పిల్లలకు సోషల్ మీడియా వద్దు.. యూకే ఎంపీల డిమాండ్‌ | UK MPs Demand Ban on Social Media for Children Under 16 | Sakshi
Sakshi News home page

పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. యూకే ఎంపీల డిమాండ్‌

Jan 20 2026 4:36 AM | Updated on Jan 20 2026 4:41 AM

UK MPs Demand Ban on Social Media for Children Under 16

లండన్: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ బ్రిటన్‌లోని అధికార లేబర్ పార్టీకి చెందిన 61 మంది ఎంపీలు ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధాని సర్ కీర్ స్టామర్‌ను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో, పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

డెన్మార్క్, ఫ్రాన్స్, నార్వే, న్యూజిలాండ్, గ్రీస్ వంటి దేశాలు ఇప్పటికే ఇలాంటి చట్టాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయని ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. బ్రిటన్ కూడా ఈ దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ అంశంపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కన్జర్వేటివ్ పార్టీతో పాటు లిబరల్ డెమోక్రాట్లు కూడా తమ మద్దతు ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీ నేత కెమి బాడ్నోచ్ ఇటీవల పార్లమెంట్‌లో మాట్లాడుతూ, తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 16 ఏళ్లలోపు పిల్లలందరికీ సోషల్ మీడియాపై నిషేధం విధిస్తామని ప్రకటించారు.

ఈ పరిణామాలతో అధికార లేబర్ ఎంపీల డిమాండ్‌కు ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీనిపై స్పందించిన ప్రధాని కీర్ స్టామర్, ప్రభుత్వం ఈ అంశాన్ని ఓపెన్ మైండ్‌తో పరిశీలిస్తోందని, అన్ని అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement