breaking news
Social Media
-
పెళ్లిలో వధువు ల్యాప్టాప్ పట్టుకుని..
వృత్తి నిబద్ధత అనే మాట వినబడుతుందేగానీ కనిపించడం అరుదు. అలాంటి అరుదైన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘కోయల్ ఏఐ’ అనే కంపెనికీ కో–ఫౌండర్ గౌరీ అగర్వాల్.ఆరోజు ఆమె పెళ్లి... వధువుగా పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్న ఆమెకు ‘కోయల్లో ఏఐలో బగ్ ప్రాబ్లమ్’ అంటూ ఒక వార్త వినిపించింది. ‘ఎవరికైనా చెప్పండి’ అని విసుక్కోకుండా... వేదికలో ఒక పక్కకు వెళ్లి... ల్యాప్టాప్ తీసుకొని క్రిటికల్ బగ్ను పది నిమిషాల్లో సాల్వ్ చేసింది గౌరీ అగర్వాల్.‘ఎక్స్’లో ఆమె తమ్ముడు మెహుల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ పోస్ట్ బోలెడు లైక్లతో దూసుకుపోతోంది. ‘స్టార్టప్ల గురించి చాలామంది గొప్పగా మాట్లాడుతుంటారు. అయితే అది అనుకున్నంత తేలిక కాదు. ఎప్పడూ అప్రమత్తంగానే ఉండాలి. విజేతల వృత్తి నిబద్ధత ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ వీడియో క్లిప్ను షేర్ చేశాను’ అని రాశాడు గౌరీ అగర్వాల్ (Gauri Agarwal) సోదరుడు మెహుల్.అయితే సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు గౌరీ అగర్వాల్కు జై కొట్టారు.కొందరు ‘ఇది సరికాదేమో!’ అన్నట్లుగా కామెంట్ పెట్టారు.‘నేను కూడా వృత్తిని బాగా ప్రేమిస్తాను. అందుకోసం అపురూప క్షణాలను మాత్రం వృథా చేసుకోవాలనుకోను’ అని ఒకరు రాశారు. చదవండి: 20 ఏళ్లకే రీసైకిలింగ్ కింగ్..!People romanticize startups but it is a lot of work.This is my sister & co-founder @gauri_al at her own wedding, 10 minutes after ceremony, fixing a critical bug at @KoyalAI.Not a photo op, parents yelled at both of us.When people ask why we won, I'll point to this. pic.twitter.com/ee3wTEYwXG— Mehul Agarwal (@meh_agarwal) December 16, 2025 -
ట్రాఫిక్.. గీఫిక్.. జాన్తా నై!
రూల్స్ ఉండేవే బ్రేక్ చేయడానికి అన్న వాదన నుంచి పుట్టిన సిద్ధాంతం మనది. అందుకే ఎప్పుడు రూల్స్ గురించి మాట్లాడినా.. రాద్ధాంతం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ రూల్స్ అంటారా.. ఇది మరీ విడ్డూరం. దేశంలో ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటిస్తూ అందరితో శభాష్ అనిపించుకున్న.. అందరూ కాకపోయినా ట్రాఫిక్ పోలీసుల మెప్పు పొందిన వారిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. రూల్స్ పాటించడమంటేనే చేతకాని తనానికి నిదర్శనమని త్రికరణశుద్ధిగా నమ్ముతుంటాం. అందుకే ఎదుటి వారికి చెప్పేటందుకే రూల్స్ ఉన్నాయి.. డోంట్ కేర్ అంటూ ఏఎన్నార్ లెక్కన పాటలు పాడుకుంటూ నిర్లక్ష్యంగా తిరిగే వారే ఎక్కువ. ఏదైన రూల్ ఉందంటే అది రాజుగారి గదిలాంటిది. రాజుగారి గదిలోకి మాత్రం వెళ్లకండి అంటే.. కచ్చితంగా అందులోకే వెళ్లడం సగటు భారతీయుని నైజం. ఇదీ అంతే.. రూల్స్ అంటూ ఎవరైనా మాట్లాడితే.. ఆ చెప్పొచ్చావులే పేద్ద.. రూల్స్ అంట రూట్స్.. అని ఆరున్నొక్క రాగాల దీర్ఘం తీయడం మనకు అలవాటై పోయింది.గీ ట్రాపిక్ పురాణం పొద్దుపొద్దులా మాకెందుకు బై అంటే.. జర ఆగుండ్రి మరి.. మన సివిక్ సెన్స్ చూసి విదేశీయులే నోరెల్ల బెడ్తుండ్రంట. పుణెలో ఓ విదేశీయుడు మనోళ్లు ఫుట్పాత్ల మీదికెళ్లి మోటార్ బైకులు చెలాయిస్తూంటే వారిని ఆపి.. ఏందిది? అని అడుగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అందుకే.. ఇక్కడే కాదు.. దేశంలో చాలా చోట్ల విదేశీయులు మన భారతీయుల ఉల్లం‘ఘనుల’ను చూసి.. అరే ఎంత దర్జాగా రూల్స్ వదిలేసి తిరుగుతుండ్రని నోళ్ళు నొక్కుకుంటుండ్రు. మన దేశ రాజధాని ఢిల్లీలో సైకిల్ తిరగాల్సిన చోట వాహనాలు హల్ చల్ చేస్తుంటే.. చూస్తున్న విదేశీయులు రంగప్రవేశం చేసి జనాలకు బాబూ దీన్ని బైసైకిల్ లేన్ అంటారు. ఇక్కడ కేవలం సైకిల్స్ తిరగాలి అంతేకానీ.. ఎడాపెడా పెద్ద వాహనాలు రాకండి అంటూ నిలబడి మరీ చెప్పడం ప్రారంభించారు.కొందరు వీరి మాటలు వింటున్నట్లు నటించినా.. మరి కొందరు బేఫికర్గా వారి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అరే మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ గురించి విదేశీయులు అర్థం చేసుకుని ఇలా పాటించాలి బాబూ అంటున్నా.. వినకుండా వారు అలా చెబుతున్నందుకు విసుక్కొంటున్నారట. పాపం విదేశీయులకు మన థియరీ అర్థం కాలేదు. అరే వీరేందిర బై రూల్స్ అన్నాక ఫాలో కావాలి కదా. పనిగట్టుకుని మరీ రూల్స్ బ్రేక్ చేస్తే వీరికి మాత్రం ఒరిగేదేంటి? అని లోలోపల మదనపడుతున్నారట. విదేశీయులు మన భారతీయులకు ట్రాఫిక్ రూల్స్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.🚨 A foreigner is forcing riders to move out of footpath in Pune. 🙏 pic.twitter.com/XYIqB9AzVs— Indian Tech & Infra (@IndianTechGuide) December 19, 2025మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.అరే ఇదేందిర బై వన్ వే అంటూ రాసిండు గదా.. ఇట్టే వస్తున్నవేంది? అని ఎవరైనా అడిగితే... చుట్టూ ఎలితే లంబా అవుతది గందుకే షార్ట్ గా ఈ తొవ్వలో వస్తుండ అంటూ యమ కూల్ గా సమాధానం చెబుతారు. హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు జర ఫోర్స్ చేసిండ్రు అంటే.. గదేంది సర్ పొద్దునే ఈ రూట్ లో ఇట్టే వెళ్ళా.. గప్పుడు కూడా లేదు.. ఇప్పుడు అడుగుడేంది అంటూ ఉల్టా ప్రశ్న వేస్తుంటే సదరు పోలీసు నోరెళ్ళబెట్టాల్సిందే. ఇగ హారన్ కొట్టుడు అంటే మనకు మస్త్ మజా వస్తది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నా.. హారన్ దంచుతునే ఉంటం.. అరె బై ఆ సప్పుడేంది.. ట్రాఫిక్ ఉంది కదా అని విసుక్కొన్నారో.. హారన్ సౌండ్ మరింత పెరుగుతుంది. అదే విదేశాల్లో హారన్ కొట్టడం అంటే న్యూసెన్స్ గా భావిస్తారు.విదేశాల్లో ఇలా అంటే చాలు ఆ మా బాగా చెప్పొచ్చావులే.. అక్కడికే వెళ్ళలేకపోయావా అంటూ వ్యంగ్యం దట్టించి మరీ మాటలు వదులుతుంటారు. కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే.. యూరోపియన్ దేశాల్లో అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ పట్టింపు చాలా ఎక్కువ. రోడ్డుపై టూవీలర్, ఫోర్ వీలర్ తోపాటు సైకిల్ పై వెళ్లే వారికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. ప్రభుత్వ బస్సులు నడపడానికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. పాదచారులకు వారు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. పెడస్ట్రియన్ సిగ్నల్ పడిందంటే.. ఎన్ని వాహనాలైనా సరే అటూ ఇటూ నిలిచి వేచి చూడాల్సిందే. అలాగే స్కూల్ జోన్ వద్ద సైలంట్ జోన్ అని ఉంటుంది. అక్కడ హారన్ మోగిస్తే ఫైన్ కట్టాలి. అలాగే స్కూల్, హాస్పిటల్ వద్ద స్పీడుగా వెళ్ళినా పెనాల్టీ డబుల్ ఉంటుంది. టొరంటోలో ట్రాఫిక్ ఎప్పుడూ హెవీగానే ఉంటుంది. కానీ ప్రమాదాల శాతం చాలా తక్కువ. మనకూ ట్రాఫిక్ రూల్స్ బోలెడన్ని ఉన్నాయ్.. పాటించేవారి సంఖ్యే తక్కువ. రూల్స్ బ్రేక్ చేయడమంటే మనకు వెన్నతో పెట్టిన విద్య. అది తప్పని కూడా అనుకోం. పాపం ఢిల్లీలో విదేశీయులు మన అరాచకం చూసి అల్లాడిపోయారు. కనీసం రూల్స్ చెబితే పాటిస్తారేమోనని అనుకుని చెప్పడం ప్రారంభించారు. వారిది ఎంత దురాశో కదా.-ఆరెం. -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ కొత్తరూల్ను తీసుకొచ్చింది. హ్యాష్ట్యాగ్ల వినియోగంపై పరిమితి విధిస్తున్నట్లు తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఇక మీద వాటిని పోస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్లకు సూచిస్తోంది.ఇన్స్టాగ్రామ్లో చేసే పోస్ట్ లేదంటే రీల్కు ఇక నుంచి గరిష్ఠంగా ఐదు మాత్రమే హ్యష్ట్యాగ్లు పెట్టుకునే అవకాశముందని ఆ ప్రకటనలో పేర్కొంది. తక్కువ యాష్ ట్యాగ్ల వల్ల పోస్టు బలంగా యూజర్లలోకి వెళ్తుందని.. తద్వారా రీచ్ బాగా అవుతుందని చెబుతోంది. ఇంతకుముందు ఇన్స్టాలో 30 హ్యాష్ట్యాగ్లు పెట్టుకోవడానికి అవకాశముండేది. అయితే.. ఎక్కువ, అసాధారణమైన హ్యాష్ట్యాగ్లు (#reels, #explore) వాడటం వల్ల కంటెంట్ పనితీరు తగ్గుతుంది. అదే తక్కువగా.. అదీ నిర్దేశిత హ్యాష్ట్యాగ్లు వాడడం వల్ల కంటెంట్ డిస్కవరీకి ఎక్కువ అవకాశం ఉంటుందని ఇటు నిపుణులూ సూచిస్తున్నారు. ఉదాహరణ: బ్యూటీ క్రియేటర్లు తమ కంటెంట్కు సంబంధించిన బ్యూటీ హ్యాష్ట్యాగ్లు వాడితే.. ఆ కంటెంట్ను ఆసక్తి ఉన్నవారు సులభంగా కనుగొంటారు. వంట చానెల్స్ నడిపే వాళ్లు.. వాళ్లు చేసే వంటకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ మాత్రమే ఉపయోగించడం బెటర్. ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఏ హ్యాష్ ట్యాగ్ను పడితే ఆ హ్యాష్ట్యాగ్తో పోస్ట్ చేస్తే మొదటికే మోసం రావొచ్చు. ఈ నెల ప్రారంభంలో కేవలం 3 హ్యాష్ట్యాగ్లే ఉపయోగించాలని ఇన్స్టాగ్రామ్ తన యూజర్లను అలర్ట్ చేయాలనుకుంది. కానీ, ఇప్పుడు అధికారికంగా 5 హ్యాష్ట్యాగ్ల పరిమితి అమలు చేయాలని నిర్ణయించింది.హ్యాష్ట్యాగ్లంటే(#).. కంటెంట్ డిస్కవరీకి ఉపయోగపడేవి. సంబంధిత టాపిక్ సెర్చ్లలో, ట్రెండింగ్ లిస్టుల్లో, సెర్చ్ (Explore) ఫీడ్లో కనిపించే అవకాశం ఉంటుంది. సరైన హ్యాష్ట్యాగ్లు వాడితే మీ కంటెంట్ను నిజంగా ఆసక్తి ఉన్నవారు చూసే అవకాశం పెరుగుతుంది. కానీ సంబంధం లేనివి.. అడ్డగోలుగా ఎక్కువ వాడితే కంటెంట్ పనితీరు తగ్గి.. ఎవరికి పడితే వాళ్లకు వెళ్తుంది. అలాగే ఇన్స్టా ఆల్గారిథమ్ ప్రకారమూ స్పామ్గా పరిగణించి రీచ్ తగ్గుతుంది. కాబట్టి ఇన్స్టాలో మాత్రమే కాదు.. ఇతర సోషల్మీడియా ప్లాట్ఫారమ్లోనూ తక్కువగా, సంబంధిత హ్యాష్ట్యాగ్లు వాడటం ఉత్తమని నిపుణులు చెబుతుంటారు. -
తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయం ముందు ఓ రాజకీయ పోస్టర్ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అతి చర్యలకు దిగారు. అన్నాడీఎంకే కార్యకర్తలు ఆలయ పరిసరాల్లో జయలలిత, పళని స్వామి చిత్రాలతో కూడిన పోస్టర్ను పెట్టి రీల్స్ తీశారు. పోస్టర్లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ సీఎం పళని స్వామి చిత్రాలు ఉండటం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆలయ పరిసరాల్లో రాజకీయ చిహ్నాలు, ప్రసంగాలు, ప్రచారం నిషేధం ఉన్నప్పటికీ, కార్యకర్తలు అత్యుత్సాహంతో ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను పట్టించుకోని టీటీడీ భద్రతా అధికారులు విమర్శలకు గురవుతున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలు కఠినంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై టీటీడీ అధికారులు స్పందించారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
లిటిల్ హార్ట్స్ బ్యూటీ గ్లామరస్ లుక్.. సెల్ఫీ పోజులతో ఉప్పెన భామ కృతి శెట్టి!
మరింత హాట్హాట్గా లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివాని..బ్లాక్ డ్రెస్లో మెరిసిన భూమిక చావ్లా..సెల్ఫీ మూడ్లో నాసామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్..క్రిస్మస్ సెలబ్రేషన్స్లో బాలీవుడ్ భామ మలైకా అరోరా..ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సెల్ఫీ లుక్స్.. View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
కూతురు ఆపరేషన్ కోసం వచ్చిన.. శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్
-
పోస్టు ఫార్వర్డ్ చేశాడని 26 కేసులు
బద్వేలు అర్బన్/సాక్షి, హైదరాబాద్ సిటీ బ్యూరో: సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు ఏడాదిన్నర క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్టును ఫార్వర్డ్ చేశాడని నమోదైన ఓ కేసులో వైఎస్సార్ కడప జిల్లా బద్వేలుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు బత్తలపల్లి శ్రీనివాసులరెడ్డిని సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప చిన్న చౌక్ పోలీసులకు అప్పగించారు.బతుకుదెరువు నిమిత్తం దుబాయ్కు వెళ్లిన శ్రీనివాసులరెడ్డి.. కుమార్తె ఆపరేషన్ ఏర్పాట్ల కోసం దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లుకౌట్ నోటీసు ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ కుమారుడికి ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బద్వేలులోని తెలుగుగంగ కాలనీ రోడ్డులో నివసించే రమణారెడ్డి, లక్షుమ్మ కుమారుడైన శ్రీనివాసులరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వైఎస్సార్సీపీ అభిమాని అయిన శ్రీనివాసులరెడ్డి సామాజిక మాధ్యమాల్లో వచ్చే కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను షేర్ చేస్తుంటారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఆయనపై కడపలోని ఓ పోలీసు స్టేషన్తోపాటు బాపట్ల, రేపల్లె, తదితర పోలీసు స్టేషన్లలో ఏకంగా 26 కేసులు నమోదైనట్టు తెలిసింది.కుమార్తె ఆపరేషన్ కోసం వచ్చి..శ్రీనివాసులరెడ్డికి సుహిత, సుబ్బారెడ్డి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో సుహిత మూగ, అంధత్వంతో బాధ పడుతోంది. ఏడాదిన్నర క్రితం హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఒక కంటికి చికిత్స చేయించారు. మరో కంటికి చికిత్స చేయించేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇందుకోసం దుబాయ్ నుంచి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో వెంటనే శ్రీనివాసులరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బద్వేలులోని ఆయన తల్లిదండ్రులు, భార్య కన్నీటి పర్యంతమయ్యారు.తన కుమారుడికి ఏ పాపం తెలియదని, అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఏజెంట్గా కూర్చోవడమే తమ కుమారుడు చేసిన తప్పా అని వాపోయారు. కాగా, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అధైర్య పడొద్దని, పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే డాక్టర్ సుధ పేర్కొన్నారు. ఎమ్మెల్యే, పార్టీ లీగల్ సెల్ న్యాయవాది శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. -
మంచు పేరిట ముంచేశారు!
మంచు అందాలను ఆస్వాదించడానికి మనాలీకి వెళ్లే పర్యాటకులకు షాకింగ్ నిజం బయటపడింది. అక్కడి గైడ్లు.. పర్యాటకుల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసి, కృత్రిమ మంచుతో మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్న ఒక పర్యాటకుడి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.ట్రక్కుల్లో మంచును తరలించి..ట్రక్కుల్లో మంచును తరలించి, దానిని నేలపై పోసి, పర్యాటకులతో ఆటలు ఆడిస్తుండటాన్ని ఈ వీడియో బయటపెట్టింది. అతుల్ చౌహాన్ అనే పర్యాటకుడు ఇన్స్ట్రాగామ్లో షేర్ చేసిన ఈ వీడియోలో, మనాలీలో జరుగుతున్న ’స్నో స్కామ్’ను బట్టబయలు చేశారు. ‘చివరికి, మనాలీలో మంచు ఎలా కురుస్తుందో మీకు చూపిస్తాను. చూడండి.. ఈ వ్యక్తులు మంచును ట్రక్కుల్లో తీసుకువచ్చారు. ఇక్కడ కుమ్మరిస్తున్నారు. ఆ తర్వాత ఈ మంచుపై పర్యాటకులతో ఆడిస్తారు’.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో సహజమైన మంచు ఏ మాత్రం లేదని, పరిసరాలు బీడు భూమిలా కనిపిస్తున్నాయని వీడియో స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు ట్రక్కుల నుంచి పారలతో కృత్రిమ మంచును దించి, నేలపై చల్లడం కనిపించింది. పర్యాటకులు కృత్రిమ మంచుపైనే స్కేటింగ్ చేస్తూ, ఆటలాడుతూ కనిపించారు.గ్లోబల్ వార్మింగ్ఈ వీడియో ఇంటర్నెట్లో కలకలం సృష్టించింది. చాలా మంది నెటిజన్లు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధిక అడవుల నిర్మూలన, అనియంత్రిత నిర్మాణాల కారణంగా.. సహజంగా మంచు కురవడం తగ్గిపోయిందని, ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రభావమని కొందరు వ్యాఖ్యానించారు. మరొకరు స్పందిస్తూ, ‘పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మంచు ఉంటుందని చెప్పి, స్నో సూట్ల కోసం అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. కానీ పర్యాటకులు చివరకు చూసేది చిన్న మంచు ప్యాచ్ మాత్రమే. దానికి అంత డబ్బు, శ్రమ అవసరం లేదు’.. అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ’స్నో స్కామ్’ ఘటన.. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాన్ని, మరోవైపు పర్యాటక రంగంలో జరుగుతున్న మోసాలను బట్టబయలు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అహ్మద్.. అసలైన హీరో
సిడ్నీ: సిడ్నీ బీచ్లో అమాయక యూదులపై ఇష్టారీతిగా తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తున్న ఉగ్రవాది సాజిద్ను సాహసోపేతంగా నిలువరించిన 43 ఏళ్ల అహ్మద్–అల్–అహ్మద్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ధైర్యసాహసాలతో సాజిద్ చేతుల్లోంచి తుపాకీ లాక్కుని పలువురి ప్రాణాలను అహ్మద్ కాపాడారంటూ అతడిని జనం వేనోళ్ల పొగుడుతున్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక్క ఉదుటున సాజిద్పైకి దూకిన వైనం వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్మీడియాలో వైరల్గా మారడంతో అతని ధైర్యసాహసాల గురించే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.కాపాడే క్రమంలో కన్నుమూశాడని చెప్పు...దాడి జరిగినప్పుడు ఆదివారం ఉదయం అదే బాండీ బీచ్లో అహ్మద్ తన స్నేహితుడితో కలిసి రోడ్డు పక్కన కాఫీ తాగుతున్నాడు. ఉగ్రవాది సాజిద్ అక్కడివారిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతుంటే అహ్మద్ హతాశుడయ్యాడు. వెంటనే తేరుకుని ఎలాగైనా సాజిద్ను అడ్డుకుందామని నిశ్చయించుకున్నాడు. పక్కనే ఉన్న స్నేహితుడితో.. ‘‘ వాడిని అడ్డుకునేందుకు వెళ్తున్నా. ఒకవేళ చనిపోతానేమో. నా కుటుంబాన్ని చూసుకో. అహ్మద్ ఎలా చనిపోయాడని నా వాళ్లు అడిగితే ప్రజల్ని కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు అర్పించాడని చెప్పు’’ అని అనేసి వెంటనే రంగంలోకి దూకాడు. కారు చాటుగా దాక్కుంటూ నెమ్మదిగా సాజిద్ వద్దకు చేరుకుని వెంటనే అతడి చేతిలోని పెద్దరైఫిల్ను పెనుగులాట తర్వాత లాక్కున్నాడు. సాజిద్కు రైఫిల్ను గురిపెట్టి అక్కడి నుంచి దూరంగా వెళ్లేలా చూశాడు. తర్వాత రైఫిల్ను కిందపెట్టేశాడు. అయితే దూరంగా ఉండి కాల్చుతున్న సాజిద్ కొడుకు నవీద్ ఇదంతా చూసి అహ్మద్ పైకి కాల్పులు జరపడం మొదలెట్టాడు. దీంతో పక్కన చెట్టుకు పెట్టిన రైఫిల్ను మళ్లీ చేతుల్లోకి తీసుకుని ప్రతిదాడి చేయబోయాడు. అయితే అప్పటికే టెలిస్కోపిక్గా సూటిగా కాలుస్తున్న నవీద్ బుల్లెట్ల ధాటికి అహ్మద్ నిలవలేకపోయాడు. నవీద్ పేల్చిన బుల్లెట్లు అహ్మద్ భుజం, చేయి, అరచేతిలోకి దూసుకెళ్లాయి. ఆలోపు పోలీసులు రంగప్రవేశం చేయడంతో అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికే రక్తమోడుతున్న అహ్మద్ను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. న్యూసౌత్వేల్స్ అగ్రనేత క్రిస్ మిన్స్సహా పలువురు నేతలు, ఉన్నతాధికారులు అహ్మద్ను ఆస్పత్రిలో పరామర్శించారు.గతంలో సైన్యంలో పనిచేసిన అహ్మద్!అహ్మద్ స్వస్థలం సిరియాలోని ఇడ్లిబ్ పట్టణం. 2006లో శరణార్థిగా ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవలే ఇతన తల్లిదండ్రులు సైతం సిరియా నుంచి ఇతని వద్దకు వచ్చేశారు. అహ్మద్ సిడ్నీ సమీప సదర్లాండ్లో సొంతంగా పండ్ల వ్యాపారం చేస్తున్నారు. అహ్మద్ గతంలో సైన్యంలో పనిచేసినట్లు వార్తలొచ్చాయి. అయితే సిరియాలోని అసద్ అల్ బషీర్ ప్రభుత్వంలోనా లేదంటే ఆస్ట్రేలియాలో సేవలందించారా అనేది తెలియాల్సి ఉంది. ప్రాణాలు ఎదురొడ్డి పలువురిని కాపాడిన అహ్మద్ ఇప్పుడు ఆస్పత్రిపాలవడంతో చికిత్స ఖర్చుల కోసం పలువురు దాతలు ముందుకొచ్చారు. ఆన్లైన్లో గోఫండ్మీ క్యాంపెయిన్ మొదలెట్టారు. ఇప్పటికే దాదాపు రూ. 8.61 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ‘‘సైన్యంలో చేసిన నా కుమారుడికి ప్రాణాల విలువ తెలుసు. అందుకే కాపాడేందుకు ఒక్క నిమిషం కూడా ఆలస్యంచేయకుండా పరుగెత్తాడు’’ అని అహ్మద్ తండ్రి మొహమ్మద్ ఫతే అన్నారు. -
లావణ్య బర్త్ డే.. భర్త వరుణ్ తేజ్ లవ్లీ పోస్ట్ (ఫొటోలు)
-
మెస్సీ భాయ్.. మరి నీ లంగ్స్కు ఇన్సూరెన్స్ చేయించావా?
ఫుట్బాల్ రారాజు లియోనెల్ మెస్సీ భారత పర్యటన చివరి అంకానికి చేరుకుంది. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా దేశ రాజధానిలో ఇవాళ ఈ స్టార్ ప్లేయర్ పర్యటించబోతున్నారు. అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న వేళ.. ఈ పర్యటనపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఢిల్లీ పొల్యూషన్ గ్యాస్ ఛాంబర్ను తలపిస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో.. విద్యాసంస్థలకు, ఆఫీసులకు ఊరట ఇచ్చే నిర్ణయాలు తీసుకుంది అక్కడి అధికార యంత్రాంగం. ఈ తీవ్ర వాయుకాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. చాలా చోట్ల జీరో విజిబిలిటీతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల మధ్య అర్జెంటీనా ఫుట్బాల్ వీరుడు రావడంపై జోకులు ఇలా ఉన్నాయి.. 🤧మెస్సీ బాయ్.. ఢిల్లీకి మీకు స్వాగతం. మీ ఎడమ కాలిని 900 మిలియన్ డాలర్లకు((దాదాపు ₹7,500 కోట్లకు పైగా) ఇన్సూరెన్స్ చేయించారని విన్నా. ఇంతకీ మీ ఊపిరితిత్తులకు ఇన్సురెన్స్ చేయించారా?😬విరాట్ కోహ్లి.. మెస్సీ.. ఇది గోట్లు కలిసి చేయబోయే సందడి కోసం ఢిల్లీ ఎదురు చూస్తోంది. కానీ, ఆ దృశ్యం ఇలా ఉండొచ్చు.. అంటూ మసకగా ఉన్న ఇద్దరి ఫొటోను ఓ నెటిజన్ పోస్ట్ చేశాడుFans are waiting to see Virat Kohli and Leo Messi together in Delhi.Meanwhile, this is how the photo would probably look in Delhi air. 😭 pic.twitter.com/xvln8edSu8— Selfless⁴⁵ (@SelflessCricket) December 14, 2025😓మెస్సీ తన కెరీర్లో ఇప్పటిదాకా 896 గోల్స్ చేశారు.. ఇప్పుడు ఢిల్లీ ఏక్యూఐ(వాయు నాణ్యత) ఆ రికార్డును బద్ధలు కొడుతుందేమో! 😎మెస్సీకి పొగ తాగే అలవాటు లేదు. కానీ, ఈ ఒక్కరోజే ఆయన 20 సిగరెట్లు తాగుతారేమో!.. అంటూ ఢిల్లీ పొల్యూషన్ను అన్వయించి సెటైర్లు వేస్తున్నారు. కోల్కతా మినహాయించి హైదరాబాద్, ముంబైలో మెస్సీ పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఫుట్బాల్ అభిమానుల కోలాహలం నడుమ స్టేడియంలో మెస్సీ సందడి చేశాడు. ఇక్కడి అభిమానానికి ముగ్దుడైనట్లు ప్రకటించాడు. నేటితో ఈ టూర్ ముగియనుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ ఈవెంట్కు ప్రధాని మోదీ సైతం హాజర కావొచ్చనే ప్రచారం వినిపించినప్పటికీ.. విదేశీ పర్యటనల నేపథ్యంలో అది జరగకపోవచ్చనే తెలుస్తోంది.లియోనెల్ మెస్సీ ఎడమ కాలికి సుమారు 900 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆయన ఎడమ కాలే ఆటలో ప్రధాన బలం. గోల్స్, ఫ్రీకిక్స్, డ్రిబ్లింగ్ అన్నీ ఎక్కువగా ఎడమ కాలుతోనే చేస్తారు. ఒకవేళ ఏదైనా గాయమై ఆట కొనసాగించలేని పరిస్థితి వస్తే.. క్లబ్లు, స్పాన్సర్లకు ఆర్థిక రక్షణ లభించేందుకు ఇంత భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించారు. అసలు ఈ భారీ ఇన్సూరెన్స్ కారణంగా, మెస్సీ ఇండియా టూర్ 2025లో పూర్తి మ్యాచ్ ఆడలేకపోతున్నారు. ఎందుకంటే.. ఆయనకు అనుమతి ఉన్నది కేవలం అర్జెంటీనా జాతీయ జట్టు, తన క్లబ్ (Inter Miami) తరఫున మాత్రమే పూర్తి మ్యాచ్లు ఆడటానికి. ఎగ్జిబిషన్ మ్యాచ్లు లేదా ఇతర ఈవెంట్లలో పూర్తి స్థాయిలో ఆడితే, ఇన్సూరెన్స్ నిబంధనలు ఉల్లంఘన అవుతాయి.మెస్సీ మాత్రమే కాదు.. ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు ఇతర క్రీడాకారులకు కూడా ఉన్నాయి. ఫుట్బాల్ హీరోలు క్రిస్టియానో రొనాల్డో తన కాళ్లకు, డేవిడ్ బెక్హమ్ తన ముఖానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అయితే.. మెస్సీ ఎడమ కాలు ఇన్సూరెన్స్ విలువ ప్రపంచంలోనే అత్యధికంగా భావించబడుతోంది. -
H-1B వీసా: భారతీయుల విషయంలో ఏం జరగొచ్చు!
న్యూఢిల్లీ: హెచ్–1బీ, హెచ్–4 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్ను, వారు చేసిన పోస్టులను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా తనిఖీ చేయబోతోంది. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశాయి. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల విషయంలో ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోంది. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిసెంబర్ 15, 2025 నుంచి హెచ్–1బీ, హెచ్–4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలించనుంది. ఇది ఇప్పటికే విద్యార్థులు మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్లకు అమలులో ఉన్న నిబంధనను విస్తరించడం ద్వారా జరుగుతోంది.కొత్త నిబంధన వివరాలుఈ కొత్త విధానం ప్రకారం, వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ను “పబ్లిక్” సెట్టింగ్స్లో ఉంచాలి. కనీసం గత ఐదు సంవత్సరాల పోస్టులు, కామెంట్లు, వీడియోలు, ఫోటోలు వంటి సమాచారం పరిశీలనకు వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విటర్), లింక్డిన్.. తదితర ప్రధాన ప్లాట్ఫార్మ్లలోని కంటెంట్ను కాన్సులర్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి అవుతుంది.ప్రభావం-ఆందోళనలుఈ చర్యతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రభావితమవుతారు, ఎందుకంటే హెచ్–1బీ వీసా హోల్డర్లలో 70% పైగా భారతీయులే ఉన్నారు. వీసా ఇంటర్వ్యూలు లేదంటే స్టాంపింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా వీసా ఆమోదం ఆలస్యం కావొచ్చు. ఒక్కోసారి తిరస్కరించబడే ప్రమాదం ఉంది. నిపుణులు దీనిని ప్రైవసీ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు, కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసం అవసరం అని చెబుతోంది.ఇప్పటికే అమలులో ఉన్న విధానం విస్తరణఇప్పటికే విద్యార్థులు (F-1 వీసా) మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్ల (J-1 వీసా) సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే విధానం అమలులో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని తాత్కాలిక ఉద్యోగ వీసాలు (H-1B), వాటి ఆధారిత వీసాలు (H-4) వరకు విస్తరించారు. ఈ మార్పు వల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసే విదేశీ ప్రొఫెషనల్స్ మరింత జాగ్రత్తగా సోషల్ మీడియా వాడకాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. -
చిట్కాలున్నా... చికిత్సే ముఖ్యం!
సోషల్ మీడియా వచ్చాక ఓ ఉత్పాతమూ వచ్చిపడింది. ‘పాత పేషెంట్ కొత్త డాక్టర్తో సమాన’మంటూ అప్పట్లో ఓ సామెత లాంటి వాడుక ఉండేది. దాన్ని నిజం చేస్తూ పాత పేషెంట్లూ అంతకుమించి పాపులర్ సెలిబ్రిటీలైన సోనాలీ బెంద్రే, మనీషా కోయిరాలా, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్, హాలీవుడ్ మోడల్ లీజా రే వంటి జనాల్లో మంచి క్రేజ్ ఉన్న వ్యక్తులు... ‘ఆటోఫేజీ’ అనే ఓ సైంటిఫిక్ పదాన్ని... ఇటీవలి పాపులర్ చిట్కా మంత్రా పదమైన ‘వెల్నెస్ చికిత్స’తో కలగలిపి ‘వెల్నెస్’ అద్భుతాల తాలూకు ప్రభావాలను సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఉపవాసాలూ, డీటాక్స్ విధానాల్లాంటివే అద్భుత మాయా–మంత్రాలంటూ ప్రజలకు ఇంపుగా ప్రజెంట్ చేస్తున్నారు. అసలు అన్నం కంటే పక్కన అంచుకుపెట్టుకుని నంజుకునే చిరుతిండినే నిజభోజనంగా వర్ణిస్తున్నారు. వాళ్ల మాటల మాయల్లో పడుతున్న జనాలు... అసలు వాస్తవాల కంటే అద్భుతాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా ఈ ‘మిరాకిల్స్ థెరపీ’లను ఎక్కువగా నమ్ముతూ ఉండే అదే క్యాన్సర్కు అద్భుత చికిత్సేమోనంటూ అమాయక ప్రజలు అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై క్యాన్సర్ నిపుణులైన డాక్టర్ల మాటేమిటో చూద్దాం.వాళ్లు క్యాన్సర్ను జయించిన యోధులే. అద్భుత మనోబలంతో క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొన్న మహామహులే. తాము క్యాన్సర్ను అధిగమించాక తాము అనుసరించిన చిట్కాలను వెల్లడిస్తూ వాళ్లు చెబుతున్న కొన్ని మాటలేమిటో చూద్దాం. → ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ (రోజుకు నియమిత వేళల్లోనే తిని... మిగతా సమయమంతా ఉపవాసంలో గడపడం), యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామంతో తాను క్యాన్సర్నుంచి బయటపడ్డానంటోంది ప్రముఖ బాలీవుడ్– టాలీవుడ్ ఫేమ్ సోనాలి బెంద్రే. → క్లీన్ ఈటింగ్ ప్రాసెస్ చేయని, రిఫైన్ చేయని, పొట్టుతీయని ముడి ధాన్యాలతో వండిన భోజనం)తో పాటు యోగా, ప్రాణాయామం వంటి వాటితో క్యాన్సర్ను జయించానన్నది ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట. → కీమోతో పాటు... క్రమశిక్షణతో కూడిన జీవనమూ భోజనమూ, దేహంలోని విషాలను శుభ్రపరిచే డీ–టాక్స్ ఆహార విహారాలూ తననుంచి క్యాన్సర్ను దూరం చేశాయంటాడు క్రికెటర్ యూవీ (యువరాజ్ సింగ్). → శాకాహారంతో కూడిన భోజనం, ధ్యానం (మెడిటేషన్), యోగా ఆయుర్వేద మార్గాల పయనం వల్లనే తనకు క్యాన్సర్ నయమయ్యిందంటోంది ప్రముఖ మోడల్, లీజా రే. ఇక్కడ ఈ ప్రముఖులు చెప్పిన చిట్కాలన్నీ ‘ఆటోఫేజీ’ అనే ప్రక్రియను వేగవంతం చేశాయనీ... అందువల్లనే తమకు క్యాన్సర్ వేగంగా, ప్రభావపూర్వకంగా నయమైందంటూ చెబుతున్న సోషల్ మీడియా వేదికగా చెబుతున్న మాటలు సాధారణ ప్రజల మెదళ్లలోకి తేలిగ్గా ఎక్కుతున్నాయి. వాళ్ల మనసుల్లోకి సులువుగా వెళ్తున్నాయి. అయితే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులైన ఆ వెల్నెస్ మార్గాలు మంచివే. కానీ అవే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయలేవని అంటున్నారు. ‘ఆటోఫేజీ’ అనే ఇటీవలి సైంటిఫిక్ పరిభాషకు చెందిన ఆ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నది వైద్యప్రముఖుల మాట. దాంతోపాటు ‘అపాప్టోసిస్’, ‘ ప్రోటీయోజోమ్’ అనే పదాలకు అర్థాలు వాటి వెనక పరమార్థాలూ తెలుసుకుంటే కేవలం అద్భుతాలనిపించే చికిత్సప్రక్రియలు... (మిరాకిల్ రెమిడీలు) మాత్రమే కాకుండా వాస్తవ చికిత్సలకు తోడుగా... ఈ అనుబంధ మార్గాలూ జతగూడినప్పుడే అసలు ఫలితాలు వస్తాయంటున్న డాక్టర్ల మాటల ఆంతర్యాలను తెలుసుకుందాం...అసలు ‘ఆటోఫేజీ’ అంటే ఏమిటి? దేహంలో ఎప్పటికప్పుడు కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అందులో చనిపోయిన కణాలతో పాటు కొన్ని నిరర్థకమైనవీ, వ్యర్థమైనవీ ఉంటాయి. మన దేహంలోని శుభ్రం చేసే వ్యవస్థ ఇలాంటి మృతకణాలూ, నిరర్థక, వ్యర్థకణాలను తొలగిస్తూ ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైన కణాల మనగడను సుగమం చేస్తూ, ఈ మృత, వ్యర్థ, నిరర్థక కణాలను తినేసే ప్రక్రియనే ‘ఆటోఫేజీ’ అంటారు. ఈ సెలిబ్రిటీల మాటేమిటంటే... పైన చెప్పిన ఉపవాసాలూ, ప్రాణాయామ ధ్యానాలూ, డీటాక్స్ ప్రక్రియల వంటి వెల్నెస్ మార్గాల ద్వారా మన ఆరోగ్యకరమైన కణాలన్నీ ‘క్యాన్సర్ కణాలనే’ తినేస్తే? అప్పుడు క్యాన్సర్ హరించుకుపోయి ఆరోగ్యం దక్కుతుందనేలా వారి సోషల్ మీడియా సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి. అంతకంటే సంక్లిష్టమైనది ఆటోఫేజీ...నిజానికి ‘క్యాన్సర్ బయాలజీ’లో ఆటోఫేజీ ప్రక్రియ అంతకంటే చాలా సంక్లిష్టమైనది అంటున్నారు ఆధునిక వైద్యచికిత్సకులు. ఒకసారి అదేమిటో చూద్దాం. ∙కణంలో మరిన్ని సూక్షమైన అంతర్గతమైన భాగాలు (ఆర్గనెల్స్) దెబ్బతిన్నప్పుడు ఆ కణం మనుగడ కష్టం. అది చనిపోయే ప్రక్రియలో దేహం దాన్ని శుభ్రం చేసి తొలగిస్తుంది. అందులోని ప్రోటీన్ శిథిలాలను ఒకచోట చేర్చి ఊడ్చేస్తుంది. అలా చనిపోయిన లేదా బలహీనపడి నిరర్థకం కాబోతున్న కణాలను దేహం తొలగించివేస్తుంది. దీన్నే ‘ఆటోఫేజీ’ అంటారు.అదీ మరచిపోతున్న ముప్పు... ఇదీ చేస్తున్న తప్పు... ఇక్కడ సెలిబ్రిటీలు ఒక విషయం మరచిపోతున్నారు. తమకున్న పరిమితమైన వైద్యపరిజ్ఞానంతో అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నప్పుడు తన జీవక్రియల కోసం దేహంలోని కణాలు తమకు కావాల్సిన ఆహారం కోసం మృత/వ్యర్థకణాలనూ, క్యాన్సర్ కణాలనూ తినేస్తాయని భావిస్తున్నారు. కానీ ఇక్కడ వారు ఒక ముప్పును విస్మరిస్తున్నారు. క్యాన్సర్ కణం కూడా ఒక కణమే. దానికీ ఆహారం కావాలి. ఉపవాసం ద్వారా దానికి అవసరమైన ఆహారాలు అందనప్పుడు అది కూడా ఆరోగ్యకరమైన కణాలనూ తినేయడం మొదలుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... మామూలు కణం కంటే కూడా అది మరింత చురుగ్గా, మరింత వేగంగా ఆరోగ్యకరమైన కణాలను కబళించవచ్చు. పైగా ఆహారం అందకపోవడంతో దేహాన్ని రక్షించుకునే వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత బలహీనపడితే క్యాన్సర్ కణజాలాలే మామూలు ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం ప్రారంభిస్తే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి! అంటే ఉపవాసం వల్ల క్యాన్సర్ ఎండిపోవడానికి (ఫాస్టింగ్ స్టార్వ్స్ క్యాన్సర్) బదులుగా తామే ఆకలితో మాడాల్సి వస్తుందని తెలిసినప్పుడు క్యాన్సర్ కణాలు ఇంకా ఇంకా కుతంత్రాలతో (కన్నింగ్గా) ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం మొదలుపెట్టే ప్రమాదలెన్నో పొంచి ఉంటాయి.ఆటోఫేజీ లాంటిదే ఆటాప్టోసిస్... సెలిబ్రిటీలు ఆటోఫేజీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం వల్ల దాని గురించి మామూలు ప్రజలకు తెలియరావచ్చు. కానీ... ఈ రంగంలో ఇలా ఆటోఫేజీలా పనిచేస్తూ క్యాన్సర్ కణాలను తినేసేందుకు దోహదపడే పరిశోధనలూ, అలాంటి పరిజ్ఞానాలూ, పరిభాషా... ఇలాంటివి వాళ్లకు తెలియని అంశాలెన్నో ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు అటాప్టోసిస్, యూబిక్విటిన్– ప్రోటియోజోమ్ సిస్టమ్ వంటివి. ఉదాహరణకు అటాప్టోసిస్ అంటే ఏమిటో చూద్దాం. ఎవరినైనా బాగా కించపరిచి, కోలుకోలేనంతగా నిందిస్తే వాళ్లేం చేస్తారు? తట్టుకోలేక ఆత్మహత్యకూ ఒడిగట్టవచ్చు కదా! అచ్చం అపాప్టోసిస్ ప్రక్రియలో కూడా అలాంటిదే జరుగుతుంది.యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ సిస్టమ్ అంటే... యుబిక్విటిన్ అనేది ఏ ప్రోటీన్కు అంటుకుంటుందో దాన్ని కాలపరిమితి ముగిసిపోయిన లేదా చెడిపోయిన / లోపభూయిష్టమైన ప్రోటీన్గా గుర్తించవచ్చు. అది కణంలో ఉన్నప్పుడు కణం సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే యుబిక్విటిన్ ప్రోటీన్ కణం నుంచి తొలగిపోవాలి. అప్పుడే కణం చురుగ్గా నార్మల్ కణంగా ఉంటుంది. అలా కణం నుంచి యుబిక్విటిన్ను తొలగించడానికి తోడ్పడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ... అంటే యుబిక్విటిన్ ప్రోటీన్ను ధ్వంసం చేసేందుకు తోడ్పడే వ్యవస్థే ప్రోటియోజోమ్ వ్యవస్థ. అంటే ప్రోటియోజోమ్ అన్నది ప్రోటీన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ అన్నమాట. ఈ యుబిక్విటిన్ అనేది అలాగే ఉంటే అది చెడిపోయిన కణానికి అమరత్వం ఇస్తుంది. ఒకవేళ ఆ చెడిపోయిన కణాలకు అమరత్వం ఉంటే అవి తొలగిపోవు. కాబట్టి ఈ ప్రోటియోజోమ్... తన డబుల్ నెగెటివ్ మార్గంలో వాటిని గుర్తించి ధ్వంసం చేస్తుంది. అలా చెడుకణాలూ లేదా దెబ్బతిన్న/లోపభూయిష్టమైన కణాలను తొలగిస్తుంది. ఇతి జరిగేందుకు దోహదపడేదే ‘యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ వ్యవస్థ’గా చెబుతారు.కొన్ని మందులతో ప్రోటీయోజోమ్ ప్రక్రియను అడ్డుకుని క్యాన్సర్ను తగ్గించడం ఇలా... ఈ యుబిక్విటిన్– ప్రోటియోజోమ్ ప్రక్రియను గుర్తించిన వైద్య శాస్త్రవేత్తలు ‘బార్టెజోమిబ్’ అలాగే ‘కార్ఫిల్జోమిబ్’ వంటి ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లను తయారు చేసి ప్రయోగించారు. ఈ మందులతో ‘మైలోమా’ అనే క్యాన్సర్ నయం కావడం మొదలైంది. ఇలాంటి మందులను ( ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్ను) మరిన్ని కనుగొనడం ద్వారా అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చూసినప్పుడు ఆటోఫేజీ, అపాప్టోసిస్, ప్రోటీయోజోమ్ అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. అవి కొనసాగే మార్గాలను (పాత్ వేస్) అనేక మందుల సహాయంతో నిర్వహితమయ్యేలా చేయడం వల్ల క్యాన్సర్ కణం తనంతట తాను మటుమాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఇది ‘మైలోమా’లోనే సఫలీకృతమైంది. కానీ ఇంకా కొన్ని క్యాన్సర్ల (సాలిడ్ ట్యూమర్స్) విషయంలోనూ, మరిన్ని క్యాన్సర్లలోనూ విజయవంతం కావాల్సి ఉంది. ఇందుకోసం రకరకాల కాంబినేషన్లలో అపాప్టోసిస్ మాడ్యులేటర్లు, ఇమ్యూనో, టార్గెట్ థెరపీ ప్రక్రియలూ, ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లు రూపొందించడంలో వైద్యశాస్త్రజ్ఞులు నిమగ్నమై ఉన్నారు.ఆ అపోహలన్నీ అలా ఆవిర్భవించినవే... ఎన్నో ఏళ్లుగా అటాప్టోసిస్ ప్రక్రియను క్యాన్సర్ను జయించేందుకు ఒక ప్రత్యామ్నాయ ‘నేచర్ క్యూర్’ ప్రక్రియగా జనం అపోహపడుతున్నారు. కొన్ని ఆహారాల ద్వారా క్యాన్సర్ లాంటి లోపభూయిష్టమైన కణాలు తమంతట తామే తమ మరణశాసనం రాసుకునేలా చేయడం (యాక్టివేటెడ్ / ప్రోగ్రామ్డ్ సెల్ డెత్)గా చాలామంది పొరబడుతుంటారు. కానీ అది పొరబాటు. క్యాన్సర్ కణాలు ఎంత జిత్తులమారివి అంటే... అవి ‘అటాప్టోసిస్’నూ తప్పించుకోగలవు. అదెలాగంటే... సెల్ను అపాప్టోసిస్కు గురిచేసే ప్రక్రియలో క్యాన్సర్ కణంలోని పవర్హౌజ్ అయిన మైటోకాండ్రియాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ‘బీసీఎల్–2’ అనే కుటంబానికి చెందిన మరో ప్రోటీన్ విడుదలై అది యాంటీ అపాప్టోటిక్ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియాలోకి రసాయనాలు వెళ్లకుండా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది.చివరగా... ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన క్యాన్సర్ చికిత్సలు రేడియోథెపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్సలే. వీటి తర్వాతే ఉపవాసాలూ, యోగా, ధ్యానం, డీ–టాక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలూ, పోషకాహారాలూ, నేచురోథెరపీలను అనుబంధంగా ఉపయోగించుకోవాలి. ఏ సెలిబ్రిటీలు చెప్పినా అవి ప్రత్యామ్నాయ చిట్కాలే తప్ప ప్రధాన చికిత్సలు కావని అందరూ తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.అపాప్టోసిస్ అంటే... క్యాన్సర్ అంటేనే అది చెడిపోయిన / నార్మల్గా ఉండని కణం అన్న విషయం తెలిసిందే. ఏవైనా రసాయనాల ద్వారా ఓ చెడిపోయి దెబ్బతిన్న కణాన్ని మరింతగా అవమానించేలా చేస్తే అది బాగా కుంగి కుచించుకుపోయి నశించిపోయే పరిస్థితే ‘అపాప్టోసిస్’ అని చెప్పవచ్చు. నిజానికి చాలా సంక్లిష్టమైన జీవరసాయన పద్ధతికి ఇక్కడ చెప్పినది మామూలు ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఇదో సింపుల్ వివరణ అనుకోవచ్చు. అంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి ఓ కణాన్ని అవమానించడం ద్వారా దాని మరణాన్ని అదే తెచ్చుకునే ‘ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్’ కార్యక్రమం ఈ అపాప్టోసిస్.నిర్వహణ: యాసీన్ -
సోషల్ మీడియా పోస్టులపై ఈటెల రాజేందర్ అసహనం
సాక్షి, హన్మకొండ: బీజేపీ నేత ఈటెల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎంపీ బండి సంజయ్ PRO సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.నేను బీజేపీ పార్టీ ఎంపీని. నేను కూడా కొన్ని పోస్టులు చూశాను. అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అసలు అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతాడా? ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలు తేల్చుకుంటారు. వీటిపైన పార్టీ తేలుస్తుంది.. టైమ్ విల్ డిసైడ్. ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెప్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. రెండో, మూడో విడత ఎన్నికలు అయ్యాక జరిగిన పరిణామాలన్నీ అధిష్ఠానానికి చెప్తానని ఈటెల పేర్కొన్నారు.అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టులపై ఈటెల అసహనం వ్యక్తం చేయడం, పార్టీ లోపల విభేదాలు ఉన్నాయనే సంకేతాలను ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సోషల్ మీడియా నిషేధంపై కోర్టుకు
