Cricket
-
‘అంపైర్ కూడా డబ్బులు తీసుకుంటున్నాడు.. నీకెందుకంత తొందర?!’
గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు పూర్తి చేసుకున్న కమిన్స్ బృందం కేవలం రెండు మాత్రమే గెలిచింది. తద్వారా కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.ఇక సన్రైజర్స్ శుక్రవారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH)తో తలపడనుంది. చెపాక్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ నుంచి వరుసగా విజయాలు సాధిస్తేనే కమిన్స్ బృందానికి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్లో సన్రైజర్స్ సొంత మైదానం ఉప్పల్లో ముంబై ఇండియన్స్తో తలపడిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్లో రైజర్స్ ముంబై చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రైజర్స్.. ఆది నుంచే తడ‘బ్యా’టుకు గురైంది. ముంబై బౌలర్ల ధాటికి టాపార్డర్ పెవిలియన్కు క్యూ కట్టింది.ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదంఓపెనర్లు ట్రవిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (8) పూర్తిగా విఫలం కాగా.. ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదంతో వికెట్ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. రైజర్స్ ఇన్నింగ్స్లో మూడో ఓవర్ను దీపక్ చహర్ వేయగా.. బంతిని డౌన్ ది లెగ్ ఆడేందుకు ఇషాన్ ప్రయత్నించాడు.ఈ క్రమంలో బంతి వికెట్ కీపర్ రియాన్ రికెల్టన్ చేతిలో పడింది. అయితే, బాల్ ఇషాన్ బ్యాట్ లేదంటే గ్లౌవ్స్ను తాకిందా లేదా అన్న సందేహంతో ముంబై బౌలర్గానీ, వికెట్ కీపర్గానీ అప్పీలు చేయలేదు.అంపైర్ కూడా వెంటనే ఏ నిర్ణయానికీ రాలేదు. కానీ ఇంతలోనే తాను అవుటయ్యాయని ఫిక్స్ అయి ఇషాన్ క్రీజును వీడాడు. ఏం జరిగిందో అర్థం కాని అంపైర్.. అవుట్ ఇచ్చేందుకు వేలు పైకెత్తాలా అన్న సందిగ్దంలో ఆఖరికి అవుట్ ఇచ్చాడు.అయితే, రీప్లేలో మాత్రం ఇషాన్ కిషన్ నాటౌట్ అని తేలింది. దీంతో ఇషాన్ అమ్ముడుపోయాడంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఇక ఈ ఘటనపై భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు.అంపైర్ కూడా డబ్బులు తీసుకుంటున్నాడు‘‘చాలాసార్లు ఇలాగే మెదడు పనిచేయడం ఆగిపోతుంది. నిజంగా ఇదొక మతిలేని చర్య. కాసేపు ఆగితే ఏమయ్యేది?.. అంపైర్ కూడా తాను చేస్తున్న పనికి డబ్బు తీసుకుంటున్నాడు కదా!అతడు తన నిర్ణయం ప్రకటించేదాకానైనా ఎదురుచూడాలి. తన పనిని తనను చేసుకోనివ్వాలి. ఇదేం రకమైన నిజాయితీయో నాకైతే అర్థం కావడం లేదు. క్రీడాస్ఫూర్తిని పాటిస్తున్నానని అతడు ఇలా చేసి ఉండవచ్చు, కానీ అవుట్ కాకుండానే వెళ్లిపోవడం.. అది కూడా అంపైర్ను తికమకపెట్టేలా వ్యవహరించడం సరికాదు. హఠాత్తుగా అతడు అలా ఎందుకు వెళ్లిపోయాడో తెలియడం లేదు’’అంటూ సెహ్వాగ్ ఇషాన్కు చురకలు అంటించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) వల్ల ఈమాత్రం పరువునిలుపుకోగలిగింది. సన్రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది.చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు! Fairplay or facepalm? 🤯 Ishan Kishan walks... but UltraEdge says 'not out!' What just happened?!Watch the LIVE action ➡ https://t.co/sDBWQG63Cl #IPLonJioStar 👉 #SRHvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bQa3cVY1vG— Star Sports (@StarSportsIndia) April 23, 2025 -
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన చాలా మంది ఆటగాళ్లు.. అంతే త్వరగా కనుమరుగైపోయిన దాఖలాలు ఉన్నాయన్నాడు. కాబట్టి వైభవ్ ఆచితూచి అడుగేస్తూ కెరీర్ ప్లాన్ చేసుకోవాలని సూచించాడు.రూ. 1.10 కోట్లకుదేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్- 2025 (IPL 2025) మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ రాజస్తాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా వైభవ్కు అరంగేట్రం చేసే అవకాశం కూడా ఇచ్చింది.తొలి బంతినే సిక్సర్గా మలిచాడుకెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో వైభవ్ వచ్చాడు. టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్తో కలిపి రాజస్తాన్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. లక్నోతో మ్యాచ్ సందర్భంగా అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టిన క్రికెటర్గా చరిత్రకెక్కిన ఈ బిహార్ కుర్రాడు.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు.అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది క్రికెటర్ల జాబితాలో వైభవ్ చేరిపోయాడు. ఆ మ్యాచ్లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 34 పరుగులు సాధించాడు. ఇక తాజాగా గురువారం ఆర్సీబీతో మ్యాచ్లోనూ వైభవ్ దూకుడుగానే ఆడాడు. రెండు సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేసి నిష్క్రమించాడు.కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడుఈ పరిణామాల నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘బాగా ఆడితే ప్రశంసిస్తారని.. ప్రదర్శన బాగా లేకుంటే విమర్శిస్తారని తెలిసిన ఆటగాడు గర్వం తలకెక్కించుకోకుండా ఉంటాడు. అతడి కాళ్లు భూమ్మీదే ఉంటాయి.కానీ చాలా మంది ఆటగాళ్లు.. ఒకటీ- రెండు మ్యాచ్ల ద్వారా ఫేమస్ అయిన వెంటనే దారి తప్పుతారు. తాము స్టార్ ప్లేయర్ అయిపోయామనే భ్రమలో ఆ తర్వాత కనీస ప్రదర్శన కూడా చేయలేకపోతారు.ఇక సూర్యవంశీ విషయానికొస్తే.. అతడు మరో 20 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడాలనే లక్ష్యంతో ఉండాలి. విరాట్ కోహ్లిని చూడండి.. తను 19 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పటికి 18 సీజన్లు పూర్తి చేసుకున్నాడు.కోహ్లి మాదిరే సూర్యవంశీ ఎదిగేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా.. ఈ ఐపీఎల్ సీజన్లో సాధించిన దానితో సంతోషపడి.. నేను కోటీశ్వరుడిని.. నా అరంగేట్రమే అద్భుతం.. తొలి బంతికే సిక్స్ కొట్టాను.. అనే ఆలోచనలతో ఉంటే.. బహుశా వచ్చే ఏడాది మనం అతడిని చూసే అవకాశం ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో మ్యాచ్లో రాజస్తాన్ ఆఖరి వరకు పోరాడి 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా బెంగళూరు జట్టు ఈ సీజన్లో సొంత మైదానంలో తొలి విజయం సాధించగా.. రాజస్తాన్ తొమ్మిదింట ఏడు పరాజయాలు నమోదు చేసి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: క్రెడిట్ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025 -
పాకిస్తాన్ ఉప ప్రధాని వ్యాఖ్యలు.. మండిపడ్డ పాక్ మాజీ క్రికెటర్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) స్పందించాడు. ఇషాక్ మాటలను బట్టి తాము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు పాక్ అంగీకరించినట్లు స్పష్టమైందన్నాడు. కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే.బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపిన తీవ్రవాదులు.. 26 మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత్కు సంఘీభావం ప్రకటించాయి. పాకిస్తాన్ కూడా పహల్గామ్ దాడిని ఖండించింది.స్వాతంత్ర్య సమరయోధులా?అయితే, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో దాడులు చేసిన ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా అభివర్ణించాడు. దీంతో ఇషాక్ దార్ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు భగ్గుమంటున్నారు.నేరుగా ఒప్పుకోవడమేఈ క్రమంలో పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా ఇషాక్ దార్ తీరుపై ఘాటుగా స్పందించాడు. ఎక్స్ వేదికగా అతడి వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘పాకిస్తాన్ ఉప ప్రధానే స్వయంగా ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు అని పిలుస్తుంటే.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు.ఇది కేవలం సిగ్గుచేటు మాత్రమే కాదు.. తమ దేశం ఉగ్రవాదానికి దన్నుగా ఉందని నేరుగా ఒప్పుకోవడమే అవుతుంది’’ అని కనేరియా ట్వీట్ చేశాడు. కాగా పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కనేరియా.. జట్టులో ఉన్నపుడు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని గతంలో చాలాసార్లు వెల్లడించాడు.అవమానాలు ఎదుర్కొన్నాహిందువును అయిన కారణంగా తనను సహచర క్రికెటర్లు వేరుగా చూస్తూ.. హేళన చేస్తూ ఇబ్బందులు పెట్టేవారని తెలిపాడు. పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కూడా కనేరియా జట్టులో ఉండటం చాలామందికి నచ్చేదికాదని పేర్కొనడం గమనార్హం.ఇక అంతర్జాతీయ క్రికెట్లో 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన 44 ఏళ్ల కనేరియా.. ఆయా ఫార్మాట్లలో 261, 15 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల నేపథ్యంలో ప్రస్తుతం యూకేలో అతడు నివాసం ఉంటున్నట్లు సమాచారం.కాగా పహల్గామ్లో ఉగ్రదాడి జరగగానే కనేరియా స్పందించాడు. పాకిస్తాన్ హస్తం గనుక లేకపోతే.. పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు వెంటనే ఈ దాడిని ఖండించలేదని ప్రశ్నించాడు. పాక్ ప్రభుత్వమే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి పెంచి పోషిస్తోందని ఆరోపించాడు.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..When the Deputy Prime Minister of Pakistan calls terrorists “freedom fighters,” it’s not just a disgrace — it’s an open admission of state-sponsored terrorism. pic.twitter.com/QlS1UDzq20— Danish Kaneria (@DanishKaneria61) April 24, 2025 -
చరిత్ర సృష్టించిన జైస్వాల్.. ఐపీఎల్లో తొలి ప్లేయర్గా..
రాజస్తాన్ రాయల్స్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఇంత వరకు సాధ్యం కాని రికార్డు సాధించాడు. ఎదుర్కొన్న మొదటి బంతికే మూడుసార్లు సిక్సర్ బాదిన ఏకైక బ్యాటర్గా అరుదైన ఘనత సాధించాడు.రాయాల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్ సందర్భంగా జైస్వాల్ గురువారం ఈ ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఆర్సీబీ- రాజస్తాన్ (RCB vs RR) గురువారం తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.205 పరుగులుఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (26) ఫర్వాలేదనిపించగా.. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 70) దంచికొట్టాడు. దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 50), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 23), జితేశ్ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. జైస్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసేందుకు ఆర్సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రంగంలోకి దిగగా.. తొలి బంతినే జైసూ సిక్సర్గా మలిచాడు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్స్ కొట్టిన క్రికెటర్ల జాబితాలో ఉన్న జైసూ.. మూడుసార్లు ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో జైస్వాల్ మొత్తంగా 19 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఏకంగా 49 పరుగులు రాబట్టాడు. అయితే, జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో రొమారియో షెఫర్డ్కు క్యాచ్ ఇవ్వడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్కు తెరపడింది.అంతేకాదు.. రాజస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా పతనమైంది. నితీశ్ రాణా (28), రియాన్ పరాగ్ (22), ధ్రువ్ జురెల్ (47) పోరాడినా.. 20 ఓవర్లలో రాజస్తాన్ 194 పరుగులే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఐపీఎల్లో తొలి బంతికే సిక్సర్లు బాదిన క్రికెటర్లు1.యశస్వి జైస్వాల్- 32. నమన్ ఓజా-13. మయాంక్ అగర్వాల్- 14. సునిల్ నరైన్- 15. విరాట్ కోహ్లి- 16. రాబిన్ ఊతప్ప- 17. ఫిల్ సాల్ట్- 18. ప్రియాన్ష్ ఆర్య- 1.చదవండి: ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా విరాట్ కోహ్లి ఘనత Woke up and said Pehla ball, JaisBall 🔥 pic.twitter.com/pg4w29Jl2G— Rajasthan Royals (@rajasthanroyals) April 24, 2025 -
క్రెడిట్ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం సాధించింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. తద్వారా ఈ సీజన్లో హోం గ్రౌండ్లో తొలి గెలుపు నమోదు చేసి విమర్శలకు చెక్ పెట్టింది.క్రెడిట్ మొత్తం వారికేఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) హర్షం వ్యక్తం చేశాడు. విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మేము సత్ఫలితం రాబట్టాము. ఈరోజు వికెట్ కాస్త భిన్నంగా ఉంది. అయినా మా బౌలర్లు అద్భుతంగా రాణించారు.ఈ గెలుపులో క్రెడిట్ మొత్తం వారికే దక్కుతుంది. పదో ఓవర్ తర్వాత వారు చూపిన తెగువ అద్భుతం. ఇక ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు కూడా ఎంతో చక్కగా బ్యాటింగ్ చేశారు. వాళ్లకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.గొప్ప నాయకులు ఉన్నారు.. కానీమేము వికెట్ల వేటలో ఉన్న వేళ మా మనసు చెప్పినట్లు విన్నాను. పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసినపుడే వికెట్లు కూడా తీయగలుగుతాం. జట్టులో ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు. వారిచ్చే సలహాలు, సూచనలు కూడా నన్ను నేను మెరుగుపరచుకునేందుకు దోహదం చేస్తాయి. అయితే, నా ప్రణాళికలకు అనుగుణంగానే నేను ముందుకు వెళ్తాను’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.కోహ్లి, పడిక్కల్ ధనాధన్కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు సాధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (42 బంతుల్లో 70), దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 50), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 23), జితేశ్ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్) రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్కు శుభారంభం లభించింది.జైసూ విధ్వంసంఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 49 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, జైసూ అవుటైన తర్వాత సీన్ మారిపోయింది. అంతకుముందు.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 16 పరుగులకే నిష్క్రమించగా.. నితీశ్ రాణా(28), కెప్టెన్ రియాన్ పరాగ్ (22) నిరాశపరిచారు.చెలరేగిన హాజిల్వుడ్ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (34 బంతుల్లో 47) విజయంపై ఆశలు పెంచాడు. అయితే, 20 ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు నష్టపోయిన రాజస్తాన్ 194 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా 11 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ నాలుగు వికెట్ల(4/33) చెలరేగగా.. కృనాల్ పాండ్యా రెండు, భువనేశ్వర్కుమార్, యశ్ దయాళ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఆడిన తొమ్మిది మ్యాచ్లలో ఇది ఆరో విజయం. ఈ నేపథ్యంలో పన్నెండు పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు.. తొమ్మిదింట ఏడు ఓడిన రాజస్తాన్ నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨 that speak louder than words 🥳#TATAIPL | #RCBvRR | @imVkohli | @RCBTweets pic.twitter.com/Q4B09fkllE— IndianPremierLeague (@IPL) April 24, 2025 -
మీరేం సాధించారు?.. మరో 78 వేల ఏళ్లైనా ఇదే పరిస్థితి: గావస్కర్ ఫైర్
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన (Pahalgam Incident) నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. డెబ్బై ఎనిమిదేళ్లుగా ఒక్క మిల్లీ మీటర్ భూమి కూడా చేతులు మారలేదని.. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. మరి అలాంటప్పుడు శాంతియుత జీవనం గడపకుండా.. అమాయకుల ప్రాణాలు తీస్తే వచ్చే లాభమేమిటంటూ తీవ్రవాదులకు చురకలు అంటించారు.బైసరన్ లోయలోఉగ్రవాదులు, వారికి మద్దతుగా నిలిచే వారు ఇకనైనా వాస్తవాన్ని గుర్తించి.. ఇలాంటి పిరికిపంద చర్యలను చాలించాలని గావస్కర్ సూచించారు. కాగా జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్లో ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుగాంచిన బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26 మంది మృతి చెందారు. బాధితులకు అండగాఈ నేపథ్యంలో తీవ్రవాదుల చర్యను క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మనమంతా ఒక్కటిగా ఉండి... బాధితులకు అండగా నిలవాల్సిన అవసరముందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, అనీల్ కుంబ్లే, రవిశాస్త్రి, శ్రీవత్స గోస్వామి, టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్, స్టార్ షట్లర్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ నిఖత్ జరీన్, పీఆర్ శ్రీజేశ్ తదితరులు ఉగ్రవాదుల దాడిని ఖండించారు. అంతేకాదు.. పాకిస్తాన్తో క్రీడా సంబంధాలు ఎప్పటికీ పునరుద్ధరించకూడదని పలువురు ప్లేయర్లు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సునిల్ గావస్కర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భారతీయులందరిపై దీని ప్రభావం ఉంటుంది.మరో 78 వేల ఏళ్లు గడిచినా ఇదే పరిస్థితిదుశ్చర్యలకు పాల్పడేవారిని, వారికి మద్దతునిచ్చే వారిని నేను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా.. ఇలాంటి పనుల వల్ల మీరు ఏం సాధించారు? ఇకపై ఏం సాధిస్తారు?గత 78 ఏళ్లుగా ఒక్క మిల్లీ మీటర్ భూభాగం కూడా చేతులు మారలేదు. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాదు. మరి అలాంటపుడు శాంతియుతంగా జీవిస్తూ.. దేశాభివృద్ధిపైన దృష్టి పెట్టడం మంచిది కదా! దయచేసి ఇకనైనా పిరికిపంద చర్యలు మానుకుని.. బుద్ధిగా ఉండండి’’ అని ఉగ్రవాదులకు హితవు పలికారు.చదవండి: PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక.. -
PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అసలే అంతంత మాత్రంగా కొనసాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రసారాలు భారత్లో బంద్ అయిపోయాయి. పాక్ బోర్డుకు చెందిన పీఎస్ఎల్ టోర్నీని భారత్లో ప్రసారం చేస్తున్న ‘ఫ్యాన్ కోడ్’ మొబైల్ స్ట్రీమింగ్ సంస్థ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గావ్ ఘటన నేపథ్యంలో భారత్లో ఇకపై పీఎస్ఎల్ టోర్నీ ప్రసారం చేయమని ప్రకటించింది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తూ పీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్లను ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు ‘ఫ్యాన్ కోడ్’ వెల్లడించింది. మరోవైపు పీఎస్ఎల్ టోర్నీ కోసం పాకిస్తాన్లో ఉండి మ్యాచ్ల ప్రసారానికి సంబంధించిన వేర్వేరు సాంకేతిక విభాగాల్లో పని చేస్తున్న భారతీయులను వెనక్కి పంపాలని ఆ దేశ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. భారత్కు చెందిన దాదాపు రెండు డజన్ల మంది పీఎస్ఎల్లో ఇంజినీర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, కెమెరామెన్లు, ప్లేయర్ ట్రాకింగ్ ఎక్స్పర్ట్లుగా పని చేస్తున్నారు. రెండు రోజుల్లోగా వీరంతా దేశం వీడాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. నిషేధం కొనసాగుతుంది: బీసీసీఐమరోవైపు- టీమిండియా- పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లపై ఉన్న నిషేధం ఇక ముందు కూడా కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఉండవని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, పాక్ మధ్య 2013లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తినడంతో ఆ తర్వాత ఎలాంటి సిరీస్ను నిర్వహించలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెండు జట్లూ తలపడుతూ వస్తున్నాయి. తాజాగా కశ్మీర్లోని పహల్గాంలో పాక్ తీవ్రవాదుల చేతుల్లో 26 మంది భారత పర్యాటకులు మరణించిన నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్లపై మళ్లీ చర్చ మొదలైంది. ‘పాక్తో క్రికెట్ సిరీస్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. వారు చెప్పిందే మేం వింటాం. కాబట్టి ఇకపై కూడా పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అవకాశం లేదు.ఐసీసీతో ఒప్పందాల కారణంగానే వేర్వేరు టోర్నీల్లో ఆ జట్టుతో తలపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అవగాహన ఉన్న ఐసీసీ కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. ఇకపై ఏదైనా ఐసీసీ టోర్నీ వచ్చినపుడు తగిన విధంగా స్పందిస్తాం’ అని రాజీవ్ శుక్లా వివరించారు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినా... టీమిండియా అక్కడికి వెళ్లలేదు. తటస్థ వేదిక దుబాయ్లోని అన్ని మ్యాచ్లు ఆడింది. పాక్ను లీగ్ దశలో ఓడించడం సహా టోర్నీ చాంపియన్గా నిలిచింది. చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
CSK vs SRH: గెలిచి నిలిచేనా!
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్లో పరాజయలతో సతమతమవుతోన్న గత ఏడాది రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)... ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మాజీ చాంపియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లు ఎనిమిదేసి మ్యాచ్లు ఆడి... 2 విజయాలు, 6 పరాజయాలతో నాలుగేసి పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. పట్టికలో సన్రైజర్స్ తొమ్మిదో స్థానంలో ఉండగా... చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన అన్నీ మ్యాచ్ల్లోనూ విజయం తప్పనిసరి అయిన నేపథ్యంలో... ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. చెన్నై జట్టు ఈ ఏడాది కనీస ప్రదర్శన కనబర్చలేక ఇబ్బంది పడుతుంటే... బ్యాటర్ల వైఫల్యంతో హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంటోంది. ఇరు జట్లకు మరో ఆరేసి మ్యాచ్లు మిగిలి ఉండగా... అన్నీ మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తేనే సులువుగా ప్లే ఆఫ్స్కు చేరే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో... స్పిన్కు అనుకూలించే అవకాశం ఉన్న పిచ్పై హైదరాబాద్ను పడగొట్టి ముందంజ వేయాలని ధోనీ సారథ్యంలోని చెన్నై భావిస్తోంది.మరోవైపు బ్యాటింగ్ లోపాలను సరిచేసుకొని తిరిగి భారీ స్కోర్లతో విజృంభించాలని ఎస్ఆర్హెచ్ చూస్తోంది. బుధవారమే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ముంబై చేతిలో ఓటమి మూటగట్టుకున్న రైజర్స్... 48 గంటలు తిరిగేసరికి చెన్నైతో మ్యాచ్కు రెడీ అయింది. మరి ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో పరాజయాలతో సహవాసం చేస్తున్న ఇరు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి! తీవ్ర ఒత్తిడిలో ధోనీ సేన... సాధారణంగా చెపాక్లో మ్యాచ్ అంటే... చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగడం పరిపాటి. అయితే ఈ సీజన్లో మాత్రం ఫలితాలు అందుకు భిన్నంగా వస్తున్నాయి. ధోని సేన స్పిన్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుంటంతో ఆ జట్టుకు పరాజయాలు తప్పడం లేదు. కోల్కతాతో మ్యాచ్లో అయితే చెన్నై మరీ నాసిరకం ఆటతీరు కనబర్చింది. క్రీజులో నిలవడమే తెలియదన్నట్లు బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరమవడంతో... జట్టు పగ్గాలు అందుకున్న ధోని కూడా సీఎస్కే రాత మార్చలేకపోతున్నాడు. టాపార్డర్లో ధాటిగా ఆడే బ్యాటర్ లేకపోవడం... మిడిలార్డర్లో మునుపటి మెరుపులు లోపించడం... ధోని స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడలేకపోవడం... ప్రత్యర్థి స్పిన్నర్లు విజృంభిస్తున్న చోట చెన్నై బౌలర్లు నామమాత్ర ప్రదర్శన కనబర్చడం... వెరసి చెన్నై తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కాస్త ఆశ ఏదైనా ఉంది అంటే... అది యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే మెరుపులే. గత మ్యాచ్ ద్వారానే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 17 ఏళ్ల మాత్రే... ముంబై పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 15 బంతుల్లో 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తుండగా... రచిన్ రవీంద్రలో నిలకడ కొరవడింది. మిడిలార్డర్లో జడేజా, దూబే, విజయ్ శంకర్ కీలకం కానున్నారు. ఓవర్టన్, పతిరణ, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, అశ్విన్, జడేజాతో బౌలింగ్ మెరుగ్గా ఉంది. ఏవీ ఆ మెరుపులు! సీజన్ ఆరంభ పోరులోనే దాదాపు మూడొందల పరుగులతో బీభత్సం సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత లయ కోల్పోయింది. పంజాబ్ కింగ్స్పై భారీ లక్ష్యాన్ని ఛేదించి తిరిగి గాడిన పడింది అనుకుంటే... పాత పాటే పునరావృతం చేస్తోంది. గత రెండు మ్యాచ్లను ముంబైతోనే ఆడిన సన్రైజర్స్ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయం పాలైంది. రైజర్స్ ఓటముల సంఖ్య కన్నా... ఆరెంజ్ ఆర్మీ ఆడుతున్న తీరే అభిమానులను కలవరపెడుతోంది. పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వెనుదిరగడం... జట్టు ఆలోచన విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిõÙక్ శర్మ నిలకడ కొనసాగించలేకపోతుండగా... ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో క్లాసెన్పై అధిక భారం పడుతోంది. అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ నుంచి టీమ్ మేనేజ్మెంట్ మరింత ఆశిస్తోంది. దూకుడుకు మారుపేరుగా నిలిచిన రైజర్స్... ఇప్పుడు అదే తొందరపాటులో వికెట్లు కోల్పోయి చతికిలబడుతోంది. ఇక చెన్నైలో రైజర్స్కు మంచి రికార్డు లేదు. చెపాక్లో చెన్నై సూపర్ కింగ్స్పై ఆరెంజ్ ఆర్మీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. కమిన్స్, షమీ, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ ఇషాన్ మలింగతో కూడిన బౌలింగ్ బృందం ఎలాంటి అద్భుతాలు చేయలేకపోతోంది. ‘అభిషేక్, హెడ్ విఫలమవుతున్నప్పుడు ఇతర ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాల్సిన అవసరముంది. ఈ సీజన్లో అదే కొరవడింది. భాగస్వామ్యాలు నమోదు చేయడంలో మా ఆటగాళ్లు విఫలమవుతున్నారు’ అని సన్రైజర్స్ కోచ్ వెటోరీ అన్నాడు. 400టి20ల్లో ధోనికి ఇది 400వ మ్యాచ్. ఈ మార్క్ చేరుకున్న నాలుగో భారత ప్లేయర్గా అతడు నిలవనున్నాడు. రోహిత్ శర్మ (456), దినేశ్ కార్తీక్ (412), విరాట్ కోహ్లి (407) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. తుది జట్లు (అంచనా)సన్రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), రచిన్ రవీంద్ర, షేక్ రషీద్, ఆయుశ్ మాత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జేమీ ఓవర్టన్, అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరణ. -
RCB Vs RR: చిన్నస్వామిలో బెంగళూరు చిందు
రాజస్తాన్ విజయానికి చివరి 3 ఓవర్లలో 40 పరుగులు కావాలి... భువనేశ్వర్ వేసిన 18వ ఓవర్లో జురేల్ 2 ఫోర్లు, 2 సిక్స్లు బాదడంతో 22 పరుగులు వచ్చాయి. సమీకరణం 12 బంతుల్లో 18 పరుగులకు మారడంతో గెలుపు ఖాయమనిపించింది. అయితే 19వ ఓవర్లో హాజల్వుడ్ ఒకటే పరుగు ఇచ్చి 2 వికెట్లు తీయడంతో రాయల్స్ ఆశలు కోల్పోయింది. చివరి ఓవర్లో దయాళ్ 5 పరుగులే ఇచ్చాడు. దాంతో ఈ సీజన్లో చిన్నస్వామి మైదానంలో ఆడిన నాలుగో మ్యాచ్లో బెంగళూరుకు తొలి గెలుపు దక్కగా ...విజయానికి చేరువగా వచ్చి రాజస్తాన్ వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది. బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన పోరులో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 70; 8 ఫోర్లు, 2 సిక్స్లు), దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. రెండో వికెట్కు వీరిద్దరు 51 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులే చేసింది. యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 49; 7 ఫోర్లు, 3 సిక్స్లు), ధ్రువ్ జురేల్ (34 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించగా ... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హాజల్వుడ్ (4/33) ప్రత్యర్థిని పడగొట్టడంతో కీలక పాత్ర పోషించాడు. సమష్టి ప్రదర్శన... బెంగళూరుకు ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 26; 4 ఫోర్లు), కోహ్లి శుభారంభం అందించడంతో ఆ జట్టు పవర్ప్లే ముగిసే సరికి 59 పరుగులు సాధించింది. హసరంగ తొలి ఓవర్లోనే సాల్ట్ను అవుట్ చేసి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్ మరింత దూకుడుగా ఆడాడు. మరోవైపు కోహ్లి... సందీప్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 32 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం వరుసగా పరాగ్, దేశ్పాండే వేసిన రెండు ఓవర్లలో కోహ్లి, పడిక్కల్ కలిసి 5 భారీ సిక్స్లతో మొత్తం 37 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత 11 బంతుల వ్యవధిలో 7 పరుగులు మాత్రమే చేసిన జట్టు కోహ్లి, పడిక్కల్, పాటీదార్ (1) వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ దూకుడు... భారీ ఛేదనలో రాజస్తాన్ ఇన్నింగ్స్ జోరుగా మొదలైంది. తొలి బంతికే సిక్స్ కొట్టిన జైస్వాల్... దయాళ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత హాజల్వుడ్ ఓవర్లోనూ అతను వరుసగా మూడు ఫోర్లు బాదాడు. రెండు సిక్స్లతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (16) ఎక్కువ సేపు నిలవలేదు. అనంతరం హాజల్వుడ్ ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన జైస్వాల్ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. పవర్ప్లేలో రాయల్స్ 72 పరుగులు రాబట్టడం విశేషం. ఆ తర్వాత మరో రెండు ఓవర్లు నితీశ్ రాణా (22 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), రియాన్ పరాగ్ (10 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిని ప్రదర్శించడంతో 49 బంతుల్లోనే స్కోరు 100 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత ఆర్సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్తో రాయల్స్ను నిలువరించడంలో సఫలమైంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) హెట్మైర్ (బి) హసరంగ 26; కోహ్లి (సి) రాణా (బి) ఆర్చర్ 70; పడిక్కల్ (సి) రాణా (బి) సందీప్ 50; టిమ్ డేవిడ్ (రనౌట్) 23; పాటీదార్ (సి) జురేల్ (బి) సందీప్ 1; జితేశ్ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–61, 2–156, 3–161, 4–163, 5–205. బౌలింగ్: ఆర్చర్ 4–0–33–1, ఫారుఖీ 3–0–30–0, తుషార్ దేశ్పాండే 2–0–36–0, సందీప్ శర్మ 4–0–45–2, హసరంగ 4–0–30–1, పరాగ్ 3–0–30–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) షెఫర్డ్ (బి) హాజల్వుడ్ 49; వైభవ్ (బి) భువనేశ్వర్ 16; రాణా (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 28; పరాగ్ (సి) జితేశ్ (బి) కృనాల్ 22; జురేల్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 47; హెట్మైర్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 11; శుభమ్ దూబే (సి) సాల్ట్ (బి) దయాళ్ 12; ఆర్చర్ (సి) పాటీదార్ (బి) హాజల్వుడ్ 0; హసరంగ (రనౌట్) 1; దేశ్పాండే (నాటౌట్) 1; ఫారుఖీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–52, 2–72, 3–110, 4–134, 5–162, 6–189, 7–189, 8–189, 9–191. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–50–1, యశ్ దయాళ్ 3–0–33–1, హాజల్వుడ్ 4–0–33–4, రొమారియో షెఫర్డ్ 1–0–15–0, సుయాశ్ శర్మ 4–0–31–0, కృనాల్ పాండ్యా 4–0–31–2. ఐపీఎల్లో నేడుచెన్నై X హైదరాబాద్వేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్లో ఓడిన రాజస్తాన్..
ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 11 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఓ దశలో సునయాసంగా గెలిచేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేయగల్గింది. రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47) అద్భుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా రెండు, భువనేశ్వర్, యశ్ దయాల్ తలా వికెట్ సాధించారు.అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(70), పడిక్కల్(50) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్(23),జితేష్ శర్మ(20) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హసరంగ, ఆర్చర్ తలా వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో కింగ్ కోహ్లి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లను విరాట్ ఊతికారేశాడు. ఫిల్ సాల్ట్, పడిక్కల్తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. విరాట్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉టీ20 క్రికెట్లో ఒకే వేదికపై 3500 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో 105 టీ20 ఇన్నింగ్స్లలో కోహ్లి 3500 పరుగులు చేశాడు.టీ20ల్లో ఒకే స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..3500 - బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ(భారత్)3373 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్లో ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్)3253 - రోజ్ బౌల్, సౌతాంప్టన్లో జేమ్స్ విన్స్ (ఇంగ్లండ్)3241 - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్లో అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)3238 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్లో తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)👉అదేవిధంగా టీ20 క్రికెట్లో మొదట బ్యాటింగ్ చేసిన సందర్బాల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్గా విరాట్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 62 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ బాబర్(61) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బాబర్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.👉ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.టీ20ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్లు వీరే..62 - విరాట్ కోహ్లీ*61 - బాబర్ అజామ్57 - క్రిస్ గేల్55 - డేవిడ్ వార్నర్52 - జోస్ బట్లర్52 - ఫాఫ్ డు ప్లెసిస్ -
ధోని.. ఆ పేరు అలాంటిది మరి!: సహచర క్రికెటర్కు సెహ్వాగ్ కౌంటర్
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. సన్రైజర్స్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడి 6 ఓటుమలతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదివ స్ధానంలో కొనసాగుతోంది. కాగా ఎస్ఆర్హెచ్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనంతరం భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్,అమిత్ మిశ్రాలు క్రిక్బజ్ లైవ్ షోలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా అమిత్ మిశ్రాకు సెహ్వాగ్ కౌంటరిచ్చాడు.అసలేమి జరిగిందంటే?పోస్ట్ మ్యాచ్ లైవ్ షోలో మిశ్రా, సెహ్వాగ్లు సన్రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు గురించి చర్చించారు. అయితే మిశ్రా మాత్రం ఈ అంశం నుండి దృష్టి మరల్చి, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ప్లేఆఫ్కు చేరుకునే వారి అవకాశాల గురించి మాట్లాడాడు."సీఎస్కే ప్లే ఆఫ్స్కు చేరడం దాదాపు అసాధ్యం అనుకుంటున్నాను. వారు ప్రస్తుతం ఆడుతున్న క్రికెట్ బ్రాండ్ ప్రకారం.. వరుసగా ఆరు మ్యాచ్లను గెలవడం కష్టం. ఒకవేళ గెలవాలంటే చెన్నై అన్ని విభాగాల్లోనూ బాగా రాణించాలి. ధోని బ్యాటింగ్కు వస్తే కనీసం 30 బంతులు ఆడాలి. వారి టాప్ ఆర్డర్ కూడా రాణించాలి" అని మిశ్రా పేర్కొన్నాడు. వెంటనే సెహ్వాగ్ జోక్యం చేసుకుని ప్రశ్న సీఎస్కే గురుంచి కాదు, ఎస్ఆర్హెచ్ గురించి అని మిశ్రాతో అన్నాడు. దీంతో మిశ్రా వెంటనే క్షమాపణలు చెప్పాడు. అందుకు ఇదంతా ధోనికి ఉన్న పేరు వల్లే అంటూ సెహ్వాగ్ సమాధానమిచ్చాడు.చదవండి: అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్ -
IPL 2025: రాజస్తాన్పై ఆర్సీబీ విజయం..
