breaking news
Social Media
-
హీరోయిన్ అనన్య నాగళ్ల చిల్.. జిమ్లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రాక్టీస్!
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల చిల్..జిమ్లో నటి శాన్వీ మేఘన కసరత్తులు..జిమ్లో రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ ప్రాక్టీస్..సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ నేచురల్ లుక్..చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న నమ్రతా శిరోద్కర్.. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
తస్మాత్ జాగ్రత్త.. అలాంటి రీల్స్ చేస్తే జైలుకే!
ఒరేయ్.. ఇది ఇన్స్టాగ్రామా?.. పొరపాటున గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశామా? అనేంత రేంజ్లో అసభ్యకరమైన కంటెంట్ కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్న రోజులివి. పైగా అలాంటి కంటెంట్కే ఫాలోవర్స్లో మాంచి డిమాండ్ ఉందని రెచ్చిపోతున్న తీరూ చూస్తున్నాం. బూతులతో కొందరు.. హాట్ హాట్ ఫోజులతో మరికొందరు.. సెమీ శృంగారంతో ఇంకొందరు.. చెలరేగిపోతున్నారు. అయితే ఇకపై అలాంటి వేషాలు చెల్లకపోవొచ్చు!. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ నెలకు రూ.30 వేల దాకా సంపాదిస్తున్న అక్కాచెల్లెలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్లు చేస్తోంది అసభ్యకరమైన కంటెంట్ కాబట్టి. వల్గర్ డైలాగులతో.. అతి జుగుప్సాకరమైన చేష్టలతో కంటెంట్ పోస్టు చేస్తూ వచ్చారు వాళ్లు. రానురాను వాళ్ల చేసే కంటెంట్ శ్రుతి మించిపోవడం.. అది తమ దృష్టికి వెళ్లడంతో సుమోటోగా కేసు నమోదు చేసి ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు. ఇక.. అసోంలో ఓ ఘనుడు.. తన మాజీ ప్రేయసిపై కోపంతో ఆమె ముఖంతో ఏఐ జనరేటెడ్ అశ్లీల ఇమేజ్లను సృష్టించాడు. అలా ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి మిలియన్ల ఫాలోవర్స్ను సంపాదించుకున్నాడు. ఓ ప్రముఖ అడల్ట్స్టార్ ఈ అకౌంట్కు స్పందించడంతో.. రాత్రికి రాత్రే ఈ అకౌంట్ తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు బాధితురాలు(సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే!) సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో ఆ సైకోను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ అకౌంట్ ద్వారా సదరు నిందితుడు ఏకంగా రూ.10 లక్షల దాకా సంపాదించడాని తెలుస్తోంది. రూల్స్కు పాతరేసి..ఒకప్పుడు కంటెంట్ విషయంలో సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్స్ కఠిన నిబంధనలే పాటించేది. అయితే రాను రాను ఆ పరిస్థితి దిగజారుతోంది. నిరసనలు, యుద్ధాలు, ప్రమాదాలు.. ఈ తరహా కంటెంట్ విషయంలో మాత్రమే Disclaimerను ఫాలో అవుతోంది. అమ్మాయిల హాట్ ఫోజులకు, సెమీ న్యూడ్ కంటెంట్కు, బూతు డైలాగులకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సహా ఇతర యాప్లు అడ్డాగా మారిపోయాయి. ఇదే అదనుగా.. ఆదాయం కోసం అడ్డు అదుపు లేకుండా కంటెంట్ క్రియేటర్లు చెలరేగిపోతున్నారు. ఆఖరికి మీమర్లు కూడా తమ కంటెంట్ ప్రమోషన్ కోసం ఈ తరహా కంటెంట్ను తమకు తెలియకుండానే ప్రమోట్ చేస్తున్నారు. ఉదాహరణకు.. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయ్యే కంటెంట్ను ఫిల్టర్ చేస్తే సగటున ఒక రోజులో 72 శాతం ఈ తరహా కంటెంట్ ఉండడం గమనార్హం!!.ఏఐతో దారుణాలుఅర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాడకం.. నాణేనికి రెండోవైపుగానూ ఉంటోంది. అశ్లీల, అసభ్య కంటెంట్ విషయంలో ఇప్పుడు ఏఐదే ముఖ్యపాత్రగా మారింది. ఇందునా సెలబ్రిటీల కంటెంట్ అగ్రభాగంలో ఉంటోంది. డీప్ఫేక్ ఫొటోలు, వీడియోలను ఇన్స్టాలాంటి పాపులర్ యాప్లోనూ విచ్చలవిడిగా అప్లోడ్ చేస్తున్నారు. అలాంటి కంటెంట్కు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాకపోవడం గమనార్హం. అయితే..ఈ మధ్య సెలబ్రిటీలు ఈ తరహా కంటెంట్ విషయంలో సీరియస్గానే స్పందిస్తున్నారు. దీంతో అరెస్టులు, కేసుల భయంతో ఎడిటర్లు మరో మలుపు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించుకున్న యువతను టార్గెట్ చేసుకుంటున్నారు. అరెస్టులతోనే కట్టడి!భారత్లో కఠిన చట్టాలు లేకపోవడమే.. బోల్డ్ కంటెంట్ వైరల్ కావడానికి ప్రధాన కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. చట్టసభలకే వదిలేసి.. ఈ తరహా వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి కోర్టులు సైతం ఆసక్తి చూపడం లేదు. కాబట్టి ప్రభుత్వాలే ఉక్కు పాదం మోపాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వాలు(తెలంగాణ సహా) ఈ తరహా కంటెంట్పై దృష్టిసారించాయి. తప్పుడు మార్గాల్లో సంపాదించాలని చూస్తే అరదండాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టు బాట పట్టాయి. ఈ ఏడాదిలో సోషల్ మీడియాలో వల్గర్ కంటెంట్ పోస్టు చేసినందుకు చాలా అరెస్టులే జరిగినట్లు ఆయా రాష్ట్రాల సైబర్ విభాగాలు చెబుతున్నాయి. దీంతో ఈ తరహా కఠిన చర్యలతోనే అలాంటి రీల్స్కు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు కూడా ఓ అంచనాకి వస్తున్నారు. -
16 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ, సప్త సముద్రాలు దాటి పెళ్లి : వైరల్ లవ్ స్టోరీ
"మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అంటే ఇదేనేమో. ఒక అమెరికా మహిళ వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సప్తసముద్రాలు దాటి అదీ తన కన్నా చిన్నవాడైన వ్యక్తిని మనువాడింది. ప్రేమకు సరిహద్దులు..అవధులు లేవు అని నిరూపించిన ఆ ప్రేమ జంట గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన మిండీ రాస్ముస్సేన్ (Mindy Rasmussen, 47) , అప్పర్ దిర్ జిల్లా నివాసి 31 ఏళ్ల ఫేస్బుక్ ప్రేమికుడు సాజిద్ జెబ్ ఖాన్ను ప్రేమించింది. ప్రియుడ్ని పెళ్లాడేందుకు ఏకంగా అమెరికా నుంచి పాకిస్తాన్కు వెళ్లింది. అంతేకాదు ఇస్లాంలోకి మతం మారింది. మధ్య 16 సంవత్సరాల వయస్సు తేడా స్పష్టంగా ఉన్నప్పటికీ, ఈ నెల ప్రారంభంలో సాంప్రదాయ నిఖా వేడుకలో వివాహం చేసుకున్నారు. సామాజిక విమర్శలను పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ జంట ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంటోంది.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!ఫేస్ బుక్ పరిచయంస్థానిక మీడియా కథనాల ప్రకారం దాదాపు ఒక సంవత్సరం క్రితం ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్లో పాకిస్తాన్కు చెందిన సాజిద్ జెబ్ ఖాన్ పరిచయం ఏర్పడింది. మొదట్లో అందరిలాగానే మామూలుగా మాట్లాడుకునే వారు. అది కాస్తా సుదీర్ఘ వీడియో కాల్స్గా మారింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ముందుగా రాస్ముస్సేన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అటు వీరి ప్రేమకు ఇరు కుటుంబాలూ అంగీకారం తెలిపాయి. ఈ నెల ప్రారంభంలోనే 90 రోజుల వీసా గడువుతో రాస్ముస్సేన్ అమెరికా నుంచి ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Islamabad International Airport) వచ్చింది. ఆమెకు ప్రేమగా స్వాగతం తెలిపిన సాజిద్ జెబ్ ఖాన్ స్వగ్రామానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కూడా సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘జులేఖ’గా పేరు మార్చుకుంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిఖా చేసుకున్నారు. తమ నిఖా వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాస్ముస్సేన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకుంది. దీంతో ఈ లవ్స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. -
సీఎం రేవంత్ పేరిట డీప్ఫేక్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రూ.21,000 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ.2 లక్షలు సంపాదిస్తారు. మీరు దీన్ని నమ్మి పెట్టుబడి పెట్టండి ’ అని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీలో ఒక న్యూస్ చానల్కు రేవంత్రెడ్డి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను వినియోగించి ఏఐతో ఒక డీప్ఫేక్ వీడియోను సృష్టించారు సైబర్ నేరగాళ్లు.రేవంత్ రెడ్డి క్వాంటం ఏఐ అనే వెబ్సైట్ను ప్రమోట్ చేస్తున్నట్లుగా కనిపించే నకిలీ ఏఐ–జనరేటెడ్ వీడియోను నమ్మవద్దని సీఎం కార్యాలయ అధికారులు సూచించారు. ఈ మేరకు గురువారం ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ సైతం ఈ వీడియో డీప్ఫేక్ అని, దాని నమ్మి మోసపోవద్దని సూచించింది. రేవంత్ రెడ్డి ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదు. అసలు క్వాంటం ఏఐని భారత ప్రభుత్వం ప్రారంభించలేదని, ప్రముఖుల వీడియోలను నకిలీవి సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఇలాంటి వీడియోల నుంచి సురక్షితంగా ఉండాలని సూచించారు.ఇలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఊదరగొట్టే ప్రకటనలు నమ్మవద్దని, అటువంటి వెబ్సైట్లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దని సూచించారు. ప్రభుత్వం పెట్టే ఏవైనా ఆర్థిక పథకాలను గురించి ధృవీకరించడానికి అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలను గుర్తిస్తే వెంటనే http://cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
లైవ్లో అడ్డంగా బుక్కై.. సీఈవో చిలక్కొట్టుడుపై జోకులు
ఆయనొక ప్రముఖ కంపెనీకి సీఈవో. పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన కంపెనీలో పని చేసే ఓ ఉద్యోగితో చిలక్కొట్టుడు యవ్వారానికి దిగాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఓ మ్యూజికల్ నైట్కు వెళ్లారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా ఉన్న టైంలో అనుకోకుండా కెమెరా వాళ్లవైపు తిరిగింది. అంతే సోషల్ మీడియా ఆ జంట గురించి కోడై కూస్తోంది.కోల్డ్ప్లే క్రిస్మార్టిన్ బుధవారం మాసెచూసెట్స్ స్టేట్ బోస్టన్లోని జిల్లెట్ స్టేడియంలో ప్రదర్శన ఇచ్చాడు. ప్రదర్శన కొనసాగుతున్న టైంలో.. కెమెరా హఠాత్తుగా ఓ జంట వైపు తిరిగాయి. అప్పటిదాకా ఒకరినొకరు వాటేసుకున్న ఆ ఇద్దరూ.. కెమెరా ఫోకస్ తమ మీద పడే సరికి సిగ్గుతో ముడుచుకుపోయారు. ఆపై ముఖాలు దాచేసుకుంటూ కనిపించారు. అయితే.. అందులో ఉంది ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బైరోన్. ఆస్ట్రానమర్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడుస్తున్న ఒక టెక్నాలజీ కంపెనీ. అయితే ఆయనతో ఆ వీడియోలో ఉన్నది ఆయన భార్య కాదు. ఆ కంపెనీలోనే చీఫ్ పీపుల్ ఆఫీసర్గా పని చేస్తున్న క్రిస్ట్రిన్ క్యాబెట్. ఈ వీడియోతో ఆ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న ప్రచారం తీవ్రతరమైంది. మరికొందరు పబ్లిక్ ఈ ఇద్దరు ఇలా పట్టుబడడంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతెందుకు.. Coldplay Drops the Beat And a Secret Office Romance!At a recent concert, @coldplay inadvertently revealed an alleged affair between @astronomer_zero CEO #AndyByron and his colleague Kristin Cabot, proving the band really knows how to bring secrets into the spotlight!… pic.twitter.com/LMAs9tnz2r— Photo News (@PhotoNewsPk) July 17, 2025క్రిస్మార్టిన్ సైతం ఈ వ్యవహారంపై సరదాగా స్పందించాడు. ఈ ఇద్దరినీ చూడండి.. బహుశా వీళ్ల మధ్య సంబంధం ఉందేమో లేకుంటే మాములుగానే సిగ్గుపడుతున్నారేమో అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు టిక్టాక్, రెడ్డిట్, ట్విటర్, ఇన్స్ట్రాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి. Damnit, Coldplay…#AndyByron pic.twitter.com/byy2RfqkNB— Coach Drew (@andy_stawicki2) July 17, 2025 CEO of Astronomer, Andy Byron (married with 2 kids) caught in 4K with the CPO of Astronomer, Kristin Cabot (also married) on the Jumbotron at Coldplay concert in Boston last night #astronomer #andybyron #kristincabot #astronomerceo #astronomercpo #coldplay #coldplayconcert pic.twitter.com/KjybeWVHVW— Meme Corp (@memecorpfail) July 17, 2025 lol 🤪 if they’d have just stuck it out and smiled for the #camera this would never have surfaced as virally as it did 😂 #Coldplay #Astronomer #AndyByron #kisscam #KristinCabot pic.twitter.com/6B8edsZBvU— Marie ☘️ (@7eights2nine10) July 17, 2025 Between Astronomer CEO Andy Byron Wife Megan Kerrigan and His CPO Kristin Cabot, who is more beautiful. Hi there Megan Kerrigan, you dont deserve that cheating dude. I can be all yours DM me. #ColdplayBoston #Coldplay #AstronomerCEO #andybyron pic.twitter.com/oe8ToIpc55— Derrick Groves (@DerricGroves) July 17, 2025 Me liking every tweet about the CEO and head of HR affair pic.twitter.com/0UsOrO4726— Ramp Capital (@RampCapitalLLC) July 18, 2025My low effort, painting for today pic.twitter.com/DHBjpLonUz— Travis Chapman (@Travispaints) July 17, 2025the wife watching this at home https://t.co/Sr0BhgCJAZ pic.twitter.com/ttHRRcqstL— Shreemi Verma (@shreemiverma19) July 17, 2025 ఇదిలా ఉంటే.. క్రిస్ట్రిన్ క్యాబెట్కు గతంలో వివాహం.. విడాకులు అయ్యాయి. మరోవైపు ఆండీ బైరోన్కు వివాహం అయ్యింది. ఆయన భార్య మేగన్ కెరిగన్ బైరోన్.. ఓ ప్రముఖ విద్యాసంస్థకు అసోషియేట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. తాజా వీడియో వైరల్ నేపథ్యంలో ఆండీ బైరోన్ పేరిట ఓ ప్రకటన వెలువడింది. అయితే అది వ్యంగ్యంగా ఉండడం గమనార్హం. ఫ్యాక్ట్చెక్లో అదొక పేరడీ పేజీ నుంచి సర్క్యులేట్ అయ్యిందని తేలింది. అధికారికంగా బైరోన్ దీనిపై ఎలాంటి ప్రకటన ఇవ్వేలదు. అయితే.. భర్తకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యాక.. ఆమె తన పేరులోని బైరోన్ను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించారు. అంతేకాదు.. ఆ అకౌంట్లనూ డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట విడాకులు ఖాయమనే చర్చ మొదలైంది. -
నీ గూడు చెదిరింది...
కొంగల గూళ్లు కూలిపోవడంతోపాటు వాటి పిల్లలు గాయాలతో మృత్యువాత పడ్డాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలివి. గోదావరిఖని అడ్డగుంటపల్లిలో రోడ్డు సమీపంలోని పెద్ద చింతచెట్టును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. దీంతో చెట్టుకొమ్మలపై పొదిగిన కొంగపిల్లలతో సేదదీరుతున్న వందలాది కొంగల గూళ్లు చెదిరిపోయాయి. కొమ్మల కింద పడిన పిల్లలు పెద్దసంఖ్యలో చనిపోగా.. చాలావరకు గాయపడ్డాయి. గాయపడిన కొంగలు కొమ్మలపైనే గురువారం తెల్లవారేదాకా అరవడంపై పర్యావరణ, పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కొంగపిల్లల ఖననం, తీవ్రంగా గాయపడిన వాటికి చికిత్స, గూడు చెదిరిన వాటిని మరోచోటికి తరలించడానికి రామగుండం నగరపాలక సంస్థ, అటవీ, పశువైద్యాధికారులు రంగంలోకి దిగారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సతీశ్, జిల్లా పశువైద్యాధికారి శంకర్తోపాటు వైద్యుడు పల్లె ప్రసాద్, సిబ్బంది చంద్రశేఖర్, హ్యాండ్స్ టూ సర్వ్ ఎన్జీవో వ్యవస్థాపకుడు దేవినేని అరవింద్స్వామి సేవలు అందించారు. కాగా, బతికిన కొంగలను కరీంనగర్లోని పార్క్కు తరలించారు. గాయపడిన కొంగల చికిత్సకు సుమారు రూ.8వేల వరకు తన సంస్థ ద్వారా వెచ్చించినట్లు అరవింద్స్వామి తెలిపారు. కాగా, చింతచెట్టు నరికివేతతో రామగుండం బల్దియాకు సంబంధం లేదని కమిషనర్ (ఎఫ్ఏసీ) అరుణశ్రీ స్పష్టం చేశారు. -
వామ్మో.. బిగ్బాస్ దివి బోల్డ్ లుక్.. ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్!
బిగ్బాస్ బ్యూటీ దివి బోల్డ్ లుక్..యూఎస్లో చిల్ అవుతోన్న బిగ్బాస్ బ్యూటీ ప్రియాంకజైన్..మోనికా సాంగ్ మూడ్లోనే బుట్టబొమ్మ పూజా హెగ్డే..ఇటలీలో బాలీవుడ్ భామ మలైకా అరోరా చిల్..కేరళ అడవుల్లో ప్రకృతిని ఆస్వాదిస్తోన్న నటి అభినయ.. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
రూ. 8.6 లక్షల మెన్స్ బ్యాగు, షాకవుతున్న నెటిజన్లు
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ (Louis Vuitton) ఇటీవల అరుదైన, విచిత్రమైన, ఖరీదైన ఉత్పత్తులతో వార్తల్లో నిలుస్తోంది. పారిస్లో జరిగిన మెన్స్ స్ప్రింగ్/సమ్మర్ 2026 షోలో ఈ సరి కొత్త బ్యాగ్ను లాంచ్ చేసింది. లైఫ్బాయ్ రింగ్లా వున్న ఈ బ్యాగు ధర చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. అదీ పురుషుల బ్యాగ్ ఇంత ధర పలకడం నెట్టింట సంచలనంగా మారింది.ఈ బ్యాగ్ ధర సుమారు 10,000 డాలర్లు, అంటే భారతీయ రూపాయల్లో రూ. 8,60,000. లూయిస్ విట్టన్ సిగ్నేచర్ మోనోగ్రామ్ లెదర్ కాన్వాస్తో దీన్ని తయారు చేసింది. చక్కటి స్టోరేజ్ స్పేస్తో బ్యాగ్లో మూడు వేర్వేరు జిప్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎడ్జస్టబుల్ లెదర్ స్ట్రాప్ కారణంగా భుజంపై లేదా క్రాస్-బాడీగగా వేసుకోవచ్చు. దీంతో లూయిస్ బ్రాండ్ అంతే మరి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ బ్యాగ్ సృజనాత్మక డిజైన్, కళా నైపుణ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ లగ్జరీ బ్యాగు హాట్ కేకుల్లా సేల్ కావడం విశేషమేమరి. లూయీ విటోన్ గతంలో విమానం, డాల్ఫిన్, లాబ్స్టర్ ఆకారంలో బ్యాగ్లను తయారు చేసిన చరిత్ర ఉంది. ఇవన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్ చేస్తే కోటీశ్వరుడుగా -
సర్పంతో ఆటలాడితే అంతే
భోపాల్: నాగ పామును మెడకు చుట్టుకొని, బైక్ నడుపుతూ సాహసం చేయబోయిన ఓ వ్యక్తి అదే పాము కాటు వేయడంతో మృతిచెందాడు. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాధితుడిని దీపక్ మహావర్గా గుర్తించారు. పాముతో బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీపక్ స్థానిక జేపీ కాలేజీలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పాములను పట్టడంలో నేర్పరిగా పేరుంది. వేలాది పాములను రక్షించి, సురక్షిత ప్రాంతాల్లో వదిలేశాడు. ఇటీవల నాగు పామును పట్టుకున్నాడు. దాన్ని అందరికీ చూపించాలని భావించాడు. అందుకే మెడకు చుట్టుకొని బైక్ నడిపాడు. కానీ, పాము అతడిని కాటు వేసింది. దీపక్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా తీసుకురావడంతో రక్షించలేకపోయామని డాక్టర్లు చెప్పారు. దీపక్ భార్య గతంలోనే మృతిచెందారు. అతడికి రౌనక్, చిరాగ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల మరణంతో వారు అనాథలుగా మారిపోయారు. -
వీసా అర్హతే.. హక్కుకాదు!
వాషింగ్టన్: అమెరికా వీసా దక్కడం అనేది చట్టబ ద్ధమైన హక్కు కాదని, అది కేవలం అమెరికాలోకి అడుగుపెట్టేందుకు అర్హత మాత్రమేనని ట్రంప్ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. వీసా దర ఖాస్తులదారులను హెచ్చరిస్తూ ఇప్పటికే పలు మార్లు పలురకాల అడ్వైజరీలు జారీచేసిన ట్రంప్ సర్కార్ తాజాగా మరో ప్రకటనను విడుదలచేసింది. దరఖాస్తుదారుల సామాజికమాధ్యమ ఖాతాల్లో గత వ్యాఖ్యానాలు, వీడియోలు, పోస్ట్లను జల్లెడపట్టి వెతికిమరీ అప్లికేషన్లను ప్రభుత్వం బుట్ట దాఖలుచేయడం తెల్సిందే. తాజాగా వీసా పొంది అమెరికా గడ్డపై అడుగుపెట్టాక చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వీసాను వెంటనే రద్దుచేసి, బహిష్కరించి బలవంతంగా స్వదేశానికి పంపుతామని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ అమెరికాలో ఉంటూ ఇతరులపై దాడికి పాల్పడటం, గృహ హింస, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడితే వెంటనే వీసా గడువును రద్దుచేసి దేశం నుంచి బహిష్కరిస్తాం. భవిష్యత్తులో మరోసారి అమెరికాకు రాకుండా శాశ్వతంగా నిషేధిస్తాం. మీరు అతిక్రమిస్తే ప్రభుత్వం సైతం వీసా గడువును ముగించి మిమ్మల్ని దేశం నుంచి వెళ్లగొడుతుంది’’ అని అమెరికా విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో స్పష్టంచేసింది. ‘‘వీసా పొందిన మీరు చట్టబద్ధంగా అమెరి కాలో ఉండేందుకు అర్హులు. ఆ సువర్ణావకాశాన్ని ఒక్క తప్పుతో చేజార్చుకోకండి. ఒక్క చిన్న నేరం చేసినా మీరు వీసా విషయంలో శాశ్వత విపరి ణామాలను చవిచూడాల్సి ఉంటుంది. ఇక్కడికొచ్చే ప్రతి ఒక్క సందర్శకుడు మా చట్టాల ను గౌరవించి తీరాల్సిందే’’ అని విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. -
అమెరికా స్టోర్లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్ : నెట్టింట చర్చ
భారతదేశానికి చెందిన మహిళను దొంగతనం ఆరోపణల కింద అమెరికాలో అరెస్ట్ చేశారు. ఇల్లినాయిస్ లోని టార్గెట్ స్టోర్ నుండి 1,300 డాలర్ల (సుమారు రూ.1.11 లక్షలు) విలువైన వస్తువులను దొంగిలించినట్టు ఆరోపణలు నమోదైనాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైఐరల్గా మారింది. తీవ్ర చర్చకు దారితీసింది.స్టోర్ ఉద్యోగుల ప్రకారం, విలువైన వస్తువులను కొట్టేసే ఆలోచనతోనే ఆ మహిళ ఏడు గంటలకు పైగా స్టోర్లో సంచరిస్తూ, తన ఫోన్ను నిరంతరం తనిఖీ చేసుకుంటూ కనిపించింది. చివరికి డబ్బు చెల్లించ కుండానే పశ్చిమ గేటు నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించిందని దీంతో వారు పోలీసులకు సమాచారం అందించించారు. దీంతో ఆమెను అమెరికా పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె చేతికి సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై నేరపూరిత దొంగతనం అభియోగం మోపారు. అయితే దీనిపై డబ్బులు చెల్లిస్తానంటూ క్షమాపణలు చెప్పిన మహిళ తాను ఇక్కడికి చెందిన దాన్ని కాదని, తన ఫ్యామిలీ ఇండియాలో ఉంది, వాళ్లకి ఫోన్ చేయాలి లేకపోతే నేను ఎక్కడ ఉన్నానో వారికి తెలియదు.. అమెరికాకు ఒంటరిగా వచ్చాను.. ఇంట్లో 20 ఏళ్ల కూతురు ఉంది అంటూ దీనంగా చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. చదవండి: Vidya Balan మైండ్ బ్లోయింగ్.. గ్లామ్ అవతార్, అభిమానులు ఫిదా!ఈ ఏడాది మే 1న జరిగినట్టుగా చెబుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో చర్చకు దారి తీసింది. అలా ఎలా చేసింది? అని కొంతమంది ప్రశ్నించగా, మరికొంతమంది దేశం పరువుతీసింది అంటూ విమర్శించారు. ఈ ఘనకార్యం కోసమేనా పాస్పోర్ట్తో విదేశాలకు వెళ్లింది. ఇలాంటి వారి వల్లనే అమెరికా సోషల్ మీడియా భారతీయుల పట్ల ద్వేషం, అసహ్యంతో నిండిపోయింది అని మరొకరు కమెంట్ చేశారు."ప్రపంచ వేదికపై భారతదేశానికి తలవంపులు తెచ్చి పెడుతోంది. విదేశాలలో దేశానికి అవమానం తీసుకురావద్దు. గౌరవంగా ప్రవర్తించండి అని మరొకరు హితవు పలకడం విశేషం. నోట్: అయితే ఆ మహిళ ఏ ప్రదేశానికి చెందినవారు, ఎవరు? అనే వివరాలేవీ అందుబాటులో లేవు. -
సోషల్ ట్రెండ్స్..! జంతుప్రేమికులు ఇష్టపడేలా..
మొన్న గిబ్లీ ఆర్ట్.. నిన్న బేబీ పాడ్కాస్ట్.. నేడు ‘యానిమల్ వ్లాగ్’, అవెంజర్స్, హల్క్ విడియోస్.. ఇలా సోషల్ మీడియాలో రోజుకో వింత ట్రెండ్ అవుతోంది.. సామాజిక మాధ్యమాల్లో ఏఐ హవా కొనసాగుతుంది. ఒక్కో నెల ఒక్కో ఏఐ స్పెషల్స్తో నెటిజన్లు సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏఐ ట్రెండింగ్ యుగం కొనసాగుతోంది. ఐదు నెలల క్రితం గిబ్లీ ఆర్ట్తో సోషల్మీడియా హోరెత్తింది. ఎటుచూసినా గిబ్లీ ఆర్ట్ ఫొటోలతో నెటిజన్లు, ప్రజలు సందడి చేశారు. రెండు నెలల క్రితం బేబీ పాడ్కాస్ట్, బేబీ ఏఐ వీడియోలు వైరల్ అయ్యాయి. నేడు యానిమల్ వ్లాగ్, అవెంజర్ హల్క్ వీడియోస్ నెటిజన్లను అలరిస్తున్నాయి. ఏఐతో ట్రావెలర్స్, ఫ్రెండ్స్ ట్రావెలింగ్తో చేసే వ్లాగ్ వీడియోస్ మంకీ, చింపాజీలు చేసేలా చేసి నెటిజన్లను నవ్విస్తున్నారు. సోషల్ మీడియాలోని ఇన్స్టా, ఫేస్బుక్లతో పాటు అన్ని యాప్లలో యానిమల్ వ్లాగ్, అవెంజర్, హల్క్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. అవెంజర్, హల్క్ తెలంగాణకు వస్తే, ఒక అవ్వ చేతి మనవడిగా సరదా సరదా సంభాషణల వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఛాట్జీపీటీ యానిమల్ వ్లాగ్, అవెంజర్ హల్క్ వీడియోస్ చేస్తున్నారు. ఇక జంతుప్రేమికులైతే ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారు. మరికొందరు ముందడుగేసి యానిమల్ వ్లాగ్గా మార్చేస్తున్నారు. (చదవండి: చిట్టి చేతుల్లో స్క్రీన్.. అంతటా అదే సీన్..) -
అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!
ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ మరో ఆసక్తికరమైన, మర్చిపోలేని అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తిపేశ్వర్ (Tipeshwar, Maharashtra అడవిలో అద్భుతమైన దృశ్యాలు ఆయన కంటపడ్డాయి. అది చూసి ఆయన హృదయం మైమర్చి పోయిందట. గాలికి ఊగిసలాడే ప్రతీ ఆకు ఒక కథను వినిపిస్తుంది అంటూ పులకించిపోతూ తన అనుభవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆకు కదలినా వినిపించే నిశ్శబ్ద వాతావరణంలో ఒక్క క్షణం గుండె ఆగిపోయే దృశ్యాన్నిగాంచిన వైనాన్ని పంచుకున్నారు.పులి కనిపించిన ఆ మరపురాని క్షణం-నిశ్శబ్దంగా, రాయల్గా తమ కళ్ల ముందునుంచి ఒక పులి వెళ్లిన దృశ్యాలనువర్ణించారు. ఒక్క క్షణం శ్వాసం ఆగిపోయినంత పని. ఇక్కడితో అయిపోలేదు. ఆ క్షణాలను అలా ఆస్వాదిస్తూ ఉండగానే, చిరుతపులి వచ్చింది. తనదైన వేగంగా, అలా కళ్లముందునుంచి శరవేగంగా కదిలి పోయింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అడవిలో అందం అలా వచ్చి అలా మాయమై పోతుందనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.పులి గర్జన చెట్ల గుండా ప్రతిధ్వనిండచమేకాదు మనం రక్షించుకోవాల్సింది , గౌరవించుకోవాల్సింది ఒక భూమిని మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అనే ఆలోచనను రగిలించింది. అదొ క నిశ్శబ్ద వాగ్దానం. పక్షులతో పాటు ఎన్నో మరెన్నో.. అడవిని సజీవ సింఫొనీగా మలిచే రావాలు. ఇవన్నీ అత్యంత మరపురాని రోజులకు నేపథ్య సంగీతమని చెప్పుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రయాణం కాదు. అంతకుమించినలోతైన అనుభవం అన్నారు. తిపేశ్వర్లో తాము చూసినవి కేవలం జంతువులను కాదు, ప్రకృతి మనకంటే చాలా కాలం ముందు రచించుకున్న కవితలోని పద్యాలు. మనం అదృష్టవంతులైతే ఈ అందమైన ప్రకృతిని సజీవంగా ఉంచడంలో సహాయం లభిస్తుందన్నారు.ఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు Lost in the wild heart of Tipeshwar — where every rustling leaf hinted at an untold story, and every shifting shadow held the thrill of the unknown. 🌿🐅That unforgettable moment when the tiger appeared — silent, regal, and commanding — it felt like time held its breath. A gaze… pic.twitter.com/cfZ8nnxjIg— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 15, 2025 -
లండన్ సమీపంలో కూలిపోయిన విమానం
లండన్: యూకే రాజధాని లండన్కు 58 కిలోమీటర్ల దూరంలో సౌతెండ్ ఎయిర్పోర్ట్లో ఆదివారం సాయంత్రం ఒక విమానం కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో తొమ్మిది మంది ప్రయాణి కులు, ఇద్దరు పైలట్లు ఉన్నట్లు తెలిసింది. అయితే, ప్రాణ నష్టం వాటిల్లిందా? అనే వివరాలు తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. తొలుత భారీ అగి్నగోళం, తర్వాత దట్టమైన నల్లటి పొగలు వెలువడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చాలా తీవ్రమైన ప్రమాదం అని పోలీసులు చెప్పారు. కూలిపోయింది చిన్నపాటి విమానమేనని తెలిసింది. సౌతెండ్ నుంచి నెదర్లాండ్స్లోని లెలీస్టడ్ సిటీకి బయలుదేరుతుండగా ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయినట్లు సమాచారం. -
వీసా వచ్చిందని మురిసిపోకండి.. ట్రంప్ సర్కార్ కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: వీసా కష్టాల కడలిని ఈది అమెరికాలో అడుగుపెట్టాక సైతం వీసాదారులపై ‘స్క్రీనింగ్’ కత్తి వేలాడుతూనే ఉంటుందని ట్రంప్ సర్కార్ స్పష్టంచేసింది. ఏ చట్టాలు, నిబంధనల ప్రకారం విదేశీయులకు వీసా మంజూరు చేశామో అవే చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను ఇక్కడికొచ్చాక అతిక్రమిస్తున్నట్లు తేలితే వెంటనే బహిష్కరించి దేశం నుంచి వెళ్లగొడతామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం శనివారం ఒక అడ్వైజరీని విడుదలచేసింది.‘‘అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్, టెలిగ్రామ్, లింక్డ్ఇన్ వంటి మీ సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలు ఇచ్చారు. అమెరికా వ్యతిరేక, హమాస్ ప్రతికూల సోషల్మీడియా పోస్ట్లు, వీడియోలు, వ్యాఖ్యానాలు ఉంటే ఆయా దరఖాస్తుదారులకు వీసాలను తిరస్కరించాం. అంతా సక్రమంగా ఉండి వీసాలు పొందిన విదేశీయులు ఆనందపడాల్సిన పనిలేదు. వీసాలు మంజూరైనా సరే మీపై సోషల్మీడియా ‘స్క్రీనింగ్’ప్రక్రియ ఇక మీదటా కొనసాగుతుంది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్ట్లపై ఓ కన్నేస్తాం. అమెరికా గడ్డపై ఉంటూ మా చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వెంటనే వీసాను రద్దుచేస్తాం. అలాంటి వ్యక్తులను బహిష్కరించి దేశం నుంచి వెళ్లగొడతాం’’అని అడ్వైజరీ ద్వారా అమెరికా హెచ్చరించింది.‘అమెరికాలో ఉన్నంతకాలం ఇక్కడి చట్టాల ప్రకారం నడుచుకోవాలి. వీసా స్క్రీనింగ్లో భాగంగా మీ సోషల్మీడియా అకౌంట్లలోని పోస్ట్లు, వీడియోలు, వ్యాఖ్యానాలను ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించేందుకు వీలుగా అందరికీ కనిపించేలా సెట్టింగ్లను ‘పబ్లిక్’మోడ్లోనే కొనసాగించండి. జాతీయ భద్రతకు లోబడే వీసా జారీ అనేది ఉంటుంది. అందుకే ఎఫ్,ఎం,జే ఇలా ప్రతీ వీసాదారుడు ఈ నిబంధనలను అనుసరించాలి’ అని సూచించింది. -
యూఎస్కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు! -
ఘోరం... ఇది దారుణం!
‘గర్భ’ గుడిలో జీవం పోసుకోవటంతో మొదలై కడదాకా అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటున్న ఆడపిల్లకు మృత్యువు తరచు తారసపడుతుంటుంది. అది పుట్టినిల్లా, మెట్టినిల్లా, నడివీధా, జనసమ్మర్ధం లేని ప్రాంతమా అనే తారతమ్యం లేదు. హంతకులు ఏ రూపంలో వుంటారో, ఎక్కడ కాపుగాస్తారో తెలియదు. తండ్రా, సోదరుడా, కట్టుకున్నవాడా, అపరిచితుడా అనే తేడా కూడా లేదు. ఉసురు తీసేవాడు ఎవడైనా కావొచ్చు. కారణం ఏదైనా ఉండొచ్చు. హరియాణాలోని గురుగ్రామ్లో కన్నతండ్రే కాలయముడై నిష్కారణంగా తన కంటిపాపను చిదిమేసిన ఈ ఉదంతం దిగ్భ్రాంతికరమైనది. తండ్రి దీపక్ యాదవ్ తుపాకి గుళ్లకు బలైపోయిన టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ చేసిన ‘నేరం’ ఏమీ లేదు. చిన్న వయసులోనే ఆ క్రీడలో రాణించి, ప్రతిభా పాటవాలు సొంతం చేసుకుని, అంచెలంచెలుగా ఎదగటమే ఆమె నేరం. కేవలం ఇరవై అయిదేళ్లకే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ సర్క్యూట్లో ఆమె ర్యాంకు 113. ఆ విధంగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా కూడా నిరూపించుకుంది. సొంతంగా టెన్నిస్ అకాడెమీ నెలకొల్పింది. తన వంటి బాలికలకు శిక్షణనిస్తున్నది. వారు ఎదగటానికి ఆసరాగా నిలు స్తున్నది. అటువంటి రాధిక, కన్నతండ్రికి కంట్లో నలుసుగా మారిందంటే నమ్మగలమా? ఆమెను కాల్చిచంపటం తప్ప మరో దారిలేదని విశ్వసించాడంటే ఊహించగలమా? యువతరంలో చాలా మందికి ఆ వయసుకల్లా ఏం ఎంచుకోవాలో, ఎటుపోవాలో తెలియని అయోమయం ఆవరిస్తుంది. సంకోచం వెనక్కు లాగుతుంది. కింకర్తవ్య విమూఢత కాటేస్తుంది. ఆశించిన ఉద్యోగం అందక, ఇష్టంలేని కొలువుతో సరిపడక నిస్పృహలో కూరుకుపోతారు. కానీ రాధిక అలా కాదు. టెన్నిస్ రంగంలో ఎదిగి ఒక సానియా మీర్జాలా, ఒక సెరెనా విలియమ్స్లా మెరిసిపోవాలనుకుంది. ఇప్ప టికే రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి ఎన్నో అవార్డులూ, రివార్డులూ సాధించింది. జాతీయ స్థాయి టెన్ని స్లో సైతం స్థానం సంపాదించుకోవాలని తపన పడుతోంది. కన్నవారికే కాదు... దేశానికే పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలదన్న భరోసానిచ్చింది. ఇవన్నీ ఆమె తండ్రి దృష్టిలో నేరాలయ్యాయి. రాధికా యాదవ్ ఉదంతం మనందరం నమ్ముతున్న విలువల్ని ప్రశ్నార్థకం చేస్తోంది. చిన్ననాటి నుంచీ టెన్నిస్లో ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించినవాడే హఠాత్తుగా ఎలా హంతకుడయ్యాడు? మెచ్చిన నోటితోనే దుర్భాషలాడే స్థితికి అతగాడు చేరటం వెనకున్న పరిణామాలెలాంటివి? పోలీ సులకిచ్చిన వాంగ్మూలంలో అతను ప్రస్తావించిన అంశాలు వింటే ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న మన సమాజం నిజస్వరూపం బట్టబయలవుతుంది. అంతా సవ్యంగా వుందని ఆత్మవంచనతో బతికేవారిని నిలదీస్తుంది. అందరూ దీపక్లాగే స్పందించక పోవచ్చుగానీ ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల్లో చాలామందికి కన్నకూతురు గురించి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడటం, ఆమెను చిన్నచూపు చూడటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కనబడుతూనే వుంటుంది. ఇలాంటి దుర్మార్గ ధోరణులను ప్రతిఘటించాల్సిన దీపక్ యాదవ్ తానూ ఆ తానులో ముక్కయ్యాడు. వారు ప్రవచిస్తున్న విలువల పరిధిలో, పరిమితిలో వుండకుండా కుటుంబాన్ని రాధిక వీధిన పడేస్తున్నదని అపోహపడ్డాడు. టెన్నిస్ క్రీడ గురించీ, తానిస్తున్న శిక్షణలో పాటించే ప్రమాణాల గురించీ ఆమె చేసిన వీడియోపై వచ్చిన కామెంట్లు తట్టుకోలేక సోషల్ మీడియా ఖాతాను అప్పటికే తీయించేశాడు. అకాడెమీని సైతం మూసేయాలన్న సలహా కూడా పాటించాలని కోరుకున్నాడు. దాన్ని తిర స్కరించిందన్న ఉన్మాదంతో మానవత్వాన్ని మరిచాడు. కూతురి సంపాదనపై బతుకుతున్నావని ఛీత్కరించిన మృగాల్లో కనీసం ఒక్కరికి తన లైసెన్స్ రివాల్వర్ను గురిపెట్టివుంటే ఆ బాపతు నోళ్లు మూతబడేవి. స్వయంశక్తితో ఎదుగుతున్న కన్నకూతురి కోసం దృఢంగా నిలబడిన ఒక మంచి నాన్నగా నిలిచేవాడు. ఏమైంది ఇవాళ? యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి హంతకుడిగా మిగిలాడు! ఆడపిల్లను పెంచటం, ఆమె అభీష్టానికి అనుగుణంగా ఎదగనివ్వటం, ఇష్టపడిన చదువు చది వించటం, కోరుకున్న వాడికిచ్చి పెళ్లిచేయటం వర్తమానంలో పెను సవాలుగా మారిందన్నది వాస్తవం. తల్లిదండ్రులు విద్యావంతులైనా, ఉన్నతోద్యోగాలు చేస్తున్నా, సమాజం పెట్టిన ప్రమాణా లను ఆడపిల్ల మీరితే ఎలా అన్న విచికిత్సలో పడుతున్నవారు చాలామందే తారసపడతారు. వారిలో అనేకులు చుట్టూవున్నవారి ఒత్తిళ్లకు లొంగి ఇంటి ఆడపిల్లను అదుపు చేయటానికి ప్రయ త్నించేవారే. ఆ క్రమంలో అనేకమంది పిల్లలు తమ ఇష్టాలను వదులుకుని బతుకులు వెళ్లదీస్తు న్నారు. అసలు బయటికెళ్లిన ఆడపిల్ల సురక్షితంగా ఇంటికొస్తుందో లేదో తెలియని ఆందోళనతో నిత్యం భయంభయంగా బతుకుతున్న తల్లిదండ్రులకు మేమున్నామంటూ భరోసానిచ్చే వ్యవస్థలు న్నాయా? సామాజిక కట్టుబాట్ల పేరుతో రూపొందుతున్న తప్పుడు విలువలు ఇళ్లల్లోకి చొరబడకుండా, వాటి దుష్ప్రభావాలు కుటుంబాలపై పడకుండా నివారించే సంస్కృతి ఆచూకీ ఏది? మన ప్రభుత్వాలు తీసుకుంటున్న కనీస చర్యలేమిటి?ఆడవాళ్లను కించపరిచే సినిమాలనూ, ఇతరేతర మాధ్యమాలనూ ఏ మేరకు కట్టడి చేయగలుగుతున్నాం? ఎటువంటి వివక్షకూ తావు లేకుండా దేశ పౌరులందరికీ సమాన అవకాశాలు లభించాలన్న మన రాజ్యాంగం సక్రమంగా అమలవు తున్నదా? ఇవన్నీ సరిగా లేనప్పుడు దీపక్లాంటివారు రూపొందుతారు. వారికి నారూ నీరూ పోస్తున్నవారు ఎప్పటికీ పదిలంగా వుంటారు. రాధికా యాదవ్ వంటి మణిపూసలు నిస్సహాయంగా నేల రాలుతారు. -
రోడ్డు పరిశీలనలో అపశృతి.. ప్రాణ భయంతో అధికారుల పరుగో పరుగు..
అధికారుల అవినీతికి అద్ధం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంజినీర్లు, అధికారుల సమక్షంలోనే ప్రభుత్వం చేపట్టిన కాంట్రాక్ట్ డొల్లతనం బయటకు వచ్చింది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారుల అవినీతకి ప్రత్యక్ష సాక్ష్యం అంటూ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందే..వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వాడ్వానీ తాలూకాలోని ఖడ్కి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో, ఈ మార్గంలో కొత్తగా బ్రిడ్జి నిర్మించి.. రోడ్డు వేయాలని స్థానికులు, విద్యార్థులు అధికారులను కోరారు. అంత వరకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు. ఇంతలో ఓ ఇంజినీరు మాత్రం అతికి పోయి.. అదే మార్గంలో పైపులు వేసి.. రోడ్డు నిర్మాణం చేపట్టాడు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద చిన్న బ్రిడ్జిలాగా పైపులైన్పై రోడ్డు నిర్మించారు. అనంతరం, రోడ్డు నిర్మాణ పనులను సమీక్షించేందుకు ఇంజినీర్, అధికారుల బృందం అక్కడికి చేరుకున్నారు. అనంతరం, వారు నిర్మించిన రోడ్డుపై లారీ వస్తున్న సమయంలో.. రోడ్డు కుంగిపోయి.. ఆ లారో బోల్తా కొట్టింది.ఈ క్రమంలో భయంతో వణికిపోయిన అధికారుల బృందం.. పరుగులు తీశారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అనే విధంగా ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. ఓ అధికారి అయితే.. పక్కనే నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి బురద నీటిలో దాక్కునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది అధికారుల అవినీతికా ప్రత్యక్ష సాక్ష్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Engineer and his entire team had arrived in Beed, Maharashtra to inspect the road.During the inspection, a truck got stuck on the road and overturnedThis is the live demo testing of Corruption 🤡pic.twitter.com/InEpS94e3z— 🚨Indian Gems (@IndianGems_) July 10, 2025 -
‘స్వ’యంకృతం
రీల్స్, షార్ట్స్ చూడందే పొద్దు గడవని రోజులు వచ్చేశాయి. ఎక్కడ చూడండి, ఎవరిని చూడండి, ఎప్పుడు చూడండి.. వీటిలోనే లీనమైపోయి కనిపిస్తుంటారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలకు అతుక్కుపోతున్నారు. ఒకసారి ఈ రీల్స్ లేదా షార్ట్స్ ప్రపంచంలోకి వెళ్లామంటే.. వరుసపెట్టి ఎన్ని చూస్తామో మనకే తెలీదు. ఈ షార్ట్ వీడియోలు మనల్ని ఎందుకు ఇంతలా కట్టిపడేస్తున్నాయి? ఎందుకంటే అవి మనల్ని నవ్విస్తాయి. కవ్విస్తాయి. కబుర్లు చెబుతాయి. చాలావాటిలో మన చుట్టుపక్కల వాళ్లే కనిపిస్తారు. అన్నిటినీ మించి – సెకన్లలో, నిమిషాల్లో కొద్దిపాటి నిడివితో ముగుస్తాయి. ఒకప్పుడు కాలక్షేపంతో మొదలైన ఈ వీక్షణ ఇప్పుడు ఓ వ్యసనంలా మారింది. స్వ.. షార్ట్ వీడియోల వ్యసనం (ఎస్వీఏ) అని పిలిచే ఈ వ్యసనం వల్ల మన మెదడు పనితీరే మారిపోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి బాంబును పేల్చింది. రీల్స్, షార్ట్స్, వగైరాలను చూసే అలవాటు కనుక మితిమీరితే మెదడులోని ‘రీవైరింగ్’ ప్రక్రియ గతి తప్పి మనిషి మనస్తత్వంలో ప్రతికూల మార్పులు సంభవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. సుప్రసిద్ధ సైన్స్ జర్నల్ ‘న్యూరోఇమేజ్’లో వచ్చిన ఈ పరిశోధనా వ్యాసం ప్రధానంగా షార్ట్–ఫామ్ వీడియోల వ్యసనం (ఎస్వీఏ – స్వ) వల్ల ప్రవర్తనల్లోని పెను మార్పుల గురించి చర్చించింది. ‘స్వ’ మెదడు కార్యకలాపాలను తారుమారు చేయగలదని, వాటికి అలవాటు పడిన వారిని మరింత ఉద్వేగభరితంగా, ఆర్థిక నష్టాలను సైతం పట్టించుకోనంతగా మొద్దుబారేలా చేస్తుందని ఈ కొత్త బ్రెయిన్ ఇమేజింగ్ అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు, ఇలాంటివారు తొందర పడి తక్షణ నిర్ణయాలు తీసుకుంటారని, ఆ నిర్ణయ దుష్ఫలితాల పట్ల కూడా అవసరమైన స్పందన చూపించరని పేర్కొంది. తద్వారా వ్యక్తిగతంగా, వృత్తిలోనూ వారి అభివృద్ధి కుంటు పడుతుందని తెలిపింది.మెదడు దారి తప్పుతోంది..‘స్వ’ అన్నది జూదం, మాదకద్రవ్య వినియోగం వంటి వ్యసనాల కంటే తక్కువేమీ కాదని తెలిపింది. ఈ రెండు రకాలైన వ్యసనాల్లోనూ వ్యక్తులు దీర్ఘకాలిక పరిణామాలను విస్మరించి, తక్షణ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారని అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా – నిర్ణయాలు తీసుకోవటానికి, నియమాలను పాటించటానికి కారణమయ్యే మెదడులోని ప్రదేశాలు తమ తీరు మార్చుకుని దారి తప్పుతున్నట్లు అధ్యయనం కనిపెట్టింది. ఊటబావుల్లాంటివి షార్ట్–ఫామ్ వీడియోలు ఊటబావుల వంటివి. స్క్రోలింగ్ చేయటానికి ఓపిక ఉండాలే కానీ వాటిల్లో అంతులేని కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ కూడా మనకు నచ్చేలా, మనకు సంబంధించిన విషయమని అనిపించేలా ఉంటుంది. వాటి వల్ల తక్షణ మానసిక సంతృప్తి లభిస్తుంది. అదొక తీరని దాహం అవుతుంది. దీంతో మెదడు ఒత్తిడికి గురై, మెదడు ‘రీవైరింగ్’ పని తీరులో మార్పులు సంభవిస్తాయి. పర్యవసానంగా ప్రమాదాలను పసిగట్టే, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. ‘చివరికి అది ఎంతవరకు దారి తీస్తుందంటే – బతుకు బండిని నడిపించే డబ్బు విషయాల్లో జరిగిన నష్టాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు’ అని అధ్యయనం తెలిపింది. మెదడు ‘రీవైరింగ్’ అంటే? రీవైరింగ్నే మెదడు పునఃశిక్షణ, న్యూరోప్లాస్టిసిటీ అని కూడా అంటారు. మెదడు నిరంతరం, జీవితాంతం కొత్త నాడీ సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఆ విధంగా తన పునర్వ్యవస్థీకరణ సామర్థ్యాన్ని వినియోగించుకుంటుంది. మనిషి తన అనుభవాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటానికి, గాయాల నుంచి కోలుకోవటానికి; అలవాట్లను, ఆలోచనా విధానాలను మార్చుకోవటానికి అనుమతిస్తుంది. అయితే షార్ట్–ఫామ్ రీల్స్ను అదేపనిగా చూసే అలవాటు మెదడు ఇలా రీవైరింగ్ చేసుకోవటాన్ని నిరోధిస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది.నిద్రలేమి... నిరాశ నిస్పృహలు‘స్వ’.. మొత్తం ప్రపంచ ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించింది. తాజాగా అధ్యయనం జరిగిన చైనాలో వినియోగదారులు సగటున రోజుకు 151 నిమిషాలు ఈ వీడియోలనే చూస్తూ గడుపుతున్నారు. దాదాపు 95.5 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు వీటిలోనే నిమగ్నమై ఉంటున్నారు. ఈ తీవ్రత.. ఏకాగ్రత, నిద్ర, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, నిరాశాæ నిస్పృహలను దరిచేర్చే ప్రమాదం ఉందని చైనాలోని టియాంజిన్ నార్మల్ విశ్వవిద్యాలయం సైకాలజీ ప్రొఫెసర్, అధ్యయన కర్త కియాంగ్ వాంగ్ అంటున్నారు. ఎందుకు స్పందించడం లేదు?ముఖ్యంగా, ‘స్వ’ ఉన్నవారిలో ఆర్థిక నష్టాల పట్ల పట్టింపు ఎందుకు ఉండటం లేదో కనుగొనాలని పరిశోధనా బృందం ప్రయత్నించింది. లాభాల కంటే నష్టాలకు ఎక్కువగా స్పందించే ధోరణిని.. నిర్ణయం తీసుకోవడంలో ముందు జాగ్రత్త లక్షణంగా పరిగణిస్తారు. ఈ లక్షణం ప్రమాదకర ప్రవర్తనను నివారించడానికి సహాయపడుతుంది.జూదం, మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలైన వారు తమ ఆర్థిక నష్టాల పట్ల కాస్తయినా స్పందనను చూపుతుండగా, షార్ట్–ఫామ్ వీడియో వ్యసనంలో ఇందుకు భిన్నంగా ఉండటానికి కారణాన్ని మాత్రం అధ్యయం కచ్చితంగా తేల్చలేకపోయింది. దానిని కనిపెట్టటానికి వారు ఈ రెండు రకాల వ్యసనాల కంప్యూటేషనల్ మోడలింగ్ (డీడీఎం), న్యూరోఇమేజింగ్ (ఎఫ్ఎంఆర్ఐ)లను ఆశ్రయించారు. కారణాల కోసం అన్వేషిస్తున్నారు. యువతపై తీవ్ర ప్రభావంఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ గతంలో నిర్వహించిన అధ్యయనంలో యుక్త, మధ్య వయస్కుల్లో.. షార్ట్స్, రీల్స్ చూడటం వల్ల ఒక పని మీద ధ్యాస, శ్రద్ధ ఉండకపోవడం గమనించారు. ముఖ్యంగా రకరకాల అంశాలకు సంబంధించిన చాలా స్వల్ప వ్యవధి వీడియోలు మార్చి మార్చి చూడటం వల్ల... యువత ఒక సమయంలో ఒకే పనిమీద పూర్తి శ్రద్ధ పెట్టలేకపోతున్నారని తేలింది. దేశంలోని నెట్ వినియోగదారుల్లో 80 శాతానికిపైగా షార్ట్ ఫామ్ వీడియోలు రోజూ వీక్షిస్తున్నారు. ఇండియాలో నెట్ యూజర్లు రోజుకు గంటకుపైగానే షార్ట్–ఫామ్ వీడియోలు చూస్తున్నారని ఒక అంచనా. -
జిమ్లో కృతి కర్బందా వర్కవుట్స్.. ప్రగ్యా జైస్వాల్ గ్లామరస్ లుక్!
జిమ్లో హీరోయిన్ కృతి కర్బందా కసరత్తులు...హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గ్లామరస్ లుక్..శారీలో నభా నటేశ్ హోయలు..కలర్ ఫుల్ శారీలో బాలీవుడ్ భామ శిల్పా శెట్టి.. View this post on Instagram A post shared by Nyrraa M Banerji (@nyra_banerjee) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
రూ. 1.6 కోట్ల జీతం, అయినా అమెరికాలో ఇండియన్ టెకీ జీవితం ఇదీ!
అమెరికాలో కొలువు, అదీ ఐటీ కంపెనీలో ఉద్యోగం అనగానే ఏడంకెల జీతం... లైఫ్ సెట్ అనుకుంటాం. కోట్ల రూపాయలు, తక్కువలో తక్కువ లక్షల రూపాయల ప్యాకేజీ, లగ్జరీ లైఫ్ అని భావిస్తాం కదా. కానీ న్యూయార్క్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక భారతీయ యువతి అనుభవం వింటే మాత్రం ‘అవునా.. నిజమా’అని ఆశ్చర్యపోక తప్పదు. ప్రముఖ సెర్చి ఇంజీన్ కంపెనీ గూగుల్లో న్యూయార్క్ నగరంలో టెకీగా పనిచేస్తోంది ఇండియాకు చెందిన మైత్రి మంగళ్. ఆమె జీతం ఏడాదికి రూ.1.6 కోట్లు. పాడ్కాస్టర్, రచయిత కుశాల్ లోధాతో, మంగళ్ అమెరికాలో జీతం, నెలవారీ ఖర్చుల గురించి చేసిన చర్చ ఇపుడు నెట్టింట వైరల్గా మారింది. నెల ఖర్చులు, తిండి, ఇంటి అద్దె ఖర్చులతో పోలిస్తే ఇది ఎంత అంటూ తన గోడును వెళ్లబోసుకుంది.ఈ వివరాలను లోధా సోషల్ మీడియాలో షేర్ చేశారు. "Googleలో సగటు ప్యాకేజీ ఎంత? అని Googleలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైత్రిని అడిగాను. సాధారణంగా రూ.1.6 కోట్లు ఉంటుందని పంచుకుంది" అని లోధా చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం న్యూయార్క్లో అపార్ట్మెంట్ అద్దె సుమారు రూ.2.5 లక్షలు. నెలవారీ ఖర్చురూ.4.2 లక్షలు. ఇది కాకుండా బయట తినడం, కిరాణా సామాగ్రి , ఎంటర్టైన్మెంట్ సహా ఇతర ఖర్చులు సుమారు రూ. 85,684-రూ. 1,71,368 వరకు ఉంటాయి. ప్రయాణ ఖర్చులు మరో రూ. 8,568-రూ. 17,136 దాకా అవుతాయి. View this post on Instagram A post shared by Kushal Lodha (@kushallodha548) ఇది చూసిన నెటిజన్లు ఔరా అంటూ నోరెళ్ల బెట్టారు. భారీ జీతం, న్యూయార్క్లాంటి గ్లోబల్ నగరాల్లో అసలైన జీవితం అంటూ కమెంట్స్ చేశారు.అన్నట్టు ఈ వీడియోనుమైత్రి మంగళ్కు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆమెకు 173 వేల మంది అనుచరులు ఉన్నారు. -
గుండెపోటు భయాలు.. ఆ ఒక్క ఆస్పత్రికే వేలమంది క్యూ!
గుండె సమస్యలతో ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోతున్న ఉదంతాలు నిత్యం చూస్తున్నాం. కర్ణాటక హసన్ జిల్లాలో 40 రోజుల వ్యవధిలో 23 మంది మరణించారు. ఈ కథనాలు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందునా 25-40 మధ్యవయసున్న వాళ్లే ఎక్కువగా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది.దేశంలో నిత్యం ఏదో ఒక మూల హఠాన్మరణం ఘటన చోటు చేసుకుంటోంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వ్యక్తులు, ఎలాంటి అరోగ్య సమస్యలు లేని వ్యక్తులు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణం విడుస్తున్నారు. హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్టులతోనే వాళ్లు చనిపోతున్నారని డాక్టర్లు సైతం నిర్ధారిస్తున్నారు. దీంతో కొందరు ఎలాంటి లక్షణాలు లేకున్నా పోటు తప్పదని అంచనాకి వస్తున్నారు. ఈ క్రమంలో..ముందస్తుగా గుండె పరీక్షలు చేయించుకుంటున్నారు. కర్ణాటక మైసూర్లోని ప్రముఖ జయదేవ ఆస్పత్రికి గత మూడు నాలుగు రోజుల నుంచి వేలమంది జనం క్యూ కట్టారు. ఓపీ కోసం వేకువ జాము నుంచే ఆస్పత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. క్యూ లైన్లలో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. మైసూర్తో పాటు బెంగళూరు బ్రాంచ్ ముందు కూడా ఇదే పరిస్థితి. జయదేవ ఆస్పత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అటానమస్ ఆస్పత్రి.ಮೈಸೂರು: ರಾಜ್ಯದಲ್ಲಿ ಹೃದಯಾಘಾತ ಹೆಚ್ಚಿದ ಹಿನ್ನಲೆ, ಜಯದೇವ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆಯಿಂದಲೇ ಕ್ಯೂ.#mysore #jayadevahospital #newskarnataka pic.twitter.com/KJDtN2DwwV— News Karnataka (@Newskarnataka) July 8, 2025VIDEO Credits: News Karnatakaఅయితే మీడియా కథనాలతో, సోషల్ మీడియా ప్రచారాలతో ఆందోళన చెందవద్దని జయదేవ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కేఎస్ సదానంద ప్రజలకు సూచిస్తున్నారు. ‘‘జనాలు అంతా ఒక్కసారిగా ఇక్కడికి ఎగబడినంత మాత్రాన.. సమస్య పరిష్కారం కాదు. కేవలం పరీక్షలు చేసుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఊహాగానాలకు అతిగా స్పందించొద్దు. మీరు ఆస్పత్రులకు ఎగబడడం వల్ల.. అత్యవసర పరిస్థితి ఉన్న రోగులకు చికిత్సలో అంతరాయం కలగవచ్చు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకున్న మాత్రాన సమస్య పరిష్కారం కాదు. మంచి ఆహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి’’ అని సూచించారాయన.హసన్ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. వీటిపై విచారణకుత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తాజాగా నివేదికను సమర్పించింది కూడా. అదే సమయం కోవిడ్ వ్యాక్సిన్ల పనితనం గురించి ఆయన అనుమానాలు వ్యక్తం చేయగా.. కేంద్ర ఆరోగ్య శాఖ పలు అధ్యయనాలను ప్రస్తావిస్తూ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. -
‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ : పిల్ల గుంపు వీడియో వైరల్
ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో మన ముందుంటుంది. కింగ్ కోబ్రా అయినా పులులు, సింహాలైనా, ఏనుగులైనా ఆకర్షణీయమైన వీడియోలు హల్ చల్ చేస్తూ ఉంటాయి. వర్షాలకు పరవశంతో ఆటుకుంటున్న పిల్ల ఏనుగుల వీడియో ఒకటి నెట్టింట సందడిగా మారింది."మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే" అని శ్రీశ్రీ అన్నట్టు పిల్లలు ప్రకృతిలోని అందాలను స్వచ్ఛమైన మనసుతో ఆస్వాదిస్తారు. ఆడిపాడతారు. పసితనం అనేది మనుషులకైనా.. జంతువులకైనా ఒకటే నిరూపించే ఘటన ఇది. ఒక జోరు వాన పడుతోంది. దీంతో గజరాజులతో కలిసి పిల్ల ఏనుగుల గుంపు బురదలో ఆడుకుంటూ సందడి చేశాయి. ‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ అన్నట్టు, ఒకదానిపై ఒకటి బురద జల్లుకుంటూ తొండంతో కొట్టుకుంటూ అల్లరి చేశాయి. బురదలో ఆడుకుంటున్న ఏనుగుల గుంపును రాయ్గఢ్ అటవీ శాఖ డ్రోన్ కెమెరా బంధించింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ లోని ధరమ్జైగఢ్ ఫారెస్ట్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ ఎక్స్లో పోస్ట్ చేసింది. దీంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం! #WATCH | Chhattisgarh: Raigarh Forest Department's drone captured a herd of elephants with their calves playing in the mud in the monsoon season. Visuals from Dharamjaigarh Forest Division. (08.07.2025)(Video Source: Chhattisgarh Forest Department) pic.twitter.com/BheMJESyxs— ANI (@ANI) July 9, 2025కాగా వర్షాకాలంలో ఏనుగులు బురదలో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. అవి గుంపులుగా చేరి, ఒకదానితో ఒకటి బురదను చల్లుకుంటూ, ఆడుతూ, గంతులేస్తూ ఆనందిస్తాయి. ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి. -
అమ్మాయిల ఫొటోలు, వీడియోలతో పోకిరి హల్చల్.. తర్వాత ఏమైందంటే?
బెంగళూరు: అమ్మాయిలను సీక్రెట్గా ఫొటోలు, వీడియోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్న ఓ పోకిరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో వీడియోలను అప్లోడ్ చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.వివరాల ప్రకారం.. గురుదీప్ సింగ్ (26) అనే వ్యక్తి బెంగళూరులోని చర్చి స్ట్రీట్, కోరమంగళ సహా పలు ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఈ సమయంలో రోడ్లపై వెళ్తున్న అమ్మాయిలను వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. అనంతరం, వాటిని ఇన్స్స్టాగ్రామ్లో పోస్టు చేస్తున్నాడు. అయితే, ఓ యువతికి చెందిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా షాకైంది. ఈ వీడియోలకు అసభ్యకరంగా కామెంట్స్ రావడంతో ఆవేదన చెందింది. అనంతరం, తన వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని సదరు యువతి.. గురుదీప్ సింగ్కు మెసేజ్ పెట్టింది. ఈ క్రమంలో నిందితుడు.. దురుసుగా ప్రవర్తించాడు. ఆమె ఫొటోలు, వీడియోలు తొలగించకపోగా.. అసభ్య పదజాలంతో ఆమెను దూషించాడు.దీంతో, గురుప్రీత్ సింగ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సహాయం కోసం @blrcitypolice, @cybercrimecid పోలీసులకు ఈ పోస్టులను ట్యాగ్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గురుప్రీత్ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలు స్పందిస్తూ.. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి వ్యక్తులు ఇంకా బెంగళూరులో తిరుగుతున్నారన చెప్పుకొచ్చింది. వారిపై కూడా చర్చలు తీసుకోవాలని పోలీసులను కోరింది. -
అమెరికా.. మీకు ఇదే మా సందేశం: తాలిబన్లు
మార్పును బట్టే సమాజం ముందుకు పోతోంది. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం మతం, ఆచార వ్యవహారాల పేరిట వెనక్కి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జాబితాలో అఫ్గనిస్తాన్కు చోటు ఉంది. అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలతో వీధుల వెంట విచ్చలవిడిగా తిరుగుతుండడం, విద్యపై నిషేధం, మహిళలపై అక్కడ అమలు చేస్తున్న కఠిన ఆంక్షల సంగతి సరేసరి. ఇలాంటి తరుణంలో తాలిబన్ల నుంచి కలలో కూడా ఊహించని వీడియో ఒకటి విడుదలై ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓపెన్ చేయగా.. ముసుగులో ఉన్న కొందరు వ్యక్తుల చుట్టూ ఏకే 47 తుపాకులతో, మారణాయుధాలతో తాలిబన్లు కనిపిస్తారు. అమెరికా ఇదే మా సందేశం అంటూ ఓ వ్యక్తి చెబుతున్నాడు. ఆ వెంటనే కింద ఉన్న వ్యక్తికి ఉన్న ముసుగు తొలగించగానే.. చిరునవ్వుతో Welcome to Afghanistan అంటూ ఆహ్వానిస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అఫ్గన్ నేలపై ఉన్న ప్రకృతి సుందర దృశ్యాలు, అక్కడి ఆహారం.. ఇలా అన్నింటినీ అందులో చూపించారు. పాశ్చాత్య టూరిస్టులు అక్కడి సంప్రదాయ పఠాన్ దుస్తులను ధరించి.. స్థానిక వంటలు ఆస్వాదిస్తూ, జలపాతాల్లో ఈతలు కొడుతూ, స్థానికులతో నవ్వుతూ కనిపిస్తారు. ఇవన్నీ మాంచి ఫన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో సాగుతాయి. ఈ వీడియోను తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు. కానీ, తాలిబన్లకు సంబంధించిన పేజీల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. సాధారణంగా.. ఉగ్రవాదులు విదేశీయులను అపహరించి.. వాళ్ల పీకలు కోస్తూ వీడియోలు తీసి బయటకు వదలడం గతంలో జరిగేది. ఆ ఫార్ములానే ఇప్పుడు టూరిజం ప్రమోషన్ కోసం తాలిబన్లు వాడుకుంటున్నారు. మీ నుంచి(అమెరికా) మేం స్వేచ్ఛను దక్కించుకున్నాం. ఇప్పుడు మీరు మా దేశానికి అతిథులుగా రండి అంటూ ఆ వీడియోలో చెప్పడం ఉంది.ప్రశాంతమైన వాతావరణం, అందులో విదేశీ పర్యాటకులతో స్థానికుల సందడి.. పైగా డమ్మీ తుపాకులపై Property of US Government అని రాసి ఉండడం వాళ్ల వెటకారాన్ని బయటపెట్టంది. వెరసి అఫ్గనిస్తాన్ను ఆతిథ్యభరిత దేశంగా చూపించే ప్రయత్నమిదనే విషయం ఈ వీడియోతో స్పష్టమవుతోంది. అయితే..అఫ్గనిస్తాన్ను అమెరికా బలగాలు వీడాక.. 2021 అగష్టులో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ అంతర్జాతీయంగా ఆ ప్రభుత్వానికి గుర్తింపు దక్కకపోవడంతో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. పైగా ఈ దేశం ఇంకా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితాలోనే ఉండడంతో.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికీ అఫ్ఘానిస్థాన్కి ప్రయాణించవద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఆ దేశం.ప్రపంచానికి తాము మారిపోయామని తాలిబన్లు చూపించిన ఈ ప్రయత్నం ఒకవైపు ఆశ్చర్యంతో పాటు వీడియోపై విమర్శలు అదే స్థాయిలో వెల్లువెత్తాయి. తుపాకులతో యుద్ధ నేరాల తరహాలో పర్యాటకాన్ని ప్రమోట్ చేయడంపై మండిపడుతున్నారు. పైగా వీడియోలలో ఎక్కడా ఒక మహిళను చూపించకపోవడమూ విమర్శలు తావిస్తోంది. ఇది అడ్వైర్టైజ్మెంటా? లేదంటే పర్యాటకులకు హెచ్చరికనా? అని గొణుక్కునేవారు లేకపోలేదు. The Taliban has released a tourism appeal video aimed at attracting American visitorsTheir message to Americans:"Now that we've liberated our homeland from you, you're welcome to come back as tourists or guests"Would you go? #Afganistan pic.twitter.com/iLRYXFAJjn— Nabila Jamal (@nabilajamal_) July 9, 2025‘‘తాలిబాన్లు ప్రపంచంపై ఓ ముద్ర వేసుకుని ఉన్నారు. అది చెరిపేసుకునేందుకు గత నాలుగేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బాహ్య ప్రపంచానికి ఏం ఆకర్షణీయంగా కనిపిస్తుందో అంచనా వేయడంలో వాళ్లు తప్పటడుగే వేస్తున్నారు’’ అని ఓ విశ్లేషకుడు ఈ వీడియోపై అభిప్రాయపడ్డారు. ఇంతకీ అఫ్గన్ నేలపై ఏమున్నాయి.. కాబూల్ (Kabul) అఫ్గన్ రాజధాని నగరం. గార్డెన్స్ ఆఫ్ బాబర్, దారుల్ అమల్ ప్యాలెస్, నేషనల్ మ్యూజియం వంటి ప్రాచీన, సాంస్కృతిక స్థలాలు ఉన్నాయి. దారుల్ అమల్ ప్యాలెస్హెరాత్ (Herat)లో సుప్రసిద్ధ మసీదు, హెరాత్ సిటాడెల్ వంటి ఇస్లామిక్ శిల్పకళకు ప్రసిద్ధి చెందిన కట్టాడాలున్నాయి.మజార్-ఇ-షరీఫ్ (Mazar-e-Sharif) – Blue Mosque అనే అద్భుతమైన మసీదు ఇక్కడ ఉంది.బామియాన్ (Bamiyan) – బౌద్ధ విగ్రహాల అవశేషాలు, UNESCO వారసత్వ ప్రదేశం.కాందహార్ (Kandahar) – Mosque of the Sacred Cloak, అఫ్గాన్ చరిత్రకు కేంద్రం.జలాలాబాద్ (Jalalabad) – పచ్చని ఉద్యానవనాలు, ఆకర్షనీయమైన వాతావరణం.ఫైజాబాద్ (Faizabad) – హిందూ కుష్ పర్వతాల మధ్య ఉన్న ప్రకృతి అందాలు.బాండ్-ఎ-అమీర్ నేషనల్ పార్క్ (Band-e Amir National Park) – నీలి సరస్సులు, పర్వతాలు; అఫ్గాన్లో మొట్టమొదటి నేషనల్ పార్క్.పంజ్షీర్ లోయ (Panjshir Valley) – మంచుతో కప్పబడిన పర్వతాలు, నదులు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.బాల్క్ (Balkh) – పురాతన నగరం; రూమీ జన్మస్థలం, బౌద్ధ మరియు జరోస్త్రియన్ చరిత్రకు కేంద్రం.బిజినెస్ ఇన్సైడర్ గణాంకాల ప్రకారం.. 2021 చివరి నుంచి ఇప్పటిదాకా 14,500 మంది విదేశీయులు అఫ్గనిస్తాన్లో పర్యటించారు. అందులో రష్యా, చైనా, టర్కీ, మిడిల్ ఈస్ట్కు చెందిన వాళ్లు న్నారు. వీళ్లలో చాలామంది వ్లోగర్స్ ఉండడం గమనార్హం. వీళ్లు అక్కడి టూరిజాన్ని, ఆహారపు అలవాట్లను ప్రమోట్ చేసే వీడియోలనే ఎక్కువగా వదిలారు. -
బేబీ బంప్పై ‘అమృతస్వరం’ పాట పాడితే.. వీడియో వైరల్
బాలీవుడ్ సూపర్ గాయని శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal) తన మధురమైన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. అనేక భాషల్లో తన స్వరంతో సంగీతాభిమానులు ఉర్రూతలూగించింది. తాజాగా తన గానంతో కడుపులో ఉన్న బిడ్డను కూడా కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ వైరల్గా మారింది.ఆమ్స్టర్డామ్ లోని ‘‘ఆల్ హార్ట్స్ టూర్’’ సందర్భంగా తన వీరాభిమానిని కలిసింది శ్రేయా ఘోషల్. గర్భిణి అయిన అభిమాని ముందు మోకాళ్లపై కూర్చుని, ఆమె గర్భంపై తన చేతిని సున్నితంగా ఉంచి, పుట్టబోయే బిడ్డ కోసం జోలపాట పాడటం విశేషం. పరిణీత చిత్రంలోని "పియు బోలే సాంగ్ను మంద్రంగా ఆలపించింది. అంతే గర్భస్థ శిశువు పరవశంతో కదిలిందిట. ఆ సమయంలో అభిమానితో పాటు శ్రేయ కూడా ఆనందంలో మునిగిపోయింది. ఈ వీడియో నెట్టింట అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla)లక్కీ బేబీ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. ‘డివైన్ వాయిస్ ఆ బిడ్డను ఆశీర్వదించింది’ అని ఒకరు, ‘ఓహ్..ఆ పుట్టబోయే బిడ్డకు ఎంత అదృష్టం’ అని మరో అభిమాని వ్యాఖ్యానించడం విశేషం."శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అని ఇదేనేమో!ఇదీ చదవండి: ట్విన్స్కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్ -
హైకోర్టు జోక్యంతోనైనా అరాచకాలు తగ్గుతాయా?
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి అభినందనలు. రెడ్బుక్ పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అరాచకాలకు తెగబడుతున్న తెలుగుదేశం పార్టీకి ముకుతాడు వేసే దిశగా న్యాయస్థానం మేలైన చర్య తీసుకుంది. సోషల్మీడియా పోస్టుల విషయంలో అరెస్ట్ అయిన వారికి రిమాండ్ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, పౌరుల హక్కుల పరిరక్షణకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోబోమని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లకు జారీ చేసిన ఒక సర్క్యులర్లో స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు పోలీసు అధికారుల ఇష్టారాజ్య పోకడలకు కొంతమేర బ్రేక్ వేసింది. హైకోర్టు విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు ఇకపై యాంత్రికంగా రిమాండ్ విధించరాదు. పోలీసులు పెట్టిన కేసు లోతుపాతులు, నిందితులపై మోపుతున్న బీఎన్ఎస్ సెక్షన్ల హేతుబద్ధతలను పరిశీలించిన తర్వాతే రిమాండ్పై చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పెట్టుకోవాలి. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులలో రిమాండ్ అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇటీవలి కాలంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు కొందరు అవసరమున్నా లేకపోయినా పోలీసులు మోపిన కేసుల్లో నిందితులను రిమాండ్కు పంపుతున్న విమర్శలు ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాలు అప్పుడప్పుడు రిమాండ్ తీరుతెన్నులను తప్పుపడుతున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో హైకోర్టు ఈ సర్క్యులర్ జారీ చేసింది. దీనిని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందని కూడా స్పష్టం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సర్క్యులర్కు సంబంధించిన వార్తలకు తెలుగుదేశం అనుకూల మీడియా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం!ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్బుక్ పేరుతో సొంత రాజ్యాంగం అమలు చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ సమాజంలో భయభ్రాంతులను సృష్టిస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్లు చట్టాలతో సంబంధం లేకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. లోకేష్ మరో అడుగు ముందుకేసి రెడ్బుక్ ఏదో ఘనకార్యమైనట్లు సమర్థిస్తూ మాట్లాడుతున్న తీరు ఆయన అపరిపక్వతను తెలియచేస్తుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతూ వస్తున్నారు.జర్నలిస్టులను కూడా వదలి పెట్టుకుండా వేధిస్తున్నారు. చివరికి పరిస్థితి ఏ దశకు చేరిందంటే అధికారంలో ఉన్న టీడీపీ జనసేనలకు అనుకూలంగా వ్యవహరించకపోతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సైతం రెడ్బుక్ ప్రయోగిస్తున్నారు. సిద్ధార్థ్ కౌశల్ అనే ఐపీఎస్ ఈ రెడ్బుక్ పిచ్చి గోలతో తాను పని చేయలేనని స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కొందరు అధికారులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. అధికార పార్టీ కొమ్ము కాసే కొద్ది మంది అధికారులు మాత్రం రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ చట్టాలను, నిబంధలను గాలికి వదిలి వేస్తున్నారు. కొందరు జిల్లా కలెక్టక్టర్లు, ఎస్పీలు 'నీవు ఫలానా కులం వాడివి కదా! అయినా వైఎస్సార్సీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నావు’ అని అడుగుతున్నారట. దీనికి సంబంధించి ఒక వ్యక్తి చెప్పిన మాటల వీడియో వైరల్ అయింది. జిల్లా స్థాయి అధికారులే అలా ఉంటే క్షేత్రస్థాయిలో ఉండే వారు ఏమి చేయగలుగుతారు? పద్దతిగా ఉంటే శంకరగిరి మాన్యాలు పట్టవలసి వస్తుందని భయపడుతున్నారు. కొన్ని సందర్భాలలో అధికారులు తాము వేధించామనే బయట చెప్పండని నిందితులతో అంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు వందలాది మంది సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం వంటివి జరిగాయి. రిమాండ్ విషయంలో తగు జాగ్రత్తలతో వ్యవహరించాలని హైకోర్టు సర్క్యులరైతే పంపింది కానీ... మెజిస్ట్రేట్లు దీని పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతారా? లేదా?అన్న చర్చ ఉంది. ఎందుకంటే మెజిస్ట్రేట్లు పోలీసులు పెట్టే సెక్షన్ల ఆధారంగా రిమాండ్కు పంపుతారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, వాటి పరిధిలోకి రాకుండా, అవసరం ఉన్నా, లేకపోయినా కఠినమైన సెక్షన్లతో కేసులుపెట్టే అవకాశం ఉంటుందన్నది కొందరు న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. ఉదాహరణకు ఎవరినైనా వేధించాలని భావిస్తే, సంబంధం ఉన్నా, లేకపోయినా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. కొందరు మెజిస్ట్రేట్లు ఈ విషయాన్ని గుర్తించి ఆయా సెక్షన్లను తీసి వేయిస్తున్నా, అన్ని సందర్భాల్లోనూన అలా చేయగలుగుతారా? అన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే హైకోర్టు సూచనలతో మెజిస్ట్రేట్లు సోషల్ మీడియా, తదితర భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలోనైనా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఎన్నికలకు ముందు లోకేశ్ రెడ్బుక్ అంటూ తిరుగుతుంటే, అదేదో పిచ్చిగోలలే! తెలిసి, తెలియని మాటలులే అని అంతా అనుకున్నారు. కాని కూటమికి అధికారం రాగానే అదే ప్రమాదకరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్నిసార్లు ఈ రెడ్బుక్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ఒక టాక్! అయినా తన కుమారుడిని నియంత్రించలేక పోతున్నారని చెబుతున్నారు. పోలీసు అధికారులు కూడా సీఎం కంటే మంత్రి లోకేశ్ మాటలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని టీడీపీ వర్గాలు సైతం అంటున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులపై ఒకటికి పది చోట్ల కేసులు పెట్టి వేధించడం, ఒక కేసులో బెయిల్ వస్తే పీటీ వారంట్ల పేరుతో ఇంకో కేసులో అరెస్టు చేయడం వంటివన్నీ ఏపీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలకు ఇదొక బెంచ్ మార్క్ అయ్యే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు. నిప్పుకు గాలి తోడైనట్లుగా ఈ రెడ్బుక్ అరాచకానికి తెలుగుదేశం మీడియా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి అవ్వాలని ఉవ్విళ్లూరుతున్న లోకేశ్ హుందాగా వ్యవహరించాలని చెప్పడానికి టీడీపీ ఎవరూ సాహసించడం లేదట. అంతేకాదు. టీడీపీ నాయకత్వం అండ చూసుకుని హైకోర్టు న్యాయమూర్తులను ఇష్టం వచ్చినట్లు విమర్శించే దశకు కొందరు చేరుకున్నారు. తీర్పులను విశ్లేషించవచ్చు. కాని న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తీరుపై బార్ కౌన్సిల్ సైతం తప్పు పట్టింది. జస్టిస్ శ్రీనివాస రెడ్డి కోర్టులోనే తన ఆవేదనను వ్యక్తపరిచారు.అయినా టీడీపీ తన ధోరణి మార్చుకుంటుందా?లేదా?అన్నది చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వ హననం అన్నది తెలుగుదేశం పార్టీలో ఒక విధానంగా మారింది. టీడీపీ మీడియా అండగా ఉంటోంది. ఇతర పార్టీల వారి సంగతెందుకు! చివరికి 1995లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును సైతం వదలి పెట్టకుండా దారుణమైన కథనాలు ప్రచారం చేశారు. ఒకవైపు నీతులు చెప్పడం, మరో వైపు ఇలా ఎదుటి వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం అన్నది టీడీపీ వ్యూహంగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్ను న్యాయ వ్యవస్థ ఎంత గట్టిగా అమలు చేస్తుందో, పోలీస్ వ్యవస్థ ఎంతగా గౌరవిస్తుందో వేచి చూడాల్సిందే.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నేడో, రేపో రోడ్డు ప్రారంభం.. ఇలా కొట్టుకుపోవడంతో..
జైపూర్: రాజస్థాన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రారంభానికి సిద్దంగా ఉన్న రాష్ట్ర రహదారి వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో రహదారి నిర్మించిన కాంట్రాక్టర్పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో కొత్తగా నిర్మించిన రాష్ట్ర రహదారి వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉదయపూర్వతిలోని బఘులి అనే ప్రాంతం గుండా వెళ్ళే కట్లి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ ప్రాంతంలో 86 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో, వరద ప్రవాహం ధాటికి రోడ్డు కొట్టుకుపోయింది. రహదారిని గండిపడిపోయింది.కట్లి నది.. సికార్ ఝుంఝును, చురు జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ నదిలో ఆక్రమణలు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే భారీ వర్షాల సమయంలో వరదలు సంభవించి రహదారులు కోతకు గురవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, రోడ్డు కొట్టుకుపోయిన విషయం తెలియడంతో స్థానికంగా ఉన్న ప్రజలు అక్కడికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.🔴 Rajasthan Shocker | Heavy rains wash away newly built road in Jhunjhunu just days after completion.Locals outraged, question quality of construction and demand accountability from officials.pic.twitter.com/xafp8RHgIA— The News Drill (@thenewsdrill) July 8, 2025 -
జిమ్లో బిగ్బాస్ దివి వర్కవుట్స్.. మాల్దీవుస్లో హీరోయిన్ ప్రణీత!
బిగ్బాస్ దివి జిమ్ వర్కవుట్ పోజులు.చిన్నపిల్లలతో బిగ్బాస్ అశ్విని శ్రీ ..మాల్దీవుల్లో హీరోయిన్ ప్రణీత వేకేషన్..శారీలో హీరోయిన్ ప్రియమణి పోజులు..స్విమ్మింగ్పూల్లో సేదతీరుతోన్న సురేఖవాణి కూతురు సుప్రీత.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by HemaDayal (@hemadayal18) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
శ్రుతీహాసన్ షాకింగ్ నిర్ణయం.. ఇన్స్టా పోస్ట్ వైరల్
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్లలో శ్రుతీహాసన్(Shruti Haasan) ఒకరు. సినిమా అప్డేట్స్తో పాటు తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు తరచు ఫోటోషూట్ చేసి వాటిని ఇన్స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ని అలరిస్తుంది. ఇన్స్టాలో ఆమెకు 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే..ఆమె నెట్టింట ఎంత యాక్టివ్గా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఈ బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని తన ఫాలోవర్స్కి తెలియజేస్తూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఈ అమ్మడు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే. తన అకౌంట్ను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోబోతున్నట్లు ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు. శ్రుతీహాసన్ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. -
ముంచుకొచ్చిన ఉపద్రవం.. ఊరినే కాపాడిన కుక్క!!
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. హిమాచల్ ప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో.. అక్కడి ప్రజల జీవనం కష్టతరంగా ఉంటోంది. మరోవైపు వర్షాలకు ఇప్పటిదాకా 75 మంది మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఊరకుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది!!. వివరాల్లోకి వెళ్తే..హిమాచల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడి ధరంపూర్ తాలుకా సియతి గ్రామం జూన్ 30న అర్ధరాత్రి సమయంలో పెద్ద కొండచరియ విరిగిపడడంతో సర్వనాశనమైంది. ఇళ్లు ధ్వంసం కావడంతో గ్రామస్థులంతా తియంబాలా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయినా.. ఓ ఊరకుక్క కారణంగా ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు వాళ్లు. ఆ రాత్రి ఏం జరిగిందో ఓ గ్రామస్తుడి మాటల్లో.. మా ఇంటి రెండోఅంతస్తులో ప్రతిరోజు ఓ శునకం నిద్ర పోయేది. అయితే ఆరోజు అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో అది విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. భయంతో అరుస్తుందేమోనని ఆ అరుపుల శబ్దానికి నేను లేచి దాని దగ్గరకు వెళ్లాను. పైకి వెళ్లి చూడగా.. ఇంటిగోడకు పగుళ్లు కనిపించాయి. ఇంట్లోకి చిన్నగా నీరు రావడం మొదలైంది. దాంతో వెంటనే కుక్కను కూడా కిందికి పరిగెత్తా. ఇంట్లో వాళ్లను.. చుట్టుపక్కల అందరినీ లేపి సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెప్పాను. అలా దూరంగా వెళ్లామో, లేదో.. మా గ్రామంపై ఓ పెద్ద కొండచరియ విరిగిపడింది. పదుల సంఖ్యలో ఇళ్లు దానికింద నేలమట్టం అయ్యాయి అని చెప్పారాయన. అలా కుక్క అరుపు.. 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలను రక్షించిందన్నమాట. -
బీచ్లో యాంకర్ శ్రీముఖి పోజులు.. మిచిగాన్ వీధుల్లో సమంత చిల్!
గ్రీన్ డ్రెస్లో సింగర్ కెన్నీషా హోయలు..లండన్లో చిల్ అవుతోన్న లక్ష్మీ రాయ్..బీచ్లో యాంకర్ శ్రీముఖి పోజులు...మిచిగాన్ వీధుల్లో హీరోయిన్ సమంత..వెకేషన్లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ చిల్.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Neha Kakkar (@nehakakkar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by KENEESHAA (@keneeshaa1) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
ప్రాణం తీసిన రీల్స్ సరదా.. టవల్ బిగుసుకుని చిన్నారి మృతి
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ సోషల్ మీడియా యుగంలో చాలా మంది వివిధ రకాల వీడియోలు, యూట్యూబ్ షార్ట్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. కానీ అదే రీల్స్ పిచ్చి.. యువతకు మాత్రమే కాదు.. పిల్లల ప్రాణాలకు సంకటంగా మారుతోంది. లైకుల కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా, సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ చేస్తుండగా చిన్నారి మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కులులో చోటు చేసుకుంది. చిట్కులుకు చెందిన సహస్ర నాలుగువ తరగతి చదువుతోంది.ఈ క్రమంలో కరెంట్ లేని సమయంలో ఫ్యానుకు టవల్ వేలాడదీసి రీల్స్ చేసే ప్రయత్నం చేసింది. సరిగ్గా అదే సమయంలో కరెంట్ రావడంతో సహస్ర మెడకు టవల్ బిగుసుకుని అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతిపై కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బంగారు భవిష్యత్తున్న సహస్ర అర్ధాంతరంగా తనువు చాలించడంపై చూపురులను కంటతడి పెట్టిస్తోంది. -
చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : సజ్జనార్
సోషల్ మీడియా మత్తు వైరస్లా పట్టి పీడిస్తోంది. రీల్స్ మోజులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అంతా సోషల్ మీడియాకు ఎంత అడిక్ట్ అవుతున్నారనే దానికి నిదర్శనం తాజా ఘటన. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఎండీ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీంతో ఇది నెట్టింట వైరల్గా మారింది. సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ఎంత ప్రమాదకరమో సజ్జనార్ హెచ్చరించారు. పిల్లల వ్యవహారంపై జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. వీసీ సజ్జనార్ ఎక్స్ పోస్ట్చిన్నతనం నుంచే రీల్స్ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా గురైతుండటం అత్యంత బాధాకరం. సోషల్ మీడియా మత్తులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఇలాంటి సోషల్ మీడియా వ్యసనాన్ని చూస్తూ వదిలేస్తే.. ఎంతో మంది పిల్లలు, యువకుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది.సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన పిల్లలకు కౌన్సెలింగ్ అనేది అత్యవసరం. ఈ వ్యసనం వల్ల జరిగే అనర్థాలను స్పష్టంగా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. బిజీ లైఫ్ అంటూ పిల్లల పట్ల ఏమాత్రం ఆశ్రద్దగా ఉండొద్దు. నిర్లక్ష్యంగా ఉంటే మీ పిల్లల జీవితాలను మీరే చేజేతులా నాశనం చేసిన వాళ్లుగా మిగిలిపోతారు. గుర్తుంచుకోండి.. నష్టం జరిగిన తర్వాత బాధపడితే లాభం ఉండదు. ముందే మేలుకోండి. పొంచి ఉన్న సోషల్ మీడియా ముప్పుకు మీ పిల్లలని దూరంగా ఉంచండి. ఎక్కడ జరిగిందీ ఘటన, ముగ్గురు అరెస్ట్ఇన్ఫ్లుయెన్సర్లలో రీల్ మానియా వారి ప్రాణాలను ఎలా ప్రమాదంలో పడవేస్తుందో చెప్పే మరో ఉదాహరణ, ఒడిశాలోని బౌధ్ జిల్లాలో పురునపాణి స్టేషన్ సమీపంలోని దలుపాలి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్ బాలురను పోలీసులు అరెస్టు చేశారు.ఈ వీడియోలో ఒక బాలుడు పట్టాలపై పడుకుని అత్యంత ప్రమాదకరమైన స్టండ్ చేశాడు. దీన్నిస్నేహితులలో ఒకరు డైరెక్ట్ చేయగా, మరొకరు వీడియో తీశాడు. ఈ స్టంట్ను చూస్తున్న చప్పట్లతో కేరింతలు కొట్టాడు. బాలుడు లేచి నిలబడి ఫోటోలకు పోజు ఇచ్చాడు. స్నేహితులు ఆనందంతో కేకలు వేస్తుండటం చూడవచ్చు. పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని,భద్రతా చట్టాలను ఉల్లంఘన అని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో తమ పిల్లల వ్యవహారాన్ని ఒక కంట కని పెట్టాలని తల్లిదండ్రులను కోరారు.అయితే ట్రాక్లపై పడుకున్న బాలుడు స్పందించాడు. ఇలా చేస్తే ఈ రీల్ వైరల్ అవుతుందని తన స్నేహితులు ఈ చెప్పారని, ట్రాక్పై ఉండగా, మీదనుంచి రైలు వెళుతున్నపుడు, గుండె వేగంగా కొట్టుకుందని, బ్రతుకుతానని ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు. కాగా వెర్రి తలలు వేస్తున్న సోషల్ మీడియా ధోరణులపై నెటిజనులను సజ్జనార్ హెచ్చరించడం ఇదే మొదటిసారి. కాదు అనేక విషయాలపై ఆయన యువతను, టీనజర్లను హెచ్చరిస్తూనే ఉంటారు. బిడ్డల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ తల్లిదండ్రులకు నిరంతరం సూచనలిస్తూనే ఉంటారు. అంతేకాదు ఇటీవల బెట్టింగ్ యాప్లపై ప్రకటించిన యుద్ధం, దాని ప్రభావం తెలిసిన సంగతే. -
రెడ్బుక్కు రెడ్ సిగ్నల్!
ముంపు సమస్యపై పోస్టు చేసినందుకు.. భారీ వర్షాలు కురవడంతో రాజమహేంద్రవరంలోని ప్రకాశ్ నగర్ కాలనీలో ముంపు సమస్యపై పులి సాగర్ అనే దళితుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే.. పోలీసులు ఆయన్ను ఓ ఉగ్రవాది మాదిరిగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారు! స్టేషన్కు తరలించి అర్ధనగ్నంగా నిలబెట్టి పచ్చి బూతులు తిడుతూ... కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. ముక్కలుగా కోసి రైలు పట్టాలపై పడేస్తామని, శవం కూడా దొరకదని బెదిరించారు. పులిసాగర్ను అర్ధ నగ్నంగా లాకప్లో ఉంచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్బుక్ వేధింపులకు ఈ ఉదంతం ఓ నిదర్శనం! సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ.. హామీల ఎగవేతపై నిలదీస్తూ పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులను ప్రయోగించి చంద్రబాబు సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండటం... మేజిస్ట్రేట్లు వారిని యాంత్రికంగా రిమాండ్కు పంపుతుండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసుల అరాచకాలకు హైకోర్టు చెక్ పెట్టిందని న్యాయకోవిదులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో సంబంధిత దర్యాప్తు అధికారి... అర్నేష్కుమార్, ఇమ్రాన్ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో, ఇన్నాళ్లూ రెడ్బుక్ రాజ్యాంగంతో చెలరేగిన పోలీసుల్లో వణుకు మొదలైందని వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా రెడ్బుక్ పాశవిక విధానాలను ఏమాత్రం ఉపేక్షించబోమని హైకోర్టు సంకేతాలిచ్చిందంటున్నారు. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేట్లకు తాజాగా హైకోర్టు పరిపాలనా మార్గదర్శకాలను నిర్దేశించిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలను మేజిస్ట్రేట్లందరూ పాటించి తీరాల్సిందేనని, దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. భారత రాజ్యాంగాన్నిఅనుసరించి విధులు నిర్వహించాలి గానీ... లోకేశ్ విరచిత, చంద్రబాబు ప్రవచిత రెడ్బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తే పోలీసులు ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేన్నది హైకోర్టు ఆదేశాలతో స్పష్టమైంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా సాగిస్తున్న ప్రభుత్వ స్పాన్సర్డ్... పోలీసు మార్కు వేధింపులకు హైకోర్టు ఆదేశాలతో అడ్డుకట్ట వేసినట్లైంది. ప్రధానంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో వేధింపులు... దర్యాప్తు ముసుగులో చిత్రహింసలకు పాల్పడుతూ రాష్ట్రంలో అరాచకం సృష్టించడంపై జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లకు అడ్డుకట్ట వేస్తూ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయి. హైకోర్టు అంత క్రియాశీలంగా వ్యవహరించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయేంతగా ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ దిగజారిందన్నది యావత్ దేశానికి అవగతమైంది. ప్రశ్నించే గొంతులపై దాష్టీకం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదిగా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను అమలు చేయని వైనం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్లను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది. ఎంతగా అంటే.. అన్నదాతా సుఖీభవ పథకం ఎప్పుడు ఇస్తారు? అని అడిగితే కేసు...! నిరుద్యోగ భృతి ఇవ్వరా..? అని ప్రశి్నస్తే కేసు...! వీధిలో లైట్లు వెలగడం లేదంటే కేసు...! సూపర్ సిక్స్ పథకాలను ప్రస్తావిస్తే చాలు కేసు..!! ఇలా ఎడాపెడా అక్రమ కేసులతో విరుచుకుపడింది. సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల మేనిఫెస్టో అమలులో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులతో బెదిరింపులకు దిగింది. ఏడాది వ్యవధిలో సోషల్ మీడియా కార్యకర్తలు ఏకంగా 822 మందికి నోటీసులు జారీ చేసింది. 253 అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. 86 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్లను అక్రమంగా అరెస్టు చేసింది. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కేసులు నమోదు చేయలేదు. హిట్లర్ దురాగతాలను గుర్తు చేసే రీతిలో చంద్రబాబు అణచివేతలకు పాల్పడ్డారు. అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా దర్యాప్తు పేరిట వేధించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, నిబంధనలను పాటించకుండా బరితెగించి వ్యవహరించారు. వ్యవస్థీకృత నేరాల కింద కేసులు.. సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే 41 ఏ కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలి. కానీ ఆ నిబంధనలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. ఏకంగా వ్యవస్థీకృత నేరాల కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనం. ఉగ్రవాదులు, స్మగ్లర్లపై నమోదు చేయాల్సిన కేసులను సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై బనాయించి కర్కశంగా వ్యవహరించారు. రాత్రికి రాత్రి ఇళ్ల నుంచి లాక్కొచ్చి బలవంతంగా పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్కు తిప్పుతూ.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతిక దాడులకు సైతం వెనుకాడలేదు! కొమ్ముకాస్తే.. కఠిన చర్యలు.. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా సాగిస్తున్న దమనకాండ, అరాచకాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణలపై అక్రమ కేసులు నమోదుకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, మీడియా ప్రతినిధులు, కళాకారుల భావ వ్యక్తీకరణ హక్కుకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే పోలీసుల పట్ల కఠిన చర్యలు చేపడతామని తేల్చి చెప్పింది. కేసుల దర్యాప్తు విషయంలో పాటించాల్సిన విధి విధానాలను పోలీసులకు గుర్తు చేసింది. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో రిమాండ్లు విధించడానికి వీల్లేదని మెజిస్ట్రేట్లకు స్పష్టం చేసింది. ఇకపై అటువంటి కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అది కూడా.. సీఐ, ఎస్సై స్థాయి అధికారులు తమంతట తాముగా కేసులు నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. అటువంటి కేసుల నమోదుకు ముందు అన్ని విషయాలను పరిశీలించి డీఎస్పీ అనుమతి ఇవ్వాలని పేర్కొంది. తద్వారా అక్రమ కేసులు నమోదు చేస్తే ఇకపై డీఎస్పీనే ప్రధానంగా బాధ్యుడవుతారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని తద్వారా న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇక ఈ కేసుల దర్యాప్తు పేరిట పోలీసులు నెలల తరబడి కాలయాపన చేస్తూ నిందితులను వేధిస్తుండటాన్ని కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే అందుకు కారణాలను కచ్చితంగా చెప్పాలి. న్యాయస్థానాలు కూడా ఎడాపెడా రిమాండ్లు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు నిర్దేశించింది. పోలీసులు ఆ కేసుల దర్యాప్తును 14 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దిష్ట కాలపరిమితి విధించింది. తద్వారా సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, మీడియా ప్రతినిధులు, సృజనాత్మక కళాకారులు, ఇతరుల భావ ప్రకటనా హక్కును హైకోర్టు పరిరక్షించింది. వాటికి విఘాతం కలిగించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 50 రోజుల పాటు జైల్లో..ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరెడ్డి దంపతులపై కూటమి సర్కారు తప్పుడు కేసులు బనాయించింది. 50 రోజుల పాటు జైల్లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వారిపై పలు జిల్లాల్లో అక్రమ కేసులు నమోదు చేసింది. పోస్టు పెట్టారని భర్తపై దాడి... భార్య అరెస్టుప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చిలకలూరిపేటకు చెందిన దంపతులు పాలేటి కృష్ణవేణి, రాజ్కుమార్పై పోలీసులు, టీడీపీ గూండాలు వేధింపులకు పాల్పడ్డారు. కృష్ణవేణిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రాజ్కుమార్ను చితకబాది నారా లోకేశ్ చిత్రపటం వద్ద మోకాళ్లపై నిలబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించారు.పోస్టు పెడితే దాడులు.. కేసులు!సూపర్ సిక్స్పై పోస్టు పెట్టినందుకు..సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కె.హనుమంతరెడ్డిని పోలీసులు కిడ్నాప్ చేసి మరీ చిత్రహింసలకు గురి చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం అరవీడుకు చెందిన ఆయన్ను రెండు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు.దివ్యాంగుడిపై పోలీసుల ప్రతాపంటీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నంద్యాల జిల్లా మహానందికి చెందిన తిరుమల కృష్ణపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిర్బంధించారు. దివ్యాంగుడైన కృష్ణను వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.ఒక్కడిపై 21 అక్రమ కేసులు..టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేసిన విశాఖకు చెందిన ఇంటూరి రవికిరణ్ను పోలీసులు అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారు. ఆయనపై వివిధ జిల్లాల్లో ఏకంగా 21 అక్రమ కేసులు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ వేధింపుల తీవ్రతకు నిదర్శనం. ఓ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చినా మరో కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగానే మరో 4 కేసులు బనాయించారు.2018లో పోస్టు.. ఇప్పుడు అక్రమ కేసుచంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, పాశవిక ధోరణి, మానవ హక్కుల ఉల్లంఘనకు తెనాలి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసు ఓ మచ్చు తునక. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రాజకీయ విధానాలను ప్రశ్నిస్తూ 2018లో పోస్టు పెట్టిన ఆళ్ల జగదీశ్ అనే రైతుపై 2024లో అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన్ను అక్రమంగా అదుపులోకి తీసుకుని 2 రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వేధించారు.ఫొటో ఫార్వర్డ్ చేసినందుకు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓ సోషల్ మీడియా పోస్టును వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశారని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రభావతి అనే మహిళతోపాటు 12 మందిపై కూటమి సర్కారు అక్రమ కేసు నమోదు చేసింది. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.పోసానిపై రెడ్బుక్ వేధింపులుప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని చంద్రబాబు ప్రభుత్వం వేధించిన తీరు అందరినీ నివ్వెరపరిచింది. ఆయనపై ఏకంగా 16 అక్రమ కేసులు నమోదు చేయడం సర్కారు అరాచకాలకు తార్కాణం. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ను హైదరాబాద్లో బలవంతంగా అరెస్టు చేసి రాష్ట్రానికి తరలించి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పతూ వేధించారు. ఆయన కనీసం తన మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించ లేదు. అక్రమ అభియోగాలతో రిమాండ్కు తరలించారు. 24 రోజులు జైల్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్పై విడుదల అయ్యారు.కొమ్మినేనిపై కక్ష సాధింపుప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కక్ష సాధింపులకు పాల్పడింది. సాక్షి టీవీలో ఓ చర్చా గోష్టిలో ఆయన ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకపోయినా అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. నిరాధార అభియోగాలతో రిమాండ్కు పంపించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి టీవీ, కొమ్మినేని శ్రీనివాసరావుపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఇలాంటి ఉడుతను ఎపుడూ చూసి ఉండరు.. పగబట్టిందా?
