేతలు సైతం ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతర్జాతీయ వేదికలపై మోదీకి లభించే ఆదరణకు ఇదే నిదర్శం కూడా. అలాంటి వ్యక్తి తొలిసారి జాతిని ఉద్దేశించి.. అదీ నీట్లాంటి నిరసనల మీద సెల్ఫీ వీడియో పోస్ట్ చేస్తే స్పందన ఎలా ఉంటుందో ఊహించగలరా?. నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో లోపాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ గురువారం రాత్రి మోదీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అందులో.. పేపర్ లీక్పై ఆందోళనలను అర్థం చేసుకున్నామని, కఠిన చర్యలకు దిగుతున్నామని ప్రకటించారు. ఇకనైనా ఆందోళనలు విరమించాలి అంటూ పరోక్షంగా ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ వీడియోకు భారీ స్పందన లభించింది. కోట్లాది మంది వీక్షణలు, లక్షల సంఖ్యలో స్పందనలతో ఆ వీడియో వైరల్గా మారింది.ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఈ సెల్ఫీ వీడియోకు తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి. సుమారు 25 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించగా.. 10 లక్షలకు పైగా కామెంట్లు, కోటిన్నరకు పైగా లైక్స్తో దూసుకుపోతోంది. అయితే అన్ని ప్లాట్ఫారమ్లతో కలిపి ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026నీట్ వివాదంపై వీడియో సందేశంలో స్పందించిన ప్రధాని.. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలను సహించేది లేదని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత ఆశలు, భవిష్యత్తుతో ఎలాంటి రాజీ ఉండదని భరోసా ఇచ్చారు.ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపించాయి. ప్రధాని సందేశాన్ని స్వాగతించిన పలువురు.. ఇది విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నమని పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం నీట్ వివాదంలో బాధ్యులపై చర్యలు, వ్యవస్థలో సమూల మార్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.శుక్రవారం రాత్రి మరో వీడియోను రిలీజ్ చేశారాయన. ఈసారి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన మోదీ.. “ధన్యవాదాలు మిత్రులారా. నిన్న (గురువారం) రాత్రి మీతో మాట్లాడే అవకాశం లభించింది. నా వీడియోను ఎంతోమంది చూసి, విలువైన సూచనలు అందించారు. మీ ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు. యువత నుంచి వచ్చిన సానుకూల స్పందన తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)ఇక మోదీకి ఉన్న వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్, సోషల్ మీడియా ప్రభావం మరోసారి ఈ వీడియోల ద్వారా చర్చకు వచ్చింది. దేశీయ రాజకీయాలతో పాటు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన మోదీ.. డిజిటల్ ప్లాట్ఫామ్లలోనూ భారీ స్థాయిలో ప్రజలతో అనుసంధానమవుతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యువతకు చేరువ కావాలంటూ మంత్రులకు సైతం నిన్నటి కేబినెట్ భేటీలో మోదీ సూచించడం గమనార్హం. నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఈ సెల్ఫీ వీడియో.. కేవలం ఓ రాజకీయ సందేశంగానే కాకుండా, సోషల్ మీడియాలో మోదీకి ఉన్న ప్రజాదరణకు మరో ఉదాహరణగా నిలిచిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. -
సోషల్ మీడియాని ఊపేస్తున్న కాక్రోచ్... GEN-Z కొత్త ట్రెండ్
-
బొద్దింకలతో పోలుస్తారా..? అధికారిణికి కాక్రోచ్ కౌంటర్
-
డిగ్రీ ఓకే.. స్కిల్స్ డబుల్ ఓకే..!
కష్టపడి డిగ్రీ చదివేస్తే సరిపోదు.. రియల్ వరల్డ్లో పోటీకి తగినట్టు స్కిల్స్ పెంచుకోకపోతే వెనుకపడిపోతావ్.. మహా అయితే నీ డి గ్రీ ఒక్క ఉద్యోగాన్నిస్తుంది. కాని స్కిల్స్ ఉంటే కెరీర్ మలుపు తిరుగుతుంది.ఏఐ నీ శత్రువు కాదుప్రస్తుతం అంతా ఏఐ మాయలో ప్రపంచమంతా పయనిస్తోంది. దాని వల్ల వేలమందికి ఉద్యోగాలు పోయాయి..మరిన్ని లక్షల మందికి ఉద్యోగాలు పోనున్నాయి. కాని ఏఐ నీ శత్రువు కాదు. ఏఐ వాడగలిగేవాడు నీ ఉద్యోగాన్ని తీసుకుంటాడంతే...సోషల్ మీడియాతో స్నేహం చాలదు..రీల్స్ చూస్తూ, వీడియోలు షేర్ చేయడం మానేసి కంటెంట్ క్రియేటర్గా ఎదుగు.. యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా రీల్, ఇన్ఫోటెయిన్మెంట్, బ్లాగ్స్ ఇలా నీ ట్యాలెంట్కి సూట్ అయ్యే ప్లాట్ఫాం ఎంచుకో. విస్తారమైన అవకాశాలు ఉన్నది ఒక్క సోషల్ మీడియాలోనేనని తెలుసుకో...జీతం కోసం కాదు జీవితం కోసం చూడుఏదో ఒక పని చేసి నెలజీతం తెచ్చుకుంటే చాలనుకోకు..ప్రభుత్వాలు మారినా, షేర్ మార్కెట్లు కుప్పకూలినా, కంపెనీలు దివాల తీసినా ముందుగా మూడేది నెలజీతగాళ్లకే...అందుకే నైపుణ్యాలు పెంచుకో బంగారు భవితని గెలుచుకో.భర్తీ కానివ్వకు..అందరూ చేసే పనిని నువ్వు చేయకు.. నీ ప్రత్యేకత ఉన్న పనేంటో శోధించి దానిలో ప్రతిభ చూపించి రాణించు..నిన్ను భర్తీ చేసి వేరొకరికి నీ స్థానాన్నివ్వాలన్న ఆలోచనని రానివ్వకు. -
విజయ్ బ్రో.. వెరీ రాంగ్ బ్రో!
తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రభావం కొత్త విషయం కాదు. కానీ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓ నటుడిగా విజయ్కి ఉన్న క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఆయన నటించిన ‘చివరి చిత్రం’ జన నాయగన్ విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అదే సమయంలో.. ఈ కోలాహలం ఇటు రాజకీయ చర్చకూ దారితీసింది.‘జన నాయగన్’ విడుదల సందర్భంగా విజయ్ అభిమానుల నుంచి భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ అభిమానంలో పాలకులు సైతం పోటీ పడ్డారు. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు తమిళనాడు మంత్రులు, అధికార పార్టీ నేతలు థియేటర్లకు తరలివెళ్లారు. అసెంబ్లీ స్పీకర్ నుంచి పలువురు మంత్రుల వరకు సినిమా వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు అభిమానులతో కలిసి థియేటర్లలో సందడి చేయగా.. మరికొందరు సోషల్ మీడియాలో సినిమాకు ప్రచారం చేశారు.మంత్రి టీకే ప్రభు సినిమా స్టిక్కర్లను ఇళ్ల తలుపులు, ఆటోలకు అంటించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరో మంత్రి సినిమా చూస్తూ భావోద్వేగానికి గురైన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. రాష్ట్రంలో కీలక సమస్యలు బోలెడన్ని పెండింగ్లో ఉన్నాయని.. పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సినిమా వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైందేనా? అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.నీట్ నుంచి రైతుల వరకు..నీట్పై అభ్యంతరాలతో మొదటి నుంచి కేంద్రం నుంచి పోరాడుతోంది తమిళనాడునే. అసలు ఆ పరీక్షను రద్ద చేయాలనే డిమాండ్ మొదలైంది కూడా అక్కడి నుంచే. అలాంటి రాష్ట్రంలో.. నీట్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో తమది మొదటి నుంచి ఒకే మాట అని విజయ్ టీవీకే చెబుతోంది.అయితే నిరసనల్లో మాత్రం ఆ పార్టీకి చెందిన నేతలెవరూ కనిపించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్న వేళ.. విజయ్ సినిమా వంకతో పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టు, కావేరీ నీటి విడుదల, డెల్టా రైతుల సమస్యలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సినిమా విడుదల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించడం విమర్శలకు కారణమైంది.వెరీ రాంగ్ బ్రో.. ఇటీవల తమిళనాడులో వరుసగా కస్టడీ మరణాల ఆరోపణలు కలకలం రేపాయి. పోలీసుల వేధింపులతో నలుగురు మరణించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలీసు దౌర్జన్యాలపై గళమెత్తిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.గతంలో కస్టడీ బాధిత కుటుంబాలను కలిసిన విజయ్.. పోలీసు సంస్కరణలు తీసుకురావాలని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సినిమా హీరో కావొచ్చు, కానీ..విజయ్ రాజకీయ ప్రయాణం మొత్తం ప్రజా సమస్యల చుట్టూనే సాగింది. అవినీతి, పరిపాలనా లోపాలు, ప్రజల హక్కుల కోసం పోరాడతానని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ముందున్న అసలు పరీక్ష.. అభిమానుల సీఎంగా కాకుండా ప్రజల సీఎంగా నిరూపించుకోవడం. సినిమా విజయోత్సవాలు రాజకీయంగా నష్టం చేయకపోయినా.. ప్రజా సమస్యలపై స్పందన ఆలస్యమైతే ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా సినీ మత్తు వీడి రంగంలోకి దిగాలనే అభిప్రాయమై వ్యక్తమవుతోంది. View this post on Instagram A post shared by Chennai Live (@chennailive1048) -
రాజుల కాలం కాదు.. ముగ్గురంటే ఎలా బాసూ!
“భయ్యా.. పెళ్లి చేసుకున్నావా?”“అవును..”“కంగ్రాట్స్.. సంతోషంగా ఉన్నావా?”“అదే అర్థం కావడం లేదు బాబూ.. సంతోషమో.. సవాలో!”“అదేందన్నా.. ఎందుకలా అంటున్నావ్?”“ఒక్కరిని మెప్పించడమే కష్టంగా ఉంటుంది కదా.. అలాంటిది ముగ్గురి మనసులు గెలవాలంటే రోజులో 24 గంటలు సరిపోతాయా చెప్పు!”ఇది ఏదో సినిమా కథ కాదు.. ఉత్తరప్రదేశ్లో వైరల్గా మారిన ఓ పెళ్లి కథ. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పరిచయమైన ఓ యువకుడు.. ఆ పరిచయమే చివరకు పెళ్లి బంధంగా మారిందని చెబుతున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. ఈ పెళ్లి నిజమేనా? చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)కెమెరామెన్ నుంచి భర్త వరకు..ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాకు చెందిన సరోజ్, సావిత్రి, సంతోష్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లుగా పనిచేస్తున్నారు. వారి వీడియోలకు కెమెరామెన్గా పనిచేసిన వికాస్ అలియాస్ విక్కుతో పరిచయం ఏర్పడింది. మొదట రీల్స్లో భర్త పాత్ర పోషించిన వికాస్.. చివరకు నిజ జీవితంలోనే వారి జీవిత భాగస్వామిగా మారాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. మొదట అంతా ఇదేదో సోషల్ మీడియా స్టంట్ అనుకున్నారు. కానీ ముగ్గురు సోదరీమణులు స్వయంగా స్పందిస్తూ.. “ఇది నిజమైన పెళ్లి. మా ఇష్టంతో తీసుకున్న నిర్ణయం” అని తెలిపారు.విడిపోవడం ఎందుకని..ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరు సొంత రక్తం. మరొకరు.. ఆ ఇంట్లోనే పెరిగారు. చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసే పెరిగామని చెబుతున్నారు. వేర్వేరు కుటుంబాల్లోకి వెళ్లిపోవడం ఇష్టం లేకే ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నామని వెల్లడించారు. “మేమంతా పెద్దవాళ్లమే. మా జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు మాకు ఉంది” అంటూ వారు స్పష్టం చేశారు. వికాస్ కూడా వారి నిర్ణయానికి అంగీకరించాడని, అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వివాహం జరిగిందని తెలిపారు. సరే.. మనసులు కలిశాయి.. మరి చట్టం?ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. “ప్రేమకు హద్దులు ఉండవు” అని వారు చెబుతున్నా.. చట్టానికి మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయి. భారతీయ చట్టాల ప్రకారం హిందూ వివాహ చట్టం ఒక వ్యక్తికి ఒకేసారి ఒక భార్య ఉండే విధానాన్ని గుర్తిస్తుంది. అంటే.. ఇలాంటి వివాహం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా? అధికారికంగా నమోదు జరిగిందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)“రాజుల కాలం వేరు.. ఇప్పటి చట్టాలు వేరు”ఈ పెళ్లిపై ప్రశ్నలు రావడంతో ముగ్గురు సోదరీమణులు పాతకాలపు ఉదాహరణలు చెబుతున్నారు. రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారని పేర్కొంటున్నారు. కానీ న్యాయ నిపుణుల ప్రకారం.. చారిత్రక ఆచారాలు, ప్రస్తుత చట్టాలు ఒకేలా ఉండవు.రీల్ లైఫ్ బాగుంది.. రియల్ లైఫ్ ఎలా?సోషల్ మీడియాలో ఓ వీడియోకు లక్షల వ్యూస్ రావచ్చు. కానీ నిజ జీవితంలో ఒక బంధాన్ని కొనసాగించాలంటే ప్రేమతో పాటు బాధ్యత, అవగాహన కూడా అవసరం. ఇప్పటివరకు ఈ కథలో అందరి మాట ఒక్కటే.. “మేము సంతోషంగా ఉన్నాం. సోషల్ మీడియా ఆదాయంతో కుటుంబాన్ని నడిపిస్తున్నాం. మొగుడి పేరిట కాస్త భూమి ఉంది” అని. కానీ అసలు పరీక్ష మాత్రం ముందుంది. రీల్లో కలిసి కనిపించడం సులువు.. రియల్ లైఫ్లో కలిసి నడవడమే అసలు సవాల్!. -
వినీత్ జోషి బదిలీ.. అంతటి సమర్థుడ్ని ఎలా తప్పించారు?!
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిని బదిలీ చేసి.. ఆయన స్థానంలో నరేశ్ పాల్ గంగ్వార్ను నియమించింది. వినీత్ జోషికి మాత్రం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ బదిలీపై ఇప్పుడు చర్చ మొదలైంది.విద్యా వ్యవస్థలో కీలక ముఖం.. 1992 బ్యాచ్కు చెందిన మణిపూర్ క్యాడర్ ఐఏఎస్ అధికారి వినీత్ జోషి.. కేంద్ర విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో ఒకరు. పరిపాలనలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన.. పరీక్షల నిర్వహణ నుంచి విద్యా విధానాల అమలు వరకు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలకు కేంద్ర బిందువైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తొలి డైరెక్టర్ జనరల్గా వినీత్ జోషి పనిచేశారు. నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలను నిర్వహించే సంస్థ ప్రారంభ దశలో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర విద్యాశాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.CBSE ఛైర్మన్గా మరో కీలక బాధ్యతను చేపట్టిన ఆయన.. దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానాలు, విద్యా ప్రమాణాల రూపకల్పన వంటి అంశాల్లో పనిచేశారు. అంతకుముందు మణిపూర్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృత పరిపాలనా అనుభవం ఉన్న వినీత్ జోషి.. విద్యా రంగంలో కీలక సంస్థలకు నాయకత్వం వహించిన అధికారిగా గుర్తింపు పొందారు.అనుభవజ్ఞుడి స్థానంలో మరో సీనియర్వినీత్ జోషి స్థానంలో నియమితులైన నరేశ్ పాల్ గంగ్వార్ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి. 1994 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఆయన.. కేంద్రంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన గంగ్వార్.. అంతకుముందు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.పరీక్షల నిర్వహణ, విద్యా రంగంలో ప్రత్యేక అనుభవం ఉన్న వినీత్ జోషి స్థానంలో.. పరిపాలనా అనుభవం ఉన్న మరో సీనియర్ అధికారిని కేంద్రం నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నీట్ వివాదం వేళ మార్పునీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులు, ప్రతిపక్షాలు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ఈ బదిలీ జరిగింది. ఈ నేపథ్యంలోనే వినీత్ జోషి రూపంలో తొలి వికెట్ పడిందా?అనే చర్చ జోరుందుకుంది. బాధ్యతను అధికారులపైకి మళ్లించే చర్యగా కొందరు ఈ ‘ట్రాన్స్ఫర్’ను విమర్శిస్తున్నాయి. అయితే వినీత్ జోషితో పాటు మరికొందరి మార్పు జరగడంతో పరిపాలనా మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే.. కేంద్ర వర్గాల నుంచి దానికి కూడా సరైన సమాధానం ఇంకా రాలేదు.ఎందుకిలా?వినీత్ జోషి సుదీర్ఘ అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారి. అయితే పరీక్షల నిర్వహణ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వచ్చిన సమయంలో ఆయన బదిలీ కావడం చర్చకు కారణమైంది. నీట్ వివాదానికి అసలు బాధ్యత ఎక్కడ ఉంది? వ్యవస్థలో లోపాలా? అధికారుల నిర్లక్ష్యమా? లేదంటే విధానపరమైన సమస్యలా? అన్నది భవిష్యత్తు పరిణామాలు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం నీట్ వివాదం మధ్య జరిగిన ఈ ఉన్నత స్థాయి అధికార మార్పు రాజకీయంగా కొత్త చర్చకు తెర తీసే అవకాశం లేకపోలేదు. -
ప్లకార్డ్లో పంచ్లైన్... నిరసనలో రీల్ వైబ్
లాఠీలతో కొడితే థ్యాంక్యూలు చెప్తున్నారు. చెదరగొట్టడానికి వాటర్ కానన్ వాడితే రెయిన్ డాన్స్ చేస్తున్నారు. వాళ్ల పాటే నినాదం. వాళ్ల వ్యంగ్యమే ప్రశ్న. సెల్ఫోన్ పట్టుకున్న సైన్యంలా ఉంటున్నారు. జెన్ జి నిరసనకు ఫార్మాట్ మారింది. సీరియస్ ఇష్యూ + సినిమా పంచ్ + సోషల్ మీడియా... అదే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’.ఢిల్లీ జంతర్ మంతర్లో ‘నీట్’ ప్రశ్నాపత్రానికి సంబంధించి తాజా నిరసనలో టియర్ గ్యాస్ గుప్పుమంది. అది చూసిన ఒక కుర్రాడు వెంటనే ప్లకార్డ్ మీద ఇలా రాశాడు. ‘గురూ... నేను యమునకు ఆ వైపున ఉంటా. ఇంతకన్నా కంపు రోజూ తెలుసు. ఇదసలు లెక్కే కాదు’....అక్కడే ఉన్న మరో కుర్రాడు ఇంకో ప్లకార్డ్ పట్టుకున్నాడు. దాని మీద గాంధీగారి బొమ్మ ఉంది. కింద కామెంట్– ‘ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే సీజన్1 హీరోని రంగంలో దించాల్సి వచ్చింది’... అంటే అహింసామార్గ ప్రదాతనే రంగంలోకి దించాల్సి వచ్చిందని అర్థం.మరో ప్లకార్డ్ ఒకమ్మాయి పట్టుకుంది. దాని మీద కామెంట్– ‘నాకు ఎవరూ ఫండింగ్ చేయలేదు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఉచితానికే అసహ్యించుకుంటున్నా’...తమ నిరసనకు స్పందించని పెద్దలకు చురక వేస్తూ మరో పోస్టర్. దానిపై మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్లోని సర్క్యూట్ పాత్ర. కింద కామెంట్– ఓయ్ సర్క్యూట్. రాంగ్ పర్సన్ని ఎత్తుకొచ్చావ్ స్వామీ.మామూలుగా నిరసనల్లో లాఠీచార్జీ జరిగితే పారిపోతారు. కాని నిరసనకు దిగిన జెన్ జి తరం వెనక్కి తగ్గలేదు. వాటర్ కానన్ కొట్టినా బదులుగా ‘రెయిన్ డాన్స్’ చేశారు. ‘Fitness plan: Running from police’ అని బోర్డు పట్టుకున్నారు.జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్ఒకప్పుడు నిరసన అంటే నల్ల జెండాలు, గొంతు చించుకునే నినాదాలు. కానీ 2026లో జెన్ జి ఆ డెఫినిషన్ను చెరిపేసింది. వాళ్లకు ఆగ్రహం ఉంది. కానీ ఆ ఆగ్రహాన్ని మీమ్గా, రీల్గా, పాటగా మారుస్తున్నారు. పేపర్ లీక్, నిరుద్యోగం, అవినీతి– సీరియస్ ఇష్యూలే. కానీ చెప్పే తీరు మాత్రం క్రియేటివ్. ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, జైపూర్ కావచ్చు... జెన్ జికి కోపం వస్తే స్టయిల్ ఇదే. స్పందించని వ్యవస్థను ఎద్దేవా చేస్తూ ‘నా ఎక్స్ (బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్) కూడా నన్ను ఇంతగా బాధించ లేదు’ అని ప్లకార్డు పట్టుకొని నిలబడుతున్నారు. ఇలా డిజిటల్ కల్చర్ను, మీమ్స్ భాషను నిరసనకు వాడుకోవడాన్నే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’ అంటున్నారు. బాలీవుడ్ పాటలు పాడటం, సంగీత కచ్చేరీలు, ప్రబోధ గీతాల ఆలాపన.. అన్నీ అలౌడ్.గెట్ రెడీ విత్ మీ (G-RWM)జెన్ జి యువతీ యువకులు ఒక దగ్గరకు కూడటానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీ ‘చలో సంసద్’ నిరసన కోసం ప్రిపరేషన్ అంతా సోషల్ మీడియా రీల్స్ నుంచే ప్లాన్ అయింది. ‘గెట్ రెడీ విత్ మీ’ అంటూ రీల్స్ చేస్తూ యువతను సమీకరించారు. టియర్ గ్యాస్ను తట్టుకోవడానికి స్విమ్మింగ్ గాగుల్స్, ఢిల్లీ ఉక్కపోతను తట్టుకోవడానికి మినీ యూఎస్బీ ఫ్యాన్లు, విసనకర్రలు దగ్గర పెట్టుకుని బయలుదేరి వచ్చారు. ఎయిర్పోర్టుల నుంచి, రైలు కంపార్ట్మెంట్లలో నుంచి స్టోరీలు పెడుతూ ఏదో మ్యూజిక్ కాన్సెర్ట్కు వెళ్తున్నంత ఊపుతో దేశ రాజధానికి తరలివచ్చారు. ‘మా గుండెల్లో ఇంక్విలాబ్.. మా చేతుల్లో ఇన్ స్టాగ్రామ్!’ అనే వన్–లైనర్ ఈ తరం నిరసన తత్వం. ధర్మాగ్రహం కలిగి, శాంతియుతంగా మార్పు తేవాలని ప్రయత్నిస్తున్న ఈ తరాన్ని, వ్యంగ్యమనే బాణాలతో ప్రత్యర్థి మనసు మార్చాలని చూస్తున్న ఈ భావితరం స్వరాన్ని ‘నో’ అని నొక్కేస్తే రేపు వాళ్లు మాట్లాడటమే మానేస్తారు. ‘మేమున్నాం’ అని భుజం తడితే ఈ దేశానికి క్రియేటివ్, కరేజియస్ లీడర్స్ దొరుకుతారు. పంచ్లైన్ తో మొదలైన ఈ నిరసన రేపు పాలసీతో అంతం కావాలి. అప్పుడే ఈ ‘సెల్ఫోన్ సైన్యం’ నిజమైన దేశభక్తి సైన్యంగా మారుతుంది. వారి దారి వినూత్నంఢిల్లీలో పోలీసుల లాఠీచార్జి జరిగి, సాయంత్రం వాళ్లు డ్యూటీ దిగుతుంటే లాఠీ దెబ్బలు తిన్న యువతీ యువకులంతా ‘థ్యాంక్యూ సర్... చాలా బాగా డ్యూటీ చేశారు’ అని రోడ్డు పొడుగునా నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇలా చేయడం తిట్టడం కంటే చాలా ఎక్కువ. ‘ఇంటికెళ్లి గర్వంగా ముఖం చూపించండి’ అని కూడా అన్నారు. తమను కొట్టిన వారికే మంచి నీళ్లు అందించడం, గులాబీపూలు ఇవ్వడం జెన్ జి ప్రొటెస్ట్ స్టయిల్. పోలీసులు కొడుతుంటే జాతీయ జెండాను చుట్టుకుని నిలబడటం, సారే జహాసే అచ్ఛా పాడటం.... జనగణమన ఆలపించడం.... కచ్చితంగా గాంధీ మార్గం.– కె -
ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ట్విస్ట్ ఏంటంటే?