RCB vs RR Live Updates:రాజస్తాన్పై ఆర్సీబీ విజయం..చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 11 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఓ దశలో సునయాసంగా గెలిచేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేయగల్గింది.రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47) అద్భుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా రెండు, భువనేశ్వర్, యశ్ దయాల్ తలా వికెట్ సాధించారు.అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(70), పడిక్కల్(50) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్(23),జితేష్ శర్మ(20) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హసరంగ, ఆర్చర్ తలా వికెట్ సాధించారు.16 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 160/416 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో షిమ్రాన్ హెట్మైర్(11), ధ్రువ్ జురెల్(31) ఉన్నారు.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్.. దూకుడుగా ఆడుతున్న యశస్వి జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 49 పరుగులు చేసిన జైశ్వాల్.. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..వైభవ్ సూర్యవంశీ రూపంలో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన సూర్యవంశీ.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు.5 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(35), రాణా(6) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(35),సూర్యవంశీ(10) ఉన్నారు.చెలరేగిన విరాట్, పడిక్కల్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(70), పడిక్కల్(50) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్(23),జితేష్ శర్మ(20) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హసరంగ, ఆర్చర్ తలా వికెట్ సాధించారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు..17వ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్లో ఆర్సీబీ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. దేవ్దత్త్ పడిక్కల్(50), పాటిదార్(1) ఔటయ్యారు. 18 ఓవర్లకు ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. క్రీజులో జితేష్ శర్మ(9), టిమ్ డేవిడ్(14) ఉన్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన కోహ్లి.. జోఫ్రా అర్చర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 15.1 ఓవర్లకు ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(50), టిమ్ డేవిడ్(0) ఉన్నారు.విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ..రాజస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లి 56 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లితో పాటు పడిక్కల్(29) ఉన్నాడు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్..61 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. హసరంగా బౌలింగ్లో ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(28), పడిక్కల్(1) ఉన్నారు.2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 18/02 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(5), సాల్ట్(6) ఉన్నారు.ఐపీఎల్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు కూడా రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పరాగ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్లో రాజస్తాన్ ఓ మార్పుతో బరిలోకి దిగగా.. ఆర్సీబీ ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఆర్సీబీ ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్రాజస్తాన్ యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్హాక్ ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే -
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
బీహార్కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ తరపున సూర్యవంశీ డెబ్యూ చేశాడు.ఈ యువ ఆటగాడు తొలి మ్యాచ్లోనే 34 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్తో అందరిని ఆకట్టుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అందరి కళ్లు ఈ యువ ఆటగాడిపైనే ఉన్నాయి. గురువారం బెంగళూరు వేదికగా ఆర్సీబీతో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో వైభవ్ ఎలా ఆడుతాడో అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సూర్యవంశీపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యవంశీ అతి త్వరలో టీమిండియా తరఫున అరంగేట్రం చేయబోతున్నాడని శాంసన్ జోస్యం చెప్పాడు."అతడు చాలా కాన్ఫిడెంట్గా కన్పిస్తున్నాడు. అతడిలో చాలా పవర్ ఉంది. మా క్రికెట్ ఆకాడమీలో గ్రౌండ్ బయటకు సిక్సర్లు కొట్టేవాడు. ఇంత చిన్న వయస్సులో అతడు భారీ సిక్సర్లు ఎలా కొడుతున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.అతడు నాకు తమ్ముడు లాంటి వాడు. సూర్యవంశీ ఒకట్రెండు సంవత్సరాలలో భారత్ తరపున ఆడే అవకాశం ఉందని" శాంసన్ పేర్కొన్నాడు. కాగా సూర్యవంశీ అండర్-14, అండర్-16 స్థాయిలలో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన వేలంలో వైభవ్ను రూ. 1.1 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.చదవండి: IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా? -
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్గేల్ అవుతాడు’
తండ్రి దిగ్గజ క్రికెటర్.. అంతర్జాతీయ స్థాయిలో వంద శతకాలు సాధించిన ఏకైక ఆటగాడు.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటలు లిఖించుకున్న లెజెండ్.. కానీ ఆయన కుమారుడు మాత్రం క్రికెటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాడు.ఆ తండ్రి స్పెషలిస్టు బ్యాటర్.. అయితే, కుమారుడు మాత్రం ఆల్రౌండర్. ఇప్పటికే ఆ తండ్రీకుమారులు ఎవరో అర్థమైపోయి ఉంటుంది...! అవును సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)- అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) గురించే ఈ పరిచయ వ్యాఖ్యాలు. సచిన్ తనయుడిగా మాత్రమే లోకానికి సుపరిచితమైన అర్జున్.. మేటి క్రికెటర్గా ఎదగాలంటే ఒక్కటే మార్గం ఉందంటున్నాడు యోగ్రాజ్ సింగ్.రాసి పెట్టుకోండి..‘‘అర్జున్ బౌలింగ్పై తక్కువగా బ్యాటింగ్పై ఎక్కువగా దృష్టి సారించాలి. సచిన్, యువరాజ్ సింగ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇదైతే రాసి పెట్టుకోండి.. ఒకవేళ యువీ గనుక సచిన్ కుమారుడిని తన వద్దకు రప్పించుకుని.. మూడు నెలల పాటు శిక్షణ ఇస్తే.. అర్జున్ మరో క్రిస్ గేల్ అవుతాడు.ఫాస్ట్ బౌలర్గా ఉన్న అర్జున్ ఒకవేళ తీవ్రంగా గాయపడితే కెరీర్కు ప్రమాదం. ముందుగా చెప్పినట్లు అర్జున్ ఒక్కసారి యువరాజ్ దగ్గర శిక్షణ తీసుకుంటే మాత్రం అతడు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు’’ అని యోగ్రాజ్ సింగ్ క్రిక్నెక్ట్స్ తో పేర్కొన్నాడు. కాగా అర్జున్ ఒకప్పుడు తన దగ్గర శిక్షణ తీసుకున్నట్లు యోగ్రాజ్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.బౌలింగ్ ఆల్రౌండర్కాగా 25 ఏళ్ల అర్జున్ టెండుల్కర్ బౌలింగ్ ఆల్రౌండర్. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అయిన అతడు.. ఎడమచేతి వాటం బ్యాటర్. దేశవాళీ క్రికెట్లో గోవాకు ఆడుతున్న ఈ ముంబై కుర్రాడు.. 2024-25 సీజన్లో పూర్తిగా నిరాశపరిచాడు.దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లో రెండు ఇన్నింగ్స్ ఆడి కేవలం 40 పరుగులు చేశాడు. అదే విధంగా మూడు మ్యాచ్లలో కలిపి నాలుగు వికెట్లు తీశాడు. ఇక రంజీ ట్రోఫీలో మూడు ఇన్నింగ్స్లో కలిపి 51 పరుగులు చేసిన అర్జున్.. బౌలర్గా మాత్రం ఆకట్టుకున్నాడు. నాలుగు మ్యాచ్లు ఆడి పదహారు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉండటం విశేషం.ఇక దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 2024-25 సీజన్లో రెండు మ్యాచ్లు ఆడి 21 పరుగులు చేసిన అర్జున్.. ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జట్టుతో ఉన్నాడు. మెగా వేలం-2025లో అర్జున్ను ముంబై రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. చదవండి: IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా? -
టీమిండియా దిగ్గజం బర్త్డే.. సారా టెండుల్కర్ పోస్ట్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 24). ఈరోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 52వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ (BCCI) ఈ లెజెండరీ బ్యాటర్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.శతక శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‘‘664 అంతర్జాతీయ మ్యాచ్లు.. 34,357 పరుగులు.. 201 అంతర్జాతీయ వికెట్లు.. 2011 వన్డే వరల్డ్కప్ విజేత.. కల్నల్ సీకే నాయుడు జీవనసాఫల్య పురస్కారం అందుకున్న విజేత..అంతర్జాతీయ క్రికెట్లో శతక శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్.. దిగ్గజ, స్ఫూర్తిదాయక ఆటగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని ఎక్స్ వేదికగా విషెస్ చెప్పింది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్ తదితరులు సచిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.హ్యాపీ బర్త్డే బాబాఇక సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తండ్రి బర్త్డే సందర్భంగా తాను అమూల్యంగా భావించే ఫొటోలను పంచుకుంది. అంతేకాదు తన తండ్రి గొప్పదనాన్ని వివరిస్తూ.. ‘‘ఎవరికీ భయపడొద్దు.. అయితే, ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని నేర్పించిన వ్యక్తికి...ఫ్రాక్చర్ అయిన తన భుజంపై నన్ను మోసుకువెళ్లిన దృఢమైన సారథికి.. నా ఫొటోషూట్లను మరింత ప్రత్యేకంగా మార్చే వ్యక్తికి.. అన్నిటికంటే ముఖ్యంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ నవ్వులతో ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పే వ్యక్తికి హ్యాపీ బర్త్డే బాబా’’ అంటూ సారా క్యాప్షన్ జత చేయగా.. ఆమె పోస్ట్ వైరల్గా మారింది.కాగా 1989లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన సచిన్ టెండుల్కర్ లిటిల్ మాస్టర్ నుంచి క్రికెట్ దేవుడిగా ఎదిగాడు. తన ఇరవై రెండేళ్ల కెరీర్లో లెక్కలు మిక్కిలి రికార్డులు సాధించిన మాస్టర్ బ్లాస్టర్.. తన కెరీర్లో అంతర్జాతీయ స్థాయిలో ఏకైక టీ20 ఆడాడు.సచిన్ కెరీర్లో టాప్-9 రికార్డ్స్ ఇవే👉టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్- 15,921👉వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్- 18,426👉అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్- 463👉అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్- 200👉వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్👉అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్👉దేశవాళీ క్రికెట్లో ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ అరంగేట్రంలోనే శతక్కొట్టిన వీరుల జాబితాలో తొలి స్థానం👉టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్- 51👉వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్- 2278.చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం -
IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ అంటే ఫోర్లు, భారీ సిక్సర్లే కాదు.. వాటిని బాదిన ఆటగాళ్లు, వారు ఆడిన షాట్లను విశ్లేషిస్తూ.. వారి ఆట కట్టించేందుకు బౌలర్లు రచించే వ్యూహాలు.. ఇలా ఒక్కటేమిటి.. మ్యాచ్ ఆసాంతం తమ అద్భుతమైన గొంతుతో ఆటను కళ్లకు గట్టినట్లు చూపుతున్నారే అనేలా వ్యాఖ్యానం చేసే కామెంటేటర్లు కూడా ఇందులో భాగమే!భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్కు చెందిన ఎంతో మంది దిగ్గజాలు ఐపీఎల్లో వ్యాఖ్యాతలుగా అలరిస్తున్నారు. మరి.. వాళ్లకు ఇచ్చే పారితోషికం ఎంత? అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కామెంటేటర్ ఎవరు?.. హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లో కామెంట్రీ చేసే సీనియర్, జూనియర్ల జీతాలు ఎంత? తదితర విషయాలు గమనిద్దామా?టీమిండియా దిగ్గజాలు సునిల్ గావస్కర్, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి నుంచి ఆకాశ్ చోప్రా, హర్షా భోగ్లే, ఇయాన్ బిషప్ వరకు అత్యధిక పారితోషికం అందుకునే కామెంటేటర్ల జాబితాలో ఉన్నారు. వీరిలో సునిల్ గావస్కర్ అత్యధికంగా ఇంగ్లిష్ కామెంట్రీకి రూ. 4.17 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.ఐపీఎల్-2024కు గానూ అత్యధిక పారితోషికం అందుకున్న టాప్-10 కామెంటేటర్లు 1. సునిల్ గావస్కర్ (భారత్)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు2. మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు3. కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు4. ఇయాన్ బిషప్ (వెస్టిండీస్)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు5. హర్షా భోగ్లే (భారత్)- ఇంగ్లిష్- రూ. 4.1 కోట్లు6. రవిశాస్త్రి (భారత్)- ఇంగ్లిష్- రూ. 4 కోట్లు7. ఆకాశ్ చోప్రా (భారత్)- హిందీ- రూ. 2.92 కోట్లు8. సంజయ్ మంజ్రేకర్ (భారత్)- హిందీ- రూ. 2.8 కోట్లు9. సురేశ్ రైనా (భారత్)- హిందీ- రూ. 2.5 కోట్లు10. హర్భజన్ సింగ్ (భారత్)- హిందీ- రూ. 1.5 కోట్లు11. జతిన్ సప్రూ (భారత్)- హిందీ- ఒక్కో మ్యాచ్కు రూ. 1.5 లక్షల చొప్పునటాప్ టైర్, జూనియర్ కామెంటేటర్ల జీతాల మధ్య భారీ వ్యత్యాసం (ఒక్కో మ్యాచ్కు)ఇంగ్లిష్- టాప్ టైర్ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పునహిందీ- టాప్ టైర్ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పునతమిళ్ లేదా ఇతర ప్రాంతీయ భాషలు- టాప్ టైర్ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పునఆటగాళ్లతో పాటు కామెంటేటర్లపైనా కనక వర్షం కురిపించేదే ఐపీఎల్. మరి క్యాష్ రిచ్ లీగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా! అంటారా?!చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం -
పాక్ ఆటగాడిని వారి సొంత అడ్డాలోనే నిర్భయంగా నిలదీసిన న్యూజిలాండ్ ఆటగాడు
న్యూజిలాండ్ విధ్వంసకర వీరుడు కొలిన్ మున్రో ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఆడుతున్నాడు. ఈ లీగ్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ను ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్లో ఇస్లామాబాద్ ముల్తాన్ సుల్తాన్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో ఇస్లామాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో మున్రో కీలకపాత్ర పోషించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్లో మున్రో తన ఆటతీరుతో కాకుండా వేరే విషయం కారణంగా వార్తల్లో నిలిచాడు. మున్రో బ్యాటింగ్ చేస్తుండగా సుల్తాన్స్ బౌలర్ ఇఫ్తికార్ అహ్మద్తో గొడవ జరిగింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ మూడో బంతిని ఇఫ్తికార్ బ్లాక్హోల్లోకి వేయగా మున్రో దాన్ని విజయంవంతంగా అడ్డుకున్నాడు. అయితే ఇఫ్తికార్ చక్ (చట్టవిరుద్ధమైన బౌలింగ్ శైలి) చేస్తున్నాడని మున్రో ఆరోపించాడు.iftikhar vs munro 😳 pic.twitter.com/kYqHo0R4OU— IF7 (@IF7____) April 23, 2025దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఇఫ్తికార్ మున్రో వైపు దూసుకొచ్చి ఏదో అన్నాడు. దీనికి మున్రో కూడా ధీటుగానే సమాధానం చెప్పాడు. చకింగ్ చేస్తున్నావని చెప్పడంలో తప్పేముందున్నట్లు నిలదీశాడు. మధ్యలో సుల్తాన్స్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ జోక్యం చేసుకున్నాడు. అతను కూడా మున్రోతో వాగ్వాదానికి దిగాడు. దీంతో మైదానంలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.చివరికి అంపైర్ల జోక్యంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఆతర్వాత కూడా ఇఫ్తికార్ వివాదాస్పద శైలితోనే బౌలింగ్ కొనసాగించాడు. లీగ్ వారిదే కావడంతో మున్రో చేసేదేమీ లేక బ్యాటింగ్ను కొనసాగించాడు. ఛేదనలో తన జట్టు విజయానికి మంచి పునాది వేసి ఔటయ్యాడు. ఆండ్రియస్ గౌస్ (80 నాటౌట్) చివరి వరకు క్రీజ్లో ఉండి ఇస్లామాబాద్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఇఫ్తికార్ 2 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 20 పరుగులు సమర్పించుకున్నాడు. పాక్ ఆటగాడిని వారి సొంత అడ్డాలోనే నిర్భయంగా నిలదీయడంతో క్రికెట్ అభిమానులు మున్రో ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అలాగే చట్టవిరుద్ధమైన శైలితో బౌలింగ్ చేస్తున్నా పట్టించుకోని పాక్ అంపైర్లను చీవాట్లు పెడుతున్నారు. పాకిస్తాన్లో క్రికెట్ అంటే ఇంత కంటే గొప్పగా ఏమీ ఆశించలేమని సర్దుకు పోతున్నారు. మున్రో పేరిట న్యూజిలాండ్ తరఫున రెండో వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు ఉంది. 38 ఏళ్ల మున్రో న్యూజిలాండ్ తరఫున 3 టీ20 సెంచరీలు చేశాడు. -
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఇంకా కొన్ని మ్యాచ్లే ఉన్నాయి: కమిన్స్
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్లు పూర్తి చేసుకున్న కమిన్స్ బృందం కేవలం రెండు మాత్రమే గెలిచింది. ముంబై ఇండియన్స్ (SRH vs MI)తో బుధవారం నాటి పోరులో ఓటమిపాలై ఈ సీజన్లో ఆరో ఓటమిని నమోదు చేసింది.కుప్పకూలిన టాపార్డర్సొంత మైదానం ఉప్పల్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. పేలవ ప్రదర్శన కనబరిచింది. ముంబై పేసర్ల ధాటికి రైజర్స్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (8) దారుణంగా విఫలం కాగా.. ఇషాన్ కిషన్ (1) మరోసారి చేతులెత్తేశాడు.నితీశ్ రెడ్డి (2) సైతం నిరాశపరిచాడు. ఇలాంటి దశలో వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 71) అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43)తో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఏకంగా నాలుగు వికెట్లు కూల్చగా.. దీపక్ చహర్ రెండు, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక సన్రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ శర్మ (46 బంతుల్లో 70), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్) రాణించారు.వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) స్పందించాడు. బ్యాటర్ల వైఫల్యమే తమ ఓటమికి కారణమని పేర్కొన్నాడు. ఈ సీజన్లో తమకు ఇంకా కొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని.. వికెట్ను సరిగ్గా అంచనా వేయగలిగితేనే ఇకపై ముందుకు సాగే అవకాశం ఉందని కమిన్స్ వ్యాఖ్యానించాడు.‘‘అభినవ్, క్లాసీ వల్ల మేము చెప్పుకోగదగ్గ స్కోరు చేయగలిగాం. కానీ ఈ ఇన్నింగ్స్లో మా జట్టు ప్రదర్శన అస్సలు బాలేదు. కనీసం ఇంకొక్కరైనా పట్టుదలగా నిలబడి ఉంటే బాగుండేది.ఇంకా కొన్ని మ్యాచ్లే ఉన్నాయిఇదే పిచ్పై మా తొలి మ్యాచ్లో 280 పరుగులు స్కోరు చేశాం. కానీ ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీ20 మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సమయానుగుణంగా ఇన్నింగ్స్ ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటే మంచిది.లేదంటే పరిస్థితి చేజారుతుంది. మాకింకా కొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వికెట్ను కచ్చితంగా అంచనా వేసి.. అందుకు అనుగుణంగా ఆడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. అయితే, కొన్నిసార్లు మనం సఫలమైతే.. మరికొన్ని సార్లు ప్రత్యర్థి జట్టు పైచేయి సాధిస్తుంది’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.కాగా గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్కు ఈ సీజన్లో ఇంకా ఆరు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఆరింటిలోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు సన్రైజర్స్పై గెలిచిన ముంబై.. తొమ్మిదింట ఐదో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి దూసుకువచ్చింది. చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం4️⃣th consecutive win for the @mipaltan 👌They make it 2️⃣ in 2️⃣ against #SRH this season 👏Scorecard ▶ https://t.co/nZaVdtwDtv #TATAIPL | #SRHvMI pic.twitter.com/wZMMQnOEi0— IndianPremierLeague (@IPL) April 23, 2025 -
ఇషాన్ కిషన్పై దుమ్మెత్తిపోస్తున్న ఎస్ఆర్హెచ్ అభిమానులు.. అమ్ముడుపోయాడంటూ కామెంట్లు
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయినా.. రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.ఈ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వ్యవహరించిన తీరుపై సొంత అభిమానులే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇషాన్ ముంబై ఇండియన్స్తో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. ఇషాన్ తమను నమ్మించి వెన్నుపోటు పొడిచాడని దుయ్యబడుతున్నారు. ఇకపై సన్రైజర్స్ యాజమాన్యం అతనికి అవకాశాలు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు.అసలేం జరిగిందంటే.. సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్ నిన్న ముంబై ఇండియన్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో ఇషాన్ అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా తనంతట తానే మైదానాన్ని వీడాడు. హెడ్ ఔటయ్యాక మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్.. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఇషాన్ బ్యాట్ను మిస్సై వికెట్ కీపర్ రికెల్టన్ చేతికి వెళ్లింది. బంతికి బ్యాట్కు తాకిందని భావించిన ఇషాన్ అంపైర్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఔటయ్యానని అనుకుని పెవిలియన్ బాట పట్టాడు. రీ ప్లేలో బంతి బ్యాట్కు కానీ శరీరానికి కానీ తగల్లేదని తేలింది. దీంతో ఇషాన్పై ఎస్ఆర్హెచ్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటికే హెడ్ ఔటై కష్టాల్లో ఉన్నామని తెలిసి కూడా ఇషాన్కు ఇంత నిర్లక్షమా అని మండిపడుతున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నా ఇషాన్కు ఏ మాత్రం పట్ట లేదని దుయ్యబడుతున్నారు. రూ. 15.25 కోట్లు పెట్టి కొనుక్కుంటే ఇలాగేనా చేసేదని దుమ్మెత్తిపోస్తున్నారు.కాగా, ఈ సీజన్లో ఇషాన్ తన తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై సెంచరీ చేశాడు. అప్పుడు సన్రైజర్స్ అభిమానులు ఇషాన్ను ఆహా ఓహో అంటూ ఆకాశానికెత్తారు. ఆ మ్యాచ్ తర్వాత ఇషాన్ వరుసగా 7 మ్యాచ్ల్లో విఫలమై అభిమానులను నిరాశలో ముంచెత్తాడు. సరిగ్గా ఆడకపోతే ఫామ్లో లేడని భావించిన ఫ్యాన్స్, ఔట్ కాకపోయినా ఔటయ్యానని తనకు తానే ప్రకటించుకోవడంపై ఫైరవుతున్నారు. ముంబై ఇండియన్స్ నుంచి వచ్చాడు. ఆ ఫ్రాంచైజీకి అమ్ముడుపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సీజన్లోనే ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో ఇషాన్ ఆ జట్టు ఓనర్ నీతా అంబానీతో చనువుగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇలా చేసినందుకు నీతా మేడం ఇషాన్కు రిలయన్స్ మార్ట్ నుండి సరుకులు పంపుతుందని జోక్ చేస్తున్నారు. ఇషాన్ ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్లోనే కొనసాగిన విషయం తెలిసిందే. -
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
ప్రశాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమని పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ.. ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది.పాకిస్తాన్తో ఇకపై కూడా..బీసీసీఐ తరఫున కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ఈ మేరకు తమ స్పందన తెలియజేశారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘బాధిత కుటుంబాలకు మా మద్దతు. ఉగ్రవాదుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రభుత్వ నిర్ణయానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. పాకిస్తాన్తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోము. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాం. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదు.అయితే, ఐసీసీ ఈవెంట్లలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు ఆడుతుంది. ప్రస్తుత పరిస్థితులను ఐసీసీ కూడా నిశితంగా గమనిస్తోంది’’ అని స్పోర్ట్స్తక్తో పేర్కొన్నారు.మాటలకు అందని విషాదంఇక బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. ‘‘పహల్గామ్లో జరిగిన పాశవిక ఉగ్రదాడి కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.బీసీసీఐ తరఫున ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో వారంతా ధైర్యం కోల్పోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో చోటు చేసుకున్న ఈ విషాదాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదు. మనమంతా వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు.బాధితులకు నివాళికాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్-2025లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ బాధితులకు నివాళి అర్పించింది. ఆటగాళ్లంతా నిమిషం పాటు మౌనం పాటించారు. అదే విధంగా చీర్లీడర్స్ ప్రదర్శనలు లేకుండా చూసుకున్నారు. బాణసంచా కూడా కాల్చలేదు.చివరగా 2008లోఇదిలా ఉంటే.. భారత జట్టు చివరగా 2008లో పాకిస్తాన్లో పర్యటించింది. అదే విధంగా పాక్ జట్టు 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు భారత్కు వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు భారత పర్యటనకు రాగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికైన దుబాయ్లో రోహిత్ సేన తమ మ్యాచ్లు ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవగా.. ఆతిథ్య పాక్ జట్టు ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది.కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గల బైసారన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి దిగారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు.చదవండి: Pahalgam Incident: "గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు -
పాకిస్తాన్కు వెళ్లిపోయిన కేన్ మామ
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఆడేందుకు పాకిస్తాన్కు వెళ్లిపోయాడు. కేన్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో ప్రారంభం నుండి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కేన్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్ఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. పీఎస్ఎల్లోని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ కేన్ను రూ. 86 లక్షలకు కొనుగోలు చేసింది. ఇదే కరాచీ కింగ్స్ ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ను రూ. 2.57 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ కూడా కట్టబెట్టింది. కేన్ పీఎస్ఎల్లో తదుపరి మ్యాచ్లు వార్నర్ కెప్టెన్సీలో ఆడతాడు. కేన్ పీఎస్ఎల్లో ఆడటం ఇదే మొదటిసారి. పాక్ జట్టుతో చేరిన విషయాన్ని కరాచీ కింగ్స్ యాజమాన్యం సోషల్మీడియా వేదికగా వెల్లడించింది.𝐇𝐢 𝐊𝐚𝐫𝐚𝐜𝐡𝐢 𝐟𝐚𝐧𝐬! 𝐈 𝐡𝐚𝐯𝐞 𝐚𝐫𝐫𝐢𝐯𝐞𝐝 👋The wait is over! Kane Williamson has joined the #KingsSquad 🤩#YehHaiKarachi | #KarachiKings | #HBLPSLX pic.twitter.com/R2z8nEpXbp— Karachi Kings (@KarachiKingsARY) April 24, 2025కేన్ 2015 నుండి 2024 వరకు ఐపీఎల్లో ఆడాడు. 9 సీజన్లలో అతను అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. ఎక్కువ కాలం సన్రైజర్స్కు ఆడిన కేన్.. ఆ జట్టును 2018 సీజన్లో ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు. ఆ సీజన్లో కేన్ 17 మ్యాచ్ల్లో 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. కేన్ను ఎస్ఆర్హెచ్ అభిమానులు ముద్దుగా కేన్ మామ అని పిలుచుకుంటారు. కేన్ను 2022 సీజన్లో ఎస్ఆర్హెచ్ వదిలేసింది. ఆతర్వాత అతను గుజరాత్ టైటాన్స్తో జత కట్టాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు గుజరాత్ కూడా కేన్ను వదిలేసింది. మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నా కేన్ను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. ఘన చరిత్ర కలిగిన కేన్ ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడి 18 అర్ద సెంచరీల సాయంతో 2128 పరుగులు చేశాడు.పీఎస్ఎల్లో కేన్ సహా చాలామంది న్యూజిలాండ్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఐపీఎల్లో అవకాశాలు రాకపోవడంతో వీరంతా పీఎస్ఎల్ పంచన చేరారు. పీఎస్ఎల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ (1.88 కోట్లు) కాగా.. టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్, మార్క్ చాపమన్, ఆడమ్ మిల్నే, కొలిన్ మున్రో, మైఖేల్ బ్రేస్వెల్, కైల్ జేమీసన్ ఓ మోస్తరు వేతనంతోనే సరిపెట్టుకున్నారు. పీఎస్ఎల్-2025లో కేన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్లో క్వెట్టా గ్లాడియేటర్స్తో (ఏప్రిల్ 25) తలపడనుంది. ఈ మ్యాచ్తో కేన్ పీఎస్ఎల్ అరంగేట్రం చేస్తాడు. -
SRH VS MI: రికార్డుల్లోకెక్కిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరోసారి రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో అత్యంత అరుదైన 12000 పరుగుల మైలురాయిని తాకాడు. నిన్న (ఏప్రిల్ 23) సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా (443 ఇన్నింగ్స్ల్లో) నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన రికార్డు క్రిస్ గేల్ (345 ఇన్నింగ్స్లు) పేరిట ఉంది. గేల్ తర్వాత విరాట్ (360), వార్నర్ (368), అలెక్స్ హేల్స్ (432) అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకారు. ఓవరాల్గా టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన 8వ ఆటగాడిగా హిట్మ్యాన్ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ తన టీ20 కెరీర్లో 8 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు చేశాడు.నిన్నటి మ్యాచ్లో రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ముంబై బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయినా రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. -
"గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్కు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. హతమారుస్తామంటూ (IKILLU) ఐసిస్ కశ్మీర్ రెండు ఈ-మెయిల్స్ చేసింది. ఈ విషయాన్ని గంభీర్ వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఢిల్లీలోని రాజీందర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకు గంభీర్కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని గంభీర్ ఢిల్లీ పోలీసులను కోరాడు.Praying for the families of the deceased. Those responsible for this will pay. India will strike. #Pahalgam— Gautam Gambhir (@GautamGambhir) April 22, 2025గంభీర్ పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకుంటారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు.కాగా, ఐపీఎల్ కారణంగా గంభీర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. గంభీర్ ఇటీవలే కుటుంబంతో కలిసి ఫ్రాన్స్లో హాలిడే ఎంజాయ్ చేసి వచ్చాడు. గంభీర్ గతేడాది జులైలో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. భారత్ టీ20 వరల్డ్కప్ గెలిచాక రాహుల్ ద్రవిడ్ నుంచి బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా కోచ్గా గంభీర్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గంభీర్ నేతృత్వంలో భారత్.. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్, న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్-గవాస్కర్ సిరీస్ల్లో ఓటమిపాలైంది. మధ్యలో కొన్ని చిన్నాచితక విజయాలతో పాటు భారత్ గంభీర్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. -
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
కశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం జరిగిన భయానమైన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే-తోయిబా ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. లష్కరే-తోయిబాకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.If Pakistan truly has no role in the Pahalgam terror attack, why hasn’t Prime Minister @CMShehbaz condemned it yet? Why are your forces suddenly on high alert? Because deep down, you know the truth — you’re sheltering and nurturing terrorists. Shame on you.— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర నిజంగా లేకపోతే ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించాడు. దాడి తర్వాత పాక్ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయిని నిలదీశాడు. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, పెంచి పోషిస్తుందని ఆరోపించాడు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని ట్విటర్ వేదికగా పాక్ ప్రభుత్వంపై అసహనాన్ని ప్రదర్శించాడు.Why is it that they never target local Kashmiris, but consistently attack Hindus — be it Kashmiri Pandits or Hindu tourists from across India? Because terrorism, no matter how it’s disguised, follows one ideology — and the whole world is paying the price for it. #Pahalgam— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025దీనికి ముందు కూడా కనేరియా ఓ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు స్థానిక కశ్మీరీలను ఎందుకు టార్గెట్ చేయరని ప్రశ్నించాడు. హిందువులే లక్ష్యంగా ఎందుకు దాడులకు తెగబడతారని నిలదీశాడు. ఉగ్రవాదం కారణంగా యావత్ ప్రపంచం మూల్యం చెల్లించుకుంటుందని వాపోయాడు.తాజాగా కనేరియా మరో ట్వీట్ కూడా చేశాడు. నేను ఏదైనా ట్వీట్ చేసినప్పుడల్లా కొంతమంది భారతీయ ముస్లింలు ఎందుకు బాధపడతారని ప్రశ్నించాడు.Why do some Indian Muslims get offended whenever I tweet something? Genuinely curious — just asking.— Danish Kaneria (@DanishKaneria61) April 23, 202544 ఏళ్ల కనేరియా పాక్ తరఫున క్రికెట్ ఆడిన రెండో హిందు ఆటగాడు. గతంలో అతని కజిన్ అనిల్ దల్పత్ పాక్కు ప్రాతినిథ్యం వహించాడు. కనేరియా 2000-2019 మధ్యలో పాక్ తరఫున 61 టెస్ట్లు ఆడి 261 వికెట్లు పడగొట్టాడు. 18 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. కనేరియా హిందువన్న కారణంగా పాక్ క్రికెట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అతను టీమ్లో ఉండటం చాలామంది పాక్ క్రికెటర్లకు నచ్చేది కాదని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్వయంగా చెప్పాడు. కనేరియా స్పాట్ ఫిక్సంగ్ కేసులో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ మరియు ఆ దేశ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా కనేరియా ఆ దేశాన్ని విడిచి వెళ్లాడు. ప్రస్తుతం అతను యూకేలో తలదాచుకుంటున్నాడు.Sad & heartbroken 💔 #PahalgamTerroristAttack— Mohammad Hafeez (@MHafeez22) April 23, 2025కాగా, పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కూడా స్పందించాడు. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ విచారం వ్యక్తం చేశాడు. -
SRH Vs MI: లైన్లోకి వచ్చారా వార్ వన్ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ను ముంబై ఇండియన్స్ చెత్తగా ప్రారంభించి, తిరిగి గాడిలో పడింది. తొలి ఐదు మ్యాచ్ల్లో నాలుగు పరాజయాల తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఆ జట్టుకు పడి లేవడం కొత్త కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే తొలుత పరాజయాలు ఎదుర్కొని ఆతర్వాత టైటిల్ రేసులో నిలిచింది. ప్రస్తుత సీజన్లోనూ ముంబై ఇండియన్స్ అదే ఒరవడిని కొనసాగిస్తుంది.ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కసారి ఊపులోకి వస్తే వార్ సైడ్ అవుతుంది. ఇది మరోసారి నిరూపితమైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ల్లో రోహిత్ శర్మ విఫలం కావడం.. బ్యాటర్లలో పెద్దగా ఆత్య విశ్వాసం లేకపోవడం.. పేసర్లు లయను అందిపుచ్చుకోలేకపోవడం, బుమ్రా అందుబాటులో లేకపోవడం వంటివి జరిగాయి. ఈ కారణాల చేత ముంబై తొలి మ్యాచ్ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంది.అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది. రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. బుమ్రా జట్టులో చేరడమే కాకుండా, సామర్థ్యం మేరకు సత్తా చాటుడుతున్నాడు. బ్యాటర్లు తిరిగి ఆత్మ విశ్వాసాన్ని పొందారు. బౌలర్లు, ముఖ్యంగా పేసర్లు లయను అందుకున్నారు. దీపక్ చాహర్, సూర్యకుమార్, బౌల్ట్, మిచెల్ సాంట్నర్ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగుతున్నాడు.నిన్న (ఏప్రిల్ 23) సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో పైన పేర్కొన్న ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై ఇండియన్స్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబై సన్రైజర్స్ను ఓడించడం ఇది రెండో సారి. నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచి సన్రైజర్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన ముంబై.. ఆ జట్టును స్వల్ప స్కోర్కే పరిమతం చేసింది. పేసర్లు బౌల్ట్, చాహర్ చెలరేగడంతో సన్రైజర్స్ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకోవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. బౌల్ట్ 4, చాహర్ 2, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ తీసి సన్రైజర్స్ పుట్టి ముంచారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయినా.. రోహిత్ (46 బంతుల్లో 70).. విల్ జాక్స్తో (22) పాటు ఇన్నింగ్స్ను నిర్మించాడు. జాక్స్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్) తన సహజ శైలిలో రెచ్చిపోయి బౌండరీతో మ్యాచ్ను ముగించాడు. రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి విజయానికి చేరువలో ఔటయ్యాడు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ జట్టు చివరిగా 2020 సీజన్లో నాలుగు అంతకంటే ఎక్కువ విజయాలు సాధించింది. ఆ సీజన్లో ముంబై వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి టైటిల్ను ఎగరేసుకుపోయింది. అదే ముంబై ఇండియన్స్ను చివరి (ఐదో) టైటిల్. -
చిన్నస్వామిలో చిందేసేనా!
బెంగళూరు: ఐపీఎల్ 18వ సీజన్లో ప్రత్యర్థుల మైదానాల్లో దుమ్మురేపుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో మాత్రం విజయం కోసం నిరీక్షిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన బెంగళూరు... రాజస్తాన్ రాయల్స్పై అయినా గెలవాలని చూస్తోంది. తాజా సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లాడిన ఆర్సీబీ 5 విజయాలు, 3 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్ వైపు దూసుకెళ్తుంటే... మరోవైపు రాజస్తాన్ రాయల్స్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిన రాజస్తాన్ విజయం కోసం ఎదురుచూస్తోంది. మిగిలిన స్టేడియాలతో పోల్చుకుంటే కాస్త చిన్నదిగా ఉండే... చిన్నస్వామి మైదానంలో బెంగళూరు బ్యాటర్లు సమష్టిగా సత్తా చాటాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫుల్ఫామ్లో ఉండగా... సాల్ట్, పడిక్కల్, రజత్ పాటీదార్ నుంచి మరిన్ని మెరుపులు రావాల్సి ఉంది. రాజస్తాన్ రాయల్స్ రెగ్యులర్ సంజూ సామ్సన్ గాయంతో జట్టుకు దూరం కావడంతో... అతడి స్థానంలో రియాన్ పరా గ్ సారథిగా వ్యవహరించనున్నాడు. గత మ్యాచ్తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 14 ఏళ్ల ప్లేయర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. సొంతగడ్డపై ఓ విజయం కోసం! ఐపీఎల్ ఆరంభం నుంచి బరిలోకి దిగుతున్నా... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఆర్సీబీ... ఈసారి మెరుగైన ప్రదర్శనతో తమ చిరకాల కల నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. వరుస విజయాలు సాధించలేకపోతున్నా... మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి బెంగళూరు బౌలింగ్ దళం మెరుగైన ప్రదర్శన చేస్తుండగా... బ్యాటర్లు ఫర్వాలేదనిపిస్తున్నారు. భువనేశ్వర్, యశ్ దయాళ్, హాజల్వుడ్, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మతో కూడిన బౌలింగ్ బృందం ఆర్సీబీకి ప్రధాన బలంగా మారింది. ఇక బ్యాటింగ్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి చక్కటి ఆటతీరు కనబరుస్తుండగా... కెప్టెన్ రజత్ పాటీదార్ నుంచి యాజమాన్యం మరింత ఆశిస్తోంది. మిడిలార్డర్లో జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, డేవిడ్, కృనాల్ కీలకం కానున్నారు. వీరంతా కలిసికట్టుగా కదంతొక్కితే బెంగళూరు భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నుంచి ఆర్సీబీకి ప్రధాన సవాలు ఎదురుకానుంది. అందరి చూపు... వైభవ్ వైపు మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన రాయల్స్... ఆ తర్వాత రెండు మ్యాచ్లు నెగ్గింది. అనంతరం ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ రాజస్తాన్కు పరాజయాలే పలకరించాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన స్థితిలో బెంగళూరుతో పోరుకు రెడీ అయింది. బౌలర్ల ఫామ్ లేమి, బ్యాటర్ల నిలకడ లేమికి తోడు... కెప్టెన్ సామ్సన్ గాయం రాజస్తాన్ను ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు సానుకూల అంశం ఏదైనా ఉంది అంటే... గత మ్యాచ్ ద్వారానే ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ. తొలి పోరులో అంతర్జాతీయ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ 14 ఏళ్ల బుడ్డోడు... ఆడిన మొదటి బంతికే సిక్స్ కొట్టి సంచలనం రేపాడు. క్రీజులో ఉన్నంతసేపు లక్నో బౌలర్లను ఓ ఆటాడుకున్న సూర్యవంశీ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లో ఉండగా... నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్మైర్, శుభమ్ దూబే రాణించాల్సిన అవసరముంది. అటు కెప్టెన్ గా, ఇటు మిడిలార్డర్ బ్యాటర్గా రియాన్ పరాగ్పై అదనపు బాధ్యతలు ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే పేస్ బాధ్యతలు చూసుకోనుండగా... వణిండు హసరంగా స్పిన్ భారం మోయనున్నాడు.33 ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, రాజస్తాన్ జట్లు ముఖాముఖిగా 33 సార్లు తలపడ్డాయి. 16 మ్యాచ్ల్లో బెంగళూరు, 14 మ్యాచ్ల్లో రాజస్తాన్ విజయం సాధించాయి. 3 మ్యాచ్లు రద్దయ్యాయి. రాజస్తాన్పై బెంగళూరు అత్యధిక స్కోరు 200కాగా, అత్యల్ప స్కోరు 70 పరుగులు. బెంగళూరుపై రాజస్తాన్ అత్యధిక స్కోరు 217కాగా, అత్యల్ప స్కోరు 58 పరుగులు. తుది జట్లు (అంచనా) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, పడిక్కల్, జితేశ్ శర్మ, షెఫర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హాజల్వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ. రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్ ), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్మైర్, శుభమ్ దూబే, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ. -
శ్రీలంక జట్టులో భారీ మార్పులు
కొలంబో: స్వదేశంలో జరగనున్న మహిళల ముక్కోణపు వన్డే టోర్నమెంట్ కోసం శ్రీలంక జట్టు భారీ మార్పులు చేసింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం శ్రీలంక జట్టు 8 మార్పులు చేసి బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో పాటు భారత్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు 0–2తో సిరీస్ కోల్పోవడంతో జట్టును ప్రక్షాళన చేసింది. సీనియర్ బ్యాటర్ చమరి ఆటపట్టు లంక జట్టుకు సారథ్యం వహిస్తుండగా... న్యూజిలాండ్తో టి20 సిరీస్లో ఆకట్టుకున్న మీడియం పేసర్ మల్కీ మదారాకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నమెంట్లో ఒక్కో జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసి సార్లు తలపడనుంది. మ్యాచ్లన్నీ ప్రేమదాస స్టేడియంలోనే జరగనున్నాయి. వచ్చే నెల 11న ఫైనల్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంకతో భారత అమ్మాయిల జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. శ్రీలంక జట్టు: చమరి ఆటపట్టు (కెప్టెన్ ), హర్షిత సమరవిక్రమ, విష్మీ గుణరత్నె, నీలాక్షిక సిల్వ, కవిషా దిల్హారి, అనుష్క సంజీవని, మనుడి ననయక్కర, హాసిని పెరెరా, ఆచిని కులసూర్య, పియూమి బడాల్గే, దేవ్మి విహంగ, హన్సిమ కరుణరత్నె, మల్కీ మదారా, ఇనోషి ప్రియదర్శిని, సుగంధిక కుమారి, రష్మిక, ఇనోక రణవీర. -
SRH Vs MI: రైజర్స్ పరాజయాల ‘సిక్సర్’
ఐపీఎల్–2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే అనిపిస్తోంది... గత ఏడాది రన్నరప్ ఈసారి పేలవ ప్రదర్శనతో ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఆరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది...ముంబై పేసర్లు బౌల్ట్, చహర్ ధాటికి 13/4 వద్ద నిలిచి, ఆపై ఎలాగోలా 143 వరకు చేరినా... ఆ స్కోరు ఓటమిని తప్పించలేకపోయింది. రోహిత్ శర్మ మరో చక్కటి అర్ధ సెంచరీతో ముందుండి నడిపించగా మరో 26 బంతుల ముందే ముంబై విజయతీరం చేరింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో మ్యాచ్ మ్యాచ్కీ జోరు పెంచుతూ చెలరేగుతున్న ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై నెగ్గింది. ముందుగా రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్లాసెన్ (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీ చేయగా, అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 146 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆదుకున్న క్లాసెన్... ఒకటి, రెండు, మూడు, నాలుగు... సన్రైజర్స్ టాప్–4 బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో ఇన్నింగ్స్ మరీ పేలవంగా ప్రారంభమైంది. హెడ్ (0), అభిషేక్ శర్మ (8), నితీశ్ కుమార్ రెడ్డి (2) చెత్త షాట్లు ఆడి నిష్క్రమించగా, ఇషాన్ కిషన్ (1) తన వికెట్ తానే ఇచ్చుకున్నాడు. ఈ సీజన్లో అత్యల్ప పవర్ప్లే స్కోరు (24) సన్రైజర్స్ నమోదు చేసింది. కొద్దిసేపటికి అనికేత్ వర్మ (12) కూడా వెనుదిరగడంతో 35/5 వద్ద రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి. స్కోరు 100 దాటుతుందా అనే సందేహం కనిపించింది. బ్యాటింగ్ కుప్పకూలటంతో ఇంపాక్ట్ ప్లేయర్గా అదనపు బ్యాటర్ మనోహర్ను తీసుకోవాల్సి వచ్చింది. క్లాసెన్, మనోహర్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. 34 బంతుల్లో క్లాసెన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. బుమ్రా బౌలింగ్లో రివర్స్ స్కూప్తో అతను కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. క్లాసెన్, మనోహర్ ఆరో వికెట్కు 63 బంతుల్లో 99 పరుగులు జోడించారు. చకచకా లక్ష్యం వైపు... స్వల్ప ఛేదనలో ముంబై ఆరంభంలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత జట్టుకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, విల్ జాక్స్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్కు 46 బంతుల్లోనే 64 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. జాక్స్ వెనుదిరిగిన తర్వాత రోహిత్కు సూర్య జత కలిశాడు. 35 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. హర్షల్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి మరింత జోరు ప్రదర్శించిన రోహిత్ ఎట్టకేలకు విజయానికి మరో 14 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) నమన్ (బి) బౌల్ట్ 0; అభిషేక్ (సి) పుతూర్ (బి) బౌల్ట్ 8; ఇషాన్ కిషన్ (సి) రికెల్టన్ (బి) దీపక్ చహర్ 1; నితీశ్ రెడ్డి (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 2; క్లాసెన్ (సి) తిలక్ (బి) బుమ్రా 71; అనికేత్ (సి) రికెల్టన్ (బి) పాండ్యా 12; మనోహర్ (హిట్ వికెట్) (బి) బౌల్ట్ 43; కమిన్స్ (బి) బౌల్ట్ 1; హర్షల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–13, 4–13, 5–35, 6–134, 7–142, 8–143. బౌలింగ్: దీపక్ చహర్ 4–0– 12–2, బౌల్ట్ 4–0–26–4, బుమ్రా 4–0–39–1, సాంట్నర్ 4–0–19–0, పాండ్యా 3–0–31–1, పుతూర్ 1–0–15–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి అండ్ బి) ఉనాద్కట్ 11; రోహిత్ (సి) అభిషేక్ (బి) మలింగ 70; జాక్స్ (సి)మనోహర్ (బి) అన్సారీ 22; సూర్యకుమార్ (నాటౌట్) 40; తిలక్వర్మ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 1; మొత్తం (15.4 ఓవర్లలో 3 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–13, 2–77, 3–130. బౌలింగ్: కమిన్స్ 3–0–31–0, ఉనాద్కట్ 3–0–25–1, హర్షల్ 3–0–21–0, ఇషాన్ మలింగ 3–0–33–1, అన్సారీ 3.4–0–36–1. అవుట్ కాకుండానే... సన్రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అనూహ్య రీతిలో వెనుదిరిగాడు. దీపక్ చహర్ వేసిన బంతి అతని లెగ్సైడ్ దిశగా వెళ్లగా కిషన్ గ్లాన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే కీపర్ రికెల్టన్ బంతిని అందుకున్న మరుక్షణమే కిషన్ అవుట్గా భావించి స్వచ్ఛందంగా పెవిలియన్ వైపు నడిచాడు. నిజానికి ముంబై ఆటగాళ్లు ఎవరూ గట్టిగా అప్పీల్ కూడా చేయకపోగా... అంపైర్ వినోద్ శేషన్ కూడా వైడ్గా ప్రకటించేందుకు రెండు చేతులు పైకెత్తబోయాడు. అయితే కిషన్ స్పందనను చూసిన అతను తన నిర్ణయాన్ని మార్చుకొని అవుట్గా ఖాయం చేశాడు. కిషన్ తనంతట తానే వెళ్లిపోవడాన్ని ముంబై కెప్టెన్ పాండ్యా భుజం తట్టి మరీ అభినందించాడు. అయితే ఆ తర్వాత రీప్లేల్లో అతని బ్యాట్కు బంతి తగల్లేదని, నాటౌట్ అని తేలింది. ఇషాన్ కిషన్ అతిగా స్పందించకుండా ఉంటే వికెట్ చేజారేదే కాదు.ఐపీఎల్లో నేడుబెంగళూరు X రాజస్తాన్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై విజయ భేరి మోగించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలోనే చేధించింది.ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40 నాటౌట్) మెరుపు మెరిపించాడు. సన్రైజర్స్ బౌలర్లలో ఉనద్కట్, మలింగ, అన్సారీ తలా వికెట్ సాధించారు. క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ వృధా..సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అభినవ్ మనోహర్ కీలక నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు. -
IPL 2025: జస్ప్రీత్ బుమ్రా 'ట్రిపుల్ సెంచరీ'..