మన చుట్టూ ఉంటూ మనతో పాటు జీవాల్లో కుక్కలు, పిల్లలు, ఆవు, గేదె, ఎద్దు, మేకలు గొర్రెలు, ఇతర పక్షులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే మన ఇంటిపెరటిలో, మొక్కల్లో ఎపుడూ చెంగు చెంగున తిరిగే బుల్లి ప్రాణి గురించి మనం ఇపుడు మాట్లాడుకోబోతున్నాం. అదేనండి... శ్రీరాముడి చేతిముద్రను వీపు మోస్తూ తిరిగే ఉడుత. దీనికి సంబంధిచి ఒక వీడియో ఒకటి నెట్టింట సందడిగామారింది.ఉడుతలు కూడా పగబడతాయా అన్నట్టు ఉన్న వీడియో ఎక్స్లో వైరల్గా మారింది. ఈ వీకెండ్ మూడ్లో సరదాగా మీరు కూడా ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేసేయండి. అయితే.. ఉడుతను తిట్టుకోకండి.. పాపం. బుజ్జి ఉడుత నవ్వుకోండి. ఎందుకంటే ఈ వీడియో ముందు కుక్క అక్కడ తిరుగుతున్న ఉడుతపై ఎగబడింది. దాంతో ఉడుతు ఏమనుకుందో ఏమోగానీ, అక్కడున్న మనిషిపై ఒక్కసారిగా దూకి నానా హంగామా చేసింది. ఆ తరువాత వదల బొమ్మాళి అన్నట్టు కుక్కను కాసేపు కంగారు పెట్టింది. డోర్ బెల్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో దాదాప 12 మిలియన్ల వ్యూస్ని దక్కించుకుంది అదంతా భయపడేతప్ప, ఉడుత తప్పేమీ లేదంటున్నారు నెటిజన్లు.Doorbell camera catches man getting attacked by a squirrel. Have you ever seen a squirrel like this? pic.twitter.com/l2eISJYdQC— AmericanPapaBear (@AmericaPapaBear) July 2, 2025 > ప్రకృతిలో చాలా ప్రాణులు మనతోపాటు జీవనం సాగిస్తుంటాయి.కొన్ని మనకు కనిపించనంత సూక్ష్మంతో ప్రకృతిలో మమేకమై ఉంటాయి. మరికొన్ని మనతోపాటే, మన చుట్టూనే ఉంటాయి.మనతో స్నేహంగా ఉంటాయి. మానవాళికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి. పర్యావరణ సమతుల్యతో తమవంతు పాత్ర వహిస్తుంటాయి. సాధారణంగా మనుషులు తప్ప ఏ ప్రాణీ అకారణంగా ఎవరిమీదా దాడి చేయదు. ఆహారం కోసం, తమకు హాని కలుగుతుందని భావించినపుడు, తమ మీద దాడి చేస్తున్నారని భయపడినపుడు మాత్రమే మనుషులను మీదికి ఎగబడతాయి. ఇందులో పాములకు కూడా మినహింపేమీ కాదు. నిజానికి పాములు చాలా పిరికివట. -
ఇదేందయ్యా ఇదీ.. మొన్న 90 డిగ్రీల బ్రిడ్జి.. నేడు పాము మెలికల వంతెన
భోపాల్: మధ్యప్రదేశ్లో వంతెనల నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న భోపాల్లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఓ రైల్వే వంతెన చర్చనీయాంశం కాగా.. తాజాగా మరో వంతెన తెరపైకి వచ్చింది. భోపాల్లోనే పాములా మెలికలు తిరిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జి సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. సదరు వంతెనపై ప్రయాణాల కారణంగా ఎనిమిది గంటల సమయంలోనే రెండు ప్రమాదాలు జరగడంతో.. వంతెన నిర్మించిన ఇంజినీర్, బీజేపీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు వాహనదారులు.వివరాల ప్రకారం.. భోపాల్లోని సుభాష్నగర్లో రూ.40 కోట్లతో ఒక వంతెన నిర్మించారు. ఈ వంతెనను పాములా మెలికలు తిరిగినట్టు నిర్మించడం గమనార్హం. భోపాల్ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రయాణికులు ఈ వంతెన మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ వంతెన వల్ల సుభాష్ నగర్ ప్రాంతంలో రద్దీ తగ్గినప్పటికీ దాని నిర్మాణం పలుచోట్ల మెలికలు తిరిగి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వంతెనపైకి ఎక్కిన కొన్ని సెకన్లలోనే పలుమార్లు మలుపులు తీసుకోవాల్సి వస్తుందని స్థానికులు పేర్కొన్నారు. దీనివల్ల రాత్రి సమయాల్లో, అధిక వేగంతో ప్రయాణించే వాహనదారులు మలుపుల వద్ద నియంత్రణ కోల్పోయి.. ప్రమాదాల బారినపడుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.A speeding car lost control and overturned on the Subhash Nagar Bridge in Bhopal, leaving two passengers injured.The vehicle hit the divider with such force that its front tyres detached.A live video of the dramatic accident has surfaced, highlighting the dangers of reckless… pic.twitter.com/jd1tnuBiD9— The Sentinel (@Sentinel_Assam) July 2, 2025ఇక, ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టి గాలిలో పల్టీలు కొట్టింది. మరోసారి ఓ స్కూల్ వ్యాన్ డివైడర్ను ఢీకొట్టడంతో అందులోని విద్యార్థులకు గాయాలయ్యాయన్నారు. దీంతో, వంతెన నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని ప్రమాదాలు జరగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకొని.. మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు ప్రభుత్వాన్ని కోరారు. వంతెనలు ఇలా నిర్మించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రాజధాని భోపాల్లో ఐష్బాగ్ వద్ద రూ.18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు. అయితే, అది 90 డిగ్రీల మలుపు కలిగి ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్ను సమర్థించుకుంది. సమీపంలో మెట్రో రైల్ స్టేషన్, భూమి కొరత దృష్ట్యా ఇలా నిర్మించడం తప్పితే మరో మార్గం లేదని వివరణ ఇచ్చింది. ఇలాంటి డిజైన్లను రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు విధించింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజినీర్పై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. #WATCH | Madhya Pradesh | A newly-built bridge constructed in Bhopal's Aishbagh features a 90-degree turn pic.twitter.com/M1xrJxR45e— ANI (@ANI) June 12, 2025 -
రోడ్డుపై బిగ్బాస్ బ్యూటీ చిందులు.. బుల్లితెర భామ బర్త్ డే సెలబ్రేషన్స్!
రోడ్డుపై చిందులేస్తూ ఎంజాయ్ చేస్తోన్న బిగ్బాస్ బ్యూటీ దివి..బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న బుల్లితెర భామ జ్యోతిపూర్వాజ్..యూఎస్లో యాంకర్ శ్రీముఖి చిల్..రెడ్ శారీలో ఆదితి గౌతమ్ గ్లామరస్ లుక్..రెడ్ డ్రెస్లో హీరోయిన్ రెజీనా పోజులు.. View this post on Instagram A post shared by Kanduri SriRangaSudha (@im_ksudha) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
సందట్లో సడేమియా.. పాయె.. ఇది కూడా పాయె!
-రోబోలిప్పుడు క్షవర కళ్యాణానికీ ఎసరు పెట్టేశాయి!-ఇప్పటికైతే ఒక ట్రెండు చోట్ల మాత్రమే కానీ...-ఇంకొన్నేళ్లు పోతే మాత్రం సందు గొందులన్నింట్లోనూ-‘రోబో హెయిర్ కటింగ్ సెలూన్’లు వెలియడమైతే ఖాయం!!!రోబోలొస్తే ఉద్యోగాలు పోతాయని చాలా మంది చెబుతూనే ఉన్నారు. కానీ, పరిస్థితి మరీ క్షురకుల స్థాయికి చేరుతుందని మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఊహించారు. విషయం ఏమిటంటే.. నిన్న మొన్నటివరకూ ఏదో హాబీ కొద్ది ఒకరిద్దరు రోబోలతో వెంట్రుకలు కత్తిరించుకునేందుకు, షేవింగ్ చేయించుకునేందుకు ప్రయత్నించేవారేమో కానీ.. ఇప్పుడిప్పుడే ఇవి వాణిజ్యస్థాయిలో అంటే మన వీధి చివరి సెలూన్ల మాదిరిగా దుకాణాలు తెరవడం మొదలైంది. ఈ ట్రెండ్ ఊపందుకుందీ అనుకోండి.. క్షురకులు గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోవడం గ్యారెంటీ అంటున్నారు నిపుణులు!షేన్ వైటన్.. అమెరికా యూట్యూబర్ ఇతడు. ఇంజినీర్ కూడా. ఐదేళ్ల క్రితం ‘స్టఫ్ మేడ్ హియర్’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. తన బుర్రకొచ్చిన ఆలోచనలను యంత్రాలుగా మారుస్తుంటాడు. ఉదాహరణకు ఇతడు సృష్టించిన బాస్కెట్బాల్ హూప్ (కోర్టుకు ఇరువైపులా ఉండే బోర్డు)! బాల్ ఎలా విసిరినా సరే.. బోర్డు తనను తాను అడ్జెస్ట్ చేసుకుంటుంది. బాల్ కచ్చితంగా రంధ్రంలోకే పడుతుంది! అలాగే.. స్నూకర్ ఆడుతున్నప్పుడు బాల్స్ కచ్చితంగా బాల్స్ను రంధ్రాల్లో పడేలా స్పెషల్ ‘క్యూ’ను తయారు చేశాడు. This Video shows a real robotic barber.Similar tech exists, like Shane Wighton's project reported by Popular Mechanics and CNET. It aligns with demos from startups like Snips AI. pic.twitter.com/2sRHIYGUQI— The Artificial Intelligence Techie (@TheAItechie) July 2, 2025ఈ క్రమంలోనే ఈ యువ ఇంజినీర్కు హెయిర్ కట్కూ ఓ రోబో ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది. ఇంకేముంది.. రంగంలోకి దిగిపోయాడు. బోలెడన్ని విఫల ప్రయత్నాల తరువాత ఓ సక్సెస్ఫుల్ రోబో తయారైంది. వాక్యూమ్ క్లీనర్ వంటిదాన్ని ఉపయోగించి వెంట్రుకలన్నీ పైకి లేచేలా చేసి.. రోబో ద్వారా వెంట్రుకలు కత్తిరించేలా చేశాడు. తల మొత్తాన్ని త్రీడీ మ్యాపింగ్ చేసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు తల కదలికలను కూడా నమోదు చేసుకుంటూ కదులుతుందీ రోబో బార్బర్!.Basketball hoop that doesn't let you miss by Shane Wighton. pic.twitter.com/WP9tYoVLOP— MachinePix (@MachinePix) May 11, 2020ఇదొక్కటే కాదండోయ్.. స్టూడియో రెడ్ అనే కంపెనీ కెమెరాలు, ప్రెషర్ సెన్సర్ల సాయంతో వాణిజ్యస్థాయి రోబో బార్బర్ను రూపొందించే క్రమంలో ఉంది. నేడో రేపో మార్కెట్లోకి వచ్చేస్తుంది ఇది. ఇక ఆటోమెటిక్ హెయిర్ కట్టర్ రోబో గురించి.. త్రీడీ మోడలింగ్, వాక్యూమ్ సక్షన్తోపాటు మొబైల్ ఆప్ ద్వారా అవసరమైన ‘స్టైల్’ను సెలెక్ట్ చేసుకునేలా ఒక రోబోటిక్ వ్యవస్థను సిద్ధం చేసింది. దీనికి పేటెంట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతానికి నమూనా యంత్రాల తయారీ, పరీక్షలు జరుగుతున్నాయి! ఇవన్నీ ఆటోమెటిక్ రోబో బార్బర్లైతే.. రోబోకట్, ఫ్లోబీ సిస్టమ్స్ వంటివి సెమీ ఆటోమెటిక్ పద్ధతిలో ఇంట్లోనే కటింగ్, షేవింగ్ చేసుకునే యంత్రాలను రూపొందించే పనిలో ఉన్నాయి!.స్టూడియోరెడ్, షేన్ వైటన్ వంటివారు తాము తయారు చేసిన రోబో బార్బర్లను సెలూన్లలో పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఈ విషయంలో కృత్రిమ మేధ కూడా అడుగుపెట్టేసింది. బార్బర్ జీపీటీ మన ఫొటోలను వాడుకుని ఏ స్టైల్లో ఎలా కనిపిస్తామో చూపిస్తుంది. నచ్చినదాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే చాలు! క్ష... వ... రం... మొదలైపోతుంది!!.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
గాల్లో ఉన్న విమానంలో టెన్షన్.. ప్రయాణికుడిపై ఇషాన్ శర్మ దాడి
వాషింగ్టన్: భారత సంతతి ఇషాన్ శర్మ విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇషాన్ తీవ్రంగా గాయపడ్డాడు. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఇషాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ(21) అమెరికాలోని న్యూవార్క్లో నివసిస్తున్నాడు. జూలై 1న ఫిలడెల్ఫియా నుంచి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించాడు. ఆ విమానం గాలిలో ఉన్న సమయంలో ఇషాన్ శర్మ నవ్వడం, ఏదో మాట్లాడటంపై ముందు సీటులో కూర్చొన్న కీన్ ఎవాన్స్ ఆందోళన చెందాడు. అనంతరం, క్యాబిన్ సిబ్బంది సహాయం కోరే బటన్ నొక్కాడు. అది గమనించిన ఇషాన్ శర్మ.. ఎవాన్స్ను అడ్డుకుని అతడి గొంతుపట్టుకుని కొట్టాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం పీక్ స్టేజ్కు చేరుకుంది.ఆగ్రహంతో ఎవాన్స్ కూడా తిరిగి శర్మను కొట్టడంతో అతడి కంటికి గాయమైంది. గొడవ పెద్దది కావడంతో విమాన సిబ్బంది వారిద్దరిని నిలువరించారు. ఆ విమానం మయామిలో ల్యాండ్ కాగానే భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇషాన్ శర్మ తనపై దాడికి ముందు ‘హా హ హ హ హ హ’ అంటూ నవ్వాడని, తనను కించపర్చడంతోపాటు చస్తావని బెదిరించినట్లు ఎవాన్స్ ఆరోపించాడు. అనంతరం, ఇషాన్ తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఇషాన్ శర్మ విమానంలో ధ్యానం చేస్తున్నాడని తెలిపారు. అయితే తనను ఎగతాళి చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లుగా ఎవాన్స్ భావించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఎవాన్స్ను కొట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. No more vacation…🫣| #ONLYinDADE * Man gets kicked off of Frontier flight after getting into altercation pic.twitter.com/us6ipoW5E7— ONLY in DADE (@ONLYinDADE) July 1, 2025 -
ఇంటర్నెట్ను ఈ వీడియో కుదిపేయకపోతే మంచిదే!
విజయ్ మాల్యా-లలిత్ మోదీ.. ఒకప్పుడు వీవీఐపీలుగా చెలామణి అయిన పెద్ద మనుషులు. ఇప్పుడు భారత ప్రభుత్వం దృష్టిలో ఆర్థిక నేరగాళ్లుగా పరాయి దేశాల్లో తలదాచుకుంటున్న వ్యక్తులు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఓ పార్టీలో తెగ ఎంజాయ్ చేస్తూ గడిపిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. I Did It My Way అంటూ అలనాటి అమెరికన్ సింగర్ ఫ్రాంక్ సినాత్రా(Frank Sinatra) పాడిన ప్రసిద్ధ గీతాన్ని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ-పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కలిసి ఆలపించారు. లండన్లో గత ఆదివారం తన నివాసంలో లలిత్ మోదీ ఇచ్చిన పార్టీలో ఇది జరిగింది. ఈ విలాసవంతమైన పార్టీ వీడియోను ఈ వీడియోను లలిత్ మోదీ స్వయంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. పైగా ముందుగానే ఏం జరుగుతుందో ఊహిస్తూనే.. “Controversial for sure. But that’s what I do best” అంటూ సందేశం ఉంచారు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్ను లలిత్ మోదీ తన నివాసంలోనే నిర్వహించారట. ప్రపంచం నలుమూలల నుంచి 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారని ఆయన తెలిపారు. వాళ్లలో విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ కూడా ఉన్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ను కుదిపేయకపోతే మంచిదే. వివాదాస్పదమైతే ఏముంది... అదే నా స్టైల్! అంటూ లలిత్ మోదీ చివర్లో సందేశం ఉంచారు. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi)గేల్ గతంలో ఐపీఎల్ ఆర్సీబీ జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. గేల్ సైతం తన మాజీ బాస్లు లలిత్ మోదీ, మాల్యాలతో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ, “We living it up. Thanks for a lovely evening” అని రాశారు. లలిత్ మోదీ 2010లో భారతదేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్కు కావలసిన నిందితుడు. 2017లో లండన్లో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఈ ఇద్దరూ చట్టపరమైన చిక్కుల్లో ఉన్నప్పటికీ.. తరచూ ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు చేస్తుండడం, పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తుండడం అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. -
కలర్ ఫుల్ శారీలో అనసూయ.. బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ విష్ణుప్రియ గ్లామరస్ లుక్స్!
కుమారుడితో హీరోయిన్ అమలాపాల్ పోజులు..కలర్ఫుల్ శారీలో అనసూయ అదిరిపోయే లుక్స్..మొబైల్తో బిజీ బిజీగా సురేఖవాణి కూతురు సుప్రీత..బ్లాక్ బ్యూటీలా బిగ్బాస్ ముద్దుగుమ్మ విష్ణు ప్రియ.. View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం
-
‘స్కామర్..’: భారతీయ టెకీపై అమెరికా సీఈవోలు ధ్వజం
అమెరికాకు చెందిన అయిదు కంపెనీల సీఈవోలను మోసం చేశాడంటూ భారత్కు చెందిన టెకీపై ఆరోపణలు గుప్పుమన్నాయి.'స్కామర్' అంటూ ఐదుగురు సీఈవోలు భారతీయ టెక్కీపై ఆరోపణలు గుప్పించారు. అతనితో జాగ్రత్త అంటూ బహిరంగంగా స్టార్టప్లను హెచ్చరించడం టెక్ సర్కిల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంతకీ ఎవరీ టెకీ, అసలు వివాదం ఏమిటిభారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోహమ్ పరేఖ్ బహుళ స్టార్టప్లలో ఒకేసారి మూన్లైట్ (ఒకేసారి వివిధ కంపెనీల్లో పనిచేయడం) చేసినట్లు, యజమానులను మోసం చేసి, స్టార్టప్ కంపెనీలకు మోసగించాడు అనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని తొలుత మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO సుహైల్ దోషి వెలుగులోకి తెచ్చారు. పరేఖ్ తప్పుడు సాకులతో ఒకేసారి బహుళ స్టార్టప్లను మోసం చేస్తున్నాడన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. పరేఖ్ తన కంపెనీ ప్లేగ్రౌండ్ AIలో కొంతకాలం ఉద్యోగంలో ఉన్నాడని, కానీ అతని నిజాయితీ లేని ప్రవర్తన కారణంగా వారంలోనే అతనిని తొలగించామని వెల్లడించారు.Guys we found Soham Parekh! pic.twitter.com/bWnODxbM8l— Satwik Singh (@itsmesatwik_) July 3, 2025 పరేఖ్ను బహుళ కంపెనీలలో మూన్లైటింగ్ ఆపమని తాను హెచ్చరించానని, కానీ అతని పట్టించుకోలేదు, అబద్ధాలు, మోసాలు ఆపమని చెస్పినా, ఏడాది తర్వాత కూడా అదే కొనసాగించాడు. అందుకే తీసి వేశామన్నారు. ఒకేసారి 3-4 స్టార్టప్లలో ఉద్యోగాలు చేశాడని ఆరోపించారు. తన వాదనలకు బలం చేకూర్చేలా పరేఖ్ CVని పోస్ట్ చేశాడు. PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.— Suhail (@Suhail) July 2, 2025 ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 1.28 కోట్ల వ్యూస్ వచ్చాయి. అనేకమంది కంపెనీ యజమానులు ఆయనకు మద్దుతుగా నిలిచారు. ముఖ్యంగా ఫ్లీట్ AI సహ వ్యవస్థాపకుడు , CEO నికోలాయ్ ఔపోరోవ్ ఇవే ఆరోపణలు గుప్పించారు. ఇంకా AIVideo సహ వ్యవస్థాపకుడు జస్టిన్ హార్వే, అని మరొక స్టార్టప్, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ ఇదే ఆరోపణలను ధృవీకరించారు, ఇంటర్వ్యూలలో బాగానే ఉన్నాడు కానీ అతను అబద్ధాలకోరు అని వ్యాఖ్యానించడం గమనార్హం. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్హర్స్ట్ ఏమంటారంటే.. సోహామ్ 2022లో కంపెనీలో ఇంజనీర్గా చేరాడు. తెలివైన వాడే.. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని చాలా తొందరగానే గమనించాం. అందుకే అతణ్ని తొలగించామన్నారు. అంతేకాదు పరేఖ్ ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ జార్జియా టెక్ నుండి మాస్టర్స్ డిగ్రీ బహుశా 90 శాతం నకిలీదేమో అన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు. నేను ఉద్యోగం లేక బాధపడుతోంటే, సోహమ్ పరేఖ్ను 79 సార్లు హైర్ చేసుకున్నారా అంటూ విచారం వ్యక్తం చేశాడో నిరుద్యోగ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే సోహమ్ పరేఖ్ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.అయితే తప్పేంటి?మూన్లైటింగ్ తప్పు అని మీరు ఎందుకనుకుంటున్నారు. అతను ఇంటర్వ్యూలలో పాస్ అయ్యాడు. బెస్ట్ అనే కదా మీరు అతణ్ని తీసుకున్నారు. అతను సరైన వైఖరితో సమయానికి అన్ని పనులను పూర్తి చేసినంత కాలంతప్పేంటి అంటూ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మరో టెక్నిపుణురాలు ట్వీట్ చేశారు. -
గాల్లో ప్రాణాలు.. ఫోన్లలో వీలునామాలు
టోక్యో: తరుణ్, జెనీలియా జంటగా గతంలో వచ్చిన ‘శశిరేఖా పరిణయం’సినిమాలో గాయాలపాలైన హీరోయిన్ చనిపోతానన్న భయంతో అప్పటికప్పుడు తన ప్రేమను హీరోకు చెప్తుంది. అచ్చం అలాగే తాము చనిపోవడం ఖాయమని భావించిన విమాన ప్రయాణికులు అప్పటికప్పుడు తమ ఆస్తులు ఎవరికి దక్కాలో స్మార్ఫోన్లలో వీలునామాలు, పాస్వర్డ్లు రాసి తమ వారికి సందేశాలుగా పంపించారు. ఈ ఘటన జపాన్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జూన్ 30న చైనాలోని షాంఘై పుడోంగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరిన విమానం మార్గమధ్యంలో ఇలా సాంకేతిక లోపంతో హఠాత్తుగా కిందకు దిగొచ్చి ప్రయాణికులకు గాల్లోనే చుక్కలు చూపించింది. చివరకు పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎలాగోలా విమానాన్ని సమీప ఒసాకా నగరంలోని కన్సాయ్ విమానాశ్రయంలో రాత్రి 8.50 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, సిబ్బందిసహా విమానంలోని మొత్తం 191 మంది ఊపిరి పీల్చుకున్నారు. A Spring Airlines flight from Shanghai to Tokyo was forced to make an emergency landing at Kansai Airport after a sudden loss of cabin pressure triggered a rapid descent from 36,000 feet to just under 10,500 feet in ten minutes.Flight JL8696 was cruising over Japan when a… pic.twitter.com/2n8rDGfqu5— FL360aero (@fl360aero) July 1, 2025జపాన్లోని టోక్యో నరీటా ఎయిర్పోర్ట్కు బయల్దేరిన ఈ బోయింగ్ 737 విమానం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 6.53 నిమిషాలకు ఈ అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంది. విమానంలో తలెత్తిన ఈ సాంకేతిక సమస్యపై ఇప్పుడు సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. రాత్రివేళ హాయిగా నిద్రపోతున్న వేళ విమానం ఒక్కసారిగా కుదుపునకు లోనై కిందకు దూసుకురావడం, ప్రయాణికులు ఉన్నట్లుండి తమ సీట్లలోంచి ఎగిరి పైకప్పునకు ఢీకొనడం, ఆక్సీజన్లు మాసు్కలు పెట్టుకోండని సహాయక సిబ్బంది ఏడుస్తూ చెప్పిన దృశ్యాలను కొందరు ప్రయాణికులు రికార్డ్చేశారు.Passengers on a Japan Airlines flight had to wear oxygen masks after the plane fell nearly 26,000 feet pic.twitter.com/5nseotGv3n— daredevil (@daredevil_1010) July 2, 2025ఇక, తాము ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై చనిపోతామని భావించిన ప్రయాణీకులు.. అప్పటికప్పుడు తమ ఆస్తులు ఎవరికి దక్కాలో స్మార్ఫోన్లలో వీలునామాలు రాసి తమ వారికి సందేశాలుగా పంపించారు. ఇంకొందరేమో తమ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ల పిన్ నంబర్లు, లాగిన్ పాస్వర్డ్లు పంపించారు. మరి కొందరు బీమా మొత్తాలు, ఇన్సూరెన్స్ కంపెనీల వివరాలను మెసేజ్లుగా పంపించారు. 36,000 అడుగుల ఎత్తు నుంచి విమానం 10,500 అడుగుల దిగువకు స్వేచ్ఛగా పడిపోతుండటంతో తాము చనిపోవడం ఖాయమని భావించిన చాలా మంది ప్రయాణికులు ఇలా తమ చివరి కోరికలు, వీలునామాలను స్మార్ట్ఫోన్లో తమ కుటుంబసభ్యులకు చేరవేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
తమిళనాడులో అక్కినేని కోడలు శోభిత..ఫ్యాషన్ డ్రెస్లో మిల్కీ బ్యూటీ తమన్నా!
తమిళనాడులో ఎంజాయ్ చేస్తోన్న అక్కినేని కోడలు శోభిత..శారీలో అనుపమ పరమేశ్వరన్ క్యూట్ లుక్స్..ఫ్యాషన్ డ్రెస్లో మిల్కీ బ్యూటీ తమన్నా హోయలు..కలర్ఫుల్ శారీలో టాలీవుడ్ నటి శాన్వీ మేఘన..పింక్ శారీలో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ గ్లామరస్ లుక్స్.. View this post on Instagram A post shared by Seetha🦋🇮🇳 (@kirrakseetha) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by PARVATHY KRISHNA (@parvathy_r_krishna) -
స్మార్ట్ఫోన్కు అడిక్ట్ అయ్యారా?ఈ వీడియో చూడండి!
స్మార్ట్ఫోన్కు పిల్లా పెద్దా అంతా బందీ. నిద్ర లేచించి మొదలు రాత్రి పడుకునేదాకా స్మార్ట్ఫోన్ చేతిలో లేందే క్షణం గడవదు అన్నట్టుగా స్మార్ట్ఫోన్ అడిక్షన్ అనడంలో ఎలాంటి సందేహహంలేదు. ఏ పనిచేస్తున్నా, తింటున్నా.. ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకుంటున్నా సరే ‘సెల్’ చేతిలో ఉండాల్సిందే. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో మోజులో పడి కొట్టుకుపోతున్నారు. దీనిపై తల్లిదండ్రులు, నిపుణులు ఎంత మొత్తుకుంటున్నా ఏమాత్రం ఫలితం ఉండటం లేదు. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదేంటో చూద్దాం.చదవండి: ఎంత కష్టపడినా వెయిట్ తగ్గడం లేదా? ఇవిగో టాప్ సీక్రెట్స్!పొద్దున్న లేచింది మొదలు స్మార్ట్ఫోన్ను ఇడ్సిపెడ్తలేరు.. ఇక వేరే పనేలేదు ఇది ఇంటింటి రామాయణం అన్నట్టు ప్రతి ఇంట్లోనే ఉండే తంతే. తల్లిదండ్రులు చివాట్లు పెట్టడంతో ఆ కాసేపు జాగ్రత్తగా ఉండటం, తరువాత షరా మామూలే. అలాగే ఒక టీనేజ్ అమ్మాయి భోజనం చేస్తూ స్మార్ట్ఫోన్ను చూస్తూనే ఉంటుంది. సెల్ఫీ తీసుకుంటోందో ఏమో గానీ అసలు ఏం తింటున్నా అనే సోయ లేకుండా ఉంటుంది. దీంతో చిర్రొత్తు కొచ్చిన ఒక పెద్దావిడ (బహుశా ఆ యువతి తల్లి కావచ్చు) పరుగెత్తుకొచ్చి, ఫోన్తో కలిపి ఒక పెద్ద ప్లాస్టర్ చుట్టేసింది. ఆమె ఎంత విసిగెత్తిపోయిందీ ఆ ప్లాస్టర్ను చుట్టిన తీరును బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఐకానిక్ ఆటో: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్, ధర తెలిస్తే.!😂 I laughed too hard at this. pic.twitter.com/1FQ0b0D7AG— Catturd ™ (@catturd2) July 1, 2025ఎక్స్లో షేర్అయిన ఈ వీడియో 50 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. వీడియోలో చైనీస్ టెక్స్ట్ ను మనం గమనించవచ్చు. ‘లగెత్తరా ఆజామూ’ అంటూ నెటజన్లు ఛలోక్తులు విసురుతున్నరాఉ. ఇది ప్రాంక్ వీడియో కావచ్చని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నవ్వులు పూయిస్తోంది. -
ఐకానిక్ ఆటో: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్, ధర తెలిస్తే.!
మొన్న కొల్హాపురి చెప్పుల్ని పోలిన ప్రాడా చెప్పులు సంచలనం రేపాయి. ఇపుడు లూయిస్ విట్టన్ రిక్షా ఆకారంలో లాంచ్ చేసిన లగ్జరీ బ్యాగ్ నెట్టింట సందడిగా మారింది. ప్రస్తుతం హాట్టాపిక్గా నిలిచిన ఈ హ్యాండ్బ్యాగ్ ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డైట్ పరాత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ 2026 కలెక్షన్ ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. ఇండియన్ ఆటోరిక్షా ఆకారంలో వచ్చిన హ్యాండ్బ్యాగ్ ఈ సీజన్లో భారతదేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఆటో-రిక్షా ప్రేరణతో లూయిస్ విట్టన్ కొత్త హ్యాండ్బ్యాగ్దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ మూల మూలలా సందడిగా తిరిగే ఐకానిక్ ఆటో ఆకారంలో లగ్జరీ హ్యాండ్బ్యాగ్ను తీసుకొచ్చి లూయిస్ విట్టన్. లూయిస్ విట్టన్ సిగ్నేచర్ మోనోగ్రామ్ కాన్వాస్తో బుల్లి చక్రాలు (ఇవి పనిచేస్తాయి కూడా) హ్యాండిల్బార్..ఇలా అచ్చం ఆటోలాగానే దీన్ని రూపొందించారు. View this post on Instagram A post shared by Urban NXT | Luxury Platform (@urban.nxt) ఇలాంటి కళా ఖండాలను మార్కెట్లోకి తీసుకురావడం LVకి కొత్త కాదు, ఇది గతంలో విమానాలు, డాల్ఫిన్లు, పీత ఆకారంలో ఉన్న బ్యాగులను ఆవిష్కరించింది. అయితే, ఆటోరిక్షా బ్యాగ్ మాత్రం స్ట్రీట్కల్చర్కి ప్రతిబింబంగా నిలుస్తోందంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. దీనిక ఖరీదుఎంతో తెలిస్తే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిపనేలేదే. లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఎల్వీ తీసుకొచ్చిన ఈ బ్యాగ్ ధర . 35 లక్షలట. View this post on Instagram A post shared by Diet Paratha (@diet_paratha)నెటిజన్ల స్పందనవేలాది లైక్లు, కమెంట్స్, జోక్స్తో ఈ హ్యాండ్బ్యాగ్ ఫోటోలు నెట్టింట్ వైరల్ అయ్యాయి. లగ్జరీ బ్యాగ్ ధర కూడా లగ్జరీగానే ఉంటుందా? " బావుంది! కానీ చాందినీ చౌక్లో విడుదలయ్యే వరకు నేను వెయిట్ చేస్తా" అని ఒకర చమత్కరించగా, మరొకరు, "నా అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ బ్యాగ్ ఖరీదైందా? లేక ఆటో ఖరీదైనదా?" అని ఒకరు, "సరే, మీటర్ ప్రకారం దాని ధర నిర్ణయిస్తారా?" అని మరొకరు చమత్కరించారు. -
సోషల్ మీడియా వరమా? శాపమా? బాధితులెవరు? ఏం చేయాలి?
విజయనగరం గంటస్తంభం: సోషల్ మీడియా (Social Media) ఇప్పుడు మనిషి నిత్యకృత్యాల్లో ఓ భాగమైంది. బంధుమిత్రులతో కనెక్ట్ అవ్వడానికి మంచి వేదికైంది. అనుభావాలను, అలవాట్లను, ఆలోచనలను పంచుకునే చోటు. ఇది కొంతమేర బాగానే ఉన్నా ఎదుటివారి ‘సోషల్ బతుకు’లను చూస్తూ కుంగుబాటుకు లోనవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇతరుల వివరాలు, వినోదాలు, విలాసాలను చూస్తూ.. చాలామంది.తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో మనం చూసే ప్రతిదీ నిజమేనా? అంటే..‘కాదు’ అనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకుంటే ‘ఫ్యామిలీ ఓవర్ ఎవ్రీ«థింగ్’ అంటూ ఫొటోను స్టేటస్ పెట్టుకునేవారు పట్టుమని పది నిమిషాలు కూడా ఫ్యావిులీతో గడపకపోవచ్చు. ‘ఫ్రెండ్స్ ఫర్ లైఫ్’ అనేవారు అసలు స్నేహితులే లేకపోవచ్చు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ అర్ధరాత్రి పూట పోస్టులు పెడుతుండవచ్చు, నిద్రపోకుండా ఆరోగ్యం పాడుచేసుకోవచ్చు. ‘అమ్మే దైవం’ అని ఎమోషనల్ క్యాప్షన్స్ పెట్టేవారంతా అమ్మకు పనుల్లో సాయం చేస్తారన్నది అపోహే. పొద్దున నిద్ర లేదగానే దేవుడి వీడియోలను స్టేటస్లుగా పెట్టుకున్నవారు మంచి మనుషులని ఏ తప్పూ చేయని వారని అనుకుంటే పొరపాటే. పిల్లికి బిచ్చం వేయనివారే ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడుపడవోయ్’ అంటూ ఫోజులు కొట్టవచ్చు. నువ్వు లేనిదే నేను లేనంటూ ఇన్ బాక్స్ల్లో ప్రేమ పాఠాలు వల్లె వేసేవారు..ఆ మాటే మరొకరికి చెప్పరని గ్యారంటీ లేదు. ఖరీదైన కారు ముందో, విలాసవంతమైన భవనం ముందో నిలబడి ఫొటోలు పెడితే వాళ్ల వైభోగాన్ని చూసి అసూయ కలుగుతుంది. కానీ అవి వాళ్ల సొంతమేనా కాదా? వారికి ఆ తాహతుందా, లేక ఆర్భాటాలకు పోయి ఆనక అప్పులతో ఇబ్బందులు పడుతున్నారా? అవేవీ మనకు తెలియదు. ఫొటోల కోసం ఎవరికో ఏదో సాయం చేస్తున్నట్లు నటించేవారు పెరుగుతున్నారని వారి సోషల్ మీడియా పోస్టులే చెబుతుంటాయి. ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లలో అందమైన అమ్మాయిలు ఫొటోలు చూసి ఆత్మన్యూనతకు లోనయ్యేవారు, తామూ అలాగే కనపడాలని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్న వారూ లేకపోలేదు. ఫొటోలకు ఫిల్టర్లు ఉంటాయని ఎలాంటి వారైనా అందంగా కనిపించవచ్చని ఆ క్షణం స్ఫురించదు. తెరమీద కనిపించేవన్నీ ఫిల్టరేసిన బతుకులు. నిజజీవితాలు కాదు. నిజాయతీగా ఉన్నదున్నట్లు చూపించుకునేవారూ ఉంటారు. కాకపోతే వారిది ప్రదర్శనలా ఉండదు. ఎవరికీ ఇబ్బంది కలిగించదు. లేనిది ఉన్నట్లూ ఉన్నది లేనట్లూ చూపించుకోవడానికి సోషల్ మీడియాను మయసభలా వాడుకునే వారితోనే సమస్యంతా. మంచికి వాడుకుందాం.. పోస్టులు పెడుతుంటారు, సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ, విధానాపరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి.ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలు, న్యాయపరమైన విధానాలపై వచ్చే పోస్టులను ఇతరులకు పంపడం ద్వారా చిక్కుల్లో పడుతుంటాం. అనవసరంగా పోలీసు కేసుల బారిన పడుతుంటాం.అటువంటి సమయంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సాక్ష్యాలుగా చూపుతున్నారు పోలీసులు. లేనిపోని లింకులు క్లిక్ చేయడం, పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అడిక్షన్ ఉందో లేదో ఇలా గుర్తించొచ్చు...సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనికి బదులు ఫోన్లో యాప్లను తెరిస్తే అది వ్యసనానికి సంకేతంగా చెబుతున్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్ ఫోన్ను తీసుకోవడం, మెస్సేజ్లను చూడడం.ప్రతి చిన్న సమస్యకు పరిష్కారంగా ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడడం.సెల్ఫీల మోజు బాగా పెరిగింది..సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. అతిగా సెల్ఫోన్ వినియోగంచడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక యువతకు సెల్ఫీ మోజు బాగా పెరిగింది. సెల్ఫీ మోజులో ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. దీంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. -వై.సతీష్ కుమార్, సీనియర్ కెమిస్ట్రీ లెక్చరర్, విజయనగరం తల్లిదండ్రులు నియంత్రించాలి..అనవసరమైన వయస్సులో పిల్లలకు సెల్ఫోన్ ఇవ్వకూడదు. యువత ఫోన్లను విపరీతంగా వాడుతోంది. సరదా కోసం తీస్తున్న సెల్ఫీలు చివరకు ప్రాణాల మీదికి తెస్తున్నాయి.– ప్రశాంత్ కుమార్ ఎంఎస్సీ సైకాలజీ, విజయనగరం -
లండన్లో రష్మిక చిల్.. జూన్ జ్ఞాపకాల్లో చాహల్ మాజీ భార్య ధనశ్రీ!
లండన్లో చిల్ అవుతోన్న రష్మిక మందన్నా..జూన్ జ్ఞాపకాల్లో చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ..ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గ్లామరస్ లుక్స్..అదిరిపోయే అవుట్ఫిట్లో అరియానా గ్లోరీ..వెకేషన్లో నిషా అగర్వాల్ చిల్.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
గూఫీ విషయాలు చెప్పేస్తున్నా.. ‘రా’ కోరుకుంటా..రష్మిక మందన్న కామెంట్స్
ప్రస్తుతం రష్మిక మందన్న అంటే నేషనల్ క్రష్...మెగాస్టార్ చిరంజీవి సైతం తన అభిమానాన్ని దాచుకోలేనంటూ మాట్లాడేంత స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతం ఈ సౌత్ బ్యూటీ ఏం మాట్లాడినా, ఏం చేసినా సెన్సేషన్. వరుస విజయాల ఈ కధానాయిక పంచుకునే విశేషాల కోసం సోషల్ మీడియా నిరంతరం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే... రష్మిక మందన్న తొలిసారిగా స్నాప్ చాట్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది.ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాల తర్వాత అదే స్థాయిలో ఇండియన్ యువతను ఆకట్టుకుంటున్న స్నాప్చాట్ లో ఆమె ఖాతా తెరవడం అభిమానులకు మరిన్ని విశేషాలతో కనువిందు చేయడమే అనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ‘‘నేను ఎల్లప్పుడూ కొంచెం ‘రా’ గా( పచ్చిగా) కొంచెం వాస్తవంగా ఉండగలిగే ప్రదేశాలనే కోరుకుంటాను. అదే క్రమంలో ఇప్పుడు, స్నాప్చాట్లో ప్రవేశించాను. దీని ద్వారా నా తెర వెనుక క్షణాలు, నా చిన్న చిన్న ఆనందాలు కూడా పంచుకుంటాను.అంతేకాదు గూఫీ విషయాలు (చిన్న చిన్న పొరపాట్లు, తడబాట్లు, నవ్వు తెప్పించే చిరు తప్పిదాలు..వగైరా) కూడా. మధ్యలో ఉన్న ప్రతిదాన్ని (నా సోషల్ మీడియా బృందం చేసే ముందు కూడా) పంచుకునే సమయం ఇది. మీరు దీన్ని చూస్తుంటే, చాలా ధన్యవాదాలు, అభిమానులు ఇప్పటివరకు ప్రతిదానిలో అక్షరాలా భాగమయ్యారు వారికి ఇంకా ఎక్కువ సమయం అందివ్వడానికి నేను వేచి ఉండలేను. త్వరలో మిమ్మల్ని కలుస్తాను, నా ప్రేమికులారా ’’అని రష్మిక మందన్న ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో వేచి చూద్దాం..స్నాప్చాట్ వేదికగా ఈ నేషనల్ క్రష్ సృష్టించే జోష్ ఎలా ఉంటుందో... -
బెజోస్తో పెళ్లి, ఆ పోస్ట్లన్నీమాయం, పేరు మార్చేసిన లారెన్ సాంచెజ్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీలోని వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంతవిలాసవంతమైన ఈ వివాహానికి పలువురు గ్లోబల్ సెలబ్రిటీలు విచ్చేశారు.. వివాహానికి సంబంధించిన చిత్రాలు, వివాహ ఖర్చు, ముఖ్యంగా లారెన్ సాంచెజ్, జెఫ్ బెజోస్ దుస్తులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం మరో విషయం ట్రెండింగ్లో నిలిచింది.జెఫ్ బెజోస్తో పెళ్లి తరువాత లారెన్ సాంచెజ్ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి అయిన కొన్ని గంటల తర్వాత, సాంచెజ్ తన పాత ఇన్స్టాగ్రామ్ ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. కేవలం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాత్రమే ఉంచింది. అంతేకాదు తన ఇంటి పేరును కూడా మార్చేసింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను "లారెన్ సాంచెజ్ బెజోస్" గా మార్చుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్గా నిలిచింది.ఇదీ చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos) జెఫ్ బెజోస్ ఏకంగారూ.548 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ బ్లాక్ కోట్ ధరించగా, సాంచెజ్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కర్దేషియాన్, కోలే కర్దేషియాన్, జోర్డాన్ రాణి రనియా, భారత్కు ఫ్యాషన్ ఐకాన్, వ్యాపారవేత్త భార్య నటాషా పూనా వాలా తదితరులు హాజరయ్యారు. -
రెజీనా గ్లామరస్ లుక్స్... బర్త్ డే పార్టీలో తమన్నా చిల్!
బర్త్ డే పార్టీలో ఎంజాయ్ చేస్తోన్న తమన్నా భాటియా..వెబ్ సిరీస్ జ్ఞాపకాల్లో శ్వేతాబసు ప్రసాద్..గ్రీన్ డ్రెస్లో అందాలు ఆరబోస్తోన్న రెజీనా కసాండ్రా..వెకేషన్లో చిల్ అవుతోన్న శిల్పా శిరోద్కర్..డిఫరెంట్ లుక్స్లో ఆదా శర్మ పోజులు పట్టు పరికిణీలో నటి శృతిక అర్జున్ హోయలు.. View this post on Instagram A post shared by Shrutika Arjun (@shrutika_arjun) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
జనసేన కార్యకర్తనని చిన్నచూపా?
చిత్తూరు జిల్లా: ‘కూటమి ప్రభుత్వంలో జనసేన కార్యకర్తలను అసలు పట్టించుకోరా? బిడ్డకు లివర్ మార్పిడి సర్జరీ కోసం సీఎం చంద్రబాబును కలిసేందుకు సిఫార్సు లేఖపై సంతకం పెట్టమని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని అడిగితే స్థానిక టీడీపీ నాయకుల మాటలు విని సంతకం పెట్టలేదు. నా బిడ్డ చనిపోయింది’ అంటూ చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీ కైగల్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే జనసేన కార్యకర్త మృతి చెందిన బిడ్డ, లేఖ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు వైరల్గా మారింది. అందులోని విషయం ఏమిటంటే... శ్రీనివాసులు జనసేన పార్టీ కార్యకర్త. కూలీ చేసుకునే ఇతనికి ముగ్గురు పిల్లలు. రెండో కుమార్తె సౌమ్యకు పచ్చకామెర్లు ముదిరి కాలేయం దెబ్బతింది. దీంతో పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించారు. అయితే వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని, అందుకోసం రూ.30 లక్షల దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబును కలిసి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సాయం పొందే అవకాశం ఉందని కొందరు చెప్పడంతో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సిఫార్సు సంతకం కోసం వెళ్లగా ఆయన లోకల్ నాయకుల మాట విని సంతకం పెట్టలేదు. పరిస్థితి విషమించి ఈ నెల 24న ఆ పాప మృతి చెందింది. -
తీవ్ర వ్యసనం
మొన్నటి మేలో కర్నాటకలోని ఉడిపిలో ఒక సంఘటన జరిగింది. రోడ్డు మీద తిరుగుతున్న ఒక పిచ్చివాణ్ణి ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సంరక్షించి, వైద్యం చేయించి, తిరిగి మామూలు మనిషిని చేశాడు. మెల్లగా ఆ కోలుకున్న వ్యక్తి తమిళుడని, సొంత ఊరు కుంభకోణం అని తెలిసింది. అతని మనుషులు వెతుక్కుంటూ వచ్చారు. ‘ఇతను ఆరునెలలుగా కనిపించకుండా పోయాడు. దానికి ముందు ఫోన్లో రీల్స్ చూస్తూ కుటుంబంతో మాట్లాడక, స్నానం చేయక, తిండి తినక అదే లోకంగా ఉండేవాడు. ఆ తర్వాత ఈ స్థితిలో దొరికాడు’ అని చెప్పి తీసుకెళ్లారు. రీల్స్ను వరుసపెట్టి చూడటానికి ‘డూమ్ స్క్రోలింగ్’ అంటున్నారు నిపుణులు. రీల్స్ మనిషి మెదడును ఏ విధంగా ఆక్రమించగలదో ఇదొక ఉదాహరణ.ఇటీవలే గుజరాత్లోని వడోదరలో మరో ఘటన జరిగింది. అక్కడి ఒక కొడుకు తన భార్యతో కలిసి పోలీసుల సహాయం కోరుతూ ఫోన్ చేశాడు. దానికి కారణం ఆ ఇంట్లోని తల్లి రీల్స్లో పడి తిండి తినడం మానేసింది. కొడుకు, కోడలు డ్యూటీకి వెళుతుంటే ఆమెకు బోర్ కొట్టి రీల్స్ చూడటానికి అలవాటు పడిందట. ఆ రీల్స్లో కూడా ఒక ఇన్ఫ్లూయెన్సర్ పెట్టే రీల్స్ చూస్తుందట. వాటికింద కామెంట్స్ పెడుతుందట. ఆ కామెంట్స్కు ఆ ఇన్ఫ్లూయెన్సర్ రియాక్ట్ అయితే ఆమెకు సంతోషం. లేదంటే అప్సెట్ అయ్యి అన్నం తినదు. కొడుకు కోడలు ఆమె ఫోన్ నుంచి ఇన్స్టా యాప్ను తొలగించారు. దాంతో ఇంకా పెద్ద గొడవ జరిగి, ఆమె అన్నం తినడం మానేసింది. దాంతో ఇప్పుడా కొడుకు, కోడలు తల పట్టుకుని కూచుని ఉన్నారు.అసలు రీల్స్ అంటే ఏమిటి? కొన్ని సెకన్ల విన్యాసం. 2020లో మన దేశంలో టిక్టాక్ను నిషేధించాక, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో 90 సెకన్ల నుంచి 3 నిమిషాల వీడియోస్ను ప్రవేశ పెట్టింది. వీటిద్వారా గుర్తింపు, పేరు, ఫాలోయెర్సు తద్వారా డబ్బు... ఇవన్నీ వచ్చేసరికి కేవలం రీల్స్ మీద ఆధారపడినవారు కోకొల్లలుగా పెరిగారు. వీరు రకరకాల విన్యాసాలతో నిత్యం వేలకొద్దీ రీల్స్ వదులుతుంటారు. అవి చూడటానికి ఎవరికైనా, ఎన్ని సంవత్సరాలైనా సరిపోవు. ఆ సంగతి గ్రహించి ఎప్పుడైనా సరదాగా చూసి ఫోన్ కట్టేయాలి తప్పితే వాటిలోనే కూరుకుపోతే మెదడు ఆ రీల్స్కు బానిసవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చేయి విరగ్గొట్టుకున్న అమ్మాయిఅహ్మదాబాద్లో నర్సింగ్ కోర్సులో చేరిన ఒక అమ్మాయి హాస్టల్లో బోరు కొడుతున్నదని రీల్స్ చూడటానికి అలవాటు పడింది. పరీక్షలు వచ్చాయి. రీల్స్ చూడాలంటే పరీక్షలు రాయకూడదని ఆ అమ్మాయి తన కుడి చేతిని బల్ల మీద పదేపదే బాది విరగ్గొట్టుకుంది. ఇలా ఉంటాయి రీల్స్ ఉత్పాతాలు.బి.పి. పెరుగుతుందిచైనాలోని హైబె మెడికల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం రీల్స్ వల్ల 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారిలో బి.పి. పెరుగుతుందని నిరూపణ అయ్యింది. రీల్స్లోని కంటెంట్ ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా కొనసాగుతూ మూడ్స్ను హెచ్చుతగ్గులు తెచ్చిపెడుతుండటం వల్ల ఇలా జరుగుతుంది. రాత్రివేళ గంటలు గంటలు రీల్స్ చూస్తూ నిద్ర పాడుచేసుకుని ఉద్యోగాల్లో కునికిపాట్లు పడుతున్నవారు వేలమంది ఉన్నారు. ఇక దేహం కదల్చకుండా ఉండటం వల్ల వస్తున్న శారీరక సమస్యలు ఎన్నో.టీవీ నయంరీల్స్ చూడటం కన్నా టీవీ చూడటం నయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీవీ చూస్తూ కనీసం ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయొచ్చు. లేదా పుస్తకాల ర్యాక్ సర్దుకోవచ్చు. లేదా బట్టలు మడతపెట్టడమో, కూరగాయలు తరగడమో... ఏదో ఒక పని టీవీ చూస్తూ చేయొచ్చు. రీల్స్ చూడాలంటే ఇలా చేయడానికి చేతులు ఖాళీ ఉండవు. ఒక చేతిలో ఫోన్ పట్టుకుని మరో చేత్తో స్క్రోలింగ్ చేస్తూ వెళ్లాలి. కాబట్టి శరీరం వేరే పని చేయలేదు.కాపురాలలో చిచ్చురీల్స్ చూడటం భార్యాభర్తల మధ్య చిచ్చు తెస్తోంది. నాలుగురోజుల క్రితం కర్నాటకలోని మంగళూరు సమీపంలో రీల్స్ చూస్తున్న భార్యను కట్టడి చేయలేక భర్త ఆమెను చంపేశాడు. ఉత్తర ప్రదేశ్లో ఒక భార్య రీల్స్ చూడనివ్వడం లేదని, గిన్నెలు తోమమంటున్నాడని భర్త మీద కేసుపెట్టింది. వీటన్నింటికి విరుగుడు ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో ఉండటమే అంటున్నారు నిపుణులు. హస్తకళలు, పుస్తకాలు చదవడం, క్రీడలు వీటిలో సమయాన్ని వెచ్చించడం మేలంటున్నారు. ముఖ్యంగా పిల్లల్ని రీల్స్ బారిన పడకుండా చూడమంటున్నారు. -
‘సొంతిల్లా.. నో వే..!’ బోట్లో బతికేస్తా.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
‘కూడు, గూడు గుడ్డ’ ఇవి సామాన్య జీవితానికి కావల్సిన కనీస అవసరాలు. కానీ ప్రస్తుత సమాజంలో మధ్యతరగతి జీవికి సొంత ఇల్లు అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. అందులోనూ భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో సొంతిల్లు కాదు గదా కనీసం అద్దె భారాన్ని భరించడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ పోస్ట్ వైరల్గా మారింది. మరో విధంగా చెప్పాలంటే తీవ్ర చర్చకు దారి తీసింది.మెట్రో నగరాల్లో ఒక చిన్న అపార్ట్ మెంట్ కొన్నాలన్నా లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇది చాలా మంది మధ్యతరగతి కొనుగోలుదారుల ఆందళన. దీనిపైనే స్పందిస్తా.. సొంతిల్లు,లోన్లు, ఈఎంఐలు ఇవన్నీ నా వల్ల కాదుగానీమన దేశంలో హౌస్బోట్లో జీవితాన్ని లాగించేయడం చట్టబద్ధమేనా? దయ చేసి ఎవరైనా చెప్పండి బ్రో అంటూ సోషల్మీడియాలో పెద్ద చర్చకే తెర లేపాడు. బెంగళూరు, చెన్నై లేదా హైదరాబాద్లో ఫ్లాట్ కొనలేని,గృహ రుణం కోసం వయస్సు, ఆదాయ పరిమితులు సహకరించని వ్యక్తి ఒక చిన్న పడవను కొనుగోలు చేయాలా లేదా అద్దెకు తీసుకోవాలా అంటూ ఆవేదనగా ప్రశ్నించాడు. అందులో వంటగది, బాత్రూమ్ రెండు గదులు వంటి మినిమం సౌకర్యాలతో నివసించదగిన స్థలంగా మార్చాలా? ఏం చేయాలి? అంటూ పోస్ట్ చేశాడు.ఇండియాలో భారతదేశంలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ఏ నగరంలోనూ ఫ్లాట్ కొన లేను నాకు ఇప్పటికే వయస్సు మీద పడింది, కాబట్టి నేను EMIల కట్టేంత కాలమూ పని చేయలేను ఒక బోట్ కొనుక్కొని, నదులు, సముద్ర తీరంలో పార్క్ చేసుకుంటా.. వానొచ్చినా, వరదొచ్చినా పరవాలేదు మహా అయితే హౌస్ బోట్ ధర 15 నుండి 30 లక్షల వరకు ఉంటుంది. ’’ అంటూ రాసుకొచ్చాడు. సోషల్ మీడియా స్పందనదీనిపై నెటిజనలు విభిన్న రీతుల్లో స్పందించారు. ఇళ్లు చవకగా కొనే కొన్ని ఏరియాలు, సూచనలతో పాటు పడవలో ఉండకూడదని కొందరు అతని ఆలోచనకు బ్రేక్లు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కొనమని కొందరు సూచించారు. అంతేకాదు బోట్ జీవితం ఒకే కానీ... అడ్రస్ ప్రూఫ్, పర్మినెంట్ అడ్రస్, డెలివరీ అడ్రస్ ఇలాంటి వన్నీ ఉంటాయిగా అన్నారు. -
బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ దివి.. డిఫరెంట్ లుక్లో హీరోయిన్ సమంత!