మీరట్ : ఒకే వ్యక్తిని ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై మద్దతు, వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోష్ (18) సొంత అక్కాచెల్లెళ్లు. వీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా వీడియోలు రూపొందిస్తూ ఆదాయం పొందుతున్నారు. శ్యామ్పురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కుతో జూలై 17న ఆలయంలో వివాహం చేసుకున్నట్లు వారు ప్రకటించారు. ఆ వికాస్ ఎవరో కాదు.. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లుగా పనిచేస్తున్న ముగ్గురు అక్కా చెల్లెళ్లకు వికాస్ కెమెరా మెన్గా, కంటెంట్గా అనుగుణంగా భర్తగా నటించాడు. ఇప్పుడు ఆ రీల్ భర్తే.. రియల్ భర్తయ్యాడు. వివాహం అనంతరం విడుదల చేసిన వీడియోలో, చిన్నప్పటి నుంచి తాము ఎప్పుడూ కలిసి పెరిగామని, భవిష్యత్తులో కూడా విడిపోవాలని కోరుకోవడం లేదని అక్కాచెల్లెళ్లు తెలిపారు. కుటుంబ సభ్యులు వేర్వేరుగా పెళ్లిళ్లు చేయాలని ప్రయత్నించడంతో, విడిపోవడం కంటే ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.వికాస్ కూడా వారి పరిస్థితిని అర్థం చేసుకుని, వారిని విడదీయకుండా కలిసి ఉండేలా ఈ వివాహానికి అంగీకరించినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతను తన అత్తగారి ఇంట్లోనే నివసిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వివాహంపై స్థానిక హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సనాతన సంప్రదాయాలకు, సామాజిక కట్టుబాట్లకు ఇది విరుద్ధమని పేర్కొంటూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని కోరాయి.ఇదిలా ఉండగా, వివాహం జరిగినట్లు ప్రచారం జరుగుతున్న చాముండ మాత ఆలయ నిర్వహణ మాత్రం ఆ సమయంలో ఆలయంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, అక్కడ ఎలాంటి పూజారి లేరని స్పష్టం చేసింది.వివాదం నేపథ్యంలో స్పందించిన ముగ్గురు సోదరీమణులు మరో వీడియో విడుదల చేశారు. మేము ఏ తప్పూ చేయలేదు. ఇది ప్రేమతో తీసుకున్న నిర్ణయం. మేమంతా పెద్దవాళ్లమే. మేము సంతోషంగా ఉన్నప్పుడు ఇతరులకు సమస్య ఏమిటి? అని ప్రశ్నించారు. అలాగే, పూర్వకాలంలో రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. అప్పుడు అది తప్పుగా పరిగణించలేదే, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?.అని వ్యాఖ్యానించారు.ఈ ఘటనపై పోలీసులు కూడా సమాచారం అందుకున్నట్లు హసన్పూర్ కొత్వాలి ఇన్చార్జ్ రాజేష్ కుమార్ తివారీ తెలిపారు. అయితే ఈ వివాహానికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, అధికారిక నమోదు వంటి విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. -
సీజేపీపై వివాదాస్పద పోస్ట్ : ఎవరీ ఇన్స్టా స్టార్ సోనియా
నీట్ (NEET) పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో రక్షణ విధులు నిర్వహించిన RAF (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) అసిస్టెంట్ కమాండెంట్ సోనియా సెహ్రావత్ సోషల్ మీడియా పోస్ట్పై వివాదం రేగింది.ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలను ఆమె ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.హర్యానాకు చెందిన ఈ అధికారిణికి ఇన్స్టాగ్రామ్లో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్, ఫిట్నెస్, ఆధ్యాత్మికత , బైక్ రైడింగ్కు సంబంధించిన అనేక గ్లామరస్ రీల్స్, పోస్టుల ద్వారా ఆమె నెట్టింట సందడి చేస్తూ ఉంటారు. ఇన్స్టా స్టార్ గా ఎప్పుడూ వైరల్ అవుతుంటారు. తాజాగా సీజేపీ ఆందోళనపై ఒక చనిపోయిన బొద్దింక ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ "తమను తాము బాగుచేసుకోలేని వారు, దేశాన్ని బాగు చేయాలనుకుంటున్నారు" అని క్యాప్షన్ ఇవ్వడం ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ పోస్ట్పై తీవ్ర విమర్శలు రావడంతో ఆమె దానిని తొలగించారు. CJP స్పందిస్తూ, పోలీసుల హింసను సమర్థిస్తూ నిరసనకారులను బొద్దింకలతో పోల్చడం దారుణం. అయినా బొద్దింకలు ఎప్పటికీ చనిపోవు అంటూ ఎక్స్ వేదికగా సీజేపీ కౌంటర్ ఇచ్చింది.ఇదీ చదవండి: రూ. 20 లక్షలు ఖర్చు పెళ్లికి అవసరమా? నెట్టింట తీవ్ర చర్చసోషల్ మీడియా పోస్ట్ ద్వారా సర్వీస్ నిబంధనల ఉల్లంఘించారని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాదు యూనిఫామ్ ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్గా వాడకూడదనే నియమం ఉన్నప్పటికీ, ఆమె తన '3star_Sonia' అకౌంట్లో యూనిఫామ్ ఫోటోనే ఉంచడం గమనార్హం. అయితే సీజేపీ నిరసనల్లో తనకు గాయాలయ్యాయని సోనియా మీడియాకు తెలిపారు. విద్యార్థుల మధ్యలో కొందరు అల్లరి మూకలు, వ్యతిరేక శక్తులు చొరబడి తమపై రాళ్లు, గాజు సీసాలు, చెప్పులు విసిరారని, మహిళలను కాపాడే ప్రయత్నంలో తన చేతికి దెబ్బతగిలి కట్టు పడిందని ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు పెడతా.. జీవితాలను నాశనం చేస్తా : పోలీస్ బెదిరింపు వీడియో వైరల్ -
ఆమె విద్యార్థి కానే కాదు!
జోరున వర్షం కురుస్తోంది.. చుట్టూ పోలీసులు ఉన్నారు.. ఎదురుగా ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లాఠీ దెబ్బలకు భయపడి యువకులంతా చెల్లాచెదురైపోతున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువతి.. ఆ వ్యాన్కు అడ్డుగా నిలబడింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన నిరసనను వ్యక్తం చేసింది. ఆ ఒక్క క్షణం.. ఆమె ధైర్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.నీట్ సహా పోటీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఆందోళనల్లో ఓ యువతి చూపించిన తెగువ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విమర్శకులను పక్కనపెడితే.. ఆమె చూపిన ధైర్యం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా నిలిచిన ఆమె వీడియో వైరల్గా మారింది.“వాళ్లు విద్యార్థులు.. వాళ్ల గొంతు వినాలి”బుధవారం దాదర్లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన నిరసనల్లో రిహియా యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీస్ వ్యాన్ను ఆమె వర్షంలో నిలబడి అడ్డుకున్నారు. హూడీ, క్యాప్ ధరించిన ఆమె వ్యాన్ ముందు నిలబడగా.. చుట్టూ ఉన్న పలువురు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.ఈ ఘటనపై రిహియా మాట్లాడుతూ.. ‘‘పోలీసులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే.. ప్రజల బాధ్యతను ప్రజలమే తీసుకోవాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తాను విద్యార్థిని కాకపోయినా.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్య సరైంది కాదని ఆమె అన్నారు.Meet Rhiya Ahir [IG: rhiyaahir]👏One fearless young woman stood in front of a police van during the Mumbai student protests, refusing to back down.Courage can't be bought. Justice can't be silenced. Salute to her. 🫡🫡 pic.twitter.com/c9oAvhQPeq— زماں (@Delhiite_) July 22, 2026ఒక్క అడుగు.. ఓ సందేశంరిహియా చేసిన పని కేవలం ఓ నిరసన చర్యగా మాత్రమే కాకుండా.. మహిళల ధైర్యానికి ప్రతీకగా మారింది. సాధారణంగా ఆందోళనల్లో మహిళల పాత్రపై ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కానీ రిహియా మాత్రం “ప్రశ్నించేందుకు ధైర్యం ఉంటే మార్పు సాధ్యమే” అనే సందేశాన్ని ఇచ్చారు. ఆమె వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను అభినందించారు. కొందరు ఆమెను “ముంబై హీ(షీ)రో”గా అభివర్ణించారు. ప్రముఖ హాస్యనటుడు రోహన్ జోషి కూడా ముంబై యువత నిరసన తీరును ప్రశంసిస్తూ పోస్టు చేశారు.ఎవరీ రిహియా యాదవ్?రిహియా యాదవ్ కేవలం నిరసనకారిణి మాత్రమే కాదు. ఆమె ఓ నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించారు. అంతేకాకుండా చేతితో తయారు చేసే దుస్తుల కోసం ‘రిహియాసత్’ పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్ను నిర్వహిస్తున్నారు. సృజనాత్మక రంగంలో తనదైన ముద్ర వేస్తూనే.. సామాజిక అంశాలపై కూడా స్పందించడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.మహిళా సాధికారతకు ఓ ప్రతీకగా..మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు పొందడం మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయడం కూడా. రిహియా యాదవ్ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఒక మహిళ ముందుకు వచ్చి నిలబడితే.. అది కేవలం ఒక నిరసన కాదు.. మరెందరికో ధైర్యాన్ని ఇచ్చే సందేశంగా మారుతుందనే దానికి రిహియా ఉదాహరణగా నిలించిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. -
నీట్ను కంగాళి చేసి .. బిడ్డల్ని ఫారిన్లో చదివిస్తావా?
నీట్–యూజీ పరీక్ష నిర్వహణపై నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. పేపర్ లీకేజీ ఆరోపణలు, పరీక్ష పారదర్శకతపై ప్రశ్నల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడిన నీట్ వంటి కీలక పరీక్షపై మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. కాబట్టి నైతిక బాథ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో..నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘‘సామాన్య విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే.. పరీక్ష వ్యవస్థలో ఇలాంటి లోపాలు ఎలా వస్తాయి?’’ అంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు.‘నీట్ను కంగాళి చేసి..’ అంటూ విమర్శలునీట్ వివాదంపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. పరీక్ష నిర్వహణలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియా వినియోగదారులు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. నీట్ కోసం పోరాడుతున్న దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.కుమార్తె సోషల్ మీడియా ఖాతాపై చర్చసోషల్ మీడియాలో విమర్శలు పెరగడంతో ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా ప్రధాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ నిర్ణయానికి కారణం ఇదేనని ఆమె నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొందరు నెటిజన్లు దీనిని నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఒత్తిడిగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు.విమర్శలు ఎటు వరకు?ప్రజా విధానాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని కొందరు అంటున్నారు. అయితే రాజకీయ విమర్శలు కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల వరకు వెళ్లకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. నీట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పరీక్షా ప్రక్రియలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.రాజకీయ రంగు పులుముకున్న నీట్ వివాదంనీట్ పరీక్ష వ్యవహారం ఇప్పుడు కేవలం విద్యార్థుల సమస్యగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ.. ఇంకోవైపు రాజకీయ ఆరోపణలు.. ఇలా నీట్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పరీక్ష వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు కేంద్రం ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. -
సీజేపీ నిరసనకు స్పాన్సర్ ఎవరు?.. అసలు కథ ఇదే
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. జంతర్మంతర్ వద్ద మరో ఆసక్తికర అంశం చర్చకు దారితీస్తోంది. నిరసనకారుల వెనుక ఎవరున్నారు?. అసలు వాళ్లకు మద్దతుగా వస్తున్న ఆహారం, నీరు, ఇతర సహాయ సామగ్రి ఎవరు పంపిస్తున్నారు? నిజంగానే ఆ ఆర్డర్లు ముంబై, హైదరాబాద్లాంటి నగరాల నుంచి ఆర్డర్ చేస్తున్నవేనా?.. ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.సీజేపీ ఆందోళనలు దేశానికి ప్రమాదకరమని.. ఈ ఉద్యమంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడుతున్నాయంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. విదేశీ నిధులు, ముఖ్యంగా పాక్ నుంచి ఫండింగ్ వస్తోందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. అదే సమయంలో నిరసన ప్రాంగణంలో కనిపిస్తున్న పరిణామాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి.జంతర్మంతర్కు వరుసగా.. నిరసన ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఫుడ్ డెలివరీలు వస్తూనే ఉన్నాయి. దాల్ చావల్, రాజ్మా చావల్, టీ, శాండ్విచ్లు, బర్గర్లు, తాగునీటి బాటిళ్లు పెద్ద సంఖ్యలో చేరుతున్నాయి. కొందరు డెలివరీ రైడర్లు వరుసగా రావడం అక్కడ కనిపిస్తోంది. అయితే ఈ ఆహారాన్ని ఎవరు పంపిస్తున్నారో తమకు తెలియదని వాలంటీర్లు చెబుతున్నారు. ఆర్డర్ వచ్చిన ప్రాంతం మాత్రమే తెలుస్తుందని.. పంపించిన వ్యక్తుల వివరాలు తమకు తెలియవని అంటున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సహాయం?నిరసనకారుల ప్రకారం.. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, నాగ్పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి కూడా సహాయం అందుతోందని వారు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు నేరుగా ఉద్యమంలో పాల్గొనలేకపోయినా.. తమ మద్దతును ఆహారం, నీరు వంటి రూపాల్లో తెలియజేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో తాము మద్దతుగా ఆర్డర్లు పెడుతున్నామంటూ కొందరు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. జూలై 20 తర్వాతే పెరిగిన మద్దతుజూలై 20న చలో సంసద్కు సీజేపీ ప్రయత్నించింది. అయితే ఘర్షణల నేపథ్యం, అలాగే నిరసనకారులకు గాయాలు అయిన నేపథ్యంలో.. శాంతియుతంగా జంతర్ మంతర్ వద్దే ఆ మరుసటి రోజు నుంచి ఆందోళన కొనసాగిస్తోంది. ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని అంటోంది. అయితే లాఠీ చార్జి పరిణామాల తర్వాత నిరసనకు ప్రజల నుంచి మద్దతు పెరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. అంతకుముందు వరకు పరిమితంగా ఉన్న సహాయం.. ఆ తర్వాత భారీగా పెరిగిందని వాలంటీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆహార కొరత లేదని, రోజంతా పలు పంపిణీ కేంద్రాలు పనిచేస్తున్నాయని వారు తెలిపారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఇతరులకు కూడా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఒకానొక దశలో.. ఫుడ్ ఆర్డర్లు భారీగా చేరడంతో ఇక భోజనాలు పంపొద్దంటూ CJP తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేసింది.ఫండింగ్పై రాజకీయ ఆరోపణలు.. సోషల్ మీడియాలో చర్చఅయితే ఉద్యమానికి వస్తున్న మద్దతుపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. నిరసనల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందన్న అంశంపై అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కొన్ని వర్గాలు నిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని ఆరోపిస్తుండగా.. మరికొందరు మాత్రం విద్యార్థుల సమస్యపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని వాదిస్తున్నారు.సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫుడ్ సపోర్ట్ను ప్రజల స్వచ్ఛంద మద్దతుగా చూస్తుంటే.. మరికొందరు ఉద్యమానికి నిధుల మూలాలపై స్పష్టత అవసరమని ప్రశ్నిస్తున్నారు.పేర్లు తెలియని దాతలు.. కనిపిస్తున్న మద్దతుప్రస్తుతం జంతర్మంతర్ వద్ద కనిపిస్తున్న దృశ్యం ఏమిటంటే.. పేర్లు వెల్లడించని వ్యక్తుల నుంచి ఆహారం, నీరు వంటి సహాయం నిరసనకారులకు చేరుతోంది. అయితే ఈ సహాయం వెనుక ఎవరు ఉన్నారు? ఇది కేవలం వ్యక్తిగత మద్దతేనా? లేదంటే మరేదైనా వ్యవస్థీకృత సహకారం ఉందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలు ఒకవైపు.. ఆధారాలతో నిరూపితమైన వాస్తవాలు మరోవైపు. సీజేపీ నిరసనల చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చల మధ్య.. జంతర్మంతర్ ఫుడ్ ప్యాకెట్ల కథ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. -
సెలవులో యమధర్మరాజు.. అందుకే బతికాడు!
కోల్కతా: వాహనదారులు డ్రైవింగ్ చేసే అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలంతో అయితే మరింత జాగ్రత్తగా బండి నడపాలి. కొండ ప్రాంతాలు, ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు తప్పవు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రమాదానికి గురైన బైక్ రైడర్.. చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో వైరల్ అయింది.పశ్చిమ బెంగాల్లోని సిలిగురి-డార్జిలింగ్ మార్గంలో కుర్సియాంగ్ వ్యూ పాయింట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నీలం రంగు రెయిన్కోట్ ధరించిన ఓ యువకుడు వర్షంతో తడిసిన ఘాట్ రోడ్లో వేగంగా బైక్పై వేగంగా దూసుకుపోతున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మలుపు వద్ద అతడు వెనక్కి చూడడంతో బైక్ అదుపు తప్పింది. రైడర్ బైక్పై నియంత్రణ కోల్పోయి రహదారి పక్కనున్న రాయిని ఢీకొట్టాడు. ప్రమాదం తీవ్రతకు రైడర్ ధరించిన చెప్పు కూడా గాల్లోకి ఎగిరిపోయినట్లు వీడియోలో కనిపించింది. అనంతరం అతడు కొంతవరకు బైక్ను అదుపులోకి తెచ్చుకున్నప్పటికీ రహదారి మరోవైపు పడిపోయాడు.బైక్ కిందపడగా, రైడర్ పక్కనే ఉన్న గడ్డిపై నిలబడగలిగాడు. వెనుకే వస్తున్న మరో బైక్ రైడర్కు అతడికి సహాయం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అతడికి ఎలాంటి గాయాలు అయ్యాయన్న వివరాలు వెల్లడికాలేదు. బైక్ లోయలోకి పడిపోయివుంటే పరిస్థితి దారుణంగా ఉండేదని వీడియో చూసిన వారు అభిప్రాయడుతున్నారు. బైక్ ఆ క్షణంలో ఆగకపోయి ఉంటే రైడర్ నేరుగా లోయలో పడిపోయేవాడని అంటున్నారు.చదవండి: డింపుల్ వీడియోలు వైరల్.. అఖిలేశ్ యాదవ్ అరెస్ట్నెటిజన్ల స్పందన"సేఫ్ డ్రైవ్.. సేవ్ లైఫ్" పేరుతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోపై పలువురు నెటిజనులు హస్యధోరణిలో స్పందించారు. ఈ రోజు యమధర్మరాజు సెలవులో ఉన్నట్టున్నారు అనే అర్థం వచ్చే హిందీ వ్యాఖ్యను జత చేశారు. షయమధర్మరాజు నుంచి మిస్డ్ కాల్ వచ్చింది.. కానీ రిసీవ్ కాలేదంటూ కామెంట్ పెట్టారు. మరికొందరు నెటిజనులు.. రైడర్ నిర్లక్ష్య డ్రైవింగ్ను తప్పుబట్టారు. "రైడర్ పూర్తిగా తప్పు చేశాడు. ముందు మలుపు ఉండగా వెనక్కి చూస్తూ ప్రయాణించాడు. బాధ్యతగా డ్రైవ్ చేయాలి" అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. "ఘాట్ రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు తలను వెనక్కి తిప్పి చూడకూడదు అనేది మొదటి నియమం" అని మరొకరు తెలిపారు. రీల్స్ చేయబోయి ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నాడని మరికొంత మంది అన్నారు. వర్షాకాలంలో జాగ్రత్తగా వాహనాలు నడపాలని పలువురు హితవు పలికారు. View this post on Instagram A post shared by 𝐀ʀꜱᴜ⚡️ (@aarrshad1) -
వందే భారత్లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీ
తమను ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కన్నబిడ్డలు కృతజ్ఞతగా ఉండటం అనేది ఒక భావోద్వేగ అనుభూతి. అలా కన్నవారి పట్ల అమితమై ప్రేమానురాగాలు చూపించడం, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించేలా చేయడంతోపాటు వారి చిన్న చిన్న కలల్ని గుర్తు పెట్టుకుని మరీ నెరవేర్చే పిల్లలు చాలామందే ఉన్నారు. అలా తన తండ్రిని తొలిసారి 'వందే భారత్' రైలులో తీసుకెళ్లి ఆనందింప చేసిన వీడియో ఒకటినెట్టింట విశేషంగా నిలుస్తోంది.'భుక్కడ్ ముసాఫిర్' అనే ఇన్స్టాగ్రామ్ ఐడీ ఉన్న ఒక ట్రావెలర్, ఇన్ఫ్లుయెన్సర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆ వృద్ధుడైన తండ్రి ప్లాట్ఫామ్పై వేచి ఉండటం, రైలు ఎక్కి తన సీటులో కూర్చోవడం, రైలు కిటికీలోంచి అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ మురిసిపోవడం కనిపిస్తుంది. ఆయన ముఖంలోని నవ్వును చూసి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా కనిపించారు. ఈ సందర్భంగా కుమారుడు మాట్లాడుతూ "ఒకప్పుడు మా నాన్న రూ. 5 ఆదా చేయడం కోసం ఆటో ఎక్కకుండా ఆఫీసుకు నడిచి వెళ్లేవారు. అందుకే ఇప్పుడు నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఆయనకు సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడానికి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నాను" అని ఆ కుమారుడు వీడియో కింద రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Bhukkhad Musafir | Shrikant & Noopur ❤️ (@bhukkhad_musafir) ఇదీ చదవండి: రూ. 5 లక్షల వెండి పాత్ర పొరపాటున చెత్తలో.. చివరికినెటిజన్ల స్పందనఈ వీడియో చూసి నెటిజన్లు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. నిజమైన ఆనందం ఇదే... పిల్లల బాధ్యతలు నెరవేర్చడంలో తమ సంతోషాలను త్యాగం చేసిన తల్లిదండ్రులకు తిరిగి ఆ సుఖసంతోషాలను అందించడం లోనే నిజమైన గెలుపు ఉంది వ్యాఖ్యానించారు. రైలు టికెట్ ధర ఎంతో తండ్రికి తెలిస్తే తిడతారేమో అని కొందరు సరదాగా కామెంట్ చేయడం విశేషం.ఇదీ చదవండి: రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలువందే భారత్, రైల్వే రాయితీలు ఉండవా?వందే భారత్ రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఎటువంటి టికెట్ రాయితీలు ఉండవు. కరోనా సమయంలో ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్లకు ఇచ్చే సాధారణ రాయితీలను కూడా రద్దు చేసింది. అయితే, ఐఆర్సిటిసి (IRCTC)లో క్యాన్సర్, థాలసేమియా, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు లేదా క్షయ (టిబి) వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న రోగులకు, అలాగే దివ్యాంగులకు 75శాతం వరకు టికెట్ రాయితీని అందిస్తోంది. కానీ, ఈ రాయితీలు వందే భారత్ రైళ్లకు వర్తించవు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
ఎనిమిదో వింత.. ఫిఫా కప్పుతో వస్తే టమాటలతో సత్కారమా!
ఒక దేశం తరఫున క్రీడాకారులు లేదా జట్లు ఏదైనా చాంపియన్షిప్ లేదా ట్రోఫీలు కొల్లగొడితే సత్కారాలు, సన్మానాలతో హడావిడి చేస్తుంటారు. మన భారత్ కూడా ఇందుకు అతీతమేమి కాదు. కానీ స్పెయిన్లోని ఒక ప్రావిన్స్లో మాత్రం అక్కడి నుంచి ఏ ఆటగాడు ఎంత పెద్ద ఘనత సాధించినా పూలతో స్వాగతాలు, శాలువాలతో సన్మానాలు గట్రా చేయరు. దీనికి బదులుగా అక్కడి సంప్రదాయం ప్రకారం ఆటగాళ్ల బరువుకు సమానంగా టమాటలను ఇచ్చి సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ఫిఫా గెలిచిన స్పెయిన్ జట్టులో సభ్యులైన మిడ్ఫీల్డర్స్ గావీ, పాబియానా రూయిజ్లను ఇదే తరహాలో సత్కరించడంతో వినూత్న సంప్రదాయం వెలుగులోకి వచ్చింది.ఫిఫా ప్రపంచకప్ చాంపియన్గా నిలిచిన స్పెయిన్ స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో 20 లక్షలకు పైగా అభిమానులు ఒక్కచోట చేరి స్పెయిన్ విజయోత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. 16 ఏళ్ల తర్వాత రెండో ఫిఫా టైటిల్ సాధించిన స్పెయిన్ జట్టు ఆటగాళ్లకు అభిమానులు నీరాజనాలు పట్టారు. దీనికి సంబంధించిన సెలబ్రేషన్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. అయితే స్పెయిన్ మిడ్ ఫీల్డర్స్ ఫాబియన్ రూయిజ్, పాబ్లో గవీరా (గవీ)లకు తమ ఫ్రావిన్స్ అయిన లాస్ పలాసియోస్ వై విల్లాఫ్రాంకా పాలకమండలి కూడా వినూత్నరీతిలో స్వాగతం పలికింది. ఆటగాళ్ల బరువుకు సమానంగా టమాటాలను వారికి అందించడం వైరల్గా మారింది.పురాతన సంప్రదాయం..కాగా ఈ ప్రావిన్స్లో టమాట పంట అధికంగా ఉంటుందట. అందుకే ఆ ప్రావిన్స్ నుంచి ఎవరు ఎలాంటి గొప్ప పనులు లేదా ప్రావిన్స్కు గౌరవం తెచ్చే పనులు చేస్తే టమాటాలను గిఫ్ట్గా అందిస్తారట. ఇలా చేస్తే వారి వ్యాపారం బాగుంటుందని వారి నమ్మకం. తాజాగా ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న రూయిజ్, గావీలను ఇలా సత్కరించారు. అంతేకాదు వీరి ప్రావిన్స్లోని నగ2రంలో ఉన్న రెండు ఫుట్బాల్ మైదానాలకు వీరిద్దరు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ స్టేడియాలకు మారిస్మస్, సాన్ సెబాస్టియన్ అనే పేర్లు ఉన్నాయి. ఫాబియానా రూయిజ్ లాస్ పాలాసియోస్ తరఫున ఫుట్బాల్ కెరీర్ను ప్రారంభించగా, ఆరేళ్ల వయసులోనే గావి లాలి లైయరా బాలోంపె తరఫున ఫుట్బాల్ ఆడడం ప్రారంభించాడు. ఇక ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయాన్ని సాధించి రెండోసారి ఫిఫా టైటిల్ను అందుకుంది. ▶️Esto ya es tradicional en Los Palacios y Villafranca🍅Gavi y Fabián Ruiz reciben su peso en tomates📹@AlvarooSVQ @ZonaMixta__ pic.twitter.com/PyPKDOk99U— BeSoccer (@besoccer_ES) July 21, 2026 Read: అచ్చొచ్చిన గేమ్స్ తొలగింపు.. కామన్వెల్త్లో భారత్ షెడ్యూల్ ఇదే -
కాక్రోచ్ పార్టీకి ఊహించని మద్దతు.. ప్రత్యర్థుల్లో టెన్షన్!