టీమిండియా పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20ల్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్తో బుమ్రా ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన రెండో ఇండియన్ ఫాస్ట్ బౌలర్గా బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో బుమ్రా కంటే ముందు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(318) ఉన్నాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్గా బుమ్రా నిలిచాడు. అదేవిధంగా మరో ఘనతను బుమ్రా ఈ మ్యాచ్లో సాధించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ(170) రికార్డును బుమ్రా సమం చేశాడు.మరో వికెట్ పడగొడితే మలింగను జస్ప్రీత్ అధిగమిస్తాడు. అయితే ఈ మ్యాచ్లో బుమ్రా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 39 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్లు వీరే యుజ్వేంద్ర చాహల్ - 373పీయూష్ చావ్లా - 319భువనేశ్వర్ కుమార్ - 318రవిచంద్రన్ అశ్విన్ - 315జస్ప్రీత్ బుమ్రా - 300 -
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో భారీ సిక్సర్ నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్బుతమైన సిక్స్ బాదాడు. అతడు కొట్టిన షాట్కు బంతి 107 మీటర్ల దూరం వెళ్లి ప్రేక్షకుల మధ్య పడింది.ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన ముంబై స్పిన్నర్ విఘ్నేష్ పుథూర్.. తొలి బంతిని క్లాసెన్కు షార్ట్బాల్గా సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఈ షాట్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరిట ఉండేది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో శర్మ 106 సిక్సర్ల బాదాడు. తాజా మ్యాచ్తో అభిషేక్ను క్లాసెన్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్లో క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను క్లాసెన్ తన ఫైటింగ్ నాక్తో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు. Upping the ante. Heinrich Klaasen and Abhinav Manohar on the move 👌A fighting 34-ball FIFTY from Heinrich Klaasen 👏Updates ▶ https://t.co/nZaVdtxbj3 #TATAIPL | #SRHvMI | @SunRisers pic.twitter.com/6waLHTurl5— IndianPremierLeague (@IPL) April 23, 2025 -
ఇషాన్ కిషన్.. నీకు కొంచమైనా తెలివి ఉందా? వీడియో వైరల్
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఔటైన విధానం తీవ్ర చర్చనీయాంశమైంది. అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా కిషన్ మాత్రం తనంతట తానే మైదానాన్ని వీడేందుకు సిద్దం కావడం అందరని షాక్కు గురిచేసింది.అసలేమి జరిగిందంటే?ట్రావిస్ హెడ్ ఔటయ్యాక క్రీజులోకి ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు వచ్చాడు. ఈ క్రమంలో 3వ ఓవర్ వేసిన దీపక్ చాహర్ తొలి బంతిని కిషన్కు లెగ్ సైడ్ వైపునకు సంధించాడు. ఆ బంతిని డౌన్ ది లెగ్ ఆడటానికి ఇషాన్ ప్రయత్నించాడు. కానీ బంతి కిషన్ బ్యాట్ మిస్స్ అయ్యి వికెట్ కీపర్ రికెల్టన్ చేతికి వెళ్లింది. వెంటనే కిషన్ మాత్రం ఔట్ అని భావించి పెవిలియన్కు వైపు నడిచాడు. అప్పటికి బౌలర్, వికెట్ కీపర్ కనీసం అప్పీల్ కూడా చేయలేదు. ఎప్పుడైతే కిషన్ వెళ్లిపోవడం చూసి అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. కిషన్ ఏదో క్రీడా స్పూర్తి ప్రదర్శించి వెళ్లిపోయాడని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. రిప్లేలో బంతి కనీసం బ్యాట్ కి గాని గ్లౌస్కి, బాడీ కి గానీ తగిలిన ఆనవాళ్లు రిప్లేలో కన్పించలేదు. అతడు ఔటైన తర్వాత ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో కిషన్పై ఎస్ఆర్హెచ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కొంచెం అయినా తెలివి ఉందా అంటూ పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.Fairplay or facepalm? 🤯 Ishan Kishan walks... but UltraEdge says 'not out!' What just happened?!Watch the LIVE action ➡ https://t.co/sDBWQG63Cl #IPLonJioStar 👉 #SRHvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bQa3cVY1vG— Star Sports (@StarSportsIndia) April 23, 2025Mumbai Indians players forgot the entire script, But thanks to umpire and Ishan Kishan who remembered it correctly...#SRHvsMI pic.twitter.com/dN7f5oZEub— Dr Artistic Soul (@dr_artisticsoul) April 23, 2025 -
IPL 2025: ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన ముంబై..
IPL 2025 SRH Vs MI Live updates: ఐపీఎల్-2025లో ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన ముంబై..ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40 నాటౌట్) మెరుపు మెరిపించాడు. సన్రైజర్స్ బౌలర్లలో ఉనద్కట్, మలింగ, అన్సారీ తలా వికెట్ సాధించారు. ముంబై రెండో వికెట్ డౌన్..రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన రోహిత్.. మలింగ బౌలింగ్లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 32 బంతుల్లో 14 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(26) ఉన్నాడు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. రోహిత్ శర్మ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో రోహిత్(52) తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న రోహిత్..4 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(25), విల్ జాక్స్(7) ఉన్నారు.ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్..144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్.. జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్లో ఔటయ్యాడు.చెలరేగిన క్లాసెన్.. ముంబై టార్గెట్ ఎంతంటే?టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అభినవ్ మనోహర్ కీలక నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు.హెన్రిచ్ క్లాసెన్ ఫిప్టీ..హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తన ఫైటింగ్ నాక్తో ఎస్ఆర్హెచ్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్తున్నాడు.15 ఓవర్లు ముగిసే సరికి సన్రైజర్స్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.దూకుడు పెంచిన క్లాసెన్..10 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(25), మనోహర్(1) ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 13 పరుగులకే 4 వికెట్లుఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ కేవలం 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రావిస్ హెడ్(0), కిషన్(1), అభిషేక్ శర్మ(8),నితీష్ రెడ్డి(2) వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ తలా రెండు వికెట్లు సాధించారు.ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్కు భారీ షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్(0) రూపంలో సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్లో హెడ్ పెవిలియన్కు చేరాడు.2 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.👉ఈ మ్యాచ్కు ముందు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా సన్రైజర్స్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఓ నిమిషం మౌనం పాటించారు.ఐపీఎల్-2025లో ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ నల్లటి బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు.ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. పేసర్ అశ్వినీ కుమార్ స్దానంలో విఘ్నేష్ పుత్తర్ తుది జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ఎస్ఆర్హెచ్ పక్కన పెట్టింది. అతడి స్ధానంలో జయదేవ్ ఉనద్కట్ జట్టులోకి వచ్చాడు.తుది జట్లుసన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్ -
ఇక చాలు.. పాకిస్తాన్తో క్రికెట్ ఆడొద్దు: విరాట్ కోహ్లి ఫ్రెండ్
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ క్రీడా లోకం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ క్రూరమైన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ.. అందుకు బాధ్యలైన వారికి తగిన గుణపాఠం చెప్పాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి తీవ్రంగా స్పందించాడు. భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలను పూర్తిగా నిలిపివేయాలని అతడు బీసీసీఐకి లేఖకు రాశాడు. ఇందుకు సంబంధించిన లెటర్ను తన ఎక్స్ ఖాతాలో గోస్వామి పోస్ట్ చేశాడు."ఈ విషాదకర ఘటన సమయంలో నేను ఒక విషయం చెప్పాలనకుంటున్నాను. ఇకపై పాకిస్తాన్తో క్రికెట్ ఆడడం మానేయాలి. ఇప్పుడే కాదు పాక్తో పూర్తిగా క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును పాకిస్తాన్కు పంపనందుకు ఆ దేశ మాజీ క్రికెటర్లు కొంతమంది ఏదో ఏదో మాట్లాడారు.ఆటను రాజకీయాలను కలపొద్దంటూ లేనిపోని మాటలు చెప్పారు. వారు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు. అమాయక భారతీయులను హత్య చేయడమే వారి జాతీయ క్రీడలా కనిపిస్తోంది. బ్యాట్లు, బంతులతో కాకుండా వారి బాషలోనే మనం కూడా సమాధానం చెప్పాలి" అని గోస్వామి తన నోట్లోపేర్కొన్నాడు. కాగా ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఐపీఎల్ 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన శ్రీవత్స్ గోస్వామి, ఆ తర్వాత కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్లకు ప్రాతినిథ్యం వహించాడు. అదేవిధంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో కలిసి భారత్ అండర్-19 జట్టుకు గోస్వామి ఆడాడు. -
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన భారత క్రికెటర్లు..
పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. మంగళవారం దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు విచాక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.దేశ వ్యాప్తంగా ఈ టెర్రర్ ఎటాక్పై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని 140 కోట్ల మంది భారతీయలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉగ్రదాడి ఘటనను భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్తో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ మృతుల కుటంబాలకు సంతాపం తెలియజేశారు."పహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన దారుణమైన దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు ఆ బలాన్ని చేకూర్చాలని ఆ దేవుడును ప్రార్థిస్తున్నాను"- విరాట్ కోహ్లి2 Virat Kohli pic.twitter.com/eAUtXo8hYZ— Virushka🫶❤️ (@KohliTheGOAT18) April 23, 2025"పహల్గామ్లో జరిగిన దాడి గురించి తెలిసిన వెంటనే నా హృదయం బరువెక్కిపోయింది. బాధితుల కుటంబాలకు ఆ దేవుడు తోడుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. ఇలాంటి హింసకు మన దేశంలో చోటు లేదు"- శుబ్మన్ గిల్"కశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలలకు బలం చేకూరాలని ఆ దేవడును ప్రార్థిస్తున్నాను"-కేఎల్ రాహుల్"బాధిత కుటుంబాల కోసం మనమంతా అండగా నిలుద్దాం. ఎవరైతే ఈ దుశ్చర్యకు బాధ్యులో వారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. తప్పకుండా భారత్ స్ట్రైక్ అవుతుంది"-గౌతం గంభీర్👉భారత కెప్టెన్ రోహిత్ శర్మ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీలను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.👉పెహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, మంబై ఇండియన్స్ మధ్య జరగనున్న మ్యాచ్లో ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లు ధరించి బరిలోకి దిగనున్నారు. అదేవిధంగా ఈ మ్యాచ్ను చీర్లీడర్స్ లేకుండా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాణాసంచా కూడా పేల్చవద్దు అని నిర్ణయించారు -
బంగ్లాకు భారీ షాక్.. జింబాబ్వే సంచలన విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు వారి సొంతగడ్డపై పసి కూన జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. సిల్హాట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్పై 3 వికెట్ల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ (52) టాప్ స్కోరర్గా నిలవగా..బెన్ కుర్రాన్(44) పరుగులతో రాణించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మెహాది హసన్ మిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. తైజుల్ ఇస్లాం రెండు వికెట్లు సాధించాడు. కాగా ఇది జింబాబ్వేకు నాలుగేళ్ల తర్వాత దక్కిన తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. జింబాబ్వే బౌలర్లు చెలరేగడంతో తమ బౌలర్లు చెలరేగడంతో మొదటి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలింది.జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. న్యాయుచి, మదెవెరె చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్లో 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) పర్వాలేదన్పించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్లో కూడా బంగ్లా బ్యాటర్లు తీరు ఏ మాత్రం మారలేదు. సెకెండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 255 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శాంటో(60), జాకీర్(58), మోమినల్(47) మినహా మిగితా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే ముందు కేవలం 174 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి పర్యాటక జట్టు చేధించింది. బంగ్లాపై జింబాబ్వేకు ఇది రెండో టెస్టు విజయం. కాగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఏప్రిల్ 28 నుంచి ఛటోగ్రామ్ వేదికగా జరగనుంది. -
సంచలన విజయం దిశగా జింబాబ్వే
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న జింబాబ్వే క్రికెట్ జట్టు.. సిల్హెట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో సంచలన విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్లో జింబాబ్వే గెలుపుకు మరో 57 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్లో జింబాబ్వే గెలిస్తే ఆరేళ్ల తర్వాత బంగ్లా గడ్డపై విజయం సాధించినట్లవుతుంది. చివరిగా జింబాబ్వే 2018 నవంబర్లో బంగ్లాదేశ్ను వారి సొంతగడ్డపై ఓడించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలింది. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ దెబ్బకొట్టారు. బంగ్లాదేశ్కు సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోర్.బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.మిగతా బ్యాటర్లలో బెన్ కర్రన్ 18, నిక్ వెల్చ్ 2, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 8, వెల్లింగ్టన్ మసకద్జ 6, ముజరబానీ 17, న్యాయుచి 7 పరుగులకు ఔటయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.82 వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చి 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో జింబాబ్వే ముందు కేవలం 174 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే అద్భుతంగా ఆడుతూ విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు టీ విరామం సమయానికి జింబాబ్వే గెలుపుకు 57 పరగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్లో జింబాబ్వే స్కోర్ 117/2గా ఉంది. బ్రియాన్ బెన్నెట్ (52), సీన్ విలియమ్స్ (0) క్రీజ్లో ఉన్నారు. -
ఇలాంటివన్ని పాకిస్తాన్ క్రికెట్లోనే జరుగుతాయి.. సహచరుడికే ఇచ్చి పడేసిన బౌలర్
చిత్రవిచిత్ర ఘటనలన్నీ పాకిస్తాన్ క్రికెట్లోనే జరుగుతాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో భాగంగా ఓ ఆటగాడు వికెట్ తీసిన ఆనందంలో సొంత జట్టు ఆటగాడిపైనే దాడి చేశాడు (అనుకోకుండా). ఈ ఘటనలో బాధిత ఆటగాడి తలకు గాయమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది.Update: Everyone is ok 🤗Khel Khel main 😄#HBLPSLX l #ApnaXHai l #MSvLQ pic.twitter.com/sJBcX91wai— PakistanSuperLeague (@thePSLt20) April 22, 2025ఇంతకీ ఏం జరిగిందంటే.. పీఎస్ఎల్ 2025లో భాగంగా నిన్న లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ లాహోర్ ఖలందర్స్పై 33 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. ఖలందర్స్ను సుల్తాన్స్ బౌలర్ ఉబైద్ షా 3 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు.ఈ ఉబైద్ షానే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వికెట్ (సామ్ బిల్లింగ్స్) తీసిన ఆనందంలో పొరపాటున సహచరుడు ఉస్మాన్ ఖాన్ (వికెట్కీపర్) తలపై దాడి చేశాడు. వికెట్ తీశాక సంబరాల్లో భాగంగా ఉబైద్ షా సహచరులకు హై ఫై ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఉస్మాన్ ఖాన్ కూడా తన చేయి పైకి లేపాడు. అప్పటికే జోరుమీదున్న ఉబైద్.. పొరపాటు ఉస్మాన్ చేయిపై కాకుండా తలపై హై ఫై ఇచ్చాడు. ఈ ఘటనతో దిమ్మతిరిగిపోయిన ఉస్మాన్ తల పట్టుకుని నేల వాలాడు. ఇది చూసి మైదానంలో ఉన్న వారంతా పక్కున నవ్వుకున్నారు.ఊహించని చర్యతో షాక్కు గురైన ఉస్మాన్ కొద్ది సేపు మైదానంలో పడిపోయాడు. ఫిజియో పరిశీలించాక ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఉస్మాన్ మ్యాచ్లో కొనసాగాడు. ఈ ఘటన కారణంగా మ్యాచ్కు కొద్ది సేపు అంతరాయం కలిగింది. కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 గత కొన్ని రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ లీగ్లోని ఓ ఫ్రాంచైజీ (కరాచీ కింగ్స్) బాగా రాణించిన తమ ఆటగాళ్లకు హెయిర్ డ్రయర్లు, హెయిర్ ట్రిమ్మర్లు బహుమతులగా ఇచ్చి నవ్వులపాలైంది. ఈ ఏడాది పీఎస్ఎల్ ఐపీఎల్కు పోటీగా ఒకే సమయంలో జరుగుతుంది. ఐపీఎల్ కంటే తమ లీగే గొప్పదంటూ ఢాంబికాలకు పోయిన పాక్ క్రికెట్ బోర్డు ఇలా చేసింది. తీరా చూస్తే ఐపీఎల్ కారణంగా ఒకరిద్దరున్న పీఎస్ఎల్ అభిమానులు కూడా ఆ లీగ్ను చూడటం మానేశారు. ఐపీఎల్తో పోటీ కారణంగా ఈ సీజన్లో పీఎస్ఎల్ అభిమానులు ఒక్కసారిగా తగ్గిపోయారు. స్టేడియంలో స్టాండ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక పాక్ క్రికెట్ బోర్డు అధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు. -
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు (ఏప్రిల్ 23) ఐపీఎల్లో జరుగబోయే సన్రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్కు ముందు ఓ నిమిషం మౌనం పాటించాలని నిర్ణయించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ నల్లటి బ్యాండ్లు ధరించాలని పిలుపునిచ్చింది. మ్యాచ్ సమయంలో బాణసంచా కాల్చకూడదని గైడ్ లైన్స్ జారీ చేసింది. మ్యాచ్ సందర్భంగా చీర్ లీడర్ల ప్రదర్శనలు ఉండవని స్పష్టం చేసింది.కాగా, కశ్మీర్లోని పహల్గామ్లో నిన్న (ఏప్రిల్ 22) మధ్యాహ్నం భయానమైన ఉగ్రవాద దాడి జరిగింది. పహల్గామ్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు. 2019 పుల్వామా దాడి తర్వాత కశ్మీర్లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఇదే. ఈ విషాద ఘటనతో దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. బీసీసీఐ సహా భారత క్రికెటర్లు బాధితులకు నివాళులర్పించి, సంతాపం తెలియజేశారు.ఇదిలా ఉంటే, ఇవాళ (ఏప్రిల్ 23) రాత్రి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు తలపడటం ఇది రెండోసారి. ఏప్రిల్ 17న తమ హోం గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ముంబై హైదరాబాద్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో సన్రైజర్స్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్లో ఓడితే సన్రైజర్స్ అనధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించినట్లే. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కు కూడా కీలకమే. ఆ జట్టు కూడా ఈ మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఈ సీజన్లో సన్రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో ఐదింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ముంబై 8 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి ఆరో స్థానంలో కొనసాగుతుంది.నేటి మ్యాచ్ సన్రైజర్స్ తమ సొంత ఇలాకాలో ఆడుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. తమ విధ్వంసకర ఆటగాళ్లు ఈ మ్యాచ్లో తప్పక చెలరేగుతారని సన్రైజర్స్ అభిమానులు ఆశిస్తున్నారు. సన్రైజర్స్కు హోం గ్రౌండ్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ ఆడిన మ్యాచ్ల్లో ఆ జట్టు ఆటగాళ్లు పేట్రేగిపోయారు. నేటి మ్యాచ్లో అదే జోరు కొనసాగిస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. తుది జట్లు (అంచనా)సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (wk), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్ -
PSL 2025: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ టీ20ల్లో అత్యంత అరుదైన 13000 పరుగుల క్లబ్లో చేరాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో కరాచీ కింగ్స్కు ఆడుతున్న వార్నర్.. పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్లో ఈ మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ (47 బంతుల్లో 60; 8 ఫోర్లు) చేసిన వార్నర్.. పొట్టి క్రికెట్లో 13000 పరుగులు పూర్తి చేసిన ఆరో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన మూడో ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. వార్నర్ 403 ఇన్నింగ్స్ల్లో 13000 పరుగులు పూర్తి చేశాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ కేవలం 381 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. గేల్ తర్వాత విరాట్ కోహ్లి (386 ఇన్నింగ్స్ల్లో) అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించాడు.టీ20ల్లో 13000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 14562అలెక్స్ హేల్స్- 13610షోయబ్ మాలిక్- 13571కీరన్ పోలార్డ్- 13537విరాట్ కోహ్లి- 13208డేవిడ్ వార్నర్- 13019టీ20ల్లో అత్యంత వేగంగా 13000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 381 ఇన్నింగ్స్లువిరాట్ కోహ్లి- 386డేవిడ్ వార్నర్- 403అలెక్స్ హేల్స్- 474షోయబ్ మాలిక్- 487కీరన్ పోలార్డ్- 594కరాచీ కింగ్స్, పెషావర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ రాణించడంతో పెషావర్ జల్మీపై కరాచీ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది.పెషావర్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (46) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో మహ్మద్ హరీస్ (28), అల్జరీ జోసఫ్ (24 నాటౌట్), తలాత్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. సైమ్ అయూబ్ 4, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ 7, మిచెల్ ఓవెన్ 5, అబ్దుల్ సమద్ 2, లూక్ వుడ్ 2 పరుగులకు ఔటయ్యారు. కరాచీ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో 3 వికెట్లు తీయగా.. ఆమెర్ జమాల్, మీర్ హమ్జా చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ కూడా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడింది. అతి కష్టం మీద ఆ జట్టు 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కరాచీ గెలుపుకు ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (60) గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. అయితే చివర్లో ఖుష్దిల్ షా (23 నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేసి కరాచీని విజయతీరాలకు చేర్చాడు. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ 3, అలీ రజా 2, అల్జరీ జోసఫ్, ఆరిఫ్ యాకూబ్ తలో వికెట్ పడగొట్టారు. -
LSG VS DC: ఆ కారణం చెప్పి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు: పంత్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 22) రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ, ఎల్ఎస్జీ తలపడ్డాయి. లక్నో హోం గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. మార్క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) తొలి వికెట్కు 10 ఓవర్లలో 87 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చినా ఆ ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు సరిగ్గా ఆడకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆఖర్లో ఆయుశ్ బదోని (21 బంతుల్లో 36) బ్యాట్ ఝులిపించడంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన పంత్ రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. మార్క్రమ్ ఔటయ్యాక మూడో స్థానంలో బ్యాటింగ్కు రావాల్సిన పంత్ ఆఖరి ఓవర్లో బ్యాటింగ్కు రావడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్లో ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్గా కూడా విఫలమైన పంత్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్లో లక్నోకు ఢిల్లీ చేతిలో ఇది రెండో ఓటమి. వైజాగ్లో జరిగిన తొలి మ్యాచ్లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది.నిన్నటి మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చాలా బాధగా కనిపించాడు. ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 20 పరుగులు తక్కువ చేశామని తెలుసు. ఈ మైదానంలో టాస్ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. తొలుత బౌలింగ్ చేసే జట్టుకు వికెట్ నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఛేజింగ్ సమయంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. ఈ పిచ్పై ఇది ఎప్పుడూ జరిగేదే. దీన్ని సాకుగా చూసి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు.బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కు వెళ్లడంపై స్పందిస్తూ.. వికెట్ తీరును సద్వినియోగం చేసుకుంటాడని సమద్ను ముందుగా పంపాము. మిల్లర్ను సైతం అదే ఉద్దేశంతో నా కంటే ముందు బరిలోకి దించాము. వికెట్ తీరు ముందు ఇవేవి వర్కౌట్ కాలేదు. తదుపరి మ్యాచ్లపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు. బృంద సభ్యులందరం కలిసి కూర్చుంటాము. అప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్పై డిస్కస్ చేస్తాము. ఈ ఓటమిని ఇక్కడే మరచిపోయే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాము. ఈ మ్యాచ్లో ఓడినా లక్నో పాయింట్ల పట్టికలో మరో స్థానం కిందికి దిగజారలేదు. అయితే రన్రేట్ మాత్రం మైనస్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు -0-054 రన్రేట్తో ఐదో స్థానంలో (10 పాయింట్లు) కొనసాగుతుంది. గుజరాత్, ఢిల్లీ చెరి 12 పాయింట్లతో టాప్-2లో ఉండగా.. ఆర్సీబీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్పోల్ (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను గుండెపోటుతో మరణించారని తెలుస్తుంది. కీత్కు 60వ దశకంలో మంచి బ్యాటర్గా పేరుంది. లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన కీత్ ఆస్ట్రేలియా తరఫున 43 టెస్ట్లు, 6 వన్డేలు ఆడి 7 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు చేశాడు.1966లో ఇంగ్లండ్పై మిడిలార్డర్ బ్యాటర్గా కెరీర్ ప్రారంభించిన కీత్.. 1969లో ఓపెనర్గా మారాడు. ఆ సమయంలో అతను బిల్ లారీతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ను ప్రారంభించేవాడు. కీత్కు ఇంగ్లండ్పై మంచి ట్రాక్ రికార్డు ఉంది. 1972 యాషెస్ సిరీస్లో అతను 53.88 సగటున 3 సెంచరీల సాయంతో 485 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. కీత్ తన కెరీర్ బెస్ట్ స్కోర్ 207 పరుగులను కూడా ఇంగ్లండ్పైనే చేశాడు. కీత్ 1973లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. కీత్ మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బెయిర్డ్ సంతాపం వ్యక్తం చేశారు. దేశవాలీ క్రికెట్లో విక్టోరియాకు ప్రాతినిథ్యం వహించిన కీత్.. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 10100 పరుగులు చేసి 148 వికెట్లు పడగొట్టాడు. కీత్ రిటైర్మెంట్ (1974) తర్వాత టీవీ మరియు రేడియో వ్యాఖ్యాతగా కూడా పని చేశారు. కీత్ చాలామంది ఆసీస్ ప్లేయర్లకు మెంటార్గా కూడా పని చేశాడు. కీత్.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొట్టమొదటి వన్డేలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్లో అతను 3 వికెట్లు తీశాడు. -
LSG VS DC: పంత్పై మండిపడుతున్న అభిమానులు.. గొయెంకాకు సరైన శాస్తి జరిగింది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చెత్త ప్రదర్శన కొనసాగుతుంది. నిన్న (ఏప్రిల్ 22) ఢిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. ఈ సీజన్లో పంత్కు ఇది రెండో డకౌట్.ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో పంత్ కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ చెత్త ఆటతీరు, కెప్టెన్గా తీసుకున్న చెత్త నిర్ణయాలు నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో లక్నో కొంపముంచాయి. ఓపెనర్లు మార్క్రమ్, మార్ష్ మంచి ఆరంభం ఇచ్చినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించారు.వరుస వైఫల్యాల నేపథ్యంలో పంత్ భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా రాహుల్ లాంటి ఆణిముత్యాన్ని వదులుకుని పంత్ లాంటి చెత్తను రూ. 27 కోట్లకు కొనుక్కున్నాడని కామెంట్లు చేస్తున్నారు. రాహుల్ను కాదనుకుని ఎంతో నమ్మకంతో కెప్టెన్సీ కూడా కట్టబెడితే ఇదేనా వెలగబెట్టేదని మండిపడుతున్నారు. పంత్కు 27 లక్షలు కూడా దండగే అని అంటున్నారు. ఈ దెబ్బతో పంత్ పని అయిపోయిందని చర్చించుకుంటున్నారు.కాగా, నిన్నటి మ్యాచ్లో పంత్ ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గా కూడా ఘోరంగా విఫలమయ్యాడు. మార్క్రమ్ ఔటైన తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్కు రాకుండా పెద్ద తప్పిదమే చేశాడు. మూడో స్థానంలో కాకపోయినా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చినా లక్నో ఓ మోస్తరుకు మించి భారీ స్కోరే చేసేది. బ్యాటింగ్లో విఫలం కావడంతో పంత్ ఫీల్డింగ్ సమయంలో చాలా చిరాకుగా ఉన్నాడు. సహచరులపై అరుస్తూ కనిపించాడు. బౌలర్లను సరిగ్గా రొటేట్ చేయలేకపోయాడు. ఫలితంగా రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ రెచ్చిపోయారు.రాహుల్ గత సీజన్లో లక్నో యజమాని సంజీవ్ గొయెంకా చేతిలో ఎదురైన అవమానానికి నిన్నటి మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకున్నాడు. రాహుల్ గొయెంకాకు బ్యాట్తో బుద్ది చెప్పడమే కాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత అసలు రివెంజ్ తీర్చుకున్నాడు. గొయెంకా కరచాలనం చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేయగా రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఆ సమయంలో గొయెంకా పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ. లోలోపల రాహుల్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు బెంబేలెత్తిపోయుంటాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్కు ఇచ్చి పడేసిన రాహుల్
గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా తన పట్ల వ్యవహరించిన తీరుకు నాటి లక్నో కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీపై విజయానంతరం గొయెంకా కరచాలనం చేస్తూ తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. రాహుల్ చర్యకు గొయెంకా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటబ్బా రాహుల్ ఇలా ప్రవర్తించాడని అనుకున్నారు.THE COMEBACK MAN - KL RAHUL. 🦁 pic.twitter.com/EQ67LvjLVl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2025అయితే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. గత సీజన్లో సన్రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా రాహుల్ను బహిరంగంగా అవమానించాడు. అందరి ముందు నిలదీశాడు. గొయెంకా చర్యకు మనసు నొచ్చుకున్న రాహుల్ లక్నోను వీడి ఢిల్లీ పంచన చేరాడు. ఇప్పుడు అవకాశం రావడంతో లక్నో ఓనర్కు తన ఆటతీరుతోనే బుద్ది చెప్పాడు. తనను ఘోరంగా అవమానించిన గొయెంకాపై వారి సొంత మైదానంలోనే ప్రతీకారం తీర్చుకున్నాడు. Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో రాహుల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఢిల్లీని గెలిపించాడు. సిక్సర్తో మ్యాచ్ ముగించి గొయెంకాకు తానేమి చేయగలనో నిరూపించాడు. ఈ సీజన్లో లక్నోపై ఢిల్లీకి ఇది రెండో విజయం. వైజాగ్లో జరిగిన తొలి మ్యాచ్లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో రాహుల్ ఆ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచే గొయెంకాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసిన రాహుల్.. నిన్న అవకాశం రావడంతో తన దెబ్బను రుచి చూపించాడు. ఈ సీజన్లో రాహుల్ మాంచి కసితో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 323 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్లో రాహుల్ ఓ భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఎల్ఎస్జీలో రాహుల్ ప్రస్తానంలక్నో ఐపీఎల్ అరంగేట్రం నుంచి కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్.. తొలి రెండు సీజన్లలో (2022, 2023) ఆ జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చాడు. అయితే గత సీజన్లో రాహుల్ లక్నోను ప్లే ఆఫ్స్కు చేర్చలేకపోయాడు. గత సీజన్లో నెమ్మదిగా ఆడుతున్నాడని కూడా రాహుల్పై విమర్శలు వచ్చాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
ఉప్పల్లో సన్‘రైజ్’ అయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 18వ సీజన్లో నిలకడ కనబర్చలేకపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఏడు మ్యాచ్లాడి 2 విజయాలు 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న సన్రైజర్స్... బుధవారం మరో మారు ముంబై ఇండియన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. గత గురువారం వాంఖడే వేదికగా ముంబైతోనే తమ చివరి మ్యాచ్ ఆడిన ఎస్ఆర్హెచ్... స్వల్ప విరామం అనంతరం మరోసారి ముంబైతోనే తలపడుతోది. ఈ సీజన్లో ఆడితే బ్రహ్మండం... లేదంటే శూన్యం అన్నట్లు సాగుతున్న హైదరాబాద్... ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలుపు తప్పనిసరి. జట్టులో లెక్కకు మిక్కిలి హిట్టర్లు ఉన్నా... వారంతా కలిసి కట్టుగా కదం తొక్కలేకపోతుండటమే ఎస్ఆర్హెచ్ను ఇబ్బంది పెడుతోంది. సొంతగడ్డపై బీభత్సం సృష్టించే ఆరెంజ్ ఆర్మీ... ఉప్పల్లో అయినా తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది. మరోవైపు గత మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఫామ్లోకి వచ్చిన ముంబై ఇండియన్స్... అదే జోరు కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో పైపైకి దూసుకెళ్లాలని భావిస్తోంది. తాజా సీజన్లో ఆడిన తొలి 5 మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయమే సాధించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత గాడిన పడింది. స్టార్ పేసర్ బుమ్రా వచ్చాక బౌలింగ్ మరింత రాటుదేలగా... గత మ్యాచ్తో హిట్మ్యాన్ రోహిత్ శర్మ లయ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉప్పల్లో సన్రైజర్స్ పరుగుల ఉప్పెన సృష్టిస్తుందా లేక ముంబై గెలుపు జోరు కొనసాగుతుందా చూడాలి! టాపార్డర్ రాణిస్తేనే... గతేడాది నిలకడైన ప్రదర్శనతో రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ జట్టు... ఈసారి అదే తీవ్రత కొనసాగించలేకపోతోంది. తొలి పోరులో భారీ స్కోరు చేసి ప్రత్యర్థులను బెదరగొట్టిన రైజర్స్... ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది, ఎస్ఆర్హెచ్ తరఫున ఆడిన తొలి పోరులోనే సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత ఆకట్టుకోలేకపోతుండగా... గత సీజన్లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు’ దక్కించుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమవుతూ ఉన్నాడు. ఓపెనర్లు అభిõÙక్ శర్మ, ట్రావిస్ హెడ్పై జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. దానికి తగ్గట్లు వీరిద్దరు ఆడిన రోజు టీమ్ మొత్తం చెలరేగుతుండగా... ఓపెనర్లు విఫలమైన సందర్భంలో మాత్రం ఓ మాదిరి స్కోరు చేసేందుకు కూడా తడబడుతోంది. మిడిలార్డర్లో క్లాసెన్, అనికేత్ వర్మ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్లో ఇషాన్, నితీశ్ కూడా గాడిన పడాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. అటు బౌలింగ్లోనూ రైజర్స్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. కెప్టెన్ కమిన్స్తో పాటు టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుండగా... ఇషాన్ మలింగ, జీషన్ అన్సారీపై అధిక భారం పడుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. అయితే అది వాంఖడేలోని కాస్త టరి్నంగ్ పిచ్కాగా... ఉప్పల్ ఫ్లాట్ పిచ్పై ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తికరం. ‘హ్యాట్రిక్’తో జోరుమీదున్న ముంబై ఎప్పట్లాగే ఈసారి కూడా పరాజయాలతోనే సీజన్ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత పుంజుకుంది. గత మూడు మ్యాచ్లను పరిశీలిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై విజయాలు సాధించింది. చెన్నైతో పోరు ద్వారా రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం ఆ జట్టుకు అదనపు బలాన్నిస్తోంది. రోహిత్, సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్కే నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు 15.4 ఓవర్లలోనే అధిగమించింది. హైదరాబాదీ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్ ధీర్తో మిడిలార్డర్ కూడా బలంగా ఉంది. బౌలింగ్లోనూ ముంబైకి పెద్దగా ఇబ్బందులు లేవు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన స్టార్ పేసర్ బుమ్రా మునుపటి వేగం అందిపుచ్చుకోగా... బౌల్ట్, దీపక్ చహర్ అతడికి సహకరిస్తున్నారు. సాంట్నర్, అశ్వని కుమార్ మరోసారి కీలకం కానున్నారు. అయితే సొంతగడ్డపై ఎంతటి బౌలింగ్ బృందాన్ని అయినా చిత్తు చేయగల ఆరెంజ్ ఆర్మీ హిట్టర్లను ముంబై బౌలర్లు ఏమేరకు అడ్డుకుంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. తుదిజట్లు (అంచనా) సన్రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, షమీ, జీషాన్ అన్సారీ, ఇషాన్ మలింగ, రాహుల్ చహర్. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చహర్, కరణ్ శర్మ, బౌల్ట్, బుమ్రా.10 సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్లు జరగగా... అందులో హైదరాబాద్ జట్టు 10 విజయాలు సాధించింది. మరో 14 మ్యాచ్ల్లో ముంబై గెలుపొందింది. -
ఢిల్లీ మళ్లీ...
దాదాపు నెల రోజుల క్రితం... వైజాగ్లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది... ఇప్పుడు ప్రత్యర్థి వేదికపై సాగిన మ్యాచ్లో ఢిల్లీ మళ్లీ ఆధిక్యం ప్రదర్శిస్తూ లక్నోపై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. క్యాపిటల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్కు సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరుకే పరిమితం కాగా, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా క్యాపిటల్స్ అలవోకగా మరో 13 బంతుల ముందే విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో ఆడని రాహుల్... ఈసారి హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్కు ఇరుసుగా నిలిచాడు. తనను గత ఏడాది అవమానించిన పాత జట్టు లక్నో వేదికపై సిక్స్తో మ్యాచ్ను ముగించి సంతృప్తిగా నిలబడ్డాడు. లక్నో: తొలి ఐపీఎల్ టైటిల్ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మార్క్రమ్ (33 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... మిచెల్ మార్ష్(36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆయుష్ బదోని (21 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముకేశ్ కుమార్ (4/33) లక్నోను పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు), అభిషేక్ పొరేల్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... కెప్టెన్ అక్షర్ పటేల్ (20 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ల శుభారంభం... తొలి వికెట్కు 59 బంతుల్లో 87 పరుగులు భాగస్వామ్యం... ఈ సమయంలో లక్నో స్థితి చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. అయితే ఓపెనర్లు మార్క్రమ్, మార్ష్ఇచ్చిన ఈ ఘనారంభాన్ని ఆ తర్వాత జట్టు వృథా చేసుకుంది. పవర్ప్లేలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఓపెనర్లు 6 ఓవర్లు ముగిసేసరికి 3 ఫోర్లు, 3 సిక్స్లతో స్కోరును 51 పరుగులకు చేర్చారు. ఆ తర్వాత చమీరా ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, స్టార్క్ చక్కటి బంతితో పూరన్ (9)ను బౌల్డ్ చేశాడు. అనంతరం ముకేశ్ ఒకే ఓవర్లో సమద్ (2), మార్ష్ లను అవుట్ చేయడంతో లక్నో కష్టాలు పెరిగాయి. 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయాక పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. అయితే ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన బదోని కాస్త ప్రభావం చూపించాడు. ముకేశ్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. వరుసగా వికెట్లు పడుతున్నా... సమద్, మిల్లర్ (14 నాటౌట్), బదోని తర్వాత ఇన్నింగ్స్లో మరో రెండు బంతులు ఉండగా ఏడో స్థానంలో రిషభ్ పంత్ (0) బ్యాటింగ్కు రావడం ఆశ్చర్యం కలిగించింది. టాస్ సమయంలో కుడి చేతికి కట్టుతో కనిపించిన పంత్ సమస్యేమీ లేదని చెప్పాడు. కీలక భాగస్వామ్యం... శార్దుల్ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో 15 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ ఛేదన మొదలైంది. కరుణ్ నాయర్ (15) తొందరగానే అవుటైనా... పొరేల్, రాహుల్ కలిసి చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్ను నడిపించడంతో పవర్ప్లేలో జట్టు 54 పరుగులు సాధించింది. రవి బిష్ణోయ్ ఓవర్లో 2 సిక్స్లతో 16 పరుగులు రాబట్టి ఢిల్లీ ధాటిని పెంచింది.33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పొరేల్ వెనుదిరిగాడు. పొరేల్, రాహుల్ రెండో వికెట్కు 49 బంతుల్లో 69 పరుగులు జత చేశారు. అయితే ఆ తర్వాత రాహుల్, అక్షర్ కలిసి సునాయాసంగా జట్టును గెలుపు దిశగా నడిపించారు. రాహుల్, అక్షర్ మూడో వికెట్కు 36 బంతుల్లో అభేద్యంగా 56 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) స్టబ్స్ (బి) చమీరా 52; మార్ష్(బి) ముకేశ్ 45; పూరన్ (బి) స్టార్క్ 9; సమద్ (సి) అండ్ (బి) ముకేశ్ 2; మిల్లర్ (నాటౌట్) 14; బదోని (బి) ముకేశ్ 36; పంత్ (బి) ముకేశ్ 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–87, 2–99, 3–107, 4–110, 5–159, 6–159. బౌలింగ్: అక్షర్ 4–0–29–0, స్టార్క్ 4–0–25–1, ముకేశ్ 4–0–33–4, చమీరా 3–0–25–1, విప్రాజ్ 1–0–14–0, కుల్దీప్ 4–0–33–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) మిల్లర్ (బి) మార్క్రమ్ 51; కరుణ్ నాయర్ (బి) మార్క్రమ్ 15; రాహుల్ (నాటౌట్) 57; అక్షర్ (నాటౌట్) 34; ఎక్స్ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–36, 2–105. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 2–0–28–0, దిగ్వేశ్ రాఠీ 4–0–24–0, ప్రిన్స్ 2.5–0–23–0, మార్క్రమ్ 3–0–30–2, అవేశ్ ఖాన్ 3–0–19–0, రవి బిష్ణోయ్ 3–0–36–0. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ xముంబై వేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 5000 పరుగుల మైలు రాయిని అందుకున్న క్రికెటర్గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. కేవలం 130 ఇన్నింగ్స్లలోనే కేఎల్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్(135) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో వార్నర్ రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఐదు వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఐదో క్రికెటర్గా రాహుల్ నిలిచాడు. రాహుల్కు ముందు విరాట్ కోహ్లి (8326), రోహిత్ శర్మ (6786), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్ (5162) ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నోపై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. -
చెలరేగిన కేఎల్ రాహుల్.. లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి కమ్బ్యాక్ ఇచ్చింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది.ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. మిగితా లక్నో బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.మార్క్రమ్ హాఫ్ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. లక్నో ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం అందించినప్పటికి, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమకావడంతో నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది.లక్నో బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(52) టాప్ స్కోరర్గా నిలవగా..మిచెల్ మార్ష్(45), ఆయూష్ బదోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, చమీరా తలా వికెట్ సాధించారు. -
అతడొక అద్బుతం.. చాలా క్లాస్గా ఆడుతున్నాడు: రాయుడు
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్ దుమ్ములేపుతున్నాడు. ప్రతీ మ్యాచ్లోనూ పరుగులు సాధించి గుజరాత్ జైత్ర యాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సోమవారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లోనూ సుదర్శన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 50 కంటే ఎక్కువ సగటుతో 417 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సుదర్శన్పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల వర్షం కురిపించాడు. టీ 20 క్రికెట్ను ట్రేడిషనల్గా ఎలా ఆడాలో సుదర్శన్ చూపిస్తున్నాడని అతడు కొనియాడాడు."సాయిసుదర్శన్ అద్బుతంగా ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్ చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదు. చాలా సంతోషంగా ఉంది. అతడు క్లాసికల్ బ్యాటర్గా ఆడుతున్నాడు. క్రికెట్ను సాంప్రదాయ పద్ధతిలో ఎలా ఆడవచ్చో తన బ్యాటింగ్తో చూపిస్తున్నాడు. సుదర్శన్ బంతి వేగాన్ని సరిగ్గా ఉపయోగించుకుని స్మార్ట్ క్రికెట్ ఆడుతున్నాడు.ప్రతీ మ్యాచ్లో పరుగులు సాధించడం అతడి ఆత్మవిశ్వాస్వాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. సుదర్శన్ అద్భుత ఫామ్ జట్టు మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. అందరు ఆటగాళ్లు ఒకే లయలో ఆడతారు. ప్రస్తుతం గుజరాత్ టీమ్లో అదే మనం చూస్తున్నాము" అని జియో స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం -
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేసిన పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది. మే రెండో వారంలో భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.అయితే ఇంగ్లండ్ టూర్కు తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్ను ఎంపిక చేసే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సుదర్శన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ దుమ్ములేపుతున్నాడు. సుదర్శన్ ఇప్పటికే టీ20, వన్డేల్లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు టెస్టుల్లో డెబ్యూ చసే సూచనలు కన్పిస్తున్నాయి. అతడికి ఇంగ్లండ్ రెడ్-బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. సుదర్శన్ కౌంటీ క్రికెట్లో సర్రే తరపున ఆడాడు. అదేవిధంగా మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రజిత్ పాటిదార్లకు తిరిగి పిలుపునివ్వాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయ్యర్, పాటిదార్ ఇద్దరూ గతేడాది భారత టెస్టు జట్టుకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉండడంతో ఎంపిక చేయనున్నట్లు వినికిడి. మిడిలార్డర్లో అప్షన్స్ కోసం సెలక్టర్లు వెతుకుతున్నారు. సుదర్శన్, పాటిదార్, అయ్యర్లను ముందే ఇంగ్లండ్కు పంపించే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరు ముగ్గురు భారత-ఎ జట్టు తరపున ఇంగ్లండ్ లయన్స్తో అధికారిక టెస్టు సిరీస్ ఆడనున్నారు. -
IPL 2025 LSG vs DC: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
IPL 2025 LSG vs DC Live Updates: ఐపీఎల్-2025లో ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి.లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయంఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. మిగితా లక్నో బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..అభిషేక్ పోరెల్(51) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. మార్క్రమ్ బౌలింగ్లో పోరెల్ ఔటయ్యాడు. ఢిల్లీ 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(40), అక్షర్ పటేల్(17) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ160 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(50), రాహుల్(28) ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..కరుణ్ నాయర్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన నాయర్.. మార్క్రమ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 3.4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 36/1నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నోఎక్నా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(52) టాప్ స్కోరర్గా నిలవగా..మిచెల్ మార్ష్(45), ఆయూష్ బదోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, చమీరా తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు లక్నో స్కోర్: 130/414వ ఓవర్లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్లో తొలి బంతికి అబ్దుల్ సమద్ ఔట్ కాగా.. ఆఖరి బంతికి మిచెల్ మార్ష్(45) క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో మిల్లర్(11), బదోని(10) పరుగులతో ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్నికోలస్ పూరన్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన పూరన్.. స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.లక్నో తొలి వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన దుష్మాంత చమీరా బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు లక్నో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది.మార్క్రమ్ ఫిప్టీ..లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మార్క్రమ్, మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(32), మార్క్రమ్(50) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న లక్నో.. మూడు ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో మర్క్రమ్(13), మిచెల్ మార్ష్(6) ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. సెకెండ్ రౌండ్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓ మార్పుతో బరిలోకి దిగింది. మోహిత్ శర్మ స్దానంలో దుష్మాంత చమీరా తుది జట్టులో వచ్చాడు. లక్నో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ -
టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం
టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే తన మంచి మనసును చాటుకున్నాడు. తమిళనాడుకు చెందిన పది మంది యువ, ప్రతిభావంతులైన క్రీడాకారులకు రూ.7 లక్షల ఆర్ధిక సాయాన్ని దూబే చేశాడు. మంగళవారం జరిగిన తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TNSJA) అవార్డ్స్ అండ్ స్కాలర్షిప్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో యంగ్ అథ్లెట్స్కు దూబే చెక్లను అందజేశాడు.ఈ కార్యక్రమానికి దూబే ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అదేవిధంగా యువ అథ్లెట్లకు వారి విజయాలకు గుర్తింపుగా తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కూడా రూ. 30,000 స్కాలర్షిప్లను అందజేసింది. ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమం యువ అథ్లెట్లందరికీ చాలా ప్రోత్సాహకరంగా ఉందని నేను భావిస్తున్నాను.ఈ చిన్న విజయాలను గుర్తించి వారిలో కొత్త ఉత్సహాన్ని తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నింపుతోంది. వారు మరింత కష్టపడి పనిచేసి దేశానికి గర్వకారణంగా నిలుస్తారు ఆశిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రామానికి నన్ను ఆహ్వానించిందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముంబైలో కూడా ఇటువంటి కార్యాక్రమాలు నేను చూశాను. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా యువ క్రీడాకారులకు మద్దతునిచ్చే పోగ్రామ్స్ నిర్వహిస్తుండడం చాలా సంతోషంగా ఉందని" అన్నాడు.నగదు సాయం అందుకున్న తమిళనాడు అథ్లెట్లు వీరే..పిబి అభినంద్ (టేబుల్ టెన్నిస్)కెఎస్ వెనిస శ్రీ (ఆర్చరీ)ముత్తుమీనా వెల్లసామి (పారా అథ్లెటిక్స్)షమీనా రియాజ్ (స్క్వాష్)ఎస్ నంధన (క్రికెట్)కమలి పి (సర్ఫింగ్)ఆర్ అభినయ (అథ్లెటిక్స్)ఆర్సి జితిన్ అర్జునన్ (అథ్లెటిక్స్)తక్షంత్ (చెస్)జయంత్ ఆర్కే (క్రికెట్) -
పాకిస్తాన్ హెడ్ కోచ్గా ఆర్సీబీ మాజీ డైరెక్టర్..?
పాకిస్తాన్ పురుషల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి ఆకిబ్ జావేద్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాక్ ఘోర ప్రదర్శన అనంతరం జావేద్ తన పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో హెడ్ కోచ్ లేకుండానే పాక్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది.అక్కడ కూడా అదే తీరును మెన్ ఇన్ గ్రీన్ కనబరిచింది. పాక్ జట్టు ఈ ఏడాది జూలై ఆఖరిలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ వ్యవధిలో తమ జట్టు కొత్త హెడ్ కోచ్ను ఎంపిక చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. పాకిస్తాన్ హెడ్ కోచ్ రేసులో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్రికెట్ మాజీ డైరెక్టర్ మైక్ హెస్సన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే అతడితో పీసీబీ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.హెస్సన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రధాన కోచ్గా ఉన్నాడు. అతడి నేతృత్వంలోనే ఇస్లామాబాద్ యునైటెడ్ గతేడాది పీఎస్ఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్లో కోచ్గా అతడికి అపారమైన అనుభవం ఉంది. గతంలో న్యూజిలాండ్ కోచ్గా, ఆర్సీబీ క్రికెట్ డైరక్టర్గా హెస్సన్ పనిచేశాడు. ఈ క్రమంలోనే అతడిని తమ హెడ్ కోచ్గా నియమించాలని పీసీబీ భావిస్తోందంట. అయితే హెడ్ కోచ్ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సైమన్ కాటిచ్, న్యూజిలాండ్ ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ ల్యూక్ రోంచిలతో కూడా పీసీబీ సంప్రదింపులు జరిపినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.చదవండి: IPL 2025: రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్.. ఇక కష్టమే మరి? -
ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏప్రిల్ 19న జైపూర్ వేదికగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయినట్లు రాజస్తాన్ క్రికెట్ సంఘం అడ్హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. సునాయసంగా గెలిచే మ్యాచ్లో రాజస్తాన్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిందంటూ బిహానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం స్పందించింది. తమపై చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తమని రాయల్స్ ఫ్రాంచైజీ సీనియర్ అధికారి దీప్ రాయ్ ఖండించారు."అడ్ హాక్ కమిటీ కన్వీనర్ చేసిన అన్ని ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బహిరంగంగా చేసే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు తప్పుదారి పట్టించడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్, రాయల్ మల్టీ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (RMPL), రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, బీసీసీఐ ఖ్యాతి, విశ్వసనీయతకు తీవ్ర నష్టం కలిగించాయి. అవి క్రికెట్ సమగ్రతను కూడా దెబ్బతీశాయి" అని రాయల్స్ ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రాయల్స్ యాజమాన్యం.. బిహానీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి, క్రీడా కార్యదర్శికి లేఖ రాశారు.అసలేమి జరిగిందంటే?లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ అనుహ్యంగా రెండు పరుగులతో తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 180 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగల్గింది. ఆఖరి ఓవర్లో తమ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా రాజస్తాన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.చదవండి: ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్పై ఆరోపణలు -
అందుకే రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్లో ఉన్నారు..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిన్న (ఏప్రిల్ 21) తమ సెంట్రల్ కాంట్రాక్ట్ (2024-25) ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ ప్లస్ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఓ ఆటగాడికి బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించాలంటే అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయ్యుండాలి. అయితే రోహిత్, విరాట్, జడేజా గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత పొట్టి క్రికెట్కు గుడ్బై చెప్పి కేవలం వన్డేలు, టెస్ట్ల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయినా వారికి ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించింది. దీనిపై నిన్నటి నుంచి క్రికెట్ అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా వారిని ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో కొనసాగిస్తున్నారని సోషల్మీడియా వేదికగా డిస్కషన్స్ నడిచాయి. ఈ అంశంపై బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి తాజాగా స్పందించాడు.రోహిత్, విరాట్, జడేజా ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు కానప్పటికీ ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారన్న విషయంపై వివరణ ఇచ్చాడు. 2024-25 సంవత్సరాని గానూ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధి అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉంటుంది. అయితే దీని అసెస్మెంట్ సంవత్సరం మాత్రం అక్టోబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30, 2024 మధ్యలో ఉంటుంది. ఆ వ్యవధిలో కోహ్లీ, రోహిత్ , జడేజా అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యులుగా ఉన్నారు. జూన్ 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ముగ్గురు టీ20ల నుంచి తప్పుకున్నారు. ఈ సాంకేతికత ప్రకారం.. రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు.ఇదిలా ఉంటే, నిన్న ప్రకటించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో మొత్తం 34 మంది చోటు దక్కించుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.ఈ ఏడాది కొత్తగా ఏడుగురు (ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా) సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించకున్నారు. శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ తమ కాంట్రాక్ట్ను కోల్పోయారు. రిషబ్ పంత్కు బి నుంచి ఏ కేటగిరీకి ప్రమోషన్ లభించింది. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు.ఏ ప్లస్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది. -
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్పై ఆరోపణలు
ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం కలకలం రేపుతుంది. ఏప్రిల్ 19న రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) తాత్కాలిక కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించాడు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్లో రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలైందని ఆయన అన్నాడు.ఈ మ్యాచ్పై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు నుంచి రాయల్స్ కదలికలపై అనుమానాలు ఉన్నాయని తెలిపాడు. అంతకుముందు రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్పై కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్లో కూడా రాయల్స్ గెలిచి ఉండాల్సిందని అన్నాడు. రాయల్స్ యాజమాన్యం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ను పూర్తి పక్కకు పెట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని తెలిపాడు.2013 సీజన్లో రాయల్స్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్కు పాల్పడటంతో 2016, 2017 సీజన్లలో రాయల్స్పై నిషేధం విధించారన్న విషయాన్ని గుర్తు చేశాడు. అప్పట్లో రాయల్స్తో పాటు చెన్నై సూపర్ కింగ్స్పై రెండు సీజన్ల నిషేధం విధించారు.జైదీప్ ఆరోపణలు ఎలా ఉన్నా, ఏప్రిల్ 19న జరిగిన రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్పై సగటు క్రికెట్ అభిమానికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సులువగా గెలవాల్సిన ఆ మ్యాచ్లో రాయల్స్ ఓడిపోవడాన్ని చాలా మంది ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. ఆ మ్యాచ్లో రాయల్స్ గెలుపుకు చివరి ఓవర్లో కేవలం 9 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో వికెట్లు కూడా ఉన్నాయి. క్రీజ్లో విధ్వంసకర ఆటగాళ్లు ధృవ్ జురెల్, హెట్మైర్ ఉన్నారు. అయినా రాయల్స్ చివరి ఓవర్లో 6 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. తీవ్ర ఉత్కంఠ నడుమ చివరి ఓవర్ను ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడో బంతికి డేంజరెస్ హెట్మైర్ను ఔట్ చేసి లక్నోకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఇక్కడ ఆవేశ్ ప్రతిభను ముమ్మాటికి ప్రశంసించాల్సిందే. 18వ ఓవర్లోనూ అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అప్పటికే క్రీజ్లో పాతుకుపోయిన యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ను ఔట్ చేశాడు. జనాలు ఆవేశ్ టాలెంట్ను ప్రశంశిస్తూనే, ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అనుకుంటున్నారు. -
LSG VS DC: భారీ రికార్డులపై కన్నేసిన రాహుల్, కుల్దీప్
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 22) ఓ రసవత్తర మ్యాచ్ జరుగనుంది. టేబుల్ సెకెండ్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఐదో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నో సొంత మైదానమైన అటల్ బిహారి వాజ్పేయ్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్కు ముందు ఢిల్లీ స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ రెండు భారీ రికార్డులపై కన్నేశారు. ఈ మ్యాచ్లో రాహుల్ 51 పరుగులు చేస్తే ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకిన ఎనిమిదో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రాహుల్ ఖాతాలో 4949 పరుగులు (138 మ్యాచ్లు) ఉన్నాయి. ఇందులో 4 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.రాహుల్కు ముందు విరాట్ కోహ్లి (8326), రోహిత్ శర్మ (6786), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్ (5162) ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకారు.కుల్దీప్ విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్ లక్నోతో నేడు జరుగబోయే మ్యాచ్లో ఓ వికెట్ తీస్తే.. ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని చేరకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 27వ బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ ఇప్పటివరకు 214 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో చహల్ మినహా మరే బౌలర్ 200 వికెట్ల మార్కును తాకలేదు. టాప్-5లో పియూశ్ చావ్లా (192), భువనేశ్వర్ కుమార్ (189), సునీల్ నరైన్(187), రవిచంద్రన్ అశ్విన్ (185) ఉన్నారు.ప్రస్తుత సీజన్లో రాహుల్, కుల్దీప్ల ఫామ్ను చూస్తే నేడు లక్నోతో జరుగబోయే మ్యాచ్లో ఈ రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో రాహుల్ 6 మ్యాచ్ల్లో 266 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో 11 స్థానంలో ఉండగా.. 7 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీసిన కుల్దీప్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.లక్నోపై సంచలన విజయం సాధించిన ఢిల్లీఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో లక్నోను ఢిల్లీ చివరి నిమిషంలో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో అశుతోష్ శర్మ (66 నాటౌట్), విప్రాజ్ నిగమ్ (39) వీరోచితమైన ప్రదర్శన కనబర్చి (లక్నో నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో) ఓడిపోవాల్సిన మ్యాచ్లో ఢిల్లీని గెలిపించాడు. చివరి 7 ఓవర్లలో 94 పరుగులు చేయాల్సిన తరుణంలో (6 వికెట్లు కోల్పోయాక) ఈ జోడీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. అశుతోష్ చివరి నిమిషం వరకు క్రీజ్లో ఉండి ఢిల్లీని గెలిపించాడు.ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగిన నేపథ్యంలో నేటి మ్యాచ్పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్లే ఆఫ్స్కు చేరే క్రమంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. నేటి మ్యాచ్తో లక్నో ఎక్స్ప్రెస్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్లో లక్నో రాజస్థాన్ రాయల్స్ను ఊహించని విధంగా చివరి ఓవర్లో మట్టికరిపించి మాంచి ఊపు మీద ఉంది. ఢిల్లీ గత మ్యాచ్లో గుజరాత్ చేతిలో భంగపడి కాస్త ఢీలాగా కనిపిస్తుంది.నేటి మ్యాచ్ను తుది జట్లు (అంచనా)లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (c & wk), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ / మయాంక్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, అవేష్ ఖాన్, ఆయుష్ బడోనిఢిల్లీ: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్ (wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, డోనోవన్ ఫెరీరా -
KKR VS GT: చరిత్ర సృష్టించిన గిల్, సాయి సుదర్శన్ జోడీ
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ జోడీ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ రికార్డు నెలకొల్పింది. నిన్న (ఏప్రిల్ 21) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ భాగస్వామ్యం (114 పరుగులు) నమోదు చేసిన ఈ జోడీ.. క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు (6) నెలకొల్పిన భారత జోడీగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు గిల్-సాయి సుదర్శన్.. కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్.. గౌతమ్ గంభీర్-రాబిన్ ఉతప్ప జోడీల పేరిట సంయుక్తంగా ఉండేది. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా విరాట్ కోహ్లి-ఏబీ డివిలియర్స్ ద్వయం ఉంది. ఈ జోడీ ఐపీఎల్లో 10 సెంచరీ పార్ట్నర్షిప్స్ నమోదు చేసింది. విరాట్-ఏబీడీ జోడీ తర్వాత అత్యధిక ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా క్రిస్ గేల్-విరాట్ ద్వయం ఉంది. ఈ జోడీ 9 సెంచరీ పార్ట్నర్షిప్స్ నమోదు చేసింది. వీరి తర్వాత గిల్-సాయి సుదర్శన్, శిఖర్ ధవన్-డేవిడ్ వార్నర్, డుప్లెసిస్-విరాట్ ద్వయాలు తలో 6 ఓపెనింగ్ శతక భాగస్వామ్యాలు నమోదు చేసి ఈ జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే గిల్-సాయి సుదర్శన్ జోడీ రెండు శతక భాగస్వామ్యాలు నమోదు చేయడం విశేషం.ఐపీఎల్లో తొలి వికెట్కు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన భారత జోడీలుసాయి సుదర్శన్-శుభ్మన్ గిల్ (గుజరాత్)- 6కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్ (పంజాబ్)-5గౌతమ్ గంభీర్-రాబిన్ ఉతప్ప (కేకేఆర్)-5ఓవరాల్గా ఐపీఎల్లో తొలి వికెట్కు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీలువిరాట్ కోహ్లి-ఏబీ డివిలియర్స్ (ఆర్సీబీ)- 10విరాట్ కోహ్లి-క్రిస్ గేల్ (ఆర్సీబీ)- 9విరాట్ కోహ్లి- ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ)-6శుభ్మన్ గిల్- సాయి సుదర్శన్ (గుజరాత్)- 6శిఖర్ ధవన్- డేవిడ్ వార్నర్ (సన్రైజర్స్)- 6మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో గుజరాత్ కేకేఆర్ను 39 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. గిల్ (90), సాయి సుదర్శన్ (52), బట్లర్ (41 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కేకేఆర్ను 158 పరుగులకే పరిమితం చేశారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ చెరో 2, సిరాజ్, ఇషాంత్, సుందర్, సాయికిషోర్ తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్లో రహానే ఒక్కడే హాఫ్ సెంచరీతో (50) రాణించాడు. గుజరాత్ ఏప్రిల్ 28న జరిగే తమ తదుపరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. -
జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన చోటు
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి గానూ విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డుకు ఎంపికయ్యాడు. గతేడాది ఫార్మాట్లకతీతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ బుమ్రాకు ఈ గౌరవం దక్కింది. 2024లో బుమ్రా మూడు ఫార్మాట్లలో 86 వికెట్లు (21 మ్యాచ్ల్లో 13 సగటున) తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. గతేడాది బుమ్రా టెస్ట్ల్లో విశేషంగా రాణించి అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఫలితంగా అతను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, బీసీసీఐ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు గెలుచుకున్నాడు.గతేడాది టీ20 వరల్డ్కప్లో అద్భుతంగా రాణించిన బుమ్రా భారత్కు టైటిల్ను అందించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుతో పాటు రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.దిగ్గజాల సరసన చోటుతాజాగా విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు గెలవడంతో బుమ్రా భారత దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. గతంలో విరాట్ కోహ్లి, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ అవార్డును గెలుచుకున్నారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 3 సార్లు ఈ అవార్డును గెలువగా.. సెహ్వాగ్ 2, సచిన్ ఓసారి ఈ అవార్డును దక్కించుకున్నారు.విజ్డెన్ వుమెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు విషయానికొస్తే.. 2024 సంవత్సరానికి గానూ ఈ అవార్డును భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన దక్కించకుంది. మంధన గతేడాది మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణించి, రికార్డు స్థాయిలో 1659 పరుగులు చేసింది. మహిళల క్రికెట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. గతేడాది మంధన నాలుగు వన్డే శతకాలు, ఓ టెస్ట్ సెంచరీ సాధించింది.పూరన్కు లీడింగ్ టీ20 ప్లేయర్ అవార్డుపొట్టి క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్కు విజ్డెన్ మెన్స్ లీడింగ్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు లభించింది. పూరన్ గతేడాది పొట్టి ఫార్మాట్లో 21 మ్యాచ్లు ఆడి 142.22 స్ట్రయిక్రేట్తో 464 పరుగులు చేశాడు. -
PSL 2025: దినదినాభివృద్ధి చెందుతున్న బాబర్ ఆజమ్.. భారీ ట్రోలింగ్
పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ప్రపంచంలోనే మేటి బ్యాటర్గా ఫీలయ్యే బాబర్ ఆజమ్ తన క్రికెటింగ్ ప్రస్థానంలో దినదినాభివృద్ధి చెందుతున్నాడు. గత కొంతకాలంగా చెత్త ప్రదర్శనలతో అదఃపాతాళానికి పడిపోయిన బాబర్.. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్లోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. పీఎస్ఎల్ 2025 ఆరంభ మ్యాచ్లో డకౌటైన బాబర్.. రెండో మ్యాచ్లో 1, మూడో మ్యాచ్లో 2, నిన్న (ఏప్రిల్ 21) జరిగిన నాలుగో మ్యాచ్లో 46 పరుగులు చేశాడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లికి పోటీ అని చెప్పుకునే బాబర్ నుంచి ఇలాంటి ప్రదర్శనలు చూసి క్రికెట్ అభిమానులు వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా 0, 1, 2, 46 స్కోర్లు చూసి బాబర్ దినదినాభివృద్ధి చెందుతున్నాడని సోషల్మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.పీఎస్ఎల్లో పెషావర్ జల్మీ కెప్టెన్గా వ్యవహరిస్తున్న బాబర్ ఈ సీజన్లో కెప్టెన్గానూ తేలిపోయాడు. తన జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడగా మూడింట ఓటమిపాలైంది. నిన్న కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పెషావర్ 2 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. విశేషమేమిటంటే పెషావర్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమే (46) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లలో మహ్మద్ హరీస్ (28), అల్జరీ జోసఫ్ (24 నాటౌట్), తలాత్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. సైమ్ అయూబ్ 4, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ 7, మిచెల్ ఓవెన్ 5, అబ్దుల్ సమద్ 2, లూక్ వుడ్ 2 పరుగులకు ఔటయ్యారు. కరాచీ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో 3 వికెట్లు తీయగా.. ఆమెర్ జమాల్, మీర్ హమ్జా చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ కూడా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడింది. అతి కష్టం మీద ఆ జట్టు 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కరాచీ గెలుపుకు ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (60) గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. అయితే చివర్లో ఖుష్దిల్ షా (23 నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేసి కరాచీని విజయతీరాలకు చేర్చాడు. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ 3, అలీ రజా 2, అల్జరీ జోసఫ్, ఆరిఫ్ యాకూబ్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2025: అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతున్న గుజరాత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ అంచనాలకు తలకిందులు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలతో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. మరో ఆరు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది.ప్రస్తుతం ఆరెంజ్, పర్పుల్ క్యాప్లు కూడా గుజరాత్ ఆటగాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. సాయి సుదర్శన్ 8 మ్యాచ్ల్లో 417 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 8 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చలామణి అవుతున్నాడు. బ్యాటింగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల టాప్-10 జాబితాలో సాయి సుదర్శన్తో పాటు జోస్ బట్లర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉన్నారు. ఈ ముగ్గురు గుజరాత్ టాపార్డర్లో అంచనాలకు మించి రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్లో ఈ ముగ్గురిలో ఒకరిద్దరు సత్తా చాటుతున్నారు. బౌలింగ్లోనూ అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్ల జాబితాలో ప్రసిద్ద్ సహా ముగ్గురు గుజరాత్ బౌలర్లు ఉన్నారు. ఈ సీజన్లో రవిశ్రీనివాస్ సాయికిషోర్ ఊహలకందని విధంగా సత్తా చాటుతూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాదే కొత్తగా గుజరాత్లో చేరిన సిరాజ్ సైతం ఈ సీజన్లో అదరగొడుతున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. గుజరాత్ విజయాల్లో మిడిలార్డర్ బ్యాటర్లు షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఈ సీజన్లో అదరగొడుతున్నాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఫామ్ ఒక్కటే ఈ సీజన్లో గుజరాత్ను కలవరపెడుతుంది. అతను కూడా నిన్న (ఏప్రిల్ 21) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. నిన్నటి మ్యాచ్లో రషీద్ 4 ఓవర్లలో కేవలం 25 పరుగులకే ఇచ్చి 2 కీలక వికెట్లు (నరైన్, రసెల్) తీశాడు. ఈ సీజన్లో గుజరాత్కు ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు సత్తా చాటుతూ విజయాన్నందిస్తున్నారు. బ్యాటింగ్లో సాయి సుదర్శన్ నిలకడకు మారు పేరు అన్నట్లుగా మారిపోయాడు. గిల్ సామర్థ్యం మేరకు రాణిస్తుండగా.. బట్లర్ అంచనాలకు మించి సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు పేస్ త్రయం ప్రసిద్ద్, సిరాజ్, ఇషాంత్పై ఎవరికీ అంచనాలు లేవు. సాయికిషోర్ నుంచి అయితే ఈ స్థాయి అత్యుత్తమ ప్రదర్శన అస్సలు ఊహించలేదు. సాయికిషోర్ ఎప్పుడు బంతిని పట్టుకున్నా వికెట్లు తీయడమే కాకుండా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇతను ప్రత్యర్థి బ్యాటర్ల పాలిట కొరకరాని కొయ్యగా మారాడు. ఈ సీజన్లో గుజరాత్ ఇదే జోరును కొనసాగిస్తే రెండో టైటిల్ ఖాతాలో వేసుకోవడం గ్యారెంటీ. అందరూ ఈ సీజన్లో ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్, లక్నో జట్లలో ఏదో ఒకటి టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నారు. అయితే గుజరాత్ అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతుంది.కాగా, కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఎప్పటిలాగే టీమ్ ఎఫర్ట్ను చూపించి మరో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. గిల్ (90), సాయి సుదర్శన్ (52), బట్లర్ (41 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కేకేఆర్ను 158 పరుగులకే పరిమితం చేశారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ చెరో 2, సిరాజ్, ఇషాంత్, సుందర్, సాయికిషోర్ తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్లో రహానే ఒక్కడే హాఫ్ సెంచరీతో (50) రాణించాడు. గుజరాత్ ఏప్రిల్ 28న జరిగే తమ తదుపరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. -
చితక్కొట్టిన శుబ్మన్.. కేకేఆర్పై గుజరాత్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని గుజరాత్ అందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగల్గింది.కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే(50)టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో రఘువన్షి(27) పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ట తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, సుందర్, ఇషాంత్ శర్మ సాయికిషోర్ చెరో వికెట్ పడగొట్టారు.చితక్కొట్టిన శుబ్మన్..ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ బ్యాటింగ్తో ఈడెన్లో బౌండరీలు వర్షం కురిపించాడు. 55 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 ఫోర్లు, మూడు సిక్స్లతో 90 పరుగులు చేశాడు. గిల్తో పాటు సాయిసుదర్శన్(52), బట్లర్(41) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలా వికెట్ సాధించారు. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. -
హైకోర్టులో హెచ్సీఏకు ఎదురు దెబ్బ..
తెలంగాణ హైకోర్టులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఎదురు దెబ్బ తగిలింది. హెచ్సీఏలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హైకోర్టులో ఇటీవలే పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవద్దని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్కు ఆర్డర్స్ జారీ చేసింది. స్టాఫ్ జీతాలు మినహా ఎలాంటి ఆర్థికపరమైన చర్యలు తీసుకోరాదంటూ హెచ్సీఎకు హైకోర్టు సూచించింది. -
సీఎస్కే స్టార్ ఓపెనర్ ఇంట తీవ్ర విషాదం..
న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి డెంటాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సీఎస్కే అధికారికంగా ధ్రువీకరించింది. "ఈ క్లిష్ట సమయంలో కాన్వే కుటుంబానికి మద్దతుగా ఉంటాము. డెంటాన్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని సీఎస్కే యాజమాన్యం ఎక్స్లో రాసుకొచ్చింది. కాగా కాన్వే తండ్రి మృతికి సంతాపంగా ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లు ధరించి మైదానంలో దిగారు. కాగా కాన్వే ఇప్పటికే న్యూజిలాండ్కు చేరుకున్నాడు. అతడు ఈ ఏడాది ఐపీఎల్లో చివరగా ఏప్రిల్ 11న సీఎస్కే తరపున ఆడాడు.దక్షిణాఫ్రికాకు చెందిన డెంటాన్ కాన్వే కుటంబం.. డెవాన్ కాన్వే చిన్నతనంలో న్యూజిలాండ్కు మకాం మార్చారు. ఈ క్రమంలోనే కాన్వే దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా ప్రదర్శన చేసి కివీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతి తక్కువ కాలంలోనే బ్లాక్క్యాప్స్ జట్టులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్-2025లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన డెవాన్.. 27.03 స్ట్రైక్ రేట్తో 94 పరుగులు చేశాడు. కాన్వే తిరిగి రావడంపై మాత్రం సీఎస్కే ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ ఏడాది సీజన్లో సీఎస్కే దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. చెన్నై జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది. -
ఏంటి గిల్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?