నెదర్లాండ్స్ వేకేషన్లో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్..పింక్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఆలియా భట్ పోజులు..బీచ్లో బిగ్బాస్ బ్యూటీ విష్ణుప్రియ చిల్..బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్స్.. వెరైటీ డ్రెస్లో హీరోయిన్ సమంత లుక్స్.. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
భూకంపం.. బుల్లి బకాసురుడు
ఓవైపు.. భూకంపం వచ్చి భవనాలన్నీ ఊగిపోతున్నాయి. ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారు?. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీస్తారు కదా. కానీ, ఇక్కడ ఓ బుడతడు చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. చైనాలో ఇటీవల జరిగిన భూకంపం సమయంలో ఓ చిన్నారి చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్ను నవ్వులు పూయిస్తోంది. జూన్ 23న గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని క్వింగ్యువాన్లో రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఈ సందర్భంగా ఓ ఇంట్లో జరిగిన ఘటన తాలుకా వీడియో బయటకు వచ్చింది. ఓ ఇంట్లో ఓ తండ్రి తన ఇద్దరు కొడుకులతో భోజనం చేస్తున్నాడు. సరిగ్గా ఆ టైంలో భూమి కంపించింది. తండ్రి తన చిన్న కుమారుడిని ఎత్తుకుని తలుపు వైపు పరుగెత్తాడు. పెద్ద కుమారుడు కూడా వెంటపడ్డాడు. కానీ.. ఆ చిన్నారి ఒక్కసారిగా తిరిగి వచ్చి, టేబుల్ దగ్గరికి వెళ్లి తినడం ప్రారంభించాడు. పైగా బౌల్లో ఉన్న తిండిని తీసుకుని బయటకు పరిగెత్తే ప్రయత్నమూ చేశాడు. ఈలోపు అవతలి నుంచి తండ్రి.. పరిగెత్తు! అని అరిచాడు. అయినా ఆ బుడ్డోడు భోజనం ముందు అన్నట్లు వ్యవహరించాడు. ఈ వైరల్ వీడియోపై ఆ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. మా బిడ్డకు తినడం చాలా ఇష్టం. కానీ, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాడికి తిండి కంటే జీవితం ముఖ్యమని ఇక మీదటైనా నేర్పించాలి అని అన్నాడు. నెటిజన్ల స్పందన.. ఈ పిల్లవాడి ప్రాధాన్యతలు అద్భుతం!, భూకంపం వచ్చినా, తిండిని వదలడు!.. - “Snack first, survive later!.. భూకంపం.. బుల్లి బకాసరుడు ఈ కామెంట్లతో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి..Nothing comes between this kid and his meal not even an earthquake.pic.twitter.com/eWs218JHUH— Science girl (@gunsnrosesgirl3) June 25, 2025 -
మనం చేసే పని 80 శాతం నాన్ కోర్ వర్కే!!
పని గంటలు.. వర్క్కల్చర్ గురించి ఈ మధ్యకాలంలో విపరీతంగా చర్చ నడుస్తోంది. రంగాలకు అతీతంగా ఈ వ్యవహారంపై ప్రముఖులు సైతం స్పందిస్తుండడం చూస్తున్నాం. అయితే.. ఓ సీనియర్ బ్యూరోక్రట్, అందునా LinkedIn లాంటి ప్రొఫెషనల్ వెబ్సైట్లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ల పని తీరు గురించి చర్చించుకునేలా చేసింది. జైపూర్: రాజస్థాన్ సీనియర్ ఐఏఎస్ అధికారి అజితాభ్ శర్మ (Ajitabh Sharma).. ఇటీవల విద్యుత్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన తాజాగా LinkedInలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆయన IAS అధికారుల పని విధానంపై కఠినమైన వ్యాఖ్యలు చేశారు.ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి అజితాభ్ శర్మ ఏమన్నారంటే.. ‘‘మన పని 80 శాతం పైగా నాన్-కోర్ వర్క్(ప్రధాన బాధ్యతలు కాని పనులు) మీదే వెచ్చిస్తున్నాం. అవి.. ఇతర శాఖలతో జరిపే సాధారణ సమావేశాలు, మానవ వనరుల సమస్యలు (HR issues), కేసులు..లీగల్ వ్యవహారాలు, సమాచార హక్కు చట్టం (RTI)కు సమాధానాలు, వార్తా కటింగ్స్.. లేఖలపై సమాధానాలు ఇవ్వడం, ఎన్నో రిపోర్టులు తయారు చేయడం ఇవే ప్రధానంగా ఉన్నాయి. ఒక శాఖ యొక్క నిజమైన కోర్ పని చేయడమే సమాజానికి నిజమైన సేవ.. అయితే.. ప్రతీ IAS పోస్టింగ్ను కష్టమైనదిగా అనుకోవడం తప్పుదారి చూపుతోంది. అలాంటి భావనను నేను ఎప్పుడూ నమ్మను. అధికులు అసలు బాధ్యతలను నిర్వహించాల్సిన సమయం లేక విలువైన పని చేసేందుకు అవకాశం కోల్పోతున్నారు. తద్వారా పాలనా వ్యవస్థ నెట్వర్క్లో కొత్తతరహా ఆలోచనలకు తలుపులు మూసేస్తున్నారు అని అభిప్రాయపడ్డారాయన. అజితాభ్ శర్మ వ్యాఖ్యలపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత, అధికారుల పనితీరు, శాఖల స్వాతంత్ర్యం వంటి అంశాలపై పలువురు స్పందిస్తున్నారు. ప్రభుత్వం, పాలనా వ్యవస్థలో మార్పు కోరే దిశగా ఒక IAS అధికారే స్పందించిన తీరు.. పరిశీలించదగ్గదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. LinkedInలో తన పోస్టుతో IAS వ్యవస్థలో చెలామణిలో ఉన్న కొన్ని భ్రమలపై అజితాభ్ తీవ్ర విమర్శలు చేశారంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.IAS అధికారులు శాఖానుసారమైన ముఖ్యమైన లక్ష్యాల మీద కాకుండా.. సాధారణ పరిపాలనా ప్రక్రియల్లో బిజీగా ఉంటారని అజితాభ్ ఐఏఎస్ల వర్క్కల్చర్(IAS Work Culture) పోస్టుతో తేటతెల్లమైందని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత, ఉద్యోగుల స్వయంప్రేరణ, శాఖానుగుణమైన అవగాహన ఎంత అవసరమో గుర్తు చేశాయని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇది పరిపాలనలో నిపుణత, ప్రత్యేకత, వినూత్నతను తగ్గించేలా ఉందని.. ఫలితంగా అధికారుల శక్తి ప్రభావవంతమైన పాలన మీద కాకుండా ‘ఫార్మాలిటీ’గానే మిగిలిపోతోందని మరో యూజర్ విమర్శించారు. అయితే అజితాభ్ శర్మ మాత్రమే కాదు.. గతంలో కూడా కొంతమంది ఏఏఎస్, ఐపీఎస్ అధికారులు పాలనా వ్యవస్థలో ఉన్న లోపాలు, అధికారుల పని ఒత్తిడి, సమర్థత లోపం వంటి అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ మహిళా ఐఏఎస్ అరుణా సుందరరాజన్ బ్యూరోక్రసీలో ఉన్న ఫైల్ కల్చర్, కొత్త ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్న దృక్పథం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. శివానందన్ అనే మాజీ ఐపీఎస్.. అధిక బ్యూరోక్రసీ, ఫీల్డ్ వర్క్కు ప్రాధాన్యత లేకపోవడాన్ని విమర్శించారు. రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ స్వరూప్ తన పుస్తకాల్లో(Fear of decision-making is the biggest bottleneck in governance), ఇంటర్వ్యూలలో.. ఫైల్ నిబంధనలు, అనవసరమైన నివేదికలు, అన్నింటికి మించి పాలనా వ్యవస్థలో ఉన్న భయాందోళనలు గురించి స్పష్టంగా చెప్పారు. అయితే.. ప్రస్తుతం సర్వీసులో ఉన్న అజితాభ్ శర్మ లాంటి వ్యక్తి.. సూటిగా అదీ LinkedIn వేదికగా, పైగా గణాంకాలతో (80%) పాలనా సంస్కరణల అవసరాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అజితాభ్ శర్మ గురించి..1996 రాజస్తాన్ కేడర్కు చెందిన అజితాభ్ శర్మ.. ఢిల్లీ ఐఐటీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివారు. భివాడి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అథారిటీ (BIDA)కి ఓఎస్డీగా , జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్కు చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్గా, ఇన్వెస్ట్మెంట్ & NRI వ్యవహారాలు, BIP, జైపూర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ.. ఇలా పాలనా రంగంల అనేక విభాగాల్లో సేవలందించారు. ఈ మధ్యే విద్యుత్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. -
వీడియో: తమిళ ‘సింగం’.. రౌడీని పట్టుకునేందుకు ఎస్ఐ పోరాటం
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హీరో సూర్య.. నటించిన సింగం సినిమాలో మాదిరిగా.. రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ను పట్టుకునేందుకు ఓ ఎస్ఐ.. అదే రేంజ్లో ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్లో సదరు ఎస్ఐ చివరకు విఫలమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన అళగురాజా.. మయిలై శివకుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే అళగురాజాపై ఇప్పటికే పలు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సదరు రౌడీ షీటర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. తాజాగా అళగురాజా.. తిరువళ్లూరు జిల్లాలో దాక్కున్నాడని సమాచారం అందడంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో, అతడు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.పోలీసుల రాకను పసిగట్టిన అళగురాజా, అతడి బ్యాచ్.. అక్కడి నుంచి పారిపోయింది. వీరంతా ఓ కారులో పారిపోతుండగా వారిని జామ్ బజార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద కుమార్, పలువురు పోలీసులు వెంటాడారు. ఎస్ఐ ఆనంద కుమార్.. వాళ్లు ప్రయాణిస్తున్న కారుపైకి దూకారు. తిరువళ్లూరు-తిరుపతి హైవేపై సదరు ఎస్ఐ.. కారుకు డోర్కు వేలాడుతూ దాదాపు ఒక కిలోమీటర్ వెళ్లారు. కారుతో పాటు ఎస్ఐని అళగురాజా ఈడ్చుకెళ్లారు. అనంతరం, కారు లోపల ఉన్న నిందితులు ఎస్ఐను తోసివేయడంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. అయితే, ఎస్ఐ ఆనంద కుమార్.. హెల్మెట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ కారు నుంచి ఎస్ఐ కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోసారి రౌడీ షీటర్ అళగురాజా.. పోలీసుల నుంచి తప్పించుకుని పరారీ అయ్యాడు.திருவள்ளுர் அடுத்த திருப்பாச்சூர் பகுதியில் சென்னை ஸ்பெஷல் டீம் போலீசார் முக்கிய வழக்கு ஒன்றில் தொடர்புடைய குற்றவாளியை சினிமாவில் வரும்சண்டைக் காட்சிகளையும் மிஞ்சும் அளவிற்கு துரத்தி சென்றபோது கீழே விழும் காட்சி#Tiruvallur #Chanakyaa pic.twitter.com/x3m4Q7ceJp— சாணக்யா (@ChanakyaaTv) June 26, 2025 -
పనస తోటలో లైగర్ భామ.. శారీలో శ్రద్ధాదాస్ స్టన్నింగ్ లుక్స్!
పనస తోటలో లైగర్ భామ అనన్య పాండే..మా ప్రమోషన్లతో బిజీబిజీగా కాజోల్...బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్..శారీలో శ్రద్ధాదాస్ గ్లామరస్ లుక్స్..బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ కిల్లర్ పోజులు.. View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
షాకిచ్చిన ట్రంప్.. సోషల్ మీడియా వివరాలు ఇవ్వకపోతే వీసా రద్దు!
వాషింగ్టన్: వీసా అభ్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. వీసా అప్లయి దారులు వారి సోషల్ మీడియా అకౌంట్ల వివరాల్ని బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు అభ్యర్థుల వీసా క్యాన్సిల్ చేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. తద్వారా సోషల్ మీడియా అకౌంట్లలో వీసా అప్లయి దారులు ఏ మాత్రం నెగిటీవ్ అనిపించినా అలాంటి వారు అమెరికాలోకి అడుగు పెటట్టడం అసాధ్యం అవుతుంది.ఉదాహారణకు నార్వేకు చెందిన 21ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ అమెరికాలో పర్యాటించాలని అనుకున్నాడు. కానీ మాడ్స్ ఫోన్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బట్టతలతో ఉన్న మీమ్ ఫొటో ఉంది. అంతే ఆ ఫొటొ దెబ్బకు అమెరికాలో పర్యటించే అవకాశాన్ని కోల్పోయాడు. మాడ్స్ తరహాలో భారతీయులు సైతం అమెరికాలో అడుగుపెట్టేందుకు రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోనున్నారు. అందుకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తీసుకున్న నిర్ణయమే కారణం. ఇంతకి ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా?.అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల మంజూరుపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. వీసాల మంజూరులో పారదర్శకతను పాటిస్తూ వీసా అభ్యర్థుల గుణగణాల్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కొత్త వీసా నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.Visa applicants are required to list all social media usernames or handles of every platform they have used from the last 5 years on the DS-160 visa application form. Applicants certify that the information in their visa application is true and correct before they sign and… pic.twitter.com/ZiSewKYNbt— U.S. Embassy India (@USAndIndia) June 26, 2025 సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త.. లేదంటే నో వీసాఅమెరికా వెళ్లేందుకు వీసా అప్లయి చేసుకునే అభ్యర్థులు వారి ఐదేళ్లకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్ల (సోషల్ మీడియా వెట్టింగ్) వివరాల్ని డీఎస్-160ఫారమ్లో బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. ఆ ఫారమ్లో వీసా కోసం ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్స్ వివరాల్ని ఎవరైతే మీరు పొందే కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని వీసా ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఫారమ్లో అభ్యర్థులు వారి సోషల్ మీడియా వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ సోషల్ మీడియా అకౌంట్స్ను చెక్ చేస్తారు. అందులో ఏ మాత్రం తేడా అనిపించినా వీసా ఇవ్వరు.అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విధించేలాఇక తాజా చర్య ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థుల్ని నియంత్రించే ప్రయత్నాల్లో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతేడాది అమెరికాలోని పలు కాలేజీ క్యాంపస్లలో పాలస్తీనాకు అనుకూలంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నాటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగింది. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం వీసా ప్రక్రియ సమయంలో సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం జాతీయ భద్రతా చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.భారత్లో అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన అందుకు అనుగుణంగా గత సోమవారం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది. అందులో 2019 నుండి, యునైటెడ్ స్టేట్స్ వీసా దరఖాస్తుదారులు వలసదారుల, వలసేతర వీసా దరఖాస్తు ఫారమ్లపై సోషల్ మీడియా ఐడెంటిఫైయర్లను అందించాలని కోరింది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా, యునైటెడ్ స్టేట్స్కు అనుమతించబడని వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి మేము మా వీసా స్క్రీనింగ్, వెట్టింగ్లో అందుబాటులో సమాచారాన్ని ఉపయోగిస్తాము’ అని రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
62 కిలోలు తగ్గాడు : నీళ్లు, టీ, ఫన్నీ అండ్ హెవీ కార్డియో ఇవే సీక్రెట్స్
ఒకపుడు బాన పొట్టతో, భారీ బరువుతో ఉన్న యువకుడు పట్టుదలతో తన శరీర బరువును తగ్గించుకున్నాడు. కండలు తిరిగే శరీరంతో చూడముచ్చటగా తయారయ్యాడు. 140 కిలోల నుండి 78 కిలోల బరువుకు చేరాడు. అయితే ఇది అంత ఈజీగా ఏమీ సాగలేదు. ఠినమైన ఆహారం , క్రమం తప్పని వ్యాయామంతో ఫిట్తా మారానంటూ ఇన్స్టా పోస్ట్లో వెల్లడించాడు.ఇన్స్టాగ్రామ్ యూజర్ పువి 2023 నవంబరులో తన వెయిట్లాస్ జర్నీని షేర్ చేశాడు. ప్రధానంగా 'హై-కార్బ్ డైట్' పూర్తిగా పక్కన బెట్టి, ప్రొటీన్డ్ ఆహారం, ధారాళంగా నీరు తాగడం ద్వారా 62 కిలోలు తగ్గిన తరువాత, తన దేహం కండలతో కనిపించిందని చెప్పాడు. 'కార్బోనేటేడ్ డ్రింక్స్ చెత్త'ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు ,చక్కెరలను పూర్తిగా తగ్గించేశాడు. కూల్ డ్రింక్లు, చక్కెర కార్బోనేటేడ్ డ్రింక్లకు బై బై చెప్పేశాడు. అవి చెత్త తప్ప వాటిల్లో ఏమీలేదంటాడు పువి. పుష్కలంగా నీళ్లు, అప్పుడప్పుడు టీకి మాత్రమే పరిమితమయ్యాడు. చాలా రోజులు కూరగాయలు, చాలా సింపుల్గా మసాలా దినుసులతో ఉడికించిన చికెన్ తినేవాడు. View this post on Instagram A post shared by 🅿️uvi (npuvi96) (@transformwithpuvi) 'ట్రెడ్మిల్ కాదు కానీ ఫన్ కార్డియో'బరువును తగ్గించుకోవాలనే లక్ష్యంతో ప్రొటీన్ ఫుడ్పై దృష్టిపెట్టాడు. వారానికి 4 సార్లు రెసిస్టెన్స్ ట్రైనింగ్తోపాటు, చేయ గలిగినంత కార్డియో(ట్రెడ్మిల్ కాదు) ఫన్ కార్డియో చేసేవాడు. హెవీ బ్యాగ్ కొట్టడం, స్కిప్పింగ్, HIIT (హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్) ఇలా ప్రతీదీ ఆస్వాదిస్తూ వెయిట్లాస్ జర్నీని కొనసాగించాడు. లావుగా ఉన్నానని నా బాడీని, జీవితాన్ని ద్వేషించ లేదు, కానీ ఫిట్గా మారాలని ప్లాన్ చేసుకున్నారు. ఏమి తిన్నా, ఎంజాయ్ చేస్తూ, ఉపయోగపడేలా తినాలి అంతే అంటాడు పువి. నోట్: బరువు తగ్గాలనే కోరికతో పాటు,దానికి తగిన ప్లాన్, ఆహార అలవాట్లు ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తీవ్రంగా జిమ్ చేయాలంటే నిపుణుడైన శిక్షకుడి ఆధ్వర్యంలోనే చేయాలి. దీనికంటే ముందు అసలు బరువు ఎందుకు పెరుగుతున్నామో విశ్లేషించుకోవాలి. అవసరమైతే వైద్య సలహా తీసుకోవాలి. -
సముద్రపు ఒడ్డున బిగ్బాస్ అశ్విని శ్రీ.. ట్రెడిషనల్ లుక్లో వితికా షేరు!
సముద్రపు ఒడ్డున బిగ్బాస్ బ్యూటీ అశ్విని శ్రీ చిల్..వరుణ్ సందేశ్ వైఫ్ వితికా శేరు ట్రెడిషనల్ లుక్..బ్లాక్ డ్రెస్లో భూమిక చావ్లా పోజులు..మూవీ షూట్లో బిజీ బిజీగా రాశి ఖన్నా.. View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
ఒట్టి చేతులతో చిరుతపై పోరాటం .. యువకుడి ధైర్యానికి నెటిజన్ల షాక్!
లక్నో: తన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన చిరుతపులిపై ఓ యువకుడి ఒంటి చేత్తో పోరాడాడు. ఎలాంటి ఆయుధాలు లేకుండా చిరుతపులిపై తిరగబడ్డాడు. ఆపత్కాలంలో తెగువ, ధైర్య సాహాసానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఆ వ్యక్తి పేరు మిహిలాల్ గౌతమ్ (33). అతనిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. చిరుతపులిపై పోరాటం చేసిన ఘటన లఖ్మీపూర్ ఖేరిలోని జుగనూపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అటవి శాఖ అధికారుల సమాచారం మేరకు.. మిహిలాల్ గౌతమ్ది ఇర్ధారి పూర్వా అనే గ్రామం.ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు గౌతమ్తో పాటు మరికొందరు సోమవారం జుగనూపూర్ గ్రామానికి వచ్చారు.ఇటుక బట్టీల్లో పని ప్రారంభించేందుకు గౌతమ్తో పాటు ఇతర కార్మికులకు కలిసి ఇటుకుల్ని వేడి చేసే కొలిమి ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే సేదతీరుతున్న చిరుతపులి కార్మికులపై దాడి చేసేందుకు ఒక్క ఉదుటున మీద పడింది.ఒట్టి చేతుల్ని ఆయుధాలుగా మార్చిదాడి చేస్తున్న చిరుతపులిని భయపడకుండా, గందరగోళానికి గురవుకుండా గౌతమ్ తన ఒట్టి చేతుల్నే ఆయుధాలుగా మార్చి దానిని నిలురించే ప్రయత్నం చేశాడు. ఏ మాత్రం బెదరకుండా చిరుతపై ఎదురు దాడికి దిగాడు. ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. గౌతమ్ బలాబలాల ముందు చిరుత తేలిపోయింది. అప్రమత్తమైన సహచర కార్మికులు గ్రామస్తుల సాయంతో చిరుత నుంచి గౌతమ్ను రక్షించే ప్రయత్నం చేశారు. చేతికి దొరికిన వస్తువుల్ని చిరుతపైకి విసిరేస్తూ చిరుతను భయబ్రాంతులకు గురిచేసేందుకు యత్నించారు. ఆ ప్రయత్నంలో చిరుత భయపడి స్థానిక అరటితోటల్లోకి పారిపోయింది. "फिल्मों में देखा होगा हीरो शेर से लड़ता है... लेकिन ये रियल है!"लखीमपुर-खीरी के धौरहरा की बबुरी गांव से चौंकाने वाला वीडियोयहां एक ईंट भट्टे में घुस आया तेंदुआ और सामने था एक युवक... न डर, न भागा — सीधा भिड़ गया! तेंदुए ने झपट्टा मारा, युवक ने डटकर मुकाबला कियागांववालों ने… pic.twitter.com/rd0FiBFEGY— आदित्य तिवारी / Aditya Tiwari (@aditytiwarilive) June 24, 2025 అధికారులపై చిరుత దాడిచిరుతపులి దాడిపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ప్రయత్నంలో అధికారులపై చిరుత దాడికి దిగింది. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్ రాజేష్ కుమార్ దీక్షిత్,రేంజర్ నిరూపేంద్ర చతుర్వేది, పోలీస్ అధికారి రామ్ సంజీవన్,స్థానిక గ్రామస్తుడు ఇక్బాల్కు గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం తొలిసారి దాడికి చేసిన మిహిలాల్ గౌతమ్తో పాటు ఇక్బాల్ ఖాన్ ,ఫారెస్ట్ రేంజర్ రాజేష్ కుమార్ లక్ష్మీపూర్ ఆస్పత్రికి, రేంజర్ చతుర్వేది, పోలీస్ కానిస్టేబుల్ రామ్ సంజీవన్లను తాలూకా ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్స అనంతరం బాధితులు ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.ఈ ఘటన తర్వాత అంటే మంగళవారం అదనపు పోలీసు సిబ్బందితో కలిసి అటవీ శాఖ, పోలీస్ శాఖ జాయింట్ ఆపరేషన్ను నిర్వహించాయి. అరటితోటల్లోనే ఉన్న చిరుత పులిని బంధించాయి. -
మిర్యాలగూడలో బిగ్బాస్ దివి.. విదేశాల్లో మెహరీన్ చిల్!
మిర్యాలగూడలో బిగ్బాస్ బ్యూటీ దివి చిల్..విదేశాల్లో ఎంజాయ్ చేస్తోన్న మెహరీన్ ఫిర్జాదా..బుల్బుల్ జ్ఞాపకాల్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ..బ్యాంకాక్లోని పట్టాయా బీచ్లో రోహిణి చిల్..ప్రముఖ ఆలయంలో అనసూయ పూజలు.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) -
బీచ్లో కాజల్ అగర్వాల్ .. జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి బోల్డ్ పిక్స్!
బీచ్లో ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ చిల్..పట్టాయాలో చిల్ అవుతోన్న రోహిణి..హీరోయిన్ నభా నటేశ్ గ్లామరస్ లుక్స్..జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి బోల్డ్ పిక్స్..మదర్తో మన్మధుడు హీరోయిన్ అన్షు చిల్.. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) -
బాలికపై వేధింపులు.. ఎనిమిది మందిపై పోక్సో కేసు
గుడిహత్నూర్: సోషల్ మీడియాలో స్నేహం పేరుతో ఓ బాలికను వేధింపులకు గురిచేసిన కేసులో ఎనిమిది మందిని శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడు పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు. ఒకరోజు తనకు న్యూడ్ వీడియో కాల్ చేయాలని, లేదంటే చాటింగ్ అందరికీ తెలిసేలా చేస్తానని బెదిరించాడు. ఆ బాలిక ఒకరోజు న్యూడ్ కాల్చేసి మాట్లాడుతుండగా వీడియోను స్క్రీన్ రికార్డు చేసి తన ఏడుగురు స్నేహితులకు పంపించాడు. వారు వీడియోను అడ్డం పెట్టుకుని బాలికను మానసికంగా వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. ఓ యువకుడు ఏకంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో బాలిక తన కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో షీటీం పోలీసులు ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు. -
కిర్రాక్ సీత బర్త్ డే పిక్స్.. యోగా డేలో హీరోయిన్ల కసరత్తులు!
బిగ్బాస్ బ్యూటీ కిర్రాక్ సీత బర్త్ డే స్పెషల్ పిక్స్..భర్తతో కలిసి యోగా డే వేడుకల్లో రకుల్ ప్రీత్ సింగ్...యోగాసనాల్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి..శ్రద్దాదాస్ యోగా డే రోజు అదిరిపోయే కసరత్తులు..పూనమ్ బజ్వా యోగా డే స్పెషల్..డిఫరెంట్ డ్రెస్లో అనసూయ స్టన్నింగ్ లుక్స్..నటి లక్ష్మీ రాయ్ యోగా డే స్పెషల్.. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Seetha🦋🇮🇳 (@kirrakseetha) -
ఒకప్పటి ఆ రాజసం వేరేలేవల్.. పాపం చివరిక్షణాల్లో ఇలా!
ఎంతటి గొప్పవాడైనా సరే.. చివరి రోజులలో అదే మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు.. సహజ సిద్ధమైన విషయాలనే అనుభవిస్తాడు. ఇది మనిషికి మాత్రమే కాదు.. ఇతర ప్రాణులకూ వర్తిస్తుంది. ఆరోహెడ్ ఠీవిగా అడవిలో అలా నడిచి వస్తుంటే ఒకప్పుడు రాజసం ఉట్టిపడేది. అలాంటి దాని చివరి క్షణాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ‘అయ్యో.. పాపం’ అనుకునేలా చేసింది. మొసళ్ల బలం నీటిలోనే. అలాంటిది ఆ నీటి నుంచి మొసళ్లను బయటకు లాక్కొచ్చి మరీ వేటాడే సత్తా ఉన్న పెద్దపులిగా మాతామహి మచ్చ్లీ ఓ పేరుండేది. మరి ఆ మచిలీ మునిమనవరాలిగా.. తాను అలాంటి సత్తా ఉన్నదానినే అని నిరూపించుకుంది ఆరోహెడ్. అదీ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాకే!. Arrowhead (T-84) రాజస్థాన్లోని రన్థాంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నివసించిన ఒక ప్రసిద్ధ పులి. జూన్ 19వ తేదీన.. తన 14 ఏళ్ల వయసులో అది కన్నుమూసింది. బోన్ క్యాన్సర్తో అది మరణించిందని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే.. చనిపోయే కొన్నిగంటల ముందు దాని కూనను మరో టైగర్ రిజర్వ్కు తరలించడం పలువురిని కదిలించింది కూడా. ఈలోపు.. ఆరోహెడ్ చివరి క్షణాలను సచిన్ రాయ్ అనే నేచర్ ఫొటోగ్రాఫర్ బంధించారు. లాస్ట్ వాక్ అంటూ ఆయన తన సోషల్ మీడియాలో ఆరోహెడ్ వీడియోను షేర్ చేసింది. ‘‘అది జూన్ 17వ తేదీ. పదమ్ తలాబ్ వద్ద తీసిన వీడియో ఇది. లెజెండరీ టైగ్రస్ ఆరోహెడ్ తన చివరి క్షణాల్లో నరకయాతన అనుభవించింది. అది పసికూనగా ఉన్నప్పటి నుంచి నేను దానిని చూస్తున్నా. View this post on Instagram A post shared by Sachin Rai (@sachin_rai_photography)దాని ధైర్యం, సహనం, పోరాటం.. ఆరోహెడ్ ఎదిగిన ప్రతీ దశ ఒక అధ్యాయమే. కృష్ణ (T-19), మాతామహి మచ్చ్లీ (T-16) వారసురాలిగా రన్థాంబోర్ అడవుల్లో తనదైన ముద్ర వేసుకుంది అది. అలాంటిది చివరిక్షణాల్లో.. కొన్ని అడుగులు వేస్తూ కింద పడిపోవడం ఎంతో బాధించింది. అలా అది ఓ చెట్టు కిందకు వెళ్తుండడం.. అదే దాని చివరి క్షణాలు అని నా మనసు చెప్పింది. కాసేపటికే అది ప్రకృతి ఒడిలోకి ఒరిగి శాశ్వత నిద్రలోకి జారుకుంది అని భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారాయన. T-84కు ఆరోహెడ్ అని పేరు పెట్టడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. దాని ఎడమ చెంపపై బాణం ఆకారపు గుర్తు ఉండడం వల్ల అలా పేరు పెట్టారు. రన్థాంబోర్ టైగర్ రిజర్వ్ ప్రాంతం జోన్ 2, 3, 4లను ఇది చివరి క్షణాల దాకా తన ఆధీనంలో ఉంచుకుంది. ఫొటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులు దీని రాజసానికి ఫిదా అయిపోయేవారు. బోన్ క్యాన్సర్ బారిన పడ్డాక.. చివరిరోజుల్లోనూ ఓ మొసలిని ఎదుర్కొని చంపిన వీడియో కూడా ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది. -
‘ నేను నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్’ : స్వీట్ కపుల్ జాయ్ రైడ్ వీడియో వైరల్
ఒక స్వీట్ కపుల్ అండ్ ఓల్డ్ కపుల్ (Elderly Couple) గాల్లో తేలినట్టుందే..అంటూ దర్జాగా రాయల్ ఎన్ఫీల్డ్ (టైటానిక్) బుల్లెట్ మీద రయ్య్మని దూసుకుపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంత వైరల్ అంటే 3.5 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయంటే ఈ వీడియో క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.కమలాక్షి అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు: " అందమైన వృద్ధ జంట అందమైన వింటేజ్ రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ చూశాను. సూపర్.. పొగడ్త తరువాత తాతగారి నవ్వు చూడాలి.. అమూల్యం’’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ప్రశంసకు ఉబ్బితబ్బిబ్బవుతూ తాతగారి నవ్విన నవ్వు ఈ వీడియోకే హైలైట్ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Kamalakshi (@the_green_bonneville)> ఈ వీడియోలో,బామ్మగార్ని వెనుక కూర్చోబెట్టుకున్న తాతగారు బామ్మగారు ‘నేను నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్’ అంటూ దూసుకుపోతున్నారు. ఇది చూసి కమలాక్షి వారిని పొగడ్తల్లో ముంచెత్తింది. దీంతో పబ్లిక్షాక్డ్ , చాచా రాక్డ్ అంటూ కమెంట్ చేశారునెటిజన్లు.అంతేకాదు టైటానిక్ జాక్ అండ్ రోజ్ అని కొందరు, అర్జున్ రెడ్డి, ప్రీతి అంటూ మరికొందరు ఈ వీడియోను ఎంజాయ్ చేయడం విశేషం. -
2028లో రప్పా రప్పా.. 3.0 లోడింగ్.. ట్రెండింగ్లో హరీష్ రావు ఫొటో
సాక్షి, సంగారెడ్డి: పుష్ప-2 సినిమాలోని రప్పా.. రప్పా.. డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తలపెట్టిన రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఫుల్ జోష్లో కనిపించారు.పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హరీష్ రావు రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులను కార్యకర్తలు చూపించారు. 2028లో రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్ అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో, ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు నిలిచాయి. మరోవైపు.. హరీష్ రావు మాట్లాడుతూ..‘కేటీఆర్పై కేసు పెట్టడం.. కేసీఆర్ను కమిషన్ ముందుకు పిలవడం తప్ప రేవంత్ ఏం చేశాడు. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది అని అంటున్నాయి. రెండు లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది.. మీ అందరికి రైతు భరోసా వచ్చే వరకు పోరాటం ఆపేది లేదు. ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తలవకుండా రేవంత్ స్పీచ్ ఉండదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రెండు లక్షల మంది రైతులు ఔటర్ రింగ్ రోడ్డు మీద ధర్నా చేస్తే రేవంత్ మైండ్ బ్లాక్ అవుతుంది. రైతుబంధు ఇవ్వకపోతే రంగారెడ్డి, మల్కాజిగిరి, సంగారెడ్డి రైతులందరూ కదులుతారు జాగ్రత్త. వెంటనే రెండు లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దేవాదుల ఏ బేసిన్ లో ఉందని రేవంత్ అడగడం హాస్యాస్పదం. నల్లమల్లల పుట్టిన అని చెప్పుకొనే రేవంత్.. నల్లమల్ల ఎక్కడ ఉంది? అని అడుగుతున్నాడు. కౌశిక్ను అరెస్ట్ చేయడం దారుణం.. రేవంత్ని ప్రశ్నిస్తే అర్దరాత్రి ఓ అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎయిరిండియా అంటేనే వణికిపోతోంటే....పేల్చేస్తా అంటూ మహిళ వీరంగం!
ఎయిరిండియా విమానం కూలిన దుర్ఘటన తాలూకు విషాదం మన మనసుల్లోకి తొలగి పోక ముందే ఒక మహిళా ప్రయాణికురాలు అనుచితం ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ‘విమానం- క్రాష్’ అన్న పదాలు వింటేనే ఉలిక్కి పడుతున్న ప్రస్తుత తరుణంలో స్వల్ప వివాదానికే విమానాన్ని కూలిపోతుంది అంటూ అంటూ నానా గలాటా సృష్టించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు జరిగిన ఈ సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది.ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) నుండి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన మహిళా ప్రయాణీకురాలు, వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్భాయ్ (36) బ్యాగ్ స్థలం కోసం విమాన సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలోని తన సీటు 20Fలో కూర్చునే ముందు మొదటి వరుసలో తన బ్యాగ్ వదిలి వెళ్ళిపోయింది. దీంతో దీన్ని ఆమె సీటు దగ్గర ఉన్న ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఉంచమని సిబ్బంది కోరారు. అంతే ఆవేశంతో ఊగిపోతూ , "విమానం కూలిపోతుంది" అంటూ గొడవకు దిగింది. క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. ఇది తప్పు అన్న తోటి ప్రయాణీకులపై కూడా అరిచిందిట. దీంతో పైలట్ , సిబ్బంది భద్రతా సిబ్బంది మరియు CISF సిబ్బందికి సమాచారం అందించారు, వారు ఆమెను విమానం నుండి కిందికి దింపేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానాన్ని కూల్చివేస్తామని బెదిరించిందన్న ఆరోపణలపై ఆ మహిళా వైద్యుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాలి.చెమటలు చిందించాలి చాలామంది మదిలో మెదిలే ఆలోచన ఇది. కానీ ఇవేమీ లేకుండానే హ్యాపీగా నెలకు 7 కిలల దాకా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు ఒక వైద్యుడు. అదీ కఠినమైన డైట్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమే అంటున్నారు. మరి ఆ జాదూ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. పదండి.. ఆలస్యం ఎందుకు..!నాన్-ఇన్వాసివ్ కార్డియాలజీలో నిపుణుడైన కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ ఛాజెర్ సోషల్మీడియా ద్వారా తన ఫాలోయర్లకు అనేక ఆరోగ్య చిట్కాలను అందిస్తూ ఉంటారు. తాజాగా 'జాదూ డైట్ (మ్యాజిక్ డైట్) ఫర్ వెయిట్ లాస్' అంటూ కొన్ని వివరాలను షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియో ప్రకారం ఇది శాకాహారంతో బరువు తగ్గించుకునే ఒక ప్రణాళిక. కడుపు మాడ్చుకోవాల్సి అవసరం లేకుండానే సరళమైన డైట్తో కేవలం ఒక నెలలో కనీసం 7 కిలోల బరువును తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని హామీ ఇస్తున్నారు కూడా.వెయిట్ లాస్ జర్నీ- చిట్కాలుడాక్టర్ బిమల్ ఛాజెర్ చెబుతున్న డైట్ సరళమైన, ఆరోగ్యకరమైన ఆహారాల కలయితో ఉంటుంది. బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిదనీ, ఆకలితో ఉండకుండా కేలరీల లోటును భర్తీ చేసి.శరీరం సహజంగా కొవ్వును కరిగించడానికి అనుమతిస్తుంది. ఇదీ చదవండి: 118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో'జాదూ డైట్ ఫర్ వెయిట్ లాస్'మనం మన కడుపును అధిక కేలరీల ఆహారంతో నింపితే, మన బరువు పెరుగుతుంది, అదే తక్కువ కేలరీల ఆహారంతో నింపితే, ఆకలీ వేయదు, బరువూ పెరగదు సింపుల్ మ్యాజిక్ అంటారాయన. స్వీట్ కార్న్, బీట్ రూట్, క్యారెట్లతో చేసిన సలాడ్, గుమ్మడికాయ, బీన్స్, క్యారెట్ ముక్కలు, రాగిపిండితో చేసిన సూప్ ఇలాంటివి ఆయన షేర్ చేసిన వీడియో మనం చూడవచ్చు.జాదూ డైట్లో నిజానికి బాగా తినాలి, కానీ లో-కేలరీల ఆహారాలకు కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, సలాడ్లు...ఇది శరీరాన్ని ఆహారం లేకుండా ఉంచకుండా వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఫలితంగా నెలలో 7 కిలోల బరువు తగ్గడం పక్కా..అది కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అని చెప్పారు. View this post on Instagram A post shared by Food Link (@ig_foodlink)ఆహారంగా ఇంకా ఏం తీసుకోవచ్చుబ్లాక్ టీ తాగవచ్చు. ఎక్కువ పండ్లు తీసుకోవాలి. ప్రోటీన్ , ఇతర పోషకాల కోసం మూంగ్ లేదా మసూర్ దాల్ తీసుకోవచ్చు. ఇందులో దోసకాయ, బీట్రూట్ క్యారెట్ ఇలా పచ్చి కూరగాయలతో కలిపి పప్పును తినవచ్చు.రాత్రి భోజనంలో సూప్తో పాటు సలాడ్ , ఉడికించిన కూరగాయలుఎన్ని రోజులు చేయాలి?ఈ డైట్ను కేవలం ఒక నెల పాటు మాత్రమే సాగించాలి.దీన్ని ఎప్పటికీ అనుసరించాల్సిన అవసరం లేదు. ఈ డైట్తో మీరు సుమారు 3 నెలల్లో 10-20 కిలోలు తగ్గవచ్చు. ఈ జాదూ డైట్ అద్భుతంగా పనిచేస్తుందనంటూ కోలకత్తాకు చెందిన ఒక మహిళ 86 నుంచి -62 కిలోలకు బరువు తగ్గిన వైనాన్ని ఉదహరించారు.గమనిక: ఈ కథనం డా. బిమల్ షేర్ చేసిన సమాచారం ప్రకారం అందించినంది మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల్లో ఎల్లప్పుడూ వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం. -
బాలిలో ప్రగ్యా జైస్వాల్ చిల్.. బీచ్లో సురేఖవాణి కూతురు హోయలు!
సిస్టర్కు బర్త్ డే విషెస్ చెప్పిన మ్యాడ్ స్క్వేర్ బ్యూటీ..హిమాలయ పర్వతాల్లో సారా అలీ ఖాన్ చిల్..బాలిలో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ స్టన్నింగ్ లుక్స్..బీచ్లో చిల్ అవుతోన్న సురేఖవాణి కూతురు సుప్రీత హోయలు..ఆర్జీవీ శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య లేటేస్ట్ లుక్.. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by AaradhyaDevi✨ (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) -
ఏమీ ఎరుగని పూవుల్లారా!
ఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించేకూనల్లారా!..రెండేళ్ల వయసులో ఎలా ఉండాలి?.. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ.. తల్లిదండ్రుల ఒడిలో సేదతీరుతూ ఉండాలి . కానీ, ఈ చిన్నారి మాత్రం తోటి పిల్లలతో కలిసి ఎక్కడ నీరు దొరక్కుండా పోతుందా? అనే భయంతో పరుగులు ఇలా పెడుతోంది. తమ బిడ్డలకు అందమైన బాల్యం చెక్కాలని ఆ దేవుడ్ని మొక్కుకోని తల్లిదండ్రులు ఉంటారా?. కానీ, తమ బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలని వేడుకుంటున్నారు గాజా ప్రజలు.గాజా.. గత ఏడాదిన్నరగా ఇజ్రాయెల్ దాడులతో.. తీవ్ర మానవ సంక్షోభంతో అల్లలాడుతున్న నేల. మానవతా సాయం ఆగిపోవడంతో సంక్షోభం తలెత్తి చివరకు తిండి, మంచి నీటిని కూడా పరిమితులు విధించడంతో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by عبد الرحمن ناصر | Abdulrahman Nasir (@abdulrahman_nasir7)యూనిసెఫ్ గణాంకాల ప్రకారం..ప్రస్తుతం కల్లోల గాజాలో చిన్నారులకు రోజుకి ఒకటిన్నర నుంచి 2 లీటర్ల నీరు అందిస్తున్నారు. సాధారణంగా.. అన్ని అవసరాలకు కలిపి 15 లీటర్ల నీరు ఒకరోజుకి అవసరం పడుతాయి. ఇందులో తాగు నీటికే 3 లీటర్ల అవసరం. అలాంటిది ఇక్కడి చిన్నారులకు ఒకరోజులో 2 లీటర్ల లోపే నీరు అందుతుండడం.. సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది.గణాంకాలు.. కఠోర వాస్తవాలుగాజాలో 2023 అక్టోబర్ నుండి ప్రారంభమైన యుద్ధంలో వేలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, మరియు ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.2023లోనే గాజాలో జరిగిన దాడుల్లో పిల్లలే అత్యధికంగా మరణించారు అని జెనీవాలో యునిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్టర్ ప్రకటించారు.మొత్తం గాజా మరణాల్లో.. 70% మరణాలు మహిళలు మరియు పిల్లలే అని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. యుద్ధం, ఆకలి, నీటికొరత, వైద్య సౌకర్యాల లేమి కారణంగా 14,000 మంది పిల్లలు మరణించే ప్రమాదం ఉంది అని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.ఇంకా..19 లక్షల మంది స్థానభ్రంశం చెందారు, వారిలో సగానికి పైగా పిల్లలే.370 స్కూళ్లు నేలమట్టమయ్యాయి, పిల్లలు విద్యా అవకాశాలు కోల్పోయారు.నీటి లభ్యత 5%కి పడిపోయింది, దీని వల్ల డీహైడ్రేషన్తో పసికందులు మరణిస్తున్నారు.బాల్యం అనే భావన అక్కడ పూర్తిగా విచ్ఛిన్నమైందని యునిసెఫ్ పేర్కొంది. ఈ గణాంకాలు గాజాలోని పిల్లల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. *పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించేకూనల్లారా!అచ్చటికిచ్చటి కనుకోకుండాఎచ్చటెచటికో ఎగురుతుపోయేఈలలు వేస్తూ ఎగురుతుపోయేపిట్టల్లారా!పిల్లల్లారా!గరికిపచ్చ మైదానాల్లోనూ,తామరపూవుల కోనేరులలోపంటచేలలో, బొమ్మరిళ్లలో,తండ్రి సందిటా, తల్లి కౌగిటా,దేహధూళితో, కచభారంతో,నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,ఎక్కడ చూస్తే అక్కడ మీరైవిశ్వరూపమున విహరిస్తుండేపరమాత్మలుఓ చిరుతల్లారా!మీదే, మీదే సమస్తవిశ్వం!మీరే లోకపు భాగ్యవిధాతలు!మీ హాసంలో మెరుగులు తీరునువచ్చేనాళ్ల విభాప్రభాతములు!ఋతువుల రాణి వసంతకాలంమంత్రకవాటం తెరచుకునీ,కంచు వృషభముల అగ్నిశ్వాసంక్రక్కే గ్రీష్మం కదలాడీ,ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూఏకంచేసే వర్షాకాలం,స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,హిమానీ నిబిడ హేమంతములు,చలివడకించే శైశిరకాలంవస్తూ పోతూ దాగుడుమూతలక్రీడలాడుతవి మీ నిమత్తమే!ఇవాళలాగే ఎప్పుడు కూడాఇనబింబం పయనించు నింగిపై!ఎప్పుడు కూడా ఇవాళలాగేగాలులు వీచును, పూవులు పూచును!నాకు కనంబడు నానాతారక,లనేక వర్ణా, లనంత రోచులుదిక్కు దిక్కులా దివ్యగీతములుమీరూ వాటికి వారసులే! ఇవిమీలో కూడా మిలమిలలాడును!నా గత శైశవ రాగమాలికలప్రతిధ్వనులకై,పోయిన బాల్యపు చెరిగిన పదములచిహ్నాల కోసం,ఒంటరిగా కూర్చిండి వూరువులుకదిలే గాలికి కబళమునిస్తూ,ప్రమాద వీణలు కమాచి పాడగసెలయేళ్లను, లేళ్లను లాలిస్తూ,పాతాళానికి పల్టీకొట్టీవైతరణీనది లోతులు చూస్తూ,శాంతములే, కేకాంతముగా, దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూమెటిక విరుస్తూ ఇట కూర్చిండిననను చూస్తుంటే నవ్వొస్తోందా?ఉడుతల్లారా!బుడతల్లారా!ఇది నా గీతం, వింటారా?*సేకరణ: శ్రీశ్రీ మహాప్రస్థానం/శైశవగీతి -
ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో
జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం 787-8 డ్రీమ్లైనర్ బోయింగ్ తీవ్ర విషాదాన్ని నింపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ ప్రాంతంలో కూలిపోవడంతో భోజనం తింటున్న విద్యార్థులు నలుగురు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ వార్త తెలియగానే, అహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ మానవత్వాన్ని చాటుకున్న వైనం నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటోంది. ఆయన ప్రదర్శించిన చొరవ, నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంటోందిఅహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ (56) విమానం కూలిపోయిన సమయంలో భారీ పేలుడు శబ్దాన్ని విని ఉలిక్కి పడ్డారు. అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. హా హా కారాలు వినపడుతున్నాయి. ఇది విన్న నరాజు పటేల్ వెంటనే స్పందించారు. తన వద్ద పనిచేస్తున్న సిబ్బందితో కలిసి ఆయన పరుగున ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ అప్పటికే అదుపు చేయలేని రీతిలో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. ఇంతలో సహాయ దళాలు అక్కడికి చేరుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్దిమందిలో రాజు, దట్టమైన పొగ, పెరుగుతున్న మంటలు, కేకలు, అరుపులు వినిపిస్తున్నా గందర గోళ పడలేదు. స్థానికులు ఇచ్చిన బట్టలు, చాపలను ఉపయోగించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమయం వృథా చేయకుండా, గాయపడ్డవారిని వీలైనంత వేగంగా అంబులెన్స్లలోకి ఎక్కించి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పటేల్ బృందం సేవలను చూసిన రెస్క్యూ అధికారులు, వారిని రాత్రి 9 గంటల వరకు సహాయక చర్యల్లో కొనసాగమని కోరడం గమనార్హం.అంతేకాదు సంఘటనా స్థలం శిథిలాల నుండి రూ. 60 వేల నగదు, 70 తులాల (బంగారం, హారాలు, గాజులు, మంగళసూత్రాలు, ఉంగరాలు, ) బంగారు ఆభరణాలను వెలికితీశారు. ఇంకా విదేశీ కరెన్సీ, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఐడి కార్డులు, వెండి వస్తువులను సేకరించి వాటిని జాగ్రత్తగా, నిజాయితీగా పోలీసులకు తిరిగి ఇచ్చారు.‘‘మొదటి 15 నుండి 20 నిమిషాల వరకు, తొందరగా దగ్గరికి చేరుకోలేకపోయాము. మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి, కానీ మొదటి అగ్నిమాపక దళం , 108 అంబులెన్స్లు వచ్చిన తర్వాత,సహాయం చేయడానికి ముందుకు సాగాం’’ అన్నారు రాజు. సమయానికి స్పందించడంతో పాటు, ఎంతో ధైర్య సాహసాన్ని ప్రదర్శించి ఆయన చేసిన సేవలతో పాటు తాను సేకరించిన వస్తువులను ఎంతో నిజాయితీగా అధికారులకు అప్పగించడం నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది.మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమైన రాజు పటేల్, బృందానికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఆపద సమయాల్లో ఆదుకున్నవాడే మానవుడు మహనీయుడు అని పేర్కొంటున్నారు. -
Donald Trump: అబ్బా.. ఏం గుండెరా వాడిది!
అమెరికా అధ్యక్ష భవనం చరిత్రలోనే తొలిసారి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హయాం ఓ అరుదైన ఘట్టానికి వేదికైంది. వైట్హౌజ్ ఆవరణలో రెండు భారీ జెండా స్తంభాలు ఏర్పాటు అయ్యాయి. పైగా అవి ప్రపంచంలోనే అత్యుత్తమ పోల్స్ అంటూ ట్రంప్ తనదైన శైలిలో ఓ ప్రకటన చేశారు కూడా.బుధవారం ఆ పోల్స్ను వైట్హౌజ్ భవనం బయట దక్షిణం వైపు, ఉత్తరం వైపు మరొకటి ఏర్పాటు చేయించారు(White House Huge Poles). ఆ మరుసటి రోజు అమెరికా జెండాను ఆవిష్కరించి.. సెల్యూట్ చేశారు. అయితే.. మొదటి టర్మ్(2013-2020) టైంలోనే ఇలా ఏర్పాటు ఎందుకు చేయించలేదని కొందరు మీడియా వాళ్లు అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ‘‘చాలా కాలం కిందటే ఇలా చేయాలని అనుకున్నా. తొలి టర్మ్లో అన్ని కళ్లు, వేళ్లు నా వైపే ఉండేవి. ఎక్కడ నేను దొరుకుతానా? అని విమర్శకులు వెంటాడేవాళ్లు. ఇప్పుడు నేనే అందరినీ వేటాడుతున్నా. చాలా తేడా ఉంది కదా. అందుకే ఇప్పుడు కుదిరింది’’ అని బదులిచ్చారు.అంతేకాదు.. రియల్టర్ అయిన ట్రంప్ ఆ పోల్స్ను ఎంపిక చేయడం మాత్రమే కాదు.. ఎక్కడ పాతాలో(ఏర్పాటు చేయాలో) కూడా స్వయంగా స్థలాన్ని సిబ్బందికి వెతికి చూపించారట. అయితే ఆ స్తంభాలను అక్కడ ఏర్పాటు చేసిన సిబ్బందిని అభినందించే క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పోల్స్ ఏర్పాటు చేసిన సిబ్బంది ఒక్కొక్కరిని పిలిచి ట్రంప్ కరచలనం చేశారు. ఆ సమయంలో వెనకాల.. ఓ క్రేన్ ఆపరేటర్(Crane Driver Trump Funny) కునుకు తీస్తూ కనిపించాడు. అయితే ట్రంప్ అది గమనించకుండా సిబ్బందితో ఫొటోలు దిగసాగారు. ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. అసలు అతగాడు ట్రంప్ ముందు అంత దర్జాగా ఆ పని ఎలా చేయగలిగాడంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు జస్ట్ మిస్ అంటూ కామెంట్ పెన్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి.. అతను ఇప్పుడు అసలు ప్రాణాలతో ఉన్నాడా? అని ఆరాలు తీస్తున్నారు.NEW: Crane operator appears to take a quick nap during the installation of President Trump's flag pole at the White House.The president was seen taking pictures with workers while the man sat back in the crane.Trump says the two large flag poles were his gift because it was… pic.twitter.com/QYZONrjlKO— Collin Rugg (@CollinRugg) June 18, 2025ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధికారంతో వైట్హౌజ్లో అడుగుపెట్టినప్పటి నుంచి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చిరాగానే.. ఓవల్ ఆఫీస్లో ఫొటోలన్నీంటిని మార్పించేశారు. పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నం ఫొటోను ప్రముఖంగా ఆఫీస్లో ఏర్పాటు చేయించుకున్నారు. జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రోజ్ గార్డెన్ను ఏర్పాటు చేయించారు. అయితే ఆ గార్డెన్లో నిర్మాణ పనులు జరపాలని ట్రంప్ తాజాగా ఆదేశించారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. అక్కడి గడ్డిలో హైహీల్స్తో నడిచేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారని!!. -
ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఒక్కసారిగా భర్త రావడంతో..
లక్నో: ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడితో హోటల్ గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె భర్త ఒక్కసారిగా అక్కడికి రావడంతో.. సదరు మహిళ హోటల్ పై నుంచి కిందికి దూరి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. యూపీలోని బాగ్పత్ జిల్లా బడౌత్ పట్టణంలో ఓ వివాహిత తన ప్రియుడి శోభిత్తో కలిసి హోటల్ గదికి వెళ్లింది. హోటల్ గదిలో వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత భర్త.. హోటల్ గది వద్దకు వచ్చాడు. అది గమనించిన ఆమె.. ఏం చేయాలో అర్థం కాకపోవడంతో హోటల్ గది కిటికి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో హోటల్ భవనం నుంచి.. కిందికి దూకి పారిపోయింది. వెంటనే అప్రమత్తమైన భార్య.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.A dramatic incident unfolded in Baraut, Baghpat, where a married woman was caught on video j*mping from a 12-foot roof of an OYO hotel, allegedly to escape her husband, in-laws, and police. According to reports, the woman was staying at the hotel with her lover when her… pic.twitter.com/aWcjEqItgz— ForMenIndia (@ForMenIndia_) June 18, 2025ఆమె ప్రియుడు శోభిత్ను మహిళ భర్త పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక, ఈ ఘటన సోమవారం జరగ్గా.. వారిద్దరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శోభిత్ను అదుపులోకి తీసుకొని కేసు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. వారిద్దరు దంపతులకు 2019లో పెళ్లి కాగా, ఓ కుమారుడు ఉన్నాడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఆమె హోటల్ భవనం నుంచి దూకి పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ससुरालियों ने विवाहित युवती को होटल में प्रेमी के साथ पकड़ा,Oyo होटल की पिछली खिड़की से कूदकर महिला हुई मौके से फरार,पति और पत्नी के बीच काफी समय से चल रहा विवाद....@Uppolice#बागपत #बडौत #OyoHotel #LoveAffair #viralvideo pic.twitter.com/xcxtmli0v7— Rahul kumar Vishwakarma (@Rahulku18382624) June 17, 2025 -
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతోంది
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఒకదాని వెంట ఒకటి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమాత్రం ఖాతరుచేయడం లేదంటూ కర్నూలు జిల్లా మహానందికి చెందిన పండరబోయిన తిరుమల కృష్ణ అలియాస్ జగన్ కృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. దివ్యాంగుడినైన తనపై రెడ్బుక్ పాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డజను కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు ఈ రెడ్బుక్ నుంచి స్ఫూర్తి పొంది అమానవీయంగా వ్యవహరిస్తున్నారని తిరుమల కృష్ణ తన పిటిషన్లో వివరించారు.ప్రజలందరినీ ఒకే రకంగా చూస్తానని, భయం, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానన్న ప్రమాణాన్ని పాలకులు విస్మరించారన్నారు. అలాగే, మీడియాకు చెందిన వ్యక్తులను అరెస్టుచేయడం, మీడియా సంస్థలను తగలబెట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ కూడా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. సోషల్ మీడియా తాను పెట్టిన ఒకేఒక్క పోస్టుపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదుచేసి, దివ్యాంగుడినైన తనను ఇష్టమొచ్చినట్లు తిప్పుతున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు. తదుపరి చర్యలన్నీ నిలిపివేయండి..ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదుచేయడానికి వీల్లేదని తెలిసి కూడా పోలీసులు ఫిర్యాదులు చేసేలా జనాన్ని ప్రోత్సహిస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోవడంలేదని తిరుమల కృష్ణ తన పిటిషన్లో పేర్కొన్నారు. తనపై పోలీసులు నమోదు చేసిన బహుళ ఎఫ్ఐఆర్లలో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ఆయన హైకోర్టును కోరారు. తనపై కర్నూలు వన్టౌన్ పోలీసులు నమోదుచేసిన కేసును మొదటి కేసుగా పరిగణించి, మిగిలిన కేసులన్నింటినీ కూడా వాంగ్మూలాలుగా పరిగణించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ప్రకాశ్సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పోలీసులు ఏమాత్రం ఖాతరుచేయడంలేదన్నారు. పోలీసుల వేధింపులు, అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో పోలీసు కంప్లయింట్స్ అథారిటీలను ఏర్పాటుచేయలేదన్నారు. రెడ్బుక్ పాలన వల్ల ఇబ్బందులు పడుతున్న పౌరుల్లో తాను కూడా ఒకడినన్నారు. ప్రజలకు కోర్టులను ఆశ్రయించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండాపోయిందన్నారు. తనపై నమోదు చేసిన కేసుల్లో కొన్నింటిలో బెయిల్ పొందానని, మరికొన్ని కేసులను కొట్టేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశానన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. -
Bike Taxi Ban: అవసరమైతే హైదరాబాద్కి పోతాం!
కర్నాటకలో యాప్ ఆధారిత అగ్రిగేటర్లు నడుపుతున్న టూ-వీలర్ టాక్సీ సర్వీసుల కార్యకలాపాలకు నిన్నటి(జూన్16) నుంచి బ్రేకులు పడ్డాయి. కోర్టు తీర్పు.. ప్రభుత్వం నుంచి విధానాల రూపకల్పనపై సరైన స్పందన లభించకపోవడంతో ప్రస్తుతం బైక్ ట్యాక్సీలపై నిషేధం అమలు అవుతోంది. దీంతో లక్ష మంది గిగ్ వర్కర్లపై ప్రభావం పడుతోంది. ఇందులో.. ఇదే తమ జీవనోపాధి అని వాపోతున్నారు వేలమంది రైడర్లు. కర్నాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం వేలాది మంది రైడర్లను తీవ్రంగా ప్రభావం చేస్తోంది. కాలేజీ ఫీజులు చెల్లించేందుకు బైక్లు నడుపుతున్న విద్యార్థుల దగ్గరి నుంచి.. ఉద్యోగాలు పొగొట్టుకున్న టెక్కీల దాకా ఈ సేవలనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొందరికి ఇది పార్ట్ టైం జాబ్ కాగా.. మరికొందరికి ఫుల్ టైం ఆదాయం అందించే వనరు. 👉కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మధ్యలోనే మానేసిన ఓ యువకుడు మాట్లాడుతూ.. ప్రతీ రైడ్ ఒక కొత్త వ్యక్తిని కలవడానికి కలిగించిన అవకాశం. ఈ ప్రయాణం నా ఒంటరితనాన్ని అధిగమించడంలో సహాయపడింది. నేను ఆనందంగా చేసే పనిలో ఆదాయం కూడా వచ్చింది. అలాంటి ఆదాయ వనరుకు ఇప్పుడు గండిపడింది.👉ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదు. బిజినెస్ ప్రారంభించాలన్న కల ఉంది. కానీ నెలవారీ జీతంతో పొదుపు కష్టం. అందుకే బైక్ టాక్సీల వైపు వచ్చాను. టార్గెట్లు లేవు, ఒత్తిడి లేదు, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ నిషేధం నా వంటి కలలవాళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అవసరమైతే హైదరాబాద్కు మారిపోతాను, కానీ ఈ పని వదలను:::మహదేవపురకు చెందిన ఇంద్ర శేఖర్(25) 👉బైక్ రైడ్లతో రోజుకు రూ.3,000 సంపాదించేవాడిని. అందులో కనీసం రూ.2,000 పొదుపు చేసేవాడిని. ఈ రోజుల్లో ఖర్చులకు ఫుల్ టైం ఉద్యోగం ఒక్కటే సరిపోవడం లేదు. పెద్ద నగరాల్లో జీవించాలంటే అదనపు ఆదాయం కచ్చితంగా అవసరం. అలాంటి ఆదాయం లేకుండా పోయింది:::జగదీష్(24), నాన్-ఐటీ ప్రొఫెషనల్👉సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు సాగర్ బైక్ ట్యాక్సీలతో రైడ్లు కొడుతూ సంపాదించుకుంటున్నాడు. ఈ సేవలు నా జీవన విధానాన్ని మార్చేశాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోవడం చాలా నిరాశ కలిగిస్తోంది. నా ఆదాయ మార్గం పూర్తిగా కోల్పోయాను. ఇప్పుడు మరో ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని తెలిపాడు. 👉వైట్ఫీల్డ్లో నివసించే 27 ఏళ్ల టెకీకి ఇది పార్ట్టైం జాబ్. ఆఫీస్ తర్వాత బైక్ టాక్సీ రైడ్లు చేస్తాను. ట్రాఫిక్లో ఒంటరితనాన్ని తగ్గించేందుకు ఇది మంచి మార్గం. కానీ, ఇప్పుడది లేకుండా పోతోంది అని అంటున్నాడు. నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ స్పందనబైక్ ట్యాక్సీ డ్రైవర్లను ఏదో నేరస్తుల్లాగా పరిగణించడం అన్యాయం. ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో మేమూ భాగమే. మమ్మల్ని చర్చ లేకుండానే ఎందుకు బయటకు తోసేస్తున్నారు?. లైసెన్సింగ్, ఇన్సూరెన్స్, భద్రతపై స్పష్టమైన నిబంధనలు కావాలి. లక్షకు పైగా గిగ్ వర్కర్ల జీవనాధారాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వినతిపత్రం సమర్పించింది. తీర్పు ఇలా..కర్ణాటక వ్యాప్తంగా బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే.. గత శుక్రవారం ( జూన్ 13న) ఉబర్, ఓలా, రాపిడో యాప్ సంస్థలు దాఖలు చేసిన స్టే అభ్యర్థనలను డివిజన్ బెంచ్ తిరస్కరించింది. అయితే, నిబంధనల రూపకల్పనలో పురోగతి కనిపిస్తే స్టే ఇచ్చేందుకు సుముఖత చూపిస్తామని కోర్టు తెలిపింది. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి నిబంధనలను రూపొందించేది లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 24కు వాయిదా వేసింది.మాకు అవసరంబెంగుళూరులో నిత్యం తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యను ప్రస్తావిస్తూ అనేకమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫోటోలు, వ్యాఖ్యలతో తమ ఆవేదనను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా ట్రాఫిక్తో స్తంభించిపోయే బెంగుళూరుకు బైక్ టాక్సీలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రజా రవాణా మార్గాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పును, ప్రభుత్వవ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.వా.. ఎన్ను ఐడియాఇలాంటి నిర్ణయాలతో సంబంధం లేకుండా తమ దారులు తమకు ఉన్నాయని యాప్ ఆధారిత అగ్రిగేటర్లు అంటున్నాయి. రాపిడో తమ యాప్లో 'బైక్' సర్వీసును 'బైక్ పార్శిల్'గా మార్చినట్టు తెలుస్తోంది. ప్రయాణికులు తమను తామే 'పార్శిల్'గా బుక్ చేసుకుని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. ‘‘రైడ్ బుక్ చేసుకోలేకపోతున్నారా? ఫర్వాలేదు, మిమ్మల్ని మీరే పార్శిల్గా పంపించుకోండి. దీనిని 'ప్యాస్ - ప్యాసింజర్ యాజ్ ఏ సర్వీస్' అనొచ్చు" అంటూ ఓ యూజర్ ఇందుకు సంబంధించిన బుకింగ్ స్క్రీన్షాట్ను షేర్ చేశారు. అలాగే.. ఉబెర్ 'మోటో'ను 'మోటో కొరియర్'గా మార్చింది. వా.. ఎన్ను ఐడియా(వా.. ఏం ఐడియా!) తెలివైన ఎత్తుగడ" అని మరో యూజర్ పేర్కొన్నారు. -
‘ఐపీఎల్ ఫ్లడ్లైట్లను హ్యాక్ చేశాం’
న్యూఢిల్లీ: భారత్లో ఏం జరిగినా అది తామే చేశామని పదే పదే చెప్పుకుంటూ మళ్లీ అభాసుపాలయ్యారు పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్. గతంలో భారత రక్షణ వ్యవస్థలోని కీలక సమాచారాన్ని హ్యాక్ చేశామని చెప్పుకున్న ఖవాజా అసిఫ్.. ఈసారి ఐపీఎల్ మీద పడ్డారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఎడిషన్లో ఫ్లడ్లైట్లను కూడా ఒకానొక సందర్భంలో హ్యాక్ చేశామని పాక్ అసెంబ్లీ(పార్లమెంట్) సాక్షిగా డబ్బా కొట్టుకున్నారు. మే 8వ తేదీన పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో భాగంగా ఫ్లడ్లైట్లను తమ దేశానికే చెందిన హ్యాకర్లు హ్యాక్ చేశారన్నారు. అసలు పాకిస్తాన్లో ఇంత టెక్నాలజీ ఉందా అనే భారతే ఆశ్చర్యపోతుందంటూ ఏదో చెప్పే యత్నం చేశారు. దీనిపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. ‘మీరు హ్యాక్ చేయడానికి ఫ్లడ్లైట్లు ఏమీ వైఫై కనెక్షన్ మీద నడవలేదు. కట్టుదిట్టమైన ఎలక్రికల్ సిస్టమ్లో నడిచాయి. ఇప్పుడు పాకిస్తాన్లో సైబర్ సబ్జెక్ట్ఃను ఏమైనా ప్రవేశపెట్టారా? అని సెటైర్ వేయగా, ‘మీరు స్కూలింగ్ ఎక్కడ చదివారో.. సైన్స్ అండ్ టెక్నాలజీని భలే చెబుతున్నారు’ అంటూ మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు‘ఈసారి ఒక పని చేయండి.. ఫ్లడ్లైట్లను కాదు.. స్కోరు బోర్డును హ్యాక్ చేయండి’ అంటూ మరొక యూజర్ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇలా పాకిస్తాన్ రక్షణమంత్రిపై సెటైర్ల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్ ఇలా దొరికిపోవడం తొలిసారి కాదు.. గతంలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా తాము భారత్ జెట్ విమానాలను కూల్చివేశామని, దానికి సోషల్ మీడియానే సాక్షి అంటూ AI క్రియేట్ చేసిన వీడియోలు గురించి మాట్లాడారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు ఖవాజా అసిఫ్.Pakistan Defence Minister: Our Cyber warriors did Wonder during this War with India - We Switched off FLOOD LIGHTS during IPL Match pic.twitter.com/k4eMe0uCMA— Megh Updates 🚨™ (@MeghUpdates) June 14, 2025 -
బైక్పై యువజంట వికృత చేష్టలు.. రూ. 53,500 జరిమానా
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు యువతీ యువకులు రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపధ్యంలో ఈ జంటపై చర్యలు తీసుకోవాలని పోలీసులను పలువురు కోరారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా వైరల్ అయిన ఈ ఐదు సెకన్ల క్లిప్లో ఒక యువకుడు బైక్ నడుపుతుండగా, ఒక యువతి పెట్రోల్ ట్యాంక్పై అతనికి రివర్స్ పొజిషన్లో కూర్చుని, తన కాళ్లను అతనికి వెనుకవైపుగా ఉంచింది. నిత్యం రద్దీగా ఉండే ఎక్స్ప్రెస్వేపై వారిద్దరూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. అయితే, ఆ మహిళ చేతిలో హెల్మెట్ ఉంది. అక్కడి సీసీటీవీ కెమెరాలలో ఈ ఉదంతమంతా రికార్డయ్యింది. नोएडा पुलिस ने इस "इशकजादे" का 53500 रुपए का चालान व्हीकल एक्ट में काटकर "प्रेम पत्र" घर भिजवा दिया है !! pic.twitter.com/Dw3gqS46Z8— Sachin Gupta (@SachinGuptaUP) June 16, 2025ఈ వీడియోను గమనించిన తాము, ఆ వాహనం నంబరు ఆధారంగా బైక్ను గుర్తించి మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత విభాగాల కింద రూ.53,500 చలానా జారీ చేశామని నోయిడా (ట్రాఫిక్) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లకన్ సింగ్ యాదవ్ మీడియాకు పారు. ఈ సంఘటన సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర నేరాల కింద మోటార్ వాహనాల చట్టంలోని వివిధ విభాగాల కింద పోలీసులు ఆ వాహనానికి చలానా జారీ చేశారు.ఇది కూడా చదవండి: జనగణన నోటిఫికేషన్ జారీ.. లెక్కల ప్రక్రియ ఇదే.. -
లైకులు, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా?
ఒకవైపు.. ఘోర ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఖంలో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షలు పూర్తి కాకపోవడంతో మృతదేహాల కోసం బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఈలోపు.. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మృతుల గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కొమ్మి వ్యాస్.. తన భార్య, ముగ్గురు పిల్లలతో లండన్లో స్థిరపడేందుకు ఎయిరిండియా విమానం ఎక్కడిన డాక్టర్. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో ఆ కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఇప్పుడు.. ఆ ఫ్యామిలీని బద్నాం చేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం ఎక్కిన తర్వాత ఫ్యామిలీ ఫొటోను వ్యాస్ తన కుటుంబానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫొటోను ఏఐ వీడియోగా కొందరు వైరల్ చేస్తున్నారు. మరికొందరు.. ఒక అడుగు ముందుకు వేసి వ్యాస్ కూతురు మిరాయ ఫొటోను, ఓ వీడియోను తెరపైకి తీసుకొచ్చారు. ‘‘మా కుటుంబాన్ని కోల్పోయామన్న బాధలో మేముంటే.. కొందరు విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నారు. మా పాప మిరాయ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డీఎన్ఏ టెస్టులో ఏ మృతదేహం అనేది దృవీకరణ కాలేదు. కానీ.. ఈలోపే మిరాయ్ అంత్యక్రియలంటూ భావోద్వేగం పేరిట ఓ వీడియోను పోస్ట్ చేసి కొందరు వ్యూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాగేనా చేసేది?’’ అంటూ వ్యాస్ కుల్దీప్ భట్ ఆవేదన-అసహనం వ్యక్తం చేశారు. వ్యాస్ కుటుంబం మాత్రమే కాదు.. బాధిత కుటుంబాలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి కంటెంట్ను ఖండిస్తోంది. సంబంధం లేని వీడియోలు, కంటెంట్ను తెర మీదకు తీసుకొచ్చి షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రమాదం జరిగిన నాటి నుంచే ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడెక్కడివో వీడియోలను తెచ్చి.. ఎయిరిండియా విమానంలోవి అంటూ పోస్టులు పెడుతున్నారు. మా వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని పోస్టులు ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్)లలో కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. అసలేం చేస్తున్నారు?. ఇలాంటి విషాద సమయంలోనూ కనీస నైతిక విలువలు పాటించరా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదంపైనా జోకులు, మీమ్స్ వేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో.. ప్రభుత్వాలైన స్పందించి అలాంటి కంటెంట్ను కట్టడి చేయాలని కోరుతున్నారు మరికొందరు. -
వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా?
రాయ్పూర్: ఆమె ఓ ప్రభుత్వ అధికారి భార్య. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మహిళ.. బాధ్యత మరిచిపోయి ఓవరాక్షన్ చేసింది. డీఎస్పీ సతీమణి.. తన పుట్టినరోజు సందర్భంగా చేసిన తప్పిదం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమె.. ప్రభుత్వ వాహనం బ్యానెట్పై కూర్చుని కేక్ కట్ చేస్తూ.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వ వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం ఈ మధ్య కాలంలో తరచుగా కనిపిస్తూనే ఉంది. తాజాగా ఛత్తీస్గఢ్లోని జంజ్గిర్-చాంపా జిల్లా డీఎస్పీ తస్లీం ఆరీఫ్ భార్య ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను ఒక ప్రభుత్వ వాహనం ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది. ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా.. పోలీసు శాఖకు చెందిన వాహనం బ్యానెట్పై కూర్చొని కేక్ కట్ చేసింది.ఇక, కేక్ కటింగ్ సందర్భంగా.. “స్నో స్ప్రే” తో వాహనం అద్దంపై “32” అని రాసింది. తరువాత డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి వైపర్స్తో దాన్ని తుడిచేశాడు. అనంతరం ఆమె మళ్లీ “33” అని రాస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఇదే సమయంలో కారు బ్యానెట్పై కేక్, పుష్పగుచ్ఛం కూడా ఉంచారు. ఈ రీల్ వీడియోను సరగానా రిసార్ట్(Saragana Resort)లో చిత్రీకరించినట్లు సమాచారం. ఇక కారు అలా ముందుకు పోతుంటే బ్యానెట్పై డీఎస్పీ సతీమణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సదరు పోలీసు వాహనంలో మరికొందరు మహిళలు కూడా ఉన్నారు. వారంతా ఎంజాయ్ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.DSP की पत्नी ने नीली बत्ती वाली कार के बोनट पर बैठकर मनाया बर्थडे, वायरल हुआ वीडियो छत्तीसगढ़ के बलरामपुर जिले में पुलिस बटालियन में तैनाच डीएसपी तस्लीम आरिफ की पत्नी नीली बत्ती लगी सरकारी कार के बोनट पर बैठकर अपना बर्थडे मना रही है. यह वीडियो सोशल मीडिया पर खूब वायरल हो रहा… pic.twitter.com/iarwZ1j71f— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) June 13, 2025అయితే, సదరు అధికారి భార్య తన పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ వాహనం ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అధికారిక వాహనాలు కేవలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలి. వ్యక్తిగత వేడుకల కోసం ఇటువంటి వాహనాలను వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. ముఖ్యంగా బ్లూ బీకాన్(blue beacon) వంటి అధికార గుర్తింపు చిహ్నాలున్న వాహనాలను వినియోగించడం నేరంగా పరిగణిస్తారు. దీంతో, పలువురు నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటివరకు సంబంధిత డీఎస్పీపై ఎలాంటి అధికారిక చర్య తీసుకోకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Brut India (@brut.india) -
ఆ భగవద్గీత ఈమెదే!
అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన దుర్ఘటన.. ఎంతో మంది కుటుంబాల్లో తీరని విషాదాలు నింపింది. ప్రమాద సమయంలో 230 ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది ఉండగా.. ఒకే ఒక్క ప్రయాణికుడు సజీవంగా బయటపడి మృత్యుంజయుడయ్యాడు. విమాన ప్రయాణికులు సజీవ దహనమైపోవటంతో పాటు విమానం కూలిన భవనంలోని వాళ్లు ప్రాణాలు కోల్పోవటం.. దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే..ఈ దుర్ఘటనలో కన్నీటి కథలు.. ఎన్నో భావోద్వేగ గాథలు వెలుగుచూస్తూ గుండెల్ని మెలిపెడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే.. నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. విమాన ప్రమాదం జరిగిన స్థలంలో భగవద్గీత దొరికిందని.. విమానం మొత్తం కాలిబూడిదైనా ఆ పుస్తకం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి . అయితే.. ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగి మనుషులంతా కాలి సజీవ దహనమైతే.. భగవద్గీత మాత్రం కాలిపోకుండా ఎలా ఉంది అనే కుతూహలం ఒకవైపు వ్యక్తమవుతుంటే.. మరోవైపు, అసలు ఆ భగవద్గీత ఎవరిదీ..? ఫ్లైట్లో ఎందుకుంది..? అని ప్రశ్నలు మొదలయ్యాయి.సాగర్ అమీన్ అనే వలంటీర్ విమాన ప్రమాదం గురైన స్థలంలో శిథిలాల తొలగింపు జరుగుతుండగా ఆ భగవద్గీతను కనిపెట్టారు. ఈలోపు.. ఆ గ్రంథం ఎవరనేదానిపై రకరకాల కథనాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ భగవద్గీత జయశ్రీ పటేల్(27)కు చెందిందన్నది ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ కథన సారాంశం. అందులోని వివరాల ప్రకారం..గుజరాత్ ఆరావళి జిల్లా కంభిసర్కు చెందిన జయశ్రీ పటేల్ శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు. ఎప్పుడూ ఆమె తన వెంట కృష్ణుడి చిన్న విగ్రహం, భగవద్గీతను తీసుకెళ్తుందట. ఈ ఏడాది జనవరిలో ఆమెకు వివాహం అయ్యింది. భర్త లండన్లో ఉద్యోగం. దీంతో ఆమె అక్కడికి బయల్దేరింది. అలా వివాహం అయిన మొదటిసారి.. ఆమె ప్రయాణంలోనూ వాటిని తీసుకెళ్లిందని, ప్రమాదంలో మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీళ్లతో చెప్పినట్లు ఆ ఆంగ్ల మీడియా కథనం ఇచ్చింది. మరోవైపు ఆ భగవద్గీత ఓ ఎయిర్హోస్టెస్దంటూ మరో కథనం వైరల్ అవుతోంది. Bhagavad Gita was found from the debris of the plane crash. The surprising thing is that the book did not burn even in the midst of such a fierce fire. Jai Shree Krishna 🙏🌸Om Shanti#Ahmedabad | #Planecrash | #AirIndia | #BlackBox #planecrashahmedabad #bhagavadgita pic.twitter.com/ypdrm2JP2i— DivineDiva ❤️ (@potus021) June 13, 2025 -
తాజ్మహల్ను మైమరిపించే ఇల్లు.. ఆ మాటలకు ఫిదా కావాల్సిందే!
పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా అంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యాసంస్థల ఓనర్ కమ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలియంది కాదు. అయితే ఇక్కడో పెద్దాయన అట్లాంటి డైలాగులేవీ పేల్చడం లేదు. ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహల్ను మోడల్గా తీసుకుని ఏకంగా ఇంటినే నిర్మించుకున్నారు. అందుకు ఆయన చెప్పిన సమాధానం పెద్దగా ఆశ్చర్యమేమీ అనిపించకపోవచ్చు. కానీ, ఆయన చెప్పిన విధానం మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటోంది.మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో తాజ్ మహల్ను తలపించేలా నాలుగు బెడ్రూమ్లో ఓ భవనం ఉంది. స్థానికంగా విద్యా సంస్థను నడిపించే ఆనంద్ ప్రకాశ్ చౌక్సీ నివాసం అది. 2021లో ఈయనగారు ఈ ఇంటితో నేషన మీడియా దృష్టిని ఆకర్షించారు. నాలుగు బెడ్రూమ్లు, ఓ కిచెన్, ఓ మీడియేషన్ రూం.. ఇందులో ఉంటాయి. ఆ ఇంటిని ఆనుకునే ఆ హైటెక్ గురుకుల్ కూడా ఉంది. తాజ్మహల్ పరిమాణంలో మూడింట ఒకటో వంతు ఉందట ఆ ఇల్లు. ఓ వ్లోగర్ ఆ జంటను పరిచయం చేసుకుని ఆ ఇంటిని పరిశీలించడం ఆ వీడియోలో ఉంది.👉మా తాజ్ మహల్.. నాలుగు బెడ్రూమ్ల ఇల్లు. అసలైన తాజ్ మహల్ ప్రేమకు సమాధి. ఇదేమో నా భార్యకు ప్రేమతో కట్టించిన ఇల్లు.. అంతే తేడా👉చిన్నతనంలో ఇంటింటికీ తిరిగి పాలు పోసేవాడిని. గర్వం తలకెక్కించుకోకు అని గుర్తు చేయడానికి గృహ ప్రవేశం సమయంలో ఈ ఇంటి మధ్యలో ఇలా గేదె బొమ్మను ఉంచాను. ఇది ఎప్పుడూ నా మూలాలను గుర్తు చేస్తుంటుంది👉నా భార్య మెడిసిన్ వదిలేయాల్సి వచ్చింది. నేను ఇంజినీరింగ్ చేయలేకపోయాను. అందుకే పిల్లలను డాక్టర్లను, ఇంజనీర్లను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. అలా దేశంలోనే మోస్ట్ హైటెక్ గురుకుల్ను నడిపిస్తున్నాం. 2200 మంది పిల్లలు. వాళ్లే మా కుటుంబం.👉దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటికి పరిష్కారం ఒక్కటే.. ప్రేమ. అన్నట్లు ఆనంద్ ప్రకాశ్ చౌక్సీ విద్యావేత్త మాత్రమే కాదు, తరచూ దాతృత్వ కార్యక్రమాలూ నిర్వహిస్తుంటారు. మోటివేషనల్ స్పీకర్గానూ ఆయన వీడియోలు కొన్ని అక్కడ వైరల్ అవుతుంటాయి. View this post on Instagram A post shared by Priyam Saraswat (@priyamsaraswat) -
AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్
అహ్మదాబాద్ (గుజరాత్): సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విధ్వంసకర AI 171 విమాన ప్రమాదం తర్వాత, ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది , కుటుంబ సభ్యులులను శుక్రవారం BJమెడికల్ కాలేజీ వైద్యుల హాస్టల్ ప్రాంగణం నుండి ఖాళీ చేయిస్తున్నారు. ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్గా మారాయి ఈ సందర్భంగా ముఖ్యంగా డా. అనిల్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. తమను ఇప్పటికిపుడు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా మాండేటరీ ఆదేశాలిచ్చారు, రెండు మూడు రోజులు సమయం ఇవ్వండి, మానవత్వం చూపండిఅంటూ భావోద్వేగానికి గురి అవుతున్న వీడియో సంచలనంగా మారింది. మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తన కుమార్తె, తన ఇంట్లో సహాయకురాలు ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారని, వారికి తనసాయం అవసరం అంటూ కంటతడి పెట్టారు. తన భార్య లేదని, చాలా నిస్సహాయంగా ఉన్నానంటూ భోరున విలపించారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ కన్నీంటి పర్యంత మయ్యారు. ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! View this post on Instagram A post shared by Vinay Sharma (@vinayshaarma)> కాగా 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘనినగర్ ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ఈ సందర్బంగా మధ్యాహ్నం లంచ్కోసం వచ్చిన విద్యార్థులు కూడా కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. -
25 మందికి ఎస్యూవీ కార్లను బహుమతిగా ఇచ్చిన స్టార్టప్ కంపెనీ
చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగులకు కార్లను గిఫ్టగా ఇచ్చింది. కంపెనీలు లాభాలను ఉద్యోగులను పంచి ఇచ్చింది. "నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు; అనుచరులు లేకుండా నాయకుడు లేడు" అని అజిలిసియం వ్యవస్థాపకుడు, CEO రాజ్ బాబు తెలిపారు.ఈ పరంపర కొనసాగుతుందని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో ఈ వార్త నెట్టింట సందడిగా మారింది. 25 మందికి ఎస్యూవీ కార్లు గిప్ట్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు ప్రముఖ అటానమస్ ఏజెంట్ ఏఐ భాగస్వామిగా ఉన్న అజిలిసియం సంస్థ ఒక గొప్ప ఆవిష్కరణకు చర్యలు తీసుకుంది. దీర్ఘకాలంగా తమ సంస్థలో సేవలందిస్తున్న ఉద్యోగులందరికీ హ్యుందాయ్ క్రెటా కార్లను బహుమతిగా గురువారం అందజేసింది. సంస్థ 10వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రారంభం నుంచి ప్రపంచ స్థాయికి దాని ప్రయాణాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉద్యోగులను గుర్తించి సత్కరించారు. విలువైన సేవలకు గుర్తింపుగా చెన్నైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని అజిలిసియం ప్రధాన కార్యాలయంలో ఈ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాజ్బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిలిసియంలో తమ ఉద్యోగుల సేవలను ఎల్లప్పుడు గుర్తిస్తూనే ఉన్నామని చెప్పారు. సకాలంలో సేవలను అందించడంలో , దీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి అందించిన ఈ కార్లు బహుమతులు కావని, అవి శాశ్వత విశ్వాసం, భాగస్వామ్య ఉద్దేశం కలిసిన అద్భుత స్పూర్తిగా ఆయన వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్ డాక్టర్ సీక్రెట్ ఇదే! 2014లో అజిలిసియంను రాజ్ బాబు స్థాపించారు .ఇది ఏజెంట్ AI భాగస్వామిగా లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు సేవలందిస్తున్నందున బూట్స్ట్రాప్గా ఎదుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇది 45శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR)తో వృద్ధి చెంది 2027 నాటికి 100 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నమోదు చేస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా! -
వా.. నర ప్రేమ!
విశ్వాసం గురించి చెప్పాల్సి వస్తే కుక్కనో, మరేయితర జంతువునో ప్రస్తావన తీసుకొస్తాం. ఎందుకంటే.. పట్టెడన్నం పెడితే మూగ జీవాలు చూపించే ప్రేమ అలాంటిది మరి!. తాజాగా ములుగు జిల్లాలో జరిగిన ఓ ఘటన.. పలువురిని కంటతడి పెట్టిస్తోంది. వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళ.. తన ఇంటి పక్కనే ఉన్న దుర్గమ్మ గుడి వద్ద రోజూ సేవ చేస్తూ ఉండేది. ఆమె కొడుకు బొల్లె వీర్రాజు తల్లికి సాయంగా ప్రసాదం తీసుకెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ వానరం వీర్రాజు దృష్టిని ఆకర్షించింది. అలా క్రమం తప్పకుండా ఆ వానరానికి ప్రసాదం పెట్టడంతో వాళ్లు మంచి స్నేహితులయ్యారు. అయితే అంతలోనే.. విధి వక్రీకరించింది. అనారోగ్యంతో వీర్రాజు మొన్నీమధ్యే కన్నుమూశాడు. రోజూ తనకు తిండి పెట్టి అపురూపంగా చూసుకునే వీర్రాజు రాకపోవడంతో.. ఆ వానరమే కదిలి వచ్చింది. ఇంట్లో విగత జీవిగా చాపలో ఉన్న వీర్రాజు చుట్టూ తిరిగింది. పాపం.. అతన్ని శాశ్వత నిద్ర నుంచి లేపేందుకు తన వంతు ప్రయత్నం చేసింది. అవేవీ జరగకపోవడంతో చివరకు తన స్నేహితుడి చెంత కాసేపు విశ్రమించింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. వీర్రాజు అంతిమ యాత్రలోనూ కాసేపు ఆ వానరం కనిపించింది. గుడి దగ్గరకు రాగానే వీర్రాజు పార్థివదేహం మీద పడి విలపించినంత పని చేసింది. కొద్ది దూరం అంతిమ యాత్రలో జనాలతో కలిసి వచ్చి.. ఆపై వెనక్కి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడున్న వాళ్లను కంటతడి పెట్టించాయి. ఆ వా‘నర’ ప్రేమను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. -
రామ్మోహనా.. రీల్స్ చేయడానికి వెళ్లావా..?
సాక్షి, తాడేపల్లి: నిన్న(గురువారం) భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. అయితే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిన్న ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వీడియోను రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. వీడియోకు బ్యాక్ గ్రౌండ్ ఆడియో కలిపి పోస్టు చేయడంపై ట్రోల్ అవుతోంది. ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారా? రీల్స్ చేయడానికా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.This is Aviation minister RamMohan Naidu.Instead of taking the responsibility for #planecrash he's literally uploading reels.There is music in the video, there are multiple cuts & video effects.This reel-fever of Modi cabinet is disgusting.pic.twitter.com/vUDcYfBhps— Tarun Gautam (@TARUNspeakss) June 12, 2025 -
రెడ్ శారీలో ఆదితి గౌతమ్ గ్లామరస్ లుక్స్.. బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక హోయలు!
నగల దుకాణంలో బిగ్బాస్ బ్యూటీ దివి..రెడ్ శారీలో ఆదితి గౌతమ్ హోయలు..వెకేషన్లో చిల్ అవుతోన్న మెహరీన్ ఫిర్జాదా..పెళ్లి రోజు తబిత సుకుమార్ స్పెషల్ పోస్ట్..బ్లూ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్.. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
లక్షల్లో సంపాదన.. ఇస్మార్ట్ ఆటోవాలాకు బిగ్ షాక్
ఆటో నడపకుండానే.. కత్తిలాంటి ఐడియాతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటూ ఓ ఆటోవాలా గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. నిజనిర్ధారణలోనూ.. అది వాస్తవమేనని తెలిసేసరికి వహ్ అనుకున్నారంతా. ప్రముఖులు సైతం బ్రిలియంట్ అంటూ మెచ్చుకున్నారు. అయితే ఆ ప్రచారమే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది. లింక్డిన్లో వెన్యూమోంక్ కో ఫౌండర్ రాహుల్ రుపానీ ఆ ఆటోడ్రైవర్ కథనాన్ని షేర్ చేశారు. బంద్రాకుర్లా కాంప్లెక్స్లోని యూఎస్ కన్సులేట్ బయట ఆటోను పార్క్ చేసి.. వచ్చిపోయే సందర్శకుల సామాన్లను క్లాక్ రూమ్ తరహాలో ఆటోలో భద్రపరిచి సంపాదన చేస్తున్నాడతను. అలా ఒక్కో కస్టమర్ దగ్గరి నుంచి రూ.1000 చొప్పున.. నెలకు రూ.ఐదు లక్షల నుంచి 8 లక్షల దాకా సంపాదిస్తున్నాడంటూ ఆయన స్టోరీ షేర్ చేశారు. హర్ష్ గోయెంకాలాంటి ప్రముఖులు సైతం ఆ ఆటోవాలా బుర్రకు ఫిదా అయిపోయారు.అయితే అతని కథనాలకు ముంబై పోలీసులు స్పందించారు. ఆ ఆటో డ్రైవర్ లాగే మరో 12 మంది అక్కడే అదే పనిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తక్షణమే ఆ జాగా ఖాళీ చేయాలంటూ అందరికీ సమన్లు జారీ చేశారు. ‘‘యూఎస్ కన్సులేట్ బయట భద్రతా కారణాల దృష్ట్యా పార్కింగ్ నిషేధిస్తున్నాం. ఆటో డ్రైవర్లు కేవలం ప్యాసింజర్లను అక్కడ దించి వెళ్లిపోవాలే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ముంబై పోలీసులు మళ్లీ స్పందించారు. ‘‘ఆ ఆటో డ్రైవర్కు లైసెన్స్ ఇచ్చింది ఆటో నడుపుకోవడానికి. అంతేగానీ లాకర్ సేవలు అందించడానికి కాదు. అతను మాత్రమే కాదు.. అతనిలా మరికొందరు డ్రైవర్లు అదే పనిలో ఉన్నారని మా విచారణలో తేలింది. కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు.. సమీపంలోని దుకాణాదారులకు కూడా లాకర్ సర్వీసులు నడిపించేందుకు అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా అలా నడిపిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పాపం.. బ్రిలియంట్ ఐడియాతో వైట్ కాలర్ జీతగాళ్లకు కూడా దక్కని సంపాదనతో బిజినెస్ చేస్తున్నాడని పొగిడేలోపే ఆ ఆటో డ్రైవర్కు బిగ్ షాక్ తగిలింది. -
కారులో ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ మృతదేహం.. రంగంలోకి పోలీసులు
భఠిండా: పంజాబ్లో దారుణం వెలుగు చూసింది. లూధియానాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం రాత్రి అదేష్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసిన కారులో ఆమె మృతదేహం పోలీసులకు లభ్యమయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని ఇక్కడ కారులో ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పార్క్ చేసిన కారు నుండి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు లోపల కౌర్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ కారు లూధియానా జిల్లాలో రిజిస్ట్రర్ అయిన కారు అని సమాచారం. కౌర్కు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో 3.83 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చేసే రీల్స్ ఎంతో ఆదరణ పొందాయి. అయితే ఆమె అసభ్యకర పదజాలాన్ని ఉపయోగిస్తారనే ఆరోపణలున్నాయి.ప్రాథమికంగా దీనిని హత్యకేసుగా పరిగణిస్తున్నామని బఠిండా పోలీస్ సూపరింటెండెంట్ అమ్నీత్ కొండల్ తెలిపారు. సంఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. నిందితులు కౌర్ను వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని విశ్వవిద్యాలయ పార్కింగ్ స్థలంలోని కారులో ఉంచారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ను సిట్ అడగబోయే 20 ప్రశ్నలివే.. -
విజయ్ మాల్యా 4 గంటల ఇంటర్వ్యూ.. 'సోషల్' హల్చల్
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మళ్లీ లైమ్ లైటులోకి వచ్చారు. మాల్యాపై సోషల్ మీడియా మీడియాలో తాజాగా చర్చోప చర్చలు నడుస్తున్నాయి. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్ రాజ్ షమానీ (Raj Shamani)కి ఇటీవల పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు మాల్యా. 4 గంటల పాటు సాగిన సుదీర్ఘ ముఖాముఖిలో చాలా విషయాలను ఆయన పంచుకున్నారు. వ్యాపారంలో ఒడిదుడుకుల నుంచి ఐపీఎల్ వరకు అన్ని విషయాలు మాట్లాడారు. పాలకులు తనను బలిపశువును చేశారన్నట్టుగా మాల్యా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ స్వప్రయోజనాల కోసం తనను వాడుకున్నాయని పరోక్షంగా ఎత్తిచూపారు. వివాదాలను పరిష్కరించుకోవడానికి తాను ఆసక్తి చూపించినా పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు.బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాల కంటే ఎక్కువే చెల్లించానని, అయినా తనను ఎగవేతదారుడిగా ముద్ర వేశారని వాపోయారు. తాను ఇండియా నుంచి పారిపోలేదని, అనుకోని పరిస్థితుల్లో స్వదేశానికి దూరమయ్యానని చెప్పారు. తనపై మోపిన అభియోగాలపై నిష్పక్షపాత విచారణ జరుపుతామని భారత ప్రభుత్వం హామీయిస్తే స్వదేశానికి తిరిగి వస్తానని అన్నారు. మరోవైపు మాల్యా మాటలకు బ్యాంకులు కూడా దీటుగానే స్పందించాయి. మాల్యా తీసుకున్న రుణాలు, వడ్డీల లెక్కలతో ఆయనకు బదులిచ్చాయి.కాగా, విజయ్ మాల్యా వీడియోకు 4 రోజుల్లో 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై ఎక్స్లో మాల్యా స్పందిస్తూ.. తన హృదయం ఆనందంతో నిండిపోయిందని పేర్కొన్నారు. 'ఉక్కిరిబిక్కిరి అయ్యానని చెప్పడం, నాకు నిజంగా అనిపించే దానికంటే చాలా తక్కువ. @rajshamani తో నా 4 గంటల పాడ్కాస్ట్ చూడటానికి సమయం కేటాయించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 4 రోజుల్లో ఒక్క YouTubeలోనే 20 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఇంకా ఎన్ని రీపోస్టులు వచ్చాయో ఆ దేవుడికే తెలుసు. నా నిజమైన కథ వినబడుతుందని తెలిసి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. దేవుడు మీ అందరినీ దీవించుగాక' అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు.చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను మాత్రం కాదువిజయ్ మాల్యా ఇంటర్వ్యూపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మాల్యాకు మద్దతుగా కొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొంత మంది మాత్రం ఆయన అబద్దాలు చెప్పారంటూ విశ్లేషణలు చేస్తున్నారు. మాల్యా కేసు భారతదేశంలో కార్పొరేట్ రుణాల చీకటి కోణాన్ని బయటపెట్టిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంకొంత మంది మీమ్స్, వీడియోలతో సైటర్లు పేలుస్తూ హాస్యచతురత ప్రదర్శిస్తున్నారు.Indians after watching Vijay Mallya's podcast#VijayMallya विजय माल्या 🙂 pic.twitter.com/NVyDWLPC5N— Sourabh (@vellasrv) June 7, 2025Well. #VijayMallya pic.twitter.com/ilWmPEJcRB— Kritant Mishra (@YourGandhiBro) June 8, 2025Well. #VijayMallya pic.twitter.com/ilWmPEJcRB— Kritant Mishra (@YourGandhiBro) June 8, 2025Mandatory tweet from the Banks management whenever they see news relating to #VijayMallya😿 pic.twitter.com/577rD4HmTB— Tadkamarkey 3.0 🇮🇳 (@AnilPil63050188) June 10, 2025Mandatory tweet from the Banks management whenever they see news relating to #VijayMallya😿 pic.twitter.com/577rD4HmTB— Tadkamarkey 3.0 🇮🇳 (@AnilPil63050188) June 10, 2025 -
OP Sindoor: పాక్ కవర్ డ్రైవ్ .. భలే బెడిసి కొట్టిందిగా!
