జగనన్న 2.0 లోడింగ్‌ | YS Jagan visit to Guntur is trending on social media | Sakshi
Sakshi News home page

జగనన్న 2.0 లోడింగ్‌

Feb 5 2026 5:02 AM | Updated on Feb 5 2026 5:02 AM

YS Jagan visit to Guntur is trending on social media

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటన

హోరెత్తిన జనహృదయ విజేత పేరు 

అదరని, బెదరని గుండె అది అంటూ పోస్టులు వైరల్‌  

గ్రూపుల్లో షేర్‌ చేస్తూ షేక్‌ చేస్తున్న నెటిజన్లు

సాక్షి, అమరావతి: ‘జగనన్న 2.0 లోడింగ్‌’.. అంటూ సామాజిక మాధ్యమాల్లో వైఎస్‌ జగన్‌ పేరు హోరెత్తిపోతోంది. మాజీ మంత్రి అంబటిపైనా, ఆయన ఇంటిపైనా కూటమి రౌడీ మూకల దాడి నేపథ్యంలో ఆయన కు­టుంబాన్ని పరామర్శించడాని­కి వైఎస్‌ జగన్‌ బుధవారం గుంటూరు వెళ్లారు. ఈ సందర్భ­ంగా ఉవ్వెత్తున జన అభిమాన తరంగం ఎగిసిపడింది. కార్యకర్తలకు జగన్‌ అండగా ఉంటాడని, ఎవరికీ భయపడేది లేదనే మీమ్స్‌ను నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు. 

జగన్‌ కాన్వాయ్‌ వీడియోలను వైరల్‌ చేస్తున్నారు. జగన్‌ పర్యట­నకు జనం భారీ స్థాయిలో రావడం అనేది సహజం. కానీ అంతే స్థా­యిలో ఇ­ప్పు­­డు సోషల్‌ మీడియాలోనూ ఆయనకు మద్దతు లభిస్తుండటం, వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో, వాటి గ్రూపుల్లో లెక్కకు మించి జగన్‌ పర్యటనపై పోస్టులను నెటిజన్లు షేర్‌ చేస్తుండటం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement