Social Media
-
ఆ ఒక్క మాటతో.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయాడు
జీవితంలో మొదటి అనుభవం ఎవరికీ మరిచిపోలేనిది. అది ప్రేమైనా.. ఉద్యోగమైనా.. మరొకటైనా!. అయితే ఇక్కడో వ్యక్తికి అది మనషుల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు.. వాళ్లు ఎప్పటికీ మారరనే సంగతి గుర్తించేందుకు ఉపయోగపడింది. రెడ్డిట్లో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ వివరాలను పరిశీలిస్తే.. ఓ వ్యక్తి బెంగళూర్ ఎయిర్పోర్టులో విమానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో దూరంగా కూర్చున్న వ్యక్తి అతనికి పరిచయంలా అనిపించి దగ్గరకు వెళ్లాడు. తీరా చూస్తే.. 18 ఏళ్ల కిందట తాను జాబ్ కెరీర్ మొదలుపెట్టింది మేనేజర్ ఆ వ్యక్తేనని నిర్ధారించుకున్నాడు. అంతే సంతోషం పట్టలేక అతనితో మాటలు కలిపాడు. ఆ మాజీ మేనేజర్ కూడా అతన్ని గుర్తు పట్టి పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయాడు. ఇంతలో ఆ వ్యక్తి ఆ పెద్దాయన్ని ఓ ప్రశ్న అడిగాడు. అంతే.. అతని ముఖంలో నవ్వు మాయమైంది. సైలెంట్గా జేబుల్లో చేతులు పెట్టుకుని వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ పరిణామంతో చిన్నగా నవ్వుకున్న ఆ వ్యక్తి.. సోషల్మీడియాలో ఆ ప్రశ్నేంటో చెబుతూ ఇలా రాసుకొచ్చాడు.. 2008లో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేరిన ఆ వ్యక్తి.. రెండు సంవత్సరాలకు ఆ ఉద్యోగం మానేశాడు. ఒకే తీరు పని, ఆఫీస్ ఫేవరిటిజం, ఎడతెరిపి లేని ప్రయాణాలు అతను ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలయ్యాయట. అయితే.. కంపెనీని వీడే టైంలో హెచ్ఆర్ నిజాయితీగా ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడిగితే.. అంతే నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు అతను రాసుకొచ్చాడట. అది చూసి మూడు నెలల నోటీసు పీరియడ్ కూడా అక్కర్లేకుండా ఆ కంపెనీ అతన్ని బయటకు పంపించేసింది. కానీ.. అతనికి రిలీవింగ్ లెటర్ మాత్రం ఇవ్వలేకపోయింది. ఇదే విషయమై అతని మేనేజర్ను నిలదీస్తే.. చూద్దాం.. చేద్దాం.. అంటూ చెబుతూ వచ్చాడు. చివరకు ఆ ఫాలోఅప్ విషయంలో మౌనం వహించుకుంటూ వచ్చాడట. విసుగెత్తిపోయిన ఆ యువకుడు అది మరిచిపోయి.. ఎలాగోలా మరో జాబ్ సంపాదించుకోగలిగాడు. కట్ చేస్తే.. 16 ఏళ్ల తర్వాత కలిసి ఆ మాజీ మేనేజర్ను ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న.. ‘నా రిలీవింగ్ లెటర్ సంగతి ఏంటి?’ అని. అందుకే ఆయనగారూ గప్చుప్గా వెళ్లిపోయారట. ఈ సంఘటన రెడ్డిట్లో “My Ex-Manager Remembered Everything Except Accountability” అనే శీర్షికతో పోస్ట్ అయ్యింది. వెంటనే వైరల్ అయింది.దీంతో ఆ ఫీడ్బ్యాక్లో మేనేజర్ గురించి ఏమైనా చెప్పి ఉంటాడా? అనే కుతూహలం రెడ్డిట్ యూజర్లలో పెరిగి ఆరాలు తీస్తున్నారు. చాలామంది కామెంట్స్లో, మేనేజర్ రియాక్షన్ గిల్టీ ఫీలింగ్ వల్లేనని చెప్పారు. కొందరు “ఉద్యోగి ముందుకు వెళ్లిపోయాడు, కానీ మేనేజర్ మాత్రం ఆ పాత తప్పును ఇప్పటికీ మరిచిపోలేదు” అని వ్యాఖ్యానించారు. మరికొందరు రిలీవింగ్ లెటర్స్, మేనేజీరియల్ ఈగో వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఉద్యోగ సంబంధాల్లో బాధ్యత (Accountability) చాలా ముఖ్యం. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా సంవత్సరాల తర్వాత అసౌకర్యంగా మారుతుంది. ఈ ఉద్యోగి వైరల్ కథలోలాగా!. -
జగన్ చేస్తే వినాశనం.. టీడీపీ చేస్తే అభివృద్ధా?
ఎంవీపీ కాలనీ (విశాఖ): విశాఖలో పర్యావరణ విధ్వంసం పెరిగిపోయిందని జనసేన మాజీ నాయకుడు, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖలోని సింహాచలం కొండతో పాటు ముడసర్లోవ, కంబాల కొండ, పావురాల కొండల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జగన్ ప్రభుత్వం చేస్తే విధ్వంసం, టీడీపీ చేస్తే అభివృద్ధి అన్న చందంగా విశాఖలో పర్యావరణ విధ్వంసం సాగుతోందన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ కట్టడాల కోసం రుషికొండపై నిర్మాణాలు చేస్తే టీడీపీ నానాయాగి చేసిందని.. రుషికొండను బోడిగుండు చేసేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిందన్నారు. అయితే, ఇప్పుడు డేటా సెంటర్ పేరుతో శ్రీ వరాహ నృసింహస్వామి కొలువైన పవిత్ర సింహాచలం, ముడసర్లోవ కొండలతో పాటు ప్రైవేట్ రిసార్ట్స్ కోసం పావురాల కొండలను కొట్టేస్తూ అభివృద్ధి అని చెబుతోందన్నారు. విశాఖకు రక్షణ కవచాలుగా ఉన్న కొండలను విధ్వంసం చేయడం పర్యావరణానికి పెనుముప్పుగా మారిందన్నారు. కొండల తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. ఈ విధ్వంసాన్ని ఆపేందుకు అవసరమైతే నగర ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. -
రెడ్ డ్రెస్లో మంచు లక్ష్మీ.. కేన్స్లో కొత్త లోకా బ్యూటీ..!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా..మ్యాగజైన్ లుక్లో అనన్య పాండే..జిమ్లో బిగ్బాస్ ఇనయా సుల్తానా కసరత్తులు..రెడ్ డ్రెస్లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ లుక్స్..కేన్స్లో కల్యాణి ప్రియదర్శన్ సందడి.. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
అయ్యా విజయ్.. ఇదయ్యా నీ సినిమా ఇంపాక్ట్!
యాక్టర్ టు సీఎం.. సి విజయ్ జోసెఫ్ ప్రస్థానం గురించి యావత్ దేశం మాట్లాడుకునేలా చేసింది. ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో అవి మరీ సినిమాటిక్గా అనిపించినా.. భవిష్యత్తులో వాటి ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కెరీర్లో సందేశాత్మక చిత్రాలు తీయడమూ అందుకు ఓ కారణమై ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే..తమిళనాడులో తాజాగా ఓ యువకుడు చేసిన పని నెట్టింట వైరల్గా మారుతోంది. విజయ్ సర్కార్కు విరాళంగా అరుణ్ లోకనాథన్ రూ.22,674 విరాళం అందించారు. ఈ ఫిగర్కు ఓ ప్రాధాన్యం ఉంది. 22-06-1974.. విజయ్ పుట్టిన తేదీ కూడా. దీంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. అయితే ఆ యువకుడు అలా చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. విజయ్ నటించిన ఓ సినిమానే తాను ఈ పని చేయడానికి స్ఫూర్తి ఇచ్చిందని అరుణ్ చెబుతున్నాడు.అరుణ్కు పోలియో ఉంది. అతనొక మెంటలిస్ట్, హిప్నాటిస్ట్, మైండ్-రీడర్గా ఈవెంట్లు చేసుకుంటున్నాడు. విజయ్ సీఎంగా ప్రమాణం చేశాక.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. విజయ్ చెప్పినదాని ప్రకారం.. తమిళనాడు బడ్జెట్ ఆధారంగా లెక్కలు వేసి వ్యక్తిగతంగా రూ1 లక్షకు పైగా చెల్లించాల్సి వస్తుందని అరుణ్ గుర్తించాడు. అందుకే తన వంతుగా మొదట ఈ నగదును అందించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో తమిళన్ సినిమా సీన్ గుర్తు చేశాడు.విజయ్ ప్రధాన పాత్రలో 2002లో తమిళన్ అనే చిత్రం వచ్చింది. అందులో దేశం అప్పులు తీర్చడానికి సూర్య(విజయ్ పాత్ర పేరు) ప్రధానమంత్రికి రూ.4,000 చెక్కును పంపిస్తాడు. అలా ఆ సీన్ ఇన్స్పిరేషన్తో.. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత అరుణ్ అదే పని చేసి తన అభిమాన హీరో, ప్రస్తుత సీఎంకు సహకారం అందించాడన్నమాట. ‘‘నేను పంపిన ఈ సొమ్ముతో రాష్ట్రంలో అప్పులు తీరతాయని నేనేం అనుకోను. కానీ, నేను అభిమానించే వ్యక్తికి నా వంతుగా ఉడతా భక్తిగా అందించిన చిన్నసాయం ఇది. ఈ విరాళంతో వీలైతే నాలా పోలియోతో బాధపడుతున్నవాళ్లకు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రదేశాలు, సులభమైన యాక్సెస్ కల్పించాలి’’ విజయ్ సర్కార్ను కోరుతున్నాడు. ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు, ముందుగా మీలోనే ఆ మార్పు తీసుకురండి.. అని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా అరుణ్ ప్రస్తావించాడు. Fulfilling my individual debt responsibility అనే క్యాంపెయిన్ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అన్నట్లు తమిళన్ సినిమాలో హీరో సూర్య పాత్ర లాయర్ పాత్ర. అరుణ్ కూడా గతంలో లా చేశాడంట. View this post on Instagram A post shared by Arun Loganathan (@arunthementalist_atm)విజయ్కు టర్నింగ్ పాయింట్విజయ్ సినీ కెరీర్ను తమిళన్కు ముందు.. తమిళ్కు తర్వాత అని కచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంట్ జానర్ రొడ్డకొట్టుడు చిత్రాలు తీసిన.. తమిళన్లాంటి సందేశాత్మక చిత్రం తీసి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి అబ్దుల్ మాజిత్ డైరెక్ట్కాగా, దర్శకనిర్మాత.. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్క్రీన్ప్లే అందించారు. మరో హైలైట్ ఏంటంటే.. ప్రియాంక చోప్రా నటించిన ఏకైక తమిళ చిత్రం(ఇప్పటిదాకా). ఈ సినిమాలో హీరో సూర్య లా విద్యార్థి. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతుంటాడు. జనాల్లో చట్టాలపై అవగాహన కల్పించడం చేస్తుంటాడు. బస్సులో చిల్లర కూడా ఇవ్వకుండా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే కండక్టర్ను.. ప్రయాణికుల సంతకాలతో కోర్టుకు లాంటి సన్నివేశాలు షార్ట్ రీల్స్ రూపంలో ఆ మధ్య వైరల్ కూడా అయ్యాయి. అదే సమయంలో తన కుటుంబాన్ని నాశనం చేసిన కార్పొరేట్ శక్తులపైనా ప్రతీకారం తీర్చుకునే డ్రామా కూడా నడుస్తుంది. అయితే ఈ సినిమా మరీ లిబర్టీక్గా ఉండడంతో కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా.. విజయ్ నటనకు మాత్రం తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతే ఆయన సందేశాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తెలుగులో ‘‘దమ్ముంటే కాస్కో’’ పేరుతో డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లోనూ అందుబాటులో ఉంది.సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. అమ్మాయిలు కనిపిస్తే వీలైతే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలి. సెలైన్సర్లు పీకేసి బైకులేసుకుని రోడ్ల మీద పడాలి అని కొందరు సోకాల్డ్ హీరోల్లా విజయ్ ఏనాడూ అభిమానులకు చిల్లర పిలుపులు ఇవ్వలేదు. కుర్రహీరోయిన్లతో ఫంక్షన్లలో వెకిలి చేష్టలకు పాల్పడుతూ పరువు తీసుకోలేదు. విజయ్ తన సినిమాలతోనే కాదు ప్రసంగాలతోనూ అభిమానుల్ని ఆలోచింపజేసేవారు.. ‘‘మీరూ ఎదగండ్రా బాబూ..’’ అని మోటివేట్ చేసేవారు. సినిమా అనేది నిజ జీవితంలో మార్పు తెస్తుందా? అనే చాలామంది వ్యక్తం చేసే అనుమానం. కానీ, మార్పు అనే నినాదంతో అధికారం చేపట్టిన విజయ్.. తన సినిమాలతో అది సాధ్యమని తన అభిమాని అరుణ్ ఉదంతంతో శాంపిల్ చూపించారు. పౌరులు కూడా పాలనలో భాగస్వాములు కావాలనే కొత్త సందేశం ఇప్పించారు. -
వీడియో: చున్నీ కోసం పట్టాలపైకి దిగి..
ఏమరపాటులో.. నిర్లక్ష్యంగా చేసే పనులు ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో తెలియంది కాదు. పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఇందుకు మంచి ఉదాహరణలు. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఓ ఘటనపై నెట్టింట మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ సంప్రదాయ భారత దుస్తుల్లో రైలు ఎక్కింది. డోర్ దగ్గర నిల్చుని సెల్ఫీ వీడియో(టూరిస్ట్ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏమో!) ఆమె దుప్పట్టా జారిపోయి ఫ్లాట్ఫారమ్కు-రైలుకు మధ్య పట్టాల మీద పడింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వృద్ధుడు.. అది గమనించాడు. ఆ యువతికి సాయం చేస్తానని ముందుకు వచ్చాడు. ఫ్లాట్ఫారమ్ నుంచే ఆ చున్నీని అందుకునే ప్రయత్నం చేయగా.. అది వీలుపడలేదు. దీంతో సరాసరి పట్టాలపైకి దూకాడు. అయితే ఆ సమయంలో ఆ ఇండోనేషియా మహిళ అప్రమత్తమైంది. త్వరగా పైకి రావాలంటూ ఆయన్ని కోరింది. ఆ వృద్ధుడు కూడా చున్నీని దొరకబుచ్చుకుని పైకి వచ్చేశాడు. ఆమె చేతికి అందగా థ్యాంక్స్ చెప్పడంతో ఫర్వాలేదని చెయ్యి చూపిస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. “ఆయన హీరోలా వచ్చి సహాయం చేశారు. ఎలాంటి ప్రశంసలు ఆశించకుండా నిశబ్దంగా వెళ్లిపోయారు. నిజంగా గ్రేట్” అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 41 మిలియన్లకుపైగా వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు ఆయనను “జెంటిల్మన్”, “హీరోలా నడిచాడు” అంటూ ప్రశంసించారు. కొందరు తమ అనుభవాలను పంచుకుంటూ, “ఇలాంటి భారతీయ అంకుల్స్ సో స్వీట్” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో హ్యుమాటినీ నా?, సేఫ్టీనా? అంటూ చర్చ నడిచింది. ఆ సమయంలో రైలు కదిలి జరగరానిది జరిగితే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో అంత రిస్క్ అవసరమా అంకుల్? అని సరదాగా ఆ పెద్దాయన్ని మందలిస్తున్నారు. View this post on Instagram A post shared by Indah A.L ᢉ𐭩 (@indaha.l) -
బిగ్బాస్ దివి అందాలు.. చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక..!
టాలీవుడ్ బిగ్బాస్ దివి అందాలు..ఫారిన్ వెకేషన్లో నమ్రతా శిరోద్కర్.. కేన్స్ వీధుల్లో నిహారిక కొణిదెల సందడి..మంచుకొండల్లో హీరోయిన్ సాయిపల్లవి చిల్..చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
విజయ్- రష్మిక జంట.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జంట విజయ్- రష్మిక. కొన్నేళ్లుగా డేటింగ్ ఉన్న వీరిద్దరు ఉదయ్పూర్ వేదికగా ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్ నిర్వహించారు.అయితే విరోష్ జంటగా క్రేజ్ తెచ్చుకున్న వీరిద్దరు ఓ యాడ్ ప్రమోట్ చేశారు. ప్రముఖ ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్లో పాల్గొన్నారు. దీనికి ఏకంగా 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్స్టాలో మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ జంటగా విరోష్ జోడీ నిలిచింది. ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్కు వరల్డ్ వైడ్గా వచ్చిన రెండో అత్యధిక లైక్స్ ఇవే కావడం విశేషం. దీంతో విజయ్- రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా రణబాలిలో కనిపించనున్నారు. మొదటి ప్లేస్ కూడా వీరిదే..ఈ జాబితాలో మొదటి స్థానం రికార్డ్ సైతం వీరిదే కావడం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన మాన్యవార్ అనే వెడ్డింగ్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి తోడు 104 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ప్రముఖ దిగ్గజాలు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ ఐకాన్స్ కలిసి చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్కు మించిన ఆదరణ విరోష్ జంటకు అందరినీ షాకింగ్కు గురి చేస్తోంది. -
విజయ్ సూటు.. వీధుల్లో ఆమ్బులెన్స్!!
సోషల్ మీడియా ఎఫెక్ట్తో మార్కెటింగ్ రూపురేఖలు మారిపోయాయి. ఒక ప్రొడక్టును జనాల్లోకి పంపించాలంటే.. దాని నాణ్యత, ధరలతో సంబంధం లేకుండా పోతోంది. వీలైనంత వైవిధ్యంగా జనాలకు దానిని ప్రదర్శించాల్సి వస్తోంది. చిన్నాచితకాలే కాదు బ్రాండెడ్ కంపెనీలు ఈ విషయంలో కూడా పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో అవసరమైతే ఎంతకైనా వెళ్తున్నాయి. ముంబైలో మామిడి పండ్ల కొరతను వైవిధ్యంగా క్యాష్ చేసుకోవాలని ఇన్స్టామార్ట్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆమ్బులెన్స్ అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. ఆంబులెన్స్లాంటి వెహికిల్లో ఓ వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉంటాడు. అతని చుట్టూరా మామిడి పండ్లు ఉంటాయి. అది ఆంబులెన్స్కాదు.. మామిడి ఫీవర్కు ఆమ్ (మామిడి) + అంబులెన్స్=ఆమ్బులెన్స్ అంటూ ఇన్స్టామార్ట్ ప్రచారం ఉవ్వెత్తున్న చేస్తోంది. Reason why India doesn't export mangoes: pic.twitter.com/3Ddy41CMtF— Xavier Uncle (@xavierunclelite) May 13, 2026ఇక.. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం చేసింది తెలిసిందే. సీఎంగా ఆయన సూట్ అవతారం హాట్ టాపిక్గా మారింది. అయితే విజయ్ ట్రెండింగ్లో ఉండడంతో తమిళనాడులోని పలు వస్త్రదుకాణాలు ఆయన ఫొటోలను తెగ వాడేస్తున్నాయి. ది చెన్నై సిల్క్స్ ఓ అడుగు ముందుకేసి ఆ కాంబోపై ఆఫర్లు ప్రకటించింది. ఫ్యాషన్ను ఫన్గా మార్చిన ఈ స్టంట్.. సీఎంను కాస్త “Chief Marketing Influencer” కాన్సెప్ట్తో వస్త్రాలను పరిచయం చేస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. The Chennai Silks : A major textile retailer..introduces CM Vijay look attire!CM - Chief Marketing (Influencer)? pic.twitter.com/6AvxgOcDbn— We Dravidians (@WeDravidians) May 13, 2026వేసవిలో బ్రాండ్లు కేవలం ఉత్పత్తులు అమ్ముకోవడంతో పాటు వినియోగదారుల మనసును గెలుచుకోవడానికి కొత్త కొత్త స్టంట్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్స్టామార్ట్ ఆమ్బులెన్స్, తమిళనాడు సీఎం విజయ్ వస్త్రధారణ మార్కెట్లోనే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి. మార్కెటింగ్లో ఈ రెండు స్టోరీ టెల్లింగులను చూసిన వాళ్లంతా ‘వారెవ్వా.. ఏం వాడకమయ్యా’ అని ఫిదా అయిపోతున్నారు. -
బ్లాక్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి.. వెస్టర్న్ స్టైల్లో మంచు లక్ష్మీ..!
బీచ్లో ఆర్జే మహ్వశ్ చిల్..బ్లాక్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి హోయలు..వెస్టర్న్ లుక్లో నటి మంచు లక్ష్మీ పోజులు..జిమ్లో బాలీవుడ్ భామ దిశా పటానీ కసరత్తులు..యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తోన్న పాయల్ రాజ్పుత్..అక్కినేని కోడలు శోభిత లేటేస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
'హైదరాబాద్ ఈవెంట్లో కామెంట్స్.. తప్పుగా అర్థం చేసుకున్నారు'
కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కరుప్పు. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్కు అంతా సిద్ధమైంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ బాలాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా థియేటర్లకు వచ్చే వారికోసమే తీశామని అన్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో సమీక్షించే వారి కోసం కాదన్నారు. దీంతో దర్శకుడు బాలాజీ కామెంట్స్పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆన్లైన్ సినిమాలను విశ్లేషించే వారిని కించపరిచేలా మాట్లాడారంటూ ట్రోల్స్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై స్పందించారు. కేరళలో నిర్వహించిన మూవీ ఈవెంట్లో తన కామెంట్స్పై క్లారిటీ ఇచ్చారు.తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జే బాలాజీ అన్నారు. ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా సినిమా చూడమని మాత్రమే తాను ప్రేక్షకులను కోరానని స్పష్టం చేశారు. సినిమాలపై చేసే సమీక్షలను, చర్చలను కొట్టిపారేయడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ముందుగానే ఓ అభిప్రాయంతో థియేటర్లకు రావద్దని ప్రేక్షకులను కోరడమే నా ఉద్దేశమని వెల్లడించారు. మీరు విశాల దృక్పథంతో థియేటర్లకు వచ్చి.. సినిమా చూసిన తర్వాతే.. నచ్చిందో లేదో చెప్పాలని కోరుకుంటున్నానని అన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చాక.. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడాలి.. సమీక్షించాలి. నేను కూడా ఒకప్పుడు సమీక్షకుడినే.. ఇప్పుడే డైరెక్టర్గా మారానని తెలిపారు.సూర్య హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, స్వాసిక, శ్శివద, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మరియన్, ఆడుకలం నరేన్, నమో నారాయణ, దీపా శంకర్, సభ మారన్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రం మే 14న థియేటర్లలో విడుదల కానుంది. -
‘నువ్వు వద్దు.. నీ ఉద్యోగం వద్దూ’.. జెన్జీ యువతి
తాను పనిచేస్తున్న ఓ సంస్థలో తన బాస్ తనకి గౌరవం ఇవ్వడం లేదనే కారణంతో ఓ జెన్జీ ఉద్యోగానికి రిజైన్ చేసింది. ఉద్యోగానికి రాజీనామా చేయడం తప్పుగా అనిపించడం లేదు. నిజం చెప్పాలంటే తాను కోరుకున్న దాని కోసం రాజీపడని జెన్జీ నేను గర్వపడుతున్నాను’అని వ్యాఖ్యానించింది. ఓ జెన్జీ ఉద్యోగిని తన బాస్ సమావేశంలో అవమానకరంగా ప్రవర్తించడంతో తీవ్రంగా బాధపడింది. ఆ అవమానం తట్టుకోలేక ఆమె వెంటనే రాజీనామా చేసింది. రాజీనామా అనంతరం తన బాస్కి ఓ సందేశం పంపింది. తక్కువ జీతమా? భరించొచ్చు. కానీ అవమానిస్తే అస్సలు ఊరుకోను. గౌరవం లేని వాతావరణంలో పనిచేయడం అసాధ్యం’అని స్పష్టం చేసింది. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అందులో నేను 2 సంవత్సరాలు 7 నెలలు ఒక సంస్థలో విధులు నిర్వహించా. కష్టపడ్డా. తగినట్లు పేరు సంపాదించాను. అదనపు గంటలు పనిచేశారు. అదనపు గంటలకు వేతనం ఇవ్వమంటే మేనేజర్ అందరిముందు నాపై అరిచారు. ఇది సరైన పద్దతి కాదు. క్షమాపణ అడిగాను. క్షమాపణలు చెప్పలేదు. అవన్నీ జరగనప్పుడు నేను అదే సంస్థలో ఉద్యోగం ఎందుకు చేయాలి. అందుకే రాజీనామా చేశా. ‘నిజం చెప్పాలంటే, అలా చేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను’ అని ఆమె చెప్పింది.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అనేక మంది యువత ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. ‘ఉద్యోగం కంటే గౌరవం ముఖ్యం’ అని కామెంట్లు చేస్తున్నారు. జెన్జీ తరం ఉద్యోగంలో కేవలం జీతం కోసం కాకుండా, గౌరవం, సౌకర్యం, మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చర్చ మొదలైంది. View this post on Instagram A post shared by VYLA | Dhrupadi (@vyla.world) -
‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’
ఐపీఎల్ 2026 సీజన్ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ తొలి అంచె పోటీలు ముగిసేసరికి ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో మాత్రం పంజాబ్ తడబడుతూ వస్తోంది. వరుసగా నాలుగు పరాజయాలతో పంజాబ్ పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. బౌలింగ్లో విఫలమవ్వడంతో పాటు పేలవమైన ఫీల్డింగ్ ఆ జట్టు ప్రమాణాలను దెబ్బ తీస్తున్నాయి. పంజాబ్ ఆటగాళ్లు క్యాచ్ డ్రాప్లు ఎక్కువగా చేయడం కూడా ఆ జట్టు కొంపముంచుతోంది. మైదానంలో పరిస్థితి ఇలా ఉంటే బయట కూడా పంజాబ్ జట్టు చిక్కుల్లో పడింది. ఇటీవలే విమానంలో పంజాబ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ వేప్ (ఈ-సిగరేట్) పీల్చడం వివాదంగా మారింది. వేప్ను అందించిన అర్ష్దీప్తో పాటు చాహల్, మరికొంత మంది పంజాబ్ ఆటగాళ్లపై వేటు పడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు పంజాబ్ ఓపెనర్ ప్రబ్సిమ్రన్ బరువు పెరిగాడన్న వార్తలతో పాటు జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా స్పందించింది. ఎక్స్ వేదికగా ప్రీతి జింటా మాట్లాడుతూ..'మాటలు జాగ్రత్త. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది వాగొద్దని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు కథనాల వల్ల ఆటగాళ్లు, ఫ్రాంచైజీ ప్రతిష్టకు నష్టం కలుగుతోంది. విమర్శలకు, తప్పుడు కథనాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆటలో తప్పులకు సంబంధించి ఎలాంటి చర్చనైనా స్వాగతిస్తాం. కానీ వ్యక్తులకు, జట్టుకు, ఫ్రాంచైజీ బ్రాండ్కు నష్టం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తే ఎంతమాత్రం సహించము. వీటిని తేలికగా తీసుకోలేము. సమాచారాన్ని ప్రచారం చేసే ముందు వ్యక్తులు, మీడియా నిపుణులు, సోషల్ మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా' అని పేర్కొంది. There’s a difference between criticism & calculated misinformation. Healthy debate around the game is welcome, but the deliberate spread of fake narratives to damage individuals, the team, or the brand should not & will not be taken lightly. I urge everyone including verified… https://t.co/yeqbsTwLBd— Preity G Zinta (@realpreityzinta) May 12, 2026ఇదే విషయమై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఎక్స్ వేదికగా స్పందించిది. 'విమర్శలు, సరదా సంభాషణలు, అభిప్రాయాలు క్రీడలో భాగమే. కానీ టీఆర్పీ, వ్యూస్ కోసం నకిలీ వార్తలు, కథనాలు రాయడం సరికాదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు వాస్తవాలు ఏంటన్నది గ్రహించాలని మేము కోరుతున్నాము' అని తెలిపింది.Criticism, banter, and opinions are part of sport. Fake stories and made-up narratives for cheap engagement are not. We urge everyone to verify facts before spreading misinformation for attention or traction.— Punjab Kings (@PunjabKingsIPL) May 12, 2026చదవండి: హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? -
శివ అంకుల్ నా చావుకు కారణం.. ఏటీఎంలా వాడుకున్నాడు..!
విజయనగరం జిల్లా: ‘శివ అంకుల్ నా చావుకు కారణం.. నన్ను ఒక ఏటీఎంలా వాడుకున్నారు.. తీయని మాటలతో నమ్మించి, హోటళ్లకు తీసుకెళ్లి సర్వస్వం దోచుకున్నారు.. 2019 నుంచి తన బాధ్యత, పిల్లల బాధ్యత చూస్తానని నమ్మించి భర్తలా కాపురం చేశాడు... ఆయన స్వార్థానికి నన్ను బలిచేశాడు.. ఆర్థికంగానూ దోచుకున్నాడు. నేను ఏ తప్పూచేయలేదు. నన్ను నీవు నమ్మితే చాలు అంటూ తన కుమారుడికి మెంటాడ మండలానికి చెందిన మహిళా నేత రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చివరి కోరికగా తన భర్తగా చలామణి అయిన శివకేశవనాయుడే తనకు తలకొరివి పెట్టాలని ఆ నోట్లో పేర్కొంది. విశాఖపట్నంలో మంగళవారం వేకువజామున పురుగులు మందు సేవించిన బాధితురాలు ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మెంటాడకు చెందిన ‘పచ్చ’ పత్రిక విలేకరి శివకేశవనాయుడు తనను దోచుకున్న తీరు, మోసం చేసిన తీరును బాధితురాలు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అయితే, దీనిపై ఇప్పటివరకు స్థానికంగా ఎలాంటి కేసు నమోదుకాకపోవడం గమనార్హం. ఆ విలేకరి ఓ మంత్రికి అత్యంత ఆప్తుడు కావడమే దీనికి కారణమని స్థానికంగా చర్చ నడుస్తోంది. కేసు నమోదు విషయాన్ని మెంటాడ ఎస్ఐ కె.సీతారాము వద్ద ప్రస్తావించగా ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఘటనగా పేర్కొన్నారు. -
హాఫ్ రేట్కే వందే భారత్ టికెట్లు!
రేటు కాస్త ఎక్కువై అయినా.. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఎక్కుతున్నారు. అయితే ఈ ‘స్పీడ్ రైలు’లో పరిస్థితులు కొత్తలో ఉన్నట్లు కనిపించడం లేదు. కోచ్ల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం.. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం.. నాణ్యతలేని ఆహారం.. ఇలా ఏదో ఒక అంశంతో వివాదాలతో విమర్శల పాలవుతోంది. తాజాగా..మరో వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. వందేభారత్ టికెట్ను ఓ టీసీ సగం రేటుకే అమ్మే ప్రయత్నం చేయగా.. ఓ ప్రయాణికుడు ఆ తతంగాన్ని రికార్డు చేసి నెట్లో వదిలాడు. అదేంటి?.. ఆ టికెట్ ఆన్లైన్లోనే కదా దొరికేది అనుకుంటున్నారా?.. అసలేం జరిగిందో చదివేయండి.. ఫ్లాట్ఫారమ్ మీద కూర్చున్న కొందరు ప్రయాణికుల దగ్గరకు వెళ్లిన టీసీ.. టికెట్ చూపించడమని అడిగాడు. మిగతా వాళ్ల దగ్గర టికెట్ ఉందని.. తన దగ్గర టికెట్ లేదని ఒకతను బదులిచ్చాడు. దీంతో వందే భారత్ ఎక్కాలని ఉందా? అని అడిగాడు. రేటు ఎంత అని అడిగితే.. రూ.700 విలువైన వందే భారత్ టికెట్ను రూ.380కే ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యపోయిన ఆ ప్రయాణికుడు.. అదంతా రికార్డు చేశాడు.. ఇది అధికారికం కాదు, కానీ, నా చేతుల్లో పని. రైలు ప్రయాణానికి అనుమతిస్తాను అంటూ ఆ టీటీఈ వ్యాఖ్యానించాడు. అయితే వద్దని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. బీహార్ దానాపూర్ డివిజన్ పరిధిలో నడిచే వందే భారత్ రైలులో ఈ ఘటన జరిగింది. పాట్నా రైల్వే డివిజన్లో పని చేసే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఈ పని చేయబోయాడు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించారు.Vande Bharat ₹750 ticket was being arranged by the TTE for just ₹380.⁰This guy records it and made it viral😭 pic.twitter.com/hjHH35rPAC— Ghar Ke Kalesh (@gharkekalesh) May 12, 2026రైల్వే సేవా (Railway Seva), దానాపూర్ డీఆర్ఎం ఈ వైరల్ వీడియోపై అధికారికంగా స్పందించింది. సంబంధిత టీటీఈని విచారించి.. అతన్ని సస్పెండ్ చేసింది. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ చర్యను అవినీతి, అధికార దుర్వినియోగంగా విమర్శించారు. మరికొందరు వ్యంగ్యంగా "ఇలాంటి సంఘటనలు సాధారణమైపోయాయి" అంటున్నారు. ఇంకొందరు మాత్రం టీటీఈ ఆ ప్రయాణికుడికి సహాయం చేయాలనుకున్నాడని.. కానీ, అతను ఇలా చేస్తాడని ఊహించలేదని అభిప్రాయపడ్డారు.వందే భారత్ ఎక్స్ప్రెస్ టికెట్లు అధికారికంగా కేవలం ఐఆర్సీటీసీ IRCTC వెబ్సైట్ లేదంటే మొబైల్ యాప్ ద్వారానే లభిస్తాయి. కొన్ని రూట్లలో బయలుదేరే 15 నిమిషాల ముందు వరకు సీట్లు(కరెంట్ బుకింగ్) లభించవచ్చు. ఆన్లైన్ బుకింగ్ తప్ప ఇతర మార్గం లేదు. -
యషిక ఆనంద్ హాట్ పోజులు.. యువరాణిలా ఐటమ్ బ్యూటీ నోరా..!
హీరోయన్ యషిక ఆనంద్ హాట్ పోజులు..సమ్మర్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్..యోగా చేయాలంటోన్న హీరోయిన్ అనన్య నాగళ్ల..యువరాణిలా మెరిసిపోతున్న ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహీ..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Khushi Kapoor (@khushikapoor) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
వైట్ డ్రెస్లో ది రాజాసాబ్ బ్యూటీ.. భర్తకు స్నేహా స్పెషల్ విషెస్..!
నిన్నుకోరి మూవీ రీ రిలీజ్ ఆనందంలో నివేదా థామస్..భర్తకు హీరోయిన్ స్నేహ స్పెషల్ విషెస్..ఎల్లో డ్రెస్లో టాలీవుడ్ నటి బిందు మాధవి హోయలు..వైట్ డ్రెస్లో ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ అందాలు..కూతురితో బిగ్బాస్ శివజ్యోతి మదర్స్ డే సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Divya Arundati (@divya_arundathi) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Vennela Manthri (@vennelamanthri) -
హీరోయిన్ త్రిషకు షాకింగ్ కౌంటర్ : డా.శివరంజని పోస్ట్ వైరల్
అనేక ట్విస్ట్స్ అండ్ టర్న్స్ మధ్య ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంప్రదాయ చీరకట్టులో హాజరైన నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలం రంగు పట్టుచీరలో, కొప్పున మల్లెలతో కనిపించడమే కాదు, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆనందబాష్పాలతో నిండిన కళ్లతో భావోద్వేగానికి లోనవుతున్న వీడియో సంచలనం రేపింది. ఆ తరువాత తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ప్రేమ ఎప్పుడూ గొప్పదే అంటూ ఆమె చేసిన ఇన్స్టా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో విజయ్-త్రిష మధ్య ప్రేమానుబంధంపై రకరకాల వాదనలు, పుకార్లు హాట్ టాపిక్గా మారాయి.అయితే చిన్నపిల్లల వైద్యురాలు, ఓఆర్ఎస్పై అలుపెరుగని పోరాటం చేసిన హైదరాబాద్కు చెందిన డా. శివరంజని ఇన్స్టా పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా త్రిష పోస్ట్కు కౌంటర్గా ఆమె షేర్ చేసిన ఫోటో చర్చకు దారి తీసింది. ‘ప్రేమ ఎప్పటికీ గొప్పది కాదు. ద్రోహం. విచ్ఛిన్నమైన కుటుంబాల నిశ్శబ్దం బాధాకరం. ముఖ్యంగా పిల్లలకు’ అని అర్థం వచ్చే పిక్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. View this post on Instagram A post shared by Dr Sivaranjani Santosh (@drsivaranjanionline) నెటిజనుల స్పందనవావ్..ఎంత అద్భుతమైన సమాధానం, వావ్. మీపై గౌరవం పదివేల రెట్లు పెరిగింది అంటూ ఆమెను కొనియాడగా, మహిళలు ఆమెనే ఎందుకు నిందిస్తున్నారు, దీనికి ఆ వ్యక్తి ( విజయ్) బాధ్యుడు కాదా? నిజం ఏమిటంటే, ప్రతీ వివాహం శాశ్వతంగా నిలవాలని లేదు. కొన్నిసార్లు విడిపోవడమేమంచిది. ఆరోగ్యకరం కూడా. అందుకే చాలా జంటలు సమాజం కారణంగా కలిసి జీవిస్తాయి. వారు తమలో నింపుకున్న ద్వేషం చాలా లోతుగా పాతుకుపోయి, చాలాసార్లు దానిని పిల్లలకు కూడా అందిస్తారు అని మరొకరు కమెంట్ చేశారు.చిన్నప్పుడు నేను దీనిని అనుభవించాను. అది నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది, ఇప్పటికీ నన్ను ప్రభావితం చేస్తూనే ఉంది! ఈ విషయాన్ని గట్టిగా చెప్పినందుకు ధన్యవాదాలు అని మరొకరు సమాధానం ఇవ్వడం విశేషం.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను‘ప్రతి ఒక్కరూ వివాహేతర సంబంధాన్ని సాధారణీకరించి, దాన్ని గొప్పగా కీర్తిస్తుండటం అత్యంత అసహ్య కరమైన విషయం. పిల్లలు మోయబోయే బాధ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. పిల్లలు తమ తల్లికి చాలా గట్టిగా అండగా నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లూ భార్య వెన్నెముకలా నిలబడింది, అకస్మాత్తుగా మరో స్త్రీ వచ్చింది. ఇది ఇద్దరి వ్యక్తుల తప్పే. అతను ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు, కానీ తన పిల్లల ముందు ఓడిపోయాడు.ఆమెను వేడుకకు తీసుకువచ్చి, పిల్లలను, భార్యను అవమానించడం అత్యంత ఘోరమైన విషయం.’ ఇది మరో స్పందన.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?ఒక పిల్లల వైద్యురాలిగా, విడిపోయిన లేదా, విచ్ఛిన్నమైన కుటంబాలలోని పిల్లలు అనుభవించే మానసిక క్షోభ, ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఆమె వ్యాఖ్యలు చేశారని, పిల్లలపై ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనం అంటున్నారు మరికొందరు. ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే? -
మోదీ చెప్పినట్లే.. ఆ దేశంలో జరుగుతోందా?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు ఒకవైపు.. ఆర్థిక, ఇతర రంగాల నిపుణుల విశ్లేషణలు మరోవైపు.. ఇంకోవైపు సోషల్ మీడియా ఈ అంశంతో ఊగిపోతోంది. ఈ దరిమిలా మోదీ చెప్పినట్లే ఆ దేశంలో జరుగుతోందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చమురు ఆదాపై మోదీ ఏమన్నారు.. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సమస్యలను వివిధ దేశాలతో మాట్లాడి అధిగమిస్తాం. దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని మనం తగ్గించుకోవాలి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను(EV) ప్రోత్సహిస్తున్నాం. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాం. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అవసరం మనకు భారీగా తగ్గుతుంది. వర్క్ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగులు మళ్లీ పెరగాలి. వ్యక్తిగత వాహనాలు తగ్గించి.. ప్రజా రవాణా వినియోగం పెంచాలి. చమురు వాడకం తగ్గితే.. విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది.అక్కడ ఏం జరుగుతోంది?ఇండోనేషియా రాజధాని జకార్తాలో కార్ ఫ్రీ డే అని ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతీ ఆదివారం ఉదయం రోడ్లపై కార్లు, ఇతర వాహనాలకు కనిపించవు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ మాత్రమే ఒక లేన్లో తిరుగుతాయి. మరో లేన్లో ప్రజలు ఉత్సాహంగా జాగింగ్, సైక్లింగ్, యోగా, సామాజిక కార్యక్రమాలతో వీధులన్నీ నిండిపోతాయి. దీని వెనుక ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ఇది స్థానిక ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన చర్యలో భాగమైంది.2001లో సెప్టెంబర్ 22న జకార్తాలో కార్ ఫ్రీ డే మొదలైంది. నెదర్లాండ్స్ నుంచి ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఇది ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల దాకా నడుస్తోంది. జూన్ నుంచి ఉదయం 5.30గం. నుంచి 10గం. దాకా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. మోదీ తాజా సూచన కూడా దాదాపు ఇంచుమించుగా ఇక్కడ అమలవుతున్న పాలసీ తరహాలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇక్కడో తేడా ఉంది. The turnout for Jakarta’s weekly car-free day is incredible! pic.twitter.com/PuTLkpMLbf— Chris Kost (@chriskost) May 10, 2026మోదీ సూచనతో కంపేర్ చేస్తే..జకార్తా కార్ ఫ్రీ డేలో వారానికి ఒకసారి జరిగే.. అదీ కొన్నిగంటలు ఆచరించే పాలసీ నిర్ణయం కాగా, మోదీ సూచనలు భారత దేశంలో ప్రజల నిత్యజీవనంలో పాటించాల్సిన మార్గదర్శకాలుగా ఉన్నాయి. అక్కడి పాలసీ ప్రజలకు ఒక సానుకూల అనుభవం, ఒక ఉత్సవంలా మారింది. ప్రతీ ఆదివారం ఉత్సాహంగా పాల్గొంటారువాళ్లు. ఆ రోజున ఏదైనా ఇతర కార్యక్రమాలు ఉంటే.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారు. కానీ, మోదీ సూచనలు మాత్రం ప్రజల సంగతి పక్కనపెడితే ప్రతిపక్షాల దృష్టిలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిన పిలుపుగా నిలిచాయి. ఇంధన వినియోగం తగ్గించాలనే లక్ష్యం ఒకటే అయినా.. జకార్తా కారు ఫ్రీ డే ప్రజల భాగస్వామ్యంతో, ఆనందకరమైన వాతావరణంలో జరుగుతుంది. మోదీ సూచనలు మాత్రం ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల త్యాగాన్ని కోరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మోదీ చెప్పినవి.. మనతో అయ్యే పనేనా??
ఏడాది పాటు బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి.. వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యం ఇవ్వండి.. కూరల్లో వంటనూనెకు తగ్గించి వాడండి.. విదేశీ ప్రయాణాలు చేయొద్దని.. ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నేపథ్యంలోనే ఆయన చేసిన సూచనలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఇవి అసలు ఆచరణ సాధ్యమేనా? అనేదానిపై ఆర్థిక నిపుణులు స్పందించారు. హైదరాబాద్ సభలో మోదీ ఏం మాట్లాడారు?.. కరోనా టైంలో అలవాటు అయిన వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్ విధానాలను మళ్లీ ఆచరించడం ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గించవచ్చు. ఈవీలను ప్రొత్సహిస్తే మరీ మంచిది. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం పాటు ఆపితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. ప్రతి కుటుంబం వంటనూనె వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు లాభం. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. రైతులు సహజ వ్యవసాయానికి మారితే దిగుమతులపై ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది అని అన్నారు. మోదీ సూచనలు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనవని ఆర్థిక నిపుణులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో అవి ఆచరణ సాధ్యమా? అంటే కష్టమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా బంగారం భారతీయ కుటుంబాల్లో ఆర్థిక భద్రతకు ప్రతీక. అలాంటి దానిని ఏడాదిపాటు కొనుగోలు నిలిపివేయడం అనేది భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధమని.. ఆచరణలో సాధ్యమయ్యేది కాదని అంటున్నారు. ఎనర్జీ నిపుణులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గడం సాధ్యమే. ఇది కొంత వరకు సాధ్యమే. కానీ ఇది ప్రధానంగా ఐటీ రంగం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. తయారీ, రవాణా రంగాల్లో ఇది అసాధ్యమంటున్నారు. అలాగే రైతులు సహజ వ్యవసాయం వైపు మారడం మంచి ఆలోచనే అయినప్పటికీ.. వాళ్లకు ప్రోత్సాహకాలు, మరింత శిక్షణ అవసరమని.. ప్రభుత్వాలు ఆ భారం భరించే స్థితిలో ఉందా? అని వ్యవసాయ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక వంటనూనె వినియోగం తగ్గించడంపైనా ఇటు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మోదీ పిలుపు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనదే. కానీ ప్రజల జీవనశైలిలో మార్పులు తేవడం సులభం కాదు. దీని కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు అవసరం. ఇంధన సంక్షోభం వంటి జాతీయ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రజల సహకారం కీలకమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ రియాక్షన్స్మోదీ పొదుపు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కు పెట్టింది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తోంది. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. మోదీ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు గుప్పించారు. అది దూరదృష్టితో కూడిన నిర్ణయమని అన్నారాయన. -
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్స్టాగ్రామ్లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
నేను ఆరోగ్యంగానే ఉన్నాను
‘‘నేను పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాను. నా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం... వాటిని నమ్మకండి’’ అని సీనియర్ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తెలిపారు. శక్తి కపూర్ మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఈ వార్తలపై ఆయన స్పందించి, ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. నా మృతి గురించి వస్తున్న వార్తలు అబద్ధం. ఇలాంటి పుకార్లను నమ్మకండి. ఇలాంటి తప్పుడు వార్తలను అందరం ఖండించాలి. ఇలాంటి పుకార్లు సృష్టించే వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను’’ అని పేర్కొన్నారాయన. విలన్గా, కమెడియన్గా దాదాపు 700 చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు శక్తి కపూర్. ఆయన కుమార్తె శ్రద్ధా కపూర్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ ద్వారా ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జిమ్ డ్రెస్లో నభా నటేశ్.. అనన్య నాగళ్ల స్మైలీ లుక్స్..!