ఐపీఎల్-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్బంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ సమయంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత డానీ మోరిసన్ నవ్వులు పూయించాడు.ఏ సాధారణంగా వ్యాఖ్యాత అయినా టాస్ సందర్భంగా కెప్టెన్లను జట్టు మార్పులు, మ్యాచ్ ప్లాన్స్ గురుంచి అడుగుతారు. కానీ మోరిసన్ మాత్రం గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను తన వివాహ ప్రణాళికల గురించి అడిగాడు. ఈ కివీస్ మాజీ క్రికెటర్ గిల్ను త్వరలో పెళ్లి చేసుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో ఆశ్చర్యపోయిన గిల్.. అటువంటి ప్లాన్స్ ఏమీ లేవంటూ నవ్వుతూ సమధానమిచ్చాడు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కోల్కతా రెండు మార్పులతో బరిలోకి దిగింది. వరుస మ్యాచ్ల్లో విఫలమవతున్న స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ను కేకేఆర్ మెనెజ్మెంట్ పక్కన పెట్టింది. అతడి స్ధానంలో అఫ్గాన్ స్టార్ ప్లేయర్ గుర్బాజ్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లుగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
IPL 2025 KKR vs GT: కేకేఆర్పై గుజరాత్ ఘన విజయం
IPL 2025 KKR vs GT Live Updates: కేకేఆర్పై గుజరాత్ ఘన విజయంఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని గుజరాత్ అందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగల్గింది.కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే(50)టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో రఘువన్షి(27) పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ట తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, సుందర్, ఇషాంత్ శర్మ సాయికిషోర్ చెరో వికెట్ పడగొట్టారు.ఓటమి దిశగా కేకేఆర్..గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ ఓటమి దిశగా సాగుతోంది. వరుస క్రమంలో కోల్కతా మూడు వికెట్లు కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో రస్సెల్(24) ఔట్ కాగా.. ప్రసిద్ద్ బౌలింగ్లో రమణ్దీప్ సింగ్(1) మోయిన్ అలీ(0) పెవిలియన్కు చేరారు. కేకేఆర్ విజయానికి 18 బంతుల్లో 75 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్(6), రఘువన్షి(5) ఉన్నారు.కేకేఆర్ మూడో వికెట్ డౌన్..వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన అయ్యర్.. సాయికిషోర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్..90 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన కెప్టెన్ అజింక్య రహానే.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో రింకూ సింగ్(2), రస్సెల్(10) ఉన్నారు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్..సునీల్ నరైన్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన నరైన్.. రషీద్ ఖాన్ బౌలింగ్లో తెవాటియాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(3), అజింక్య రహానే(24) ఉన్నారు.గుజరాత్కు భారీ షాక్..199 పరుగులతో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో గుర్భాజ్(1) ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కెప్టెన్ అజింక్య రహానే వచ్చాడు.శుబ్మన్ గిల్ విధ్వంసం.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.55 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 ఫోర్లు, మూడు సిక్స్లతో 90 పరుగులు చేశాడు. గిల్తో పాటు సాయిసుదర్శన్(52), బట్లర్(41) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న గిల్..17 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(26), శుబ్మన్ గిల్(80) ఉన్నారు.గుజరాత్ తొలి వికెట్ డౌన్..సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. రస్సెల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 129 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(13), శుబ్మన్ గిల్(60) ఉన్నారు.హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, సుదర్శన్..కేకేఆర్తో మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్లు శుబ్మన్ గిల్(52), సాయి సుదర్శన్(52) హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నారు. 12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 113 పరుగులు చేసింది.గిల్ ఆన్ ఫైర్..7 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్(39), సాయిసుదర్శన్(21) దూకుడుగా ఆడుతున్నారు.నిలకడగా ఆడుతున్న గిల్, సుదర్శన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(6), సాయిసుదర్శన్(19) ఉన్నారు.ఐపీఎల్-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక పోరులో కేకేఆర్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేకేఆర్ తుది జట్టులోకి గుర్బాజ్, మోయిన్ అలీ వచ్చారు. గుజరాత్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిచదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా -
IPL 2025: రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్.. ఇక కష్టమే మరి?
ఐపీఎల్-2025లో వరుస ఓటుములతో సతమతమవుతున్న రాజస్తాన్ రాయల్స్ ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏప్రిల్ 24న చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్తాన్ తాడోపేడో తెల్చుకోనుంది.ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే రాజస్తాన్కు ఈ మ్యాచ్ చాలా కీలకం. అయితే ఈ మ్యాచ్కు రాయల్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆర్సీబీతో మ్యాచ్కు కెప్టెన్ సంజూ శాంసన్ గాయం దూరమయ్యాడు. సంజూ ప్రస్తుతం పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి మరో వారం రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్సీబీతో మ్యాచ్కు శాంసన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాయల్స్ ఫ్రాంచైజీ ధ్రువీకరించింది. శాంసన్ కోలుకుంటున్నాడని, జట్టుతో పాటు బెంగళూరుకు వెళ్లకుండా జైపూర్లోనే ఉండిపోయినట్లు రాజస్తాన్ మెనెజ్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో అతడి స్ధానంలో రియాన్ పరాగ్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో అనూహ్య ఓటములను చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్పై సూపర్ ఓవర్లో పరాజయం పాలైన రాజస్తాన్.. ఆఖరి మ్యాచ్లో లక్నోపై 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. రాజస్తాన్ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదివ స్ధానంలో ఉంది.చదవండి: IPL 2025: 'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్ -
IPL 2025: తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్న స్టార్లు వీరే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చాలా మంది క్రికెటర్లు తాము తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారు. వీరిలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ సీజన్ వేలంలో లక్నో పంత్ను రూ. 27 కోట్ల రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర. ఇంత భారీ మొత్తం పెట్టినా ఈ సీజన్లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. 8 మ్యాచ్ల్లో నామమాత్రపు స్ట్రయిక్రేట్తో (98.15) కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు.ఈ సీజన్లో లభించిన మొత్తానికి న్యాయం చేయలేకపోతున్న రెండో ఆటగాడు వెంకటేశ్ అయ్యర్. వెంకటేశ్ అయ్యర్ను కేకేఆర్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే వెంకటేశ్ జట్టు తనపై పెట్టుకున్న అంచనాలకు కనీస న్యాయం చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో నామమాత్రపు ప్ట్రయిక్రేట్తో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసి 121 పరుగులు చేశాడు.ఈ సీజన్లో తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేని మూడో ఆటగాడు మహ్మద్ షమీ. షమీని ఈ సీజన్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎంతో నమ్మకంతో రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను 7 మ్యాచ్లు ఆడి 5 వికెట్లు మాత్రమే తీశాడు.ఈ సీజన్లో చెత్త ప్రదర్శనలతో ఉసూరుమనిపిస్తున్న మరో క్రికెటర్ రషీద్ ఖాన్. రషీద్ను గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకుంది. అయితే రషీద్ ఎన్నడూ లేనట్లుగా ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రషీద్ ఈ సీజన్లో 7 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ (9.73) కూడా చాలా దారుణంగా ఉంది.ఈ సీజన్లో అంచనాలు తగ్గట్టుగా రాణించలేని మరో క్రికెటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్. ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ భారీ అంచనాలు పెట్టుకుని మెగా వేలంలో రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇతగాడు ఆడిన 6 మ్యాచ్ల్లో 105.77 స్ట్రయిక్రేట్తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు గుండు సున్నాలు ఉన్నాయి.పైన పేర్కొన్న ఆటగాళ్లతో పాటు మరికొందరు కూడా తీసుకున్న మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నారు. వారిలో లివింగ్స్టోన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, క్లాసెన్, ట్రవిస్ హెడ్, ఆండ్రీ రసెల్, హెట్మైర్, రబాడ, జన్సెన్ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. టి నటరాజన్ (10.75 కోట్లు, ఢిల్లీ) లాంటి ఆటగాళ్లు భారీ మొత్తం లభించినా అవకాశాలు లేక బెంచ్కే పరిమితమవుతున్నారు. ఇదిలా ఉంటే, కొందరు దేశీయ ఆటగాళ్లు మాత్రం ఈ సీజన్లో అంచనాలకు మించి తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తున్నారు. వీరిలో ప్రియాంశ్ ఆర్య (3.8 కోట్లు), అశుతోష్ శర్మ (3.8 కోట్లు), దిగ్వేశ్ రాఠీ (30 లక్షలు), విప్రాజ్ నిగమ్ (50 లక్షలు), అనికేత్ వర్మ (30 లక్షలు), వైభవ్ సూర్యవంశీ (1.1 కోట్లు), ఆయుశ్ మాత్రే లాంటి ఆటగాళ్లు ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. సీఎస్కే నిర్ధేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ముంబై స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(76), సూర్యకుమార్ యాదవ్(68) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగలు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా(53), శివమ్ దూబే(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. మంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. చాహర్, శాంటర్న్ తలా వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన ముంబై..ఇక ఈ మ్యాచ్లో సీఎస్కేను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను మూడు సార్లు తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.ముంబై కంటే ముందు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయింది. 2008 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేను తొలిసారిగా ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత 2020 సీజన్లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నైపై 10 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చెన్నైను 9 వికెట్ల తేడాతో హార్దిక్ సేన ఓడించింది. కాగా ఈ ఓటమితో సీఎస్కే తమ ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు 8 మ్యాచ్ల ఆడిన చెన్నై కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IPL 2025: 'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్ -
సప్పగా సాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్.. చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు..!
ఐపీఎల్ 2025కు పోటీగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఇప్పటివరకు ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా లేదు. ఆటగాళ్ల మెరుపులు లేకుండా దాయాది లీగ్ సప్పగా సాగుతుంది. ఏప్రిల్ 11న మొదలైన పీఎఎస్ఎల్ 2025లో నిన్నటికి (ఏప్రిల్ 20) పది మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో కేవలం ఒకే ఒక మ్యాచ్ కాస్త ఆసక్తిగా సాగింది. ఏప్రిల్ 12న జరిగిన సీజన్ మూడో మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ ఛేదించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు తలో సెంచరీ (మహ్మద్ రిజ్వాన్, జేమ్స్ విన్స్) నమోదు చేశారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఇదొక్క మ్యాచే కాస్త ఆసక్తికరంగా సాగింది.ఏప్రిల్ 14న జరిగిన సీజన్ ఐదో మ్యాచ్ కూడా కాస్త పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఆ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. అనంతరం పెషావర్ జల్మీ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 141 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్ మొత్తంలో ఇవే కాస్త చెప్పుకోదగ్గ ప్రదర్శనలు. ఈ సీజన్లో 10 మ్యాచ్లు పూర్తయినా కేవలం 14 హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. బౌలర్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు. ఇస్లామాబాద్కు ఆడుతున్న విండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ (11) ఒక్కడే ఈ సీజన్లో సక్సెఫుల్ బౌలర్ అనిపించుకున్నాడు. కరాచీ కింగ్స్ బౌలర్ హసన్ అలీ (10) పర్వాలేదనిపించాడు.పాకిస్తాన్లో ఫ్లాట్ పిచ్లు ఉన్నా బ్యాటర్లు రాణించలేకపోతున్నారు. 10 మ్యాచ్లు పూర్తయినా చెప్పుకోదగ్గ సిక్సర్లు కానీ బౌండరీలు కానీ నమోదు కాలేదు. ఇస్లామాబాద్ ఆటగాడు ఫర్హాన్ అత్యధిక సిక్సర్లు (11), అత్యధిక బౌండరీలు (25) కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. బాబర్ 3 మ్యాచ్ల్లో కనీసం ఒక్కసారి కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు. బౌలింగ్లో షాహీన్ అఫ్రిది (3 మ్యాచ్ల్లో 5 వికెట్లు) పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో జేమ్స్ విన్స్ మినహా విదేశీ ఆటగాళ్లు ఒక్కరు కూడా స్థాయి మేరకు రాణించడం లేదు. డేవిడ్ వార్నర్ లాంటి అనుభవజ్ఞుడు కూడా తేలిపోతున్నాడు. కొలిన్ మున్రో, టిమ్ సీఫర్ట్, సామ్ బిల్లింగ్స్, ఫిన్ అలెన్ లాంటి విధ్వంకర వీరులు కూడా అడపాదడపా ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. భారీ హిట్టర్గా పేరున్న రిలీ రొస్సో తడబడుతున్నాడు. లోకల్ హీరోలు సల్మాన్ అఘా, మహ్మద్ హరీస్, ఫకర్ జమాన్, సౌద్ షకీల్, ఉస్మాన్ ఖాన్, అబ్దుల్లా షఫీక్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. -
'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్రౌండర్లు గ్లెన్ మాక్స్వెల్, లియామ్ లివింగ్స్టోన్ దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఏ మ్యాచ్లోనూ ఈ స్టార్ క్రికెటర్లు తమ మార్క్ను చూపించలేకపోయారు.దీంతో వారిద్దరిపై ఇరు జట్ల మెన్జెమెంట్లు వేటు వేశాయి. ఇప్పటికే మాక్స్వెల్ను పంజాబ్ కింగ్స్ గత రెండు మ్యాచ్లకు దూరం పెట్టగా.. ఆర్సీబీ కూడా లివింగ్ స్టోన్ను తమ ఆఖరి మ్యాచ్లో బెంచ్కే పరిమితం చేసింది. ఆదివారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో లివింగ్ స్టోన్కు ఆర్సీబీ తుది జట్టులో చోటు దక్కలేదు. అతడి స్దానంలో కరేబియన్ ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో మాక్స్వెల్, లివింగ్ స్టోన్పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. వారి ఆట తీరును చూస్తుంటే ఏదో హాలిడేకి వచ్చినట్లు ఉందని సెహ్వాగ్ మండిపడ్డాడు."మాక్స్వెల్, లివింగ్ స్టోన్లో తమ జట్ల కోసం పోరాడాలనే కసి కనిపించడం లేదు. వారు ఏదో హాలిడే కోసం భారత్కు వచ్చినట్లు అన్పిస్తోంది. ఇక్కడకు వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్లిపోవడమే వాళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు కోసం ఏదైనా చేయాలనే తపన వారిలో లేదు. గతంలో చాలా మంది విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడాను. వారిలో ఒకరిద్దరూ మాత్రమే జట్టు కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు అప్పటిలో నాకు అన్పించిందని" క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా మాక్స్వెల్ ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి కేవలం 41 పరుగులతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు లివింగ్స్టోన్ 7 మ్యాచ్లు ఆడి 87 పరుగులు చేశాడు.చదవండి: PBKS vs RCB: నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి -
ఐదేసిన మెహిది హసన్.. అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించిన జింబాబ్వే
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో పర్యాటక జింబాబ్వే కీలకమైన 82 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. ఓవర్నైట్ స్కోర్ 67/1 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన జింబాబ్వే మరో 206 పరుగులు జోడించి 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో బెన్ కర్రన్ 18, నిక్ వెల్చ్ 2, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 8, వెల్లింగ్టన్ మసకద్జ 6, ముజరబానీ 17, న్యాయుచి 7 పరుగులకు ఔటయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోవండతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలింది. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ సొంతగడ్డపై భారీ దెబ్బకొట్టారు. బంగ్లాదేశ్కు సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోర్. బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. ఖలీద్ అహ్మద్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. -
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్పై విమర్శలు
ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్లోకి రావడం ఆ జట్టుకు శుభసూచకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. గత మ్యాచ్ల మాదిరి ఆదిలోనే వికెట్ పారేసుకోకుండా తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన తీరును ప్రశంసించాడు. అయితే, ఓ ఓపెనింగ్ బ్యాటర్గా అతడి ప్రదర్శన ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదని విమర్శించాడు.రూ. 16.30 కోట్లకుకాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ రోహిత్ శర్మను రూ. 16.30 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే, ఈ సీజన్ ఆరంభం నుంచి అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్లో మొత్తం కలిపి 82 పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో మాత్రం బ్యాట్ ఝులిపించాడు.వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్లో రోహిత్ శర్మ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు,. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొని.. 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా హిట్మ్యాన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.అతడి స్థాయికి ఇది అతి సాధారణ ప్రదర్శన‘‘అందరి ముఖాల్లో సంతోషం. కానీ అదే సమయంలో ఎన్నో ప్రశ్నలు. ఒకవేళ రోహిత్ శర్మ కనీసం 20 పరుగుల మార్కు దాటేందుకు ఇంకొన్ని ఇన్నింగ్స్ తీసుకుని ఉంటే.. విమర్శలు మరింత ఎక్కువయ్యేవి.అయితే, ప్రతి ఇన్నింగ్స్లోనూ అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే, ఆఖర్లో 26 అతడి అత్యధిక స్కోరుగా ఉండేది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు.ఇప్పుడు ఫామ్లోకి వచ్చినా.. అతడి స్థాయికి ఇది అతి సాధారణ ప్రదర్శన మాత్రమే. జట్టు ఓపెనర్గా ఇలాంటి ఆట తీరు ఎంతమాత్రం సరికాదు. అయితే, ఈ మ్యాచ్లో రోహిత్ పరుగులు చేయడం జట్టుకు సానుకూల పరిణామం.మెరుగ్గా ఇన్నింగ్స్ ఆరంభించి.. ట్రేడ్మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. అయితే, అతడు ఈరోజు వికెట్ పారేసుకోకుండా ఉండటమే నాకు నచ్చిన అత్యంత గొప్ప విషయం’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. ఏదేమైనా సూపర్స్టార్ రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే ముచ్చటగా అనిపించిందని.. ఇక ముందు కూడా ఇదే ఫామ్ను కొనసాగించాలని ఆకాంక్షించాడు.చెన్నైని ఓడించిన ముంబైకాగా వాంఖడేలో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 176 పరుగులు సాదించింది. ఇక ముంబై ఈ నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 15.4 ఓవర్లలోనే ఊదేసింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లు-76 రన్స్), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు- 68 రన్స్) కలిసి ముంబైని గెలుపు తీరాలకు చేర్చారు.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోA perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
MI VS CSK: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 20) సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హిట్మ్యాన్.. ఐపీఎల్లో 20 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్కు ముందు రోహిత్, విరాట్ కోహ్లి తలో 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచి భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాళ్లుగా ఉన్నారు.విరాట్ నిన్ననే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచి రోహిత్ రికార్డును సమం చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే రోహిత్ విరాట్ను వెనక్కు నెట్టి హోల్ అండ్ సోల్గా భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (ఐపీఎల్) గెలుచుకున్న ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ (20) వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్లు)ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు (టాప్-5)25- ఏబీ డివిలియర్స్ (184 మ్యాచ్లు)22- క్రిస్ గేల్ (142 మ్యాచ్లు)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్లు)నిన్నటి మ్యాచ్లో రోహిత్ మరో రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శిఖర్ ధవన్కు వెనక్కు నెట్టాడు. ఈ జాబితాలో విరాట్ టాప్ ప్లేస్లో ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు (టాప్-5)8326 - విరాట్ కోహ్లీ6786 - రోహిత్ శర్మ*6769 - శిఖర్ ధావన్6565 - డేవిడ్ వార్నర్5528 - సురేష్ రైనామ్యాచ్ విషయానికొస్తే.. నిన్న రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.సీఎస్కే ఇన్నింగ్స్లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. -
హార్దిక్తో ఇలాగే ఉంటది!.. పాపం ఆకాశ్ అంబానీ.. భయపడిపోయాడు!
తొలుత అంపైర్ క్యామ్.. తర్వాత స్పైడర్ క్యామ్.. ఇప్పుడు ‘చంపక్’.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) బ్రాడ్కాస్టింగ్ టీమ్లో చేరిన కొత్త మెంబర్ పేరిది. ఐపీఎల్-2025 సీజన్ సందర్భంగా ఓ రోబో కుక్కను నిర్వాహకులు ప్రవేశపెట్టారు.ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏప్రిల్ 13న ఈ రోబో కుక్కను.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ డానీ మోరిసన్ పరిచయం చేశాడు. తమ జట్టులోని కొత్త మెంబర్ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.𝗛𝗼𝗹𝗱 𝗼𝗻! 𝗪𝗲'𝘃𝗲 𝗮 𝗻𝗲𝘄 𝗜𝗣𝗟 𝗳𝗮𝗺𝗶𝗹𝘆 𝗺𝗲𝗺𝗯𝗲𝗿 𝗶𝗻 𝘁𝗼𝘄𝗻 👀It can walk, run, jump, and bring you a 'heart(y)' smile 🐩❤️And...A whole new vision 🎥Meet the newest member of the #TATAIPL Broadcast family 👏 - By @jigsactin P.S: Can you help us in… pic.twitter.com/jlPS928MwV— IndianPremierLeague (@IPL) April 13, 2025 ఇక వాంఖడేలో ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్మధ్య ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా దీనికి ‘చంపక్’గా నామకరణం చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ రోబో కుక్కను రిమోట్తో ఆపరేట్ చేస్తారు. ఈ నేపథ్యంలో చెన్నైపై విజయానంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ‘చంపక్’ను కలిశాడు.ఆ సమయంలో ముంబై జట్టు యజమాని ఆకాశ్ అంబానీ హార్దిక్ పక్కనే ఉన్నాడు. ఈ క్రమంలో ఆకాశ్ను ఆటపట్టించేందుకు రోబో కుక్కను అతడి మీదకు ఉరికించాడు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయి ఆకాశ్ అక్కడి నుంచి పరిగెత్తే ప్రయత్నం చేయగా.. హార్దిక్ గట్టిగా నవ్వేశాడు.pic.twitter.com/InWH5eY2hC— Epic Comments Telugu (@epicmntstelugu) April 21, 2025 అనంతరం చంపక్తో ఆకాశ్కు షేక్హ్యాండ్ ఇప్పించిన హార్దిక్.. ఆ తర్వాత అతడి ముందు రోబో డాగ్ సాగిలాపడేలా రిమోట్తో ఆపరేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పటికే ‘చంపక్’ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్ కలిశారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో టాస్ గెలిచిన ముంబై చెన్నైని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ధోని సేన ఐదు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32) అరంగేట్రంలోనే మెరుపులు మెరిపించగా.. రవీంద్ర జడేజా (53 నాటౌట్), శివం దూబే (50) అర్ధ శతకాలు సాధించారు.ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు కూల్చగా.. అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 15.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి పని పూర్తి చేసింది.ఓపెనర్లలో రియాన్ రికెల్టన్ (24) ఓ మోస్తరుగా ఆడగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ, వన్డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దంచికొట్టారు. రోహిత్ 45 బంతుల్లో 76.. సూర్య 30 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచి ముంబై విజయాన్ని ఖరారు చేశారు. ఈ సీజన్లో ముంబై ఇప్పటికి ఎనిమిదింట నాలుగు గెలిచి పట్టికలో ఆరో స్థానంలో ఉండగా.. చెన్నై ఎనిమిది మ్యాచ్లకు గానూ రెండే గెలిచి ఆఖరున పదో స్థానంలో కొనసాగుతోంది. -
PSL 2025: హెయిర్ డ్రైయర్, ట్రిమ్మర్.. షాహీన్ అఫ్రిదికి ఖరీదైన బహుమతి
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం తమ ఆటగాళ్లకు (జేమ్స్ విన్స్, హసన్ అలీ) హెయిర్ డ్రైయర్లు, హెయిర్ ట్రిమ్మర్ లాంటి వస్తువులను బహుమతులుగా (అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ) ఇచ్చి విమర్శలపాలైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకు కనీస విలువ చేసే బహుమతులైనా ఇవ్వాలేరా అంటూ నెటిజన్లు సదరు ఫ్రాంచైజీ యాజమాన్యంపై మండిపడ్డారు.ఈ నేపథ్యంలో లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన తమ ఆటగాడు షాహీన్ అఫ్రిదికి ఓ ఖరీదైన వస్తువును బహుమతిగా ఇచ్చి ట్రోలింగ్ నుంచి తప్పించుకుంది. అఫ్రిది తన ప్రదర్శనలతో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఖలందర్స్ను విజేతగా నిలపడంతో యాజమాన్యం అతనికి 24 క్యారెట్ల బంగారు పూత పూసిన ఐఫోన్ 16 ప్రోను గిఫ్ట్గా ఇచ్చింది. ఈ విషయాన్ని ఖలందర్స్ యాజమాన్యం ఓ వీడియో ద్వారా సోషల్మీడియాలో షేర్ చేసింది.The iPhone has landed 📱😉Our Captain Qalandar receives a gift he’s worthy of 💛🤴🏽 A custom 24K Gold-plated IPhone 16 Pro, made just for Lahore Qalandars’ main man, Shaheen! pic.twitter.com/PYigEiJvRR— Lahore Qalandars (@lahoreqalandars) April 20, 2025ఖలందర్స్కు కెప్టెన్గా కూడా ఉన్న అఫ్రిది క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్పై వరుసగా 2-6, 3-35 ప్రదర్శనలు చేశాడు. ఈ ప్రదర్శనల కారణంగా ఖలందర్స్ ఆయా జట్లపై 79, 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ చేతిలో ఓటమి అనంతరం ఖలందర్స్ క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్పై విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (డిఫెండింగ్ ఛాంప్ ఇస్లామాబాద్ యునైటెడ్ టాప్ ప్లేస్లో ఉంది) కొనసాగుతుంది. ఖలందర్స్ తమ తదుపరి మ్యాచ్లో మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని ముల్లాన్ సుల్తాన్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 22న జరుగనుంది. -
నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (PBKS vs RCB) స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) అదరగొట్టాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ దూకుడు శైలికి భిన్నంగా సంయమనంతో ఆడి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అద్భుత అర్ధ శతకంతో మెరిసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.పంజాబ్తో మ్యాచ్లో మొత్తంగా 54 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 73 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్లో కోహ్లి 135 స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేస్తే.. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) మాత్రం వేగంగా ఆడాడు.ఈ కేరళ బ్యాటర్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 61 పరుగులు సాధించాడు. ఇక ఆఖర్లో జితేశ్ శర్మ సిక్స్తో ఆర్సీబీ గెలుపును ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.నాకెందుకు?.. ఈ అవార్డుకు అతడే అర్హుడు‘‘మాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్. రెండు పాయింట్లు కూడా ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించే క్రమంలో ఎంతో ఉపయోగపడతాయి. సొంత మైదానం వెలుపలా మేము అద్భుతంగా ఆడుతున్నాం.ఈ విషయం ఇక్కడ మరోసారి నిరూపితమైంది. అయితే, ఈరోజు దేవ్ ఇన్నింగ్స్ వల్లే ఇది సాధ్యమైంది. అతడు భిన్న రీతిలో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. నాకు అభిప్రాయం ప్రకారం ఈ అవార్డుకు అతడే అర్హుడు.కానీ నాకెందుకు ఇచ్చారో తెలియడం లేదు’’ అంటూ కోహ్లి పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘నేను క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నా పర్లేదు.. ఆ తర్వాత వేగం పెంచి.. ఆఖరిదాకా క్రీజులో ఉండాలనేదే మా వ్యూహం.మాకు మంచి జట్టు లభించిందిఈ సీజన్లో మాకు మంచి జట్టు లభించింది. వేలంలో మా వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. డేవిడ్, టిమ్, పాటిదార్.. అందరూ తమ పాత్రలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇక రొమారియో షెఫర్డ్, లియామ్ లివింగ్స్టోన్ కూడా ఉండటం మాకు సానుకూలాంశం’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా మూడు రోజుల క్రితం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీని ఓడించింది. అందుకు బదులుగా పంజాబ్ సొంత మైదానం ముల్లన్పూర్లో ఆర్సీబీ ఆదివారం నాటి మ్యాచ్లో శ్రేయస్ సేనపై ప్రతీకారం తీర్చుకుంది. ఏడు వికెట్ల తేడాతో పంజాబ్ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో ఎనిమిదింట ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. పంజాబ్ కూడా ఎనిమిదింట ఐదు విజయాలు సాధించినా రన్రేటు పరంగా వెనుకబడి నాలుగో స్థానంలో ఉంది.ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ👉టాస్: ఆర్సీబీ.. మొదట బౌలింగ్👉పంజాబ్ స్కోరు: 157/6 (20)👉ఆర్సీబీ స్కోరు: 159/3 (18.5)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించిన ఆర్సీబీ.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోSmacking them with ease 🤌Virat Kohli is in the mood to finish this early 🔥Updates ▶ https://t.co/6htVhCbTiX#TATAIPL | #PBKSvRCB | @imVkohli pic.twitter.com/iuT58bJY2A— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్మ్యాన్’కే ఇది సాధ్యం!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత అద్బుత ఇన్నింగ్స్తో మెరిశాడు. ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభం నుంచి పేలవ ఫామ్తో సతమతమైన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్ సందర్భంగా ‘వింటేజ్ హిట్మ్యాన్’ను గుర్తు చేస్తూ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు.రోహిత్ ధనాధన్చెన్నై విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ 33 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 45 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచి.. సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్)తో కలిసి ముంబైని విజయతీరాలకు చేర్చాడు.ఇక చెన్నైతో మ్యాచ్లో ‘హిట్మ్యాన్’ అంటూ అభిమానులు ఇచ్చిన బిరుదును రోహిత్ శర్మ మరోసారి సార్థకం చేసుకున్నాడు. ఆదివారం నాటి మ్యాచ్లో అతడి ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం ఇందుకు నిదర్శనం.This man & his pull shots >>>>#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvCSKpic.twitter.com/hwnlKRNvO0— Mumbai Indians (@mipaltan) April 20, 2025 ఈ క్రమంలో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది.ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు (అంతర్జాతీయ, లీగ్ క్రికెట్లో కలిపి) బాదిన క్రికెటర్లు👉రోహిత్ శర్మ- ఇండియాలో- 361 సిక్సర్లు👉క్రిస్ గేల్- వెస్టిండీస్లో- 357 సిక్సర్లు👉విరాట్ కోహ్లి- ఇండియాలో- 325 సిక్సర్లు👉మహేంద్ర సింగ్ ధోని- ఇండియాలో- 286 సిక్సర్లు👉కీరన్ పొలార్డ్- వెస్టిండీస్లో- 276 సిక్సర్లు👉సంజూ శాంసన్- ఇండియాలో- 274 సిక్సర్లు👉నికోలస్ పూరన్- వెస్టిండీస్లో- 271 సిక్సర్లు.ఇక ఓవరాల్గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున టెస్టుల్లో 88, వన్డేల్లో 344, టీ20లలో 205 సిక్స్లు కొట్టాడు. ఐపీఎల్లో 264 మ్యాచ్లు పూర్తి చేసుకుని 292 సిక్సర్లు బాదాడు.సీఎస్కే 176.. ఆలౌట్ముంబై- చెన్నై మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో ఆదివారం జరిగిన చిరకాల ప్రత్యర్థుల పోరులో ఆతిథ్య ముంబై పైచేయి సాధించింది. టాస్ గెలిచి చెన్నైని బ్యాటింగ్కు ఆహ్వానించిన హార్దిక్ సేన.. ధోని బృందాన్ని 176 పరుగులకు కట్టడి చేసింది.అనంతరం కేవలం ఒక వికెట్ కోల్పోయి 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై.. తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఈ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టిన హార్దిక్ సేన పాయింట్ల పట్టికలో ఆరోస్థానాని (8 మ్యాచ్లలో నాలుగు గెలిచి)కి దూసుకువచ్చింది. మరోవైపు.. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్లు ఆడిన చెన్నైకి ఇది ఆరో పరాజయం. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోA #SKY special in Wankhede!#SuryaKumarYadav hits the winning runs for #MI & the Revenge is completed!Next up on #IPLRevengeWeek 👉 #KKRvGT | MON, 21 APR, 6:30 PM LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/8rw3ZDwA5w— Star Sports (@StarSportsIndia) April 20, 2025 -
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల.. రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్, ఇషాన్.. కొత్తగా నితీశ్కు చోటు
2024-25 సంవత్సరానికి గానూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను (34 మంది) విడుదల చేసింది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.🚨 𝗡𝗘𝗪𝗦 🚨BCCI announces annual player retainership 2024-25 - Team India (Senior Men)#TeamIndiaDetails 🔽https://t.co/lMjl2Ici3P pic.twitter.com/CsJHaLSeho— BCCI (@BCCI) April 21, 2025సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించడింది. ఇందులో ఏ ప్లస్ కింద విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది.ఈ ఏడాది కొత్తగా కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు: ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్ఈ ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ఈ ఏడాది పదోన్నతి పొందిన ఆటగాడు: రిషబ్ పంత్ (బి కేటగిరి నుండి ఏ కేటగిరికి)రిటైర్డ్ అయిన ఆటగాడు: రవిచంద్రన్ అశ్విన్ (కేటగిర ఏ నుంచి ఔట్) -
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదో గెలుపు నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ (PBKS vs RCB) చేతిలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఎదురైన పరాభవానికి ఆదివారం బదులు తీర్చుకుంది. పంజాబ్ను వారి హోం గ్రౌండ్ ముల్లన్పూర్లో ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగాఈ క్రమంలో పంజాబ్పై ప్రతీకార విజయం నేపథ్యంలో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. అయితే, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా కోహ్లి వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్న తీరు విమర్శలకు తావిచ్చింది.కోహ్లి చర్య.. శ్రేయస్ ఫైర్ఇక కోహ్లి చర్య పట్ల శ్రేయస్ కూడా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపించింది. మ్యాచ్ ముగియగానే ఇరుజట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలో.. అయ్యర్ కోహ్లితో కోపంగా ఏదో మాట్లాడాడు. అయితే, కోహ్లి మాత్రం నవ్వుతూ వాతావరణాన్ని చల్లబరచాలని ప్రయత్నించాడు.కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం గంభీరంగా అతడికి బదులిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏదేమైనా సహచర టీమిండియా ఆటగాడిని కించపరిచేలా ఇలాంటి సెలబ్రేషన్స్ దిగ్గజ బ్యాటర్ అయిన కోహ్లి స్థాయికి తగవంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కోహ్లిని అనుకరిస్తూ హేళన చేశాడా?అయితే, ఆర్సీబీ అభిమానులు మాత్రం శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్లో కోహ్లిని అనుకరిస్తూ హేళన చేశాడని.. అందుకే కింగ్ ఇలా బదులిచ్చాడని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. శ్రేయస్ ఆర్సీబీ మ్యాచ్ సమయంలో ఎలాంటి మూర్ఖపు చర్యలకు దిగలేదని.. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో అతడు ఇచ్చిన రియాక్షన్ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.బ్యాటర్గా శ్రేయస్ విఫలంకాగా ముల్లన్పూర్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ పంజాబ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్సిమ్రన్ సింగ్ (33), వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31) రాణించగా.. ఆఖర్లో మార్కో యాన్సెన్ (20 బంతుల్లో 25 నాటౌట్) ఆకట్టుకున్నాడు.ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. పేసర్ రొమారియో షెఫర్డ్ శ్రేయస్ అయ్యర్ (6) రూపంలో కీలక వికెట్ దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.దంచికొట్టిన పడిక్కల్, కోహ్లిఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ విరాట్ కోహ్లి, వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. పడిక్కల్ కేవలం 35 బంతుల్లోనే 61 పరుగులతో దుమ్ములేపాడు.అయితే, కెప్టెన్ రజత్ పాటిదార్ (12) ఈసారి విఫలం కాగా.. కోహ్లి- జితేశ్ శర్మతో కలిసి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశాడు. కోహ్లి 54 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 73 పరుగులతో అజేయంగా నిలవగా.. జితేశ్ (8 బంతుల్లో 11) సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. కాగా ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ ఐదింట గెలిచి.. పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది.చదవండి: Rohit Sharma: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. నాకు దక్కిన అరుదైన గౌరవంCSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి ఇలా..Jitesh Sharma dials 6⃣ to seal it in style 🙌Virat Kohli remains unbeaten on 73*(54) in yet another chase 👏@RCBTweets secure round 2⃣ of the battle of reds ❤Scorecard ▶ https://t.co/6htVhCbltp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/6dqDTEPoEA— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
CSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి..
ఐపీఎల్-2025 ఆరంభంలో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్.. గేర్ మార్చింది. ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో గెలుపు బాట పట్టిన హార్దిక్ సేన.. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుని.. ధోని సేనను ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐపీఎల్-2025 (IPL 2025)లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసి.. ఓవరాల్గా నాలుగో విజయం అందుకుంది.ఈ క్రమంలో ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఆరో స్థానానికి దూసుకువచ్చింది ముంబై ఇండియన్స్. ఇక ఆదివారం నాటి సీఎస్కేతో మ్యాచ్లో ముంబై దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్లోకి రావడం జట్టుకు మరో శుభసూచకం.రోహిత్- సూర్య ధనాధన్చెన్నై విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 19 బంతుల్లో 24 పరుగులు చేసి నిష్క్రమించగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 33 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న హిట్మ్యాన్.. మొత్తంగా 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.రోహిత్కు తోడుగా సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ కారణంగా ముంబై 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. సీజన్ ఆరంభ మ్యాచ్లో చెపాక్లో చెన్నై చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యజమానులు నీతా అంబానీ (Nita Ambani), ఆకాశ్ అంబానీల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం.. సూర్య ధనాధన్ ఇన్నింగ్స్ చూసి వారు ఖుషీ అయ్యారు.రెండు జెడల సీతలాఇక నీతా- ఆకాశ్లకు తోడు ఈసారి అంబానీల కొత్త కోడలు రాధికా మర్చంట్ (Radhika Merchant) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భర్త అనంత్ అంబానీతో కలిసి మ్యాచ్ను వీక్షించిన రాధికా.. రెండు జెడల సీతలా ముంబై జెర్సీలో తళుక్కుమన్నారు. రోహిత్ శర్మ ఫిఫ్టీ పూర్తి చేసుకోగానే కరతాళ ధ్వనులతో అనంత్- రాధికా తమ మాజీ కెప్టెన్ను అభినందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ధోని విఫలంకాగా వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు ఆయుశ్ మాత్రే 32 పరుగులతో ఆకట్టుకున్నాడు.మరోవైపు.. రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్), శివం దూబే (32 బంతుల్లో 50) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్ ధోని 4 పరుగులకే పరిమితమయ్యాడు.ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు, అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్ ఒక్కో వికెట్ తీశారు. ముంబై సీఎస్కే విధించిన లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది.చదవండి: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. నాకు దక్కిన అరుదైన గౌరవం: రోహిత్ శర్మA perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025 "Anant Ambani and Radhika Merchant" cheering for his captain Rohit Sharma ✊🔥.#CSKvsMI #RohitSharma pic.twitter.com/09vXEKgmxR— Aniket 𝕏 (@ImAniket264) April 20, 2025 -
CSK Vs MI: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. ఇప్పుడు ఇలా..: రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్ సందర్భంగా.. చాలా కాలం తర్వాత హిట్మ్యాన్ బ్యాట్ ఝులిపించాడు. సొంత మైదానం వాంఖడేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 45 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.చాలా కాలం తర్వాత ఇలానాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో అజేయ అర్ద శతకంతో జట్టును గెలిపించిన రోహిత్ శర్మను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం తర్వాత నేను ఇక్కడ నిలుచోగలిగాను. ఫామ్లేమి కారణంగా ఒక్కోసారి మనపై మనకే సందేహం కలుగుతుంది. మన పంథాను మార్చుకునేలా చేస్తుంది. కానీ అలాంటపుడే సంయమనంతో ఉండాలి. లేదంటే ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. నా వరకు ఈరోజు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. అందుకే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆడాలని ముందే నిర్ణయించుకున్నా. మా ప్రణాళికల ప్రకారమే నా ఇన్నింగ్స్ కొనసాగించాను.బంతి నా ఆధీనంలోకి వచ్చినప్పుడు బౌండరీకి తరలించాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగడంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. ఫీల్డింగ్ వేళ చివరి 2-3 ఓవర్లలో వచ్చినా.. నేరుగా బ్యాటింగ్కే దిగినా పెద్దగా తేడా ఏమీ ఉండదు’’ అని పేర్కొన్నాడు.నాకు దక్కిన అరుదైన గౌరవంఅదే విధంగా.. వాంఖడేలో కొత్తగా తన పేరిట ఏర్పాటు చేసిన స్టాండ్ గురించి కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘రోహిత్ శర్మ స్టాండ్లోకి బంతిని తరలించడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. నాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. ఆ పేరును పలికినప్పుడల్లా ఎలా స్పందించాలో కూడా నాకు తెలియడం లేదు.ఏదేమైనా ఈరోజు చివరి వరకు నిలిచి మ్యాచ్ను విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. నా బాధ్యత కూడా అది. సరైన సమయంలో మేము గెలుపు బాట పట్టాము. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచాం’’ అని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో చెపాక్లో చెన్నై చేతిలో ఓడిన తాజా గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ముంబై ఎనిమిదింట నాలుగు మ్యాచ్లలో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు రోహిత్ శర్మ.. ఏడు ఇన్నింగ్స్ ఆడి 158 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ చెన్నై స్కోర్లుటాస్: ముంబై.. తొలుత బౌలింగ్చెన్నై స్కోరు: 176/5 (20)ముంబై స్కోరు: 177/1 (15.4)ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసిన ముంబై.చదవండి: IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి A perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
రాజకీయ కక్షతోనే నా పేరు తొలగించారు
బంజారాహిల్స్(హైదరాబాద్): ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కున్న తన పేరును తొలగించడంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ విచారం వ్యక్తం చేశారు. నార్త్ స్టాండ్ నుంచి అజహరుద్దీన్ పేరును తొలగించాలంటూ అంబుడ్స్మెన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించిన నేపథ్యంలో బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.పదేళ్లపాటు ఇండియన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా, 19 ఏళ్లు క్రికెటర్గా సేవలందించానని పేర్కొన్నారు. కొంత మంది కావాలని రాజకీయం చేసి లార్డ్స్ క్రికెట్ క్లబ్తో కోర్టుల్లో పిటిషన్¯ వేయించారని ఆరోపించారు. తనపై వచి్చన పలు ఆరోపణలను గతంలోనే కోర్టు కొట్టేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక హైదరాబాదీగా దేశం గర్వించే స్థాయికి ఎదిగానని, కుట్రలకు న్యాయపరంగా సమాధానం చెప్తానని అన్నారు. ఉదయం నుంచి తనకు వేలాదిగా తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారని, నార్త్ స్టాండ్స్కు తన పేరును తొలగించడాన్ని వారు ఖండిస్తున్నారని అన్నారు. ఆనాడు క్రికెట్ అభిమానుల కోరిక మేరకే తన పేరును స్టాండ్స్కు పెట్టారని గుర్తు చేశారు. అజారుద్దీన్ పేరు తొలగింపుపై అభిమానుల ఆందోళన.. క్రికెటర్ అజారుద్దీన్ పేరును ఉప్పల్ స్టేడియంలో నార్త్స్టాండ్ నుంచి తొలగించాలంటూ అంబుడ్స్మెన్ కోర్టు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అజారుద్దీన్ అభిమానులు బంజారాహిల్స్లో ధర్నా చేశారు. అజారుద్దీన్ను కావాలంనే కొంత మంది రాజకీయ కక్షలతో వేధిస్తున్నారని ఇలాగే కొనసాగితే హెచ్సీఏ ముందు తాము ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. -
IPL 2025 GT Vs KKR: టైటాన్స్ జోరు సాగేనా!