ఆపరేషన్ సిందూర్ ఓ విఫల ప్రయత్నమని.. పైగా తాము జరిపిన ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్తో భారత్కు భారీగా నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ నెల రోజులుగా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్ ఫొటోలతో, అసత్య ప్రచారాలతో ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలు అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి అదే రిపీట్ అయ్యింది.అబ్బే.. భారత సైన్యం అసలు తమ ఎయిర్బేస్లపై దాడులే జరపలేదని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ దాడులను కవరింగ్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు బయటపడింది. ఆపరేషన్ సిందూర్లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత్ నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్బేస్లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఇండియా టుడే జరిపిన శాటిలైట్ చిత్రాల విశ్లేషణలో అవి పైకప్పు కాదని, టార్ఫలిన్లు అని తేలింది. అదీ వాటి పైకప్పు ఆకుపచ్చ, గోధుమ రంగులో మ్యాచ్ అయ్యేలా చూసుకుంది పాక్ ఆర్మీ. అయినప్పటికీ శాటిలైట్ చిత్రాల ద్వారా విషయం బయటపడింది. 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. దాడి తర్వాత దెబ్బతిన్నవాటిని పునరుద్ధరించకుండానే.. కేవలం టార్పలిన్తో కవర్ చేశారని సోషల్మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. ఇదంతా చూస్తున్న కొందరు బాలీవుడ్ అభిమానులు.. పర్దే మేన్ రహ్నే దో, పర్దా న ఉటావో అంటూ పాట పాడుతూనే.. పర్దా తొస్తే అసలు విషయం బయటపడుతుందంటూ పాక్ను ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్ ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. దేశ రక్షణ బడ్జెట్ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది.Nearly a month after India’s strikes in Pakistan, a review by India Today shows craters now concealed & hangars patched with tarpaulin, the visual indicators of damage remain, masked but not restored Read here - https://t.co/r8blLp5Kk1 pic.twitter.com/VzlJGQ6DcA— Damien Symon (@detresfa_) June 11, 2025 -
పిల్లలకు సోషల్ మీడియా పరిమితులు : ఫోన్పై స్మార్ట్చెక్
పద్నాలుగేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా యాప్ల వాడకంపై, పరిమితులు విధించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆన్లైన్ భద్రతా చట్టాల విషయంలో వివిధ దేశాలు కచ్చితమైన విధానాలనూ అమలు పరుస్తున్నాయి. కానీ, సోషల్ మీడియా మంచి చెడులు పిల్లల విషయంలో ఎప్పుడూ ప్రశ్నార్థకమే. పిల్లలపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో, తల్లితండ్రులే తప్పనిసరి జాగ్రత్తలు తీసు కోవాలంటున్నారు నిపుణులు. పిల్లలు సోషల్ మీడియాలో గడపగల సమయాన్ని పరిమితం చేయడానికి, కఠినమైన ఆన్లైన్ భద్రతాచ ర్యలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయనే వార్తలు కొంత ఊరటనిస్తున్నాయి. పాశ్చాత్య దేశాలు పిల్లలు వ్యక్తిగత సోషల్ మీడియా యాప్ల వాడకంపై రోజుకు రెండు గంటల పరిమితి విధించి, ఇరవై రెండు గంటలపాటు బంద్ విధించాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు నివేదికలూ సూచిస్తున్నాయి.స్మార్ట్ వ్యసనంపై టాక్ షోబీబీసీ నిర్వహించిన సండే విత్ లారా కుయెన్స్బర్గ్ నిర్వహించిన టాక్షోలో పాల్గొన్న యూకే టెక్నాలజీ కార్యదర్శి పీటర్ కైల్ను ‘సోషల్ మీడియా పిల్లల సమయ పరిమితుల గురించి అడిగినప్పుడు, కైల్ స్పందిస్తూ ‘కొన్ని యాప్లు పిల్లలను స్మార్ట్ఫోన్కు అంటిపెట్టుకుని, ఫోన్ వ్యసన పరులయేలా చేస్తున్నాయి. వాటి బారి నుంచి పిల్లలను రక్షించడానికి ఆన్లైన్ భద్రత చట్టాల అమలుకు కృషి జరుగుతోంది’ అన్నారు. ఆన్లైన్లో హానికరమైన కంటెంట్ను చూసి, తన 14 ఏళ్ల కూతురు మోలీ ఆత్మహత్య చేసుకుందని, ఆన్ లైన్ భద్రతా చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, సరైన నియంత్రణ లేకపోవడం, సాంకేతికత దుర్వినియోగం వల్ల ఎక్కువమంది యువత ప్రాణాలు కోల్పోవడాన్ని, ఆరోగ్యాలు దెబ్బ తినడాన్ని చూశాం‘ అని ఇయాన్ రస్సెల్ అనే వ్యక్తి వేదనతో తెలిపారు. దీనికి కైల్ స్పందిస్తూ– ‘పిల్లలు ఆన్లైన్లో ఎదుర్కొంటున్న హాని సునామీని అరికట్టడానికి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని చూసి దేశంలోని తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ స్మార్ట్ ఫోన్లకు ప్లాస్టర్లను అతికించలేం. పరిమితులను విధించడం వల్ల మేలు జరగదు. ఆరోగ్యకరమైన ఆన్లైన్ జీవితం ఎలా ఉంటుందో పిల్లలు అర్ధం చేసుకునేలా అవగాహన కల్పించాలి’ అంటూ అనిత ఈ షోలో తెలిపారు. ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్లో అఖిల్- జైనబ్మనం పరిమితులను ఎంచుకోవచ్చుయాప్స్కి, డిజిటల్ పరికరాలను నియంత్రించేందుకు ఇప్పటికే తల్లిదండ్రులకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. టిక్టాక్ 2023లో 18 ఏళ్లలోపు వారికి డిఫాల్ట్గా 60 నిమిషాల స్క్రీన్ సమయ పరిమితిని ప్రవేశపెట్టింది. ఇన్స్టాగ్రామ్ అన్ని వయసుల వినియోగదారులను వారి స్వంత పరిమితిని సెట్ చేసుకోమంటుంది. ఎంత సమయం బ్లాక్ చేయవచ్చో కూడా ఎంచుకోవచ్చు. 2021లో, చైనా ఆన్లైన్ గేమింగ్పై కఠినమైన ఆంక్షలు విధించింది. వారాంతాల్లో, సెలవు దినాల్లో మాత్రమే 18 ఏళ్లలోపు గేమర్స్ను రోజుకు ఒక గంటకు పరిమితం చేసింది. సెలవు దినాల్లో మూడు గంటలకు పెంచింది. యువతపై గేమింగ్ ప్రభావం గురించి తన ఆందోళనలను ఉదహరించి, మరీ ఈ నిబంధనలను విధించింది కేంద్రం. కానీ గత సంవత్సరం డ్రాఫ్ట్ అప్డేట్ ప్రభుత్వ వెబ్సైట్ నుండి అదృశ్యమైంది. ప్రభుత్వాలు అమలు చేయాలనే కఠిన నిబంధనలకన్నా ముందు కౌమారదశలో ఉన్న పిల్లలకు డిజిటల్ సేవలు ఎలా పొందాలో అవగాహన కల్పించడం ముఖ్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చదవండి: 230 -110 కిలోలకు అద్నాన్ సామి :‘ఆపరేషన్కాదు,వాక్యూమ్ క్లీనర్’ తల్లిదండ్రులూ ఇవి అమల్లో పెట్టండిటెక్నాలజీని బ్లాక్ చేయవద్దు. పిల్లలకు సురక్షితంగా సాంకేతికతను ఎలా ఉపయోగించాలో నేర్పించాలి. పిల్లలకు ఇష్టమైన యాప్లు, సైట్లు గురించి ఆసక్తి చూపుతూనే, వారు వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో కూడా తెలుసుకుంటూ ఉండాలి..పేరెంట్స్ స్మార్ట్ఫోన్ వాడకంలో పరిమితులు నిర్దేశించాలి. ఫిల్టరింగ్ సాఫ్ట్వేర్ వాడేలా జాగ్రత్తపడాలి.కుటుంబ మీడియా ఒప్పందం అంటే.. ప్రయాణం, భోజనం, పడక సమయాలు వంటి ప్రదేశాలను టెక్నాలజీ ఫ్రీ జోన్లుగా మార్చాలి. ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారం గురించి ఏమాత్రమూ వెల్లడించకూడదు అనే విషయాన్ని బోధించాలి. ఆన్లైన్ లో సమాచారాన్ని ఫిల్టర్ చేయడం, నిజం – అబద్ధం మధ్య తేడా తెలుసుకోవడంలో సహాయపడాలి. ఆరుబయట పచ్చదనం, స్క్రీన్ టైమ్ మధ్య సమతుల్యతను పాటించాలి. వారి శారీరక అభివృద్ధిపైన దృష్టి పెట్టాలి.14 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా యాప్స్ సైన్ అప్ చేయడంలో సహాయం చేయవద్దు.సోషల్మీడియాలో నమ్మదగిన వనరులను అన్వేషించి, వాటిని అందుబాటులో ఉంచాలి. పిల్లలకు ఇంటర్నెట్ సేఫ్టీచాలా సైట్లు, వెబ్ టూల్స్ 13 ఏళ్ల పై వయసున్న యూజర్ల కోసం ఉంటాయి. ఇవి ఆన్లైన్ కాపీరైట్తో భద్రపరిచి ఉంటాయిఆన్లైన్లో చేస్తున్న వర్క్ గురించి తల్లిదండ్రులకు పిల్లలు చెప్పాలి. తాము చూస్తున్న సైట్లో తప్పుగా ఏమైనా అనిపించినప్పుడు, ఉపయోగించడంలో మెళకువలు తెలియనప్పుడూ టెక్నాలజీ తెలిసిన పెద్దవారిని అడగాలి.ఆన్లైన్లో స్నేహితులను తల్లిదండ్రుల అనుమతి లేకుండా యాడ్ చేయవద్దు. అవతలి వారు చెప్పిన ప్రతిదాన్నీ నమ్మవద్దువ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్గా ఉంచాలి. పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ΄ాస్వర్డ్లు, ప్లానింగ్లు, పుట్టినరోజు.. వంటివి షేర్ చేయవద్దు. ఏది బడితే అది పోస్ట్ చేయకూడదు. అది ఒక్కోసారి భవిష్యత్తుకు ప్రమాదంగా మారవచ్చు.మీరు లేదా మీకు తెలిసినవారు బుల్లీయింగ్కు గురైనట్లయితే వెంటనే ఆ విషయాన్ని పెద్దవాళ్లకు తెలియజేయాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్,ఎండ్ నౌ ఫౌండేషన్ -
నీ తల్లిని కావడం వరం రా కన్నయ్యా! బిగ్బాస్ ఫేమ్ నటి ప్రియ ఇన్స్టా పోస్ట్ (ఫొటోలు)
-
Dusting challenge : 19 ఏళ్ల యువతి బలి, అసలేంటిది, లక్షణాలేంటి?
‘డస్టింగ్’ పేరుతో మరో సోషల్మీడియా భూతం అమాయక యువతీ యువకుల పారిట ప్రాణాంతకంగా మారుతోంది. అమెరికాలో ప్రమాదకరమైన డస్టింగ్ కారణంగా 19 ఏళ్ల యువతి మృత్యువాత పడింది. ఈ ఘటన అరిజోనాలో చోటుచేసుకుంది. మృతురాలిని రెన్నా ఓరూర్కేగా గుర్తించారు.ది ఇండిపెండెంట్ ప్రకారం, 19 ఏళ్ల రెన్నా ఓ'రూర్కే (Renna O'Rourke) ఏరోసోల్ వకారణంగా గుండెపోటుకు గురైంది. ఆ తరువాత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అపస్మారక స్థితిలో నాలుగు రోజులు చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి బ్రెయిన్ డెడ్గావైద్యులు ప్రకటించారు. ప్రియుడితో కలిసి రెన్నా తమకు తెలియకుండానే ఏరోసోల్ కీబోర్డ్ క్లీనర్ను ఆర్డర్ చేశారని,రెన్నా తల్లిదండ్రులు చెప్పారు. "ఆమె ఎప్పుడూ, 'నేను ఫేమస్ అవుతాను నాన్నా.. చూడండి. ' అని తరచూ చెప్పేదని అమ్మాయిల తండ్రి ఆరోన్ ఓ'రూర్కే అన్నారు.అసలేంటీ డస్టింగ్ డస్టింగ్ - క్రోమింగ్ లేదా హఫింగ్ అని కూడా పిలుస్తారు - ఈ డస్టింగ్ చాలెంజ్ ఇపుడొక వైరల్ ట్రెండ్. ఈ ఛాలెంజ్లో సరదా, ఆనందం కోసం కీబోర్డ్ క్లీనర్ల వంటి ఇంట్లో ఉండే రసాయనాలను స్ప్రే చేసి ముక్కుద్వారా పీల్చుతున్నారు. అమెరికా, ట్విటర్లో ట్రెండింగ్గా మారింది. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడతారు. గుండె పనిచేయడం మానేసి, ప్రాణాలు పోయే దాకా వస్తుంది. తాము పొందే స్వల్పకాలిక ఆనందం కన్నవాల్లకి తీరని శోకం మిగుల్చుతుందని గమనించలేకపోతున్నారు. .19 ఏళ్ల రెన్నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టమని, ఉత్సాహంగా, ఉల్లాసంగా చాలా సందడిగా ఉండేదని తండ్రి గుర్తు చేసుకున్నారు. మరోబిడ్డకు ఇలా కాకూడదనే సదుద్దేశంతో ఓరూర్కే కుటుంబం రెన్నా జ్ఞాపకార్థం, టీనేజర్లు మరియు తల్లిదండ్రులకు 'హఫింగ్' వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. గోఫండ్మీ పేజీని కూడా ప్రారంభించారు. "లోతుగా వెతకండి. వారి గదులను శోధించండి. అలా చేయడం వారి ప్రాణాలను కాపాడుతుంది" అని రెన్నా తల్లి సూచించారు.డస్టింగ్ లేదా క్రోమింగ్లో ఏమి జరుగుతుంది?క్రోమింగ్ చేసేటప్పుడు, ప్రజలు మెటాలిక్ పెయింట్స్ ఇతర ఉత్పత్తులలోని హైడ్రోకార్బన్లను పీల్చడానికి ప్రయత్నిస్తారని నిపుణులు అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. తీవ్రమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు, మరణానికి దారి తీస్తుంది. క్రోమింగ్ అనే భావన చాలా సంవత్సరాలుగా వివిధ పేర్లతో ఉంది.మాదకద్రవ్యాల వినియోగం, ఆరోగ్యంపై జాతీయ సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది - ముఖ్యంగా టీనేజర్లు - ప్రతి సంవత్సరం ఇన్హేలెంట్లను ఉపయోగిస్తారు. అమెరికాలో 2015 నుండి 2022 వరకు 12 -17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అత్యధికంగా వాడుతున్నారు. అలాగే 2024 మార్చిలో యూకేలో 11 ఏళ్ల బాలుడు సోషల్ మీడియాలో వీడియోలు చూసి విషపూరిత పదార్థాలను పీల్చి మరణించాడు.డస్టింగ్ వల్ల కలిగే ప్రమాదాలు ఏరోసోల్ పెయింట్, పెయింట్ థిన్నర్, ఇంజీన్ ఫ్యూయల్, జిగురు వంటి అనేక గృహోపకరణాలలో హైడ్రోకార్బన్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి భారీ మత్తును కలిగిస్తాయి. ఊపిరి ఆడకపోవడం నిద్రలేమి, తలనొప్పి, బద్ధకం, కండరాల బలహీనత, కండరాల నియంత్రణ కోల్పోవడం, వికారం, వాంతులు లాంటి ప్రారంభ లక్షణాలు ముదిరి చివరకు ప్రాణాలను హరిస్తాయి. తీవ్ర లక్షణాలు : ఊపిరాడకపోవడం, గుండె ఆగిపోవడం, ఉక్కిరిబిక్కిరి, కోమా, మూర్ఛలు , ప్రాణాంతక గాయంనిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటు బాడీలో ఆక్సిజన్ను పూర్తిగా తొలగిస్తుంది. ఊపిరాడకుండా చేసి మరణానికి గురి చేస్తుంది. క్రోమింగ్ శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కూడా ప్రభావితం చేస్తుంది. పొటాషియం స్థాయిలను తగ్గించేస్తుంది. ఇది గుండె కొట్టుకోవడంలో మార్పులు, కండరాల బలహీనత, ఇతర హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది. -
భర్తలకు స్పాట్.. రాజాలా బలవుతున్న భర్తలెందరో!
‘‘అరె మామా.. పెళ్లంటేనే భయమైతుంది రా’’ అంటూ తన స్నేహితుడు రవికి ఫోన్ చేసి ఆందోళనగా చెబుతున్నాడు విష్ణు. ‘‘సడన్ ఎందుకు మామా అలా అనిపిస్తోంది?’’ అంటూ అవతలి నుంచి రవి వాయిస్ వినిపించింది. ‘‘అరేయ్.. మేఘాలయా హనీమూన్ కోసం వెళ్లిన జంట మిస్ అయ్యిందని మొన్న ఓ వార్త లింకు పంపాను కదరా’’ అంటూ గుర్తు చేశాడు విష్ణు. ‘‘ఆ.. అవును.. పాపం ఆ భార్యకి కూడా ఏమైందో తెల్వదంట కదా!. అయితే ఏమైంది ఇప్పుడు’’ అన్నాడు రవి. ‘‘ఏం లేదురా.. ఆ మొగుడ్ని చంపింది ఆ భార్యేనంట!!’’ అంటూ విష్ణు చెప్పడంతో షాక్ తినడం ఇవతల రవి వంతైంది. మేఘాలయా హనీమూన్ జంట మిస్టరీ మిస్సింగ్ ఎపిసోడ్లో బయటపడ్డ ట్విస్ట్ గురించి రవి-విష్ణులాంటి వాళ్లెందరో చర్చించుకుంటున్నారు. అదీ సోషల్ మీడియా వేదికగా..!. మరో వ్యక్తితో బంధంలో ఉండి కూడా రాజా రఘువంశీని వివాహం చేసుకోవడం, ఆపై అతన్ని అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో స్కెచ్ వేయడం.. హనీమూన్లోనే భర్తకు స్పాట్ పెట్టడం.. ‘‘అసలు ఈ పెళ్లిళ్లు ఎందుకయ్యా?’’ అని చర్చను సోషల్ మీడియాలో తెర మీదకు తెచ్చింది. అయితే ఇందుకు ఈ ఒక్క కేసే కాదు.. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలే కారణం. సిమెంట్ డ్రమ్ము అంటేనే.. ప్రాణంగా ప్రేమించి మరీ పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు సౌరభ్ తివారీ. అలాంటిది తన గంజాయి ‘ఛప్రీ’ ప్రియుడు షాహిల్ శుక్లా కోసం భర్తనే కడతేర్చింది ముస్కాన్ రస్తోతి. భర్తకు మత్తు మందు ఇచ్చి, ఆపై చంపి ముక్కలు చేసి.. ఆ బాడీని పెద్ద డ్రమ్ములో కుక్కి సిమెంట్తో ముంచేశారు. ఆపై.. సౌరభ్ కుటుంబాన్ని నమ్మించేందుకు అతని ఫోన్ నుంచి సందేశాలు పంపుతూ ఏకంగా 12 రోజులపాటు ఈ గంజాయి జంట సరదాగా గడిపింది. అయితే తిరిగి వచ్చాక శవాన్ని మాయం చేసే క్రమంలో సీల్డ్ డ్రమ్ము పగిలిపోవడంతో.. భయపడిన ముస్కాన్ తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో బంగారం లాంటి భర్తను చంపిన ముస్కాన్ను ఆమె తల్లిదండ్రులే దగ్గరుండి పోలీసులకు అప్పగించడం ఈ కేసులో కొసమెరుపు. ప్రస్తుతం ముస్కాన్, షాహిల్ శుక్లా జైల్లో శిక్ష అనుభవిస్తుండగా.. ఇండోర్ కేసుగా ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భర్తకు అడ్డంగా దొరికిన యూట్యూబర్ ఆపై.. రవీనా ఓ యూట్యూబర్. అయితే ఆమె చేసే వీడియోలు భర్తకు నచ్చేవి కాదు. దీంతో తనను మందలించడమే తన భర్త పనిగా పెట్టుకున్నాడనుకుని ఆమె రగలిపోయింది. ఈ క్రమంలో ఓరోజు సోషల్ మీడియాలో సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన కంటెంట్ను పొగడ్తలతో ముంచెత్తడంతో సురేష్ ప్రేమలో పీకల లోతుల ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలో ఓరోజు.. మార్చి 25వ తేదీన ఇంట్లోనే ప్రియుడితో ఏకాంతంగా గడుపుతూ భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దీనిపై నిలదీసిన భర్తను ఇద్దరూ కలిసి ఊపిరిరాడకుండా చేసి కడతేర్చారు. ఆ కరాళ రాత్రిలో భర్త మృతదేహాన్ని ప్రియుడి సాయంతో బైక్పై తీసుకెళ్లి నగర శివారులోని పడేశారు. విచారణలో హర్యానా భివానిలో జరిగిన ఈ ఘోరం బయటపడింది. భర్తను కడతేర్చి ఆపై పక్కలో.. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, రాత్రంతా అతని మంచంలోనే ఉంటూ కాటు వేస్తూనే ఉందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని ఆ మధ్య ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఇది భార్య చేసిన కుట్ర అని తెలుసుకోవడానికి పోలీసులకు ఎంతో టైం పట్టలేదు. మీరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తిరిత్యా బయటి ప్రాంతాలకు వెళ్తుండడంతో.. అమర్జీత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చుట్టాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అమిత్.. భార్యను మందలించాడు. దీంతో ప్రియుడితో కలిసి స్కెచ్ గీసింది. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని ఊపిరాడకుండా చంపేసింది. ఆపై అద్దెకు పామును తెచ్చి భర్త మృతదేహం మీద కాట్లు వేయించి మంచంలో పడేసింది. అప్పటికే ప్రాణం పోవడం విషం శరీరానికి ఎక్కలేదు. బదులుగా.. పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.పెళ్లై పదిరోజులు తిరగకుండానే.. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి మే 11వ తేదీన సోనమ్తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మే 20వ తేదీన హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది ఈ జంట. అయితే ఈ జంట ఆచూకీ లేకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. ప్రతికూల వాతావరణంలోనూ దట్టమైన అడవుల్లో గాలింపు చేపట్టారు పోలీసులు. ఈ లోపు.. రాజా రఘువంశీ మృతదేహం దొరకడంతో సోనమ్ ఆచూకీ కోసం అతని కుటుంబం కంగారుపడింది. ఈలోపు విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. సోనమే రాజాను హత్య చేయించిందని!. తన తండ్రి కంపెనీలో పని చేసే రాజ్ కుష్వాహ్తో ఆమె ప్రేమలో ఉందని, ఆ విషయం తెలిసి తండ్రి మందలించాడని, ఆపై బలవంతంగా రాజా రఘువంశీకి ఇచ్చి వివాహం చేయడంతో ఆమె భర్తను వదలించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి సాయంతో ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ను సంప్రదించి తన భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చిందామె. అలా.. మూడు రోజుల తర్వాత రాజా రఘువంశీని వాళ్లు మట్టుపెట్టారు. విచారణలో ఈ షాకింగ్ విషయం బయటపడడంతో అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీమూన్ వెళ్లే ముందు రఘువంశీని ఒత్తిడి చేసి మరీ రూ.10 లక్షల విలువైన బంగారు నగలు అతని ఒంటిపై వేయించిందని, వాటి కోసమే హత్య జరిగిందన్న కోణంలో నమ్మించాలని ప్రయత్నించింది. అయితే ఆమె రిటర్న్ టికెట్స్ బుక్ చేయకపోవడంతో మొదలైన అనుమానం.. చివరకు మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది. ముంబై, థానే, నవీ ముంబైలో గత నాలుగు నెలల్లో.. ఇలా భర్తలను వివాహేతర సంబంధం కోసం బలిగొన్న భార్యల కేసులు ఆరు దాకా నమోదు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. కొసమెరుపు ఏంటంటే.. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకోవడం. అయితే ఇందులో ఒక కేసులో ప్రియుడు తాను తప్పు చేశానని గ్రహించి దగ్గరుండి ఆమెను మళ్లీ భర్త దగ్గర దిగబెట్టగా.. మరో కేసులో మాత్రం ఆ భర్త చేసిన త్యాగం అలాగే మిగిలిపోయింది. -
కర్మ అంటే ఇదేనేమో.. ట్రంప్పై మాస్ ట్రోలింగ్
వాషింగ్టన్: ‘కర్మ’ ఎవరినీ వదలదు అంటారు. అచ్చంగా ఇలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎదురైంది. అంతకుముందు, మాజీ అధ్యక్షుడు జో బైడెన్.. విమానం ఎక్కుతున్న సమయంలో కిందపడిన సందర్భంలో ట్రంప్ ఆయనపై సెటైర్లు వేశారు. తాజాగా ట్రంప్ కూడా విమానం ఎక్కుతూ అలాగే కింద పడబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ట్రంప్పై సెటైరికల్ కామెంట్స్ చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలోని ఎయిర్ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతున్న సమయంలో జారిపడ్డాడు. ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యాంప్ డేవిడ్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ట్రంప్ మెట్లపై చేయివేసి పైకి లేచారు. అనంతరం, రూబియో సైతం కిందపడ బోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బైడెన్ 2.0 ట్రంప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Here is the whole video. Rubio stumbled as well. Was raining before.Post the whole thing pic.twitter.com/RKVLBZR29Y— Adi 🎗 (@Adi13) June 8, 2025ఇక, జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మెట్లు ఎక్కుతున్న సమయంలో బైడెన్ పలు సందర్భాల్లో కింద పడిపోయారు. దీంతో, బైడెన్ను టార్గెట్ చేసిన ట్రంప్.. పలుమార్లు ఎగతాళి చేసి మాట్లాడారు. ఇప్పుడు అలాంటి విచిత్ర పరిణామామే ట్రంప్కు కూడా ఎదురైంది. 🚨 BREAKING: DOWN GOES DONALDTrump just stumbled and almost faceplanted boarding Air Force One. I’ve been telling you — he drags his legs and he’s clearly not well.When Biden stumbled, the media lost its mind and Tapper wrote an entire fake “nonfiction” book.Where are they… pic.twitter.com/MZlHfbfDUJ— Chris D. Jackson (@ChrisDJackson) June 8, 2025WATCH: President Joe Biden stumbles and falls up the stairs while boarding Air Force One pic.twitter.com/1m7tecpsxc— The Post Millennial (@TPostMillennial) March 19, 2021 -
ఇదో దిక్కుమాలిన ఛాలెంజ్.. బైకర్పై సజ్జనార్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు యువకులు చేస్తున్న పనులపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ సమాజానికి ఏం నేర్పిస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ వీడియోను షేర్ చేశారు.ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘'ఓపెన్ ఛాలెంజ్' అంట!? ఫేమస్ అయ్యేందుకు ఇవేం పిచ్చి పనులు. సోషల్ మీడియా వైరల్ వెర్రి పట్టి ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఆలోచించకుండా దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారు మీరు. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు. ఆలోచించండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 'ఓపెన్ ఛాలెంజ్' అంట!? ఫేమస్ అయ్యేందుకు ఇవేం పిచ్చి పనులు. సోషల్ మీడియా వైరల్ వెర్రి పట్టి ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఆలోచించకుండా దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారు మీరు. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు. ఆలోచించండి. pic.twitter.com/G3FNIDfzjh— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 8, 2025 -
అబ్బాయిలకు ఫుల్ డిమాండ్.. ఒక్క ‘హగ్’ ఇవ్వండి.. 600 తీసుకోండి..
బీజింగ్: మారుతున్న జీవనశైలి కారణంగా ఉరుకులు పరుగుల జీవితం నడుస్తోంది. ప్రేమ, ఆప్యాయతలకు, కుటుంబాలకు కొందరు దూరం అవుతున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే చైనాలో ఓ కొత్త ట్రెండ్ హాట్ టాపిక్గా మారింది. ఒత్తిడికి గురవుతున్న యువతులు.. అబ్బాయిలను హగ్ చేసుకుంటున్నారు. ఈ హగ్ ఊరికే కాదు.. ఒక్కసారి హగ్ చేసుకుంటే సదరు యువతి.. 50 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు 600 రూపాయలు) చెల్లించి ఉంటుంది. దీంతో, చైనా అబ్బాయిలకు ఫుల్ గిరాకీ నడుస్తోంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఒత్తిడి అధిగమించేందుకు చైనాలోని యువతులు ఓ వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. మానసిక సాంత్వన కోసం డబ్బులు చెల్లించి 'మ్యాన్ మమ్స్' (man mums) అని పిలవబడే వ్యక్తుల నుంచి కొద్దిసేపు హగ్ పొందుతున్నారు. గతంలో 'మ్యాన్ మమ్స్' అనే పదాన్ని కండలు తిరిగిన శరీరంతో జిమ్లో కసరత్తులు చేసే పురుషులను ఉద్దేశించి వాడేవారు. అయితే, ఇప్పుడు ఈ పదం అర్థం మారింది. శారీరకంగా ధృడంగా ఉంటూనే, సున్నితత్వం, ఓర్పు, ఆప్యాయత వంటి లక్షణాలున్న పురుషులను 'మ్యాన్ మమ్స్'గా పరిగణిస్తున్నారు. వీరు అందించే కౌగిలింతలు ఒత్తిడిని తగ్గించి, ఓదార్పునిస్తాయని యువతులు భావిస్తున్నారు. చైనా ప్రస్తుతం మ్యాన్ మమ్స్ ట్రెండ్లోకి వచ్చింది. ఇక, ఈ ట్రెండ్ ప్రకారం.. అమ్మాయికి ఎవరైనా అబ్బాయి ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 600 చెల్లిస్తారు అమ్మాయిలు. ఎవరైనా అబ్బాయిలు.. ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 200 నుంచి రూ. 600 వరకు పే చేస్తున్నారు. ఆన్ లైన్లో ముందుగానే ఈ హగ్స్ కోసం అమ్మాయిలు.. నచ్చిన కుర్రాడిని బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత మాల్స్, పార్కులు, అండర్ గ్రౌండ్ రోడ్లు.. ఇలా పబ్లిక్ ప్లేసుల్లో ఇలా చేస్తున్నారు. ఇలా నచ్చినవారిని హగ్ చేసుకోవడం వల్ల తమ ఒత్తిడి తగ్గిపోతుందని అమ్మాయిలు భావిస్తున్నారు.In China, some young women are paying strangers — not for therapy or romance, but for something far simpler: a five-minute hug.They’re called “man mums” — gentle, muscular men who offer warmth and emotional comfort in public spaces. The cost? Just US$3 to US$7 for five minutes.… pic.twitter.com/4kD1FpPpws— Ashwini Roopesh (@AshwiniRoopesh) June 7, 2025ఈ సందర్భంగా ఒక యువతి మాట్లాడుతూ.. మూడు గంటల పాటు ఓవర్టైమ్ పని చేసిన తర్వాత, ఒక 'మ్యాన్ మమ్'ను కలుసుకున్నాను. అతను మూడు నిమిషాల పాటు నన్ను కౌగిలించుకున్నాడు. ఉద్యోగం, ఆఫీసు ఒత్తిడికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తుండగా అతడు నెమ్మదిగా నా భుజం తట్టాడు. దీంతో, ఒత్తిడి దూరమే ప్రశాంతంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది.అంతకుముందు.. ఒక విద్యార్థిని, తనకు ఓదార్పునిచ్చేందుకు దయగల, ఫిట్గా ఉండే 'మ్యాన్ మమ్' నుంచి కౌగిలింత కావాలని, అందుకు డబ్బులు చెల్లిస్తానని ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ‘నాకు సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే కౌగిలించుకుంటే చాలా సురక్షితంగా అనిపించింది. మనం ఒక అండర్గ్రౌండ్ స్టేషన్లో ఐదు నిమిషాలు కౌగిలించుకుంటే చాలు’ అని ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది, లక్షకు పైగా కామెంట్లు వచ్చాయి. -
రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని సృష్టిస్తోంది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆహార పంపిణి నిలిపివేత,కరువు నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. ఇటీవలి ఆహార పంపిణీలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. మరోవైపుఆ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు బ్లాక్మార్కెట్ దందా జోరందుకుంది. ఏ వస్తువును కొందామన్నా ధర వింటే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. అతి చవకగా దొరికే పార్లే-జి బిస్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలు ధర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. గాజా నుండి ఇటీవల వైరల్ అయిన పోస్ట్ ప్రకారం ముంబైతె తయారయ్యే పార్లే జి బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడవుతున్నాయి. భారత మార్కెట్లో కేవలం 5 రూపాయలకు లభించే ఈ బిస్కెట్ల ధర చూసి సోషల్ మీడియా యూజర్లు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఈ ధరలు దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుండి ఎగుమతి అవుతున్న ఒక్క పార్లే-జికే పరిమితం కాదు, అన్ని వస్తువులు పరిస్థితి అలాగే ఉంది.After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025 "మూడు నెలలకు పైగా సరిహద్దులను మూసివేయడం వల్ల 2 మిలియన్ల మంది ప్రజల అవసరాలను తీర్చలేని చాలా తక్కువ మొత్తంలో ప్రాథమిక అవసరాలు మాత్రమే అనుమతి ఉందనీ, . కాబట్టి కొంతమందిమాత్రమే ఆహారం లభించినపుడు, ఈ ఆహారాలు చాలా ఎక్కువ, భరించలేని ధరలకు అమ్ముడవుతున్నాయని స్థానిక డాక్టర్ అల్షావా చెప్పారని ఎన్డీటీవీ తన స్పెషల్ రిపోర్ట్లో తెలిపింది. సమస్య అసలు సరఫరాదారులతో లేదా పన్నులతో కాదు" "ఈ వస్తువులు సాధారణంగా మానవతా సహాయంగా ఉచితంగా గాజాలోకి వస్తాయి. కానీ అవికొంతమందికి లభ్యమవుతున్నాయి. మిగతావి బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని ఆయన అన్నారు.ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!జూన్ 6 నాటికి ఉత్తర గాజాలో మార్కెట్ ధరలుకిలోల చక్కెర: రూ. 4,914వంట నూనె: రూ. 4,177కిలో బంగాళాదుంపలు: రూ. 1,965కిలో ఉల్లిపాయలు : రూ. 4,423కాఫీ కప్పు: రూ. 1,800 గత గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన తరువాత, గాజాకు ఆహార లభ్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం మార్చి 2 -మే 19 మధ్య, పాలస్తీనాలో ఆధీన ప్రాంతం దాదాపు మొత్తం దిగ్బంధనను ఎదుర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడి తరువాత కేవలం పరిమిత సంఖ్యలో మానవతా ట్రక్కులను మాత్రమే అనుమతినిస్తున్నారు. ఈ గాజా పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 54,510 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం
సొమ్ము భద్రం, భవితం స్వర్ణం అనుకుంటూ సాధారణ ప్రజలనుంచి గొప్ప గొప్పోళ్ల దాకా బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటారు. కాయకష్టం చేసి, కడుపు మాడ్చుకుని మరీ పొదుపు చేసిన సొమ్మను ఎంతో విశ్వాసంతో ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచుఫల్ ఫండ్స్ రూపంలో దాచుకుంటారు. తమ డబ్బు సురక్షితంగా ఉందని భావిస్తారు. బ్యాంకుల అభివృద్ధి, పెట్టుబడికి గట్టి సపోర్ట్ ఇస్తారు. కానీ బ్యాంకు వినియోగదారుల సొమ్మును అక్రమంగా వాడుకుంటూ కొంతమంది అధికారులు, ఉద్యోగులు, బ్యాంకు వ్యవస్థకే చెడ్డపేరు తీసు కొస్తున్నారు. అంతేకాదు యూజర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. తాజా ఒక అధికారి నిర్వాకం గురించి తెలుసుకుంటే... షాక్ అవ్వక తప్పదు. నెట్టింట చర్చకు దారి తీసిన ఈ వివరాలను తెలుసుకుందాం రండి! ఎన్డీటీవీ కథనం ప్రకారం రాజస్తాన్లోని కోటలోని ఒక బ్యాంకుకు చెందిన ఒక మహిళా అధికారి రూ. 4 కోట్లకు పైగా కస్టమర్లను మోసం చేసింది. ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకులో రిలేషన్షి మేనేజర్గా పనిచేస్తున్న సాక్షి గుప్తా బ్యాంకు యూజర్ల FDల నుండి కోట్ల రూపాయలను తస్కరించింది. వీటిని స్టాక్లలో పెట్టుబడిగా పెట్టింది. ఇలా రూ. 4.58 కోట్లు అక్రమాలకు పాల్పడింది. అంతేకాదు లావాదేవీల సందేశాల గురించి వారికి తెలియ కుండా ఉండటానికి , ఖాతాలతో లింక్ చేయబడిన కస్టమర్ల మొబైల్ నంబర్లను కూడా మార్చేసింది.కస్టమర్లను ముంచేసి..తానూ ..'యూజర్ FD (ఫిక్స్డ్ డిపాజిట్)' లింక్ను దుర్వినియోగం చేసి, 2020 - 2023 సంవత్సరాల మధ్య 41 మంది కస్టమర్ల 110 ఖాతాల నుండి రూ. 4.58 కోట్లు కొట్టేసింది. స్టాక్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ వ్యవధిలో ఎక్కువ సొమ్ము ఆర్జించాలనే లక్ష్యంతో ఈ చర్యకు పూనుకుంది. రెండేళ్ల పాటు తన అక్రమాలు ఎవరి కంట కనపడకుండా కొనసాగించింది. దీంతో బ్యాంకు అధికారులెవరూ దీన్ని గమనించలేదు. అటు స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు రావడంతో డబ్బును తిరిగి ఖాతాల్లో జమ చేలేకపోయింది. అలా అత్యాశకుపోయి, కస్టమర్లను ముంచేసి, తాను కూడా మునిగిపోయింది. ఒక కస్టమర్ తన FD గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18న ఆమెపై కేసు నమోదైంది. రంగంలోకి పోలీసులు గత రాత్రి ఆమె సోదరి వివాహంలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇదీ చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఈ ఖాతాలకు లింక్ చేసి రూ. 4 కోట్లకు పైగా విత్డ్రా చేసిందనీ, ఖాతాదారులకు తన పన్నాగం గురించి తెలియకుండా ఉండటానికి ఆమె తన సిస్టమ్లో OTP లను పొందడానికి ఉపయోగించే వ్యవస్థను కూడా రూపొందించిందని దర్యాప్తు అధికారి ఇబ్రహీం ఖాన్ అన్నారు. అయితే దీనిపై బ్యాంకు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ప్రభావితమైన కస్టమర్లకు నష్టాన్ని భర్తీ చేస్తామని బ్యాంకు వర్గాలు తెలిపాయి.బ్యాంకులో మోసం గురించి తెలుసుకున్న తర్వాత, తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి కస్లమర్లు బ్యాంకుకు రావడం మొదలైంది."మన డబ్బు ఎక్కడ ఉంచాలి? ఇంట్లో ఉంచుకోలేం, ఇప్పుడిక బ్యాంకులో ఉంచుకోలేం ఏమి చేయాలి?" అంటూ బ్యాంకు కస్టమర్ మహావీర్ ప్రసాద్ వాపోయారు. చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్! -
శర్మిష్ఠ పనోలీకి హైకోర్టు బెయిల్
కోల్కతా: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలీ(22)కి కోల్కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మతపరమైన కామెంట్లు చేసినట్లు నమోదైన ఫిర్యాదు మేరకు కలకత్తా పోలీసులు గతవారం హరియాణాలోని గురుగ్రామ్లో ఉండగా అరెస్ట్ చేశారు. లా స్టూడెంట్ అయిన శర్మిష్ట ఆపరేషన్ సిందూర్పై బాలీవుడ్లోని ఓ వర్గం నటులు మౌనంగా ఉన్నారంటూ మే 7న చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఆన్లైన్లో వైరలయ్యింది. తీవ్రమైన కామెంట్లు రావడంతో మరునాడే మే 8న వీడియోను తొలగించి, క్షమాపణ చెప్పింది. బెదిరింపులు రావడంతో కుటుంబంతో సహా వేరే చోటుకు మకాం మార్చింది. అయినప్పటికీ, ఆమె తన వీడియో ద్వారా మత విద్వేషాలను ప్రేరేపించిందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. దీంతో మే 30వ తేదీన గురుగ్రామ్లో అరెస్ట్ చేసిన పోలీసులు కోల్కతాకు తరలించారు. బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న అభ్యర్థనపై జస్టిస్ రాజా బసు చౌదరి సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు వింది. గురువారం తీర్పు విడుదల చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో శర్మిష్ఠ పనోలీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని, కేసు విచారణలో అధికారులకు సహకరించాలని ఆమెను ఆదేశించింది. అదేవిధంగా, పనోలీకి తగు భద్రత కల్పించాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నవాళ్లను సొంత దేశాలకు పంపించేయడం.. కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారాయన. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు(Indian Students) అప్రమత్తం అయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా.. మరికొందరు ఏకంగా సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు వీసాలు(American Visas) మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గరి నుంచి.. యూఎస్ క్యాంపస్లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. ఈ క్రమంలో.. అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, లింక్డిన, టిక్టాక్ ఇలా ఇతర ఫ్లాట్ఫారమ్లన్నింటిని జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ( పోస్టులు చేయడంతో పాటు లైకులు, షేర్లు, కామెంట్లు.. వగైరా)ని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్నే తొలగిస్తున్నట్లు సమాచారం.అభిప్రాయాల దగ్గరి నుంచి పొలిటికల్ జోక్స్ దాకా వేటిని తమ టైం లైన్లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లనూ తొలగించడమూ మంచిది కాదనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. -
హృదయ విదారకం: తొక్కిసలాటపై ప్రధాని దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్సీబీ ఈవెంట్లో 11మంది మృతి చెందడం విచారకరమని అన్నారు. ఇది హృదయవిదారక ఘటన అని, బాధిత కుటుంబాలు తవ్ర ఆవేదనలో ఉన్నాయని ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. The mishap in Bengaluru is absolutely heartrending. In this tragic hour, my thoughts are with all those who have lost their loved ones. I pray that those who are injured have a speedy recovery: PM @narendramodi— PMO India (@PMOIndia) June 4, 2025గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీ బెంగళూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడినవారికి వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను కోరారు. చిన్నస్వామి స్టేడియం ప్రాంగణానికి సమీపంలో ఉన్న డ్రెయిన్పై ఉంచిన తాత్కాలిక స్లాబ్పైకి భారీగా జనం చేరడంతో అది కూలిపోయిందని తెలుస్తోంది. ఫలితంగా తొక్కిసలాట జరగగా, 11 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనం విపరీతంగా తరలివచ్చారు. అభిమానులు తమ క్రికెట్ జట్టు హీరోలను చూసేందుకు తెగ ఆసక్తి చూపించారు. -
పాక్లో మరో ఘోరం.. ఎవరీ సనా యూసఫ్?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో ఘోరం చోటు చేసుకుంది. సనా యూసఫ్(Sana Yousuf) అనే టీనేజర్ దారుణ హత్యకు గురైంది. మంగళవారం ఇస్లామాబాద్ సుంబల్ ప్రాంతంలో ఆమె ఉంటున్న ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. సనాతో మాట్లాడుతూనే.. వెంట తెచ్చుకున్న రివాల్వర్తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సనా అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు జరిపి, ఫైసలాబాద్లో ఉండగా పట్టుకున్నారు. నిందితుడిని ఉమర్ హయత్(Umar Hayath) అలియాస్ కాకాగా నిర్ధారించారు. సనాను ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు ఉమర్ అంగీకరించాడు. సనాకు టిక్టాక్లో 7.40 లక్షల మంది, ఇన్స్టాలో 5 లక్షల మంది ఫాలోయెర్లున్నారు. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తెలుస్తోంది. నేరానికి పాల్పడిన ఉమర్ కూడా టిక్టాకరేనని పోలీసులు ధృవీకరించారు. అయితే.. నేరానికి ఎందుకు పాల్పడ్డాడనే కారణాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితుడి నుంచి రివాల్వర్, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సనా(17) మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతోందని తెలుస్తోంది. ఆమె తండ్రి ప్రభుత్వ అధికారి, సోషల్ యాక్టివిస్ట్ కూడా. తల్లి గృహిణి. ఈమె 15 ఏళ్ల సోదరుడు ఖైబర్ ప్రావిన్స్లోని సొంతూరు చిత్రాల్కు వెళ్లాడు. ఘటన సమయంలో ఆమె దగ్గరి బంధువు ఒకరు ఇంట్లో ఉన్నారు. ఈ కేసులో ఆ బంధువే ప్రత్యక్ష సాక్షి. కాగా, పాకిస్తాన్(Pakistan)లో ఈ మధ్యకాలంలో హత్యకు గురైన మూడో మహిళా ఇన్ఫ్లుయెన్సర్(Social Media Teenager) సనా కావడం గమనార్హం. పంజాబ్లో మహిళా టిక్టాకర్ను ఇటీవలే ఆమె బంధువొకరు చంపేశారు. ఫిబ్రవరిలో పెషావర్లో మరో మహిళా టిక్టాకర్ హత్యకు గురయ్యారు. సనా కేసు అక్కడి సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ కేసును పరువు హత్య, ప్రేమ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.ఇదీ చదవండి: ఏకాంత వీడియోలు ఒక్కొటిగా బయటకు.. -
ఏఐ కంపు కోణాన్ని బయటపెట్టిన మహిళా ఎంపీ
అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ.. షార్ట్ కట్లో ఏఐ. ఇప్పుడు దాదాపు ప్రతీ రంగంలో దీని వినియోగం ఉంటోందని, అది ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ, ఆ సాంకేతికత ఆధారంగా జరుగుతున్న కంపు వ్యవహారాలను మాత్రం చర్చించుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడో ఓ మహిళా ప్రజా ప్రతినిధి ధైర్యం చేసి ముందడుగు వేశారు.లారా మెక్క్లూర్.. న్యూజిలాండ్ ఏసీటీ పార్టీ ఎంపీ. ఈవిడ చేసిన ఓ పని ఇప్పుడు మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. చట్ట సభలో.. అదీ సభ్యులందరి ముందు గూగుల్లో నుంచి తన నగ్న ఫొటోను వెతికి.. ప్రింట్ తీసి మరీ అందరి ముందు ప్రదర్శించారామె. ‘‘ఇది నా నగ్న చిత్రమే. కానీ, నిజమైంది కాదు. వీటిని గూగుల్ నుంచే తీశాను. అయితే వీటిని సృష్టించి..గూగుల్లో అప్లోడ్ చేసింది కూడా నేనే. ఇందుకు నాకు పెద్ద కష్టమేమీ కాలేదు. ఐదు నిమిషాలలోపే పట్టింది’’ అని అన్నారామె.తద్వారా ఏఐ ఆధారిత డీప్ఫేక్ ఎంత ప్రమాదకరమైందో చెప్పే ప్రయత్నం చేశారామె. చట్ట సభను అగౌరవపరిచే ఉద్దేశంతో తాను ఈ పని చేయలేదని, దేశ యువతకు జరిగే నష్టం గురించి సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘డీప్ఫేక్.. చాలా ప్రమాదకరమైంది. అలాంటి ఫొటోలు, వీడియోలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను చేసిన పని మీకు జుగుప్సగా అనిపించొచ్చు. కానీ, ఈ వ్యవహారం ఎంత సులువో.. అంతే ప్రమాదకరమైంది కూడా. అది మీరంతా ఆలోచించాలనే ఇలా చేశా. ఇక్కడ సమస్య టెక్నాలజీతో కాదు. దానిని తప్పుడు దోవలో ఉపయోగిస్తున్న విధానమే. కాబట్టి.. వీటి కట్టడికి ప్రత్యేక చట్టాలు కచ్చితంగా అవసరం’’ అని ప్రసంగించారామె. మే 14వ తేదీన జరిగిన ఈ డిబేట్ తాలుకా వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.🇳🇿 MP HOLDS UP AI-NUDE OF HERSELF IN PARLIAMENT TO FIGHT DEEPFAKESNew Zealand politician Laura McClure held up an AI-generated nude of herself in Parliament to push a law against fake explicit images.She made it at home to show how easy it is to create deepfakes that can ruin… pic.twitter.com/G74KLOoh7o— Mario Nawfal (@MarioNawfal) June 2, 2025ఏఐను వివిధ రంగాల్లో ఎంత సవ్యంగా ఉపయోగిస్తున్నారో.. సోషల్ మీడియాలో అంతే తప్పుడు దోవలోనూ ఉపయోగించడం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో!. వాళ్ల మీద అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సృష్టించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి పాపులర్ యాప్లలోనూ కొందరు ఆకతాయిలు వదులుతుండడం గమనార్హం. అయితే ఇలాంటివి తమ కంట పడ్డా కూడా గట్టిగా నిలదీసేందుకు ప్రముఖులు ముందుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం. -
పెళ్లి తర్వాత ఈరోజు ఎంతో ప్రత్యేకం అంటూ ఫోటోలు షేర్ చేసిన సోనియా (ఫొటోలు)
-
ఏకాంత వీడియోలు ఒక్కొక్కరివిగా బయటకు..!
పొరుగుదేశం పాకిస్తాన్లో డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ల కమ్యూనిటీని వణికిపోతోంది. గత కొన్నిరోజులుగా అక్కడి ఇన్ఫ్లుయెన్సర్ల పరువు బజారున పడుతోంది. వరుసబెట్టి ఒక్కొక్కరి ఏకాంత వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై జనాలు వాళ్లను తిట్టిపోస్తుండగా.. మరోవైపు వాళ్ల కవరింగ్లు, వివరణలు, చట్టపరమైన చర్యలతో ప్రస్తుతం ఈ అంశం అక్కడ హాట్ టాపిక్గా మారింది.పాక్లో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లతో పాపులర్ అయిన కొందరు యువతుల ప్రైవేట్ వీడియోలు గత కొన్నిరోజులుగా వైరల్ అవుతున్నాయి. విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మినాహిల్ మాలిక్, ఇమ్షా రెహమాన్ల వీడియోలు తొలుత సర్క్యులేట్ కావడంతో.. వాళ్లకున్న మిలియన్ల ఫాలోవర్లు షాక్కు గురయ్యారు. ఆ వెంటనే టాక్ షోలు, మ్యూజిక్ వీడియోలతో పాపుల్ అయిన మథీరా ఖాన్ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా.. కన్వాల్ అఫ్తాబ్ అనే మరో ఇన్ఫ్లుయెన్సర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ వీడియోలను ఆ ఇన్ఫ్లుయెన్సర్లు(Influencers) ఖండిస్తున్నారు. అవి తమవి కావని, ఇదంతా ఏఐ సృష్టి అని వివరణలు ఇస్తున్నారు. పనిలో పనిగా ఫిర్యాదులు చేస్తూ.. చట్టపరమైన చర్యలకు వెెళ్తున్నామని ప్రకటించారు. మినాహిల్ ఓ అడుగు ముందుకు వేసి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అయితే ఆ కామెంట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. అందుకు కారణం.. ఆమె చేసింది బాలీవుడ్ నటి కరీనా కపూర్ గతంలో చెప్పిన మాటలు కావడం!.ఇదిలా ఉంటే.. ఈ డర్టీ వ్యవహారంలో భారత్ ప్రస్తావనతో అక్కడి టీవీ చానెల్స్లో చర్చలు నడిపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంతో అక్కడి మీడియా ఛానెల్స్ను, సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో చాలామందిని భారత్ నిషేధించింది. ఈ క్రమంలో ఇది భారత్ నుంచి జరుగుతున్న వ్యవహారమేనని అక్కడి మీడియా చర్చ జరపడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్కు చెందిన ఎకనామిక్ టైమ్స్ ప్రముఖంగా ఓ కథనం ఇచ్చింది.SHOCKING NEWS 🚨 Private videos of several Pakistani influencers of Pakistan have leaked online.Pakistan’s influencer community is facing a wave of scandals one after another 😱After viral incidents involving TikTok stars Minahil Malik and Imsha Rehman, now videos of Mathira… pic.twitter.com/rFdRAPIBY8— BALA (@erbmjha) June 1, 2025 -
ఆటోడ్రైవర్ను తిట్టి.. చెప్పుతో కొట్టి, ఆపై శిరస్సు వంచి క్షమాపణలు
బెంగళూరు: రాష్ట్రంలో కన్నడిగులపై.. కన్నడేతర వ్యక్తులు దాడులు చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. వీటిని అక్కడి ప్రజలు కూడా అంతే తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓ ఆటోడ్రైవర్ను ఇస్టానుసారం తిడుతూ చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. గంటల వ్యవధిలోనే ఆమెతో క్షమాపణలు చెప్పించిన మరో వీడియో బయటకు వచ్చింది. పంకూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో స్కూటీ మీద శనివారం బయటకు వెళ్లింది. శివాజీనగర్ ప్రాంతంలో.. వాళ్ల బండి పక్కనే ఆగిన ఆటోడ్రైవర్తో ఒక్కసారిగా ఆమె వాగ్వాదానికి దిగింది. ఆటో టైర్ తన కాలు మీద నుంచి వెళ్లిందని చెబుతూ ఆమె అతని దూషించసాగింది. అయితే అలాంటిదేం జరగలేదు కదా అని ఆ ఆటోడ్రైవర్ ఆమెకు బదులిచ్చాడు. అయినా ఆమె అస్సలు తగ్గలేదు. ఆమె తిట్ల పురాణాన్ని ఆ డ్రైవర్ ఫోన్లో వీడియో తీయబోయాడు. అంతే.. ఆ పరిణామంతో ఆ యువతి రగిలిపోయింది. ‘‘వీడియో తీస్తావా.. తీసుకో’’ అంటూ కాలికున్న చెప్పు తీసి అతన్ని కొట్టింది. స్థానికులు కొందరు సర్దిచెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఘటన జరిగిన వెంటనే ఆ ఆటోడ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి పేరు లోకేష్గా తెలుస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగర పోలీసులు సత్వర చర్యలకు దిగారు. ఆ యువతిని అరెస్ట్ చేశారు. ఆపై ఆమె స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆదివారం సాయంత్రం ఆ ఆటోడ్రైవర్, మరికొందరి సమక్షంలో పంకూరి మిశ్రా క్షమాపణలు కోరింది. తాను గర్భవతినని, ఏదైనా అనుకోని ఘటన జరగొచ్చనే ఆందోళనతో తాను అలా ప్రవర్తించానని చెప్పుకొచ్చింది. జరిగిందానికి లోకేష్కు క్షమాపణలు చెబుతూ.. శిరస్సువంచి నమస్కారాలు చెప్పింది. బెంగళూరు నగరమన్నా.. కన్నడ సంప్రదాయాలన్న తనకు మంచి ఉద్దేశాలే ఉన్నాయని, కన్నడ ప్రజలనుగానీ.. భాషనుగానీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని.. జరిగిందానికి తనను క్షమించాలని ఆ భార్యాభర్తలు వేడుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. In #Bengaluru: The female software engineer, who was arrested for assaulting an autorickshaw driver with her slipper in Bellandur area over a road dispute, has apologised to the autodriver, his family & Kannadigas. Videos of assault & apology👇@timesofindia pic.twitter.com/61xXewMgI8— TOI Bengaluru (@TOIBengaluru) June 2, 2025 VIDEO CREDITS: TOI Bengaluru -
బిగ్ న్యూస్: అనితా మేడమ్.. ఈ ప్రశ్నలకు జవాబుందా?