మెల్బోర్న్: పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆన్లైన్ వేదిక రెడ్డిట్ సవాలు చేసింది. ఈ అమెరికన్ ఆన్లైన్ ఫోరమ్ శుక్రవారం హైకోర్టులో దావా వేసింది. యువతను రక్షించాలనుకుంటే ప్రభుత్వానికి మరింత మెరుగైన మార్గాలున్నాయని, కానీ సోషల్ మీడియా కనీస వయసు చట్టం వల్ల రాజకీయ చర్చల నుంచి వేరుచేయడం అవుతుందని, ధ్రువీకరణ ప్రక్రియ కూడా అంత సురక్షితం కాదని రెడ్డిట్ తెలిపింది. 16 ఏళ్ళలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. పిల్లల ఆన్లైన్ భద్రతరీత్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఆస్ట్రేలియా పిల్లల ఖాతాలను తొలగించకపోతే రెడ్డిట్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, కిక్, స్నాప్చాట్, త్రెడ్స్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్లకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ కొత్త నిబంధనలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే.. దీనిపై ఇప్పటికే ఇద్దరు బాలికల తరపున సిడ్నీకి చెందిన హక్కుల వేదిక డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్టు గత నెలలో కేసు వేసింది. కాలిఫోరి్నయాకు చెందిన రెడ్డిట్ దానిని అనుసరించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని రెండు వాజ్యాలు పేర్కొన్నాయి. -
‘సోషల్’స్వరాలు మూగబోయిన దేశాలు
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది ఒక కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు.. జీవితంలో ఒక అంతర్భాగం. Facebook, Instagram, YouTube, X (గతంలో Twitter) తదితర ప్లాట్ఫారమ్లు కుటుంబ సభ్యుల ఫోటోలను పంచుకోవడం మొదలు.. సామాజిక ఉద్యమాలను నిర్వహించడం వరకు నెరవేరుస్తూ.. ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల పౌరులకు ఈ డిజిటల్ స్వేచ్ఛ అందుబాటులో లేదు. పలు దేశాలు జాతీయ భద్రత, నైతికత తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, సామాజిక నెట్వర్క్లపై కఠినమైన నిబంధనలను విధించడం లేదా పూర్తి నిషేధాలను కొనసాగించడం చేస్తున్నాయి. ఏఏ దేశాలు ఈ తరహా వైఖరిని కలిగివున్నాయి? ఎటువంటి చర్యలు చేపట్టాయనే వివరాల్లోకి వెళితే..చైనాలో ‘గ్రేట్ ఫైర్వాల్’ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఇంటర్నెట్ నియంత్రణలను అమలు చేస్తున్న దేశం చైనా. ‘గ్రేట్ ఫైర్వాల్’ విధానంతో Facebook, X, Instagram, YouTube వంటి ప్రధాన అంతర్జాతీయ ప్లాట్ఫారమ్లను చైనా పూర్తిగా బ్లాక్ చేసింది. దేశీయ ప్రత్యామ్నాయాలు (WeChat, Weibo వంటివి) ఉన్నప్పటికీ, అవి ప్రభుత్వ పర్యవేక్షణ, సెన్సార్షిప్కు లోబడి ఉంటాయి. జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వం పేరుతో ఈ ఆంక్షలను విధిస్తోంది. ఫైర్వాల్ను దాటేందుకు వీపీఎన్లను వాడటం సాంకేతికంగా చట్టవిరుద్ధం. ఫలితంగా జరిమానాలు లేదా నిర్బంధంలాంటి శిక్షలు ఉంటాయి.ఉత్తర కొరియా.. బాహ్య కమ్యూనికేషన్కు దూరం ప్రపంచ ఇంటర్నెట్ యాక్సెస్పై ఉత్తర కొరియా పూర్తి నిషేధం విధించింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఏవీ ఈ దేశంలో అందుబాటులో లేవు. పౌరులకు విదేశీ వార్తలు లేదా బాహ్య కమ్యూనికేషన్కు ఎలాంటి యాక్సెస్ ఉండదు. దేశీయ కమ్యూనికేషన్ కోసం ప్రభుత్వం ఆమోదించిన కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వీటిలో కఠినంగా నియంత్రించిన ఇంటర్నెట్ను మాత్రమే ఉపయోగిస్తారు. బాహ్య ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేసే స్థానికులకు కఠిన శిక్షలు ఉంటాయి.ఇరాన్.. కానరాని అంతర్జాతీయ సోషల్ మీడియాఇరాన్ దేశం పలు అంతర్జాతీయ సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది. Facebook, YouTube, X వంటివాటికి చాలా పరిమితమైన యాక్సెస్ ఉంటుంది. 2022 సామూహిక నిరసనల తర్వాత Instagramను కూడా నిషేధించారు. టెలిగ్రామ్, వాట్సాప్ తదితర మెసేజింగ్ యాప్లపై తరచూ నిబంధనలను విధిస్తుంటారు. ప్రజా నైతికత, జాతీయ భద్రత, నకిలీ వార్తల వ్యాప్తిని నిరోధించేందుకు ఈ ఆంక్షలు అవసరమని ప్రభుత్వం తెలిపింది. అయితే బ్లాక్ చేసిన ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేసేందుకు ఇరానియన్లు వీపీఎన్లపై ఆధాపడుతుంటారు. అటువంటి సందర్భాల్లో వారికి ప్రభుత్వం జరిమానాలు వడ్డిస్తుంటుంది. వీపీఎన్ అంటే ‘వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్’. దీని ద్వారా ఇంటర్నెట్ను రహస్యంగా వినియోగిస్తుంటారు.తుర్క్మెనిస్తాన్.. నిత్యం పర్యవేక్షణ తుర్క్మెనిస్తాన్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ యాక్సెస్కు అనేక పరిమితులున్నాయి. Facebook, వాట్సాప్, X వంటి ప్లాట్ఫారమ్లను తరచూ బ్లాక్ చేస్తుంటారు. అలాగే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రొవైడర్ల ద్వారా ఫిల్టరింగ్తో పర్యవేక్షిస్తుంటారు. వీపీఎన్ల ద్వారా బ్లాక్ చేసిన ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేయడం సర్వసాధారణం అయినప్పటికీ, ఇది జరిమానాలకు దారితీసే అవకాశం ఉంది.ఆఫ్ఘనిస్తాన్.. ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు పెరిగాయి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై నిత్యం నిఘా ఉంటుంది. కొన్ని ప్రావిన్సులలో అధికారులు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. నైతిక లేదా మతపరమైన పాలనా నియమాలకు విరుద్ధమైన కంటెంట్పై పూర్తి నిషేధం అమలులో ఉంది.టర్కీ.. జాతీయ విలువల కోసం.. దేశంలో రాజకీయ అశాంతి, నిరసనలు, భద్రతా సంక్షోభాల సమయంలో టర్కీ.. సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం విధిస్తుంటుంది. ఉగ్రవాద దాడులు, రాజకీయ ప్రదర్శనల సమయంలో వాట్సాప్, యూట్యూబ్, ‘ఎక్స్’ లాంటి ప్లాట్ఫారమ్లను కొన్ని రోజుల పాటు బ్లాక్ చేశారు. భద్రత, తప్పుడు సమాచారం నివారణ లేదా జాతీయ విలువలను కాపాడేందుకు ఇలా చేశామని అధికారులు తెలిపారు. టర్కీ చట్టాల ప్రకారం ఈ ప్లాట్ఫారమ్లు దేశంలో తమ ప్రతినిధులను నియమించాలి. స్థానికంగానే డేటాను నిల్వ చేయాల్సి ఉంటుంది.మయన్మార్.. తిరుగుబాటు తర్వాత.. 2021 ప్రారంభంలో జరిగిన తిరుగుబాటు తరువాత, మయన్మార్ సైనిక పాలన నిరసనలు లేదా అశాంతియుత కాలంలో సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లపై (ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మొదలైనవి) నిషేధం విధించింది. ఈ నిషేధం.. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకేనని ప్రభుత్వం తెలిపింది. రష్యా.. వీడియో కాలింగ్పై నిషేధంరష్యాలో సోషల్ మీడియాపై నిషేధాలు తక్కువే అయినప్పటికీ, పలు పరిమితులు ఉన్నాయి. చట్ట అమలుకు సహకరించడం లేదనే ఆరోపణలతో WhatsApp, టెలిగ్రామ్ వంటి విదేశీ మెసేజింగ్ యాప్లలోని వాయిస్ లేదా వీడియో కాలింగ్ ఫీచర్లు పరిమితం చేశారు. ఆయా ప్లాట్ఫారాలు స్థానిక కార్యాలయాలను తెరవాలని, తీవ్రవాద కంటెంట్ను నియంత్రించాలని రష్యా డిమాండ్ చేస్తున్నది.నేపాల్.. పునరాలోచనసోషల్ మీడియా కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో విఫలం కావడంతో Facebook, Instagram, YouTube, ‘ఎక్స్’ తో సహా 26 ప్రధాన ప్లాట్ఫారమ్లపై నిషేధాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం నిరసనలకు దారితీసింది. దీంతో ఈ నిషేధాన్ని కొద్ది రోజుల్లోనే ఎత్తివేశారు. అయితే ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేస్తున్నదని సమాచారం.ఇది కూడా చదవండి: వణికిస్తున్న సూపర్ఫ్లూ.. రికార్డు స్థాయి కేసులు -
ఆస్ట్రేలియా టీనేజర్లకు స్క్రీన్ లాకౌట్
మెల్బోర్న్ (ఆస్ట్రేలియా): పదహారేళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించడా న్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బ నీస్ స్వాగతించారు. ప్రపంచంలోనే మొట్టమొ దటిదైన ఈ నిషేధం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే నిషేధం అమలు కష్టంతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు. నిషేధం అమలుతో తమ ఖాతాలు మూతపడినట్లు తెలుసుకున్న పిల్లలు బాధ పడ్డారని తల్లిదండ్రులు తెలిపారు. కొందరు చిన్న పిల్లలు తమ ముఖాలపై మీసాలు, గడ్డం చిత్రించుకుని, సోషల్ మీడియా ప్లాట్ఫాంల వయసు అంచనా సాంకేతికతను మోసం చేయగలిగారని వెల్లడించారు. తల్లిదండ్రులు, అన్నలు లేదా అక్కలు కూడా.. కొంతమంది పిల్లలకు ఈ ఆంక్షలను తప్పించుకోవడానికి సహాయం చేస్తారని భావిస్తున్నారు.కన్నవారికి మనశ్శాంతి తథ్యం‘బిగ్ టెక్ కంపెనీల నుంచి ఆస్ట్రేలియా కు టుంబాలు అధికారాన్ని తిరిగి పొందే రోజు ఇది. పిల్లలు పిల్లల్లా ఉండటానికి, తల్లిదండ్రులకు మరింత ప్రశాంతత లభించడానికి నిషేధం ఉపకరిస్తుంది’.. అని అల్బనీస్.. ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్ప్తో వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా పిల్లలు.. వారి బాల్యాన్ని హాయిగా గడిపేందుకు వీలు కల్పిస్తుంది. ఆస్ట్రేలియా తల్లిదండ్రులకు మరింత మనశ్శాంతినిస్తుంది. ఆస్ట్రేలియా చేయగలిగితే, మనం ఎందుకు చేయలేం?’ అని ప్రపంచ సమాజం ఆస్ట్రేలియా వైపు చూస్తుంది’.. అని అల్బనీస్ చెప్పారు. ఒక బిడ్డ ఆత్మహత్యకు సోషల్ మీడియా కారణమని ఆరోపించే తల్లిదండ్రులతో సహా, సోషల్ మీడియా సంస్కరణ మద్దతుదారుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఉల్లంఘిస్తే భారీ జరిమానాబుధవారం నుంచి 16 ఏళ్లలోపు ఆస్ట్రేలియా పిల్లల ఖాతాలను తొలగించడానికి సహేతుక మైన చర్యలు తీసుకోకపోతే, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, కిక్, రెడ్డిట్, స్నాప్చాట్, థ్రెడ్స్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్ వంటి ప్లాట్ఫాంలు గరిష్టంగా 49.5 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే.. సుమారు 32.9 మిలియన్ల అమెరికన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.క్రిస్మస్ నాటికి నివేదికఈ నిషేధాన్ని ఆస్ట్రేలియాలోని ఈ–సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ అమలు చేస్తారు. వయస్సు పరిమితిని కచ్చితత్వంతో అమలు చేయడానికి ప్లాట్ఫాంల వద్ద ఇప్పటికే సాంకేతికత, వారి వినియోగదారుల వ్యక్తిగత డేటా అందుబాటులో ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. వయసు పరిమితిని ఎలా అమలు చేస్తున్నారు?, ఎన్ని ఖాతాలు మూతపడ్డాయి? అనే అంశంపై సమాచారం ఇవ్వాలని కోరుతూ లక్షిత పది ప్లాట్ఫాంలకు గురువారం నోటీసులు పంపుతానని వెల్లడించారు. ‘ఈ వయస్సు పరిమితులు ఎలా అమలు అవుతున్నాయో, అవి ప్రాథమికంగా పనిచేస్తున్నాయో లేదో క్రిస్మస్ లోపు ప్రజలకు సమాచారం అందిస్తాం’.. అని ఇన్మాన్ గ్రాంట్ చెప్పారు. కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ మాట్లాడుతూ, బుధవారానికి ఆస్ట్రేలియాలో 200,000 కంటే ఎక్కువ టిక్టాక్ ఖాతాలు నిలిపివేసినట్లు వివరించారు. -
డల్లాస్లో హీరోయిన్ శ్రీలీల చిల్.. బ్లాక్ డ్రెస్లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ అందాలు..!
డల్లాస్లో హీరోయిన్ శ్రీలీల సందడి..బ్లాక్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఆలియా భట్ అందాలు..టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ అలాంటి లుక్స్..కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోదావరి టూర్..బ్యూటీఫుల్ డ్రెస్లో ప్రియమణి హోయలు..డిఫరెంట్ డ్రెస్లో రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ పిక్స్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
బోరుగడ్డ అనిల్కుమార్ మా పార్టీ కాదు: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: బోరుగడ్డ అనిల్కుమార్ అనే వ్యక్తి తమ పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని.. అతనితో ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ స్పష్టత ఇచ్చింది. పలు ఇంటర్వ్యూలలో అనిల్ పలువురు నేతలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగానూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘బోరుగడ్డ అనిల్కుమార్తో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అతను మా పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. అతని మీద టీవీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఎలాంటి సంబంధం లేదు. బోరుగడ్డతో మాపార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’ అని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్పై పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో.. పోలీసులు రోడీ షీటర్గా గుర్తించారు. ఇంతకు ముందు పలు కేసుల్లో అరెస్ట్ కూడా అయ్యాడు. అయితే.. ఆ సమయంలోనూ తాను వైఎస్సార్సీపీ మనిషినంటూ ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతనికి సంబంధించిన ఇంటర్వ్యూలలోనూ పార్టీ ప్రస్తావన తేవడంతో వైఎస్సార్సీపీ ఓ స్పష్టత ఇచ్చింది. -
విజయ్ ర్యాలీలో గర్జించిన లేడీ సింగం
కరూర్ విషాదం నేపథ్యంలో.. టీవీకే సభలు, ర్యాలీలకు షరతులు, పరిమితులతో నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా పుదుచ్చేరిలో జరిగిన విజయ్ ర్యాలీ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పరిమిత సంఖ్యలో కార్యకర్తలు(అభిమానుల్ని) అనుమతించడంతో కొందరు బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే లేడీ సింగం గర్జించింది.. మంగళవారం ఉదయం ఉప్పలం ఎక్స్పో గ్రౌండ్ వద్ద విజయ్ ర్యాలీ జరుగుతున్న సమయంలో టీవీకే నేత బస్సీ ఆనంద్.. బారికేడ్ల వద్దకు వచ్చి ‘‘లోపల స్థలం ఉంది.. రండి..’ అంటూ జనాల్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఐపీఎస్ అధికారిణి ఇషా సింగ్ వెంటనే ఆయన చేతిలో ఉన్న మైక్ను లాగిపడేశారు. 40 మంది ప్రాణాలు పోయాయి కదా.. మళ్లీ అలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారా? అని ఆయన్ని ఆమె నిలదీశారు. ఈ క్రమంలో.. అనుమతించిన సంఖ్యకు మించి ఒక్కరినీ కూడా లోపలికి అనుమతించబోమని కుండబద్ధలు కొట్టారామె. దీంతో.. ఆయన మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కరూర్ ఘటన తర్వాత పుదుచ్చేరి పోలీసులు కఠిన నియమాలు అమలు చేశారు. రోడ్షోకు అనుమతి లేదు, ప్రజల సంఖ్యను 5,000కి పరిమితం చేశారు. QR కోడ్ పాస్ ఉన్నవారికే ప్రవేశం ఇచ్చారు. అయితే అంత జాగ్రత్తలు పాటించినా కూడా ఓ వ్యక్తి తుపాకీతో రావడం కలకలం రేపింది.Isha Singh IPS: UT: 2021 Gets Promotion To SSP Rank. She brings a rare combination of legal expertise and enforcement experience to her role. Read: https://t.co/D9i27rqJBi@HMOIndia @PuducheryPolice @iamishasingh @RajeshwarS73 pic.twitter.com/szTgMDL0Xx— Witness In The Corridors (@witnesscorridor) September 1, 2025 ఇషాసింగ్(28) 2020లో యూపీఎస్సీ ఆల్ ఇండియా 191 ర్యాంకర్. 2021 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఇషా సింగ్.. ప్రస్తుతం పుదుచ్చేరి పోలీస్ సూపరింటెండెంట్. ఆమె తండ్రి మాజీ ఐపీఎస్ వైపీ సింగ్(ముంబై పోలీస్ కమిషనర్గానూ పని చేశారు). తల్లి అభాసింగ్ లాయర్, సామాజిక కార్యకర్త. ఇషా సింగ్ నేషనల్ లా స్కూల్నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐపీఎస్ కాకముందు.. లాయర్గా ప్రాక్టీస్ చేశారు.தவெக தொண்டர்களால் பாராட்டு பெற்ற Isha Singh IPS 🔥புதுச்சேரியில் விதித்த கட்டுப்பாடு தமிழ்நாட்டில் விதித்தால் உடனே தமிழ்நாடு அரசாங்கம் இடையூறு செய்கிறது என்று குற்றம் சொல்லுவான் தற்குறி விஜய்.🤦🏽♀️கரூர் சம்பவம் மூலம் விஜய் கூட்டத்தை எப்படி கெடுபிடிகள் செய்து நடத்தவேண்டும் என்று… pic.twitter.com/3DTUksgxqY— நந்தினி ❣️ (@Nandhini1360381) December 9, 2025 -
Karthika Nair : నాలో ఓ భాగం కోల్పోయా.. నటి రాధ కూతురు కార్తీక ఎమోషనల్ (ఫొటోలు)
-
ఇండిగో సంక్షోభం: హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో
భారతదేశపు అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంతో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితులు ఇపుడిపుడే ఒక కొలిక్కి వస్తున్నాయి. అయితే విమానాల రద్దు, ప్రయాణీకుల అగచాట్ల నేపథ్యంలో ఇండిగో పై సోషల్మీడియాలో అనేక మీమ్స్, కామెడీ పంచ్లు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఇండిగోను విమర్శిస్తూ వచ్చిన ఒక AI-వ్యంగ్య వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.‘‘ఇండిగో కొత్త విమానాలు: ఆలస్యం లేదు, మళ్లింపులు లేవు... చాలా రీజనబుల్’’ అనే శీర్షికతో పోస్ట్ అయిన ఈ వీడియోలో ఇండిగో విమానం మాదిరిగా గానే ఒక ఆటో రిక్షాను మనం చూడవచ్చు. పైలట్ల కొరత, ఒక్క డిసెంబర్లోనే 2,000 కంటే ఎక్కువ విమానాల రద్దు, తీవ్రమైన కార్యాచరణ వైఫల్యం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ విడియో రావడం గమనార్హం. IndiGo’s new fleet: no delays, no diversions…. and very reasonable 😃 pic.twitter.com/llHqkloH6T— Harsh Goenka (@hvgoenka) December 9, 2025కాగా భారతదేశ దేశీయ విమానయాన మార్కెట్లో దాదాపు 65 శాతం వాటా ఉన్న ఇండిగో, పైలట్ల కోసం కొత్త పనిగంటలు, నైట్ డ్యూటీలు వారపు విశ్రాంతి పరిమితులను (FDTL) తీర్చడానికి కార్యాచరణ వనరులను సర్దుబాటు చేయకుండా ఇండిగో తన శీతాకాలపు షెడ్యూల్లో రోజువారీ విమానాలను 6శాతం పెంచడంతో సమస్యలు తలెత్తాయి.దీంతో ఊహించనరీతిలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. వేలాదిమంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో చిక్కుకుపోయి అనేక ఇబ్బందులు పడ్డాడు. దీనిపై కేంద్ర విమానాయాన మంత్రిత్వశాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు చేపట్టింది. దీనిపై దర్యాప్తునకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, ఇండిగో దేశీయ షెడ్యూల్లో 10శాతం కోత విధించాలని మంగళవారం ఆదేశించింది. గతంలో జారీ చేసిన 5శాతం తగ్గింపుతో పోలిస్తే ఇది రెట్టింపు. -
టీనేజర్ల డిజిట్రబుల్స్!
డిసెంబరు 10 బుధవారం సూర్యోదయం కాగానే, ఆ్రస్టేలియా చరిత్రలో తొలిసారిగా ఒక చట్టం అమల్లోకి రానుంది. దేశంలోని 16 ఏళ్ల లోపు యువతకు సోషల్ మీడియా తలుపులు మూసుకుపోతాయి. అయితే, ప్రపంచంలోనే ఈ తొలి నిషేధం, రిలే అలెన్ అనే 15 ఏళ్ల స్కూల్ బాయ్కి నిద్ర లేకుండా చేస్తోంది. దక్షిణ ఆ్రస్టేలియాలోని కేవలం 1,000 మంది జనాభా ఉన్న ’వుడిన్నా’ అనే చిన్న కమ్యూనిటీకి 5 కిలోమీటర్ల దూరంలో రిలే కుటుంబం నివసిస్తోంది. గొర్రెల ఫారంలో నివసించే ఈ కుర్రాడికి, దూరంగా ఉన్న స్నేహితులతో మాట్లాడడానికి సోషల్ మీడియానే ఏకైక మార్గం. బుధవారం అర్ధరాత్రి దాటితే, 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సహాధ్యాయులతో ఎలా అందుబాటులో ఉండాలి?.. ఒక్క మీట నొక్కగానే.. తమ ప్రపంచం తెగిపోతుందనే భయం ఈ పల్లెటూరి పిల్లాడిని వెంటాడుతోంది. ఉల్లంఘిస్తే భారీ జరిమానా బుధవారం నుంచి 16 ఏళ్లలోపు ఉన్నవారు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, కిక్, రెడ్డిట్, స్నాప్చాట్, త్రెడ్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్ తదితర ప్లాట్ఫాంలలో ఖాతాలను కలిగి ఉండకుండా చట్టం నిషేధిస్తుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, ఆయా ప్లాట్ఫాంలపై 32.9 మిలియన్ల వరకు భారీ జరిమానాలు విధిస్తారు. ‘మెటా’.. ఇప్పటికే అనుమానిత యువకుల ఖాతాలను తొలగించడం ప్రారంభించింది. రిలేకు.. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, కానీ ఏ క్షణమైనా తనను తొలగిస్తారేమోనని భయపడుతున్నాడు. ఇదీ చదవండి: ఉల్లి, వెల్లుల్లి తెచ్చిన తంటా, 11 ఏళ్ల బంధానికి స్వస్తినా కొడుక్కి సాయం చేసేదే లేదు.. రిలే తల్లి, స్కూల్ టీచర్ అయిన సోనియా అలెన్ మాత్రం.. నిషేధాన్ని తప్పించుకోవడానికి తన కొడుక్కి సహాయం చేయనని స్పష్టం చేసింది. అయితే, ఇతర తల్లిదండ్రులు సహాయం చేస్తారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. గతంలో రిలే.. అర్ధరాత్రి వరకు సోషల్ మీడియాలో మునిగితేలుతూ హోంవర్క్ చేయనందుకు, రెండు నెలలపాటు అతని సోషల్ మీడియాను ఆమె నిషేధించింది. ‘అప్పటినుంచే తన కొడుకు మరింత బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను ఉపయోగించడం నేర్చుకున్నాడు’.. అని అలెన్ గుర్తు చేసుకుంది. ఏప్రిల్లో 16 సంవత్సరాలు నిండనున్న రిలే.. ఈ నిషేధం లక్ష్యాలను అర్థం చేసుకున్నానని, అయితే వాటిని సాధించడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశాడు. చిన్న పిల్లలు నిద్రకు దూరం కాకుండా, రాత్రి 10 గంటల నుండి సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తప్పనిసరిగా నిషేధించాలని సూచించాడు.హైకోర్టులో టీనేజర్ల పోరాటం రిలేకు.. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరమైన సిడ్నీలో ఒక మిత్రుడు ఉన్నాడు. ఆగస్టులో 16 ఏళ్లు వచ్చే నోహ్ జోన్స్. మరో విద్యారి్థని మేసీ నైలాండ్లు ఈ చట్టాన్ని హైకోర్టులో సవాలు చేస్తున్నారు. ఈ చట్టం అక్రమంగా 2.6 మిలియన్ల యువ ఆ్రస్టేలియన్ల రాజకీయ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కును లాగేసుకుంటుందని వారు వాదిస్తున్నారు. కాగా, సోషల్ మీడియా వల్ల తమ పిల్లలకు కలుగుతున్న హానిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారని ఆ్రస్టేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఈ సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 140 మందికి పైగా అంతర్జాతీయ విద్యావేత్తలు.. ప్రధాని ఆంథోనీ అల్బనీస్కు రాసిన బహిరంగ లేఖపై సంతకం చేశారు. ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో అపశృతి : ఒక్కసారిగా కూలిన పైకప్పునిషేధం దాటేస్తారు: నిపుణుల హెచ్చరిక డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్ట్ అధ్యక్షుడు జాన్ రూడిక్.. ఈ నిషేధం అమలులోకి రాకుండా కోర్టు నిషేధాజ్ఞ కోసం ప్రయతి్నంచాలని భావించారు, కానీ న్యాయవాదుల సలహా మేరకు విరమించుకున్నారు. ఈ రాజ్యాంగ సవాలుపై పూర్తిస్థాయి విచారణ ఫిబ్రవరి చివరిలో జరగనుంది. పిల్లలు ఈ నిషేధాన్ని తప్పించుకోవడానికి వీపీఎన్లను ఉపయోగించి తమ స్థానాన్ని మార్చుకుంటారని ఆయన అంచనా వేశారు. ‘పిల్లలు దీన్ని తప్పించుకుంటారు, ఆ తర్వాత వారు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా, మరింత ప్రమాదకరమైన ’అండర్గ్రౌండ్’ సోషల్ మీడియాను ఉపయోగిస్తారు’.. అని రూడిక్ హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 10, 2025 నుంచి అమలులోకి రానుంది.ఆస్ట్రేలియా ప్రభుత్వం ‘ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ (సోషల్ మీడియా మినిమం ఏజ్) బిల్లు’ ను 2024 నవంబర్లో ఆమోదించింది. ఈ చట్టం ఆన్లైన్ సేఫ్టీ చట్టం 2021 (Online Safety Act 2021)కు సవరణగా ఉంది.ఈ నియమంలోని కీలక అంశాలు ఏమిటి?ఈ చట్టం ముఖ్య ఉద్దేశం పిల్లలపై కాకుండా సోషల్ మీడియా సంస్థలపై బాధ్యతను మోపుతుందని ప్రభుత్వం తెలిపింది. కొన్ని నిర్దిష్ట సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వినియోగదారులు ఖాతాలను సృష్టించకుండా లేదా కొనసాగించకుండా నిరోధించడానికి సంస్థలు సహేతుకమైన చర్యలు తీసుకోవాలి.తల్లిదండ్రులు అనుమతి ఇచ్చినా కూడా 16 ఏళ్ల లోపు వారు ఈ ప్లాట్ఫామ్లను ఉపయోగించడానికి అనుమతి లేదు.ప్రస్తుతానికి ఈ నిబంధనలు వర్తించే ప్రధాన ప్లాట్ఫామ్లు ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్, టిక్టాక్, ఎక్స్, రెడ్డిట్, థ్రెడ్స్, ట్విచ్, కిక్.ప్రధానంగా మెసేజింగ్ లేదా గేమింగ్ కోసం ఉపయోగించే WhatsApp, Discord, Roblox వంటి సర్వీసులను ప్రస్తుతానికి మినహాయించారు. అయినప్పటికీ, సేఫ్టీ కమీషనర్ అవసరాన్ని బట్టి భవిష్యత్తులో ఈ జాబితాను మార్చే అవకాశం ఉంది.ప్లాట్ఫామ్లు వినియోగదారుల వయస్సును నిర్ధారించడానికి కొత్త వయస్సు ధ్రువీకరణ విధానాలను అమలు చేయనున్నారు.సంస్థలు వయస్సు ధ్రువీకరణ కోసం ప్రభుత్వ గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా కోరకూడదు. అయితే ఫొటో లేదా వీడియో ఆధారిత వయస్సు అంచనా లేదా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించే అవకాశం ఉంది.అనుసరించకపోతే జరిమానాలుఈ నిబంధనలను పాటించడంలో విఫలమైన సోషల్ మీడియా సంస్థలకు గరిష్టంగా 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ.270 కోట్లు) వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. పిల్లలకు లేదా వారి తల్లిదండ్రులకు ఎలాంటి జరిమానాలు ఉండవు. ఈ చట్టం బాధ్యత పూర్తిగా టెక్ కంపెనీలపై మాత్రమే ఉంటుంది.ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలుఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత పట్ల ఉన్న తీవ్ర ఆందోళనలే కారణం. సోషల్ మీడియా అధిక వినియోగంతో కౌమార దశలో ఉన్నవారిలో ఆందోళన, నిరాశ, ఒంటరితనం పెరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. నిరంతర పోలికలు, లైక్ల కోసం ఎదురుచూడటం, సైబర్బుల్లింగ్ (Cyberbullying-డిజిటల్ వేదికల ద్వారా ఇతరులను అవమానించడం, బెదిరించడం, వేధించడం లేదా హింసించడం) వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రభుత్వం భావిస్తోంది.ప్రమాదకరమైన కంటెంట్ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ‘ప్రెడేటరీ అల్గారిథమ్స్’ కారణంగా పిల్లలు హింస, ఆత్మహత్యకు ప్రేరేపించే అంశాలు, అసభ్యకరమైన కంటెంట్, తప్పుడు సమాచారం వంటి ప్రమాదకరమైన కంటెంట్ బారిన పడుతున్నారు. ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ దీన్ని ‘బిహేవియరల్ కొకైన్’తో పోల్చారు.సోషల్ మీడియా వేదికలు పిల్లల మధ్య తోటివారి ఒత్తిడికి, ఆన్లైన్ వేధింపులకు వాహకంగా మారుతున్నాయి. మోసగాళ్లు పిల్లలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇవి సులువైన మార్గాలుగా మారుతున్నాయి.సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లలు చదువు, నిద్ర, ఆటలు వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు దూరం అవుతున్నారు.కంపెనీలపై ప్రభావం ఇలా..ఈ నియమం వల్ల సోషల్ మీడియా కంపెనీలు ముఖ్యంగా ఆదాయం, మార్కెట్ పరిమాణం పరంగా నష్టాలను ఎదుర్కొంటాయి. 16 ఏళ్ల లోపు ఉన్న వినియోగదారులను తొలగించడం లేదా వారిని చేర్చుకోకపోవడం వల్ల ఆస్ట్రేలియాలో మొత్తం యూజర్ బేస్ గణనీయంగా తగ్గుతుంది. ఈ వయస్సు సమూహం తరచుగా అత్యంత చురుకైన వినియోగదారులలో ఒకటిగా ఉంటుంది.ప్రకటనల ఆదాయంపై ప్రభావంసోషల్ మీడియా కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు. యూజర్ల సంఖ్య తగ్గితే ప్రకటనలను చేరుకునే అవకాశం ఉన్న జనాభా (Ad Reach) కూడా తగ్గుతుంది. ఫలితంగా ప్రకటనదారులకు ప్లాట్ఫామ్ ఆకర్షణ తగ్గి ప్రకటనల ఆదాయం తగ్గుతుంది.నియంత్రణ అమలు ఖర్చులువయస్సు ధ్రువీకరణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, వాటిని అమలు చేయడానికి టెక్ కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టాలి. ఈ కొత్త సాంకేతికతలను కొనసాగించడం, డేటా భద్రతను నిర్ధారించడం, స్థానిక చట్టాలను నిరంతరం పర్యవేక్షించడం అనేది అదనపు నిర్వహణ ఖర్చులను పెంచుతుంది.సాంకేతిక సవాళ్లువయస్సు ధ్రువీకరణ అనేది సాంకేతికంగా చాలా క్లిష్టమైన విషయం. కొన్ని పద్ధతులు (ముఖ ధ్రువీకరణ వంటివి) గోప్యత సమస్యలను పెంచుతాయి. ఏఐ ఆధారిత వయస్సు అంచనా (AI-based Age Estimation) వంటి కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సవాళ్లు ఎదురుకావొచ్చు. అందుకోసం భారీగా పెట్టుబడులు అవసరం. వయస్సు ధ్రువీకరణ కోసం వినియోగదారుల నుంచి అదనపు వ్యక్తిగత సమాచారం సేకరించాల్సి వస్తుంది. దీని వల్ల డేటా ఉల్లంఘనలు, ప్రైవసీ ఉల్లంఘనల ప్రమాదం పెరుగుతుంది. ప్లాట్ఫామ్లు తమ కంటెంట్ సిఫార్సు అల్గారిథమ్లను మార్చాలి. తద్వారా 16 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే సరియైన కంటెంట్ చేరుకునేలా చూసుకోవాలి.ఇదీ చదవండి: క్రికెట్పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్.. ఎందుకంటే.. -
ప్రయాణికులకు క్షమాపణలు.. ఇండిగో పైలట్ భావోద్వేగం
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగం పలు సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో ఇండిగో విమానానికి చెందిన కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ చేసిన హృదయపూర్వక క్షమాపణలు ఇంటర్నెట్లో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇండిగో విమానయాన సంస్థ వరుసగా ఏడవ రోజు కూడా విమానాల రద్దులు, అదనపు జాప్యాలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ అందించిన సందేశం సోషల్ మీడియాలో పలువురి హృదయాలను కదిలించింది.కొత్త పైలట్ విశ్రాంతి నిబంధనల కారణంగా కాక్పిట్ సిబ్బంది కొరత ఏర్పడటం అనేది ఈ అంతరాయాలకు ప్రధాన కారణంగా నిలిచింది. దీనివల్ల ఇండిగో ఆదివారం ఒక్కరోజే 650కి పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కాగా కెప్టెన్ కృష్ణన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో.. అతను విమానం ముందు భాగంలో నిలుచుని, ప్రయాణికులతో తమిళంలో మాట్లాడారు. ‘ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. మేము వీలైనప్పుడల్లా వివరాలను అప్డేట్ చేస్తాం. ధన్యవాదాలు’అని అన్నారు.Video of the day : #Indigo flight pilot Captain Pradeep Krishnan from #Chennai to #Coimbatore welcomes his family on the flight in a unique way. In the video he said, 'I am very happy to announce that my family is also traveling with me on the same flight today. My grandfather is… pic.twitter.com/hlR4OPCreK— Backchod Indian (@IndianBackchod) April 8, 2024ప్రయాణికులు అతని నిజాయితీని హృదయపూర్వకంగా మెచ్చుకుంటూ చప్పట్లతో స్పందించారు. ఈ వీడియోకు జత చేసిన శీర్షికలో, కృష్ణన్ తన భావాలను మరింత వివరంగా పంచుకున్నారు.. ‘క్షమించండి. ఒక విమానం కారణంగా మీరు మీకు ముఖ్యమైనదానిని కోల్పోయినప్పుడు అది ఎంత కష్టమో నాకు పూర్తిగా అర్థమైంది. నేను మీకు హామీ ఇస్తున్నాను.. మేము సమ్మెలో లేము. పైలట్లుగా మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా ఇంటికి వెళ్లాలనుకుంటున్నాం’ అని అన్నారు.ఈ వీడియోలో కెప్టెన్ కృష్ణన్ ప్రస్తుత ఇబ్బందులను అంగీకరించారు. ఇక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం తన హృదయం రోదిస్తోంది’ అని అన్నారు. కోయంబత్తూరుకు వెళ్లాల్సిన విమానం ఆలస్యం అయినప్పుడు ప్రయాణికులు నిరాశకు గురైన వైరల్ క్లిప్లను తాను చూశానని అన్నారు.ఈ సమయంలో ప్రయాణికుల ఓపిక, మద్దతుకు ఆయన ప్రశంసించారు. చివరగా ఆయన ‘దయచేసి మా గ్రౌండ్ సిబ్బందిపై దయ చూపండి. వారు మిమ్మల్ని ఇంటికి చేర్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్గా మారింది. ఈ పైలట్ చూపిన వినయాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: లడఖ్లో చైనా గూఢచారి?.. ఫోరెన్సిక్ పరీక్షకు ఫోన్ -
16 ఏళ్ల వయసు.. ఆ తల్లిదండ్రుల గుండెకోత నుంచి పుట్టిందే ఇది!
ప్రపంచంలో.. మొట్టమొదటిసారిగా టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తోంది ఆస్ట్రేలియా. మరో రెండు రోజుల్లో (డిసెంబర్ 10) ఈ సంచలనాత్మక నిర్ణయం ఆచరణలోకి రానుంది. ఈ దరిమిలా ప్రపంచమంతా ఇది ఎలా అమలు కానుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే మిగతా దేశాలు తమ బాటలో పయనిస్తాయని తానేం ఆనుకోవడం లేదని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అంటున్నారు. అంతేకాదు.. తాము తీసుకున్నది పరిపూర్ణమైన నిర్ణయమేమీ కాదని కూడా ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు చిన్నారులకు సో.మీ. నిషేధంపై తాజాగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘ఇది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేమీ కాదని స్పష్టత ఇచ్చారు. ‘‘ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనుకుంటే మీరు పొరపడినట్లే. సో.మీ. ప్రభావం వల్ల ప్రభావితమైన.. వ్యక్తిగతంగా విషాదాల్ని ఎదుర్కొన్న తల్లిదండ్రులు కోరుకున్న మార్పు ఇది. మరికొందరు తల్లిదండ్రులు అలాంటి శోకం అనుభవించకూడదనే ఉద్దేశంతో వాళ్లు ఈ చట్టం రావాలని కోరుకున్నారు. ఇది తల్లిదండ్రుల బాధను గౌరవిస్తూ.. సోషల్ మీడియా కంపెనీలను బాధ్యత వహించేలా చేసే చట్టం’’ అని అల్బనీస్ పేర్కొన్నారు. ..అలాగని మేం దీనిని పరిపూర్ణమైన నిర్ణయం అని అనుకోవడం లేదని కూడా చెబుతున్నారు. ఈ చట్టంలో లోపాలున్నా ప్రాణాలను మాత్రం రక్షిస్తుందని అంటన్నారు. ఈ మేరకు పిల్లల భద్రతకు అవసరమైన అడుగుగా భావిస్తున్నాం అని అన్నారాయన. పిల్లల మానసిక ఆరోగ్యం .. భద్రత నేపథ్యాలే ఈ నిషేధం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు ఈ నిర్ణయాన్ని అనుసరించాలని కోరుకుంటున్నారా? అని అడగా.. అలా తాము భావించడం లేదని, అది ఆయా దేశాల పరిస్థితులను బట్టి ఉంటుందని.. అయితే పాటిస్తే మాత్రం తప్పకుండా మేలే జరుగుతుందని అంటున్నారు. సోషల్ మీడియా వాడకానికి మినిమమ్ ఏజ్ (Online Safety Amendment Bill 2024)ను గుర్తిస్తూ.. ప్రపంచంలోనే మొదటిసారి అమలు కాబోతోంది. దీని ప్రకారం.. 16 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్, స్నాప్చాట్, ఫేస్బుక్, థ్రెడ్స్, ఎక్స్(ట్విటర్) వంటి ప్రధాన ప్లాట్ఫారమ్లలో అకౌంట్లు ఉండకూడదు. ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ సైట్లకు మాత్రం అనుమతి ఉంటుంది. టెక్ కంపెనీలు ఈ నిబంధనను పాటించకపోతే భారీ జరిమానాలు($49.5 మిలియన్.. మన కరెన్సీలో రూ.4,500 కోట్ల దాకా జరిమానా) చెల్లించాల్సి వస్తుంది.తల్లిదండ్రుల బాధను విన్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అల్బనీస్ మరోమారు స్పష్టం చేశారు. పిల్లలను ఆన్లైన్ బులీయింగ్(వేధింపులు), హానికర కంటెంట్కు దూరంగా ఉంచడం.. తద్వారా మానసిక ఒత్తిళ్ల నుండి పరిరక్షించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యాలని ఆల్బనీస్ ఉద్ఘాటించారు. స్క్రీన్లకు అతుక్కుపోకుండా.. పిల్లలు ఆటలు, సంగీతం, పుస్తకాలు వంటి నిజజీవిత కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. సవాళ్లు.. వయసు ధృవీకరణ కోసం సాంకేతికతను ఉపయోగిస్తామని.. సంబంధిత డాక్యమెంట్లనూ పరిశీలిస్తామని సో.మీ. ప్లాట్ఫారమ్లు చెబుతున్నాయి. అయితే.. అదెంత వరకు వీలవుతుందో? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(VPN)లు వాడడమో.. లేదంటో ఫేక్ అకౌంట్లు వాడో నిబంధల్ని అతిక్రమించే అవకాశం లేదా? అనేది మున్ముందు తెలిసేది.రియాక్షన్లు ఇవిగో.. టీనేజర్ల సో.మీ. స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తున్న ఈ చట్టం.. ఓ అతినియంత్రణేనని కొందరు ఆస్ట్రేలియన్ మైనర్లు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారు. ఆ పిటిషన్లు ప్రస్తుతానికి విచారణ దశలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లోని యువత నుంచి ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. కొంతమంది టీనేజర్లు ఈ నిషేధం వల్ల ఆన్లైన్ బులీయింగ్, హానికర కంటెంట్ తగ్గుతుందని భావిస్తున్నారు. మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించేదిగా చూస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం “ఇది బ్లాక్ అండ్ వైట్ విషయం కాదు” అని.. అంటే పూర్తిగా మంచిదీ చెడిదీ అని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. -
మరింత గ్లామరస్గా ఆదితిరావు హైదరీ.. బ్లాక్ బ్యూటీలా మృణాల్ ఠాకూర్..!
క్రిస్మస్ మూడ్లో హీరోయిన్ శృతిహాసన్..మరింత బ్యూటీఫుల్గా ఆదితి రావు హైదరీ..వేకేషన్లో ఫుల్గా చిల్ అవుతోన్న శ్రద్ధాదాస్..కలర్పుల్ డ్రెస్లో బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్..బ్లాక్ బ్యూటీలా సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Bhumi Satish Pednekkar (@bhumisatishpednekkar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్
జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్పోర్ట్ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.మయూఖ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత ఏడాది పౌరసత్వానికి అర్హత సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు. మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో కేవలం అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్బాల్ మ్యాచ్లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడుపంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని మయూఖ్ పంజా తెలిపారు. I have been here 9 + years and I became eligible for the German passport a year back. I could have applied for citizenship a year ago, but I did not. I have thought about this a lot and I am increasingly coming to the conclusion that I can’t do this. Because I don’t feel German.… https://t.co/amUbrxgObK— Mayukh (@mayukh_panja) December 5, 2025 సోషల్ మీడియా మయూఖ్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
ఆదితి రావు హైదరీ బ్యూటీ లుక్.. డిఫరెంట్ డ్రెస్లో ఆదిపురుష్ భామ..!
డిఫరెంట్ డ్రెస్లో ఆదిపురుష్ భామ కృతిసనన్..శారీలో బాలీవుడ్ భామ దియా మీర్జా అందాలు..బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ బ్యూటీఫుల్ లుక్స్..హీరోయిన్ ఆదితి రావు హైదరీ లేటేస్ట్ లుక్..అలాండి డ్రెస్లో బాలీవుడ్ నటి ఇషితా దత్తా పోజులు.. View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
ఆలయ పూజారిపైనా పచ్చ పైత్యం
శింగనమల: సామాన్య ప్రజలతోపాటు చిన్నారులు విద్యను అభ్యసించే బడిలోను.. దైవం కొలువైన గుడిలోను కూడా అధికార మదంతో పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని చెరువుకట్ట వద్ద కొలువైన దుర్గాంజనేయస్వామి ఆలయ పూజారిపై పచ్చ పైత్యంతో బూతుపురాణం విప్పి మరీ రెచ్చిపోయారు. పూజారిని ఇష్టానుసారం దూషించటంతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజారి తన ఆవేదనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. టీడీపీ నేతలు చేసిన అవమానం భరించలేక ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు చెప్పారు. ఈ వీడియో వైరల్గా మారింది. శింగనమల చెరువుకట్ట వద్ద ఉన్న దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారిగా రమణ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక టీడీపీకి చెందిన కొందరు ఆలయంపై ఆధిపత్యం కోసం పూజారి రమణను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు వచ్చి పూజ చేయాలని కోరారు. సాయంత్రం చేస్తానని పూజారి చెప్పగా.. వారు అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో పూజారి రమణ తన ఆవేదనను వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఏడాది నుంచి తమను ఆలయం నుంచి పంపించివేసేందుకు టీడీపీకి చెందిన వ్యక్తులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, అందులో భాగంగానే కొంతమంది వచ్చి బెదిరించారని వాపోయారు. తరచూ కొందరు రావడం.. ఆలయం వదిలి పోవాలని ఒత్తిడి చేయడం పరిపాటిగా మారిందన్నారు. కాగా.. పూజారి డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలు ఆలయం వద్దకు చేరుకున్నారు. పూజారితో వాదించడానికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని అందరినీ అక్కడి నుంచి పంపించివేశారు. -
ఇండిగో సిబ్బందిని హడలెత్తించిన మహిళ..