కోల్కతా: ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో పోరుకు సిద్ధమైంది. కేకేఆర్ జట్టు లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు 259 మ్యాచ్లాడగా... అందులో మూడుసార్లు మాత్రమే గుజరాత్ టైటాన్స్తో తలపడింది. షెడ్యూల్ కారణంగా ఇరు జట్ల మధ్య తక్కువ మ్యాచ్లు జరగగా... సోమవారం పోరులో అటు కేకేఆర్, ఇటు గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్లే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగనున్నాయి. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రూపంలో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు కోల్కతాకు అందుబాటులో ఉండగా... గుజరాత్ తరఫున రషీద్ ఖాన్, సాయికిషోర్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత సీజన్లో శుబ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్లాడి 5 విజయాలు, 2 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గతంలో కోల్కతాకు ప్రాతినిధ్యం వహించిన గిల్... తన పాత జట్టుపై విజృంభించాలని చూస్తుంటే... విండీస్ ద్వయం రసెల్, నరైన్ సమష్టిగా కదంతొక్కి జట్టును గెలుపు బాట పట్టించాలని కోల్కతా మేనేజ్మెంట్ భావిస్తోంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పించిన అనంతరం తిరిగి కేకేఆర్ గూటికి చేరిన అభిషేక్ నాయర్ ఈ మ్యాచ్లో డగౌట్ నుంచి కోల్కతా ప్లేయర్లకు సలహాలు ఇవ్వనున్నాడు. మరి ఈ మ్యాచ్లో విజయంతో గుజరాత్ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందా... లేక సొంతగడ్డపై కోల్కతా విజయ దరహాసం చేస్తుందా చూడాలి! నిలకడ లేమి సమస్య... డిఫెండింగ్ చాంపియన్గా సీజన్ ఆరంభించిన కోల్కతా... స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోతోంది. పంజాబ్తో జరిగిన గత మ్యాచ్లో 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన కేకేఆర్... 95 పరుగులకే కుప్పకూలింది. బ్యాటర్లు ముకుమ్మడిగా విఫలమవడంతో కోల్కతా మూల్యం చెల్లించుకుంది. అయితే అభిõÙక్ నాయర్ రాకతో జట్టులో జవసత్వం నిండుతుందని యాజమాన్యం ఆశిస్తోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకపై ఆడనున్న అన్నీ మ్యాచ్లు కీలకమైన నేపథ్యంలో... ప్లేయర్లంతా సమష్టిగా సత్తా చాటాలని చూస్తున్నారు. ముఖ్యంగా వేలంలో రూ. 23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ కనీస ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. ఈ సీజన్లో వెంకటేశ్ 24.20 సగటుతో 121 పరుగులు చేయగా... రమణ్దీప్ కేవలం 29 పరుగులే చేశాడు. హిట్టర్లుగా పేరున్న రసెల్ 5 మ్యాచ్ల్లో 34 పరుగులకే పరిమితం కాగా... రింకూ సింగ్ 38.66 సగటుతో 116 పరుగులు చేశాడు. కెప్టెన్ అజింక్య రహానే 2 అర్ధశతకాల సాయంతో 221 పరుగులు చేయగా... 20 ఏళ్ల రఘువంశీ 170 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు సునీల్ నరైన్, డికాక్ కొన్ని మెరుపులు మెరిపిస్తున్నా... నిలకడగా జట్టుకు శుభారంభం అందించలేకపోతున్నారు. ఈ లోపాలన్నీ సరిద్దిద్దుకుంటేనే కేకేఆర్ తిరిగి గెలుపు పట్టాలెక్కనుంది. బౌలింగ్లో హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్లో ఉన్నారు. అన్నీ రంగాల్లో పటిష్టంగా... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తోంది. టాప్–3 ఆటగాళ్లు శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్ చక్కటి ఫామ్లో ఉండటం ఆ జట్టుకు కలిసి రానుంది. రూథర్ఫార్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా రూపంలో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. గత మ్యాచ్లో శతకానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయిన బట్లర్ ఈ సీజన్లో 63.00 సగటుతో 315 పరుగులు చేయగా... సాయి సుదర్శన్ 365 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. బౌలింగ్లోనూ గుజరాత్కు ఇబ్బందులు లేవు. సీనియర్ పేసర్ ప్రసిధ్ కృష్ణ తాజా సీజన్లో 14 వికెట్లు పడగొట్టి దూకుడు మీద ఉండగా... హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ అతడికి చక్కటి సహకారం అందిస్తున్నారు. తమిళనాడు స్పిన్నర్ సాయి కిషోర్ తనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుండగా... రషీద్ ఖాన్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తుది జట్లు (అంచనా) కోల్కతా నైట్ రైడర్స్: రహానే (కెప్టెన్), నరైన్, డికాక్, వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ, రింకూ సింగ్, రసెల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, నోర్జే, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. గుజరాత్ టైటాన్స్: గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, రూథర్ఫర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ. -
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. పంజాబ్ కింగ్స్తో పోరులో కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్లో రోహిత్ శర్మ ఊర మాస్ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్ భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్... తనను ‘హిట్మ్యాన్’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.ముంబై: సిక్స్... ఫోర్... ముంబై ఇన్నింగ్స్ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ, టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ల ఆట మ్యాచ్లో హైలైట్స్ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ముందుగా చెన్నై సూపర్కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్లు) హోరెత్తించారు. దంచేసిన జడేజా, దూబే ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (20 బంతుల్లో 19; 1 ఫోర్)కు ఓపెనింగ్లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్ బాయ్’ ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్లతో అలరించాడు. తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్కు 79 పరుగులు జోడించారు. సిక్స్లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు. బాదుడే... బాదుడు రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ చేసిన రికెల్టన్ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్ నుంచి రోహిత్ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్ ఓవర్న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ను కోల్పోయింది. సూర్యకుమార్ రావడం... రోహిత్తో కలిసి ధనాధన్ షోను డబుల్ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్మ్యాన్’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: షేక్ రషీద్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 19; రచిన్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 5; ఆయుశ్ (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 32; జడేజా (నాటౌట్) 53; దూబే (సి) జాక్స్ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్: చహర్ 4–0–32–1, బౌల్ట్ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్ జాక్స్ 1–0–4–0, హార్దిక్ 2–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) ఆయుశ్ (బి) జడేజా 24; రోహిత్ (నాటౌట్) 76; సూర్యకుమార్ (నాటౌట్) 68; ఎక్స్ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్: ఖలీల్ 2–0–24–0, ఓవర్టన్ 2–0– 29–0, అశ్విన్ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0. ముల్లాన్పూర్: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోష్ ఇన్గ్లిస్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించాడు. కోహ్లి ఆఖరిదాకా... పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) వికెట్ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్ కోహ్లి, పడిక్కల్ నడిపించారు. వన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్ షాట్లతో ముల్లాన్పూర్ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 22; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 33; అయ్యర్ (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 6; ఇన్గ్లిస్ (బి) సుయశ్ 29; నేహల్ (రనౌట్) 5; శశాంక్ (నాటౌట్) 31; స్టొయినిస్ (బి) సుయశ్ 1; యాన్సెన్ (నాటౌట్) 25; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–0, యశ్ దయాళ్ 2–0–22–0, హాజల్వుడ్ 4–0–39–0, కృనాల్ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్ 2–0–18–1, సుయశ్ 4–0–26–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్గ్లిస్ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్) 73; పడిక్కల్ (సి) నేహల్ (బి) హర్ప్రీత్ 61; పాటీదార్ (సి) యాన్సెన్ (బి) చహల్ 12; జితేశ్ శర్మ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్ 3–0–28–1, హర్ప్రీత్ బ్రార్ 4–0–27–1, యాన్సెన్ 3–0–20–0, చహల్ 4–0–36–1, స్టొయినిస్ 1–0–13–0, నేహల్ 0.5–0–9–0. ఐపీఎల్లో నేడుకోల్కతా X గుజరాత్ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs MI: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ఆది నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ సీజన్లో తొలిసారి సామర్థ్యం మేరకు సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్) కూడా పర్వాలేదనిపించాడు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. -
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో విరాట్ ఛేదనలో అద్భుతమైన హాఫ్ సెంచరీతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అదరగొట్టి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్లో విరాట్కు ఇది మూడో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఓవరాల్గా 19వది.ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో విరాట్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. రోహిత్ కూడా ఐపీఎల్లో ఇప్పటివరకు 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. విరాట్, రోహిత్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు క్రిస్ గేల్ (22) పేరిట ఉంది. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్, రోహిత్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్లు)19 - రోహిత్ శర్మ (263 మ్యాచ్లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్లు)ఈ మ్యాచ్లో విరాట్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్- 66 (62, 4)శిఖర్ ధవన్- 53 (51, 2)రోహిత్ శర్మ- 45 (43, 2)కేఎల్ రాహుల్- 43 (39, 4)ఏబీ డివిలియర్స్- 43 (40, 3)ఐపీఎల్లో విరాట్ పేరిట ఉన్న రికార్డు..అత్యధిక పరుగులుఅత్యధిక శతకాలుఅత్యధిక 50 ప్లస్ స్కోర్లుఅత్యధిక బౌండరీలుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్ను స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ చేసి ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. -
MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో ఆయుశ్ మాత్రే సీఎస్కే తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. మాత్రే ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మాత్రే 17 ఏళ్ల 278 రోజుల వయసులో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు. మాత్రేకు ముందు ఈ రికార్డు అభినవ్ ముకుంద్ పేరిట ఉండేది. ముకుంద్ 18 ఏళ్ల 139 రోజుల వయసులో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు.ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కులైన ఆటగాళ్ళు17y 278d - ఆయుశ్ మాత్రే vs MI, వాంఖడే, 2025*18y 139d - అభినవ్ ముకుంద్ vs RR, చెన్నై, 200819y 123d - అంకిత్ రాజ్పూత్ vs MI, చెన్నై, 201319y 148d - మతీష పతిరన vs GT, వాంఖడే, 202220y 79d - నూర్ అహ్మద్ vs MI, చెన్నై, 2025మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే 16 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ బౌలింగ్లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి రచిన్ రవీంద్ర (5) ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్లోనే ఇరగదీశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్లో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. #RRvLSG: 14-year-old Vaibhav Suryavanshi's first three balls vs LSG on IPL debut: 𝐒𝐈𝐗, 1 RUN, 𝐒𝐈𝐗,#MIvCSK: 17-year-old Ayush Mhatre's first four balls vs MI on IPL debut: 1 RUN, 𝗙𝗢𝗨𝗥, 𝐒𝐈𝐗, 𝐒𝐈𝐗,WHAT A WAY TO ANNOUNCE YOUR ARRIVAL! | 📸: JioStar pic.twitter.com/WRVTwqEt2f— CricTracker (@Cricketracker) April 20, 20256.5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్లోకి వచ్చాడు. కాగా, నిన్న జరిగిన మ్యాచ్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) ఎలా రెచ్చిపోయాడో, ఈ మ్యాచ్లో ఆయుశ్ మాత్రే కూడా అలాగే ఇరగదీశాడు. సూర్యవంశీ తన అరంగేట్రం ఇన్నింగ్స్లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. -
పడిక్కల్ విధ్వంసం, సత్తా చాటిన విరాట్.. పంజాబ్పై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగగా.. ఆ మ్యాచ్లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో పంజాబ్ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్ను స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ వికెట్లు తీయకపోయినా.. పొదుపుగా బౌలింగ్ చేశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2025: సీఎస్కేపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
సీఎస్కేపై ముంబై ఇండియన్స్ ఘన విజయంచెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ముంబై 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ముంబైని విజయతీరాలకు చేర్చారు. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను ముగించాడు.సూర్యకుమార్ హాఫ్ సెంచరీస్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 146/1గా ఉంది.టార్గెట్ 177.. 13 ఓవర్లలో ముంబై స్కోర్ 127/1రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మరోహిత్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్లో సూర్యకుమార్ 32 పరుగులతో (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా ఉన్నాడు. 12 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 112/1గా ఉంది. టార్గెట్ 177.. 9 ఓవర్లలో ముంబై స్కోర్ 88/1రోహిత్ శర్మ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 14; ఫోర్, సిక్స్)తొలి వికెట్ కోల్పోయిన ముంబై6.4వ ఓవర్- 63 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో ఆయుశ్ మాత్రేకు క్యాచ్ ఇచ్చి రికెల్టన్ (24) ఔటయ్యాడు.టార్గెట్ 177.. 6 ఓవర్లలో ముంబై స్కోర్ 62/0రోహిత్ శర్మ (18 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రికెల్టన్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్)టార్గెట్ 177.. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ177 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతుంది. రోహిత్ శర్మ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. 3 ఓవర్లలో ముంబై స్కోర్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులుగా ఉంది. రోహిత్ 10 బంతుల్లో 2 ఫోర్లు,2 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేశాడు. రికెల్టన్ 8 బంతుల్లో 2 బౌండరీల సాయంతో 11 పరుగులు చేశాడు. రాణించిన దూబే, జడేజా.. గౌరవప్రదమైన స్కోర్ చేసిన సీఎస్కేటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే గౌరవప్రమదై స్కోర్ చేసింది. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. ధోని ఔట్18.4వ ఓవర్- 156 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ధోని (4) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. దూబే ఔట్16.2వ ఓవర్- 142 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో విల్ జాక్స్కు క్యాచ్ ఇచ్చి శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న దూబేఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన శివమ్ దూబే అదరగొడుతున్నాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. దూబేకు జతగా రవీంద్ర జడేజా (19) క్రీజ్లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 118/3గా ఉంది.మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే7.6వ ఓవర్- 63 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో షేక్ రషీద్ (19) స్టంపౌటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 66/3గా ఉంది. రవీంద్ర జడేజా (6), శివమ్ దూబే (1) క్రీజ్లో ఉన్నారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔటైన ఆయుశ్ మాత్రేఅరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్లోనే అదరగొట్టాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్లో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 6.5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే3.1వ ఓవర్- 16 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ తన స్పెల్ తొలి బంతికే రచిన్ రవీంద్ర (9 బంతుల్లో 5) వికెట్ తీశాడు. ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ 10 బంతుల్లో బౌండరీ సాయంతో 11 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. రషీద్కు జతగా అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే క్రీజ్లోకి వచ్చాడు.ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మ్హత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, MS ధోని(కెప్టెన్/వికెట్కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరణఇంపాక్ట్ సబ్లు: అన్షుల్ కాంబోజ్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, సామ్ కర్రాన్, రవిచంద్రన్ అశ్విన్ -
PBKS VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో భారీ రికార్డు సొంతం
పరుగుల యంత్రం విరాట్ కోహ్లి మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్- 66 (62, 4)శిఖర్ ధవన్- 53 (51, 2)రోహిత్ శర్మ- 45 (43, 2)కేఎల్ రాహుల్- 43 (39, 4)ఏబీ డివిలియర్స్- 43 (40, 3)మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్పూర్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (73) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. జితేశ్ శర్మ (11) సిక్సర్ బాది మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో దేవ్దత్ పడిక్కల్ (61) మెరుపు అర్ద సెంచరీ చేయగా.. సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీఈ మ్యాచ్లో గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పంజాబ్ను కిందికి దించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి. -
రెచ్చిపోయిన జింబాబ్వే బౌలర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన బంగ్లాదేశ్
ఐపీఎల్ రసవత్తరంగా సాగుతున్న వేల బంగ్లాదేశ్, జింబాబ్వే మధ్య టెస్ట్ మ్యాచ్ మొదలైంది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజు జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోయారు. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్కు ఇది నాలుగో అత్యల్ప స్కోర్. బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. ఖలీద్ అహ్మద్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ 40, బెన్ కర్రన్ 17 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.స్వదేశంలో బంగ్లాదేశ్ అత్యల్ప స్కోర్లు (టెస్ట్ల్లో)ఢాకా- 107 (2001)సిల్హెట్- 143 (2018)సిల్హెట్- 169 (2018)సిల్హెట్- 191 (2025)ఢాకా- 211 (2005) -
PBKS VS RCB: యువరాజ్ సింగ్ను అధిగమించిన ప్రభ్సిమ్రన్ సింగ్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. పంజాబ్ హోం గ్రౌండ్ ముల్లాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. పంజాబ్, ఆర్సీబీ రెండు రోజుల కిందటే బెంగళూరులో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది.ఇవాళ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంది. కృనాల్ పాండ్యా (4-0-25-2), సుయాశ్ శర్మ (4-0-26-2), రొమారియో షెపర్డ్ (2-0-18-1) చెలరేగడంతో పంజాబ్ 18 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 22, ప్రభ్సిమ్రన్ సింగ్ 33, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1 పరుగు చేసి ఔట్ కాగా.. శశాంక్ సింగ్ 25, జన్సెన్ 14 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.ఈ మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ ఆ ఫ్రాంచైజీ దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ రికార్డును అధిగమించాడు. యువరాజ్ పంజాబ్ కింగ్స్ తరఫున 959 పరుగులు (51 మ్యాచ్ల్లో) చేయగా.. ఈ మ్యాచ్లో ప్రభ్సిమ్రన్ యువీ పరుగుల సంఖ్యను దాటేశాడు. ప్రభ్సిమ్రన్ పంజాబ్ తరఫున 42 మ్యాచ్ల్లోనే 965 పరుగులు చేశాడు. సగటు, స్ట్రయిక్రేట్లోనూ ప్రభ్సిమ్రన్ యువరాజ్ కంటే మెరుగ్గా ఉన్నాడు. పంజాబ్ తరఫున యువీ యావరేజ్ 22.30గా ఉండగా.. ప్రభ్సిమ్రన్ యావరేజ్ 22.97గా ఉంది. యువీ స్ట్రయిక్రేట్ 127.86గా ఉండగా.. ప్రభ్సిమ్రన్ స్ట్రయిక్రేట్ 150.55గా ఉంది.టాప్లో కేఎల్ రాహుల్.. 12వ స్థానంలో ప్రభ్సిమ్రన్ఐపీఎల్లో పంజాబ్ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ (2548) ఉన్నాడు. అతడి తర్వాత షాన్ మార్ష్ (2477), డేవిడ్ మిల్లర్ (1974), మయాంక్ అగర్వాల్ (1513), మ్యాక్స్వెల్ (1424), క్రిస్ గేల్ (1339), వృద్దిమాన్ సాహా (1190), మనన్ వోహ్రా (1106), మన్దీప్ సింగ్ (1073), కుమార సంగక్కర (1009), శిఖర్ ధవన్ (985) ఉన్నారు. ప్రభ్సిమ్రన్ ప్రస్తుతం పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 12వ స్థానంలో ఉన్నాడు.ప్రభ్సిమ్రన్ ప్రస్తానం ఇలా..2019 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ప్రభ్సిమ్రన్ 2023, 2024 సీజన్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 సీజన్లో 14 మ్యాచ్ల్లో 358 పరుగులు చేసిన ప్రభ్సిమ్రన్.. 2024 సీజన్లోనూ 14 మ్యాచ్ల్లో 334 పరుగులు చేశాడు. ప్రభ్సిమ్రన్ 2023 సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి వెలుగులోకి వచ్చాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు పంజాబ్ ప్రభ్సిమ్రన్ను రూ. 4 కోట్లకు రీటైన్ చేసుకుంది. ప్రస్తుత సీజన్లో ప్రభ్సిమ్రన్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేస్తూ పంజాబ్కు శుభారంభాలు అందిస్తున్నాడు.ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్, ఢిల్లీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
టీమిండియా కెప్టెన్సీ రేసులో ఊహించని పేరు!.. జట్టులో చోటే లేదే!
ఐపీఎల్-2025 (IPL 2025) సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో తొలిసారి కెప్టెన్గా ప్రమోషన్ పొందాడు రజత్ పాటిదార్ (Rajat Patidar). విశేష ఆదరణ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు సారథిగా ఎంపికైన అతడు.. తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు.రజత్ పాటిదార్ సారథ్యంలో సీజన్ ఆరంభ మ్యాచ్లోనే డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్పై ఘన విజయం సాధించింది ఆర్సీబీ. అనంతరం.. చెన్నై సూపర్ కింగ్స్ను 2008 తర్వాత తొలిసారి చెపాక్లో ఓడించింది.సొంత మైదానంలో ఇంత వరకు గెలవలేదుఅయితే, ఇతర వేదికలపై సత్తా చాటిన ఆర్సీబీ సొంత మైదానంలో మాత్రం తేలిపోతోంది. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన పాటిదార్ సేన.. తర్వాత వాంఖడేలో ముంబై ఇండియన్స్ను ఓడించి తిరిగి గెలుపు బాట పట్టింది.తర్వాత మళ్లీ పాత కథే. చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. అనంతరం జైపూర్లో రాజస్తాన్ రాయల్స్ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఆఖరిగా.. మరలా చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది.ఈ క్రమంలో ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో గెలిచి.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగింట గెలిచింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప రజత్ పాటిదార్ గురించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆర్సీబీ కెప్టెన్గా రాణిస్తున్న పాటిదార్ పేరు.. టీమిండియా కెప్టెన్సీ రేసులోనూ వినిపిస్తుందని అంచనా వేశాడు.టీమిండియా కెప్టెన్సీ రేసులో‘‘ఆర్సీబీ బ్యాటింగ్ విషయంలో రజత్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ముచ్చటేస్తోంది. నాయకుడిగా గొప్ప పరిణతి కనబరుస్తున్నాడు. సొంతగడ్డపై ఎలా గెలవాలన్న అంశంపై అతడు మరింత దృష్టి సారించాల్సి ఉంది.ఒకవేళ పాటిదార్ ఇలాగే తన విజయపరంపరను కొనసాగిస్తే.. త్వరలోనే టీమిండియా క్రికెట్ కెప్టెన్ గురించి జరిగే చర్చల్లో ముందుగా అతడి పేరే వినిపిస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.జట్టులో చోటే లేదే!కాగా మధ్యప్రదేశ్కు చెందిన 31 ఏళ్ల రజత్ పాటిదార్ 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. గతేడాది టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. కానీ టీ20లలో మాత్రం అతడికి ఇంత వరకు భారత్ తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇక మూడు టెస్టుల్లో 63, ఒక వన్డేలో 22 పరుగులు చేశాడు పాటిదార్.అయితే, ఐపీఎల్లో కూడా ఇప్పటికి 34 మ్యాచ్లు పూర్తి చేసుకుని ఏకంగా 1008 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టీమిండియాలో చోటుకే నోచుకోవడం లేని పాటిదార్ పేరు కెప్టెన్సీ రేసులో ఊహించడమే కష్టం. అలాంటిది రాబిన్ ఊతప్ప మాత్రం ఈ రకమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.చదవండి: Vaibhav Suryavanshi: యువీ- లారా కలిస్తే అతడు.. చిన్న పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు -
IPL 2025: పంజాబ్పై ఆర్సీబీ ఘన విజయం
పంజాబ్పై ఆర్సీబీ ఘన విజయం18.5వ ఓవర్- నేహల్ వధేరా బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన జితేశ్ శర్మ (11) మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ16.4వ ఓవర్- 143 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి పాటిదార్ (12) ఔటయ్యాడు.హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లివిరాట్ 43 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 15 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 122/2గా ఉంది. విరాట్ (50), పాటిదార్ (9) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటే 30 బంతుల్లో 36 పరుగులు చేయాలి. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ12.3వ ఓవర్- 109 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో నేహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ (61) ఔటయ్యాడు. లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న ఆర్సీబీ158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. 9 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ వికెట్ నష్టానికి 75 పరుగులుగా ఉంది. విరాట్ (35), పడిక్కల్ (38) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటే 66 బంతుల్లో మరో 83 పరుగులు చేయాలి. ధాటిగా ఆడుతున్న కోహ్లి, పడిక్కల్ఛేదనలో ఆర్సీబీ ఆదిలోనే సాల్ట్ వికెట్ కోల్పోయినప్పటికీ ధాటిగానే ఆడుతుంది. విరాట్ (31), పడిక్కల్ (22) బ్యాట్ ఝులిపిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 54/1గా ఉంది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆర్సీబీ158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ చివరి బంతికి అర్షదీప్సింగ్ బౌలింగ్లో వికెట్కీపర్ జోస్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (1) ఔటయ్యాడు. విజృంభించిన ఆర్సీబీ బౌలర్లు.. పంజాబ్ స్కోరెంతంటే?ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్సిమ్రన్ సింగ్ (33), వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (31 నాటౌట్), మార్కో యాన్సెన్ (25 నాటౌట్) ఓ మోస్తరుగా పరుగులు రాబట్టారు.మిగతా వాళ్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6), నేహాల్ వధేరా (5 రనౌట్), మార్కస్ స్టొయినిస్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. పేసర్ రొమారియో షెఫర్డ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.పదహారు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 129-6యాన్సెన్ 11, శశాంక్ 19 పరుగులతో ఉన్నారు. మరోవైపు.. ఆర్సీబీ స్పిన్నర్ సూయశ్ శర్మ స్థానంలో బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు.ఆరో వికెట్ డౌన్13.5: సూయశ్ శర్మ బౌలింగ్లో స్టొయినిస్ (1) బౌల్డ్. మార్కో యాన్సెన్ క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 114-6(14). శశాంక్ సింగ్ 15 పరుగులతో ఉన్నాడు.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్13.2: సూయశ్ శర్మ బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్ (29) బౌల్డ్ అయ్యాడు. మార్కస్ స్టొయినిస్ క్రీజులోకి వచ్చాడు. శశాంక్ 14 పరుగులతో ఉన్నాడు. పంజాబ్ స్కోరు: 112/5 (13.2) .సెంచరీ కొట్టిన పంజాబ్12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి సరిగ్గా 100 పరుగులు చేసింది. ఇంగ్లిష్ 22, శశాంక్ సింగ్ 9 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్8.6: సూయశ్ శర్మ బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్- నేహాల్ వధేరా (5)తో కలిసి సింగిల్ తీశాడు. అయితే, రెండో పరుగు తీసే క్రమంలో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో నేహాల్ వధేరా రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పంజాబ్ స్కోరు: 76/4 (9). శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు.శ్రేయస్ అయ్యర్ అవుట్7.4: రొమారియో షెఫర్డ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (6)కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. నేహాల్ వధేరా క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 69/3 (7.5) . జోష ఇంగ్లిస్ ఐదు పరుగులతో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్6.1: ప్రభ్సిమ్రన్ (33) రూపంలో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి ప్రభ్సిమ్రన్ పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లిస్ అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు.పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు: 62-1(6)ప్రభ్సిమ్రన్ 33, శ్రేయస్ అయ్యర్ ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్4.2: కృనాల్ పాండ్యా బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరిగిన ప్రియాన్ష్ ఆర్య (22). క్రీజులోకి శ్రేయస్ అయ్యర్.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లుప్రభ్సిమ్రన్ 10 బంతుల్లో 19, ప్రియాన్ష్ ఆర్య 14 బంతుల్లో 22 పరుగులతో ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలో పంజాబ్ స్కోరు: 41-0 తొలి ఓవర్లో పంజాబ్ స్కోరు: 2-0కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్. ప్రియాన్ష్, ప్రభ్సిమ్రన్ ఒక్కో పరుగుతో ఉన్నారు.🚨 Toss 🚨@RCBTweets won the toss and elected to bowl against @PunjabKingsIPL in Match 37.Updates ▶️ https://t.co/6htVhCbltp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/gg5M40bjrg— IndianPremierLeague (@IPL) April 20, 2025ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ (PBKS vs RCB) మధ్య ఆదివారం మ్యాచ్ జరుగనుంది. చండీగడ్లోని ముల్లన్పూర్లో గల మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య పంజాబ్ బ్యాటింగ్ చేసింది.తుదిజట్లుపంజాబ్ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చహల్ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: హర్ప్రీత్ బ్రార్, విజయ్కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్గే, గ్లెన్ మాక్స్వెల్, ప్రవీణ్ దూబేఆర్సీబీఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సూయశ్ శర్మ, జోష్ హాజిల్వుడ్, యశ్ దయాల్.ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భండాగే, జేకబ్ బెతెల్, స్వప్నిల్ సింగ్.ప్రతీకారం తీర్చుకోవాలనికాగా ఈ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో తలపడ్డ పంజాబ్ సొంతమైదానంలోనే వారిని ఓడించింది. వర్షం వల్ల పద్నాలుగు ఓవర్లకు కుదించిన మ్యాచ్లో బెంగళూరు జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ను వారి సొంత గడ్డపై ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. -
మటన్, పిజ్జా అంటే ఇష్టం.. చిన్న పిల్లాడు.. కానీ పాపం..
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించే చర్చ. దేశవాళీ క్రికెట్లో అద్భుతాలు చేసిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)నూ తాజాగా అడుగుపెట్టాడు. ఐపీఎల్-2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (RR vs LSG)తో శనివారం (ఏప్రిల్ 19) నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు.తొలి బంతినే సిక్సర్గా మలిచాడుతద్వారా అత్యంత పిన్న వయసులో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. అంతేకాదు.. రాయల్స్ ఓపెనర్గా తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు ఈ చిచ్చరపిడుగు. లక్నో పేసర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో బంతిని బలంగా బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటిచెప్పాడు.ఈ మ్యాచ్లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. మూడు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 34 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఎదుర్కొన్న తీరు అమోఘమంటూ మాజీ క్రికెటర్లు వైభవ్ నైపుణ్యాలను కొనియాడుతున్నారు.మటన్, పిజ్జా అంటే ఇష్టం.. చిన్న పిల్లాడు.. కానీ పాపం.. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ వ్యక్తిగత కోచ్ మనీశ్ ఓజా ఈ టీనేజర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘తనకి చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం. చిన్న పిల్లాడు కదా.. సహజంగానే పిజ్జా అంటే కూడా మక్కువ ఎక్కువే. కానీ ఇకపై అతడు వాటిని తినబోడు.ఇక్కడికి రాగానే మటన్తో పాటు పిజ్జా అతడి డైట్ చార్ట్ నుంచి ఎగిరిపోయింది. మేమైతే అతడికి తరచుగా మటన్ పెట్టేవాళ్లం. ఎంత పెట్టినా సరే అంతా తినేసేవాడు. అందుకే తను కాస్త బొద్దుగా కనిపిస్తాడు. అయితే, ఇప్పుడు తనకు ఇష్టమైన ఆహారాన్ని అతడు సంతోషంగానే వదులుకున్నాడు.యువీ- యువీ కలిస్తే అతడువైభవ్కు సుదీర్ఘమైన కెరీర్ ఉంది. అతడు ఈరోజు ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు చూశారు కదా!.. భవిష్యత్ కాలంలో అతడు ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు. తను ఫియర్లెస్ బ్యాటర్.అతడికి బ్రియన్ లారా ఆరాధ్య క్రికెటర్. అయితే, లారా- యువరాజ్ సింగ్ కలిస్తే ఎలా ఉంటుందో.. వైభవ్ అలాంటి ఆటగాడు. యువీలా దూకుడుగా ఆడటం తన శైలి.‘బంతి సిక్సర్ కొట్టేందుకు ఆస్కారం ఇస్తే నేనెందుకు సింగిల్ తీయాలి?.. సిక్సే కొడతా’ అని వైభవ్ చెబుతూ ఉంటాడు. ప్రాక్టీస్ సెషన్లో మేము 4 ఓవర్లలో 40 పరుగులు.. ఆరు ఓవర్లలో 60 పరుగులు చేయాలని ఆటగాళ్ల మధ్య పోటీలు పెట్టేవాళ్లం.వైభవ్ అయితే.. ఇంకొన్ని బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసేవాడు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో మనీశ్ ఓజా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. లక్నోతో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో రాజస్తాన్ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. కాగా మెగా వేలం-2025లో రాజస్తాన్ 1.1 కోట్లకు బిహార్ కుర్రాడు వైభవ్ను కొనుగోలు చేసింది.చదవండి: ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్ వైరల్ 𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025 -
Uppal: నార్త్ స్టాండ్ పేరు తొలగింపు.. స్పందించిన అజారుద్దీన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)ను చూసి క్రికెట్ ప్రపంచం నవ్వుకుంటోందంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పదేళ్లకు పైగా భారత క్రికెట్ జట్టును విజయవంతంగా ముందుకు నడిపానని.. అలాంటి తన పట్ల అసోసియేషన్ ఇలా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డాడు.కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్కాగా ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నార్త్ స్టాండ్ (North Stand) పేరుకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ స్టాండ్కు అజారుద్దీన్ పేరు ఉండగా... ఇప్పుడు అతడి పేరును తొలగించాలని అంబుడ్స్మన్ జస్టిస్ (రిటైర్డ్) వి.ఈశ్వరయ్య శనివారం ఆదేశాలు జారీ చేశారు.అదే విధంగా.. ఈ స్టాండ్కు సంబంధించి ఇకపై స్టేడియం అధికారిక కార్యక్రమాల్లో గానీ టికెట్లపై గానీ అజహర్ పేరును వాడరాదని ఆయన హెచ్సీఏకు సూచించారు. కాగా భారత క్రికెటర్గా, కెప్టెన్ అజహర్ చేసిన సేవలను గుర్తిస్తూ 2019లో ఈ స్టాండ్కు అతడిపేరు పెట్టారు.అయితే ఆ సమయంలో స్వయంగా అజహర్ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ హోదాలో తనకు వ్యక్తిగతంగా ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకోవడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) కిందకు వస్తుందని.. పైగా జనరల్ బాడీ అనుమతి లేకుండానే ఇది చేశారంటూ లార్డ్స్ క్రికెట్ క్లబ్ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ అనంతరం అంబుడ్స్మన్ ఈ మేరకు తన తీర్పును వెలువరించారు.మీ ముఖం మీదే నవ్వుతారుతాజాగా ఈ విషయంపై మహ్మద్ అజారుద్దీన్ స్పందించాడు. ‘ది హిందూ’తో మాట్లాడుతూ.. ‘‘ఇందులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అనే అంశానికి ఆస్కారమే లేదు. ఈ విషయమై నేను ప్రస్తుతం ఎలాంటి కామెంట్ చేయలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను..క్రికెట్ ప్రపంచం హెచ్సీఏ ముఖం మీదే నవ్వుతుంది. వారి తీరు అలా ఉంది మరి!.. పదిహేడేళ్ల క్రికెట్ కెరీర్.. పదేళ్లకు పైగా జాతీయ జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాను. హైదరాబాద్లో క్రికెటర్ల పట్ల ఇదిగో.. ఇలాగే వ్యవహరిస్తారు. ఇది చాలా విచారకరం. మేము కచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. చట్ట ప్రకారమే ముందుకు వెళ్తాం’’ అని అజారుద్దీన్ తెలిపాడు.మరోవైపు... నార్త్ స్టాండ్ పేరుకు సంబంధించి ఫిర్యాదు చేసిన ది లార్డ్స్ క్రికెట్ క్లబ్ మాత్రం హర్షం వ్యక్తం చేసింది. ‘‘నిబద్ధత, నిష్పాక్షితకు ఈ తీర్పు నిదర్శనం. పారదర్శకంగా వ్యవహరించిన అధికారులకు మా ధన్యవాదాలు’’ అని క్లబ్ కోశాధికారి సోమ్నా మిశ్రా ‘ది హిందూ’తో వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ కెరీర్ ఇలాకాగా హైదరాబాద్కు చెందిన మహ్మద్ అజారుద్దీన్ 1984- 2000 సంవత్సరం మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 99 టెస్టులాడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 6215 పరుగులు సాధించాడు. ఇందులో 22 శతకాలు ఉన్నాయి.అదే విధంగా.. టీమిండియా తరఫున 334 వన్డేలు ఆడిన అజారుద్దీన్.. ఏడు సెంచరీల సాయంతో 9378 పరుగులు సాధించాడు. రైటార్మ్ మీడియం పేసర్ అయిన అతడు.. వన్డేల్లో 12 వికెట్లు కూడా తీశాడు.చదవండి: అశుతోష్ శర్మపై మండిపడ్డ ఇషాంత్ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్! కారణం ఇదే.. -
నరాలు తెగే ఉత్కంఠ: ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ మరోసారి దురదృష్టకర రీతిలో ఓటమి పాలైంది. గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో సరిసమానంగా స్కోరు చేసినా సంజూ సేన సూపర్ ఓవర్లో బోల్తా పడిన విషయం తెలిసిందే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లోనూ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది.ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఆవేశ్ ఖాన్ (Avesh Khan) తన అద్భుత బౌలింగ్ నైపుణ్యాలతో లక్నోకు విజయం అందించాడు. ఫలితంగా రాజస్తాన్ మరోసారి ఓటమి భారంతో తలదించుకోవాల్సి వచ్చింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్- లక్నో (RR vs LSG) జట్ల మధ్య శనివారం రాత్రి మ్యాచ్ జరిగింది.180 పరుగులుసొంత మైదానంలో టాస్ ఓడిన రాజస్తాన్ తొలుత బౌలింగ్కు దిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (45 బంతుల్లో 66)తో పాటు ఆయుశ్ బదోని (34 బంతుల్లో 50), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్) రాణించారు.రాజస్తాన్ బౌలర్లలో వనిందు హసరంగ రెండు, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్నో విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ తమ ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించింది.దంచికొట్టిన ఓపెనర్లుఓపెనర్ యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74) బ్యాట్ ఝులిపించగా.. అతడికి జోడీగా వచ్చిన అరంగేట్ర ఆటగాడు, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా దుమ్ములేపాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, ఓపెనర్లు శుభారంభం అందించినా రాజస్తాన్ అదే జోరునుకొనసాగించలేకపోయింది. నితీశ్ రాణా (8) విఫలం కాగా.. కెప్టెన్ రియాన్ పరాగ్ (26 బంతుల్లో 39) ఫర్వాలేదనిపించాడు. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి కేవలం తొమ్మిది పరుగులే అవసరమయ్యాయి.ఆఖరి ఓవర్లో హైడ్రామాఈ క్రమంలో బంతితో రంగంలోకి దిగిన లక్నో పేసర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో తొలి బంతికి ధ్రువ్ జురెల్ సింగిల్ తీశాడు. అనంతరం షిమ్రన్ హెట్మెయిర్ జురెల్తో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. ఫలితంగా రాజస్తాన్ విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 6 గా మారింది.సరిగ్గా అప్పుడే ఆవేశ్ ఖాన్ తన నైపుణ్యాలకు మెరుగుపెట్టి మూడో బంతికి హెట్మెయిర్ (12)ను పెవిలియన్కు పంపాడు. ఆ మరుసటి బంతికి పరుగులేమీ ఇవ్వకుండా డాట్ చేశాడు. అనంతరం శుభమ్ దూబే రెండు పరుగులు తీయగా.. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ దూబే ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు.ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా సంబరాలుఫలితంగా రాజస్తాన్ విజయానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నపిల్లాడిలా గంతులేస్తూ ఆయన స్టేడియంలో సందడి చేశారు. మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ శిబిరంలో ప్రతి ఒక్కరి ముఖాలు నిరాశతో వెలవెలబోయాయి.రాజస్తాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే ఎలాంటి స్పందనా లేకుండా.. అలాగే చూస్తూ ఉండిపోయాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం నెత్తికి చేతులు పెట్టుకుని నిరాశను వ్యక్తం చేశాడు. యశస్వి జైస్వాల్ కూడా బేలగా చూస్తూ అలా ఉండిపోయాడు.Heart-racing, nerve-wracking, and simply unforgettable! 🤯#LSG defy the odds and seal a 2-run victory over #RR after the most dramatic final moments 💪Scorecard ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG | @LucknowIPL pic.twitter.com/l0XsCGGuPg— IndianPremierLeague (@IPL) April 19, 2025ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. ‘‘ద్రవిడ్ హృదయాన్ని ఆవేశ్ ముక్కలు చేశాడు.. గోయెంకానేమో తొలిసారి చిన్నపిల్లాడిలా గంతులేస్తున్నారు.. ఇలాంటి దృశ్యాలు అరుదు’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నాయి.చదవండి: IPL 2025: శుబ్మన్ గిల్కు భారీ షాక్! -
అశుతోష్పై మండిపడ్డ ఇషాంత్ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్
గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) సహనం కోల్పోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ (Ashuthosh Sharma)కు వేలు చూపిస్తూ మైదానంలోనే వార్నింగ్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్తో పాటు.. టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అసలేం జరిగిందంటే..ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (GT vs DC) మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన టైటాన్స్.. ఢిల్లీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.అశుతోష్ శర్మ ధనాధన్ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ ఎనిమిది వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (9 బంతుల్లో 18), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31) వేగంగా ఆడగా.. కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 28) కాసేపు మెరుపులు మెరిపించాడు.ఇక అక్షర్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (21 బంతుల్లో 31)తో మెరవగా.. ఢిల్లీ నయా ఫినిషర్ అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37) ధనాధన్ బ్యాటింగ్తో దంచికొట్టాడు. అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్లో పందొమ్మిదో ఓవర్లో గుజరాత్ పేసర్ ఇషాంత్ శర్మ బంతితో బరిలోకి దిగాడు.అప్పటికి డొనొవన్ ఫెరీరా, అశుతోష్ క్రీజులో ఉన్నారు. ఇషాంత్ బౌలింగ్లో తొలి బంతిని ఎదుర్కొన్న అశుతోష్ సింగిల్ తీయగా.. మరుసటి బంతికి ఫెరీరా రన్ పూర్తి చేశాడు. మూడో బంతికి మళ్లీ అశుతోష్ సింగిల్ తీయగా.. నాలుగో బంతికి ఫెరీరా సాయి కిషోర్కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్గా పెవిలియన్కు చేరాడు.వేలు చూపిస్తూ వార్నింగ్ఫెరీరా స్థానంలో వచ్చిన మిచెల్ స్టార్క్ సింగిల్ తీయగా.. అశుతోష్ మళ్లీ స్ట్రైక్లోకి వచ్చాడు. అయితే, ఆఖరి బంతిని ఇషాంత్ వైడ్గా వేయగా.. అశుతోష్కు మరో బంతి ఆడే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో ఇషాంత్ సంధించిన బౌన్సర్ను అశుతోష్ ఎదుర్కోలేకపోయాడు.ఇక బంతి వెళ్లి వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లో పడింది. ఈ క్రమంలో బంతి అశుతోష్ గ్లోవ్స్ను తాకిందని భావించిన గుజరాత్ ఆటగాళ్లు బిగ్గరగా అవుట్కి అప్పీలు చేశారు. అయితే, అంపైర్ నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. ఇంతలో అశుతోష్ బంతి భుజాన్ని రాసుకుని వెళ్లిందన్నట్లుగా సైగ చేశాడు. అశుతోష్ శర్మ చర్యను సహించలేకపోయిన ఇషాంత్ శర్మ అతడి దగ్గరికి వెళ్లి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపించింది. తర్వాత అశుతోష్ తన షర్టును పైకెత్తి బంతి భుజానికి తాకిందని అంపైర్కు చెప్పే ప్రయత్నం చేశాడు.Battle b/w ishant sharma vs ashutosh Sharma 🤣 pic.twitter.com/EMd12Z2o7V— Daigo18 (@daigo2637391027) April 19, 2025ఇరగదీసిన బట్లర్ఇంతలో అంపైర్తో పాటు గిల్ జోక్యం చేసుకుని ఇషాంత్ను పక్కకు తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.2 ఓవర్లలో ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జోస్ బట్లర్ (54 బంతుల్లో 97 నాటౌట్), షెర్ఫానే రూథర్ఫర్డ్ (34 బంతుల్లో 43), రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 11 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: IPL 2025: శుబ్మన్ గిల్కు భారీ షాక్! Right off the middle! 💥#AshutoshSharma hits the accelerator and launches a stunning SIX over the square boundary!Watch the LIVE action ➡ https://t.co/6YcPaJPTHV#IPLonJioStar 👉 #GTvDC | LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar! pic.twitter.com/TpSfdehCwX— Star Sports (@StarSportsIndia) April 19, 2025 -
శుబ్మన్ గిల్కు భారీ షాక్!
గెలుపు సంబరంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా.. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు శిక్ష విధించింది.ఇందుకు సంబంధించి ఐపీఎల్ పాలక మండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ గిల్కు జరిమానా విధించినట్లు తెలిపింది. ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్లో అతడు మొదటిసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు రూ. 12 లక్షలతో సరిపెట్టినట్లు పేర్కొంది.ఢిల్లీ భారీ స్కోరుకాగా ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ వేదికగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (32 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్లు), అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. జోస్ ది బాస్.. దంచేశాడులక్ష్య ఛేదనలో జోస్ బట్లర్ దంచికొట్టాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కేవలం 54 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.మరోవైపు.. బట్లర్కు తోడుగా షెర్ఫానే రూథర్ఫర్డ్ (34 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్లు) కూడా రాణించాడు. ఆఖర్లో తెవాటియా మూడు బంతుల్లో 11 పరుగులతో అజేయంగా నిలిచి బట్లర్తో కలిసి గుజరాత్ను గెలుపుతీరాలకు చేర్చాడు. THE CELEBRATION FROM JOS BUTTLER. - Buttler was on 97*, but the happiness after Tewatia finished the match. 👏❤️ pic.twitter.com/31z4tWPJmL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2025 ఢిల్లీ విధించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ఈ సీజన్లో ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది.ఐపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ ఢిల్లీ👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: గుజరాత్.. మొదట బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 203/8 (20)👉గుజరాత్ స్కోరు: 204/3 (19.2)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై గుజరాత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్ (గుజరాత్- 54 బంతుల్లో 97 నాటౌట్).చదవండి: IPL 2025: గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్ -
పాకిస్తాన్ భారత్లో మ్యాచ్లు ఆడదు: పీసీబీ చీఫ్
భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్కప్ (ICC Women's ODI World Cup) కోసం పాకిస్తాన్ జట్టు భారత్లో పర్యటించబోదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహసిన్ నఖ్వీ శనివారం స్పష్టంచేశారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ఐసీసీ పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్లో పర్యటించేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో రోహిత్ సేన ఆడే మ్యాచ్లను ‘హైబ్రీడ్ మోడల్’లో దుబాయ్లో నిర్వహించారు. ఇప్పుడదే రీతిన మహిళల వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ ఆడనున్న మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. దీనికి గతంలోనే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. ‘భారత జట్టు పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు. తటస్థ వేదికపై మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు మహిళల ప్రపంచకప్ విషయంలోనే అదే జరుగుతుంది. ఆతిథ్య హోదాలో భారత్ నిర్ణయించిన తటస్థ వేదికపై మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సిద్ధంగా ఉంది’అని నఖ్వీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది.వెస్టిండీస్ అవుట్.. బంగ్లాదేశ్ క్వాలిఫైభారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. పాకిస్తాన్లో జరుగుతున్న వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా బంగ్లాదేశ్ వరల్డ్కప్ బెర్త్ దక్కించుకుంది. లాహోర్లో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రితూ మోని (48; 5 ఫోర్లు), ఫహీమా ఖాతూన్ (44 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ మహిళల జట్టు 39.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’మునీబా అలీ (93 బంతుల్లో 69; 8 ఫోర్లు), ఆలియా రియాజ్ (52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) సత్తాచాటారు.ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్ల్లోనూ గెలిచిన పాకిస్తాన్ 10 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలవగా... బంగ్లాదేశ్ జట్టు 5 మ్యాచ్ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బంగ్లాదేశ్ రెండో ‘ప్లేస్’దక్కించుకుంది. వెస్టిండీస్ కూడా 5 మ్యాచ్ల్లో 3 విజయాలు, 2 ఓటములతో 6 పాయింట్లు సాధించినా... రన్రేట్లో స్వల్పంగా మెరుగ్గా ఉన్న బంగ్లాదేశ్ ముందంజ వేసింది. మాథ్యూస్ మెరుపులు వృథా... వెస్టిండీస్ మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. థాయ్లాండ్తో మ్యాచ్లో 10 ఓవర్లలో లక్ష్యఛేదన పూర్తిచేస్తే మెరుగైన రన్రేట్తో వరల్డ్కప్నకు అర్హత సాధించే అవకాశం ఉండగా...ఐదు బంతుల తేడాతో అవకాశం కోల్పోయింది. ఆ జట్టు 10.5 ఓవర్లలో 168 పరుగులు చేసింది. మొదట థాయ్లాండ్ మహిళల జట్టు 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. నాథకన్ చాంతమ్ (66; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ 4, ఆలియా అలీనె 3 వికెట్లు పడగొట్టింది.అనంతరం ఛేదనలో విండీస్ 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెపె్టన్ హేలీ మాథ్యూస్ (29 బంతుల్లో 70; 11 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... షినెల్ హెన్రీ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్స్లు) దంచికొట్టింది.మాథ్యూస్ మెరుపులతో కరీబియన్ జట్టు సునాయాసంగా గమ్యాన్ని చేరేలా కనిపించినా... కీలక సమయంలో ఆమె అవుట్ కావడం విండీస్ అవకాశాలను దెబ్బకొట్టింది. చివర్లో హెన్రీ విజృంభించినా... అది సాధ్యపడలేదు. లీగ్ మ్యాచ్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 0.639 రన్రేట్తో నిలవగా... వెస్టిండీస్ 0.626తో నిలిచింది. అంటే 0.013 తేడాతో వెస్టిండీస్ వరల్డ్కప్ పోటీ నుంచి తప్పుకొంది. చదవండి: కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ -
లక్నో ‘సూపర్’ విక్టరీ
జైపూర్: ఆఖరి ఓవర్... ఆఖరి బంతిదాకా ఇరు జట్లతోనూ దోబూచులాడిన విజయం చివరకు లక్నో సూపర్జెయింట్స్ను వరించింది. రాజస్తాన్ రాయల్స్ 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుతం చేశాడు. 6 పరుగులే ఇచ్చి ప్రమాదకర హిట్టర్ హెట్మైర్ను అవుట్ చేశాడు. దీంతో ఉత్కంఠ రేపిన పోరులో సూపర్జెయింట్స్ 2 పరుగులతో అనూహ్యంగా రాయల్స్పై గెలిచింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మార్క్రమ్ (45 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్లు), ఆయుశ్ బదోని (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, ఆఖరి ఓవర్లో సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్స్లు) చెలరేగాడు. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి ఓడింది. యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్స్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. మార్క్రమ్, బదోని ఫిఫ్టీ–ఫిఫ్టీ పవర్ప్లే ముగియక ముందే హిట్టర్లు మార్ష్ (4), పూరన్ (11), పవర్ ప్లే తర్వాత కెపె్టన్ రిషభ్ పంత్ (3) అవుటవడంతో లక్నో 54 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న ఓపెనర్ మార్క్రమ్, ఆయుశ్ బదోని సూపర్జెయింట్స్ స్కోరు భారాన్ని మోశారు. ఇద్దరు వేగంగా ఆడటంతో జట్టు పరుగుల జోరందుకుంది. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న మార్క్రమ్ నాలుగో వికెట్కు 76 పరుగులు జోడించాక అవుటయ్యాడు. కాసేపటికి బదోని 33 బంతుల్లో బదోని అర్ధ సెంచరీ చేసిన వెంటనే నిష్క్రమించాడు. సమద్ 4 సిక్సర్లతో... 19 ఓవర్లలో 153/5 వద్ద ఓ మోస్తరు స్కోరు చేసిన లక్నో శిబిరంలో ఆఖరి ఓవర్ ఆనందం నింపింది. సందీప్ వేసిన 20వ ఓవర్లో మిల్లర్ (7 నాటౌట్) సింగిల్ తీసివ్వగా తర్వాత సమద్ 6, 6, 2, 6, 6లతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. దీంతో సూపర్జెయింట్స్ స్కోరు 180కి చేరింది. జైస్వాల్ శ్రమించినా... యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కొత్త కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకట్టుకున్నాడు. ఇద్దరి ఓపెనర్ల వేగం రాజస్తాన్ను లక్ష్యం వైపు నడిపించింది. తొలి వికెట్కు 85 పరుగులు జోడించాక వైభవ్ ఆటను మార్క్రమ్ ముగించగా, నితీశ్ రాణా (8)ను శార్దుల్ పెవిలియన్ చేర్చాడు.తర్వాత జైస్వాల్కు జతయిన కెపె్టన్ రియాన్ పరాగ్ రన్రేట్ తగ్గకుండా ఇన్నింగ్స్ను నడిపించారు. 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన జైస్వాల్ దూకుడు పెంచాడు. లక్ష్యానికి చేరువైన దశలో 18వ ఓవర్లో జైస్వాల్, పరాగ్లను అవుట్ చేసిన అవేశ్...ఆఖరి ఓవర్లో హెట్మైర్ (12)కు చెక్ పెట్టాడు.స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) హెట్మైర్ (బి) ఆర్చర్ 4; మార్క్రమ్ (సి) పరాగ్ (బి) హసరంగ 66; నికోలస్ పూరన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 11; రిషభ్ పంత్ (సి) జురేల్ (బి) హసరంగ 3; ఆయుశ్ బదోని (సి) దూబే (బి) తుషార్ 50; మిల్లర్ నాటౌట్ 7; సమద్ నాటౌట్ 30; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–16, 2–46, 3–54, 4–130, 5–143. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–32–1, తీక్షణ 4–0–32–0, సందీప్ శర్మ 4–0–55–1, తుషార్ దేశ్పాండే 4–0–26–1,హసరంగ 4–0–31–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) అవేశ్ 74; వైభవ్ (స్టంప్డ్) పంత్ (బి) మార్క్రమ్ 34; నితీశ్ రాణా (సి) అవేశ్ (బి) శార్దుల్ 8; రియాన్ పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 39; జురేల్ నాటౌట్ 6; హెట్మైర్ (సి) శార్దుల్ (బి) అవేశ్ 12; శుభమ్ నాటౌట్ 3 ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–85, 2–94, 3–156, 4–161, 5–175. బౌలింగ్: శార్దుల్ 3–0–34–1, అవేశ్ ఖాన్ 4–0–37–3, దిగ్వేశ్ రాఠి 4–0–30–0, మార్క్రమ్ 2–0–18–1, ప్రిన్స్ 4–0–39–0, రవి బిష్ణోయ్ 3–0–19–0. 14 ఏళ్ల 23 రోజుల వయసులో... ఐపీఎల్ వేలం సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. లీగ్ బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ తన తొలి బంతికే సిక్స్ బాది సంచలన రీతిలో మొదలు పెట్టాడు. ఎక్స్ట్రా కవర్ దిశగా ఆ షాట్ను అద్భుతంగా ఆడిన అతని సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చెలరేగిపోతున్న దశలో అనూహ్యంగా స్టంపౌట్ కావడంతో వైభవ్ తట్టుకోలేకపోయినట్లున్నాడు. కన్నీళ్లతో అతను నిష్క్రమించాడు! బిహార్కు చెందిన ఈ ప్రతిభాశాలి ఇప్పటికే భారత అండర్–19 జట్టు తరఫున ఆడటంతో పాటు 5 రంజీ మ్యాచ్లలో కూడా బరిలోకి దిగాడు. వేలంలో వైభవ్ను రాజస్తాన్ రూ.1.10 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్లో నేడుపంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్పూర్ ,మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ముంబై X చెన్నై వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో రాయల్స్ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో యశస్వి జైస్వాల్ (74), వైభవ్ సూర్యవంశీ (34), రియాన్ పరాగ్ (39) అద్భుతంగా ఆడినప్పటికీ.. రాయల్స్ ఒత్తిడికి చిత్తై గెలుపు వాకిట బోర్లా పడింది. రాయల్స్ ఈ సీజన్లో ఇలా ఓడటం ఇది రెండో సారి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ రాయల్స్ గెలుస్తుందనుకుంటే సూపర్ వరకు వెళ్లి ఓటమిపాలైంది. ఆవేశ్ ఖాన్ (4-0-37-3) ఒంటిచేత్తో రాయల్స్ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. -
కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి లీగ్లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ కెరీర్లో తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి మరో రికార్డు నెలకొల్పాడు. క్యాష్ రిచ్ లీగ్లో తొలి బంతికే (కెరీర్లో) సిక్సర్ బాదిన 10వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్ కెరీర్లో తొలి బంతికే సిక్సర్ బాదిన ఆటగాళ్లు..రాబ్ క్వినీ (RR)కెవోన్ కూపర్ (RR)ఆండ్రీ రస్సెల్ (KKR)కార్లోస్ బ్రాత్వైట్ (DD)అనికేత్ చౌదరి (RCB)జావోన్ సియర్ల్స్ (KKR)సిద్దేష్ లాడ్ (MI)మహేష్ తీక్షణ (CSK)సమీర్ రిజ్వీ (CSK)వైభవ్ సూర్యవంశీ (RR)A VIDEO TO REMEMBER IN IPL HISTORY 👑- ITS VAIBHAV SURYAVANSHI..!!!! pic.twitter.com/ZuKskRWyI7— Johns. (@CricCrazyJohns) April 19, 2025ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కులైన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ (RR) vs LSG, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్ (RCB) vs SRH, 201917y 11d - ముజీబ్ ఉర్ రెహ్మాన్ (PBKS) vs DC, 201817y 152d - రియాన్ పరాగ్ (RR) vs CSK, 201917y 179d - ప్రదీప్ సాంగ్వాన్ (DC) vs CSK, 2008మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఛేదనకు దిగిన రాయల్స్ ఆది నుంచే దూకుడుగా ఆడుతుంది. తొలి బంతికే సిక్సర్ కొట్టిన సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఆవేశ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్ (52), రియాన్ పరాగ్ క్రీజ్లో ఉన్నారు. -
వెస్టిండీస్కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!
మహిళల వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్లో వెస్టిండీస్కు గుండె కోత మిగిలింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గెలిచినా కరీబియన్ జట్టు వరల్డ్కప్కు అర్హత సాధించలేకపోయింది. థాయ్లాండ్తో ఇవాళ (ఏప్రిల్ 19) జరిగిన డు ఆర్ డై మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్లాండ్ 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ కేవలం 10.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయినా 0.013 రన్రేట్ తేడాతో వరల్డ్కప్ బెర్త్ను కోల్పోయింది. పాయింట్ల పరంగా విండీస్తో సమానంగా ఉన్నప్పటికీ.. రన్రేట్ కాస్త ఎక్కువగా ఉండటంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ బెర్త్ను దక్కించుకుంది. ఈ టోర్నీలో పాక్ ఆడిన 5 మ్యాచ్ల్లో గెలిచి తొలి ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, బంగ్లాదేశ్ పోటీపడ్డాయి. ఇరు జట్లు చెరో 5 మ్యాచ్ల్లో తలో మూడు గెలువగా, రన్రేట్ కాస్త ఎక్కువగా ఉండటం చేత బంగ్లాదేశ్ వరల్డ్కప్కు అర్హత సాధించింది.కాగా, పాక్ వేదికగా జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025లో మొత్తం ఆరు జట్లు (పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్లాండ్) పాల్గొన్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పాక్, బంగ్లాదేశ్ వరల్డ్కప్కు అర్హత సాధించాయి. ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించగా.. పాక్, బంగ్లాదేశ్ క్వాలిఫయర్స్ ద్వారా క్వాలిఫై అయ్యాయి. -
ఢిల్లీపై గుజరాత్ విజయం.. అవకాశం ఉన్నా సెంచరీ పూర్తి చేయలేకపోయిన బట్లర్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 19) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ 39, అశుతోష్ శర్మ 37, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్ తలో 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18, విప్రాజ్ నిగమ్ 0, డొనోవన్ ఫెరియెరా 1, స్టార్క్ 2 (నాటౌట్), కుల్దీప్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ఆదిలోనే శుభ్మన్ గిల్ (7) వికెట్ కోల్పోయినప్పటికీ.. జోస్ బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ (97 నాటౌట్) కారణంగా 19.2 ఓవర్లలో (3 వికెట్ల నష్టానికి) లక్ష్యాన్ని చేరుకుంది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 36, రూథర్ఫోర్డ్ 43, తెవాతియా 11 పరుగులు (నాటౌట్) చేశారు.ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఢిల్లీని వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.పాపం బట్లర్ఈ మ్యాచ్లో బట్లర్కు సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా 97 పరుగుల వద్ద అజేయంగా నిలిచిపోయాడు. చివరి రెండు ఓవర్లలో గుజరాత్ గెలుపుకు 15 పరుగులు అవసరమైన తరుణంలో బట్లర్ 96 పరుగుల వద్ద ఉన్నాడు. ఎంత పని చేశావయ్యా తెవాతియా..?అయితే 19వ ఓవర్ను ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌల్ చేయడంతో ఆ ఓవర్లో బట్లర్ సెంచరీ కోసం రిస్క్ చేయలేకపోయాడు. చివరి ఓవర్లో అయినా మూడంకెల స్కోర్ను అందుకుందామా అంటే తెవాతియా అతనికి అడ్డుపడ్డాడు. జట్టు గెలుపుకు 10 పరుగులు అవసరమైన తరుణంలో వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి గుజరాత్ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో బట్లర్ చేసేదేమీ లేక జట్టు గెలుపును ఆస్వాదించాడు.విరాట్ రికార్డు సమమయ్యేదిఈ మ్యాచ్లో బట్లర్ సెంచరీ పూర్తి చేసి ఉంటే ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేసేవాడు. విరాట్ ఐపీఎల్లో 8 సెంచరీలు చేయగా.. బట్లర్ ఖాతాలో 7 సెంచరీలు ఉన్నాయి. విరాట్ రికార్డును సమం చేసేందుకు బట్లర్కు ఇంతకంటే మంచి అవకాశం రాదు. తెవాతియా కారణంగా బట్లర్ చరిత్రలోనే నిలిచిపోయే అవకాశాన్ని కోల్పోయాడు. ఏదిఏమైనా ఈ మ్యాచ్లో బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగానే గుజరాత్ గెలిచింది. సెంచరీ పూర్తి చేసుంటే అతని టాలెంట్కు తగ్గ గుర్తింపు దక్కేది. -
RR VS LSG: ఐపీఎల్లో సంచలనం
ఐపీఎల్లో సంచలనం నమోదైంది. ఓ కుర్రాడు కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే అరంగేట్రం చేయనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సూర్యవంశీకి ముందు ఈ రికార్డు ప్రయాస్ రే బర్మన్ పేరిట ఉండేది. బర్మన్ 2019 సీజన్లో ఆర్సీబీ తరఫున 16 ఏళ్ల 157 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. బర్మన్ తర్వాత ఐపీఎల్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడి రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ పేరిట ఉంది. ముజీబ్ 2018 సీజన్లో 17 ఏళ్ల 11 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.అత్యంత పిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్, 2019 17వ 11వ తేదీ - ముజీబ్ ఉర్ రెహమాన్, 2018 17y 152d - రియాన్ పరాగ్, 2019 17y 179d - ప్రదీప్ సాంగ్వాన్, 2008లక్నో, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ విషయానికొస్తే.. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా రాయల్స్ కెప్టెన్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ మ్యాచ్లో లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆకాశ్దీప్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. రాయల్స్ తరఫున సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నాడు.తుది జట్లు..రాజస్థాన్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్(వికెట్కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్ -
IPL 2025: రాయల్స్పై లక్నో విజయం
రాయల్స్పై లక్నో విజయంఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో రాయల్స్ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్స్17.6వ ఓవర్- ఆవేశ్ ఖాన్ ఒకే ఓవర్లో జైస్వాల్, రియాన్ పరాగ్ను (39) ఔట్ చేశాడు. రాయల్స్ గెలవాలంటే 12 బంతుల్లో మరో 20 పరుగులు చేయాలి.మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్17.1వ ఓవర్- 52 బంతుల్లో 74 పరుగులు చేసిన జైస్వాల్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్9.6వ ఓవర్- 94 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఆవేశ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్ (52), రియాన్ పరాగ్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్8.4వ ఓవర్- మార్క్రమ్ బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) స్టంపౌటయ్యాడు.ధాటిగా ఆడుతున్న రాయల్స్ ఓపెనర్లు181 పరుగుల ఛేదనలో రాయల్స్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. యశస్వి జైస్వాల్ 24 బంతుల్లో 40.. వైభవ్ సూర్యవంశీ 12 బంతుల్లో 21 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 6 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 61/0గా ఉంది. తొలి మ్యాచ్లోనే దంచికొడుతున్న వైభవ్ సూర్యవంశీరాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే దంచి కొడుతున్నాడు. 7 బంతుల్లోనే ఫోర్, 2 సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. సూర్యవంశీకి జతగా వచ్చిన యశస్వి జైస్వాల్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) కూడా ధాటిగా ఆడుతున్నాడు. ఫలితంగా రాయల్స్ 3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో సమద్ విధ్వంసం.. గౌరవప్రదమైన స్కోర్ చేసిన లక్నోసందీప్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో అబ్దుల్ సమద్ పేట్రేగిపోయాడు. నాలుగు సిక్సర్లు సహా 27 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే తలో వికెట్ దక్కించుకున్నారు. హాఫ్ సెంచరీ పూర్తి అయిన వెంటనే ఔటైన బదోని17.3వ ఓవర్- తుషార్ దేశ్పాండే బౌలింగ్లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆయుశ్ బదోని ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. బదోని 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 18 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 146/5గా ఉంది. మిల్లర్ (4), సమద్ (1) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో15.5వ ఓవర్- 130 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్లో రియన్ పరాగ్ సూపర్ క్యాచ్ పట్టడంతో మార్క్రమ్ (66) ఔటయ్యాడు. బదోనికి (46) జతగా మిల్లర్ (3) క్రీజ్లోకి వచ్చాడు. 17 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 139/4గా ఉంది.మార్క్రమ్ ఫిఫ్టి.. 100 దాటిన లక్నో స్కోర్10.3వ ఓవర్- సందీప్ శర్మ బౌలింగ్లో మూడు పరుగులు తీసి మార్క్రమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 12 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 105/3గా ఉంది. మార్క్రమ్ 60, బదోని 24 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. పంత్ మరోసారి..!7.4వ ఓవర్- ప్రస్తుత సీజన్లో పంత్ (9 బంతుల్లో 3) మరోసారి విఫలమయ్యాడు. హసరంగ బౌలింగ్లో వికెట్కీపర్ జురెల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం లక్నో స్కోర్ 54/3గా ఉంది. మార్క్రమ్ (34), బదోని క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. డేంజరస్ పూరన్ ఔట్5.2వ ఓవర్- 46 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. సందీప్ శర్మ బౌలింగ్లో ఇన్ ఫామ్ బ్యాటర్ నికోలస్ పూరన్ (11) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. మార్ష్ ఔట్2.2వ ఓవర్- టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో హెట్మైర్కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (4) ఔటయ్యాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా రాయల్స్ కెప్టెన్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆకాశ్దీప్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. రాయల్స్ తరఫున సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అతడి వయసు 14 ఏళ్ల 23 రోజులు.తుది జట్లు..రాజస్థాన్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్(వికెట్కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్ -
IPL 2025: కేకేఆర్తో జతకట్టిన అభిషేక్ నాయర్
టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్తో జతకట్టాడు. నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్గా ఎంపిక కాకముందు (గత సీజన్లో) కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్లో సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా పదవి ఊడటం ఖాయమని తెలిసాక నాయర్ మళ్లీ కేకేఆర్లో చేరిపోయాడు. నాయర్ను తిరిగి తమ సహాయక బృందంలోకి ఆహ్వానిస్తున్నామని కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.నాయర్ గతేడాది జులైలో టీమిండియా అసిస్టెంట్ కోచ్గా ఎంపికయ్యాడు. అతని పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. బీసీసీఐ నాయర్ కాంట్రాక్ట్ పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. దీంతో నాయర్ తన పదవీకాలం మరో మూడు నెలలు ఉండగానే టీమిండియా పదవికి గుడ్బై చెప్పి తన పాత జట్టు కేకేఆర్లో చేరిపోయాడు. నాయర్తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కాంట్రాక్ట్లను కూడా పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.కాగా, గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ ఛాంపియన్గా నిలవడంలో అభిషేక్ నాయర్ కీలకపాత్ర పోషించాడు. అయితే కేకేఆర్ పరిస్థితి ఈ సీజన్లో భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 7 మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నాయర్ చేరికతో కేకేఆర్ ఆటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ టేబుల్ టాపర్లుగా కొనసాగుతున్నాయి. -
అజారుద్దీన్కు బిగ్ షాక్
టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్కు భారీ షాక్ తగిలింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరును తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్పై విచారణ జరుపుతూ ఈ మేరకు తీర్పునిచ్చారు. అజారుద్దీన్ హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో నార్త్ స్టాండ్కు తన పేరును పెట్టుకున్నాడు. ఈ నిర్ణయం చెల్లదని జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఈ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయని తెలిపారు. వెంటనే నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని హెచ్సీఏను ఆదేశించారు. టికెట్లపై ఇక నుంచి అజారుద్దీన్ పేరును ముద్రించరాదని తేల్చి చెప్పారు.కాగా, 2019లో అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉండగా.. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కు తన పేరును పెట్టుకున్నాడు. ఆ ఏడాది డిసెంబర్ 7న భారత దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ స్టాండ్ను ప్రారంభించారు. అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్ట్లు, 334 వన్డేలు ఆడి మొత్తంగా 29 సెంచరీలు చేశాడు. -
కేఎల్ రాహుల్ కామెంట్స్.. షాకైన పీటర్సన్!.. నా దోస్తులంతా ఇంతే..
ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ప్రయాణం విజయవంతగా సాగుతోంది. అతడి మార్గదర్శనంలో.. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ సరికొత్త ఉత్సాహంతో విజయపరంపర కొనసాగిస్తోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.ఇక తమ ఏడో మ్యాచ్లో భాగంగా ఢిల్లీ శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో పోటీకి దిగింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండగా.. ఒకరోజు ముందే అక్కడికి చేరుకున్న అక్షర్ సేన నెట్స్లో తీవ్రంగా శ్రమించింది.సోదరా.. నీకు మెంటార్కు అర్థం తెలుసా?!.ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill).. ఢిల్లీ మెంటార్ పీటర్సన్ దగ్గరకు వచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.పరస్పరం క్షేమ, సమాచారాలు అడిగితెలుసుకున్న తర్వాత.. పీటర్సన్.. ‘‘సోదరా.. నీకు మెంటార్కు అర్థం తెలుసా?!.. ఇక్కడ ఉన్న వాళ్లలో ఒక్కరికి మెంటార్ అంటే తెలియనే తెలియదు’’ అని గిల్తో అన్నాడు.రెండు వారాల పాటు మాల్దీవుల పర్యటనవీరిద్దరి సంభాషణ మధ్యలో జోక్యం చేసుకున్న ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. పీటర్సన్కు ఊహించని షాకిచ్చాడు. ‘‘ఎవరైతే సీజన్ మధ్యలోనే రెండు వారాల పాటు మాల్దీవుల పర్యటనకు వెళ్తారో.. వారే మెంటార్’’ అంటూ రాహుల్ పీటర్సన్ను టీజ్ చేశాడు. దీంతో పీటర్సన్ బిక్కముఖం వేసుకుని చూసాడు.నా దోస్తులంతా ఇంతేఇందుకు.. ‘‘నా స్నేహితులంతా ఇంతే.. విషపూరితమైన వాళ్లు.. లక్ష్యం లేని వాళ్లు. ఎప్పుడూ ప్రతికూలంగానే మాట్లాడతారు.. పరుషంగా ఉంటారు.. నాకు కొత్త స్నేహితులు కావాలి.. కానీ అంత త్వరగా, సులువుగా దొరకరే..’’ అన్న పంక్తులతో సాగే BoyWithUke పాటను ఢిల్లీ అడ్మిన్ పీటర్సన్ ఇన్నర్ వాయిస్లా జతచేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘థాంక్యూ కేఎల్.. మెంటార్ అంటే సరైన అర్థం ఏమిటో ఇప్పుడే చెప్పావు’’ అన్నట్లు క్యాప్షన్ ఇచ్చారు. కాగా కెవిన్ పీటర్సన్ 2009లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు.వ్యక్తిగత సెలవు మీదఆరంభంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన కెవిన్ పీటర్సన్.. సారథిగానూ వ్యవహరించాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్డెవిల్స్కి ప్రాతినిథ్యం వహించిన పీటర్సన్.. 17 మ్యాచ్లలో కెప్టెన్గానూ వ్యవహరించాడు. అదే విధంగా రైజింగ్ పూణె సూపర్జెయింట్స్కు కూడా ఆడాడు.2016లో చివరగా ఐపీఎల్ ఆడిన 44 ఏళ్ల పీటర్సన్ మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్లో 36 మ్యాచ్లు ఆడి 1001 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 2025లో మెంటార్ అవతారంలో తిరిగి ఢిల్లీ ఫ్రాంఛైజీతో జట్టు కట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదాని, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మాట్లతో కలిసి పీటర్సన్ పనిచేస్తున్నాడు.ఇక ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్పై ఢిల్లీ గెలుపొందిన తర్వాత.. వ్యక్తిగత సెలవు మీద పీటర్సన్ మాల్దీవుల పర్యటనకు వెళ్లాడు. ఫలితంగా ఏప్రిల్ 10న ఆర్సీబీతో మ్యాచ్కు అతడు అందుబాటులో ఉండలేకపోయాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేఎల్ రాహుల్ పీటర్సన్ను ట్రోల్ చేయడం విశేషం.చదవండి: ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్ Thanks KL, now we know what a mentor does 😂 pic.twitter.com/JXWSVJBfQS— Delhi Capitals (@DelhiCapitals) April 19, 2025 -
GT VS DC: డబుల్ సెంచరీ పూర్తి చేసిన కేఎల్ రాహుల్
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో సిక్సర్ల డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్గా, ఓవరాల్గా 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 19) జరుగుతున్న మ్యాచ్లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. రాహుల్ ఐపీఎల్లో ఇప్పటిదాకా 129 ఇన్నింగ్స్లు ఆడి 200 సిక్సర్లు కొట్టాడు. రాహుల్కు ముందు భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (286), విరాట్ కోహ్లి (282), ఎంఎస్ ధోని (260), సంజూ శాంసన్ (216), సురేశ్ రైనా (203) సిక్సర్ల డబుల్ సెంచరీ పూర్తి చేశారు. ఓవరాల్గా రాహుల్కు ముందు క్రిస్ గేల్ (357), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, ఏబీ డివిలియర్స్ (251), డేవిడ్ వార్నర్ (236), కీరన్ పోలార్డ్ (223), సంజూ శాంసన్, ఆండ్రీ రసెల్ (212), సురేశ్ రైనా ఈ ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో మూడో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్ 14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అభిషేక్ పోరెల్ (9 బంతుల్లో 18; 3 ఫోర్లు, సిక్స్), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగానే ఆడినప్పటికీ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. 10 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 1052గా ఉంది. అక్షర్ పటేల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (8) క్రీజ్లో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో (6 మ్యాచ్ల్లో 5 విజయాలు) కొనసాగుతుండగా.. గుజరాత్ మూడో స్థానంలో (6 మ్యాచ్ల్లో 4 విజయాలు) ఉంది. పంజాబ్ రెండు (7 మ్యాచ్ల్లో 5 విజయాలు), ఆర్సీబీ నాలుగు (7 మ్యాచ్ల్లో 4 విజయాలు) స్థానాల్లో ఉండగా.. లక్నో (7 మ్యాచ్ల్లో 4 విజయాలు), కేకేఆర్ (7 మ్యాచ్ల్లో 3 విజయాలు), ముంబై ఇండియన్స్ (7 మ్యాచ్ల్లో 3 విజయాలు), రాజస్థాన్ రాయల్స్ (7 మ్యాచ్ల్లో 2 విజయాలు), సన్రైజర్స్ (7 మ్యాచ్ల్లో 2 విజయాలు), సీఎస్కే వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
IPL 2025: ఢిల్లీపై గుజరాత్ విజయం
ఢిల్లీపై గుజరాత్ విజయంఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 19) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ 39, అశుతోష్ శర్మ 37, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్ తలో 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18, విప్రాజ్ నిగమ్ 0, డొనోవన్ ఫెరియెరా 1, స్టార్క్ 2 (నాటౌట్), కుల్దీప్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ఆదిలోనే శుభ్మన్ గిల్ (7) వికెట్ కోల్పోయినప్పటికీ.. జోస్ బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ (97 నాటౌట్) కారణంగా 19.2 ఓవర్లలో (3 వికెట్ల నష్టానికి) లక్ష్యాన్ని చేరుకుంది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 36, రూథర్ఫోర్డ్ 43, తెవాతియా 11 పరుగులు (నాటౌట్) చేశారు. ఆఖర్లో బట్లర్కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా తెవాతియా చివరి ఓవర్లో వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి గుజరాత్ను విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఢిల్లీని వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బట్లర్12.5వ ఓవర్- మోహిత్ శర్మ బౌలింగ్లో బౌండరీ బాది బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బట్లర్ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బట్లర్కు జతగా రూథర్ఫోర్డ్ క్రీజ్లో ఉన్నాడు. ఇదే ఓవర్లో రూథర్ఫోర్డ్ తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదాడు. 13 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 129/2గా ఉంది. బట్లర్ 52, రూథర్ఫోర్డ్ 31 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్7.3వ ఓవర్- 74 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (36) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 85/2గా ఉంది. బట్లర్ (38), రూథర్ఫోర్డ్ (3) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్1.4వ ఓవర్- 204 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కరుణ్ నాయర్ అద్బుతమైన త్రోతో శుభ్మన్ గిల్ను (7) రనౌట్ చేశాడు. 3 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 29/1గా ఉంది. సాయి సుదర్శన్ (16), బట్లర్ (6) క్రీజ్లో ఉన్నారు. భారీ స్కోర్ చేసిన ఢిల్లీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ 39, అశుతోష్ శర్మ 37, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్ తలో 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18, విప్రాజ్ నిగమ్ 0, డొనోవన్ ఫెరియెరా 1, స్టార్క్ 2 (నాటౌట్), కుల్దీప్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. 18 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 188/6 (18) అశుతోష్ 12 బంతుల్లో 32 పరుగులతో క్రీజులో ఉండగా.. ఫెరీరా ఇంకా ఖాతా తెరవలేదు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు17.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన అక్షఱ్ పటేల్ (38). ఆ వెంటనే విప్రాజ్ నిగమ్ను అవుట్ చేసిన ప్రసిద్. 18వ ఓవర్లో వరుస బంతుల్లో గుజరాత్కు రెండు వికెట్లు. ఢిల్లీ స్కోరు: 173/6 (17.2)అక్షర్ పటేల్కు గాయం?15.3: అర్షద్ ఖాన్ బౌలింగ్లో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని తరలించిన అక్షర్.. సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు చీలమండ నొప్పితో విలవిల్లాడగా.. ఫిజియో వచ్చి పరీక్షించాడు.15 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 150/4అక్షర్ 33, అశుతోష్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ14.2: సిరాజ్ బౌలింగ్లో స్టబ్స్ (31) అవుట్. అక్షర్ 32 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 146/4 (14.2). అశుతోష్ శర్మ క్రీజులోకి వచ్చాడు.ఢిల్లీ ధనాధన్14 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు: 146/3స్టబ్స్ 19 బంతుల్లో 31, అక్షర్ పటేల్ 24 బంతుల్లో 32 పరుగులతో జోరుమీదున్నారు.పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 105-3స్టబ్స్ 8, అక్షర్ పటేల్ 15 పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్8.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్ మూడో వికెట్గా వెనుదిరిగిన కరుణ్ నాయర్ (31). స్కోరు: 93/3 (8.2). అక్షర్ పటేల్ 12 పరుగులతో ఆడుతుండగా.. ట్రిస్టన్ స్టబ్స్క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు: 73/2 (6)కరుణ్ నాయర్ 19, అక్షర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ అవుట్4.4: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్ (28). దీంతో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 58/2 (4.4)నాలుగు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 52/1రాహుల్ 22, కరుణ్ నాయర్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ1.4: అర్షద్ ఖాన్ బౌలింగ్లో అభిషేక్ పోరెల్ సిరాజ్కు క్యాచ్ ఇచ్చి 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 23/1 (1.4)తొలి ఓవర్లోనే 16 పరుగులుగుజరాత్ బౌలింగ్ ఎటాక్ను సిరాజ్ పేలవంగా ఆరంభించాడు. తొలి రెండు బంతులను వైడ్గా వేసిన ఈ రైటార్మ్ పేసర్ బౌలింగ్లో.. తర్వాతి రెండు బంతుల్లో అభిషేక్ పోరెల్ వరుసగా 4, 6 బాదాడు. ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించాడు. అభిషేక్ పోరెల్ 14, కరుణ్ నాయర్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరు... వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తోంది.తుదిజట్లుగుజరాత్ టైటాన్స్సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: షెర్ఫానే రూథర్ఫర్డ్, మహిపాల్ లామ్రోర్, అనూజ్ రావత్, వాషింగ్టన్ సుందర్, కరీం జనత్.ఢిల్లీ క్యాపిటల్స్అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్.ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: జేక్ ఫ్రేజర్-మెగర్క్, దర్శన్ నల్కాండే, సమీర్ రిజ్వీ, డొనొవన్ ఫెరీరా, దుష్మంత చమీర.కాగా ఢిల్లీ ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ ఆరింట నాలుగు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్ -
ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకున్నారని.. ఒక్కరు కూడా బుద్ధిని ఉపయోగించలేకపోయారంటూ ఘాటుగా విమర్శించాడు.హోం గ్రౌండ్లో వరుస పరాజయాలు కాగా సొంత మైదానంలో ఇతర జట్లు ఇరగదీస్తుంటే ఆర్సీబీ మాత్రం.. హోం గ్రౌండ్లో వరుస పరాజయాలు నమోదు చేస్తోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ పాటిదార్ సేన ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఈ పోరును 14 ఓవర్లకు కుదించారు.పెవిలియన్కు క్యూ ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే వరుసగా షాకులు తగిలాయి. పంజాబ్ పేసర్ అర్ష్దీప్ బౌలింగ్లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (Virat Kohli- 1) వెనువెంటనే వెనుదిరిగారు. ఇక వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ (23) నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా చహల్ అతడిని పెవిలియన్కు చేర్చాడు.2️⃣ sharp catches 🫡2️⃣ early strikes ✌Arshdeep Singh and #PBKS with a solid start ⚡Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/jCt2NiuYEH— IndianPremierLeague (@IPL) April 18, 2025 డేవిడ్ మెరుపుల వల్లమిగిలిన వాళ్లలో లియామ్ లివింగ్స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1) పూర్తిగా విఫలం కాగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ 14 ఓవర్లలో 95 పరుగులు చేయగలిగింది.𝘽𝙊𝙊𝙈 💥Nehal Wadhera is in a hurry to finish it for #PBKS 🏃Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/upMlSvOJi9— IndianPremierLeague (@IPL) April 18, 2025ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినా నేహాల్ వధేరా ధనాధన్ ఇన్నింగ్స్ (19 బంతుల్లో 33 నాటౌట్) కారణంగా.. పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో పంజాబ్తో మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్ల తీరుపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?‘‘ఆర్సీబీ బ్యాటింగ్ మరీ తీసికట్టుగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యపు షాట్లు ఆడారు. ఒక్కరంటే ఒక్కరు కూడా.. మంచి బంతికి అవుట్ కాలేదు. అంతా సాధారణ బంతులే ఆడలేక పెవిలియన్ చేరారు.ఆర్సీబీ బ్యాటర్లలో ఒక్కరైనా కామన్ సెన్స్ ఉపయోగించి ఉంటే బాగుండేది. వాళ్ల చేతిలో గనుక వికెట్లు ఉండి ఉంటే స్కోరు 14 ఓవర్లలో కనీసం 110- 120గా ఉండేది. తద్వారా విజయం కోసం పోరాడే పరిస్థితి ఉండేది. కానీ వీళ్లు మాత్రం చేతులెత్తేశారు.సొంత మైదానంలో ఆర్సీబీ గెలవలేకపోతోంది. పాటిదార్ ఇందుకు పరిష్కారాన్ని కనుగొనాలి. నిజానికి ఆర్సీబీ బౌలర్లు బాగానే ఆడుతున్నారు. కానీ బ్యాటర్లే చిత్రంగా ఉన్నారు. సొంత మైదానంలో అందరూ వరుసగా విఫలమవుతున్నారు’’ అని క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇటు కోహ్లి.. అటు భువీకాగా ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగు గెలిచి పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లోనూ ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లలో కలిపి అతడు 249 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి ఓపెనింగ్ జోడీ అయిన ఫిల్ సాల్ట్ 212 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. కెప్టెన్ పాటిదార్ ఇప్పటికి 209 పరుగులు సాధించాడు. బౌలర్లలో ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్ టాప్లో ఉన్నాడు. ఈ సీజన్లో భువీ ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు తీశాడు.చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్ -
ICC WC Qualifier: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..