-
అర్జెంటీనా చీటింగ్.. కాక రేపుతున్న రొనాల్డో 'లైక్' వివాదం
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్లో చేతిలో ఓటమి చవిచూసిన అర్జెంటీనా రన్నరప్గా నిలిచింది. అయితే టోర్నీ ఆరంభం నుంచి అర్జెంటీనాకు అనుకూలంగానే వ్యవహరించదన్న విమర్శలు బహిరంగంగా వ్యక్తమయ్యాయి. ఫిఫాలో అర్జెంటీనాతో ఆడిన జట్లలో చాలా జట్లు ఇదే ఆరోపణలు చేశాయి. ఈ వివాదం సోషల్ మీడియాకు కూడా పాకింది. ఫైనల్కు అర్జెంటీనా చేరుకునే క్రమంలో ఫిఫా పక్షపాత ధోరణితో వ్యవహరించిందనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపించాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఒక వీడియోకు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో లైక్ చేయడమే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.దీంతో ఫిఫా వ్యవహారంపై వచ్చిన విమర్శలకు రొనాల్డో కూడా మద్దతు తెలిపాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారంపై జాతీయ మీడియా నిర్వహించిన ఫ్యాక్ట్చెక్లో భిన్నమైన విషయం వెలుగులోకి వచ్చింది. రొనాల్డో అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోకు లైక్ చేసిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని తెలిపింది. అయితే దీనిలో కూడా రెండు అంశాలు దాగున్నాయి. ఒకవేళ రొనాల్డో మొదట లైక్ చేసి ఆ తర్వాత దానిని తొలగించి ఉండొచ్చు. అదీ కాకపోతే మాత్రం ఇది పాత స్క్రీన్షాట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.ఈసారి ఫిఫాలో 48 జట్లు పోటీపడితే అర్జెంటీనాకు వ్యతిరేకంగా ఒక్కసారి కూడా వీఏఆర్ (VAR) నిర్ణయం రాలేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా జట్టుకు ఫిఫా అనుకూలంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా రౌండ్ ఆఫ్-16లో ఈజిప్ట్తో జరిగిన మ్యాచ్ అనంతరం వీఏఆర్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తమ జట్టు చేసిన గోల్ను అనర్హంగా ప్రకటించడం వల్లే ఓటమి ఎదురైందని మ్యాచ్ ముగిసిన తర్వాత ఈజిప్ట్ కెప్టెన్తో పాటు ప్రధాన కోచ్ కూడా ఆరోపించారు. అయితే ఈ విమర్శలను ఫిఫా ఖండిస్తూ, మ్యాచ్ల నిర్వహణలో ఎలాంటి పక్షపాతం ప్రదర్శించలేదని స్పష్టం చేసింది.ఇక ఫిఫా ప్రపంచకప్లో పోర్చుగల్ ప్రయాణం ప్రిక్వార్టర్స్లోనే ముగిసింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడిన రొనాల్డోకు ఇదే చివరిదనే ప్రచారం కూడా జరిగింది. ఈసారి ఫిఫాలో రొనాల్డో కూడా పెద్దగా మెరవలేదు. ఇప్పటిదాకా రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించని రొనాల్డో వయసు 41 ఏళ్లు. దీంతో వచ్చే ఫిఫా (2030) నాటికి రొనాల్డో ఆటకు గుడ్బై చెప్పే అవకాశముంది.Read: అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా! -
నిరసనలకు వెళ్లలేదు.. ర్యాంక్ కొట్టాడు!
నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యా సంస్కరణలు.. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. ఓ టాపర్ మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. తోటి విద్యార్థుల్లా నిరసనల్లో పాల్గొనడం కంటే.. మళ్లీ పరీక్ష రాసి ర్యాంక్ కొట్టడంపైనే ఫుల్గా ఫోకస్ పెట్టాడు. అంతేకాదు ఆ ప్రయత్నంలో విజయమూ సాధించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అతని స్పందన ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.NEET-UG 2026 రీ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్-2 సాధించిన పంషుల్ బన్సల్ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా ఆ సమయంలో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులకు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. నిరసనకు ఎందుకు వెళ్లాలి? దాని బదులు ఇంట్లో చదువుకుని స్కోర్ను మెరుగుపరుచుకోవచ్చు కదా అని తాను అనుకున్నానని చెబుతున్నాడు. మొదట నేనూ బాధపడ్డా..ఢిల్లీ గ్రేటర్ కైలాష్లోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్ విద్యార్థి అయిన పంషుల్.. మొదటి NEET పరీక్ష రద్దు కావడంతో తొలుత తీవ్ర నిరాశకు గురయ్యాడట. "మొదట బాధగా అనిపించింది. నేను బాగా రాశానని, మెడికల్ సీటు వస్తుందని అనుకున్నాను. కాసేపటికి దీనినే మరో అవకాశం లాగా మార్చుకోవాలనుకున్నా. ఆ ఫలితం ఆధారంగా నా పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపాడు.706 నుంచి 715 మార్కులకు..నీట్ మొదటి పరీక్షలో పంషుల్ 706 మార్కులు సాధించాడు. అయితే రీ ఎగ్జామినేషన్లో అతని స్కోర్ను 715 మార్కులు. ఎగ్జామ్లో 99.9999 పర్సంటైల్తో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సాధించాడు. ఈ విజయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు కూడా తెలియజేశారు. అదనంగా లభించిన సమయాన్ని కొత్తగా చదవడానికి కాకుండా.. తన పాత ప్రణాళికనే మరింత క్రమశిక్షణతో కొనసాగించానని చెప్పాడు. "నా షెడ్యూల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇదే రొటీన్ను కొనసాగించాను. చివరి నెలన్నరలో చేయగలిగినంత కష్టపడ్డాను. మిగతాది దేవుడిపై వదిలేశాను" అని పంషుల్ తెలిపాడు.నిరసనలపై నో కామెంట్NEET పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇప్పుడు నిరసనలపై తన అభిప్రాయం చెప్పాలని అడిగినప్పుడు.. పంషుల్ స్పందించేందుకు నిరాకరించాడు. "దానిపై నేను వ్యాఖ్యానించను" అని స్పష్టం చేశాడు.#NDTVExclusive | "I thought of the situation as an opportunity to improve my score. So I thought, why should I go to the protest? Instead I could be studying at home and improving my skill and score": NEET UG 2026 topper Panshul Bansal to NDTV's @ShivAroor on #IndiaMatters pic.twitter.com/G8c7O2KXHn— NDTV (@ndtv) July 21, 2026పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన NEET-UG పరీక్షను తొలుత మే 3న నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న పరీక్షను రద్దు చేశారు. అనంతరం జూన్ 21న భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య రీ ఎగ్జామ్ నిర్వహించి.. జులై 16న ఫలితాలు ప్రకటించారు.అయితే పంషుల్ బన్సల్ విజయ ప్రయాణంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తన లక్ష్యంపై దృష్టి పెట్టి ర్యాంక్ సాధించిన అతని కృషిని పలువురు ప్రశంసిస్తుండగా.. మరోవైపు NEET వివాదంలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల పరిస్థితులను కొందరు గుర్తు చేస్తున్నారు.పంషుల్ వంటి సౌకర్యాలు ఉన్న విద్యార్థులకు మరో అవకాశం లభించడం ఒక కోణమైతే.. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు పరీక్షా వ్యవస్థలోని లోపాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళనకారులు చెబుతున్నారు. పేపర్ లీక్ వ్యవహారం ఇప్పటికే ఒత్తిళ్లతో ఉన్న విద్యార్థుల్లో అసంతృప్తికి చివరి కారణంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సోషల్ మీడియా పోస్టులపైనే ఎందుకింత శ్రద్ధ?
కర్ణాటక: సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు వేగంగా కేసులు నమోదు చేసుకుని చర్యలు తీసుకుంటున్న వైనంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎన్నో గంభీరమైన కేసులు ఉండగా, సోషల్ మీడియా పోస్టులపైనే ఎందుకింత శ్రద్ధ అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఏమిటీ కేసు? వివరాలు.. బంట్వాళ బస్టాండులో ఒక యువతి హత్య జరిగితే, సోషల్ మీడియాలో న్యాయ విద్యార్థి కిరణ్ ఆరాధ్య పోస్టు పెట్టాడు. దీంతో అతనిపై బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ కిరణ్ హైకోర్టును ఆశ్రయించాడు. కిరణ్ తరఫు లాయర్, ఎంపీ తేజస్వి సూర్య వాదిస్తూ ఊహాజనితాల మీద ఎఫ్ఐఆర్ను నమోదు చేశారని, అందులో ఏ మతాన్ని కించపరచలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ, కేసు నమోదు చేసి రెండు రోజులే అయ్యింది, పిటిషనర్కు పోలీసులు ఇంకా నోటీసు ఇవ్వలేదని తెలిపారు. పిటిషనర్కు ఎటువంటి ఊరట కల్పించరాదని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, రాష్ట్రంలో ఎన్నో తీవ్రమైన కేసులు ఉండగా, సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు శ్రద్ధ చూపడం సమంజసం కాదని, కేసు పూర్తిగా విచారణ జరిగే వరకూ పిటిషనర్పై చర్యలు తీసుకోరాదని ఆదేశించారు. -
ఆలయ ఆవరణలో త్రిష-విజయ్ల ఫ్లెక్సీ.. కేసు నమోదు
తమిళనాడులో ఫ్లెక్సీ కలకలం రేగింది. సేలం జిల్లా ఆత్తూర్లో ఏర్పాటు చేసిన ఓ ఆలయ ఉత్సవ బ్యానర్ వివాదానికి దారితీసింది. ఆ బ్యానర్లో ప్రముఖ నటి త్రిషను అమ్మవారి రూపంలో చిత్రించడం, ఆ పైన తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్ ఫొటోను కూడా ‘సిగ్నేచర్ ఫోజు’తో ఉంచడంపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.పెరియా మారియమ్మన్ ఆలయ ఆడి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఫ్లెక్సీలో త్రిష అమ్మవారి గెటప్లో కూర్చున్నట్లు ఉంది. ఆ పైన విజయ్ అసెంబ్లీలో చేసిన సిగ్నేచర్ ఫోజుతో ఉన్నారు. ఆ పక్కనే ఇద్దరు అభిమానుల ఫొటోలు చెరో వైపు ఉన్నాయి. కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినీ నటిని దేవతా రూపంలో చూపించడం సరైంది కాదన్నారు. వివాద నేపథ్యంలో రాత్రికి రాత్రే బ్యానర్ను అక్కడి నుంచి తొలగించారు. ఆ ప్లేస్లో మరొకటి ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే తమ దాకా విషయం రావడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేయడం, అందునా అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యానర్ ఏర్పాటు చేసిన దుకాణ యజమాని గోకుల్, దానిని అమర్చిన చంద్రుపై చర్యలకు సిద్ధమయ్యారు. వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. విజయ్-త్రిష ఫొటోలపై చర్చఇటీవల తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి. ఎన్నికల ముందే వీళ్ల బంధం బయటపడడం, ఎన్నికల విజయంపై విజయ్కు త్రిష అభినందనలు తెలియజేయడం, ప్రమాణస్వీకారం నాడు చేసిన హడావిడి.. పుట్టినరోజు వేడుక జరపడం ఇలా ఉండగానే ఈ నేపథ్యంలో ఆలయ ఉత్సవ బ్యానర్లో ఇద్దరి ఫొటోలు కలిసి కనిపించడం మరోసారి ఆసక్తిని రేపింది. అదే సమయంలో ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల ఫొటోలను విచ్చలవిడగా వాడడం, అభిమానుల బ్యానర్ సంస్కృతిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. -
రోడ్డుపక్కన చిన్న ఫుడ్ స్టాల్.. మరీ ఇంతగా సంపాదిస్తున్నాడేంటీ?
రోడ్డుపక్కన ఫుడ్ స్టాల్ నడిపే వ్యక్తి నెలవారీ ఆదాయం గురించి తెలుసుకున్న ఓ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఇందుకు సంబంధించిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంప్రదాయ ఉద్యోగాలపై ఉన్న అభిప్రాయాలు, రోడ్డుపక్కన వ్యాపారం చేసే వారిపై ఉన్న భావనలపై చర్చ మొదలయ్యేలా చేసింది ఈ వీడియో. ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన వీడియోలో ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ చిరుతిళ్లు అమ్మే ఫుడ్ స్టాల్ను సందర్శించింది. అతను నెలకు సుమారు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నాడని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. తన జీతం మాత్రం చెప్పుకునే స్థాయిలో లేదని సరదాగా చెప్పింది."రోడ్డుపక్కన బండి పెట్టి అమ్మితే ఏమి వస్తుంది? అని అనుకునే వారు ఈ వీడియో చూసి తమ ఆలోచన మార్చుకోవాలి" అని డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కోమల్ నేగి ఇన్స్టాగ్రామ్లో రాసింది. వీడియో ప్రారంభంలో కోమల్ నేగి రోడ్డుపక్కన ఉన్న ఒక ఫుడ్ స్టాల్ను చూపించింది. అక్కడ ఒక వ్యక్తి మ్యాగీ, ఛోలే-కుల్చే వంటి వంటకాలు అమ్ముతున్నాడు. అతనితో మాట్లాడిన సమయంలోనే నెలకు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పాడు.సోషల్ మీడియాలో స్పందన ఈ వీడియో చూసిన చాలామంది నవ్వు ఎమోజీలతో స్పందించారు. ఒకరు "అతను నాకు ఉద్యోగం ఇస్తాడా?" అని కామెంట్ చేశారు. ఇంకొకరు "ఆదాయపు పన్ను లేదు, అద్దె లేదు" అని పేర్కొన్నారు. ఇంకొకరు "అతను కష్టమైన శారీరక శ్రమ చేస్తున్నాడు. నువ్వు చేయడం లేదు. ఈ పోలిక సరైంది కాదు" అని రాశారు. View this post on Instagram A post shared by Komalnegi🦋 (@bykomal_raw) -
రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పనిచేయను
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేతిలో ఫోన్, అందులో సోషల్ మీడియా అకౌంట్స్ ఆన్లో ఉండాల్సిందే. సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడా లేదు. అంతా ఇదే చేస్తున్నారు. చాలా తక్కువమంది నటీనటులు మాత్రమే దీనికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్లలో మలయాళ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఒకరు. రూ.100 కోట్లు ఇచ్చినా గానీ సోషల్ మీడియాలోకి రానని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకు గల కారణాన్ని వెల్లడించింది.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన 'బిగ్బాస్' శుభశ్రీ)'నావి మార్ఫింగ్, డీగ్రేడింగ్ చేసిన ఫొటోలు చూసి షాకయ్యాను. దాని నుంచి తేరుకోవడానికి చాలా టైమ్ పట్టింది. రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా నేను సోషల్ మీడియాకు దూరంగానే ఉంటాను. నా సినిమాల గురించి వచ్చే వార్తలు, ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి మాత్రం నా పెంపుడు కుక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఉపయోగిస్తాను. ప్రస్తుతం నేను కొత్త వ్యక్తులని కలవడంలో నిజమైన ఆనందాన్ని పొందుతున్నాను' అని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చింది.ఈమె నటించిన తమిళ మూవీ 'గట్ట కుస్తీ 2' రెండు వారాల క్రితం థియేటర్లలోకి వచ్చింది. స్పోర్ట్స్ కామెడీ జానర్లో తెరెకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో గాడ్సే, అమ్ము తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు'లో నటిస్తోంది. మరోవైపు పీరియడ్ తమిళ మూవీతో పాటు '#లవ్', 'తీవినై పోట్రు' అనే వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తోంది. (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)#AishwaryaLekshmi: "Even if I'm offered ₹100 crore, I will never return to social media."She revealed that morphed and degrading photos deeply affected her, adding that leaving social media finally gave her peace of mind. pic.twitter.com/tQn2LHhAfT— Filmyscoops (@Filmyscoopss) July 21, 2026 -
వైన్స్ షాపులో ఐదు గంటల హైడ్రామా! ప్రాణాలకు తెగించి..
ఉదయం వేళ.. అంతా సాధారణంగానే సాగుతోంది. షాప్లో పనులు చేసుకుంటున్న సిబ్బందికి కాసేపట్లో ఎదురుకాబోయే ప్రమాదం గురించి అసలు ఊహే లేదు. ఇంతలో ఒక్కసారిగా.. ఆకోశ్రంతో ఉన్న ఓ చిరుత అక్కడికి దూసుకొచ్చింది. క్షణాల్లోనే ప్రశాంతంగా ఉన్న ప్రదేశం భయానకంగా మారిపోయింది. ఎదురుగా క్రూర మృగం.. తప్పించుకునే అవకాశం దాదాపు లేదు. అప్పటికే చిరుత దాడిలో గాయపడిన ఓ వ్యక్తి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అయితే.. ఆ సమయంలో ఓ సేల్స్మెన్ చూపించిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాణాలకు తెగించి తీసుకున్న ఒక్క నిర్ణయంతో అతడు పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ ఘటన రాజస్థాన్లోని టోంక్ జిల్లా టోడారాయ్సింగ్ పట్టణంలో సోమవారం (జూలై 20) ఉదయం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో స్థానిక ప్రాంతంలోని పొదల్లో చిరుత దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. అటవీ వాలంటీర్ రాకేష్ దాన్ని గుర్తించి దగ్గరకు వెళ్లాడు. చిరుతను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండగానే.. అది ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. చిరుత దాడితో స్థానికులు అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికే ఆ జంతువు అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలోని ఓ లిక్కర్ షాప్ వైపు పరుగులు తీసింది.చిరుత ఒక్కసారిగా షాప్లోకి దూసుకురావడంతో అక్కడి వారంతా షాక్కు గురయ్యారు. మొదట షాప్ యజమాని ఫతే లాల్ కోలీపై అది దాడి చేసింది. ఆ తర్వాత లోపల ఉన్న సేల్స్మెన్ సంజయ్ గుర్జర్పై విరుచుకుపడింది. చిరుత దాడిలో సంజయ్కు ముక్కు, భుజం, చేతులపై గాయాలయ్యాయి. అయినప్పటికీ అతడు భయంతో కుప్పకూలిపోలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే తెగువ చూపి సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు.చిరుతను బయటకు వదిలేస్తే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ప్రమాదం తప్పదని సంజయ్ గ్రహించాడు. ఆ క్షణంలో తన ప్రాణాలను పణంగా పెట్టి షాప్ షట్టర్ను కిందికి దించాడు. దీంతో చిరుత లోపలే చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. జైపూర్ నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రప్పించారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఆపరేషన్ తర్వాత చిరుతకు మత్తు మందు ఇచ్చి సురక్షితంగా పట్టుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. షాప్లో చిరుత సంచరించిన తీరు, రెస్క్యూ ఆపరేషన్, సేల్స్మెన్ ధైర్యం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు నాలుగు కాళ్ల మృగం.. మరోవైపు గాయాలతో ఉన్న పరిస్థితి.. అయినప్పటికీ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయంతో సంజయ్ పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. చిరుతను బంధించింది అటవీ శాఖ బృందమే అయినా.. ఆ ఐదు గంటల హైడ్రామాలో తొలి హీరో మాత్రం సేల్స్మెన్ సంజయ్ గుర్జర్నే అని స్థానికులు ప్రశంసిస్తున్నారు. Leopard attacks man inside wine shop in Todaraisingh, Tonk, Rajasthan caught on CCTV pic.twitter.com/agUYH14EBL— Ghar Ke Kalesh (@gharkekalesh) July 20, 2026 -
‘కేతన్ నా హీరో.. చాలా కేరింగ్’.. పొగడ్తలు గుప్పించిన సియా!
ఒకప్పుడు ప్రేమ, అనుబంధానికి గుర్తుగా నిలిచిన ఓ వీడియో.. ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. పుణే లోహ్గఢ్ కేసులో నిందితురాలు సియా గోయల్ కేతన్ అగర్వాల్ను పొడుగుతూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను నెటిజన్లు చూసి నెటిజన్లు.. పాపం కేతన్, అంత మంచోడిని చంపడానికి చేతులెలా వచ్చాయి? అని సియాను తిట్టుకుంటున్నారు. ఆ వీడియో కేతన్-సియా నిశ్చితార్థ వేడుకలోది. వేదికపై కేతన్, సియా కలిసి ఉన్న సమయంలో అక్కడున్న ఒకావిడ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అప్పటికే సియా కేతన్ను తన హీరో అని, ఆ హీరో నెంబర్ 1 అని వ్యాఖ్యానించింది. “కాబోయే భర్తగా కేతన్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అతడిని మీ హీరో నంబర్ వన్గా భావించడానికి కారణం?” అని ప్రశ్నించారు. దీనికి సియా చిరునవ్వుతో.. “కేతన్ చాలా కేరింగ్, చాలా మంచివాడు” అంటూ సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న కేతన్ నవ్వుతూ స్పందించగా.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. అప్పట్లో ప్రేమగా కనిపించిన ఈ క్షణాలు.. ఇప్పుడు కేతన్ మృతి కేసు నేపథ్యంలో మరో కోణంలో చర్చకు వస్తున్నాయి.'Ketan Agarwal Is Caring & Kind,' Said Siya Goyal During Engagement Ceremony pic.twitter.com/xMy79rhfQg— Pune First (@Pune_First) July 20, 2026పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ.. పుణె రూరల్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వివాహంపై అసంతృప్తితో ఉన్న సియా గోయల్ (20), ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫొటో షూట్ పేరుతో కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. అక్కడి లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అంతకు ముందు(జూన్ 14న) ఇదే ప్రాంతంలో కేతన్ను చంపేందుకు మరోసారి ప్రయత్నం జరిగినట్లు కూడా తెలుస్తోంది. పుణే కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. కాబోయేవాడిని ప్రియుడి సాయంతో హతమార్చడం.. రకరకాల చర్చలకు దారి తీసింది. ఈ తరుణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. కేతన్ను తోసి చంపింది సియానా? లేదంటే చేతనా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో పోలీసులును సియా, చేతన్లు ఏ వివరాలు చెప్పుకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. పోలీసులు ఆమెను విచారణ కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్తున్న సమయంలోనూ మీడియా ముందు ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ వస్తోంది. సియా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలంటున్న ఆమె కుటుంబం.. మరోవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. అయితే దర్యాప్తు ఆలస్యం అవుతుండడంతో ఆమె బెయిల్ దక్కవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది కేతన్ కుటుంబం. సియా కేతన్ కలిసి దిగిన ఫొటోలు, సరదాగా గడిపిన వీడియోలు.. ఇప్పుడు “కేతన్ మంచోడు.. కేరింగ్” అని చెప్పిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంత మంచోడికి విషయం చెబితే సరిపోయేది కదా.. ఎందుకు చంపేశావ్? అని కామెంట్లలో సియాను తిట్టి పోస్తున్నారు. -
సోషల్ మీడియా మోహం.. సంసారాల్లో క్రైమ్ దాహం!