జిమ్ డ్రెస్లో హీరోయిన్ నభా నటేశ్..సద్గురు ఫౌండేషన్లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి..స్మైలీ లుక్స్తో హీరోయిన్ అనన్య నాగళ్ల పోజులు..వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న ఆదిపురుష్ బ్యూటీ కృతిసనన్..వర్షంలో ఎంజాయ్ చేస్తోన్న ఆర్జే మహ్వశ్.. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Prakriti 💫 (@prakritikakar) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) -
నిలోఫర్లో రోగి సహాయకురాలిపై దాడి!
హైదరాబాద్: నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి సహాయకురాలిపై ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోగి సహాయకురాలిపై ఓ మహిళ సెక్యూరిటీ పిడి గుద్దులు కురిపించింది. అంతటితో ఆగకుండా మరో ముగ్గురు మహిళా సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకొని రోగి సహాయకురాలిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి సద్దుమణిగాక అధికారులు, వైద్యులు బాధితురాలిపై సానిభూతిని ప్రదర్శించి సర్ది చెప్పి బయటికి పంపింనిట్లు తెలిసింది. ఈ దాడి ఎప్పుడు జరిగింది, ఏ విషయంలో జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయమై సూపరిండెంట్ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన స్పందించలేదు. స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
15 కి.మీ.లకు రూ.1200
యశవంతపుర: బెంగళూరులో 15 కిలోమీటర్ల దూరం ఆటోరిక్షాలో వెళ్లినందుకు రూ.1200 చార్జీ వసూలు చేసినట్లు ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వర్షం వస్తున్న సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది, అందువల్ల స్నేహితులతో కలిసి ఆటోలో వెళ్లాను, ఇందుకు రూ.1200 వసూలు చేశారు, ఇది చాలా ఎక్కువ అని వివరించారు. ఈ పోస్టుపై సాన్యా సింగ్ అనే నెటిజన్ స్పందిస్తూ, బెంగళూరులో ఇలా ఉంటుందని ఊహించలేదు. మంగళవారం తన స్నేహితులతో కలిసి 15 కిలోమీటర్ల దూరం ఆటోలో ప్రయాణించినందుకు 12 వందలు చార్జీ చేశారు. ఈ డబ్బుతో రెండుసార్లు ఇంటి సరుకులను కొనవచ్చు. బెంగళూరులో వయొలిన్ కంటే హార్న్ శబ్దమే జోరుగా వినపడుతుంది. కాలేజీలో ప్రవేశం కంటే ఇక్కడ రైడ్ను బుక్ చేయడం కష్టంగా ఉంటుంది అని విమర్శించారు. మన కెరియర్ పెరుగుతుందో, లేదో తెలియదు. ఆటో డ్రైవర్లు మాత్రం శ్రీమంతులు అవుతారని దుయ్యబట్టారు. పెద్ద మొత్తంలో చార్జీ చేయటం అన్యాయమంటూ కొందరు పేర్కొన్నారు. ఈ పోస్టుతో బెంగళూరులో ఆటో, క్యాబ్ చార్జీలు చర్చనీయాంశమయ్యాయి. -
విష్ణుప్రియ స్టన్నింగ్ పోజులు.. శారీలో పుష్ప బ్యూటీ పావని..!
రెడ్ డ్రెస్లో యాంకర్ విష్ణు ప్రియ స్టన్నింగ్ పోజులు..ఏప్రిల్ జ్ఞాపకాలు నెమరు వేసుకున్న యషిక ఆనంద్..శారీలో మరింత అందంగా పుష్ప బ్యూటీ పావని..బంగారంలా మెరిసిపోతున్న బాలీవుడ్ భామ నుస్రత్..చీరతో ముసుగేసిన ఐటమ్ సాంగ్ గర్ల్ నోరా ఫతేహీ.. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Vishnu Priya Bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Pavani Karanam (@livpavani) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
వర్షం పడితే చాలు దోపిడీ
దేశ ఐటీ రాజధానిగా, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరులో వర్షం కురిస్తే చాలు జనజీవనం స్తంభించడంతోపాటు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ కింద ఏకంగా రూ.1,200 వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ఈ సర్జ్ ప్రైసింగ్ (అధిక ఛార్జీలు) వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాన్యా సింగ్ తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో కేవలం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆటో డ్రైవర్ రూ.1,200 డిమాండ్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఆమె అంత మొత్తం చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ట్రాఫిక్ కారణంగా ఇంటికి చేరుకోవడానికి ఆమెకు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.గందరగోళంబెంగళూరు వర్షాల గురించి సాన్యా సింగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘బెంగళూరులో వర్షం కురిసినప్పుడు వయోలిన్ సంగీతం వినిపించదు. కేవలం హారన్ల మోత మాత్రమే వినిపిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ పొందడం కంటే వర్షం సమయంలో ఆటో బుక్ చేయడం చాలా కష్టమైన పని. మా కెరీర్లు ఎలా ఉన్నా ఆటో డ్రైవర్లు మాత్రం ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sanya Singh (@sanya.unfiltered)సోషల్ మీడియాలో..ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ‘వర్షం పడితే చాలు ఆటోలు, క్యాబ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’ అని ఒక వినియోగదారుడు పేర్కొన్నారు. ‘డిమాండ్, సరఫరా పేరుతో డ్రైవర్లు ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారు. దీనిని నియంత్రించే వ్యవస్థ లేదా నియమ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి?’ అని మరొకరు ప్రశ్నించారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
నా చావుకు కారణం మీ అనుచరులే..
నిడదవోలు రూరల్: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అనుచరుల టార్చర్ వల్లే నేను చనిపోతున్నాను.. అకారణంగా ఓ కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్చార్జి కట్టా మణికంఠ సోషల్ మీడియాలో ఆదివారం మధ్యాహ్నం సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో మణికంఠ ఆచూకీ తెలపాలని టీడీపీ నాయకులు నిడదవోలు పట్టణ పోలీస్స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. మరో వైపు మణికంఠ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సెల్ఫీ వీడియో సారాంశం ఇదీ.. ‘నా పేరు కట్టా మణికంఠ. మాది నిడదవోలు మండలం సింగవరం. నాన్న.. నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా. అక్రమ కేసులు తట్టుకోలేకపోతున్నాను. మంత్రి కందుల దుర్గేష్ గారూ.. నేను తెలుగుదేశం కార్యకర్తను. మా నాన్న గారు తెలుగుదేశం పార్టీ నాయకులు. 1989 నుంచి అదే టీడీపీలో ఉన్నారు. సింగవరంలో చందు అనే వ్యక్తి గతంలో దేవదాయశాఖకు సంబంధించిన స్థలాలు కబ్జా చేశాడు. పంచాయతీరాజ్, స్కూల్ స్థలాలు కబ్జా చేశాడు. దానిపై మా నాన్న 14 నెలలుగా పోరాటం చేస్తున్నారు. టీడీపీ బూత్ ఇన్చార్జినైన నా మీద కేసులు పెడితే ఇంకా ఎందుకు సార్ పార్టీ. మీ నియోజకవర్గంలో బీసీలంటే అంత చులకనా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి నా ఫోన్ సీజ్ చేశారు. ఎస్సై, సీఐ పట్టించుకోవడం లేదు. నేను పనిచేసిన చోటుకు వచ్చి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఊర్లో భూములు కబ్జా చేసిన చందు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నాకు గుండె దడగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. నేను చనిపోతున్నాను. నా చావుకు కారణం డాక్టర్ తోపరాల కల్యాణ చక్రవర్తి, పెన్మత్స చందు వర్మ, అచ్యుత్ పవన్, సాయిలక్ష్మణ్ అడ్డాల, ఎస్సై జగన్మోహన్రావు, సీఐ తిలక్లే. నేను చనిపోతున్నాను.. నా వల్ల కావడం లేదు.’ అని పోస్టు చేశాడు. -
గ్రీన్ డ్రెస్లో నిహారిక కొణిదెల.. డిఫరెంట్ అవుట్ఫిట్లో సుప్రీత..!
ఏప్రిల్ జ్ఞాపకాల్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ..ఆరెంజ్ డ్రెస్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందాలు..పచ్చని డ్రెస్లో ప్రకృతిలో కలిసిపోయిన నిహారిక కొణిదెల..పార్టీలో యాంకర్ రష్మీ గౌతమ్ చిల్..డిఫరెంట్ అవుట్ఫిట్లో మెరిసిన టాలీవుడ్ బ్యూటీ సుప్రీత.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గుంటూరు కోర్టులలో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సూచించింది. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట దక్కింది. కొత్తపేట పీఎస్లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. తనపై గుంటూరు జిల్లా నల్లపాడు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ శ్రీహరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు తేలేందత వరకు ఆ కేసుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆయన గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. ఒకే అంశానికి సంబంధించి బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కావాలనే కేసులు పెట్టారు. ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అందుకు నన్ను బాధ్యుడిని చేయడం తగదు’అని శ్రీహరి తన వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.పూడి శ్రీహరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, గుంటూరు కోర్టులు తీర్పును వెలువరించాయి. నమోదైన కేసుల్లో పూడి శ్రీహరిని అరెస్ట్ చేయొద్దని 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఆదేశించాయి. -
జ్ఞాపకాల్లో మెగా డాటర్ నిహారిక.. శారీలో సీతారామం బ్యూటీ..!
మూవీ ఈవెంట్లో మెరిసిన పాయల్ రాజ్పుత్..బిగ్బాస్ సావిత్రి ఇంట 21 రోజుల వేడుక..గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనిఖా సురేంద్రన్..శారీలో మృణాల్ ఠాకూర్ హోయలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ రాశి ఖన్నా హోయలు.. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
సముద్ర తీరాన హన్సిక చిల్.. పెళ్లి కూతురిలా మెరిసిపోతున్న శ్రీలీల..!
సముద్ర తీరాన చిల్ అవుతోన్న హన్సిక..బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ గ్లామర్ పోజులు..సమ్మర్లో మ్యాంగో తింటూ ఎంజాయ్ చేస్తోన్న సమీరా..బ్లూ డ్రెస్లో బిగ్బాస్ దివి అందాలు..పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ శ్రీలీల.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
బెంగాల్ పోలింగ్: టేపుతో ఈవీఎంల ట్యాంపరింగ్?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తుది విడత పోలింగ్ వేళ.. అధికార, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలకు దిగాయి. కేంద్ర బలగాల సాయంతో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడుతోందని, ఎన్నికల పరిశీలకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ఓడిపోతున్నాననే భయంతో ఆమె అలా మాట్లాడుతున్నారని.. రౌడీయిజంతో ఆ పార్టీనే ఓటర్లను భయపెడుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగానే..పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై గుర్తులకు టేప్ అంటించి ఉండడం కలకలం రేపింది. పలు నియోజకవర్గాల్లో అధికార పక్షం తమ కమలం గుర్తును దాచేసి ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. సౌత్ 24 పరగణాలోని పోలింగ్ బూత్ల్లో.. అదీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పట్టున చోట ఇది ఎక్కువగా జరిగిందని అంటోంది.ఇంతకాలంగా మమతా బెనర్జీని రక్షిస్తున్న డైమండ్ హార్బర్ మోడల్ ఇదేనా? అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. అభిషేక్ బెనర్జీ కూడా ఈ మోడల్తోనే లోక్సభ ఎన్నికల్లో నెగ్గారా? అంటూ బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇంచార్జి అమిత్ మాలవీయా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఫల్తా నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్లలో బీజేపీ గుర్తు ఉన్న బటన్ను టేప్తో కప్పి, ఓటర్లు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఈ విధానాన్ని వారు “డైమండ్ హార్బర్ మోడల్” అని పిలుస్తున్నారు. ఇది మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలో గెలుపు కోసం ఉపయోగించిన టెంప్లేట్ అయి ఉండొచ్చు. మమతా బెనర్జీ తన క్రిమినల్ కేసులున్న టీఎంసీ అభ్యర్థి జెహంగీర్ ఖాన్కు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ మోడల్ను రక్షిస్తున్నారు అని మాలవీయా విమర్శించారాయన. అదే సమయంలో పలు చోట్ల తమ గుర్తును కూడా టేపుతో దాచేశారని సీపీఎం ఆరోపిస్తోంది. ఈ సంచలన ఆరోపణల నడుమ.. ఆ వీడియో వైరల్ అవుతోంది.అయితే టీఎంసీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. బీజేపీ తప్పుడు ప్రచారానికి దిగిందని అంటోంది. మాలవీయా సోషల్ మీడియాలో పోస్టులు చేసే బదులు తమ బాసుల దృష్టికి విషయం తీసుకెళ్తే సరిపోతుంది కదా.. అప్పుడు వాళ్లు ఈసీని ప్రయోగించి చేయాల్సింది చేస్తారు అని ఎద్దేవా చేస్తోంది. మరోవైపు.. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దర్యాప్తులో వాస్తవమని తేలితే రీపోలింగ్ అంశం పరిశీలిస్తామని చెబుతోంది. This is what Mamata Banerjee was defending when she spoke up for Jehangir Khan, a criminal contesting on a TMC ticket from Falta in Diamond Harbour.In several polling booths, the option to vote for the BJP has been blocked using a tape, effectively preventing voters from… pic.twitter.com/sKw3mcdA86— Amit Malviya (@amitmalviya) April 29, 2026 -
అస్తిపంజరంతో బ్యాంక్కు.. అసలు జరిగింది ఇదే!
ఓ గిరిజనుడు తన సోదరి సమాధిని తవ్వి, ఆమె అస్థిపంజరాన్ని భుజాన మోసుకుని బ్యాంకు అధికారుల ముందు ప్రదర్శించిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. మీడియా, సోషల్ మీడియా ద్వారా ఇది బాగా వైరల్ అయ్యింది కూడా. ఈ ఘటన కలచి వేసిందని సాక్షాత్తూ ఆ రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నియంత్రణ శాఖల మంత్రి సురేష్ పూజారి అనడం.. విపక్షాల విమర్శలకూ తావిచ్చింది. అయితే.. ఘటన వైరల్ అయిన నేపథ్యంలో జీతూ ముండాకే ఎక్కువ మంది సపోర్ట్గా నిలిచారు. వ్యవస్థలోని లోపాలు, అవగాహన లోపం, పేదరికం.. అంశాలతో పెద్ద చర్చే నడిచింది. ఏదైతేనేం బాధిత కుటుంబానికి అందాల్సిన డబ్బు అందింది. అయితే సంబంధిత బ్యాంకు మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా సగం సగం సమాచారంతో తమను తొట్టిపోయడం సరికాదని అంటోంది. ఫ్యాక్ట్ చెక్ పేరిట అసలేం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసింది. కేంఝర్ జిల్లా దియానలి గ్రామానికి కల్రా ముండాకు (56) ఒడిశా గ్రామీణ వికాస్ బ్యాంక్ బ్యాంకులో ఖాతా ఉంది. పశువులు అమ్మేయగా వచ్చిన సొమ్మును ఆమె ఆ ఖాతాలో జమ చేసుకుంది. అయితే ఈ ఏడాది జనవరిలో ఆమె కన్నుమూసింది. దీంతో ఆ సొమ్ము కోసం ఆమె సోదరుడు జీతూ ముండా (50) బ్యాంకు అధికారుల్ని సంప్రదించాడు. ఆమె వస్తేనే ఆ డబ్బు ఇవ్వడం కుదరుతుందని బ్యాంకు అధికారులు అతనితో చెప్పారు. ఆమె చనిపోయిందన్నా వినలేదు. దీంతో సాక్ష్యం కోసం ఆమె సమాధి తవ్వి ఎర్రటి ఎండలో భుజాన వేసుకుని బ్యాంకు దగ్గరికి వచ్చాడు. కంగారుపడిపోయిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం.. ఈలోపు అతన్ని కొందరు వీడియోలు తీసి నెట్లో పెట్టారు. ఈలోపు పోలీసులు కలగజేసుకుని అతనికి న్యాయం చేస్తామని సర్దిచెప్పి.. ఆ అస్తిపంజరాన్ని తిరిగి సమాధిలోకి చేర్చారు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ภาพถึงหน้าแบงค์แล้ว Jitu Munda พยายามถอนเงินประมาณ 20,000 รูปี (6,877.64 บาท) จากบัญชีของพี่สาวผู้ล่วงลับ ธนาคารในรัฐโอดีชา ปฏิเสธ (ให้พาเจ้าของบัญชีมาด้วย) pic.twitter.com/TEi3evavxn— R here (@UvgtdERt4PWmcjF) April 28, 2026ఈ ఘటన వైరల్ కావడంతో.. మంగళవారం అధికారులు స్పందించారు. కల్రా ముండా డెత్ సర్టిఫికెట్తో పాటు లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు కూడా జీతూ ముండా, మిగతా సోదరీమణుల చేతికి అప్పగించారు. ఆ వెంటనే గ్రామీణ బ్యాంక్ అధికారులు కదిలారు. వాళ్లకు రావాల్సిన రూ.19, 402 సొమ్మును అందజేశారు. అదే సమయంలో రెడ్క్రాస్ సొసైటీ వాళ్లకు ఆ కుటుంబ దీనావస్థ గురించి తెలిసి మరో రూ.30 వేలను అందించింది. అయితే.. బ్యాంకు మాత్రం జరిగింది వేరని చెబుతోంది. విత్డ్రా సొమ్ము కోసం జీతూ ముండా బ్యాంకుకు వచ్చిన మాట వాస్తవమే. కానీ, అప్పటికే ఆయన మద్యం సేవించి ఉన్నాడు. ఆ మత్తులో ఉండడం, పైగా నిరక్షరాస్యుడు కావడంతో మా సిబ్బంది చెప్పింది అతనికి అర్థం కాలేదు. చనిపోయిన వ్యక్తి ఖాతాలో ఎమౌంట్ను విత్డ్రా చేసే అధికారం.. నామినీకి తప్ప మూడో వ్యక్తికి ఉండదు. అందుకే డబ్బు ఇవ్వడం కుదరదని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. ఆమె చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకురావాలని.. అదీ కుదరకుంటే నామీనిని అయినా తీసుకు రమ్మని చెప్పారు. అప్పటికే మత్తులో ఉన్న ఆయనకు అదేదీ అర్థం కాలేదు.. మా ఉద్దేశం డిపాజిటర్ డబ్బును రక్షించడం, నియమాలను పాటించడం మాత్రమే. బ్యాంకు సిబ్బంది ఖాతాదారులను వేధింపులకు గురి చేస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఒడిషా గ్రామీణ బ్యాంకుకు స్పాన్సర్షిప్ చేస్తున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక ట్వీట్ చేసింది. Reported Incident at Odisha Grameen Bank of claimant bringing sister’s skeleton for death claim process.We would like to submit that, today the Government Authorities have issued the Death Certificate and Legal Heir Certificate. Immediately on receipt of these documents, Bank…— Indian Overseas Bank (@IOBIndia) April 28, 2026 ఎవరేమంటున్నారు.. ‘నా సోదరి మరణించిందని చెప్పినా బ్యాంకు సిబ్బంది వినలేదు. ఆమెను తీసుకొని వస్తేనే డబ్బు ఇస్తామన్నారు. ఏం చేయాలో పాలుపోక నా సోదరి అస్థిపంజరాన్ని తీసుకొచ్చి ఆమె మరణించిన విషయాన్ని రుజువు చేయాలనుకున్నా’.. జీతూ ముండామా సోదరుడు డబ్బు కోసం బ్యాంకు చుట్టూ తిరిగాడు. అక్కడి సిబ్బంది ఇవ్వకుండా అతన్ని వేధించారు. ఏం చేయాలో సరిగా వివరించలేదు. భరించలేకే ఆ పని చేశాడు. అందుకే అధికారులు దిగొచ్చి మా డబ్బు మాకు ఇచ్చారు .. జీతూ మిగిలిన ఇద్దరు సోదరీమణులుమరణించిన వ్యక్తిని బ్యాంకుకు తీసుకురావాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. అవసరమైన పత్రాలు అందించమని మాత్రమే కోరాం. అవి అందిన వెంటనే రూ.19,402 మొత్తాన్ని ముగ్గురికీ అందించాం.. బ్యాంకు అధికారులుజీతు ముండా, కల్రా ముండాలు నిరక్షరాస్యులు. నామినీ, లీగల్ హెయిర్ అనే విషయాల గురించి తెలియదు. అకౌంట్లు ఇచ్చే సమయంలో అత్యుత్సాహం చూపించే సిబ్బంది కూడా సరైన విధంగా వివరించలేదు.. స్థానిక పోలీసులుడబ్బు ఎలా తీసుకోవాలో జీతూ ముండా కుటుంబానికి అవగాహన లేకుండా పోయింది. అదే సమయంలో వాళ్లకు అర్థమయ్యేలా వివరించడంలో బ్యాంకు సిబ్బంది కూడా విఫలమయ్యారు.. గ్రామస్తులుబ్యాంకు అధికారులకు ఆ పెద్దాయన భలే బుద్ధి చెప్పారు అని కొందరు.. ఇలాంటి విషయాల్లో ఖాతాదారులకు కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. -
ఈ డెలివరీ బాయ్ చాలా మంచోడు
చిన్న చిన్న తప్పులు.. ఒక్కోసారి పెద్ద నష్టానికే దారి తీయొచ్చు. అలాంటి టైంలో ఎవరో ఒకరు కాపాడేందుకు ముందుకు వస్తే ఎలా ఉంటుంది?. వాళ్లను రియల్ హీరో అనకుండా ఉండలేం కదా!. ముంబైలో ఒక యువతి అలాంటి అనుభవం ఎదురైంది. డెలివరీ కోసమని వచ్చిన యువకుడు చేసిన పనితో ఆమె ఉబ్బితబ్బిబై నెట్టింట ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. ముంబైకి చెందిన దివ్య ఉన్ని.. పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ కంగారులో ఇంటికి తాళం సంగతి ఏమోగానీ.. కనీసం డోర్ కూడా దగ్గరకు వేయకుండా వెళ్లిపోయింది. అయితే అప్పటికే ఆమె ఆన్లైన్లో ఓ పార్శిల్ ఆర్డర్ పెట్టింది. ఇంటికి తాళం వేయని సంగతి మర్చిపోయి.. డెలివరీ బాయ్ దానిని బయట పెట్టి వెళ్తాడులే అని అనుకుంది. అయితే డెలివరీ ఇవ్వడానికి వచ్చిన యువకుడు డోర్ తెరిచే ఉన్న విషయాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని అతను ఫోన్లో ఆమెకు తెలియజేశాడు. నాలిక్కరుచుకున్న దివ్య.. ఆగమేఘాల మీద ఇంటికి చేరింది. ‘‘అతను కేవలం పార్సెల్ను వదిలి వెళ్లిపోలేదు. ఇంటి ముందు నిలబడి, ఎవరూ లోపలికి వెళ్లకుండా చూసుకున్నాడు. నా పెంపుడు పిల్లి బయటకు పారిపోకుండా చూశాడు. నేను వచ్చేదాకా ఓపికగా అక్కడే ఎదురు చూశాడు. తనను అమ్జాద్ అని పరిచయం చేసుకున్న ఈ డెలివరీ బాయ్కి దివ్య కృతజ్ఞతలు తెలిపింది.ఈ సంఘటనను దివ్య వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోగా.. అది వైరల్ అయింది. అమ్జాద్ నిజాయితీ, బాధ్యతా భావం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “ఇలాంటి నిజాయితీకి గుర్తింపు ఇవ్వాలి” అని కొందరు.. అతనికి టిప్ అయినా ఇవ్వాల్సింది అని మరికొందరు కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Divya Unny (@divyaunnyfilms) -
అడ్డంగా దొరికిపోయిన రాఘవ్ చద్దా!
రాజకీయాల్లో మార్పులు సాధారణమే. కానీ ఆ మార్పులు డిజిటల్ యుగంలో ప్రజల నమ్మకాన్ని, నేతల ఇమేజ్ను ఒక్కసారిగా కుదిపేస్తాయి. అందుకు రాఘవ్ చద్దానే ఉదాహరణ. ఆమ్ ఆద్మీ పార్టీలో యువ నేతగా ఎదిగిన చద్దా.. బీజేపీలో చేరడానికి జెన్జీ జీర్ణించుకోలేకపోయింది. #UnfollowRaghavChadha అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతూ.. లక్షలాది ఫాలోవర్లు ఆయన్ని వదిలి వెళ్లిపోతున్నారు. తద్వారా దేశంలోనే అతిపెద్ద డిజిటల్ నిరసనకు ఆయన కారణమయ్యారు. చద్దా ఆప్ ఉన్నప్పుడు యువతకు దగ్గరగా ఉన్న నాయకుడిగా, మరీ ముఖ్యంగా సాధారణ సమస్యలపై మాట్లాడే వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్నారు. కానీ ఆప్ను తిడుతూ బీజేపీలో చేరిన వెంటనే ఆయనపై విశ్వాసం ఉంచిన యువతలో నిరాశ, కోపం వ్యక్తమైంది. ఈ నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న ప్రజాదరణను కూడా గణనీయంగా ప్రభావితం చేసింది.కేవలం 24 గంటల్లోనే 1 మిలియన్కి(10 లక్షల మందికి) పైగా ఫాలోవర్స్ తగ్గిపోయారు. ఇప్పటిదాకా మొత్తం 2.3 మిలియన్ల మంది అన్ఫాలో చేశారు. ఇంకా అవుతూనే ఉన్నారు. జెన్జీ ఐకాన్గా పేరు పొందిన రాఘవ్ చద్దా పార్టీ మారడాన్ని యువత నమ్మక ద్రోహంగా ఫీలవ్వడమే ఈ ఫలితమని స్పష్టమవుతోంది. అయితే..ఈ పరిణామం తర్వాత ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రతీ ఓ సంచలన వీడియో విడుదల చేశారు. డ్యామేజ్ కంట్రోల్కి దిగిన రాఘవ్ చద్దా.. ఫాలోవర్లను కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని ఆధారాలు చూపించాడు. ఈ ఏడాది ఏప్రిల్లో అదీ ఈ మధ్యే క్రియేట్ చేసిన అకౌంట్ల ద్వారా రాఘవ్ చద్దాను ఫాలో చేయిస్తున్నారని.. వాటిలో పోస్టులు.. ప్రొఫైల్ ఫోటోలు.. ఎలాంటి ఎంగేజ్మెంట్ లేదని.. కేవలం బాట్స్ (bots) ద్వారా ఫాలోవర్స్ సంఖ్యను కృత్రిమంగా పెంచే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. నిజమైన ప్రజాదరణను నకిలీ ఫాలోవర్లతో కాపాడలేరు అని రతీ ఆ వీడియో చేయడం ఈ చర్చను మరింత వేడెక్కించింది. ఈ వీడియోతో సోషల్ మీడియాలో రాఘవ్ చద్దా విశ్వసనీయతపై పెద్ద ప్రశ్నలు తలెత్తాయి. సోషల్ మీడియా కాలంలో.. నాయకుల విశ్వసనీయత కేవలం సభల్లో ఇచ్చే ప్రసంగాలపై ఆధారపడదు. వారి డిజిటల్ ఇమేజ్, ప్రజలతో ఉన్న అనుబంధం, ఫాలోవర్ల ప్రతిస్పందన కూడా ముఖ్యమే. రాఘవ్ చద్దా కేసు.. సోషల్ మీడియా యుగంలో ప్రజల నమ్మకం ఎంత త్వరగా మారిపోతుందో, డిజిటల్ ఇమేజ్ ఎంత కీలకమో గుర్తు చేసింది. -
సమాధి తవ్వి.. భుజంపై అక్క అస్థిపంజరంతో..!
న్యాయం కోసం హీరోలు సినిమాల్లో పోరాడడం చూస్తుంటాం. భావోద్వేగంతో విజిల్స్ వేస్తుంటాం.. కన్నీళ్లు పెట్టుకుంటాం. ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది. అయితే ఈ కథలో బాధితుడే ఓ హీరో. ఆ వ్యక్తి సహనానికి అధికారులు పరీక్ష పెట్టారు. ఓపిక నశించిన ఆ పెద్దాయన చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.50 ఏళ్ల జీతు ముండాది ఒడిషా కియోంజర్ జిల్లా డియానాలి గ్రామం. అతని అక్క కల్రా ముండా(56) ఈ జనవరిలో అనారోగ్యంతో చనిపోయింది. మరణించే ముందు ఆమె తన పశువుల్ని అమ్మింది. అలా వచ్చిన సొమ్ము రూ.20 వేలను ఒడిశా గ్రామీణ బ్యాంక్లో జమ చేసింది. అయితే ఆ సొమ్ము కోసం జీతు ఒజీవీ బ్యాంక్ మలిపోసి బ్రాంచ్కు వెళ్లాడు.కల్రా తన సోదరి అని, ఆమె మరణించిందని.. ఎవరూ లేకపోవడంతో ఆ సొమ్ము తనకు ఇవ్వమంటూ బ్యాంక్ అధికారుల్ని కోరాడు. అయితే సిబ్బంది అది వినిపించుకోలేదు. అకౌంట్ హోల్డర్ను తీసుకురావాల్సిందేనని పట్టుబట్టారు. అలా పదులసార్లు బ్యాంకుకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు మేనేజర్ కూడా చేతులెత్తయడంతో జీతూకి మండిపోయింది.సరాసరి అక్క సమాధి దగ్గరికి వెళ్లి.. ఆ అస్తిపంజరాన్ని ఓ సంచిలో మూటగట్టకున్నాడు. ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా ఆ సంచి మోసుకుంటూ బ్యాంకుకు వచ్చాడు. దారిన స్థానికులు కొందరు ఆ చర్యను చూసి షాక్కు గురయ్యారు. తమ మొబైల్స్లో ఆ దృశ్యాన్ని రికార్డు చేశారు. అస్థిపంజరాన్ని చూపించి.. తన సోదరి చనిపోయిందని ఆధారాలు చూపించాడు. జీతూ చేసిన పనితో బ్యాంకు అధికారులు హడలి పోయారు. పోలీసులకు సమాచారం అందించారు.A man in Odisha dug up his deceased sister’s grave and brought her skeleton to the bank Just to prove she had died.He had been trying to withdraw ₹20,000 from her account, but bank officials kept insisting he bring the account holder in person. Despite repeatedly telling them… pic.twitter.com/hICEqwvPFu— Woke Eminent (@WokePandemic) April 28, 2026అనుమతి లేకుండా పాతిన శవాన్ని బయటకు తీయడం నేరమని.. జీతూ మీద కేసు పెట్టమని బ్యాంకు అధికారులు పోలీసుల మీద ఒత్తిడి చేశారు. కానీ, పోలీసులు మాత్రం ఆ పెద్దాయనకే సపోర్ట్గా నిలిచారు. వాళ్ల జోక్యంతో బ్యాంకు అధికారులు దిగి వచ్చారు. జీతు ముండాకి ఇవ్వాల్సిన సొమ్మును ఇచ్చే ఏర్పాటు చేశారు. ‘‘జీతు ముండా, కల్రా ముండాలు నిరక్షరాస్యులు. నామినీ, లీగల్ హెయిర్ అనే విషయాల గురించి తెలియదు. అకౌంట్లు ఇచ్చే సమయంలో అత్యుత్సాహం చూపించే సిబ్బంది కూడా సరైన విధంగా వివరించలేదు’’ అని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. తనకు తెలియకుండానే చేసిన ఈ నిరసన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భలే పని చేశాడని.. బ్యాంకు వాళ్లకు తగిన బుద్ధి చెప్పాడని ప్రశంసలు గుప్పిస్తున్నారు. మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల బ్యాంకుల్లో కోట్లాది డబ్బులు మూలుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, బ్యాంకుల్లో క్లైమ్ చేయని డిపాజిట్లు, టీడీఎస్ రీఫండ్లు కలిపి సుమారు లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు చెందిన డబ్బు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి.బ్యాంకుల్లో క్లయిమ్ చేయని డిపాజిట్లుజనవరి 2026 నాటికి మొత్తం రూ.72,454 కోట్లుపబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో: రూ.60,571 కోట్లుప్రైవేట్ బ్యాంకుల్లో: రూ.9,608 కోట్లువిదేశీ బ్యాంకుల్లో: రూ.2,275 కోట్లు.. ఈ మొత్తాన్ని RBI నిర్వహించే Depositor Education and Awareness (DEA) Fundకి బదిలీ చేశారు.టీడీఎస్ రీఫండ్లుక్లైమ్ చేయని TDS రీఫండ్లు: సుమారు రూ3,000 కోట్లు. ఇవి ప్రభుత్వ ఖజానాలో ఉంటాయి, కానీ పన్ను చెల్లించిన వ్యక్తులు ITR ఫైలింగ్ ద్వారా తిరిగి పొందవచ్చు.ఎందుకు క్లయిమ్ చేయబడటం లేదు?అకౌంట్ హోల్డర్ మరణం, నామినీ లేకపోవడంప్రజల్లో అవగాహన లోపంక్లిష్టమైన పేపర్వర్క్, ప్రక్రియలు -
‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్ యువకునికి నరకం!
ఇస్లామాబాద్: సోషల్ మీడియాలో ఏదైనా జోక్ వేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన వింత పరిస్థితి పాకిస్తాన్లో నెలకొంది. తమ రోజువారీ ట్రాఫిక్ కష్టాలను వర్ణిస్తూ, ఓ యువకుడు సరదాగా చేసిన ఓ పోస్ట్ ఏకంగా అతన్ని కటకటాల వెనక్కి నెట్టివేసింది.ఇస్లామాబాద్లోని టార్నోల్ రైల్వే క్రాసింగ్ వద్ద నిత్యం ఉండే ట్రాఫిక్ రద్దీపై ఓ యువకుడు సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ చేశాడు. ‘టార్నోల్ రైల్వే క్రాసింగ్.. హార్ముజ్ జలసంధికి ఏమాత్రం తీసిపోదు. ఒకవేళ దీన్ని మూసివేస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి’ అని అందులో రాసుకొచ్చాడు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి తరచూ వార్తల్లో నిలుస్తోంది. అలాంటి సున్నితమైన అంశాన్ని స్థానిక రైల్వే గేటుకు ముడిపెడుతూ, చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్గా మారింది.పోలీసుల యాక్షన్.. కఠిన సెక్షన్ల కింద కేసుఆ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో ఇస్లామాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు యువకుడిని అదుపులోకి తీసుకొని అతని మొబైల్ ఫోన్ను సీజ్ చేసి ఆధారాలు సేకరించారు. ప్రభుత్వ అధికారి ఆదేశాలను ధిక్కరించడం, అక్రమ నిర్బంధం, నేరానికి యత్నించడం వంటి పాకిస్తాన్ పీనల్ కోడ్లోని పలు కఠినమైన సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో భద్రతా కారణాల దృష్ట్యా సెక్షన్ 144 అమల్లో ఉందని, అందుకే ముందస్తు భద్రతలో భాగంగానే ఈ అరెస్ట్ చేశామని పోలీసులు ఈ చర్యను సమర్థించుకుంటున్నారు.భావప్రకటనా స్వేచ్ఛపై మొదలైన తీవ్ర చర్చఅయితే, భద్రత పేరుతో పోలీసులు చేసిన ఈ అరెస్ట్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం డార్క్ హ్యూమర్తో చేసిన ఓ చిన్న కామెంట్ను జాతీయ భద్రతా ముప్పుగా భావించి, అరెస్ట్ చేయడం ఏంటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని పలువురు మండిపడుతున్నారు. భద్రత, పౌర హక్కుల మధ్య సమతుల్యత పాటించడంలో అధికారులు విఫలమయ్యారని, ఒక జోక్కు ఇంతలా స్పందించడం సరికాదని స్థానిక పత్రికలు సైతం తమ సంపాదకీయాల్లో పోలీసుల తీరును ఎండగడుతున్నాయి.ఇది కూడా చదవండి: షాకింగ్: సన్యాసుల ముసుగులో భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్! -
మహిళల్ని ముందు, వెనుక వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?
యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది. తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని వేసిన ఫిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు బీకే దిగంత్.. బెంగళూరు మెట్రో చిక్స్ అనే ఇన్స్టా ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసేవాడు. గత ఏడాది మేలో బనశంకరి పోలీసులు విచారణ జరిపి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసు చెల్లుబాటు కాదని, కొట్టేయాలని నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అర్జీని విచారించిన న్యాయమూర్తి.. నిందితునిపై భగ్గుమన్నారు. మహిళలను ఎక్కడా సురక్షితంగా ఉండనివ్వరా? అని దిగంత్ను నేరుగా ప్రశ్నించారు. ఇలా చేయడం చూస్తే నీకు మానవత్వం ఉందా? అంటూ అర్జీని కొట్టివేశారు. మహిళలను ముందు, వెనుక నుంచి వీడియో తీసి ఎడిట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?, మీరు ఎలాంటి మనుషులు అని జడ్జి ఆగ్రహించారు. నిందితుని న్యాయవాది వాదిస్తూ, మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నారు. అయితే సాంకేతిక అంశాలను చూపించి తప్పించుకోలేదని న్యాయమూర్తి చురకలు ముట్టించారు. కొన్ని విషయాలలో నైతికత, భద్రత ముఖ్యమన్నారు. మహిళల అనుమతి లేకుండా అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే పెద్దనేరమని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
హైదరాబాద్లో పెట్రో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. భారీ క్యూలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ దొరకదంట.. అర్జంట్గా పోయి ట్యాంకు ఫుల్ చేయించుకోవాలి అంటూ బంకు దగ్గరికి వెళ్లిన రామారావుకి జనం కాస్త ఎక్కువగా కనబడ్డారు. కాస్త ముందుకు వెళ్తే మరో బంక్ ఉంది కదా అనుకుని వెళ్తే.. మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం కనిపించింది. చూస్తే కిలోమీటర్పైగా బండ్లు క్యూ కట్టాయి. పోనీలే ఇంకో బంక్ అనుకుంటూ మరో రెండు కిలోమీటర్లు వెళ్లి చూస్తే అక్కడ ‘‘నో స్టాక్ బోర్డు’’.హైదరాబాద్లో సోమవారం నుంచి పెట్రో బంకుల వద్ద పరిస్థితి ఇది. మంగళవారం ఉదయం నాటికి అది తీవ్రతరంగా మారింది. పెట్రోల్ బంకుల ముందు ద్విచక్ర వాహనాలు, కార్లు భారీగా వరుస కట్టాయి. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాతే పెట్రోల్, డీజిల్ అంటూ చెబుతున్నారు బంకు నిర్వాహకులు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో బంకుల వద్ద దృశ్యాలు ఇవే. తొలుత ఏపీలో కేవలం డీజిల్ కొరత మాత్రమే ఉందని చర్చ జరగ్గా.. ఆ వెంటనే అది పెట్రోల్కు కూడా పాకింది. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల సరిహద్దుల గుండా నెమ్మదిగా అంతటా ‘పెట్రో కొరత వైరస్’ వ్యాపించేసింది. కంపెనీల నిర్వాకమా?యుద్ధ ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. అయితే దేశీయంగా ఇంధన ధరలు పెరగకపోవడం వల్ల ఆయిల్ కంపెనీలు నష్టాలను భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు తమ రిటైల్ అవుట్లెట్లకు సరఫరాను తగ్గించగా.. మరికొన్ని ‘రేషన్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థల బంకులపై అదనపు భారం పడుతోంది. ఒకేసారి డిమాండ్ పెరగడంతో గంటల తరబడి వాహనాలు క్యూ కడుతుండగా.. సాధారణంగా రెండు మూడు రోజులకు సరిపడే స్టాక్ కొన్ని గంటల్లోనే ఖాళీ అవుతోంది. ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నది సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్లు. ‘‘పెట్రోల్, డీజిల్ అయిపోతోంది’’, ‘‘ఇరాన్ యుద్ధం జరుగుతోంది కదా ఇక కష్టమే’’, ‘‘ధరలు పెరుగుతాయి” ఇలాంటి వదంతులతో ప్రజలు అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, బాటిళ్లు, క్యాన్లలో నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని అధికారులు అంటున్నారు. ఫలితంగా.. అవసరం ఉన్న వాహనదారులు మాత్రమే కాదు వ్యవసాయ, వ్యాపార, పరిశ్రమ.. ఇతర రంగాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. ప్రభుత్వ వ్యవస్థలు ఫెయిల్!తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొందనే ప్రచారం సోషల్ మీడియాకే పరిమితమైందని ప్రభుత్వం అంటోంది. అలాగే తగినంత నిల్వలు.. సరఫరా సాఫీగానే ఉందని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. కానీ, పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులను రంగంలోకి దించినట్లు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, అది పూర్తి స్థాయిలో జరగడం లేదన్నది జనం మాట. ఈ విషయంలో ఇరు ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అవుతున్నాయని తిట్టిపోస్తున్నారు. ఆయిల్ కంపెనీలు సరైన సమాచారం అందించి పంపిణీ వ్యవస్థను మెరుగుపరిస్తేనే ఈ భయాందోళనలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.Again I could see big queues at Petrol bunks #Hyderabad— Vinay (@vinay_a9) April 27, 2026Visited 3 petrol bunks in Hyderabad after 9PM, no service anywhere. Shortage again? 🤨#Hyderabad #PetrolShortage— Rishi. (@Rushiver_k) April 27, 2026Long queues in front of all petrol bunks in hyderabad . Shooting was interrupted today because of scarcity of diesel. 🙏🙏🙏— Sateesh Botta (@bkrsatish) April 27, 2026@TelanganaCMO @TelanganaCS @PetroleumMinToday almost all petrol Bunks in #Hyderabad have displayed "no stock" boards.And which bunk the stock is available have kilometres of Queue line for #petrol and #diesel.Is this a real shortage of fuel? pic.twitter.com/0xenXCN8dj— JALIGAMA PAVAN 🇮🇳 (@JaligamaPavan) April 27, 2026petrol crisis in hyderabad, most of the petrol bunks are closed and there's a huge rush wherever it's opened! pic.twitter.com/TjZws7nZwn— Vipul (@vipul_devis) April 27, 2026 -
వరల్డ్ రిచెస్ట్ సిటీ.. అట్ట పెట్టెల్లో నివాసం..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం.. అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు నివసించే ప్రపంచ ఆర్థిక కేంద్రం హాంకాంగ్. అయితే, ఇక్కడ నివసిస్తున్న గృహ కార్మికులు, సామాన్య ఉద్యోగుల సంబంధించిన జీవన శైలి తాజాగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీకెండ్స్లో కార్మికులు, ఉద్యోగులు అట్ట పెట్టెల్లో నివాసం ఉండటం, అండర్పాస్ల కింద సేద తీరడం వంటికి వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో, ఈ విషయం చర్చకు దారి తీసింది. ఇంతకీ వాళ్లంతా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే..సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు హాంకాంగ్లో కార్మికుల జీవన శైలి, అక్కడి పరిస్థితులను వివరించారు. హాంకాంగ్లో గృహ నిర్మాణ కార్మికులు, సాధారణ ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలను తెలియజేశారు. పలువురు కార్మికులు అండర్పాస్లు, వంతెనలపై కార్డ్బోర్డ్ పెట్టెలలో “కాఫిన్ హోమ్స్” (అట్ట పెట్టెల్లాంటి గదులు) నివసించడం ఆ వీడియోలో చూపించారు. ఈ సందర్బంగా వారందరికీ నివాసం ఉండేందుకు సొంత ఇళ్లు లేదని చెప్పుకొచ్చారు. కార్డ్బోర్డ్ పెట్టెలతో తాత్కాలిక "గదులను" నిర్మించుకుంటారు. ఈ క్రమంలో.. హాంకాంగ్ ధనికులకు నివాసం కల్పించడానికి నిరాకరించే శ్రమశక్తిపైనే హాంకాంగ్ ఆధారపడి నడుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. View this post on Instagram A post shared by Rapha | Travel Tips & Itineraries 🌏 (@the.tale.of.travel) అయితే, “కాఫిన్ హోమ్స్” అనేవి అత్యంత చిన్న, కిక్కిరిసిన నివాస స్థలాలు. వీటిలో కార్మికులు మరియు తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు నిద్రించాల్సి వస్తుంది. ఎందుకంటే హాంకాంగ్లో గృహ ధరలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. దీంతో, ప్రతీ ఆదివారం(సెలవు రోజున) ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియాకు చెందిన వేలాది మంది మహిళలు తాము శుభ్రపరిచే విలాసవంతమైన అపార్ట్మెంట్ల నుండి, నగరంలోని ఉన్నత వర్గాల వారిని చూసుకునే కేర్ సెంటర్ల నుండి బలవంతంగా బయటకు పంపించేయబడుతున్నారు. వారికి సెలవు రోజున నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. సొంత నివాసాలు లేకపోవడంతో ఇలా అండర్పాస్లు, వంతెనలపై కార్డ్బోర్డ్ పెట్టెలలో సేద తీరుతున్నారు. కాగా, ఐక్యరాజ్యసమితి కూడా వీటిని “మానవ గౌరవానికి అవమానం”గా పేర్కొంది.ప్రధాన కారణం.. హాంకాంగ్లో గృహ సంక్షోభానికి ప్రధాన కారణం భూమి కొరత, అధిక గృహ ధరలు, మరియు ప్రభుత్వ విధానాలే కారణం. హాంకాంగ్లో భూమి పరిమితంగా ఉండటం, ఎక్కువ భాగం పర్వతాలు లేదా రక్షిత ప్రాంతాలు కావడం ప్రధాన కారణం. మరోవైపు.. 2004–2021 మధ్య గృహ ధరలు 239% పెరిగాయి, కానీ వేతనాలు కేవలం 7.1% మాత్రమే పెరిగాయి. ప్రభుత్వం భూమి అమ్మకాలపై ఆధారపడటం వల్ల, అధిక విలువ గల ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ధరలను మరింత పెంచాయి. దీంతో, సామాన్యులు, కార్మికులు ఇళ్లు కొనే పరిస్థితి లేదు. Hong Kong’da pazar izni gerçeği: Binlerce ev işçisi, çalıştıkları evden çıkmak zorunda kaldığı için köprü altlarında karton kutularla kendine “oda” yapıyor.Modern şehir dediğimiz şey bazen sadece pahalı binalardan ibaret. pic.twitter.com/ZTz9OvrB6M— 🐺Özet Geç 🦅 (@_OzetGec_) April 26, 2026కాఫిన్ హోమ్స్ అంటే ఏమిటి?.పరిమాణం: 11–25 sq ft (సాధారణంగా ఒక పార్కింగ్ స్థలం లేదా జైలు గది పరిమాణం).రూపకల్పన: పాత అపార్ట్మెంట్లను విభజించి, లోపల పెట్టెల్లాంటి గదులు తయారు చేస్తారు.సౌకర్యాలు: కిటికీలు లేకపోవడం, గాలి ప్రసరణ తక్కువగా ఉండటం, ప్రైవసీ లేకపోవడం.నివాసులు: తక్కువ ఆదాయం కలిగిన కార్మికులు, డెలివరీ వర్కర్లు, వృద్ధులు, కొంతమంది విద్యార్థులు.సవాళ్లు..అద్దెలు పెరగడం: కొత్త నియమాలు గృహ ప్రమాణాలను మెరుగుపరుస్తాయి కానీ అద్దెలు పెరిగే అవకాశం ఉంది.సామాజిక అసమానత: తక్కువ ఆదాయం గల కార్మికులు ఇంకా “కాఫిన్ హోమ్స్” లేదా subdivided flatsలోనే ఉండే ప్రమాదం ఉంది.రాజకీయ ప్రభావం: డెవలపర్లు మరియు ప్రభుత్వ ఆదాయ ప్రయోజనాలు ప్రజా గృహాల విస్తరణను అడ్డుకుంటాయి.సమస్యలు, పరిష్కారాలుసమస్య: హాంకాంగ్లో గృహ ధరలు అత్యంత ఎక్కువగా ఉండటం వల్ల కార్మికులు ఇలాంటి “కాఫిన్ హోమ్స్”లో నివసించాల్సి వస్తోంది.ప్రభుత్వ చర్యలు: తాత్కాలిక గృహాలు (transitional housing) అందిస్తున్నారు, కానీ 2 సంవత్సరాలకే పరిమితం.సామాజిక ప్రభావం: ఇది హాంకాంగ్లోని ఆర్థిక అసమానతకు స్పష్టమైన ఉదాహరణ. -
పెళ్లి వేడుకలో మెరిసిన నమ్రతా.. ఫుల్ గ్లామరస్గా ఆషిక రంగనాథ్..!