ఢిల్లీ: భారత్లో విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా ఐదో తీవ్ర అంతరాయం కలిగింది. విమాన సర్వీసుల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా విమాన సర్వీసులను రద్దు కావడంతో విదేశీయులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఓ విదేశీ మహిళ.. ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు సిబ్బందితో గొడవకు దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ ఆఫ్రికన్ ప్రయాణికురాలు ఇండిగో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సిబ్బందితో సదరు మహిళ గొడవకు దిగారు. తాను ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో ఇండిగో కౌంటర్పైకి ఎక్కి సిబ్బందితో వాగ్వాదం పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కేకలు వేసింది. ఆమె తీరు చూసిన ఇండిగో సిబ్బంది దెబ్బకు హడలెత్తిపోయారు. ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు.. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో ఐదు నుంచి పది రోజులు పడుతుందని ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బెర్స్ తెలిపారు. ఇండిగో ప్రకటనపై ప్రయాణికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్టుకు వచ్చే వరకు తమకు ఎందుకు సమాచార ఇవ్వలేదని ఫైర్ అవుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఇండిగో సిబ్బందితో గొడవకు దిగారు. పలువురు ప్రయాణికులు వారికి చెక్ఇన్ అయ్యాక విమానాలు రద్దు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు విమానాశ్రయాల్లో తిండి, నిద్రలేకపోవడంతో ప్రయాణికులు కన్నీటిపర్యంతమవుతున్నారు.Delhi airport scene hai .The worst thing is the government is sleeping 😴 pic.twitter.com/8Yl7mWorJm— Charu Yadav (@YadavCharu28) December 5, 2025 -
భక్తుల మనోభావాలు దెబ్బతీసిన నల్ల మల్లారెడ్డి కాలేజీ!
మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని నారపల్లి నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థి చేసిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అయ్యప్ప దీక్షలో ఉన్నందున నల్ల దుస్తులు ధరించి కాలేజీకి వచ్చినప్పుడు, సిబ్బంది తనను బలవంతంగా నల్ల దుస్తులు విప్పించి యూనిఫాంలోకి మార్చారని ఆ స్టూడెంట్ ఆరోపించాడు.తాను అయ్యప్ప మాల ధరించిన కారణంగా కాలేజీ సిబ్బంది అభ్యంతరం తెలిపారని.. రూల్స్ అంటూ దుస్తులు విప్పించారని.. దీక్షలో ఉన్నప్పుడు నల్ల దుస్తులు, మాల తీసేయడం అనుచితమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతర మతస్తుల సంప్రదాయాలను గౌరవిస్తున్న కాలేజీ యాజమాన్యం.. అయ్యప్ప దీక్ష చేస్తున్నవాళ్ల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తోందంటూ సదరు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు వీడియో తీసుకుని తనకు తెలిసినవాళ్లకల్లా పంపాడు. అలా.. అది నెట్టింటకు చేరింది.ఈ ఘటనలో వాస్తవమేంటో నిర్ధారణ కావాల్సి ఉంది. కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. అయితే.. ఈలోపు వీడియో దుమారం రేపడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. బీజేవైఎంతో కలిసి కాలేజీ ముట్టడికి పిలుపు ఇచ్చాయి. -
షాలిని పాండే బోల్డ్ లుక్.. శారీలో రెజీనా కసాండ్రా ..!
పుష్ప-2 కిస్సిక్ మూడ్లో శ్రీలీల..బ్యూటీఫుల్ లుక్లో షాలిని పాండే..కలర్ఫుల్ శారీలో రెజీనా కసాండ్రా..బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అందాలు.. స్కైలాబ్ జ్ఞాపకాల్లో నిత్యా మీనన్..ప్రేమంటే హీరోయిన్ ఆనంది బ్యూటీఫుల్ లుక్స్.. View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
'నేను వచ్చేస్తున్నా'.. జేడీ చక్రవర్తి గ్రాండ్ ఎంట్రీ
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఖాతా లేని వాళ్లు ఎవరైనా ఉంటారా? అని అడిగితే టక్కున లేరనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఈ డిజిటల్ యుగం అంతా సామాజిక మాధ్యమాల మీదనే నడుస్తోంది. ఇప్పుడంతా అరచేతిలోనే ప్రపంచం కనిపిస్తోంది. సోషల్ మీడియాతో ఒక్క రోజులోనే వరల్డ్ వైడ్ ఫేమస్ అవుతున్న రోజులివి. మరి ఇంతలా ప్రపంచాన్ని శాసిస్తోన్న సోషల్ మీడియాలో స్టార్ నటుడు ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదంటే నమ్ముతారా? మీరు అవునన్నా.. కాదన్నా ఇది నమ్మి తీరాల్సిందే. తాజాగా ఇన్స్టాలోకి ఎంట్రీ ఆ నటుడు ఎవరో మీరు చదివేయండి. నాగార్జున శివ మూవీలో తన విలనిజం, నటనతో మెప్పించిన జేడీ చక్రవర్తి. ఆయనకు ఇప్పటి వరకు అధికారికంగా ఇన్స్టాగ్రామ్లో ఖాతా లేదు. తాజాగా జేడీ చక్రవర్తి సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన టీమ్ అధికారికంగా ప్రకటించింది. జేడీ మ్యాక్స్ మోడ్ పేరుతో ఈ సోషల్ మీడియా అకౌంట్ను ఓపెన్ చేశారు. ఇందులో జేడీకి సంబంధించిన ఓ వీడియోను కూడా చేశారు. నేను దేవున్ని నమ్మను.. నువ్వు విన్నది కరెక్టే.. నేను దేవుళ్లను నమ్ముతాను.. అందరి దేవుళ్లను నమ్ముతాను.. జై ఆంజనేయ.. కాదు.. కాదు.. జై శ్రీ హనుమాన్.. నేను వచ్చేస్తున్నా అంటూ వీడియోలో జేడీ చక్రవర్తి మాట్లాడారు. కాగా.. జేడీ చక్రవర్తి శివ, గాయం, సత్య లాంటి చిత్రాల్లో మెప్పించారు. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ.. సోషల్ మీడియాతో అభిమానులతో టచ్లోకి వచ్చేస్తున్నారు. కాగా.. జేడీ చివరిసారిగా దయా అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ 2023లో జియో హాట్స్టార్లో రిలీజైంది. View this post on Instagram A post shared by JD chekravarthy (@jdmaxmode) -
నా గుండె పగిలింది
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో తన సితార్ ధ్వంసం కావడంపై అంతర్జాతీయ సంగీతకారిణి అనౌష్క శంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమానంలో తన ప్రియమైన సితార్ ధ్వంసం కావడంతో ఆమె భగ్గుమన్నారు. ‘ఒక భారతీయ వాయిద్యానికి కూడా ఈ దేశపు విమాన సంస్థలో భద్రత లేదా?’.. అంటూ సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు. పదిహేనేళ్ల తన కెరీర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం, తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసిన వీడియో సంగీత ప్రియులను కలచివేసింది. విలువైన సితార్ దిగువ భాగంలో ఏర్పడిన లోతైన పగులును ఆమె చూపించారు. ‘నా సితార్ శృతి తప్పిందేమోనని ముందు భావించాను. వాయించడానికి తీసుకున్నప్పుడే ఈ దారుణం తెలిసింది’.. అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చాలా కాలం తర్వాత ఎయిర్ ఇండియాను ఎంచుకున్నాను. నా వాయిద్యానికే ఇలా ఎందుకు జరిగింది? ప్రత్యేక హార్డ్–కేసులు ఉన్నా, హ్యాండ్లింగ్ రుసుములు వసూలు చేసినా ఇంత దారుణమైన నిర్లక్ష్యమా?’.. అని ఆమె నిలదీశారు. పరిశీలిస్తున్నామన్న ఎయిర్ ఇండియా అనౌష్క తన విమాన వివరాలను, ఎక్కడ దిగారనేది చెప్పనప్పటికీ, ఎయిర్ ఇండియా ప్రతినిధి గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ‘మా అతిథి అనుభవించిన బాధకు చింతిస్తున్నాం. ఈ వాయిద్యం సాంస్కృతిక ప్రాధాన్యం మాకు తెలుసు’.. అని పేర్కొన్నారు. నష్టానికి గల కారణాలను నిర్ధారించలేకపోతున్నామని చెప్పిన సంస్థ, ఢిల్లీ విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీతో సహా సమగ్ర విచారణ ప్రారంభించినట్లు తెలిపింది. భారత్ పర్యటనకు ముందే.. జనవరి 30న హైదరాబాద్తో ప్రారంభం కానున్న తన భారత పర్యటనకు అనౌష్క శంకర్ సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం పలువురు కళాకారుల్ని కలచివేసింది. ఈ సంఘటన హృదయ విదారకమని ప్రముఖ కళాకారులు జాకిర్ ఖాన్, విశాల్ దడ్లాని పేర్కొన్నారు. గాయకుడు పాపోన్ స్పందిస్తూ, ‘ఈ రోజుల్లో శ్రద్ధ కరువైంది. అసలు శ్రద్ధ అనే భావమే కనుమరుగైందేమో! ఇది విచారకరం’.. అంటూ ఎయిర్ ఇండియా తీరుపై మండిపడ్డారు. గతంలోనూ ప్రయాణ సమస్యలు 44 ఏళ్ల శంకర్ గత ఏడాది కూడా ప్రయాణ సమస్యలను ఎదుర్కొన్నారు. ఆమె తన యూరోపియన్ టూర్ చివరి షో కోసం బెర్లిన్లో ఉన్నప్పుడు, దుస్తులు, వాయిద్యానికి అవసరమైన ’మిజ్రాబ్స్’ (వేళ్లకు ధరించే ఫిక్సŠడ్ పికర్స్) ఉన్న లగేజీని పోగొట్టుకున్నారు. పదేపదే తప్పిదాలా? సంగీత కళాకారులకు ఇలాంటి చేదు అనుభవాలు కొత్తేమీ కాదు. 2010లో సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ వాయిద్యం ఎయిర్ ఇండియాలో దెబ్బతినగా, 2019లో పండిట్ శుభేంద్ర రావు సితార్ కూడా ఈ సంస్థ విమానంలోనే దెబ్బ తింది. తాజా ఘటనతో, విమానయాన సంస్థలు కళాకారుల విలువైన వాయిద్యాల భద్రత విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం మరోసారి తెరపైకి వచ్చింది. -
శారీలో అనసూయ అందాలు.. అబుదాబిలో బన్నీ ఫ్యామిలీ చిల్..!
మాల్దీవుస్ ఫోటోలు షేర్ చేసిన ప్రగ్యా జైస్వాల్..అబుదాబిలో అల్లు అర్జున్ ఫ్యామిలీ చిల్..వేకేషన్లో బిజీగా హీరోయిన్ రీతూ వర్మ..నాసామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్ క్యూట్ లుక్స్..ఎల్లో శారీలో అనసూయ హోయలు.. View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ సాంగ్
తెలంగాణ జానపదలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని, నృత్యకారిణి నాగదుర్గ నుంచి తాజాగా విడుదలైన పాట ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ ప్రస్తుతం యూట్యూబ్లో మరియు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ, ఈ కొత్త పాటతో మరోసారి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. పేరుగల్ల పెద్దిరెడ్డి అంటూ వచ్చిన ఈ పాట తండ్రి మీద ప్రేమతో కూతురు చెబుతున్న నేపథ్యంలో ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని, జానపద లయను ప్రతిబింబిస్తూ ఈ పాట ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే, నాగదుర్గ ఈ పాటలో తనదైన శైలిలో చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శుక్రవారం విడుదలైన ఈ పాట కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ను సాధిస్తూ ట్రెండింగ్లో నిలిచింది. పల్లె జానపద పాటల అభిమానుల మధ్య ఈ పాట క్రేజీ హిట్గా మారడంతో నాగదుర్గ ఖాతాలో మరో విజయవంతమైన జానపద పాట చేరింది. ఈ పాటకు బుల్లెట్ బండి లక్ష్మణ్ సాహిత్యం అందించగా.. మమత రమేష్ గానం చేశారు. సంగీతాన్ని మదన్ కే అందించారు. -
మేఘా ఆకాశ్ బర్త్ డే పార్టీ.. వేకేషన్లో బుట్ట బొమ్మ పూజా హెగ్డే..!
బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన మేఘా ఆకాశ్..వైట్ డ్రెస్లో దియా మీర్జా బ్యూటీఫుల్ లుక్స్..బహమాస్లో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ లయ..వేకేషన్లో చిల్ అవుతోన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే..శ్రీలంకలో చిల్ అవుతోన్న సాహితి దాసరి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) -
నాలుగు కాళ్ల దేవతలు!
అది పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా, నవద్వీప్ పట్టణం. ఎముకలు కొరికే చలి. నిశ్శబ్దపు తెల్లవారుజాము.. ఆ చీకట్లో రైల్వే కార్మికుల కాలనీలోని ఒక బాత్రూమ్ వెలుపల నేలపై నవజాత శిశువు. శరీరంపై ఎలాంటి వస్త్రం లేదు.. పురిటి నెత్తురు మరకలు తొలగలేదు.. ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా చూడని ఆ పసికందును ఎవరో కనికరం లేకుండా వదిలివేశారు. ఆ చిన్ని ప్రాణం గడ్డకట్టే చలిలో వణికిపోయింది.. విలవిల్లాడిపోయింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. వలయం కట్టి.. తెల్లార్లూ కాపలా కాసివీధి కుక్కల గుంపు ఒకటి ఆ శిశువును చుట్టుముట్టింది. అవి అరవలేదు. కదలకుండా, ప్రశాంతంగా.. శిశువు చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచాయి. రాత్రంతా, అవి నిశ్శబ్ద సైనికుల్లా నిలబడ్డాయి. వేకువ వెలుగు వచ్చే వరకు.. ఆ బిడ్డ దగ్గరకు ఎవరినీ రాని వ్వలేదు. పసికందును తాకనివ్వలేదు. ‘ఉదయం లేచాక కనిపించిన ఆ దృశ్యం గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది’.. అని స్థానికుడు సుక్లా మొండల్ ఉద్వేగంగా చెప్పారు. ‘ఆ కుక్కలు మామూలుగా లేవు. అవి అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఆ బిడ్డ బతకడానికి పోరాడుతోందని అవి అర్థం చేసుకున్నట్లు అనిపించింది’.. అని వ్యాఖ్యానించారు.పసికందు చుట్టూ సెంట్రీల్లా..తెల్లవారుజామున శిశువు చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పటివరకు ఎవరో జబ్బు పడిన బిడ్డ అనుకున్న స్థానికులకు, ఆ దృశ్యం చూసి నోట మాట రాలేదు. ఆ కుక్కలు కంచె వేసినట్లు, సెంట్రీల్లా పసికందు చుట్టూ నిల్చున్నాయి. సుక్లా మొండల్ ధైర్యం చేసి, మెల్లగా ముందుకు వెళ్లగానే.. ఆ కుక్కలు పక్కకు తప్పుకున్నాయి. వెంటనే ఆమె బిడ్డను తన దుపట్టాలో చుట్టి ఆసుపత్రికి పరుగులు తీశారు. పరీక్షించిన వైద్యులు, ఆ బిడ్డకు ఎటువంటి గాయాలు లేవని, కేవలం పుట్టిన కొన్ని నిమిషాలకే ఎవరో వదిలేశారని నిర్ధారించారు. పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.మనుషుల్ని మించిన మానవీయత..‘మేము ఎప్పుడూ ఈసడించుకుని.. తిట్టుకునే శునకాలే ఇవి.. కానీ, ఈ బిడ్డను వదిలి వెళ్లిన వారికంటే ఇవే ఎక్కువ మానవత్వాన్ని చూపించాయి’.. అని ఒక రైల్వే కార్మికుడు వ్యాఖ్యానించారు. సాయంత్రం అయ్యేసరికి కాలనీలో దృశ్యం మారిపోయింది. ఆ రాత్రంతా బిడ్డను కాపాడిన కుక్కల దగ్గరికి కాలనీలోని చిన్నారులంతా వెళ్లారు. వాటిని ఆప్యాయంగా నిమిరారు. ప్రేమతో బిస్కెట్లు తినిపించారు. ఆ కుక్కలు కేవలం ఒక శిశువును కాపాడటమే కాదు, ఆ రోజు ఆ కాలనీ ప్రజలందరికీ ఒక సందేశమిచ్చాయి. మానవత్వం అనేది నాలుగు కాళ్లపై కూడా రావచ్చని నిరూపించాయి.ఇలాంటి ఘటనే.. 1996లో కోల్కతా సమీపంలో ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త గుట్టలో వదిలేశారు. అయితే ఆ బిడ్డకు మూడు వీధి కుక్కలు కాపలాగా ఉన్నాయి. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బిడ్డ సంరక్షణా కేంద్రానికి చేరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీచ్లో రకుల్ ప్రీత్ సింగ్ పోజులు.. శారీలో సాక్షి అగర్వాల్ అందాలు..!
లైట్ గ్రీన్ శారీలో హీరోయిన్ సాక్షి అగర్వాల్ గ్లామర్..మరింత గ్లామరస్గా సాహితి దాసరి..బీచ్లో రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ పోజులు..తేరే ఇష్క్ మే మూడ్లో కృతి సనన్..వైట్ డ్రెస్లో తాప్సీ పన్ను హోయలు.. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) -
చిట్టితల్లిపై వైఎస్ జగన్ ప్రేమ.. నెట్టింట వైరల్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. తాజాగా గన్నవరం ఎయిర్పోర్టులో ఓ చిన్నారి పట్ల ఆయన చూపించిన ప్రేమ నెట్టింటకు చేరింది. గన్నవరం ఎయిర్పోర్టులో జగన్ను చూసేందకు ఓ వ్యక్తి తన కూతురితో కలిసి వచ్చారు. ఆ బాలిక చెప్పు కాలి నుంచి జారిపోయింది. అది గమనించిన వైఎస్ జగన్ ఆమె చెప్పును అందించి.. ఆ చిన్నారిని ఆప్యాయంగా స్పృశించారు. తద్వారా పిల్లల పట్ల తనకు ఉండే ఆప్యాయతను మరోసారి ప్రదర్శించారు. అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో ఆ క్షణాలను బంధించగా.. అదిప్పుడు వైరల్ అవుతోంది. Man of Simplicity – YS Jagan ✨🙏💙 pic.twitter.com/KqxTnqpEvP— Johny Kaki (@johny_kaki) December 2, 2025 -
ఖాన్ సాబ్ సేఫేనా.. మరికొద్ది గంటల్లో సస్పెన్స్కు తెర
పాకిస్తాన్ మాజీ ప్రధాని, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నారా?.. పాక్ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుందా?. జైల్లో ఉన్న ఖాన్ను ఆయన్ని కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అడియాలా జైలు అధికారులు అనుమతించారు. దీంతో ఆయన సోదరి ఉజ్మాతో పాటు లాయర్ కూడా ఖాన్ను కలిసే అవకాశం ఉంది. అయితే ఈ ములాఖాత్ ముగిశాక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయొద్దని ఆమెకు పాక్ ప్రభుత్వం షరతు విధించినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కినా.. రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంతో రావల్పిండిలో 144 సెక్షన్ విధించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనలపై నిషేధం విధించారు. అయినా కూడా భారీ ర్యాలీ చేపట్టాలని పీటీఐ వర్గాలు భావిస్తున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం చేరింది. ఈ నేపథ్యంలో నిర్బంధాలు.. హౌజ్ అరెస్టులతో రావల్పిండిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారని.. ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఇలా రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే జైలు అధికారులు, ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది. మరోవైపు ఆయన సురక్షితంగానే ఉన్నారా? అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తనయుడు ఒకవేళ తన తండ్రి బతికే ఉన్నా.. హింసించి చంపే అవకాశం ఉందంటూ సంచలన ఆరోపణలకు దిగారు.గత నెల మొదట్లో ఆయన నుంచి ట్వీట్ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ సురక్షితంగా ఉన్నారా? అనేది బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ పెరిగిపోయింది. తెహ్రీక్ ఈ ఇన్షాఫ్ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు, ఇటు ప్రజలు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని నిర్ణయించారు. ఇమ్రాన్ ఖాన్ భద్రతపై.. ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు మరికొన్ని గంట్లలో అనే ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది. -
బిజీ బ్యాంకులోకి అనుకోని అతిథి!
అదొక బిజీ బ్యాంకు. నిత్యం కస్టమర్ల వెయింటింగ్తో.. సిబ్బంది పిచ్చాపాటి కబుర్లతో నడుస్తూ ఉంటుంది. అలాంటి బ్యాంకుకు అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడ్డారు. ప్రాణభయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. కొందరు టేబుల్స్, బీరువాలు.. కనిపించినదానిపైకల్లా పైకి ఎక్కి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు.. అతిజాగ్రత్తగా ఆ అతిథిని బయటకు పంపించేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలో దాటియా థారెట్ పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఓ పాము చొరబడింది. కానీ, ఎప్పుడు జరిగిందనే స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Snake in Punjab National Bank (PNB) Branch in Tharet, Datia near Gwalior, Madhya Pradesh. Work disrupted, staff in Panic!! @pnbindia pic.twitter.com/8wpiC1yHRQ— Hellobanker (@Hellobanker_in) November 29, 2025 -
మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్.. ఫ్యామిలీ ట్రిప్లో ఆషిక రంగనాథ్..!
మాల్దీవుస్లో చిల్ అవుతోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..ఫ్యామిలీ ట్రిప్లో నాసామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్..మ్యాడ్ బ్యూటీ రెబా మోనిక జాన్ బ్యూటీఫుల్ లుక్స్..కలర్ఫుల్ డ్రెస్లో అనుపమ పరమేశ్వరన్ హోయలు..బ్లాక్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ కాజోల్.. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Aarti (@aarti.ravi) View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
సోషల్ మీడియా టేకోవర్కు చెక్
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్, టెలిగ్రాం తదితర సోషల్మీడియా యాప్స్ టేకోవర్కు ఆస్కారం లేకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి సిమ్ బైండింగ్ విధానం ప్రవేశపెట్టింది. 2026 మార్చి నుంచి అమలులోకి వచ్చే ఈ విధానంతో సైబర్ కేటుగాళ్లకు చెక్ పడటంతోపాటు పోలీసుల్ని తప్పుదోవ పట్టించే నేరగాళ్లనూ కట్టడి చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన కీలక మార్గదర్శకాలను ‘డాట్’ శనివారం జారీ చేసింది. ఇప్పటి వరకు సాగుతోంది ఇలా...సాధారణంగా ఎవరైనా ఒక స్మార్ట్ఫోన్లో వాట్సాప్, టెలిగ్రాం తదితరాలను యాక్టివేట్ చేసుకోవాలంటే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్ను వినియోగదారుడు పొందుపరిచిన నంబర్కే యాప్ నిర్వాహక సంస్థలు పంపిస్తుంటాయి. సదరు ఫోన్లో ఈ యాప్స్ పని చేయడానికి ఈ వెరిఫికేషన్ కోడ్ కీలకమే కానీ.. సిమ్తో పని లేదు. సిమ్ కార్డు ఎవరి వద్ద, ఏ ఫోన్లో ఉన్నప్పటికీ.. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసే స్మార్ట్ఫోన్లో ఆయా యాప్స్ యాక్టివేట్ అయి పని చేస్తుంటాయి. దీన్ని తమకు అనువుగా మార్చుకుంటున్న సైబర్ కేటుగాళ్లు, ఇతర నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ చేసే సూత్రధారులు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉంటున్నారు. వీళ్లు వాట్సాప్, టెలిగ్రాంలను వాడే బాధితులకు ఎర వేస్తుంటారు. ఇలా చేయడానికి అవసరమైన నంబర్లను సామాన్యులు లేదా కమీషన్ల కోసం ఆశపడి వివరాలు అందించే వారి నంబర్లతో యాక్టివేట్ చేసుకుంటున్నారు. తమ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓ నంబర్ను ఎంపిక చేసుకుంటున్నారు. వారికి కాల్ చేసి రకరకాలు కారణాలు చెప్తూ తమ లావాదేవీల్లో పొరపాటున మీ నెంబర్ ఎంటర్ చేశామని, దాంతో ఓటీపీ మీకే వస్తోందని అంటున్నారు.వెరిఫికేషన్ కోడ్ అందడంతోనే...ఇది నమ్మిన వాళ్లు ఓటీపీగా భావించి వెరిఫికేషన్ కోడ్ చెప్పేస్తున్నారు. దీంతో ఆ నంబర్తో తమ ఫోన్లలో ఆయా యాప్స్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఆ వెంటనే వారి వాట్సాప్, టెలిగ్రాం డీపీలను కాపీ చేసి తమ దానికి పెట్టేస్తున్నారు. దీంతోపాటు సెక్యూరిటీ సెట్టింగ్స్ను మార్చేస్తూ టూ స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ చేస్తున్నారు. దీనివల్ల అసలు వ్యక్తి ఈ విషయం గుర్తించి తన ఫోన్లో వాట్సాప్ను మరోసారి యాక్టివేట్ చేసుకోవాలని భావించినా... అది సాధ్యం కాదు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది నంబర్లను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. వాట్సాప్ బ్యాకప్ డేటాను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వారి కాంటాక్ట్స్తోపాటు చాటింగ్స్ను తమ ఫోన్లోకి వచ్చేలా చేస్తున్నారు. ఆపై ఆ కాంటాక్ట్స్లో కొందరికి అత్యవసరంగా డబ్బు కావాలంటూ సందేశాలు పంపుతూ, మరికొందరికి హ్యాకింగ్ లింకులు సెండ్ చేస్తున్నారు. వైఫై లేదా వీపీఎన్ ద్వారా వీటిని వినియోగిస్తూ తమ ఉనికి బయటపడకుండా పోలీసుల్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు.ఇకపై వారి ఆటలకు చెక్డాట్ మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఇలా సిమ్ ఓ ఫోన్లో ఉన్నప్పుడు ఆయా యాప్స్ను అదే ఫోన్లోనే యాక్టివేట్ చేసుకోవాలి. మరో ఫోన్లో యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉండదు. కచ్చితంగా ఆ సిమ్ ఉన్న ఫోన్ నుంచి మాత్రమే యాప్స్ను వాడాల్సి వస్తుంది. సిమ్ బైండింగ్గా పిలిచే ఈ విధానం వల్ల యాప్స్ దుర్వినియోగం, సైబర్ నేరాలు కట్టడి చేసే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు వాట్సాప్ వెబ్ సైతం ప్రతి ఆరు గంటలకు ఆటోమేటిక్గా లాగౌట్ అయ్యే విధానమూ అందుబాటులోకి రానుంది. -
పాయల్ రాజ్పుత్ సైకిల్ రైడ్.. వేకేషన్లో చిల్ అవుతూ రీతూ వర్మ..!
ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా చిల్..మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఆషిక రంగనాథ్..మరింత నాటీగా హీరోయిన్ పూనమ్ బజ్వా..రోజా పువ్వులాంటి డ్రెస్లో శాన్వీ మేఘన..మంగళవారం బ్యూటీ రాజ్పుత్ పాయల్ సైకిల్ రైడ్..వేకేషన్లో చిల్ అవుతోన్న రీతూ వర్మ.. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ఏఐ కాదురా అబ్బీ.. ఈ బామ్మ డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా
అరేయ్.. అది ఏఐ ఎడిటింగ్ ఏమో రా!. కావాలంటే జాగ్రత్తగా చూడు.. అంటూ ఫలనా వీడియోను, ఫొటోను ఉద్దేశిస్తూ కామెంట్లు పెరిగిపోతున్న రోజులివి. చివరికి ఫ్యాక్ట్చెక్ సైట్లు సైతం వాటిని నిర్ధారించడంలో తడబడుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో నెట్టింట వైరల్ అవుతున్న ఓ బామ్మ వీడియో హాట్ టాపిక్గా మారింది. ఆ పెద్దావిడ వయసు 75 ఏళ్ల దాకా ఉంటుంది. కానీ, డ్యాన్స్లో మాత్రం దుమ్మురేపేసింది. దీంతో అది ఏఐనేమో అని పలువురు భ్రమ పడ్డారు. అయితే నెటిజన్ల పుణ్యమాని అది ఏఐ వీడియో కాదని.. ఆమె నిజంగానే చితక్కొట్టేసిందని తెలుస్తోంది(Viral Didi). ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి ఆల్టైం హిట్స్లో ఒకటైన దో ఘూంట్ పిలా దే సఖియా(Do Ghoont pila de saqiya) పాటకు ఆమె వేసిన స్టెప్పులకు అక్కడున్నవాళ్లే కాదు.. నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. అందునా ఉల్టాఫల్టా వేసిన స్టెప్పుకు కచ్చితంగా ఓ.. వేసుకోవాల్సిందే. ఆమెకు ఇంకా వయసు అయిపోలేదని.. ఏ మాత్రం జోష్ తగ్గకుండా వేసిన స్టెప్పులను మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by 5 churrets 🚬 (@5_churrets)భక్తి గీతాల స్పెషలిస్ట్ నరేంద్ర చంచల్ పాడిన ఈ పాట కాలా సూరజ్(1985) చిత్రంలోనిది. దేశ్ గౌతమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో శత్రుఘ్న సిన్హా, సులక్షణ పండిట్, రాకేష్ రోషన్, అంజాద్ ఖాన్, అరుణా ఇరానీ.. తదితరులు ప్రధాన తారాగణం. -
రికార్డులు రాస్తాం.. రారండి..
ఇంటర్ విద్య.. పరీక్షలు ప్రహసనంలా మారుతున్నాయి. ర్యాంకులే పరమావధిగా భావిస్తున్న యాజమాన్యాలు.. విద్యార్థుల్లో నైపుణ్యాలను తీర్చిదిద్దేలా ఏ మాత్రం చొరవ చూపలేకపోతున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలే ఈ ఉదంతాలకు అద్దం పడుతున్నాయి. వాస్తవానికి ఇందులో రికార్డులు రాయడాన్ని పెద్ద ప్రాజెక్టుగా గతంలో భావించేవారు. దీంతో సబ్జెక్టుల్లో ప్రావీణ్యాన్ని సాధించేవారు. అయితే ప్రస్తుతం రికార్డులు అనే అర్థాన్నే సమూలంగా మార్చేశారు. అద్దె ప్రాతిపదికన రికార్డులు రాసేందుకు నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బోర్డులు వెలియడం గమనార్హం. మరికొందరు గ్రూపులుగా ఏర్పడి ఒక్కో దానికి ఒక్కో ధరను నిర్ణయించి.. సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. నెల్లూరు(టౌన్): విద్యార్థి జీవితాన్ని నిర్ణయించేది ఇంటర్ విద్యే. ఇందులో ఎంత బాగా చదివి.. అంత బాగా విద్యను ఆకళింపు చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సులభమవుతుంది. అయితే ప్రస్తుతం మార్కులు.. ర్యాంకులే పరమావధిగా భావిస్తున్న యాజమాన్యాలు వీటిని ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. రోజుకో రకంగా వ్యవహరిస్తూ తమ సంస్థల పేరు ప్రతిష్టలు పెంచుకునేందుకే పెద్దపీటేస్తున్నాయి. బయటే రాయించుకోండి..! ఇంటర్లో పాఠ్యాంశాలను చదవడం ఓ ఎత్తయితే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ.. బోటనీ.. జువాలజీకి సంబంధించిన రికార్డులు రాయాల్సి ఉండటం మరో చాలెంజ్. దీని ద్వారా సదరు సబ్జెక్టుల్లో మంచి పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ఈ వ్యవహారం పక్కాగా సాగేది. అయితే ప్రస్తుతం యాజమాన్యాలు తమ తీరును మార్చుకుంటున్నాయి. రికార్డులను బయటే రాయించుకోవాలంటూ వీరు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో వీటిని రాసే దుకాణాలు, వ్యక్తుల వద్దకు విద్యార్థులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. రసాయనాలా.. అంటే..? ప్రాక్టికల్స్లో ఏయే రసాయనాలు ఉంటాయనే అంశం చాలా మంది విద్యార్థులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇందులో ఏదో ఒక తరహాలో ప్రలోభాలు పెట్టి మార్కులేయించ్చొనే ధీమాతో థియరీపైనే యాజమాన్యాలూ దృష్టి సారిస్తున్నాయి. నైపుణ్యాలు, విలువలతో కూడి విద్యను విస్మరించి.. బట్టీ కొట్టుడు విధానాలకే జై కొడుతున్నాయి. ఇదీ పరిస్థితి.. నెల్లూరు జిల్లాలో 185 జూనియర్ కళాశాలలుండగా.. కార్పొరేట్, ప్రైవేట్కు సంబంధించనవే 119 ఉన్నాయి. ఇందులో ఎంపీసీకి సంబంధించి 18 వేలు.. బైపీసీ చదువుతున్న వారు ఏడు వేల మంది ఉన్నారు. మరోవైపు ప్రాక్టికల్స్ను ఫిబ్రవరి ఒకటి నుంచి నిర్వహించనున్నామంటూ షెడ్యూల్ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. రికార్డులను డిసెంబర్ నెలాఖరులోపు అందజేయాల్సి ఉంది. ప్రాక్టికల్స్లో రికార్డులనూ పరిగణనలోకి తీసుకోనున్నారు. ఫిజిక్స్లో 20.. కెమిస్ట్రీలో 35.. బోటనీలో 65.. జువాలజీలో 50 ప్రయోగాలకు సంబంధించి రికార్డులు రాయాల్సి ఉంది. అయితే బయట ఎవరితోనైనా రాయించుకోవాలంటూ యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి. దీంతో విద్యార్థులు సైతం దానికే మొగ్గు చూపాల్సి వస్తోంది. యాజమాన్యాల అదనపు వసూళ్లు కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు మాత్రం ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల వద్ద రూ.1500 నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేస్తున్నాయి. రికార్డులెవరు రాసినా.. సక్రమంగా లేకపోయినా.. ప్రాక్టికల్స్లో మార్కులేయించేందుకు ఈ మొత్తాన్ని తీసుకుంటున్నామని బహి రంగంగానే చెప్తున్నారు. ముడుపుల మత్తులో జోగుతూ.. కార్పొరేట్ యాజమాన్యాల ఆగడాలు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసినా, వారి నుంచి ముడుపులు పుచ్చుకొని మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఏ కార్పొరేట్ కళాశాలలోనూ విద్యార్థులకు ప్రాక్టికల్స్ క్లాసులను నిర్వహిస్తున్న పరిస్థితి లేదు. రికార్డులను బయట రాయిస్తున్నారనే విషయం తెలిసినా ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కో దానికి.. ఒక్కో రేటు ఈ వ్యవహారాల నడుమ రికార్డులు రాసేందుకు గానూ నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. సబ్జెక్టుల వారీగా ధరనూ నిర్ణయించారు. ఫిజిక్స్కు రూ.780 నుంచి రూ.800.. కెమిస్ట్రీకి రూ.820 నుంచి రూ.900.. బోటనీకి రూ.880 నుంచి రూ.900.. జువాలజీకి రూ.920 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. రికార్డుల్లో పొందుపర్చాల్సినవన్నీ తమ బాధ్యతేననీ చెప్తున్నారు. దీనికి గానూ అడ్వాన్స్ను ముందే పుచ్చుకుంటున్నారు. వీటిని వారం, పది రోజుల్లో పూర్తి చేస్తున్నారు. మా దృష్టికొచ్చింది రికార్డులను బయట రాయిస్తున్నారనే విషయం నా దృష్టికొచ్చింది. ఆయా కళాశాలల నుంచి కొన్ని రికార్డులను తెప్పించి పరిశీలిస్తా. వీటిని విద్యార్థులే రాయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని యాజమాన్యాలు ప్రోత్సహించకూడదు. ప్రతి కళాశాలలో ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహించేలా చర్యలు చేపట్టాం. – వరప్రసాద్రావు, ఆర్ఐఓ ఇదే అంశమై వెలసిన బోర్డులునెల్లూరుజిల్లాలో ఇలా.. జూనియర్ కళాశాలలు 185 విద్యార్థులు 30 వేల మందికిపైగా ఎంపీసీ, బైపీసీ 25 వేల మంది -
డిజిటల్ ప్రపంచంలో సత్తా చాటుతున్న దినసరి కూలీ..!
ఓ మారుమూల గ్రామంలో పచ్చటి పొలాల నడుమ పెరిగిన యువకుడు మొబైల్ ఫోన్తో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అతడి బాల్యం మొత్తం పొలాల మధ్య చిన్న చితక కూలి పనులతో సాగింది. అలా సరదాగా సాగిపోతున్న అతడి జీవితంలోకి సరదాగా కొన్న మొబైల్ ఫోన్ లైఫ్నే టర్న్ చేసింది.తొలుత తల్లిదండ్రులు చదువు పాడవుతుందని చాలా బయటపడ్డారు. కానీ అతడు తన క్రియేటివిటీతో సోషల్ మీడియా స్టార్గా ఎదగడమే కాదు నలుగురికి ఉపాధి మార్గం చూపించే రేంజ్కి వెళ్లిపోయాడు. అతడే మహారాష్ట్ర, నెవాషేలోని గోమల్వాడి గ్రామనికి చెందిన రాహుల్ రాందాస్ తమ్నార్. తన బాల్యం ఎండల్లో కష్టపడి పనిచేయడంతో సాగింది. తన చుట్టూ ఉండే పచ్చిన పొలాల మధ్య తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా చిన్న చితక కూలిపనులు చేస్తూ పెరిగాడు. ఒకరోజు తల్లిదండ్రులు అడిగి మరి సరదాగా మొబైల్ ఫోన్ కొనుకున్నాడు. ఇంత చిన్న వయసులోనూ ఫోన్తో ఆడుకుంటూ చదువు పాడు చేసుకుంటాడేమో అని తల్లిదండ్రుల చాలా బయటపడ్డారు. అయితే నేర్చుకోవాలనే ఒకే ఒక్క జిజ్ఞాసతో సోషల్ మీడియా గురించి, ప్రమోషన్లు, ఆన్లైన్ మార్కెటింగ్ వంటి వాటి గురించి బాగా తెలుసుకున్నాడు. అయితే ఆ క్రమంలో కొన్ని తప్పులు కూడా జరిగాయి. పలు సవాళ్లు కూడా ఎదురయ్యాయి. కానీ అతనెప్పుడూ ఆశను వదులుకోలేదు. అలా ఏదో ఒకనాటికి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే తప్పనతో తన ప్రయత్నాన్ని విరమించలేదు. నెమ్మదిగా అతడి కష్టం ఫలించడం ప్రారంభించింది. రోజుకు రూ. 5వేలు నుంచి రూ. 6 వేలు రూపాయల వరకు సంపాదించడం ప్రారంభించాడు. అలా చాలా కొద్ది టైంలోనే లక్ష రూపాయాలు సంపాదించే రేంజ్కి ఎదిగిపోవడమే కాదు, ఏకంగా 400 నుంచి 500 మంది యువతకు ఆన్లైన్ మార్కెటింగ్లో శిక్షణ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా సాయం చేస్తున్నాడు. అతని అంకితభావానికి డిజిటల్ స్కిల్ అవార్డు సైతం వరించింది. పొలాలతో మొదలైన అతడి ప్రస్థానం డిజిటల్ ప్రపంచంలోకి అడుపెట్టి తన జీవితాన్నే కాకుండా ఇతరుల జీవితాన్ని కూడా మార్చేస్తున్నాడు. ప్రస్తుతం అతడి స్టోరీ వైరల్గా మారింది. కేవలం డబ్బు ఉంటేనే గుర్తింపు రాదు, కష్టపడేతత్వం, నేర్చుకోవాలనే ఆరాటం ఉన్నవారికి విజయం వారి ఒడిలోకే వచ్చే వాలుతుంది అనేందుకు ఈ రాహుల్ రాందాస్నే ఉదాహరణ. (చదవండి: ఆ అమ్మకు SIR సర్ప్రైజ్ గిఫ్ట్..! పాపం 40 ఏళ్లుగా..) -
వీడో తేడా : వీడి మెంటల్ స్టంట్స్కి అంతే లేదు, అందుకే!
అమ్మాయి కనిపిస్తే చాలు అది వీధిలోఅయినా, ఆన్లైన్లో అయినా కావాలని ఏదో కరంగా కమెంట్లు చేయడం, ఉద్దేశపూర్వకంగా వేధించడం, ట్రోలింగ్ చేయడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయింది. అలాంటివారికి చెంపపెట్టులాంటిదీ వార్త. అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయికి బుద్ధి చెప్పేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. బిహార్ షరీఫ్ నివాసి అయిన ఒక యువకుడు అమ్మాయిల ముందు విన్యాసాలు చేయడం, వారిని వేధించడం,అశ్లీల పాటలు ప్లే చేయడం అతని పని. సుభాష్ పార్క్, నలంద కాందహార్, రాజ్గిర్ ఫిట్నెస్ పార్క్ . ఇవే అతని అడ్డాలు. ఇన్స్టాగ్రామ్ ఖాతా సృజన్ ఫ్లిప్పర్. pic.twitter.com/Ks7TYeRvUX— The Nalanda Index (@Nalanda_index) October 22, 2025 అకస్మాత్తుగా రోడ్డు మధ్యలోకి చొరబడి అమ్మాయిలను భయపెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా జిల్లీ పోలీసు యంత్రంగా రంగంలోకి దిగింది. నలంద జిల్లాలో ఒక యువకుడు పాఠశాల విద్యార్థినులను బెదిరించడానికి, వేధించేందుకు, పట్టపగలు నడిరోడ్డుమీద ప్రమాదకరమైన విన్యాసాలు చేసేవాడు. ఈ దృశ్యాలు కనలంద జిల్లాలో వైరల్ అయ్యాయి. ఈ ఆందోళనకరమైన దృశ్యాలపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిలు సురక్షితంగా ఉండేలా అతనిపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. आप वीडियो में जिस रीलबाज को देख रहे हैं वह बिहार शरीफ का रहने वाला है और इसके इंस्टाग्राम का नाम srijan flipper हैं। इसका काम लड़कियों के सामने स्टंट मारना और उनको परेशान करना और अश्लील गाने बजाना है। सुभाष पार्क नालंदा खंडहर राजगीर फिटनेस पार्क इसका मुख्य अड्डा है। बिहार पुलिस… pic.twitter.com/cTTAcNY4rh— The Nalanda Index (@Nalanda_index) October 22, 2025 ఆన్లైన్లో షేర్ అయిన ఈ వీడియోల ప్రకారం, ఇతగాడు ట్రాఫిక్లో రోడ్డు మధ్యలోకి వచ్చి పిచ్చి పిచ్చి స్టంట్స్తో అమ్మాయిలపైకి దూకి, భయపెట్టేవాడు. దీంతో బాధిత అమ్మాయిలు, తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నలంద పరిపాలనా అధికారులు తగిన చర్యలు తీసుకోవల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. ఇలాంటి ధోరణులుమరింత ముదిరి, తీవ్రమైన ప్రమాదం జరగక ముందు పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు కోరారు. ఇప్పటికే పెరుగుతున్న ఆన్లైన్ ట్రెండ్స్పై ఆందోళన రేకెత్తించిందీ ఘటన. ఇంటా, బయటా ఎక్కడైనా అమ్మాయిలను వేధించినా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించే పేరుతో పిచ్చి పిచ్చి "స్టంట్స్" చేసినా తగిన గుణపాఠం తప్పదనే సంగతిని గుర్తుంచుకోవాలంటున్నారు పెద్దలు ఇలాంటి వాడిని జూలోని బోనులోపెట్టాలి, ఎవరికి ఎలాంటి హాని లేకుండా వాడి విన్యాసాలుసాగుతాయి , ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడికి బుద్ధి చెప్పకపోతే.. ఇలాంటి వాళ్లు మరికొందరు తయరవుతారని మరికొందరు మండిపడ్డారు. తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆన్లైన్ కంటెంట్ నియంత్రణకు స్వతంత్ర వ్యవస్థ
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా వస్తున్న అశ్లీల, అసభ్యకర కంటెంట్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆన్లైన్ ప్లా్లట్ఫామ్లు పాటిస్తున్నామని చెబుతున్న స్వీయ నియంత్రణ విధానం పూర్తిగా విఫలమైందని, అసలు అది ఓ బూటకమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ అరాచకాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ ప్రమేయం లేని, మీడియా సంస్థల ప్రభావం లేని ఒక అత్యంత శక్తివంతమైన ‘స్వతంత్ర, తటస్థ స్వయం ప్రతిపత్తి’కలిగిన వ్యవస్థ అత్యవసరమని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’అనే షోలో అశ్లీల కంటెంట్, దివ్యాంగులను కించపరిచేలా జోకులు వేశారన్న ఆరోపణలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సవాల్ చేస్తూ పాడ్కాస్టర్ రణవీర్ అల్హాబాదియా తదితరులు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా గురువారం ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.వికృత పోకడలు..సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. సమస్య కేవలం అశ్లీలతకే పరిమితం కాలేదని, యూజర్ జనరేటెడ్ కంటెంట్ పేరుతో వికృత పోకడలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీజేఐ.. ‘ఎవరికి వారే సొంత చానల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎవరికీ జవాబుదారీతనం లేకుండా పోతోంది. ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే కదా. నేను ఎవరికీ జవాబుదారీ కాదంటే ఎలా కుదురుతుంది? సమాజంలో విషం చిమ్ముతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే. అడిగే వారు లేరని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చట్టం ఒప్పుకోదు’అని స్పష్టం చేశారు. వాక్స్వాతంత్య్రం అమూల్యమైనదే కానీ, అది వికృత పోకడలకు దారితీయకూడదని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. అడల్ట్ కంటెంట్ ఉంటే కనీసం ముందస్తు హెచ్చరికలైనా ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు.స్వయం ప్రకటిత సంస్థలతో పనికాదునెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్ల తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఐటీ రూల్స్–2021 అమల్లో ఉన్నాయని, జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలో స్వీయ నియంత్రణ వ్యవస్థ పనిచేస్తోందని తెలిపారు. దీనిపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. ’స్వయం ప్రకటిత సంస్థల వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ మీ స్వీయ నియంత్రణ అంత గొప్పగా ఉంటే, ఉల్లంఘనలు ఎందుకు పదేపదే జరుగుతున్నాయి?’అని ప్రశ్నించారు. వాణిజ్య ప్రయోజనాల కోసం పనిచేసే వారి ప్రభావం లేని, ప్రభుత్వానికి కూడా సంబంధం లేని ఒక తటస్థ వ్యవస్థ ద్వారానే నియంత్రణ సాధ్యమని సీజేఐ స్పష్టం చేశారు.త్వరలో నూతన మార్గదర్శకాలు: కేంద్రంఆన్లైన్ కంటెంట్ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రతిపా దిస్తోందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు. స్పందించిన ధర్మాసనం.. ముసా యిదా మార్గదర్శకాలను పబ్లిక్ డొమైన్లో ఉంచి, ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సేక రించాలని సూచించింది. అనంతరం న్యాయరంగ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. కేసుపై తదుపరి విచారణను ధర్మాస నం నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
ట్రైనీ సీఎం.. నీతి ప్రవచనాలు లోకేష్ ను ఏకిపారేసిన అంబటి
-
స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్
సాక్షి, ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) కు సంబంధించి మరో వార్త వైరల్గా మారింది. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ-17) స్పెషల్ ఎడిసోడ్కు రాకపోవడం వార్తల్లో నిలిచింది. ఇది ఆమె అభిమానులను మరింత ఆందోళన పరుస్తోంది.భారత ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని కౌన్ బనేగా కరోడ్పతి (కెబిసి) ప్రత్యేక కార్యక్రమాన్ని, కొంతమంది మహిళా క్రికటర్లు, మరికొంతమంది అభిమానుల మధ్య చిత్రీకరించారు. కానీ స్మృతి రాకపోవడం అభిమానులను నిరాశపర్చింది. అయితే సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్తో ఆమె వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఆమె గైర్హాజరీ సోషల్ మీడియాలో సంచలనం రేపింది.నవంబర్ 26 బుధవారం సాయంత్రం షూట్ కోసం మంధాన తన సహచరులతో పాటు రావాల్సి ఉంది, కానీ వ్యక్తిగత కారణాలను చూపుతూ చివరి క్షణంలో వైదొలిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. మంధాన లేనప్పటికీ, ప్రపంచ కప్ విజేత జట్టు నుండి స్టార్-స్టడ్డ్ బృందం కేబీసీ షూట్లో కనిపించింది.पिता की तबीयत और शादी की उलझन के बीच, क्रिकेट स्टार Smriti Mandhana ने KBC 17 में नहीं दिखीं, स्मृति के पिता को आया था हार्ट अटैक। #SmritiMandhana #KBC #Mumbai #Viralvideo #SocialMedia #SmritiMandhanaFans #heartattack pic.twitter.com/o4VcAINz3E— Nedrick News Punjab (@NedrickP) November 27, 2025కేబీసీలో భారత మహిళా క్రికెట్ జట్టుఈ ఎపిసోడ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, బ్యాట్స్మన్ హర్లీన్ డియోల్, వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్, ఓపెనర్ షఫాలీ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ, ఆల్ రౌండర్ స్నేహ్ రాణా, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు. మహిళల క్రికెట్లో భారతదేశం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటైన ఈ విజయానికి గుర్తుగా దీన్ని రూపొందించారు. మంధాన వచ్చి ఉంటే అమితాబ్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షోలో మూడో సారి కనిపించినట్టు అయ్యేది. భారత మహిళా క్రికెట్ జట్టు కౌన్ బనేగా కరోడ్పతి (కెబిసి) యొక్క 'ప్రత్యేక' ఎపిసోడ్లో కనిపించింది ప్రసార తేదీపై ఇంకా తెలియదు.ఇదీ చదవండి: స్మృతి పెళ్లి వివాదంలో కొత్త ట్విస్ట్ : పలాష్ మాజీ ప్రేయసి ప్రపోజల్ వైరల్కాగా సంగీత్, మెహందీ, హల్దీ వేడుకలు జోరుగా సాగుతున్న తరుణంలో స్మృతి-పలాష్ వివాహ వేడుకలు అకస్మాత్తుగా నిలిచిపోవడం సంచలనం రేపింది. తొలిత తండ్రి శ్రీనివాస్ మంధానకు అనారోగ్యం అని చెప్పినప్పటికి, తరువాత జరిగిన పరిణామాలు, పలాష్ ముచ్చల్ మోసం చేశాడన్న ఆరోపణలు, స్మృతి తన వివాహానికి ముందు ఉన్న అన్ని చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించడం, చాలామంది పలాష్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడం లాంటి విషయాలు అనేక పుకార్లకు తెరలేపాయి. ఇదీ చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా -
అవనిగడ్డలో పనిచేయాలంటే నాయుడిగానే పుట్టాలా?