సాక్షి, అమరావతి: నిండునూరేళ్లు కలిసి జీవించాల్సిన దాంపత్య బంధాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. అనుమానాలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆస్తి వివాదాలు సైతం చివరికి దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. దీంతో కుటుంబ వ్యవస్థ విచి్ఛన్నం అవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భార్యలు భర్తలను హత్య చేస్తున్న ఘటనలు యావత్ సమాజాన్ని విస్తుగొలుపుతున్నాయి.ముఖ్యంగా భర్తలను చంపడంలో మహిళలు అనేక సరికొత్త మార్గాలను ఎంచుకోవడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. ప్రెషర్ కుక్కర్, నీళ్ల డ్రమ్, బాత్రూమ్ టైల్స్ కింద, గ్యాస్ సిలిండర్లో ఇలా అనేక చోట్ల భర్త మృతదేహాలను దాచిపెట్టడం భీతిగొలుపుతోంది. కొండపై నుంచి తోసేయడం, తినే ఆహారంలో విషం కలపడం, విషం నింపిన ఇంజక్షన్లు చేయడం, కత్తితో పొడవడం, గొంతు నులిమి చంపేయడం, కిరాయి వ్యక్తులతో హత్య చేయించడం వంటి మార్గాలను ఎంచుకుని మరీ కట్టుకున్న వాడిని కడతేర్చుతున్నారు. ప్రాణం తీస్తున్న పరిచయాలు.. సామాజిక మాధ్యమాల్లో ఏర్పడుతున్న పరిచయాలు తీవ్ర నేరాలకు పురిగొల్పుతున్నాయి. కొంత కాలం పరిచయాలే బంధాలుగా ఏర్పడి, అప్పటికే ఉన్న బంధాలను తెంచుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. ఏపీలోని ప్రకాశం, అనకాపల్లి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో, తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో భర్త హత్య కేసులు ఇటీవల సంచలనం సృష్టించాయి.చాలా ఘటనల్లో వివాహేతర సంబంధాలు, అనుమానాలు, కుటుంబ కలహాలే ప్రధాన కారణాలుగా తేలాయి. హత్యలకు కుటుంబ, వ్యక్తిగత వివాదాలే కారణమని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్యులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, హత్యలకు గురైన కేసుల్లో 36.36 శాతం కుటుంబ, ఆస్తి వివాదాలు, 29.55 శాతం వివాహేతర సంబంధాల వల్ల జరిగినట్లు తేలింది. బాధితులు, నిందితులు ఎక్కువగా ఒకరికొకరు పరిచయం ఉన్నవారేనని అధ్యయనం వెల్లడించింది. విస్మయం కలిగిస్తున్న అధ్యయనాలు.. వివాహేతర సంబంధాలపై గ్లీడెన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. దేశంలోని టైర్–1, టైర్–2 నగరాలకు చెందిన 1,503 మంది వివాహితులపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం 37 శాతం మంది ప్రేమలో ఉన్నప్పటికీ భాగస్వామిని మోసం చేయడం సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. 55 శాతం మంది తమ జీవిత భాగస్వామి కాకుండా మరొకరితో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.పది మందిలో ఆరుగురికిపైగా వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపినట్లు సర్వే పేర్కొంది. అలాగే పురుషుల్లో 59 శాతం, మహిళల్లో 53 శాతం మంది తమ భాగస్వామిపై అవిశ్వాసం లేదా అనుమానం వ్యక్తం చేశారు. 44 శాతం మంది సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్ల ద్వారా పరిచయమైన వారితో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు వెల్లడైంది. పెద్ద నగరాలు, చిన్న పట్టణాల్లో ఈ ధోరణి దాదాపు ఒకే స్థాయిలో ఉండటం గమనార్హం. కుటుంబాలు ఛిన్నాభిన్నం.. మానసిక ఆరోగ్య వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం, సోషల్ మీడియా ప్రభావం, మద్యం వ్యసనం, ఆర్థిక ఒత్తిళ్లు, పరస్పర అనుమానాలు హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయి. విభేదాలు వచ్చినప్పుడు కౌన్సెలింగ్, కుటుంబ పెద్దల మధ్యవర్తిత్వం లేదా చట్టబద్ధమైన విడాకుల వంటి మార్గాలను ఎంచుకోవాల్సిన చోట హత్యలకు పాల్పడటం అత్యంత ప్రమాదకర ధోరణిగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. భర్త హత్యకు గురైతే ప్రాణం కోల్పోయేది ఒక్కరే కాదు. తల్లిదండ్రులు కుమారుడిని, పిల్లలు తండ్రిని కోల్పోతారు. నేరానికి పాల్పడిన భార్య జైలుకు వెళ్లడంతో కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నమవుతుంది. నమ్మకం, పరస్పర గౌరవం, సంభాషణ, సమస్యలకు శాంతియుత పరిష్కారాలే ఇలాంటి విషాదాలను నివారించే మార్గాలని నిపుణులు సూచిస్తున్నారు. -
సిఎం చంద్రబాబు సొంత జిల్లాలో దివ్యాంగులకు కరువైన రక్షణ
సాక్షి, చిత్తూరు: సిఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో దివ్యాంగులకు రక్షణ కరువైంది. చిత్తూరు జిల్లాలో దివ్యాంగులపై జరిగిన దాడి ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐరాల మండలం ఎర్రిపల్లి పంచాయితీ కంపల్లె గ్రామంలో ఈనెల 8న దివ్యాంగురాలు సుమతిపై రాజేంద్ర రెడ్డి విచక్షణారహితంగా దాడి చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన 48 సెంట్ల స్థల వివాదం నేపథ్యంలో చోటుచేసుకుంది. తహశీల్దార్ పోలీసు బందోబస్తు ఇవ్వమని కోరినా పట్టించుకోకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. బాధితురాలు సుమతి దివ్యాంగుల జె.ఏ.సి ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కాగా, తోటి దివ్యాంగురాలు విజయకు జరుగుతున్న అన్యాయంపై మద్దతుగా వచ్చిన ప్రతినిధుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. దివ్యాంగులపై ఇంత దాష్టీకమా?!... రక్షణ కల్పించాల్సిన సిస్టమ్ ఎక్కడుంది? 😡👇సమాజంలో అణగారిన వర్గాలకు, దివ్యాంగులకు అండగా నిలవాల్సిన చట్టాలు, రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలు ఎటు పోయాయి? చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఉదంతం చూస్తే చట్టాలు ఎవరికోసం పని చేస్తున్నాయనే… pic.twitter.com/b9IYHsOta6— MA-VI-GUN KAREEM (@ysrcp_vjw) July 19, 2026ఐరాల పోలీస్ స్టేషన్లో దివ్యాంగుల జె.ఏ.సి ప్రతినిధులు ఫిర్యాదు చేసినప్పటికీ, ఈనెల 11న రాజేంద్ర రెడ్డి ఫిర్యాదు ఆధారంగా 8 మంది దివ్యాంగులపై కేసు నమోదు చేయడం బాధితులను మరింత కలవరపెట్టింది. రేపు(సోమవారం) దివ్యాంగుల జె.ఏ.సి ప్రతినిధులు చిత్తూరు జిల్లా ఎస్పీని కలవనున్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో దివ్యాంగులకు రక్షణ లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటనకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. -
ఫేస్బుక్ డౌన్.. సేవల్లో అంతరాయం!
ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఫేస్బుక్ సేవల్లో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు డౌన్డిటెక్టర్ వెబ్సైట్ వెల్లడించింది.ఫేస్బుక్ అంతరాయం కారణంగా.. చాలా మంది వినియోగదారులు తమ ఫేస్బుక్ ఖాతాల్లోకి లాగిన్ కాలేకపోయినట్లు వెల్లడించారు. కొందరు లాగిన్ అయినప్పటికీ పోస్టులు చేయడం, ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేయడం, న్యూస్ ఫీడ్ను చూడడం వంటి ముఖ్యమైన ఫీచర్లు పనిచేయలేదని పేర్కొన్నారు.ఫేస్బుక్ మెసెంజర్ సేవల్లో కూడా కొంతమందికి అంతరాయం కలిగింది. మెసేజస్ పంపడం, స్వీకరించడం వంటి సౌకర్యాలు సరిగా పనిచేయకపోవడంతో వినియోగదారులు అసౌకర్యానికి గురయ్యారు. బహుశా సాంకేతిక సమస్యల కారణంగా ఈ అంతరాయం కలిగి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.ఈ సమస్య భారతదేశంతో పాటు.. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, , టర్కీ మొదలైన దేశాల్లో కూడా తలెత్తింది. దీంతో ఇక్కడ ఫేస్బుక్ సేవలు నిలిచిపోయాయని ఫిర్యాదులు వచ్చాయి. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సాంకేతిక సమస్యగా భావిస్తున్నారు. అయితే సంస్థ.. ఈ సమస్యకు గల కారణం ఏమిటనే విషయాన్ని వెల్లడించలేదు.User reports indicate problems with Facebook since 3:55 AM EDT.How is it affecting you? #FacebookDownhttps://t.co/8wgYQLKxCu— Downdetector (@downdetector) July 19, 2026 -
ట్రంప్ పోస్టులు ముందుగా చూడాలంటే రూ.85 లక్షలు ఇవ్వాలి..
వాషింగ్టన్: ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ‘పెయిడ్ డేటా సర్వీస్ ప్లాన్’ను ప్రకటించింది. దీని ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ట్రూత్ సోషల్లోని ప్రముఖ ఖాతాల పోస్టులు అత్యంత వేగంగా అందుతాయి. ట్రూత్ ఏపీఐ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్.. ప్రభావం ఎక్కువగా చూపే 10 ఖాతాల కంటెంట్ను బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లు, ట్రేడింగ్ సంస్థలకు సాధారణ యాప్ నోటిఫికేషన్ల కంటే వేగంగా అందిస్తుంది. ట్రూత్ ఏపీఐ సేవ ధర $60,000 నుంచి $100,000 మధ్య (సుమారు రూ.51 లక్షల నుంచి రూ.85 లక్షల మధ్య) ఉండొచ్చని సమాచారం.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కొన్ని సెకన్ల ఆలస్యం కూడా ఆర్థికంగా కొందరికి నష్టాలను తెచ్చిపెడుతుంది. అటువంటి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వీస్ రూపొందించారు. తాజా సమాచారం వచ్చిన వెంటనే చర్యలు తీసుకునే ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ సంస్థలు ఇందులో ఉన్నాయి. ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్లు ముందే నిర్ణయించిన నియమాల ఆధారంగా ఆటోమేటిక్గా కొనుగోలు, అమ్మకాలు చేసే విధానం.ఇప్పటి వరకూ ఇలాంటి సంస్థలు ట్రూత్ సోషల్ను అందరిలాగే గమనించేవి లేదా ప్లాట్ఫాం నిబంధనలకు విరుద్ధంగా డేటాను సేకరించేవి. ట్రూత్ ఏపీఐ ఆ లోటును భర్తీ చేసే పరిష్కారంగా తీసుకొచ్చారు. సోషల్ మీడియా వ్యాపారానికి బయట కొత్త ఆదాయ మార్గాన్ని ఓపెన్ చేయాలనే లక్ష్యంతో డేటా లైసెన్సింగ్లో ట్రంప్ మీడియా వేసిన తొలి అధికారిక అడుగు ఇదే. ప్లాట్ఫాంలో వచ్చే పోస్టులకు మార్కెట్లు ఇప్పటికే స్పందిస్తున్నాయని, వేగంగా సమాచారం పొందాలనే డిమాండ్ పెరుగుతుందని తాత్కాలిక సీఈవో కెవిన్ మెక్గర్న్ తెలిపారు.ఇందుకే పోస్టులను వేగంగా చదవాలి ట్రంప్ పోస్టులు సుంకాల ప్రకటనల నుంచి చైనా వాణిజ్య విధానంపై వ్యాఖ్యల వరకు ఎన్నో సందర్భాల్లో మార్కెట్లపై ప్రభావం చూపించాయి. 2025 ఏప్రిల్ 9న కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన పోస్టు చేసిన వెంటనే వాల్ స్ట్రీట్ సూచీలు భారీగా ఎగిశాయి.మార్కెట్ వర్గాలు కూడా ఈ ప్రభావాన్ని అంగీకరిస్తున్నాయి. ట్రూత్ సోషల్లో మార్కెట్ను నిరంతరం ప్రభావితం చేసేది ట్రంప్ ఒక్కరేనని ఒక ఫండ్ మేనేజర్ చెప్పారు. అందుకే ఆయన పోస్టులు ముందుగానే అందడం అత్యంత విలువైనదిగా భావిస్తున్నారు.అయితే ఈ చెల్లింపు సర్వీసు అసమానతలను పెంచుతుందని విమర్శకులు అంటున్నారు. వేగంగా సమాచారం అందడం వల్ల భారీ నిధులు ఉన్న సంస్థలకు, చిన్న సంస్థలపై పైచేయి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. సెనేటర్ రాన్ వైడెన్ ఈ చర్య వల్ల ట్రంప్ కుటుంబానికి ఆర్థిక లాభం చేకూరడంతో పాటు వాల్ స్ట్రీట్ లాభాలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్థాయుల వారీగా డేటా అందించడం కొత్త విషయం కాదు. ఇది సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించకపోవచ్చు. అయినా సమాన అవకాశాలపై సందేహాలు తలెత్తొచ్చు. ఈ సర్వీసు రోజంతా పర్యవేక్షణ సౌకర్యంతో పాటు 2022 నుంచి ఉన్న పాత పోస్టుల భద్రపరిచిన రికార్డులను కూడా అందిస్తుంది. ఆగస్టు 1న ప్రారంభం కానున్న ఈ సేవకు ఇప్పటికే తొలి ఖాతాదారులు చేరారు. రాజకీయ ప్రభావాన్ని ఆదాయంగా మార్చే ప్రయత్నాలను ట్రంప్ మీడియా మరింత దూకుడుగా విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. -
రోహిత్ వివాదం.. టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
రోహిత్ శర్మ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్లు ఉన్న సమయంలో వీలైనంత మేర సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిదని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. శనివారం లండన్లోని భారత హైకమిషన్ నిర్వహించిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో భాగంగా టీమిండియాతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ సహా ఆటగాళ్లంతా హాజరయ్యారు.99 శాతం అదే ధోరణిలో: రాజీవ్ శుక్లారాజీవ్ శుక్లా మాట్లాడుతూ..'భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు తమను తాము క్రికెట్ నిపుణులుగా భావిస్తుంటారని, అందుకే మ్యాచ్లకు ముందు ఆటగాళ్లు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం. మన జట్టులో ప్రతిభకు కొదవలేదని, కేవలం ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్లు ముందున్న కర్తవ్యం. అనవసర విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.' అని చెప్పుకొచ్చారు.బయటి విషయాలు పట్టించుకోను: గిల్టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. తన చేతిలో లేని బయటి అంశాల గురించి ఆలోచించకుండా, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా అధిగమించగలనని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే టీమిండియాలో క్యాంప్లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్న వేళ గిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక గాయాల నుంచి కోలుకొని టీ20 కెప్టెన్గా ప్రమోషన్ పొందిన శ్రేయస్ అయ్యర్ తన పునరాగమన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, వారు ఇచ్చిన మద్దతు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, అందుకే మరింత బలంగా జట్టులోకి తిరిగి రాగలిగానని అయ్యర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. చారిత్రక బంధం: గంభీర్ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ భారత్-బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాల వల్ల యూకే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రదేశమేనని అన్నారు. భారత క్రికెట్ అనేది కేవలం డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం కాదని, జట్టును బేషరతుగా ప్రేమించే ప్రతి ఒక్క నిజాయితీ గల అభిమానికి చెందుతుందని గంభీర్ స్పష్టం చేశాడు. ఇక ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన యూకేలోని భారత హైకమిషనర్ పి. కుమారన్, డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండేలు టీమిండియాకు ఘన స్వాగతం పలికారు. ఇదే వారంలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) వ్యాపారంతో పాటు క్రీడారంగానికి కూడా ఎన్నో కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ టీమిండియా సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇవాళ చివరి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లు ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. -
తల తెగినా ఫైటింగ్ ఆగలేదు.. భవిష్యత్తు యుద్ధానికి జస్ట్ ట్రైలర్?
చైనాలో జరిగిన ఓ హ్యూమనాయిడ్ రోబో పోరాట కార్యక్రమం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పోటీలో పాల్గొన్న ఓ రోబో ప్రత్యర్థి దాడిలో తన తలను కోల్పోయినప్పటికీ, కొన్ని క్షణాల పాటు పోరాటాన్ని కొనసాగించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ ఘటన చైనాలో నిర్వహించిన హ్యూమనాయిడ్ రోబో కాంబాట్ ఈవెంట్లో చోటుచేసుకుంది. ఫైట్ సమయంలో రెండు రోబోలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ప్రత్యర్థి రోబో ఇచ్చిన బలమైన దెబ్బకు ఒక రోబో తల భాగం విరిగిపోయింది. సాధారణంగా యంత్రం పనిచేయడం ఆగిపోతుందని అందరూ భావించినప్పటికీ, ఆ రోబో తన కదలికలను కొనసాగిస్తూ పోరాటం చేసింది.Robot lost its head mid-fight and kept swinging anyway 😂pic.twitter.com/KnMaFDsr2n— Tansu Yegen (@TansuYegen) July 17, 2026రోబో తల భాగం లేకుండానే ముందుకు కదులుతూ దాడులు చేయడం చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు దీనిని సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ‘టెర్మినేటర్’ సన్నివేశాలను తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఘటన రోబోటిక్స్ రంగంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని కూడా చూపిస్తోంది. హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల మాదిరిగా నడవడం, సమతుల్యత పాటించడం, క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రోగ్రామ్ చేసిన విధంగా స్పందించడం వంటి సామర్థ్యాలను సాధిస్తున్నాయి.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిపై టెక్నాలజీ కంపెనీలు, పరిశోధనా సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్తులో ఈ రోబోలు పరిశ్రమలు, సేవా రంగాలు, అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనాలో జరిగిన ఈ రోబో ఫైట్ మాత్రం ఒక విషయం స్పష్టం చేసింది. యంత్రాల ప్రపంచం ఊహించిన దానికంటే వేగంగా ముందుకు సాగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. -
కోర్టులపై రీల్స్, లాయర్ లైఫ్ వీడియోలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు ప్రాంగణాలు, కేసుల విచారణలు, న్యాయవాదుల కార్యాలయా లు, ఇంటర్న్షిప్లు, క్లయింట్ల వివరాలకు సంబంధించిన వీడియోలు, రీల్స్, సోషల్ మీడియా పోస్టులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కఠిన ఆంక్షలు విధించింది. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ఇంటర్న్లు సోషల్ మీడియాలో పాటించాల్సిన నైతిక ప్రమాణాలు, వృత్తి గోప్యత, కోర్టు మర్యాదలకు సంబంధించిన కొత్త మార్గదర్శ కాలను జారీ చేసింది. వీటిని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు, న్యాయ విద్యా సంస్థలు వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బీసీఐ జారీ చేసిన సర్క్యులర్ ను సాధారణ సూచనగా కాకుండా తప్పని సరిగా అమలు చేయాల్సిన ఆదేశంగా పరిగణించాలని పేర్కొంది. సర్క్యులర్ను కేవలం వెబ్సైట్లో ఉంచడం లేదా వాట్సాప్లో పంపించడం సరిపోదని, విద్యార్థులు, న్యాయవాదుల్లో దీనిపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది.ఇవి అందరికీ వర్తిస్తాయి‘సోషల్ మీడియాలో న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ఇంటర్న్ల వృత్తి గౌరవం, నైతికతను కాపాడడం’పేరుతో విడుదల చేసిన ఈ సర్క్యులర్లో కోర్టు ప్రాంగణాలు, కోర్టు కారిడార్లు, న్యాయమూర్తుల విచారణలు, లైవ్స్ట్రీమ్ విచారణల క్లిప్పింగులు, చాంబర్లు, ఇంటర్న్షిప్లు, కేసుల నిర్వహణకు సంబంధించిన రీల్స్, వీడియోలు, షార్ట్ క్లిప్స్, మీమ్స్, థంబ్నెయిల్స్, ప్రచార పోస్టులు రూపొందించడం, ప్రచారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మార్గదర్శకాలు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, పరిశోధన విద్యార్థులు, ఇంటర్న్లు సహా న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారందరికీ వర్తిస్తాయని బీసీఐ పేర్కొంది. ఆ వీడియోలపై నిషేధంఇంటర్న్షిప్ సమయంలో చాంబర్లో జరిగే చర్చలు, కేసు ఫైళ్లు, క్లయింట్ సమావేశాలు, న్యాయ వ్యూహాలు, డ్రాఫ్టింగ్, పరిశోధన, కోర్టు సందర్శనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వృత్తి గోప్యతకు విరుద్ధమని బీసీఐ స్పష్టం చేసింది. ప్రత్యేకంగా ‘డే ఇన్ కోర్ట్‘, ‘డే ఇన్ చాంబర్‘, ‘ఇంటర్న్షిప్ రివీల్‘, ‘కేస్ ఫైల్‘, ‘కోర్ట్ రూమ్ డ్రామా‘, ‘లాయర్ లైఫ్‘వంటి శీర్షికలతో వీడియోలు, రీల్స్ రూపొందించడం నిషేధిత చర్యలుగా పేర్కొంది. కోర్టు విచారణలను రికార్డు చేయడం, క్లయింట్ల వివరాలు, కేసు వ్యూహాలు, డ్రాఫ్టులు, పిటిషన్లు, అంతర్గత చర్చలను బహిర్గతం చేయడాన్ని కూడా పూర్తిగా నిషేధించింది. ఇంటర్న్షిప్ అనేది క్రమశిక్షణ, వినయం, న్యాయ పరిశోధన, డ్రాఫ్టింగ్, కోర్టు విధా నాల అవగాహన, వృత్తి నైతికత, బాధ్యత లను నేర్చుకోవడానికి మాత్రమేనని, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకో వడానికి లేదా వ్యక్తిగత ప్రచారం కోసం కాదని విద్యార్థులకు స్పష్టంగా తెలియ జేయాలని బీసీఐ సూచించింది.హామీ తప్పనిసరిఇకపై న్యాయ విద్యార్థులు అడ్మిషన్ సమయంలో ప్రత్యేక అండర్టేకింగ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ ప్రారంభానికి ముందు మరో ప్రత్యేక అఫిడవిట్ ఇవ్వడం కూడా బీసీఐ తప్ప నిసరిగా చేసింది. ఈ అండర్టేకింగ్ను సాధార ణ అడ్మిషన్ ఫారంలో భాగంగా కాకుండా విడిగా తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. అలాగే అన్ని న్యాయ కాలేజీలు, విశ్వవిద్యాల యాలు ఈ మార్గదర్శకాలపై అవగాహన కార్య క్రమాలు నిర్వహించాలని కోరింది. అధ్యాపకు లు, విద్యార్థులకు సర్క్యులర్ను వివరించాలని, అమలు పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై ఇంటర్న్షిప్ రద్దు, సంబంధిత ‘లా’ కాలేజీలకు సమాచారం ఇవ్వడం, ఇంటర్న్షిప్ కోఆర్డినేట ర్లు, బార్ అసోసియేషన్లు, లా ఫర్మ్లకు ఫిర్యాదు చేయడం, అడ్మిషన్ లేదా ఎన్రోల్మెంట్ కమిటీల ముందు కేసులు ఉంచడం, కౌన్సెలింగ్, హెచ్చరికలు, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని బీసీఐ హెచ్చరించింది. -
స్టీరింగ్ చేతిలో.. సడన్గా డ్రైవర్ మాయం!
కొన్నిసార్లు ప్రమాదాలు కూడా నవ్వులు పూయిస్తాయి. అలాంటి ఓ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సరదా ట్రిప్లో భాగంగా గోల్ఫ్ కార్ట్ నడుపుతున్న ఓ యువతి.. రోడ్డుపై ఫోకస్ కోల్పోవడంతో చివరకు వాహనం నేరుగా పొదల్లోకి వెళ్లిపోయింది.వైరల్గా మారిన 13 సెకన్ల వీడియోలో.. కొందరు గోల్ఫ్ కార్ట్లో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆకులతో నిండిన సన్నని దారిలో కార్ట్ వెళ్తుండగా.. డ్రైవర్ ఒక్కసారిగా రోడ్డుపై దృష్టి కోల్పోయింది. పక్కనే ఉన్న యువతి కింద పడిపోగా.. డ్రైవింగ్ చేస్తున్న సంగతి మరిచిపోయి కంగారులో స్టీరింగ్ వదిలేసింది. కింద పడిన యువతి కోసం ఈమె కూడా దూకేసింది. వెనక కూర్చున్నవాళ్లు ఆ షాకింగ్ పరిణామాన్ని తొంగి చూస్తూ ఉండిపోయారు. మరి డ్రైవర్ మాయమైతే.. వాహనం నడిపేదెవరు?.. అందుకే వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రయాణికుల్లో ఒకరు ఒక్కసారిగా కిందకు జారిపడటం, ఆ వెంటనే డ్రైవర్ సీట్లో యువతి కూడా దూకేయడం.. ఆ వీడియోను మరింత వినోదంగా మార్చింది.did she forget she was the driver 🥲 pic.twitter.com/cjAKlyYGZR— Peché Africa 🇿🇦 (@pmcafrica) July 17, 2026వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. “డ్రైవర్ అని మర్చిపోయి పార్టీకి వచ్చిందా?” అంటూ కొందరు సరదాగా స్పందించగా.. మరికొందరు “రోడ్డుపై చూపు ఎప్పుడూ ముందే ఉండాలి” అంటూ జాగ్రత్తలు సూచించారు.మిలియన్లకు పైగా వ్యూస్.. కామెంట్ల వర్షంపెచే ఆఫ్రికా షేర్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. లక్షల సంఖ్యలో లైక్స్, షేర్స్ రావడంతో పాటు.. ఈ ఘటనపై మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. కొందరు దీనిని జీవితానికి ఉదాహరణగా పోల్చుతూ.. “దృష్టి ఎక్కడ ఉంటే ప్రయాణం కూడా అక్కడికే వెళ్తుంది” అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.ఈ ఘటన సరదాగా ముగిసినప్పటికీ.. వాహనం నడిపేటప్పుడు దృష్టి మరల్చడం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తుచేసింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో.. ఈ గోల్ఫ్ కార్ట్ ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వుల పండుగగా మారింది. “రోడ్డుపై డ్రైవింగ్.. పార్టీలో డ్యాన్స్ కాదు!” అంటూ నెటిజన్లు ఈ వీడియోకు ఫన్నీ టచ్ ఇస్తున్నారు. -
అన్నా.. పురుగుల అన్నం పెడ్తున్నారు!
