వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి జనాదరణ ఎలా ఉంటుందో మరోసారి కూటమి ప్రభుత్వానికి తెలిసొచ్చింది. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని పరిశీలించి.. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ గుంటూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో దారిపొడవునా జననేతకు జనం నీరాజనం పలికారు. పూల వర్షం కురిపించి.. ఆయనతో కరచలనం కోసం, ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. ఆ అభిమానాన్ని అంతే ఆప్యాయంగా ఆయన అభివాదాలతో స్వీకరించారు.