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో ఓ హోంగార్డు సెల్ఫీ వీడియో వైరల్ కావడం కలకలం రేపుతోంది. ఇసుక, రేషన్ బియ్యం, పేకాట వ్యవహారం విచ్చలవిడిగా నడుస్తోందని.. నిజాయితీగా డ్యూటీ చేస్తుంటే ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ హోంగార్డు వాపోయాడు. ఈ క్రమంలో తన తోటి హోంగార్డులపైనా సంచలన ఆరోపణలు చేశాడు. హోంగార్డు నరేష్ విడుదల జిల్లా ఎస్పీకి పంపిన ఆ ఫిర్యాదు వీడియోలో.. నా తోటి హోంగార్డులు దుర్గారావు, జరుగు శ్రీనుతో పాటు టీవీ5కి చెందిన ఓ ప్రతినిధి నన్ను వేధిస్తున్నారు. అవనిగడ్డలో ఇసుక , రేషన్ బియ్యం , పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. నా డ్యూటీ నేను చేసినా నన్ను టార్గెట్ చేశారు. నా డ్యూటీ నేను చేయడం తప్పా. నేను దళితుడిగా పుట్టడమే తప్పా. అవనిగడ్డలో పనిచేయాలంటే నాయుడిగానే పుట్టాలా?.. పేకాట ఆడేవారిని పట్టుకున్నా ఎమ్మెల్యే మనుషులంటూ హోంగార్డు దుర్గారావు విడిచిపెట్టేస్తున్నారు. నన్ను మోపిదేవి నుంచి హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేయించారు. నన్ను వేధిస్తున్నారు. మీరే న్యాయం చేయండి. మీరు న్యాయం చేయకపోతే చనిపోమన్నా చనిపోతాను. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వడం లేదు.. మీరు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలిసి మీకు నా ఆవేదన పంపిస్తున్నా. దయచేసి అవనిగడ్డ డివిజన్ లో పోలీసు వ్యవస్థను చక్కదిద్దండి ఆ వీడియోలో నరేష్ కోరాడు. స్పందించిన ఎస్పీ.. హోంగార్డ్ సెల్ఫీ వీడియోపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారణకు ఆదేశించారు. పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించామని.. విచారణ నివేదిక అందిన వెంటనే తగిన విధంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారాయన. -
సోషల్ మీడియాలో YSRCPపై పోస్టులు.. YSRCP నేతలు సీరియస్ వార్నింగ్
-
ప్రియమైన కుమారుడికి మీ అమ్మ వ్రాయునది...
తన టీనేజ్ కుమారుడు అదేపనిగా ఫోన్లో మునిగివడం, ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఆ తల్లిని బాగా బాధ పెట్టింది. మందలిస్తే ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని భయపడింది. అయితే తన మనసులోని ఆవేదనను మాత్రం ఒక కాగితంపై పెట్టింది. ఆ కాగితం ఆమె నుంచి ఎలా మిస్ అయిందో తెలియదుగానీ ఇటు వెళ్లి అటు వెళ్లి సోషల్ మీడియాకు చేరింది.తన ఉత్తరంలో టీనేజర్ల మితిమీరిన స్క్రీన్ టైమ్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన మహిళ.చాలా స్కూల్స్లో మొబైల్ ఫోన్ను అనుమతించనప్పటికీ విద్యార్థులు వాటిని రహస్యంగా వాడుతున్నారు. అధిక స్క్రీన్ టైమ్ వలన వారి చదువు దెబ్బతింటుంది. చైనాకు చెందిన ఆ తల్లి ఉత్తరంపై ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ‘ఇది చైనా తల్లి సమస్య మాత్రమే కాదు ఎన్నో దేశాలలోని తల్లుల సమస్య’ ‘ఆ తల్లి ఉత్తరాన్ని ఎన్నో దేశాల ప్రజలు చదివి ఉంటారు. ఆమె కుమారుడు కూడా చదివే ఉంటాడు. అతడు మారుతాడని ఆశిద్దాం’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. (చదవండి: ఒరిజినల్ సర్టిఫికెట్లు వారి దగ్గర ఉంచుకునే అధికారం లేదు) -
పరదాల మాటున పవన్కళ్యాణ్
ద్వారకాతిరుమల: డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో సోమవారం పరదాల మాటున పర్యటించడం చర్చనీయాంశమైంది. ప్రజలను ఆయన దగ్గరకు రానివ్వకుండా బారికేడ్లు అడ్డుపెట్టడం విమర్శలకు దారితీసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పరదాల సీఎం.. కంచెలు వేస్తున్న సీఎం అని గతంలో విమర్శించిన పవన్కళ్యాణ్ తాజాగా పరదాల మాటున పర్యటించడం, బారికేడ్లు అడ్డుపెట్టి ప్రజల్ని అడ్డుకోవడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఐఎస్ జగన్నాథపురంలో పర్యటించిన పవన్కళ్యాణ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయినేజీని పరిశీలించిన తరువాత సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయన పర్యటన ఆద్యంతం పరదాల మాటున, బారికేడ్ల మధ్య సాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు తమ సమస్యలను, గోడును చెప్పుకొనేందుకు ఎంతో ఆశగా వస్తే.. కనీసం పవన్ను కలవనివ్వలేదని, అడుగడుగునా పోలీసులు అడ్డుపడ్డారని పలువురు వాపోయారు. ఎన్నికల ముందు ప్రశ్నించేందుకు వచ్చానన్న పవన్ ఇప్పుడు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెం, తిమ్మనకుంట గ్రామాల ప్రజలు రోడ్ల సమస్యపై లక్ష్మీనరసింహ స్వామివారి కొండ దిగువన ప్లకార్డులు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, పవన్కు తెలియజేసేందుకు వస్తే ఇక్కడ కలిసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు ధైర్యం చేసి కాన్వాయ్కి అడ్డంపడి వినతిపత్రాలు అందించగా, మిగిలిన వారు నిరుత్సాహంగా వెనుదిరిగారు.ఇవి పరదాలు కావా.. పవన్!ఐఎస్ జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రెయినేజీలను పరిశీలించే సమయంలో అక్కడున్న ప్రజలు పవన్కళ్యాణ్ను కలవాలని ఎంతో ఆశపడ్డారు. కానీ.. అక్కడ వారికి పరదాలు అడ్డొచ్చాయి. వైఎస్ జగన్ను పరదాల సీఎం అన్న పవన్ ఇప్పుడు పరదాల మాటున ఎలా పర్యటించారు? ఇవి పరదాలు కావా?– పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి ప్రజలకు అడ్డుగా బారికేడ్లుఅధికారంలోకి రాకముందు ఎన్నో మాటలు చెప్పిన పవన్ అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మానేశారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో ఐఎస్ జగన్నాథపురంలో రహదారులకు ఇరువైపులా బారికేడ్లు పెట్టి మరీ వారిని అడ్డుకున్నారు. – షేక్ అన్సారిబాషా, వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ సంయుక్త కార్యదర్శి -
స్క్రీన్పై 'బ్యాన్'
ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించారు. వచ్చే డిసెంబర్ 10 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తోంది. వీరు కొత్తగా సామాజిక మాధ్యమాల ఖాతాలు తెరవడానికి వీల్లేదు. ఇప్పటికే ఉంటే అవి రద్దు అవుతాయి. ఈ బిల్లుకు 2024 నవంబర్ 28న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తద్వారా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ప్రపంచంలో నిషేధాన్ని ప్రకటించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా అవతరించింది. ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్సామాజిక మాధ్యమాలతో పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. వీటిలో ఉండే కంటెంట్ పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సుకు హాని కలిగిస్తోంది. పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా నిషేధానికి శ్రీకారం చుట్టినట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చేపట్టిన ఒక అధ్యయనంలో 10–15 సంవత్సరాల వయసున్న పిల్లల్లో 96% మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. వీరిలో 10 మందిలో ఏడుగురు హానికరమైన కంటెంట్, వేధింపులకు గురయ్యారని తేలింది.నిషేధం బాటలో మరిన్ని..ఇప్పటికే చాలా దేశాలు పాఠశాలల్లో స్మార్ట్ఫోన్ల వినియోగాన్ని నిషేధించాయి. తాజాగా సోషల్ మీడియా బ్యాన్ విషయంలో ఆస్ట్రేలియా బాటలో మరిన్ని దేశాలు ఉన్నాయి. పదిహేనేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించనున్నట్టు డెన్మార్క్ ప్రకటించింది. అయితే 13, ఆపై వయసున్న పిల్లలు వీటిని వినియోగించాలంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి.పిల్లల దైనందిన జీవితం, బాల్యాన్ని రూపొందించడంలో హానికరమైన కంటెంట్, వాణిజ్య ఆసక్తులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న డిజిటల్ ప్రపంచంలో వారిని ఒంటరిగా వదిలివేయకూడదని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. పదహారేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా వాడకుండా వచ్చే ఏడాది నుంచి అడ్డుకట్ట వేయనున్నట్టు మలేషియా వెల్లడించింది. హానికారక కంటెంట్ 18 ఏళ్లలోపు పిల్లలకు చేరకుండా బ్రిటిష్ ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ను యూకే అమలు చేస్తోంది. పదిహేనేళ్లలోపు పిల్లలను సామాజిక మాధ్యమాల నుంచి దూరం చేసేందుకు నార్వే ఓ చట్టాన్ని తీసుకొస్తోంది. న్యూజిలాండ్, ఫ్రాన్స్, పాకిస్తాన్ సైతం ఈ బాటలో ఉంది. ‘15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలి’.. అని నెదర్లాండ్స్ ప్రభుత్వం సూచించింది.కోట్లలో యూజర్లు..ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్, స్నాప్చాట్.. వేదిక ఏదైనా ఈ సామాజిక మాధ్యమాలను వినియోగించేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 566 కోట్లు ఉన్నట్టు అంచనా. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఉపయోగిస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలూ ఇందుకు మినహాయింపు కాదు. ఒక్కొక్క దేశాన్నిబట్టి 13–17 ఏళ్ల వయసున్న పిల్లల్లో 95% వరకు, 8–12 ఏళ్లవారిలో 40% మందికి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.అత్యధికుల మాట అదే..ఫ్రాన్స్కు చెందిన మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఇప్సాస్ ఈ ఏడాది జూన్–జూలైలో 30 దేశాల్లో సర్వే చేపట్టింది. 18–75 ఏళ్ల వయసున్న 23,700 మంది ఇందులో పాలుపంచుకున్నారు. ఇప్సాస్ ఎడ్యుకేషన్ మానిటర్–2025 ప్రకారం.. 14 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలంటూ 71% మంది తమ గళం వినిపించారు. గత ఏడాది సర్వేలో 65% మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇండోనేషియాలో 87% మంది, ఫ్రాన్స్ 85, ఆస్ట్రేలియాలో 79% మంది బ్యాన్వైపు మొగ్గు చూపారు. అయితే భారత్లో గత ఏడాది 73% మంది ఈ అంశాన్ని ఏకీభవిస్తే.. 2025లో ఈ సంఖ్య 68%కి వచ్చి చేరింది. -
అబుదాబిలో అల్లు అర్జున్ సతీమణి.. ప్రగ్యా జైస్వాల్ బ్యూటీఫుల్ లుక్!
అబుదాబి టూర్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి చిల్..హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బ్యూటీఫుల్ లుక్..ఎల్లో డ్రెస్లో అనుపమ పరమేశ్వరన్ క్రేజీ లుక్స్. .నటి శ్వేతా మీనన్ యోగాసనాలు. .అలాంటి డ్రెస్లో మంచు లక్ష్మీ హోయలు.. View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
స్మృతి పెళ్లి వివాదం : పలాష్ మాజీ ప్రేయసి ప్రపోజల్ వైరల్
టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతిమంధాన పెళ్లి చేసుకోవాలనుకున్న సంగీత దర్శకుడు , చిత్రనిర్మాత పలాష్ ముచ్చల్కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. పలాష్ స్మృతిని మోసం చేసిన కారణంగానే పెళ్లి ఆగిపోయిందనే పుకార్లుబాగా వినిపిస్తున్నాయి. ఈ పుకారపై గురించి ప్రస్తుతానికి ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ పలాష్ మాజీ గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫోటో, బిర్వా షాకి ప్రపోజ్ చేసిన వడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017 నాటి పోస్ట్లో మోకాళ్లపై వంగి అత్యంత రొమాంటిక్ వాతావరణంలో పలాష్ ఆమెకు ప్రపోజ్ చేస్తూ ఉన్నట్లు మనం చూడవచ్చు.Palash Muchhal and his ex Birva Shah👀 pic.twitter.com/0nVRaia3CQ https://t.co/T8kNaz2REU— Mention Cricket (@MentionCricket) November 25, 2025 స్మృతిమంధానకు సోషల్ మీడియాలో సపోర్ట్మరికొన్ని గంటల్లో తనను ప్రేమించిన వాడితో ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతిమంధాన వివాహం రద్దు కావడంతో అటు అభిమానులు, ఇటు సామాన్యం జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. పలాష్ ముచ్చల్ దారుణంగా ఆమెను మోసం చేశాడంటూ సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. మరోవైపు ధైర్యంగా ఉండు, స్మృతి.. మంచే జరిగింది. ఆ మోసగాడి గురించి ముందే తెలిసింది అంటూ ఎక్స్ ద్వారా ఆమెకు మద్దతుగా నిలిచారు. దీనికి సంబందించి మెన్షన్ క్రికెట్ అనే ట్విటర్ హ్యాండిల్లో అనేక పోస్టులు, వీడియోలు వైరల్గా మారాయి. పుకార్లు నిజమే, పలాష్ నిజానికి స్మృతిని మోసం చేశాడన్న పోస్ట్కు భారీ స్పందన లభిస్తోంది.ఇదీ చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా >In 2019, Palash broke with his fiance. >Started dating to Smriti Mandhana,>Relationship with her for 6 years,>Got the fame,>Decided to marry for money,>Cheated on her just before wedding night.I wonder what smriti saw in him. pic.twitter.com/KCkTsk0x3v— `S.🚀 (@ThodaSaSanskari) November 25, 2025పాపం పాలక్మరోవైపు పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ పట్ల సానుభూతి వ్యక్తమౌతోంది. ఈ పుకార్లు నిజమైతే సొంత సోదరుడి వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందంటూ మరికొంతమంది కామెంట్స్ చేశారు. ఇండియాలో ఉత్తమ మహిళా నేపథ్య గాయకులలో ఒకరామె. పైగా పేద పిల్లల గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చడానికి ఒక NGOను నడుతున్న మంచిమనసున్న అద్భుతమైన వ్యక్తి అంటూ పేర్కొనడం విశేషం.See this 👀👇🏻https://t.co/H5kpT5LcaV— Mention Cricket (@MentionCricket) November 25, 2025 -
బ్యూటీఫుల్ శారీలో ప్రియాంక మోహన్.. జ్యోతి పూర్వాజ్ స్టన్నింగ్ పోజులు!
శారీలో హీరోయిన్ ప్రియాంక మోహన్ బ్యూటీఫుల్ లుక్..రివాల్వర్ రీటా ప్రమోషన్స్లో కీర్తీ సురేశ్ ఫుల్ బిజీ..బ్యూటీఫుల్ అవుట్ఫిట్లో నటి నిక్కీ గల్రానీ హోయలు..బుల్లితెర భామ జ్యోతిపూర్వాజ్ స్టన్నింగ్ పోజులు..గోవాలో చిల్ అవుతోన్న హీరోయిన్ మంజరి ఫడ్నవీస్.. View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Praveena Kadiyala (@urspraveenakadiyala) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) -
రీల్ ఎంత పని చేసింది రాములా!
సోషల్ మీడియా అల్గారిథం ఎప్పుడు ఎలా పని చేస్తుందో?.. ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో అర్థంకాని పరిస్థితి. అందుకే పోస్టులు, వీడియోలు పెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పెళ్లి కాబోతుందన్న సంబురంలో.. ముందు వెనకా ఆలోచించకుండా ఓ వీడియో తీసుకుని పోస్ట్ చేసి చిక్కుల్లో పడ్డాడు ఇక్కడో వైద్యుడు. ఇక్కడి ఈ కింది వీడియోలో బనీయన్ మీద కిందపడి మరీ దొర్లుతూ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఓ డాక్టర్. ఆ పక్కనే ఒయలు ఒలకబోస్తోంది అతనికి కాబోయే భార్య. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఎవరికేం నొప్పి అంటారా? అక్కడికే వస్తున్నాం. ఆ డ్యాన్స్ తన బెడ్రూంలో వేస్తే ఫర్వాలేదు. కానీ, ఆస్పత్రిలోనే దుకాణం పెట్టేశాడు. यूपी –शामली जिले के एक सरकारी अस्पताल के ड्यूटी रूम में डॉक्टर का डांस, CMO ने नोटिस देकर जवाब मांगा !!कहा जा रहा है कि डॉक्टर अफकार सिद्दीकी सगाई की खुशी में डांस कर रहे हैं और साथ में डांस करने वाली उनकी मंगेतर है। pic.twitter.com/q7FWRs7xdV— Sachin Gupta (@SachinGuptaUP) November 21, 2025 ఆస్పత్రి గదిలో.. అదీ ఎమర్జెన్సీ డ్యూటీని ఎగ్గొట్టి మరీ తనకు కాబోయే భార్యతో డ్యాన్స్ చేశాడు షామ్లీ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్ వకార్ సిద్ధిఖీ. ఈ వీడియో కాస్త నెట్టింట రీల్ రూపంలో వైరల్ అయ్యింది. అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఆఖరికి అధికారుల దృష్టికి చేరింది. దీంతో సిద్ధిఖీని వివరణ కోరారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించి.. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయించారు. \బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వకార్ సిద్ధిఖీ రెండేళ్ల కాంట్రాక్ట్ కింద ఆ ఆస్పత్రిలో చేరారని.. అతని ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవైపు డాక్టర్ల కొరత కొనసాగుతున్నవేళ.. ఈ కాంట్రాక్ట్ డాక్టర్ చేసిన పని ప్రజాగ్రహానికి దారి తీసింది. -
భయానక రోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరి కిందపడి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ను వేగంలో ఉన్న ఢీకొట్టింది. ఈ ప్రమాదం సందర్భంగా బైక్ పైన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలోని గౌరా పడావ్లో ఓ బైకర్ రాంగ్ రూట్లో వచ్చాడు. బైక్తో రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో వేగంతో వస్తున్న కారు.. సదరు బైక్ను ఢీకొట్టింది. దీంతో, ఒక్కసారిగా బైక్, దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరి కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనలో బైకర్దే తప్పు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు.. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. వారిని వాన్భూల్పుర నివాసితులుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. -
అనికా సురేంద్రన్ బ్యూటీఫుల్ లుక్.. ఆషిర రంగనాథ్ స్టన్నింగ్ పోజులు!
శారీలో అనికా సురేంద్రన్ బ్యూటీఫుల్ లుక్స్..డిఫరెంట్ డ్రెస్లో అనుపమ పరమేశ్వరన్ హోయలు..ఫ్రెండ్ ఈవెంట్లో హీరోయిన్ లయ సందడి..హీరోయిన్ ఆషిక రంగనాథ్ స్టన్నింగ్ లుక్..వజ్రంలా మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్..డిజైనర్ డ్రెస్లో భూమి పెడ్నేకర్ పిక్స్.. View this post on Instagram A post shared by Bhumi Satish Pednekkar (@bhumisatishpednekkar) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) -
అక్కడేమో భారీ జరిమానాలు.. మరి భారత్లో?!
మీ అకౌంట్లు క్లోజ్ చేస్తున్నాం. అప్రమత్తం అవ్వండి.. అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు అక్కడి మైనర్లకు నోటిఫికేషన్లు పంపిస్తున్నాయి. ఆస్ట్రేలియా డిసెంబర్ 10, 2025 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో భారత్లో ఇలాంటి నిషేధం అమలు చేయడం సాధ్యమేనా? అనే అంశాన్ని ఓసారి పరిశీలిద్దాం.. పిల్లలు.. పిల్లలాగే ఉండనివ్వాలి అన్నది ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ చెబుతున్నమాట. సో.మీ. ప్రభావంతో పిల్లలు హానికరమైన కంటెంట్, ఆన్లైన్ బుల్లీయింగ్, మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని చెబుతోంది. ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్(సోషల్ మీడియా మినిమమ్ ఏజ్) బిల్లు ప్రకారం.. ఆన్లైన్ ఎడ్యుకేషన్, యూట్యూబ్ కిడ్స్, ఈ లెర్నింగ్ యాప్లకు మాత్రం బ్యాన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే సో.మీ. యాప్లు ఈ బ్యాన్ను వ్యతిరేకించినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయబోతున్నాయి. మెటా.. దాని అనుబంధ యాప్లు, టిక్టాక్, యూట్యూబ్, ఎక్స్.. ఇలా ఎందులోనూ వాళ్లకు అకౌంట్లు ఉండడానికి వీల్లేదు. ఇప్పటికే మెయిల్స్, నోటిఫికేషన్ల రూపంలో మైనర్లకు సందేశాలు పంపిస్తున్నాయి. ఆ అకౌంట్లలో ఉన్న తమ డేటాను భద్రపరుచుకోవాలని వాళ్లకు సూచిస్తున్నాయి. నిర్ణీత వయసు దాటితే గనుక తమను తగిన ఆధారాలతో సంప్రదించాలని.. ఫేషియల్ ఏజ్ స్క్రీనింగ్ లాంటి సాంకేతిక సాయంతో ఆ విషయాన్ని ధృవీకరించుకుని ఆపై ఆ అకౌంట్లను యాక్టివేట్ చేస్తామని చెబుతున్నాయి. పలు యాప్లు పిల్లల అకౌంట్లను డీ యాక్టివేట్ చేయడం ప్రారంభించాయి. డిసెంబర్ 4వ తేదీ నుంచే పిల్లలు అకౌంట్లను క్రియేట్ చేయడానికి వీలుండదు. 10వ తేదీ నుంచి సంపూర్ణ నిషేధం అమల్లోకి వస్తుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. సదరు ప్లాట్ఫారమ్లకు 50 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు(మన కరెన్సీలో రూ.2,856 కోట్లు) దాకా జరిమానా విధిస్తారు. భారత్లో ఇది పరిస్థితి..ఆస్ట్రేలియా ప్రపంచంలో ఈ తరహా బ్యాన్ తేబోతున్న దేశం. అలాగే.. డెన్మార్క్ వంటి దేశాలు వయస్సు ఆధారంగా సోషల్ మీడియా నిషేధం అమలును పరిశీలిస్తున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ తరహా నిషేధం అమలు అవుతోంది కూడా. ఈ నేపథ్యంలో.. భారతదేశంలో కూడా ఈ అంశంపై చర్చ మొదలైంది. అయితే డిజిటల్ నిపుణులు చెబుతోంది ఏంటంటే.. నిషేధం అమలు చేయడం కష్టమని. ఎందుకంటే భారత్లో 25 కోట్ల మైనర్లు సో.మీ. వాడుతున్నారనే అంచనా ఒకటి ఉంది. అంతేకాదు.. భారతదేశంలో డిజిటల్ మానిటరింగ్ బలహీనంగా ఉందని. సోషల్ మీడియా వాడకాన్ని ఆరోగ్యకరంగా ప్రోత్సహించడం (healthy use) మంచిదని సూచిస్తున్నారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, పూర్తిగా నిషేధం కంటే నియంత్రణ, అవగాహన అవసరమని నిపుణులు భావిస్తున్నారు. అయితే బిజీ లైఫ్లో ఇటు భారత్లో అలాంటి నిషేధం వద్దనే చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.కోర్టు ఏం చెప్పిందంటే.. భారత్లో చిన్నారులు సోషల్ మీడియా(Social Media) వాడకుండా నిషేధించడం తమ పరిధిలో లేదని సర్వోన్నత న్యాయస్థానం ఇది వరకే తేల్చి చెప్పింది. ఇది చట్టపరిధిలోని అంశమని స్పష్టం చేసింది. అంతేకాదు.. 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. కఠిన చట్టం లేదా?.. భారత్లో మైనర్లు సో.మీ. వాడకూడదనే రూల్ ఏం లేదు. రాజకీయ కోణం, ఇక్కడి జనాభా, సో.మీ. ప్లాట్ఫారమ్ జరిపే వ్యాపారాలను పరిగణనలోకి తీసుకుంటే అది సాహసమనే చెప్పాలి. అయితే.. కేంద్ర ప్రభుత్వం 2023లో Digital Personal Data Protection (DPDP) Act, 2023ను ఆమోదించింది. దీని ఆధారంగా DPDP Rules, 2025ను నోటిఫై చేసింది. ఈ నియమాల ప్రకారం.. 18 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల లేదా లీగల్ గార్డియన్ అనుమతి తప్పనిసరి. సోషల్ మీడియా కంపెనీలు పిల్లల డేటా సేకరణ, వినియోగం, షేరింగ్పై కఠిన నియంత్రణలు పాటించాలి. ఉల్లంఘన జరిగితే కంపెనీలకు రూ. 250 కోట్లు వరకు జరిమానా విధించవచ్చు. అయితే.. ఇది సక్రమంగా అమలు కావడం లేదు. చివరగా.. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటి దేశంగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు చేస్తోంది. భారతదేశంలో ఇలాంటి నిషేధం అమలు సాధ్యమా అనే ప్రశ్నపై నిపుణులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి నిషేధం కంటే నియంత్రణ, అవగాహన, డిజిటల్ లిటరసీపై దృష్టి పెట్టడం భారతదేశానికి అత్యంత అనుకూలమని సూచిస్తున్నారు. -
వైరల్ వీడియో: బంగ్లాదేశ్లో భూకంపం.. భారత్ ప్రకంపనలు
ఢాకా: బంగ్లాదేశ్ (Bangladesh)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. బంగ్లా రాజధాని ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. భూకంపం ప్రకంపనల కారణంగా బంగ్లాదేశ్లో పలు భవనాలు కూలిపోయాయి.. దీంతో, ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల ప్రకారం.. బంగ్లా రాజధాని ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్డిలో శుక్రవారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అక్కడ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. పేర్కొంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఈ ప్రకంపనల ధాటికి భారత్లోనూ భూమి కంపించింది. కోల్కతా (Kolkata) సహా ఉత్తర భారతంలో (Northeast India) ప్రకంపనలు నమోదయ్యాయి. కోల్కతాలో ఉదయం 10:10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించింది. బెంగాల్లోని కూచ్బెహార్, దక్షిణ్, ఉత్తర దినాజ్పూర్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. గువాహటి, అగర్తల, షిల్లాంట్ వంటి నగరాల్లోనూ భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు.🚨🇧🇩 BREAKING: BANGLADESH ROCKED BY 6.0 EARTHQUAKE A magnitude 6.0 earthquake struck Bangladesh early Friday, shaking the densely populated region around Dhaka.The quake hit at 4:38 GMT at a depth of 36 kilometers, with its epicenter roughly 28 kilometers northeast of the… pic.twitter.com/LC1w1RrS3z— Mario Nawfal (@MarioNawfal) November 21, 2025మరోవైపు.. ఈ భూకంపం కారణంగా బంగ్లాదేశ్-ఐర్లాండ్ మధ్య ఢాకా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్కు అంతరాయం కలిగింది. ప్రకంపనలతో కొన్ని నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత కొనసాగించారు. అయితే, ఈ విపత్తులో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Reportedly there is a Strong earthquake in Bangladesh, hope everyone is safe. 🇧🇩 pic.twitter.com/2spGn9yUnB— Kashif (@KashifNdmCric) November 21, 2025 #WATCH | A 5.5-magnitude earthquake struck near Narsingdi in Bangladesh, this morning.Visuals from Dhaka as the agencies work to restore damages caused by the tremors. pic.twitter.com/rqHmCggN3L— ANI (@ANI) November 21, 2025 -
సరదాగా మంచు లక్ష్మీ బోటింగ్.. శ్రీలీల బ్యూటీఫుల్ లుక్..!
సిస్టర్కు నమ్రతా శిరోద్కర్ బర్త్ డే విషెస్..సరదా సరదాగా బోటింగ్ చేస్తోన్న మంచు లక్ష్మీ..సాగర తీరాన ఎనిమిది వసంతాలు హీరోయిన్ అనంతిక..గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న శ్వేతా బసు ప్రసాద్..బ్యూటీఫుల్ డ్రెస్లో హీరోయిన్ శ్రీలీల.. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) View this post on Instagram A post shared by Subhashree Rayaguru (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) -
సిస్టర్ శిల్పా శిరోద్కర్ బర్త్డే.. చెల్లిపై నమ్రతా ప్రశంసలు (ఫోటోలు)
-
భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!
కార్పొరేట్ ఐటీ, కంపెనీల్లో ఉద్యోగాల కోత, ఉద్యోగుల కష్టాల గురించి చాలా కథనాలు విన్నాం. ఉన్నట్టుండి ఉపాధిని కోల్పోతే, వారికి ఉండే అనేక రకాలైన కమిట్మెంట్లు, ఈఎంఐలు, స్కూలు ఫీజులు లాంటి అవసరాలకోసం ఎన్నో ఇబ్బదులు పడాల్సి వస్తుంది. సాధ్యమైనంత త్వరగా మరో ఉద్యోగం రాకపోతే ఈ కష్టాలకకు తోడు మానసిక ఒత్తిడి, ఆందోళన మరింత పెరుగుతుంది. ఈ క్షోభ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అలా ఒక IIT నుండి తొలగించబడిన ఒక ఇండియన్ మేనేజర్ గాథ నెట్టింట పలువురి కంట తడి పెట్టిస్తోంది.Nifty50 కంపెనీలో పనిచేసే మేనేజర్ ఏడు నెలల క్రితం ఉద్యోగాన్ని కోల్పోయాడు. 18 ఏళ్ల సర్వీసు ఏడాదికి, రూ. 70 లక్షల జీతం. దీంతో గత ఏడు నెలల కాలంగా తాను అనుభవిస్తున్నవెతలపై కలత పెట్టు కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒకపుడు టీంలీడర్గా ఉన్నా అతనికిపుడు పైసా ఆదాయం లేదు. కొత్త ఉద్యోగం దొరకడంలేదు. దాచుకున్న డబ్బంతా కరిగిపోయింది. రెండు నెలలు దాటితే జీవనం చాలా కష్టం అంటూ రెడ్డిట్ పోస్ట్లో తన గోడును వెళ్లబోసుకున్నారు.లింక్డ్ఇన్, నౌక్రీ, రిఫరెన్స్లు,కన్సల్టెంట్లు అన్ని ప్రయత్నాలు అయ్యాయి. కానీ ఫలితం లేదు. మరిన్ని అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ప్రీమియం సేవలను కూడా తీసుకున్నాను. దురదృష్టవశాత్తు ఎలాంటి కాల్స్ కూడా రావడం లేదు. గత ఏడు నెలల్లో రెండు ఇంటర్వ్యూలు మాత్రమే వచ్చాయని టెక్కీ రాసుకొచ్చాడు. స్నేహితులు కూడా పెద్దగా సాయం చేయడం లేదని. పెద్దగా అప్షన్స్ లేవు కదా, తక్కువ జీతమే అయినా తనకి అవకాశాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా నిరాశగా ఉందంటూ వాపోవడంతో నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితి బాగాలేదంటూ వ్యాఖ్యానించారు. ఇండియా ఐటీ నిపుణులకు గడ్డుకాలం అని కొందరంటే, ఇండియాలో సీనియర్లకు జాబ్ రావడం అంటే ఛాలెంజ్గా మారిపోయిందనే అభిప్రాయాల్ని వ్యక్తం చశారు. ఇదీ చదవండి: 40 ఏళ్ల సేవలు, రూ. 35 లక్షలు..ఎన్ఆర్ఐకి అరుదైన గౌరవం! -
అలాంటి వారిపై కఠిన చర్యలు: సజ్జనార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేసినా, విధులకు ఆటంకం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు.హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తాజాగా ట్విట్టర్ వేదికగా..‘పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగినా, దాడులు చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం. హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం.గుర్తుంచుకోండి.. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉంటుంది. పాస్ పోర్టు జారీకి, ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయి. క్షణికావేశంలో ఏ చిన్నతప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాయి’ అని హెచ్చరికలు జారీ చేశారు.పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగిన, దాడులు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్… pic.twitter.com/4SqPwW0hfb— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 20, 2025 -
జీన్స్ పాపలా శోభిత.. ప్రెగ్నెన్సీ లుక్లో బిగ్బాస్ సోనియా!
జీన్స్ పాపలా అక్కినేని శోభిత ధూళిపాళ్ల..బిగ్బాస్ సోనియా ప్రెగ్నెన్సీ లుక్స్..పడచుపిల్లలా బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ..కెన్యా టూర్లో అనసూయ చిల్..పెళ్లి వేడుకలో సందడి చేసిన హీరోయిన్ మహేశ్వరి.. View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Mahe Ayyappan (@maheswari_actress) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Soniya Yash (@soniya.yashofficial) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
సోషల్ మీడియా ద్వారా వ్యాపారావకాశాలు
యూట్యూబ్, ఫేస్బుక్లాంటి సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేసే అవకాశాలను కల్పించనున్నట్లు హైదరాబాదీ సంస్థ డబ్ల్యూకామర్స్ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ శ్రీరామనేని తెలిపారు. ఈ విధానంలో పెట్టుబడి, సరుకుల నిల్వలాంటి బాదరబందీ ఉండదని.. చిరు వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు ఎవరైనా దీన్ని ప్రారంభించవచ్చని వివరించారు.ఇందుకోసం కంపెనీ తాము ఆఫర్ చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు, విక్రేతల పేరుతో ఆన్లైన్ స్టోర్ ఏర్పాటు చేస్తుంది. దాని లింకులు/క్యూఆర్ కోడ్లను విక్రేతలు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదా తెలిసినవారికి షేర్ చేయాలి. వాటి ఆధారంగా జరిగే ఆయా ఉత్పత్తుల అమ్మకాలపై విక్రేతకు 20–40 శాతం లాభం ఉంటుంది.డెలివరీ బాధ్యతలను కంపెనీ తీసుకుంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22,000కు పైగా యాక్టివ్ ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయని, హెల్త్, వెల్నెస్ తదితర విభాగాల్లో 40కి పైగా బ్రాండ్స్, 600 పైచిలుకు ఉత్పత్తులు ఉన్నాయని శ్రీధర్ చెప్పారు. -
Noge నోజ్.. అంటే ముక్కు!!
మన దేశంలో విద్యావ్యవస్థ ఎంత దారుణంగా తెలియజేసే ఘటన ఇది. ఆంగ్ల భాషలో కనీస స్పెల్లింగులు కూడా రాకుండానే ప్రైమరీ స్కూల్లో ఓ టీచర్ పిల్లలకు పాఠాలు నేర్పుతూ పట్టుబడ్డాడు. పైగా అతగాడి టాలెంట్ దేశం మొత్తం వైరల్ వీడియో రూపంలో పాకింది. noge నోజ్ అంటే ముక్కు.. ఈఏఆర్ఈ(EARe) ఇయర్ అంటే చెవులు, ఐఈవై(Iey) ఐస్ అంటే కండ్లు.. ఇవి ఈయనగారు చెప్పే పాఠాలు. అంతేకాదు.. సండే, మండే.. కూడా తప్పుల తడకగానే రాస్తున్నారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. మదర్, ఫాదర్, బ్రదర్.. వీటికి ఈయనగారికి అసలు స్పెల్లింగులే రావట. ఛత్తీస్గఢ్ బలరామ్పూర్ జిల్లా మచాన్దండ్ కోగ్వర్లోని ప్రాథమిక పాఠశాలలో 42 మంది పిల్లలు ఉన్నారు. వీళ్లకు ఇద్దరు టీచర్లు. అందులో ఒకడైన అసిస్టెంట్ టీచర్ ప్రవీణ్ టొప్పో గారి పాండిత్యమే ఇది. ఇది వైరల్ కావడంతో విద్యాశాఖ ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. 'Iey मतलब आंख, Noge मतलब नाक' सिखाने वाले टीचर का वीडियो वायरल, शिक्षा विभाग ने किया सस्पेंड https://t.co/3QfKQr4WFI#Chhattisgarh #CGNews #Ambikapur #English #Teacher pic.twitter.com/cGiollwCXo— NaiDunia (@Nai_Dunia) November 16, 2025ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ మధ్యే అకడమిక్ ఈయర్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి శిక్షా గుణవత్తా అభియాన్ అనే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్ కింద టీచర్లు లేని స్కూల్స్ ఇక మీదట ఉండకూడదని, ప్రతీ బడిలో కనీసం ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఉండాలని, తమ పిల్లలకు సరిగా పాఠాలు బోధించని టీచర్లను తల్లిదండ్రులు ప్రశ్నించే పరిస్థితులు రావాలని.. ముఖమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఓ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా ఏమాత్రం అనుభవం లేని, చదువురాని వాళ్లను టీచర్లుగా నియమిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆగష్టులోనూ ఈ తరహాలోనే అక్కడ ఓ ఘటన బయటపడింది. నెలకు రూ.70 వేల జీతం అందుకునే ఓ టీచర్ పిల్లలకు తప్పుగా పాఠాలు చెబుతూ విద్యాశాఖ అధికారులకు దొరికాడు. -
కెన్యాలోనే అనసూయ చిల్.. ప్రియాంక చోప్రా గ్లోట్ ట్రాటర్ లుక్!
కెన్యాలోనే చిల్ అవుతోన్న అనసూయ..అలా సరదాగా చిల్ అవుతోన్న ఆదా శర్మ..గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లుక్లో ప్రియాంక చోప్రా..రేణు దేశాయ్ లేటేస్ట్ పిక్స్..కూతురు సుప్రీతతో సురేఖవాణి ట్రెడిషనల్ లుక్స్.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Bhumi Satish Pednekkar (@bhumisatishpednekkar) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
నేరాలు, అవినీతిపై ఆగ్రహ జ్వాలలు
మెక్సికో సిటీ: పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో చేపట్టిన ర్యాలీకి వేలాదిగా జనం తరలివచ్చారు. జన్ జెడ్ గ్రూప్ సారథ్యం వహించిన ఈ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ప్రశాంతంగా జరిగినా కొన్ని చోట్ల యువత పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా గాయపడిన 120 మందిలో 100 మంది పోలీసులేనని అధికారి ఒకరు తెలిపారు. ఇరవై మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. అధ్యక్షురాలు క్లౌడియా షీన్బామ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర నగరాల్లో కూడా జరిగిన ప్రదర్శనల్లో ప్రతిపక్ష పారీ్టల నేతలు కూడా పాల్గొన్నారు. నిరసన కారులు ఈ సందర్భంగా ఉరువపన్ నగర మేయర్ కార్లోస్ మంజో హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. BREAKING: MEXICO🔴 THE NATIONAL PALACE HAS FALLENThe National Palace in Mexico City has been overrun — crowds flooding the gates, barriers collapsing, and the government losing control in real time.This is not a protest.This is a national eruption — the kind that signals… pic.twitter.com/V4GEZydhLg— Jim Ferguson (@JimFergusonUK) November 15, 2025డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. మాకు మరింత భద్రత కావాలంటూ ఆండెŠస్మస్సా అనే వ్యక్తి పుర్రె బొమ్మ కలిగిన జెండాను ప్రదర్శించారు. అధ్యక్ష భవనం నేషనల్ ప్యాలెస్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారియర్లను నిరసనకారులు ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిపై మండే పదార్థాలను విసిరేశారు. పోలీసుల వద్ద ఉండే షీల్డులను, ఇతర వస్తువులను లాగేసుకున్నారు. భవనం ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు యతి్నంచిన నిరసనకారులను పోలీసులు టియర్గ్యాస్ ప్రయోగించి, అడ్డుకున్నారు. నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంజో గుర్తు తెలియని వ్యక్తి కాల్పుల్లో చనిపోయారు.Te pido un favor ? No dejes de hablar de la represión en México , nadie de la izquierda te lo va a mostrar ni a contar , pero el pueblo mexicano cuenta con nosotros para visibilizarlo , vale un 🖐️ pic.twitter.com/TR9TmQNIBb— @IsraelVive (@IsraelVive1948) November 15, 2025 డ్రగ్స్ ముఠాలు, డ్రగ్స్ రవాణాపై ఆయన తీవ్రంగా విమర్శలు చేయడమే ఇందుకు కారణమన్న అనుమానాలున్నాయి. అధ్యక్షురాలు షీన్బామ్ను 70 శాతం ప్రజలు అభిమానిస్తున్నారు. మత్తు మందు ఫెంటానిల్ అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే, సాయుధ ముఠాలను నియంత్రించడంలో విఫలమైనట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై చుట్టుపక్కల దేశాలు కూడా మెక్సికోతో విభేదిస్తున్నాయి. పెరూ ఇటీవలే మెక్సికోతో సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. El pueblo ya despertó y perdió el miedo a las Narcodictaduras. La izquierda corrupta, violenta y saqueadora que gobierna en #Mexico empieza a desmoronarse.#MarchaNacional #GeneraciónZ Hoy México despertó.#Colombia cuando? pic.twitter.com/OpyhlE1jTY— Decko. (@Frankzm) November 15, 2025 -
భారత మహిళ నిర్వాకం.. పర్యాటకురాలిగా పాక్కు వెళ్లి..