‘‘అన్నా.. హాస్టల్లో భోజనం సరిగ్గా ఉండదు.. అన్నంలో పురుగులు వస్తున్నాయ్’’ అంటూ పిల్లలు చెప్పిన మాటలకు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చలించిపోయారు. చెన్నైలోని సైదాపేటలో ఉన్న ఎంసీ రాజా సోషల్ జస్టిస్ స్టూడెంట్స్ హాస్టల్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హాస్టల్కు చేరుకున్న విజయ్.. అక్కడి వసతులు, నిర్వహణ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత లోపాలు, నీటి సమస్యలు, సిబ్బంది కొరత వంటి అంశాలను వివరించారు.ఫిర్యాదు చేస్తే కొద్దిరోజులే.. హాస్టల్లో అందించే భోజనం నాణ్యతపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ఆహారంలో పురుగులు కనిపిస్తున్నాయని, భోజనం విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని వారు సీఎంకు తెలిపారు. గతంలో విద్యార్థుల ఆందోళనల తర్వాత కొంతకాలం ఆహారం నాణ్యత మెరుగుపడిందని, కానీ కొద్దిరోజులకే మళ్లీ పాత పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగదిలో పరిశుభ్రత పాటించడం లేదని, సిబ్బంది గ్లౌజులు, క్యాప్స్ వంటి రక్షణ పరికరాలు ఉపయోగించడం లేదని చెప్పారు.హాస్టల్స్ లో దయనీయ స్థితి..సీఎం విజయ్ వద్ద తమ గోడు వినిపించిన విద్యార్థులు అభివృద్ధిలో టాప్ 5 స్థానాల్లో ఉన్న తమిళనాడులో వాస్తవ పరిస్థితులు ఇవి..#CMVijay pic.twitter.com/JTgr31HMGW— UttarandhraNow (@UttarandhraNow) July 17, 2026వసతులపై విద్యార్థుల ఫిర్యాదులుహాస్టల్లో నీటి సరఫరా సమస్యలు, మరుగుదొడ్ల నిర్వహణ లోపాలు, సిబ్బంది కొరత, భద్రతా లోపాలపై కూడా విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, హాస్టల్లో భద్రతపై ఆందోళన ఉందని తెలిపారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.రాత్రి ఆలస్యంగా కోచింగ్ తరగతులు లేదా పనుల నుంచి వచ్చే విద్యార్థులకు గేట్లు మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు విద్యార్థులు చెప్పారు. స్పోర్ట్స్ సదుపాయాలు, ఆధునిక జిమ్, లైబ్రరీలో మరిన్ని పుస్తకాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.సీఎం స్పందన.. అధికారులకు ఆదేశాలువిద్యార్థుల సమస్యలను ఓపికగా విన్న సీఎం విజయ్.. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భోజనం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని సూచించారు. హాస్టల్లోని వంటగది, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలను స్వయంగా పరిశీలించిన విజయ్.. సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. తదుపరి తనిఖీ నాటికి అన్ని లోపాలు సరిచేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.రూ.44.50 కోట్లతో నిర్మించిన హైటెక్ హాస్టల్సైదాపేటలోని ఈ 10 అంతస్తుల హాస్టల్ను గత డీఎంకే ప్రభుత్వ హయాంలో సుమారు రూ.44.50 కోట్లతో నిర్మించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మించారు. లిఫ్ట్లు సహా పలు ఆధునిక సదుపాయాలు ఉన్నప్పటికీ.. నిర్వహణ లోపాలపై విద్యార్థుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో సీఎం స్వయంగా తనిఖీ చేపట్టినట్లు సమాచారం.వరుసగా రెండో ఆకస్మిక తనిఖీముఖ్యమంత్రి విజయ్ ఇటీవల చెన్నైలోని ఎగ్మోర్ చిన్నారుల ఆసుపత్రిని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాజాగా విద్యార్థుల హాస్టల్ను సందర్శించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. “సమస్యలు చెప్పేందుకు ప్రజలు సీఎం వద్దకు వెళ్లడం కాదు.. సీఎం స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లడం” అనే విధంగా ఆయన తనిఖీలపై చర్చ జరుగుతోంది. -
MS రాజు నుండి నాకు ప్రాణహాని... బట్టలు విప్పి నగ్నంగా నన్ను
-
క్లాస్రూంలోనే రాసలీలలు
విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే హద్దులు దాటారు. పాఠాలు చెప్పాల్సిన తరగతి గదిలోనే అనుచిత ప్రవర్తించారు. ఆ వీడియోలు కాస్త బయటకు రావడంతో.. తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు కంగుతిన్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఇటు విద్యాశాఖ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు.. తరగతి గదిలో హద్దులు దాటి ప్రవర్తించారు. విద్యార్థులు లేని టైం చూసుకుని ఏకాంతంగా కలుసుకున్నారు. ముద్దులతో, కౌగిలింతలతో.. రెచ్చిపోయారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.. విద్యాశాఖ రంగంలోకి దిగింది. ఇద్దరు సీనియర్ టీచర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. నివేదికలో.. వాళ్లు తప్పు చేసినట్లు తేలింది.ప్రవర్తన ఉపాధ్యాయుల వృత్తి ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని.. ఇలాంటి చర్యలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తేల్చింది. దీంతో విద్యాశాఖ వాళ్లను సస్పెండ్ చేసింది.ఉత్తరప్రదేశ్లో కన్నౌజ్ జిల్లాలోని సౌరిక్ బ్లాక్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. నివేదిక ఆధారంగా జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఒక టీచర్ను గుగరాపూర్ బ్లాక్ రిసోర్స్ సెంటర్కు, మరో టీచర్ను తాల్గ్రామ్ బ్లాక్ రిసోర్స్ సెంటర్కు అటాచ్ చేశారు. చాలా కాలంగా వీళ్లిద్దరూ ఇలా చేస్తున్నట్లు తేలిందని ఆయన అంటున్నారు.అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో నిజమైనదేనా? ఎప్పుడు చిత్రీకరించారు? అనే అంశాలపై కూడా అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. వీడియోలో మాత్రం ఆ క్లాస్రూం రొమాన్స్.. ఈ ఏడాది జనవరిలో జరిగినట్లు డేట్ కనిపిస్తోంది. వీడియో ప్రామాణికతను నిర్ధారించే విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన గురువులే ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పాఠాలు చెప్పాల్సిన క్లాస్రూంలోనే అనుచిత ప్రవర్తనకు పాల్పడి.. చివరకు ఇద్దరు టీచర్లు తమ ఉద్యోగాలపై వేటు పడే పరిస్థితిని ఎదుర్కొన్నారు. -
బస్టాండ్లో దారుణం.. ప్రేమ నిరాకరించిందని బంధువు దాడి!
మంగుళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న యువతిపై ఓ వ్యక్తి మారణాయుధంతో దాడి చేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, బంట్వాల్లోని కేఎస్ఆర్టీసీ న్యూ బస్ స్టాండ్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతురాలిని లావణ్యగా గుర్తించారు. ఆమె కక్కేపదవు ప్రాంతానికి చెందిన యువతిగా, కళ్లడ్కలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. లావణ్య బస్సు కోసం వేచి ఉండగా నిందితుడు ఆమె వద్దకు వచ్చాడు. అనంతరం తన బ్యాగులో నుంచి పదునైన ఆయుధాన్ని తీసి దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. దాడి నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించినా, నిందితుడు వెంటాడి దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్ర గాయాలతో ఉన్న లావణ్యను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.A rare scene that has happened in the Mangalore region. A 21-year-old, Lavanya, was brutally hacked to death by her ex, four years after their relationship had ended. The accused, 22-year-old Chetan, who is also a distant relative, attacked her in broad daylight at a bus stop… pic.twitter.com/3wo95zZUnD— Sharanya Shettyy (@Sharanyashettyy) July 16, 2026బంధువే నిందితుడా?ఈ ఘటనలో నిందితుడిగా చేతన్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు మృతురాలికి దూరపు బంధువని, కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లావణ్య తన ప్రేమను తిరస్కరించడంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు.ఈ దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. బంట్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక, బస్టాండ్ వంటి బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ హత్య స్థానికుల్లో భయాందోళనలు కలిగించింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో, నగరంలో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. -
విజయ్కు త్రిష.. నాకేమో నవ్వు!
సాక్షి సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష కృష్ణన్ బంధంపై తరచూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. తన తాజా చిత్రం 'విజిటర్' ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన ధ్యాన్.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకను పరోక్షంగా ప్రస్తావిస్తూ వేసిన సరదా పంచ్లు ప్రేక్షకులను నవ్వించాయి. అయితే ఈ వ్యాఖ్యలు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ ఈవెంట్లో తన సహనటి నవ్యా నాయర్ను ఉద్దేశించి ధ్యాన్ మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం. నవ్యాకు పెళ్లై, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినా నేను ఒకరోజు కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. నువ్వు తెల్లచీర కట్టుకుని ముందు వరుసలో కూర్చొని, కళ్లలో నీళ్లతో నన్ను చూస్తూ ఉండాలి" అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో సభలో నవ్వులు పూశాయి.Trisha emotions were on high during Vijay oath ceremony. An emotional moment ❤️ pic.twitter.com/GrJcW88bwg— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 10, 2026ఆ తర్వాత మైక్ అందుకున్న నవ్యా నాయర్ కూడా అదే స్థాయిలో స్పందించింది. "నువ్వు సీఎం అయితే.. నువ్వు చెప్పినట్టే తెల్లచీరకు ఆకుపచ్చ అంచు, డైమండ్ నెక్లెస్ వేసుకుని ముందు వరుసలో కూర్చుంటా. కళ్లలో ఆనందబాష్పాలతో నీకు జైకొడతా. కానీ ముందు వరుసలో నాకు సీటు మాత్రం రిజర్వ్ చేయాలి" అంటూ చమత్కరించింది. దీంతో సభలో మరోసారి నవ్వుల వెల్లువ ఎగిసింది.ఇదంతా సరదా సంభాషణలా అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తప్పు బడుతున్నారు. ఈ వ్యాఖ్యలను విజయ్ ప్రమాణ స్వీకార వేడుకతో పోలుస్తున్నారు. వాళ్లిద్దరిపైనా మండిపడుతున్నారు. The day I take the oath as CM... I think Navya will be there in the front row wearing a saree...!!- Dhyan Sreenivasan 😂 pic.twitter.com/UT5GvyK8Fq— Trollywood 𝕏 (@TrollywoodX) July 16, 2026 తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు త్రిష.. ఆయన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభతో కలిసి ముందు వరుసలో కూర్చోవడం, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురికావడం అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ ఘటననే ధ్యాన్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ప్రస్తావించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ కార్యక్రమంలో ధ్యాన్ మరో సరదా వ్యాఖ్య కూడా చేశాడు. విజయ్ ముఖ్యమంత్రి అయినట్లే.. తానూ రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అవుతానని జోక్ చేశాడు. అలాగే తన స్నేహితుడు, నటుడు అజు వర్గీస్ను ఈ సంభాషణలోకి లాగుతూ.. తనకి గవర్నర్ పదవి బాగుంటుందని నవ్వించాడు. వెంటనే అజు వర్గీస్ మీ అమ్మగారికి రాష్ట్రపతి పదవి దక్కుతుందని జోక్ చేశాడు.అయితే ఈ ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందని అనుకున్నాడో ఏమో.. అజు వర్గీస్ వేదిక మీదకు వచ్చి "విజయ్ సార్, నా ఫ్రెండ్ కొంచెం పిచ్చోడు.. దయచేసి క్షమించండి" అంటూ వ్యాఖ్యానించాడు. ఆ మాటతో అక్కుడున్నవాళ్లంతా కడుపుబ్బా నవ్వుకున్నారు.ఎవరీ ధ్యాన్-నవ్యా?ధ్యాన్ శ్రీనివాసన్(Dhyan Sreenivasan) మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన శ్రీనివాసన్ కుమారుడు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన వినీత్ శ్రీనివాసన్కు సోదరుడు. 2013లో వచ్చిన తీరా సినిమాతో నటుడిగా పరిచయమైన ధ్యాన్, 2013లో 'తీరా' చిత్రంతో నటుడిగా పరిచయమైన ధ్యాన్ శ్రీనివాసన్.. 'ఆది కాప్యారే కూటమణి', 'కుంజిరామాయణం', 'గూడలోచన', 'వర్షంగళ్క్కు శేషం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక.. నవ్యా నాయర్ మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి. 'నందనం', 'ఇష్టం', 'కళ్యాణరామన్', 'పందిప్పాడ' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె, మలయాళంతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్ 2017లో అర్పితా సెబాస్టియన్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్యా నాయర్ 2010లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త సంతోష్ మీనన్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. -
నాయకా? ఖల్నాయకా? ఎమోజీ హుజూర్...
‘ఎమోజీ, ఎమోజీ ఏం చేస్తుంటావు?’ అని అడిగితే...‘ఇద్దరు శత్రువుల మధ్య స్నేహదీపాన్ని వెలిగిస్తాను’‘ఇద్దరు మిత్రులను శత్రువులను చేసి పచ్చగడ్డి వేసి భగ్గుమనిపిస్తాను’ అన్నదట!ఇంతకీ ఎమోజీ క్యారెక్టర్ ఏమిటి?మనకు కరెక్ట్ ఫ్రెండా? ఖల్ నాయకా?ఎమోజీలు చిన్నవే కావచ్చు. అయితే వాటి ప్రభావం మాత్రం పెద్దది. ఆత్మీయతల నుంచి అపార్థాల వరకు, వెలుగు పంచడం నుంచి డార్క్ వెబ్ మార్కెట్ వరకు ఆ ప్రభావం ఒక్కోచోట ఒక్కోరకంగా కనిపిస్తోంది...ప్రతిరోజూ కోట్లాదిమంది ఆన్లైన్ సంభాషణలలో, వివిధ సందర్భాలలో ఎమోజీలను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు సరదా సరదాగా కనిపించిన ఎమోజీలు ఇప్పుడు డిజిటల్ యుగానికి దృశ్యసంకేతాలుగా మారాయి.అలా కాదు... ఇలా కూడా!ఒకప్పుడు ఎమోజీ అంటే సరదా స్పందన మాత్రమే. అయితే ఇప్పుడు అవతలి వ్యక్తిని వేధించడానికి కూడా ఎమోజీలను ఉపయోగిస్తున్నారు. అవి కొన్నిసార్లు క్రూరంగా ఉంటున్నాయి. ఉదా: ఒకరి రూపాన్ని అవమానించడానికి పందిముఖం ఎమోజీని, ఒకరి బాడీ గురించి జోక్లు వేయడానికి పీచ్ ఎమోజీని, వేధించడానికి దెయ్యం ముఖం ఎమోజీని, బెదిరించడానికి మంట, బాంబు, తుపాకీ... మొదలైన ఎమోజీలను ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ వేధింపులపై దృష్టి సారించే సైబర్ బుల్లింగ్ రీసెర్చ్ సెంటర్ పరిశోధన ప్రకారం డిజిటల్ బెదిరింపులలో ‘పీచ్’లాంటి ఎమోజీలను ఉపయోగిస్తున్నారు. గుర్తుపట్టలేవు!ఎమోజీ ఆధారిత వేధింపులు అందరికీ తెలిసేలా ఉండకపోవడానికి ఒక కారణం..ఒకే ఎమోజీలో... పంపిన వారికి, అందుకున్న వారికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి అనేక అర్థాలు ఉంటాయి. విద్వేషపూరిత పదాల కోసం స్కాన్ చేసే ఆటోమేటెడ్ సిస్టమ్స్ వ్యంగ్యపు చిరునవ్వు లేదా ఆటపట్టించే పీచ్ ఎమోజీలను విస్మరించవచ్చు. ఒకవేళ గుర్తించినప్పటికీ అందులోని అంతరార్థాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు.ఎమోజీ మర్డర్!ఒక ఎమోజీకి సంబంధించిన గొడవలో గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన ఇరవై ఏళ్ల ప్రిన్స్ కుమార్ హత్యకు గురయ్యాడు. చనిపోయిన తన తాత రూప్నారాయణ్ను గుర్తు చేసుకుంటూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు ప్రిన్స్. అందరూ ‘అయ్యో!’ అని సానుభూతి చూపితే, రాజీందర్ గోండ్ అనే అతడి ఫ్రెండ్ మాత్రం నవ్వుతున్న ఎమోజీతో స్పందించాడు. దీంతో ఇద్దరిమధ్య గొడవైంది. ఫోన్లో మొదలైన మాటల యుద్ధం కాస్తా ఘర్షణ స్థాయికి చేరింది. ఈ క్రమంలో ప్రిన్స్పై గోండ్ దాడి చేసి హత్య చేశాడు.కోర్టు మెట్లు ఎక్కిన ఎమోజీ!తన భార్య ఒకరికి ‘కిస్’ ఎమోజీ పంపిందని, కాబట్టి విడాకులు మంజూరు చేయాలని జమ్మూ కశ్మీర్లో ఒక డాక్టర్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిని సవాలు చేస్తూ ఆయన భార్య హైకోర్ట్ను ఆశ్రయించింది!అంతటా... అవగాహన కలిగించాలిఎమోజీలను నిషేధించడం లేదా ప్రతి పోస్ట్ను పర్యవేక్షించడం కంటే విద్యావేత్తలు, యువతతో డిజిటల్ దృశ్యభాషపై అవగాహనను పెంపొందించాలి అని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. అందులో కొన్ని...→ ఎమోజీల అర్థాలు, వివిధ వయసుల వారికి సందర్భాలకు అనుగుణంగా అర్థం ఎలా మారుతుందో తెలియజేయాలి.→ ఎమోజీలను హానికరంగా ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై ఇళ్లలో, పాఠశాలల్లో చర్చలు నిర్వహించాలి.→ హానికరమైన ఎమోజీలను గుర్తించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మోడరేషన్ సాధనాలను అప్డేట్ చేయాలి.డిజిటల్ బాడీ లాంగ్వేజ్పనిచేసేచోట వ్యక్తులు మాట్లాడుకునే విధానంలో అంతరం పెరుగుతోందని, అది ఎమోజీల రూపంలో వ్యక్తమవుతోందని సాఫ్ట్వేర్ కంపెనీ ‘అట్లాసియన్’ సర్వే చెబుతోంది. జెన్ జెడ్ ఉద్యోగులలో తొంభైశాతంమంది ‘కమ్యూనికేషన్పై ఎమోజీల ప్రభావం ఉంటుంది’ అని చెప్పారు. ఎమోజీలకు ‘డిజిటల్ బాడీ లాంగ్వేజ్’ అని పేరు పెట్టింది నివేదిక.‘ఎమోజీలు వినోదం కోసం మాత్రమే కాదు... మోటివేషన్ విషయంలోనూ సహాయపడతాయి’ అంటున్నారు జెన్ జెడ్లో చాలామంది. యువతలో మూడింట రెండు వంతుల మంది ఎమోజీలు ఉన్న మెసేజ్లను చదవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు.డార్క్ వెబ్ ఎమోజీసినిమాలలో ముసుగులు ధరించిన నేరస్థులు, ఎదుటి వ్యక్తికి అనుమానం రాకుండా తమను తాము గుర్తించుకోవడానికి సంకేత పదాలు, రహస్య సంజ్ఞలు ఉపయోగించడం మనకు తెలిసిందే. ఎమోజీలను డిజిటల్ ప్రపంచపు సంకేత పదాలుగా పరిగణిస్తున్నారు. మత్తు పదార్థాల పేర్లను దాచడానికి డార్క్ వెబ్ మార్కెట్లు ఎమోజీలను ఉపయోగించుకుంటున్నాయి. సైబర్ దాడులు, మోసాలు, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు సంబంధించి నేరగాళ్లు కోడ్ సందేశాలుగా ఎమోజీలను ఉపయోగిస్తున్నారు.ఎమోజీ కాంటాక్డ్ డైరెక్టరీ!కోల్కత్తాలోని ఒక ఇంట్లో పని చేసే ఝుర్నా నిరక్షరాస్యురాలు. తన సెల్ఫోన్లో పేర్లను ఫీడ్ చేసుకోలేదు. ఎవరైనా ఫీడ్ చేసినా చదువుకోలేదు కదా! అప్పుడు ఎమోజీలే ఆమెకు సహాయపడ్డాయి. పేర్లకు బదులుగా ఆమె సెల్ స్క్రీన్పై వరుసగా ఎమోజీలు కనబడతాయి. వ్యక్తిని లేదా ప్రదేశాన్ని ఈ ఎమోజీలు సూచిస్తాయి. ఉదాహణకు వర్మ అనే వ్యక్తి కాంటాక్ట్ ను హంస ఎమోజీతో సేవ్ చేసింది. మరోవ్యక్తి కాంటాక్ట్ను గుడి ఎమోజీతో సేవ్ చేసింది. ఎందుకంటే ఆ వ్యక్తి గుడికి దగ్గరగా ఉంటాడు... ఇలా రకరకాల సంకేతాలతో తనదైన పర్సనల్ ఎమోజీ కాంటాక్డ్ డైరెక్టరీని రూపొందించుకుంది ఝుర్నా. -
‘నేను భర్తగా భావించే సాయే నా అంత్యక్రియలు చేయాలి’
సాక్షి, ప్రకాశం: సోషల్ మీడియా పరిచయం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తాను భర్తగా భావించిన వ్యక్తికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని మనోవేదనకు గురైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపినేని సాయి సుమంత్, కీర్తి అనే ఇద్దరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. సుమంత్ దుబాయ్లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా, కీర్తి ముంబైలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు.అయితే, కీర్తికి తెలియకుండా సుమంత్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయమై కీర్తి అతడిని నిలదీయగా.. సుమంత్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన కీర్తి ఆత్మహత్య చేసుకుంది. తనువు చాలించే ముందు ఆమె ఒక లేఖ రాసింది. తాను భర్తగా భావించే సాయి సుమంత్ చేతుల మీదుగానే తన అంత్యక్రియలు నిర్వహించాలన్నదే తన ఆఖరి కోరికని ఆ లేఖలో పేర్కొంది.కీర్తి మరణానంతరం ఆమె మృతదేహాన్ని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులోని సాయి నివాసానికి తీసుకువచ్చారు. చనిపోయిన కీర్తి మెడలో సాయి తాళి కట్టాలని, ఆమె అంత్యక్రియలను అతడే జరపాలని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు అక్కడ ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో సాయి సుమంత్ తల్లిదండ్రులు కీర్తి కుటుంబ సభ్యులను బెదిరించి, ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు -
ముద్రగడ పద్మనాభంపై తప్పుడు ప్రచారం.. నీ టాస్క్ ఫోర్స్ ఎక్కడ బాబు
-
డిజిటల్ కర్ఫ్యూ!
సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి దాటినా స్మార్ట్ఫోన్లలో గంటలకొద్దీ ఆన్లైన్ గేమ్స్.. సోషల్ మీడియాలో చాటింగ్లు.. తల్లిదండ్రులు వద్దని వారించినా, ఆరో గ్యం పాడవుతున్నా లెక్కలేనితనం... ఇదీ భారత్ సహా అనేక దేశాల్లో స్మార్ట్ఫోన్లకు బానిసలవుతున్న పిల్లలు ముఖ్యంగా టీనేజర్ల పరిస్థితి. ఈ విషయంలో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు భారత్ ఇంకా కసరత్తు చేస్తుంటే వివిధ దేశాలు మాత్రం చట్టబద్ధంగా ముందుకు కదిలాయి. నిర్ణీ త సమయం దాటితే ఇంటర్నెట్కు తాళం పడే విధానాన్ని అమలు చేస్తున్నాయి. రాత్రి 10 గంటలు దాటగానే సోషల్ మీడి యా ఓపెన్ కాకుండా, పబ్జీ వంటి ఆన్లైన్ గేమ్స్ రన్ కాకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో టైమ్ దాట గానే.. పిల్లలు ఎంత ప్రయత్నించినా సంబంధిత యాప్స్ పనిచేయట్లేదు. ఇంకొన్ని దేశాలైతే మరో అడుగు ముందుకేసి ఇంటర్నెట్నే బంద్ చేస్తున్నా యి. దీన్నే డిజిటల్ కర్ఫ్యూగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి నిబంధనలు ఉన్నాయంటే.. డిజిటల్ కర్ఫ్యూ అమల్లో చైనా అందరికంటే ముందుంది. స్మార్ట్ఫోన్లలో ‘మైనర్ మోడ్’ను చైనా ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో ఫోన్ల తయారీదారులు 18 ఏళ్ల లోపు పిల్లలకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఫోన్లలో ఇంటర్నెట్ ఆటోమేటిక్గా కట్ అయ్యేలా సాఫ్ట్వేర్ను రూపొందించారు. పిల్లల వయసును బట్టి రోజుకు 40 నిమిషాల నుంచి గరిష్టంగా రెండు గంటలు మాత్రమే స్క్రీన్ టైమ్ వెసులుబాటు లభిస్తోంది. అలాగే ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. నిబంధనలు పాటించని కంపెనీలకు భారీ జరిమానాలు విధిస్తోంది.బ్రిటన్ ప్రభుత్వం 16, 17 ఏళ్ల టీనేజర్ల కోసం రాత్రివేళల్లో లైవ్ స్ట్రీమింగ్స్, మెసేజింగ్ ఫీచర్లను డిఫాల్ట్గా లాక్ చేసే విధానాలను తెస్తోంది. ఫ్రాన్స్ స్కూళ్లలో స్మార్ట్ఫోన్లను నిషేధించడంతోపాటు రాత్రివేళల్లో స్క్రీన్ టైమ్ నియంత్రణలపై గట్టిగా కసరత్తు చేస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి రాత్రిపూట ఇంటర్నెట్ ఆపేలా డిజిటల్ కర్ఫ్యూ చట్టాలు చేయకపోయినా డిజిటల్ అడిక్షన్ కట్టడిపై దృష్టిపెట్టింది. ఆన్లైన్ గేమింగ్ వ్యసనాన్ని అరికట్టడానికి టైమ్ లిమిట్స్, ఏజ్ వెరిఫికేషన్, పేరెంటల్ కంట్రోల్స్ లాంటి నిబంధనలను ప్రభుత్వం తీసుకొచి్చంది. ఎందుకీ కట్టడి.. » రాత్రివేళల్లో ముఖ్యంగా లైట్లు ఆర్పేసి చీకట్లో గంటల తరబడి బ్లూ స్క్రీన్ లైట్ని చూడటం వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. » నిద్రకు కారణమయ్యే మెలటోటిన్ హార్మోన్ విడుదల కాకపోవడం వల్ల స్మార్ట్ఫోన్లకు బానిసలవుతున్న పిల్లల్లో నిద్రలేమి ఎక్కువగా ఉంటోంది. పీడియాట్రిక్ వైద్యులు చెప్పే దాని ప్రకారం రాత్రివేళల్లో కళ్లపై బ్లూలైట్ పడితే నిద్ర హార్మోన్ 60 శాతం తగ్గుతుంది. దీంతో పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి, చదువు దెబ్బతింటాయి. » టీనేజర్లపై సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ వేధింపులు ఎక్కువగా రాత్రివేళల్లోనే జరుగుతున్నాయి. » ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 12–18 ఏళ్ల పిల్లల్లో 42 శాతం మంది రోజుకు 6 గంటలకు పైగా స్క్రీన్ చూస్తున్నారు. దీంతో నిద్రలేమి, ఒత్తిడి, డిప్రెషన్ కేసులు 3 రెట్లు పెరిగాయి. -
ముద్రగడ మృతిపైనా ట్రోల్స్.. టీడీపీ, జనసేన నీచ రాజకీయం!