పెళ్లి వేడుకలో నమ్రతా శిరోద్కర్ సందడి..శారీలో బాలీవుడ్ భామ కాజోల్ అందాలు..చుడిదార్లో హీరోయిన్ ప్రియమణి పోజులు..డిగ్రీ ఫోటోను షేర్ చేసిన హీరోయిన్ మాధవీలత..ఫుల్ గ్లామరస్గా కనిపించిన నా సామిరంగ బ్యూటీ..సముద్ర తీరాన నటి ఐశ్వర్య రఘుపతి చిల్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) View this post on Instagram A post shared by Siddhi Idnani (@siddhi_idnani) -
అభిమాని ప్రీమియర్ లీగ్..
ఈ నెల 20న.. ముంబై ఇండియన్స్ –గుజరాత్ టైటాన్స్ మ్యాచ్..! హైదరాబాదీ కుర్రాడు తిలక్వర్మ ధాటిగా ఆడలేకపోతున్నాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చి అతడితో ఏదో గట్టిగా మాట్లాడాడు. ఆ తర్వాత తిలక్ రెచి్చపోయి బాదేశాడు. సెంచరీ కొట్టాడు. తెల్లవారి చూస్తే, తిలక్తో వేడిగా సాగిన హార్దిక్ సంభాషణ సోషల్ మీడియా రీల్గా మారిపోయింది.సీఎస్కేతో మ్యాచ్లో ఓ బ్యాట్స్మన్ అవుటైన సమయానికి, స్టాండ్స్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమాని నిమ్మకాయతో కనిపించడం వైరల్ అయింది. దీంతో అతీంద్రియ శక్తులను ఆపాదిస్తూ హాస్యభరిత వీడియోలు ఆన్లైన్లో సందడి చేశాయి.సాక్షి,హైదరాబాద్ : మైదానంలో క్రీడాకారులు బంతులతో, బ్యాట్స్తో ఆడుకుంటుంటే.. మైదానం వెలుపల వారిని యువ వీక్షకులు రీల్స్తో, మీమ్స్తో ఆడేసుకుంటున్నారు. ఈ క్రియేటర్ల ధాటికి జెంటిల్మన్ గేమ్ నేడు చిలిపి సందడికి చిరునామాగా మారిపోయింది. వినోద ప్రధానంగా రూపుదిద్దుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కాన్సెప్ట్ సోషల్ మీడియా విజృంభణతో ఊహించని స్థాయిలో హై‘పిచ్’ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్గా మారింది. ఇన్స్ట్రాగామ్ రీల్స్ నుంచి ఎక్స్లో పోస్టుల వరకు, ట్రోలింగ్ అంతటా వ్యాపించింది. అత్యంత నేర్పుగా... ఆద్యంతం కట్టిపడేసేలా చేసిన ఎడిట్లు, ఫన్నీ రియాక్షన్లు నిమిషాల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. జెన్ జీ ట్రెండ్.. ఐపీఎల్ సీజన్ సందర్భంగా, రీల్స్ మీమ్స్తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జెన్ జెడ్... ఐపీఎల్తో మీమ్స్, రీల్స్ ఫాంటసీ లీగ్ల ద్వారా ఎక్కువగా మమేకమవుతున్నారు. ఈ ప్లాట్ఫామ్స్ తాజా లీగ్ను ‘మీమ్ పండగ’గా మార్చాయి. ఐపీఎల్లో జరుగుతున్న చిన్నచిన్న ఘటనలను కూడా శరవేగంగా వైరల్ అయ్యేలా చేస్తున్నాయి. కాదేదీ కామెడీకి అనర్హం ఒక అభిమాని ఇన్స్ట్రాగామ్ రీల్ కోసం పాపులర్.. ‘రింగ్ టాస్’ ట్రెండ్ను ప్రయత్నిస్తూ రూ.70 వేల విలువైన ఉంగరాన్ని పోగొట్టుకోవడం వైరల్ అయింది. ఆ ఉంగరం జారిపోయి... దొరక్కపోవడంతో దీనిపై ఆన్లైన్లో మీమ్స్ స్పందనలు వెల్లువెత్తాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ చాంపియన్ చెన్నూ సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య పోటీలు, జట్ల ప్రదర్శన, కెప్టెన్సీ.. అంతులేని మీమ్స్ను సృష్టించాయి. ‘ఈ సాలా కప్ నమదే’ జోకులు, ‘తలా ఫర్ ఎ రీజన్’ మీమ్స్ సందడి చేశాయి. ఆయా జట్ల మద్దతుదారులు చెలరేగి నాన్స్టాప్గా ట్రోలింగ్కు దిగారు.ఆపాదించుకుని.. ఆస్వాదిస్తూ ఒకప్పుడు లైవ్ క్రికెట్ను చూడడానికి మాత్రమే అలవాటు పడిన నగర వాసులు.. ఇప్పుడు క్రికెట్లో పరోక్షంగా పాల్గొనడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మాŠయ్చ్ పరిస్థితులను ఆపాదించుకుని రీల్స్ చేస్తూ ఆస్వాదిస్తున్నారు. వాటిలో స్వయంగా నటిస్తూ తామూ క్రికెటర్లమేనన్న అనుభూతిని పొందుతున్నారు. సహజంగానే వినూత్నతను ఇష్టపడే యువత.. ఈ తరహా ట్రెండ్తో మరింత మజా పొందుతున్నారు. దానికి తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ.. ఇతరుల కామెంట్లు కూడా చదువుతూ ఆనందిస్తున్నారు. -
10 లక్షలు ఔట్.. రాఘవ్ చద్దాకు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఝలక్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్న రాఘవ్ చద్దాకు భారీ షాక్ తగిలింది. పార్టీకి, పంజాబ్ ప్రజలకు ద్రోహం చేశారన్న ఆరోపణల మధ్య చద్దాకు సోషల్ మీడియాలో భారీ షాక్ తగిలింది. అతి తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో ఫాలోవర్లను కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై చద్దాను తీవ్రంగా ట్రోల్ చేయడం మాత్రమేకాదు లక్షలాది మంది అన్ ఫాలో చేయడం గమనార్హం. పార్టీ మారుతున్నట్టు ప్రకటించగానే రాఘవ్ చద్దాపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా ఈ పరిణామం సోషల్ మీడియాపై బాగా ప్రభావం చూపించింది.Unfollow Raghav Chadha సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతరాఘవ్ చద్దా రాజకీయ మార్పు వార్త బయటకు రాగానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్లో ఆయనపై విమర్శల వర్షం కురిసింది.ఫాలోవర్ల సంఖ్యగా భారీగా తగ్గిపోయింది. ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య సుమారు 1.46 కోట్ల (14.6 మిలియన్లు) నుండి 1.37 కోట్లకు పడిపోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో సుమారు 80,000 పైగా ప్రతికూల కామెంట్లు రాగా, ఫేస్బుక్లో వేలమంది యూజర్లు ఆయనను అన్ఫాలో చేయాలని ప్రచారం చేపట్టారు.నెటిజన్లు ఆయనను ఉద్దేశించి “హీరో టు జీరో”, “పంజాబ్ గద్దర్” (పంజాబ్ ద్రోహి), , “అన్ఫాలో రాఘవ్ చద్దా” చద్దా కాదు చడ్డీ అంటూ కామెంట్లతో హోరెత్తించారు. ఫలితంగా 24 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది ఆయన్ను అన్ఫాలో చేశారు.సామాన్యుల సమస్యలపై గళం విప్పే నేతగా, ప్రజల పక్షాన నిలిచే వ్యక్తిగా రాఘవ్ చద్దాకు మంచి గుర్తింపు ఉండేది. అయితే, ఇటివలి పరిణామాలు, కేజ్రీవాల్కి లిక్కర్ స్కాంనుంచి ఊరట లభించగానే చద్దాపై చర్యలు, పథకం ప్రకారం ఆరుగురి ఎంపీలతో కలిసి చద్దా పార్టీ మారిన నేపథ్యంలో ఆయనను అభిమానించే ఒక వర్గం ప్రజలు తీవ్ర నిరాశకు మరియు ఆగ్రహానికి లోనయ్యారు. ఈ నిర్ణయం ఆయన ప్రజాదరణపై తీవ్ర ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్ ,అశోక్ మిత్తల్ కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా చద్దా మాట్లాడుతూ.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆప్ రాజ్యసభ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అంత్యక్రియల్లో బార్ గర్ల్స్ డ్యాన్స్.. అసలు విషయం ఇదీ!
థాయ్లాండ్లో ఒక వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా చోటుచేసుకున్న వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఒక మనిషి చివరి కోరిక తీర్చడం, కనీసధర్మంగా పాటించడం ఆనవాయితీ. అలా వారి ఆత్మశాంతిస్తుందని కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢంగా నమ్ముతారు. కానీ అలా చేసినందుకు ఒక థాయ్ కుటుంబం విమర్శల పాలైంది. అసలింతకీ ఏమైంది? అతని చివరి కోరిక ఏంటి?బ్యాంకాక్ పోస్ట్ నివేదిక ప్రకారం,దక్షిణ థాయ్లాండ్లోని నఖోన్ సి తమ్మారత్ ప్రావిన్స్లో ఉన్న వాట్ థెప్పనోమ్ చుయట్ అనే బౌద్ధ దేవాలయంలో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 15న మరణించిన 59 ఏళ్ల వ్యక్తి అంత్యక్రియలను ఏప్రిల్ 21న నిర్వహించారు. అయితే అతని దహన సంస్కారాలకు ముందు ప్రదర్శన ఇవ్వడానికి 'కొయెట్ డాన్సర్స్' గా పిలిచే ముగ్గురు మహిళా నృత్యకారులను ఏర్పాటు చేసింది. (అతి తక్కువ బట్టలతో నృత్యం చేస్తారు. సాధారణంగా బార్ టేబుళ్ల మీద, నైట్క్లబ్లలో లేదా ఇతర కార్యక్రమాలలో నృత్యం చేస్తారు) దీనికి సంబంధించిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.ఏం జరిగింది?బౌద్ధ సన్యాసులు ప్రార్థనలు పూర్తి చేసి వెళ్ళిపోయిన తర్వాత, చితికి నిప్పంటించే ముందు ఈ నృత్య ప్రదర్శన జరిగింది. ముగ్గురు యువతులు శవపేటిక ముందు నిలబడి డ్యాన్స్ చేశారు. అన్ని వయసుల వారు ఈ ప్రదర్శనను చూస్తుండగా, దీనిని సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుబాధపడుతూ కూర్చోవడం కంటే, మరణించిన వారి ఆఖరి కోరికను గౌరవించడం మంచిదే. దీనివల్ల విషాదం కొంతవరకు తగ్గుతుందని కొందరు సదరు కుటుంబానికి మద్దతుగా నిలిచారు. మరోవైపు మరణించిన వారి కోరికను గౌరవించాల్సిందే, కానీ అంత్యక్రియల వంటి పవిత్రమైన చోట ఇలాంటి నృత్యాలు సరికావు. ముఖ్యంగా చిన్న పిల్లల ముందు ఇలాంటి ప్రదర్శనలు భ్యంతరకరమని మరికొందరు విమర్శించారు. మొత్తానికి, సంప్రదాయానికి, వ్యక్తిగత కోరికకు మధ్య జరుగుతున్న ఈ వివాదం థాయ్లాండ్లో హాట్ టాపిక్గా మారింది.కుటుంబ సభ్యుల వివరణనెటిజన్ల విమర్శల నేపథ్యంలో మృతుడి కుటుంబం వివరణ ఇచ్చింది. "చావు అనేది అనివార్యం, నా అంత్యక్రియల సమయంలో ఎవరూ ఏడవకూడదు, వేడుకలా జరుపు కోవాలి" అనేది అతని చివరి కోరిక అని, దాన్ని నెరవేర్చడం తమ కనీస బాధ్యఅని భావించామని తెలిపారు. అతను జీవించి ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా, జోవియల్గా ఉండేవారని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చడానికి మరియు శోకతప్త హృదయాల్లో ఆనందాన్ని నింపడానికే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
రెండేళ్లుగా నరకం : పెళ్లంటేనే భయం భయ్యా, వైరల్ వీడియో
గృహ హింస, వేధింపులు బాధితులు కేవలం మహిళలు మాత్రమే కాదు. పురుషులు కూడా అనేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా భార్య చేతిలో వేధింపులకు గురవుతున్న ఒక వ్యక్తి, తన ల్యాప్టాప్ ద్వారా ఆ దాడులను రికార్డ్ చేసి బయట పెట్టాడు. ఇది నెట్టింట ఫెమినిజంపై చర్చకు దారి తీసింది .ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయిఏం జరిగింది అంటే?ఒక వ్యక్తి తన భార్య చేతిలో దారుణ హింసను ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండేళ్లపాటు వేధింపులు తరువాత తన ల్యాప్టాప్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో ప్రకారం మహిళ తన భర్తతో తీవ్రంగా వాదిస్తోంది. ఆమె అతడిని చెంపదెబ్బలు కొట్టడం, జుట్టు పట్టుకుని లాగడం వంటి దృశ్యాలు ల్యాప్టాప్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ‘‘పెళ్లి చేసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి" అనే క్యాప్షన్తో ఈ వీడియో నెట్టింట షేర్ అయింది. దీంతో హాట్ టాపిక్గా మారింది.నెటిజన్ల స్పందనఈ వీడియో పురుషులపై జరుగుతున్న గృహహింస గురించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. "పెళ్లి అంటేనే భయం వేస్తోంది" భయ్యా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు ఇది 'గృహ ఉగ్రవాదం' అని అభివర్ణించారు. అంతేకాదు పనిలో పనిగా ఫెమినిజంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ ఫెమినిస్టులు ఎక్కడ ఉన్నారు? ఈ మహిళను కూడా సమర్థిస్తారా?" అని కొందరు ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇది నిజమైన ఫెమినిజం కాదని, హింస అని విమర్శించారు. ఈ ఘటన వెనుక ఉన్న మహిళ బెంగాలీ అని పేర్కొంటూ, కొందరు బెంగాలీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇతర వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పురుషులు కూడా బాధితులుగా మారుతున్నారని, వారి కోసం కూడా కఠిన చట్టాలు ఉండాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: 3 అపార్ట్మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్ మేనేజర్నోట్ : సాధారణంగా గృహహింస అంటే మహిళలపై జరిగేది అనే భావన ఉంటుంది స్త్రీ-పురుషులతో సంబంధంలేకుండా వేధింపులు, గృహహింస (Domestic Violence) ఎవరు అనుభవించినా అది నేరమే. హింస ఎక్కడ ఉన్నా తప్పే. జెండర్తో సంబంధం లేకుండా హింసను ఎదుర్కోవడం ముఖ్యం అనే అవగాహన పెరగాలి. తమపై దౌర్జన్యాలకు అన్యాయానికి వ్యతిరేకంగా సంబంధిత చట్ట వ్యవస్థలకు ఫిర్యాదు చేయడం, రక్షణ పొందడం అవసరం. After being abused for the past two years bro recorded these clips on his laptop Think twice before getting married 🙏 pic.twitter.com/1AQLGWjooU— Vishal (@VishalMalvi_) April 23, 2026 -
చాలా ఇష్టమంటోన్న బిగ్బాస్ దివి.. ఫస్ట్ టైమ్ అంటోన్న యషిక ఆనంద్
మొక్కల పెంపకంలో బిజీగా బిగ్బాస్ దివి..శారీలో బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా అందాలు..బీచ్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ సిమ్రత్ కౌర్..ఫస్ట్ టైమ్ ఓటేసిన ఆనందంలో యషిక ఆనంద్ పోజులు..పెళ్లి కూతురిలా ముస్తాబైన మంచు లక్ష్మీ.. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
హవ్వ..! మతపైత్యం అదుపులో ఉంచుకోలేరా?
మతాలు, కులాలు మనుషుల మధ్య అడ్డుగోడలుగా నిలవడం ఇవాళ్టి వ్యవహారం కాదు. ఈ గీతలు దాటిన ప్రేమలు ఎన్ని మొగ్గ తొడుగుతున్నప్పటికీ, పెళ్లిళ్లు ఎన్ని జరుగుతున్నప్పటికీ.. భవిష్యత్తులోనైనా ఏదో ఒకనాటికి సమసిపోతాయని అనుకునే వాతావరణం మాత్రం లేదు. ఎందుకంటే.. ఎంతగా ఆధునిక సమాజం ఈ అడ్డుగోడల్ని దాటి వికసిస్తున్నదో.. అంతకంటే ఎక్కువగా మనుషుల్లో కుల జాడ్యం, మతమౌఢ్యం మరింతగా వేళ్లూనుకుంటున్న ఉదాహరణలు మనకు సర్వత్రా కనిపిస్తుంటాయి. సున్నితమైన ఈ అంశాల్లో ఎదుటివారి మనోభావాల్ని గాయపరచడం మాత్రమే కాదు.. దారుణంగా రెచ్చగొట్టే భయావహ వాతావరణానికి గురిచేసే ఘటనలు మనకు నిత్యం అనేకం తారసపడుతుంటాయి. బెంగుళూరు నగరంలో కూడా అలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది.అబ్బిగెరె ప్రాంతంలో ఓ దంపతులు.. ఒక ముస్లిం వ్యక్తిని అభ్యంతరకరమైన మాటలతో నిందించారు. ‘నువ్వు ముస్లింవి. నువ్వు పాకిస్తానీవి. నువ్వొక టెర్రరిస్టువి’ అంటూ వారు అతడిని తూలనాడారు. ఇలాంటి మాటలు ఒక సాధారణ ముస్లింను ఎంతగా గాయపరుస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. వీరి నిందల పర్యవసానంగా స్థానికంగా ఒక సంస్థకు చెందిన వారు.. ఆ దంపతులకు సదవగాహన కల్పించి, బుద్ధిమాటలు చెప్పే ప్రయత్నం చేశారు. వారి ఇంటికి వచ్చి.. ఇలా ముస్లిం పేరుతో ఒక మనిషిని కించపరుస్తూ మాట్లాడడం, టెర్రరిస్టుగా అభివర్ణించడం తప్పు అని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ సంస్థ తరఫున వచ్చిన వారిలో కేవలం ముస్లిములే కాదు. అన్ని మతాల వారూ ఉన్నారు. ముస్లిం అయిన ప్రతీ వ్యక్తిని టెర్రరిస్టుగా చిత్రీకరించి.. సభ్యసమాజంలో అశాంతికి, అపోహలకు బీజం వేసే ఇలాంటి బుద్ధులను ఎండగట్టారు. ఆ దంపతులకు వీరు బుద్ధి మాటలు చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది.ప్రత్యేకించి ఈ సంఘటనలో మరో సంగతి చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఆ దంపతుల్లో భర్త తమను గురించి తాము ఘనంగా చెప్పుకుంటూ.. నేను డిఫెన్సులో పనిచేస్తున్న వాడినే అంటూ గంభీరంగా సెలవిచ్చారు. డిఫెన్సులో పనిచేస్తున్న వ్యక్తివే అయితే గనుక.. నీలో మరింతగా దేశభక్తి ఉండాలి. ఈ దేశం అన్ని మతాలు, అన్ని ధర్మాల సమ్మేళనం అనే స్పృహ నీకు ఎక్కువగా ఉండాలి. పరమతసహనం కూడా నీలో ఎక్కువగా ఉండాలి.. కనిపించిన ప్రతి ముస్లింను పాకిస్తానీగా, టెర్రరిస్టుగా చిత్రీకరిస్తూ ఎలా మాట్లాడతావు? అంటూ వాళ్లు నిలదీశారు. చివరికి ఆ దంపతులు క్షమాపణ చెప్పబోయినప్పుడు కూడా.. మీరు క్షమాపణ చెప్పడం కాదు.. మీ ఆలోచన మార్చుకోవాలి.. అంటూ వారు హితవు చెప్పి వెళ్లడం గమనించాల్సిన సంగతి.Abbigere, BengaluruA woman and her husband (a former army officer) have been accused of making derogatory remarks to a Muslim man, saying, "You are Muslim, you are Pakistani, you are a terrorist." Subsequently, members of an organization arrived at the scene, protested. pic.twitter.com/5YwFlPieHg— The Muslim (@TheMuslim786) April 22, 2026మనం చాలా సందర్భాల్లో గమనిస్తుంటాం. ఇళ్లు అద్దెకు తీసుకునేందుకు తిరిగేవారిని మీరు శాకాహారులైతేనే ఇస్తాం’ అని చెప్పే వాళ్లు మనకు పురాతన కాలం నుంచి ఇవాళ్టికీ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి మనుషుల్ని తప్పుబట్టే వాళ్లూ ఉంటారు. అయితే అలాంటి వారి బాధల్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ.. ముస్లిం అయిన వ్యక్తి కనిపిస్తే చాలు.. ‘మీరంతా పాకిస్తానీలు.. మీరంతా టెర్రరిస్టులు..’ అని నిందించే వారిని ఏమనాలి? పాకిస్తాన్ మీద ఉన్న ద్వేషాన్ని ఒక మతానికి ఆపాదించడమూ, ఆ మతానికి చెందిన అందరి మీదా టెర్రరిజం ముద్ర వేసేయడమూ ఎంత అనైతికం అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది.దుర్మార్గాలు కులాల్ని బట్టి, మతాల్ని బట్టి ఉండవు. కేవలం మనుషుల్లో ఉండే బుద్ధుల్లో మాత్రమే ఉంటాయి. అలాంటి తప్పుడు మనుషులు ఒకే మతంలో లేదా ఒకే కులంలో ఉంటారని అనడం, ఆపాదించడం సుహృద్భావ సమాజ ఆవిష్కరణకు పెనుద్రోహం అవుతుంది. ఆ సత్యం మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగితే.. ఏ ఇద్దరు మనుషుల మధ్య కూడా ఎలాంటి అపోహలూ ఉండని మంచి రోజులు తప్పకుండా వస్తాయి.-యం.రాజేశ్వరి. -
ఫేక్ అయితేనేం... ఫేమ్ అయ్యింది!
సమాజం సవ్యంగా ఉండాలంటే కుటుంబాలు బాగుండాలి. ఆ కుటుంబాల కోసం పిల్లల పెంపకం నుంచి ఇంటిపనుల వరకు మహిళలు ఎంతో శ్రమిస్తారు. తల్లుల కష్టమే కుటుంబ రథానికి ఇంధనం అవుతుంది. అయితే వారి శ్రమ ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతుంటుంది. పైగా... ‘పురుషులు బయటకి వెళ్లి కష్టపడతారు. స్త్రీలు ఇల్లు కదలకుండా సుఖంగా ఉంటారు’ అనే ప్రచారం ఒకటి. వారి శ్రమకు వెల కట్టేవారు లేరు. వారి శ్రమ కనిపించని శ్రమ అయింది. తాజా విషయానికి వస్తే.,...‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్లో ఉందని చెబుతుంటారు.‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్ని బద్దలు కొట్టే శిల్పం ఇది. జోస్ లూయిస్ ఫెర్నాండేజ్ రూపొందించారని చెబుతున్న ఈ శిల్పంలో... ఒకవైపు పిల్లలను చేతిలో పట్టుకొని, మరోవైపు... చీపురు, వాషింగ్ మెషిన్, బకెట్లాంటి ఇంటిబరువును వీపున మోస్తున్న స్త్రీ కనిపిస్తుంది. ముగ్గురు పిల్లలను, ఇంటి పనులను వీపుపై మోస్తున్న ఈ స్త్రీ శిల్పం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. అసలు విషయం ఏమింటే, ఇలాంటి శిల్పం నిజంగా లేదు. పూర్తిగా కల్పితం. అయినప్పటికీ ఈ కల్పిత శిల్పం విపరీతంగా వైరల్ అయింది. లక్షలాది వ్యూస్ను సొంతం చేసుకొని ‘వైరల్ స్టాచ్యూ’ గా పేరు తెచ్చుకుంది. ‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్లో ఉందట! ‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్నిబద్దలు కొట్టే శిల్పం ఇది. -
తమిళనాడులో బాబు స్పీచ్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్
-
ఎలుకను తరిమి.. బోరుబావిలో పడి..
ఆదివారం ఆటవిడుపులో భాగంగా.. కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ సరదాగా పోలో మ్యాచ్ ఆడారు. ఆరు గోల్స్ చేసి కురక్షేత్ర టీం కెప్టెన్గా విజయంలో ఆయన కీలకపాత్ర పోషించారు కూడా. అయితే మ్యాచ్ మధ్యలో సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చి.. ఓ పాతికేళ్ల కుర్రాడిని పరిచయం చేసి దేశం దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు.నవీన్ జిందాల్తో ఉన్న ఆ యువకుడి పేరు ప్రిన్స్. ఆర్మీలో చేరాలనే కసితో పరీక్షలు రాశాడు. కానీ, ఎత్తు రూపంలో అతని కల చెదిరిపోయింది. ఐటీఐ కోర్స్ పూర్తి చేసిన ప్రిన్స్.. ప్రస్తుతం అంబాల నగరంలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే అతనిలో అంత ప్రత్యేకత ఏముందా? అనుకుంటున్నవాళ్లకు నవీన్ జిందాల్ ఆ కుర్రాడితోనే అసలు విషయం చెప్పించాడు.అది 2006 జులై 21.. కురుక్షేత్ర జిల్లా షాహబాద్ మండలం హల్ధేరీ గ్రామం. తన స్నేహితుడు అంగ్రెజ్తో కలిసి పంట పొల్లాల్లో ఆడుకుంటున్నాడు నాలుగేళ్ల చిన్నోడు ప్రిన్స్. ఇంతలో ఓ ఎలుక వాళ్ల కంట పడింది. దాని వెంట పడుతూ పరుగులు తీశారు ఆ ఇద్దరు. ఇంతలో అది ఓ సంచిని దాటుకుని కలుగులోకి దూరింది. ఆ పాలిథీన్ సంచిపై ఒక్క దూటున దూకారా పిల్లలు. అంగ్రెజ్ పక్కకు పడిపోగా.. ప్రిన్స్ మాత్రం క్షణాల్లో 60 అడుగుల బోరుబావిలోకి జారిపోయాడు. అయితే..అంగ్రెజ్ ఆలస్యం చేయలేదు. పరుగున వెళ్లి అందరినీ తీసుకొచ్చాడు. జనం, పోలీసులు, అధికారులు, బుల్డోజర్లు.. కాసేపటికే రెస్క్యూ వాతావరణంతో అక్కడి వాతావరణం మారిపోయింది. హర్యానా కావడంతో ఆర్మీ అక్కడికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే నేల స్వభావం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగింది. ఈలోపు దేశం మొత్తం ఆ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేసింది. ఈ మధ్యలో..చిన్నా.. భయపడకు. ఎలాగైనా నిన్ను బయటకు తీస్తాం అంటూ తల్లిదండ్రుల మాటలు, అధికారుల పిచ్చాపాటి సంభాషణలతో ప్రిన్స్ ఏడవకుండా ధైర్యంగా ఉండిపోయాడు. సుమారు 50 గంటల తర్వాత పిల్లాడిని సజీవంగా బయటకు తీయగలిగింది సైన్యం. అంతే దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది.అలా బోర్వెల్ బాయ్గా స్థిరపడిన ఆ చిన్నారి ప్రిన్సే.. ఇప్పుడు పాతికేళ్ల కుర్రాడిగా నవీన్ జిందాల్తో లైవ్లో కనిపించాడు. ఆనాడు బోరుబావిలో పడ్డాక ఆ చిన్నారి ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తు చేసుకున్న జిందాల్ పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఆ టైంలో ప్రిన్స్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. సరైన తిండి లేక ప్రిన్స్ నీరసంగా కనిపించాడు. బోరుబావిలో పడిన సమయంలో.. దేశం నలుమూలల నుంచి ఆ కుర్రాడి కోసం చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇతర తినుబండారాలు వచ్చాయి. అదలా కొన్నాళ్లపాటు కొనసాగింది అని గుర్తు చేశారాయన. తాను ఎవరి నుంచి ఎలాంటి సాయం ఆశించడం లేదని.. దేవుడిచ్చిన జీవితం.. సైన్యం ప్రసాదించిన పునర్జన్మతో తన కాళ్ల మీద తాను నిలబడతానని చెబుతున్నాడా మృత్యుంజయుడు. -
Kasu Mahesh Reddy : జరా జాగ్రత్త..!
-
అనుష్క పోస్ట్కి స్పందించిన ర్యాపిడో.. క్షమాపణలు
రైడ్-హైలింగ్ సేవలపై ఫిర్యాదులు పెరిగిపోతున్న రోజులివి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రయాణాల్లో ఎదురయ్యే చేదు అనుభవాలను తరచూ నెట్టింట చూస్తూనే ఉన్నాం. లైంగికంగా వేధించడం.. లేదంటే హయ్యర్ చార్జీలు డిమాండ్ చేస్తుండడాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు బాధితులు. ఈ తరుణంలో తాజాగా ఓ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో ర్యాపిడో కంపెనీ స్పందించాల్సి వచ్చింది.ర్యాపిడో డ్రైవర్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో ఘజియాబాద్కు చెందిన ఓ యువతి షేర్ చేయడంతో పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అతను చేసిన మెసేజ్లను ఆమె స్క్రీన్ షాట్ రూపంలో ప్రదర్శించింది. ఆ యువతి పేరు అనుష్క. తనను గమ్య స్థానంలో దించి వెళ్లిపోయిన కాసేపటికి ఆ డ్రైవర్ తనకు హాయ్ అంటూ వాట్సాప్ ద్వారా సందేశం పంపాడని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ‘‘నేనెవరో గుర్తుపట్టలేదా?. ఇందాకే కదా మిమ్మల్ని డ్రాప్ చేశాను. మీరు అందంగా ఉన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మరింత బాగుంటారు. మీ వయసు ఎంత?.. ఒంటరిగా ఉంటున్నారా?.. కోపం వద్దు.. రేపు సాయంత్రం అలా బయటకు వెళ్దామా?’’ అంటూ మెసేజ్ చేశాడతను.దానికి ఆమె ‘‘నీ పని నువ్వు చేస్కో భయ్యా..’’ అంటూ బ్లాక్ చేసిందా యువతి. ఆ మొత్తం ఘటనను వీడియో రూపేణా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అంతే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో ర్యాపిడో కంపెనీ క్షమాపణలు చెప్పింది. View this post on Instagram A post shared by Anushka_Official☀️ (@aanu_shka3)ఆ డ్రైవర్ ప్రవర్తనను “అంగీకరించలేని చర్య”గా పేర్కొంటూ.. వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించే ప్రవర్తన తమ సేవా ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రైడ్ IDని డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని కోరుతూ.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.ఈ ఘటనతో వినియోగదారులు డేటా గోప్యత, వ్యక్తిగత సమాచారం వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ర్యాపిడో లాంటి ప్రముఖ కంపెనీలు రైడ్-హైలింగ్(Ride-hailing) సేవల టైంలో వినియోగదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
మద్యం మత్తులో యువకుల ఘర్షణ
గుంటూరు: గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నగరంపాలెం పోలీస్స్టేషన్ పరిధిలోని కంకరగుంట బ్రిడ్జి వద్ద ఓ వైన్ షాపు భవనం పైనుంచి వేలాడదీసి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి పై దాడి చేసిన ఘటన ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అప్రమత్తమైన నగరంపాలెం సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రసన్న సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆకులవారితోట ప్రాంతానికి చెందిన దేవరకొండ స్వరూప్, శ్రీనివాసరావు తోట ప్రాంతానికి చెందిన దేవరకొండ శశికుమార్ సోదరులు. వీరు మద్యం తాగేందుకు కొమ్మినేని రత్తయ్యకు చెందిన నిర్మల్ వైన్ షాపు వద్దకు వచ్చారు. మద్యం తాగుతున్న సమయంలో అదే వైన్షాపులో ఉన్న మరో వ్యక్తితో వాగ్వవాదం చోటుచేసుకుంది. దీంతో సోదరులిద్దరు ఆ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో ఆ వ్యక్తిని వైన్ షాపు భవనం పై నుంచి కిందకు వేలాడ తీసి తీవ్రంగా దాడి చేశారు. ఇది గమనించి వాహనదారులు సెల్ఫోన్లో వీడియాలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్ది సేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇద్దరు సోదరులను వైన్షాపు నిర్వాహకులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు ఘటనా స్థలి చేరుకుని ఇద్దరు సోదరులను అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు. బల్లి రాజ్కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి ఇద్దరు సోదరుల దాడికి భయపడి పారిపోవడంతో గాయపడిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని విచారించి ఇద్దరు సోదరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ సత్యనారాయణ వెల్లడించారు. -
బైక్ యాక్సిడెంట్.. ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం
స్పీడ్ థ్రిల్స్.. బట్ ఇట్ కిల్స్.. ఎన్నోసార్లు రుజువు చేసింది. సరదా కోసం కొందరు యువకులు పని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించి.. తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఏప్రిల్ 14న అన్నదమ్ములైన ఉప్లక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్లు ఒకే బైక్పై స్పీడ్గా ప్రయాణించారు. ఆ ముందు మరో బైక్ మీద స్నేహితులు ప్రశాంత్, ప్రదీప్ ద్వివేది వీడియో తీస్తూ ముందుకు సాగారు. వీడియోలో బైక్ చివర కూర్చున్న సోదరుడి చేతితో తుపాకీ కూడా ఉంది. రెండు బైక్లు ఒకదానిని మించి మరొకటి దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మధ్యలో ఒక ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇటుకలతో నిండిన ట్రాలీని ఢీ కొట్టింది. मऊगंज में एक सड़क हादसे में तीन भाइयों की मौत हो गई. इस हादसे का एक वीडियो सामने आया है, जिसमें यह साफ देखा जा सकता है कि रफ्तार का जुनून कितना खतरनाक हो सकता है. #mpnews #roadaccident pic.twitter.com/8AV0YNOXSa— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) April 19, 2026ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వీడియో తీస్తున్న మరో బైక్పై ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా స్కిడ్ అయ్యి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తుపాకీ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. హెచ్చరిక: వేగం క్షణికానందం పంచొచ్చు.. కానీ నిర్లక్ష్యం ప్రాణాలను తీసుకుపోతుంది -
మీతో పని ఉంది సార్.. రాత్రి ఇంటికి రండి!
అనంతపురం జిల్లా: హనీ ట్రాప్ దందా దుమారం రేపుతోంది. సమాజంలో గౌరవంగా బతుకుతున్న అమాయకులను లక్ష్యంగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొట్టారు. ఈ నయా దందాపై ‘కవ్విస్తారు.. కాటేస్తారు!’ అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన కథనం ఉమ్మడి జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై బాధితులు నేరుగా ఎస్పీ జగదీష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో అనంతపురం రూరల్, నాలుగో పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు గ్యాంగ్ లీడరు లేడీబాస్తో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఇందులో పాత్రధారులు, సూత్రధారులందరిపైనా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయాలని సూచిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న దందా.. వలపు వయ్యారాలతో బాధితులకు వల వేసి, వీడియో కాల్స్, వ్యక్తిగత సంభాషణలను ఆయుధాలుగా మార్చుకుని రూ.లక్షలు దోచుకుంటున్న ఈ ముఠా కార్యకలాపాలు విస్తృతంగా సాగినట్లు వెల్లడవుతోంది. ముఖ్యంగా ‘లేడీ డాన్’ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తున్నట్టు బయటపడటం కలకలం రేపుతోంది. ఐదేళ్ల కిందట తిరుపతిలో ఒక ఫారెస్ట్ అధికారిని ఇదే తరహాలో బ్లాక్మెయిల్ చేసి రూ.లక్షలు వసూలు చేసిన ఘటన కూడా ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పట్లో తిరుపతిలో కేసు కూడా నమోదైంది. అలాగే కూడేరు మండలానికి చెందిన బాధితుడు ఈ ముఠా వలలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల పలువురు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదులు చేయడం, అలాగే ముఠాలో డబ్బుల పంపకాల విషయంలో విభేదాలు రావడం వల్ల ఈ దందా వెలుగులోకి వచ్చింది. లబోదిబోమంటున్న రిటైర్డ్ ఉద్యోగి.. అనంతపురం రూరల్ ప్రాంతానికి చెందిన 70 ఏళ్లకు పైబడి ఉన్న ఓ రిటైర్డ్ ఉద్యోగి వ్యక్తిగత పనిమీద రుద్రంపేట వద్దనున్న డీమార్ట్ సమీపంలోకి వెళ్లాడు. అక్కడ ఓ మహిళ (అప్పటికే పక్కా ప్రణాళిక రచించారు) తారసపడి.. సదరు రిటైర్డ్ ఉద్యోగి చేస్తున్న పనికి సంబంధించి తమకు అవసరం ఉందని, ఇంటివద్దకు రావాలని చెప్పి ఫోన్ నంబరు తీసుకెళ్లింది. మరుసటి రోజు ఫోన్ చేసి రిటైర్డ్ ఉద్యోగిని రుద్రంపేట శివారులోని ప్రాంతానికి పిలిపించింది. అక్కడ ఇంట్లోకి రాగానే తలుపు దగ్గరగా వేసింది. ‘రండి సార్.. పర్వాలేదు’ అంటూ వలపు మాటలతో రెచ్చగొట్టింది. ఈ పరిణామంతో కంగుతిన్న బాధితుడు ‘అమ్మా...ఏంటిది’ అంటుండగానే అప్పటికే బయట సిద్ధంగా ఉన్న పాత్రధారులు రంగప్రవేశం చేశారు. రిటైర్డ్ ఉద్యోగిని న్యూడ్(నగ్నం)గా నిలబెట్టి వీడియోలు, ఫొటోల్లో బంధించారు. ఆయనతో పాటు ఉన్న మహిళపై తీవ్రస్థాయిలో చిందులేశారు. ‘నువ్వు అవసరం లేదుపో... మా కుటుంబ మర్యాద మంటగలిపావు’ అని అనడంతో ఆ వృద్ధుడికి ఏమి జరుగుతోందో తెలీక బిక్కమొహం వేశాడు. ‘నీ విషయం కూడా బయటపెడతా...ఎలా మా ఇంటికి వస్తావు. పోలీసులకు ఫిర్యాదు చేస్తా. మీ కుటుంబ సభ్యులందరికీ ఫొటోలు, వీడియోలు పంపుతా. సోషల్ మీడియాలోనూ పెడతాన’ని బెదిరించారు. దీంతో ఆయన లబోదిబోమంటూ తనకు ఏపాపమూ తెలీదని చెప్పినా వినలేదు. చివరగా రూ.10 లక్షలు ఇస్తే సమస్య ఇంతటితో ఆపేస్తామని, లేదంటే నీ బండారమంతా బయటపెడతామని చెప్పడంతో తన ఇబ్బందులన్నీ చెప్పుకుని చివరకు రూ.3 లక్షలు సమరి్పంచుకున్నాడు. ఇలాంటి బాధితులు చాలామందే ఉన్నారు. అయితే ఎక్కువగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ధనవంతులను ఈ ముఠా లక్ష్యం చేసుకుంది. -
సడెన్ షాక్ అంటే ఇదేనేమో.. అర్ధరాత్రి వింత అనుభవం..
Viral Video.. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో ప్రమాదకరమైన స్టంట్ చేసిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. సదరు యువతి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రదీప్ చౌదరి అనే వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ వీడియో ప్రకారం.. మద్యం మత్తులో ఇద్దరు యువతులు థార్ వాహనంపైన కూర్చుని ఉన్నారు. మద్యం మత్తులో రాత్రి వేళ ప్రమాదకర స్టంట్స్ చేశారు. ఈ క్రమంలో కారు పైన ఉన్న ఒక యువతి సరిగా కూర్చునేందుకు ప్రయత్నించింది. ఇంతలో డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా ముందుకు కదిలించాడు.సదరు యువతి అలర్ట్గా లేకపోవడం.. సడెన్గా వాహనం ముందుకు కదలడం ఒక్కసారిగా జరిగిపోవడంతో యువతి రోడ్డుపై వెనక్కి పడిపోయింది. అక్కడే కుప్పకూలిపోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఆమె తలకు తీవ్రమైన గాయం కావడానికి, ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఆమె కింద పడగానే చుట్టుపక్కల ఉన్న జనం హుటాహుటిన ఆమె వైపు పరుగెత్తుకు వచ్చారు. ఈమెను పైకి లేపే ప్రయత్నం చేశారు. ఇదంతా వీడియోలో కనిపించింది. అనంతరం, ఏం జరిగింది అనే విషయం తెలియలేదు.लड़की पूरी तरह से दारू के नशे में धुत्त है वह थार की छत पर बैठ जाती और ड्राइवर स्टंट कराने की कोशिश करता है लड़की तुरंत नीचे जाकर गिरती है।ऐसे शराबियों के साथ में ऐसा होना बहुत जरूरी होता है ,अब आगे से ये कभी ऊपर नहीं बैठेगी 😂 pic.twitter.com/HisY39UjXy— Pradeep Chaudhary (@pradeepgr63) April 16, 2026ఇక, ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్గా మారింది. నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ.. సదరు యువతి, డ్రైవర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట అని మండిపడుతున్నారు. ఇలాంటి విన్యాసాలు కేవలం చేసేవారికే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ముప్పు కలిగిస్తాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేశారు. -
హే అంకుల్ సామ్! బీబీకి దూరం : ట్రంప్పై సెటైర్ల జోరు
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైంది మొదలు, ప్రసుత సీజ్ఫైర్ దాకా పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన అనేక వివాదాస్ప, గందరగోళ ప్రకటనలపై ఇరాన్ సోషల్ మీడియా ఘోరంగా ట్రోల్ చేస్తోంది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ గట్టి కౌంటరే ఇచ్చారు. ట్రంప్ విజయోత్సాహపు వాదనలపై 7 వాదనలు, 7 అబద్ధాలు ('7 claims 7 lies') అంటూ విరుచుకు పడ్డారు. ట్రంప్ విజయోత్సాహం, ఇరాన్ తీవ్ర స్పందనఇరాన్ యుద్ధంలో విజయం సాధించానని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం అబద్ధాలని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఇరాన్ మండిపడింది.ప్రపంచానికి ఇది ఒక గొప్ప అద్భుతమైన రోజు అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ (Truth Social) పోస్ట్లో ట్రంప్ రాసుకొచ్చిన వైనంపై జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సంచలన వ్యాఖ్యానించింది. "ఎక్కువ ఆనందాన్ని ప్రదర్శించవద్దు, కొంచెం హుందాగా ఉండండి. ఫోన్ పక్కన పెట్టి హాయిగా నిద్రపోండి. అలాగే నెతన్యాహు (Bibi)ని ఒక వారం పాటు బ్లాక్ చేయండి" అంటూ ఎద్దేవా చేసింది. అలాగే వివిధ దేశాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ట్రంప్పై సెటైర్లు వేశాయి. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా ఏమీ తక్కువ తినలేదు. ట్రంప్కు ఒక మంచి సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడు) అవసరమని ఘాటుగా వ్యాఖ్యానించింది.New Lego video about Drunk Pete Hegseth.. pic.twitter.com/iLGGvBLtTl— PolitMemeAi🔥 (@MemesNoWords) April 17, 2026 ట్రంప్ను ఎగతాళి చేస్తూ, మరో పోస్ట్లో ఇలా కూడా పేర్కొంది, "హే అంకుల్ సామ్! మీరెందుకు ఒక నిర్ణయం తీసుకోరు? హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలనుకుంటున్నారా లేక మళ్లీ మూసివేయాలను కుంటున్నారా?!" ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్కాగా ట్రంప్ అనేక సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇరాన్ యుద్ధంలో విజయం సాధించాం, దీనిని ఇకపై ప్రపంచానికి వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించరు అని ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తే హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయవచ్చని ఇరాన్ హెచ్చరించింది. మీడియా యుద్ధం ద్వారా ప్రజల అభిప్రాయాలను మార్చాలని అమెరికా చూస్తోందని, కానీ ఇరాన్ ప్రజలు ఇలాంటి ట్రిక్కులకు ప్రభావితం కారని గాలిబాఫ్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
మాజీ డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన పోలీసులు..