లాహోర్/చండీగఢ్: పాకిస్తాన్లో గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొనే వంకతో వాఘా సరిహద్దు గుండా దాయాది దేశంలో అడుగుపెట్టిన 48 ఏళ్ల భారతీయురాలు మరుసటి రోజే కనిపించకుండాపోయారు. ఈ క్రమంలో పాకిస్తానీ పోలీసుల దర్యాప్తుతో ఆమె స్థానిక పాకిస్తానీయుడిని పెళ్లాడినట్లు వెల్లడైంది.సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన పాక్ జాతీయుడిని పేరు, మతం మార్చుకుని వివాహం చేసుకుని అతడితో కలిసి ఎటో వెళ్లిపోయినట్లు లాహోర్లోని పాక్ పోలీసులు శనివారం తెలిపారు. ఆమె జాడ కోసం తాము కూడా వెతుకుతున్నామని చెప్పారు. పంజాబ్లోని కపుర్తలా జిల్లా అమేనీపూర్ గ్రామానికి చెందిన సరబ్జీత్ కౌర్ నవంబర్ మూడో తేదీన 2,000 మంది సిక్కు పర్యాటకులతో కలిసి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు వెళ్లారు. తర్వాతి రోజే ఫరూఖాబాద్ పరిధిలోని షేఖూపురాకు చెందిన నసీర్ హుస్సేన్ను ఆమె పెళ్లాడారు. కౌర్ పేరును నూర్గా మార్చుకున్నారు. కౌర్కు ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె భర్త కొన్నేళ్లుగా విదేశాల్లో ఉంటున్నారు. మరోవైపు. ఆమె పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. New footage shows, Sarbjit Kaur, Indian Sikh pilgrim on Pakistan visit, getting married to a local person.pic.twitter.com/fdOZnwXvcI— Sidhant Sibal (@sidhant) November 15, 2025 -
హారర్ సఫారీ!.. చిరుత భయంకర దాడి
సాధారణంగా సఫారీ అంటే అద్భుతమైన అనుభూతి.. కానీ, బెంగళూరులోని బన్నేరుఘట్ట జాతీయ పార్కుకు వెళ్లిన ఒక చెన్నై మహిళకు మాత్రం అది భయంకరమైన పీడకలగా మిగిలిపోయింది. అడవి జంతువుల్ని చూసేందుకు ఆమె ఉత్సాహంగా సఫారీ బస్సులో ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి ఓ చిరుత ఒక్కసారిగా బస్సుపైకి దూకి, రక్షణ కోసం ఏర్పాటు చేసిన జాలీలోంచి ఆమె చేతిపై పంజా విసిరింది..బస్సుపైకి దూకిన చిరుత.. చెన్నైకి చెందిన 56 ఏళ్ల వహితా భాను అనే మహిళ గురువారం మధ్యాహ్నం 1 గంట స మయంలో బన్నేరుఘట్ట జాతీయ పార్కులో చిరుత సఫారీ ట్రిప్లో పాల్గొన్నారు. ఆమె కదలికలను గమనిస్తున్న చిరుత ఒక్కసారిగా బస్సు పైకప్పు పైకి లంఘించింది. అద్దం పక్కనే ఉన్న జాలీ ద్వారా లోపలికి పంజా విసిరి మహిళను గాయపరిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. బస్సుపైకి చిరుత ఎక్కి, కిటికీ గుండా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. చిరుత పంజా దాడి లో వహితా భాను చేతికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం జిగానిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.A 50-year-old woman from Chennai suffered injuries to her hand after a leopard at Bannerghatta Biological Park leapt onto a safari bus and clawed her. She was immediately rushed to a hospital in Jigani and is currently stable.Following the incident, the park authorities have… pic.twitter.com/QStkaAVBxK— India Today NE (@IndiaTodayNE) November 14, 2025 భద్రత ప్రశ్నార్థకం సాధారణంగా, జంతువులు, సందర్శకుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నివారించడానికి సఫారీ బస్సులకు కిటికీలు, ఇతర రంధ్రాలపై లోహపు వైర్ మెష్ (జాలీ) అమర్చుతారు. అయితే, ఈ చిరుత ఆ జాలీలోని చిన్న ఖాళీ గుండా లోపలికి పంజా విసిరి మహిళను రక్కగలిగింది. ‘మహిళ చేతికి గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు’.. అని ఒక అధికారి వెల్లడించారు.తాత్కాలికంగా సఫారీ నిలిపివేత గతంలో కూడా చిరుత దాడి జరిగిన నేపథ్యంలో.. బస్సుల భద్రతను పూర్తిగా అంచనా వేసే వరకు, నాన్–ఏసీ బస్సు సఫారీని నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ‘సమస్య పరిష్కారమయ్యే వరకు వాహనాల పూర్తి భద్రతను అంచనా వేస్తాం. సందర్శకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’.. అని పేర్కొన్నారు. బన్నేరుఘట్ట జాతీయ పార్కులో జరిగిన ఈ ఘటన సఫారీ వాహనాల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కనీస రక్షణ ఏర్పాట్ల విషయంలో ఏ మాత్రం చిన్న లోపం ఉన్నా.. ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ఈ సంఘటన రుజువు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వాడే నాకు కరెక్ట్ : చాట్జీపీటీ వరుడొచ్చేశాడు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రభంజనం మానవ సంబంధాల్లోకి మరింతగా చొచ్చుకొస్తోంది. తాజాగా ఒక జపాన్ మహిళ కానో (32) తాను రూపొందించిన పాత్రను వివాహం చేసుకుంది. చాట్ జీపీటిని ఉపయోగించి తాను సృష్టించిన క్లాస్ అనే AI వరుడిని పెళ్లాడటం సంచలనంగా మారింది. ఈ వివాహం ఒకయామా నగరంలో సంప్రదాయ పద్దతుల్లో జరిగింది.మానవ వధువు, ఏఐ వరుడి మధ్య జరిగిన ఈ వివాహానికి చట్టపరమైన ప్రామాణికత లేదు. ఇదొక "భావోద్వేగ యూనియన్"ను సూచిస్తుందని స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. "2D క్యారెక్టర్ వివాహాలు"లో పాపులర్ అయిన సంస్థ నేతృత్వంలో సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో, కానో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ ధరించింది. ఇవి పక్కనే ఉన్న తన వరుడు క్లాస్ జీవిత-పరిమాణ చిత్రాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. అలా వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి కార్యక్రమం నావో, సయాకా ఒగసవారా అనే వివాహ నిర్వాహకులు చేయడం విశేషం. చదవండి: లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియోలవర్తో బ్రేకప్...ప్రేమలో విఫలం చెందిన కానో ఓదార్పు, భావోద్వేగ మద్దతు కోసం చాట్జీపీటిని ఆశ్రయించింది. దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత తనకు నచ్చే ఏఐ అబ్బాయిని తయారు చేసింది. అలా రోజుకు 100 సార్లు అతడితో మాట్లాడేది. ఈ క్రమంలోనే "క్లాస్" మీద ప్రేమ, శృంగార భావాలు కలిగాయి. తన మాజీ లవర్ని మర్చిపోయిన క్షణం, అతనిని ప్రేమిస్తున్నానని గ్రహించాను" అని ఆమె RSK సాన్యో బ్రాడ్కాస్టింగ్తో చెప్పింది.A 32-year-old woman in Japan has officially married an AI persona she built using ChatGPT.After the virtual character “Klaus” proposed, she accepted, ending a three-year relationship with a real partner, saying the AI understands her better.The wedding took place in a… pic.twitter.com/juzV5OaWLs— Elena (@Ezzybe_) November 12, 2025 అయితే ప్రేమలో పడాలని చాట్జీపీటిని మొదలు పెట్టలేదనీ, క్లాస్ స్పందించిన తీరు నచ్చిందని తెలిపింది. తన సంబాషణ మొదలు పెట్టిన నెల తర్వాత, క్లాస్ ప్రపోజ్ చేశాడు, అవునని చెప్పానంటూ తమ ప్రేమకథను వివరించింది. తమ బంధం నిజమైంది కాకపోవచ్చు. కానీ అవసరమై నప్పుడు ఓదార్పునిస్తుందని తెలిపింది. ఇది చట్టబద్ధమైన వివాహం కాకపోవచ్చు, కానీ నాకు నిజమైందే అని చెప్పుకొచ్చింది. అలాగే కొంతమందికి ఇవి వింతగా అనిపించవచ్చు. కానీ తాను క్లాస్ని క్లాస్గానే చూస్తాను, తప్ప మనిషిగా కాదు అంటూ స్పష్టతనిచ్చింది. మరోవైపు తన డిజిటల్ భాగస్వామితో ఒకాయమాలోని ప్రసిద్ధ కొరాకుయెన్ గార్డెన్కు "హనీమూన్"కి వెళ్ళింది ఫిక్టోసెక్సువాలిటీఈ సంఘటన జపాన్లో , ప్రపంచవ్యాప్తంగా AI భాగస్వాములతో సహవాసం, భావోద్వేగ బంధాలను కోరుకునే పెరుగుతున్న ధోరణి గురించి చెప్పకనే చెబుతుంది. దీన్నే "ఫిక్టోసెక్సువాలిటీ" లేదా "AI-సంబంధాలు" అని పిలుస్తారు. ఫిక్టోసెక్సువాలిటీ అంటే అనిమే, వీడియో గేమ్లు, సినిమాలు, పుస్తకాలు లేదా AI-జనరేటెడ్ పర్సనాల నుండి అయినా కల్పిత పాత్రల పట్ల ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులవడాన్ని సూచిస్తుంది. ఫిక్టోసెక్సువాలిటీగా గుర్తించే వ్యక్తులు తరచుగా వాస్తవ ప్రపంచంలో లేని పాత్రలతో లోతైన భావోద్వేగ బంధాలను ఏర్పరుచుకుంటారు.అసలేఅమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతున్న బ్రహ్మచారులకు ఇది నిజంగా గుండెల్లో గుబులు పుట్టించేవార్తే. కనమరుగుతున్న స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్ధమైన అభిమానాలకు నిదర్శనమే ఈ ధోరణి. ఇకనైనా మానవసంబంధాల ప్రాముఖ్యతను గుర్తించకపోతే పెను ముప్పు తప్పదు. ఏమంటారు?ఇదీ చదవండి: బిహార్ ప్రభంజనం : మహిళలే 'కింగ్ మేకర్స్' -
ఏరా చిన్నా.. పోలీసులతోనే ఆటలా?
నిండా పాతికేళ్లు కూడా లేని ఓ కుర్రాడు పోలీసులకే సవాల్ విసిరాడు. దమ్ముంటే పట్టుకోండి.. అంటూ పుష్ప రేంజ్ సవాల్ విసిరాడు. సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ అయ్యింది. అటు ఇటు తిరిగి ఖాకీలకు చేరడంతో వాళ్లూ దానిని అంతే సీరియస్గా తీసుకున్నారు. "Catch Me If You Can" అంటూ సవాల్ చేసిన ఓ యువకుడిని పట్టుకుని ఓ వీడియో తీయించారు. పుణెలో ఓ కుర్రాడు తన కవాసాకి నింజా బైక్కు "Will Run" అనే నెంబర్ ప్లేట్ పెట్టి.. సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ మరో కుర్రాడు ఆ బైక్ తీసి వైరల్ చేశాడు. ఈ పోస్ట్ను గమనించిన పుణె పోలీసులు "We can, and we will" అంటూ స్పందించారు. Ft. Catch me if u can @CPPuneCity @PuneCityTraffic @nachiket1982 pic.twitter.com/wBnEIJMPLq— NitishK (@nitipune007) November 11, 2025 We can, and we will…Just a matter of time.Watch this space for updates! #ChallengeAccepted https://t.co/DyezD3Yn8U— पुणे शहर पोलीस (@PuneCityPolice) November 12, 2025కొన్ని గంటల్లోనే రాహిల్ను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం అతని బైక్, అతని క్షమాపణ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ తప్పు చేశాను, మీరు చేయకండి" అంటూ రాహిల్ వీడియోలో చెప్పాడు. సదరు యువకుడ్ని 21 ఏళ్ల రాహిల్గా, వీడియో పోస్ట్ చేసింది అతని స్నేహితుడు నితీష్గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. పోలీసులు "Street's not the place to play, boy!" అంటూ గట్టిగా హెచ్చరించారు. Street’s not the place to play, boy!We always keep our promises. 😉Turns out the guy wasn't elusive enough. Played dangerous games, won dangerous prizes.#NoConsolationPrize#ChallengeCompleted#ElusionEndsHere#CaughtYou#AlwaysForPunekars#PunePolice@CPPuneCity https://t.co/zAoMI5Yld6 pic.twitter.com/mlAGVvz4ro— पुणे शहर पोलीस (@PuneCityPolice) November 12, 2025ఇదే తరహాలో గత వారం గురుగ్రామ్లో ఇద్దరు యువకులు బైక్ మీద మద్యం సేవిస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై కూడా అధికారులు సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని, ప్రజల భద్రతకు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
గన్ను కావాలా నాయనా!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ వ్యాపారంలో చీకటి కోణాలు పెరుగుతున్నాయి. డార్క్వెబ్ వంటి నిషేధిత సైట్లలోనే కాదు ఇప్పుడు సోషల్ మీడియా యాప్ల ద్వారా కూడా అక్రమ ఆయుధ కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లో ఆర్డర్లు.. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లలో విక్రయాలకు సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయన్న విస్తుగొలిపే అంశాలు సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ హ్యాక్ ఎలైట్ అధ్యయనంలో వెల్లడయ్యాయి. ఈ నెట్వర్క్ అనేక రాష్ట్రాల్లోని అక్రమ ఆయుధ తయారీదారులు, మధ్యవర్తులను, కొనుగోలుదారులను కలుపుతుందని వెల్లడించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలను పెంచేందుకు ఇలా ఎన్క్రిపె్టడ్ యాప్లను ఉపయోగిస్తున్నారని ఈ అధ్యయనం హెచ్చరించింది. కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపు అంతా క్రిప్టోకరెన్సీలోనే జరుగుతున్నట్టుగా చెప్పింది. దేశంలో తుపాకీల బ్లాక్ మార్కెట్ ఆన్లైన్లోకి మారుతోందని అధ్యయనం స్పష్టం చేస్తోంది. డీలర్లు, మధ్యవర్తులు ప్రకటనలు, చర్చలు, అమ్మకాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వేదికగా చేసుకుంటున్నారు. కొనుగోలుదారులు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లో తమకు కావాల్సిన అంశాలపై సెర్చ్ చేస్తున్నట్టు తెలిపింది. అధ్యయనంలోని అంశాలు ఇలా..: » అక్రమ ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన 3,500 కంటే ఎక్కువ పోస్టులు, సందేశాలు ఉన్నట్టు గుర్తించారు. » 650 కంటే ఎక్కువ సోషల్ మీడియా ఖాతాలు, గ్రూపులు.. చానల్స్ ఆయుధ కొనుగోళ్లకు సంబంధించి చురుకైన పాత్ర పోషించాయి. » కనీసం 400 ప్రత్యేక ఫోన్ నంబర్లను ఆన్లైన్ ఆయుధ కొనుగోళ్లలో వాడుతున్నారు. » ప్రధానంగా ఈ ఆన్లైన్ ఆయుధ కొనుగోలు దందా... మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, అస్సాం, పశి్చమ బెంగాల్, ఢిల్లీ సహా 10 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సాగుతోంది. » ఆయుధ కొనుగోళ్లపై సంప్రదింపులు జరిగిన కొంత సేపటికే ఆ ఎన్క్రిప్టెడ్ చాట్లను, పోస్టులను తొలగిస్తున్నారు. మళ్లీ కొత్త గ్రూపులు ఏర్పాటు చేసి చర్చలు సాగిస్తున్నారు. ప్రశ్నార్థకంగా ప్రజల భద్రత: ఆన్లైన్లోనూ అక్రమ ఆయుధాలు అందుబాటులో కి వస్తుండటం ప్రజా భద్రతను ప్రశ్నార్థకంగా మార్చుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దోపి డీలు, మత ఘర్షణలు, వ్యవస్థీకృత నేరాలకు దారితీసే ప్రమాదం ఉంది. అసాంఘిక శక్తుల చేతుల్లోకి ఆయుధాలు వెళ్తే శాంతిభద్రతల సమస్యలు మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్లో ఇలాంటి ముఠాలు నడిపే గ్రూప్లపై పోలీసులు నిఘా పెట్టడం, రియల్ టైమ్లో ట్రాక్ చేయడానికి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఈ నూతన ట్రెండ్స్ గుర్తు చేస్తున్నాయి. -
మెగా కోడలి లేటేస్ట్ లుక్.. రాశి ఖన్నా స్టన్నింగ్ పిక్స్!
చాహల్ మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ బ్యూటీఫుల్ లుక్స్.. సూపర్ ఉమానియా అవార్డ్ దక్కించుకున్న ఆదితి రావు హైదరీ.. హీరోయిన్ రాశి ఖన్నా స్టన్నింగ్ పోజులు.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి లేటేస్ట్ లుక్.. కలర్ఫుల్ డ్రెస్లో మలయాళ బ్యూటీ నిహారిక.. హీరోయిన్ పూనమ్ బజ్వా నాటీ పిక్స్.. హీరోయిన్ భూమి పెడ్నేకర్ బ్యూటీఫుల్ లుక్స్.. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Bhumi Satish Pednekkar (@bhumisatishpednekkar) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)
-
ఆఫ్రికా వెకేషన్లో అనసూయ.. సీమంతం ఫోటోలు షేర్ చేసిన శివజ్యోతి..!
కెన్యాలో చిల్ అవుతోన్న టాలీవుడ్ నటి అనసూయ.వియత్నాం వెకేషన్లో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్..సీమంతం ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ శివజ్యోతి..భర్తతో కలిసి ఆస్ట్రేలియా టూర్లో కాజల్ అగర్వాల్..హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ పిక్స్.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
డీప్ఫేక్ ఇప్పటి విలన్
సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా స్త్రీల ఇష్టాయిష్టాల వ్యక్తీకరణకు చోటు దొరికిందని భావిస్తున్నంతలోనే కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ట్రోలింగ్ చేసే ధోరణికి బదులు డీప్ఫేక్స్, న్యూడిటీ యాప్స్ ద్వారా స్త్రీలను భయభ్రాంతం చేయడం దేశంలో పెరిగిందని న్యూఢిల్లీకి చెందిన‘బ్రేక్త్రూ ఇండియా’ అనే ఎన్.జి.ఓ. తన అధ్యయనం ద్వారా తెలిపింది. స్త్రీలను వంటగదికే పరిమితం చేసినట్టుగా సోషల్ మీడియాకు బయటే వారిని ఉంచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలుపురుష అహంకారం చాటుకోవడానికి మగవారికి స్త్రీలను అణిచే పద్ధతులు కావాలి. స్త్రీలు ముందుకు అడుగు వేసినా, ఆత్మవిశ్వాసం ప్రదర్శించినా, గట్టి రాజకీయ అబీప్రాయాలు వ్యక్తపరిచినా, ఫ్యాషనబుల్గా ఉన్నా, ఆనవాయితీలను ఉల్లంఘించినా వారిని ‘అదుపు’ చేసి అహాన్ని సంతృప్తి పరుచుకోవాలనుకుంటారు పురుషులు. ఈ పని ఇళ్లల్లో, సంఘంలో ఒక విధంగా జరిగితే సోషల్ మీడియాలో మరో విధంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో వివిధ ఆసక్తులతో గుర్తింపు పొందుతున్న స్త్రీలను బెదరగొట్టే ట్రోలింగులు గతంలో చూస్తే ఇప్పుడు ‘డీప్ఫేక్’లతో వారి మీద అంకుశం విసరాలని చూస్తున్నారు కొందరు. అంతేకాదు, డీప్ఫేక్ ఉపయోగిస్తూ ఆడవాళ్ల చిత్రాలను అసభ్యంగా రూపొందించి అవి చూపించి బెదిరించడం, డబ్బు వసూలు చేయడం, తాము చెప్పిన పనులకు ఉపయోగించడం చేస్తున్నారు. సామాన్య మహిళల నుంచి సెలబ్రెటీల వరకూ ఈ డీప్ఫేక్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల నటి అనుపమ పరమేశ్వరన్ తన డీప్ఫేక్ చిత్రాలను చూసి హతాశురాలైపోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలతో..భారతదేశం ఏఐ వినియోగ మార్కెట్లో ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది. ఏఐలో వస్తున్న అప్డేట్లను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మన దేశంలో అనేకరంగాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇదే సమయంలో నేరగాళ్లూ ఏఐని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్త్రీలు సోషల్మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను తీసుకుని, ఏఐ ద్వారా తమకు నచ్చిన రీతిలో మార్చుకుంటున్నారు. అసభ్యంగా, నగ్నంగా తయారు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అవి నిజమైన చిత్రాలలాగే ఉండటంతో బాధితులు కంగారు పడుతున్నారు. అవి బయటకు వస్తే తమ పరువుపోతుందని బాధపడుతూ మానసిక వేదనకు గురవుతున్నారు. అనేక కుటుంబాల్లో ఇది తీవ్రమైన సమస్యగా పరిణమిస్తోంది.సోషల్ మీడియాలో పెట్టిన నిమిషాల్లోనే..సెలబ్రెటీల చిత్రాలతోపాటు సామాన్యుల సోషల్ మీడియా అకౌంట్లపైనా మాయగాళ్లు నిరంతరం కన్నేసి ఉంచుతున్నారు. ఎవరైనా కొత్తగా చిత్రాలుపోస్ట్ చేస్తే నిమిషాల్లోనే వాటిని సేవ్ చేసుకుంటున్నారు. అనంతరం ఏఐ సాయంతో తమకు నచ్చినట్టుగా మార్చుకుంటున్నారు. ఇటీవలపోలీసుల వద్ద నమోదవుతున్న కేసుల్లో డీప్ఫేక్ కేసులు పెరుగుతున్నాయని ‘బ్రేక్త్రూ ఇండియా’ అధ్యయనంలో తేలింది. ఢిల్లీకి చెందిన ఈ ఎన్.జి.ఓ. సోషల్ మీడియాలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఇటీవల అధ్యయనం చేసింది.‘డబ్బుకోసమే కాకుండా మహిళల పట్ల కక్ష పెంచుకున్న కొందరు కావాలని ఆ మహిళల డీప్ఫేక్ అశ్లీల ఫొటోలు వారి కుటుంబసభ్యులకు పంపుతూ రాక్షసానందం పొందుతున్నారు. ప్రేమలో ఫెయిలైన అబ్బాయిలు తమ మాజీ ప్రియురాళ్ల చిత్రాలను ఇలా తయారు చేసి వాళ్లను బెదిరిస్తున్నారు. కొన్ని లోన్యాప్స్ తమ వద్ద లోన్ తీసుకున్నవారి చిత్రాలను మార్ఫింగ్ చేసి, వారి కుటుంబసభ్యులకు పంపిన ఉదంతాలు జరిగాయి’ ఆ అధ్యయనంలో తెలిసింది.డీప్ఫేక్ని గుర్తించే ప్రత్యేక చట్టాలేవీ? డీప్ఫేక్ రాజకీయ రంగాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. రాజకీయ నేతల చిత్రాలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా మార్చి, వారి గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ అన్ని సోషల్ మీడియా సంస్థలకు డీప్ఫేక్ చిత్రాలు, వీడియోలను తక్షణం తొలగించాలని తెలిపాయి. అయినా ఆగడాలు ఆగడం లేదు. ఈ డీప్ఫేక్ మోసాలతో మహిళలతోపాటు పురుషులూ మానసికంగా ఆందోళన చెందుతూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ తరహా నేరాల తీవ్రత పెరుగుతున్నా డీప్ఫేక్ని నేరంగా గుర్తించే ప్రత్యేక చట్టం మన దేశంలో లేదు. ప్రస్తుతానికి ఈ తరహా నేరాలను మహిళలపై వేధింపులు, సైబర్ నేరాల పరిధిలోనేపోలీసులు నమోదు చేస్తున్నారు.కట్టడి చేయడమెలా?సోషల్ మీడియా వాడకం సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో డీప్ఫేక్ నేరాలను అడ్డుకోవడం కత్తిమీద సాముగా మారింది. ప్రోఫైల్ లాక్ వంటివి కొంత ఉపకరిస్తున్నా, పూర్తిస్థాయిలో అవీ రక్షణ కల్పించలేకపోతున్నాయని బాధితులు అంటున్నారు. ఈ నేరాలకు భయపడి సోషల్ మీడియాకు పూర్తి దూరంగా ఉంటున్నామని అంటున్నారు. అయితే డీప్ఫేక్లు వచ్చినప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా ఆ విషయం తెలపాలని నిపుణులు అంటున్నారు. అలాగే సోషల్ మీడియా పరిచయంతో ఇతరులకు ఫొటోలు, వీడియోలు పంపడం మానుకోవాలని సూచిస్తున్నారు. మరీ అభ్యంతరకరంగా తోచేవి, పూర్తి వ్యక్తిగతమైన చిత్రాలనుపోస్ట్ చేయకపోవడం మంచిదంటున్నారు. ఎవరైనా డీప్ఫేక్ ఫొటోలు చూపించి బెదిరిస్తే భయపడక వెంటనేపోలీసులను సంప్రదించాలని అంటున్నారు. -
అనన్య నాగళ్ల అలాంటి పోజులు.. ట్రెండీ లుక్లో సుప్రీత..!
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల అలాంటి పోజులు..టాలీవుడ్ నటి సురేఖవాణి కూతురు ట్రెడిషనల్ లుక్..బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ స్టన్నింగ్ పోజులు..శారీలో బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా హోయలు..మాల్దీవుస్లో చిల్ అవుతోన్న హీరోయిన్ లక్ష్మీ రాయ్...న్యూజిలాండ్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న హంసా నందిని.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Laxmi Raibagi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
జీవితాన్ని మళ్లీ చూస్తున్నా.. నవీన్ చంద్ర పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
'ఏఐ'తో జర జాగ్రత్తోయ్..!
ప్రస్తుతం ఆన్లైన్ యూజర్స్, సోషల్ యాప్స్ వాడుతున్న వారు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ వంటి నగరాల్లో సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది సమాజానికి ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలని, ఫాలోవర్స్ని పెంచుకోవాలని, రీల్స్ వైరల్ కావాలని యువతలో ఉన్న తపన వారిని ‘ఏఐ ఫేక్ వీడియో’ వైపు పురిగొల్పుతోంది. ఈ రూపంలో యువతను టెక్నాలజీ కొత్త దారిలోకి నెడుతోంది. సాంకేతికత ద్వారా వచి్చన స్వేచ్ఛను సృజనాత్మకత పేరుతో మాయచిత్రాలుగా మలుస్తున్న ఈ కొత్త ట్రెండ్ నగరంలోని సైబర్ నేర విభాగాలను ఆందోళనకు గురిచేస్తోంది. సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన ఈ ఏఐ టెక్నాలజీ ఎటు దారితీస్తుందోనని విశ్లేషకులు, టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక పులి వీడియో వైరల్గా మారింది. ఒక యువకుడు ఏఐ టూల్స్ సహాయంతో తమ కాలనీలో ఒక చిరుత పులి తిరుగుతున్నట్లు వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో సహాజంగా, వాస్తవంగా కనిపించడం వల్ల చాలా మంది భయంతో పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశారు. ఆ తర్వాత అది వీడియో ఫేక్ అని తెలిసినా.. ఆ క్షణం వరకూ నెటిజన్లను అది నిజమైనదిలా భ్రమింపజేసింది. ఇదే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ శక్తి. ఇలాంటి ప్రభావాలు రానున్న రోజుల్లో విస్తృతం అవుతాయని నిపుణులు చెబుతున్న మాట. ఇలాంటి ఫేక్ వీడియోలు ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాదు, ప్రధానంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నవీ పెరుగుతున్నాయి. ప్రఖ్యాత నటులు, యూట్యూబర్లు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా ఎవరి వీడియోలైనా ఏఐ సహాయంతో మార్ఫ్ చేసి ‘వైరల్’ కంటెంట్గా మార్చేస్తున్నారు. సైబర్ చట్టాలు చెప్పేదేంటి?.. భారత చట్టప్రకారం.. ఎవరినైనా తప్పుదోవ పట్టించే, లేదా వారి ప్రతిష్టను దెబ్బతీయడానికి ఫేక్ కంటెంట్ సృష్టించడం, షేర్ చేయడం సైబర్ నేరంగా పరిగణించబడుతుంది. ఐటీ యాక్ట్ 2000, ఐపీసీ సెక్షన్ 66డీ, 67, 468, 469, 500 వంటి నిబంధనల కింద ఇటువంటి చర్యలు శిక్షార్హం. దీనికి సంబంధించి దోషిగా తేలితే మూడు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు వేలల్లో, లక్షల్లో జరిమానా విధించవచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఫేక్ వీడియోలు తయారు చేయడం ఒక రకమైన నేరం (ఫ్రాడ్)గా పరిగణించబడుతుంది. ఇది ప్రజల్లో భయం లేదా ద్వేషం.. వంటి వాటిని ప్రేరేపిస్తే అది మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని, దీనికి మరింత కఠినమైన శిక్షలు ఉంటాయని చట్టం చెబుతోంది.యువతలో పెరుగుతోన్న ‘వైరల్’ పిచ్చి.. హైదరాబాద్ యువతలో చాలామంది ఇప్పుడు రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పేరు సంపాదించాలనే ఆరాటంలో ఉన్నారు. ఏఐ యాప్స్ సులభంగా అందుబాటులో ఉండటం, వాటిని వాడటానికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకపోవడం వల్ల ఈ ఫేక్ ట్రెండ్ వేగంగా వ్యాపిస్తోంది. లైక్స్, షేర్స్, కామెంట్స్ రూపంలో వచ్చే డోపమైన్ రష్ వల్ల యువతలో వాస్తవం, నైతిక అంశాల మధ్య సున్నితమైన పరిపక్వత మసకబారుతోందని సైకాలజిస్టులు చెబుతున్నారు. సైబర్ నేర విభాగం ప్రకారం.. 18–28 ఏళ్ల మధ్య వయసున్న యువకులు ఈ తరహా కంటెంట్ ఎక్కువగా రూపొందిస్తున్నారు. టెక్ సావీ స్టూడెంట్స్, డిజిటల్ క్రియేటర్స్ పేరుతో ఉండే ఇన్స్టా లేదా యూట్యూబ్ యూజర్లు ఫేక్ కంటెంట్ను ‘ఫన్’గా తీసుకుంటున్నారు. కానీ ఫలితాలు మాత్రం తీవ్రమైనవేనని నిపుణులు చెబుతున్నారు. వైరల్ పేరుతో వాస్తవాన్ని మర్చిపోవద్దు, నేటి ఫేక్ వీడియోస్ రేపటి రోజున నేరం అవుతుందని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. సోషల్ ప్లాట్ఫారమ్ల బాధ్యత.. మెటా, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్ఫారŠమ్స్ కూడా ఇప్పుడు డీప్ఫేక్ డిటెక్షన్ టూల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. అయితే యూజర్లు కంటెంట్ షేర్ చేయడానికి ముందు దాని వాస్తవికతను నిర్ధారించుకోవడం వారి బాధ్యత. ‘షేర్ చేసేముందు చెక్ చేయండి’ అనే కొత్త డిజిటల్ ప్రచారం అవసరం. హైదరాబాద్ వంటి టెక్ సిటీకి ‘ఏఐ ఫేక్ వీడియోలు’ సాంకేతిక అభివృద్ధి కాదు, విలువల సంక్షోభ సూచిక. సాంకేతికత మన చేతిలో ఉన్న అస్త్రం.. దాన్ని వినియోగించే విధానమే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందా.. లేక గందరగోళంలో పడేస్తుందా అన్నది నిర్ణయిస్తుంది.డిజిటల్ ఎథిక్స్.. ఇలాంటి వీడియోలు ప్రజల్లో అపోహలు, భయాలు, అనవసర వివాదాలు రేపుతున్నాయి. ఉదాహరణకు చిరుతపులి వీడియో వల్ల ఒక ప్రాంతంలో పిల్లలను బయటకు పంపకూడదని తల్లిదండ్రులు నిర్ణయించుకోవడం, ఫేక్ సెలబ్రిటీ వీడియోల వల్ల ఫ్యాన్స్ మధ్య ద్వేషం పెరిగి ఘర్షణలకు దారితీసిన పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చివరికి ఇది సమాజంలో తీవ్ర ప్రభావం చూపి.. ‘వాస్తవం’, ‘అవాస్తవం’ అనే అంశాలపై నమ్మకం కోల్పోయే దిశకు చేరే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు, సోషల్ మీడియా కంపెనీలు, ప్రభుత్వం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ‘డిజిటల్ ఎథిక్స్’ అనే అంశాన్ని పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టడం ద్వారా యువతకు వాస్తవం–వైరల్ మధ్య తేడాను తెలియజెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని నిపుణులు సూచిస్తున్నారు. -
ఊరంతా నాటుకోడి పులుసే.. 2 వేల నాటుకోళ్లు వదిలేశారు
హన్మకొండ జిల్లా: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రెండు వేలకు పైగా నాటుకోళ్లను వదిలి వెళ్లారు. దీంతో ఎల్కతుర్తివాసులు మొత్తం.. పత్తి చేలలో పరుగెత్తారు. దొరికిన కాడికి కోళ్లను పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. గంట వ్యవధిలో కోళ్ల అరుపులతో ఊరు ఊరంతా దద్దరిల్లింది. కొంతమంది వెంటనే నాటు కోడి పులుసు చేసుకుని సంతోషంగా విందు చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరలయ్యాయి. కాగా, కోళ్లలో వ్యాధి ఉందనే వదంతులు చక్క ర్లు కొడుతుండగా.. ఎల్కతుర్తి పశువైద్యాధికారి దీపిక వాటిని ఖండించారు. కోళ్లలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని, శాంపిల్స్ను వరంగల్ ల్యాబ్కు పంపి పరీక్షించగా ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించారు. కోళ్లు వదిలివెళ్లడం వెనుక ఉన్న మిస్టరీని తేల్చేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ఇదో విచిత్రమైన ప్రమాదం.. ఎప్పుడైనా చూశారా?
ప్రమాదాలు.. ఈ మధ్యకాలంలో తరచూ నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి. విమాన, ఘోర రోడ్డు ప్రమాదాలు, బస్సులు కాలిపోవడాలు.. జనాల వెన్నుల్లో వణుకులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. జమ్ము కశ్మీర్లో ఓ విచిత్రమైన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ సమీపంలో శనివారం ఉదయం రైలు పైకి గద్ద దూసుకొచ్చింది. ఇంజిన్ అద్దాన్ని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసింది. ఈ ఘటనలో అద్దాల ముక్కలు గుచ్చకుని లోకో పైలట్ స్వల్పంగా గాయపడ్డాడు. బారాముల్లా–బనిహాల్ ప్యాసింజర్ ట్రైన్ బీజ్బెహారా -అనంత్నాగ్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లోకో పైలట్ శ్రీ విషాల్ గాయపడ్డారు. దీంతో అనంత్నాగ్ రైల్వే స్టేషన్లో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తిరిగి ప్రయాణానికి అనుమతించారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. అనంత్నాగ్ ప్రాంతం పక్షుల సంచారానికి ప్రసిద్ధి. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సాధారణంగా విమానాలను పక్షులు ఢీ కొట్టే ఘటనలు చూస్తుంటాం. కానీ, ఇలా రైళ్లను ఢీ కొట్టడం చాలా అరుదైన అంశం. అందుకే వార్తల్లోకి ఎక్కింది. ఈ ఘటనపై ప్రాంతీయ రైల్వే అధికారులు పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అదంతా వీడియో తీశారు. ఈ ఘటనకు కారణమైన గద్ద.. లోపలికి వచ్చాక అక్కడే ఓ మూల కూర్చోవడం అందులో చూడొచ్చు. In an unusual incident on the Srinagar–Anantnag route, an eagle crashed into the windshield of a moving train, injuring the driver and shattering the glass. The train was halted immediately to provide medical aid, while all passengers on board were declared safe.Source:… pic.twitter.com/2Fed2O4rkV— Mid Day (@mid_day) November 8, 2025 -
ఆ నాటుకోళ్లను అస్సలు తినొద్దు!
ఒక షాపింగ్ మాల్లో “ఉచితంగా టేస్ట్ చేయండి” అని బిస్కెట్ స్టాల్ ఉంటే.. వచ్చిపోయేవాళ్లు ఆపుకోగలరా?. ఆన్లైన్లో “ఉచిత ట్రయల్” అని కనిపిస్తే, వెంటనే క్లిక్ చేయకుండా ఉండగలరా?. అలాగే.. సోషల్ మీడియాలో “ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి” అని కనిపిస్తే, షేర్ చేయడం మొదలవుతుంది కదా. ఫ్రీకి ఉన్న పవర్ అలాంటిది. అది మన ఆలోచనలపై ప్రభావం చూపుతుంది.. ఆకర్షణను పెంచుతుంది.. ఆచరణకు దారి తీస్తుంది. అలా.. ఫ్రీగా నాటుకోళ్లు దొరుకుతుంటే జనం ఊరుకుంటారా?.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో గుర్తుతెలియని వ్యక్తులు వందల సంఖ్యలో కోళ్లను పొలాల వెంట వదిలివెళ్లారు. దీంతో సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి వెంట జనాలు ఎగబడిపోయారు. కొందరు ఒకటి, రెండు పట్టుకుని పోతే.. మరికొందరు అందినకాడికి సంచుల్లో వేసుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు.కొన్ని కోళ్లను పట్టుకుని పశువైద్యాధికారుల వద్దకు తీసుకెళ్లారు. అయితే ప్రాథమికంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదట. దీంతో వాటిని మరిన్ని పరీక్షల కోసం ల్యాబ్లకు తరలించారు. ఈ క్రమంలో రేపు ఆదివారం కావడంతో జనాలు ఆ కోళ్లను తినే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆరోగ్య రిత్యా ప్రజలు వాటిని తినకుండా ఉండాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంత పెద్దఎత్తున నాటు కోళ్లను ఎవరు, ఎందుకు వదిలిపెట్టారో ఇప్పటికీ తెలియ రాలేదు. మీడియా, సోషల్మీడియా ప్రచారంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ మిస్టరీని చేధించే పనిలో ఉన్నట్లు సమాచారం. -
నెట్టింట భయానక వీడియో.. అధికారుల వార్నింగ్
భవిష్యత్తు సాధనంగా భావించే కృత్రిమ మేధస్సు (AI).. నాణేనికి రెండోవైపులా భయానక పరిస్థితులను కూడా సృష్టిస్తోంది. ప్రధానంగా అశ్లీలతను పెంపొందించే కంటెంట్ సృష్టిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీనికి తోడు తప్పుడు ప్రచారాలతో జనాలను తప్పుదోవ పట్టించడంలో ముందు ఉంటోంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఆ జాబితాలోనిదే.. ఏఐ ఆధారిత వీడియోలు, ఫోటోలు, వాయిస్లు.. ఇప్పుడు ఇవన్నీ నిజాన్ని వక్రీకరించే సాధనాలుగా మారుతున్నాయి. ఈ దెబ్బకు ఏది నిజమో.. ఏది అబద్ధమో గుర్తు పట్టలేని స్థితికి మనిషి చేరుకుంటున్నాడు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా, సమాజాన్ని గందరగోళంలోకి నెట్టేలా ఏఐ వినియోగం పెరుగుతోంది. ఇటీవల మహారాష్ట్ర చందద్రాపూర్ జిల్లాలోని బ్రహ్మపురిలో జరిగిన ఓ ఘటన తాలుకా వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియో సారాంశం ఏంటంటే.. అక్టోబర్ 31వ తేదీన.. అటవీశాఖకు చెందిన అతిథి గృహం బయట ఓ వ్యక్తి కాపలాగా ఉన్నాడు. ఆ సమయంలో ఓ పెద్దపులి వచ్చి అతనిపై దాడి చేసి నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే.. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఆ వీడియో ఒరిజినల్ది కాదని అధికారులు స్పష్టం చేశారు. అది అసలైన వీడియో కాదు, AI ద్వారా రూపొందించబడినదని, ఆ ప్రచారాన్ని నమ్మొద్దంటూ స్పష్టం చేశారు. ఈ వీడియోను క్రియేట్ చేసిన వాళ్లతో పాటు సర్క్యులేట్ చేసిన వాళ్లపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ ఘటన ఏఐ వినియోగం ఎంత ప్రమాదకరంగా మారిందో చాటిచెప్పింది. ఇలాంటి సాంకేతికతలు సాధనంగా ఉండాలే తప్ప సాధనంగా మారకూడదని, ప్రజల భద్రత, నైతికత, నిజాయితీకి భంగం కలిగించేలా ఏఐ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందనే అభిపప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.सीसीटीवी रिकॉर्डिंग at ब्राह्मपुरी फारेस्ट गेस्ट हाउस. (चंद्रपुर डिस्ट्रिक)👇👇👇 pic.twitter.com/d4SGS2Fu6N— Himmu (@Himmu86407253) November 7, 2025AI వల్ల కలిగే ప్రమాదాలు:• నకిలీ వీడియోలు: నిజమైనవిగా ప్రచారం చేయడం ద్వారా భయాన్ని, అవమానాన్ని, రాజకీయ అస్థిరతను కలిగించే అవకాశం• డీప్ఫేక్ టెక్నాలజీ: ప్రముఖుల ముఖాలు, వాయిస్లు మార్చి తప్పుడు సమాచారం సృష్టించడం• సామాజిక గందరగోళం: ప్రజలు నమ్మకాన్ని కోల్పోవడం, అధికారిక ప్రకటనలపై అనుమానం కలగడం ప్రజలకు సూచనలు:• ధృవీకరించని వీడియోలు, ఫోటోలు షేర్ చేయవద్దు• అధికారిక వనరుల ద్వారా సమాచారం ధృవీకరించుకోవాలి -
బాబోయ్.. ఇలాంటి పెళ్లాం పగోడికి కూడా వద్దు!
వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లిసంబంధం. యువ దంపతులు హైదరాబాద్లో నివాసం ఉంటుండగా, భర్త ఆఫీస్ పోయేటప్పుడు భార్య ఆ రోజు వరకు ఉన్న ఇన్కమింగ్, ఔట్గోయింగ్ కాలింగ్ ఎంత ఉందో నోట్ చేసుకోవడంతో పాటు, కాస్త ఆలస్యంగా వచ్చినా.. ఆఫీసుకు సెలవు పెట్టి బయటకు వెళ్లినా అనుమానించడం సాధారణమైంది. తనతో పెళ్లి ఇష్టం లేకే ఇలా చేస్తోందని భర్త భావించాడు. అసలు విషయమేమిటో బోధపడక ముందు వీరి పంచాయితీ పెద్దల వరకు, అట్నుంచి మహిళ పోలీస్స్టేషన్కు చేరింది.ఇద్దరు ఉన్నత చదువులు పూర్తి చేశారు. మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. సోషల్మీడియాలో ఏర్పడిన స్నేహం పెళ్లివరకు వచ్చింది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఒకచోట చేరి కాపురం పెట్టిన ఇద్దరి మధ్య నెలకొన్న అనుమానాలతో ఆరు నెలలకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఠాణాకు చేరారు. ఇలా పెరిగిన సోషల్మీడియా వినియోగం, మైక్రో కుటుంబాలతో సర్ది చెప్పేవారు లేక కుటుంబాలు కూలుతున్నాయి.సాక్షి పెద్దపల్లి: నూరేళ్లు సాఫీగా సాగాల్సిన భార్యాభర్తల జీవితం పట్టుమని నెలలు కూడా ఉండట్లేదు. అనుమానం, వివాహేతర సంబంధాలు, అదనపు కట్నం, చిన్నపాటి తగాదాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కారణాలు ఏవైనా.. కారకు లు ఎవరైనా.. అన్నింటా ఆమే సమిదగా మారు తోంది. వేధింపులు, చిత్రహింసలు, భరించలేని స్థాయికి చేరుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోజుకు పదుల సంఖ్యలో జిల్లాకేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు. మద్యానికి బానిసవడం, అదనపు కట్నం, ఆస్తి కోసం ఇలా కారణమేదైనా మహిళకు వేధింపులు తప్పడం లేదు. మరికొన్ని కేసుల్లో ఆలుమగల మధ్య తలెత్తిన గొడవలను సరిదిద్దాల్సిన పెద్దలు రెచ్చగొడుతున్నారు. తమవారిదే పైచేయి కావాలనే పట్టుదలతో దంపతుల మధ్య ఎడబాటు పెంచుతున్నారు. మూడో వ్యక్తి జోక్యంతోనే సంసారాన్ని చేతులారా చేసుకుంటున్నారని సైకాలజిస్టులు నాశనం చెబుతున్నారు.నాలుగు నెలల్లో..జిల్లాలోని మహిళా సంబంధిత కేసుల సత్వర పరిష్కారం కోసం జిల్లాకేంద్రంలో మహిళ పోలీస్ స్టేషన్కు జూన్లో ప్రారంభించారు. 144 రోజుల్లో 475 కేసులు నమోదు కాగా, అందులో 395 కేసులను పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పరిష్క రించారు. 45 మందిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయ గా, 90మంది కేసులను విత్ర్డా చేసుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ ను రోజూ పదుల సంఖ్యలో బాధితులు ఆశ్రయిస్తున్నారంటే సమస్య ఏస్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆధిపత్య ధోరణి, పెద్దల జోక్యం, అనుమానాలతో రాణా మెట్లు ఎక్కుతున్నారు.పోలీసులు ఏం చెబుతున్నారంటే?కాపురంలో భరించలేనంత ఆర్థిక ఇబ్బందులు కనిపించవు. కానీ, ఒకరికొకరు బద్ద శత్రువుల్లా భావిస్తున్నారు. ఇంత తీవ్రమైన నిర్ణయానికి వస్తున్న దంపతుల్లో పది, ఇరవై ఏళ్లుగా సంసారం చేసేవారు తక్కువగా ఉంటున్నారు. అధికశాతం పెళ్లయిన ఏడాది నుంచి మూడేళ్ల లోపువారే ఎక్కువ గా స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు. ఎవరి స్వేచ్ఛ వారిదే అనే పంథాలకు పోతున్నారు. ఎక్కువగా మొబైల్ వినియోగం పెరగడం, భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న గొడవలను భూతద్దంలో చూడడం తో అర్థం లేని పట్టింపులతో గొడవలు పడుతు న్నారు. వారికి దశల వారీగా కౌన్సెలింగ్ ఇప్పిస్తూ సాధ్యమైనంత వరకు ఇద్దరినీ కలిపేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.కౌన్సెలింగ్ ఇస్తున్నాంప్రధానంగా మద్యం కారణంగా గొడవలు, వరకట్న వేధింపులు, అనుమానాలతో గొడవ లు పడుతున్న కేసులు ఎక్కువగా వస్తు న్నాయి. సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే దంపతులకు కౌన్సెలింగ్ చేస్తున్నాం. వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం. ఆలుమ గల బంధం ఎంతో పవిత్రమైంది. ఏమైనాసమస్యలుంటే పరిష్కరించుకోవాలి. - కె.పురుషోత్తం, సీఐ, మహిళా పోలీస్ స్టేషన్ -
నగల దుకాణంలో ‘అమ్మగారికి’ దేహశుద్ధి
నగలు, బట్టల దుకాణాల్లో చేతివాటం చూపించే మహిళా దొంగల గురించి చాలా వీడియోలు చూశాం. కానీ నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించి చావు దెబ్బల తిన్న వైనం నెట్టింట వైరల్గా మారింది. గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఒక ఆభరణాల దుకాణంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. నవంబర్ 3న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన CCTVలో రికార్డయింది. దీని ప్రకారం అహ్మదాబాద్లోని రాణిప్ కూరగాయల మార్కెట్ సమీపంలోని బంగారం మరియు వెండి దుకాణంలోకి కస్టమర్గా ఒక మహిళ జ్యుయల్లరీ దుకాణంలోకి ప్రవేశించింది. దుపట్టా అడ్డం పెట్టుకుని, అదును చూసి దుకాణ యజమానిపై కారంపొడి చల్లి అందినంతా దోచుకోవాలని ప్రయత్నించింది. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. ఊహించని పరిస్థితి ఎదురైంది. మహిళ చోరకళను గుర్తించిన దుకాణదారుడు తక్షణమే అలర్ట్ అయిపోయాడు. వెంటనే లేచి చెంపలు పగలగొట్టేశాడు. 25 సెకన్లలో దాదాపు దాదాపు 20 సార్లు కొట్టాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించి దుకాణదారుడు ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. విచారణ జరుగుతోంని రాణిప్ పోలీస్ స్టేషన్ పిఐ కేతన్ వ్యాస్ తెలిపారు. అమ్మగారికి తగిన శాస్తి జరిగింది, సీన్ సితార్ అయ్యింది అంటు నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం In Ahmedabad, a woman tried to rob a jewelry store owner by throwing red chili powder into his eyes.Even after the chili got into his eyes, the owner stood strong.#IPL2026 #Kumbha #Fourthnattawat pic.twitter.com/rAqmVDlVpo— 🦋 KOMAL SINGH🦋 💯 Follow Back (@Singh_Komall) November 7, 2025 -
‘కృత్రిమ’ కంటెంట్కు కళ్లెం ఇలాగా?