సాక్షి, విజయవాడ: రాజకీయ విభేదాలు సహజమే.. కానీ మరణించిన నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై సోషల్ మీడియాలో ట్రోల్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ని కించపరిచేలా టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్టులు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు కొనసాగిన ముద్రగడ పద్మనాభం.. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఉద్యమ నేతగానూ గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికైన ఆయన.. రెండు ప్రభుత్వాల్లో మంత్రిగా, ఒకసారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు.ముఖ్యంగా కాపు సామాజిక వర్గ సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలుగా నిలిచాయి.తన రాజకీయ జీవితంలో పలు సందర్భాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఉద్యమాలు చేపట్టారు. అరెస్టులు, నిరసనలు, దీక్షలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పోరాడిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే ఆయన మరణం తర్వాత కూడా ఆయన రాజకీయ ప్రస్థానం, ఉద్యమాలపై చర్చ కొనసాగుతోంది.అయితే.. ఆయన రాజకీయ నిర్ణయాలు, కొన్ని పార్టీలతో ఉన్న అనుబంధంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీలో చేరడం, ఆ తర్వాతి రాజకీయ పరిణామాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. కానీ రాజకీయ వైఖరిని విమర్శించడం వేరు.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం వేరు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హద్దులు దాటేసి..ముద్రగడ పద్మనాభం జీవించి ఉన్న సమయంలోనే కాకుండా.. మరణం తర్వాత కూడా సోషల్ మీడియాలో ఆయనపై దుష్ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన అనుబంధ పేజీల పోస్టులు, వ్యాఖ్యలపై అభిమానులు, అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే అయినప్పటికీ.. మరణించిన వ్యక్తిపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ సంస్కృతికి మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.రాజకీయాలకు అతీతంగా గౌరవం అవసరంఒక నాయకుడి విధానాలను, నిర్ణయాలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు, పోరాటాలను పూర్తిగా విస్మరించి.. కేవలం రాజకీయ అనుబంధాల ఆధారంగా అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు.ముద్రగడ పద్మనాభం జీవితంలో ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ప్రభుత్వాలను ఎదురించి ఉద్యమాలు చేశారు. తన నమ్మిన అంశాల కోసం పోరాడారు. ఆయనతో విభేదించిన వారూ ఉన్నారు.. ఆయనను సమర్థించిన వారూ ఉన్నారు. అయితే ప్రజా జీవితంలో ఉన్న ఒక నేత మరణించిన సమయంలో కనీస గౌరవం పాటించాలనే చర్చ.. తాజాగా సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో మరోసారి మొదలైంది. -
అర్ధరాత్రి సోషల్ మీడియా బంద్!
పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న వేళ.. బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. టీనేజర్లు అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు సోషల్ మీడియా వినియోగించకుండా డిఫాల్ట్ పరిమితులు విధించాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సోషల్ మీడియా యాప్లను వినియోగించకుండా నిరోధించేలా కొత్త నిబంధనలు తీసుకురానుంది.ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం.. యువతలో పెరుగుతున్న రాత్రివేళల ఫోన్ వినియోగంపై ఆందోళనలే. ఆలస్యంగా నిద్రపోవడం, ఏకాగ్రత తగ్గడం, చదువుపై ప్రభావం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు అధిక స్క్రీన్ టైమ్ కారణమవుతోందని తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వినియోగదారులను ఎక్కువసేపు యాప్లలోనే ఉంచేలా రూపొందించిన విధానాలపై విమర్శలు ఉన్నాయి.ఇందులో భాగంగా.. వినియోగదారులను నిరంతరం ఆకర్షించే కొన్ని ఫీచర్లపై కూడా బ్రిటన్ దృష్టి పెట్టింది. వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా ప్లే అయ్యే విధానం వంటి ‘ఎంగేజ్మెంట్ ఫీచర్లను’ డిఫాల్ట్గా నిలిపివేయనున్నారు. అయితే వినియోగదారులు కోరుకుంటే కొన్ని సెట్టింగులను మార్చుకునే అవకాశం ఉండనుంది.పూర్తి నిషేధం కాదు.. నియంత్రణే లక్ష్యంఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు పిల్లలకు పూర్తిస్థాయి నిషేధం విధించే మార్గాన్ని కాకుండా.. బ్రిటన్ దశలవారీ నియంత్రణ విధానాన్ని ఎంచుకుంది. ఇప్పటికే చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనల దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు 16, 17 ఏళ్ల యువతపైనా రాత్రివేళ పరిమితులను తీసుకురావడం ద్వారా మధ్యస్థ మార్గాన్ని అనుసరిస్తోంది.స్క్రోలింగ్కు బ్రేక్.. నిద్రకు ప్రాధాన్యంబ్రిటన్ కొత్త నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియా యాప్లలో అంతులేని స్క్రోలింగ్కు కారణమయ్యే ఫీచర్లను డిఫాల్ట్గా నిలిపివేయనున్నారు. ముఖ్యంగా ఒక వీడియో తర్వాత మరో వీడియో ఆటోమేటిక్గా ప్లే అయ్యే విధానాన్ని నియంత్రించనున్నారు. దీంతో టీనేజర్లు రాత్రివేళల్లో ఎక్కువ సమయం ఫోన్లకు అతుక్కుపోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. "యువతకు అవసరమైన నిద్ర లభించేందుకు, చదువుపై దృష్టి పెట్టేందుకు, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి" అని బ్రిటన్ టెక్నాలజీ మంత్రి లిజ్ కెండల్ తెలిపారు.ఆస్ట్రేలియా అనుభవాలతో బ్రిటన్ జాగ్రత్తలుపిల్లల సోషల్ మీడియా వినియోగంపై కఠిన చర్యలు తీసుకున్న తొలి దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉండకుండా నిషేధం విధించే చట్టాన్ని అక్కడ తీసుకొచ్చారు. అయితే ఆ నిబంధనలను తప్పించుకునేందుకు కొందరు టీనేజర్లు కొత్త మార్గాలను అన్వేషించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. వయసు ధ్రువీకరణ వ్యవస్థలను దాటేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కూడా అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో కేవలం పూర్తిస్థాయి నిషేధం కంటే.. వినియోగ అలవాట్లను నియంత్రించడం, ముఖ్యంగా రాత్రివేళల స్క్రీన్ టైమ్ను తగ్గించడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని బ్రిటన్ భావిస్తోంది.మానసిక ఆరోగ్యంపై ఆందోళనలుసోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించడం వల్ల యువతలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల్లో రాత్రివేళ సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం వల్ల నిద్ర, దృష్టి కేంద్రీకరణ, మానసిక ఆరోగ్యంలో మెరుగుదల కనిపించినట్లు తేలింది.2027 నుంచి అమలు?బ్రిటన్ ప్రతిపాదించిన సోషల్ మీడియా నియంత్రణ(పూర్తిస్థాయి) నిబంధనలను ఈ ఏడాది చివరి నాటికి పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారు. 2027 వసంతకాలం నుంచి వీటిని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల అమలును కఠినంగా పర్యవేక్షిస్తామని కూడా స్పష్టం చేసింది.ప్రపంచవ్యాప్తంగా పిల్లల సోషల్ మీడియా వినియోగంపై చర్చ జరుగుతున్న వేళ.. ఆస్ట్రేలియా పూర్తిస్థాయి నిషేధం వైపు వెళ్తుంటే.. బ్రిటన్ మాత్రం నియంత్రణల మార్గాన్ని ఎంచుకుంది. రాబోయే రోజుల్లో యువతను సోషల్ మీడియా ప్రభావం నుంచి రక్షించేందుకు మరిన్ని దేశాలు ఎలాంటి విధానాలు అవలంబిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ఆ సమయంలో ఒంటెలకు ఆహారంగా పాములు..ఎందుకు?
సాధారణంగా పాముల్ని చూస్తే ఎవరైనా దూరంగా జరిగిపోతారు. కానీ ఎడారి ఓడగా పిలుచుకునే ఒంటెకు బతికి వున్న పామును తినిపించడం చూస్తే ఎవరైనా షాక్కు గురి కావాల్సిందే. శాకాహారి అయిన ఒంటె నోరు బలవంతంగా తెరిచి మరీ ఒక బతికున్న విషపూరితమైన పాములను వెనుక ఉన్న రహస్యం ఏంటి? అరబ్ దేశాల్లో తరతరాలుగా ఈ ఆచారం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఈ ప్రశ్నలను మరింతగా తెరపైకి తీసుకొచ్చాయి.రాజస్థాన్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఒంటెల కాపరులు ఈ వింత పద్ధతిని పాటిస్తారు. ఒంటెలకు 'హయాం' (Hayam) అనే ఒక రకమైన వ్యాధి వస్తుంది (ఇది సాధారణంగా ఈగలు, దోమల ద్వారా వచ్చే పరాన్నజీవి వ్యాధి). ఈ వ్యాధి వచ్చినప్పుడు ఒంటె శరీరం వేడెక్కి, ఆహారం తీసుకోవడం మానేస్తుంది. ఆ సమయంలో దానికి బ్రతికున్న విషసర్పాలను తినిపిస్తే, ఆ విషం వల్ల ఒంటె ఒంట్లోని రోగం నయమవుతుందని, దాని కళ్ల వెంట నీళ్లు వచ్చి వ్యాధి బయటకు పోతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. తరతరాలుగా ఈ పద్ధతిని పాటస్తున్నప్పటికీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదు.అసలు నిజంఒంటెలు కేవలం శాకాహారులు (Herbivores). అవి సహజంగా పాములను తినవు. పశువైద్య నిపుణుల ప్రకారం, బ్రతికున్న పామును తినిపించడం వల్ల ఒంటెకు ఎటువంటి ఉపయోగం లేదు. పైగా ఇది ఆ ఒంటె ప్రాణాలకే ప్రమాదం. పైగా జంతు హింస కిందికి వస్తుంది. ఒకవేళ ఆ చికిత్స తర్వాత ఒంటె బ్రతికినా, అది దాని స్వయం నిరోధక శక్తి వల్ల బ్రతికిందే తప్ప పాము వల్ల కాదు.మన దేశంలో నాగపంచమి వంటి పండుగల సమయంలో పాములు పాలు తాగుతాయనే ఒక పెద్ద అపోహ ఉంది. పాములు క్షీరదాలు కావు, అవి సరీసృపాలు. వాటి శరీరంలో పాలను అరిగించుకునే శక్తి (Lactase enzyme) ఉండదు. పండుగలకు కొన్ని వారాల ముందు పాములవాళ్లు అడవి పాములను పట్టుకుని, వాటి విషపు పళ్లను పీకేసి, వాటికి ఆహారం, నీరు లేకుండా ఉంచుతారు. బాగా దాహంతో ఉన్న పాము, ఆకలి తట్టుకోలేక ఎదురుగా ఉన్న పాలను నీళ్లు అనుకుని తాగుతుంది. ఆ పాలు వాటి ఊపిరితిత్తుల్లోకి చేరి, ఇన్ఫెక్షన్ వచ్చి కొద్ది రోజుల్లోనే ఆ పాములు విలవిల్లాడుతూ చనిపోతాయి.భారతదేశంలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ పాము కుడితే ఆసుపత్రికి వెళ్లేకంటే, సాంప్రదాయ పద్ధతులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మంత్రగాళ్లు, నాటు నాటు వైద్యులు దగ్గరికి వెళ్లి మంత్రాలు వేయించడం, వేర్ల పసరు పూయించడం చేస్తుంటారు. దీనివల్ల రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమవుతుంది. విషసర్పం కుట్టినప్పుడు ప్రాణాలను కాపాడగలిగేది కేవలం యాంటీ-స్నేక్ వెనమ్ (Anti-Snake Venom) ఇంజెక్షన్ మాత్రమే. కొన్నిసార్లు విషం లేని పాములు కుట్టినప్పుడు మంత్రగాళ్ల వల్ల నయమైందని ప్రజలు నమ్మి, నిజంగా విషమున్న పాము కుట్టినప్పుడు కూడా అక్కడికే వెళ్లి ప్రాణాలు కోల్పోతుంటారు. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న ఆ వీడియోలు ఎక్కడ నుంచి వచ్చాయి అనేది నిర్ధారణ లేదు. ఇలాంటిమ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. -
ప్లీజ్ కాపాడండి.. స్టేషన్ ఎదుటే 40 నిమిషాల పాటు..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన రాజ్కుమార్(22) సుమారు 40 నిమిషాల పాటు ప్రాణాల కోసం సహాయం కోరినా, సకాలంలో వైద్య సహాయం అందక మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. జూలై 12న ఆటో చార్జీ విషయంలో డ్రైవర్తో రాజ్కుమార్కు వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమీపంలోని పోలీసుల పింక్ బూత్ వద్దకు వెళ్లి సహాయం కోరాడు. అయితే బూత్ మూసి ఉండటంతో లోపల ఉన్న సిబ్బంది దృష్టికి తీసుకెళ్లేందుకు గాజు తలుపును బలంగా కొట్టాడు. దీంతో గాజు పగిలి అతని చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న రాజ్కుమార్ దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే పడి సహాయం కోసం వేడుకున్నా ఎవరూ వెంటనే ఆస్పత్రికి తరలించలేదని తెలిపారు. అనంతరం అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. गाजियाबाद पुलिस पर सवाल!मदद मांगने पहुंचे व्यक्ति को कथित तौर पर पिंक बूथ का दरवाजा नहीं खोला गया, शीशा तोड़ने पर हाथ की नसें कट गईं, देर तक सड़क पर तड़पता रहा।— जनता की सुरक्षा के लिए बने बूथ आखिर किस काम के?#Ghaziabad #UPPolice #ViralVideo pic.twitter.com/UvZT9C1l84— Payall Singhh (@PayallSingh13) July 14, 2026ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘాజియాబాద్ పోలీసులు మాత్రం రాజ్కుమార్, ఆటో డ్రైవర్ ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని, గాయపడిన వెంటనే ఆస్పత్రికి తరలించామని చెబుతున్నారు. దీంతో, ఈ ఘటనపై ఘాజియాబాద్ డీసీపీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల స్పందన, వైద్య సహాయం అందించడంలో జరిగిన ఆలస్యం, వైరల్ వీడియోలతో పాటు ఘటన మొత్తం మీద సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
బాబు సభ నుంచి వెళ్ళిపోతున్న జనం వైరల్ అవుతున్న వీడియో
-
మంటల్లో కారు.. ఢిల్లీ టన్నెల్లో టెక్నాలజీతో తప్పిన ముప్పు!
రోడ్డు ప్రమాదాలు, వాహనాల్లో అగ్నిప్రమాదాలు పెరుగుతున్న వేళ.. సకాలంలో స్పందించడమే ప్రాణాలను కాపాడే కీలక అంశంగా మారింది. అయితే చాలా సందర్భాల్లో మానవ ప్రమేయంతో అప్రమత్తమయ్యేలోపే మంటలు వేగంగా వ్యాపించి భారీ నష్టం జరుగుతోంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి పరిస్థితి అదుపు తప్పుతున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థలు ఎంత వేగంగా పనిచేస్తాయో చూపించే ఘటన ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్–ద్వారకా ఎక్స్ప్రెస్వేలోని ఎయిర్పోర్ట్ టన్నెల్లో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా.. అక్కడి ఆటోమేటిక్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్ క్షణాల్లో స్పందించింది. టన్నెల్లో ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో టన్నెల్లో ఉన్న వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అయితే ప్రమాదాన్ని గుర్తించేందుకు మనుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా.. టన్నెల్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ వెంటనే పనిచేసింది. మంటలు గుర్తించిన వెంటనే స్ప్రింక్లర్లు యాక్టివేట్ అయి నీటిని వెదజల్లాయి. దీంతో మంటలు పెద్దగా వ్యాపించకముందే అదుపులోకి వచ్చాయి.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే మంటల కారణంగా వెలువడిన పొగతో కొంతసేపు టన్నెల్ పరిసరాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు.A car caught fire today inside the Airport Tunnel on the Gurugram–Dwarka Expressway, filling the tunnel with smoke.As visibility dropped, vehicles halted outside the tunnel, while the tunnel's automatic fire safety system activated immediately, switching on the sprinklers. The… pic.twitter.com/MfmL8Ouavb— Megh Updates 🚨™ (@MeghUpdates) July 13, 2026టెక్నాలజీ ఉంటే ఎంత తేడా?సాధారణంగా టన్నెల్లలో అగ్నిప్రమాదాలు అత్యంత ప్రమాదకరమైనవి. పరిమిత స్థలం, పొగ వేగంగా వ్యాపించడం, అత్యవసర సమయంలో బయటకు రావడంలో ఇబ్బందులు కారణంగా పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్ భద్రతా వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే స్పందించడం వల్ల మంటలు విస్తరించకుండా అడ్డుకోవచ్చు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంటలు చెలరేగిన వెంటనే టన్నెల్ సేఫ్టీ సిస్టమ్ యాక్టివేట్ కావడం, స్ప్రింక్లర్లు పనిచేయడం చూసి.. అత్యవసర సమయాల్లో ఆధునిక టెక్నాలజీ ఎంత కీలకమో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
షుగర్ సూదులు, మందులు వద్దంటూ వైరల్ డైట్!
"మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది.. ఇక ఇన్సులిన్, మందులు అవసరం లేదు!" అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ డైట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ డైట్ను నమ్మి వేలాది మంది షుగర్ పేషెంట్లు వైద్యులు సూచించిన మందులు ఆపేయడంతో.. ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొందరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.'ఎల్-తయ్యిబాత్' డైట్.. ఆ పదానికి అరబిక్లో "మంచివి" అనే అర్థం. ఈ డైట్ను ఈజిప్టుకు చెందిన మాజీ వైద్యుడు దియా ఎల్-అవాడీ (Diaa El-Awadi) విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆయన ప్రకారం.. తినే తిండిలో కొన్నింటిని దూరంగా పెడితే చాలూ.. డయాబెటిస్ దానంతట అదే తగ్గిపోతుందట!. మధుమేహానికి అసలు కారణం కొన్ని ఆహార పదార్థాలేనని, వాటిని పూర్తిగా మానేస్తే షుగర్ మందులు, ఇన్సులిన్ అవసరమే ఉండదని దియా ఎల్ అవాడీ చెప్పేవాడు. ఆ డైట్లో.. ఆకుకూరలు, గుడ్లు, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు బంద్ చేయాలని సూచించాడు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ కావడంతో.. గుడ్డిగా ఆ మాటలు నమ్మి లక్షలాది మంది ఈ డైట్ను అనుసరించడం ప్రారంభించారు.మందులు ఆపేసి... ప్రాణాల మీదకుఎల్-తయ్యిబాత్ డైట్ను నమ్మి చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారు. యెమెన్లో ఈ బాధితుల సంఖ్య అధికంగా ఉంటోంది. 67 ఏళ్ల మురాద్ అల్-అదిమి అనే మధుమేహి కూడా ఇదే డైట్ను నమ్మాడు. 15 ఏళ్లుగా షుగర్ మందులు వాడుతున్న ఆయన.. ఈ డైట్ పాటిస్తే మందులు అవసరం లేదని తెలిసి వాటిని ఆపేశాడు. మొదటి కొన్ని రోజులు బాగానే అనిపించడంతో స్నేహితులకు కూడా ఇదే డైట్ను సూచించాడు. కానీ పదో రోజుకే ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న ఆయన.."మందుల ఖర్చు తగ్గుతుందని అనుకున్నా.. ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడూ మందులు ఆపొద్దు" అని హెచ్చరిస్తున్నాడు.క్యూ కడుతున్న షుగర్ పేషెంట్లుయెమెన్లోని తైజ్ రిపబ్లికన్ ఆస్పత్రి వైద్యుల ప్రకారం.. గత కొన్ని నెలలుగా అత్యవసర విభాగానికి వస్తున్న మధుమేహుల్లో చాలా మంది ఈ డైట్ను అనుసరించి మందులు మానేసినవారే. చాలామంది తీవ్రమైన షుగర్, డీహైడ్రేషన్, డయాబెటిక్ కీటోఅసిడోసిస్ వంటి ప్రమాదకర పరిస్థితులతో ఆస్పత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలోని పలుదేశాల్లోనూ ఈ తరహా డైట్ పాటించి పలువురు ఆస్పత్రి పాలవుతున్నారనే నివేదికలు వెలువడుతున్నాయి.ఈ డాక్టర్ ఎవరంటే..దియా ఎల్-అవాడీ ఒకప్పుడు ఈజిప్టులో వైద్యుడిగా పనిచేశారు. అయితే శాస్త్రీయ ఆధారాలు లేని వైద్య సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలతో ఈజిప్ట్ వైద్య మండలి ఆయన వైద్య అనుమతిని రద్దు చేసింది. ఆయన నిర్వహిస్తున్న రెండు క్లినిక్లను కూడా 2026 మార్చిలో మూసివేసింది. అనంతరం యూఏఈలో ఉన్న సమయంలో 2026 ఏప్రిల్లో ఆకస్మిక గుండెపోటుతో ఆయన మరణించారు. యూఏఈ వైద్య నివేదిక ప్రకారం ఆయన మరణం సహజ కారణాలతోనే జరిగిందని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని ఈజిప్ట్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే సోషల్ మీడియాలో కుట్ర సిద్ధాంతాలు వైరల్ కావడంతో.. ఆయన ప్రచారం చేసిన ‘ఎల్-తయ్యిబాత్’ (El-Tayyebat) డైట్కు మరింత ప్రచారం లభించింది.ధరలు కూడా కుప్పకూలాయి!ఈ డైట్ ప్రభావం అరబ్ దేశాల్లోని మార్కెట్పైనా పడింది. గుడ్లు, చికెన్, ఆ డైట్లో ఉన్న కూరగాయలు కొనేవారి సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. తైజ్లో గుడ్ల ట్రే ధర 3.5 డాలర్ల నుంచి 1.6 డాలర్లకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు 20 కోళ్లు అమ్మే దుకాణాల్లో ఇప్పుడు ఐదు కూడా అమ్ముడవడం లేదని వారు వాపోతున్నారు.వైద్యులు ఏమంటున్నారు?వైద్యులు, పోషకాహార నిపుణులు మాత్రం ఈ డైట్కు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఆకుకూరలు, గుడ్లు, పప్పుధాన్యాలు, పండ్లు వంటి ఆహారాల్లో శరీరానికి అవసరమైన.. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. వీటిని పూర్తిగా మానేయడం వల్ల పోషకాహార లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు, డైటీషియన్లు సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.సోషల్ మీడియా సలహాలొద్దు"సోషల్ మీడియాలో కనిపించే ప్రతి డైట్ అందరికీ సరిపోదు. కొందరికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. అదే అందరికీ చికిత్స కాదు. ముఖ్యంగా మధుమేహం వంటి వ్యాధుల్లో డాక్టర్ సూచించిన మందులను స్వయంగా ఆపేయడం ప్రాణాలకు ప్రమాదం" అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్క వైరల్ వీడియోను నమ్మి మందులు మానేస్తే.. షుగర్ తగ్గకపోగా ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.గమనిక: మన దేశంలోనూ సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్లో వైరల్ అయ్యే "షుగర్కు అద్భుత చికిత్స" వంటి వీడియోలను చూసి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేయడం ప్రాణాపాయానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న 'బాసింగ బలాలే' పాట
'బాసింగ బలాలే'.. తెలంగాణ జానపదానికి కొత్త ఊపు.. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తున్న ఫోక్ సాంగ్..ఒక మంచి జానపద పాటకు కాలంతో సంబంధం ఉండదు. మట్టివాసన, పల్లె పలుకులు, సంప్రదాయాల సోయగం కలిస్తే ఆ పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రస్తుతం అలాంటి ఆదరణనే సొంతం చేసుకుంది 'బాసింగ బలాలే' ఫోక్ సాంగ్. తెలంగాణ పల్లె సంస్కృతిని, పెళ్లి వేడుకల సందడిని, గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే ఈ పాట సోషల్ మీడియా వేదికలపై విపరీతమైన ఆదరణ పొందుతోంది. "బాసింగం" అనేది తెలుగు సంప్రదాయ వివాహాల్లో వధూవరులు నుదుటిపై ధరించే పవిత్రమైన అలంకారం. పెళ్లి వేడుకలో దానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అదే సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన "బాసింగ బలాలే" పాటలో తెలంగాణ యాస, జానపద సంగీతం, డప్పు బీట్లు, ఉత్సాహభరితమైన సాహిత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.పాట విడుదలైన నాటి నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో లక్షలాది వీడియోలు రూపొందుతున్నాయి. పెళ్లిళ్లు, హల్దీ వేడుకలు, కాలేజీ ఈవెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా ఎక్కడ చూసినా 'బాసింగ బలాలే' పాటే మార్మోగుతోంది. చిన్నారుల నుంచి యువత వరకు ఈ పాటకు ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. -
ప్రశ్నిస్తే జైలు.. నిలదీస్తే ఉపా!
సాక్షి, అమరావతి: తాను ప్రతిపక్షంలో ఉంటే సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి గొంతుక. అధికారంలోకి వచ్చాక అదే సోషల్ మీడియా ఒక ముప్పు. ఇదీ చంద్రబాబు నైజం. 2024 ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వేల మంది సోషల్ మీడియా ప్రతినిధులు, యూట్యూబ్ ఛానళ్లు, ఇన్ఫ్లుయెన్సర్ల సైన్యంతో విష ప్రచారం చేయిస్తూ యుద్ధం నడిపిన టీడీపీ, జనసేన కూటమి.. ఇప్పుడు తమను ప్రశ్నించే ప్రతి గొంతుపైనా ఉక్కుపాదం మోపుతోంది. కేసులు, అర్ధరాత్రి అరెస్టులు, నిర్బంధాలు, ఖాతాల ఫ్రీజ్లు, చివరికి ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టం దాకా అణచివేత పరంపర కొనసాగిస్తోంది.సోషల్ మీడియా గొంతు పిసికేందుకు ఏకంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసే వరకూ వెళ్లింది. తన వైఫల్యాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను చంద్రబాబు భరించలేకపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా కనిపించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయె న్సర్లు.. ఇప్పుడు చంద్రబాబుకు నేరగాళ్లుగా కనిపిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా నోరెత్తే వారిని జైలుకు పంపుతామని స్వయంగా ఆయనే బెదిరించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది.జిల్లాకొక నిఘా విభాగంతో వేట సోషల్ మీడియా ద్వారా తమను విమర్శిస్తున్న, ప్రశ్నిస్తున్న వారిని గుర్తించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సైబర్ గార్డ్ విభాగాలు, జిల్లా స్థాయి సోషల్ మీడియా పర్యవేక్షణ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి గత రెండేళ్లలోనే ప్రతిపక్ష పార్టీకి చెందిన వారితోపాటు సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఏకంగా 2వేల వరకూ కేసులు నమోదు చేశారు. సాక్ష్య పోర్టల్ ద్వారా తమకు అనుకూలంగా లేవంటూ 15 వేల వెబ్ లింకులను తొలగించారు. సగటున రోజుకు రెండు కేసులు పెడుతున్నారు. 20 లింకులను తొలగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారి అభిప్రాయాలపై ఇంత భారీగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాజాగా పోలీసు యంత్రాంగం మొత్తాన్ని విమర్శకుల వేటకు వాడుతుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. రెండేళ్లలో ఎన్నెన్నో అరాచకాలుఈ రెండేళ్లలో ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎలా విరుచుకుపడ్డారో చూస్తే ప్రభుత్వ కక్షసాధింపు తీరు అర్థమవుతుంది. యూరియా కొరతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పోస్టు పెట్టాడనే కారణంతో సాయి భార్గవ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టును ఏకంగా సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఒక సోషల్ మీడియా పోస్టుకు సీఐడీ రంగంలోకి దిగడం విశేషం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే కారణంతో బొసా రమణ అనే యాక్టివిస్టును వేధించి అరెస్టు చేశారు. ఈ అరెస్టు వ్యవహారంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రమణ కోసం భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాల్సి వచ్చింది. తమను ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతుండడంతో వైఎస్సార్సీపీకి చెందిన అవుతు శ్రీధర్రెడ్డిని అరెస్టు చేయగా, ఆయనకు కింది కోర్టు విధించిన రిమాండ్ చట్టవిరుద్ధమని హైకోర్టు కొట్టేసింది. ఏకంగా పొరుగు రాష్ట్రం తెలంగాణలోకి వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్టు కేవీఆర్ను అర్ధరాత్రి హైదరాబాద్లో అరెస్టు చేశారు. అడ్డుకోబోయిన ఆయన భార్యను పోలీసులు బలవంతంగా నెట్టేసిన దృశ్యాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. యూట్యూబర్ రావణ్పై ఏకంగా ఉపా ప్రయోగం కలకలం రేపింది.నాడు టీడీపీ కోసం వేల మంది.. సోషల్ మీడియా వారియర్లు 2024 ఎన్నికల ముందు ఇదే సోషల్ మీడియాను టీడీపీ, జనసేన ఏ స్థాయిలో వాడుకున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారానికి, అసత్య కథనాలకు వేల మంది సోషల్ మీడియా వారియర్లను రంగంలోకి దింపి పని చేయించారు చంద్రబాబు. అప్పటి సీఎం జగన్ చెప్పిన ప్రతి మాట, ప్రభుత్వం చేసిన ప్రతి పని మీద సోషల్ మీడియాను ప్రయోగించారు చంద్రబాబు. అప్పుడు అది ఆయనకు భావ ప్రకటనా స్వేచ్ఛగా కనిపించింది. 2023లో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తాను అరెస్టయినప్పుడు దేశ విదేశాల్లోని టీడీపీ సానుభూతిపరులతో సోషల్ మీడియాలో ఉద్యమమే నడిపించింది టీడీపీ. అప్పుడు సోషల్ మీడియా వారికి రక్షణ కవచంగా ఉపయోగపడింది. ఇప్పుడు అదే చంద్రబాబుకు నేరగాళ్ల వేదికగా కనిపిస్తోంది. ఆయన్ను విమర్శించే ప్రతి ఒక్కరికీ జగన్ ద్వారా ఫండింగ్ అందుతోందంటూ నేరస్తులుగా ముద్ర వేస్తున్నారు. తాను అధికారంలోకి రావడానికి నిచ్చెనగా ఉపయోగపడిన సోషల్ మీడియానే ఇప్పుడు తన ప్రభుత్వ అసలు రూపాన్ని ప్రజల ముందు పెడుతుంటే చంద్రబాబు ఏ మాత్రం భరించలేకపోతున్నారు.సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని అడిగే గొంతులను టాస్క్ఫోర్స్తో మూయించాలని చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగాలు, మానసిక వేధింపులు, యాక్టివిస్టులను నేరస్తుల తరహాలో మీడియా ముందు నిలబెట్టడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు పని చేస్తోంది. తద్వారా తన ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు బయటకు రాకుండా చేయాలని కంకణం కట్టుకుంది. ఇలా ఎన్ని చేసినా రోజుకో బాగోతం వెలుగు చూస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీలే బ్లాక్ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతానే తొలగించడం, పార్టీ ఫేస్బుక్ పేజీని భారత్లో అందుబాటులో లేకుండా చేయడం దాకా ఈ అణచివేత వెళ్లింది. ఐటీ యాక్ట్ కింద సోషల్ మీడియా పోస్టులకు నేరుగా అరెస్టులు చేయొద్దన్న సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా, రాష్ట్రంలో అవి అమలు కావడం లేదంటే అణచివేత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
‘‘ఈ20 పెట్రోల్తో మైలేజ్ ఎన్నడూ లేనంతగా పడిపోయింది’’
భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్లాగర్ సౌరవ్ జోషి ఈ20 పెట్రోల్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "కారు ఇంతకుముందు 17 కిలోమీటర్లు/లీటర్ మైలేజ్ ఇచ్చేది. అది మొదట 9 కిలోమీటర్లు/లీటర్కు పడిపోయింది. ఇప్పుడు మరింత తగ్గి కేవలం 5 కిలోమీటర్లు/లీటర్ మాత్రమే ఇస్తోంది" అని తెలిపారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్లే తన కారు మైలేజ్ భారీగా పడిపోయిందని ఆయన ఆరోపించారు. 41 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లున్న తన యూట్యూబ్ ఛానల్లో ఇటీవల అప్లోడ్ చేసిన ‘రేస్ విత్ బ్రదర్స్. కోన్ జీతేగా?’ అనే వీడియో వ్లాగ్లో, తన మెర్సిడెస్-బెంజ్ ఎస్యూవీ డ్యాష్బోర్డ్లో కనిపిస్తున్న వివరాలను చూపిస్తూ అసహనం వ్యక్తం చేశారు.సౌరవ్ జోషి ఏమన్నారు? ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జోషి.. కేవలం 48 గంటల్లోనే తన కారు మైలేజ్ ఎన్నడూ లేనంతగా పడిపోయిందని చెప్పారు. “నిన్న మన కారు మైలేజ్ 17 నుంచి నేరుగా 9కి పడిపోయిందని చూపించాను. ఈ రోజు అది ఎంత అయిందో తెలుసా? ఇప్పుడు అది 5కి చేరింది... చూడండి, మైలేజ్ 5 అని చూపిస్తోంది” అని జోషి చెప్పారు.పూర్తి వీడియో ఇది.. ఈ వీడియోలో 4 నిమిషాల తర్వాత జోషి ఈ20 గురించి మాట్లాడారు.. స్థానిక పెట్రోల్ బంకుల్లో లభిస్తున్న ఇంధనంపైనే జోషి నింద మోపారు. “ఇథనాల్ వల్లే ఇలా జరిగింది” అని ఆయన అన్నారు. ఆయనతో పాటు వ్లాగ్లు చేసే ఆయన భార్య అవంతికా భట్ కూడా స్పందిస్తూ.. “ఈ కారు కోసం ఎంత డబ్బు ఖర్చు చేశాం!” అని అన్నారు.గతంలో ఒకసారి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నింపితే సుమారు 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని చూపించేదని, ఇప్పుడు మాత్రం ట్యాంక్ నింపిన వెంటనే కేవలం 480 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే చూపిస్తోందని చెప్పారు. ఈ భారీ తగ్గుదల వల్ల జర్మనీకి చెందిన ఈ ఎస్యూవీలోని పెట్రోల్ ఇంజిన్ దెబ్బతింటుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.“ఈ కారు ఎప్పుడు ఆగిపోతుందో నాకు తెలియదు... ఇప్పుడు పెట్రోల్ నింపించాలంటేనే భయంగా ఉంది” అని చెప్పారు. తన దగ్గర మరో మెర్సిడెస్ ఎస్యూవీ జీ-వాగన్ విద్యుత్ వెర్షన్ కూడా ఉందని, దాంతో ఇథనాల్పై ఆందోళన ఉండదని చెప్పారు. విలాసవంతమైన కారులో యాంత్రిక లోపం వస్తే నగర శివార్లు, చిన్న పట్టణాల్లో నివసించే వారికి పెద్ద ఇబ్బందిగా మారుతుందని కూడా చెప్పారు.“ఇది మెర్సిడెస్ కారు కదా. సమస్య వస్తే ఢిల్లీకి పంపాల్సి వస్తుంది... పెట్రోల్ ఖరీదైనదే కాదు, కారు చెడిపోతే మరమ్మతుల ఖర్చు కూడా చాలా ఎక్కువ” అని చెప్పారు. ఈ వీడియోలోని భాగం ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది.ప్రభుత్వం ఏమంటోంది?కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, ముడి చమురు దిగుమతులను తగ్గించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) అందుబాటులోకి తీసుకురావాలని భారత్ ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. అయితే, ఎక్కువ ఇథనాల్ ఉన్న ఇంధనాన్ని పాత ఇంజిన్లు తట్టుకోగలవా అనే ఆందోళనను కారు యజమానుల్లో కనపడుతోంది.కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఈ20 పెట్రోల్ వల్ల తుప్పు వస్తుందనే ఆరోపణలను తిరస్కరించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టులను తప్పుడు ప్రచారంగా పేర్కొన్నారు. విమర్శలు చేస్తున్నవారు స్పష్టమైన ఆధారాలు చూపాలని సవాలు చేశారు. “ఈ20 పెట్రోల్ వల్ల ఏ కారూ సమస్య ఎదుర్కొన్న ఉదాహరణ లేదు... సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అంతా సమన్వయంతో చేస్తున్న తప్పుడు కథనం” అని చెప్పారు.Vlogger Saurabh Joshi"My car mileage has dropped from 17 to 9, today it further dropped to 5All this is because of Ethanol, it's so dishearteningI spent so much money on this car and look at the condition,all becoz of Ethanol"The relaity is slowly hitting everyone !! pic.twitter.com/LPU0l2pomr— Nehr_who? (@Nher_who) July 12, 2026 -
ప్రశ్నిస్తే ప్రతీకారమా.. కేసులతో కట్టడి చేయగలరా?
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం పత్రికా రంగం అయితే, నేటి ఆధునిక సమాజంలో సామాన్యుడి ఆయుధం, ఐదో స్తంభం 'సోషల్ మీడియా'. కోట్లాది మంది ప్రజలు తమ భావాలను పంచుకోవడానికి, పాలకుల తప్పులను ఎండగట్టడానికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడానికి సోషల్ మీడియా ఒక వేదికగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, పాలకులలో జవాబుదారీతనాన్ని పెంచుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం భిన్నమైన, తీవ్ర ఆందోళనకరమైన మార్గంలో ప్రయాణిస్తోంది.ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిని, సామాజిక మాధ్యమాలలో ప్రశ్నించే వారిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు. ఇది కేవలం ఒక వర్గాన్నో, ఒక పార్టీ కార్యకర్తనో కట్టడి చేసే చర్య కాదు. పౌరుల ప్రాథమిక హక్కు అయిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ను ఖూనీ చేసే కుట్ర. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత కీలకమైనది. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీసే హక్కు, విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. కానీ నేడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తుంటే విమర్శిస్తే అర్ధరాత్రి అరెస్టులు, ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు బనాయించే సంస్కృతి రాజ్యమేలుతోంది. ఇటీవల కాలంలో పోలీసులు ఏర్పాటు చేసిన సోషల్ మీడియా మానిటరింగ్ యూనిట్లు, ప్రభుత్వ విమర్శకులను ఏరివేసే ప్రత్యేక టాస్క్ ఫోర్స్లు రాజ్యాంగ రక్షణల కంటే పాలకుల అజెండాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయనేది స్పష్టమవుతోంది.తాజాగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం సోషల్ మీడియాను క్రమబద్ధీకరించడం కాదు, పాలకులపై వస్తున్న వ్యతిరేక గొంతులను శాశ్వతంగా నొక్కేయడమేనని మేధావులు, హక్కుల సంఘాల నేతలు భావిస్తున్నారు. తప్పులను సరిదిద్దుకోవాల్సిన పాలకులు, తప్పులను ఎత్తిచూపిన వారిపై పగబట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా సోషల్ మీడియా కార్యకర్తలు, స్వతంత్ర యూట్యూబర్లపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టుల పరంపర అమానుష కాండను తలపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వ్యక్తిపై వరుసగా కేసులు పెట్టడం, ఒక కేసులో బెయిల్ రాగానే మరో పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకో కేసులో అరెస్ట్ చేయడం వంటి అప్రజాస్వామిక చర్యలు నిత్యకృత్యమయ్యాయి.ఈ అణచివేత పర్వంలో కొన్ని ప్రధానమైన ఉదాహరణలను పరిశీలిస్తే వ్యవస్థ ఎంతలా దుర్వినియోగం అవుతుందో అర్థమవుతుంది. యూట్యూబర్లపై ‘ఉగ్రవాద’ ముద్ర వేయడం దారుణమైన విషయం. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసినందుకు 'ప్రశ్న' యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు ప్రశ్న రావణ్ ను పోలీసులు ఐదు రోజుల్లో ఐదుసార్లు వరుసగా అరెస్ట్ చేశారు. కోర్టులు ఒకదాని తర్వాత ఒకటి బెయిల్స్ ఇస్తున్నా, అతను జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడానికి ఏకంగా అత్యంత కఠినమైన 'ఉగ్రవాద నిరోధక చట్టం' UAPA కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట. కేవలం మాటలతో విమర్శలు చేసిన ఒక సామాజిక కార్యకర్తపై దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించాడనే నెపంతో దేశద్రోహం, ఉగ్రవాద చట్టాలు ప్రయోగించడం విస్మయానికి గురిచేస్తోంది.ప్రతిపక్ష పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను, నెటిజన్లను కక్షపూరితంగా టార్గెట్ చేస్తున్నారు. వందలాది మంది కార్యకర్తలపై పాత పోస్టులను వెలికితీసి, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ కేసులు పెడుతున్నారు. వేల సంఖ్యలో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలపై నిఘా ఉంచి, ఇళ్లకు వెళ్లి వేధించడం, కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేయడం వంటి పద్ధతులు నేడు ఏపీలో సాధారణమైపోయాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం కాదు అని పదే పదే స్పష్టం చేశాయి. కక్షపూరిత రాజకీయం కోసం ఐపీసీ ప్రస్తుత బీఎన్ఎస్, ఐటీ చట్టాలను దుర్వినియోగం చేయవద్దని కోర్టులు గైడ్లైన్స్ ఇచ్చినా, క్షేత్రస్థాయిలో పోలీసులు పాలకుల మెప్పు కోసం చట్టాలను చుట్టాలుగా మార్చేస్తున్నారు.ప్రభుత్వం అధికారికంగా మహిళల రక్షణ, అసభ్యకర పోస్టుల అదుపు పేరుతో చట్టాలను కఠినతరం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఆచరణలో అవి కేవలం రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడానికే ఉపయోగపడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షాల మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఎంతటి దారుణమైన పోస్టులు పెట్టినా, మార్ఫింగ్ వీడియోలు చేసినా ఎలాంటి చర్యలు ఉండవు. కానీ, ప్రతిపక్ష లేదా తటస్థ కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలును ప్రశ్నిస్తే మాత్రం ఐటీ యాక్ట్, బీఎన్ఎస్ లోని కఠిన సెక్షన్లు తెరపైకి వస్తాయి. పోలీస్ స్టేషన్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగాలు, మానసిక వేధింపులు, సోషల్ మీడియా కార్యకర్తలను నేరస్థుల తరహాలో మీడియా ముందు నిలబెట్టడం వంటి చర్యల ద్వారా సమాజంలో భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారు. 'మేము చెప్పిందే వినాలి, మేము చేసిందే రాయాలి, ప్రశ్నిస్తే జైలు గదులు సిద్ధంగా ఉంటాయి' అనే అలిఖిత నియంతృత్వ విధానాన్ని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారు.తుపాకీ గుండ్లకైనా ఎదురొడ్డి నిలబడే శక్తి అక్షరానికి మరియు ఆలోచనకు ఉంటుంది. చరిత్రలో ఏ రోజూ అణచివేత శాశ్వతంగా గెలవలేదు. గతంలో సామాజిక మాధ్యమాల గొంతు నొక్కాలని చూసిన ఏ ప్రభుత్వమూ ప్రజా క్షేత్రంలో నిలబడలేకపోయింది. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది పాలకులను సరైన దారిలో పెట్టే ఒక టానిక్ లాంటిది. దాన్ని విషంగా భావించి నెటిజన్ల మీద యుద్ధం ప్రకటించడం చంద్రబాబు ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు.ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఇప్పటికైనా తన కక్షసాధింపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా విమర్శించే హక్కును గౌరవించాలి. అక్రమ అరెస్టులు, ఉపా వంటి కఠిన చట్టాల దుర్వినియోగాన్ని తక్షణమే ఆపాలి. లేనిపక్షంలో, ఈ రోజు నెటిజన్ల గొంతు నొక్కడానికి ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు, రేపు పాలకుల పతనానికి పునాదిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాను నిషేధించవచ్చు లేదా కట్టడి చేయవచ్చు.. కానీ ప్రజల మనసుల్లో రగిలే అసంతృప్తిని ఏ చట్టాలూ ఆపలేవు!-కంచర్ల యాదగిరిరెడ్డిమేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ. -
డెలివరీ పేరుతో ఇంట్లోకి ఎంట్రీ.. వికృత చేష్టలతో ఖంగుతిన్న మహిళ
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళకు డెలివరీ ఏజెంట్ కారణంగా భయానక అనుభవం ఎదురైంది. పార్సిల్ డెలివరీ కోసం ఇంటికి వచ్చిన వ్యక్తి టాయిలెట్ ఉపయోగించుకోవాలని కోరగా, మహిళ అందుకు నిరాకరించింది. అయితే ఆమె మాటను పట్టించుకోకుండా అతడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది. సాధారణ డెలివరీగా మొదలైన ఘటన చివరకు తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వీడియోలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి పార్సిల్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ వెళ్లే ముందు టాయిలెట్ ఉపయోగించుకోవాలని అడిగాడు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్నందున ఆమె అందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఆమె వద్దని చెప్పినా పట్టించుకోకుండా సదరు వ్యక్తి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడని మహిళ ఆరోపించింది. ఆ తర్వాత జరిగిన ఘటనతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. తన ఎదుట ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఆమె ఎదుట తన దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆమె వెంటనే తలుపులు మూసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.एक महिला ना कहने पर भी एक लड़का उनका Washroom Use किया उनको उसका Private Part दिखाए 😡।एक Flipkart/Myntra का Delhivery Boy parcel लेेकर आता है एक लड़की के पास उसके बाद उन्होंने कहा कि आपका Washroom Use कर सकता हूं क्या ।लेकिन वो लेडीज अकेला रहता है इसलिए ना कहा लेकिन वो नहीं… pic.twitter.com/rJFaJVRUWT— Subhajit Das (@SantaniSubhajit) July 11, 2026ఈ ఘటన అనంతరం బాధితురాలు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో వీడియో రూపంలో వెల్లడించింది. ఆమె పోస్టు వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫిర్యాదు అందించాలని బాధితురాలిని కోరిన పోలీసులు, ఫిర్యాదు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాగా, ఇటీవలి కాలంలో డెలివరీ సిబ్బందితో సంబంధం ఉన్న కొన్ని వివాదాస్పద ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఈ ఘటన కూడా ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అపరిచితులకు ఇంట్లోకి ప్రవేశం కల్పించకూడదని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. -
సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల సంతాపం
ఎస్. జానకి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తపరిచారు. మధురమైన అమృత గాత్రంతో తరతరాలుగా శ్రోతలను అలరించారు జానకమ్మగారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – రజనీకాంత్ఆమె పాడిన పాటలు ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి... కానీ ఆ ప్రేమను నేను ఎక్కడ వెతకాలమ్మా... భరించలేని దుఃఖంలో చాలామంది ఉన్నారు. వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. – కమల్హాసన్ జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనక జానకమ్మగారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ ఆ రోజులు, ఆ జ్ఞాపకాలు, మళ్లీ కళ్ల ముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మగారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది. – చిరంజీవిగాన కోకిల, లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్. జానకమ్మగారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాదిమంది సంగీతాభిమానులను అలరించిన జానకమ్మగారు ఇక లేరనే వార్త యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి చిత్రాలతో పాటు... నా చిత్రాలలోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజాదరణ ΄÷ందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు దశాబ్దాల అనుబంధం ఉంది. తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేసిన జానకమ్మగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. – బాలకృష్ణ ప్రఖ్యాత గాయని శ్రీమతి ఎస్. జానకిగారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు గాయనీమణుల్లో ఒక ఆణిముత్యం లాంటివారు జానకిగారు. ఆమె గాత్రం ఎంతో మధురమైనది. ‘నిరీక్షణ, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, స్వాతి ముత్యం, జగదేక వీరుడు అతిలోకసుందరి, ప్రతిఘటన, అంతఃపురం’ లాంటి చిత్రాల్లో జానకిగారు పాడిన గీతాలను తెలుగు వారు ఎప్పటికీ మరచిపోరు. – పవన్ కల్యాణ్ -