ఛండీగఢ్: హర్యానాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలాతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనపై గన్ గురిపెట్టారని చౌతాలా సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల మేరకు.. హర్యానాలోని గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం వద్ద జరిగిన నిరసనకు సంబంధించి జేజేపీతో సంబంధం ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై హిసార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సిద్ధాంత్ జైన్ను కలవడానికి మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా వెళ్లారు. ఈ సందర్బంగా ఒక పోలీసు అధికారి తన కారును పోలీసు వాహనంతో అడ్డగించారని, కారును ఢీకొట్టడానికి ప్రయత్నించారని చౌతాలా ఆరోపించారు. సదరు అధికారి అంతటితో ఆగకుండా.. తనపై పిస్టల్ గురిపెట్టినట్టు ఆరోపించారు.BJP ka Nayab HaryanaPolice ke besh main Gunde.....@PMOIndia @NayabSainiBJP pic.twitter.com/uVCBOFyyVf— Dushyant Chautala (@Dchautala) April 17, 2026దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాగా, ఈ వీడియోలో ఒక పోలీసు వాహనం తన కారును అడ్డుకోవడం స్పష్టంగా కనిపించింది. మరో వీడియోలో, చౌతాలా తన వాహనం దిగి పోలీసులను నిలదీయడం కనిపిస్తుంది. ఆ తర్వాత, కదులుతున్న ఆ వాహనాన్ని ఆపడానికి ఆయన అందులోకి ఎక్కడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది, కానీ ఆ వాహనం వేగంగా ముందుకు దూసుకెళ్లిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అనంతరం, ఈ వీడియోను చౌతాలా ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్బంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ నాయబ్ హర్యానా పోలీసులతో దాడి చేస్తున్నాడు. రక్షకుడే వేటగాడిగా మారినప్పుడు, వ్యవస్థను ప్రశ్నించడం అనివార్యమవుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఘటనను పోలీసుల రౌడీయిజంగా అభివర్ణించారు. ఇదే బీజేపీ వారి నయా హర్యానా.. పోలీసు యూనిఫాంలో ఉన్న రౌడీలు అని వ్యాఖ్యానించారు.जब रक्षक ही भक्षक बन जाए, तो व्यवस्था पर सवाल उठना तय है। pic.twitter.com/UGvYm7qEJx— Dushyant Chautala (@Dchautala) April 17, 2026 -
తప్పుడు పోస్టులపై వైఎస్ భారతీరెడ్డి లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుంటూ పెడుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తనపై సర్క్యులేట్ అవుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికలు మెటా ప్లాట్ఫామ్స్, ఎక్స్ కార్పొరేషన్, యూట్యూబ్, గూగుల్లకు లీగల్ నోటీసులు పంపారు. భారతీరెడ్డి తరఫున న్యాయవాది ప్రద్యుమన్ కైస్తా ఈమేరకు నోటీసులిచ్చారు. తప్పుడు కథనాలతో కూడిన పోస్టులను ప్రచారం చేస్తున్న థింక్ ఆంధ్ర, ఎం9 న్యూస్లకు సైతం నోటీసులు పంపారు.భారతీరెడ్డి, జగన్మోహన్రెడ్డి బాధితులుగా మారారు..వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు వారి రాజకీయ ప్రత్యర్థులకు చెందిన ఐటీ సెల్ ప్రారంభించిన దుష్ప్రచారానికి బాధితులుగా మారారు. ఈ దాడి.. అన్ని పరిమితులను దాటి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. యూట్యూబ్, ఫేస్బుక్ ఖాతాలు కలిగిన థింక్ ఆంధ్ర.. తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను విస్తృతంగా ప్రచురించి ప్రసారం చేస్తోంది. మిర్చి 9 న్యూస్ కూడా ఇలాంటి కంటెంట్నే సృష్టించి విస్తృతంగా వ్యాప్తి చేస్తోంది. ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్ పనే..ఈ కంటెంట్ను భారతీరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్కు సంబంధించిన అకౌంట్లు సేకరించి వాటిని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో థింక్ ఆంధ్రా ఓ తప్పుడు, ఆధారరహిత కథనాన్ని సృష్టించింది. ఫేస్బుక్, యూట్యూబ్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రణాళికబద్ధంగా సాగుతున్న దాడి...వైఎస్ జగన్ దంపతులపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఆ తప్పుడు కథనాలు, పోస్టులను వ్యాప్తి చేస్తున్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా సాగుతున్న దాడి. ఆ పోస్టులు నా క్లయింట్ కుటుంబ పరువుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అవి పరువు నష్టం కలిగించే తప్పుడు వార్తలే కాకుండా భారతీరెడ్డి వ్యకిగత గోప్యతను సైతం హరిస్తున్నాయి. ఇది చట్ట ప్రకారం నేరం. ఈ నేపథ్యంలో మీరు పోస్టు చేసిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను తక్షణమే తొలగించాలి. అదే విషయానికి సంబంధించిన ఇతర పోస్టులను సైతం తొలగించాలి. భారతీరెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై చేస్తున్న దుష్ప్రచారం తాలూకు తప్పుడు, నిరాధార కథనాలను, పోస్టులను ప్రసారం చేస్తున్న ఆయా సామాజిక మాధ్యమాల అకౌంట్లను సైతం బ్లాక్ చేయాలి. లేని పక్షంలో భారతీరెడ్డి తీసుకునే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి. ప్రస్తుత లీగల్ నోటీసులో ప్రస్తావించిన అంశానికి సంబంధించిన ఏ విధమైన కంటెంట్ అయినా, అలాగే నా క్లయింట్కు అపకీర్తి కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, మళ్లీ ప్రచురించడం, ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, ప్రచారం చేయడం, షేర్ చేయడం, వ్యాప్తి చేయటాన్ని తక్షణమే నిలిపివేయాలి. మీరు ప్రచురించిన, ప్రసారం చేసిన, పోస్టు చేసిన కథనాలు తప్పుడు కథనాలని అంగీకరిస్తూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అలాగే ఆ కంటెంట్ ఇప్పటికే తొలగించినట్లు ప్రకటించాలి..’ అని ప్రద్యుమన్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. -
బ్లాక్ శారీలో నిహారిక అందాలు.. కోట్లో మెరిసిపోతున్న పెద్ది బ్యూటీ..!
కోలీవుడ్ బ్యూటీ రవీనా రవి స్మైలీ లుక్స్..హీరోయిన్ అనన్య నాగళ్ల బ్యూటీఫుల్ వీడియో..కోట్లో మెరిసిపోతున్న పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్..బ్లాక్ శారీలో నిహారిక కొణిదెల అందాలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ రెజీనా హోయలు.. View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shanoor Sana Begum (@shanoor_sana) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
15 మంది మృతి.. ఓ మహిళ మాత్రం ఇన్స్టాగ్రామ్ రీల్తో బతికింది
చండీగఢ్ : 15 మంది ప్రాణాలు బలిగొన్న పడవ ప్రమాదంలో ఓ మహిళ మాత్రం చావు అంచున ఉన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ను గుర్తు చేసుకుని అద్భుతంగా ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.పోలీసుల వివరాల ప్రకారం, గత వారం ఉత్తరప్రదేశ్లోని మథురలో పెను విషాదం చోటు చేసుకుంది. వృందావన్లోని యమునా నదిలో 20–30 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలుల కారణంగా పడవ అదుపు తప్పి, అనంతరం సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను ఢీకొనడంతో బోల్తా పడిందని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు.ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ రోజు ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాటికి మొత్తం 15 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే, గల్లంతైన వారిలో లూధియానాకు చెందిన 54 ఏళ్ల రాజిందర్ కౌర్ బంగా మాత్రం చావు అంచు నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు నీటిలో మునిగి ఊపిరాడక హాహాకారాలు చేస్తుండగా, బంగా మాత్రం తాను గతంలో ఇన్స్టాగ్రామ్లో చూసిన వీడియోను గుర్తు చేసుకుని ప్రాణాలను కాపాడుకున్నట్లు స్వయంగా మీడియాకు తెలిపారు.‘నేను గతంలో నీటిలో మునిగితే ఎలా బయటపడాలో వివరిస్తూ ఇన్స్టాలో అప్లోడ్ చేసిన టిప్స్ వీడియో చూశాను. ప్రమాద సమయంలో ఆ సూచనలు గుర్తుకు వచ్చాయి. నోరు తెరవలేదు, చేతులను నిటారుగా ఉంచాను, కాళ్లను కదిలించాను. ఈత రాకపోయినా ఆ సూచనల వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఆమె పేర్కొన్నారు. -
ఒరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్!
సమయం: ఉదయం 10 గంటలు.. స్థలం: మన దేశంలోనే కానీ కచ్చితంగా తెలియదు.. కనుచూపు మేర నుంచి తమవైపే కదలి వస్తున్న ఓ మరమనిషిని చూసి కోళ్లు ‘‘కొకొక్కొ..’’ అంటూ చెల్లాచెదురయ్యాయి. దూరంగా వీధి కుక్కలు.. ఇదేందయ్యా ఇది అన్నట్లు ఓ చూపు చూసి దౌడు అందుకున్నాయి. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు.. అంటూ వీధుల వెంట జనం ఆశ్చర్యపోతూ ఆ దృశ్యాన్నే చూస్తున్నాడు...ఇదేదో కొత్త గేమ్ క్యారెక్టర్లా ఉందే అంటూ ఓ చిన్నారి తన తల్లితో చెబుతూ చప్పట్లు కొడుతూ మురిసిపోతోంది. కాస్త దూరంలో ఉన్న అధికారులు, సిబ్బంది.. ‘హమ్మయ్యా.. వీధుల్లో, గల్లీల్లో తిరిగే జంతువుల్ని కంట్రోల్ చేయడానికి మేం రోడ్డెక్కాల్సిన రావాల్సిన అవసరం లేదు’ అంటూ తెగ సంబరపడిపోయ్యారు. అధికారుల్లో ఒకరు మైక్ అందుకుని.. ‘‘ఇది ఒక రోబో. పేరు ఎడ్వర్డ్.. ఇక నుంచి వీధుల్లో, రోడ్ల మీద జంతువుల్ని తరమి కొడుతుంది. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు’’ అంటూ అనౌన్స్ చేశారు. ఇది ఇంకా ఏం చేస్తుందా? అని స్థానికులు గుమిగూడి చూస్తున్నారు. ఈలోపు.. నడిరోడ్డులో డివైడర్కు కాస్త పక్కనే హాయిగా రెస్ట్ తీసుకుంటూ నెమరేస్తున్న ఆవు దగ్గరికి వెళ్లింది ఆ రోబో. ఆవు మాత్రం కదలకుండా ‘‘ఇప్పుడు నిన్ను చూసి భయపడలా?’’ అన్నట్టుగా ఓ చూపు చూసి తన పనిలో తాను ఉండిపోయింది. పాపం ఆ పిచ్చి యంత్రుడు ‘‘ఉషూ.. ఉషూ.. చో’’ అన్నట్లు ఎన్ని సైగలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈలోపు పారిపోతున్న కోళ్లు, వీధి కుక్కలు ఆ సీన్ చూసి ఆగిపోయాయి. పైకి నిలబడిన ఆ ఆవును చూసి కేజీఎఫ్లో రాకీభాయ్లా ఊహించేసుకున్నాయి. ఆవు వెంట కలిసిన ఆ జంతువులు ఆ రోబోను, తమను తరిమేందుకు వచ్చిన అధికారులను రోడ్ల వెంట పరుగులు పెట్టించాయి. ‘‘ఒరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్’’ అంటూ అధికారులు.. ‘‘రేయ్.. ఎవర్రా మీరంతా’’ అంటూ ఎడ్వర్డ్ చెరో వైపు పారిపోయారు. పాపం ఎడ్వర్డ్ వార్చోకి(Edward Warchocki).. పోలాండ్లోని వార్సా నగరంలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్(Unitree G1 humanoid robot). వీడు ఈ మధ్యే అడవి పందుల గుంపును వెంబడించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వినోదం కోసం చేసిన ప్రదర్శన మాత్రమే అయినా స్థానికులు దీనిని ఆసక్తిగా చూశారు. ఈ దృశ్యం "సై-ఫై సినిమా"లా కనిపించడం వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది.zaganiam dziki do lasu pic.twitter.com/Pjxkn0kfob— Edward Warchocki (@edwardwarchocki) April 12, 2026కొందరు దీనిని కేవలం మార్కెటింగ్ స్టంట్ అని, మరికొందరు భవిష్యత్తు టెక్నాలజీకి సంకేతం అని భావిస్తున్నారు. మన దేశానికి వస్తే మాత్రం ఎడ్వర్డ్గాడి పరిస్థితి పైన చెప్పుకున్నట్లే ఉంటుందని కొందరు సెటైర్ల రూపంలో కామెంట్లు చేస్తున్నారు. -
వెర్రితలలు వేస్తున్న టీడీపీ సోషల్ మీడియా
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగంపై అక్రమ కేసులతో రెడ్బుక్ వేధింపులకు పాల్పడుతున్న పోలీసులు ... టీడీపీ సోషల్ మీడియా విభాగం బరితెగించి సాగిస్తున్న దుష్ప్రచారం, వ్యక్తిత్వ హనన పోస్టులపై మాత్రం చోద్యం చూస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడే దు్రష్పచారానికి టీడీపీ సోషల్ మీడియా 2014లోనే తెరతీసింది. అప్పటి నుంచి అసభ్యకర, జుగుప్సాకర పోస్టులతో బరితెగించడమే పనిగా పెట్టుకుంది. ఇక 2014లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ సోషల్ మీడియా విభాగం విశ్వంఖలత్వం వెర్రితలలు వేస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు, టీడీపీ నేతల జుగుప్సాకర వ్యాఖ్యలతో పోస్టులను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తోంది. అది కూడా టీడీపీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే ఈ విష ప్రచారం సాగిస్తుండటం గమనార్హం. వైఎస్ జగన్ చేతిలో గొడ్డలి, ఇతర ఆయుధాలు పెట్టినట్టుగా మార్ఫింగ్ ఫొటోలతో టీడీపీ అధికారిక వెబ్సైట్లో పుంఖానుపుంఖాలుగా పోస్టులు పెడుతున్నారు. మహిళలు, చిన్నారులను కూడా కించపరుస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెడుతుండటం టీడీపీ బరితెగింపునకు నిదర్శనం. వాటిని టీడీపీ సోషల్ మీడియా విభాగాలు, ఆ పార్టీ కార్యకర్తలు పక్కా పన్నాగంతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను కట్డడి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు టీడీపీ నేతలకు వర్తించవన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తోంది. అందుకే టీడీపీ సోషల్ మీడియా విభాగం విష ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఏమాత్రం యత్నించడమే లేదు. టీడీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ప్రశ్నిస్తూ...నిలదీస్తూ వైఎస్సార్సీపీ పోస్టులు పెడితే మాత్రం పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తుండటం గమనార్హం. పోలీసులు టీడీపీ సోషల్ మీడియా సైకో కార్యకర్తలుగా వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఇక డీజీపీ కార్యాలయం టీడీపీ కార్యాలయంగా రూపాంతరం చెందిందా అన్న రీతిలో వ్యవహరిస్తోంది. -
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల.. ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల..!
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల హోయలు..డెకాయిట్ మూడ్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్..ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల అందాలు..కర్లింగ్ జుట్టుతో మంజరి ఫడ్నవీస్ బ్యూటీఫుల్ లుక్..సాగర తీరాన బాలీవుడ్ భామ సన్నీ లియోన్ చిల్..బాలీవుడ్ భామ సురభి జ్యోతి బేబీ బంప్ ఫోజులు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
పోలీసుల్ని ఆశ్రయించిన వల్లభనేని వంశీ
సాక్షి,కృష్ణాజిల్లా: వల్లభనేని వంశీపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ఏఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ కోరారు. -
శ్రీహరినే బయపెట్టాలనుకుంటున్నారా అరెస్ట్ అంబటి రియాక్షన్
-
రీల్స్ మోజులో మెడికోలు.. సేవలు మర్చిపోయారా?
ఆదిలాబాద్టౌన్: రోగులకు వైద్య సేవలు అందించాల రిమ్స్ ఆస్పత్రి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారింది.. కొంతమంది మెడికోలు, జూడాలు, పలువురు వైద్యులు రీల్స్ చేయడం పట్ల చర్చ సాగుతోంది. విధులు నిర్వహించే సమయంలో ‘రీల్స్ మోజు’లో పడి రోగులనే మర్చిపోతున్నారనే విమర్శలు లేకపోలేదు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా తరహాలో ఏకంగా ఆపరేషన్ థియేటర్లో శస్త్ర చికిత్సకు ముందు రోగితో డ్యాన్స్ చేయడం, ఆస్పత్రిలోని ఇతర పరికరాలను చేతిలో పట్టుకొని సోషల్ మీడియా కోసం వీడియోలను చిత్రీకరిస్తున్నారు. విధుల్లో ఉన్న సమయంలో కాకుండా ఇతర సమయంలో రీల్స్ చేస్తే పట్టించుకునేది కాదని, ఆస్పత్రి ఆవరణతో పాటు ఆయా వార్డుల్లో వీడియోలు షూట్ చేస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. అయితే రోగులతో కలిసి వీడియోలు తీయడం ద్వారా ఆ రోగి గోప్యత బయట పడుతుందని పలువురు చెబుతున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులకు అసౌకర్యంగా మారిందని పేర్కొంటున్నారు.‘లైక్’ల కోసం..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పలువురు ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేట్ వైద్యులు, వారి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇన్స్ట్రాగామ్లో పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోలు అంతటా హల్చల్ కావడంతో రిమ్స్లోని పలువురు మెడికోలు, జూడాలు, కొంత మంది వైద్యులు సైతం వారిలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ‘లైక్స్’ కోసం వీడియోలు తీస్తూ రెచ్చిపోతున్నారు. ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు రోగులకు ఇబ్బందులు ఎదురైనా సరే.. ఫాలోవర్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి్సన వీరే ఇలా డ్యాన్సులు చేయడం, రీల్స్ తయారు చేయడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను ఫోన్లో వివరణ కోరగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డ వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు కలిశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్ధించడం ఎంతవరకు సమంజసం అంటూ తనీష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.దీనిపై ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో చినపులివర్రులో కొల్లూరు ఎస్ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు తెల్లవారుజామున మఫ్టీలో గోడదూకి తన ఇంట్లోకి చొరబడి తనను వెంట తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్కు తనీష్ బాబు వివరించారు. ఎవరు మీరు, నా భర్తను ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించిన తన భార్య అనూషపై, అడ్డుకున్న స్ధానికులపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్కు ఆయన వివరించారు.తనీష్బాబును అక్రమంగా తీసుకెళుతున్న సమాచారం తెలుసుకుని అప్పటికప్పుడు తాను చినపులివర్రు వెళ్ళి పోలీసుల దౌర్జన్యాన్ని నిలదీసినట్లు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు తెలిపారు. సోషల్ మీడియా కేసులలో నోటీసులు ఇవ్వకుండా వీధిరౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని ప్రశ్నించిన వైఎస్ జగన్.. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మండిపడ్డారు.తనీష్బాబుకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని.. తనీష్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసిన వారిలో తనీష్ బాబు భార్య అనూష, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, చిలుమూరు రామ్మోహన్ రావు, సొంటి కామేశ్వరరావు, వసుమల్ల రోహిత్, అంబటి రామ్మోహన్ రావు ఉన్నారు. -
ఈవీకి పొల్యుషన్ సర్టిఫికెట్ లేదని ఫైన్
మనదేశంలో ఇటీవల కాలంలో విద్యుత్తు వాహనాల వినియోగం బాగా పెరిగింది. పర్యావరణానికి హాని కలిగించవనే ఉద్దేశంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే రాజస్థాన్లోని ఓ పోలీసు అధికారి ఈవీకి పొల్యుషన్ సర్టిఫికెట్ లేదని జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నాగౌర్ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు నడుపుతున్న వ్యక్తిని ఓ పోలీసు ఆపారు. కారుకు ఎడంపైపున ఉన్న ముందు సీటు విండోకు సన్షేడ్ అమర్చినందుకు వాహనాన్ని మొదట ఆపారు. దీనికి 200 రూపాయల జరినామా విధించారు. అక్కడితో ఆగకుండా పొల్యుషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ చూపించాలని వాహనదారుడిని పోలీసు అధికారి అడిగారు. అతడు చూపించకపోవడంతో మరో రూ.1500 ఫైన్ వేశారు. విద్యుత్ వాహనానికి పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదని ఎంత చెప్పినా సదరు పోలీసు పట్టించుకోలేదు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తాను చూశానని, అందుకే కారు ఆపానని మాట మార్చాడు. తాను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయలేదని, సాక్ష్యం చూపించాలని కోరినా పట్టించుకోలేదు. తనకు అకారణంగా జరిమానా వేసినందుకు కోర్టులో వేస్తానని చెప్పినా ఆ పోలీసు అధికారి లెక్కచేయలేదు. ఈ తంతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజనులు స్పందిస్తున్నారు. పోలీసు అధికారు తీరును తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈవీకి పీయూసీ సర్టిఫికెట్ అడగడం హాస్యాస్పదంగా ఉందని.. ఇది కాలిక్యులేటర్ను వాతావరణం గురించి అడిగినట్టుగా ఉందని సెటైర్ వేశారు. తెలియని విషయాన్ని ఒప్పుకోకుండా పోలీసు అధికారి మొండిగా వాదించడాన్ని అజ్ఞానంతో కూడిన అహంకారంగా నెటిజనులు పేర్కొన్నారు. ఈవీకి పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదని చాలా మంది పోలీసులకు తెలియదని, ఇలాంటి విషయాలపై వారికి శిక్షణ తప్పనిసరి అని వ్యాఖ్యానించారు."ఇలాంటి పోలీసు అధికారుల వీడియోలు వైరల్ కావడం మరింత ముఖ్యం. ఎందుకంటే వారికి తెలియని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించర''ని ఓ నెటిజన్ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థలోని తెలివితక్కువ వారి వల్లే దేశం నాశనం అవుతుందని.. ఇలాంటి వారు లంచాల కోసం ఎంతకైనా దిగజారతారని మరో నెటిజన్ మండిపడ్డారు. ఈవీకి కచ్చితంగా పీయూసీ వర్తించదని, ఒకవేళ డ్రైవింగ్ సమయంలో కారు కిటికీలకు కర్టెన్లు వేసివుంటే చలానా విధించే అవకాశం ఉందని మరో నెటిజన్ అన్నారు. नागौर पुलिस ने नया कानून लागू किया है इलेक्ट्रिक कार की PUC करवाओ नहीं तो आपके भी PUC का चालान कटेगालो साहब ने काट दिया 1500 की चालान😳😲 pic.twitter.com/uYpFvT0If1— एक नजर (@1K_Nazar) April 8, 2026చదవండి: వాళ్ల తలల్ని 'తలారీ'కి అప్పజెప్పవద్దు! -
ఒక రాధ ఇద్దరు కృష్ణులు!
వివాహ వేడుక జరగాల్సిన ఆ వేదిక యుద్ధరంగంలా మారింది. ఆ అమ్మాయిని నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానంటూ ఇద్దరు పెళ్లి కొడుకులు ఊరేగింపుతో వచ్చారు. ఇరువైపులా పెద్దలు వాగ్వాదానికి దిగడంతో వధువు కుటుంబం తలలు పట్టుకుంది. గొడవ ముదిరి తన్నుకునేదాకా పోవడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరుకుంది.ఉత్తర ప్రదేశ్ అమ్రోహా జిల్లాలో ఓ వివాహ వేడుకలో విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ పెళ్లి మండపం వద్దకు ఇద్దరు వ్యక్తులు బారాత్లతో, కుటుంబ సభ్యులు.. బంధువులతో చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వధువు కుటుంబం సంభల్కు చెందిన ఓ వ్యక్తితో తమ బిడ్డకు వివాహం నిశ్చయించారు. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న టైంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో తాము నష్టపోకూడదని భావించిన పెళ్లి కూతురు తండ్రి.. మొరాదాబాద్కు చెందిన మరో వ్యక్తితో తమ బిడ్డకు పెళ్లి ఫిక్స్ చేశారు.అయితే.. సంభల్కు చెందిన కుటుంబం పెళ్లి విషయంలో వెనకడుగు వేయలేదు. ఆమె తనకు నచ్చిందని.. తననే పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో ఏర్పాట్లు చేసుకుని.. బారాత్తో ఊరేగింపుగా పెళ్లి మండపం వద్దకు చేరుకుంది. అదే సమయంలో మొరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం కూడా వేదిక వద్దకు బారాత్తో చేరుకుంది. ఇరువర్గాల లౌడ్ మ్యూజిక్, డ్యాన్సులతో పరిణామంతో అక్కడ గందరగోళం నెలకొంది. కాసేపటికి ఇరు వైపులా కొట్టుకున్నంత పని చేశారు. దీంతో వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు.. నిర్ణయాన్ని వధువుకు, ఆమె కుటుంబానికే వదిలేశారు. దీంతో మూడు కుటుంబాలు చర్చలు జరిపాయి. చివరకు సంభల్కు చెందిన యువకుడికే ఇచ్చి వివాహం జరపాలని నిర్ణయించారు. దీంతో చేసేది లేక మొరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం అక్కడి నుంచి వెనుదిరగ్గా.. వివాహం ఘనంగా జరిగింది. స్థానికంగా ఈ ‘డబుల్ బారాత్’ గురించి చర్చ జరగ్గా.. అది నెట్టింటకు చేరింది. -
మోనాలిసా భర్తకు దక్కిన ఊరట
సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే ప్రేమపెళ్లి వ్యవహారంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఆమె మైనర్ అంటూ భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అతనికి ఊరట లభించింది. ఫర్మాన్ను ఇప్పట్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదని కేరళ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కిందటి ఏడాది ఆరంభంలో జరిగిన ప్రయాగ్రాజ్(యూపీ) మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఓ ఫొటోగ్రాఫర్ కంట పడి ఇంటర్నెట్ సెన్సేషన్గా నిలిచింది మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా భోస్లే. మోడలింగ్ అటుపై మూవీ ఆఫర్స్తో వార్తల్లోకి ఎక్కింది. అయితే అనూహ్యంగా ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కసారిగా సంచలన చర్చకు దారి తీసింది.ఇటు మత కోణంలో ఆమె వివాహంపై పెద్ద రచ్చే నడిచింది. అదే సమయంలో తన కూతురు మైనర్ అని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు మోనాలిసా తండ్రి. దీంతో మైనర్ కిడ్నాప్, బలవంతపు వివాహం నేరాల కింద కేసు నమోదు అయ్యింది. ఈలోపు ఇటు షెడ్యూల్ ట్రైబ్స్ కమిటీ కూడా ఆమెకు 16 ఏళ్లు అని తేల్చింది. దీంతో పోక్సో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ ఆరోపణల్ని ఆ జంట మీడియా సమావేశం పెట్టి మరీ తోసిపుచ్చింది. ఈ జనవరితో 18 ఏళ్లు నిండాయని.. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలు(ఆధార్కార్డ్, బర్త్ సర్టిఫికెట్) కూడా ఉన్నాయని.. ఇష్టపూర్వకంగానే తమ వివాహం జరిగిందని ఆ జంట చెబుతోంది. పెద్దలు కూడా తమ వివాహానికి అంగీకరించారని.. ఆ తర్వాత కొందరి ప్రొద్భలంతో కేసు పెట్టారని మోనాలిసా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషనర్ వేశారు. ఇంతకు ముందు..మార్చి 23వ తేదీన కేరళ హైకోర్టు అరెస్ట్ విషయంలో తాత్కాలిక ఊరట ఇచ్చింది. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు త్వరగతిన తమను అనుమతించాలని మధ్యప్రదేశ్ పోలీసులు కేరళ హైకోర్టును మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి గడువును పొడిగించింది. తాజా తీర్పుతో మే 20వ తేదీ దాకా ఫర్మాన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఈలోపు ఆమె మైనర్ అవునా? కాదా? ఆ వివాహం చెల్లుబాటు అవుతుందా? వాళ్లు సమర్పించినవి సరైన పత్రాలేనా?.. అనే అంశాలపై దర్యాప్తు కొనసాగనుంది.మిస్సింగ్ కలకలం?మోనాలిసా కనిపించడం లేదంటూ ఫర్మాన్ ఖాన్ పెట్టిన ఓ వీడియో నిన్నంత వైరల్ అయ్యింది. తామిద్దరం రాజస్థాన్కు వెళ్లామని.. అజ్మీర్లో ఆమె కనిపించకుండా పోయిందని.. ఆమె కోసం అంతా గాలిస్తున్నానంటూ ఆ వీడియోలో చెప్పాడతను. అయితే.. ఆమె మిస్ కావడం వెనుక ఫర్మాన్ ప్రమేయం ఉండి ఉండొచ్చని మోనాలిసా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత 15-20 రోజులుగా తమ కూతురు తమతో మాట్లాడడం లేదని.. ఇప్పుడు అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోందని.. కేసు నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని.. పోలీసులు ఎలాగైనా ఆమె జాడ కనిపెట్టాలని కోరుతున్నారు. -
బాహుబలి గెటప్లో వరుడు.. శోభన ఫ్లెక్సీ వైరల్!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొత్త స్టైల్తో హైలైట్ అయింది. ములకలపల్లి మండలం నల్లివారం గూడెంకు చెందిన గోపి పెళ్లి ఈ నెల 10న జరిగింది. కానీ అసలు టాక్ మాత్రం శోభన ఫ్లెక్సీదే! వరుడిని ‘బాహుబలి’ గెటప్లో స్టైలిష్గా డిజైన్ చేసి, “బ్రహ్మచారి జీవితానికి Good Bye.. సంసార జీవితానికి Welcome” అంటూ పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది. హీరో లుక్లో ఉన్న వరుడి ఫ్లెక్సీ చూసి గ్రామస్తులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లిళ్లలో క్రియేటివిటీకి ఇది కొత్త లెవల్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు! -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి గానూ ఈ చర్యలకు దిగినట్లు తెలియజేశారామె. ‘‘బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నిరాధార ఆరోపణలు చేస్తూ నాపై పోస్టులు పెడుతోంది. నా ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోంది. ఈ దుష్ప్రచారానికి ఈ పార్టీ అధినేత కేసీఆర్దే బాధ్యత. అందుకే 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి నాకు ఆయన క్షమాపణలు చెప్పాలి. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయి’’ అని సీతక్క నోటీసుల్లో హెచ్చరించారు.మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు ఫోన్లు పంపిణీ చేశారు. అయితే, ఒక్కో ఫోన్ను మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేసి, కమీషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని ఇదివరకే ఖండించిన మంత్రి సీతక్క.. ఒక్కో ఫోన్ను రూ.11,650 కే కొనుగోలు చేశామని, దీనిపై పూర్తి పారదర్శకత ఉందని.. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
వారమైనా గ్యాస్ సిలిండర్ రాలేదా?
హైదరాబాద్కు చెందిన ఓ టెకీ గ్యాస్ బుకింగ్ చేసుకున్నాడు. ఎప్పటిలాగే ఆన్లైన్ పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపు చేశాడు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యిందని.. వారం రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది ఓ మెసేజ్ వచ్చింది. కానీ, వెంటనే రావాల్సిన డీఏసీ కోడ్ మాత్రం రాలేదు. అయితే ఇంకా టైం ఉంది కదా అని కూల్గా ఉండిపోయాడు. వారం గడిచింది.. డీఏసీ కోడ్, సిలిండర్.. రెండూ రాలేదు. పది రోజులకు డీఏసీ కోడ్ వచ్చింది. హమ్మయ్యా.. ఇక రేపో, మాపో సిలిండర్ వస్తుంది లే అనుకున్నాడు. కానీ పేమెంట్ చేసి రెండు వారాలు గడిచినా సిలిండర్ రాకపోవడంతో అసహనానికి గురయ్యాడు. డెలివరీ బాయ్స్ అని అడిగితే.. ఏం చేయలేమన్న సమాధానం. గ్యాజ్ ఏజెన్సీ వద్దకు వెళ్తే వాళ్లూ చేతులెత్తేశారు. దీంతో సిలిండర్ ఎప్పుడు వస్తే.. అప్పుడే అన్నట్లు ఉండిపోయాడు. ఒక హైదరాబాద్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకు వస్తే దేశంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితితేనే ఎదుర్కొంటున్నారు వినియోగదారులు.దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేనేలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ అయితే.. ఓ అడుగు ముందుకు వేసి ఎన్ని ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయో లెక్కలేసి చెబుతోంది. వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగానే కనిపిస్తోంది. ఇదో భారీ స్కామ్?!ఎల్పీజీ సిలిండర్ సరఫరాలో ఆలస్యానికి ‘గోస్ట్ డెలివరీలు’ ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంటే.. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు చెప్పిన టైంలో సిలిండర్ అందదు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సిలిండర్ డెలివరీ అయినట్లు మెసేజ్ మాత్రం వస్తుంది. అలా.. డెలివరీ అయ్యిందని రికార్డుల్లోకి ఎక్కుతోంది. ఆందోళన చెందుతున్న కస్టమర్లకు ఏదో ఒకటి సర్ది చెబుతున్నారు. కొన్నిరోజులు పోయాక.. నెమ్మదిగా మరో సిలిండర్ను కస్టమర్లకు అడ్జస్ట్ చేసి అందిస్తున్నారు. మరి మధ్యలో ఆ సిలిండర్ ఏమైనట్లు?.. అలాంటి వాటిని బ్లాక్ మార్కెట్లోకి చేర్చి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర, పుణేతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల అధికారుల దాడుల్లో పెద్ద సంఖ్యలో సిలిండర్లు పట్టుబడ్డాయి. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ లేదంటే మనీపే యాప్ల ద్వారా బుకింగ్ చేసిన ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ఇలా ప్రధానంగా జరుగుతోందని గుర్తించారు. గోస్ట్ డెలివరీ స్కామ్ కారణంగా వినియోగదారుడు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాడు. కొందరైతే మళ్లీ బుకింగ్ చేసుకుని మరీ ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. గ్యాస్ కంపెనీలు మాత్రం గోస్ట్ డెలివరీ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నాయి. తమ యాప్లు క్రాష్ కావడం, సర్వర్ సమస్యలు, బుకింగ్.. డెలివరీ రికార్డుల్లో లోపాల వల్లే ఆలస్యం జరుగుతోందని చెబుతున్నాయి. ఇలా చేయండి.. సిలిండర్ డెలివరీకి డీఏసీ(Delivery Authentication Code) కోడ్ అనేది తప్పనిసరి. ఆ కోడ్ చెబితేనే డెలివరీ బాయ్ సిలిండర్ ఇస్తాడు. కానీ, ఘోస్ట్ డెలివరీ దందా ఆ కోడ్తో సంబంధం లేకుండానే నడుస్తోందని తెలుస్తోంది. మీకు DAC కోడ్ రాకపోవడం లేదంటే డెలివరీ ఆలస్యం అవ్వడం వెనుక సిస్టమ్ లోపాలతో పాటు డీలర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెట్కి మళ్లింపు కారణాలు ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి డీఏసీ కోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే కస్టమర్ కేర్కి ఫిర్యాదు చేయండి. బుకింగ్ వివరాలు, నగదు చెల్లింపు రసీదులు, స్క్రీన్షాట్లను భద్రంగా ఉంచుకోండి. ఇవి ఫిర్యాదుల టైంలో సాక్ష్యంగా ఉపయోగపడతాయి.సిలిండర్ రాలేదన్న ఆందోళనతో డబ్బులు చెల్లించి మళ్లీ డబుల్ బుకింగ్ చేస్కోవద్దుడీఏసీ కోడ్ రాకుండా.. సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీలకు, గోదాంలకు పరుగులు తీయొద్దుఆన్లైన్ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది గనుక అధికారిక పోర్టల్/మనీ యాప్ల ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలిచెప్పిన టైంలో గనుక సిలిండర్ డెలివరీ జరగకపోయినా, డీఏసీ కోడ్ విషయంలో ఆలస్యం లేదంటే ఏదైనా మతలబు జరిగినా.. సంబంధిత గ్యాస్ కస్టమర్ కేర్ నంబర్లకు సంప్రదించి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గంఫిర్యాదుల కోసం.. • ఇండియన్ గ్యాస్ (IndianOil): 1800-2333-555• హెచ్పీ గ్యాస్ (HPCL): 1800-233-3555• భారత్ గ్యాస్ (BPCL): 1800-22-4344ఈ టోల్ ఫ్రీ నెంబర్లే కాదు.. అధికారిక పోర్టల్/యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అందుకోసం ఆ యాప్/వెబ్సైట్లలో Complaints/Feedback అనే విభాగం ఒకటి ఉంటుంది. లేదంటే.. స్థానిక డీలర్కి రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేయవచ్చు. ఇవేకాదు.. వినియోగదారుల కోసం హెల్ప్లైన్ నెంబర్ 1915కి కూడా కాల్ చేసి ఏ గ్యాస్ కంపెనీ మీద అయినా ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే.. 8800001915 అనే నెంబర్కు మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే consumerhelpline.gov.in అనే వెబ్సైట్ ద్వారానూ ఫిర్యాదు చేయొచ్చు. అయితే.. ఫిర్యాదులు చేసే టైంలో మీ గ్యాస్ బుక్ కన్జూమర్ నెంబర్, ఎల్పీజీ ఐడీ నెంబర్, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన ID.. పేమెంట్ రసీదు, మెసేజ్ స్క్రీన్షాట్ వంటి సాక్ష్యాలుగా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. -
కిడ్నాప్ చేసి.. హిజ్రాగా మార్చే యత్నం
మైసూరు(కర్ణాటక): యువకున్ని కిడ్నాప్ చేసి బలవంతంగా మంగళముఖిగా వేషం వేసి డబ్బులు వసూలు చేయించడం, రీల్స్ చేయించుకుని డబ్బు సంపాదిస్తూ, అతన్ని కూడా బలవంతంగా హిజ్రాగా మార్చాలని ప్రయత్నించారు. దీంతో బాధిత యువకుడు న్యాయం కోసం మైసూరు లష్కర్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నంజనగూడులోని త్యాగరాజ కాలనీకి చెందిన యువకుడు అనిల్కుమార్ దివ్యాంగుడు కూడా. అతడు 4 నెలల క్రితం మైసూరు రూరల్ బస్టాండులో బస్సు కోసం వేచిఉన్న సమయంలో మంగళముఖి అనిత ముసుగువేసి.. కిడ్నాప్ చేసి, మంగళూరుకు తీసుకు వెళ్లింది. అక్షతగా పేరు మార్చి తరువాత అతనికి చీర , నైటీ, చెవి కమ్మలు వేసి అక్షత అని పేరు మార్చింది. బలంవంతంగా వీధులలో , దుకాణాల వద్ద భిక్షాటన చేయించింది. ప్రతినిత్యం 2 నుంచి 3 వేల రూపాయలు కలెక్షన్ తీసుకు రావాలని బెదిరించింది. రీల్స్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మంగళూరు, కేరళ ప్రాంతాలలో వ్యభిచారానికి పంపింది. అతని ఆధార్ కార్డులో కూడా ట్రాన్స్ జెండర్గా మార్పించింది. వచ్చే నెల ముంబైకి తీసుకు వెళ్లి, సర్జరీ చేయించి పూర్తిగా మంగళముఖిగా మార్చడానికి ప్రణాళిక రూపొందించింది. దీనిని గుర్తించిన అనిల్కుమార్ ఇంటికి వెళ్తానని చెప్పగా, అనిత బెదిరించి చోరీ కేసు పెట్టించింది. ఎలాగోలా మంగళూరు నుంచి తప్పించుకుని వచ్చిన అనిల్.. మైసూరు లష్కర్ స్టేషన్లో అనితపై ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తన ఫిర్యాదుకు స్పందించడం లేదని అనిల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ఆమె మరణం తీరని లోటు
‘‘ఓ మధురమైన స్వరాన్ని కోల్పోయాం. ఆమె మరణం తీరని లోటు’’ అంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆశా భోంస్లేకి నివాళి అర్పించారు.తరతరాలుగా విభిన్నమైన భావోద్వేగాలను పలికిస్తూ, ఆశా భోంస్లేగారి గాత్రం భారతీయ సినిమాకు ప్రత్యేకంగా నిలిచింది. ప్రతి పాటకూ గ్రేస్, విలక్షణతను తీసుకువచ్చిన ఆమెను ఎప్పుడూ ఆరాధిస్తాను. భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని స్వరాన్ని కోల్పోయింది.– నటుడు చిరంజీవిశాశ్వతమైన గాయనీ...! అంటూ తాను నటించిన ‘చాచీ 420’ సినిమాలో ఆశా భోంస్లే పాడిన పాట ‘జాగో ఘోరీ..’ను, ఆమెతో తాను ఉన్న క్లిప్పింగ్స్ను షేర్ చేశారు.– నటుడు కమల్హాసన్.ఆశా భోంస్లేగారి మరణంతో ఒక శకం నిశ్శబ్దంగా ముగిసింది. ఆమె స్వరం కేవలం సంగీతం మాత్రమే కాదు... మన జీవితాల్లోని ప్రతి దశను స్పృశిస్తూ మనతో జీవించిన ఒక భావోద్వేగం. తరతరాలుగా ఆమెలా ప్రజల హృదయాలను తాకిన కళాకారులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆమె మనల్ని వదిలి వెళ్లిపోయి ఉండొచ్చు. ఆమె స్వరం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. – నటుడు మోహన్ బాబుదశాబ్దాల పాటు ఆశా భోంస్లేగారి మ్యాజికల్ వాయిస్ భారతీయ సినిమాకు ్రపాణంగా నిలిచి, లక్షలాది హృదయాలను తాకింది. తరతరాలుగా నిలిచిపోయే జ్ఞాపకాలను ఆమె వదిలి వెళ్లారు. ప్రేమ, గౌరవాలతో ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. – నటుడు ఎన్టీఆర్భారతీయ సంగీతానికి తీరని లోటు. ఆశా భోంస్లేగారి గాత్రం స్వచ్ఛమైన మ్యాజిక్ అండ్ ఎమోషన్ . ఆమె లెగసీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆశాగారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – నటుడు రామ్చరణ్ఆశా భోంస్లేగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. తరతరాలను నిర్వచించిన ఆమె స్వరం ఎప్పటికీ నిలిచిపోతుంది. – అల్లు అర్జున్భారతీయ సంగీతానికి తీరని లోటు. మీ స్వరానికి సాటి లేదు... మీ పాటలు తరతరాలుగా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. – నటుడు సల్మాన్ ఖాన్ఆశా తాయ్ (మరాఠీలో పెద్దక్క అని అర్థం) మరణవార్త బాధ కలిగించింది. భారతీయ సినిమాకు ఆమె గాత్రం ఒక మూలస్తంభంలాంటిది. భవిష్యత్లో శతాబ్దాల పాటు ఆశాగారి గాత్రపు మాధుర్యం కొనసాగుతూనే ఉంటుంది. – నటుడు షారుక్ ఖాన్ఆశాగారి మరణం దుఃఖాన్ని కలిగిస్తోంది. ఆమెకు నేను పెద్ద అభిమానిని. గొప్ప గాయకులు రఫీ, కిషోర్, లతగార్లు లేరు. ఇప్పుడు ఆశాగారూ మనకు దూరమయ్యారు. ఓ శకం ముగిసిందని నాకు అనిపిస్తోంది. ఆశాగారి మరణం ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే కాదు... దేశం, ప్రపంచానికే నష్టం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. – నటుడు ఆమిర్ ఖాన్మన దేశానికి స్వాతంత్య్రం లభించి, 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగ’ అనే పాటను ఆమెతో కలిసి రికార్డు చేసే అవకాశం నాకు లభించింది. మా అమ్మని కాకుండా నేను అమ్మా అని పిలిచే మరొక వ్యక్తి ఆశాగారు మాత్రమే. ‘శ్రీవల్లీ..’ సాంగ్ (పుష్ప: ది రైజ్’లోని పాట..) ఆమెకు నచ్చింది. ఆశా అమ్మ... మిమ్మల్ని చాలాసార్లు కలిసే చాన్స్ నాకు దక్కింది. అది నాకు పెద్ద ఆశీర్వాదం. సంగీతం పట్ల మీ అంకితభావం, ప్యాషన్ ను నేను ప్రత్యక్షంగా చూశాను. – సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ఆమె గాత్రం ఒక మ్యాజిక్. ఆమెతో ఓ సాంగ్ను షేర్ చేసుకునే గౌరవం నాకు లభించింది. ఆశాగారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. భారతీయ సంగీతానికి ఆమె మరణం తీరని లోటు. – నటుడు సంజయ్ దత్ఒక శకం ముగిసింది. నేను ముంబైలో ఎక్కడున్నా ప్రభుకుంజ్ (ముంబైలో ఆశా ఎక్కువ కాలం నివసించిన భవనం) దాటి వెళ్తున్నప్పుడు తొలుత లతాగారికి ఫోన్ చేసేదాన్ని. ఆ తర్వాత ఆశాజీగారిని కలిసేదాన్ని. ఆమె స్థానాన్ని మరొక సింగర్ భర్తీ చేయలేరు.– గాయని ఉషా ఉతుప్మనందరికీ, భారతీయ సంగీతానికి ఎంతో బాధాకరమైన రోజు ఇది. మన ప్రియమైన ఆశా సోదరి ఇక లేరన్న విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆమె స్వరం ఎప్పటికీ జీవించే ఉంటుంది.– గాయకుడు–సంగీతదర్శకుడు శంకర్ మహదేవన్తన పాటలకు జీవకళను అద్ది, ఎంతో ప్రత్యేకతను చాటుకున్న ఆశాగారు ఇక లేరనే విషయం నమ్మశక్యంగా లేదు. ఆశాగారితో నాకు ప్రత్యేకమైన భావోద్వేగంతో కూడిన అనుబంధం ఉంది. అందుకే ఆమె ఇక లేరన్న విషయం నాకు కష్టంగా అనిపిస్తోంది. నేను నటించిన సినిమాల్లోని పాటలను ప్రత్యేకమైన తన గాత్రం, శైలితో పాపులర్ చేశారామె. చిత్ర పరిశ్రమలో నా ఎదుగుదలలో భాగస్వామ్యమైన లతా, ఆశాగార్లతో నాకు మంచి అనుబంధం ఉంది. – నటి హేమ మాలినిభారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిభాశాలి అయిన ఒక గాయనిని కోల్పోయిన రోజు ఇది. ఆమె నాతో ఎంత ప్రేమాభిమానాలతో ఉండేవారో, గాయనిగా అంతే గౌరవమర్యాదలతో నడుచుకునేవారు. నా జీవితంలో నేను ఎప్పటికీ మరచిపోలేని ఓ స్థానంలో ఉంటారామె. వేరే ఏ స్వరంతోనూ పోల్చలేని ఓ ప్రత్యేకమైన స్వరం ఆమెది. ఆమె ఎప్పుడు చెన్నైకి వచ్చినా నన్ను కలిసేవారు. నా ఆత్మీయ సోదరి. – సంగీతదర్శకుడు ఇళయరాజాఆశాగారు తన గాత్రంతో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. ఆమె గొప్ప కళాకారిణి. – సంగీతదర్శకుడు, ఏఆర్ రెహమాన్ఆమె గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోతాయా? ఆమె సాధించలేనిదంటూ ఏమైనా ఉందా? పనులు ఎలా చేయాలో మా అందరికీ చూపించిన వ్యక్తి. నిజమైన మార్గదర్శకురాలు. – గాయని చిన్మయిఆశాజీ మరణవార్త విని నేను పూర్తిగా కుప్పకూలిపోయాను. ఆశాజీని కోల్పోవడం అంటే మా అమ్మగారిని రెండోసారి కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోంది. ఈ సంగీత ప్రపంచంలో నా వేలు పట్టుకుని, నా చేత తొలి అడుగులు వేయించి, నాకు మార్గనిర్దేశకత్వం చేస్తూ, నా మొట్టమొదటి స్వరకల్పనకు గాత్రం అందించారు ఆమె. బహుముఖ ప్రజ్ఞాశాలి. అద్భుతమైన గాయని. ఆమెలా మరొకరు ఎప్పటికీ రారు. ఒక శకం ముగిసింది. – గాయకుడు అనూ మాలిక్ఆశా తాయ్ ఒక సింగర్గా, మంచి మానవతావాదిగా, లెజెండ్లా ఎప్పటికీ నిలిచిపోయే ఉంటారు. ఆమె స్వరానికి తగ్గట్లుగా మేం నటించేందుకు ముందే ప్రిపేర్ అయి, వస్తుంటాం. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆశాగారి సాంగ్ రికార్డింగ్ చూశాను. ఓ సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఆ మెలోడి సాంగ్కు ఆమె చూపిన ప్రతభలో నటిగా నేను పది శాతం ప్రతిభ చూపినా నేనో గొప్ప యాక్టర్ అవుతానని ఆమెకు చెప్పాను. – నటి కాజోల్నా ఆల్టైమ్ ఫేవరెట్ సింగర్ ఆశాగారి మరణం నన్ను ఆలోచనల్లో పడేసింది. అప్పట్లో రెహమాన్ లాంటి కొత్త సంగీత దర్శకుడితో ప్రయోగాలు చేయాలనే ఉత్సుకతతో వచ్చి, విప్పారిన కళ్లతో చూసిన ఓ పాపలా ఆమె కనిపించారు. చిన్న అడ్జెస్ట్మెంట్తో సింగిల్ టేక్లోనే ఈ పాట పూర్తయింది. ఆశ్చర్యకరంగా నా ‘కంపెనీ’ సినిమాలో ఆమె ‘ఖల్లాస్’ పాటను పాడారు. ఈ సినిమా విడుదలై నేటికి 24 ఏళ్లు పూర్తవుతున్నాయి. శాస్త్రీయ సంగీత మూలాలను, ఆధునిక లయల్లో విభిన్నమైన భావోద్వేగాలతో పలు భాషలకు అనుసంధానిస్తూ ఆమె స్వరం తరతరాలుగా నదీ ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంటుంది. మానవ భావోద్వేగాలను ఆమె ఆవిష్కరించినట్లు మరెవరూ ఆవిష్కరించలేరు. ఆశాజీ... మీరు మరొక చోటుకు వెళ్లి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ సంగీతం శాశ్వతంగా నిలిచే ఉంటుంది.– దర్శకుడు రామ్గోపాల్ వర్మఆశా భోంస్లేగారు మధురమైన గానంతో ఎన్నో తరాలను అలరించారు. ఆమె ప్రతిభ, ఆమె స్వరం ఎప్పటికీ మన మనసుల్లో నిలిచిపోయి ఉంటాయి. భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలు అమూల్యమైనవి. ఈరోజు చాలా దుఃఖమైన రోజు. మహాగాయని మనతో లేకపోవడాన్ని నమ్మలేకపోతున్నాను. ఆమె నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. బాలీవుడ్లో తన అద్భుతమైన స్వరంతో నాకిచ్చినటువంటి అమోఘమైన పాటలు మరపురానివి. ‘శరాబీ’ చిత్రంలో ‘దే దే ప్యార్ దే..’, ‘తోఫా తోఫా’ పాటలు కానీ... తెలుగులో ‘పాలు నీళ్లు’ సినిమాలో ‘ఇది మౌనగీతం...’ అనే పాటను కానీ అద్భుతంగా ఆలపించారు. లతా మంగేష్కర్గారు కానీ, ఆశా భోంస్లే దీదీ కానీ నా జీవితంలో నాకిచ్చినటువంటి ఈ అనుభూతిని మర్చిపోలేను. ఆశా భోంస్లే లేని లోటు నాకే కాదు... వ్యక్తిగతంగా ప్రజలకు, సంగీత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీ వారికి చెప్పలేని లోటు. అలాంటి గాయని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇక మనకు దొరకరేమో! – నటి జయప్రద -
నిషేధం కాదు... కంటెంట్ కావాలి!