సాక్షి, విజయవాడ: కూటమి పాలనలో శాంతి భద్రతల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. తాజాగా.. తెనాలిలో పోలీసులు నడిరోడ్డు మీదే యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై(Tenali Police Torture) సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలోనూ ఈ ఘటనపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో.. దళితులపై పోలీస్ టార్చర్ను హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) సమర్థించడంతో.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వాళ్ళని ఎందుకు ఇలా కొట్టలేదు మేడమ్? ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యే, కూటమి పార్టీల నేతలను ఎందుకు ఇలా శిక్షించలేదు మేడమ్?దళిత ప్రొఫెసర్ని కొట్టిన జనసేన ఎమ్మెల్యేపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు మేడమ్?అసలు పోలీసుల దాష్టికాన్ని మీరు ఇలా ఎలా సమర్థిస్తారు మేడమ్?.. అంటూ హోం మంత్రికి పలువురు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటితో పాటు కూటమి ప్రభుత్వం(AP Kutami Prabhutvam) అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నడుస్తున్న ప్రతీకార రాజకీయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ.. పలు ఉదంతాలను ప్రస్తావిస్తూ హోం మంత్రి అనితను సూటిగా ప్రశ్నిస్తున్నారు. చట్టాలు, కోర్టులు వేయాల్సిన శిక్షలు పోలీసులే వేస్తారన్న ధోరణిలో మాట్లాడిన హోం మంత్రి.. పై ఘటనలను తన వ్యాఖ్యలతో ఎలా సమర్థించుకుంటారు అంటూ నిలదీస్తున్నారు.‘‘పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారు. ఒక స్టెప్ ఫార్వార్డ్ వేస్తే ఈ రకంగా విమర్శిస్తున్నారు. పోలీసులు ని కొంత పని చేసుకొనివ్వాలి. తెనాలిలో రౌడీ షీటర్స్ పోలీసులు పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు ని కొట్టినందుకే అలా చేశారు. వాళ్ళందరూ రౌడీ షీటర్లు, గంజా బ్యాచ్’’.. ఇదీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షించే మంత్రి అనిత నోటి నుంచి వచ్చిన తప్పుడు ప్రకటనలు.ఇదీ చదవండి: జగన్ అడిగిందేంటి.. చంద్రబాబు చెబుతోందేంటి? -
ఉత్తరకొరియాగా మార్చొద్దు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షర్మిష్ట పనోలీ అరెస్టును బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆపరేషన్ సిందూర్పై కొందరు బాలీవుడ్ స్టార్లు ఎందుకు పెదవి విప్పలేదంటూ ఎక్స్లో వివాదాస్పద పోస్ట్ చేసినందుకు పనోలీని కోల్కతా పోలీసులు అరెస్టు చేయడం, కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడం తెలిసిందే. పనోలీ వాడిన భాష అభ్యంతకరమే అయినా అందుకామె క్షమాపణలు చెప్పారని కంగన గుర్తు చేశారు. కనుక ఆమెను విడుదల చేసి దీన్ని ఇంతటితో వదిలేయాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగాక మరింతగా కక్షసాధింపుకు పాల్పడి రాష్ట్రాన్ని ఉత్తరకొరియాగా మార్చొద్దని సూచించారు. నెదర్లాండ్స్ ఎంపీ గ్రీత్ వైల్డర్స్ కూడా పనోలీ అరెస్టును తప్పుబట్టారు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు గొడ్డలిపెట్టని ఆక్షేపించారు. ఆమె తక్షణ విడుదలకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. -
ఎవరీ శర్మిష్టా పనోలి.. ఆమె విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి మోదీకి విజ్ఞప్తులు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో బాలీవుడ్ సెలెబ్రిటీలపై విమర్శలు చేస్తూ, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వీడియో పోస్టు చేసిన కేసులో 22ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్,న్యాయ విద్యార్థిని శర్మిష్టా పనోలిని (Sharmistha Panoli) పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ తిరస్కరించిన కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు 1500 కిలోమీటర్లు ప్రయాణించడం, ప్రపంచంలోని పలు దేశాల్లోని ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంతో శర్మిష్టా పనోలి చర్చాంశనీయంగా మారారు. ఇంతకీ ఈ శర్మిష్టా పనోలి ఎవరు? శర్మిష్టా పనోలి ఎవరు?శర్మిష్టా పనోలి పుణె న్యాయ విద్యార్థిని. పూణేకి చెందిన లా కాలేజీలో నాలుగో సంవత్సరం న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నారు. ఓ వైపు చదువుతూనే మరోవైపు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా శర్మిష్టా రాణిస్తున్నారు. ఇన్స్టాలో 94,000 మందికిపైగా ఫాలోవర్స్ను సొంతం చేసుకున్న న్యాయ విద్యార్థిని రాజకీయ, సామాజిక అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేయడంలో పేరు సంపాదించారు.వివాదాస్పద వీడియోలో ఏమన్నారంటే?అయితే ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిపై (2025 Pahalgam attack) ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ ఆపరేషన్ సిందూర్తో (Operation Sindoor) సైనిక చర్యకు దిగింది. పాక్ను చావు దెబ్బ కొట్టింది. ఇదే అంశంపై ఓ పాక్ యూజర్.. శర్మిష్టాను పలు ప్రశ్నలు సంధించాడు. సదరు యూజర్ వేసిన ప్రశ్నలపై శర్మిష్ఠ పోనోలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి పలు అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. పహల్గాం ఉగ్రదాడితో మౌనం వహించడంపై బాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్ రణవీర్ అల్లాహ్బాదియాపై విమర్శలు గుప్పించారు. Kolkata, West Bengal: Kolkata Police arrested a law student Sharmistha Panoli from Pune in Gurgaon for allegedly hurting religious sentiments through social media posts on Operation Sindoor. She was brought to Kolkata on transit remand and produced before the Alipore CJM Court.… pic.twitter.com/jxDpcVSzlJ— IANS (@ians_india) May 31, 2025ఆ విమర్శలు మిస్ఫైర్ అయ్యాయి. శర్మిష్ట చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో శర్మిష్ట నెటిజన్లను క్షమాపణలు కోరారు. అనంతరం, ఆ వీడియోను డిలీట్ చేశారు. అయినప్పటికీ, కోల్కతా పోలీసులు శర్మిష్టాపై చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థినిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మతసామరస్యాన్ని దెబ్బతీయడం, సామాజిక కలహాలు సృష్టించేలా ప్రేరేపించడంపై కేసు నమోదు చేశారు. 1500 కిలోమీటర్లు ప్రయాణించిన పోలీసులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణించి గురుగ్రామ్లో అదుపులోకి తీసుకుని అలిపూర్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించించింది. జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీలోకి పంపింది. విచారణ సందర్భంగా శర్మిష్టా తరఫున న్యాయవాది, అన్ని డిజిటల్ ఆధారాలు ఇప్పటికే సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. కస్టడీ అవసరం లేదని వాదించారు. కోర్టు ఆ వాదనల్ని ఖండించింది. జ్యుడీషియల్ కస్టడీ విధించింది. Free the brave Sharmishta Panoli!It’s a disgrace for the freedom of speech that she was arrested. Don’t punish her for speaking the truth about Pakistan and Muhammad. Help her @narendramodi! @AmyMek #Sharmishta#IStandwithSharmishta #ReleaseSharmistha #FreeSharmishta pic.twitter.com/YhGSLhuyr2— Geert Wilders (@geertwilderspvv) May 31, 2025మోదీజీ శర్మిష్టా పనోలిని రక్షించండిశర్మిష్టా పనోలి అరెస్టుపై వివాదం రాజుకుంది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి పలువురు విజ్ఞప్తులు పంపుతున్నారు. శర్మిష్టా పనోలి అరెస్టుపై డచ్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. కోల్కతా పోలీసుల తీరు వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంది. ఆమెను రక్షించండి.ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్టను విడుదల చేసేలా ప్రధాని మోదీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రపంచంలో అందరి దృష్టి శర్మిష్టపైనే ఉందంటూ ఆమె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
కొంపముంచుతున్న కొత్త స్నేహాలు
సాక్షి, పుట్టపర్తి: ప్రస్తుతం యువత బయట కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటోంది. పలకరింపులు..పరామర్శలన్నీ వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ వేదికగానే సాగుతున్నాయి. ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారానే కొత్త కొత్త స్నేహాలు పుట్టుకువస్తున్నాయి. హలో అంటే చాలు పొలోమంటూ ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చి వాలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు తెలిసీ తెలియని వయసులో ఒకరికొకరు ఆకర్షితులై.. తర్వాత లేని పోని సమస్యల్లో ఇరుక్కుంటున్నారు.ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఒకరికొకరు దగ్గరై.. ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చాలామంది మైనర్లు సోషల్ మీడియా వేదికగా చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి వ్యవహారాల వరకూ వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని ఏదో ఒక పోలీస్ స్టేషన్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎక్కువ మంది మైనర్లే.. తెలిసీ తెలియని వయసులో నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ కొత్త పరిచయాలతో స్టేషన్ మెట్లు ఎక్కుతున్న మైనర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బాల్య వివాహాలు, ప్రేమ పెళ్లిళ్లు, ఆన్లైన్ ప్రేమ తగాదాలు.. ఇలా వివిధ రకాల ఫిర్యాదులు నిత్యం పోలీసు స్టేషన్కు వస్తున్నాయి. అయితే ఎక్కువ మంది మైనర్లే ఉండటంతో వారి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు సామాజిక బాధ్యతగా తల్లిదండ్రులను పిలిపించి.. సర్దిజెప్పుతుండగా... సమస్య బయటికి రాకుండా సద్దుమణుగుతోంది. ఇక ఆన్లైన్ ద్వారా పరిచయాలతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా నెలల వ్యవధిలోనే విడాకుల వరకూ వచ్చేస్తున్నాయి. నిబంధనలు బేఖాతరు.. సోషల్ మీడియా పరిచయాలతో దగ్గరవుతున్న వారు...కొన్నిరోజులకే న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్కు వస్తున్నారు. చాలా సందర్భాల్లో అమ్మాయి మైనర్ కావడం... అప్పటికే పరిస్థితి చేయి దాటిన నేపథ్యంలో పెద్దలే గుట్టు చప్పుడు కాకుండా వివాహాలు జరిపిస్తున్నారు. బాల్య విహహం తప్పని తెలిసినా చాలా మంది ఎదురుచెప్పలేకపోతున్నారు. అధికారులకు తెలిసినా అమ్మాయి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని అవగాహన కల్పించడానికే పరిమితం అవుతున్నారు. నూతన జంటలను విడదీయలేక.. మానవీయ కోణంలో ఆలోచించి వదిలేస్తున్నారు.పుట్టపర్తికి చెందిన 17 ఏళ్ల యువతికి గోరంట్ల మండలానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయయ్యాడు. ఇద్దరూ చాటింగ్ చేసుకుంటూ వాట్సాప్ కాల్స్ వరకు వచ్చారు. ఆ తర్వాత వీడియో కాల్స్.. ఫొటోల మారి్పడి తదితర వ్యవహారాలన్నీ సాగాయి. పెళ్లి చేసుకుందామనేలోపు ఇద్దరి మధ్య తగాదాలు వచ్చాయి. పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తనకు ఆ అమ్మాయిపై ఇష్టం పోయిందని యువకుడు అడ్డం తిరిగాడు.. మైనర్లు కావడంతో పోలీసులు ఇద్దరికీ సర్దిజెప్పి పంపించారు. హిందూపురానికి చెందిన 18 ఏళ్ల యువతికి పెనుకొండకు చెందిన 27 ఏళ్ల పురుషుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. తర్వాత ఇద్దరూ ఆర్నెల్ల పాటు చాటింగ్ చేసుకుంటూ ఫోన్ నంబర్లు, అడ్రస్ మార్చుకున్నారు. గంటల తరబడి వాట్సాప్ చాటింగ్ కొనసాగింది. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తికి అప్పటికే వివాహమైందన్న విషయం కనుక్కొన్న యువతి నానా రభస చేసింది. తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి గుట్టుగా వ్యవహారాన్ని చక్కబెట్టి పంపారు. అవగాహన కల్పిస్తున్నాం మొబైల్ ఫోన్ అతిగా వినియోగించే యువత వాట్సాప్, ఇన్స్ట్రాగాం తదితర సోషల్ మీడియా సైట్లులోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఆయా మాధ్యమాల్లో కొత్తవ్యక్తుల పరిచయాలు వారి జీవితాలనే మార్చేస్తున్నాయి. అందువల్ల ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా కనిపెడుతూ ఉండాలి. స్మార్ట్ ఫోన్ వినియోగంలో లాభాలతో పాటు అనేక అనర్థాలూ ఉన్నాయి. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నాం. – మహేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, పుట్టపర్తి -
Social Media లైక్.. కామెంట్.. షేర్.. ప్రాణాలు పోతున్నా లెక్క చేయట్లే!
‘కరీంనగర్కు చెందిన పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఖరీదైన ఫోన్ కావాలంటూ ఇంట్లో మారాం చేశాడు. కళాశాలకు వెళ్లేటప్పుడు కొనిస్తామంటే వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పారిపోయిన కొడుకు హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించిన తల్లిదండ్రులు అతడిని తెచ్చి ఫోన్ఇచ్చారు. చాలా కుటుంబాల్లో పిల్లలతో తల్లిదండ్రులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారని మానసిక నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలనే తాపత్రయంతో విద్యార్థులు వాటిపై దృష్టి సారిస్తున్నారు. దీంతో చదువుపై ఏకాగ్రత తప్పుతోందని చెబుతున్నారు’రీల్స్పై తాపత్రయం.. ప్రాణాపాయం‘జిల్లాలోని ఓ పట్టణప్రాంతానికి చెందిన తొమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇటీవల క్లాస్రూమ్లో పరీక్ష రాస్తూ నిద్ర పోయాడు. ఉపాధ్యాయుడు గమనించి అతడి ముఖంపై నీళ్లు చల్లినా.. స్పందన కరువైంది. సమీప ఆస్పత్రికి తీసుకెళ్తే డీహైడ్రేషన్ కారణంగా అనారోగ్య సమస్య తలెత్తినట్టు డాక్టర్లు తెలిపారు. రెండురోజులు మిత్రులతో కలిసి రీల్స్ చేసేందుకు ఇతర ప్రాంతానికెళ్లడమే కారణమని తేలింది. చదువుకునే వయసులో ఎందుకీ పనులని టీచర్లు ప్రశ్నించగా.. తనకు నెలకు రూ.10 వేలు వస్తాయని బదులివ్వడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.’ప్రస్తుత ప్రపంచమంతా ‘లైక్’, ‘కామెంట్’, ‘షేర్’ రూపంలో మారిపోయింది. ఈ వర్చువల్ ప్రపంచపు చిరునవ్వుల కోసం యువత, విద్యార్థులు అనర్థాల బాట పడుతున్నారు. ఒక్క చిన్న రీల్, కొద్ది సెకన్ల వీడియో, ఒక్క ఫేమ్ కోసం ప్రాణాన్ని కూడా పణంగా పెడుతున్నారు. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సోషల్ మీడియా మన జీవితాల్లో భాగమైంది. ముఖ్యంగా కరోనా సమయంలో విద్యార్థుల కో సం అందించిన ఫోన్లు, ఇప్పుడు వారి జీవితాన్ని ని యంత్రించే ఆయుధాలుగా మారాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా, రీల్స్ యువతకు ఆత్మలుగా మారిపోయాయి. ఇటీవల కరీంనగర్ మానేరు వాగులో ఓ యువకుడు రీల్స్ కోసం వెళ్లి మునిగిపోయాడు. మరో యువకుడు రైలుపై రీల్ తీయడానికి వెళ్లి మృత్యువాతపడ్డాడు. ఇలా రోజురోజుకు రీల్స్ పిచ్చి అనార్థాలకు దారీతీస్తోంది.యువత మారాలి..రీల్స్ను కట్టడి చేయాలంటే యువత ముందుగా పద్ధతి మార్చుకోవాలని, ప్రాణాంతక రీల్స్తో జీవితాలే కోల్పోతామని గుర్తుంచుకోవాలని సైక్రియాటిస్టులు పేర్కొంటున్నారు. అలాగే రీల్స్ వెనక దాగి ఉన్న ప్రమాదాలు ఊహించకుండా వీడియోలు చూస్తున్నవారు అనేక రకాల యాడ్స్ రూపంలో మోసాలకు గురువుతున్నారు. ఆన్లైన్ రమ్మీ, ట్రేడింగ్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాడ్స్ ద్వారా ప్రజలు కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్వయోభేదం లేకుండా..సామాజిక మాధ్యమాలు బాల్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వయోభేదం లేకుండా పావులారిటీ కోసం ఫొటోలు, వీడియోలు, ప్రదర్శనలకు వాటిని వేదికగా మలచుకుంటున్నారు. వారించాల్సిన కొంతమంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపకరిస్తున్నా, చదువుపై నిర్లక్ష్యం పెరుగుతోందని కన్నవారు గుర్తించలేకపోతున్నారు.రీల్స్తో అనర్థాలురీల్స్ కోసం చేసే బైక్ విన్యాసాలతో చాలా మంది యువతకు అనర్థాలు జరిగాయి. కరీంనగర్ మానేరు, బైపాస్, మల్కాపూర్, బొమ్మకల్, చింతకుంట తదితర ప్రాంతాల్లో యువత బైకులు తిప్పుతూ, రోడ్లపై హుషారుగా రీల్స్ తీసే ప్రయత్నాల్లో బలవుతున్నారు. డివైడర్లకు తగిలి, ఎదురుగా వస్తున్న వాహనాలకు ఢీకొని ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. రీల్స్ వెనక నిజజీవితంలో జరుగుతున్న విషాదాలు ఎవరిదృష్టిలో పడడం లేదు. కరీంనగర్ జిల్లాలో రీల్స్ తీసే యత్నంలో యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉండగా తాజాగా అర్బాజ్ అనే యువకుడు మానేరువాగులో రీల్ తీసేక్రమంలో నీటమునిగి మృతిచెందాడు. అతడితో ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా కాపాడలేకపోయారు. ఇదే జిల్లాకు చెందిన మరో యువకుడు రైలుపై రీల్ తీయబోతూ కరెంట్షాక్కు గురై మృత్యువాతపడ్డాడు.చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్? ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దురీల్స్కు యువత ఆకర్షితులవడంతో అది వ్యసనంగా మారడం జరుగుతుంది. వ్యక్తిత్వ వికాస లోపంతోనే సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతున్నారు. కాగ్నటివ్ బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ద్వారా వీటి నుంచి బయటపడే అవకాశాలున్నాయి. యువత భవిష్యత్తు మీద దృష్టి పెట్టి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి.– డాక్టర్ అట్ల శ్రీనివాస్రెడ్డి, సైక్రియాటిస్టు -
ట్రాన్స్ఫార్మర్కు ప్రత్యేక పూజలు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
మట్టి, గట్టు, చెట్టు, పుట్ట.. మన దేశంలో ప్రతీది పూజలకు అర్హత ఉన్నవే. అయితే ఇక్కడ ఓ ఊరు కరెంట్ ట్రాన్స్ఫార్మర్(Electricity Transformer)కు ప్రత్యేక పూజలు చేసింది. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ ఆ పూజలు ఎందుకో తెలుసా?మధ్యప్రదేశ్ భింద్ గ్రామంలోని(Madhya Pradesh Bhind Village) గాంధీనగర్ ఏరియాలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ గత 15 సంవత్సరాలుగా సేవలందించి.. ఈ మధ్యే కాలిపోయింది. విద్యుత్ విభాగం అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అసలే వేసవి కావడంతో రోజుల తరబడి ప్రజలు కరెంట్ లేక అల్లలాడిపోయారు. చివరకు.. స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుష్వాహను ఈ విషయమై సంప్రదించారు.ఎమ్మెల్యే చొరవతో రెండే రెండు గంటల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ను అధికారులు బిగించేశారు. దీంతో వాళ్లు సంబురం చేసుకున్నారు. కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చి ట్రాన్స్ఫార్మర్కు పూజలు(Puja To Transformer) చేశారు. ఆపై స్వీట్లు పంచుకున్నారు. ఎందుకిలా చేశారని ఆరా తీస్తే..ఆ గ్రామస్తులు మరోసారి అధికారులను నమ్ముకోవాలనుకోవడం లేదు. అలా నమ్ముకుంటే ఏం జరుగుతుందో వాళ్లను అనుభవం అయ్యింది కదా. ‘‘అధికారులు ఎలాగూ సక్రమంగా పని చేయరు. అందుకే చాలాఏండ్లు పని చేయాలని ఈ కొత్త ట్రాన్స్ఫార్మరే కోరుకుంటూ పూజలు చేశారంట. హా.. షాకయ్యారా! అదన్నమాట అసలు సంగతి. ఇదీ చదవండి: పులిని పుట్టుకుని సెల్ఫీకి యత్నించి.. -
AP: ఒంటరి మహిళలు, వివాహితలే టార్గెట్.. యూట్యూబర్ అరెస్ట్
సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళలను లైంగికంగా వేధిస్తున్న యూట్యూబర్ హేమాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధింపులకు గుర్తిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో యూట్యూబర్ హేమాద్రిని తిరుచానూర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడు హేమాద్రి.. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు, ఒంటరి మహిళలకు, వివాహితలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం, వారితో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు సేకరించాడు. కొద్ది రోజుల తర్వాత వారిని సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినట్టు బాధితులు.. పోలీసులు ఆశ్రయించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. హేమాద్రిని అరెస్ట్ చేశారు. మరోవైపు.. హేమాద్రి అరెస్ట్ తెలియడంతో తిరుచానూర్, తిరుపతి, చంద్రగిరి నుంచి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. -
మాక్రాన్-బ్రిగెట్టా వీడియోపై ట్రంప్ ఫన్నీ.. డోర్ క్లోజ్ చేయాలంటూ..
వాషింగ్టన్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇలాంటివి జరిగేటప్పుడు అక్కడ తలుపులు మూసి ఉన్నాయో.. తెరిచి ఉన్నాయో చూసుకోవాలి అని ఫన్నీ కామెంట్స్ చేశారు. అది చూసుకుంటే ఇలా సోషల్ మీడియాలో మనం ఉండం కదా.. అని చెప్పుకొచ్చారు.అధ్యక్షుడు మాక్రాన్ ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్టా నెట్టినట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ ఘటనపై స్పందించాలని ఓ విలేకరి ట్రంప్ను కోరారు. ఈ సందర్భంగా ట్రంప్ స్పందిస్తూ.. దీని గురించి తాను నేరుగా మాక్రాన్తోనే మాట్లాడాను. అంతా బాగానే ఉందని తెలిపారు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు తలుపులు వేసి ఉన్నాయో, లేదో ఒకసారి గమనించుకోవాలి అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. మాక్రాన్-బ్రిగెట్టాల వియత్నాం పర్యటన సందర్బంగా హనోయ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం హనోయ్లో దిగిన తరవాత.. ఒక అధికారి తలుపును తెరిచినప్పుడు మాక్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతలోనే ఎర్రని స్లీవ్స్ ధరించిన రెండు చేతులు మాక్రాన్ను నెట్టివేశాయి. ఆయన వెంటనే తలతిప్పి వెనక్కి జరిగారు. ఇది రికార్డు అవుతున్నట్లు గమనించి చిరునవ్వుతో చేయి ఊపారు. ఆ తరువాత ఫొటోల్లో మెక్రాన్, ఎర్రని జాకెట్ వేసుకొని బ్రిగెట్టా విమానం మెట్ల వరుసపై కనిపించారు. భార్య చేతిని పట్టుకోవడానికి మాక్రాన్ ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు. తరువాత ఇద్దరూ కలసి మెట్లు దిగి రెడ్ కార్పెట్ మీద పక్కపక్కనే నడిచారు.BREAKING:@pdoocy just asked Donald Trump about Brigitte Macron slapping @EmmanuelMacron earlier this week.TRUMP: "Make sure the door remains closed."🤣🤣 pic.twitter.com/V05Hna79DG— Evan Kilgore 🇺🇸 (@EvanAKilgore) May 30, 2025అనంతరం, ఈ ఘటనపై మాక్రాన్ స్పందిస్తూ.. మా విషయంలో ప్రతీ ఒక్కరూ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. అప్పుడు నా భార్యతో నేను జోక్ చేశాను. ఇది మా మధ్య ఎప్పుడూ జరిగేదే అంటూ క్లారిటీ ఇచ్చారు. ‼️🇫🇷 Here's a higher-quality version of today’s most viral video. Enjoy! #Macron pic.twitter.com/aGkx0nXzKe— Maimunka News (@MaimunkaNews) May 26, 2025 -
ప్లీజ్ మమ్మీ ఆపండి.. అమెరికా స్కూల్లో వింత ప్రవర్తన..
వాషింగ్టన్: అమెరికాలోకి ఎలిమెంటరీ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా అక్కడికి వచ్చిన పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఇది కాస్తా కొట్లాటకు దారి తీసింది. పేరెంట్స్ ఫైటింగ్ కారణంగా చిన్నారులు భయంతో ఏడుస్తూ.. వారిని ఆపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. అమెరికాలో ఆర్కాన్సాస్ రాష్ట్రంలోని వెస్ట్ మెంఫిస్ నగరంలో ఉన్న ఫాల్కీ ఎలిమెంటరీ స్కూల్లో.. ఈనెల 28వ తేదీన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సదరు స్కూల్ యాజమాన్యం చిన్నారులు సహా వారి తల్లిదండ్రులకు ఆహ్వానం కల్పించారు. ఈ క్రమంలో పిల్లలతో పాటుగా వారి పేరెంట్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం, కార్యక్రమం జరుగుతుండగా.. కొందరు మహిళల మధ్య ఏదో విషయంలో వాగ్వాదం మొదలైంది.దీంతో, మాటాలమాటా పెరిగి.. గొడవ పెద్దదిగా మారింది. ఆగ్రహంతో రగిలిపోయిన పేరెంట్స్.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పురుషులు కూడా కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈవెంట్లో పేరెంట్స్ గొడవపడటంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. కన్నీరుపెట్టుకుంటూ వారిని ఆపివేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు.Brawl breaks out after a Kindergarten Graduation at West Memphis’ Faulk Elementary. Children can be heard screaming “Stop” to the adults. <- Read that again. The news reported that the “Police are investigating the situation further.” 🙄 pic.twitter.com/PL43g2zZdx— The Facts Dude (@The_Facts_Dude) May 30, 2025మరోవైపు.. ఈ ఘటనను సదరు పాఠశాల యాజమాన్యం ఖండించింది. ఇటువంటి ప్రవర్తన కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. విద్యార్థులు, సిబ్బంది రక్షణ, పాఠశాల ప్రాంగణం భద్రత మొదటి ప్రాధాన్యం అని.. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. వీరికి గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
‘నవ’ మోసాలు
అవనిగడ్డ: జీవో 117ని రద్దు చేయకుండా రెక్టిఫికేషన్ పేరుతో పాఠశాలల సంఖ్యను తొమ్మిది రకాలుగా మార్చడాన్ని ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న చేతలకు పొంతన లేని తీరుపై వారు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యమమే సరైన మార్గమని, లేకపోతే భవిష్యత్ లేదని ఉపాధ్యాయులంతా ఏకమవుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉద్యమబాటకు సై అంటున్నారు. నాటి లోకేశ్ వీడియో వైరల్ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ మాట్లాడిన వీడియోని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. గౌరవ శ్రీనారా లోకేశ్ గారు ఎన్నికలకు ముందు..అంటూ ఇంగ్లిష్, తెలుగు మీడియం ఆప్షన్పై మాట్లాడిన వీడియో ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే తెలుగు, ఇంగ్లిష్ మీడియంపై ఆనాడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు? ఇప్పుడెలా స్పందిస్తున్నారనే వీడియో సైతం అందరి గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. సంతకాలతో మంత్రి లోకేశ్కు లేఖలుఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) యూనియన్ నేతలు ఒకడుగు ముందుకేసి 9 అంశాలపై సంతకాలు చేసిన లేఖలను మంత్రి నారా లోకేశ్కు మెయిల్స్, వాట్సాప్ల ద్వారా పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉపాధ్యాయుల వాట్సాప్ లేఖ సీఎస్పురం(పామూరు): ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారాలోశ్కు ప్రకాశం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తులశ్పంపారు. అన్ని గ్రామాల్లో 1 నుంచి 5 తరగతులకు ప్రాథమిక పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలంటూ పలు అంశాలపై ఏకరువుపెడుతూ వాట్సాప్ చేశారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్గిష్ మాద్యమాలను కొనసాగించాలని కోరారు. ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులు, ఉన్నతపాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలంటూ వాట్సాప్ ద్వారా మంత్రికి వినతులు పంపినట్లు ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.నాయబ్రసూల్, సీఎస్పురం మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాసులు, జె.ఎస్.ఆనంద్బాబు పేర్కొన్నారు. ఆ తొమ్మిది అంశాలివే1. ప్రతి గ్రామంలో ప్రతిపాదిత ఫౌండేషన్ స్కూల్ స్ధానంలో 1 నుంచి 5 తరగతులుండేలా ప్రాథమిక పాఠశాలలు విధిగా కొనసాగించాలి. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. 2. విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం కోసం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలను కొనసాగించాలి. మైనారిటీ భాషల మాధ్యమాలను కొనసాగించాలి. 3. ఎస్జీటీలకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. 4. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది విద్యార్థులు దాటితే 5 ప్లస్ 1 ఉపాధ్యాయులను నియమించాలి.5. ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులను విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలి. 6. ప్రతిపాదిత ప్రభుత్వ ఉత్తర్వు 21లో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పడనున్న 40 పీరియడ్ల భారాన్ని 32 పీరియడ్లకు మించకుండా చూడాలి. 7. ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. 8. క్లస్టర్లలో ఉపాధ్యాయులు మిగులు చూపించకుండా వారిని విద్యార్థుల సంఖ్యను బట్టి అవరోహణ క్రమం (ఎక్కువ నుంచి తక్కువ స్థాయి)లో పాఠశాలలకు కేటాయించాలి. 9. పెరిగిన జనాభా మేరకు మునిసిపాలిటీ, కార్పొరేషన్, నూతనంగా వెలిసిన ఆవాసాలతో నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలి. -
ఏరా పులి..!
రేయ్.. పులిని చూడాలనుకో, తప్పులేదు. పులితో ఫోటో దిగాలనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చెయ్యొచ్చు.. అంటూ ఓ పాపులర్ సినిమా డైలాగ్ ఉంటుంది. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేయబోయి తన ప్రాణాలనే రిస్క్లో పడేసుకోబోయాడు ఓ భారతీయ టూరిస్టు.ఈ భూమ్మీద పులులకు స్వర్గధామంగా థాయ్లాండ్ ఫుకెట్(Phuket)కు పేరుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు పులులకు మేత వేయొచ్చు.. ఫొటోలు దిగొచ్చు.. అతిదగ్గరగా వాటితో కొంత సమయం గడపొచ్చు. అదంతా వాటి శిక్షకుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. అయితే తాజాగా అక్కడికి వెళ్లిన ఓ భారతీయ పర్యాటకుడికి చేదు అనుభవం ఎదురైంది.తొలుత పులిని తీసుకుని కాస్త దూరం నడిచిన ఆ వ్యక్తి.. దాని శిక్షకుడి సూచన మేరకు దానిని పట్టుకుని ఫొటో దిగే ప్రయత్నం చేయబోయాడు. అయితే ఆ ప్రయత్నం పులికి చిరాకు తెప్పించిందో ఏమో.. ఒక్కసారిగా అతనిపై దాడికి తెగబడింది(Tiger Attack Viral Video). కట్ చేస్తే..సిద్ధార్థ శుక్లా(Sidharth Shukla) అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఈ ఘటన తాలుకా వీడియోను పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. అయితే అది సరిగ్గా ఎప్పుడు జరిగిందనేది మాత్రం అతను పేర్కొనలేదు. కామెంట్ సెక్షన్లో ఓ వ్యక్తి ఆ టూరిస్ట్ చిన్నచిన్న గాయాలతో బయటపడినట్లు తెలిపాడు.Apparently an Indian man attacked by a tiger in Thailand.This is one of those paces where they keep tigers like pets and people can take selfies, feed them etc etc.#Indians #tigers #thailand #AnimalAbuse pic.twitter.com/7Scx5eOSB4— Sidharth Shukla (@sidhshuk) May 29, 2025ఈ ఘటనతో వన్యప్రాణ పర్యాటకంపై విమర్శలు వినవస్తున్నాయి. అసహజ వాతావరణంలో వాటి ప్రవర్తన అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని, కాబట్టి పర్యాటకుల విషయంలో నిర్లక్ష్యం తగదని ఫుకెట్ నిర్వాహకులను నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: వివేక్ రామస్వామి భార్యకు చేదు అనుభవం -
అపార్ట్మెంట్ కిటికీ నుంచి 500 నోట్ల వర్షం.. ఏమైందో తెలిసే లోపే ట్విస్ట్..
భువనేశ్వర్: ఒక ప్రభుత్వ ఇంజినీర్ ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. భారీ అవినీతి తిమింగలం విజిలెన్స్కు చిక్కింది. విజిలెన్స్ అధికారులు తన ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకుని సదరు అధికారి.. ఇంట్లోని నోట్ల కట్టలను కిటికీలోంచి బయటపడేశాడు. ఆ కరెన్సీ నోట్ల వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో బైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు.. సోదాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి ఒడిశాలోని అంగుల్, భువనేశ్వర్, పూరిలోని పిపిలి సహా మొత్తం ఏడు ప్రాంతాల్లోని సారంగి నివాసాలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు.Odisha Vigilance Raids Chief Engineer of RW Division in DA Case, ₹2.1 Crore Cash Seized@odisha_police pic.twitter.com/fNqSsIveqT— Dr.Somesh Patel🇮🇳 (@SomeshPatel_) May 30, 2025 ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు తన ఫ్లాట్ వద్దకు రాగానే సారంగి ఇంట్లోని నోట్ల కట్టలను కిటికీలోంచి బయటకు పడేశాడు. కింద వెళ్తున్న వారు కిటికిలో నుంచి పడుతున్న నోట్లను చూసి ఖంగుతున్నారు. అనంతరం, నగదును అధికారులు రికవరీ చేశారు. ఈ సోదాల్లో భాగంగా రూ.రెండు కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా 26 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. వారు నోట్ల కట్టలు లెక్క పెడుతోన్న ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి.#WATCH | Bhubaneswar: Odisha Vigilance Department conducted searches at 7 locations of Odisha Rural Works Division Chief Engineer, Baikuntha Nath SarangiAbout Rs 1 crore has been recovered from his flat in Bhubaneswar, while about Rs 1.1 crore has been recovered from his… pic.twitter.com/n8MQxYfU0L— ANI (@ANI) May 30, 2025 Odisha Vigilance Raids on Chief Engineer Baikuntha Nath Sarangi working in RW Dept over disproportionate assetsVigilance recovered approximately Rs. 2.1 crore cash Sarangi threw several bundles of Rs. 500 notes from his Bhubaneswar flat window upon seeing vigilance officers pic.twitter.com/CO3dnWWv8K— S U F F I A N (@iamsuffian) May 30, 2025 -
పర్యాటకులపై రైనో దాడియత్నం.. వీడియో వైరల్
దిబ్రూగఢ్: సరదాగా నేషనల్ పార్క్ సందర్శనకు వెళ్లిన పర్యాటకలకు ఊహించని పరిణామం ఎదురైంది. పర్యాటకులు పార్కులో సంచరిస్తున్న సమయంలో ఓ ఖడ్గమృగం వారి వాహనంపైకి దూసుకెళ్లింది. వాహనంపై దాడి చేయబోయింది. దీంతో, అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అసోంలోని మానస్ నేషనల్ పార్క్లో పర్యాటకులు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఒకచోట ఆగిన పర్యాటకులు.. అక్కడున్న ఖడ్గమృగాలను చూస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఖడ్గమృగం.. పర్యాటకుల వైపు దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా.. పర్యాటకులు ఉన్న వాహనంపై దాడి చేసింది. వాహనాన్ని ముందుకు, వెనక్కు లాగుతూ.. వాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. ఖడ్గమృగం ఇలా దాడి చేయడంతో పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.అనంతరం, కొద్దిసేపటికే ఖడ్గమృగం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ ఘటనపై తమకు సమాచారం అందిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. In Manas National Park in Assam, this furious rhino has attacked a tourist vehicle no less than five times.Each day, rhino charges at the mere sight of humans.The reason behind its anger toward people remains a mystery. pic.twitter.com/mE3V6TT04z— Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) May 29, 2025 -
అంతా చూస్తున్నారు.. అతి వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలను మరింత లోతుగా పరిశీలిస్తాం... సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రణాళిక కొనసాగుతోంది’ఇదీ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల ప్రకటించిన విషయం. దీన్నిబట్టి చూస్తే సోషల్ మీడియా ప్రొఫైలింగ్కు ఎంతటి ప్రాధాన్యత పెరుగుతుందో అర్థమవుతోంది. కేవలం విదేశాల్లో చదువు, ఉద్యోగాలకు వెళ్లే వారికే కాదు.. స్థానికంగా ఉద్యోగాలు పొందాలనుకునే యువతకు సంబంధించి సైతం ఆయా సంస్థలు ఇటీవల సోషల్ మీడియా ప్రొఫైలింగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. సదరు వ్యక్తి సోషల్ మీడియాలో వెల్లడించే భావాలు.. పెడుతున్న పోస్టులు, కామెంట్లు, వీడియోల ఆధారంగా అతడి వ్యక్తి త్వం ఏంటి? ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? ఇలా అనేక విషయాల్ని అంచనా వేస్తు న్నాయి. ఇంకాస్త లోతుగా వెళితే పెళ్లి సంబంధాల సమయంలోనూ అబ్బాయి–అమ్మాయిల గురించి, వారి స్నేహాలు, ప్రవర్తన, ఇతరులతో ఉన్న సంబంధాలపై ఒక అంచనాకు వస్తున్నారు. ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, ఎక్స్లలో వాళ్లు షేర్ చేసే ఫొటోలు, వీడియోల ఆధారంగా కూడా ప్రవర్తన, నడవడికను ఇట్టే అంచనా వేస్తున్న రోజులివి. అందుకే సోషల్ మీడియాలో అంతాచూస్తున్నారని, కాబట్టి అతి ధోరణి వద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.ఫన్ పేరిట కించపర్చేలా వ్యాఖ్యలు సాంకేతికతతో ఎంత ఉపయోగం ఉంటుందో.. అంతేస్థాయిలో అనర్థాలున్నాయి. నేటి యువత ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వాడటం పరిపాటిగా మారింది. గంటల తరబడి చాటింగ్లు, మీటింగ్ల్లో కొందరు హద్దు దాటుతున్నారు. యువత, విద్యార్థులు ఫన్ పేరిట ఎదుటి వారిని కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.. తోటి విద్యార్థులను సైబర్ బుల్లీయింగ్ (తప్పుడు వ్యాఖ్యలతో వేధించడం) చేస్తున్నారు. రాజకీయ వ్యాఖ్యలు, మతపరమైన వివాదాస్పద కామెంట్లు పెడుతుంటారు. ఈ వ్యాఖ్యలే వారిపాలిట ఇబ్బందికరంగా మారుతున్నాయి. కొన్నిసార్లు వీసాల రద్దు వరకు దారి తీస్తున్నాయి. ఎంబసీల్లోని అధికారులు వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి సోషల్ మీడియా ఖాతాలు వెరిఫై చేస్తున్నారు. యూకే, కెనడా, అమెరికా లేదా ఇతర ఏ దేశానికి వెళ్లాలన్నా వీసాలు ఆమోదం పొందడం లేదు. ఇందుకు ప్రధాన కారణం సోషల్ మీడియా ప్రొఫైలింగ్. అందుకే మన వ్యక్తిగత ప్రవర్తన కేవలం బయటి సమాజంలోనే కాదు.. సోషల్ మీడియా ప్రపంచంలోనూ ఉన్నతంగా ఉండాలని చెబుతున్నారు. మన చేతుల్లోనే.. మన భవిష్యత్తు» కేవలం విదేశాల్లో విద్యా అవకాశాల విషయంలోనే కాదు.. అన్ని వయస్సుల వారి అవకాశాలకు ప్రతిబంధకంగా ఈ సోషల్ మీడియా ప్రొఫైలింగ్ మారుతోందని మరవొద్దు. » పెళ్లి సంబంధమైనా, కొత్త ఉద్యోగమైనా సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాల వెతుకులాట కొనసాగుతోందని మరవొద్దు. » ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సోషల్ మీడియా యాప్లలో, వాట్సాప్ వంటి గ్రూప్ల్లో సంయమనంతో ఉండకపోతే చిక్కులు తప్పవు. » అనసవర వ్యాఖ్యలు చేయడంతో కొన్నిసార్లు ఇతర కంపెనీల్లో గొప్ప ఆఫర్లు వచ్చినా ఉద్యోగాలు పొందలేని పరిస్థితి. అదేవిధంగా ఒక ఉద్యోగి మతం, ప్రాంతం, కులాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు పోస్టులు పెడితే ఉద్యోగ ఎదుగుదలకు అవి ప్రతిబంధకాలుగా మారే ప్రమాదం ఉంటుంది. » మన వ్యక్తిగత వివరాలు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, ఫ్రెండ్స్ ఎవరు, తరచూ ఎక్కడికి వెళుతుంటాం.. వీటన్నింటినీ క్రోడీకరించి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి అవతలి వ్యక్తి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయొచ్చని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా సమాచారం అనవసరం.. సోషల్ మీడియాలో కొందరు తమ సమస్త వివరాలు చెబుతుంటారు. కానీ, అవసరానికి మించి ఏ వ్యక్తిగత సమాచారమూ సోషల్ మీడియాలో పంచుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. పుట్టిన రోజులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలు, మన స్వస్థలాల వివరాలు వీలైనంత వరకు పెట్టకుండా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా వాడకంపై సరైన అవగాహన ఉండాలని పేర్కొంటున్నారు. మన వ్యక్తిగత సమాచారం మనం కాకుండా ఏ వెబ్సైట్లో, సెర్చ్ ఇంజిన్లో చూసినా వెంటనే దాన్ని తొలగించాలని ఆ వెబ్సైట్ను కోరాలని వారు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రొఫైలింగ్ అంటే..? ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లలో ఖాతాలున్న వారు.. వాటిల్లో షేర్ చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు, వివరాలు, పెడుతున్న కామెంట్లు అన్నింటినీ క్రోడీకరించి అవతలి వ్యక్తి గురించి అంచనావేసే పద్ధతినే సోషల్ మీడియా ప్రొఫైలింగ్అంటాం. దీని ఆధారంగా ఒక వ్యక్తి సామాజిక ప్రవర్తనను దాదాపుగా అంచనా వేయొచ్చు. -
Podcast: యూట్యూబ్లో కోట్లలో వ్యూస్ - ట్రెండింగ్ పాడ్కాస్టింగ్!
శ్రీనగర్కాలనీ: ఓ వ్యక్తి అనుభవాలు.. ఎదుర్కొన్న కష్టాలు.. సాధించిన విజయాలు.. పలువురికి ఉపయోగ పడే సంఘటనలు.. ఇలా ఎన్నో అంశాలను తెలుసుకోవడానికి పేపర్ చదవడం, రేడియోలో వినడం, టీవీలో చూడటం చేసేవాళ్లం. ఆయా అంశాల గురించి తెలుసుకునేవారం.. ఇప్పుడంతా ఫోనే.. తింటున్నా.. నడుస్తున్నా.. జర్నీ చేస్తున్నా.. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఫోన్.. ఒక్కసారి యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర యాప్స్ ఓపెన్ చేస్తే చాలు వేలు, లక్షల సంఖ్యలో వీడియోలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే.. ప్రస్తుతం పాడ్కాస్టింగ్(Podcast) ట్రెండ్ కొనసాగుతోంది. ఇది కొన్నేళ్ల క్రితమే మొదలైనా ప్రస్తుతం పాడ్కాస్టింగ్ అంటే అందరికీ తెలుస్తోంది. ఇంటర్వ్యూ ట్రెండ్ అవ్వాలంటే పాడ్కాస్టింగ్తోనే అన్నట్లుగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏడాది కాలంగా మరింత ట్రెండింగ్గా మారి సెలెబ్రిటీస్తో పాడ్కాస్టింగ్ కోట్లలో వ్యూస్ని తెచ్చిపెడుతోంది. యూట్యూబ్లో కోట్లలో వ్యూస్.. భారత్లో పాడ్కాస్టింగ్కు డిమాండ్ పెరిగింది. ఫుడ్, బిజినెస్, పొలిటికల్, ఎంటర్టైన్మెంట్, సైన్స్, టెక్నాలజీ ఇలా అన్ని రంగాల్లో రాణించిన వారు తమ అనుభవాలను పాడ్కాస్టింగ్లో వెల్లడిస్తున్నారు. ఇందులో వీడియో పాడ్కాస్టింగ్ చాలా పాపులర్ అయ్యింది. ఒక యూట్యూబర్ లేక ఒక వ్యక్తి ఫేమస్ పర్సన్ను వారి అనుభవాలను విశ్లేషణాత్మకంగా, పూర్తిగా వారి అనుభవాలను నెటిజన్లను తెలియజేయడం ట్రెండింగ్గా మారింది. ఫేమస్ పర్సనాలిటీస్ వారి జీవిత విషయాలను పాడ్కాస్టింగ్లో వెల్లడించడంతో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాల్లో కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా చానల్స్కి కూడా రూ.లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఇదీ చదవండి: చిన్న వయసులోనే పెళ్లి, బాధ్యతలు: పట్టుదలతో IAS అధికారిగాపాడ్కాస్టింగ్.. పాడ్కాస్టింగ్ అంటే ఒక వ్యక్తి తన విజ్ఞానాన్ని, పలు విషయాలను పూర్తిగా వివరించే పక్రియే పాడ్కాస్టింగ్.. ఆడియో, వీడియో, మోనో, గ్రూప్ పాడ్కాస్టింగ్ చాలా రూపాల్లో ఉంటుంది. ఒకప్పుడు రేడియోలో ఒక వ్యక్తి తన రంగానికి సంబందించిన విషయాలను వెల్లడించడమే ఇప్పుడు రికార్డింగ్ రూపంలో ఒక క్లారిటీ ఆడియో, వీడియోను చేయడమే.. ఆడియో పాడ్కాస్టింగ్ చాలా తక్కువ టైంలో అవుతుంది. అదే గ్రూప్, ఇద్దరు వ్యక్తుల పాడ్కాస్టింగ్ వీడియో పాడ్కాస్టింగ్ చేయాలంటే మైక్స్, మ్యూజిక్, ఎడిటింగ్ ఖచ్చితంగా చేయాలి. చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్ -
Comment X: పబ్లిక్ రోడ్లు కాస్త..
నడిరోడ్డులో.. పగలురాత్రి తేడాల్లేకుండా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనలెన్నో ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల కారణంగా అవి వైరలూ అవుతున్నాయి. మొన్నీమధ్యే మధ్యప్రదేశ్లో ఓ నేత రోడ్డు మీదే ఓ మహిళతో నగ్నంగా శృంగారం జరిపి కటకటాల పాలయ్యాడు. తాజాగా కర్ణాటకలో కదిలే కారులో రెచ్చిపోయింది ఓ జంట.బెంగళూరుకు చెందిన ఓ జంట మే 27వ తేదీన కోరమంగళలో డిన్నర్ చేసింది. ఆపై కారులో వెళ్తూ.. సన్రూఫ్ నుంచి బయటకు వచ్చి రొమాన్స్ చేయసాగింది. దారినపోయే వాహనదారులు ఆ తతంగం అంతా రికార్డు చేశారు. అయితే.. Karnataka Portfolio అనే ఎక్స్ పేజీ ఆ వీడియోను హైలైట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇలాంటి జుగుప్సాకరమైన చేష్టలు ప్రజలకు ఇబ్బందికరమైనవని, కారులో ఉన్నవాళ్లతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం ఇబ్బందుల్లోకి నెడతాయని పేర్కొంది. వీడియో బాగా వైరల్ కావడంతో నగర పోలీసులు స్పందించారు. వీడియోలో నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసి ఓనర్ను పట్టుకున్నారు. ప్రమాదకరీతిలో వాహనం నడపడం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కింద మొత్తం రూ.1,500 జరిమానా చేతిలో పెట్టి ఈసారికి వార్నింగ్తో వదిలిపెట్టారు. మొన్నీమధ్యే.. ఏప్రిల్లో నగరంలోని మాదవర మెట్రో స్టేషన్లో ఓ జంట అభ్యంతరకర చేష్టలకు దిగడం.. ఈ వీడియో సైతం నెట్టింట తెగ వైరల్ అవ్వడం తెలిసే ఉంటుంది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. పబ్లిక్ రోడ్లు కాస్త ప్రైవేట్ బెడ్రూంలుగా మారిపోయాయంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అయ్యింది.ఇదీ చదవండి: మెట్రోలో వెళ్లే అమ్మాయిలను సీక్రెట్గా ఫొటో తీసి.. -
ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం
న్యూఢిల్లీ: ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అత్యాచారానికి గురైనట్లు చెబుతున్న 40 ఏళ్ల మహిళ చిన్నపిల్ల కాదని పేర్కొంది. ఆమె అంగీకారంతోనే లైంగిక చర్య జరిగిట్లు పరోక్షంగా వెల్లడించింది. అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు న్యాయస్థానం బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడిని అరెస్టు చేసి, జైల్లో పెట్టి తొమ్మిది నెలలు గడుస్తున్నా పోలీసులు అభియోగాలు నమోదు చేయలేదని, అందుకే మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఆ మహిళ ఆ యువకుడిని ఇష్టపూర్వకంగానే కలిస్తే అతడిపై రేప్ కేసు ఎలా నమోదు చేస్తారని ఢిల్లీ పోలీసులను జస్టిస్ బి.బి.నాగరత్న, జస్టిస్ సతీశ్చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఆమె అతడితో ఏడుసార్లు జమ్మూకశ్మీర్కు వెళ్లిందని, అతడిపై సెక్షన్ కింద 376 కింద కేసు పెట్టడం సరైంది కాదని పేర్కొంది. ఈ కేసులో సదరు మహిళ దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. తమ దుస్తుల బ్రాండ్ ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన యువకుడిని సంప్రదించారు. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆ మహిళ ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని యువకుడు కోరగా, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దాంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, బెయిల్పై బయట ఉన్నప్పుడు ఈ మహిళను కలవొద్దని షరతు విధించింది. -
కొలంబోలో అనసూయ చిల్.. ఎల్లో శారీలో రష్మిక హోయలు!
బ్లాక్ అవుట్ఫిట్లో బాలీవుడ్ భామ మలైకా అరోరా..కొలంబోలో అనసూయ చిల్..సెల్ఫీ ఫోజులో మహేశ్ బాబు కూతురు సితార..ఎల్లో శారీలో రష్మిక మందన్నా హోయలు..కాన్స్ ఫెస్టివల్ మూడ్లోనే ప్రణీత సుభాశ్.. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Karishma Patidar (@stylebykarishmaa) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
Menstrual Hygiene Day : ‘నెలసరి’పై ఇన్ని అబద్ధాలా?!