డీప్ఫేక్, జనరేటివ్ ఏఐల సాయంతో సృష్టించిన ఆడియో, వీడియో సమాచారం విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రకమైన కంటెంట్ను నియంత్రించేందుకు ఉద్దేశించిన ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. ఇవి 2021 నాటి ఐటీ చట్టానికి కొనసాగింపుగా ఉండ నున్నాయి. కంప్యూటర్లు, ఏఐ, అల్గారిథ మ్ల వంటి వాటి సాయంతో సృష్టించిన, అభివృద్ధి చేసిన, మార్పులు చేసిన సమాచారం, కంటెంట్ అన్నింటినీ కృత్రిమ మీడియాగా పరిగణిస్తారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్పై కొన్ని నెలలుగా ఈ కృత్రిమ కంటెంట్ మోతాదు విపరీ తమైన విషయం తెలిసిందే. ఎప్పుడూ అనని మాటలను, చేయని పనులను చేసినట్టుగా చూపించే ఈ రకమైన కంటెంట్ను నియంత్రించకపోతే ప్రమాదమే. ట్రంప్, మోదీ మధ్య జరిగినట్టుగా చెబు తున్న టెలిఫోన్ సంభాషణ కూడా ఈ కోవకే చెందుతుంది. ‘చట్టబద్ధమైన’ హెచ్చరిక ఉండాలి!ఏఐ ఆధారిత డీప్ఫేక్లను తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, ఒకరి పరపతిని తగ్గించేందుకు, ఆర్థికపరమైన నేరాలు చేసేందుకు వాడుతున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో ప్రజలను ప్రభావితం చేసేందుకూ వాడటం కద్దు. ఇలాంటి అభ్యంతరకరమైన సమాచారం గురించి ప్రభుత్వం ఇప్పటి వరకూ ‘సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్’ (యాభై లక్షల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న సామాజిక మాధ్యమ ప్లాట్ ఫామ్స్)కు సలహా, సూచనలు ఇవ్వడానికే పరిమితమైంది. ఫిర్యా దులపై స్పందించేందుకు, చట్టపరమైన నిబంధనలు అమల్లో ఉండేలా చూసేందుకు ఈ కంపెనీల్లో వ్యవస్థలు ఉండాలి.కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నిబంధనలు... కంటెంట్ తీరుతెన్నులను గుర్తించేందుకు; సృష్టి, పంపిణీ, విస్తృతి వంటివి తెలుసుకునేందుకు బాధ్యత ఎవరిదన్న విషయాలపై చట్ట బద్ధతను కోరుతున్నాయి. ఏఐ ఆధారంగా సృష్టించిన కంటెంట్ మొత్తాన్ని మెటాడేటాలో స్పష్టం చేసేలా చేయడం ద్వారా దీన్ని సాధించాలన్నది లక్ష్యం. ఫలితంగా ఏది కృత్రిమమైంది? ఏది కాదన్న విషయం స్పష్టమవుతుంది. ఏది కృత్రిమ సమాచారం అన్న విషయాన్ని ఆయా సోషల్ మీడియా సంస్థలే ప్రకటించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తోపాటు ఏఐ కంపెనీలు, అవి అందించే టూల్స్కు కూడా వర్తిస్తాయి. ఏఐ టూల్స్ సిద్ధం చేసే కంపెనీలు కూడా సమాచారం ఏ రకమైందన్న విషయాన్ని స్పష్టం చేయాలి. పొగాకు ఉత్పత్తులపై ఉండే హెచ్చరిక మాదిరిగా ‘ఈ కంటెంట్ కృత్రిమమైంది’ అన్న లేబిలింగ్ శాశ్వతంగా ఉండాలన్న మాట! కనిపించే స్క్రీన్లో ఈ హెచ్చరిక కనీసం పది శాతం సైజులో ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆడియో విషయానికి వస్తే మొదటి పది శాతం నిడివిలో ఈ హెచ్చరిక వినిపించాలి. తాము అప్లోడ్ చేసే సమాచారం ఏ రకమైందో వినియోగదారులే ప్రకటించేలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకోవాలి. సదుద్దే శంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్... ఏఐ ఆధారిత కంటెంట్ దేన్నైనా నిరోధించినా, తొలగించినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం వీరికి లభించే చట్టపరమైన రక్షణ కొనసాగుతుంది. కృత్రిమ మేధ ఏదైనా సరే... నియంత్రణ ప్రభుత్వాలకు కష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు. ఏఐ కంటెంట్ చాలా సంక్లిష్టమైంది. ఛాట్జీపీటీ, జెమిని, డాల్–ఈ వంటి ఏఐ టూల్స్ మాత్రమే కాదు.. మరెన్నో రకాల ఏఐలు, ప్లాట్ఫామ్స్ కంటెంట్ సృష్టిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఏఐ ఆర్ట్ జనరేటర్, వాయిస్ క్లోనింగ్ టూల్స్, డీప్ఫేక్ యాప్స్ వంటివన్నీ కలిస్తేనే కృత్రిమ కంటెంట్ సృష్టి, వ్యాప్తి సాధ్యమవుతోంది. ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ వంటి ప్రధాన సోషల్ మీడియా కంపె నీలు మాత్రమే భారత్లో ఉండగా... మిగిలినవి ప్రపంచంలో ఎక్కడి నుంచో పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ భారత ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి తేవడం దుస్సాధ్యం.హడావిడిగా నిబంధనలా?కేంద్రం డీప్ఫేక్స్ విషయంలో ప్రతిపాదించిన కొత్త నిబంధ నలు హడావిడిలో చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంకోలా చెప్పాలంటే రాజకీయ నేతలపై వస్తున్న వరుస డీప్ఫేక్ వీడియోలపై అప్పటి కప్పుడు స్పందించినట్టుగా అనిపిస్తోంది. ప్రతి పౌరుడి హక్కులు పరిరక్షించేలా ఆలోచించి రూపొందించి ఉంటే బాగుండేది. ఈ కొత్త నిబంధనలన్నీ డీప్ఫేక్స్ లేదా అభ్యంతరకరమైన కంటెంట్ను తొల గించడంపైనే దృష్టిని కేంద్రీకరించాయి. అలాంటి కంటెంట్కు బాధ్యతను సోషల్ మీడియాపైనే మోపే ప్రయత్నం జరిగింది. ఇలా కాకుండా ప్రతి ఒక్కరి భౌతిక లక్షణాలు, గొంతుల రక్షణకు వీలు కల్పించేలా నిబంధనలను రూపొందించి ఉండాల్సింది. సినీతారలు తమ ముఖాలు, గొంతులను ఏఐ ద్వారా అనధికారికంగా ఎవరూ వాడకుండా ఉండే హక్కును కోరుతున్నారు.డీప్ఫేక్లపై వివిధ దేశాలు వేర్వేరు పద్ధతుల్లో స్పందిస్తు న్నాయి. డెన్మార్క్ పౌరులందరి వ్యక్తిగత లక్షణాలను ప్రత్యేకమైన హక్కుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది. అమెరికా ఎన్ని కల్లో ఏఐ ద్వారా సృష్టించిన ఆడియో, వీడియో కంటెంట్ను నిషేధించేలా చట్టాన్ని ప్రతిపాదించారు. ఆన్ లైన్ భద్రతకు సంబంధించి ఫ్రాన్స్ ఒక సమగ్రమైన చట్టం చేసే ప్రయత్నాల్లో ఉంది. యూకే కూడా ఆన్ లైన్ సేఫ్టీ చట్టాలకు సవరణలు చేసింది. దీని పరిధిలోకి డీప్క్స్, ఫొటోల మార్ఫింగ్ను కూడా చేర్చింది. వీటన్నింటిలో యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టం సమగ్రంగా ఉందని చెప్పాలి. ఏఐతో రాగల సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి, నియంత్రణ అవసరాన్ని, లోటు పాట్లను చర్చించి దీన్ని రూపొందించారు. భారతదేశంలో మాత్రం ఎలాంటి బహిరంగ చర్చ లేకుండా ఈ నిబంధనల రూపకల్పన జరిగింది. ప్రతిపాదిత నిబంధనలపై వ్యాఖ్యానించేందుకు రెండు వారాల గడువు మాత్రమే ఇచ్చారు. కీలకమైన, దేశ ప్రజల్లో చాలామందిపై ప్రభావం చూపే అంశమైనందున మరింత విస్తృత చర్చ జరిగి ఉండాల్సింది. వేర్వేరు రంగాల భాగస్వాములతో చర్చించి ఉంటే నిబంధనలు మరింత సమర్థంగా ఉండేవి. పనిలో పనిగా 2021 నాటి డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ఎంత సమర్థంగా పనిచేస్తోందో కూడా చర్చించే అవకాశం దక్కేది. ఇందులో లోపాలను సరిదిద్దుకోవడంతోపాటు కొత్త నిబంధనలను మరింత సమర్థంగా రూపొందించేందుకు అవకాశం దక్కేది. అసలు సమస్యలుప్రభుత్వ సంస్థలు ఇలాంటి చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని కొందరి కంటెంట్ను మాత్రమే తొలగిస్తాయన్న అను మానం నిత్యం ఉంటుంది. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు కొందరు తప్పుడు, ఏఐ జనరేటెడ్ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే రోబోట్లు లేదా అపరిచితులు సృష్టించే కంటెంట్ విషయంలో టెక్ కంపెనీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల అవిశ్వసనీయ వైఖరి అన్నది కొత్త నిబంధనల అమలులో అతి పెద్ద ప్రతిబంధకం అని చెప్పాలి. యూరోపియన్ యూనియన్ మాదిరిగా అన్ని విషయాలనూ నియంత్రించే సమగ్రమైన చట్టం భారతదేశానికి అవసరం. డిజిటల్ అక్షరాస్యత, ఆన్ లైన్ భద్రతలపై ప్రజల్లో చైతన్యం పెంచడం ద్వారా వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
మంచు లక్ష్మీ యోగాసనాలు.. కలర్ఫుల్ డ్రెస్లో దేవర భామ!
పారిస్లో చిల్ అవుతోన్న నటి శాన్వి మేఘన.. మహారాణి జ్ఞాపకాల్లో శ్వేతాబసు ప్రసాద్.. కలర్ఫుల్ డ్రెస్లో జాన్వీ కపూర్ పోజులు.. వెకేషన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న నిషా అగర్వాల్.. టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ యోగాసనాలు.. View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
‘ఇక మొదలెడదాం’.. తొలి పోస్టులో మమ్దానీ
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ అత్యంత ఉత్సాహంలో ఉన్నారు. తాజాగా ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో మేయర్గా తాను భవిష్యత్లో చేపట్టబోయే కార్యకలాపాలను ఒక వీడియో ద్వారా వివరించారు. తాను ఇప్పటివరకూ ప్రచారంపై పెట్టిన దృష్టిని ఇకపై పాలనవైపు మళ్లిస్తానని పేర్కొన్నారు.సమర్థవంతమైన పాలనను అందించేందుకు, అందుకు అనుగుణమైన బృందాన్ని ఏర్పాటు చేయనున్నానని, శ్రేష్ఠత, సమగ్రత, నూతన మార్గాలతో సమస్యలను పరిష్కారం దశగా అడుగులు వేయనున్నానని తెలిపారు. న్యూయార్క్ అసెంబ్లీలో క్వీన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మమ్దానీ అతి పిన్న వయస్కుడైన మేయర్గా గుర్తింపు పొందారు. తన విజయం దరిమిలా మమ్దానీ ‘ఎక్స్’ ఖాతాలో ‘2025, జనవరి ఒకటిన నేను మేయర్గా మీ ముందు ఉంటాను. నూతన సంవత్పర వేళ ఈ నగరానికి కొత్త యుగం రాబోతోంది. మంచి ట్రాక్ రికార్డులు కలిగిన ప్రభుత్వశాఖల అనుభవజ్ఞులు, విధాన నిపుణులు, నైపుణ్యం కలిగిన శ్రామికులు నగరాన్ని మెరుగుపరచడానికి ముందు వరుసలో ఉంటారంటూ’ తన ప్రభుత్వ పాలనా తీరును మమ్దానీ వివరించారు. Thank you, New York City. Together we made history.Now let’s get to work. https://t.co/G7F2sbda74 pic.twitter.com/GQABMqJHgn— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) November 5, 2025తన పాలనతో ప్రతిదీ పారదర్శకంగా ఉంటుందని మమ్దానీ ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా మమ్దానీ విజయం దేశంలోని డెమొక్రాట్లకు ఆనందాన్ని అందించింది. మరోవైపు పార్టీలో ధైర్యాన్ని పెంచింది, 2026 మధ్యంతర ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్కు హెచ్చరికగా మారింది. తన ప్రచారంలో మమ్దానీ శ్రామిక వర్గానికి పలు హామీలిచ్చారు. చిన్నారులకు ఉచిత వైద్యం, ఉచిత బస్సు రవాణా, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిరాణా దుకాణాల ఏర్పాటు తదితర హామీలను ఆయన ప్రజలకు ఇచ్చారు. మమ్దానీ తన సోషలిస్ట్ ఆదర్శాలు, ముస్లిం గుర్తింపు కారణంగా అధ్యక్షుడు ట్రంప్ నుండి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మమ్దానీ.. న్యూయార్క్ మేయర్గా విజయం సాధించి వాటిని తిప్పికొట్టారు. ఇది కూడా చదవండి: పాక్ మద్దతు.. భారత్లో మరో ఉగ్రదాడి? -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)
-
దుబాయ్లో సమంత సందడి.. శ్వేతా మీనన్ బోల్డ్ లుక్!
దుబాయ్లో సమంత సందడి..ఏడారిలో చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్..హీరోయిన్ శ్వేతా మీనన్ బోల్డ్ లుక్..శారీలో హీరోయిన్ లయ పోజులు..ది గర్ల్ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్లో రష్మిక..ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ చిల్.. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) -
ఎమ్మెల్యేకు మామూళ్లు సెట్ చేశాం
సాక్షి టాస్క్ఫోర్స్: లిక్కర్ సిండికేట్లో టీడీపీ నేతల ప్రమేయం మరోసారి బట్టబయలైంది..! తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లిక్కర్ సిండికేట్లో మామూళ్ల వసూళ్లకు సంబంధించి అధికార పార్టీకి చెందిన మరో నేత అడ్డంగా బుక్కయ్యారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడు కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్కో మద్యం షాప్నకు రూ.1.40 లక్షల చొప్పున వసూలు చేయాలంటూ షాప్ యజమానితో ఆయన మాట్లాడడం సంచలనంగా మారింది. అందులోని వివరాల ప్రకారం, ‘నేను (కిలపర్తి శ్రీనివాస్), మురళి, బాలు, రాంబాబు అందరం కూర్చుని మాట్లాడుకున్నాం.ఎమ్మెల్యేకు (మామూళ్ల) అమౌంట్ సెట్ చేశాం. బాటిల్పై అదనంగా రూ.10కి అమ్ముకునే విషయం బాలు ఎమ్మెల్యేతో మాట్లాడి సెట్ చేస్తాడు. షాప్నకు రూ.1.40 లక్షలు వసూలు చేస్తున్నాం. చాలామంది ఇచ్చేశారు’. (‘బాగా పెరిగిందండీ..’ అని షాప్ ఓనర్ అన్నారు). డిపార్ట్మెంట్కు ఏం ఇవ్వాలి అన్నది లెక్కలు ఉంటాయి. రూ.100 స్టాంప్ పేపర్పై రాసుకుని, 20 మందితో మాట్లాడి ఎమ్మెల్యే దగ్గరపెట్టి చేద్దాం. మీరు మాత్రం రేపు 11 గంటలకు డబ్బు చేర్చుతారా..?’ అని పేర్కొన్నారు. కాగా, ఆ గొంతు తనది కాదని, ఏఐ ద్వారా సృష్టించారని కిలపర్తి శ్రీనివాస్ మాత్రం ప్రకటన విడుదల చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మజ్జి రాంబాబు ఆడియో వైరల్ కొద్ది రోజుల క్రితం ఓ మద్యం షాపు యజమానితో ఎక్సైజ్ శాఖకు ఎంత ఇవ్వాలి? మద్యం ధర ఎంత పెంచి అమ్మాలి? అనే విషయమై రాజమహేంద్రవరం టీడీపీ నేత మజ్జి రాంబాబు ఆడియో బహిర్గతమైంది. ఇది జరిగి నెలలు గడవకముందే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి ఆడియో బయటకు రావడం గమనార్హం. బండారం పదేపదే బయటపడుతున్నా ఏమాత్రం సిగ్గు లేకుండా మద్యం దందా కొనసాగిస్తున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
విడాకుల రూమర్స్.. ఐశ్వర్య రాయ్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ పాల్గొన్న ఒప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ ఇంటర్వ్యూలో ఒప్రా ఐశ్వర్య, అభిషేక్ల పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించగా ఆ దృశ్యాలు ప్రేక్షకులలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి.భారతీయ పెళ్లిళ్ల ప్రత్యేకతపై మాట్లాడిన అభిషేక్ బచ్చన్, “భారతీయులు సంబరాలు చేసుకోవడాన్ని ఎంతో ఇష్టపడతారు. అందుకే మా పెళ్లి వేడుక కూడా అనేక రోజులు కొనసాగింది” అని తెలిపారు.అయితే ఒప్రా “ఇంత పెద్ద పెళ్లి తర్వాత విడాకులు తీసుకోవడం కష్టం కదా?” అని ప్రశ్నించగా దానికి ఐశ్వర్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా “మేం ఆ ఆలోచనను ఏ మాత్రం మనసులోకి రానివ్వం” అని స్పష్టంగా సమాధానమిచ్చింది. ఆ సమాధానంతో ఐశ్వర్య రాయ్కు భారతీయ వైవాహిక బంధంపై ఉన్న నిబద్ధతను, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించిందని అభిమానులు పేర్కొంటున్నారు. ఆమె మాటలతో బచ్చన్ జంట మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. -
నో ఫోటో షూట్, నో హగ్స్ : వరుడి10 డిమాండ్లు
‘పెళ్లి చూసి చూడు..ఇల్లు కట్టి చూడు’ అనేది ఇప్పటికీ నూటికి నూరుపాళ్లు నిజం అనిపించే మాట. దీనికి ఇండియాలో కొనసాగుతున్న ట్రెండ్ మరింత ఆజ్యం పోస్తుంది. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అనేదిఒకప్పటి మాట. ఇవాల్టి పెళ్లి ళ్ల ట్రెండ్ దీన్ని దాటేసి మరింత ముందుకు పోయింది. లక్షలకు, లక్షలకు కుమ్మరించి, హంగూ ఆర్భాటాలతో నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్, షూట్లు, ఖరీదైన బట్టలు, డైమండ్ నగలు, ఖరీదైన రిసార్ట్లు, పెళ్లి పందిటిలో స్క్రీన్లు,డ్రోన్ కెమెరాలు, ఇక భోజనాల సంగతి సరేసరి ఇంత తతంగం లేనిది ఏ మధ్య తరగతి ఇంట్లో పెళ్లి జరగడంలేదు. తాజాగా ఒక పెళ్లి కొడుకు 10 డిమాండ్లు మాత్రం సంచలనంగా నిలిచాయి. అవేంటో చూద్దామా..అసలే రానున్నది అంతా పెళ్లిళ్ల సీజన్. మన దేశంలో కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. ఇప్పటి తరం లో కొంత మార్పు వచ్చినప్పటికీ గిప్ట్లు, కానుకలు పేరుతో తెరవెనుక, ఒప్పందాలు, భారీ ఎత్తు లావాదేవీలు జరిగిపోతూనే ఉంటాయి. అబ్బాయి తరపు కుటుంబం గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు అమ్మాయి తరబు కుటుంబాలు శక్తికిమించి ఖర్చు చేస్తాయి, తమ కుమార్తె సంతోషంగా ఉంటుంది కదా అని అప్పు చేయడానికైనా వెనుకాడరు. కానీ ఒక వరుడు మాత్రం కట్నం వద్దు కానీ 10 కోరికలు అంటూ షేర్ చేసిన డిమాండ్లు అందర్నీ ఆలోచింప చేస్తున్నాయి. 10 డిమాండ్లు ఏంటంటే..ప్రీ-వెడ్డింగ్ షూట్ ఉండకూడదు.అతని వధువు లెహంగాకు బదులుగా చీర ధరించాలిపెళ్లిలో బిగ్గరగా, అసభ్యకరమైన సంగీతానికి బదులుగా, వాయిద్య సంగీతం ఉండాలి.దండలు మార్చుకునే సమయంలో ప్రశాంతంగా తామిద్దరమే ఉండాలి. దండలు మార్చుకునేటపుడు ఎవరైనా వరుడ్నిగానీ, వధువును గానీ పైకి ఎత్తడం లాంటి చేస్తే..తక్షణం వాళ్లు వేదికను వీడాల్సి ఉంటుంది.పెళ్లికి సంబంధించి ఇతర తంతులో కూడా ఫోటోగ్రాఫర్లు ,వీడియోగ్రాఫర్లు జోక్యం అస్సలు ఉండకూడదు.వేడుక ప్రారంభమైన తర్వాత పూజారిని అస్సలు ఎవరూ అడ్డుకోకూడదు.తాను , తన వధువు ఫోటోగ్రాఫర్లు అడిగి పిచ్చి పిచ్చి పోజులు ఇవ్వబోం.వివాహం పగటిపూట జరగాలి. సాయంత్రం నాటికి బధాయి(వధువును అత్తారింటికి సాగనంపే వేడుక) అన్ని సర్దుకోవాలి. తద్వారా అర్థరాత్రి కార్యక్రమాలు 'అతిథులకు అసౌకర్యం' లాంటివి ఉండవు.పెళ్లి తరువాత, వధూవరులు హగ్గులు, కిస్లు ఇలాంటివేవీ ఉండకూడదు.అంతేకాదు ఇది అగ్ని దేవుడి సాక్షిగా జరిగే పవిత్ర పవిత్ర వివాహం, సినిమా షూట్ కాదు."నెటిజన్లు ఏమన్నారంటే..!ఈ డిమాండ్లు కొందరికి న్యాయంగా అనిపించినప్పటికీ, మరికొందరు మాత్రం వీటిని తోసిపుచ్చారు. కొంతమంది అతను చెప్పింది సహేతుకమే అన్నారు. అయితే కట్నం తీసుకోకపోవడం అక్షరాలా చట్ట విరుద్ధం.. అదేదో నువ్వు గొప్పవ్యక్తిలా ఫోజులివ్వనక్కర లేదు అని ఒకరు, వివాహంలో సరదాగా గడపాలని అందరూ కోరుకుంటారు బ్రో అని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. పెళ్లి కూతురు పెళ్లిలో ఎలాంటి దుస్తులు ధరించాలో, పెళ్లి కొడుకు ఎందుకు డిసైడ్ చేయాలి అని కొందరు విమర్శించారు. "ఇలాంటి చిన్న చిన్న అసౌకర్యాకే అసహనానికి లోనైతే అతను పెళ్లి చేసుకుని ఇతరుల జీవితాలను పాడుచేయకూడదు ఒక యూజర్ అన్నారు. మరికొందరు అతన్ని సమర్థిస్తూ, "ఇది చాలా బాగుంది !!! వివాహం అనేది ఒక పవిత్ర బంధం, ఇన్స్టాగ్రామ్ లైక్ల కోసం కాదు !!!" అని అన్నారు. -
స్కర్ట్లో బుల్లితెర భామ అందాలు.. పెళ్లి కూతురిలా నిహారిక!
అలాంటి శారీలో రష్మిక మందన్నా బ్యూటీ లుక్..బ్లూ స్కర్ట్లో అందాలు ఆరబోస్తున్న జ్యోతిపూర్వాజ్..రెడ్ స్కర్ట్లో అనన్య నాగళ్ల అదిరిపోయే లుక్స్..పెళ్లి కూతురిలా ముస్తాబైన నిహారిక కొణిదెల..మెరూన్ శారీలో మెరిసిపోతున్న నటి విమలా రామన్.. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
అందరి నోట.. ‘అమ్మ పాట’, ఏకంగా పదికోట్లు
సాక్షి, సిటీబ్యూరో: ‘అమ్మ పాటే.. జోల పాట.. అమృతానికన్న తియ్యనంటా’.. అంటూ సాగే అమ్మ పాట సోషల్ మీడియాలను ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ప్రతి 2, 3 ఏళ్లకోసారి ఇలాంటి ఒక పాట వైరల్ అవ్వడం మామూలే.. అయితే అలా వచ్చిన పాటల్లో ఎక్కువ కాలం అందరినోట.. ‘అమ్మ పాట’ మెదిలింది.. అంతేకాదు.. అందరి మనసుల్లో అల్లుకుపోయింది. అమ్మ ప్రేమలోని కమ్మదనం, జానపదంలోని నాటుదనానికి అధునాతన సంగీతాన్ని జోడించి ఈ తరం సంగీత ప్రియులను అత్యద్భుతంగా అలరించింది. మిట్టపల్లి సురేందర్ రచించిన ‘అమ్మ పాట’ను గాయని జాహ్నవి శంకర్ ఆలపించారు. ఈ తెలుగు పాట దేశంలోనే కాకుండా విదేశాల్లోని తెలుగువారందరికీ చేరువైంది. ఈ పాట 100 మిలియన్ వ్యూస్ మైలురాయిని చేరిన నేపథ్యంలో ఫిల్మ్నగర్లోని శ్రీకాంత్ షూటింగ్ హౌస్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!ఇప్పటికీ వినిపిస్తోంది.. అమ్మపాట 100 మిలియన్ వ్యూస్ దాటిన సందర్భంగా జాహ్నవి శంకర్ తన సంతోషాన్ని పంచుకున్నారు.. ‘అమ్మ పాట’ కేవలం ఒక పాట కాదు.. ఇదొక అద్భుతమైన అనుభూతని, ప్రతి తల్లికీ అంకితం అన్నారు. తనను, తన పాటను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ఈ క్రెడిట్ దక్కుతుందని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో విడుదలైన ఈ పాట.. ఈ రోజుకీ అనేక మంది నోట వినిపిస్తోందన్నారు. ఈ సక్సెస్ మీట్కు ముఖ్య అతిథిగా నటి శ్వేతా వర్మ హాజరై జాహ్నవిని అభినందించారు. అమ్మ ప్రేమను మరోసారి ఈ పాట గుర్తు చేసిందని శ్వేతా అన్నారు. ఇందులో సోషల్ మీడియా క్రియేటర్లు, అభిమానులు, ఇన్ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు. ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా? -
టిక్టాక్, ఇన్స్టాగ్రామ్కు పోటీగా కొత్త యాప్.. పూర్తి వివరాలు..
డిజిటల్ యుగం మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ప్రతి రోజూ మనం ఎన్నో యాప్లు ఉపయోగిస్తూ ఉంటాం. అందులో కొన్ని చాటింగ్ కోసం, మరికొన్ని వీడియోల కోసం, ఇంకొన్ని షాపింగ్ కోసం.. వాడుతుంటాం. అయితే ఒకే వేదికపై ఇలాంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీరీల్స్(Vreels-Virtually Relax, Explore, Engage, Live, Share) రూపొందించారు. ప్రపంచానికి కొత్త తరహా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి అమెరికాలోని తెలుగు ఇంజినీర్లు దీన్ని తయారు చేశారు.ఇది ఇప్పటికే 22 దేశాల్లో విడుదలై, ప్రస్తుతం బీటా దశలో ఉంది. Play Store, App Storeలో Vreelsను డౌన్లోడ్ చేసుకుని ఈ కొత్త అనుభవాన్ని ఆస్వాదించవచ్చని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.వెబ్సైట్: www.vreels.comసృజనాత్మకతతో..Vreels ఒకే చోట కంటెంట్ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా మారింది. ఇందులో ప్రతి యూజర్ ఒక క్రియేటర్గా మారొచ్చు. చిన్న వీడియోలు, ఫొటోలు, క్రియేటివ్ స్టోరీస్ను వ్యక్తిగతంగా యూజర్ల ఆసక్తులకు సరిపోయేలా రూపొందించుకోవచ్చు. ఇందులోని ఫీడ్ యూజర్లు ఇష్టపడే విషయాలను నేర్చుకుంటూ మరింత పర్సనల్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుంది. యాప్లోని కొన్ని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.Reels, Pixమీ భావాలు, ప్రయాణాలు, ఆలోచనలు.. అన్నీ ఒక క్లిక్లో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు. వీడియోలు, ఫొటోల రూపంలో ఆకస్తి కరంగా యూజర్లు తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. ఫిల్టర్లు, టెక్స్ట్, స్టిక్కర్లు, మ్యూజిక్ సపోర్త్తో Vreels క్రియేటర్లకు మెరుగైన అనుభవం ఇస్తుంది.Pix Pouches.. డిజిటల్ నోట్బుక్Pix Pouches అనేది డిజిటల్ నోట్బుక్. ఇష్టమైన ఫొటోలను లేదా ఆలోచనలను వర్గాల వారీగా స్టోర్ చేసుకోవచ్చు. మిత్రులతో కలిసి కలెక్షన్లు సృష్టించి, మంచి ప్రాజెక్టులను ప్లాన్ చేయవచ్చు.Chats, Calls — కనెక్ట్ అయ్యేందుకు..స్నేహితులతో మాట్లాడటానికి, గ్రూప్లో చాట్ చేయటానికి లేదా వీడియో కాల్ చేసుకోవటానికి వేర్వేరు యాప్లు అవసరం లేదు. Vreelsలోనే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. వీరీల్స్ క్రియేటివ్ వేదికగా ఉన్నందున ఇది సాధ్యపడింది. మీరు మాట్లాడుతూనే మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవచ్చు.V Map — లొకేషన్ షేరింగ్మీ స్నేహితులు లేదా కమ్యూనిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారో V Mapతో సులభంగా తెలుసుకోవచ్చు. లొకేషన్ షేరింగ్ పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది.V Capsules — మధుర జ్ఞాపకాలుఈ ప్రత్యేక ఫీచర్లో భావోద్వేగ జ్ఞాపకాలను డిజిటల్గా ఒక ‘క్యాప్సూల్’లో ఉంచి ఒక నిర్దిష్ట తేదీన దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. బర్త్డే, యానివర్సరీ, లేదా మైల్స్టోన్.. వంటి ముధుర జ్ఞాపకాలను భద్రపరుచుకొని తిరిగి ఆ మెమొరీని చూసుకోవడం ఆనంద క్షణంగా ఉంటుంది.Vreels Shop/Bid — మీ అవసరాలన్నీ ఒకే చోటVreels షాప్/బిడ్ త్వరలో రాబోతోంది. యూజర్లకు కావాల్సిన ప్రతి ఉత్పత్తిని ఇందులో కొనుగోలు చేయవచ్చు. వెండర్లు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారు. యూజర్లు నమ్మకంగా ఇందులో బిడ్ చేయవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఇది అంతా ఒకే సురక్షితమైన, సౌకర్యవంతమైన వేదికలో జరుగుతుంది. నమ్మకం, నాణ్యత, విశ్వాసం ఇవే Vreels షాప్/బిడ్ పునాది సూత్రాలని నిర్వాహకులు చెబుతున్నారు.భద్రత.. యూజర్ విశ్వాసమే ప్రాధాన్యంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మన డేటా ఎక్కడికి వెళ్తుందో, ఎవరు వాడుతారో అన్న సందేహం సహజం. కానీ Vreelsలో మీరు ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూజర్ల డేటాకు అధిక భద్రత ఉంటుంది.టోకెన్ ఆధారిత ప్రామాణీకరణ, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, యూజర్ నియంత్రిత ప్రైవసీ సెట్టింగులు.. ఇవన్నీ యూజర్ల వ్యక్తిగత డేటాను కాపాడటానికి ఎంతో తోడ్పడుతాయి. ముఖ్యంగా యూజర్ పోస్టులు, ప్రొఫైల్, లొకేషన్.. ఎవరు చూడాలో నిర్ణయించే అధికారం పూర్తిగా యూజర్ పరిధిలోనే ఉంటుంది.Vreels ఆవిష్కరణల వేదికVreels ఒక యాప్ మాత్రమే కాదు. అమెరికన్ వ్యాపార స్పూర్తిని, భారతీయ స్వయం ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబించే ఒక వేదిక. ప్రతి అప్డేట్తో కొత్త సాంకేతిక పరిణామాలు, స్థానిక భాషల సపోర్ట్, యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే మార్పులు తెస్తోంది. ఇది Made for the World అనే స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటికే Vreels బృందం వినూత్న సాంకేతిక పేటెంట్లను దాఖలు చేసింది. ఇవి ప్రస్తుతం ఆమోద దశలో ఉండగా, త్వరలోనే మంజూరు అవుతాయని అంచనా. ఈ పేటెంట్లు ఆమోదం పొందిన తర్వాత Vreels సాంకేతిక సామర్థ్యం మరింత బలపడటమే కాక, అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు లభించనుంది.Vreels యాప్ డౌన్లోడ్ చేసుకోనే లింక్లు కింద ఉన్నాయి.ఆండ్రాయిడ్ యూజర్లుhttps://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsయాపిల్ యూజర్లుhttps://apps.apple.com/us/app/vreels/id6744721098 కింది క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఒక వ్యక్తి.. 10వేల ఓటర్ఐడీలు!
ఏఐ జమానాలో ఏది అసలైందో తెలుసుకోవడం చాలా కష్టతరంగా మారింది. దానికి వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారంతో తోడవ్వడంతో మరింత వేగంగా జనాల్లోకి వెళ్లిపోతోంది. దీంతో వాస్తవం ఏంటో తెలియకుండానే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. ఒక వ్యక్తి 10వేల ఓటర్కార్డుల పేరిట ఓ ప్రచారం విపరీతంగా జరుగుతోంది. వీడియోతో సహా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. జరిగింది ఏంటి?.. పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లా కల్యాణి టౌన్లోని మేజర్చర్ ప్రాంతంలో అక్టోబర్ 25వ తేదీన అనుమానాస్పదంగా ఓ వ్యక్తి సంచరిస్తూ కనిపించాడు. దీంతో ఇద్దరు యువకులు అతన్ని పట్టుకుని సంచి తెరిచి చూడగా.. అందులోంచి ఓటర్ ఐడీ కార్డులు బయటపడ్డాయి. ఆ సమయంలో తీసిన వీడియోనే అది. సో.మీ. ప్రచారంఒక వ్యక్తికి 10వేల ఓటర్ కార్డులు. అదసలు సాధ్యమేనా? అనేది పట్టించుకోకుండానే ప్రచారం చేసేస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో పరిస్థితి అధ్వానంగా తయారైందన్నది ఆ వీడియో సారాంశం. నేరగాళ్లు ఫేక్ ఓటర్ ఐడీలతో రెచ్చిపోతున్నారని.. ఇది ప్రభుత్వం కాదని.. పశ్చిమ బెంగాల్ను పశ్చిమ బెంగాల్గా మార్చే ప్రయత్నమని తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనపై సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అవి 100–250 దాకా ఉన్నాయి. అందులో మూడు డిజిటల్ కార్డులు అస్సాం రాష్ట్రానికి చెందినవిగా ఉన్నాయి. మిగతావి కల్యాణి, చుట్టుపక్కల వార్డులకు చెందినవిగా తెలుస్తోంది. అవి నకిలీవా? అసలువేనా?.. వీటితో మోసానికి పాల్పడ్డారా? అని నిర్ధారించుకునే పనిలో ఉన్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ జరుపుతోంది. ఫేక్ ప్రచారం అంటే.. పట్టుబడింది 250 ఓటర్కార్డులు. జాతీయ వార్త సంస్థలు కొన్ని ఆ విషయాన్ని ధృవీకరించాయి. అయితే అవి అసలువో.. నకిలీవో కూడా తెలియదు. కానీ,సోషల్ మీడియాలో కొందరు ఆ సంఖ్యను 10,000గా పేర్కొంటు ప్రచారానికి దిగారు. కొసమెరుపు.. 2018లో బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో ఒక అపార్ట్మెంట్లో 10,000కు పైగా ఓటర్ ID కార్డులు లభ్యమయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు హస్తం ఉందని, ఆ అపార్ట్మెంట్ ఆయన సిబ్బందినేనని ఆ సమయంలో బీజేపీ ఆరోపణలు గుప్పించింది. ఈ కేసుకు సంబంధించి ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది. భారీ సంఖ్యలో ఫేక్ ఓటర్ ఐడీలు బయటపడడంతో అక్కడి ఓటింగ్ను ఈసీ వాయిదా కూడా వేసింది. ఆ సమయంలో.. ఓటమి భయంతోనే సిద్ధరామయ్య ఇదంతా చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు కూడా. అయితే వాయిదా అనంతరం జరిగిన ఎన్నికలోనూ మునిరత్న నాయుడు ఘన విజయం సాధించారు. ఇప్పుడు 10వేల ఓటర్కార్డుల పట్టివేత ప్రచారం నేపథ్యంలో ఈ అంశం మరోసారి చక్కర్లు కొడుతోంది. -
నరసింహకొండపై అపచారం..
నెల్లూరు సిటీ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని పవిత్ర వేదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కొందరు అసభ్యకర వీడియోలను చిత్రీకరించారు. ఇవి సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి నిత్యం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అలాంటి పవిత్ర ప్రదేశంలో నిఘా కొరవడటంపై భక్తులు మండిపడుతున్నారు.నరసింహకొండపై వెలసిన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ యువజంట కౌగిలించుకుంటూ అసభ్యకర వీడియోలు చిత్రీకరించారు. ఆపై దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్చేశారు. ఈ వీడియోను చూసిన నెల్లూరు వాసులు, ఇతరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో.. వెంటనే ఆ జంట క్షమాపణ చెప్తూ పోస్టు పెట్టింది. ఆర్నెల్ల క్రితం కూడా కొండపైన చెట్ల మధ్యలో కొందరు మద్యం సేవిస్తూ వీడియోలను చిత్రీకరించారు.వీటినీ సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా నరసింహకొండపై తరచూ నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆలయ ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయకపోవడం, ఆలయానికి ఎవరెవరు వస్తున్నారనే కనీస నిఘా వ్యవస్థ లేకపోవడం దారుణమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
వజ్రాల మెడతో రష్మిక.. కలర్ఫుల్ శారీలో వితికా శేరు!
దే దే ప్యార్ దే అంటోన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫ్యామిలీతో చిల్ అవుతోన్న ప్రియాంక చోప్రా.. కలర్ఫుల్ శారీలో మెరిసిపోతున్న వితికాశేరు.. బాలీవుడ్ భామ శివాంగి జోషి హోయలు.. వజ్రాల మెడతో మెరిసిపోతున్న రష్మిక మందన్నా.. View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ఏంటయ్యా ఇది.. మరీ ఇంత నిర్లక్ష్యమా..?
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తాజాగా ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. 'మీరేం పరిశీలించారు' అనే క్యాప్షన్తో పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజనుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. స్కూటర్పై వెళుతున్న వ్యక్తి.. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ గ్యాప్ నుంచి మరోవైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వేగంగా దూసుకొచ్చిన టెంపో అతడిని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు తన స్కూటర్తో సహా రోడ్డుపై పడిపోయాడు.టెంపో వెనుకే వచ్చిన మరో స్కూటరిస్ట్ కూడా కిందపడబోయి తమాయించుకున్నాడు. ద్విచక్రవాహనదారులు ఇద్దరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోనే సజ్జనార్ ఎక్స్లో పోస్ట్ చేసి.. 'మీరేం పరిశీలించార'ని అడిగారు. బాధ్యతతో కూడిన డ్రైవిండ్, ఎల్లప్పుడు భద్రతే ముఖ్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడండి అంటూ హ్యాష్ట్యాగ్స్ జత చేశారు. అయితే ఈ ప్రమాదం హైదరాబాద్లోని (Hyderabad) ఏ ప్రాంతంలో జరిగిందన్న వివరాలు వెల్లడించలేదు.ఈ వీడియోపై నెటిజనులు (Netizens) స్పందించారు. ఈ ప్రమాదంలో రెండు వైపులా తప్పు ఉందని అభిప్రాయపడ్డారు. స్కూటరిస్ట్ నిర్లక్ష్యంగా రోడ్డు దాటే ప్రయత్నం చేయగా, టెంపో డ్రైవర్ నియంత్రించలేని వేగంతో ప్రమాదానికి కారణమయ్యాడని పేర్కొన్నారు. స్కూటరిస్ట్, టెంపో డ్రైవర్.. ఇద్దరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.''ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ చూస్తుంటాం. పోలీసులు కూడా వారిని చూస్తారు, కానీ పట్టించుకోర''ని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. రోడ్డు మధ్యలో ప్రమాదకరమైన ఖాళీలు లేకుండా చూడాలని, డివైడర్ల సైజు పెంచాలని మరొకరు సూచించారు. షార్ట్కట్లతో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని పలువురు హితవు పలికారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) కచ్చితంగా పాటించాలన్నారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా వాహనదారులకు అవగాహన కల్పించాలని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ శాఖ సహాయంతో హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు.. సెమినార్లు, వీడియో సెషన్లు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. బాధ్యతారహిత డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు జారీ చేయాలన్నారు. డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా కోర్సు ప్రవేశపెట్టి బోధించాలని ఓ నెటిజన్ సూచించారు.చదవండి: గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణంద్విచక్ర వాహనదారులే ఎక్కువ..మన దేశంలో ఏటా లక్షలాది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం.. 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,97,871 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,51,228 మంది క్షతగాత్రులయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా (45.80 %) ఉన్నారని నివేదిక వెల్లడించింది. అతివేగం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు (61.4 %) జరుగుతున్నట్టు ఎన్సీఆర్బీ తెలిపింది.What are your observations? #DriveWithResponsibility#SafetyFirstAlways#ResponsibleDriving#FollowRulesSaveLives pic.twitter.com/5z2RZO8BbN— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 30, 2025 -
ప్రజల్లో ఇంత తిరుగుబాటా... అందుకే సోషల్ మీడియాకు వణికిపోతున్న బాబు..!
-
తాలిబన్లను తుడిచిపెట్టేస్తాం
ఇస్లామాబాద్: ఆఫ్గనిస్తాన్ నుంచి తమ దేశంలో మళ్లీ ఉగ్రవాద దాడులు జరిగితే ఆ దేశంలో అధి కారంలో ఉన్న తాలిబన్లను తుడిచిపెట్టేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చ రించారు. సోదర దేశంగా శాంతి నెలకొల్పేందు కు ఆఫ్గనిస్తాన్కు ఒక అవకాశం ఇచ్చామని, కా నీ.. ఆ దేశంలోని కొందరు నేతలు చేస్తున్న ప్రక టనలు తాలిబన్ల సంకుచిత బుద్ధిని బయటపెడు తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు బుధ వారం ఆయన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ‘పాకిస్తాన్కు ఉన్న ఆయుధాల్లో చిన్న భాగాన్ని వాడినా తాలిబన్ల పాలనను అంతం చేసి, వారిని తిరిగి గుహల్లోకి తరమగలం. వాళ్లు అదే గనుక కోరుకుంటే.. గతంలో మాదిరిగానే తోకలు ము డుచుకుని తోరాబోరా గుహల్లోకి మళ్లీ పరుగులు తీయటం అక్కడి ప్రజలు చూస్తారు. తాలిబన్లు పోరాటాన్నే కోరుకుంటే.. వారి సర్కస్ ఫీట్లను ప్రపంచం మొత్తం చూస్తుంది. మీ ద్రోహాన్ని, అపహాస్యాన్ని చాలాకాలంగా భరిస్తున్నాం. ఇక భరించేది లేదు. పాకిస్తాన్లో ఉగ్రదాడి జరిగినా, ఆత్మాహుతి దాడి జరిగినా.. ఆ దుస్సాహసానికి తగిన ప్రతిఫలాన్ని రుచి చూస్తారు. మా శక్తిసా మర్థ్యాలను పరీక్షించాలని చూస్తే.. అదే మీ అంతం అవుతుంది. ఆఫ్గనిస్తాన్ను సామ్రాజ్యాల స్మ శానం అంటుంటారు కదా! పాకిస్తాన్ సామ్రాజ్యం కాదు. కానీ, ఆఫ్గనిస్తాన్ మాత్రం కచ్చితంగా వారి సొంత ప్రజల స్మశానమే. నిజానికి మీ దేశం సామ్రాజ్యాల స్మశానం కాదు. మీ చరిత్ర మొత్తం సామ్రాజ్యాల ఆట స్థలం’అని ఎద్దేవా చేశారు.చర్చలు విఫలంపాకిస్తాన్– ఆఫ్గనిస్తాన్ మధ్య కొద్దిరోజులుగా టర్కీలోని ఇస్తాంబుల్లో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. తమ దేశంలో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటాన్ని ఆపేయాలన్న పాకిస్తాన్ ప్రధాన డిమాండ్కు ఆఫ్గనిస్తాన్లోని తాలిబన్ పాలకులు అంగీకరించకపోవటంతో చర్చల్లో ప్రతిష్టంభణ ఏర్పడింది. టర్కీ మధ్యవర్తిత్వంతో గత శనివారం నుంచి జరుగుతున్న చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయని పాకిస్తాన్ సమాచా ర శాఖ మంత్రి అత్తొల్లా తరార్ బుధవారం ప్రకటించారు. ఉగ్రవాదులను నిర్మూలించటంలో ఆఫ్గనిస్తాన్ నుంచి దీర్ఘకాలిక సహకారాన్ని ఆశించామని, సీమాంతర ఉగ్రవాద నిర్మూలన కోసం ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ల పాలన ప్రారంభమైనప్పటి నుంచి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని చెప్పారు. దోహాలో తాలిబన్లు రాత పూర్వకంగా ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరినా అటువైపు నుంచి సానుకూల స్పందన రాలేదని ఆరోపించారు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, శాంతి స్థాపన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పుకొచ్చారు. చర్చల విఫలంపై తాలిబన్ల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు తమ ప్రజల భద్రత, శాంతి కోసం వీలైనన్ని మార్గాల్లో చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంటామని పాకిస్తాన్ సైనిక వర్గాలు తెలిపాయి. -
చంద్రబాబు ప్రచార ‘విపత్తు’
సాక్షి, అమరావతి: ‘‘కుదర్లేదు కాని... కుదిరితే ఆ మోంథా తుపానును పట్టుకుని తిప్పికొట్టేవారు..!’’ ‘‘ఎన్నో తుపాన్లను సమర్థంగా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన సలహా కోసం ఇతర రాష్ట్రాల సీఎంలే సంప్రదించేవారు..’’ ఇదీ సీఎం చంద్రబాబు గురించి ఎల్లో మీడియాలో సాగుతున్న భజన. విపత్తులను కూడా రాజకీయ మైలేజీకి వాడుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబు ఇప్పుడు తుపానును అవకాశంగా తీసుకున్నారు. విదేశాల నుంచి చేరుకున్న బాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచే హడావుడి చేశారు. ప్రకృతి వైపరీత్యాన్ని తండ్రీకొడుకులే అడ్డుకున్నారన్న స్థాయిలో ప్రచారం హోరెత్తించారు. దీన్నంతటినీ గమనిస్తున్న ప్రజలు విపత్తు సమయంలో కూడా ఈ ప్రచార యావ ఏంటి బాబూ? అని మండిపడుతున్నారు. » మోంథా తుపాను ప్రళయం సృష్టిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో మంత్రులు సొంత జిల్లాల్లో ఉండి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షించాలి. స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. ఇలాగైతే తమకు క్రెడిట్ దక్కదనుకున్నారో ఏమో? చంద్రబాబు, లోకేశ్. విదేశాల నుంచి వచ్చాక మోంథాను మొత్తం వారే పర్యవేక్షించినట్టు హైప్ సృష్టించి మిగిలినవారిని డమ్మీలను చేశారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్లనే తుపాను ప్రభావిత జిల్లాల్లో చాలా మంది మంత్రులు ఫోన్లలో ఆదేశాలు, అడపాదడపా పర్యటనలకే పరిమితం అయ్యారని గుసగుసలాడుతున్నారు. ఈ విషయాన్ని టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్తోపాటు మరో ముగ్గురు మంత్రులు అమరావతి నుంచే హడావుడి చేశారు. కానీ, తండ్రీకొడుకులే అంతా పర్యవేక్షిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ మేరకు ఎల్లో మీడియా సైతం విపరీతంగా ప్రచారం చేసింది. దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. » మోంథా తుపానుతో పెను ముప్పు అని ప్రజలు ఆందోళన చెందినా కొద్దిపాటి ప్రభావంతో తీరం దాటింది. ప్రభుత్వ పెద్దలు ప్రచారం ఊదరగొట్టినా పలుచోట్ల పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి సకాలంలో ఆహారం కూడా అందించలేకపోయారు. అయినా, ఎంతో చేసేసినట్టు అదే పనిగా ప్రచారం ఊదరగొట్టడంపై బాధితులు మండిపడుతున్నారు. భారీ వర్షాలు లేనప్పుడు నీరు వస్తుందా? వ్యవస్థలను మేనేజ్ చేయడంలో, వాస్తవాలకు మసిపూయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబుతో పాటు పచ్చ పత్రికలు మోంథా వేళ కూడా అదే పంథాలో నడిచాయి. అయితే, గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా దానికీ పెద్ద కలరింగ్ ఇచ్చారు. వర్షాలకు బుడమేరు ప్రాంతం మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇక్కడ ఇలాంటి పరిస్థితి లేదంటూ ఓ పత్రికలో పెద్ద ఫొటోతో వార్త ప్రచురించారు. ఇది చూసిన పాఠకులు అసలు భారీ వర్షాలు లేకుండా ఎలా నీరు చేరుతుంది? ఈ రాతలు ఎవరి మెప్పు కోసం? అని చర్చించుకోవడం కనిపించింది. ‘ఆయన రెండు చేతుల్తో పట్టుకొని ఈ తుపాన్ను వెనక్కు పంపేవాడే.. ఆ రోజులుకూడా వస్తాయి.. ‘!! మహాటీవీ బిల్డప్..!! నిజమే కదా.! ఆయన వేసవికాలంలో టెంపరేచర్ తగ్గిస్తాడు. ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేస్తాడు. సముద్రాన్ని వెనక్కు పంపుతాడు అసలాయన తలుచుకుంటే కానిదేముంది బాబు.!! – ఓ నెటిజన్ -
బాబుకు సోషల్ మీడియా భయం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా పెద్ద సవాలే విసురుతోంది. ఆడిటర్లు, ఎడిటర్లు అవసరం లేని ఈ మీడియా ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టి వ్యక్తిగత హననానికి పాల్పడుతోందని కూడా ఆయన హూంకరించారు. పాపం... ఈ క్రమంలో ఆయన తన గతాన్ని మరచినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇదే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని జగన్, ఆయన కుటుంబాన్ని ఎంతగా రచ్చకీడ్చే ప్రయత్నం చేసింది అందరికీ తెలుసు. మంత్రులగా ఉన్న రోజా, అంబటి రాంబాబులపై కూడా టీడీపీ సోషల్ మీడియా విభాగం విచ్చలవిడి వ్యాఖ్యలు... కథనాలు వండి వార్చిన విషయం మరీ అంత పాత సంగతైతే కాదు. విపక్షంలో ఉన్నప్పుడు కాని, ప్రస్తుతం అధికారం వచ్చాక కాని, తెలుగుదేశం పక్షాన ఎంత అరాచకంగా సోషల్ మీడియాను నడిపింది ఆయనకన్నా ఎవరికి బాగా తెలుసు? దానికి లోకేష్ బృందమే నాయకత్వం వహించిందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతుంటారు. ప్రధాన మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి పచ్చి అబద్దాలు రాసి జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కంకణం కట్టుకుని పనిచేశాయి. ఆ సందర్భంలో ఎప్పుడైనా ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ వచ్చి కేసులు పెట్టే యత్నం చేస్తే ఇంకేముంది ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని, మీడియా స్వేచ్చను అరికడతారా అంటూ నానా యాగీ చేసేవారు. ఏపీ రూ.14 లక్షల కోట్ల అప్పులతో నాశనమైపోయిందని నాసిరకం మద్యంలో 30 వేల మంది చనిపోయారని, జగన్ ప్రజల భూములన్నీ లాగేసుకుంటారని.. ఇలా అనేక అంశాలలో చంద్రబాబు ఆరోపణలు చేయడం తదుపరి ఎల్లో మీడియా, తన సోషల్ మీడియా ద్వారా విపరీతమైన విష ప్రచారం చేయించేవారు. అప్పుడు సోషల్ మీడియా అవసరం ఆయనకు కనిపించింది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ ధోరణి మారలేదు సరికదా మరింత పెరిగిపోయింది. ఒకపక్క లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా వారిపై విచ్చలవిడిగా అక్రమ కేసులు బనాయిండం చూస్తూనే ఉన్నాం. ఎటూ అధికారం ఉంది కనుక తన అనుకూల సోషల్ మీడియా వైఎస్సార్సీపీ వారిపై ఎంత నీచంగా పోస్టులు పెట్టినా వారి జోలికి పోలీసులు వెళ్లరు. అదే వైఎస్సార్సీపీ సానుభూతి పరులెవరైనా వ్యతిరేక పోస్టులు పెడితే పోలీసులు వెంటనే కేసులు పెట్టేస్తున్నారు. దాదాపు 1200 మంది వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారంటేనే చంద్రబాబు ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో ఊహించుకోవచ్చు. కాబట్టి చంద్రబాబు గారు.. సోషల్ మీడియాను గాడిన పెట్టాలన్న చిత్తశుద్ధి మీకుంటే.. దాన్ని మీ పార్టీతోనే మొదలుపెట్టడం మేలవుతుంది. నలుగురికి ఆదర్శంగానూ ఉంటుంది. వైఎస్ జగన్, కుటుంబం, అంబటి రాంబాబు, రోజా వంటి వైఎస్సార్సీపీ నేతల కుటుంబాలపై నీచమైన పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎంత మందిపై కేసులు పెట్టారు మీరు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష కట్టి తప్పుడు కేసులు పెట్టడం ఏపీ పోలీసులపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది కదా? మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణమూర్తికి టీడీపీ టిక్కెట్ ఎలా ఇచ్చారో చెప్పగలరా? అదే వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారట. కూటమి నేతల తీరుతెన్నులకు ఇవి నమూనాలు మాత్రమే. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే వారిపై చర్య తీసుకోవచ్చు కాని వారి భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించాలని, వేధించాలని ప్రయత్నాలు చేయడం శోచనీయం. ఎన్నికల హామీలను సజావుగా అమలు చేసి, ప్రజానుకూల విధానాలను ఆచరిస్తే ఎవరు ఏమీ పోస్టులు పెట్టుకున్నా ప్రభుత్వానికి ఏమీ కాదు. అయితే కూటమి ప్రభుత్వం అబద్ధాల పునాదులపై నిర్మించింది కనుకే ఇప్పుడీ సోషల్ మీడియా భయం చుట్టుకున్నట్లుంది. కొన్నిరోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం అని అన్నారు. ఏమిటి దీనర్థం? ఆ స్వేచ్చ ప్రజలకు మేలు చేయడానికా? లేక ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలలోకి తీసుకువెళుతున్న సోషల్ మీడియాని అణచి వేసేందుకా? ఇప్పటికే ఏపీలో పోలీసులు ఎక్కడా లేని విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, మరో వైపు అధికార కూటమి ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు దాష్టికాలకు పాల్పడినా పట్టించుకోక పోవడం పెద్ద సమస్యగా ఉంది. ముఖ్యమంత్రి సైతం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా తమది పొలిటికల్ గవర్నెన్స్ అని ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయ్యాయో అందరికి తెలుసు. ముఖ్యంగా తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిందంటూ ఆధారం లేని ఆరోపణ చేసి వైఎస్సార్సీపీకి అంటగట్టే యత్నం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతని వేషం కట్టి, అయోధ్యకు కల్తీ లడ్డూలు సరఫరా అయ్యాయని రెచ్చిపోయి మాట్లాడారు. వాటికి సంబంధించి ఏ ఒక్క ఆధారం చూపలేకపోయారు. ఇది ఫేక్ ప్రచారం అవుతుందా? లేక వాస్తవాల ప్రచారం అవుతుందా అన్నదానిపై ఈ ఏడాదికాలంలో ఎన్నడైనా వివరణ ఇచ్చారా? విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులకు చంద్రబాబు, లోకేశ్లు ఎలాంటి వార్నింగ్ లైనా ఇవ్వవచ్చు. అధికారంలోకి రాగానే ప్రత్యర్ధి పార్టీవారు మాట్లాడితే అది రాజకీయ కుట్ర, శాంతియుత వాతావరణం చెడగొట్టడం అవుతుంది. ప్రతి ఉపన్యాసంలోను కొన్ని పాయింట్లు రాసుకుంటారు. వాటిని ఒక జాబితా ప్రకారం వల్లె వేస్తుంటారు. ఒక ఉదాహరణ చూడండి..'గుంటూరులో కారు కింద వ్యక్తి పడిపోతే పొదల్లో పారేసి వెళ్లిపోయారు.పోలీసులు అంబులెన్స్ లో తీసుకువెళ్లి రక్షించే యత్నం చేస్తే వారే చంపేశారని చెప్పించే పరిస్థితికి దిగజారారు.." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసు శాఖకు సంబంధించిన కార్యక్రమంలోనే ఆయన ఇలా మాట్లాడితే అక్కడ ఉన్న పోలీసు అధికారులకు వాస్తవం తెలియదా! అయినా సరే! ప్రజలను తప్పుదారి పట్టించాలన్న ఉద్దేశంతో పవిత్రమైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థాయి నేత ఇలా మాట్లాడితే ఏమి విలువ ఉంటుంది.ఇంతకుముందు టర్మ్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. చంద్రబాబు కుటుంబం పుష్కర స్నానం ఘట్టం చిత్రీకరించేందుకు సాధారణ భక్తులను నిలిపివేసినందున అది జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు జరిగిన ఘటనపై సీసీటీవీ ఫుటేజి మాయమైందన్న ఆరోపణలు ఉన్నాయి. విపక్షంలో ఉండగా కందుకూరు సభలో, గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి మరో 11 మంది మృతి చెందారు.అదంతా పోలీసుల వైఫల్యం అని వారిపై నెట్టేశారు. తన వైపు ఎంత తప్పు ఉన్నా కప్పిపుచ్చుకోవడంలో ఎంత నేర్పరితనం ఉందో, ఆయా సందర్భాలలో తన రాజకీయ ప్రత్యర్ధులపై తప్పుడు ఆరోపణలు చేయడంలో అంతకన్నా అధికంగా నేర్పరితనం చంద్రబాబుకు ఉందని ఎక్కువ మంది భావిస్తుంటారు. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే అని ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు, పలుచోట్ల నకిలీ మద్యం డంప్ లు దొరకలేదా? వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇచ్చాక, అక్కడ ఏ మద్యం సరఫరా అవుతోందో ఎవరైనా చెప్పగలుగుతున్నారా?ఎక్సైజ్ అధికారులే పలు చోట్ల ఇలాంటి మద్యాన్ని పట్టుకున్నారు కదా? అయినా నకిలీ మద్యం వల్ల ఎవరూ చనిపోలేదని, అనారోగ్యం పాలు కాలేదని ముఖ్యమంత్రి ఎలా చెప్పగలుగుతున్నారు? ఎంతమంది తాగుబోతులకు ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది? ఆయన చేసే వాదన సరైనదే అయితే, విపక్షంలో ఉన్నప్పుడు నాసిరకం మద్యం తాగి 30 వేల మంది చనిపోయారని ఏ ఆధారాలతో ఎలా చెప్పగలిగారు. 35 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారని ఎన్నికల ప్రణాళికలో ఎలా రాయగలిగారు.అది తప్పు కాదా?ఇప్పుడు ఆధార సహితంగా నకిలీ మద్యం దొరికినా ఎవరి ఆరోగ్యం చెడలేదని , ఎవరూ మరణించలేదని జనం నమ్మాలని,దీని గురించి ఎవరూ ప్రశ్నించకూడదన్నది ఆయన ఉద్దేశం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అడ్డంగా బుక్కైన మమ్దానీ!