సోషల్ మీడియాపై చర్చ కొత్త దశకు చేరుకుంది. 16 ఏళ్ల లోపు బాలల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధిస్తు న్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఇటీవల తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. డిజిటల్ వ్యసనం, ఆన్లైన్లో అపరిమిత కాలాన్ని వెచ్చిస్తున్నందువల్ల కొన్ని పరిమితులు తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు కూడా అదే బాట పట్టే అవకాశముందని వార్తలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మైనర్లను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ఒక చట్టం తెచ్చింది. అదే తరహా విధానాలు అనుసరించడంపై ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు చర్చిస్తున్నాయి. మానసిక ఆరోగ్యం దెబ్బ తినడం, సైబర్ బెదిరింపులు, నిద్రలో అవాంతరాలు వంటి సమ స్యలు తలెత్తుతున్నమాట వాస్తవమే. ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ వంటి సంస్థల అధ్యయనాలు కూడా ఆ సంగతిని ధ్రువీకరిస్తున్నాయి. బాలలు ఎలక్ట్రానిక్ తెరల ముందు రోజూ ఏడు గంటలకు పైగా గడుపుతున్నారని అవి తెలుపుతున్నాయి.సోషల్ మీడియా ‘కత్తి’ లాంటిది!ఎడతెగని ఫార్వర్డ్లు, సంచలనాత్మక అభిప్రాయాలు వ్యక్తపర చడం గురించి సోషల్ నెట్వర్క్ వాడకందారులు ఎవరికైనా వేరే చెప్పనవసరం లేదు. వాట్సాప్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్ఫారాలు తప్పుడు సమాచారానికి కారణమవుతున్నాయని నిందలు మోస్తున్నాయి. ఎన్నికల సందర్భాలలోనైతే చెప్పనే అక్కర లేదు. ఏది బూటకమో, ఏది వాస్తవమో నిర్ధారణ కాకపోయినా ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ముద్ర వేసుకుని వచ్చేస్తాయి. ఫలితాలను ప్రభావితం చేయడంలో, హింసకు పురిగొల్పడంలో వాటి పాత్రను తోసిపుచ్చలేం. ఢిల్లీలో 2020 నాటి అల్లర్లను దానికి నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో నిషేధించడం, లేదా నియంత్రించడం తప్ప గత్యంతరం లేదు. కానీ, ఆ యా వేదికలది తప్పా, లేక వాటిని వినియోగించుకుంటున్న మన తీరులో లోపం ఉందా అనే ప్రశ్న వెన్నాడుతూనే ఉంటుంది. సోషల్ మీడియా దానికదే విషపూరితమైనది కాదు. క్యాట్ వీడియోలు, కుట్ర సిద్ధాంతాలు, కవ్వించే మాటల వంటి అల్పమైన విషయాల వరదలో టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, ఘర్షణ ప్రాంతాల నుంచి పౌరులు నేరుగా నివేదించే కథనాల వంటి మంచి సంగతులు కూడా కొట్టుకొస్తాయి. ఇస్రో రాకెట్ ప్రయోగాల ప్రత్యక్ష వీడియోల వంటివి యువతలో స్ఫూర్తిని నింపుతాయి. అటువంటి సంగతులు మాధ్యమం తటస్థమైనదేననే సంగతిని గుర్తుచేస్తాయి. ఇదీ కత్తి లాంటిదే! దానితో కూరగాయలు తరగ వచ్చు. ఒంటికి గాయమూ చేసుకోవచ్చు. చరిత్ర నేర్పుతున్న పాఠాలుగూటెన్బర్గ్ 1440లో ముద్రణా యంత్రం కనుగొనడంతో విషయ పరిజ్ఞానం అందరికీ అందడం మొదలైంది. పునరుజ్జీవన, సంస్కరణవాద ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. యూరప్లో అక్షరాస్యత 10 శాతం నుంచి దాదాపు నూరు శాతానికి చేరుకుంది. అదే సమయంలో మూఢ నమ్మకాలను, కక్ష సాధింపు ప్రాపగాండాను పెంపొందించే కరపత్రాలు కూడా పుట్టుకొచ్చాయి. అయినా, నిషేధాలు నిలువలేదు. టెక్నాలజీయే కొనసాగింది. రేడియో వాడుకలోకి వచ్చినప్పుడు కూడా అదే ధోరణి పునరా వృతమైంది. జర్మనీలో 1930లలో హిట్లర్ విద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తికి అది కారణమైంది. ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ ఉత్తేజపూరిత ప్రసంగాలు అమెరికా ఐక్యానికి దోహదపడ్డాయి. టెలివిజన్ రాకతో నిరాధారమైన ఆరోపణలతో ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు చేసే పద్ధతి ఊపందుకుంది. అదే సమయంలో, పౌర హక్కులకు రక్షణ కల్పించి, మార్పునకు చేయూతనందించింది. నేడు సోషల్ మీడియా కూడా అదే బాటలో ఉంది. 50 కోట్ల మంది యూజర్లు, ప్రపంచంలోనే పెద్ద మార్కెట్గా మన దేశాన్ని మార్చారు. ‘నాసా’ కృష్ణబిల చిత్రాలను కొన్ని అందిస్తే, భ్రమలను తొలగిస్తూ నోబెల్ బహుమతి గ్రహీతలు చెప్పే మాటలను మరికొన్ని అందిస్తున్నాయి. వన్యప్రాణులపై డిస్కవరీ ఛానల్ రీల్స్ వస్తున్నాయి. అలా వేదికలు రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి. వదంతులను వ్యాప్తి చేస్తోందని ట్విట్టర్ను తిట్టుకున్నాం. కానీ, కోవిడ్ మృతుల విషయంలో భారతీయ వైద్య పరిశోధనా మండలి ఇచ్చిన తాజా సమాచారాన్ని కూడా ట్విట్టరే ఎప్పటికప్పుడు అందించింది. డిజిటల్ ఎకో సిస్టంనిజమైన సవాల్ నిషేధించడంలో కాక, ఎకో సిస్టంను సుసంపన్నం చేయడంలో ఉంది. దేశంలోని 1.4 బిలియన్ల మందిలో మూడొంతుల మంది 35 ఏళ్ళ లోపువారు. వార్తలకు వారు డిజిటల్ మార్గాలపైనే ఆధారపడుతున్నారు. యువతలో 80 శాతం మంది సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ల నుంచి పొందు తున్నారు. ప్రజానిధులతో ప్రభుత్వం కూడా బోలెడంత సమాచా రాన్ని ఎత్తిపోస్తోంది. వాటిలో నీతి ఆయోగ్ నివేదికలు, విశ్వ విద్యాలయ గ్రాంట్ల సంఘ పరిశోధన పత్రాలు, రక్షణ పరిశోధన – అభివృద్ధి సంస్థ నవీకరణలు కూడా ఉన్నాయి. కానీ, అవన్నీ ప్రాచుర్యానికి నోచుకోని ఎక్కడెక్కడో సైట్లలో పీడీఎఫ్ల రూపంలో మూలుగుతున్నాయి. కొందరు ఉన్నత విద్యావంతులు మాత్రమే వాటిని చూస్తున్నారు. మంత్రిత్వ శాఖల నివేదికలలో 70 శాతం ఏటా వెయ్యికన్నా తక్కువ మంది చూపరుల దృష్టికి మాత్రమే ఆనుతున్నాయని 2023 నాటి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబులో తేలింది. సోషల్ మీడియా ఒక పరిష్కారాన్ని ఇవ్వజూపుతోంది. వ్యవసాయ చట్టాలను, లేదా వాతావరణ డేటాను వివరించే రీల్స్ చేసేందుకు ఇన్ఫ్లుయెన్సర్లతో వివిధ మంత్రిత్వ శాఖలు భాగస్వామ్యం కుదుర్చుకుంటే? ప్రాచీన చరిత్రపై విశ్వవిద్యాలయాలు టిక్టాక్ సిరీస్ చేస్తే? వేదాలను వైరల్ చేస్తే? నివేదికలను ఇన్ఫోగ్రాఫిక్స్గా మార్చేందుకు యువ క్రియేటర్ల సేవలను ఇస్రో, ఐఐటీలు, ఐసీఎంఆర్ వంటి ప్రభుత్వ సంస్థలు వినియోగించుకుంటే? వేదికలను సద్వినియోగం చేసుకునేటట్లు విద్యావేత్తలు, స్కాలర్లు తమ వంతు పాత్ర పోషించాలి. ‘పనికిమాలిన’వంటూ ప్లాట్ ఫారాలను చిన్నచూపు చూసే బదులు వారు క్వాంటమ్ ఫిజిక్స్, లేదా ఎన్నికల డేటాపై థ్రెడ్లను పోస్ట్ చేయవచ్చు. ఉన్నత ప్రమా ణాలతో కూడిన కంటెంట్ పెడుతున్నవారిని ఆ యా ప్లాట్ ఫారాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. కాకపోతే విచక్షణా జ్ఞానంతో అన్వేషిస్తూ పోవాలి. మేరీ క్యూరీ 1 గ్రాము రేడియం కోసం 8 టన్నుల పిచ్ బ్లెండ్ను జల్లెడ పట్టవలసి వచ్చింది. ఆ క్రమంలో ఆమెకు కాలిన గాయాలయ్యాయి. సోషల్ మీడియా కూడా అదే రకమైన శ్రమను డిమాండ్ చేస్తోంది. చిందర వందర మధ్యలో అసలైన దాన్ని వెతికి పట్టుకోవాలి. సైట్ విశ్వస నీయతకు సంబంధించి న్యూస్ గార్డ్ వంటి టూల్స్ రేటింగ్ ఇస్తున్నాయి. ప్రభుత్వం కేవలం పోలీసుగానే వ్యవహరించకుండా, స్వయంగా క్వాలిటీ కంటెంట్ అందించాలి. వార్తాహరుడిని చంపే బదులు అతన్ని సమాచారంతో బలోపేతం చేయాలి.శివప్రసాద్ ఖేనేడ్వ్యాసకర్త సైన్స్ కమ్యూనికేటర్, మ్యూజియంవృత్తి నిపుణుడు (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
శ్రీలంక వెకేషన్లో హీరోయిన్ ప్రణీత.. హాఫ్ శారీలో సురేఖవాణి కూతురు..!
శ్రీలంక వేకేషన్లో చిల్ అవుతోన్న హీరోయిన్ ప్రణీత..లంగా ఓణిలో సురేఖవాణి కూతురు సుప్రీత హోయలు..లైట్ పింక్ డ్రెస్లో మెరిసిపోతున్న బిగ్బాస్ దివి..బాలీవుడ్ భామ ఇషితా దత్తా హాట్ ఫోజులు..శారీలో ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ లుక్స్.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
ట్రాఫిక్ చలాన్ల ఎఫెక్ట్.. కేటుగాడి మాయ వైరల్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ట్రాఫిక్ చలనాలను తప్పించుకునేందుకు అడ్డదారులను ఎంచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో కారు నంబర్ ప్లేట్ విషయంలో వెలుగు చూసిన మోసం చూసి పోలీసులే ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల మేరకు.. జూబ్లీహిల్స్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారు నడుపుతూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. దీంతో, కారును పరిశీలించే క్రమంలో కొత్త విషయం తెలుసుకుని పోలీసులే ఖంగుతిన్నారు. సదరు కారుకు నెంబర్ ప్లేటు మార్చే ప్రత్యేక సిస్టమ్ ఉండటంతో పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. కొన్ని సెకన్ల వ్యవధిలో కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ మారుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణ, ఢిల్లీలో రిజిస్ట్రేషన్లతో ఉన్న నంబర్ ప్లేట్లు మారడం జరుగుతుండటం విశేషం. దీంతో, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఇంటర్నెట్ను ఊపేసిన ‘90-డిగ్రీల’ బ్రిడ్జి ఇక హిస్టరీ!
భోపాల్: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిన మధ్యప్రదేశ్లోని భోపాల్ ‘90-డిగ్రీల వంతెన’ గుర్తుంది కదా? ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ వింత డిజైన్ పై అటు స్థానికుల నుంచి, ఇటు నెటిజన్ల వరకూ తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు ఎట్టకేలకు దిగివచ్చారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ), రైల్వే శాఖల కొనసాగుతున్న వివాదానికి ముగింపు దొరికింది. ‘సిమెంట్ తో కట్టిన మృత్యుద్వారం’గా ముద్రపడిన ఈ వంతెన డిజైన్ను పూర్తిగా మార్చివేసి, త్వరలోనే సురక్షితంగా తీర్చిదిద్ది, ప్రజల వినియోగానికి తీసుకురావాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు.భోపాల్ లోని ఐష్బాగ్ ప్రాంతంలో సుమారు 18 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి 2025, జూన్ నాటికే పూర్తయినప్పటికీ వాహనాల రాకపోకలకు నోచుకోలేదు. ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల ముందు, ఈ వంతెన మలుపు ఏకంగా 90 డిగ్రీల కోణంలో ఉన్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఆ మలుపులో వాహనాలు అదుపుతప్పి బోల్తా పడతాయని స్పష్టమైంది. ఈ దారుణమైన ప్లానింగ్ పై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మీమ్స్, విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపధ్యంలో ఏడుగురు పీడబ్ల్యూడీ ఇంజనీర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బృందాలను రంగంలోకి దించింది. పక్కనే ఉన్న మెట్రో లైన్ వల్లే డిజైన్ లో ఈ సమస్య తలెత్తిందని దర్యాప్తులో తేలింది. రైల్వే శాఖ నుండి సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే మరో నాలుగు, ఐదు రోజుల్లో పాత కాంట్రాక్టర్తోనే మార్పుల పనులు ప్రారంభించనున్నారు. కొత్త డిజైన్ ప్రకారం మలుపు వ్యాసార్ధాన్ని 2 మీటర్ల నుండి 2.5 మీటర్లకు, వంతెన వెడల్పును 8.5 మీటర్ల నుండి 10.5 - 11 మీటర్లకు పెంచనున్నారు. దీని ద్వారా కార్లు, మధ్య తరహా, భారీ వాహనాలు సురక్షితంగా ప్రయాణించే వీలుంటుంది.ఇది కూడా చదవండి: ట్రంప్ ‘మ్యాజిక్ పెయింట్’.. మండిపడుతున్న నిపుణులు -
Instagramతో కోట్లలో డబ్బు సంపాదన.. ఎలా అంటే?
ఫ్రెండ్స్.. మీకో విషయం తెలుసా..? Instagramలో సబ్స్క్రిప్షన్ అనే ఫీచర్తో ఒక అమ్మాయి నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలు. అవును.. మీరు విన్నది నిజమే. అక్షరాలా సంవత్సరానికి 12 కోట్లు. ఇది వినగానే మీలో చాలా మందికి.. అబ్బా.. నాకూ అకౌంట్ ఉంది.. నేను కూడా స్టార్ట్ చేస్తా, ఆ టాలెంట్ ఏదో నేర్చేసుకుంటా.. అని అనిపిస్తోంది కదా..? కానీ ఒక్క నిమిషమాగండి. ఆ టాలెంట్ మీరు నేర్చుకోలేరు, నేను నేర్పించలేను. ఎందుకంటే అది ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు.. అదో రకమైన టాలెంట్, అది అందరికీ రాదు, అందరూ చేయకూడదు కూడా.హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి కూడా పాకింది. దురదృష్టవశాత్తూ.. మన ఫీమేల్ కంటెంట్ క్రియేటర్స్ ఈ ఫీచర్ని చాలా రాంగ్ దారిలో వాడుతున్నారు. అసలేం జరుగుతోంది..? దీనిపై ఎందుకు ఇంత వ్యతిరేకత..? అనేవి వివరంగా మాట్లాడుకుందాం.అసలు ఈ కోటి రూపాయల గోలేంటి..? కేరళకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. తన పేరు అశ్విని, Instagramలో పర్పుల్ సెలా అని ఉంటుంది.. ఆ అమ్మాయికి ఉన్నది కేవలం 2-3 లక్షల ఫాలోవర్లే. కానీ.. సబ్స్క్రైబర్లు మాత్రం 26 వేల మందే. వీరంతా ఒక్కొక్కరు నెలకు 399 రూపాయలు పే చేస్తున్నారు. ఇలా లెక్కేస్తే నెలకు కోటి రూపాయల పైనే ఈ అమ్మాయి సంపాదిస్తోంది. హిందీ క్రియేటర్లని కూడా దాటి ఈమె ఇండియాలోనే నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోయింది. మన తెలుగులో కూడా గత 4-5 నెలలుగా విష్ణుప్రియ, సాధన నాయుడు లాంటి వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకు Twitterలో వీళ్ళ ఫోటోలే ట్రెండింగ్. మరి.. ఏంటా ఫోటోలు? ఏమున్నాయి అందులో? అన్నీ ఆనిముత్యాలే. బాహాటంగా ఎక్స్పోజింగ్ చేస్తూ యూత్ ని ఆకర్షించడమే వీరి పని.అసలు Instagram ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ ఎందుకొచ్చింది..? అంటే నిజానికి ఇది YouTube మానిటైజేషన్ లాంటిది. క్రియేటర్లకి డైరెక్ట్ ఆదాయం ఉండదు కాబట్టి, వాళ్ళ స్పెషల్ టాలెంట్ని క్యాష్ చేసుకోవడానికి ఇచ్చారు. ఉదాహరణకు.. ఒక బిజినెస్ పర్సన్ తన ప్రీమియం డిజైన్లు చూపించడానికి.. ఒక CA లేదా లాయర్ తన క్రిటికల్ లీగల్ టిప్స్ చెప్పడానికి.. ఒక ఫోటోగ్రాఫర్ తన సీక్రెట్ సెట్టింగ్స్ నేర్పించడానికి.. లేదా ఒక డాన్సర్ తన ఎక్స్క్లూజివ్ స్టెప్స్ నేర్పించడానికి.. ఈ సబ్స్క్రిప్షన్ను తీసుకొచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి..? టాలెంట్ని పక్కన పెట్టి, బాడీని చూపిస్తూ మనీ సంపాదిస్తున్నారు. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు రాత్రింబవళ్లు కష్టపడితే నెలకి లక్ష రావడం కష్టంగా ఉంటే, వీళ్ళు ఇలాంటి కంటెంట్తో కోట్లు కొల్లగొడుతున్నారు. ఇది చూసినప్పుడు ఎవరికైనా కోపం, ఆవేదన రావడం సహజం.ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. మన పేరెంట్స్ చిన్నప్పుడు కష్టపడి కాయగూరలమ్మినా, కూలి పని చేసినా మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే అది కష్టం, అది నీతి. కానీ వీళ్ళు రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు..? మీ అమ్మ ఏం చేస్తుందిరా అంటే.. Instagramలో సబ్స్క్రిప్షన్ పెట్టి ఇగో ఇలాంటి ఫోటోలు అమ్ముతుంది.. అని గర్వంగా చెప్పుకోగలరా..? మై బాడీ మై విష్ అని కొందరు వాదిస్తారు. లీగల్గా ఇది కరెక్టే కావచ్చు.. కానీ ఎథికల్గా ఏం సమాధానం చెబుతారు. ఇలాంటివి చూసి కాలేజీ పిల్లలు, హౌస్ వైఫ్స్ కూడా మనీ ఇంత ఈజీగా వస్తుందా అని తప్పుడుదారిలో ఇన్స్పైర్ అవుతున్నారు. దీనివల్ల యూత్ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా..? ఒక ఫోటో చూడటానికెళ్లి గంటల కొద్దీ అందులోనే మునిగిపోతున్నారు. రాబోయే కాలం ఒక యుద్ధభూమి. అక్కడ సర్వైవ్ అవ్వాలంటే స్కిల్ కావాలి కానీ, ఇలాంటి వ్యసనాలు కాదు.మీకు అలాంటి కంటెంట్ చూపించాలనే ఉంటే.. దానికి ఓన్లీ ఫ్యాన్స్ లాంటి డెడికేటెడ్ యాప్స్ ఉన్నాయి, అక్కడికెళ్ళండి. Instagram అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర్నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఉంటారు. దీన్ని ఇలాంటి చెత్తతో నింపేయొద్దు. తల్లిదండ్రులకు కూడా ఓ సజిషన్.. మీ పిల్లల ఫోన్లలో Instagram, Telegram యాప్స్ ఎలా వాడుతున్నారో గమనించండి. వాళ్ళు ఎక్కడ మనీ స్పెండ్ చేస్తున్నారో చూడండి. చెడిపోవడానికి వంద దారులున్నాయిక్కడ, జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. చివరిగా.. మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు, ఎలా సంపాదిస్తున్నారు అన్నదే ముఖ్యం. అభిమానుల పేరుతో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు మీ అభిమానానికి అర్హులు కాదా అని. దట్సాల్. -
తోటి విద్యార్థి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
హయత్నగర్: సహచర విద్యార్థి సోషల్ మీడియాలో వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన నమలితోక కేశవ లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుంట్లూర్లో ఉంటున్నాడు. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు (15) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. స్థానిక కాంగ్రెస్ నేత కొడుకు (15) కూడా అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.ఈ క్రమంలో కేశవ కూతురు గురువారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు కేశవకు ఫోన్ చేసి మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్ తెప్పించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా స్థానిక రాజకీయ నేత కొడుకు తరచూ సోషల్ మీడియాలో బాలికను వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్.. కేఫ్లో బిగ్బాస్ దివి చిల్..!
మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్..హీరోయిన్ ప్రియమణి లేటేస్ట్ లుక్..గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న నటి బిందు మాధవి..కేఫ్లో చిల్ అవుతోన్న బిగ్బాస్ దివి..జిమ్లో హనీ రోజ్ కసరత్తులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
ఎల్లో డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ.. హాంకాంగ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్..!
ఎల్లో డ్రెస్లో బాలీవుడ్ భామ అవనీత్ కౌర్..అమ్మ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న నిత్యా మీనన్..ఐటమ్ సాంగ్ లుక్లో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ..హీరోయిన్ కృతి కర్బందా గ్లామరస్ పిక్స్..హాంకాంగ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్.. వేకేషన్లో చిల్ అవుతోన్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు!
బీఎండబ్ల్యూ (BMW) వంటి దిగ్గజ సంస్థలో 19 ఏళ్ల యువతి డిగ్రీ లేకుండానే ఉద్యోగం సాధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ రోల్ సాధించాలంటే కనీసం డిగ్రీతో పాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. కానీ, గౌరీ ఎమ్ అనే 19 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ ఎలాంటి ఫార్మల్ డిగ్రీ లేకుండానే, డిజిటల్ స్పేస్లో ఆమెకున్న పర్సనల్ బ్రాండింగ్ పవర్ కారణంగా ఆ సంస్థలో పర్సనల్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.ఎలాంటి డిగ్రీ లేకుండానే ప్రపంచంలోనే ప్రీమియం కార్లు, మోటార్సైకిళ్లను ప్రతిష్టాత్మక కంపెనీ బీఎండబ్ల్యూలో ఉద్యోగం సంపాదించిందంటూ ఒక లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్ అవుతోంది. అకడమిక్ అర్హతలతో సంబంధం లేకుండా, కేవలం బలమైన వ్యక్తిగత బ్రాండ్ను, సోషల్ మీడియా ఉనికి ద్వారా కంటెంట్ క్రియేటర్ గౌరీ ఎం పూర్తికాల పర్సనల్ మార్కెటింగ్ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. వివిధ ప్లాట్ఫామ్లలో గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా లింక్డ్ఇన్లో 65,000 మందికి పైగా, ఇన్స్టాగ్రామ్లో 35 వేల మందికి పైగా ఉన్నారని ఆ పోస్ట్ ద్వారా తెలుస్తోంది.పైగా ఆమె ఏ కంపెనీకి దరఖాస్తు చేసుకోలేదు, కనీసం కోల్డ్ ఈమెయిల్స్ కూడా పంపలేదు. ఆమె కంటెంట్ చూసి కంపెనీ ప్రతినిధులే స్వయంగా ఆమెను సంప్రదించడం విశేషం."నేను కేవలం 19 ఏళ్ల అమ్మాయిని, నాకున్న వనరులతో ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రపంచ స్థాయి కార్ల తయారీ సంస్థ నన్ను గుర్తించి ఉద్యోగం ఆఫర్ చేయడం నమ్మలేకపోతున్నాను" అని ఆమె లింక్డ్ఇన్లో పోస్ట్లో వెల్లడించింది.నెటిజన్ల స్పందన ఈ విషయంలో నెటిజన్లు రెండు రకాలుగా స్పందించారు. ప్రస్తుతకాలంలో కేవలం డిగ్రీల కంటే నైపుణ్యం (Skills) , పర్సనల్ బ్రాండింగ్ ముఖ్యమని, సోషల్ మీడియాను కెరీర్ ఎదుగుదలకు ఎలా వాడుకోవాలో గౌరీ నిరూపించిందని కొందరు ప్రశంసించారు. మరోవైపు ఇలాంటివి అరుదుగా జరుగుతాయి, అన్ని రంగాల్లో డిగ్రీ లేకుండా ఉద్యోగాలు రావడం సాధ్యం కాదు అంటూ ఉద్యోగార్థులను హెచ్చరించారు. సంప్రదాయ విద్యా విధానం ప్రాముఖ్యతను తక్కువ చేయకూడదని సూచించడం గమనార్హం.ఇదీ చదవండి: షార్ట్కట్ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధి -
రాజకీయాల్లోకి తమిళ్ రౌడీ.. ఆకులు నములుతూ వింత ప్రచారం
-
‘ఎప్పుడైనా పొమ్మంటారు’.. టెక్కీ కన్నీరు!
న్యూఢిల్లీ: ‘ఉద్యోగమే ప్రాణంగా భావించి, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యం.. సెలవులు కూడా తీసుకోకుండా అహర్నిశలు శ్రమించినా.. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థ కూడా తనను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలో నుంచి తీసేసిందని’ ఒక టెక్కీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ భద్రత అస్సలు లేదని, ఏ క్షణంలోనైనా కంపెనీలు మనల్ని సాగనంపొచ్చని యువతకు ఆయన రియాలిటీ చెక్ ఇస్తున్నారు.జేసన్ జాంగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత నెలలో గూగుల్ చేపట్టిన లేఆఫ్స్లో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పటినుంచి ఫేస్ చేస్తున్న తన నిరుద్యోగ జీవితాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో పంచుకుంటున్నారు. ‘నేను ఎప్పుడూ నా పనికే మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. మరింత కష్టపడితే, రోజులో ఎక్కువ గంటలు పనిచేస్తే, నా వెకేషన్స్ వాయిదా వేసుకుంటే.. నా శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుందని బలంగా నమ్మాను. కానీ, ఇవేవీ నా ఉద్యోగాన్ని కాపాడలేకపోయాయి’ అని జాంగ్ తన తాజా వీడియోలో వాపోయాడు. రాత్రులు, వీకెండ్స్ అని తేడా లేకుండా తన జీవితమంతా ఆఫీస్ పనులకే పరిమితమయ్యానని గుర్తుచేసుకున్నాడు.ప్రాణం పెట్టి పనిచేస్తే ఉద్యోగం ఊడదన్నది ఒక భ్రమ మాత్రమేనని జాంగ్ స్పష్టం చేశాడు. తనతో పాటు పనిచేసిన ఎంతో మంది ప్రతిభావంతులైన ఉద్యోగులు కూడా ఇలాగే ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ‘కంపెనీలు ఎప్పుడైనా మిమ్మల్ని వదిలించుకోగలవు.. కార్పొరేట్ రంగంలో ఇదే ఇప్పుడు కొత్త సాధారణంగా మారిపోయింది" అని పేర్కొన్నారు. ఈ చేదు అనుభవం తర్వాత, తాను ఏదో ఒకటి సొంతంగా చేయాలని ఆలోచన చేస్తున్నట్లు జాంగ్ తెలిపాడు.నెటిజన్ల రియాక్షన్..జాంగ్ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ‘మనం ఎప్పుడూ ఇతరుల కోసమే కష్టపడతాం కానీ, మన కోసం పనిచేయం. ముందు మీ ఆరోగ్యానికి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు లేకపోయినా కంపెనీలో పనులు ఆగవు, కానీ మీ జీవితం ఆగిపోతుంది’ అని ఒకరు విలువైన సలహా ఇచ్చారు. చేస్తున్న ఉద్యోగంతో పాటే ఇతర అవకాశాలు, సైడ్ బిజినెస్ కూడా వెతుక్కోవాలని మరొకరు సూచించారు. 25 ఏళ్లకే తాను కూడా ఇలాగే ఉద్యోగం కోల్పోయి ఏడు నెలలు తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లినట్లు ఒక యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. జాంగ్కు భవిష్యత్తులో మంచి వాతావరణం ఉన్న ఉద్యోగం దొరకాలని ఆకాంక్షించారు.ఇది కూడా చదవండి: వార్నీ.. వేలికి సిరా ఉంటే చాలు.. ఆఫర్లే ఆఫర్లు! -
ట్రంప్పై మీమ్ల వర్షం
టెహ్రాన్: ఇరాన్ సేనలు రణక్షేత్రంలో అమెరికా సైనికులతో తలపడుతుంటే ఇరాన్ దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెటకారపు మాటలతో ట్రంప్ను చీల్చి చెండాడుతున్నాయి. వెక్కిరింతలతో, మీమ్స్తో ట్రంప్పై విరుచుకుపడుతున్నాయి. దీంతో నెటిజన్లకు నవ్వుకోవడానికి భారీ సరుకే దొరికింది. ‘ఎక్స్’ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో ఇప్పుడీ మీమ్స్ తెగ షేర్ అవుతున్నాయి. వేల కోట్ల రూపాయల యుద్ధ విమానాలు, సరకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు కుప్పకూలినా ట్రంప్ ఇంకా తామే గెలిచామనడంపై పశ్చిమఆఫ్రికాలోని సియారాలియోన్ దేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక వెటకారపు ట్వీట్ పెట్టింది. దాంట్లో బాంబుల ధాటికి సూటు చిరిగిపోయి, దెబ్బలు తగిలి, జుట్టు చెదిరిపోయినా ట్రంప్ ‘మేమే గెలిచాం’అని గట్టిగా అరుస్తున్నట్లు ఒక ఏఐ ఫొటోను పెట్టి ‘‘అవును సర్. అంతా తగలబడినా మీరే గెలిచారు. ఇకనైనా ప్రశాంతంగా ఉండండి’’అనే క్యాప్షన్ను ఎంబసీ జతచేసింది. హార్మూజ్ను తెరవండి వెధవల్లారా అని ట్రంప్ తిట్టగా ‘అసలు అది మూసేయలేదుగా. మా నౌకలు హార్మూజ్ను ఇప్పుడే దాటేశాయిగా’’అని చైనా అన్నట్లు దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ మరో ట్వీట్ పెట్టింది. జలసంధిని తెరవాలని ట్రంప్ ఆదేశించగా తాళం చెవులు ఎక్కడో మరచిపోయామని మరో ట్వీట్ పెట్టారు. సొంత మాధ్యమం ‘ట్రూత్సోషల్’లో ట్రంప్ కొద్దిసేపు పోస్ట్లుపెట్టకపోతే ‘‘సార్. ఏదో ఒకటి మాట్లాడండి. ఏదో ఒకటి పోస్ట్ చేయండి. లేదంటే మాకు మహా బోర్ కొడుతోంది’’అని జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ మరో ట్వీట్తో నవ్వించింది. -
వైట్ డ్రెస్లో చిన్నపిల్లలా బిగ్బాస్ దివి.. పింక్ శారీలో మెగా కోడలు..!
రిసార్ట్లో చిల్ అవుతోన్న శాన్వీ మేఘన..పింక్ శారీలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి..వైట్ డ్రెస్లో చిన్నపిల్లలా బిగ్బాస్ దివి పోజులు..నయనతార బ్లాక్ అండ్ వైట్ లుక్స్..పల్లిచట్టంబి ప్రమోషన్స్లో బిజీగా కయాదు లోహర్.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
రీల్ కూడా వార్తే..
వార్తలు, రాజకీయ సంబంధ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారా? రానున్న రోజుల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఐటీ నిబంధనలు–2021కి కేంద్ర ఎల్రక్టానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కొన్ని సవరణలను ప్రతిపాదించింది. ఇవి కార్యరూపంలోకి వస్తే యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ప్రచురణకర్తలుగా పరిగణిస్తారు. అంటే వారు పోస్ట్ చేసే ప్రతి విషయంపై ప్రభుత్వ నిఘా, బాధ్యత పెరుగుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్క్రియేటర్లూ జాగ్రత్త..వార్తలు, రాజకీయ సంబంధ పోస్టులను పంచుకునే యూట్యూ బర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను ఇప్పటివరకు ప్రభుత్వం వార్తా సంస్థలుగా గుర్తించలేదు. దీనివల్ల టీవీ చానెళ్లకు ఉండే కఠిన నిబంధనలు వీరికి ఉండేవి కావు. ప్రతిపాదిత కొత్త సవరణల ప్రకారం ఏదైనా కంటెంట్ను ‘తప్పు’అని ప్రభుత్వం భావిస్తే.. దాన్ని వెంటనే తొలగించే అధికారం ప్రభుత్వానికి పెరుగుతుంది. అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు క్రియేటర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమిటీ కొత్త ప్రతిపాదన? సమాచార సాంకేతికత (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) రెండో సవరణ నిబంధనలు–2026 కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై ఏప్రిల్ 14 వరకు ప్రజల అభిప్రాయాలను కోరింది. సురక్షితమైన ఇంటర్నెట్ను నిర్మించడమే దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతుండగా.. విమర్శకులు మాత్రం ఇది సామాన్యుల డిజిటల్ వాక్ స్వాతంత్య్రంపై ప్రభుత్వానికి అపరిమితమైన కొత్త అధికారాలను కట్టబెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఈ ముసాయిదా నిబంధనలను డిజిటల్ నియంతృత్వంగా అభివర్ణించింది. పరిధిలోకి ఎవరు వస్తారు? ఈ సవరణలు యూట్యూబర్లు, ఇన్స్ట్రాగామ్ రీల్స్ క్రియేటర్లు, ‘ఎక్స్’యూజర్లు, ఇన్ఫ్లుయెన్సర్లతో సహా ప్రైవేట్ వ్యక్తులు పోస్ట్ చేసే వార్తలు, రాజకీయ అభిప్రాయాలతో కూడిన కంటెంట్ ఐటీ నిబంధనలలోని ‘పార్ట్–3’పరిధిలోకి వస్తాయి. గతంలో వృత్తిపరమైన మీడియా సంస్థలకు మాత్రమే పరిమితమైన మూడంచెల పర్యవేక్షణ విధానం ఇకపై వీరికి కూడా వర్తిస్తుంది.కొత్త నిబంధన ఏమిటి? ప్రభుత్వం జారీ చేసే లిఖితపూర్వక వివరణలు, సలహాలు, ఉత్తర్వులు, మార్గదర్శకాలను సోషల్ మీడియా సంస్థలు కచ్చితంగా పాటించాలి. ఏదైనా ప్లాట్ఫాం నిరాకరిస్తే వాటికి ఉన్న ‘సేఫ్ హార్బర్’రక్షణను ప్రభుత్వం రద్దు చేస్తుంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఎవరో ఒకరు తప్పుడు పోస్ట్ పెడితే దానికి ఆ సంస్థను బాధ్యులను చేయకూడదనేది సేఫ్ హార్బర్ నిబంధన ఉద్ధేశం. ఈ రక్షణ పోతే యూజర్లు చేసే ప్రతి తప్పుకు లేదా పెట్టే ప్రతి వివాదాస్పద పోస్ట్కు సదరు కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనివల్ల కోర్టు కేసులు, భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత సమయంలో తొలగించాలి? నోటీసు అందిన 2–3 గంటల్లో ప్లాట్ఫాంలు సదరు కంటెంట్ను తొలగించాల్సి ఉంటుంది. 2021 నిబంధనల ప్రకారం గతంలో ఉన్న 24–36 గంటల సమయ పరిమితితో పోలిస్తే ఇది చాలా పెద్ద మార్పు.విస్తృత చర్యల్లో భాగమా? ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం డీప్ఫేక్స్, ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్పై కొన్ని నిబంధనలు తెచ్చింది. దీని ప్రకారం అలాంటి కంటెంట్ ఏఐతో రూపుదిద్దుకుందని లేబుల్ వేయడం, ఫిర్యాదు వచ్చిన వెంటనే త్వరగా తొలగించడం తప్పనిసరి చేశారు. ఇప్పుడు వస్తున్న కొత్త ఐటీ ప్రతిపాదన దీనికి తదుపరి దశ. ఆన్లైన్లో ప్రజలు మాట్లాడే లేదా పెట్టే పోస్టులపై ప్రభుత్వ పర్యవేక్షణను మరింత పటిష్టం చేయడం దీని ప్రధాన లక్ష్యం. -
షాకిచ్చిన ఒరాకిల్ : గూగుల్లోని ఈ పాలసీ తెలుసా?