సోషల్ మీడియా డైట్ మేనియా
‘మొలకెత్తిన గింజలు తినండి... జబ్బులన్నీ పరార్’‘చిరుధాన్యాలు తినండి... చిటికెలో ఆరోగ్యం పొందండి’‘రోజూ పాతిక గుడ్లు తినండి... తేలికగా బరువు తగ్గించుకోండి’‘ఆకుకూరలు తినండి.... ఆయురారోగ్యాలు పొందండి’ఇవన్నీ సోషల్ మీడియాలో మార్మోగిపోయే మాటలు. యూట్యూబ్ తెరిచినా, ఇన్స్ట్రాగ్రామ్ తెరిచినా ఉచిత ఆరోగ్య, ఆహార సలహాలతో ఊదరగొట్టే మహానుభావులు కనిపిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటనే దానిపై వీరెవరికీ ఏకాభిప్రాయం ఉండదు. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క సిద్ధాంతం. ఒకరు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం చిరుధాన్యాలను తినాలంటారు. ఇంకొకరు ఆకులు అలములు మొలకలతోనే అద్భుతమైన ఆరోగ్యం సాధ్యమని ప్రవచిస్తారు. మరొకరు ‘ఉష్ణం ఉష్ణేన శీతలం’ అన్నట్లుగా కొవ్వును కొవ్వుతోనే కరిగించవచ్చని నమ్మకంగా చెబుతారు.‘నా సలహా పాటిస్తే డయాబెటిస్, బీపీ దగ్గరకే రావు; మీ గుండె ఉక్కు గుండులా మారుతుంది’ అని చెబుతారొకరు. ‘నేను చెప్పే ఆహార పద్ధతిని పాటిస్తే క్యాన్సర్ కూడా పరారవుతుంది’ అని సవాలు చేస్తారొకరు. ‘నేను చెప్పిన కషాయాలు తాగుతూ, ఆకులు అలములు మొలకలు తింటే అరవైలోనూ ఇరవైలా ఉరకలేస్తారు’ అని ఢంకా బజాయిస్తారు మరొకరు. సోషల్ మీడియాలో వీళ్ల వీడియోలు చూసే జనాలు గందరగోళంలో పడుతుండటం మామూలుగా మారింది. ముందు వెనుకలు ఆలోచించకుండా, నిపుణులను సంప్రదించకుండా, సోషల్ మీడియాలో ఊదరగొట్టే ఆహారారోగ్య ప్రవాచకుల సలహాలు పాటించడం వల్ల ఆస్పత్రుల పాలవుతున్నవారు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారు ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలను ఊదరగొట్టేవారిలో అత్యధికులు వైద్యులు కాదు. కనీసం అర్హత కలిగిన న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు కూడా కాదు. వీళ్లంతా స్వయంప్రకటిత నిపుణులు. వీళ్లలో కొందరు కేవలం తోచిన సలహాలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోకుండా; డాక్టర్లను, ఆధునిక వైద్యరంగాన్ని పూచికపుల్లతో సమానంగా తీసిపారేస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు. ఇదేదో మన దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ప్రబలుతోంది.థంబ్నెయిల్ ప్రచారాలుసోషల్ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుంటాయి. ఈ సలహాలు చెప్పేవారిలో చాలామందికి పోషకాహార శాస్త్రంలో గాని, వైద్యశాస్త్రంలో గాని ఎలాంటి అర్హతలూ ఉండవు. అర్హులైన వారి వీడియోల కంటే అనర్హుల వీడియోలే ఎక్కువగా సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. వీటిలో దాదాపు 70 శాతానికి పైగా వీడియోలు ‘స్వయంప్రకటిత’ నిపుణులవే! సోషల్ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలు చెబుతూ వీడియోలు చేసేవారిలో అర్హులైన న్యూట్రిషనిస్టులు, వైద్యులు 30 శాతానికి లోపే ఉంటున్నారు.‘సోషల్ మీడియాలో స్వయంప్రకటిత నిపుణులు చెప్పే ఆహార ఆరోగ్య సలహాలకు ఎలాంటి ఆధారాలూ ఉండవు. వీటిలో ఉండేది చాలావరకు తప్పుడు సమాచారమే’ అని కెనడాలోని డల్హౌసీ యూనివర్సిటీలోని మెడిసిన్ రీసెర్చ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ లీ కేహిల్ తన అధ్యయనంలో వెల్లడించారు. ‘సోషల్ మీడియాలోని వీడియోలు చూస్తూ, రకరకాల ఆహార ప్రయోగాలు చేయడం వల్ల సమస్యల బారినపడ్డ వారు చాలామంది నా వద్దకు వస్తుంటారు. సోషల్ మీడియాలో చూసే సమాచారం ఎంతవరకు కచ్చితమైనదో తెలుసుకునే ప్రయత్నం ఎవరికి వారే చేయాలి. పోషకాహారం గురించి, ఆరోగ్య సమస్యల గురించి సాధికారికమైన సమాచారాన్ని అందించే వెబ్సైట్లు, వీడియోలు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం వల్ల గుండె సమస్యలతో బాధపడేవారు ఉత్తపుణ్యానికి పరిస్థితిని మరింత జటిలం చేసుకుంటున్నారు’ అని కెనడాలోని ఒటావాకు చెందిన రిజిస్టర్డ్ డైటీషియన్ వెరోనికా రోజ్ చెబుతున్నారు. పోషకాహారం గురించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అపోహలను తొలగించి, శాస్త్రీయంగా వాస్తవాలను వెల్లడించడానికి తాను కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు పెడుతున్నట్లు ఆమె తెలిపారు.‘ఇన్స్టాగ్రామ్’లో ఆహార సలహాలు ఇచ్చేవారి వీడియోల్లో దాదాపు సగానికి సగం తప్పుడు సమాచారంతో కూడుకున్నవేనని ఆస్ట్రేలియాలోని డీకిన్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ న్యూట్రిషన్ (ఐపీఏఎన్) ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం లక్షకు పైగా ఫాలోవర్లు కలిగిన వారి ఖాతాలనే నమూనాగా తీసుకున్నారు. ‘సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చించే అంశాల్లో పోషకాహారం కూడా ఒకటి. అయితే, సోషల్ మీడియా ద్వారా ఈ అంశంపై జనాలకు అందుతున్న సమాచారంలో కచ్చితత్వం, ప్రామాణికత కొరవడుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం. సోషల్ మీడియా ద్వారా అర్హతలు లేకుండానే పోషకాహార, ఆరోగ్య సలహాలు ఇచ్చేవారిని కొన్ని ఫుడ్ సప్లిమెంట్ బ్రాండ్లు తమ ప్రచారం కోసం కూడా వాడుకుంటున్నాయి’ అని ఈ అధ్యయనం జరిపిన రీసెర్చ్ స్కాలర్ ఎమిలీ డెన్నిస్ తెలిపారు. సోషల్ మీడియాలో స్వయంప్రకటిత నిపుణులు ఇచ్చే ఆహార ఆరోగ్య సలహాపైన, వారు ప్రచారం చేసే ఫుడ్ సప్లిమెండ్ బ్రాండ్లపై జనాలు అప్రమత్తంగా ఉండాలని ఎమిలీ హెచ్చరిస్తున్నారు.తప్పుడు సమాచారానికి ఉదాహరణలుసోషల్ మీడియాలో ఆహార ఆరోగ్యాల గురించి ప్రమాదకరమైన స్థాయిలో తప్పుడు సమాచారం వచ్చి పడుతోంది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న తప్పుడు ప్రచారం గురించి కొన్ని ఉదాహరణలు, వాస్తవాలు...ప్రచారం: చక్కెర పూర్తిగా విషం. వాస్తవం: చక్కెర విషమేమీ కాదు. చక్కెర తక్షణ శక్తిదాయకం. పరిమిత మోతాదులో చక్కెర తీసుకోవడం వల్ల నష్టమేమీ ఉండదు.ప్రచారం: ఆల్కలైన్ వాటర్తో అన్నీ నయమైపోతాయి.వాస్తవం: ఆల్కలైన్ వాటర్ శరీరంలోని పీహెచ్ స్థాయిని మార్చేస్తుందని చాలామంది ప్రచారం చేస్తున్నా, ఇది పూర్తి అవాస్తవం. శరీరం తన పీహెచ్ స్థాయిని తానే నియంత్రించుకుంటుంది. ఆల్కలైన్ వాటర్ వల్ల శరీరంలోని పీహెచ్ స్థాయి అమాంతం మారిపోదు. దాని వల్ల వ్యాధులు నయం కావు.ప్రచారం: గ్లూటెన్ చాలా హానికరం.వాస్తవం: గోధుమలు, బార్లీ వంటి వాటిలో గ్లూటెన్ ఉంటుంది. వీటి పిండితో తయారు చేసే రొట్టెలు, బిస్కట్లు తదితర పదార్థాల్లో ఉండే గ్లూటెన్ కొద్దిమందికి సరిపడదు. ఈ పరిస్థితిని ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ అంటారు. ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ లేనివారికి గ్లూటెన్ వల్ల జరిగే హాని ఏమీ ఉండదు.ప్రచారం: ఈ ఆహారాలతో క్యాన్సర్ నయమవుతుంది.వాస్తవం: సీతాఫలం గింజలు, లక్ష్మణఫలం, పసుపు, వెల్లుల్లి వంటి పదార్థాలు క్యాన్సర్ను నయం చేస్తాయని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలతోను, ప్రత్యేక ఆహార పద్ధతులతోనే క్యాన్సర్ను నయం చేయడం అసాధ్యం. క్యాన్సర్కు కీమో థెరపీ, రేడియో థెరపీ, ఇమ్యూనో థెరపీ వంటి చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లకు శస్త్రచికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది.ప్రచారం: మా డైట్ ప్లాన్తో వారం రోజుల్లోనే పదికిలోల బరువు తగ్గవచ్చువాస్తవం: ఎలాంటి డైట్ ప్లాన్తోనైనా తక్కువ వ్యవధిలో ఎక్కువ బరువు తగ్గడం దాదాపు అసాధ్యం. ఒకవేళ అందుకు ప్రయత్నించినా, శరీరంలో పోషక లోపాలు ఏర్పడి అనర్థాలు తలెత్తవచ్చు.ప్రచారం: డీటాక్స్ డ్రింక్స్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేస్తాయి.వాస్తవం: నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్ సహా పలు డీటాక్స్ డ్రింక్స్ లివర్, కిడ్నీల పనిని పూర్తిగా భర్తీ చేస్తాయని కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవం. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో లివర్, కిడ్నీలు సహజంగానే డీటాక్సిఫికేషన్ చేస్తాయి. ఇవి పాడైనప్పుడు తగిన వైద్య చికిత్స తప్పనిసరి.ప్రచారం: డయాబెటిస్కు మందులు అక్కర్లేదు.వాస్తవం: డయాబెటిస్కు మందులు వాడటం అనవసరమని; వేపాకు, నేరేడు ఆకు, మెంతాకు వంటి ఆకులు తీసుకుంటే పూర్తిగా నయమవుతుందని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. కొన్నిరకాల ఆకులు, పండ్లు వంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి స్వల్పంగా అదుపులోకి వచ్చినా, ఇవేవీ డయాబెటిస్ చికిత్సకు పూర్తి ప్రత్యామ్నాయం కావు.ప్రచారం: నూనెలు, నెయ్యి, ఇతర కొవ్వులతోనే ఆరోగ్య సమస్యలువాస్తవం: సమతుల పోషకాహారంలో కొవ్వులు కూడా తప్పనిసరి భాగంగా ఉండాలి. కొవ్వులను, నూనెలను పూర్తిగా మానేస్తే పోషక లోపాలు ఏర్పడతాయి. కొవ్వుల్లో కరిగే ఏ, డీ, ఈ, కే విటమిన్ల లోపం ఏర్పడి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే నూనెలు, కొవ్వులను తగిన మోతాదులో వాడాలి.ప్రచారం: ఎంత కొవ్వు తిన్నా హానిలేదు.వాస్తవం: వెన్న, నెయ్యి, కొబ్బరినూనె ఎంత తిన్నా ఏమీ కాదని, వీటితో బరువు తగ్గవచ్చని కొందరి ప్రచారం. ఇవి మితిమీరితే బరువు తగ్గకపోగా, పెరిగే అవకాశాలే ఎక్కువ. పైగా ఒంట్లో కొవ్వు మితిమీరితే అధిక బరువు మొదలుకొని గుండెజబ్బుల వరకు రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.ప్రచారం: కీటో డైట్తో డయాబెటిస్ పూర్తిగా నయమవుతుంది.వాస్తవం: కీటో డైట్ తీసుకుంటే, డయాబెటిస్ మందులతో పని ఉండదని కొందరి ప్రచారం. కీటో డైట్ వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ కొంత మెరుగుపడవచ్చు. అలాగని డాక్టర్లు సూచించిన మందులు వాడటం ఆపేస్తే పరిస్థితి విషమించే ప్రమాదాలు ఉంటాయి.తప్పుడు సమాచారం ఉచ్చులో యువతరంసోషల్ మీడియాలో వచ్చే ఆహార ఆరోగ్య సలహాలకు సంబంధించిన తప్పుడు సమాచారానికి యువతరమే ఎక్కువగా ప్రభావితమవుతోందని పలు అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. తెలిసీ తెలియని స్థితిలో ఉండే 18–25 ఏళ్ల లోపు వయసువారు ఈ వీడియోల ద్వారా ప్రభావితమై, కనీసం నిపుణులను సంప్రదించకుండా రకరకాల ఆహార పద్ధతులను పాటిస్తూ ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని న్యూజీలండ్కు చెందిన ‘సెంటర్ ఫర్ న్యూట్రిషనల్ సైకాలజీ’ అధ్యయనం వెల్లడించింది.శరీరాకృతి, చర్మం తీరు, జుట్టు తీరు వంటి చిన్న చిన్న అంశాల్లో అపనమ్మకంగా ఉండే యువత సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో చెప్పేవారి సలహాలు విని, వాటిని పాటిస్తే అద్భుతాలు జరిగిపోతాయనే భ్రమతో స్వయంగా ప్రయోగాలు చేస్తున్నారని, అకస్మాత్తుగా ఆహారపు అలవాట్లను మార్చుకుని చిక్కుల్లో పడుతున్నారని ఈ అధ్యయనం జరిపిన బృందానికి నేతృత్వం వహించిన జాక్ ఆర్.హెచ్.కూపర్ చెబుతున్నారు.‘కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థుల్లో చాలామంది సోషల్ మీడియాలో వచ్చే ఆహార ఆరోగ్య సలహాల పట్ల తేలికగా ఆకర్షితులవుతున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి వాటిలో వచ్చే వీడియోల్లో స్వయంప్రకటిత నిపుణులు చెప్పే సలహాలు పాటిస్తే అద్భుతాలు జరిగిపోతాయని నమ్మి ఆహార పద్ధతులపై ప్రయోగాలు చేస్తున్నారు. వీడియోల్లో స్వయంప్రకటిత నిపుణులు ఊదరగొట్టే స్థాయిలో ఫలితాలు రాకపోగా, కొత్త సమస్యలు పుట్టుకొస్తుండటంతో మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు’ అని కూపర్ వెల్లడించారు.నియంత్రణ లోపమే అసలు సమస్యపోషకాహార సలహాలు, ఆరోగ్య సలహాలు ఎవరు ఇవ్వాలనే దానిపై నియమ నిబంధనలు, నియంత్రణ లేకపోవడమే అసలు సమస్యగా ఉంటోంది. ఇతరేతర రంగాల్లో డిగ్రీలు ఉన్నవాళ్లు కూడా సోషల్ మీడియాలో స్వయంప్రకటిత పోషకాహార ఆరోగ్య నిపుణులుగా చలామణీ అవుతున్నారు. శరీరనిర్మాణ శాస్త్రం, పోషకాహార శాస్త్రం వంటి అంశాల్లో అవగాహన లేకుండానే, తాము నమ్మిన విషయాలనే పరమ సత్యాలుగా ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 కింద ఏర్పడిన ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆహార ఉత్పత్తులు, ఫుడ్ సప్లిమెంట్ల నాణ్యత ప్రమాణాలపై మాత్రమే నియంత్రణ కలిగి ఉంది.ఆహార ఆరోగ్య సలహాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఎలాంటి నియంత్రణ లేదు. ఆహార ఆరోగ్యాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారిని నియంత్రించడానికి కట్టుదిట్టమైన చట్టాలేవీ లేవు. మన దేశం నుంచి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ఆహార ఆరోగ్య అంశాలపై ప్రతిరోజూ పుంఖాను పుంఖాలుగా వస్తున్న వీడియోల్లో దాదాపు 80 శాతం వరకు గుర్తింపు కలిగిన అర్హతలు లేనివారు చెబుతున్నవేనని ఒక అంచనా.ఇలాంటి వీడియోలు రూపొందిస్తున్న వారిలో ఆధునిక వైద్యంలోను; ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, నేచురోపతి తదితర వైద్య విధానాల్లోను; న్యూట్రిషన్, డైటెటిక్స్ విధానాల్లోను డిగ్రీలు కలిగిన వారు సుమారు 20 శాతం వరకు మాత్రమే ఉంటున్నారు. అయితే, అర్హతలు లేనివారి వీడియోలకు కూడా లక్షలాది ఫాలోవర్లు ఉంటుండటమే ఆందోళన కలిగించే అంశం.తప్పుడు ప్రచారానికి కారణాలు...సోషల్ మీడియాతో ప్రచారం మాత్రమే కాదు, డబ్బు కూడా దండిగా వస్తుంది. యూట్యూబ్, ఇన్స్ట్రాగ్రామ్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా అల్గోరిథమ్స్ ఎక్కువమంది చూసే కంటెంట్ను మరింత ఎక్కువమందికి చూపిస్తాయి. దీనివల్ల ప్రకటనలు ఎక్కువగా వస్తాయి. ప్రకటనల ఆదాయంలో కొంత వీటిలో వీడియోలు పెడుతున్నవారికి వస్తుంది. దీనికితోడు సప్లిమెంట్లు, డైట్ కోర్సుల అమ్మకాలకు కూడా సంబంధిత కంపెనీలు ‘స్వయంప్రకటిత’ నిపుణులను సాధనంగా ఉపయోగించుకుంటాయి. వీటి ద్వారా కూడా వారికి ఆదాయం వస్తుంది. ప్రచారానికి ప్రచారం, ఆదాయానికి ఆదాయం అప్పనంగా దొరుకుతుండటంతో కొందరు తమ చదువుకు, నైపుణ్యాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా, అకస్మాత్తుగా ఆహార ఆరోగ్య నిపుణులుగా సోషల్ మీడియాలో అవతారమెత్తుతూ జనాలను గందరగోళంలో ముంచుతున్నారు. కొంచెం దృష్టిపెడితే, సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో అసలైనవేవో, తప్పుడు ప్రచారంతో కూడినవేవో తేలికగానే కనిపెట్టవచ్చు. ‘డాక్టర్లు దాచిన రహస్యం!’, ‘ఫార్మసీ మాఫియా’, ‘శాస్త్రవేత్తలకే తెలియని ఆరోగ్య రహస్యం’, ‘వారం రోజుల్లో ఫ్యాటీ లివర్ నయం’, ‘క్యాన్సర్ను ఈజీగా తగ్గించవచ్చు’, ‘ఈ తైలంతో పక్షవాతం నయం’ వంటి థంబ్నెయిల్స్తో వచ్చే కంటెంట్లో చాలావరకు అవాస్తవాలే ఉంటాయి. వీటిని ప్రచారంలోకి తెచ్చేవారికి ఆహార, ఆరోగ్య, వైద్య శాస్త్రాలపై కనీస అవగాహన కూడా ఉండదు. సోషల్ మీడియాలో కొద్ది శాతమైనా అర్హులైన వైద్యులు కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కంటెంట్కు, పోస్ట్ చేసిన వారి అర్హతలను బేరీజు వేసుకుని ఈ వీడియోలను చూడటం క్షేమం.∙పన్యాల జగన్నాథదాసు -
ఆరోగ్యప్రదాయిని ‘కోకో నిబ్స్’
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆరోగ్య ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘కోకో నిబ్స్’ గురించే చర్చ నడుస్తోంది! ట్రెండింగ్లో ఉన్న బెస్ట్ సూపర్ఫుడ్ ఇదేనంటూ సోషల్ మీడియా చెబుతోంది. ఇంతకీ ఇదేంటంటే.. కరకరలాడే డార్క్ చాక్లెట్ ముక్కలు. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ బోలెడు ఉన్నాయని.. వాటిని రోజువారీ డైట్లో చేర్చుకోవాలని న్యూట్రిషనిస్టులు సిఫారసు చేస్తున్నారు. నిజానికి ఇవి చాక్లెట్ తయారీకి వాడే కోకో గింజల ముక్కలు. వాటిలో ఎలాంటి చక్కెరలు కలపరు.. కాబట్టి ఇవి 100 శాతం ఆరోగ్యకరమైనవి. భావోద్వేగాలను మార్చడం నుంచి గుండెను పదిలంగా ఉంచే వరకు కాకో నిబ్స్ చేసే మేలు అంతా ఇంతా కాదు. పోషకాల గని మార్కెట్లో దొరికే ఖరీదైన సప్లిమెంట్ల కంటే కోకో నిబ్స్ వంద రెట్లు మేలైనవి. వాటిలో కండరాల పనితీరును మెరుగుపరిచే మెగ్నీషియం, ఎముకలను పటిష్టపరిచే ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే శరీర అలసటను తగ్గించి రోజంతా యాక్టివ్గా ఉంచడంలోనూ దోహదపడుతుంది. ముఖ్యంగా శరీరంలో మంట తగ్గించడంలో, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. కోకో నిబ్స్లో ఫెనిలెథైలమైన్, అనండమైడ్ వంటి అద్భుతమైన సమ్మేళనాలు ఉన్నాయి. అందుకే వాటిని సరదాగా ‘లవ్ డ్రగ్’ అని కూడా పిలుస్తారు. ఈ ‘డ్రగ్’ మెదడులో సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక సహజ న్యూరోట్రాన్స్మిటర్లా పనిచేస్తుంది. కోకో నిబ్స్లోని ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటు అదుపులోకి వస్తుంది. శరీరంలోని మంచి కొవ్వు శాతం పెరిగి గుండెపోటు ముప్పు తగ్గుతుంది.డైట్లో ఎలా చేర్చుకోవాలి? కోకో నిబ్స్ కాస్త చేదుగా, కాఫీ గింజల రుచితో కరకరలాడుతుంటాయి. వాటిని మీ మెనూలో రకరకాలుగా వాడుకోవచ్చు» బ్రేక్ఫాస్ట్లో: ఓట్మీల్, కార్న్ఫ్లేక్స్ లేదా పెరుగుపై చల్లుకొని తినొచ్చు.» స్మూతీస్లో: మిల్క్షేక్స్ లేదా స్మూతీస్లో వేస్తే అదనపు క్రంచ్ వస్తుంది.» డెజర్ట్స్ టాపింగ్: ఐస్క్రీమ్లు, కేక్లు, బ్రౌనీస్ వంటి తీపి పదార్థాలపై వాటిని వేసుకుంటే ఆ చేదు, తీపి కాంబినేషన్ అదిరిపోతుంది.» సలాడ్స్: హెల్తీ సలాడ్స్ లేదా గ్రెయిన్ బౌల్స్లో వేసుకుంటే కరకరలాడుతుంది. -
15 రోజులు.. 31 కోట్ల లీటర్లు.. చరిత్ర తిరగరాసిన ప్రజలు..
ఒక చుక్క నీరు కూడా వృథా కాకూడదని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. చేతుల్లో ఎలాంటి భారీ యంత్రాలు లేవు.. కోట్ల రూపాయల ప్రాజెక్టులు లేవు.. కానీ ఒకే లక్ష్యం ఉంది.. వర్షపు నీటిని కాపాడాలి. ఆ సంకల్పంతో వేలాది మంది గ్రామస్తులు కదిలారు. ఫలితం.. కేవలం 15 రోజుల్లో ఏకంగా 31 కోట్ల లీటర్ల నీటిని సంరక్షించిన అరుదైన విజయగాథ ఇది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగుచూసింది.ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలో మొదలైన ఈ జల ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వర్షాలు కురిసినప్పుడు నీరు వేగంగా ప్రవహించి గ్రామాల నుంచి బయటకు వెళ్లిపోకుండా, ప్రతి చుక్కను భూమిలోకి చేర్చాలనే ఆలోచనతో గ్రామస్తులు స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. ‘మోర్ గావ్, మోర్ పానీ 2.0’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వందలాది గ్రామాల్లో ప్రజలు శ్రమదానం చేశారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, రైతులు, యువత కలిసి నీటి నిల్వ నిర్మాణాల పనుల్లో పాల్గొన్నారు. ఇంకుడు గుంతలు, సోక్పిట్లు, చిన్న నీటి నిల్వ గుంతలు, వర్షపు నీటిని మళ్లించే కాలువలు వంటి అనేక నిర్మాణాలను తక్కువ సమయంలో పూర్తి చేశారు.ఈ ప్రయత్నంలో వేలాది చిన్న చిన్న పనులు కలిసి ఒక పెద్ద ఫలితాన్ని ఇచ్చాయి. మొత్తం 3 లక్షలకు పైగా జల సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు కావడంతో వర్షపు నీరు నేరుగా భూగర్భ జలాల్లోకి చేరే అవకాశం పెరిగింది. సాధారణంగా వాగులు, కాలువల ద్వారా వెళ్లిపోయే కోట్లాది లీటర్ల నీరు ఇప్పుడు గ్రామాల భవిష్యత్తుకు నిల్వగా మారింది. ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలు శక్తి ప్రజల భాగస్వామ్యం. కేవలం ప్రభుత్వం చేసే పనిగా కాకుండా, తమ గ్రామానికి తామే నీటి రక్షకులుగా మారిన ప్రజల ఆలోచనే ఈ విజయానికి కారణమైంది. నీటి సమస్యను ఎదుర్కోవడానికి పెద్ద ప్రాజెక్టుల కోసం ఎదురుచూడకుండా, చిన్న చిన్న చర్యలతోనే పెద్ద మార్పు తీసుకురావచ్చని గ్రామాలు నిరూపించాయి.ఈ కార్యక్రమం కేవలం నీటి నిల్వకే పరిమితం కాలేదు. భవిష్యత్తులో తాగునీటి సమస్యను తగ్గించడం, రైతులకు సాగునీటి భరోసా కల్పించడం, భూగర్భ జలాలను పునరుద్ధరించడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు బలమైన పునాది వేసింది. ప్రభుత్వ పథకం ఉన్నప్పటికీ, దీనిని విజయవంతం చేసింది ప్రజలే. ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి పనిచేయడం, ప్రతి గ్రామం దీన్ని తమ బాధ్యతగా తీసుకోవడంతో ఇది ప్రభుత్వ కార్యక్రమం కంటే ప్రజా ఉద్యమంగా మారింది.వాతావరణ మార్పులు, కరవు, నీటి కొరత ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వేళ.. ప్రజలు ఒక్కటైతే ప్రకృతిని కాపాడటమే కాదు, భవిష్యత్ తరాలకు నీటి భద్రతను కూడా అందించవచ్చని ఈ గ్రామాలు నిరూపించాయి. ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయకుండా కాపాడాలనే సంకల్పం.. నేడు 31 కోట్ల లీటర్ల జలసంపదగా మారింది. ఇదే మహాసముంద్ గ్రామాల అసలైన విజయం.