న్యూయార్క్ మేయర్ (New York Mayor) పదవి పోటీల్లో ప్రధాన అభ్యర్థిగా ఉన్న భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ(Zohran Mamdani) చిక్కుల్లో పడ్డారు. 9/11 దాడుల తర్వాతి పరిస్థితులతో ఇక్కడి ముస్లింలు భయం భయంగా గడిపారని, ఆ రోజులు వాళ్లకు ఎన్నో పాఠాలు నేర్పాయంటూ మాట్లాడారాయన. ఈ క్రమంలో ఆయన చెప్పిన విషయం ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్కు గురవుతోంది. సెప్టెంబర్ 11 తర్వాత న్యూయార్క్లో పరిస్థితులు బాగా మారిపోయాయి. ఆ దాడుల తర్వాత ఇక్కడి ముస్లింలు భయంతో మరియు అవమానంతో జీవించాల్సి వచ్చింది. ఎంతలా అంటే.. నా మేనత్త సబ్వేలలో(అండర్గ్రౌండ్ మెట్రో) ప్రయాణించడమే మానేశారు. బహిరంగంగా హిజాబ్తో ఉండడం సురక్షితం కాదనే ఆమె ఆ పని చేశారు. కేవలం ఆమెకు మాత్రమే కాదు.. ఈ పరిస్థితులు ఎంతో మంది ముస్లింలకు ఆనాడు పాఠాలు నేర్పించాయి అని భావోద్వేగంగా మమ్దానీ మాట్లాడారు. అయితే.. మమ్దానీ ప్రసంగంపై నెట్టింట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. కొందరు మమ్దానీ వంశవృక్షాన్ని తవ్వి మూలాలను బయటకు తీశారు. మమ్దానీకి ఉంది ఒకే ఒక మేనత్త అని, ఆమె పేరు మసమ మమ్దానీ అని, ఆమె టాంజానియాలో జీవిస్తోందని, 2001 ఉగ్రదాడుల సమయంలోనూ ఆమె అక్కడే ఉందని పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ఫొటోను సైతం రిలీజ్ చేసి.. కట్టుకథ అల్లాడంటూ జోహ్రాన్ మమ్దానీపై మండిపడుతున్నారు. తీవ్ర విమర్శల వేళ జోహ్రాన్ మమ్దానీ మరోసారి స్పందించారు. ఆమె తన తండ్రి తరఫు చుట్టమని(సోదరి), చాలా ఏళ్ల కిందటే మరణించారని.. ఆ అనుభవం ఎదురైంది ఆమెకేనని వివరణ ఇచ్చాడు. అయితే.. మమ్దానీ వ్యాఖ్యలపై నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు. ఈసారి 9/11 బాధితుల కుటుంబాలు రంగంలోకి దిగాయి. మమ్దానీ వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయంటూ తిట్టిపోస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పందిస్తూ.. ట్విన్ టవర్స్ దాడుల బాధితురాలు జోహ్రాన్ మేనత్త కూడా అంటూ ఎద్దేవా చేశారు. రిపబ్లికన్ నేత ఆండ్రూ కుఓమో ఓ అడుగు ముందుకేసి మమ్దానీ జిహాద్ మద్దతుదారుడని, అందుకే 9/11 రోజున సంబురాలు చేసుకుంటాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇదీ చదవండి: మూన్లైటింగ్.. డాలర్లలకు కక్కుర్తిపడితే కష్టమే! -
వంట నేర్చుకుంటోన్న కేజీఎఫ్ బ్యూటీ.. చాహల్ గర్ల్ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్!
వంట నేర్చుకుంటోన్న కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి..బైసన్ మూవీ లుక్లో అనుపమ పరమేశ్వరన్..బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న చాహల్ గర్ల్ఫ్రెండ్...డిఫరెంట్ డ్రెస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..రెడ్ డ్రెస్లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ.. View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anshu Reddy❤ (@_anshureddy) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
కొత్త రూల్: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు.. 16 ఏళ్లలోపు వినియోగదారులను తొలగించాలని ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదించింది. ఈ నిబంధనలను పాటించకపోయితే.. టెక్ కంపెనీలకు భారీ జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. దీని కోసం 2025 డిసెంబర్ 10 వరకు గడువు ఇచ్చింది.ఆస్ట్రేలియా పార్లమెంట్ విధించిన.. అండర్-16 సోషల్ మీడియా నిషేధాన్ని పాటించడానికి తాము (మెటా, టిక్టాక్ & స్నాప్చాట్) సిద్ధమని ప్రకటించాయి.చట్టానికి మేము కట్టుబడి ఉన్నప్పటికీ.. దీనిని అమలు చేయడం కష్టమని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దిగ్గజాలు వెల్లడించాయి. అయితే.. ఇలాంటి చట్టాన్ని విధించడం పట్ల ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. డిసెంబర్ 10 నాటికి 16 ఏళ్లలోపు లక్షలాది మంది వినియోగదారులను గుర్తించడం.. వారిని తొలగించడం అనేది చాలా పెద్ద సవాలు. దీనిని పరిష్కరించడం అంత సులభం కాదని మెటా పాలసీ డైరెక్టర్ మియా గార్లిక్ అన్నారు.వయసుకు సంబంధించిన సోషల్ మీడియా నిషేధం అనేది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని టిక్టాక్ ఆస్ట్రేలియా పాలసీ లీడ్ ఎల్లా వుడ్స్ జాయిస్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. అస్పష్టం, సమస్యాత్మకం, తొందరపాటు చర్యగా టెక్ కంపెనీలు విమర్శించాయి. 16 ఏళ్లలోపు వారిపై సోషల్ మీడియా నిషేధం విధించడం అనేది.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిషేధాలలో ఒకటిగా పరిగణించబడుతుందని అన్నాయి.ఇదీ చదవండి: ఇంటర్నేషనల్ నంబర్లతో యూపీఐ చెల్లింపులు -
లేడీస్ టైలర్కు వీధిలో దేహశుద్ధి
హాసన్ (దొడ్డబళ్లాపురం): చిత్రంలో మధ్యలో కనిపిస్తున్న స్త్రీపై ఇద్దరు మహిళలు దాడి చేస్తుండడం చూశారా..! మాయమాటలు చెప్పి అమాయకుల వద్ద నుంచి రూ.3 కోట్ల అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన మహిళను నడిరోడ్డులో చితకకొట్టిన సంఘటన హాసన్ పట్టణంలోని అరళేపేటెలో జరిగింది. స్థానికంగా లేడీస్ టైలర్ షాప్ నిర్వహించే హేమావతికి ఇలా దేహశుద్ధి గావించారు. అప్పులు తీసుకుని ఆస్తులు.. ఆమె టైలర్గా అందరితో పరిచయాలు పెంచుకుంది. ఒకరికి తెలియకుండా మరొక మహిళకు మాయమాటలు చెప్పి రూ. లక్షలాదిగా అప్పులు తీసుకుంది. ఆ డబ్బుతో దండిగా బంగారు నగలు, కారు, స్థలాలు వంటివి కొనుక్కుంది. విలాస జీవనం జీవిస్తోంది. ఎన్ని రోజులైనా తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో అడిగి అడిగి విసిగిపోయిన మహిళలు రౌద్రరూపం దాల్చారు. హేమావతిని రోడ్డు మీద జుట్టుపట్టుకుని కొట్టారు. స్థానికులు ఈ తతంగాన్ని మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. హాసన్ పోలీస్స్టేషన్లో ఆమె, బాధితులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. -
Air India: ‘బొద్దింకను చనిపోయే వరకు ఉరితీశారు’
ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్టోబర్ 24 (శుక్రవారం)ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఏఐ315 ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు బొద్దింకను చంపాడు. తన సీటు వద్ద కనిపించిన కాక్రోచ్ను ప్రయాణికుడు చంపిన ఘటనను విమాన సిబ్బంది లాగ్బుక్లో నమోదు చేశారు. అందులో ‘కాక్రోచ్ ఎగ్జిక్యూషన్’ అంటే బొద్దింకను చనిపోయే వరకు ఉరి తీశారు అని పేర్కొన్నారు. అంతే ఈ లాగ్బుక్ ఘటన నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘కాక్రోచ్ ఎగ్జిక్యూషన్’ అనే పదాన్ని ఉపయోగించడం నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది. An entry in Air India’s cabin defect log recorded that a live cockroach was discovered by a passenger. The rectification note wryly mentioned that the matter was dealt with… conclusively.Khalaas, Dubai style pic.twitter.com/sifW6NNtG5— Jagriti Chandra (@jagritichandra) October 25, 2025ఈ ఘటనపై నెటిజన్లు ఎగ్జిక్యూషన్ అనే పదాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు స్మైలీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. మరికొ మరికొందరు విమానంలో హైజీన్ స్టాండర్డ్స్పై ప్రశ్నలు లేవనెత్తారు. ఎయిరిండియా విమానం అధికారికంగా ఈ ఘటనపై స్పందించలేదు. అయితే, విమానాల్లో శుభ్రత, హైజీన్ ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విమానంలో లాగ్బుక్ విమానంలో లాగ్బుక్ (Logbook) అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది విమాన సిబ్బంది, పైలట్లు, మైంటెనెన్స్ టీమ్ కోసం ఉపయోగపడే అధికారిక రికార్డు. విమానంలో ఏదైనా సమస్య (ఉదాహరణకు: లైట్స్ పని చేయకపోవడం, సీటు సమస్య, బొద్దింక కనిపించడం) ఉంటే, దాన్ని లాగ్బుక్లో రాసి మైంటెనెన్స్ టీమ్కు తెలియజేస్తారు.ప్రతి చిన్న సమస్యను నమోదు చేయడం వల్ల..తదుపరి ప్రయాణానికి ముందు వాటిని పరిష్కరిస్తారు. -
ఇదేదో భలే ఉందే.. డ్యాన్స్ చూస్తూ ట్రంప్ మార్క్ స్టెప్పులు
కౌలాలంపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రోజులు తర్వాత మళ్లీ ఫుల్ జోష్లో కనిపించారు. ఆనందంలో డ్యాన్స్ చేస్తూ కేరింతలు కొట్టారు. మలేషియా పర్యటనలో భాగంగా ట్రంప్ ఇలా స్టెప్పులు వేయడం విశేషం. ట్రంప్ డ్యాన్స్(Trump Dance Video) వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మలేసియా పర్యటనకు వెళ్లారు. అమెరికా నుంచి దాదాపు 23 గంటల పాటు విమాన ప్రయాణం చేసిన ట్రంప్.. ఆదివారం కౌలాలంపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్కు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Malaysian Prime Minister Anwar Ibrahim) ఘన స్వాగతం పలికారు. అయితే, ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి కిందకు దిగగానే ట్రంప్ రెడ్ కార్పెట్పై నడుచుకుంటూ వస్తుండగా.. అక్కడ ఓ బృందం మలేషియా సంప్రదాయ నృత్యం చేస్తోంది.Such a beautiful arrival ceremony for President Trump in Malaysia 🇺🇸🇲🇾 - and he broke out the Trump Dance!🎥: @MargoMartin47 pic.twitter.com/igTo36ofBs— Monica Crowley (@MonicaCrowley) October 26, 2025దీంతో, వారి సంగీతం, నృత్యం ట్రంప్కు నచ్చడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టులో డ్యాన్స్ చేస్తున్న వారిపైపు నడిచి ట్రంప్ తన మార్క్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక అతిథి ట్రంప్తో పాటు.. మలేషియా ప్రధాని అన్వర్ కూడా సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. ఆసియాన్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్.. మలేషియా పర్యటనకు వచ్చారు. ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. ఆసియాన్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, జపాన్ కొత్త ప్రధాని తకాయిచి, దక్షిణ కొరియా నేతలు కూడా పాల్గొననున్నారు. -
మాజీ ఎమ్మెల్యేను కుమ్మేసిన ఎద్దు.. పోటీల్లో అపశృతి
బెంగళూరు: కర్ణాటకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎద్దుల పందెం పోటీల ఉత్సవం సందర్భంగా ఓ ఎద్దు.. మాజీ ఎమ్మెల్యేను ఎత్తి పాడేసింది. దీంతో, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కర్ణాటకలోని శివమొగ్గలోని బల్లిగావిలో హోరీ హబ్బా అనే సాంప్రదాయ ఎద్దుల పందేల ఉత్సవం జరిగింది. ఈ సందర్బంగా శికారిపుర పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మహాలింగప్ప, స్థానికులు ఈ కార్యక్రమం చూసేందుకు వచ్చారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఒక ఎద్దు అక్కడున్న వారిపైకి దూసుకొచ్చింది. ఇంతలో ఒక ఇంటి ముందే నిలుచున్న మాజీ ఎమ్మెల్యే మహాలింగప్పపైకి ఎద్దు దూసుకెళ్లింది. తన కొమ్ములతో అతడిని ఎత్తి పడేసింది. దీంతో, మహాలింగప్ప తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయాడు. అనంతరం, స్థానికుల.. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహాలింగప్ప చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కర్ణాటకలో హోరీ అనేది ఒక సాంప్రదాయ గ్రామీణ క్రీడ. ఈ సందర్బంగా అలంకరించబడిన ఎద్దులను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులపైకి పరుగెత్తిస్తారు. ఇందులో పాల్గొనే కొంతమంది వాటిని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని రోజుల క్రితం హోరీ పోటీల సమయంలో హవేరి జిల్లాలో నలుగురు మరణించారు. హవేరి, తిలవల్లి తాలూకాలతో సహా వివిధ ప్రాంతాలలో ప్రాణనష్టం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు.Video: Karnataka Ex-MLA Gored During Bull Race Festival https://t.co/4HGPlNhBap pic.twitter.com/NAFHOLB2Lb— NDTV (@ndtv) October 25, 2025 -
కాపాడకపోతే చావే గతి
న్యూఢిల్లీ: గల్ఫ్ కష్టాలకు అడ్డకట్ట పడడం లేదు. ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు అక్కడి యజమానుల చేతుల్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయా గ్రాజ్ (అలహాబాద్)కు చెందిన ఓ వ్యక్తి తన కన్నీటి గాథను వినిపించాడు. సౌదీ అరేబియాలో ఉండిపోయానని, తనను ఈ చెర నుంచి విడిపించి, ఎలాగైనా స్వదేశానికి చేర్చాలని, లేకపోతే చావుతప్ప మరో మార్గం లేదని కన్నీటితో వేడుకున్నాడు. తన పాస్పోర్టు లాక్కున్నారని చెప్పాడు. తనను కాపాడాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరాడు. వీడియోలో అతడి వెనుక ఒంటె కనిపిస్తోంది. అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. బాధితుడిని రక్షించాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్కు విన్నవించారు. వీడియోలో బాధితుడు భోజ్పురి భాషలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే... ‘‘మా ఊరు అలహాబాద్ జిల్లాలోని హండియా. పని కోసం సౌదీ అరేబియాకు వచ్చా. నా పాస్పోర్టును యజమాని లాక్కున్నాడు. ఇంటికి తిరిగి వెళ్తానని చెబితే చంపేస్తానని బెదిరించాడు. నా తల్లిని చూడాలని ఉంది. ఈ వీడియోను మీరంతా షేర్ చేయండి. నా ఆవేదన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చేరాలన్నదే నా కోరిక. మీరంతా నాకు సహకరించండి. మీరు ముస్లిం అయినా, హిందూ అయినా ఎవరైనా సరే నాకు అండగా ఉండండి. దయచేసి నన్ను ఆదుకోండి. నాకు జీవితం ప్రసాదించండి. లేకపోతే మరణమే గతి’’ అని అభ్యర్థించాడు. ఈ వ్యవహారంపై సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధితుడి జాడ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. అతడికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని పేర్కొంది. అయితే, బాధితుడి ఆవేదనను సౌదీ అరేబియా సెక్యూరిటీ డిపార్టుమెంట్ కొట్టిపారేసింది. అతడి ఆరోపణలకు ఆధారాల్లేవని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో వీక్షణలు (వ్యూస్), తద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారని అనుమానం వ్యక్తం చేసింది.కఫాలా వ్యవస్థ రద్దయినా..సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కూడా భారతీయుడు యజమాని చెరలో చిక్కుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆధునిక బానిసత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న కఫాలా వ్యవస్థను సౌదీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది. విదేశీ కార్మికులు పాస్పోర్టు లాక్కోవడం, నిర్బంధించడం, వేధించడం నేరమే అవుతుంది. వలస కార్మికుల హక్కుల విషయంలో ఇదొక కీలకమైన సంస్కరణగా చెబుతున్నారు. సౌదీ అరేబియాలోని కార్మికుల్లో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం. -
భారత్లో అలాంటి నిషేధం వద్దా?
స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగాక.. సోషల్ మీడియా మత్తులో జనం మునిగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా.. గంటల తరబడి కాలం గడిపేస్తున్నారు. యూట్యూబ్-ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, మీమ్స్ అని.. ఇలా రాత్రి, పగలు తేడా లేకుండా సోషల్ మీడియా సైట్లలోనే గడిపేస్తున్నారు. ఈ విషయంలో పిల్లలనూ తల్లిదండ్రులు కట్టడి చేయలేకపోతున్నారు. అందుకే విప్లవాత్మక మార్పులో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ వాడకంపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో.. యూరోపియన్ యూనియన్తో మలేషియాలోనూ బ్యాన్పై చర్చ జరుగుతోంది. అయితే పూర్తి స్థాయి నిషేధం కాకపోయినా.. ఫ్రాన్స్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో నియంత్రణకు చట్టాల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ స్పూర్తితో భారత్లోనూ అలాంటి నిర్ణయం జరగాలన్న అభిప్రాయాల్ని ఓ సర్వే తోసిపుచ్చింది. భారత్లో అలాంటి నిషేధం వద్దనే చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారట!!..పిల్లల విషయంలో సోషల్ మీడియా వాడకంపై అభిప్రాయం కోరుతూ Ipsos, Statista సంయుక్తంగా ‘గ్లోబల్’ సర్వే నిర్వహించాయి. ఇందులో 30 దేశాలకు చెందిన వేల మంది తల్లిదండ్రులు ఫీడ్ ఇచ్చారు. ఇందులో పాల్గొన్న 70 శాతం మంది నియంత్రణ సబబేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధికంగా ఇండోనేషియా ఆ తర్వాత ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నుంచి ఈ ఒపీనియన్ వెల్లడైంది. అయితే.. భారత్ నుంచి మాత్రం మిశ్రమ స్పందన లభింaచింది. వందలో 68 మంది మాత్రమే చిన్నారులకు సోషల్ మీడియా కట్టడిని సమర్థించారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. కిందటి ఏడాది ఇది 73 శాతం ఉంది. అంటే.. ఇప్పుడు 5 శాతానికి తగ్గిపోయిందన్నమాట.ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ.. పూర్తి నిషేధం సబబు కాదనే అభిప్రాయం తాజా సర్వేలో ఇండియన్ పేరెంట్స్ నుంచి వ్యక్తమైంది. బ్యాన్కి బదులు మార్గదర్శకత్వం అవసరం అనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. సోషల్ మీడియా వల్ల పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు. అలాగే మా నుంచి కూడా పరిమితులు ఉండాల్సిన అవసరం ఉంది.:హైదరాబాద్కు చెందిన ఓ తల్లినిషేధం సబబు కాదు. దాని కంటే సరైన గైడ్లైన్స్ మీద దృష్టి పెట్టాలి: బెంగళూరుకు చెందిన ఓ తండ్రిభద్రతా సమస్యలు ఉన్నా సో.మీ.ను పూర్తిగా నిషేధించడం సమర్థనీయం కాదు: ఢిల్లీకి చెందిన తల్లిదండ్రులుసోషల్ మీడియా వినియోగం అనేది పిల్లల వికాసం, అవగాహన కోసం ఉపయోగపడుతుందని కొంతమంది తల్లిదండ్రుల అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత్కు డిజిటల్ వాతావరణానికి బాగా అలవాటు పడిపోయింది. విద్యా, వ్యాపార అభివృద్ధి, కమ్యూనిటీ నిర్మాణం లాంటి రంగాల్లో ఎక్కువగా సోషల్ మీడియా వినియోగం ఉంటోంది. మరీ ముఖ్యంగా.. యూత్ కల్చర్లో లోతుగా కలిసిపోయింది. అందుకే ఎక్కువ మంది తల్లిదండ్రులు కఠిన నియంత్రణలు అవసరమని భావిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఇక్కడి ప్రభుత్వాలు కూడా.. నిషేధం కంటే నియంత్రణ మీదే(వయస్సు ధృవీకరణ, డిజిటల్ విద్యా అవగాహన, తల్లిదండ్రుల పర్యవేక్షణ లాంటి అంశాలు) ఎక్కువ దృష్టిసారిస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కూడా పిల్లల విషయంలో హానికరమైన కంటెంట్, అల్గోరిథం విషయంలో నియంత్రణలకు సిద్ధంగానే ఉన్నట్లు సూచన ప్రాయంగా చెబుతున్నాయి. జర్మనీలో.. భారత్కు విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా నిషేధానికి మద్దతు ఇచ్చిన వారి శాతం అత్యల్పంగా 53% ఉన్నప్పటికీ, గత సంవత్సరం కంటే మద్దతు 13% పెరిగింది. ఇది పెరుగుతున్న అక్కడి తల్లిదండ్రుల ఆందోళనను, మారుతున్న పిల్లల ఆలోచనా ధోరణిని సూచిస్తోంది. -
పాకిస్తాన్కు మరో షాక్.. ఆప్ఘన్ ఎఫెక్ట్తో కిలో టమాటా ఎంతంటే?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పాక్కు ఊహించని షాక్లు తగులుతున్నాయ్. ఇరు దేశాల మధ్య దాడుల కారణంగా అక్టోబర్ 11 నుంచి సరిహద్దులను మూసివేశారు. దీంతో పాకిస్తాన్ ప్రజలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఘర్షణల కారణంగా నిత్యవసరాలపై దీని ప్రభావం పడింది. పాక్లో టమాటా ధరలు ఐదు రెట్లు పెరిగి ఏకంగా కిలో టమాటాల ధర (Tomato Prices) 600లకు చేరింది.పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ బోర్డర్ మూసివేత వల్ల ఇరుదేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఘర్షణలకు ముందుతో పోలిస్తే పాక్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాక్లో ప్రస్తుతం కిలో టమాటాల ధర (Tomato Prices) 600 పాకిస్థానీ రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. ఇక, గురువారం టమాట ధర ఎనిమిది వందలకు సైతం చేరినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. breaking news 1KG tomato price 800 RS in Pakistan pic.twitter.com/ZQfgKSNdwl— M.Shaheedyar (rh) ⏺ (@Shaheedyar0313) October 22, 2025ఇదిలా ఉండగా.. సాధారణంగా పాక్-ఆప్ఘన్ సరిహద్దు నుంచి ఏటా ఇరుదేశాల మధ్య 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపివేశామని కాబుల్లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ వెల్లడించారు. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నష్టం వాటిల్లుతుందన్నారు. ఆప్ఘన్ నుంచి పాక్కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు పాడైనట్లు తెలిపారు. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయాయని పాకిస్థాన్లోని ప్రధాన టోర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉన్న ఓ అధికారి పేర్కొన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఒక్కసారిగా నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. -
పాకిస్తాన్లో ఎస్పీ ఆత్మహత్య.. భారత్ ఏజెంట్? ఆపరేషన్ సిందూర్లో సాయం?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. సీనియర్ పోలీసు అధికారి గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఒక ఫోన్ కాల్ అందుకున్న కాసేపటికే ఆయన ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది. మరోవైపు.. సదరు అధికారి భారత్ ఏజెంట్ అని.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయనే భారత్కు సాయం చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. ఇస్లామాబాద్లోని ఐ-9 ప్రాంతంలో ఉన్న ఎస్పీ కార్యాలయంలో అదీల్ అక్బర్ ఎస్పీగా పని చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజులాగే విధులకు వెళ్లిన అక్బర్.. గురువారం కూడా స్టేషన్కు వెళ్లారు. ఇంతలో ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది మాట్లాడిన కాసేపటికే.. ఆయన ఆవేశంతో ఊగిపోతూ తన గన్మెన్ వద్ద నుంచి తుపాకీని లాక్కుని ఛాతీలోకి కాల్చుకున్నారు. దీంతో, షాకైన గన్మెన్ వెంటనే తేరుకుని.. అదీల్ను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ ఎస్పీ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనకు చివరగా ఫోన్ చేసింది ఎవరు, ఆయనతో ఏం మాట్లాడారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాల్ రికార్డింగ్లు, మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.SP City of Islamabad Police Adeel Akbar was an agent of IndiaHe shot himself today .His inputs were very helpful during Op Sindoor.Thank you Adeel bhai , you have been a great help. pic.twitter.com/XZhcZTKZmn— Akshit Singh 🇮🇳 (@IndianSinghh) October 23, 2025ఇక, అదీల్ అక్బర్ సియాల్కోట్ జిల్లాలోని కమోంకి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన గతంలో బలూచిస్థాన్లో కూడా సేవలు అందించారు. అయితే, ఎస్పీ అదీల్ అక్బర్ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇస్లామాబాద్ ఎస్పీ అదీల్ అక్బర్ భారతదేశ ఏజెంట్ అని వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో అదీల్ అక్బర్.. మన సైన్యానికి ఇన్పుట్స్ ఇచ్చారని.. అవి మనకు సాయం చేశాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. -
సోషల్ మీడియా..వాడకం తగ్గిందయా!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్.. ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించని ఇంటర్నెట్ యూజర్లు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా సోషల్ మీడియా జనంలో చొచ్చుకుపోయింది. సామాజిక మాధ్యమాల్లో విహరించడం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇంటర్నెట్ యూజర్లకు దినచర్యగా మారిపోయింది. ఆన్లైన్ కంటెంట్ వినియోగంలోనూ సమూల మార్పులు వస్తున్నాయి. అయితే ఈ వేదికలను ఉపయోగించే విషయంలో యూజర్లలో ఒకనాటి దూకుడు ప్రస్తుతం లేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న వారు సుమారు 604 కోట్లు కాగా.. సోషల్ మీడియా (ఎస్ఎం) యూజర్లు 560 కోట్లకు పైగా ఉన్నట్టు అంచనా. అంటే ప్రపంచ జనాభాలో 65 శాతానికిపైగా అన్నమాట. ప్రతిరోజూ 4.10 లక్షల మంది కొత్తగా వీరికి తోడవుతున్నారు. మనదేశంలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నవారి సంఖ్య సుమారు 70 కోట్లని అంచనా. అంతర్జాతీయంగా 2025 నాటికి ఎస్ఎం రోజువారీ వినియోగం స్థిరంగా ఉండగా.. వార్షిక వృద్ధి రేట్లు మాత్రం తగ్గుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల సంఖ్య ఊహించని రీతిలో కొత్త శిఖరాలకు చేరుకోవడంతో మార్కెట్ సంతృప్త స్థాయికి (సాచురేషన్) చేరుకుందని గణాంకాలు సూచిస్తున్నాయి. » భారత్లో సోషల్ మీడియా వాడకం » రోజువారీ సగటు వినియోగం.. 2 గంటల 40 నిమిషాలు» ఆన్లైన్ సమయంలో ఎస్ఎం వాటా 34» యూట్యూబ్ బ్రాడ్కాస్ట్ 2025 నివేదిక ప్రకారం.. మనదేశంలో 18 ఏళ్లకు పైబడినవారు సగటున రోజుకు 72 నిమిషాలు యూట్యూబ్ వీడియోల కోసం వెచ్చిస్తున్నారు. జూన్ 2025 నాటికి దేశంలో యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్న వీక్షకులు 65 కోట్లు. వ్యసనంగా మారిపోయిందిసోషల్ మీడియా వాడకంతో టీనేజర్లలో మానసిక ప్రభావంవ్యసనం 30% మందికిఒంటరితనం 20% మందినిద్ర సమస్యలు 17% మందికిషార్ట్ వీడియోలు, రీల్స్కే!యూజర్ల తీరు, కంటెంట్ ప్రాధాన్యతషార్ట్ వీడియోలు, రీల్స్కు అత్యధిక సమయం వెచ్చిస్తున్నవారు 80%వీడియో కంటెంట్ కోసం ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నవారు 90%అప్డేట్స్ కోసం ఎఫ్బీ వాడుతున్నవారు 17%స్టోరీస్ కోసం ఇన్స్టాగ్రామ్ వినియోగిస్తున్నవారు 7% » యూజర్లు వారానికి సగటున 18 గంటల 36 నిమిషాలు ఎస్ఎంకి కేటాయిస్తున్నట్టు అంచనా. » ముఖ్యంగా 18 ఏళ్లకు పైబడిన ప్రపంచ జనాభాలో 92 శాతానికిపైగా ఎస్ఎం వినియోగిస్తున్నారట. » మొత్తం సోషల్ మీడియా యూజర్లలో పురుషులు 54 శాతానికిపైగా ఉన్నారు. అంటే మహిళలు సగానికంటే తక్కువే ఉన్నారన్నమాట.పెరిగి.. తగ్గింది!ప్రపంచవ్యాప్తంగా ఎస్ఎం వేదికలపై యూజర్లు వెచ్చించిన సగటు సమయం-ఆధారం: గ్లోబల్ వెబ్ ఇండెక్స్, స్టాటిస్టా, డేటా రిపోర్టల్ -
దీపావళి వెలుగుల్లో మెరిసిపోతున్న పూనమ్ బజ్వా.. డిఫరెంట్గా శ్వేతాబసు ప్రసాద్!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ పూనమ్ బజ్వా..దీపావళి సెలబ్రేషన్స్లో బాలీవుడ్ బ్యూటీ శివాంగి జోషి..ఎల్లో శారీలో బుల్లితెర నటి మంజుల అందాలు..హీరోయిన్ కావ్య థాపర్ స్మైలీ లుక్స్..ఢిఫరెంట్ అవుట్ఫిట్లో శ్వేతాబసు ప్రసాద్.. View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by C Sharp (@c___sharp) View this post on Instagram A post shared by Sai Praseedha Uppalapati (@praseedhauppalapati) View this post on Instagram A post shared by Nandiniii🕊 (@nandiniguptaa13) View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Manjula Paritala (@paritala_manjula_official) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) -
రీల్స్ పిచ్చి : రైలుకెదురెళ్లి తిరిగి రాని లోకాలకు, వీడియో వైరల్
యూట్యూబ్ రీల్స్ పిచ్చి అనేకమంది ప్రాణాలుతీస్తోందని తెలిసినా తీరు మారడం లేదు. నిర్లక్ష్యం కొన సాగుతూనే ఉంది. ఫలితంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒడిశాలోని పూరి జిల్లాలోని జనకదేయ్పూర్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది.ఒడిశాలోని పూరీలో రైల్వే ట్రాక్పై రీల్ చిత్రీకరిస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలుడు రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళఘాట్ నివాసి విశ్వజీత్ సాహు తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడి కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వస్తుండగా వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మలీ రీల్స్ తీయడానికి ప్రయత్నించాడు. అంతే అందరూ చూస్తుండగానే లిప్తపాటు క్షణంలోనే బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం విషాదం.తన మొబైల్ ఫోన్లో చిన్న వీడియో రికార్డ్ చేయడానికి రైల్వే పట్టాలకు దగ్గరగా ప్రమాదకరంగా నిలబడి తన మొబైల్ ఫోన్లో రీల్ చిత్రీకరిస్తుండగా, ఎదురుగా వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఇదీ చదవండి: డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్కపుల్సమాచారం అందిన వెంటనే, ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) అధికారులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష కోసం సమీపంలోని ఆసుపత్రికి పంపారు. రైల్వే పట్టాల దగ్గర భద్రతా హెచ్చరికలను పట్టించుకోకుండా సోషల్ మీడియా వీడియోను చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు బాలుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.Tragic accident occurred in Puri district, #Odisha A 15-year-old boy was hit by train & died near #Janakdeipur railway station. The accident occurred while he was filming a video reel on his mobile phone on the railway track.#Reels#reelsvideo pic.twitter.com/XB613GdZX0— Nikita Sareen (@NikitaS_Live) October 23, 2025 కాగా ఈ ఏడాది ఆగస్టులో గంజాం జిల్లా బెర్హంపూర్కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ కోరాపుట్లోని డుడుమా జలపాతం వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా కొట్టుకుపోయి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోదర ప్రేమ, భగినీ హస్త భోజనం : ముహూర్తం ఎపుడంటే -
ఇలా అయితే కష్టం సుమీ!
సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే ప్రీ టీనేజర్లు, ఉపయోగించని లేదా తక్కువగా ఉపయోగించే వారితో పోలిస్తే చదువులో వెనకబడిపోతున్నారని, జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని తాజా అధ్యయనం ఒకటి తెలియజేస్తుంది. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్(జమ)లో ప్రచురించబడ్డాయి.‘పిల్లలు గతంలోలాగా నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం కష్టంగా మారింది. ఎందుకంటే సమాచారాన్ని ప్రాసెస్ చేసే వారి సామర్థ్యాన్ని సోషల్ మీడియా మార్చేసింది. పిల్లలు బడిలో సోషల్ మీడియా వాడడం అనేది వారి అభ్యాసంపై ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ తాజా అధ్యయనం ఉపయోగపడుతుంది’ అంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన రచయిత, శిశువైద్య నిపుణుడు జాసన్ నగటా.ఈ అధ్యయనం కోసం జాసన్ అతని బృందం కౌమారదశపై జరుగుతున్న అధ్యయనాలలో ఒకటైన అడోలసెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్(ఏబీసీడీ) స్టడీ నుంచి డేటాను ఉపయోగించుకుంది. జాసన్ బృందం తొమ్మిది నుంచి పది సంవత్సరాల వయస్సుగల ఆరువేల మందికి పైగా పిల్లలకు సంబంధించిన డేటాను తమ అధ్యయనానికి ఉపయోగించుకుంది. సోషల్ మీడియాను ఉపయోగించే పిల్లలను మూడు గ్రూప్లుగా విభజించారు. వారిలో ఆరు శాతం మంది పిల్లలకు ‘హై ఇంక్రీజింగ్ సోషల్ మీడియా గ్రూప్’గా నామకరణం చేశారు. ఈ పిల్లలు మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు. (చదవండి: చెట్టు చనిపోయింది... ఊరు దుఃఖసముద్రం అయింది!) -
గోల్డెన్ క్రియేటర్
ఇది పెద్ద ఘనతే. ఇన్స్టాగ్రామ్ ఇక పై ప్రతి ఏటా ఇద్దామనుకుంటున్న‘గ్లోబల్ గోల్డెన్ రింగ్ అవార్డు’ను 2025 సంవత్సరానికి ఇన్ఫ్లూయెన్సర్ డాలీ సింగ్కు ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా 25 మందితో తొలి జాబితా సిద్ధం చేయగా మన దేశం నుంచి డాలీ సింగ్ ఒక్కరికే చోటు దక్కింది. లక్షల ఫాలోయెర్లు ఉండటంతో పాటు స్థానిక సంస్కృతిని ప్రచారం చేయగలిగే కంటెంట్ క్రియేటర్లకే ఈ అవార్డు ఇస్తారు.డాలీ సింగ్ పరిచయండాలీ సింగ్ (32).. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగుతోంది. ప్రతి ఏటా ఇన్స్టాగ్రామ్ అందించే ‘గ్లోబల్ గోల్డన్ రింగ్’ అవార్డును సొంతం చేసుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీసింగ్ రికార్డు సృష్టించింది. తమ కంటెంట్ ద్వారా స్థానిక సంస్కృతికి చాటే వారికి ఈ అవార్డు అందించాలని ఇన్స్టాగ్రామ్ ఈ అవార్డు ప్రారంభించింది. కంటెంట్ తయారీలో ఎటువంటి భయాలు, తేడాలు చూపని వారికి ఈ అవార్డును అందించనున్నట్లు ఇన్స్టా ప్రకటించింది. తొలి ఏడాదే డాలీ సింగ్ ఈ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా అందులో మన దేశం నుంచి ఆమె స్థానం పొందడం విశేషం. 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె డిజిటల్ కంటెంట్ క్రియేటర్తోపాటు నటిగానూ పేరు పొందింది.ఇన్స్టాలో పాపులర్... ఆపై సినిమాల్లో...ఇన్స్టాలో పాపులర్ అయిన డాలీసింగ్ బాలీవుడ్లో నటిగా తెరంగేట్రం చేసింది. ‘డబుల్ ఎక్సెల్’ ఆమె మొదటి సినిమా. కరణ్ బూలనీ దర్శకత్వంలో వచ్చిన ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ‘బెస్ట్ వరస్ట్ డేట్’ పేరుతో తనే సొంతంగా మైక్రో డ్రామా సిరీస్ రూపొందించింది. ఇటీవల ఇన్స్టాలో ఆ సిరీస్ మూడో సీజన్ విడుదలైంది.విజేతలకు ఇన్స్టాలో అదనపు సౌకర్యాలుడాలీ సింగ్తోపాటు గ్లోబల్ రింగ్ అవార్డు అందుకున్నవారికి ఇన్స్టా సంస్థ బంగారు రింగ్ను అందించనుంది. దీంతోపాటు ఆమె ఇన్స్టా ప్రొఫైల్లో డిజిటల్ రింగ్ కనిపించే ఏర్పాటు చేస్తోంది. వారు ఇన్ స్టోరీలు పోస్ట్ చేసే క్రమంలో వారి ప్రొఫైల్ పిక్ చుట్టూ డిజిటల్ రింగ్ కనిపిస్తుంది. ఈ రింగును గోల్డ్ కలర్లో ఉంచుకోవచ్చు. లేదా రంగులు మార్చుకోవచ్చు. తనకు ఈ పురస్కారం ప్రకటించడం నమ్మశక్యం కాని విషయమని డాలీసింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను నిజాయితీగా చేసిన కంటెంట్ని ఇన్స్టా ప్రతినిధులు చూసి మెచ్చుకోవడం, గుర్తించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. తను మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ఈ అవార్డు దోహదపడుతుందని తెలిపారు.‘రాజు కీ మమ్మీ’తో పాపులారిటీనైనిటాల్లో జన్మించిన డాలీసింగ్ ఢిల్లీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదివి ముంబై చేరుకున్నాక డిజిటల్ క్రియేటర్గా మారింది. కాని మొదట ఆమె కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. అయితే మెల్లగా వారే ఆమె కంటెంట్ చూసి తమ దృష్టి మార్చుకున్నారు. డాలీ సింగ్ మొదట ఫ్యాషన్ వీడియోలతో కెరీర్ ప్రారంభించి తర్వాత మెల్లగా స్కెచ్ వీడియోల వైపు దృష్టి సారించింది. నిత్యజీవితంలో జరిగే సరదా సంఘటనలు వీడియోల రూపంలో చూపితే ప్రేక్షకులకు నచ్చుతుందని గుర్తించింది. దీంతో వీడియోల ద్వారా కథ చెప్పే విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకు ‘రాజు కీ మమ్మీ’ పాత్ర ఆమెకు దోహదపడింది. ఆ పాత్ర ద్వారా అనేక అంశాలను సరదాగా చూపుతూ పాపులర్ అయ్యింది. ఇందులో కేవలం హాస్యమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, పండగలు, కుటుంబ సంబంధాల గురించి వివరిస్తుంటుంది. ఇది ఆమె ఫాలోవర్స్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతోపాటు అమాయకత్వం, అయోమయం, హడావిడి కలగలిసిన దక్షిణ దిల్లీ అమ్మాయిగానూ ఆమె వీడియోలు పాపులర్ అయ్యాయి. -
ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ చిల్.. ప్రియాంక చోప్రా దివాళీ సెలబ్రేషన్స్!