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్ ప్రకటించిన భారీ లేఆఫ్స్ టెక్ ప్రపంచం ప్రకంపనలు రేపాయి. రేపటినుంచి మీ సేవలు అవసరం లేదు అంటూ కేవలం తెల్లవారుజామున 6 గంటలకు పంపిన ఒకే ఒక్క ఈమెయిల్ టెకీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఆందోళన ఇలా ఉండగానే మరో భిన్నమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే..ఒకవైపు ఒరాకిల్ 30వేలమంది ఉద్యోగుల తీసివేత ప్లాన్లతో షాక్ ఇవ్వగా, మరోవైపు గూగుల్ తన ఉద్యోగుల కుటుంబాలకు అందించే 'మరణానంతర ప్రయోజనాల' వివరాలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.ఒకవైపు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, గూగుల్ 'డెత్ బెనిఫిట్స్' విశేషంగా నిలిచాయి. వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం గూగుల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబానికి భారీ ప్రయోజనాలు అందిస్తోంది.గూగుల్ 'డెత్ బెనిఫిట్స్' మరణించిన ఉద్యోగి భాగస్వామికి (Spouse) 10 ఏళ్ల పాటు సగం జీతాన్ని గూగుల్ చెల్లిస్తుంది. అలాగే స్టాక్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఉద్యోగికి రావాల్సిన అన్-వెస్టెడ్ స్టాక్స్ (Unvested Stocks) అన్నీ తక్షణమే కుటుంబానికి అందుతాయి.దీంతోపాటు పిల్లలకు 19 ఏళ్ల వయస్సు వచ్చే వరకు (ఒకవేళ ఫుల్ టైమ్ స్టూడెంట్ అయితే 23 ఏళ్ల వరకు) ప్రతి నెల 1,000 డాలర్లు (సుమారు రూ. 83,000) అందుతాయి. సర్వీస్తో సంబంధం లేకుండా అంటే ఉద్యోగి ఎంత కాలం పనిచేశారనే దానితో సంబంధం లేకుండా కొత్తగా చేరిన వారికైనా, పదేళ్ల అనుభవం ఉన్న వారికైనా ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!ఈ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!మరోవైపు ఈ ప్రయోజనాలపై ఒక సీనియర్ ఇంజనీర్ ఉదాహరణను నెటిజన్లు విశ్లేషించారు. గూగుల్ పాలసీ ప్రకారం, ఒక సీనియర్ ఇంజనీర్ మరణిస్తే ఆ కుటుంబానికి 15 కోట్లకు పైగా అందుతాయి. 2012లో గూగుల్ HP మాజీ చీఫ్ లాస్లో బాక్ రూపొందించిన ఈ విధానం రూపొందించారనీ ఉద్యోగి కుటుంబ భద్రత సంస్థ బాధ్యత అని గూగుల్ నమ్ముతుందని ఆయన వ్యాఖ్యానించారు.10 ఏళ్లలో సుమారు 925,000 డాలర్ల జీతం.లైఫ్ ఇన్సూరెన్స్ కింద 555,000డాలర్లుస్టాక్స్ రూపంలో డాలర్లు 350,000.పిల్లలకు నెలకు వెయ్యి డాలర్లు.మొత్తంగా చూస్తే వెస్టెడ్ స్టాక్స్ కాకుండానే దాదాపు రూ. 15.5 కోట్లు కంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.నెటిజన్ల స్పందన"మా మేనేజర్ శనివారం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తేనే ఏదో కొండను తవ్వి తెచ్చినట్లు ఫీల్ అవుతారు. కానీ గూగుల్ తన ఉద్యోగి లేకపోయినా వారి కుటుంబాన్ని కాపాడుతోంది. ఇది కదా లైఫ్ గోల్స్ అనాల్సింది!" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. నిజంగా గ్రేట్ ఇది.. దీని విలువను లెక్కగట్టేంత వరకు దీన్ని గ్రహించలేరు అని ఒకరు, కంపెనీలు ఈ విధంగా ఇంత దీర్ఘకాలికంగా ఆలోచించడం చాలా అరుదు.” అని మరొకరు పేర్కొన్నారు.ఇదీ చదవండి: వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో చరిత్ర : ఎవరీ రినీ సంపత్? -
జగన్ MAVIGUNపై TDP ట్రోల్స్.. ఇచ్చిపడేసిన KS ప్రసాద్
-
సోలో లైఫ్.. సోషల్ మీడియా
ఉదయం లేస్తూనే సోషల్మీడియా వాకిట్లో పక్షుల్లా వాలిపోతుంటారు. రీల్స్, రివైవల్, కబుర్లు, మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు.. వయసు తేడా లేకుండా ఆన్లైన్ వేదికగానే ఎన్నో విశేషాలను పంచుకుంటూ, పెంచుకుంటూ ఉంటారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా డంప్ అయ్యే ఎన్నో మానసిక సమస్యలనూ నెత్తిన మోస్తున్నారు. ‘ప్రపంచం అంతా ‘పర్ఫెక్ట్’గా ఉందన్న భ్రమతో తమను తాను హింసించుకునేవారి శాతం ఇటీవల పెరుగుతోంది..’ అంటున్నారు నిపుణులు.వైజాగ్ వాసి పదిహేడేళ్ల అనన్య భోజనం తినడం తగ్గించడం మొదలుపెట్టింది. ఈ సమస్య ఎంతగా అంటే ఒకరోజు ఆమెను బలవంతంగా హాస్పిటల్లో చేర్చి, సెలైన్ పెట్టించాల్సి వచ్చింది. సోషల్ మీడియా ప్రభావంతో ఆమె తన శరీరం గురించి ఎక్కువగా ఆలోచిస్తుండేది. తినమని తల్లి ఒత్తిడి చేస్తే ‘లైక్స్ రావడం లేదంటే అర్థం, నేను బాగా లేనట్టేగా..’ అని గట్టిగట్టిగా అరుస్తోంది.. అని అనన్య తల్లి ఆవేదన చెందుతోంది.. ∙∙ ఉద్యోగంలో బిజీగా ఉండే మాధవి రిలాక్స్ కావడానికి సోషల్మీడియా ఒక మార్గంగా మారింది. మొదట్లో ఫ్రెండ్స్తో కనెక్ట్ అవడానికి ఆ తర్వాత ఫొటోలు షేర్ చేసేది. ఆ పోస్టులకు లైక్స్, కామెంట్స్ పెరుగుతుండటంతో తరచు చెక్ చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. ఒకట్రెండుసార్లు ఆమె పెట్టిన ఫొటోకు తక్కువ లైక్స్ రావడంతో నిరాశ మొదలైంది. ‘అందరూ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకో’ అనుకోవడం మొదలుపెట్టింది. ఇతరుల ఫొటోలు చూసి, తనను తాను పోల్చుకుంటుంది. ‘వారితో పోల్చితే, అంత అందంగా లేను. అందుకే లైక్స్ రావడం లేదు’ అనే భావన పెరిగింది. పనిమీద దృష్టి తగ్గింది. దీంతో ఆందోళన పెరగడం, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు మొదలయ్యాయి. కనిపించని ఒత్తిడులుఇప్పటికాలంలో సోషల్ మీడియా మహిళల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ అదే సమయంలో ఇది మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. బయటికి కనిపించేది ఫొటోలు, వీడియోలు, లైక్స్, కామెంట్స్ మాత్రమే. కానీ అంతరంగంలో జరిగే మానసిక ఒత్తిడి వేరుగా ఉంటోంది. అందం, ఆనందం, ఆర్థిక విషయాలు, తన చుట్టూ ఏమీ బాగోలేదనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.ప్రధాన సమస్యలుఇతరులతో పోల్చుకోవడం. ఇతరులు అందంగా, ఆనందంగా ఉన్న ఫొటోలు, రీల్స్.. చూసి వారి జీవితం వడ్డించిన విస్తరి అనే భావనకు లోనవుతున్నారు. అదే సమయంలో తమ జీవితం ఎంత నిస్సారంగా ఉందో అంచనా వేసుకుంటున్నారు. దీంతో మిగతావారికంటే తమ జీవితం చాలా తక్కువ అనే భావనకు లోనవుతున్నారు. → ఫొటోలు, వీడియోలకు వాడే ఫిల్టర్లు, ఎడిటింగ్, ఏఐ.. వంటి వాటి వల్ల అంచనాలు పెరుగుతున్నాయి. నిజానిజాలు అర్ధం చేసుకోలేకపోతున్నారు.→ తమపై తమకు ఆత్మవిశ్వాసం లోపిస్తోంది. కుటుంబంపైనా ఈ ప్రభావం పడుతోంది.→ లైక్స్, కామెంట్స్ ద్వారా ఆనందం పొందడం అలవాటై, తక్కువ రెస్పాన్స్ వస్తే ‘బాధ’కు లోనవుతున్నారు. → ట్రోలింగ్, నెగటివ్ కామెంట్స్ వల్ల డిప్రెషన్, భయాందోళనకు లోనవుతున్నారు. → ఇతరుల ఆనందం చూసి ‘నేను ఏదో మిస్ అవుతున్నాను’ అనుకుంటున్నారు. → అతి ఎక్కువగా స్క్రీన్ టైమ్లో గడపడం వల్ల మానసిక అలసటకు లోనవుతున్నారు. → సోషల్ మీడియా అంటే రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. సరైన విధంగా వాడితే సమాచారం, ప్రపంచంతో కనెక్టివిటీ ఇస్తుంది. కానీ నియంత్రణ లేకుండా వాడితే మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.నియంత్రణ తప్పనిసరి→ రోజుకు ఒక పరిమితి పెట్టుకోవాలి.→ సోషల్ మీడియాలో కనిపించేది పూర్తి నిజం కాదని గుర్తుంచుకోవాలి.→ వారానికి ఒక రోజు సోషల్ మీడియా నుంచి పూర్తి బ్రేక్ తీసుకోవడం మంచిది.→ ప్రేరణ, ఉత్సాహం, అవగాహన కలిగించే కంటెంట్ను ఫాలో అవడం మంచిది. → మన విలువలను లైక్స్తో కాకుండా మనసుతో కొలవాలి. కుటుంబం, స్నేహితులతో రోజువారీ అంశాలపై చర్చ, మాట్లాడం.. వంటివి చేస్తుంటే సోషల్ మీడియా ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు. సోషల్ మీడియా అనేది ఒక వర్చువల్ ప్రపంచం. అక్కడ మనం చూస్తున్నది పూర్తినిజం కాదు. కానీ, మన మెదడు దాన్ని నిజం అనేలా స్వీకరిస్తుంది. అదే సమస్యకు మూలం అవుతుంది. పాజిటివ్గా వచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల మన బ్రెయిన్లో డోపమైన్ అనే ‘ఫీల్గుడ్’ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఫోన్ను పదే పదే చెక్ చేయడం, సోషల్ మీడియా లేకపోతే అసహనం, నిద్రలేమి, పనిమీద దృష్టి తగ్గడం.. వంటి సమస్యలన్నీ తలెత్తుతాయి. రోజులో కొంత సమయమే సోషల్ మీడియా ఉపయోగించడం, అభి రుచులు, వ్యాయామం, కుటుంబంతో సరైన టైమ్ గడపడం వంటివాటి వైపు మనసును మళ్లించగలిగితే సరైన జీవన ఆనందాన్ని పొందగలరు. సమస్యను నియంత్రించుకోలేకపోతే నిపుణులను సంప్రదించి, వారి సూచనలు పాటించడం మేలు చేస్తుంది.– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్ -
ఆమెకు 55, అతడికి 25 : రూ 60 కోట్లు, లగ్జరీకార్లు
చైనాకు చెందిన వ్యాపారవేత్త యు వెన్హాంగ్ (Yu Wenhong), తనకంటే 30 ఏళ్లు చిన్నవాడైన 25 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు సుమారు రూ. 60 కోట్ల కట్నం, విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిన వైనం పెళ్లి కాని ప్రసాదులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనా మెడికల్ ఈస్తటిక్స్ రంగంలో ప్రముఖురాలైన యు వెన్హాంగ్ (55), 25 ఏళ్ల లియు యుచెన్ (Liu Yuchen) అలియాస్ రెన్రెన్ను వివాహం చేసుకుంది. యు, యుచెన్ (రెన్రెన్) ఈ మార్చిలో పెళ్లాడింది. పెళ్లి సందర్భంగా తన భర్తకు సుమారు 50 మిలియన్ యువాన్ల (సుమారు రూ.60 కోట్లు) విలువైన నగదు, విలాసవంతమైన ఇళ్లు, రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిందట.(పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్)ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరడంతో వీరి ప్రేమ చర్చల్లో నిలిచింది. మరోవైపు లియు యుచెన్ తమ సంబంధం గురించి మాట్లాడుతూ, ఇంత విలాసవంతమైన జీవితాన్ని తాను ఊహించలేదని, కానీ ఆమె ప్రేమను, వచ్చిన అవకాశాన్ని ఉప యోగించుకున్నానని భర్త లియు యుచెన్ పేర్కొనడం గమనార్హం. కాగా యుకు గతంలోనూ వివాహాలు అయ్యాయి. అలాగే ఒక విదేశీ మోడల్ అల్బేనియన్ మోడల్ Rolando Lekajతో పదేళ్ల రిలేషన్షిప్లో ఉంది. వీరికి ఒక బిడ్డ కూడా.ఇదీ చదవండి : రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!వీరిద్దరి పరిచయం ఎలా2025లో లైవ్ స్ట్రీమింగ్లో వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమైనారు. ఈ పరిచయం వారిని మరింత దగ్గర చేసింది. ఆ తరువాత యు అతనికి రోల్స్-రాయ్స్, మెర్సిడెస్-బెంజ్ మోడళ్ల వంటి ప్రీమియం కార్లతో సహా అత్యంత ఖరీదైన విలాసవంతమైన వస్తువులను బహుమతిగా ఇచ్చిందని చెబుతున్నారు.నెటిజన్లు స్సందన మల్టీ మిలియన్ డాలర్ల డౌరీ కథ చైనీస్ సోషల్ మీడియా అంతటా మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొంతమంది వినియోగ దారులు యు విజయాన్ని, ఆర్థికంగా ఎదిగిన తీరును అభినందిస్తుండగా, ఈ ఉదంతం చైనాలో మారుతున్న సామాజిక విలువలు, సంపద, స్త్రీ-పురుష సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది.యు వెన్హాంగ్ సక్సెస్ స్టోరీసామాన్య కుటుంబంనుంచి వ్యాపారవేత్తగా యు ఎదిగిన తీరు అసామాన్యం. ఈశాన్య చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్లోని డాలియన్లో ఒక సాధారణ ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. తండ్రి మరణం తర్వాత 18 ఏళ్లకే కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో ఐబ్రో టాటూ టెక్నీషియన్గా కెరీర్ ప్రారంభించి, పట్టుదలతో 2004లో హాంగ్కాంగ్లో 'యంగ్ మెర్రీ రియల్ ఇంటర్నేషనల్ గ్రూప్'ను స్థాపించింది. ఆమె తనను తాను 'సెల్ఫ్ మేడ్' మహిళగా ప్రొజెక్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వ్యాపారం చైనా వ్యాప్తంగా వందలాది బ్రాంచ్లతో విస్తరించింది.వ్యాపార వివాదాలు : ఆమె కంపెనీకి చెందిన కొన్ని కాస్మెటిక్ చికిత్సల శాస్త్రీయతపై గతంలో విమర్శలు వచ్చాయి. అలాగే, 2022లో వందల కోట్ల పన్ను ఎగవేత కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. -
శారీలో నభా నటేశ్ అందాలు.. ఎల్లో డ్రెస్లో పాయల్ రాజ్పుత్..!
ఎల్లో డ్రెస్లో పాయల్ రాజ్పుత్ అందాలు..ఏఐ పిక్స్ షేర్ చేసిన రేణు దేశాయ్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గ్లామరస్ పిక్స్..శారీలో మత్తెక్కిస్తోన్న హీరోయిన్ నభా నటేశ్ అందాలు.. మార్చి జ్ఞాపకాల్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి.. View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
లక్ష రూపాయలా? నా కొద్దు బాబూ : ఇంట్రస్టింగ్ స్టోరీ
కనిపెంచిన తల్లిదండ్రులకు బిడ్డలు ఖరీదైన బహుమతులు అందించడం చాలా కామన్. ఎదిగిన బిడ్డలు ఎంతో ప్రేమగా ఇచ్చిన కానుకను చూసి మురిసిపోవడం ఇంకా కామన్. అయితే తల్లికి ఖరీదైన అందమైన గిష్ట్ ఇచ్చిన కొడుకు ఆ తరువాత తల్లిని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాడు. దీనికి సంబంధింన వివరాలను సోషల్మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది. స్టోరీ ఏంటంటే..వేదిక్క్రాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సాహిల్ రాజ్ కుమార్ తన తల్లికి లక్ష రూపాయల బహుమతి కొన్నాడు. కానీ దాన్నితల్లి తీసుకునేందుకు చాలా ష్టపడాల్సి వచ్చింది. దాదాపు అరగంటపాటు ఆమెకు నచ్చచెప్పి ఒప్పించారు.. ఊహించిన దానికంటే తాను చాలా ఎక్కువ సంపాదిస్తానమ్మా.. డోంట్ వర్రీ అంటూ ఆమెను ఒప్పించారు. ఆమెకు 1,200 డాలర్ల (సుమారు 1,00,500 రూపాయలు) విలువైన కళ్లజోడును కొనిచ్చిన హృద్యమైన కథను ఎక్స్లో షేర్ చేశారు. ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, సాహిల్ దానిని "చాలా హృద్యమైన రోజు"గా అభివర్ణించారు.సోషల్ మీడియాలో పంచుకున్న ఒక హృద్యమైన కథ ఆన్లైన్లో వేలాది మంది నెటిజనులను ఆకర్షించింది. తన తల్లి షాపింగ్ చేస్తుండగా అనుకోకుండా చేసిన వీడియో కాల్ అనంతరం, ఆమెకు లక్ష రూపాయల విలువైన డిజైనర్ కళ్లజోడును ఎలా బహుమతిగా ఇచ్చాడో వెల్లడించారు. తాను ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ, తన కోసం విలాస వస్తువులపై అరుదుగా ఖర్చు చేసే తన తల్లి, ఒక దుకాణంలో కళ్లద్దాలు చూస్తుండగా, వాటిలో కొన్నింటిని చూపించడానికి తనకు వీడియో కాల్ చేసిందని గుర్తుచేసుకున్నాడు. అయితే తనకు బాగా నచ్చిన కళ్లజోడు విలువ ఎక్కువ ఉండటంతో , దాన్ని కొనే ఆలోచనను ఆమె వెంటనే విరమించుకుంది. దీంతో కొడుకు కుమార్ కల్పించుకుని, ఆ డబ్బు తానే చెల్లిస్తానని చెప్పాడు, కానీ అతని తల్లికి నమ్మకం కుదరలేదు. అతను నెలకు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు, సంపాదిస్తూ, పొదుపు చేసినప్పుడే అలాంటి బహుమతిని అంగీకరిస్తానని ఆమె చెప్పింది. అలా కుమార్ ఆమెను 30 నిమిషాలు వాదించి ఒప్పించి, చివరకు ఆమె అతన్ని నమ్మిన తర్వాత, కళ్లద్దాలు కొనడానికి అంగీకరించింది. ఇదీ చదవండి : బెంగళూరులో మహిళా టెకీ విషాదాంతంఇది సోషల్ మీడియా వినియోగదారులను ఆకర్షించింది. కుమారుడిపై ప్రశంసలు కురిపించారు. సగటు భారతీయ కుటుంబాల్లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలని వ్యాఖ్యానించారు. పిల్లలు తమ జీవితంలో బాగా రాణిస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా వారి నుండి ఆర్థిక సహాయం స్వీకరించడానికి తల్లిదండ్రులు ఇష్టపడరని పేర్కొన్నారు.ఇదీ చదవండి : రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి -
సమంత మెచ్చిన ఇన్స్టా రీల్.. ఆమె టాలెంట్కు ఫిదా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. మనం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే చాలు.. అది క్షణాల్లోనే వైరలైపోతుంది. ఇప్పుడున్న జమానాలో ఇన్స్టా రీల్స్లో మునిగిపోతున్నారు జనాలు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూసేస్తున్నారు. కేవలం చూడడమే కాదు.. తమ క్రియేటివిటీని అంతా బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టా ప్రపంచం పచ్చని పల్లె ప్రజల టాలెంట్ను కూడా అందరికీ పరిచయం చేస్తోంది.తాజాగా ఓ మహిళ టైలర్ చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లుగా చేసిన ఈ రీల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల సమంత-యాంకర్ సుమ ఉగాది సందర్భంగా చేసిన వీడియోను సింక్ చేస్తూ ఆ మహిళ టైలర్ చేసిన ప్రమోషన్ నెట్టింట వైరల్గా మారింది. ఆమె హీరోయిన్తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ మహిళ క్రియేటివిటీని మెచ్చుకుంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ సమంత సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. సమంతను మెప్పించిన రీల్సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి… pic.twitter.com/xMtp5jsGXs— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026 -
‘రండి బాబూ రండి.. 50 రూపాయలకే స్వచ్ఛమైన గాలి’
న్యూఢిల్లీ: మనం తాగే మంచి నీటిని బాటిళ్లలో కొనుక్కోవడం మనకు అలవాటే.. అయితే పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని కూడా సీసాల్లో కొనుక్కునే రోజులు వచ్చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో ఒక వ్యక్తి ‘స్వచ్ఛమైన గాలి’ని విక్రయిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కన్నౌట్ ప్లేస్లో కనిపించిన ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ధర్మశాల నుంచి ‘ప్యూర్ ఎయిర్’..హిమాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతమైన ధర్మశాల నుంచి స్వచ్ఛమైన గాలిని ప్లాస్టిక్ సీసాల్లో నింపి తీసుకొచ్చినట్లు గాలి విక్రయదారు చెబుతున్నాడు. అతను ఒక్కో బాటిల్ ధర రూ. 50 గా నిర్ణయించాడు. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ వాసులు ఈ ‘స్వచ్ఛమైన గాలి’ అనుభవం కోసం క్యూ కడుతున్నారు. ఆ బాటిళ్లు కొనుక్కుని పీలుస్తూ ‘నిజంగానే ఢిల్లీ గాలికంటే ఇది చాలా భిన్నంగా, హాయిగా ఉంది’ అని కొనుగోలుదారులు అభిప్రాయపడటం గమనార్హం. This guy sold “air” from Dharamshala for ₹50 to people in Delhi, and those buying it actually said it felt different from Delhi’s air. What looks like a random video today could turn into a real business and a harsh reality in the coming years, the bigger concern is whether even… pic.twitter.com/MS2nDwzj5A— Nikhil saini (@iNikhilsaini) March 31, 2026విషపూరితమైన గాలికి నిదర్శనంఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. మంగళవారం నాటి లెక్కల ప్రకారం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 171 గా నమోదైంది. ఇది ‘పేలవమైన’ కేటగిరీ కిందకు వస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలు, వీచిన గాలులు కాలుష్యాన్ని కొంత మేర తగ్గించినప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు.ముంచుకొస్తున్న ముప్పు?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ రోజు ఇది ఒక ఫన్నీ వీడియోలా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో గాలిని ఇలాగే కొనుక్కోవాల్సి రావడం ఒక చేదు నిజం కాబోతోంది’ అని ఒక యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఇది ఒక వింత వ్యాపారంగా కనిపిస్తున్నా, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే రేపు అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్డీఏ అంజలి’ -
పాతికేళ్లకే కుంగుబాటు!!
ఆమె శరీరానికి జ్వరం వస్తేనే ఇంట్లో సరిగా పట్టించుకోరు. ఇక మనసుకు జ్వరం వస్తే? మన దేశంలో స్త్రీల మానసిక సమస్యలను గుర్తించడం, వైద్యం చేయించడం చాలా తక్కువ. తల్లి, భార్య, చెల్లెలు, అక్క, కుమార్తె... వీరి మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలుసుకునేలోపు మానసిక సమస్యలు ముదిరిపోయి ఉంటాయి. అనేక వొత్తిళ్లు, పరిమితులు స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. వాటి పట్ల అవగాహనే సగం వైద్యం. ఇంటిల్లిపాది తెలుసుకోవాల్సిన వరుస కథనాలు నేటి నుంచి...హాస్పిటల్స్లో సైకియాట్రీ, సైకాలజీ విభాగాల్లోని వెయిటింగ్ రూమ్స్లోకి చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఎందుకంటే, అక్కడ మానసిక సమస్యలతో కనిపిస్తున్నవారు 35 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. 84 దేశాలలో వరల్డ్ మెంటల్ హెల్త్ రిపోర్ట్ చేసిన మైండ్ హెల్త్ కోషెంట్ స్కోర్లో భారతీయ యువత 60వ స్థానంలో ఉండి, తక్కువ పనితీరును కనబరిచినట్టు వెల్లడైంది. ఈ విషయంలో ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. అంటే, మన దేశ యువత మానసిక ఆరోగ్య సమస్యల ముఖచిత్రం ఇప్పుడు చిన్నవయసుకే చేరిపోయిందన్నమాట.వరల్డ్ మెంటల్ హెల్త్ పరిశోధనలో భారతదేశంలోని యువత ఎం.హెచ్.క్యూ స్కోరు సుమారు 33గా ఉంది. ఇది ‘బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్న’ వర్గం కిందకు వస్తుంది. దీని వల్ల 18–34 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో దాదాపు 64 శాతం మంది ఇంకా కుటుంబాలపై ఆధారపడుతున్నట్టుగానే తెలిసింది. సాధారణంగానే ఇటీవలి కాలంలో పదమూడు, పద్నాలుగేళ్ల లోపు వయసు నుంచే మానసిక సమస్యలు మొదలవుతున్నాయి. ఇక 25 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ సమస్యలు 62 శాతానికి పెరుగుతున్నాయి. వీరిలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, మత్తు పదార్థాలపై ఆధారపడటం.. వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిని త్వరగా గుర్తించకపోతే తాత్కాలిక సమస్యలుగా ఉండాల్సినవి, జీవితాంతం వెంటాడే పెను భారంగా మారిపోతాయి.మానసిక ఒత్తిడిఈ రోజుల్లో యువత డబ్బును సంపాదించడంలోనూ, విచ్చలవిడిగా ఖర్చు చేయడంలోనూ ఇండిపెండెంట్గా ఉంటున్నారని అనుకుంటారు. కానీ, మానసికంగా, భావోద్వేగ పరంగా ఇతరులపై ఆధారపడుతున్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ ప్రపంచం, గ్లోబల్ పోటీ వల్ల విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కానీ అదే సమయంలో అవన్నీ మనసుపై ఒత్తిడిని కూడా పెంచుతున్నాయి. దీని వల్ల 20–25 ఏళ్ల వయస్సులోనే బర్నౌట్, క్లినికల్ డిప్రెషన్ కేసులు కనిపిస్తున్నాయి అంటున్నారు సైకియాట్రిస్టులు.సామాజిక ఒత్తిడిఈ రోజులు ఎలా ఉంటున్నాయంటే చిన్న వయస్సులోనే ‘పనితీరును అద్భుతంగా ప్రదర్శించాలి’ అనే ఒత్తిడి మొదలవుతోంది. పిల్లల్లో వారి మైండ్ పూర్తిగా ఎదగకముందే ‘కంపారిజన్’ అనే భారం పడుతోంది. ఒక దశలో చదువుల ఒత్తిడి, మరొక దశలో ఉద్యోగ అనిశ్చితి, వివిధ రకాల ప్రతిభ, డిజిటల్ స్మార్ట్.. రోజువారీ స్ట్రెస్గా మారిపోయాయి. అన్నీ సాధించేయాలనే తపన కూడా మైండ్ను ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు. డిజిటల్ అడిక్షన్ – కంపారిజన్ ట్రాప్సోషల్ మీడియాలో అందరి జీవితాలు ‘పర్ఫెక్ట్’గా కనిపిస్తాయి. అవి నిజం కాకపోయినా మనలో మనకే తక్కువవాళ్లమనే భావనను పెంచుతాయి. తెలిసినవారి, పరిచయస్తుల సోషల్మీడియా పర్ఫెక్ట్ ఫొటోలు చూసి పోల్చుకోవడం పెరిగింది. ‘నేను అంతగా బాగోలేను, నేనేమీ చేయలేను’ అనే భావనలో సెల్ఫ్–ఎస్టీమ్, సోషల్ ఐసోలేషన్... వంటివి పెరుగుతున్నాయి.ఒంటరితనం సృష్టించిన వలయంఇప్పటి జనరేషన్ సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువగా కనెక్ట్ అయి ఉంది. కానీ, గాఢమైన, వాస్తవ సంబంధాలు మాత్రం తగ్గిపోయాయి. అదే ఒంటరితనానికి, డిప్రెషన్ కు ప్రధాన కారణంగా మారుతోంది. యువత ఈ విధంగా ఉండటం వల్ల దేశ భవిష్యత్తు ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. యువత ఆరోగ్యంగా, ఉత్పాదకంగా ఉంటేనే దేశం సర్వ సంపన్నంగా ఎదుగుతుంది. కానీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో 70–80 శాతం మందికి సరైన సమయంలో చికిత్స అందడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఒక తరం యువత తమ సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.నియంత్రణ తప్పనిసరి→ చాలా మానసిక సమస్యలు ముందే గుర్తించి, నిపుణులను సంప్రదించి, తగిన సూచనలు పాటిస్తే నియంత్రణలో ఉంటాయి.→ ఆలస్యమైతే సులభంగా నయం అయ్యే సమస్య జీవితాంతం ఉండే డిసేబిలిటీగా మారిపోతుంది.→ స్కూళ్లు, కాలేజీల్లో మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ తప్పనిసరి ఏర్పాటు చేయాలి. → నేటి తరాన్ని మన ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మెరుగైన ఫలితాలను పొందుతాం.చర్చించే స్వేచ్ఛ ఉండాలిమానసిక కుంగుబాటు, సమస్యలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. మన దేశంలో ఇప్పటికీ కొన్నిచోట్ల మానసిక సమస్య అంటే ‘సంకోచం’తో ఆగిపోతారు. ఇతరులతో పోటీ, పోలిక అనేవి ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే బాగా పెరిగాయి. అలా కాకుండా స్వీయ సమర్థతను వెలికి తీయగలగాలి. ఏ పని ఎంతవరకో హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. సమయ పాలన, పోషకాహారం, ఉత్సాహభరితమైన జీవనశైలి.. మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఎలాంటి సంకోచం లేకుండా మానసిక సమస్యలపై కుటుంబంలోనూ, సమాజంలోనూ చర్చించే స్వేచ్ఛ ఉండాలి. మానసిక ఆరోగ్యానికి సంబంధించి యువతకు అనుకూలమైన హెల్త్కేర్ సిస్టమ్ అవసరం.– డాక్టర్ మంజులారావు, క్లినికల్ సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రీల్స్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి పడి బాలిక మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రాజారెడ్డి నగర్లోని సాయి నివాస్ అపార్ట్మెంట్లో దుర్ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరిస్తూ ఐదవ అంతస్తు నుంచి కింద పడిపోయి పుష్ప (13) అనే బాలిక మృతి చెందింది. పుష్ప తండ్రి ధను బహదూర్ నేపాల్కు చెందినవారు. జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి తిరుపతికి వలస వచ్చారు. సాయి నివాస్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈరోజు సాయంత్రం పుష్ప రీల్స్ వీడియోలు తీస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. తల్లి కాజల్ పుష్పను వెతుకుతుండగా అపార్ట్మెంట్ ఐదవ అంతస్తు నుంచి పడినట్లు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న అలిపిరి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా మోజు చిన్నారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాక్ ఉప ప్రధానికి చేదు అనుభవం.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు చేదు అనుభవం ఎదురైంది. పాకిస్తాన్లో జరిగిన కీలక నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సందర్బంగా ఇషాక్ దార్ కాలు జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల మేరకు.. తాజాగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలలో మధ్యవర్తిగా తనను తాను నిలబెట్టుకోవడానికి ఇస్లామాబాద్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ర్ అబ్దెలట్టిని ఆహ్వానించే సమయంలో కాలు జారి కింద పడిపోయారు.#Pakistan के Deputy Prime Minister और Foreign Minister #Ishaq_Dhar ज़मीन पर धड़ाम!इशाक Saudi और Egypt के विदेश मंत्रियों का स्वागत कर रहे थे कि चलते चलते अचानक गिर गए.. pic.twitter.com/0H2aNHdP6i— Ruby Arun रूबी अरुण (@arunruby08) March 29, 2026దీంతో, వెంటనే అక్కడ ఉన్న అధికారులు ఆయనను పైకిలేపేందుకు సహాయం చేశారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. సమావేశం యథావిధిగా కొనసాగినట్టు సమాచారం. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటికి కేవలం పాకిస్తాన్ నేతలకు మాత్రమే సాధ్యమని.. ఎవరూ ఇలా ప్రయత్నించవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Ishaq Dar sends his regards and slots to the Foreign Ministers of Iran and Egypt like this.It's a new style of slots of Pakistan military regime 😂Note: None should try this kind of slots it's just Pakistan military regime style 😀 😂 pic.twitter.com/QbaXf36Aea— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) March 29, 2026 -
బంగారం కాదు బిల్డప్
సాక్షి, హైదరాబాద్: ఒంటి నిండా బంగారంతో సూర్య భాయ్గా సోషల్మీడియాలో పలు ఇంటర్వ్యూలు ఇచ్చి, కొన్ని సినిమాల్లోనూ నటించిన హైదరాబాదీ పల్లపు సురేష్ కుమార్ చెప్పినవన్నీ కేవలం బిల్డప్లేనని తేలిపోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులు పట్టుకున్న ‘బంగారు బాబు’ కొండా విజయ్కుమార్ వ్యవహారంతో సూర్య భాయ్ కథ బయటికి వచ్చింది. శుక్రవారం విచారణ చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతడు ధరించే బంగారు ఆభరణాల్లో అనేకం కోటింగ్తో కూడినవి స్పష్టం చేశారు. వీటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని తేల్చారు. గుట్టు వీడిన కట్టుకథలు.. నగరంలోని అత్తాపూర్నకు చెందిన పల్లపు సురే‹Ùకుమార్ అలియాస్ సూర్య భాయ్ తాను ధరించే బంగారు ఆభరణాలు, యూట్యూబ్ చానళ్లతో పాటు ఇతర సోషల్మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలతో అనేక మందిని సుపరిచితుడిగా మారాడు. తాను ధరించే నగల విలువ రూ.కోటి వరకు ఉంటుందనీ ప్రగల్భాలు పలికేవాడు. ఇప్పటి వరకు ఇతడి ప్రచారాన్ని అంతా నమ్మారు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో మొదలైన ఓ కేసు విచారణ శుక్రవారం హైదరాబాద్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇతడు చెప్పేవన్నీ కట్టుకథలని, ధరించే వాటిలో అత్యధికం నకిలీ నగలని తేలిపోయింది. సెటిల్మెంట్లతో వాహనాల కొనుగోలు సూర్య భాయ్ గడిచిన ఆరేళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని గుర్తించారు. 2022–23లో రూ.4.9 లక్షల ఆదాయం ఉన్నట్లు చూపించారని తేల్చారు. అతడితో పాటు భార్య పేరు మీదా సొంద ఇంటితో సహా ఎలాంటి స్థిరాస్తులు లేవని, నెలకు రూ.20 వేల అద్దె చెల్లిస్తూ ఓ ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. అతడికి ఉన్న థార్, సఫారి, ఎండీవర్ వాహనాలతో పాటు బుల్లెట్ బైక్ను భూవివాదాలు సెటిల్మెంట్ చేయడం ద్వారా వచ్చిన కమీషన్తో కొనుగోలు చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. సూర్యభాయ్ ధరించే నగల విలువ రూ.3 లక్షలే అని తేల్చారు. అతను ధరించేవి ఎక్కువ భాగం రాగి, వెండితో తయారయ్యాయని, వాటి పైన బంగారం, రేడియం పూత పూసినట్లుతేల్చింది. ఐటీ అధికారుల విచారణలో సూర్య భాయ్ తాను సమాజంలో పాపులారిటీతో పాటు సినిమాల్లో అవకాశాలు పొందడానికి ఇలా చేశానని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారాలపై ఐటీ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
హెబ్బాపటేల్ గ్లామరస్ లుక్.. వేకేషన్లో ధనశ్రీ వర్మ చిల్..!
బాలీవుడ్ బ్యూటీ సురభి జ్యోతి బేబీ బంప్ లుక్..పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ పునర్నవి..హీరోయిన్ హెబ్బా పటేల్ గ్లామరస్ పిక్స్..వేకేషన్లో చిల్ అవుతోన్న కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ..హీరోయిన్ సమంత స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) -
సోషల్ మీడియా అసత్య వార్తలతో దేశం ఇబ్బంది పడింది! : కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఉందని వస్తున్న వదంతులను నమ్మొద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలతో అనేక రకాలు ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో ఒక్క కుటుంబమో, ఒక వ్యక్తి ఇబ్బంది పడడం లేదని, యావత్ దేశం ఇబ్బంది పడేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయిల్ కంపెనీలు, డీలర్లతో కలిసి కిషన్రెడ్డి సీజీజీ టవర్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరాలపై ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొందన్నారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం లేదని చెప్పడం, కొంతసేపు పంపులను మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలను కలిగించాయని చెప్పారు. దేశానికి అవసరమైన ఇంధనం కొరత లేకుండా ఉండేందుకు, ఇతర దేశాలు నిర్ణయించిన ధరలను చెల్లించి అయినా సరే, పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులను దేశానికి తీసుకురావడంలో కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని దేశాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని, ఈ పరిస్థితుల్లో మనం ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ, దేశవ్యాప్తంగా రైల్వేలను విద్యుదీకరణ చేస్తూ, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. కొరత పేరుతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఎక్కువ ధరకు అమ్మినా, స్టాక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కిషన్రెడ్డి హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులకు కావాల్సిన వాటిని సకాలంలో చేర్చేలా కంపెనీలు, ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం గతంలో గ్యాస్ బుక్ చేసుకున్నట్టుగా ఇంటి దగ్గరకి వచ్చి ఇస్తారని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పొల్చితే మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, కొంతమేర ధరల తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలిగించినట్టు అవుతుందన్నారు. ప్రజలకు భారం కావొద్దని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించద్దని చెప్పారు. ఈ సమావేశంలో జగన్మోహన్రెడ్డి, అమరేందర్రెడ్డి, సుశీల్కుమార్ రాయ్, నిలేశ్, పీయూష్ మిత్తల్ పాల్గొన్నారు. -
ఐపీఎల్ బెట్టింగ్స్.. ప్రత్యేక నిఘాతో సజ్జనార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బెట్టింగ్లపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్టు వీడియో షేర్ చేశారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే సమాచారం ఇవ్వాలన్నారు.హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు!. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.ఆన్లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బెట్టింగ్లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి అని’ వీడియో షేర్ చేశారు. #SayNoToBettingబెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు!ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్లను… pic.twitter.com/BA4uUttaIU— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 28, 2026 -
బిగ్బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్.. పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ..!
బిగ్బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్..పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ అందాలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ గ్లామర్..వైట్ డ్రెస్లో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హోయలు.. బాలిలో చిల్ అవుతోన్న హీరోయిన్ లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
రెండు నెలల దాకా నో ఫికర్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఇండియాలో భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఇంధనం విషయంలో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పంపుల వద్ద బారులు తీరుతున్నారు. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య ఎల్పీజీ సరఫరా తగ్గింది. హోటళ్లు మూతపడుతున్నాయి. ఇంధనం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో గందరగోళం మరింత పెరిగిపోతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నా వదంతులు మాత్రం ఆగడం లేదు. అందుకే ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరో రెండు నెలల దాకా మనకు ఢోకా లేదని భరోసా ఇచ్చింది. అలాగే 8 లక్షల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, దీంతో దేశమంతటా ఒక నెల మొత్తం గ్యాస్ అవసరాలు తీరుతాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఎంతమాత్రం లేదని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేయడం వల్ల జనం ఆందోళనకు గురై ఇంధనం కోసం ఎగబడ్డారని తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రభుత్వం మన దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వల వివరాలను బయటపెట్టడం ఇదే మొదటిసారి. ‘క్యాష్ అండ్ క్యారీ’వల్ల అంతరాయం నిజమే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పష్టంచేసింది. అవి సాధారణంగానే పని చేస్తున్నాయని, చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ వివరణ ఇచ్చింది. కొన్నిచోట్ల పరిమితంగానే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించింది. చమురు కంపెనీలు కొత్తగా అమలు చేస్తున్న ‘క్యాష్ అండ్ క్యారీ’విధానం వల్ల చిన్న పట్టణాల్లో కొంత అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనని అంగీకరించింది. నిధుల సమస్య కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో పంపుల యజమాన్యాలకు సహకరిస్తున్నట్లు పేర్కొంది. ఇంధనం, ఎల్పీజీ సరఫరా ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించింది. అన్ని రిటైల్ ఇంధన కేంద్రాల్లో తగినంత నిల్వలు ఉన్నాయని పునరుద్ఘాటించింది. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా దురుద్దేశపూర్వకంగా సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. 150కిపైగా దేశాల నుంచి దిగుమతి ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన నాలుగో దేశం భారత్. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో ఐదో స్థానంలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ముడి చమురు, గ్యాస్ దిగుమతులు సగానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా 150కిపైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. మనదేశంలో అన్ని రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని, రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు సరఫరాల ఒప్పందాలను భారతీయ చమురు కంపెనీలు ఇప్పటికే ఖరారు చేసుకున్నాయని స్పష్టంచేసింది. మన దగ్గర మొత్తం 74 రోజులకు సరిపడా ముడి చమురును, ఇంధనాన్ని నిల్వ చేసకొనే సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.ఇంధన ఎమర్జెన్సీకి ఆస్కారం లేదు ప్రపంచంలో ఎక్కడం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా సరే మన దగ్గర ప్రతి పౌరుడికి రెండు నెలలపాటు స్థిరంగా ఇంధనం సరఫరా చేయగలమని కేంద్రం తెలిపింది. రాబోయే కొన్ని నెలలపాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని వెల్లడించింది. ఎల్పీజీ విషయంలో దేశీయంగానే ఉత్పత్తిని పెంచుతున్నామని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నామని కేంద్రం స్పష్టంచేసింది. ఇంధనం, గ్యాస్పై తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొన్ని దేశాల్లో జాతీయ ఇంధన ఎమర్జెన్సీ విధించారని, సరఫరా తగ్గించారని, ధరలు పెంచారని.. మన దేశంలో అలాంటి పరిస్థితికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. -
హీరోయిన్ చేస్తానని నా భార్యను తీసుకెళ్లాడు సార్..!
నాకు నలభై సంవత్సరాలు. నా భార్య స్వాతికి ముప్పై సంవత్సరాలు (పేర్లు మార్చబడినవి). మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆమె చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే వంటలు చాలా బాగా చేస్తుంది. అయితే నలుగురిలో తాను ప్రత్యేకంగా కనిపించాలనే ఆరాటం ఆమెకు ఎక్కువ. కోవిడ్ సమయంలో సరదాగా యూట్యూబ్లో వంటల వీడియోలు చేయడం ్రపారంభించింది. మొదట్లో మంచి వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు. కానీ తరువాత వ్యూస్ తగ్గిపోయాయి, సబ్స్క్రైబర్లు కూడా పెరగలేదు. అదే సమయంలో రీల్స్ ట్రెండ్ మొదలైంది. దాంతో ఆమె వంటలు తగ్గించి చిన్నచిన్న డ్యాన్సులు, స్కిట్స్ చేయడం ్రపారంభించింది. ఇతరుల మాదిరిగా తనకు వ్యూస్ రావడం లేదని రొమాంటిక్ పాటలకు, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్తో వీడియోలు చేయడం మొదలు పెట్టింది. ఈ లోపు సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక వ్యక్తి తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని, తరువాత ఆమెను హీరోయిన్ని చేస్తానని నమ్మబలకడంతో ఆమె నేను ఎంత చెప్పినా వినకుండా హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అతను రెండు మూడు చిన్న సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు ఇచ్చాడు. కానీ ఆమె మాత్రం త్వరలోనే హీరోయిన్ అవుతానని నమ్ముతోంది. ఆ వ్యక్తి ఆమెను ప్రలోభపెట్టి అన్ని రకాలుగా తన వైపు తిప్పుకుంటున్నాడని అర్థమైంది. మాకు ఇద్దరు పిల్లలు. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకు సర్దిచెప్పకపోగా మా కూతురు హీరోయిన్ అవుతుందని, నేను అనవసరంగా అనుమానాలు పెంచుకుంటున్నానని నా మీదనే ఎదురు దాడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో నేను ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. – నరసింహారావు, విజయవాడమీరు ఎంత వేదన అనుభవిస్తున్నారో అర్థమవుతోంది. ఒకవైపు బాధ, మరోవైపు అవమానం, కోపం, నిరాశ ఇవన్నీ కలగలిసిన పరిస్థితి మీది. ఇక మీ భార్య విషయానికి వస్తే, ఆమెకు ముందు నుంచే నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఆకాంక్ష ఉన్నట్లు స్పష్టమవుతోంది. కొందరిలో ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గుర్తింపు రావడం మాత్రమే వారికి చాలా ముఖ్యం. యూట్యూబ్లో వంటల వీడియోల ద్వారా కొంతకాలం ఆమెకు ఆ గుర్తింపు వచ్చింది. కానీ వ్యూస్, సబ్స్క్రైబర్లు తగ్గడంతో ఆమె రీల్స్, ఇతర వీడియోల వైపు వెళ్లి ఉండవచ్చు. సోషల్ మీడియాలో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు కొత్తగా ప్రయత్నిస్తున్న మహిళలను ప్రలోభపరుస్తుంటారు.ఇలాంటి సమయంలో మీరు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకువెళ్లడం చాలా ముఖ్యం. మొదటగా.. ఆమె చేస్తున్న ప్రతి దాన్ని పూర్తిగా తప్పు అని చెప్పి, ఆపమని ఒత్తిడి చేస్తే ఆమె ఇంకా మీకు దూరమయ్యే అవకాశం ఉంది. బదులుగా ‘‘నీ ప్రయత్నాలకు నేను కూడా తోడుగా ఉంటాను’’ అనే విధంగా మాట్లాడడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవసరమైతే కొంతకాలం ఆమెతో కలిసి ఆడిషన్లకు వెళ్లడం ద్వారా ఆమె ఒంటరిగా ఉండే పరిస్థితి తగ్గుతుంది. రెండవది.. సినిమా రంగంలో ఇప్పటికే పనిచేస్తున్న... లేదంటే స్థిరపడిన వ్యక్తులతో ఆమె మాట్లాడేలా చూడండి. ఆ రంగంలో ఉన్న కష్టాలు, వాస్తవ పరిస్థితుల గురించి వాళ్లు చెబితే కొన్నిసార్లు అది ఎక్కువ ప్రభావం చూపుతుంది. మూడవది.. మీ పిల్లల గురించి కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్లు ఈ పరిస్థితి వల్ల ఒత్తిడికి గురికాకుండా చూడాలి. అవసరమైతే కొంతకాలం వారిని హాస్టల్లో చేర్పించండి. నాలుగవది.. మీ అత్తమామలతో కూడా ప్రశాంతంగా మాట్లాడండి. ‘‘ఆమె నటనావకాశాల కోసం ప్రయత్నించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఆమె భద్రతే నాకు ముఖ్యం’’అని వాళ్లకు అర్థమయ్యేలా వివరించండి. ఇంతేకాదు.. చట్టపరమైన విషయాల గురించి కూడా మీరు అవగాహన కలిగి ఉండటం మంచిది. ఆ వ్యక్తి నిజంగా మోసం చేస్తున్నాడని అనిపిస్తే సంబంధిత ఆధారాలను సేకరించండి. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒక మనిషిని బలవంతంగా మార్చడం సాధ్యం కాదు, ఆమె సొంత నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారని గమనించాలి. కాబట్టి మనం చేయగలిగేది ఓపికగా ప్రయత్నించడం, అదే సమయంలో సంబంధాన్ని పూర్తిగా తెంచుకోకుండా ఉండడం మాత్రమే! పరిస్థితి క్లిష్టంగా అనిపిస్తే ఒక మంచి క్లినికల్ సైకాలజిస్టు లేదా సైక్రియాట్రిస్టు దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు మనశ్శాంతి కోల్పోకుండా మీ శ్రేయోభిలాషులతో కూడా సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి. ఒక్కోసారి జీవితంలో మనం అన్నీ అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కాలమే సరైన సమాధానం చెబుతుంది. ఓపిగ్గా ముందుకెళ్లండి. ఆల్ ది బెస్ట్. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
చిరునవ్వులు.. డ్యాన్సులు..
‘‘పెళ్లి వేడుకల తర్వాత మేం కొన్నాళ్లు తీరికగా గడపాలనుకున్నాం’’ అని సోషల్ మీడియా వేదికగా రష్మికా మందన్నా పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నాల వివాహం ఫిబ్రవరి 26న జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్, గుడికి వెళ్లడం, సత్యనారాయణ వ్రతం, అభిమానులతో విందు, మీడియాని ప్రత్యేకంగా కలవడం... ఇలా వివాహ వేడుకలతో బిజీ బిజీగా గడిపిన విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ఉరుకులు పరుగులు లేకుండా కాస్త ప్రశాంతంగా ఉండాలనుకున్నారు. అందుకే థాయ్ల్యాండ్లోని కో సామ్యూయ్ దీవికి వెళ్లారు. అయితే ఈ నూతన జంటతో పాటు వీరి స్నేహితులు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ‘‘ప్రశాంతమైన ఉదయాలు, ఈతతో మధ్యాహ్నాలు, టేబుల్ టెన్నిస్ మరియు పూల్ గేమ్స్తో సాయంత్రాలు, సినిమాలతో రాత్రిళ్లు... ఇలా చిరునవ్వులతో సమయం గడిచి΄ోయింది. కో సామ్యూయ్ మాకు ఇల్లులానే అనిపించింది. ఫ్రెండ్స్తో కలిసి గడిపిన ఆ ఆనంద క్షణాలు’’ అని పేర్కొని, ఇన్స్టాగ్రామ్ వేదికగా రష్మిక కొన్ని ఫొటోలు, ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ‘మై హజ్బెండ్’ అని విజయ్ని రష్మిక పిలవడం, విజయ్ నవ్వుతూ చూడడం, ఇంకా రష్మిక కోసం విజయ్ పిజ్జా తయారు చేయించి, ఇవ్వడం, ఇద్దరూ డ్యాన్స్ చేయడం, చిరునవ్వులు చిందించడం, మాట్లాడుకోవడం వంటి విజువల్స్ ఉన్నాయి. -
మాల్దీవుస్లో మాళవిక రాజ్ చిల్.. బిగ్ బాస్ దివి స్టన్నింగ్ పోజులు
కాఫీ తాగుతూ హీరోయిన్ మేఘా ఆకాశ్ చిల్..బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామరస్..బిగ్బాస్ దివి స్టన్నింగ్ పోజులు..మాల్దీవుస్లో మాళవిక రాజ్ చిల్..బుల్లితెర భామ దివ్యాంక త్రిపాఠి సీమంతం వేడుక.. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
వైరల్ వీడియో.. కింగ్ కోబ్రాతోనే ఆటలా..?