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది. ఫేసుబుక్, ఇన్స్ట్రాగామ్, వా ట్సాప్ తదితర వేదికలపై లెక్కలేనంత సమాచారం అందుబాటులో ఉంది. ఆరోగ్యానికి సంబంధించి చాలామంది నిపు ణులు సోషల్ మీడియాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. డాక్టర్లు సైతం తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ఈ సమాచారం ప్రజలకు ఉపయోగపడుతోంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారమే అధికంగా వ్యాప్తిలో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో కొందరు మిడిమిడి జ్ఞానంతో ఇస్తున్న సమాచారం ప్రాణాంతకంగా మారుతోంది. భారత్లో నెలసరికి (పిరియడ్స్) సంబంధించిన వివరాలు, సలహాల కోసం మహిళలు సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. తప్పుడు సమాచారం మహిళల నెలసరి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నట్లు వెల్లడయ్యింది. అందుకే మహిళలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. బుధవారం ‘మెన్స్ట్రువల్ హైజీన్ డే’(Menstrual Hygiene Day). ఈ నేపథ్యంలో మహిళల నెలసరి ఆరోగ్యంపై ఇటీవల ‘ఎవర్టీన్ మెన్స్ట్రువల్ హైజీన్ సర్వే’నిర్వహించారు. సర్వేలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో 1,152 మంది మహిళలను ప్రశ్నించారు. వీరిలో 72.4 శాతం మంది 19 నుంచి 35 ఏళ్లలోపువారే ఉన్నారు. 76.6 శాతం మంది గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఈ సర్వేలో ఏం తేలిందంటే. నెలసరికి సంబంధించిన సోషల్ మీడియాలో తగినంత సమాచారం అందుబాటులో ఉన్నట్లు 71.6 శాతం మహిళలు నమ్ముతున్నారు. ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. పిరియడ్స్ గురించి ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు ఇచ్చే సమాచారాన్ని విశ్వసిస్తున్నారు. నెలసరి శుభ్రతపై వారు చక్కటి అవగాహన కల్పిస్తున్నట్లు భావిస్తున్నారు. మెన్స్ట్రువల్ అత్యవసర పరిస్థితుల్లో సమాచారం కోసం 11.5 శాతం మంది సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. తప్పుదోవ పట్టించే లేదా ప్రమాకరమైన సమాచారం సైతం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. దీనవల్ల తాము శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు మహిళలు చెప్పారు. పిరియడ్స్ ఆలస్యం కావడం అనేది పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్(పీసీఓడీ)కు సంకేతమని కొందరు బ్లాగర్లు చెబుతున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. (పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్) నెలసరి సమయంలో నొప్పి అధికంగా ఉంటే నిమ్మరసం లేదా కాఫీ తాగాలన్నది కొందరి సలహా. కానీ, అలా చేస్తే నొప్పి తగ్గకపోగా మరింత పెరుగుతుంది. (వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదా)నెలసరి వచ్చినప్పుడు వ్యాయామం చేయడం చాలా ప్రమాదకరం అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఆ సమయంలో వ్యాయామం చేస్తే నొప్పి, చికాకు నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి. నెలసరిలో విడుదలయ్యే రక్తం అపవిత్రమైందని, ఆ సమయంలో దేవాలయాలకు వెళ్లొద్దని, ఇళ్లల్లో పచ్చళ్లు కూడా ముట్టుకోవద్దని, ఇతరులకు దూరంగా ఉండాలన్న అభిప్రాయం ఇప్పటికే సమాజంలో పాతుకుపోయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి మూఢవిశ్వాసాలను మరింత పెంచేస్తున్నారు. కొత్తకొత్తవి జోడిస్తూ మహిళలను ఆందోళనకు గురి చేస్తున్నారు. పీరియడ్స్ వచ్చినప్పుడు ఫలానా ఆహారం తీసుకోవాలని లేదా తీసుకోవద్దని చెబుతున్నారు. కానీ, అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. నెలసరి సమయంలో భాగస్వామితో కలిస్తే గర్భం రాదు అనేది తప్పుడు అభిప్రాయమేనని నిపుణులు అంటున్నారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో కచి్చతత్వం, వాస్తవాలతో కూడిన, నిర్ధారించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాన్ హెల్త్కేర్ సంస్థ సీఈఓ చిరాగ్పాన్ సూచించారు. నెలసరి శుభ్రత కోసం శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తున్నట్లు 87.8 శాతం మంది చెప్పారు. 5.7 శాతం మంది డిస్పోజబుల్ పిరియడ్ ప్యాంటీస్, 4.7 శాతం మంది మెన్స్ట్రువల్ కప్స్, 1.6 శాతం మంది టాంపోన్స్ వాడుతున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది. -
ఆదాయానికి మించి ఆస్తులు.. పోలీసుల అదుపులో ఇన్స్టా క్వీన్
చండీఘడ్: మహీంద్రా థార్. రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్ బైక్. కోట్ల విలువ చేసే రెండు ప్లాట్లు. రెండు ఐఫోన్లు. రోలెక్స్ వాచీ.. కోట్లు విలువ చేసే ఆస్తులు ఎవరివో తెలుసా? పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేసిన ఇన్స్టా క్వీన్ ఆమెందీప్ కౌర్వి. గత నెలలో పంజాబ్ పోలీస్ శాఖ ఆమెందీప్ కౌర్ని విధుల నుంచి తొలగించింది. పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ దేశ సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపారనే ఆధారాలతో సస్పెండ్ చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడిని నిజం చేస్తూ పోలీస్ శాఖ వేటు వేయడంతో కానిస్టేబుల్గా ఉన్న సమయంలో భారీ ఎత్తున డబ్బులు సంపాదించింది.ప్రభుత్వ ఉద్యోగం పోవడంతో సంపాదించిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఇన్ స్టా గ్రామ్ క్వీన్గా పేరు సంపాదించింది. అయితే, ఈ క్రమంలో పంజాబ్ విజిలెన్స్ బ్యూరో ఆమెను అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బథిండాలో జరిగిన విచారణ ఆధారంగా అవినీతి కేసు నమోదైంది.ఈ ఏప్రిల్ నెలలో మాదక ద్రవ్యాల కేసులో ఆమెందీప్ కౌర్పై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో జైలు పాలయ్యారు. అయినప్పటికీ, ఆమె మే 2 న బథిండా కోర్టు నుంచి బెయిల్పై విడుదల అయ్యారు. తాజాగా, విచారణలో పంజాబ్ పోలీసులకు కళ్లు బైర్లు కమ్మేలా ఆమెందీప్ కౌర్కు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఆస్తులు మొత్తం రూ. 1.35 కోట్లగా ఉన్నాయి. వాటిని ఎన్డీపీసీ యాక్ట్ కింద సీజ్ చేశారు. ఈ ఆస్తులు రెండు ప్లాట్లు, మహీంద్రా థార్, రోలెక్స్ వాచీ, మూడు ఫోన్లు ఉన్నాయి.సీజ్ చేసిన ఆస్తులు లెక్కిస్తేవిరాట్ గ్రీన్, బథిండా (217 చదరపు యార్డులు): రూ.99,00,000డ్రీమ్ సిటీ, బథిండా (120.83 చదరపు యార్డులు): రూ.18,12,000థార్ కార్: రూ.14,00,000రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్: రూ.1,70,000ఐఫోన్ 13 ప్రో మాక్స్: రూ.45,000ఐఫోన్ ఎస్ఈ: రూ.9,000వివో ఫోన్: రూ.2,000బ్యాంక్ బ్యాలెన్స్ (SBI): రూ. 1,01,588.53రోలెక్స్ వాచీ: ధర తెలియాల్సి ఉంది. విచారణ సందర్భంగా 2018 నుంచి 2025 వరకు ఆమె సంపాదించిన ఆస్తుల గురించి ఆరా తీశారు. ఆమె తీసుకున్న జీతం, బ్యాంకు అకౌంట్లు, ఆమెకు ఉన్న అప్పులను అధికారులు పరిశీలించారు.విచారణలో ఆమె ఖర్చులు తన ఆదాయాన్ని దాటినట్టు తేలింది. ఇన్స్టా క్వీన్ అనే పేరు దక్కించుకున్న ఆమె ఇన్స్టా గ్రామ్లో ఖరీదైన వస్తువులతో వీడియోలను పోస్ట్ చేసింది. వాటి ఆధారంగా ఆమె ఆదాయంపై అధికారుల కన్ను పడింది. ఆమెందీప్ కౌర్ 2018 నుండి 2024 మధ్య మొత్తం రూ.1.08 కోట్ల ఆదాయం సంపాదించింది. కానీ ఆమె ఖర్చులు రూ. 1.39 కోట్లు పైగా ఉన్నాయి. అంటే రూ.31.27 లక్షలు ఆమె ఆదాయానికి మించిన ఖర్చు చేశాయి. 28.85 శాతం ఆమె చట్టబద్ధమైన ఆదాయానికి మించి ఉంది. మే 26న జరిపిన విచారణ ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద విజిలెన్స్ బ్యూరో అధికారులు ఆమెను అదపులోకి తీసుకున్నారు. -
ఇదెక్కడి విడ్డూరం.. ఇలా కూడా పరువు పొగొట్టుకుంటారా?
హుర్రే.. ఆపరేషన్ సింధూర్కి కౌంటర్గా ఆపరేషన్ భున్యన్తో భారత్పై విజయం సాధించాం అంటూ పాక్ చేస్తున్న వేడుకలు, వరుస ప్రకటనలు నవ్వులు పూయిస్తున్నాయి. ఒకదానికి తర్వాత మరొకటి తప్పుడు ప్రచారాలతో పరువు పొగొట్టుకుంటోంది ఆ దేశం. తాజాగా..ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్(Asim Munir) చేసిన పని.. విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఆపరేషన్ భున్యాన్ సక్సెస్ పేరిట ఆయనో డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్, సెనేట్ చైర్మన్ యూసుఫ్ రజా గిలానీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే.. ఆపరేషన్ భున్యన్(Operation Bunyan) విక్టరీకి గుర్తుగా ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్కు ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఓ పెయింటింగ్ బహుకరించారు. కానీ.. అందులో ఉన్న తప్పును కొందరు టక్కున పట్టేశారు. నాలుగేళ్ల కిందట చైనా జరిపిన మిలిటరీ ఆపరేషన్ తాలుకా చిత్రమది. ఆ చిత్రాన్ని ముందూ వెనుక చూడకుండా ఆపరేషన్ భున్యాన్ చిత్రమంటూ అదీ ఆర్మీ చీఫ్ ప్రధాని బహుకరించడం విడ్డూరంగా పేర్కొంటున్నారు కొందరు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీరంలోని ఉగ్ర శిబిరాలను నాశనం చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత్. అయితే.. ఆపరేషన్ భున్యన్ ఉన్ మర్సూస్తో తామూ భారత్పై దాడులు జరిపి ఘన విజయం సాధించామని పాక్ ప్రకటించుకుంటూ వస్తోంది. కానీ, అంతర్జాతీయ సమాజానికి తగిన ఆధారాలు మాత్రం చూపించకపోయింది. వరుసగా.. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో పాక్ పరువు మళ్లీ మళ్లీ పోగొట్టుకుంటూ వస్తోంది. భారత్పై విజయం అంటున్నారు కదా.. దానికి తగిన ఆధారం ఒక్కటైనా చూపించలేని స్థితిలో పాక్ ఉందంటూ పలువురు జోకులు పేలుస్తున్నారు.ఇదీ చదవండి: నన్ను ఆపేస్తే నీ సంబంధం బయటపెడతా! -
రండి బాబు రండి.. ఇంకు మరకల చొక్కా 80,000 మాత్రమే..
పిచ్చి వెధవా.. తెల్లని చొక్కా వేసి బడికి పంపిస్తే మొత్తం ఇంకు మరకలు చేసుకోస్తావా.. బుద్ధి లేదా.. నేను ఇప్పుడు వీటిని ఎలా వదలగొట్టాలి.. ఎన్ని రిన్ సబ్బులు ఎన్ని సర్ఫ్ ప్యాకెట్లు వాడాలో.. ఇప్పుడు మీ నాన్నకు తెలిస్తే ఏమంటాడో.. మళ్ళీ కొత్త చొక్కా కొనాలంటే మాటలా.. తింగరి సన్నాసి అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు అని అమ్మ కొట్టిన రోజులు గుర్తున్నాయా?. బాబూ.. మా అబ్బాయి చొక్కా నిండా ఇంకు మరకలు పడ్డాయి దీన్ని కాస్త వదిలించియేలా గట్టిగా రేవు పెట్టావయ్యా అని చెప్పిన రోజులూ ఉన్నాయి. ఆమ్మో.. ఈ దరిద్రపు పెన్ను మళ్ళీ ఇంకు కక్కేసింది.. దీన్ని నిక్కర్ జేబులో పెట్టుకోకుండా అనవసరంగా తెల్ల చొక్కా జేబులో పెట్టాను.. ఇది మొత్తం షర్ట్ ను ఖరాబ్ చేసింది. ఇంటికెళ్తే అమ్మ ఏం తిడుతుందేమో ఏమిటో అని భయపడిన రోజులున్నాయి అయితే అప్పుడు మరక అన్నదే ఇప్పుడు మురిపెం అయింది. అదికూడా కాస్ట్లీ వ్యవహారం అయింది. మామూళోళ్ళకు దక్కని స్థాయి.ఒకనాడు ప్యాంట్కు ఎక్కడైనా కన్నం పడితే .. లేదా ఏ ముళ్లకంపకో.. ఏదైనా ఫెన్సింగ్కు గానీ తగులుకుని చినిగిపోతే అయ్యో అనే వాళ్ళం. దాన్ని మళ్ళా టైలర్ దగ్గరకు తీసుకెళ్లి రఫ్ చేయించేవాళ్ళు. కానీ, నేడు ఇప్పుడు జీన్స్లో చిరుగుల జీన్స్ (TORN JEANS) పేరిట అధిక ధరలకు కొంటున్నారు.. ఇదేంటి కుర్రోడా అంటే ఇదే ట్రేండింగ్ అంటున్నారు నేటి యూత్. అదే విధంగా ఇప్పుడు చొక్కాల్లో కూడా సరికొత్త మోడల్ వచ్చింది. ఇటలీ దేశానికీ చెందిన moschino couture అనే దుస్తుల కంపెనీ ఏకంగా ఇంకు మరకల చొక్కాను రూపొందించింది. men light blue pen ink leak pocket shirt పేరిట మార్కెట్లోకి దించిన ఈ చొక్కా జేబుల వద్ద సరిగ్గా ఇంకు మరక ఉండేలా డిజైన్ చేశారు.అలా మరక పడిన చొక్కాను సదరు సంస్థ బాగా చవగ్గా అమ్ముతోంది లెండి.. అంటే ఒక్కోటి రూ.80 వేలు మాత్రమే.. చూసారా. ఒకనాడు అయ్యో ఇదేంటి ఇలా అయిపొయింది చొక్కా అనుకునేది ఇప్పుడు మురిపెం అయింది. ఇంకుమరకల చొక్కా ధర చూసి గుండె గుభేల్ మన్నదా.. ఐతే సింపుల్.. ఓ మామూలు తెల్ల షర్ట్ కొనేద్దాం.. మనమే ఇంకు మరక వేసుకుందాం.. ఐదారొందల్లో కొత్త ఫ్యాషన్లోకి మారినట్లు సంబరపడిపోదాం.. -సిమ్మాదిరప్పన్న. -
పెద్ద సారూ.. పార్టీ ఆఫీసులో ఇదేం పని.. వీడియో వైరల్
లక్నో: బీజేపీ సీనియర్ నేత ఒకరు పార్టీకి చెందిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహిళా కార్యకర్తను రాత్రి వేళ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లడం ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సదరు నేత స్పందిస్తూ.. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని చెప్పడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఏప్రిల్ 12న రాత్రి 9.30 గంటల సమయంలో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్ కిషోర్ కశ్యప్, ఒక మహిళా కార్యకర్తతో కలిసి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళతో కలిసి పై అంతస్తులోని గదిలోకి వెళ్లాడు. బీజేపీ పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ తాజాగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బామ్ బామ్ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.#Gonda: बमबम पर आरोप, पार्टी ने जारी किया नोटिस! क्या पद गंवाएंगे भाजपा जिलाध्यक्ष अमर किशोर कश्यप ? @deepaq_singh @Bhupendraupbjp pic.twitter.com/yKU2OFXYpz— GONDA POST (@gondapost) May 25, 2025మరోవైపు ఈ వైరల్ వీడియోపై బీజేపీ నేత అమర్ కిషోర్ కశ్యప్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కొనసాగడం ఇష్టం లేని వ్యక్తులు పన్నిన కుట్ర ఇది. కొంతమంది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇది ఏప్రిల్ 12 తేదీన జరిగింది. ఆ రోజు మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. దీంతో పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించాను. మానవతా దృక్పథంతో ఆ మహిళకు సహాయం చేశానని చెప్పుకొచ్చారు. అయితే, తనపై కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈ వీడియో వైరల్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. Gonda BJP Chief Responds to Viral Video: “She Was Unwell, Needed Rest” pic.twitter.com/pVY9o8OKoT— The Times Patriot (@thetimespatriot) May 25, 2025ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో అమర్ కిషోర్కు పార్టీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా స్పందిస్తూ..‘సోషల్ మీడియాలోని వీడియో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది. పార్టీ నేతలకు క్రమశిక్షణ అవసరం. ఈ ఘటనపై నోటీసులు ఇవ్వడం జరిగింది. అనుచితంగా ప్రవర్తించినట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
గూగుల్ నిర్ణయంతో పిల్లలకు చేటు?
కృత్రిమ మేధ... ఎటు చూసినా ఇదే హాట్టాపిక్. అయితే ఈ అత్యాధునిక టెక్నాలజీని పిల్ల లకూ చేరువ చేసేందుకు గూగుల్ చేస్తున్న ప్రయత్నం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కృత్రిమ మేధ ఛాట్బోట్ ‘జెమి నీ’ని 13 ఏళ్ల కంటే తక్కువ వయసు వారికీ అందుబాటు లోకి తెస్తున్నట్లు గూగుల్ ఇటీవలే ప్రకటించింది. మొదట అమెరికా, కెనడాల్లో ప్రవేశపెట్టి ఈ ఏడాది చివరికి ఆస్ట్రేలియాలోనూ లాంచ్ చేయనున్నట్లు సమా చారం. గూగుల్ ఫ్యామిలీ లింక్ అకౌంట్లు ఉన్న వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ పరిణామం ఏమంత మంచిది కాదని అనిపిస్తోంది. సోషల్ మీడియా వాడకంపై పిల్లలకు నిషేధం ఉన్నా వారిని సురక్షితంగా ఉంచేందుకు ఎన్ని పాట్లు పడాలో ఈ నిర్ణయం హైలైట్ చేస్తోంది. బహుశా దీన్ని ముందుగా గూగుల్ లాంటి పెద్ద కంపెనీల్లో వెంటనే అమలు చేసి చూడటమే మేలేమో!పదమూడేళ్ల లోపు పిల్లలకు అందబాటులోకి తెస్తున్న కృత్రిమ మేధ ఛాట్బోట్ ‘జెమినీ’ వాడకంపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉంటుందని గూగుల్ చెబు తోంది. ఫ్యామిలీ లింక్ అకౌంట్ల ద్వారా పిల్లలు ఏయే అప్లికేషన్లు వాడవచ్చో నిర్ణయించవచ్చు. పిల్లల పేరుతో అకౌంట్ను సృష్టించేందుకు తల్లిదండ్రులు పిల్లాడి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాస్తా వారి వ్యక్తిగత గోప్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకా శాలున్నాయి. అయితే పిల్లల వాడకానికి సంబంధించిన సమాచారాన్ని ఏఐ వ్యవస్థల శిక్షణకు వాడుకోబోమని స్పష్టం చేస్తోంది. ఛాట్బోట్ డీఫాల్ట్గా అందుబాటులో ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు నియంత్రణ కోసం కొన్ని ఫీచర్లను స్విచ్చాఫ్ చేయాలి. ఈ వ్యవస్థ తప్పులు చేసేందుకు అవకాశముందని అంగీకరిస్తోంది కాబట్టి ఇది అందించే సమాచారం నాణ్యత, విశ్వసనీయత ఎంత అన్నది ప్రశ్నార్థకం. కొన్నిసార్లు ఛాట్ బోట్లు కొన్ని సమాధానాలను ఊహించుకుని చెబుతూంటాయి. టెక్ పరిభాషలో దీన్ని ‘హెలూసినేషన్ ’ అంటూంటారు. పిల్లలు ఒకవేళ తమ హోంవర్క్ కోసం ఈ ఛాట్బోట్ను వాడుతూంటే.. అందులో వాస్తవాలు ఎన్నో... ఛాట్ బోట్ తాలూకూ భ్రాంతి, భ్రమ ఎంతో తెలియకుండా పోతుంది. గూగుల్, ఇతర సెర్చ్ ఇంజిన్లు తమంతట తాము ఒక స్పందన ఇవ్వకుండా... ఆ యా అంశాలకు సంబంధించిన వేర్వేరు సమాచారాలను మీ ముందు ఉంచు తాయి. వాటిల్లో వార్తలుంటాయి. ఫీచర్ కథనాలుంటాయి. విద్యార్థులు ఎవరైనా వీటిని చదివి అర్థం చేసుకుని తమ హోం వర్క్లను చేసుకోవచ్చు. అయితే ఏఐ టూల్స్ ఇలా కాదు. అందుబాటులో ఉన్న సమా చారంలో ఒక ప్యాటర్న్ కోసం వెతుకుతాయి. వాటి ఆధారంగా సమాధానాలను సృష్టిస్తాయి. లేదా చిత్రాన్ని తయారు చేస్తాయి. ఇవన్నీ మనం అందించే ప్రశ్న అంటే ప్రాంప్ట్ ఆధారంగా జరుగుతాయి. ఉదాహరణకు... ఒక కుర్రాడు పిల్లి బొమ్మ గీయమని అడిగాడని అనుకుందాం. అప్పుడు ‘జెమినీ’ ఛాట్బోట్ వ్యవస్థ... పిల్లి లక్షణాలు అంటే పొడుచుకొచ్చిన చెవులు, మీసాలు, పొడవైన తోక వంటి వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తుంది. వీటి ఆధారంగా పిల్లి చిత్రాన్ని గీస్తుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్లు, జెమినీ ఛాట్బోట్లు అందించే సమాచారంలోని తేడాలను గుర్తించడం పసిపిల్లలకు సవాలే. ఏఐ టూల్స్ పెద్దవాళ్లను కూడా... అది కూడా న్యాయవాదుల వంటి నిపుణులను కూడా తేలికగా బురిడీ కొట్టించగలవని ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. వయసుకు తగ్గ సమాచారం మాత్రమే పిల్లలకు అందేలా తాము రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని గూగుల్ చెబుతోంది. అయితే ఇలాంటి ఏర్పాట్లు కొత్త సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఉదాహరణకు... లైంగిక సంబంధిత సమాచారం పిల్లలకు అందకుండా చూసేందుకు కొన్ని పదాలను (ఉదాహరణకు రొమ్ము) నిషేధించామనుకోండి... పిల్లలకు అవసరమైన సమా చారం (కౌమార దశలో శరీరంలో చోటు చేసుకునే మార్పులు) కూడా అందకుండా పోతుంది. ఈ–సేఫ్టీ కమిషన్ సూచనలుఏఐ ఛాట్బోట్లతో రాగల సమస్యలను ఈ–సేఫ్టీ కమిషన్ ఇప్పటికే వివరించింది. ఏఐ ఛాట్బోట్లు ‘‘హాని కరమైన సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్ని పంచు కోవచ్చు. అలాగే ప్రమాదకరమైన సలహాలూ ఇవ్వ వచ్చు’’ అని హెచ్చరించింది. పిల్లలకు ఛాట్బోట్లు అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుందో ఈ సూచన స్పష్టం చేస్తోంది. ఛాట్ జీపీటీ, రెప్లికా, టెస్సా వంటి ఛాట్బోట్లను ఇప్పటికే పరిశీలించాము. మనుషులు అలిఖిత నిబంధనల సాయంతో చేసే సామాజిక ప్రవర్త లను ఈ ఛాట్బోట్ల స్పందనలు ప్రతిబింబిస్తున్నాయి. ఈ అలిఖిత నిబంధనలను ‘ఫీలింగ్ రూల్స్’ అంటారు. తలుపు తెరిచారని ‘థ్యాంక్యూ’ చెప్పడం, లేదా పొర బాటున ఎవరినైనా ఢీకొంటే ‘సారీ’ చెప్పడం వంటివి ఈ ఫీలింగ్ రూల్స్ కోవలోకి వస్తాయి. వీటిని అనుకరించడం ద్వారా మన నమ్మకాన్ని చూరగొనేలా ఈ ఛాట్ బోట్లను రూపొందించారు. అయితే ఈ రకమైన మాన వీయ ప్రవర్తన పిల్లల విషయానికి వచ్చేసరికి గందర గోళం సృష్టించవచ్చు. తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నా నమ్మేలా చేస్తుంది. అంతేకాకుండా... ఓ యంత్రంతో కాకుండా... సాటి మనిషితోనే వ్యవహారాలు నడుపుతున్నామని వారు నమ్మడం మొదలవుతుంది. ఆస్ట్రేలియాలో జెమినీ ఛాట్బోట్ చాలా కీలక సమ యంలో పిల్లలకు అందబాటులోకి వస్తోంది. ఎందుకంటే... పదహారేళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్లపై ఈ ఏడాది డిసెంబరు నుంచే నిషేధం అమలు కానుంది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూని యన్, యునైటెడ్ కింగ్డమ్లు 2023లో చేసిన ‘డిజిటల్ డ్యూటీ కేర్ చట్టం’ గురించి తెలుసుకోవడం అవసరం. గత ఏడాది నవంబరు నుంచి ఆస్ట్రేలియా ఈ చట్టం అమలును స్తంభింపజేసింది. హానికారక సమాచారం విషయంలో టెక్నాలజీ కంపెనీలనే బాధ్యులను చేస్తుందీ చట్టం!లీసా ఎం. గివెన్ వ్యాసకర్త ఆర్ఎంఐటీ యూనివర్శిటీ అధ్యాపకులు(‘ద కాన్వర్సేషన్ ’ సౌజన్యంతో) -
బిగ్బాస్ బ్యూటీ స్టన్నింగ్ లుక్.. ప్రీతిజింటాతో ఆర్జే మహ్వశ్..!
బిగ్బాస్ బ్యూటీ అశ్విని శ్రీ స్టన్నింగ్ లుక్..ప్రీతిజింటాతో కలిసి ప్యాలెస్లో ఆర్జే మహ్వశ్..ఆధ్యాత్మి బాటలో ఐశ్వర్య రాజేశ్...సండేను ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ రాశి ఖన్నా..కొరియాలో చిల్ అవుతోన్న సీనియర్ హీరోయిన్ మీనాసాగర్... View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
అనుష్కతో సన్నిహితంగా పెద్ద కుమారుడు.. లాలూ సంచలన నిర్ణయం
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది సేపటి క్రితం తన పెద్ద కుమారుడు తేజ ప్రతాప్ యాదవ్ను ఆర్జేడీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. తేజ్ ప్రతాప్ను ఆర్జేడీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. తేజ్ ప్రతాప్ను పార్టీ నుంచి బహిష్కరణకు కారణం శనివారం ఆయన ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టారు. ఆ సోషల్ మీడియా పోస్టే లాలూ కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. निजी जीवन में नैतिक मूल्यों की अवहेलना करना हमारे सामाजिक न्याय के लिए सामूहिक संघर्ष को कमज़ोर करता है। ज्येष्ठ पुत्र की गतिविधि, लोक आचरण तथा गैर जिम्मेदाराना व्यवहार हमारे पारिवारिक मूल्यों और संस्कारों के अनुरूप नहीं है। अतएव उपरोक्त परिस्थितियों के चलते उसे पार्टी और परिवार…— Lalu Prasad Yadav (@laluprasadrjd) May 25, 2025శనివారం తేజ్ ప్రతాప్ ఫేస్బుక్లో అకౌంట్లో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ఆ ఫొటోలో తేజ్ ప్రతాప్ ఓ యువతితో సన్నిహితంగా ఉన్నారు. ఆ యువతి పేరు అనుష్క యాదవ్ అని, తాము గత 12ఏళ్లుగా రిలేషన్లో ఉన్నట్లు ప్రకటించారు. ఆ పోస్టుపై దుమారం చెలరేగడంతో కొద్ది సేపటికే దానిని డిలీట్ చేశారు. తన ఫేస్బుక్ను ఎవరో హ్యాక్ చేశారన్నారు. ఆ పోస్టు తాను చేయలేదని స్పష్టం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. గతంలో, తేజ్ ప్రతాప్ యాదవ్, అనుష్క యాదవ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు,వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ये वीडियो भी फेक है? 🤔 pic.twitter.com/XdTgZHbZ8b— Ankur Singh (@iAnkurSingh) May 24, 2025దీంతో తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటనపై లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, సామాజిక న్యాయం కోసం పార్టీ (ఆర్జేడీ) సమిష్టి పోరాటాన్ని బలహీన పరుస్తోంది. తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవని ఎక్స్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, సామాజిక న్యాయం కోసం మన సమిష్టి పోరాటాన్ని బలహీన పరుస్తుంది. పెద్ద కుమారుడి కార్యకలాపాలు, ప్రజా ప్రవర్తన, బాధ్యతారహిత ప్రవర్తన మన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. అందువల్ల, పైన పేర్కొన్న పరిస్థితుల కారణంగా, నేను అతన్ని ఆరేళ్ల పార్టీ పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాను. నేటి నుంచి పార్టీకి, కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరిస్తున్నాను’ అని లాలూ యాదవ్ హిందీలో రాసిన పోస్ట్లో తెలిపారు.కాగా, తేజ్ ప్రతాప్ 2018లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి మధ్య విభేదాలు రావడంతో ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. -
మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)
-
గర్ల్ఫ్రెండ్ను పరిచయం చేసిన లాలూ కొడుకు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు, మాజీ మంత్రి తేజ్ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav) అందరినీ సర్ప్రైజ్ చేశారు. సింగిల్ స్టేటస్కు గుడ్బై చెబుతూ తన ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేశాడు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంచిన ఆమెను, తన ప్రేమను ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలియజేయడం గమనార్హం.అనుష్క యాదవ్(Anushka Yadav) అనే అమ్మాయితో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని, తాము గతకొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నామని తేజ్ప్రతాప్ యాదవ్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఎలా తెలియజేయాలో తెలియక ఇలా పోస్ట్ ద్వారా తెలియజేశానని, అంతా తనను అర్థం చేసుకుంటారని వెల్లడించారాయన. ఈ పోస్ట్ బీహార్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. కొందరు తేజ్ ప్రతాప్కు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. మరికొందరు వివాహం ఎప్పుడని ఆరా తీస్తున్నారు. ఇంకొందరు అనుష్క యాదవ్ నేపథ్యం కోసం తెగ వెతికేస్తున్నారు. ఆమె గురించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్న ఈ యువనేత.. తాను అక్కడ సింగిల్గా లేననే విషయాన్ని తాజా పోస్టుతో స్పష్టం చేశాడు.ఇదిలా ఉంటే.. మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్-రబ్రీదేవి జంటకు తొమ్మిది మంది సంతానం. ఆరుగురు కూతుళ్ల తర్వాత ఏడో సంతానంగా తేజ్ ప్రతాప్ యాదవ్ జన్మించాడు. చిన్న కొడుకు, మాజీ మంత్రి తేజస్వి యాదవ్ చివరి సంతానం. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్కు గతంలో వివాహం జరిగింది.బీహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య(Tej Pratap Yadav Wife Aishwarya)తో 2018లో తేజ్ ప్రతాప్ వివాహం అయ్యింది. అయితే ఆ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. తనను ఐశ్వర్య పట్టించుకోవడం లేదని తేజ్ ప్రతాప్, అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఐశ్వర్య ఐదు నెలలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తుండగా.. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. -
అర్ధరాత్రి నడిరోడ్డుపై డర్టీ పిక్చర్
అర్ధరాత్రి.. అదీ బిజీ రహదారిపై సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరించాడో ఒక్కడో రాజకీయ నేత. ఓ మహిళతో అభ్యంతకర రీతిలో కనిపించి చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం అతగాడి డర్టీ పిక్చర్(Dirty Picture) వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భోపాల్: మధ్యప్రదేశ్ మంద్సౌర్ జిల్లా బని గ్రామానికి బీజేపీ నేత మనోహర్లాల్ ధాకడ్(Manoharlal Dhakad) తీరుపై ఇటు రాజకీయ వర్గాలు, అటు సామాన్య ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ఆదమరిచి ఓ మహిళతో శృంగారం చేశాడు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో అందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డు కాగా, ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. అందులోని దృశ్యాల ప్రకారం.. తొలుత ఓ వైట్ కలర్ కార్ ఎక్స్ప్రెస్వే పక్కన వచ్చి ఆగింది. అందులోంచి నగ్నంగా ఉన్న ఓ మహిళ కిందకు దిగింది. ఆపై కిందకు దిగిన మనోహర్లాల్ ఆమెతో అభ్యంతరకర భంగిమలో రెచ్చిపోయాడు. మే 13వ తేదీ అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో మనోహర్పై విమర్శలు వెల్లువెత్తాయి. మనోహర్ బీజేపీ లోకల్ లీడర్ కాగా, ఆయన భార్య మంద్సౌర్ జిల్లా పంచాయితీ సభ్యురాలు.ఈ గలీజు వీడియోపై ఆయన స్పందన కోరేందుకు మీడియా ప్రయత్నించగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై జిల్లా బీజేపీ చీఫ్ రాజేష్ దీక్షిత్ స్పందించారు. మనోహర్లాల్కు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదని, ఆయన కేవలం ఆన్లైన్ సభ్యుడు మాత్రమేనని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై రాష్ట్ర స్థాయి బీజేపీ నేత ఒకరు స్పందించారు. ఇలాంటి వాళ్లకు పార్టీలో ఎట్టిపరిస్థితుల్లో చోటు ఉండబోదని స్పష్టం చేశారు. -
క్రీడాకారుల మధ్య అనుబంధం ఉండాలి
గచ్చిబౌలి: ఆటగాళ్లకు అభిమానులు అందించే ప్రోత్సాహం, ఉత్సాహం ఎంతో శక్తిని అందిస్తాయని, వీరి మధ్య అనుబంధం ఎప్పటికప్పుడు బలోపేతం అవుతూ ఉండాలని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్, అర్జున అవార్డ్ గ్రహీత పుల్లెల గోపీచంద్ అన్నారు. భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లను, అభిమానులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ‘ఫ్యాన్ లీ’ యాప్ ను గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ డిజిటల్ యుగంలో క్రీడాకారులపై సానుకూల ప్రభావాన్ని చూపించే విధంగా అభిమానులకు ఆరోగ్యకరమైన సమాచారాన్ని అందించే డిజిటల్ వేదికల అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘బ్యాడ్మింటన్ ఇండియా’ పేరుతో దేశంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లు, యువ ప్రతిభావంతులు, అభిమానులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం అనే ఆలోచనను అభినందించారు. సోషల్ మీడియా యుగంలో ఆటగాళ్లతో అభిమానుల సత్సంబంధాలు ఉండాలని, ట్రోలింగ్స్ వంటివి దూరం కావాలని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణలో ఫ్యాన్లీ సహ వ్యవస్థాపకులు శ్రీనివాసన్ బాబు, శరవణన్ కనగరాజు, శ్రీదేవి సిరాలతో పాటు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
లైంగిక దాడి నిందితుల విజయ యాత్ర.. మళ్లీ అరెస్ట్
సాక్షి బెంగళూరు/ శివాజీనగర: గ్యాంగ్ రేప్ కేసులో జైలు నుంచి బెయిల్పై విడుదలైన నిందితులు విజయ యాత్ర జరుపుకొన్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిని మళ్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని హావేరిలో జరిగింది.వివరాల ప్రకారం.. కర్ణాటకలో 2024 జనవరి 8న హానగల్ శివార్లలో ఓ వివాహితపై (26) గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో జైలుపాలైన 19 మందిలో 12 మందికి 10 నెలల క్రితమే బెయిల్ వచ్చింది. ప్రధానమైన ఏడుగురు నిందితులు అఫ్తాద్ చందన కట్టి, మదార్సాబ్ మండక్కి, సమీవుల్లా లాలనవర్, మొహమ్మద్ సాదిక్ అగసిని, షోయబ్ ముల్లా, తౌసిఫ్ చోటి, రియాజ్ సెవికేరిలకు మూడు రోజుల క్రితమే బెయిల్ మంజూరైంది.ఈ నేపథ్యంలో సబ్జైలు నుంచి విడుదలై తమ ఊరు హక్కి ఆలూరుకు వెళ్లారు. బంధుమిత్రులతో కలిసి ఐదు కార్లలో ఊరేగింపు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరలయ్యాయి. దారుణాలకు పాల్పడి ఉత్సవాలు చేసుకుంటారా? అంటూ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు బెయిల్ నిబంధనలను అతిక్రమించారంటూ ఏడుగురు నిందితులకుగాను ఐదుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 🚨 SHAMEFUL! Gang rape accused celebrate in a victory procession after securing BAIL in Haveri. Names — Mohammad Sadiq Agasimani, Shoib Mulla, Tausip Choti, Samiwulla Lalanavar, Aptab Chandanakatti, Madar Saab Mandakki, and Riyaz Savikeri. pic.twitter.com/ceSw4oiedL— Megh Updates 🚨™ (@MeghUpdates) May 23, 2025 -
బిగ్బాస్ బ్యూటీ దివి వన్సైడ్ లవ్.. రెడ్ శారీలో మెరిసిపోతున్న అదితిరావు హైదరీ!
హీరోయిన్ నివేదా థామస్ స్మైలీ లుక్..రెడ్ శారీలో మెరిసిపోతున్న అదితిరావు హైదరీ..వన్ సైడ్ లవ్ చేద్దామంటోన్న బిగ్బాస్ బ్యూటీ దివి..బర్త్ డే పార్టీ మూడ్లోనే యాంకర్ రష్మీ గౌతమ్..బీచ్లో బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ..కేన్స్లో దేవర భామ జాన్వీ కపూర్ సందడి.. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
కాఫీ తాగుతూ హీరోయిన్ నభా నటేశ్ చిల్.. స్టైలిష్ అవుట్ఫిట్లో శ్వేతాబసు ప్రసాద్..!
కాఫీ తాగుతూ చిల్ అవుతోన్న హీరోయిన్ నభా నటేశ్..స్టైలిష్ అవుట్ఫిట్లో శ్వేతాబసు ప్రసాద్..లండన్ వేకేషన్లో బాలీవుడ్ భామ అవనీత్ కౌర్...బ్లూ శారీలో యాంకర్ లాస్య హోయలు..కేన్స్ ఫెస్టివల్లో సందడి చేస్తోన్న ఊర్వశి రౌతేలా.. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
సోషల్ మీడియా పోస్ట్తో.. రూ. 14 కోట్ల జాబ్ పోయింది
లండన్: ఇంగ్లండ్ మాజీ ఫుట్బాల్ ఆటగాడు, కామెంటేటర్ గ్యారీ లినేకర్ (Gary Lineker) బీబీసీ వ్యాఖ్యాత స్థానం నుంచి వైదొలగనున్నాడు. సామాజిక మాధ్యమాల్లో జియోనిజానికి సంబంధించిన పోస్ట్ పెట్టిన కారణంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న గ్యారీ... ఇప్పుడు వ్యాఖ్యాతగా తప్పుకోనున్నాడు. మీడియా సెలబ్రిటీగా మంచి పేరున్న 64 ఏళ్ల లినేకర్... అత్యధిక పారితోషికం అందుకుంటున్న బ్రిటిష్ జాతీయ ప్రసారకుడిగా ఉన్నాడు. బీబీసీలో వ్యాఖ్యాతగా అతడు ఏడాదికి దాదాపు 1.7 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 14 కోట్ల 52 లక్షలు) ప్రతిఫలంగా పొందుతున్నాడు.‘జియోనిజం రెండు నిమిషాల్లో వివరించొచ్చు’ అనే క్యాప్షన్తో కూడిన ఎలుక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో లినేకర్పై విమర్శలు గుప్పుమన్నాయి. యూదు వ్యతిరేక భావజాలం కలిగిన ఇలాంటి పోస్టు పెట్టినందుకు లినేకర్ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ... బీబీసీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించినందుకు సోషల్ మీడియా పాలసీ (Social Media Policy) ప్రకారం అతడిపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 80 మ్యాచ్లాడిన లినేకర్... 48 గోల్స్ చేశాడు. 1986 ప్రపంచకప్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.చదవండి: భారత టాప్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై గగన్ నారంగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ -
ఫోర్బ్స్లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్
బాలీవుడ్ యువనటి నటి అనన్య పాండే) (Ananya Panday) తన కరియర్ ఒక కీలకమైన మైలురాయిని సాధించింది. 2025 ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించి అందర దృష్టిని ఆకర్షించింది. నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించి ఫో ర్బ్స్ ఆసియా పోస్ట్ను అనన్య ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే అనన్య బాయ్ ఫ్రెండ్గా భావిస్తున్నవాకర్ బ్లాంకో ఈ వార్తలపై స్పందించడం విశేషంగా నిలిచింది. అనన్యను అభినందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, క్లాప్స్ ఎమోజీతో స్పెషల్ వార్తను తన అభిమానులకు షేర్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా జాబితా 10వ ఎడిషన్ను ప్రకటించింది. ఇందులో ఆసియాలో అత్యంత ఆశాజనకమైన 300 మంది వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు , 30 ఏళ్లలోపు యంగస్టర్లను ఎంపిక చేసింది. 2025కి గాను ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో చోటు దక్కించుకున్నందుకు అనన్యపాండే, ఇషాన్ ఖట్టర్ ప్లేస్ దక్కించుకున్నారు.. ఈ సంవత్సరం బాలీవుడ్ నుండి ఎంపిక చేయబడిన కొద్దిమందిలో వీరిద్దరూ ఈ ఘనతను సాధించారు. దీంతో ఇద్దరిపై అభినందనలు వెల్లువెత్తాయి.2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తో అరంగేట్రం చేసిన అనన్య పాండే, విభిన్నమైన సినిమా పాత్రలు, నటనతోపాటు, తనదైన ష్యాషన్స్టైల్తో తన ప్రత్యేకతను చాటుకుంది. అనేకమది యువ అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి చాప్టర్ 2’ లోని నటనకు ప్రశంసలు దక్కిచంఉకుంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ఛానల్కు తొలి భారతీయ రాయబారిగా మారింది. స్టైల్ ఐకాన్గా ఆమె హోదాను మరింత సుస్థిరం చేసుకుంది. యువతలో సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడంపై దృష్టి సారించిన ఆమె ప్రచారమైన సో పాజిటివ్ను కూడా ప్రచారం చేస్తోంది. మరోవైపు, బియాండ్ ది క్లౌడ్స్తో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ధడక్తో ప్రధాన స్రవంతి దృష్టిని ఆకర్షించిన ఇషాన్ ఖట్టర్కి 2025లో ఒక కీలకమైన ఏడాదిగా మారింది. గ్లోబల్ సినిమాలు ప్రాజెక్టులతో పాటు, హోమ్బౌండ్ చిత్రంతో కాన్స్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇషాన్ ఇటీవలి మూవీలలో నెట్ఫ్లిక్స్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘ది రాయల్స్’, అంతర్జాతీయ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ‘ది పర్ఫెక్ట్ కపుల్’ ఉన్నాయి, View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)అనన్య పాండే వాకర్ బ్లాంకోల డేటింగ్ సందడిఅనన్య , వాకర్ మధ్య డేటింగ్ సందడి గత ఏడాదిలో(2024)నే ప్రారంభమైంది. ముఖ్యంగాఅనంత్ అంబానీ ,రాధిక మర్చంట్ వివాహంలో ఇద్దరూ కలిసి కనిపించినప్పుడు,వాకర్ను తన భాగస్వామిగా పరిచయం చేసిందని బాంబే టైమ్స్ నివేదిక వెల్లడించింది. అలాగే అనన్య 26వ పుట్టినరోజు (అక్టోబర్ 30, 2024న వాకర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అనన్యకు పుట్టిన రోజు విషెస్ తెలుపుతూ నువ్వు చాలా స్పెషల్.. ఐ లవ్ యూ అన్నీ.. అంటూ ఒక సందేశాన్ని, బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేయడంతో ఈ పుకార్ల జోరు మరింత పెరిగింది. 2018లో మనీష్ మల్హోత్రా కార్యక్రమంలో ఆదిత్య కపూర్ కలిసిన అనన్య అతనితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల డేటింగ్ తరువాత వీరిద్దరూ ప్రస్తుతం విడిపోయినట్టు తెలుస్తోంది.వివిధ పరిశ్రమలలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది ప్రభావవంతమైన యువతీయువకుల జాబాతాను ప్రకటిస్తుంది. ఫోర్బ్స్. 2011 నుండి 30 అండర్ 30 జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. -
ఛీ ఛీ.. ఈమె టీచరేనా.. బాలుడి జీవితం సర్వనాశనం!
మాస్కో: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ వివాహిత టీచర్.. విద్యార్థితో అనుచితంగా ప్రవర్తించింది. 11 ఏళ్ల బాలుడితో హద్దులు దాటి ప్రవర్తించింది. సదరు బాలుడిని లైంగికంగా వేధింపులకు గురిచేసి.. తన శారీరక అవసరాలను తీర్చుకుంది. ఈ విషయం బాలుడి తల్లికి తెలియడంతో.. ఆమె వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో, ఆమెకు తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ దారుణ రష్యాలో చోటుచేసుకుంది. ఈ మేరకు ది న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది.వివరాల ప్రకారం.. రష్యాలో ఉన్న సెయింట్ పీటర్స్బర్గ్ ఉత్తర శివారులోని పాఠశాలలో అన్నా ప్లాక్సుక్ (27) టీచర్లో పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థి(11)తో ఆమె అనుచితంగా ప్రవర్తించారు. ఆమె శారీరక అవసరాల కోసం అతడిలో లైంగిక వాంఛలకు ప్రేరేపించారు. క్లాస్రూమ్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన శారీరాన్ని తాకే విధంగా ప్రవర్తించింది. అతడి పెదవులను సైతం ముద్దాడింది. అంతేకాకుండా సదరు విద్యార్థికి వాట్సాప్లో ఆమె నగ్న చిత్రాలను పంపించింది. మెసేజ్లు చేయడం, వీడియోలు పంపించడం చేసింది. దీంతో, బాలుడు.. ఆమె చేసే పనులను అడిక్ట్ అయిపోయాడు.ఒకానొక సమయంలో బాలుడు.. ఇంట్లో ఉండగా వింతగా ప్రవర్తించాడు. అనుమానం వచ్చిన అతడి తల్లి.. ఫోన్ చెక్ చేయడంతో టీచర్ బండారం బయటకు వచ్చింది. దీంతో, ఆమెను పేరెంట్స్ నిలదీశారు. పాఠశాల ప్రిన్సిపాల్కు టీచర్పై తల్లి ఫిర్యాదు చేసింది. అనంతరం, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు టీచర్ ప్లాక్సుక్కు తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఒక సంవత్సరం పాటు బోధించకుండా నిషేధం విధించింది.Shocking: Anna Plaksyuk, a 27-year-old married primary school teacher from Toksovo, Russia, sentenced to 9 years for sexually abusing an 11-year-old boy. The “dream teacher” sent naked selfies, exposed by the victim’s mother. Justice served! pic.twitter.com/SXv0WrZHxs— Make Europe Great Again - M.E.G.A (@ScaryEurope) May 16, 2025 -
ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్బాస్ ఫేం
మలయాళ టీవీ నటి, యాంకర్ బిగ్బాస్ ఫేం ఆర్య బాబు (ఆర్య బదై) తన జీవితంలో సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఎట్టకేలకు తన ప్రేమ రెండో పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆర్య బడై బంగ్లా ఫేమ్, ప్రాణ స్నేహితుడు, వెడ్డింగ్ డిజైనర్ సిబిన్ బెంజమిన్తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ఇద్దరూ ఇన్స్ట పోస్ట్ ద్వారా వెల్లడించారు. అలాగే ప్రేమపూర్వక సందశాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో పంచుకున్నారు. దీంతో ఇద్దరికీ ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. 'ది బెస్ట్ అన్ ప్లాన్డ్ థింగ్' అంటూ ఆర్య తన ఎంగేజ్మెంట్ వార్తను అభిమానులతో షేర్చేసింది. మలయాళం బిగ్ బాస్ 2 లో ఆర్య, సిబిన్ కలిసి పాల్గొన్నారు. ఆర్య తన కాబోయే భర్తతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!‘‘సిబిన్ సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాను. ప్రాణ స్నేహితుల నుండి జీవితాంతం సహచరులుగా... జీవితం ఒకే ఒక సాధారణ ప్రశ్నతో , నా మొత్తం జీవితంలో నేను తీసుకున్న వేగవంతమైన నిర్ణయంతో అత్యంత నమ్మశక్యం కాని, అందమైన మలుపు తీసుకుంది. ఇది అస్సలు ప్లాన్ చేసుకోని విషయం... ఆనందంలో, బాధలో తోడుంటే వ్యక్తిగా, నా కూతురు ఖుషీకి ఉత్తమ తండ్రిగా, స్నేహితుడిగా,మా మొత్తం కుటుంబానికి బలమైన సపోర్ట్గా ఉన్నందుకు ధన్యవాదాలు. చివరకు నేను సంపూర్ణం.. నా గృహం నీచేతుల్లో..’’ అని పోస్ట్ పెట్టింది ఆర్య.ఇదీ చదవండి: బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!అటు సిబిన్ కూడా ఆర్య కోసం ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ఫోటోను షేర్ చేశాడు. ఆర్యను ముద్దుగా 'చోక్కి' అని పిలుస్తాడు. ఆర్య లాగే,. ర్యాన్ , ఖుషీ ఇద్దరికీ తండ్రిగా ఉన్నందుకు సంతోషిస్తూ, సిబిన్ ఇలా వ్రాశాడు: "నేను జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను - అవి తరచుగా నన్ను కోల్పోయేలా, విచ్ఛిన్నం చేసేలా చేశాయి. కానీ ప్రతి తుఫానులో, ఎలాంటి శషబిషలు లేకూడా నాతో నిలిచిన వ్యక్తి. అదే ఆమె - నా ప్రాణ స్నేహితురాలు. గందరగోళంలో నాకు ప్రశాంతత, నిశ్శబ్దంలో నా నవ్వు, నా ఓదార్పు - నా చోక్కీ... నా చోక్కీ, నా కొడుకు ర్యాన్ ,నా కుమార్తె ఖుషీతో హృదయపూర్వకంగా, ఎప్పటికీ అంతం జీవితం ప్రారంభించబోతున్నాను. దేవా, నాకు నా శాశ్వతత్వాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.కాగా కాంచీవరం.ఇన్కు ఫౌండర్ సీఈవోగా ఉంది ఆర్యం. ఆర్య గతంలో రోహిత్ సుశీలన్ను వివాహం చేసుకుంది. వీరికి ఖుషీ (13) అనే కుమార్తె ఉంది. పెళ్లైన పదేళ్లకు 2018లో ఆర్య, రోహిత్ విడిపోయారు. ఆ తరువాత ప్రముఖ వివాహ డీజే సిబిన్తో ప్రేమలో పడింది. వీరు చాలా సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు. తమ సంబంధాన్ని చాలావరకు గోప్యంగా ఉంచారు, ఎట్టకేలకు తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సిబిన్కు కూడా మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు ర్యాన్ ఉన్నాడు.