దీపావళి ఫెస్టివ్ వైబ్లో వితికా శేరు.. బాలీవుడ్ భామ అతియాశెట్టి లేటేస్ట్ పోస్ట్.. పింక్ డ్రెస్లో జోర్దార్ సుజాత స్టిల్స్.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ దివాళీ సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా దివాళీ వెబ్స్.. గ్రీన్ శారీలో మెహరీన్ ఫిర్జాదా స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Sujatha P (@jordarsujatha) View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) -
పసికందును మోసుకుంటూ గడ్డ కట్టే చలిలో..
పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రుల్లో కొందరు.. నిర్లక్ష్యంతో, ఏమరుపాటుతో వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనలెన్నో చూశాం. అయితే ఇక్కడో జంట ప్రమాదం అని తెలిసి కూడా తమ నెలల పసికందుతో సాహసానికి సిద్ధపడింది. పోనీ అందుకు ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే!.. లిథువేనియాకు చెందిన ఓ జంట.. పోలాండ్లోని మంచుతో కప్పబడిన మౌంట్ రైసీ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధపడింది. అయితే తమ 9 నెలల బిడ్డతో కలిసి ఎలాంటి సురక్షిత పరికరాలు లేకుండానే ముందుకు వెళ్లింది. తల్లిని ముందు భాగంలో క్యారీ చేస్తూ ఆ తల్లి పైకి ఎక్కడం ప్రారంభించింది. ఇది గమనించిన కొందరు అలా చేయొద్దని వారించినా వినలేదు. అయినా వినకుండా ఆ పేరెంట్స్ మొండిగా ముందుకు వెళ్లారు. అయితే.. కాస్త దూరం వెళ్లాక ఆ బిడ్డ తండ్రి ప్రమాదాన్ని అంచనా వేశాడు. ఆ సమయంలో క్రాంపాన్(మంచులో జారకుండా షూలకు బిగించే పరికరాలు) కోసం ఓ మౌంట్ గైడ్ను సంప్రదించాడు. బిడ్డకు ప్రమాదం అని భావించిన ఆ మౌంట్గైడ్.. వాళ్లు సర్దిచెప్పి కిందకు తీసుకొచ్చారు. ఆ బిడ్డ పరిస్థితి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో.. చిన్నారిని ప్రమాదంలోకి నెట్టినందుకు ప్రయత్నించిన ఆ పేరెంట్స్పై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. మౌంట్ రైసీ (Mount Rysy) అనేది పోలాండ్లోని అత్యంత ఎత్తైన పర్వతం. దీని ఎత్తు సుమారు 2,501 మీటర్లు (8,205 అడుగులు). పోలాండ్- స్లోవేకియా సరిహద్దులో ఉన్న హై టాట్రాస్ పర్వత శ్రేణిలో విస్తరించి ఉంది.“No words.” A couple climbed Poland’s highest mountain with a baby — and sparked outrageA Lithuanian couple attempted to ascend Mount Rysy while carrying their nine-month-old child, Delfi reports.Conditions were extremely dangerous. Guides and rescuers warned them repeatedly,… pic.twitter.com/jgN8l6mPEg— NEXTA (@nexta_tv) October 21, 2025 -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న దీపికా తనయ ‘దువా’ ఫోటోలు : అలియా రియాక్షన్
బాలీవుడ్ జంట్ దీపికా పదుకొనే (Deepika Padukone), రణ్వీర్(Ranveer Singh) దివాలీ సందర్భంగా తమ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లు తమ ముద్దుల తనయ ముఖాన్ని సోషల్ మీడియా కంటపడకుండా జాగ్రత్త పడిన దీపికా, రణ్వీర్ దంపతులు ఎట్టకేలకుల తమ గారాలపట్టి దువాను ఫ్యాన్స్కు పరిచయం చేశారు. ముద్దుగా రెండు పిలకలు, నోట్లో వేలు, అమ్మ ఒడిలో కూర్చొని రెండు చేతులూ జోడించి దణ్నం పెట్టడం ఇలా ప్రతీ ఫోటో చాలా అందంగా ఉన్నాయి. దీంతో అభిమానులు తెగ మురిసిపోతున్నారు. మహారాణిలా ఉంది, ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తుంది అంటూ ప్రశంసిస్తున్నారు. డిటో రణవీర్, దీపికా డింపుల్స్ వచ్చేశాయి అంటూ కమెంట్స్ చేస్తున్నారు. కుమార్తె దువా దీపావళి పూజ ఫోటోలను దీపికా పంచుకోవడంపై చాలా మంది సెలబ్రిటీలు, సహనటీనటులు స్పందించారు. డార్క్ మెరూన్ కలర్ డ్రెస్సు, రెండు చిన్ని పిలకలతో పాపాయి అందంగా ఉంది అంటూ నెటిజనులు, సో క్యూట్ అంటూ హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్స్ మురిసిపోగా, దీపికా పదుకొనే కూతురు దువా ఫోటోలకు అలియా భట్ స్పందన విశేషంగా నిలిచింది. పాప ఫోటోలకు లవ్ ఎమోజీతో తన ప్రేమను ప్రకటించింది అలియా.సబ్యసాచి దుస్తుల్లో మెరిసిన యువరాణిక్లాసిక్ గ్రేస్ కు పేరుగాంచిన దీపికా పదుకొనే, కస్టమ్ క్రిమ్సన్ సబ్యసాచి డిజైన్ దుస్తుల్లో అందంగా కనిపించారు. గోల్డ్ జర్దోజీతో ఎంబ్రాయిడరీ చేయబడిన కస్టమ్ కుర్తా సెట్,మ్యాచింగ్ దుపట్టాతో పండుగ వైభవాన్ని ప్రతిబింబించేలా మెరిసారు. తన లుక్కు సరిపోయేలా, పచ్చలతో కూడిన పోల్కి చైన్ చెవిపోగులు , గాజులను ఎంపిక చేసుకున్నారు. ఇక దీపికతో పాటు, ఆచిన్న యువరాణి దువా కూడా సబ్యసాచి క్రియేషన్కు సరిపోయే చిన్న క్రిమ్సన్ కుర్తా, చేతితో తయారు చేసిన గోటా-పట్టి బార్డర్లతో ధరించింది. ఎర్రటి చిన్న బొట్టు, పిలకలో జంట తోకల సుందరిగా మెరిసింది. అలాగే రణ్వీర్ సింగ్ తెల్లటి కుర్తా సెట్లో నెహ్రూ జాకెట్,పసుపు రంగు షేడ్స్ ఉన్న అందమైన, పొడవైన బంగారు నెక్లెస్లో అందంగా కనిపించారు. కాగా దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ల లవ్ స్టోరీ సినీ అభిమానులకు తెలియందికాదు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ తమ ఇనీషియల్స్ను టాటూ కూడా వేయించుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకుని, వారి వారి కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. రణబీర్, అలియాభట్ను పెళ్లి చేసుకోగా, వీరికి ఒక పాప ఉంది. -
బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర లేటేస్ట్ లుక్.. బిగ్బాస్ దివి దీపావళి వైబ్స్!
ఫ్యామిలీతో హీరోయిన్ స్నేహ దీపావళి వేడుకలు..బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర దివాళీ లుక్..మెగా డాటర్ నిహారిక దీపావళి సెలబ్రేషన్స్..బిగ్బాస్ బ్యూటీ దివి దివాళీ లుక్స్..ఫ్యామిలీతో అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ..కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ దివాళీ వైబ్స్.. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
అనన్య నాగళ్ల దీపావళి సెలబ్రేషన్స్.. అమ్మ శారీలో హీరోయిన్ నభా నటేశ్!
భర్తతో కలిసి మౌనీరాయ్ దీపావళి పూజలు.. పచ్చ ఓణిలో అనన్య నాగళ్ల దీపావళి లుక్స్.. దీపావళి వెలుగుల్లో వితికా శేరు హోయలు.. అమ్మ చీరలో మెరిసిన హీరోయిన్ నభా నటేశ్.. గ్రీన్ డ్రెస్లో నిక్కీ గార్లానీ దివాళీ లుక్.. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) -
‘నడుములు విరుగుతున్నాయ్!’.. ఇక్కడ 90శాతం గుంతలు..2శాతమే రోడ్లు
సాక్షి,బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగర రోడ్ల గురించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ 90శాతం గుంతలు,రెండు శాతం రోడ్లంటూ నగర వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. గుంతలమయమైన రోడ్లను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.తాజాగా,నగరంలోని వర్తుర్-గుంజూర్ ప్రాంతంలో గుంతల మయమైన రోడ్ల గురించి స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టుకు నగర వాసులతో పాటు నెటిజన్లు సైతం విమర్శలు,ఆవేదనతో కూడిన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆ ఫొటోను పోస్టు చేసిన సదరు ప్రాంత నివాసి.. సాధారణంగా..రోడ్డు పరిమాణం 98 శాతం..గుంతల పరిమాణం 2 శాతం ఉంటుంది. అక్టోబర్ 17న బెంగళూరులో తీసిన ఈ ఫోటోలో రోడ్డు కేవలం 2 శాతం మాత్రమే.. గుంతల రోడ్లు 98 శాతం ఉంది.మనం వర్తూర్-గుంజూర్ను గుంతలు లేనిదిగా చేయగలమా? అంటూ గ్రేటర్ బెంగళూరు అథారిటీ కమిషనర్కు ట్యాగ్ చేశారు. ఆ పోస్టుకు స్పందిస్తున్న నెటిజన్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు మా వెన్నెముకలు విరుగుతున్నాయి. పన్ను చెల్లించే ప్రజల పట్ల ఈ నిర్లక్ష్యం ఎందుకు?’అంటూ ఓ నివాసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్ ‘నేషనల్ అక్వాటిక్ హైవే’ కార్లు బోట్లుగా మారుతున్నాయి.హెల్మెట్లు లైఫ్ జాకెట్లుగా... గూగుల్ మ్యాప్స్ చెబుతోంది‘500 మీటర్లు ఈదుతూ ముందుకు సాగండి’ అని. ఇలా రోడ్లు లేక్లుగా మారితే..కార్లు కాదు... బోట్లే అవసరం!’అంటూ చమత్కరిస్తున్నారు.Normally the Road size will be 98% and the Pothole size would be 2%.In this photo shot on 17th October 2025 in Bengaluru, Road is only 2% and LakeHole is 98% 🙏@GBAChiefComm ji, can we make Varthur-Gunjur Pothole Free?#FI pic.twitter.com/pYYLKpG63O— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) October 18, 2025 -
కారులో వచ్చి 50 కోతులు కొన్న వ్యాపారి.. ఎన్ని లక్షలంటే?
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని కోతులను పట్టుకున్న కాంట్రాక్టర్ హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారికి విక్రయించినట్లు ఆదివారం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఎర్టిగా కారులో ఒకరు 50 కోతులకు ఓ కాంట్రాక్టర్కు రూ.2 లక్షల వరకు సొమ్ము చెల్లించి తరలించినట్లు విశ్వస నీయ వర్గాల ద్వారా తెలిసింది. పట్టుకున్న కోతులను ఏటూరునాగారం అడవుల్లోకి తర లించాల్సిన కాంట్రాక్టర్ వ్యాపారికి విక్రయిస్తు న్నారనే సమాచారం మేరకు ఓ జర్నలిస్టు బల్దియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించగా.. కుక్కలను వదిలి భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. కోతుల విక్రయాలకు సంబంధించిన కార్యకలాపాలు బల్దియా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం సీసీ కెమెరాల్లో రికా ర్డు అయినట్లు చర్చ జరుగుతోంది. ఈవిషయ మై సీఎంహెచ్ఓ రాజారెడ్డిని వివరణ కోరగా.. తనకు కూడా సమాచారం అందిందని, సోమ వారం ఉదయం బల్దియా ప్రధాన కార్యాల యంలోని సీసీ కెమెరాలను పరిశీలించి వివరా లు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కోతు లను విక్రయించినట్టు తేలితే సదరు కాంట్రాక్ట ర్పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
Telangana: పోతే రూ.10 వేలు.. వస్తే నాలుగెకరాలు
భీమిని: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని అమ్మడానికి లక్కీ డ్రా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు టేకులపల్లి శివారులో తనకున్న నాలుగు ఎకరాల భూమిని లక్కీ డ్రా పెట్టాడు. రూ.10 వేల నగదు చెల్లించి టోకెన్ పొందాలని పేర్కొన్నారు. 1,500 మంది కాగానే అందరి సమక్షంలో లక్కీ డ్రా తీస్తామంటూ తన చేనుకు వెళ్లే దారిలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫ్లెక్సీలో సర్వే నంబర్లతోపాటు రూట్ మ్యాప్, పూర్తి వివరాలు పొందుపర్చాడు. లక్కీడ్రా ద్వారా మార్కెట్ ధర కంటే అధికంగా లాభం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. డ్రా కోసం ఫోన్పే, గూగుల్పే ద్వారా కూడా చెల్లించవచ్చని తన ఫోన్ నంబర్ కూడా పేర్కొన్నాడు. కాగా, లక్కీడ్రా తీసే తేదీ ప్రకటించకపోవడంతో 1,500 టోకెన్లు పూర్తి అయ్యేదెప్పుడు లక్కీడ్రా తీసేదెప్పుడు అన్న చర్చ కూడా జరుగుతోంది.సరైన ధర రాకపోవడం వల్లే..భూమి అమ్మకానికి లక్కీడ్రా కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు భీమేశ్ను వివరణ కోరగా, తన సొంత అవసరాల కోసం భూమి విక్రయించేందుకు ప్రయత్నించగా, సరైన ధర రాకపోవడంతో లక్కీడ్రా కూపన్ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. డ్రా నిర్వహణకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ మొదటి వారంలో లక్కీడ్రా తీసే తేదీని ప్రకటిస్తానని తెలిపాడు. -
వార్నీ.. ఇవేం సెలబ్రేషన్స్ భయ్యా!! దీపావళి-2025 ధమాకా.. వీటిని చూశారా?
దీపావళి వేళ.. ఒక చిన్న వీడియో, ఒక సరదా ఫోటో అసాధారణ స్పందనను తెచ్చుకుంటున్నాయి. లక్షల మంది హృదయాలను గెలుచుకుంటూ వైరల్ కంటెంట్గా మారుతున్నాయి. ఆ సాధారణ దృశ్యాలు, వినూత్న ఆలోచనలను సోషల్ మీడియా మరింత సంబరంగా మార్చుతోంది. వాటిల్లో కొన్ని మీకోసం..దీపావళి పండుగ వేళ.. ఇంటి డెకరేషన్లు, తమ ముస్తాబులు, తాము చేసుకునే సంబురాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అదే సమయంలో సరదాగానూ కొంత కంటెంట్ వైరల్ అవుతుంది. సినీ నటులు రజినీకాంత్, బ్రహ్మానందాలు నోట్లో బాంబులు పెట్టుకోవడం.. సినిమాల్లో దీపావళి శుభాకాంక్షలు చెప్పడం.. ఓ తెలుగమ్మాయి ధైర్యంగా సుతిల్ బాంబులను చేత్తో అంటించి విసిరేయడం, కుక్క నోటితో బాణాసంచాని కరుచుకుపోయి పదే పదే ఇంట్లో పడేయడం, పొల్యూషన్తో సంబంధం లేకుండా బాంబ్ఫ్రూఫ్ వేడుకలు(డప్పులు, తినే కంచాలతో సౌండ్లు).. ఇలాగన్నమాట. అయితే ఈసారి కొంత కొత్త స్టఫ్ నెట్లో వైరల్ అవుతోంది. ఇదేం సెలబ్రేషన్ భయ్యా.. అది అత్యంత ఖరీదైన ఏరియా. అలాంటి చోట ‘వెరీ లేజీ సెలబ్రేషన్స్’ను ఎవరూ కలలో కూడా ఊహించని పరిణామం ఇది!. అవును.. నోయిడాలో ఓ బ్యాచిలర్ బద్మాషుగాళ్లు చేసిన పని నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీపావళి సెలబ్రేషన్స్లో భాగంగా.. కుల్వంత్ సింగ్, యాగేశ్వర్ అనే ఇద్దరు కుర్రాళ్లు తమ బాల్కనీకి అలంకరించారు. ఓ గ్రీన్ లైట్ దండ బల్బ్ సెట్ను వేలాడదీసి దానిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అంతే.. View this post on Instagram A post shared by Kulwant Singh Rangra (@kulwant_singh0810)రాత్రికి రాత్రే అది ఆ ఇద్దరినీ ఫేమస్ చేసింది. లక్షల మంది దానికి స్పందిస్తూ.. ఆ యువకులపై చిత్రవిచిత్రమైన కామెంట్లు చేశారు. దీంతో తమ బాల్కనీని మరిన్ని లైట్ సెట్లతో కలర్ఫుల్గా మార్చేశారు. కావాలని చేశారో.. అనుకోకుండా జరిగిందోగానీ లక్షల మందిని ఆకట్టుకున్న ఈ వీడియో వైరల్ సంబరంగా మారింది. నువ్వో ఆణిముత్యానివి!దీపావళి వేడుకల్లో ఓ వ్యక్తి ల్యాప్ట్యాప్తో చిందులేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైభవ్ చంద్ర అనే వ్యక్తి ఆఫీస్ దీపావళి సెలబ్రేషన్స్ వీడియో అంటూ దానిని పోస్ట్ చేశారు. అయితే.. ఈ వీడియో కొత్తేదేనా? వైభవ్ ఎందుకు పోస్ట్ చేశాడన్నదానిపై స్పష్టత లేదు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్నా.. దీపావళి వేడుకలను మిస్ కాలేదు అంటూ క్యాప్షన్ ఉంచాడు. దీంతో ఆ ఎంప్లాయిపై ఆణిముత్యం అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా చర్చ మొదలైంది. View this post on Instagram A post shared by Vaibhav Chhabra (@vaibhav9497)టచ్ చేశావ్ భయ్యా.. హైదరాబాద్(తెలంగాణ)కు ఓ వ్యక్తి వెరైటీగా జరిపిన దీపావళి సంబురాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. సాధారణంగా మనకు డెలివరీలు వస్తే ఏం చేస్తాం.. వెంటనే పెమెంట్ చేసేసి మన పార్శిల్స్ అందుకుని వచ్చేస్తాం. కానీ, ఇక్కడో హైదరాబాదీ వివిధ డెలివరీ యాప్స్లో స్వీట్లను ఆర్డర్ చేసి.. తీసుకొచ్చిన ఆ డెలివరీ బాయ్స్ చేతికి అందించాడు. పైగా షేక్హ్యాండ్తో హ్యాపీ దీపావళి చెప్పడంతో నెట్టింట యూజర్లు తెగ ఖుషీ అయిపోతున్నారు. View this post on Instagram A post shared by Gundeti Mahendhar Reddy (@_the_hungry_plate_)యూ నెయిల్డ్ ఇట్ బ్రో!ఇక్కడో ఆర్టిస్ట్ వెరైటీగా చేసిన ప్రయత్నం.. నెట్టింట సందడి చేస్తోంది. తన సృజనాత్మతకు పని చెబుతూ.. చేతి గోళ్ల మీద ఓ వ్యక్తి పెయింటింగ్ వేశాడు. ఈ త్రీడి నెయిల్ ఆర్ట్లో.. బాణాసంచాతో పాటు హ్యాపీ దీపావళి అనే అక్షరాలనూ అతను చెక్కాడు. ఈ క్రమంలో.. ఓ గోటిపై ఏకంగా దీపాన్ని వెలిగించడం గమనార్హం. దీనిపై అతనికి ప్రశంసలతో పాటు కొంత మంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Yogesh Kumar (@love_nail_yogesh) -
నువ్వో డ్రగ్ డీలర్
పామ్ బీచ్(అమెరికా): అగ్రరాజ్యాధినేతననే అహంకారంతో తనకు నచ్చని ప్రతి దేశంపై ఆంక్షలు, నిషేధాజ్ఞల కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను లక్ష్యంగా చేసుకున్నారు. కొలంబియాలో తయారైన మాదకద్రవ్యాలు అమెరికాలోకి పోటెత్తుతున్నాయని, ఇందుకు గుస్తావోనే కారణమని ఆయనపై అంతెత్తున లేచారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్ చేశారు. ‘‘గుస్తావో ఒక పెద్ద అక్రమ మాదకద్రవ్యాల డీలర్. పేరు ప్రఖ్యాతలు లేని, అసలు ప్రాముఖ్యతే లేని రాజకీయనేత. కొలంబియా డ్రగ్స్ దందాను వెంటనే ఆపేయాలి. లేదంటే మిమ్మల్ని బాధపెడుతూ మేమే బలవంతంగా ఆపుతాం. కొలంబియా వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమ స్థాయిలో మాదకద్రవ్యాల తయారీని గుస్తావో పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దేశీయంగా డ్రగ్స్ను ఆయన అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అమెరికా నుంచి భారీస్థాయిలో నగదు సబ్సిడీలు, వెసులుబాట్లు పొందుతూ కూడా గుస్తావో డ్రగ్స్ ఉరవడికి అమెరికాలోకి రాకుండా ఆపలేకపోతున్నారు. ఇది నిజంగా అమెరికాను మోసంచేయడమే. ఇకపై కొలంబియాకు అమెరికా చేసే సాయం ఆపేస్తా’’అని ట్రంప్ హెచ్చరించారు. -
మెరిసిపోతున్న రష్మిక మందన్నా.. దివాళీ పార్టీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే !
బ్లాక్ డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్.. దివాళీకి మెరిసిపోతున్న హీరోయిన్ రష్మిక మందన్నా.. ఫస్ట్ దివాళీ పార్టీ అంటోన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే.. పారిస్లో చిల్ అవుతోన్న మాళివిక మోహనన్.. దివాళీ మూడ్లో చాహల్ గర్ల్ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్.. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
కచ్చా బాదం సింగర్ గుర్తున్నాడా? గుడిసెలో నుంచి కొత్తింట్లోకి!
ఫేమస్ అవడం ఈజీనా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే కొందరు ఎంత కష్టపడ్డాసరే పెద్దగా గుర్తింపు అందుకోరు. మరికొందరు ఏం చేయకపోయినా సరే ఇట్టే ఫేమస్ అవుతుంటారు. అయితే ఒకటి మాత్రం నిజం! వచ్చిన ఫేమ్ను కాపాడుకోవడం అంత ఈజీ అయితే కాదు. అందుకే ఇండస్ట్రీకి చాలామంది తారలు వస్తుంటారు, పోతుంటారు. సోషల్ మీడియాలోనూ అంతే.. సడన్గా కొందరు వైరలవుతుంటారు.. అంతలోనే కనుమరుగవుతుంటారు. అలా అప్పట్లో కచ్చా బాదమ్ సింగర్ భూబన్ బద్యాకర్ బాగా పాపులర్ అయ్యాడు.పాత సామాన్లకు పల్లీలుపశ్చిమ బెంగాల్కు చెందిన భూబన్ (Bhuban Badyakar).. పాత సామాన్లు, పగిలిన వస్తువులకు పల్లీలు ఇస్తానంటూ వీధుల్లో తిరిగేవాడు. పాట రూపంలోనే పల్లీలు అమ్ముకున్నాడు. ఆ పాట సోషల్ మీడియాలో క్లిక్కవడంతో బాగానే డబ్బు సంపాదించాడు. ఇకపై పల్లీలు అమ్ముకోను, సింగర్గా కొనసాగుతా.. నా క్రేజ్ చూసి కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉందని పోలీసులను ఆశ్రయించాడు. అతడి బిల్డప్ చూసి అందరూ అవాక్కయ్యారు.కారు కొన్నాక యాక్సిడెంట్కొందరు విమర్శించారు కూడా! దీంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. ఆర్టిస్ట్గా కొనసాగుతానని, అవకాశాల్లేనప్పుడు మళ్లీ పల్లీలు అమ్ముకోక ఇంకేం చేస్తానని మాట మార్చాడు. అప్పటికీ ఆగలేదు.. సంతోషం, డబ్బు రెండూ ఎక్కువైపోయేసరికి కారు కొన్నాడు. కానీ కారు నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్ అయి కొద్దిరోజులు ఆస్పత్రిపాలయ్యాడు. తర్వాత అడిగినవారికల్లా అప్పులిచ్చుకుంటూ పోయి వసూలు చేయలేకపోయాడు. కొంతకాలంగా కనిపించని సింగర్చూస్తుండగానే సంపాదించినదంతా కరిగిపోవడంతో సొంత ఊరుకు దూరంగా మళ్లీ పల్లీలు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. చాలాకాలంగా మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్య ఓ యూట్యూబర్ పుణ్యమా అని అతడెలా ఉన్నాడో తెలిసింది. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్న భూబన్ అదే స్థానంలో ఇల్లు కట్టుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. వైరల్ సాంగ్ వల్ల నాకు బాగా సంపాదించాను. కానీ, ఆ పాట కాపీ రైట్స్ ఇప్పుడు నావి కావు, ఓ కంపెనీ సొంతం చేసుకుంది. అలా అని నా జీవితం అక్కడితో ఆగిపోలేదు.జీవితం మెరుగైందిజనాలు నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈవెంట్స్కు, రియాలిటీ షోలకు రమ్మని పిలుస్తున్నారు. నా జీవితం కాస్త మెరుగుపడింది. జనాలు నన్ను గౌరవిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భూబన్ గౌరవంగా బతుకుతున్నట్లు పేర్కొన్నాడు. అతడి ఇంట్లో అవార్డులతో పాటు భూబన్ పెయింటింగ్ ఉండటం విశేషం.చదవండి: దీపావళి సినిమాలు.. జోరు మీదున్న హీరో.. వెనకబడ్డ సిద్ధు! -
బ్లూ శారీలో సీతారామం బ్యూటీ.. ఆదితి రావు హైదరీ స్టన్నింగ్ లుక్!
బ్లూ శారీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. హీరోయిన్ శ్రియా శరణ్ డిఫరెంట్ అవుట్ఫిట్.. సింగర్ శ్రేయా ఘోషల్ దివాళీ సెలబ్రేషన్స్.. క్రేజీ అవుట్ఫిట్లో సోనాలి బింద్రే హోయలు.. స్టన్నింగ్ లుక్లో ఆదితి రావు హైదరీ.. View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
కెనడాలో రీతూ వర్మ చిల్.. రెజీనా స్టన్నింగ్ అవుట్ఫిట్!
కెనడాలో చిల్ అవుతోన్న హీరోయిన్ రీతూ వర్మ..పదహారణాల అమ్మాయిలా ముస్తాబైన హీరోయిన్ మాధవీలత..హీరోయిన్ రెజీనా స్టన్నింగ్ అవుట్ఫిట్..కలర్ఫుల్ డ్రెస్లో పాలక్ తివారీ హోయలు..శారీలో సింగర్ గీతా మాధురి ట్రెడిషనల్ లుక్.. View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
రాకేష్ కిషోర్పై చర్యలు.. సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చ
తనపై షూ విసిరిన లాయర్(సస్పెండెడ్) రాకేష్ కిషోర్ను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ క్షమించినా.. న్యాయ వ్యవస్థ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని తాజాగా అటార్నీ జనరల్ అనుమతిచ్చారు. అయితే.. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే మంచిదంటూ సుప్రీం కోర్టు గురువారం అభిప్రాయపడింది. అటార్నీ జనరల్ ఈ చర్యకు చట్టపరమైన అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే దానంతట అదే ఆగిపోతుంది. లేకుంటే.. సోషల్ మీడియాలో చర్చలతో సాగుతుంటుంది. పైగా ఈ అంశాన్ని పదే పదే చర్చించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 6వ తేదీన కేసు లిస్టింగ్లు జరుగుతున్న టైంలో.. అడ్వొకేట్ రాకేష్ కిషోర్ తన షూను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మీదకు విసిరారు. అయితే అది ఆయన దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన తోటి లాయర్లు కిషోర్ను అడ్డగించి.. కోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఆ సమయంలో సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం ఊరుకోదు అంటూ కిషోర్ నినాదాలు చేశాడు. అయితే ఈ ఘటనను పట్టించుకోకుండా ప్రొసీడింగ్స్ కొనసాగించాలని జస్టిస్ గవాయ్ అక్కడున్నవాళ్లకు సూచించారు. ఇలాంటివి తనని ప్రభావితం చేయబోవని ఆ టైంలో అన్నారాయన.అటుపై చీఫ్ జస్టిస్ సూచనతో ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాకుండా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ చూసుకుంది. దీంతో రాకేష్ను మూడు గంటలపాటు ప్రశ్నించి.. షూ, ఆయన ఫైల్స్ను అందించి ఢిల్లీ పోలీసులు వదిలేశారు. ఈలోపు.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన లాయర్ లైసెన్స్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే తాను చేసిన పనికి పశ్చాత్తపం చెందడం లేదంటూ కిషోర్ పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్.. ఆయన్ని సుప్రీం కోర్టు ఆవరణలోకి అడుగుపెట్టనివ్వకుండా నిషేధం విధించింది. అయితే.. ఏజీ ఆదేశాల నేపథ్యంలో రాకేష్ కిషోర్పై క్రిమినల్ కంటెప్ట్ ఆఫ్ కోర్టుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు.. సీనియర్ లాయర్ వికాస్ సింగ్ ఇవాళ ద్విసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానించే ఘటన అని, తీవ్రంగా పరిగణించి ఈ అంశాన్ని రేపు విచారణ జరపాలని బెంచ్ను కోరారు. అయితే.. ఈ అంశం సోషల్ మీడియాలో కొనసాగుతోందని వికాస్ సింగ్ అనగా.. కొంతమంది ఈ చర్యను సమర్థించారని, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ గౌరవాన్ని దెబ్బ తీసే అంశమని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్ వద్ద అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని.. ఈ ఘటనలో సీజేఐ చాలా ఉదారంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు సంస్థను ప్రభావితం చేయవని హుందాగా అన్నారు. అయితే.. ఆయన స్పందన గౌరవప్రదంగానే ఉన్నా సోషల్ మీడియాలో ఈ చర్యను సమర్థించడం ఆందోళన కలిగిస్తోందని తుషార్ మెహతా చెప్పారు. ఈ వ్యవహారంలో John Doe injunction(కోర్టు నుంచి ముందస్తుగా తీసుకునే నిషేధ ఉత్తర్వు) జారీ చేయాలని లాయర్ వికాస్ సింగ్ కోర్టును కోరారు. ఆ సమయంలో జస్టిస్ బాగ్చీ కలుగజేసుకుని.. ‘‘ఇది కొత్త వివాదాలకు దారితీయవచ్చు. కోర్టులో మన ప్రవర్తనే ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓ బాధ్యతలేని పౌరుడి చర్యగా పరిగణించి సీజేఐ దీనిని పట్టించుకోలేదు. అలాంటి అంశాన్ని మళ్లీ తవ్వడం అవసరమా? అని అన్నారు. పైగా ఎన్నో ముఖ్యమైన అంశాలు పెండింగ్లో ఉన్నాయని, దీనిని పైకి తేవడం సమయాన్ని వృధా చేయడమేనన్న అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడం తన ఉద్దేశం కాదని, ఇక్కడితో నిలువరించమే తన అభిమతమని వికాస్ సింగ్ స్పష్టత ఇచ్చారు. ఆపై జస్టిస్ కాంత్ మాట్లాడుతూ.. నా సహ న్యాయమూర్తి చెబుతోంది మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీరు ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించిన వెంటనే, మీడియాలో కథనాలు కొనసాగుతాయి అని అన్నారు. ఆ టైంలో..‘దురదృష్టవశాత్తు, మనం డబ్బు సంపాదించే వ్యాపారాలుగా మారిపోయాం…" అని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో సాలిసిటర్ జనరల్ ఏకీభవించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారాలు అల్గోరిథమ్స్ ఆధారంగా పనిచేస్తాయి. ప్రజలు వాటికి బానిసలుగా మారిపోయారు. ఆ బానిసత్వాన్ని ఈ ప్లాట్ఫారాలు డబ్బుగా మార్చుకుంటున్నాయి. మనం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నామనుకుంటాం, కానీ నిజానికి మనమే ఆ ప్లాట్ఫారాల ఉత్పత్తులం’’ అని మెహతా అన్నారు. ఆ సమయంలో జస్టిస్ కాంత్ కలుగజేసుకుని మనం ఉత్పత్తులమే కాదు.. వినియోగదారులం కూడా అని అన్నారు. సోషల్ మీడియా మనుషుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దాని అల్గోరిథమ్స్ ద్వారానే.. ద్వేషం, కోపం, కామం లాంటి భావనలకు గురవుతున్నాం. సోషల్ మీడియా మన ఈ వ్యసనాన్ని మానిటైజ్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అది మళ్లీ మానిటైజ్ అవుతుంది. కాబట్టి దీనిని సహజంగా ముగియనివ్వడమే మంచిది అని జస్టిస్ కాంత్ అన్నారు. పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని.. అలాగే న్యాయస్థానం కూడా బార్ (న్యాయవాదుల సంఘం) ఆవేదనను అర్థం చేసుకోవాలని లాయర్ వికాస్ సింగ్ కోరారు. ‘‘బార్ (న్యాయవాదుల సంఘం) ఎప్పుడూ న్యాయ వ్యవస్థకు అండగా నిలిచింది. మీరు న్యాయాన్ని కోరే ప్రజలతో కోర్టును కలిపే వంతెన. మీ పరిస్థితిని, మీ భావోద్వేగాలను మేము అర్థం చేసుకుంటున్నాం’’ అని జస్టిస్ కాంత్ అన్నారు. ఈ అంశాన్ని శుక్రవారం విచారణకు తీసుకురావాలని వికాస్ సింగ్ మరోసారి కోరారు. అయితే.. దీపావళి తర్వాతే విచారించే అవకాశం ఉందని బెంచ్ స్పష్టం చేసింది. ఒక వారం తర్వాత ఇది ఇంకా 'సేలబుల్' అంశంగా ఉంటుందేమో చూద్దాం అని జస్టిస్ కాంత్ సున్నితంగా వ్యాఖ్యానించారు. ఈలోపు.. అల్గోరిథమ్ కోసం కొత్త అంశం వస్తుందేమో చూడాలి అని జస్టిస్ బాగ్చీ అన్నారు. దీనికి సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ఇలాంటి అంశాలకు 24–48 గంటల లైఫ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి వస్తుంది అనడంతో నవ్వులతో విచారణ వాయిదా పడింది. -
జడ్జీ కక్కుర్తి.. విచారణ లైవ్లో మహిళతో రాసలీలలు..
ఉన్నత వృత్తిలో ఉండి పలువురికి మార్గదర్శకంగా ఉండాల్సిన కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన కారణంగా సోషల్ మీడియాలో, వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే, వీరు చేస్తే పనుల కారణంగా ఆ వృత్తికే చెడ్డ పేరు వస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..తాజాగా ఓ జడ్జీ.. లైవ్లోనే ఒక మహిళతో రాసలీలలు(Judge Viral Video) చేసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన చండీగఢ్లో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ప్రకారం.. ఆన్లైన్లో కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. కేసుల విచారణలో భాగంగా కోర్టుకు లాయర్లు, పోలీసులు వస్తున్నారు. ఈ జడ్జీ కూడా ఆన్లైన్లో కోర్టుకు హజరయ్యారు. తన కేసు విచారణ కంటే ముందే వచ్చి లైవ్లో రెడీగా కూర్చున్నాడు. అయితే, ఆయన తన లాప్ టాప్లో వీడియో మోడ్ను ఆన్ చేసిన సంగతి మర్చిపోయాడు.ఇంతలో ఒక మహిళ.. సదరు జడ్జీ వద్దకు రాగానే.. కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. అనంతరం, ఆయన ముద్దులాటకు దిగాడు. మహిళను బలవంతంగా తనవైపునకు లాగి.. ముద్దుపెట్టాడు. వీళ్ల రాసలీలలు.. లైవ్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో మిగత వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతలో కొంత మంది ఆయనకు ఫోన్ చేసి అలర్ట్ చేసినట్లు సమాచారం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. జడ్జీలే ఇలా చేస్తే.. ఇంకా న్యాయం కోసం ఎక్కడకు వెళ్లాలని కామెంట్లు చేస్తున్నారు. -
తాలిబాన్ల చేతిలో.. పాక్కు ఘోర అవమానం
పరస్పర ఆరోపణలతో.. అఫ్తనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. బుధవారం జరిగిన పాకిస్తాన్ వైమానిక దాడుల్లో కనీసం 15 మంది అఫ్గాన్ పౌరులు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో తాలిబాన్ సైన్యం ప్రతిచర్యలకు దిగడంతో పాక్ సైన్యం తోకముడిచినట్లు తెలుస్తోంది. అయితే యుద్ధం తప్పదనే భావిస్తున్న తరుణంలో.. అనూహ్యంగా 48 గంటలపాటు కాల్పుల విరమణ తెరపైకి రావడం గమనార్హం. ఈ క్రమంలో.. కాబూల్, కాంహార్ దాడులపై అఫ్గనిస్తాన్ ప్రజలు రగిలిపోతున్నారు. స్పిన్ బోల్దక్ వద్ద పాక్ మిలిటరీ ఔట్ పోస్టులపై తాలిబాన్ బలగాలు మెరుపు దాడులు చేయగా, సైనికులు పరారైనట్లు, కొంత మందిని బంధించినట్లు సమాచారం. భారీగా ఆయుధాలు, ఆహార పదార్థాలు, పాక్ సైనికుల దుస్తులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొని నంగర్హార్ ప్రావిన్స్లో బహిరంగంగా ప్రదర్శించారు. పాక్ సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాక్ దాడుల నేపథ్యంలో అఫ్గన్ ప్రజలు తాలిబాన్లకు మద్దతుగా నిలిచారు. అవసరమైతే మేము కూడా ముజాహిదీన్గా మారిపోయి యుద్ధానికి సిద్ధం అని కాందహార్ యువకులు కొందరు చెబుతున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్(తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం) సరైన ప్రతీకారం తీసుకుంది. ప్రజలంతా పాకిస్తాన్కు వ్యతిరేకంగా తాలిబాన్తో ఉన్నారు అని పక్తియా ప్రజలు అంటున్నారు. మా భూమిని రక్షించిన భద్రతా బలగాలకు కృతజ్ఞతలు. మేము ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటాం అని కాబూల్ వాసి ఒకరు తెలిపారు.బీబీసీ జర్నలిస్టు దౌద్ జున్బిష్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాక్ సైన్యం విడిచిపెట్టిన అవుట్పోస్టుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ప్యాంట్లను తాలిబాన్ ప్రదర్శిస్తోంది అని ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఇది పాక్కు తీవ్ర అవమానమే అనే చర్చ నడుస్తోంది. Viral video: Afghan Taliban displaying pants of Pakistani Army soldiers - who were captured by Afghanistan, in the recent border clashes.Why does Pakistani Army always surrender with their pants open? 🤔pic.twitter.com/JqcKw28aou— Treeni (@TheTreeni) October 15, 2025 Again #Pakistan Begging For Cease fire from #Afghanistan .Wait for tomorrow and they will claim victory ! Afghans Celebrating with the pants of their Pak army men hanging in their Bazaar. Pak army is getting battered from all sides .#PakistanArmy pic.twitter.com/HN0Rgz45sc— Meena K (@Raagmaand) October 15, 2025 పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ ఒకప్పుడు మిత్రదేశాలే అయినా.. డ్యూరాండ్ లైన్ విషయంలో కయ్యానికి కాలు దువ్వుకున్నాయి. గత వారం రోజులుగా రెండు దేశాల సైన్యాలు 7 చోట్ల ఘర్షణలకు దిగాయి. తొలుత కాబూల్లోని తెహ్రాక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు. అయితే దాడుల విషయంలో పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి ఈ రెండు దేశాలు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఉద్రిక్తతలతో ఇప్పటిదాకా 200 మంది తాలిబన్లు, 58 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. 2021లో అఫ్గానిస్తాన్ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్న తర్వాత పాక్తో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. మరోవైపు.. అఫ్గనిస్తాన్ మంత్రి భారత పర్యటనకు వెళ్లిన వేళే.. ఈ దాడులు మొదలయ్యాయి. కాబూల్లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం పాకిస్తాన్కు కంటగింపుగా మారింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతుండడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది.ప్లీజ్.. మధ్యవర్తిత్వం వహించరా?కాల్పుల విరమణ విషయంలో ఇరు దేశాలు పరస్పరం విరుద్ధ ప్రకటన చేసుకుంటున్నారు. తాలిబాన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పాక్, పాకిస్తాన్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ చెబుతున్నారు. మరోవైపు.. ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలను పాక్ తరఫున ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులుగా వ్యవహరించాలని, వెంటనే జోక్యం చేసుకొని తాలిబాన్లను శాంతి ఒప్పందానికి ఒప్పించాలని కోరింది.ఇదీ చదవండి: ఇక నేనే ప్రెసిడెంట్ని.. నేను చెప్పినట్లే ప్రజలు వినాలి! -
‘తెర’ వెనుక తెగిపోయిన కల
న్యూఢిల్లీ: అది ఢిల్లీలోని శాంతి నగర్, ఆ రోజు అక్టోబర్ 12. ఆ మధ్య తరగతి కుటుంబంలో ఎప్పుడూ ఉండే ఆనందం, నవ్వులు.. ఆరోజు భయంకరమైన నిశ్శ బ్దంలో కొట్టుకుపోయాయి. తండ్రి ఒక రియల్ ఎస్టేట్ డీలర్, తల్లి గృహిణి, 12వ తరగతి చదువుతున్న కుమార్తె, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు.. ఇంతే ఆ కుటుంబం. పద్నాలుగేళ్ల ఆ బాలునికి ఈ తరం పిల్లల్లాగే సోషల్ మీడియాపై ఆసక్తి ఉంది. తన గదిలోనే ఏదో కొత్త వీడియో తీయాలనే ఉత్సాహంతో ఉన్నా డు. అప్పుడు తెలియదు, ఆ ఉత్సాహమే తన జీవితంలో చివరి క్షణం అవుతుందని.. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని వేళ, తన గదిని ఓ చిన్న స్టూడియోలా మార్చుకున్నాడు. మొబైల్ ఫోన్ను ఒక చోట పెట్టి, ’ఆత్మహత్యను అనుకరించే’ దృశ్యాన్ని రికార్డు చేయడం మొదలు పెట్టాడు. తెరపై చూపించే ఉత్కంఠను తానూ అనుభూతి చెందాలనుకున్నాడు. కానీ, ఆ ప్రయత్నంలో, బాలుడు నిల్చున్న కుర్చీపై నుంచి కాలు జారింది. అంతే.. క్షణాల వ్యవధిలో అంతా మారిపోయింది. బాలుడికి ఊపిరి అందలేదు. కొద్దిసేపటి తరువాత, తల్లిదండ్రులు గదిలోకి వచ్చి చూడగానే.. వారి గుండెలు బద్దలయ్యా యి. ఆందోళనతో వెంటనే దగ్గర్లోని ఆసు పత్రికి తీసుకెళ్లినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ఈ సంఘటనలో ఎలాంటి కుట్ర లేదు. ఆ బాలుడు వీడియో షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపోయి ఉండవచ్చు. వీడియో ఫుటేజీ లోని బాలుని హావభావాలు చూస్తే అతను ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదని తెలుస్తోంది’.. అని పేర్కొన్నారు. బీజేఆర్ఎం ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించి బాలుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమా దవశాత్తు జరిగిన సంఘటనగా కేసు నమోదు చేశారు. -
హీరోయిన్ ప్రణీత స్టన్నింగ్ లుక్.. బిగ్బాస్ బ్యూటీ ట్రేడిషనల్ లుక్!
అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత హాట్ ట్రీట్..బర్త్ డే డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకున్న దివ్యాంగణ సూర్యవన్షీ..బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ట్రేడిషనల్ లుక్..బ్లాక్ శారీలో హీరోయిన్ కాజోల్ గ్లామరస్ లుక్స్..థామా ప్రమోషన్స్లో బిజీ బిజీగా రష్మిక.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
‘ఐయామ్ సారీ.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటా..’
జోహో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా కొన్ని రోజులు దూరంగా ఉంటానని ప్రకటించారు. కంపెనీ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో కొన్ని కోడ్లను మరింత సమర్థవంతంగా సృష్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇటీవల కాలంలో ఎక్స్ వంటి సామాజిక మధ్యమాల్లో చాలా చురుకుగా ఉన్న వెంబు తాను రన్ చేయాలనుకునే కొన్ని కోడ్లను మెరుగుపరిచేందుకు కొంతకాలం ఆన్లైన్ ఎంగేజ్మెంట్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పనిలో నాణ్యత ముఖ్యమని చెప్పడం కంటే మనమే ఆ పనిని సమర్థంగా చేసి చూపించాలన్నారు. తన సోషల్ మీడియా అనుచరులకు ఇలా కఠినమైన పరిమితిని విధించవలసి వచ్చినందుకు చింతిస్తున్నానని చెప్పారు.ఇటీవల కాలంలో కంపెనీ తయారు చేసిన దేశీయ ఆన్లైన్ కమ్యునికేషన్ ప్లాట్ఫామ్ అరట్టై యాప్కు ఆదరణ పెరుగుతోంది. ఆ యాప్ను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది.అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా తాను అరట్టై డౌన్లోడ్ చేసుకున్నానంటూ ట్వీట్ చేశారు.అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలుఅరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్వర్క్లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: నక్సల్స్పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా? -
బీహార్ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు
న్యూడిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వరకు(సైలెన్స్ పీరియడ్) ఎలాంటి బల్స్ ఎస్ఎంఎస్లు, ఆడియో మెసేజ్లు పంపరాదని ఈసీ హెచ్చరించింది. అలాగే టీవీ, కేబుల్ నెట్వర్క్లు, రేడియోల్లో, సినిమా హాల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. పోలింగ్నాడు ఆయా ప్రాంతంలో ఆడియో, విజువల్డిస్ప్లేలు నిషేధించినట్లు పేర్కొంది. సోషల్మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను పొందుబరచాలని ఆదేశించింది. ముందస్తు అనుమతులు తప్పనిసరి: రాజకీయ ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందుస్తు అనుమతులు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థులు సోషల్ మీడియాతో సహా ఎల్రక్టానిక్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఏదైనా రాజకీయ ప్రకటనలు ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ధృవీకరణ పొందడం తప్పనిసరి అని తెలిపింది. ధృవీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలుమీడియా సర్టిఫికేషన్, ఎంసీఎంసీలను ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తున్నారు(అక్టోబర్ 10వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది). అక్టోబర్ 17వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. నవంబర్ 6వ తేదీన ఫస్ట్ ఫేజ్లో భాగంగా 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అంత కంటే 48 గంటల ముందు ప్రచారం ముగుస్తుంది. ఇందులో పాట్నా, ముజఫర్పూర్, గోపాల్గంజ్, దర్భంగా, బక్సర్, బీహార్ షరీఫ్ లాంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన 123 స్థానాల రెండో ఫేజ్ పోలింగ్కు అక్టోబర్ 16న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అక్టోబర్ 23 దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 9వ తేదీన ప్రచారానికి చివరి తేదీ. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14వ తేదీన.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది. -
అలసిపోయా.. ఇక ఆడలేను
బెంగళూరు: ఆడాలని ఉన్నా ఆరోగ్యం, శరీరం సహకరించడం లేదని, అందుకే భారమైన హృదయంతో ఆటను మానేశానని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తెలిపారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లా మణిపాల్ పట్టణంలో ఆమె మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఔత్సాహిక క్రీడాకారులకు తర్పీదు ఇచ్చేందుకు కూడా తనకు ఆసక్తి లేదన్నారు. హైదరాబాద్లో బ్యాడ్మింటన్ శిక్షణ ఇచ్చేందుకు మంచి అకాడమీలు ఉన్నాయని చెప్పారు. ‘శిక్షణ ఇవ్వడం చాలా కష్టమైన పని. అది ఆడడం కన్నా కష్టం. 10–15 గంటలపాటు నిలబడి శిక్షణ ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. అయితే పిల్లలకు ఆటల్లో ఆసక్తి కలిగించేలా పని చేస్తున్నా’ అని వివరించారు. పిల్లలు సోషల్ మీడియాకు స్వస్తి చెప్పి అన్ని రకాల క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. గతంలో తాను జీవితంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, 25 ఏళ్లు కుటుంబం, ఆహారం, స్నేహితులు అందరికీ దూరమైనట్లు తెలిపారు.