విష సర్పాలతో ఆటలు చాలా ప్రమాదకరం. స్నేక్ క్యాచర్స్ కూడా పాములను పట్టే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అందులోనూ అత్యంత విష సర్పమైన కింగ్ కోబ్రాను పట్టుకోవడం చాలా ప్రమాదం. ఇక్కడొక వ్యక్తి కింగ్ కోబ్రాను బంధించిన వైనం చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురౌవుతుంది. ఆ కోబ్రాను బంధించే క్రమంలో అది ఒకసారి చిక్కినట్లే చిక్కి మళ్లీ బుసలు కొట్టిన తీరు చూస్తే అమ్మో అనిపించకమానదు. అయినా చివరకు అత్యంత చాకచాక్యంగా ఓ గొట్టం సాయంతో దాన్ని బంధించాడు ఆ స్నేక్ క్యాచర్. ఒక గొట్టం, ఒక సంచి సాయంతో దాన్ని ఎట్టకేలకు పట్టుకున్నాడు. కనీసం చేతికి గ్లౌజ్లు కూడా లేకుండానే పట్టుకోవడం ఇది చూసిన నెటిజన్లకు మరింత కలవరాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏమాత్రం అటు-ఇటు అయినా ఇక ఆ కోబ్రా నుంచి తప్పించుకోవడం కష్టమనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కింగ్ కోబ్రా ఎంత ప్రమాదమంటే ఒకే కాటు ద్వారా 400–500 mg వరకు విషం ఇంజెక్ట్ చేయగల శక్తి ఉంటుంది. ఈ పరిమాణం 11 మంది మనుషులను లేదా ఒక ఏనుగును చంపగలదు అని శాస్త్రీయంగా నిర్ధారించబడింది కూడా. మరి అటువంటి కింగ్ కోబ్రాతో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పట్టుకోవడం ప్రాణం మీదకు తెచ్చుకున్నట్లే అవుతుందని నెటిజన్లు అంటున్నారు.కాస్త అటు ఇటు అయ్యి ఉంటే..5 నిమిషాల్లో అతని ప్రాణం పోవడం ఖాయం! #KingCobra pic.twitter.com/G8W2d22SVT— UttarandhraNow (@UttarandhraNow) March 24, 2026 -
విశాఖలో అద్భుత సైకత శిల్పం.. పర్యాటకుల సందడి
విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరం మరో అరుదైన ఘటనకు నిలయమైంది. విశాఖలో సరికొత్త సైకత(ఇసుక శిల్పం) శిల్పం పర్యాటకులకు మరింతగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ సరికొత్త సైకత శిల్పం ఏంటని అనుకుంటున్నారా?. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ చైన్ 'కేఎఫ్సీ' (KFC)కి చెందిన చికెన్ బకెట్. దీనికి సంబంధించిన భారీ ఆకార శిల్పం ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది భారత్లోనే అతిపెద్ద ఇసుక నిర్మాణం కావడం గమనార్హం.విశాఖపట్నం నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రామకృష్ణ మిషన్ బీచ్లో ఇటీవల ఒక అద్భుతమైన ఇసుక శిల్పం వెలిసింది. విశాఖలో కేఎఫ్సీ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఇసుక శిల్పాన్ని ఏర్పాటు చేశారు. దీంతో, కేఎఫ్సీ సైకత శిల్పం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కాగా, ఈ అద్భుత కళాఖండాన్ని ప్రముఖ స్థానిక సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ తీర్చిదిద్దారు. కేవలం ఇసుకను మాత్రమే ఉపయోగించి తయారు చేసిన ఈ శిల్పం చూడటానికి అచ్చు అసలైన కేఎఫ్సీ చికెన్ బకెట్లాగే ఉండటం గమనార్హం.ఇక, ఈ శిల్పంపై కేఎఫ్సీ వ్యవస్థాపకుడు కల్నల్ సాండర్స్ ముఖచిత్రాన్ని ఎంతో స్పష్టంగా చెక్కారు. దీనిని రూపొందించడానికి ఆయన సుమారు రెండు రోజుల పాటు నిరంతరంగా శ్రమించారు. ఈ భారీ శిల్పాన్ని "ఇండియాస్ టాలెస్ట్ శాండ్ బకెట్" గా అభివర్ణిస్తున్నారు. బీచ్కు వచ్చే పర్యాటకులు ఈ శిల్పం ముందు నిలబడి సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ భారీ ఇసుక శిల్పం ఇప్పుడు నగరవాసులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక, ఇది విశాఖపట్నం నగరంలో కేఎఫ్సీ 14వ బ్రాంచ్ కావడం విశేషం. సముద్ర తీర వాతావరణానికి అనుగుణంగా, కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించేలా ఈ రెస్టారెంట్ ఇంటీరియర్ డిజైన్ను రూపొందించారు. -
‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్!
చాంగ్చున్: చైనాలోని జిలిన్ ప్రావిన్స్లో కొందరు దొంగలు ఒక ట్రక్కులో బంధించి తీసుకెళ్తున్న ఏడు పెంపుడు శునకాలు అత్యంత చాకచక్యంగా తప్పించుకోవడమే కాకుండా.. ఏకంగా 17 కిలోమీటర్ల దూరం వరకూ కలిసి ప్రయాణించి, ఎట్టకేలకు తమ యజమానుల చెంతకు చేరాయి. ఈ ‘గ్రేట్ ఎస్కేప్’ కథ నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోంది.ఈ కథలోకి వెళితే ఈ ఏడు కుక్కలు వేర్వేరు జాతులకు చెందినవి. కానీ ఇవన్నీ ఒకే గ్రామంలో కలిసి ఆడుకుంటూ స్నేహంగా మెలుగుతుంటాయి. అయితే కొందరు దొంగలు వీటిని వేర్వేరు ఇళ్ల నుంచి అపహరించి, కుక్క మాంసం విక్రయించే ముఠాకు అమ్మేందుకు ఒక ట్రక్కులోనికి ఎక్కించారు. అయితే ఆ ట్రక్కు నుంచి అవి ఎలాగోలా బయటపడ్డాయి. సాధారణంగా ఇలాంటి స్థితిలో కుక్కలు భయంతో ఎటుపడితే అటు పరుగులు తీస్తాయి. కానీ, ఇవి మాత్రం కలిసిగట్టుగా ప్రయాణం సాగించాయి. Seven dogs stolen from their owners have gone viral after escaping from an illegal transport truck and making their way home.They traveled around 17 km together, led by a corgi across highways and fields, now safely back with their respective owners..🐶🐾🥺❤️ pic.twitter.com/H5VB9BQkGB— 𝕐o̴g̴ (@Yoda4ever) March 23, 2026చాంగ్చువాంగ్ ఎక్స్ప్రెస్వే హైవేపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నా, ఈ ఏడు కుక్కలు ఒక సైనిక దళం మాదిరిగా క్రమశిక్షణతో నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు వాహనదారులను ఆశ్చర్యపరిచాయి. ఇక్కడ ఒక హృదయ విదారక విషయం ఏమిటంటే.. గాయపడి నడవలేకపోతున్న ఒక జర్మన్ షెపర్డ్ కుక్కను మిగిలినవి వదిలివేయలేదు. ఆ గాయపడిన ‘మిత్రుడి’ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడగా, చిన్నదైన కోర్గి కుక్క మధ్యలో నడుస్తూ ముందుకు సాగింది. ఒకటి నెమ్మదిస్తే మిగిలినవన్నీ ఆగి, వాటికి ధైర్యం చెబుతూ, ముందుకు సాగాయి.రెండు రోజుల పాటు తిండి, నీరు లేకపోయినా పొలాలు, రోడ్లు దాటుకుంటూ దాదాపు 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో స్థానిక వాలంటీర్లు డ్రోన్ల సాయంతో వీటిని గమనిస్తూ వచ్చారు. చివరికి అవి తమ సొంత గ్రామానికి చేరుకోగానే, వాటి యజమానుల ఆనందానికి అవధులు లేవు. మృత్యువు ముఖం వరకు వెళ్లి, తిరిగి ప్రాణాలతో వచ్చిన తమ పెంపుడు జంతువులను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.ఇది కూడా చదవండి: ‘ఆంత్రోపిక్’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్! -
యూట్యూబర్లకు నోటీసులు.. TDP తప్పులను ప్రశ్నిస్తే జైలుకే
-
స్విమ్ షూట్లో హీరోయిన్ అనితా.. సముద్రంలో ప్రగ్యా జైస్వాల్ చిల్..!
వైట్ బ్యూటీలా మెరిసిపోతున్న ది రాజాసాబ్ బ్యూటీ..సముద్రంలో జలకాలాడుతోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..హీరోయిన్ కావ్య థాపర్ స్మైలీ లుక్స్...ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా..స్విమ్ షూట్లో మెరిసిన హీరోయిన్ అనితా.. View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
తమిళనాడులో దారుణం.. వైరల్ వీడియో
ఇటీవలి కాలంలో కుక్క దాడులు దారుణంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూకి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. తాజాగా తమిళనాడులో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంటి ముందు నుంచి వెళ్తున్న వారిపై ఓ పెంపుడు కుక్క దాడి ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, తమ కుక్క దాడి చేస్తున్న సమయంలో దాని యజమానులు చూస్తూ ఉండిపోవడం దారుణం. దీంతో, వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో వేదారణ్యం సమీపంలోని తోప్పుతురై ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు పవితా, ఆమె తల్లి తమ ఇంటికి వెళ్తుండగా ఓ పెంపుడు కుక్క వారిపై దాడికి పాల్పడింది. వారిద్దరూ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇంటి గేటు తెరిచి ఉండటంతో కుక్క బయటకు వచ్చి పవితాను వెంబడించి దాడి చేసింది. పవితా నేలపై పడిపోయి తీవ్రంగా బాధపడుతుండగా ఆమె తల్లి.. కుక్కను తప్పించే ప్రయత్నం చేయగా.. అది ఆమెపై కూడా దాడి చేసింది.అయితే, కుక్క దాడి చేస్తున్న సమయంలో ఇంటి యజమానులు బయటకు వచ్చారు. పవితా, ఆమె తల్లిపై కుక్కు దాడి చేస్తున్నా వారు కుక్కను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితులకు సాయం చేయకుండా.. ఇంటి గేటును మూసివేశారు. అనంతరం, బాధితులు ఇద్దరూ కుక్కను లోపలికి పిలవాలని చెప్పినా వారు పట్టించుకోలేదు. వారితోనే(బాధితులతో యజమానులు) వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఆమె కుక్కను కర్రతో కొట్టిన తర్వాత అది అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడితో బాధితులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని వేదారణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పెంపుడు జంతువులను బాధ్యతగా చూసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. ఈ దాడిలో యజమానుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #WATCH | நாகை: வேதாரண்யம் அருகே தாய் மற்றும் மகளை கடித்து தாக்கிய வளர்ப்பு நாயை வேடிக்கை பார்த்த உரிமையாளர் #SunNews | #DogIssue | #UntrainedDogs pic.twitter.com/xKB7LsyPTh— Sun News (@sunnewstamil) March 21, 2026 -
ట్రంప్ షాకింగ్ పోస్ట్.. ‘అతని చావుతో సంతోషం’
వాషింగ్గన్: ఎప్పుడూ సంచలనాలకు అడ్డాగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి ప్రపంచవ్యాపంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అమెరికా గూఢచారి సంస్థ ఎఫ్బీఐ (ఎఫ్బీఐ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. అతని మరణంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. ఒకప్పుడు తనపై వచ్చిన రష్యా సంబంధాల ఆరోపణలను విచారించిన ముల్లర్ మరణంపై ట్రంప్ అత్యంత కఠినమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.విద్వేషానికి పరాకాష్టముల్లర్ మరణవార్త తెలిసిన వెంటనే ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా.. ‘రాబర్ట్ ముల్లర్ చనిపోయారు. మంచిదైంది.. ఆయన చనిపోయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇకపై ఆయన అమాయకులను బాధించలేరు’ అంటూ పోస్ట్ చేశారు. గతంలో ముల్లర్ చేపట్టిన దర్యాప్తును ట్రంప్ పదేపదే ‘విచ్ హంట్’ (రాజకీయ కుట్ర)గా అభివర్ణించేవారు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ముల్లర్పై ఆయనకున్న తీవ్ర విద్వేషాన్ని బయటపెట్టాయి.ఎఫ్బీఐలో కొత్త ఉత్సాహంముల్లర్ తన 12 ఏళ్ల పదవీ కాలంలో ఎఫ్బీఐ రూపురేఖలను మార్చివేశారు. 2001లో అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 దాడులకు వారం రోజుల ముందే ఆయన బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు కేవలం నేర పరిశోధన సంస్థగా ఉన్న ఎఫ్బీఐని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ముల్లర్కే దక్కుతుంది. రిపబ్లికన్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో నియమితులైన ఆయన, రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షుల కింద పనిచేశారు.ట్రంప్.. ఆయన 34 మంది స్నేహితులు..2013లో పదవీ విరమణ చేసిన ముల్లర్, 2017లో మరోమారు వార్తల్లోకి నిలిచారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచార బృందానికి, రష్యాకు మధ్య ఏవైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై దర్యాప్తు చేయడానికి ఆయన ‘స్పెషల్ కౌన్సిల్’గా నియమితులయ్యారు. దాదాపు 22 నెలల పాటు సాగిన ఈ విచారణలో ట్రంప్ సన్నిహితులతో సహా 34 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. 2019లో ఆయన సమర్పించిన 448 పేజీల నివేదికలో.. ట్రంప్ బృందానికి రష్యాతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ, అది నేరపూరిత కుట్ర అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని ముల్లర్ తేల్చారు. అప్పటి నిబంధనల ప్రకారం సిట్టింగ్ ప్రెసిడెంట్పై క్రిమినల్ చర్యలు తీసుకోలేకపోయినప్పటికీ, ట్రంప్ దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను ఆయన తన నివేదికలో వెల్లడించారు. ముల్లర్ కుటుంబ సభ్యులు ఆయన ధృవీకరిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఇది కూడా చదవండి: ప్రపంచం షాక్..‘అరిరంగ్’తో బీటీఎస్ విశ్వరూపం -
దళితుడిని ఇంట్లోకి రానిస్తావా..
రాజమహేంద్రవరం సిటీ: ‘ఏయ్.. ఏంటి దళితుడిని ఇంట్లోకి రానిస్తూ మాదర్చోద్ వేషాలు వేస్తున్నావు. నీ కొడుకు ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు కదా! మంత్రి కొల్లు రవీంద్రతో చెప్పి ఉద్యోగం తీయించేస్తా’ అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఓ మహిళను బెదిరించిన ఫోన్ రికార్డింగ్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వారం రోజుల కిందట వ్యాపార లావాదేవీల్లో ఓ వ్యక్తిని అప్పారావు బెదిరించిన ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మరచిపోకముందే ఓ మహిళను ఫోన్లో బెదిరించిన ఆడియో జిల్లాలో మరోసారి వైరల్గా మారింది. జాన్ను నరికేస్తా.. నగరంలో ఒంటిరిగా నివసిస్తున్న మహిళ ఇంటికి ఓ దళితుడు వస్తున్నాడనే విషయంపై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. ‘దళితుడు జాన్ను ఇంటికి రాకుండా బయటకు తరిమి వేయ్.. లేనిపక్షంలో ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న నీ కొడుకు ఉద్యోగం తీయించేస్తా.. నీ అంతు చూస్తా’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. జాన్ అనే వ్యక్తి మాల మహానాడు పేరిట వ్యవహరిస్తున్నాడని, ఇది సరైనది కాదని అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద కూడా మాల మహానాడు, మాదిగ దండోరా ఉన్నాయని, జాన్ విషయం త్వరలో తేల్చేస్తానంటూ ఆయన ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ‘ఫైనల్గా నీ బతుకు నువ్వు బతుకు. నేను అడుగు పెట్టానంటే అన్నీ తేల్చి పారేస్తాను..నీ బతుకేంటో రోడ్డున పెడతా.. జాన్ను అడ్డగోలుగా నరికి పారేస్తా’ అంటూ ఆమెకు స్ట్రాంగ్ వారి్నంగ్ ఇస్తూ దుర్భాషలాడారు. మహిళలను దుర్భాషలాడడం సరైన విధానం కాదని ఆమె చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ‘నువ్వు మహిళవే కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిరెడ్డి అప్పారావు ఈవిధంగా దిగజారి మాట్లాడడం సరైనది కాదని కూటమి నాయకులే చర్చించుకుంటున్నారు. అయితే మహిళను తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సోషల్ మీడియాపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: అతిపవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ దుర్మార్గమైన దుష్ప్రచారం చేసి.. అది హెరిటేజ్ సిండికేట్ నెయ్యి కాంట్రాక్టుల కోసమేనన్న విషయం బయటపడి.. తెలుగుప్రజలంతా ఛీత్కరిస్తుండడం ఒకవైపు.. అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టిన టీవీ5 అధినేత బీఆర్నాయుడి రాసలీలలు బయటపడి వేంకటేశ్వరస్వామి భక్తులంతా ఛీకొడుతుండడం మరోవైపు.. అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న ఈ విమర్శల జడిలో ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇక ఎవరూ ఈ విషయాలపై మాట్లాడకుండా ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోని అన్ని వేదికలలోనూ హెరిటేజ్, బీఆర్ నాయుడు అనే పేర్లు కనబడకుండా చేయడానికి మాస్టర్ప్లాన్ వేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టు నుంచి ఈనెల 3న ఈ మేరకు ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో కూడా బీఆర్ నాయుడు, హెరిటేజ్ లపై ఏ విధమైన ప్రచారం చేయకూడదని, ఎలాంటి పోస్టులు ఉన్నా తొలగించాలనేది ఆ ఉత్తర్వుల సారాంశం. ఈ కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని బీఆర్ నాయుడు, హెరిటేజ్ అనే పేర్లు కనపడితే చాలు, వెంటనే రిమూవ్ చేయాలంటూ ప్రభుత్వం ఆయా సంస్థలకు నోటీసులు పంపిస్తోంది. వేదిక ఏదైనా సరే.. బీఆర్ నాయుడు, హెరిటేజ్ అనే పేరుతో ఆ పోస్టులు ఉంటే ఆయా సంస్థలకు నోటీసులు పంపి, బలవంతంగా పోస్టులను డిలీట్ చేయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కార్ ఈ విధంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇది ప్రజల భావప్రకటనా స్వేచ్ఛపై చంద్రబాబు సర్కార్ చేస్తున్న దాడేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.డిలీట్ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు..ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే సాకుతో సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. నేరుగా వారికి మెయిల్స్ చేయడంతో పాటు, సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపిస్తోంది. అందులో వేలాది మంది పేర్లను, ఐడీలను పేర్కొంటూ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలంటూ.. సబ్జెక్ట్, కంటెంట్ తో సంబంధం లేకుండా హెరిటేజ్, బీఆర్ నాయుడు అనే పదాలు ఉంటే చాలు, వీడియో అయినా, పోస్ట్ అయినా, పోస్టర్ అయినా, మీమ్ అయినా, నాలుగు అక్షరాలైనా సరే.. డిలీట్ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. చివరికి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన వీడియోలు కూడా డిలీట్ చేయాలంటూ నోటీసులిస్తున్నారంటే సోషల్ మీడియా దెబ్బకు ప్రభుత్వ పెద్దలు ఎంతలా భయకంపితులు అవుతున్నారో అర్థమవుతుంది. మరింత మందికి తెలియకూడదనే..ఇటీవల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం.. ముఖ్యంగా పరాయి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై పోస్టులు, వీడియోలు, మీమ్స్ వెల్లువెత్తాయి. పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి పనులు చేసిన బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. కానీ, తప్పులను సరిదిద్దుకోవాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా అలాంటి పోస్టులు పెట్టిన వారిపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపులకు పాల్పడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక హెరిటేజ్ విషయంలోనూ ప్రభుత్వం నిజాలు బయటకు రానీయకుండా అడ్డుకుంటోంది. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ ఇష్యూ, అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం, వీఎస్ఆర్ సంస్థకు హెరిటేజ్ కు సంబంధాలు బయటపడటంతో చంద్రబాబు సర్కార్ బెంబేలెత్తింది. అందుకు సంబంధించిన వీడియోలు, పోస్టులన్నీ డిలీట్ చేయిస్తోంది. అజిత్ పవార్ మేనల్లుడు, ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ మాట్లాడిన మాటలు పోస్టు చేసిన వారికి కూడా నోటీసులిచ్చి డిలీట్ చేయించారు.భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డుకట్ట..వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛపై చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా దాడికి పాల్పడుతోంది. అన్యాయాలపై, దుర్మార్గాలపై వాయిస్ వినిపించకుండా చేస్తున్న దాడి అత్యంత దారుణం. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై జరుగుతున్న ఇలాంటి పరిణామాలు తీవ్ర అభ్యంతరకరం. ప్రభుత్వంపై విమర్శలు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు, నోటీసులు, పోస్టుల తొలగింపు ముమ్మాటికీ నియంత పాలనకు నిదర్శనం. – కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది -
వారిని కొందరు ఆడపిల్లలు గుడ్డిగా నమ్ముతూ..: సజ్జనార్
హైదరాబాద్: అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని చెప్పారు.ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు తన దృష్టికి ఎక్కువగా వస్తున్నాయని, ఆ కథనాలు చూశాక ఎంతో బాధనిపిస్తోందని సజ్జనార్ అన్నారు. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని నకిలీ ఖాతాలతో అమ్మాయిలకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారని చెప్పారు. ఆ మాయమాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు వారిని గుడ్డిగా నమ్మి తమ వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను పంచుకుంటున్నారని తెలిపారు.అలా పంపగానే ఆ అపరిచితులు రాక్షసులుగా మారిపోయి వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని సజ్జనార్ వివరించారు. వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలని, భౌతికంగా కలవాలని వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. పరువు పోతుందన్న భయంతో, ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక కొందరు అమ్మాయిలు అడిగినంత డబ్బులు ముట్టజెబుతూ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. ఈ వేధింపులు తాళలేక కొందరు తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారని చెప్పారు.‘ఆడపిల్లలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మీకు ఆన్లైన్లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అస్సలు భయపడకండి. ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్కు లొంగవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పండి. ఏ మాత్రం సంకోచించకుండా డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు.తల్లిదండ్రులు సైతం పిల్లలతో కాస్త సమయం గడుపుతూ.. వారు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనేదానిపై ఓ కన్నేసి ఉంచండి. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, వీపీఎన్లు వాడితే పోలీసులకు చిక్కబోమని సైబర్ నేరగాళ్లు భ్రమపడొద్దు. మీరు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ, అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నాను’ అని ఎక్స్లో సజ్జనార్ చెప్పారు. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ఫోన్.. ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు నా దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు… pic.twitter.com/sWbS2L4bhP— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 21, 2026 -
అభిమాని అభ్యర్థణకు మోదీ రిప్లై.. చెక్కెర తగ్గించండి..!
సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి, తన వీరాభిమాని కుమారునికి మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రి ప్రధాని మోదీకి వీరాభిమాని అని ఆయన చెబితే తను చెక్కెర తినడం మానేస్తాడని ఒక సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్ ప్రధానిని ఇన్స్ట్రాలో వీడియో చేస్తూ అభ్యర్థించారు. దీనికి ప్రధాని మోదీ స్పందించారు. ఇది ఇప్పుడు వైరల్గా మారింది.యువరాజ్ దువా అనే సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్ తన తండ్రి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రధాని మోదీని అభ్యర్థించారు. "ప్రధాని మోదీ గారు మా తండ్రి గారు మీకు వీరాభిమాని ఆయన చెక్కెర అధికంగా తింటాడు. దయచేసి మీరు అతనిని షుగర్ తినడం మానిపించాలి. మీరు చెబితే ఆయన వింటారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్యా దయచేసి ఆయనను చెక్కెర తినడం మానిపించండి" అని ఇన్స్ట్రా రీల్ చేశారు.ఈ వీడియో కాస్త వైరల్గా మారి ప్రధాని దృష్టికి చేరింది. దీంతో మోదీ తన అధికారిక ఇన్స్ట్రా అకౌంట్లో దీనికి రిప్లై ఇచ్చారు. " యువరాజ్ అభ్యర్థన మేరకు నేను తన తండ్రిని షుగర్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయనతో పాటు ఇతరులు కూడా అలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చెక్కెర అధికంగా తీసుకోవడం అనేక వ్యాధులకు, ఉభకాయానికి కారణం అవుతుంది. యోగా మీ జీవితంలో భాగం చేసుకొవడం ద్వారా ఆరోగ్యంగా ఫిట్గా ఉండవచ్చు. అని మోదీ ఇన్స్ట్రాలో రిప్లై ఇచ్చారు. అనంతరం అతని వీడియో రీషేర్ చేశారు.అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రధాని మీ వీడియో షేర్ చేశారని తెలిస్తే మీ తండ్రి చాలా గర్వంగా ఫీలవుతారని ఒకరు కామెంట్ చేశారు. ఇలా ఇన్స్ట్రాలో చాలా మంది యువరాజ్ దువాకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. అయితే భారత ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇన్స్ట్రాగ్రామ్లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 10 కోట్లు దాటింది. -
సంయుక్త మీనన్ గ్లామరస్ పిక్స్.. మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్..!
హీరోయిన్ సంయుక్త మీనన్ గ్లామరస్ లుక్స్..బాలిలో చిల్ అవుతోన్న లక్ష్మీ రాయ్..రెడ్ డ్రెస్లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ అందాలు..శారీలో దిల్ రాజు సతీమణి తేజస్విని పోజులు..మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
వినూత్న వ్యాపారం.. వింటే అవాక్కే!
చిన్న సమస్య అయితే రూ. 250, పెద్ద సమస్య అయితే ఐదు వందల రూపాయలు.. ఇవేమీ ఆస్పత్రుల్లో ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి పెట్టిన ధరలు కావు. బ్యాంకుల్లో సర్వీసు చార్జీలు కూడా కాదు. సాంకేతిక సమస్యలు తీర్చడానికి పెట్టిన రేట్లు కూడా కావివి. మరేంటి? సాటి మనుషుల బాధలను వినడానికి ఓ వ్యక్తి నిర్ణయించిన ధరలు ఇవి. ఏంటి సమస్యలు వినడానికి డబ్బులు ఇవ్వాలని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ముంబై బీచ్కు వెళ్లాల్సిందే.ముంబై మహానగర సముద్ర తీరంలో (Mumbai Beach) ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్న ఓ వ్యక్తి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతడు పట్టుకున్న ఫ్లెక్సీపై ''మీ బాధలు నాతో పంచుకోండి. నేను వింటాను'' అని రాసుంది. అంతేకాదు అతడి రెండు ఫోన్ నంబర్లతో పాటు ఏ సమస్యకు ఎంత మొత్తం తీసుకుంటాడనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. ఇదంతా ఆసక్తిగా అనిపించి ఓ వ్యక్తి అతడితో మాట కలిపాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది.కలిసి ఏడవడానికి రూ. 1000!చిన్న చిన్న సమస్యలు వినడానికైతే 250 రూపాయలు, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రూ. 500 తీసుకుంటానని అతడు చెప్పాడు. సమస్యలు వినడమే కాకుండా కలిసి కూర్చుని తనివితీరా ఏడవాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వాలని తెలిపాడు. డబ్బు చెల్లించి ఇలా ఎవరైనా చేస్తారా అని అడిగితే.. ''ఏం ఎందుకు చేయరు'' అంటూ ప్రశ్నించాడు. తన సేవలకు మన్నన దక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడతను. తన పేరు పృథ్వీరాజ్ బోహ్రా (Prithviraj Bohra) అని.. ప్రజల సమస్యలు వినేందుకే తానిక్కడ ఉన్నానని చెప్పాడు. తనకు ఇన్స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ ఉందని వెల్లడించాడు. భావోద్వేగ మద్దతు కోసంపృథ్వీరాజ్ వీడియో వైరల్ కావడంతో నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంత మంది అతడి సేవలను మెచ్చుకుంటే, మరికొందరు డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడని విమర్శించారు. ఏది ఏమైనా ముంబై వంటి మహానగరాల్లో ఒంటరి జీవితాలు వెళ్లదీస్తున్న వారికి భావోద్వేగ మద్దతు అవసరమన్న వాదనతో అందరూ ఏకీభవిస్తున్నారు. కష్టసుఖాలు పంచుకునేందుకు, మనుసులోని భావాలు పంచుకునేందుకు మనుషులు కరవవుతున్న నగర జీవితాల్లో పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లు ఒయాసిసు లాంటి వారని పేర్కొంటున్నారు.చదవండి: ‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!కాగా, ఈ వైరల్ వీడియో తీవ్రమైన సమస్యను వెలుగులోకి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కారణంగా నగర జీవులు మానసిక సమస్యల బారిన పడుతున్నారని, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇలాంటి అనధికారిక మార్గాలను వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. తమ బాధలను ఎవరితో పంచుకోవాలో తెలియక పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లను ఆశ్రయిస్తున్నారని వివరించారు. నెటిజనుల స్పందనపృథ్వీరాజ్ బోహ్రా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఈ వ్యక్తి బీచ్లో అతిపెద్ద వ్యాపార నమూనాని ఆవిష్కరించాడు" అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఇదే తదుపరి గొప్ప స్టార్టప్ ఆలోచన" అని మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి సేవలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు తాము ఉచితంగా అందిస్తామని కొందమంది సరదాగా కామెంట్ చేశారు. ముంబై లాంటి మహా నగరాల్లో మనుషులను ఒంటితనం ఎంతగా బాధిస్తుందో ఇలాంటి ఉదంతాలు వెల్లడిస్తున్నాయని, ఇక్కడ బాధ కూడా అమ్ముడుపోతుందని నెటిజనులు అంటున్నారు. అయితే మనుషుల బాధలను అలుసుకుగా తీసుకుని మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.🚨 Mumbai Beach Viral : Man charges people to listen to problems.REPORTER : Do people come? 🤯MAN : "Yes, For small troubles, ₹250. For bigger worries, ₹500, and to cry together, ₹1,000. I am here to listen to people’s problems" 😳pic.twitter.com/cTXeKgzLzl— News Algebra (@NewsAlgebraIND) March 20, 2026 -
సోషల్ మీడియాతో సంతోషం ఆవిరి!
హెల్సింకీ: ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా యువతలో సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. లేనిపోని ఆందోళనకు కారణమవుతోంది. ప్రధానంగా పశి్చమ దేశాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ గురువారం విడుదల చేసిన ‘వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్–2026’ఇదే విషయం వెల్లడించింది. గ్యాలప్ విశ్లేషణ సంస్థ, ఐక్యరాజ్యసమితి సస్టెనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ భాగస్వామ్యంతో ఈ నివేదిక రూపొందించారు. అధ్యయనంలో భాగంగా 147 దేశాల్లో లక్షల మందిని ప్రశ్నించారు. వారి అభిప్రాయాలు సేకరించారు. ప్రపంచంలో ఫిన్లాండ్ అత్యంత సంతోషంగా ఉన్న దేశమని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఈసారి టాప్–10 జాబితాలో ఫిన్లాండ్తోపాటు ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే తదితర దేశాలకు స్థానం దక్కింది. అగ్రరాజ్యం అమెరికాకు 23, కెనడాకు 25, బ్రిటన్కు 29వ ర్యాంకు లభించింది. భారత్కు 116వ ర్యాంకు దక్కింది. నివేదికలోని కీలక అంశాలివీ.. → కోస్టారికా దేశం 2023లో 23వ స్థానంలో ఉండగా, 2026లో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. → ఏమాత్రం సంతోషంగా లేని దేశాల్లో అఫ్గానిస్తాన్, సియెర్రాలియోన్, మలావీ నిలిచాయి. → అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో 25 ఏళ్లలోపు యువత సోషల్ మీడియాకు బానిసగా మారుతోంది. ఫలితంగా వారు వాస్తవ ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. సంతోషానికి దూరమవుతున్నారు. → మనుషులు సంతోషంగా ఉండాలంటే కుటుంబ బంధాలకు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. సామాజికంగా ఇతరులతో స్నేహ సంబంధాలు మెరుగుపర్చుకోవాలి. → సామాజిక జీవితాల్లో నాణ్యత, స్థిరత్వం ఉన్న దేశాల్లో ప్రజలు సంతోషంగా ఉంటున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ ఎమ్మానుయేల్ డీ నెవ్ చెప్పారు. లాటిన్ అమెరికా దేశాల్లో కుటుంబ బంధాలు, సామాజిక సంబంధాలు బలంగా ఉంటాయని వెల్లడించారు. అందుకే అక్కడి ప్రజలు సంతోషంగా జీవిస్తున్నట్లు స్పష్టంచేశారు. → ఫిన్లాండ్తోపాటు ఉత్తర యూరోపియన్ దేశాలు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటన్నది పరిశీలిస్తే.. అక్కడి సంపద, ఆ సంపద పంపిణీలో సమానత్వం, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వాలు ఉండడం, ఆర్థిక విపత్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు చేపట్టడం, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉండడం వంటివి కనిపిస్తాయి. -
అనసూయ ఉగాది వైబ్స్..థాయ్లాండ్ వేకేషన్లో అభినయ..!
టాలీవుడ్ నటి అనసూయ ఉగాది వైబ్స్..మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఉగాది లుక్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ఉగాది పోజులు..టాలీవుడ్ నటి హంసానందని ఉగాది సెలబ్రేషన్స్..థాయ్లాండ్ వేకేషన్లో టాలీవుడ్ నటి అభినయ.. View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
బీజేపీ ఆఫీసులో కలకలం.. పార్టీ నేతపై మహిళ దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ఆఫీసులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పార్టీ కార్యవర్గ సభ్యుల అభినందన కార్యక్రమంలో ఓ మహిళ.. బీజేపీ నేతపై దాడి చేసింది. అతడిని చెంపదెబ్బ కొట్టి, అతడి కాలర్ పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో బుధవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. నామినేటెడ్ కౌన్సిలర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులను అభినందించడానికి పార్టీ నేతలు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ మహిళ ప్రాంగణంలోకి ప్రవేశించి, ఆర్థిక వివాదంపై పార్టీ నేతను కార్యకర్తను నిలదీసింది. తనను లక్షల రూపాయలు మోసం చేశాడని ఆరోపించి, పార్టీ కార్యకర్తల సమక్షంలో అతనిపై దాడి చేసింది. చెంపదెబ్బ కొట్టి, అతని కాలర్ పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించింది. దీంతో ఆ ప్రాంగణంలో కలకలం రేగింది. దీంతో, అక్కడున్న వారంతా జోక్యం చేసుకోవడానికి పరుగెత్తుకొచ్చారు. ఈ ఘర్షణలో తోపులాటలు, మాటల దూషణలు, చెప్పులతో కొట్టుకోవడం వంటివి జరిగినట్లు సమాచారం.यूपी – जिला महराजगंज में BJP के कार्यक्रम में एक महिला कार्यकर्ता ने पुरुष कार्यकर्ता का कॉलर पकड़ लिया, हाथापाई की, उसे चप्पल दिखाई। महिला कार्यकर्ता का आरोप था कि LIC पॉलिसी के नाम पर साढ़े 4 लाख रुपए लिए, लेकिन इस व्यक्ति ने वो पैसे खाते में जमा .!#UttarPradesh #Maharganj pic.twitter.com/IzETG53KxF— Anil Yadav (Journalist) (@AnillYadavIN) March 19, 2026రూ.4.5 లక్షల మోసం ఆరోపణ..ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. తాను ఎల్ఐసీ డిపాజిట్ల పేరుతో సుమారు రూ.4.5 లక్షలు అతడికి అప్పగించానని.. అయితే నిందితుడు ఆ డబ్బును జమ చేయకపోగా దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఆమె చాలా కాలంగా తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆమె తన కుమారుడితో కలిసి ఆ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, వారిద్దరూ వెంటనే డబ్బు తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు.పోలీసుల జోక్యంసమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ వివాదంలో పాల్గొన్న మహిళను, ఇతరులను బీజేపీ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో, దాదాపు గంటపాటు అంతరాయం తర్వాత కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది.పార్టీ స్పందనఆర్థిక వివాదం కారణంగా ఈ ఘర్షణ అకస్మాత్తుగా చెలరేగిందని మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ అభ్యర్థి సమీర్ త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..‘నామినేటెడ్ కౌన్సిలర్లు మరియు మండల అధ్యక్షుల సన్మాన కార్యక్రమం సందర్భంగా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక వివాదం తలెత్తింది. మాకు ముందే సమాచారం అంది ఉంటే, ఈ పరిస్థితిని నివారించే వాళ్లం. వీరిద్దరూ బీజేపీకి చెందినవారే. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
రోడ్డు మధ్యలో బోరింగ్ పంపు.. వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్లో పీడబ్ల్యూడీ ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా వింత ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మధ్యలో బోరింగ్ ఉండగానే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టిన అంశం బయటకు రావడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తేరుకుని దిద్దుబాటు చర్యలకు దిగారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గతేదాడి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మీర్జాపూర్ జిల్లాలో పర్యటించేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ షెడ్యూల్ ఖరారైంది. కాగా, సీఎం యోగి వస్తున్నారని.. అధికారులు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. యోగి వస్తున్న కారణంగా మీర్జాపూర్ జిల్లాలో అధికారులు హడావిడి చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలోని కాంతిత్ ప్రాంతంలో రోడ్డు వెడల్పు పనులను కూడా యమ స్పీడ్గా చేశారు. రోడ్డు పనులు చకచకా కానిచ్చేశారు కానీ.. నడిరోడ్డు మధ్యలో ఉన్న బోరింగ్ పంపును తీసివేయడం మర్చిపోయారు.🚨Mirzapur, UP's new PWD road built AROUND a hand pump. Coordination fail or planning blunder? Who's accountable for this public inconvenience? pic.twitter.com/l1juOKDIsA— indiainlast24hr (@indiain24hr) March 18, 2026బోరింగ్ పంపు నడిరోడ్డుపైన ఉండగానే కొత్త రోడ్డు వేశారు. బోరింగ్ తొలగించకుండానే కొత్త రోడ్డు వేసి కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు చేతులు దులుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. దీంతో, నెటిజన్లు యూపీ ప్రభుత్వం, అధికారులపై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. బోరింగ్ పంపు ఘటన ముఖ్యమంత్రి ఆఫీసుకు కూడా చేరడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. తాజాగా రోడ్డుపై ఉన్న పంపును తొలగించారు. ఈ వీడియో సైతం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ పంపు వ్యవహారం సోషల్ మీడియాలో కొత్త చర్యలకు దారి తీసింది. Handpump In Middle Of The Road, Netizens Slam #PWD #Mirzapur #UttarPradesh #YogiAdityanath pic.twitter.com/VJyrKmY5x9— HW News English (@HWNewsEnglish) March 18, 2026 -
కృత్రిమ మేధ.. వికృత నీడ
మార్ఫింగ్.. ఎక్కడో ఎవరివో ఫొటోలు మార్ఫింగ్ చేశారంటే నోరెళ్లబెట్టి చూసేవాళ్లం. ఇప్పుడు ఆ వికృత క్రీడ మన గడప వరకు పాకింది. మన బడులు, కాలేజీలకూ ఈ జాడ్యం వచ్చేసింది. అందివచ్చిన సాంకేతికతను కొందరు ఇలా తప్పుడు పనులకు వినియోగించడంతో మన అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు, వాట్సాప్ స్టేటస్లు, సరదాగా తీసుకున్న ఫొటోలు సైతం ఇప్పుడు భయపెడుతున్నాయి. ఏఐ సహకారంతో జరుగుతున్న ఈ దురాగతానికి మన ఏమరపాటే అదనుగా మారుతోంది. టెక్కలి : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పక్కదారి పడుతోంది. ఒక వ్యక్తి ఫొటో, వీడియోను ఉపయోగించి ఇష్టానుసారంగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీల ఫొటోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసేవారు. ఇప్పుడు విద్యాలయాలకు ఆ వికృత సంస్కృతి పాకింది. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్తో పాటు బహిరంగ ప్రదేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో వీడియాలు, ఫొటోలను సేకరించి వాటితో వికృతమైన చేష్టలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవగాహన కలిగిన వ్యక్తులు ధైర్యంగా ఫిర్యాదు చేసి నిందితుల్ని సైబర్ పోలీసులకు పట్టిస్తున్నారు. మరి కొంత మంది వీటి బారిన పడినప్పటికీ బయటకు చెప్పుకోలేక తల్లడిల్లిపోతున్నారు. కఠిన శిక్షలు» ఏఐతో కొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వాటిలో మార్ఫింగ్, వాయిస్ క్లోనింగ్, రాజకీయ కుట్రలు తదితర చేష్టలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడడంతో పాటు ఇతర డిజిటల్ దుర్వినియోగానికి కఠినతరమైన శిక్షలను అమలు చేశారు. » ఏఐ ద్వారా వ్యక్తిగతంగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడితే సెక్షన్ 67,67ఏ ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. » ఏఐను వినియోగించి మరో వ్యక్తి మాదిరిగా ఫొటోలు, వీడియోలు సృష్టిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. » మరొకరి సంతకాన్ని డిజిటల్ సంతకంగా మార్చి ఉపయోగిస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. » వీటితో పాటు ఫేక్ న్యూస్ సృష్టించడం, వాయిస్లు సృష్టించడం, నకిలీ ఎల్రక్టానిక్ రికార్డులు సృష్టించడం, మరొకరి గౌరవాన్ని భంగం కలిగించడం వంటి దుర్వినియోగానికి ఐటీ చట్టం 2000 ప్రకారం 66డి, 67 , బీఎన్ఎస్ కింద కఠినతరమైన శిక్షలు పడే అవకాశం ఉంది. అత్యవసర సమయాల్లో 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మంచి పనులకు ఉపయోగించాలి కంప్యూటర్ రంగంలో విప్లవాత్మకంగా కొనసాగుతున్న కృత్రి మ మేధస్సు (ఏఐ) ను మంచి పనులకు ఉపయోగించడం వల్ల అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప తప్పుడు మార్గాలకు వెళితే కచ్చితంగా శిక్షలకు గురికాక తప్పదు. ఏఐ ఉపయోగం, దుర్వినియోగం పై అవగాహన పెంచుకోవాలి. – ప్రొఫెసర్ ఎం.వీ.బీ.చంద్రశేఖర్, హెచ్ఓడీ, సీఎస్ఈ, ఏఐఎంఎల్దుర్వినియోగం చేస్తే కఠినమైన శిక్షలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఏఐను దుర్వినియోగం చేస్తే కఠినతరమైన శిక్షలు ఉన్నాయి. ఏఐను ఒక టూల్గా ఉపయోగించి ఎన్నో ఉపాధి అవకాశాలు సాధించవచ్చు. కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సుల్లో ఏఐతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరిస్తున్నాం. – ప్రొఫెసర్ వీవీ నాగేశ్వరరావు, డైరెక్టర్కచ్చితంగా దొరికిపోతారు అరకొర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న వారి వల్లనే ఏఐ దుర్వినియోగంగా మారుతోంది. వీడియోలు, ఫొటోలు మార్ఫింగ్కు పాల్పడితే కచ్చితంగా పట్టుబడతారు. ఏఐ టూల్స్ వినియోగంలో కొన్ని రకాల చెడు ప్రభావం లేకుండా మార్పులు చేయాలి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదులు చేయాలి. – కె.నిహారిక, సీఎస్ఈ, (ఆర్టిఫిషియల్, మెషిన్ లెర్నింగ్) ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల , టెక్కలి డేటా షేర్ కాకుండా చూసుకోవాలి సోషల్ మీడియాల్లో వ్యక్తిగతమైన డేటా షేర్ కాకుండా చూ సుకోవాలి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో ఫొటోలు, వీడియోలు విషయంగా భద్రత పాటించాలి.– ఎస్.చిరంజీవి, సీఎస్ఈ, ఏఐఎంఎల్మార్ఫింగ్ జరిగితే ఆందోళన వద్దు ఏఐ ద్వారా డీప్ ఫేక్ మార్ఫింగ్ జరిగితే ఆందోళన చెందకూడదు. దీనికి సంబంధించి రక్షణ కోసం సైబర్ విభాగాలు ఉన్నాయి. వారికి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో ఆ వీడియోలు, ఫొటోలను తొలగిస్తారు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలి. – ప్రియాంకపాడి, సీఎస్ఈ, ఏఐఎంఎల్ -
కర్లింగ్ హెయిర్తో బిగ్బాస్ దివి..ఆరెంజ్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి..!
కర్లింగ్ హెయిర్తో బిగ్బాస్ బ్యూటీ దివి..రెస్టారెంట్లో ఆరగిస్తున్న హీరోయిన్ మన్నారా చోప్రా..ఆరెంజ్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి హోయలు..కల్లు తాగుతూ చిల్ అవుతోన్న హేమ, సురేఖావాణి..బీచ్లో ఎంజాయ్ చేస్తోన్న నటాషా స్టాంకోవిచ్.. View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by @natasastankovic__ -
గ్యాస్ బ్లాక్ దందా.. 201 సిలిండర్లు, 33 లక్షలు స్వాధీనం
అమెరికా-ఇజ్రాయెల్.. ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో భారత్లో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో, పలు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల దందా కొనసాగుతోంది. తాజాగా యూపీలో బాత్రూమ్లో సిలిండర్లు దాచిన ఘటన, పశువుల పాకలో 200 సిలిండర్లు దాచి పెట్టిన ఘటనలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాత్రూమ్లో సిలిండర్లు..ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా దాచిపెట్టారనే ఆరోపణ నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బదౌరా మార్కెట్లోని ఒక గృహోపకరణాల దుకాణంలో సోదాలు చేపట్టగా తాళం వేసి ఉన్న బాత్రూమ్ అధికారులకు కనిపించింది. అనుమానంతో గది తలుపును పగలగొట్టి చూడగా అందులో పదుల సంఖ్యలో ఫుల్ సిలిండర్లు, ఖాళీ సిలిండర్లు బయటపడ్డాయి. ఈ ఘటన సమయంలోనే దుకాణం యజమాని మున్నీలాల్ విశ్వకర్మ, అతని కుమారుడు అక్కడి నుంచి పారిపోయారు. అధికారులు రీఫిల్లింగ్ పరికరాలు, పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో, జాన్సా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.#BREAKING : During a late-night raid in Hapur, Uttar Pradesh, local authorities recovered 32 LPG cylinders from a residential property. Officials confirmed that 18 of the cylinders were filled. Further action is being taken in the matter.#LPGSeizure #IllegalLPG… pic.twitter.com/9NR8ZWbcbK— upuknews (@upuknews1) March 13, 2026పశువుల పాకలో 201 సిలిండర్లు..రాజస్థాన్లోని పశువుల పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 201 ఎల్పీజీ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోట్పుట్లి-బెహ్రోర్ జిల్లాలోని శ్యామ్నగర్ ప్రాంతంలో అధికారి శశిశేఖర్ శర్మ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో పశువుల పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 106 ఫుల్ సిలిండర్లు, 95 ఖాళీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పశువుల పాకకు సమీపంలోనే గుంజన్ గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఏ ఏజెన్సీ నడుస్తోంది. సోదాల సమయంలో ఏజెన్సీ యజమాని మదన్ సైని అక్కడే ఉన్నారు. దీంతో, అధికారులు ప్రశ్నించగా.. సరైన పత్రాలు లేకుండానే ఏజెన్సీని నడుపుతున్నట్లు ఆయన అంగీకరించారు. అనంతరం, అధికారులు.. గ్యాస్ సిలిండర్లతో నిండిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్పై రాష్ట్రవ్యాప్తంగా నిఘా ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు.610 LPG Cylinders of Indane, Bharat Gas & HP Gas were seized, which were illegally storedThe Crime Branch, Delhi Police busted an illegal LPG cylinder hoarding racket operating from a godown in Mundka, Outer DelhiTo defame govt and to create panic situation these people can… pic.twitter.com/v9oWJBGHAM— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) March 16, 2026గ్యాస్ చోరీ.. హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక సిలిండర్ నుండి మరొక సిలిండర్కు గ్యాస్ను బదిలీ చేస్తున్న వీడియోలు ఆన్లైన్లో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫరీదాబాద్ అధికారులు ఎల్పీజీ దొంగతనం, అక్రమ రీఫిల్లింగ్, బ్లాక్ మార్కెటింగ్పై చర్యలను ముమ్మరం చేశారు. ఈ విషయమై జిల్లా ఆహార మరియు సరఫరాల శాఖ పలు ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్పై 7 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్టు చెప్పుకొచ్చారు.ఎల్పీజీ బ్లాక్ మార్కెట్.. 33 లక్షలు స్వాధీనంమహారాష్ట్రలో ఎల్పీజీ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అధికారులు తనిఖీలు చేపట్టగా 2,129 దాడుల్లో రూ.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న 1,208 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలకు సంబంధించి మొత్తం 23 మందిపై కేసులు నమోదు చేయగా, నిత్యావసర వస్తువుల చట్టం, 1955లోని నిబంధనల కింద 18 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎల్పీజీ డెలివరీ, బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలకు సంబంధించిన ఫిర్యాదులను తెలియజేయడానికి ప్రభుత్వం 9769919229 అనే వాట్సాప్, హెల్ప్లైన్ నంబర్ను జారీ చేసింది.330 LPG cylinders seized in Bhiwandi, Maharashtra. Three people booked for illegal storage.#lpggasissue #LpgCrisis #LpgCylinder #Maharashtra pic.twitter.com/3RfIiLTZB8— Sachin (@Sachin1649242) March 17, 2026 -
‘నేను బ్రతికే ఉన్నాను మైక్’ : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ
జెరూసలేం: ఇరాన్ జరిపిన దాడిలో తాను మరణించాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఖండిస్తూ వస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆరోగ్యం, ఉనికి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను షేర్ చేశారు.ఆ వీడియోలో ఆయన అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి నడుస్తూ మాట్లాడుతున్నారు. ‘నేను బతికే ఉన్నాను మైక్’ అంటూ నెతన్యాహూ చమత్కరించారు. హకబీ కూడా సరదాగా స్పందిస్తూ, ‘మీ ఆరోగ్యం గురించి డొనాల్డ్ ట్రంప్ నన్ను పంపించారు. మీ క్షేమసమాచారం తెలుసుకోమన్నారు’ అని వ్యాఖ్యానించారు.నెతన్యాహూ స్వయంగా వీడియో విడుదల చేసి తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను బతికే ఉన్నానని స్పష్టం చేశారు. హకబీతో సరదా సంభాషణలో ఆయన ‘అవును, మైక్. నేను బతికే ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు.వీడియోలో సరదా మాటల మధ్య ఇరాన్ నాయకత్వంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల ప్రస్తావన కూడా వచ్చింది. ఈ రోజు, నేను పంచ్ కార్డ్పై ఉన్న రెండు పేర్లను చెరిపేశాను అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఈ వీడియోతో నెతన్యాహూ మరణం పుకార్లకు ముగింపు పలికారు. అయితే సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న అసత్య కథనాలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి.నెతన్యాహూ మరణంపై సోషల్ మీడియాలో పుకార్లు మాత్రం ఆగలేదు. కేఫ్లో కాఫీ తాగుతున్న వీడియోలు, ప్రజలతో మాట్లాడుతున్న క్లిప్లు, చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్న దృశ్యాలు ‘పాతవి. ఇదంతా ఏఐ సృష్టి ’అంటూ ప్రచారం చేస్తున్నారు. ‘ఆయన చేతిలో ఐదు వేళ్లు కాదు, ఆరు వేళ్లు ఉన్నాయి’ అంటూ వింత వాదనలు కూడా వైరల్ అవుతున్నాయి. Crossing names off the list is good - doing it shoulder to shoulder with our American friends is even better.Good to see Ambassador @GovMikeHuckabee. Always a pleasure.🇮🇱🇺🇸 pic.twitter.com/FZrZN03IZI— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 17, 2026 -
గంగా నదిలో బిర్యానీతో ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్
వారణాసి: గంగా నదిలో పడవలో విహరిస్తూ చికెన్ బిర్యానీతో ఇఫ్తార్ విందు చేసుకున్నందుకు యూపీ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. ప్రార్థనా ప్రదేశాన్ని అపవిత్రం చేశారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే, విందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీనిపై బీజేపీ యువమోర్చా నగర విభాగం అధ్యక్షుడు రజత్ జైశ్వాల్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గంగా నది మధ్యలో విహరిస్తూ వీరు మిగిలిన ఆహారపదార్థాలను నీళ్లలోకి పడవేసి అపవిత్రం చేశారని ఆరోపించారు. హిందువులు మనోభావాలను ఉద్దేశపూర్వకంగా కించపరిచారన్నారు. ప్రపంచ దేశాల నుంచి నిత్యం ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులు గంగా నదిని పవిత్రంగా భావిస్తారని, పూజలు చేస్తారని తెలిపారు. In Varanasi, 14 Muslim youths were arrested after holding an Iftar Party on a boat in the Ganga River.An FIR was filed alleging that they consumed chicken biryani during iftar and threw leftover bones into the river, which reportedly hurt religious sentiments.The complaint… pic.twitter.com/VDIdIE3cWi— زماں (@Delhiite_) March 17, 2026 -
రీల్స్ పిచ్చి.. ఇంటి యజమానిని పార్శిల్ చేసిన కుటుంబం?!
బెంగళూరులోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం చేసిన విచిత్ర ప్రయత్నం స్థానికులను, పోలీసులను షాక్కు గురి చేసింది. ఒక మహిళ, ఆమె భర్త, అత్త, మరిది కలిసి పెద్ద ప్యాకేజీని కొరియర్ సర్వీస్ ఆఫీసుకు తీసుకెళ్లారు.పార్శిల్ తరలించే ముందు దాని బరువు ఎంత ఉంది? అందులో ఏమున్నాయి? అని అడగడం సర్వసాధారణం. ఈ ఘటనలో కూడా పార్శిల్ సర్వీస్ కార్యాలయం ప్రతినిధులు ఇదే విధంగా ఆరా తీశారు. సిబ్బంది పార్శిల్ లోపల ఏముందో చెప్పాలని అడగ్గా కుటుంబ సభ్యులు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. ‘మేము కష్టపడి ఇంత దూరం వచ్చాం. ఈ పార్శిల్ను తాము చెప్పిన అడ్రస్కు పంపాలి’ అని పట్టుబడుతూ వాగ్వాదానికి దిగారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన సిబ్బంది ప్యాకేజీని తెరిచి చూడగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంటి యజమాని బయటకు వచ్చాడు.కంగుతిన్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.విచారణలో కుటుంబం చెప్పిన వివరణ మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఉగాది, రంజాన్ మాసంలో బస్సు, ట్రైన్ టికెట్లు దొరకకపోతే గమ్యస్థానానికి ఎలా వెళ్లాలో చూపించేందుకు ఇంటి యజమానిని తెల్లబస్తాలో పెట్టి పార్శిల్ కేంద్రానికి తీసుకువచ్చామని, ఇదంతా సోషల్ మీడియా రీల్స్ కోసం చేశామని తెలిపారు. తరువాత పోలీసులు కుటుంబ సభ్యులను స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరికి వారు క్షమాపణలు చెబుతూ, తాము చేసిన పని బాధ్యతారహితమని అంగీకరిస్తూ వీడియోను రికార్డు చేశారు.పోలీసులు కుటుంబానికి కఠిన హెచ్చరిక జారీ చేసి, ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు మళ్లీ చేయవద్దని సూచించారు. చివరికి వారిని విడిచిపెట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. వినోదం కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి. Daughter & family stuff father in gunny bag, take him to courier office to "send parcel" out of Bengaluru all for a reel showing it's easier to courier a man than book bus/train tickets this festive season. Now in police station. Weird world. 😭pic.twitter.com/gGEpKeeYjM— Ghar Ke Kalesh (@gharkekalesh) March 17, 2026 -
విచ్చలవిడి ‘యూజర్ల’పై ప్రభుత్వం ఉక్కుపాదం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టులపై ఇకపై ప్రభుత్వం తన కీలక శాఖల కళ్లతో నిఘా సారించనుంది. ఇప్పటివరకు కేవలం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు మాత్రమే ఉన్న ‘కంటెంట్ బ్లాకింగ్’ అధికారాలను మరో నాలుగు కీలక మంత్రిత్వ శాఖలకు కూడా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐటీ చట్టం, 2000లోని సెక్షన్ 69 (ఏ) కింద పలు మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఎందుకు ఈ మార్పు?ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఏదైనా వివాదాస్పద పోస్టును తొలగించాలన్నా లేదా బ్లాక్ చేయాలన్నా ఇతర శాఖలు ఐటీ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయాలి. ఈ కారణంగా ఐటీ శాఖ వద్ద ఫైళ్లు పేరుకుపోయి, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించే తప్పుడు సమాచారం, డీప్ఫేక్ వీడియోలు వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.అధికారాలు పొందే శాఖలు ఇవే..ఐటీ మంత్రిత్వ శాఖతో పాటు నేరుగా బ్లాకింగ్ ఆర్డర్లు జారీ చేసే అవకాశం ఉన్న శాఖలు..హోం మంత్రిత్వ శాఖవిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖరక్షణ శాఖసమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అంతేకాకుండా సోషల్ మీడియాలో తప్పుడు ఆర్థిక సలహాలు ఇచ్చే ‘ఫిన్-ఫ్లూయెన్సర్ల’పై చర్యలు తీసుకునేందుకు వీలుగా సెబీ (సెబీ) వంటి నియంత్రణ సంస్థలకు కూడా ఈ అధికారాలు ఇచ్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి.యూజర్లపై ప్రభావంఇటీవలే ప్రభుత్వం సోషల్ మీడియా కంటెంట్ తొలగింపు సమయాన్ని 36 గంటల నుండి కేవలం 3 గంటలకు తగ్గించింది. ఇప్పుడు అధికారాల వికేంద్రీకరణ జరిగితే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫారమ్లకు నేరుగా వివిధ శాఖల నుండి ఆదేశాలు అందుతాయి. అయితే దీనివల్ల ప్రభుత్వంపై చేసే విమర్శలు లేదా సెటైరికల్ పోస్టులు కూడా తొలగించే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా దేశ సార్వభౌమాధికారం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: ‘ట్రావెల్ విత్ జో’ కేసు.. 10 నెలలైనా వీడని ఉత్కంఠ -
అమ్మాయిలు, ఆంటీలతో యువకులు సరదాగా మాట్లాడొచ్చంటూ..
"ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు" అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా యాడ్స్ కనపడుతున్నాయి. అమ్మాయిలు, ఆంటీలతో మాట్లాడొచ్చని అనగానే చాలా మంది అబ్బాయిలు ఆ యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే, అటువంటి యాడ్స్ వెనుక నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు ఉంటుందని అంటున్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్.‘యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్ ఇది. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు. మాయమాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లే. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోగానే, మీ ఫోన్లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయి.ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడుదమని వీడియో కాల్ చేస్తే.. అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్మెయిలింగ్ సెక్స్టార్షన్ కు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం.యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కారు.. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసే భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలి. క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండండి.ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడకండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయండి. బీ అలర్ట్’ అని సజ్జనార్ సూచించారు. "ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు." అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదు.. నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు. యువత… pic.twitter.com/gl9bJcJQi5— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 17, 2026 -
నోరు జారిన లోకేష్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
-
సింగర్ ఓవరాక్షన్.. డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన
పాట్నా: బీహార్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోజ్పురి సింగర్ ధనంజయ్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రైవేటు ఈవెంట్లో భాగంగా స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్తో శర్మ అనుచితంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా.. మహిళ అని కూడా ఆమెను పైకి ఎత్తి జనాలపైకి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోజ్పురి సింగర్ ధనంజయ్ శర్మ తాజగా బీహార్లో ఓ ప్రైవేటు ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాలు విపరీతంగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాటలు పాడుతూ అందరూ ఎంజాయ్ చేస్తున్న తరుణంలో అనూహ్య ఘటన జరిగింది. స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్ను పైకి ఎత్తి జనాల్లో పడేశాడు ధనంజయ్ శర్మ. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా టచ్ చేస్తూ ఆమెను లిఫ్ట్ చేశాడు. అనంతరం, స్టేజ్ కింద ఉన్న ఆడియన్స్పైకి ఆమెను విసిరేశాడు. దీంతో ఆ లేడీ డ్యాన్సర్ తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది.⚠️VIRAL | Singer Dhananjay Sharma lifts female dancer off stage and throws her into reaching fans during Muzaffarpur show. pic.twitter.com/neHNwWTdFl— The Tatva (@thetatvaindia) March 16, 2026ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ధనంజయ్ శర్మకు కొంచెం కూడా బుద్ధి లేదని ఫైర్ అవుతున్నారు. లేడీ డాన్సర్ అని చూడకుండా, పబ్లిక్ సిటీ కోసం ఇలాంటి పనులు చేస్తారా? అని మండిపడుతున్నారు. మహిళలంటే అతడికి ఎలాంటి గౌరవం లేదని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ ధనుంజయ్ శర్మ స్పందించారు.. ఈ క్రమంలో తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో వేదికపై ఏం జరిగిందో ప్రజలకు పూర్తి నిజం తెలియదని ఆయన అన్నారు. తాను పాట పాడుతున్న సమయంలో డ్యాన్సర్లు నన్ను ఢీకొట్టారు. వారు నన్ను పట్టుకుని వేదికపై నుండి నెట్టడానికి ప్రయత్నించారు. ఈ మధ్యలో, ఒక మోడల్ నన్ను తన్ని.. నా ఛాతీపై చేయి వేయడం ప్రారంభించింది. ఇది ఎలాంటి ప్రవర్తన? అని ఆయన ప్రశ్నించారు. సదరు డ్యాన్సర్ను తాను విసిరేయాలని అనుకోలేదని ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సింగర్ ధనంజయ్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. -
శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్.. హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక
ఆస్కార్ వేడుక పిక్స్ షేర్ చేసిన ప్రియాంక చోప్రా..శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్ అందాలు..బ్లూ డ్రెస్లో టాలీవుడ్ నటి వితికాశేరు పిక్స్..ఈవెంట్లో మెరిసిన టాలీవుడ్ భామ మెహరీన్..హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక మందన్నా.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
టీడీపీ ఎంపీ పుట్టా సోషల్ మీడియాలో ఆడుకున్న నెటిజన్లు
-
ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా?
అహ్మదాబాద్: విదేశాల్లో భారీ ప్యాకేజీలు అందుకుంటూ, అత్యాధునిక సాంకేతికతతో పనిచేసి, ఏవో కారణాలతో స్వదేశానికి తిరిగివచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు భారతీయ కంపెనీల్లో వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. క్యాన్సర్ పరిశోధనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)వంటి అత్యున్నత రంగాల్లో అనుభవమున్న టెక్కీలను ఇంటర్వ్యూల్లో ‘నోట్ప్యాడ్' మీద కోడ్ రాయమనడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది.అసలేం జరిగింది?అహ్మదాబాద్కు చెందిన ‘న్యూకాన్స్’ (Pneucons) సంస్థ వ్యవస్థాపకుడు రితేష్ లఖానీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ ఉదంతం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అతని స్నేహితులిద్దరు గత ఐదేళ్లుగా జర్మనీని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఒకరు క్యాన్సర్ కణాలను గుర్తించే ఏఐ మోడల్స్ను రూపొందించగా, మరొకరు మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) పైప్లైన్స్లో నిపుణుడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసం వారు తమ విదేశీ ఉద్యోగాలను వదిలి భారత్కు తిరిగివచ్చారు.అయితే వారు ఇక్కడ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తే.. సదరు రిక్రూటర్లు వారి అనుభవాన్ని పక్కన పెట్టి, 2026వ సంవత్సరంలో కూడా ఒక సాధారణ ‘నోట్ప్యాడ్’ ఇచ్చి కోడ్ రాయమని అడగడం వారిని షాక్నకు గురిచేసింది. ‘క్యాన్సర్ను గుర్తించే ఏఐ మోడల్స్ తయారు చేసే మేధావులను నోట్ప్యాడ్పై కోడ్ రాయమనడం హాస్యాస్పదం’ అని లఖానీ ఎద్దేవా చేశారు.నెటిజన్ల రియాక్షన్: 'ఇది టెక్ ఇంటర్వ్యూనా.. జోకా?'ఈ పోస్ట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ‘భారతీయ ఇంటర్వ్యూ వ్యవస్థ ఇంకా పురాతన కాలంలోనే ఉంది. 15 ఏళ్ల అనుభవం ఉన్నవాడిని కూడా లాజిక్ అడగకుండా, బట్టీ పట్టినట్టు కోడ్ రాయమనడం రిక్రూటర్ల అసమర్థతకు నిదర్శనం’ అని ఒకరు మండిపడ్డారు. ‘అనుభవం ఎంత ఉన్నా ప్రాథమిక అంశాలు ముఖ్యం. నోట్ప్యాడ్పై రాయడం వల్ల వారి సృజనాత్మకత, పట్టు అర్థమవుతుంది" అని మరికొందరు వాదించారు. మొత్తానికి ప్రపంచమంతా ఏఐ వేగంతో దూసుకుపోతుంటే, మన దగ్గర ఇంకా పాత పద్ధతులతోనే ప్రతిభను కొలవడం ఇప్పుడు ఐటీ రంగంలో చర్చకు దారితీసింది.ఇది కూడా చదవండి: UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే.. -
డీప్గా మౌనం..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది. అదేమిటంటే మహిళలకు వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతరించడమే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకునేలోపే ఆ వీడియో 80 లక్షలకుపైగా వ్యూస్ను పొందింది. ఈ రెండేళ్లలో ఇటువంటి డీప్ఫేక్ కంటెంట్ విస్తృతమైంది.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. ఏఐ సేఫ్టీ సంస్థ ‘పై ల్యాబ్స్’నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా డీప్ఫేక్ బాధితుల్లో 93% మంది మహిళలే. ఇటీవలి కాలంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన అనధికారిక కృత్రిమ కంటెంట్ ఏకంగా 900% పెరిగింది. భారత్లో మహిళలు బాధితులుగా నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులు 2024లో సుమారు 50వేలు ఉండగా.. 2025 నాటికి 80 వేలకు చేరుకున్నాయి.ఫొటోల మార్ఫింగ్, అసభ్యకరమైన డీప్ఫేక్ వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నెట్లో కనిపిస్తున్న కంటెంట్లో డీప్ఫేక్ పోర్నోగ్రఫీ అత్యధికంగా ఉంటోంది. వాస్తవ వ్యక్తుల పోలికలు లేకుండా పూర్తిగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన మహిళా రూపాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. మౌనంగా బాధితులు.. మహిళలకు సంబంధించిన 62% డీప్ఫేక్ వేధింపుల ఘటనలు అసలు బయటకే రావడం లేదు. సామాజిక వివక్ష, అవమానం జరుగుతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. చాలామంది ఎదురుదాడి చేయడానికి బదులుగా నిశ్శబ్దంగా తమ డిజిటల్ ఉనికిని (సామాజిక మాధ్యమాల వినియోగాన్ని) తగ్గించుకుంటున్నారు. 33% మందికి తమను రక్షించడానికి ఉన్న చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదు.పరిశ్రమలా విస్తరించాయి..డీప్ఫేక్ వీడియోలతో వేధింపులు కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. విస్తృతంగా ప్రచారంలోకి వచి్చన ఒక కేసులో.. మాజీ భాగస్వామి ఒకరు ఏఐ టూల్స్ను ఉపయోగించి ఒక మహిళ చిత్రంతో అసభ్యకరమైన ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్ను సృష్టించాడు. ఈ విషయాన్ని గుర్తించేలోపే 1.4 మిలియన్ల ఫాలోవర్లను ఆ ప్రొఫైల్ సంపాదించింది.ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐదువేల కంటే ఎక్కువ ఫేస్–స్వాప్ టూల్స్, 1,000 వాయిస్–క్లోనింగ్ అప్లికేషన్స్ ద్వారా ఈ వేధింపులు ఒక పరిశ్రమలా విస్తరించాయి. సాధారణ మహిళలు కూడా సెలబ్రిటీలకు సమానంగా ప్రమాదంలో ఉన్నారు. డీప్ఫేక్లను అరికట్టడం అనేది ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. జెనరేటివ్ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉండటం, దురి్వనియోగం చేసే వారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. వీటిని గుర్తించే సాంకేతికతలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు. -
బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్.. బ్లూ శారీలో త్రిష అందాలు..!
యోగాసనాలు చేస్తోన్న నటి పూనమ్ బజ్వా..బీచ్లో చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్..ఫ్యామిలీతో అనసూయ వాకింగ్ టైమ్..బిగ్బాస్ దివి లేటేస్ట్ గ్లామరస్ లుక్..బ్లూ శారీలో హీరోయిన్ త్రిష అందాలు... View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
బ్లాక్ డ్రెస్లో ఉప్పెన భామ కృతి శెట్టి.. హీరోయిన్ రెజీనా లేటేస్ట్ లుక్..!
బ్లాక్ డ్రెస్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హోయలు..టాలీవుడ్ భామ విష్ణు ప్రియ స్టన్నింగ్ లుక్స్..నగలతో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ త్రిష..శారీలో దిల్ రాజు సతీమణి అందాలు..బ్లూ డ్రెస్లో హీరోయిన్ రెజీనా అందాలు.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
రోజూ వైన్, మాంసం : షాకిస్తున్న 102 ఏళ్ల బామ్మ
తూర్పు చైనాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు తన ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జీవితంపై ఆమె దృక్పథం, లైఫ్స్టైల్, ఫుడ్ తదితర వివరాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వందేళ్లు జీవించినవారు కఠినమైన ఆహార నియమాలు, చక్కటి జీవనశైలి, నియమ నిబద్ధతతో ఉంటారని అనుకుంటాం కదా. కానీ ఈమె అలవాట్లు అందుకు భిన్నం. ప్రస్తుతం సెంచరీ దాటేసింది తైజౌ గ్రామీణ ప్రాంతంలో నివసించే జిన్ బావోలింగ్ (Jin Baoling).సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ 102 ఏళ్ల జిన్ బావోలింగ్ కొడుకు, కోడలు మనవరాలు సహా సన్నిహిత కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. వృద్ధురాలి. దీర్ఘాయువు రహస్యాలు, దినచర్యఏంటో తెలిస్తే షాకవ్వక మానరు.తైజౌ ఈవినింగ్ న్యూస్ నివేదిక ప్రకారం, వందేళ్లు నిండిన ఆమె మానసికంగా చురుగ్గా, సాధారణంగా మంచి శారీరక స్థితిలో ఉంటుంది. గత 50 ఏళ్లుగా ఆమె ఆసుపత్రి మెట్లు ఎక్కకపోవడం విశేషం.జిన్ బావోలింగ్ రోజులో దాదాపు 15 గంటలు నిద్రపోతుందట. ఉదయం 9 గంటలకు నిద్రలేచి, తన తోటలో సూర్యరశ్మిలో కూర్చుని సమయం గడుపుతుంది.గటిపూట కూడా అప్పుడప్పుడు కునుకు తీస్తుంది. రాత్రి 7 గంటలకల్లా పడుకుంటుంది. ప ఆమె ఆరోగ్యంలో ఈ విశ్రాంతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె కుమారుడు చెబుతున్నారు.ఆహారపు అలవాట్లలో మాంసాహారం ఎక్కువ, కూరగాయలు తక్కువ ఉండటం మరో విశేషం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కూరగాయలు తినాలని చెబుతుంటారు, కానీ ఈమె మాత్రం కూరగాయలను అస్సలు ఇష్టపడరు. పైగా 'పిగ్ ట్రాటర్స్' (పంది కాళ్లు) అంటే చాలా ఇష్టం. దీన్ని చైనాలో చాలా రుచికరమైనవిగా భావిస్తారు. కొల్లాజెన్లో సమృద్ధిగా ఉండే ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే కొన్నిసాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగిస్తారట. జిన్ దీన్ని దాదాపు ప్రతిరోజూ తింటుంది. ఇంకా డంప్లింగ్స్, స్టీమ్డ్ బన్స్ లేదా వంటోన్స్ తోపాటు,రోజుకు మూడు ఆరెంజ్ పండ్లు, రెండు గుడ్లు తీసుకుంటారు. వీటితో పాటు కేకులు, బ్రెడ్ , బ్రౌన్ షుగర్, ఖర్జూరాలతో చేసిన టీని ఎంజాయ్ చేస్తారు. ఏమి తిన్నా అన్నీ టైం ప్రకారం తినాల్సిందే.ప్రతీ పూట మందు ఉండాల్సిందే ఆమె ఆహారంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జిన్ ప్రతీ భోజనంతో పాటు రైస్ వైన్ (బియ్యంతో చేసిన మద్యం) తాగుతుంది. ఖర్జూరాలు, లిచీ వంటి పండ్లతో నిల్వ చేసిన ప్రత్యేకమైన వైన్ ఆమె కోసం ఇంట్లోనే సిద్ధంగా ఉంటుంది.ఇంకా ఈమె కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఖర్జూరం, లాంగన్, లీచీ , యమ్బెర్రీస్, రైస్ వైన్ జాడిలు ఉంటాయి.కాళ్ళ కీళ్ళు సమస్యల కారణంగా నడిచేటప్పుడు జిన్కు సహాయం అవసరం కానీ 102 ఏళ్లు ఉన్నప్పటికీ ఆమె చూపు ఇంకా స్పష్టంగానే ఉంది. చేతులు కూడా వణకవు. ఖాళీ సమయంలో సాక్సులు కుట్టడం, చెప్పుల సోల్స్ రిపేర్ చేయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ చురుగ్గా ఉంటుంది. ఆమెలోని పాజిటివ్ మైండ్సెటే దీర్ఘాయువుకు ప్రధాన కారణం అంటారు ఆమె కుమారుడు. అలాగే ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడకుండా, మనసులో కుళ్లు,కుతంత్రాలు లేకుండా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుం దని చెప్పారు. దృఢత్వం, ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా, స్థానికులు ఆమెను ఆప్యాయంగా "ఓల్డ్ బేబీ" అని పిలుచుకుంటున్నారు.నెటిజన్లు స్పందనతమకు నచ్చినట్లు జీవించడమే అసలైన ఆరోగ్యం" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఆమె అలవాట్లను ప్రశంసించారు. “ఆయుర్దాయం కోసం ఉత్తమ ఔషధం ఏమిటంటే, మీరు చాలా సుఖంగా ఉండే విధంగా జీవించడం, అతిగా ఆలోచించని హృదయంతో జీవించడం.” అని ఒకరు, “అమ్మమ్మ జిన్ సుదీర్ఘ నిద్ర , చక్కటి విశ్రాంతితో యువకులను మించిపోయింది.”అని మరొకరు వ్యాఖ్యానించారు.. “ఒక వందేళ్లు దాటిన వ్యక్తి అసాధారణ ఆరోగ్య అలవాట్లతో తన సొంతనిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతున్నందుకు చాలా సంతోషం. నా తాతకు 94 సంవత్సరాలు, అతను తాగడం, ఆలస్యంగా మేల్కొని ఉండటం, ఎక్కువ పాటలు పాడటం, చెస్ ఇష్టపడతాడు.” అంటూ మరొక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. -
అనసూయపై అసభ్యకర పోస్టులు.. ఇద్దరు అరెస్ట్
-
తొక్కతో తింటే... తలనొప్పి తగ్గుతుందా?
ఇటీవల ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల మీద ఆహార సలహాలు చాలా వస్తున్నాయి. ఫలానా ఆహారం ఇలా తింటే ఈ లాభాలనీ, ఫలానా పదార్థాలతో ఇవీ ప్రయోజనాలంటూ రకరకాల సలహాలూ, సూచనలూ నెటిజనులను నిత్యం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అందులో ఒకటి... ఆపిల్ను తొక్కతో సహా పరగడుపునే తీసుకుంటే దీర్ఘకాలికంగా వచ్చే తలనొప్పులు తగ్గుతాయన్నది. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో చూద్దాం! వాస్తవాలేమిటంటే... ఆపిల్ స్కిన్లో చాలారకాల పోషకాలున్న మాట వాస్తవమే. ఉదాహరణకు మలబద్ధకాన్ని తొలగించే పీచు, వ్యాధి నిరోధకశక్తిని సమకూర్చే విటమిన్ సి, ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి నివారణనిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలుంటాయి. ముఖ్యంగా ఆపిల్ తొక్కలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల ఇతరత్రా ఆరోగ్య ప్రయోజనాలకు అవకాశాలున్నాయి. అయితే సాధారణంగా ఆపిల్ తొక్క మెరిసేలా చేయడానికి చాలామంది ఒక రకం మైనపుపూత (వ్యాక్స్)తో ఆపిల్కు మెరుపు తెప్పించి ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు కాబట్టి తొక్కతో తినాలనుకునేవారు వీలైనంతగా కడిగి తినడం మేలు. అదో అపోహ మాత్రమే... పరగడుపున పొట్టుతోనే ఆపిల్ తినడం వల్ల తలనొప్పులు తగ్గుతాయనుకోవడం అపోహ మాత్రమే. తలనొప్పులు అనేక కారణాల వల్ల వస్తుంటాయి. ఉదాహరణకు ఒంట్లో నీటి మోతాదు తగ్గడం, తీవ్రమైన ఒత్తిడి వంటివి. తొక్కతో సహా తినడం వల్ల దేహం రీహైడ్రేట్ కావడం, ఒత్తిడి తగ్గడం వంటివేమీ జరగవు. కాబట్టి తొక్క వల్ల తలనొప్పులు తగ్గడమనేది అపోహేనని నిపుణుల అభిప్రాయం.అయితే తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి వాటిలో ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ గుణాలు కూడా ఉన్నందువల్ల నొప్పి తగ్గడంలో అవి కొంత ఉపయోగపడవచ్చు గానీ... ఉదయం పరగడుపున తొక్కతో ఆపిల్ తినడం వల్లనే తలనొప్పుల నుంచి పూర్తి విముక్తి కలుగుతుందనుకోవడం మాత్రం అపోహ అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే అయినా ‘ప్రతి రోజూ ఆపిల్ తింటే... వైద్యుడి దగ్గరకు వెళ్లక్కర్లేదు’ (ఏన్ ఆపిల్ ఏ డే... కీప్స్ ద డాక్టర్ అవే) అనే సూక్తి ప్రకారం ఆపిల్ను బాగా కడిగాక తొక్కతో తినడంలో ప్రయోజనమే తప్ప నష్టమీదీ ఉండదనేది ఆహార నిపుణుల మాట. -
గ్యాస్ కొరత.. సిలిండర్ను ఇలా కూడా వాడొచ్చా..!
ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ కొరత భయాందోళనలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నా గ్యాస్ సిలిండర్ల ప్యానిక్ బుకింగ్స్ మాత్రం అధికంగానే కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ల యుద్ధం కారణంగా అనిశ్చిత పరిస్థితి రావొచ్చేమోనని భయంతో ప్రజలు ముందుగానే అప్రమత్తమవుతున్నారు. ఇందులో గ్యాస్ సిలిండర్ అంశం ఒకటి.అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడీయో వైరల్గా మారింది. ఈ వీడియోను చూస్తే గ్యాస్ సిలిండర్ను ఇలా కూడా వాడొచ్చా అనిపించకమానదు. నెట్టింటిలో వైరల్గా మారిన ఆ వీడియోలో ఓ వ్యక్తి.. ఖాళీ సిలిండర్ తీసుకుంటాడు. దాన్ని వెల్డింగ్ పనిముట్ల సాయంతో కట్ చేసి.. దాన్ని కట్టెల పొయ్యి మాదిరిగా మార్చేశాడు. ఇలా ఫుల్ గ్యాస్ సిలిండర్ లేదనే చింతను తీర్చుకున్నాడు. ఈ వ్యక్తి తెలివి తేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. వీడు మాములోడు కాదురా నాయనా అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ భయాందోళనలు నడుస్తున్న నేపథ్యాన్ని ఆసరగా చేసుకుని ఇలా వైరల్ కావడానికి కూడా చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మన భారతీయుల టాలెంట్ మామూలు టాలెంట్ కాదుగా 👍pic.twitter.com/AVN1cCRPTS— UttarandhraNow (@UttarandhraNow) March 13, 2026 -
ఖాళీ సిలిండర్ల కామెడీ.. ‘మీమ్స్’ మహోత్సవం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన ఆటంకాలు సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిలిండర్ బుక్ చేశాక రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడంతో, వినియోగదారులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. అయితే ఈ పరిస్థితులను కొందరు తమదైన శైలిలో హాస్యంగా మలుస్తున్నారు. గ్యాస్ కష్టాలపై సోషల్ మీడియా వేదికగా షేర్ అవుతున్న ‘మీమ్స్’ ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి.‘ఉత్తుత్తి’ వంటలు.. వివిధ విన్యాసాలుపశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ దిగుమతులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఇదే తరుణంలో నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ‘ఖాళీ సిలిండర్లు - నిండుగా కామెడీ’ అన్నట్లుగా పరిస్థితి మారింది. స్టవ్ మీద వంట చేస్తున్నట్లు నటిస్తూ, ‘ఇది ఊహాజనిత గ్యాస్’ అని పేర్కొనే వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరికొందరు.. మళ్లీ పాతకాలం నాటి కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నట్లుందని అంటున్నారు.గ్యాస్ అప్పు ఇస్తారా?గతంలో ఇరుగుపొరుగు వారి వద్ద చక్కెర, పాలు అప్పుగా తీసుకునేవారమని, ఇప్పుడు గ్యాస్ అప్పు ఇస్తారా? అని అడిగే రోజులు వచ్చాయంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సిలిండర్లను బంగారు ఆభరణాల్లాగా దాచుకోవడం, వాటికి సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవడం వంటి మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. కేవలం గృహ అవసరాలకే కాకుండా, వాణిజ్య రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు దాదాపు 8 శాతం పెరగడంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణ భారంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతినవచ్చనే భయంతో చాలామంది ముందస్తుగా సిలిండర్లను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కృత్రిమ కొరతకు కూడా దారితీస్తోంది.పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాలతో చర్చలు జరిపారు. హార్ముజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ భరోసా ఇస్తున్నప్పటికీ, అంతటా పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ఎల్పీజీ కష్టాలకు త్వరలో విముక్తి: మంత్రి సురేష్ గోపి -
హైదరాబాద్ పిల్లల సోషల్ మీడియా వినియోగం ఎంతంటే?
పొద్దున లేవగానే ఒకసారి.. స్కూల్కి వెళ్లే ముందు మరోసారి.. మళ్లీ తిరిగొచి్చనప్పటి నుంచి సరదాగా కాలక్షేపానికి.. నిద్రపోయే ముందు కొద్దిసేపు.. ఇదేదో మందులు వేసుకోడానికి ప్రి్రస్కిప్షన్పై రాసిన సమయం అనుకునేరు? అలా అనుకుంటే పొరపాటే.. ఇది ప్రస్తుతం నగరాల నుంచి పల్లెల వరకూ సామాజిక మాధ్యమాల వినియోగంలో పిల్లలు బంధీలైన తీరు. కొందరు టైం పాస్ కోసం.. మరికొందరు సెలబ్రిటీ స్టేటస్ కోసం.. పిల్లలు మొదలుకుని.. పండు ముసలి వరకూ ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి ఖాతాల వినియోగం పెరిగిపోయింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అయితే చెప్పే ప్రసక్తే లేదు.. దైనందిన జీవితంలో కనీసం రెండు గంటల పాటు దీనికోసమే కేటాయిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16ఏళ్ల లోపువారికి సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తామని ప్రకటించడంతో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో సోషల్ మీడియా వాడకం సర్వసాధారణ విషయం. ఈ సోషల్ యాప్స్ వాడకం వయసుతో సంబంధం లేకుండా మారింది. బాల్యం అంటే అటలు.. పాటలు అనే కాలం నుంచి.. బాల్యం అంటే స్మార్ట్ఫోన్ అనే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. అయితే.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదా.? అమలు సాధ్యమా? ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం అధికంగా ఉండే హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో చిన్నారులు, టీనేజర్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిజిటల్ ‘డీలా’.. ఓ వైపు చాట్ జీపీటీ, ఏఐ, జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి టెక్నాలజీ వేదికలతో అంతా స్మార్ట్ మయం అవుతోంది. విద్యా కేంద్రాల్లో, పాఠశాలల్లో టెక్నాలజీ వినియోగం, స్మార్ట్ ఆలోచనలవైపు ప్రపంచం పరుగుపెడుతోంది.. అదే టెక్నాలజీ వినియోగంలో నైపుణ్యం సాధించేందుకు చిన్నారులకు స్మార్ట్ఫోన్, టాబ్లెట్ పరిచయం చేస్తూ.. ఆన్లైన్ క్లాసులు, హోమ్వర్క్ పేరుతో క్రమంగా స్క్రీన్ టైమ్ సోషల్ మీడియావైపు దారి మళ్లుతోంది.ఎంతలా అంటే.. టెక్నాలజీ పరిచయం లేని పాఠశాలల్లోని పిల్లలు సైతం సోషల్ మీడియా ఖాతాలు వినియోగించేలా. రీల్స్, షార్ట్స్, గేమింగ్, లైవ్ స్ట్రీమ్.. వంటి వ్యాపకాలతో అనేక సామాజిక రుగ్మతలకు లోనవుతున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రత్యక్షంగా మాట్లాడే నైపుణ్యాలు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం వంటివి తగ్గిపోయి.. వర్చువల్ ఫ్రెండ్షిప్, లైక్స్, ఫాలోవర్స్ ఆధారంగా రిలేషన్స్ని అంచనావేసే మానసిక ధోరణికి లోనవుతున్నారు. ఫలితంగా ఆందోళన, అసూయ, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. సోషల్ మీడియా అధిక వినియోగం వల్ల నైపుణ్యాలను కోల్పోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. మరీ ముఖ్యంగా స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల కంటి సమస్యలు, దృష్టిలోపం, తలనొప్పి, నిద్రలేమితనం, స్థూలకాయం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. దీంతోపాటు శారీరక చురుకుదనం తగ్గి జీవనశైలి వ్యాధులకు లోనవుతున్నారు. మరోవైపు ఫాలోవర్స్, లైక్స్ సంఖ్య ఆధారంగా స్వీయ విలువను అంచనావేసే మానసిక రుగ్మతకు, ట్రోలింగ్, సైబర్ బుల్లీయింగ్తో తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని, దీనిపై కట్టడి లేకపోతే భవిష్యత్తులో దుష్పరిణామాలను చూడాల్సిన పరిస్థితి తప్పదని మానసిక నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అడిక్షన్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంటి సభ్యులే కారకులవుతున్నారు. పిల్లలకు అన్నం తినిపించడానికి, ఏడవకుండా ఉండడానికి మొదలై.. బిజీ జీవితంలో పిల్లలకు సమయం కేటాయించలేక వారిని అల్లరిని కట్టడిచేయడానికి స్మార్ట్ఫోన్ అలవాటు చేస్తున్నాం. దీంతోపాటు చౌకైన డేటా అనో, అందరూ వాడుతున్నారులే..అనే భావన, కంటెంట్ అల్గారిథమ్స్ పిల్లలను ఎక్కవగా ఆకట్టుకునేలా రూపొందించిన ప్రోగ్రామ్స్ కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని కట్టడిచేయడంలో మొదటి పాత్ర తల్లిదండ్రులదే.. మితిమీరిన వినియోగం వల్ల పిల్లల గోప్యత, భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, బైక్ నెంబర్లను ఆధారంగా చేసుకుని ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన ఆ మధ్య చర్చనీయాంశమైంది. పిల్లల జీవితాలను కంటెంట్గా మార్చడం ఎంతవరకూ సమంజసం? అనేచర్చ ఉత్పన్నమవుతోంది.సర్వే చెబుతోందేంటి? హైదరాబాద్లో ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. 10–16 ఏళ్ల వయసు పిల్లల్లో సుమారు 68 శాతం మంది రోజుకు కనీసం 2–3 గంటలు సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది నిద్ర సమస్య, 30 శాతం మంది చదువుపై దృష్టి తగ్గడం, వయసుకు మించిన సమాచారం తెలుసుకోవడం, సామాజిక, నైతిక పరమైన విషయాల్లో జెన్ జీ తరం కన్నా.. జెన్ ఆల్ఫా తరంలో తేడాలు కనిపిస్తున్నాయని సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. అయితే సంపూర్ణ నిషేధం కంటే.. అవగాహన, నియంత్రణ, తల్లిదండ్రుల భాగస్వామ్యం ముఖ్యమని.. డిజిటల్ లిటరసీ, హెల్దీ స్క్రీన్ హ్యాబిట్స్ నేర్పడం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెంచడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కట్టడి సాధ్యమేనా? దేశంలో చిన్నారుల ఆన్లైన్ భద్రతకు ఐటీ నిబంధనలు, డేటా రక్షణ మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో అమలే పెద్ద సవాలుతో కూడినది. వయసు నిర్ధారణ వ్యవస్థలు బలహీనంగా ఉండటం, తల్లిదండ్రులే అకౌంట్లు తెరవడానికి అనుమతించడం వల్ల నిబంధనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు చిన్నారులకు ఎలాంటి కంటెంట్ చూపించాలి, వేటికి దూరంగా ఉంచాలి అనే విషయాల పై పెద్దలకు అవగాహన లేకపోవడం. సమయ పరిమితితో విద్యాపరమైన వెబ్సైట్లు, ఈ–లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, కథలు, సైన్స్ వీడియోలు, క్రియేటివ్ ఆర్ట్స్ వంటి కంటెంట్ వైపు పిల్లలను మళ్లించడం వారి అభిృద్ధికి దోహదపడుతుంది. -
ఇన్స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలు
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని బుధవారం ఉదయం నుంచీ ఇన్స్టాగ్రామ్ వినియోగ దారులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో యాప్ను ఉపయోగించడంలో సమస్యలొస్తున్నా యంటూ వేలాదిమంది యూజర్లు గగ్గోలే పెడుతున్నారు. ఇన్స్టాలో సందేశాలను పంపలేక పోతున్నారని లేదా వాటికి ప్రత్యుత్తరం ఇవ్వలేక పోతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో సందేశాలు, మీమ్స్తో హల్ చల్ చేస్తున్నారు.ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్ డేటా ప్రకారం 10,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సమస్యలను ఫ్లాగ్ చేశారు, వీరిలో అమెరికా యూజర్లే ఎక్కువున్నారు. ఇండియాలో వందల సంఖ్యలో ఇలాంటి సమస్యలను నివేదించారు. అయితే మెటా యాజమాన్యంలోని కంపెనీ ఇన్స్టాగ్రామ్ దీనిపై ఇంతవరకూ అధికారికంగా స్పందించ లేదు.యూజర్ల ఫిర్యాదులు యాప్ పనిచేయకపోవడంతో, వినియోగదారులలో గందరగోళం, నిరాశకు దారితీసింది. ఇన్స్టాగ్రామ్ DMలు పనిచేయడం లేదంటూ స్క్రీన్షాట్లతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. “ఇన్స్టాగ్రామ్ డౌన్ ఐ రిపీట్ ఇన్స్టాగ్రామ్ డౌన్” అని ఒకరు, మరొకరు “ఇన్స్టాగ్రామ్ dms డౌన్ అయ్యిందా లేదా... నేను కుక్ అయ్యానా” , “ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిందా??? dms నాకు పని చేయడం లేదా అది నేను మాత్రమేనా?” అని మరొకరు ప్రశ్నించారు. మరికొతమంది నెటిజన్లు ట్విటర్లో తమ సమస్యను రిపోర్ట్ చేశారు. “ఇన్స్టాగ్రామ్ పనిచేయడం మానేసిందా? నేను నా స్నేహితుడికి ప్రత్యుత్తరం ఇవ్వలేను” అని ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్లో (గతంలో ట్విట్టర్)లో ఒక వినియోగదారు పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: గల్ఫ్ ఉద్రిక్తతలు : సౌదీకు పాకిస్థాన్ బాసట