వన్డే ప్రపంచకప్ ఆడాలన్న స్కాట్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. ఐసీసీ టోర్నీ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్కాటిష్ జట్టు ఓటమిపాలైంది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నీ (ICC Women's ODI World Cup) జరుగనున్న విషయం తెలిసిందే.ఒక్క వికెట్ తేడాతోఈ నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా ఇందుకు సంబంధించి క్వాలిఫయర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీ లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్ ఒక్క వికెట్ తేడాతో స్కాట్లాండ్ (Ireland Beat Scotland)ను ఓడించింది. ఒకవేళ ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ గెలిచి... శనివారం పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓడిపోతే స్కాట్లాండ్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించేది. కానీ స్కాట్లాండ్ ఆశలపై ఐర్లాండ్ నీళ్లు కుమ్మరించింది.కేథరీన్ బ్రైస్ అజేయ సెంచరీ వృథాలాహోర్ వేదికగా ఐర్లాండ్తో పోరులో ముందుగా బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 268 పరుగులు సాధించింది. కెప్టెన్ కేథరీన్ బ్రైస్ (Kathryn Bryce- 137 బంతుల్లో 131 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ చేసి స్కాట్లాండ్కు గౌరవప్రద స్కోరు అందించింది. నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..అనంతరం ఐర్లాండ్ జట్టు సరిగ్గా 50 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సారా ఫోర్బ్స్ (55; 6 ఫోర్లు), కెప్టెన్ గ్యాబీ లూయిస్ (61; 9 ఫోర్లు), లౌరా డెలానీ (57 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి ఐర్లాండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో స్కాట్లాండ్, ఐర్లాండ్ తమ ఐదు లీగ్ మ్యాచ్లను పూర్తి చేసుకొని నాలుగు పాయింట్లతో వరుసగా మూడో, నాలుగో స్థానంలో నిలిచాయి.పాక్ బెర్తు ఖరారుఇక చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ జట్టుతో పాకిస్తాన్.. థాయ్లాండ్ జట్టుతో వెస్టిండీస్ శనివారం తలపడతాయి. ఇదిలా ఉంటే.. హ్యాట్రిక్ విజయాలతో పాకిస్తాన్ ఇప్పటికే వరల్డ్కప్కు అర్హత పొందగా... రెండో బెర్త్ కోసం బంగ్లాదేశ్, వెస్టిండీస్ రేసులో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చదవండి: BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం -
డేవిడ్ వార్నర్కు మరో ఆఫర్.. ఈసారి..
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)మరో టీ20 లీగ్లో భాగం కానున్నాడు. అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో సీటెల్ ఒర్కాస్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని సీటెల్ ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ తమతో జట్టు కట్టినట్లు తెలిపింది.కాగా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఎన్నో టీ20 లీగ్లలో వార్నర్ భాగమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పాటు బిగ్ బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), ది హండ్రెడ్ (ఇంగ్లండ్), ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (UAE), పాకిస్తాన్ సూపర్ లీగ్లలో వివిధ జట్లకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.12956 పరుగులు.. సగం ఐపీఎల్లోనేఇక టీ20 ఫార్మాట్లో వార్నర్కు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు 402 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 12956 పరుగులు సాధించాడు. ఇందులో ఐపీఎల్లో ఆడిన మ్యాచ్లు 184 కాగా.. సాధించిన పరుగులు 6565. 2009లో ఐపీఎల్లో అడుగుపెట్టిన వార్నర్ నిలకడైన ఆటతో రాణించాడు.అమ్ముడుపోకుండా మిగిలిపోయాడుఅంతేకాదు 2016లో కెప్టెన్గా సన్రైజర్స్ హైదరాబాద్కు టైటిల్ అందించాడు. చివరగా గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన వార్నర్.. ఎనిమిది మ్యాచ్లు ఆడి కేవలం 168 పరుగులే చేశాడు. ఈ క్రమంలో మెగా వేలం-2025కి ముందు ఢిల్లీ వార్నర్ను వదిలేయగా.. వేలంలోనూ అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.పీఎస్ఎల్లో అత్యధిక ధరఈ క్రమంలో పీఎస్ఎల్ వైపు దృష్టి సారించిన వార్నర్.. ఈ పాక్ టీ20 లీగ్లో అధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. కరాచీ కింగ్స్ అతడిని రూ. 2.57 కోట్లకు కొనుగోలు చేసి.. కెప్టెన్గా నియమించింది. ఇక పీఎస్ఎల్ ఏప్రిల్ 11- మే 18 వరకు జరుగనుండగా.. అమెరికా టీ20 లీగ్ MLCని జూన్ 12- జూలై 13 వరకు నిర్వహించనున్నారు.సీటెల్ ఒర్కాస్తో తాజా ఒప్పందంఈ నేపథ్యంలో సీటెల్ ఒర్కాస్ వార్నర్తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఎంత మొత్తానికి అతడి సేవలు వినియోగించుకోబోతోందో మాత్రం వెల్లడించలేదు. కాగా వార్నర్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్ కెప్టెన్గా ఉన్న వార్నర్.. బిగ్ బాష్ లీగ్లో సిడ్నీ థండర్ కెప్టెన్గా ఈ ఏడాది జట్టును ఫైనల్కు తీసుకువెళ్లాడు. అంతేకాదు.. 12 ఇన్నింగ్స్లో కలిపి 405 పరుగులతో లీగ్లో అత్యధిక వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఐఎల్టీ20లో ఈ ఏడాది టైటిల్ గెలిచిన దుబాయ్ క్యాపిటల్స్ జట్టులో వార్నర్ సభ్యుడు. ఇక ది హండ్రెడ్ లీగ్లో అతడు లండన్ స్పిరిట్కు ఆడుతున్నాడు. చదవండి: BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం -
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడో ఓటమిని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో పాటిదార్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వర్షం వల్ల ఈ మ్యాచ్కు అంతరాయం కలుగగా.. పద్నాలుగు ఓవర్లకు కుదించారు.ఈ క్రమంలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 14 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ సాధించాడు.ఇక పంజాబ్ ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి.. 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ మూడు వికెట్లు దక్కించుకోగా.. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు కూల్చాడు.అతిపెద్ద గుణపాఠంఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar).. బ్యాటింగ్ వైఫల్యం వల్లే తాము ఓడిపోయామని పేర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘‘మా బ్యాటింగ్ విభాగం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.ఇలాంటి మ్యాచ్లలో భాగస్వామ్యాలు నమోదు చేయడం అత్యంత ముఖ్యం. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ మ్యాచ్లో మాకు ఇదే అతిపెద్ద గుణపాఠం.పరిస్థితులకు తగ్గట్లుగా మేము మా బ్యాటింగ్ శైలిని మార్చుకోవాల్సి ఉంది. అందుకే ఈరోజు పడిక్కల్ను ఆడించలేదు. ఇక వికెట్ కూడా అంత చెత్తగా ఏమీ లేదు. చాలా కాలంగా కవర్లు కప్పి ఉంచిన కారణంగా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు మేలు చేకూరింది.క్రెడిట్ వారికే.. మా బౌలర్లు కూడా సూపర్ఈ విజయంలో క్రెడిట్ పంజాబ్ బౌలర్లకే దక్కుతుంది. వికెట్ ఎలా ఉన్నా.. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. మా బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. అదే మాకు అతిపెద్ద సానుకూలాంశం. బ్యాటర్లు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఆడారు. కానీ కొన్నిసార్లు నిరాశ తప్పదు. బ్యాటింగ్ విభాగంలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాం’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.కాగా సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది 46వ ఓటమి. ఐపీఎల్ చరిత్రలో హోం గ్రౌండ్లో అత్యధిక మ్యాచ్లలో పరాజయం పాలైన జట్టుగా ఆర్సీబీ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్👉టాస్: పంజాబ్ కింగ్స్.. మొదట బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 95/9 (14)👉పంజాబ్ కింగ్స్ స్కోరు: 98/5 (12.1)👉ఫలితం: ఆర్సీబీపై ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డేవిడ్ (ఆర్సీబీ- 26 బంతుల్లో 50 నాటౌట్). .@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️They continue their winning streak with an all-round show over #RCB 👏Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్గా -
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)తో విభేదాలంటూ వచ్చిన వార్తలపై.. ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని.. సంజూ, తానూ జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తామని స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇద్దరికీ గాయాల బెడదఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో రాయల్స్ కేవలం రెండు మాత్రమే గెలిచింది. మరోవైపు.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజూ శాంసన్ గాయాల బారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ సీజన్ ఆరంభానికి ముందు ద్రవిడ్ లీగ్ మ్యాచ్ ఆడి కాలికి దెబ్బ తాకించుకోగా.. వీల్చైర్లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.ఇంపాక్ట్ ప్లేయర్గానేఇక సంజూ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్లలో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగాడు. ఆ తర్వాత సారథిగా పగ్గాలు చేపట్టిన ఈ కేరళ బ్యాటర్.. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా మరోసారి గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పితో అతడు తదుపరి లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు దూరమయ్యే పరిస్థితి.ద్రవిడ్- సంజూ మధ్య విభేదాలు?ఇదిలా ఉంటే.. ఢిల్లీపై గెలవాల్సిన మ్యాచ్ను రాయల్స్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులే చేయడంతో మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్లో ఢిల్లీ రాయల్స్పై జయభేరి మోగించింది. అయితే, సూపర్ ఓవర్కు ముందు ద్రవిడ్ ఆటగాళ్లతో డగౌట్లో చర్చలు జరుపగా.. సంజూ మాత్రం అందులో పాలుపంచుకోలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. ద్రవిడ్- సంజూ మధ్య విభేదాలనే వదంతులు వచ్చాయి.అతడు జట్టులో అంతర్భాగంఅయితే, ఈ వార్తలను ద్రవిడ్ ఖండించాడు. లక్నోతో శనివారం నాటి మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు. నేను, సంజూ ఒకే విధంగా ఆలోచిస్తాం. మా ప్రణాళికలు ఒక్కటే.అతడు జట్టులో అంతర్భాగం. ప్రతి చర్చ, నిర్ణయంలోనూ అతడు భాగమై ఉంటాడు. అయితే, కొన్నిసార్లు మనం అనుకున్న ఫలితాలు రాకపోతే ప్రతి ఒక్కరు నిరాశ చెందుతారు. ఆటలో ఇవన్నీ సహజం.మన ప్రదర్శన బాగా లేకపోతే విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ ఇలా ఆధారాల్లేకుండా వస్తున్న వార్తలను మేమైతే అరికట్టలేము. మా జట్టులోనూ ఎలాంటి విభేదాలు లేవు.మా వాళ్లు కఠినంగా శ్రమిస్తున్నారు. గెలుపు కోసం కృషి చేస్తున్నారు. తమ ప్రదర్శన బాగాలేకపోతే ఆటగాళ్ల మనసు ఎంతగా గాయపడుతుందో మీకు తెలియదు. ఎవరో పనిగట్టుకుని వారిని విమర్శించాల్సిన పనిలేదు. పొరపాట్లను సమీక్షించుకుని సరిచేసుకోగల సత్తా వారికి ఉంది’’ అని ద్రవిడ్ విమర్శకులకు, వదంతులు వ్యాప్తి చేసే వారికి చురకలు అంటించాడు.చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్గా -
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
ఫిక్సింగ్కు యత్నించిన గుర్మీత్ సింగ్ భమ్రా అనే వ్యక్తిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిషేధం విధించింది. భమ్రా ముంబై టీ20 లీగ్లో సొబో సూపర్ సానిక్స్ అనే ఫ్రాంచైజీ కలిగి ఉన్నాడు. ఐదేళ్ల క్రితం అతడు ఆ లీగ్లో ఫిక్సింగ్కు యత్నించినట్లు తేలడంతో బోర్డు అంబుడ్స్మన్ రిటైర్డ్ జస్టిస్ అరుణ్ మిశ్రా నిషేధం విధించారు. అయితే, భమ్రాపై ఐదేళ్లా లేదంటే జీవితకాల నిషేధమా అనేది తెలియాల్సి ఉంది. కాగా 2019 సీజన్లో సొబో సూపర్ సానిక్స్ ప్లేయర్లు ధవళ్ కులకర్ణి, భవిన్ ఠక్కర్లతో ఫిక్సింగ్ కోసం సంప్రదింపులు జరిపారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన కులకర్ణి సహా ఠక్కర్లు ఫిక్సింగ్కు నిరాకరించారు. తదనంతరం ఈ విషయాన్ని బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ)కు తెలిపారు. సోనూ వాసన్ అనే వ్యక్తి ద్వారా గుర్మీత్ సింగ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు చేశారు. సోనూ వాసన్ డబ్బు ఆశ చూపినా భవిన్ తలొగ్గలేదు. ఇద్దరు ఫిక్సింగ్కు ససేమిరా అనడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. విచారణలో గుర్మీత్ దోషి అని తేలడంతో శిక్ష ఖరారు చేశారు.ఇక భమ్రా జీటీ20 కెనడా లీగ్ (ప్రస్తుతం మనుగడలో లేదు)లోనూ భాగమయ్యాడు. కాగా కోవిడ్కు ముందు అతడు ముంబై టీ20 లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్గా ఉండగా.. ప్రస్తుతం అతడిని లీగ్ నుంచి తొలగించారు.ఐపీఎల్లోనూ ఫిక్సింగ్ కలకలంకాగా ఐపీఎల్-2025లోనూ ఫిక్సింగ్కు అవకాశముందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీసీసీఐ జట్ల యజమానులు, ఆటగాళ్లు, సిబ్బందికి కీలక సూచనలు చేసింది.హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త గట్టిగానే ఫిక్సింగ్ యత్నాలు చేస్తున్నాడని.. ఆ వ్యక్తి గనుక సంప్రదిస్తే వెంటనే అవినీతి నిరోధక భద్రతా విభాగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఖరీదైన బహుమతుల పేరిట వల వేసే అవకాశం ఉందని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సదరు వ్యాపారవేత్త గతంలోనూ ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని.. అతడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఒకవేళ అతడు ఏ రకంగానైనా సంప్రదింపులు జరపాలని చూస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని ఆటగాళ్లను అప్రమత్తం చేసింది.చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్గా -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్గా..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో అతి తక్కువ ఇన్నింగ్స్లో అత్యధిక స్ట్రైక్రేటుతో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న భారత తొలి క్రికెటర్గా నిలిచాడు. వర్షం వల్ల 14 ఓవర్ల ఆటఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా పాటిదార్ ఈ ఘనత సాధించాడు. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో పద్నాలుగు ఓవర్లకు మ్యాచ్ను కుదించగా.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (1) పూర్తిగా విఫలం కాగా.. రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించాడు.95 పరుగులుఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 50 నాటౌట్) ఆడటంతో ఆర్సీబీ తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్ప్రీత్బ్రార్ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.పంజాబ్ ఫటాఫట్ఇక పంజాబ్ 12.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. నేహాల్ వధేరా (19 బంతుల్లో 33) ధనాధన్ ఇన్నింగ్స్తో పంజాబ్ను విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్తో మ్యాచ్లో 23 పరుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.. ఐపీఎల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 30 ఇన్నింగ్స్లోనే పాటిదార్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.సచిన్ రికార్డు బ్రేక్ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉన్న రికార్డును పాటిదార్ బద్దలు కొట్టాడు. వీరిద్దరు 31 ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నారు. ఇక.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయిని చేరుకుని.. ఐపీఎల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్గా రికార్డుఅయితే, రజత్ ఇన్నింగ్స్ పరంగా సుదర్శన్ కంటే వెనుకబడి ఉన్నా... సగటు, స్ట్రైక్రేటు పరంగా మెరుగ్గా ఉన్నాడు. తద్వారా ఐపీఎల్లో 35కు పైగా సగటుతో 150కి పైగా స్ట్రైక్రేటుతో 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్గా పాటిదార్ చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్లో అతడి నిలకడైన ఆటకు ఇది నిదర్శనం.ఐపీఎల్-2025: బెంగళూరు వర్సెస్ పంజాబ్👉వర్షం వల్ల మ్యాచ్ 14 ఓవర్లకు కుదింపు👉వేదిక: ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్👉బెంగళూరు స్కోరు: 95/9 (14)👉పంజాబ్ స్కోరు: 98/5 (12.1)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో బెంగళూరుపై పంజాబ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 నాటౌట్). .@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️They continue their winning streak with an all-round show over #RCB 👏Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025చదవండి: RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్ -
చాలెంజర్స్పై పంజా...
ముందు వాన... తర్వాత హైరానా! శుక్రవారం రాత్రి బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) పరిస్థితి ఇది. ఆలస్యమైన ఆటలో వికెట్ల వేటను చకచకా మొదలుపెట్టిన పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థిథని వారి సొంతగడ్డపై కుదేల్ చేసింది. కుదించిన ఓవర్లలో విదిల్చిన పంజాతో ఎదురైన స్వల్ప లక్ష్యాన్ని ఎంచక్కా ఛేదించిన కింగ్స్ ఈ ఐపీఎల్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో మూడోసారి బెంగళూరు ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడో మ్యాచ్లోనూ రాయల్ చాలెంజర్స్ బోణీ కొట్టలేకపోయింది. బెంగళూరు: పంజాబ్ కింగ్స్ బౌలింగ్ గర్జించింది. బెంగళూరును వణికించింది. కింగ్స్ను విజేతగా నిలబెట్టింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్లు) ఒక్కడే మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ , మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్ప్రీత్ బ్రార్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసి గెలిచింది. నేహల్ వధేరా (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడాడు. హాజల్వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. బెంగళూరు తమ తుదిజట్టును మార్చలేదు. పంజాబ్ మాత్రం రెండు మార్పులు చేసింది. మ్యాక్స్వెల్, సుర్యాంశ్ షెడ్గే స్థానాల్లో స్టొయినిస్, హర్ప్రీత్ బ్రార్ బరిలోకి దిగారు. అందరూ తొందరగానే... వర్షం వల్ల మ్యాచ్ చాలా ఆలస్యంగా ఆరంభమైంది. దీంతో మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించారు. కోహ్లి, సాల్ట్, లివింగ్స్టోన్లాంటి హిట్టర్లున్న జట్టులో ఏ నలుగురో, ఐదుగురో ఆడాల్సిన 14 ఓవర్లను ఏకంగా 11 మంది ఆడేశారు. టాపార్డర్, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ అందరూ తొందర, తొందరగా వికెట్లను పారేసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. సాల్ట్ (4), కోహ్లి (1), రజత్ పాటీదార్ (23), లివింగ్స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1) చేతులెత్తేశారు. డేవిడ్ ఒక్కడి మెరుపులతోనే... జట్టు స్కోరు 95/9. అంటే 11 మంది క్రీజులోకి వచ్చారన్నమాటే! అందరూ బ్యాటింగ్కు దిగినా... స్కోరులో సగంకంటే ఎక్కువ స్కోరు ఒక్కడే టిమ్ డేవిడ్ చేశాడు. ఏడో వరుసలో, ఏడో ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన డేవిడ్ అండగా నిలిచేవారే కరువైనా... ఆఖరి రెండు ఓవర్లలోనే అంతా మార్చాడు. 12 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్లకు 63 పరుగులు చేసింది. డేవిడ్ స్కోరు 19 కాగా... జేవియర్ 13వ ఓవర్లో 2 బౌండరీలు సహా 11 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ బ్రేక్కు ముందు... చివరి 14వ ఓవర్లో తొలి మూడు బంతులు వరుసగా... 0, 0, 0 పరుగే రాలేదు. తర్వాత మూడు బంతుల్ని డేవిడ్ భారీ సిక్సర్లు బాదడంతో 18 పరుగులొచ్చాయి. 48 పరుగులు చేసిన డేవిడ్ సహా అంతా ఇన్నింగ్స్ బ్రేక్ కావడంతో మైదానం వీడుతున్నారు. కానీ అంపైర్ చాలా ఆలస్యంగా నోబాల్ సిగ్నలిచ్చాడు. సహచరులతో కబుర్లాడుతూ డగౌట్ చేరుతున్న ఆటగాళ్లను వెనక్కి పిలిచి ఫ్రీ హిట్ ఆడించడంతో 2 పరుగులు తీసిన డేవిడ్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. నేహల్ మెరిపించాడు... సులువైన లక్ష్యం కావడంతో పంజాబ్కు ఛేదనలో పెద్దగా కష్టం ఎదురవలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (16), ప్రభ్సిమ్రాన్ (13), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7) ఇలా టాపార్డర్ వికెట్లు రాలినా... మిడిలార్డర్లో నేహల్ భారీ షాట్లతో విరుచుకు పడి జట్టును గెలిపించాడు. దీంతో ఒకే ఓవర్లో హాజల్వుడ్ అయ్యర్, ఇన్గ్లిస్ (14) వికెట్లను పడగొట్టినా... నేహల్ బ్యాటింగ్ బెంగళూరును మ్యాచ్లో పట్టుబిగించకుండా చేసింది. 11 బంతులు మిగిలుండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలురాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్గ్లిస్ (బి) అర్ష్ దీప్ 4; కోహ్లి (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ 1; పాటీదార్ (సి) జేవియర్ (బి) చహల్ 23; లివింగ్స్టోన్ (సి) ప్రియాన్‡్ష (బి) జేవియర్ 4; జితేశ్ (సి) నేహల్ (బి) చహల్ 2; కృనాల్ (సి అండ్ బి) యాన్సెన్ 1; టిమ్ డేవిడ్ (నాటౌట్) 50; మనోజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) యాన్సెన్ 1; భువనేశ్వర్ (సి) జేవియర్ (బి) హర్ప్రీత్ 8; యశ్ దయాళ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్ప్రీత్ 0; హజల్వుడ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో 9 వికెట్లకు) 95. వికెట్ల పతనం: 1–4, 2–21, 3–26, 4–32, 5–33, 6–41, 7–42, 8–63, 9–63. బౌలింగ్: అర్శ్దీప్ 3–0–23–2, జేవియర్ 3–0–26–1, యాన్సెన్ 3–0–10–2, చహల్ 3–0–11–2, హర్ప్రీత్ బ్రార్ 2–0–25–2. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) హాజల్వుడ్ 16; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) భువనేశ్వర్ 13; అయ్యర్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 7; ఇన్గ్లిస్ (సి) సుయశ్ (బి) హాజల్వుడ్ 14; నేహల్ (నాటౌట్) 33; శశాంక్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 1; స్టొయినిస్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 7; మొత్తం (12.1 ఓవర్లలో 5 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–22, 2–32, 3–52, 4–53, 5–81. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–26–2, యశ్ దయాళ్ 2.1–0–18–0, హాజల్వుడ్ 3–0–14–3, కృనాల్ 1–0–10–0, సుయశ్ 3–0–25–0. ఐపీఎల్లో నేడుగుజరాత్ X ఢిల్లీ వేదిక: అహ్మదాబాద్ , మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి రాజస్తాన్ X లక్నో వేదిక: జైపూర్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీపై పంజాబ్ విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఆర్సీబీపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జన్సెన్, చహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డేవిడ్తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. అయితే నేహల్ వధేరా (33 నాటౌట్) ఏమాత్రం జంక కుండా బ్యాటింగ్ చేసి పంజాబ్ను విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. యశ్ దయాల్ బౌలింగ్లో సిక్సర్ బాది స్టోయినిస్ (7 నాటౌట్) మ్యాచ్ను ముగించాడు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రియాంశ్ ఆర్య 16, ప్రభ్సిమ్రన్ సింగ్ 13, శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లిస్ 14, శశాంక్ సింగ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. -
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
పేసర్ అర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 18) జరుగుతున్న మ్యాచ్లో అర్షదీప్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అర్షదీప్ ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి వికెట్లు తీశాడు. 2019 సీజన్లో పంజాబ్లో చేరిన అర్షదీప్ ఇప్పటివరకు 86 వికెట్లు తీశాడు. అర్షదీప్కు ముందు పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు పియూశ్ చావ్లా పేరిట ఉండేది. చావ్లా పంజాబ్ తరఫున (2000-2013) 84 వికెట్లు తీశాడు. అర్షదీప్ను పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు వదిలేసింది. అయినా అతన్ని వేలంలో తిరిగి రూ. 18 కోట్లు పెట్టి దక్కించుకుంది.ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..86* - అర్ష్దీప్ సింగ్84 - పియూష్ చావ్లా73 - సందీప్ శర్మ61 - అక్షర్ పటేల్58 - మహ్మద్ షమీమ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో పంజాబ్ బౌలర్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఆర్సీబీ 8.2 ఓవర్లలో 42 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సహా జన్సెన్, చహల్ తలో రెండు వికెట్లు తీశారు. బార్ట్లెట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, రజత్ పాటిదార్ 23, లివింగ్స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1 పరుగు చేసి ఔటయ్యారు. టిమ్ డేవిడ్ (8), భువనేశ్వర్ కుమార్ (3) క్రీజ్లో ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 47/7గా ఉంది. -
IPL 2025: బ్యాటింగ్లో పూరన్.. బౌలింగ్లో నూర్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) ఆర్సీబీ, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యేలా కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 9 గంటలకు వరకు టాస్ కూడా పడలేదు. ఈ మ్యాచ్కు వేదిక అయిన బెంగళూరులో ఇంకా వర్షం కురుస్తున్నట్లు సమాచారం. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరగాలన్నా రాత్రి 10:41 గంటల్లోపు టాస్ పడాలి.ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ (6 మ్యాచ్ల్లో 5 విజయాలు) అగ్రస్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ (6 మ్యాచ్ల్లో 4 విజయాలు), ఆర్సీబీ (6 మ్యాచ్ల్లో 4 విజయాలు), పంజాబ్ (6 మ్యాచ్ల్లో 4 విజయాలు), లక్నో (7 మ్యాచ్ల్లో 4 విజయాలు), కేకేఆర్ (7 మ్యాచ్ల్లో 3 విజయాలు), ముంబై (7 మ్యాచ్ల్లో 3 విజయాలు), రాజస్థాన్ రాయల్స్ (7 మ్యాచ్ల్లో 2 విజయాలు), ఎస్ఆర్హెచ్ (7 మ్యాచ్ల్లో 2 విజయాలు), సీఎస్కే (7 మ్యాచ్ల్లో 2 విజయాలు) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.పరుగుల్లో టాప్ పూరన్ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్ కొనసాగుతున్నాడు. పూరన్ ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడి 208.77 స్ట్రయిక్రేట్తో 357 పరుగులు చేశాడు. పూరన్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు.అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుపూరన్- 357సాయి సుదర్శన్- 329మిచెల్ మార్ష్- 295సూర్యకుమార్ యాదవ్- 265శ్రేయస్ అయ్యర్- 250విరాట్ కోహ్లి- 248అత్యధిక వికెట్ల వీరుడు నూర్ప్రస్తుతం పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) హోల్డర్గా సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ కొనసాగుతున్నాడు. నూర్ 7 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. నూర్ తర్వాత కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో 11 వికెట్లు తీశారు.అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లునూర్ అహ్మద్-12కుల్దీప్ యాదవ్- 11ఖలీల్ అహ్మద్- 11 హార్దిక్ పాండ్యా- 11 శార్దూల్ ఠాకూర్- 11సెంచరీల వీరులుఅభిషేక్ శర్మ-1ప్రియాన్ష్ ఆర్య-1ఇషాన్ కిషన్-1అత్యధిక హాఫ్ సెంచరీలుపూరన్-4సాయి సుదర్శన్-4మిచెల్ మార్ష్-4అత్యధిక ఫోర్లుట్రవిస్ హెడ్- 33సాయి సుదర్శన్-31అభిషేక్ శర్మ-31అత్యధిక సిక్సర్లుపూరన్-31శ్రేయస్ అయ్యర్-20మిచెల్ మార్ష్-17ఐదు వికెట్ల ఘనతలుహార్దిక్ పాండ్యామిచెల్ స్టార్క్ -
IPL 2025: ఆర్సీబీపై పంజాబ్ విజయం
ఆర్సీబీపై పంజాబ్ విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జన్సెన్, చహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డేవిడ్తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. అయితే నేహల్ వధేరా (33 నాటౌట్) ఏమాత్రం జంక కుండా బ్యాటింగ్ చేసి పంజాబ్ను విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. యశ్ దయాల్ బౌలింగ్లో సిక్సర్ బాది స్టోయినిస్ (7 నాటౌట్) మ్యాచ్ను ముగించాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రియాంశ్ ఆర్య 16, ప్రభ్సిమ్రన్ సింగ్ 13, శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లిస్ 14, శశాంక్ సింగ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్2.4వ ఓవర్- 22 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్లో టిమ్ డేవిడ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ప్రభ్సిమ్రన్ (13) ఔటయ్యాడు. పంజాబ్ బౌలర్ల విజృంభణ.. 95 పరుగులకే పరిమితమైన ఆర్సీబీవర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అర్షదీప్, జన్సెన్, చహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డేవిడ్తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు. 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ సింగ్ 2, బార్ట్లెట్, జన్సెన్, చహల్ తలో వికెట్ తీశారు. పాటిదార్ (21), టిమ్ డేవిడ్ (5) క్రీజ్లో ఉన్నారు. 6.3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 38/5గా ఉంది. కోహ్లి ఔట్.. 21 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ2.4వ ఓవర్- 21 పరుగులకే ఆర్సీబీ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి (1) ఔటయ్యాడు. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్లో తొలి బంతికే బౌండరీ బాదిన సాల్ట్ నాలుగో బంతికి మరో భారీ షాట్కు ప్రయత్నించి వికెట్ కీపర్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ రెండు మార్పులు చేసింది. మ్యాక్స్వెల్ స్థానంలో స్టోయినిస్ జట్టులోకి వచ్చాడు. హర్ప్రీత్ బ్రార్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్ ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, నేహాల్ వధేరా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, విజయ్కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్జ్, గ్లెన్ మాక్స్వెల్, ప్రవీణ్ దూబే9:30 గంటలకు టాస్.. 14 ఓవర్ల మ్యాచ్టాస్ 9:30 గంటలకు పడనుంది. 9:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్ ప్లే 4 ఓవర్లుగా తేల్చారు. ముగ్గురు బౌలర్లు నాలుగు ఓవర్లు, ఓ బౌలర్ మిగతా రెండు ఓవర్లు బౌల్ చేయవచ్చు. తగ్గిన వర్షం.. తొలిగిన కవర్లు9:05 గంటలు- ఎట్టకేలకు వర్షం తగ్గుముఖం పట్టడంతో మైదాన సిబ్బంది కవర్లను తొలగించారు. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి వార్మప్ మొదలుపెట్టారు. ఎంతకీ తగ్గని వర్షం.. ఓవర్ల కోత మొదలైంది8:30 గంటలు-సాయంత్రం ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గడం లేదు. ఇకపై మ్యాచ్ ప్రారంభమైనా ఓవర్ల కోత తప్పదని తెలుస్తుంది.ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ హెం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలాడు. టాస్ ఆలస్యమయ్యే అవకాశముంది. గత రెండు, మూడు గంటల నుంచి వర్షం పడుతుండటంతో స్టేడియం మొత్తం కవర్లు కప్పి ఉంచారు. మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదమేమీ లేనప్పటి.. ఓవర్ల కోత ఉండవచ్చని తెలుస్తుంది. -
IPL 2025: సన్రైజర్స్పై విజయం.. చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా వాంఖడే మైదానం వేదికగా నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్తో రాణించిన విల్ జాక్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్ఎస్ఆర్హెచ్పై గెలుపుతో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఓ వేదికపై ఛేజింగ్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. వాంఖడే మైదానంలో ముంబై 29 సార్లు (47 మ్యాచ్ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది. ఈ రికార్డు సాధించే క్రమంలో ముంబై కేకేఆర్ను అధిగమించింది. కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో 28 సార్లు (40 మ్యాచ్ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది.ఐపీఎల్లో ఓ వేదికపై ఛేజింగ్ చేస్తూ అత్యధిక విజయాలు సాధించిన జట్లు..ముంబై ఇండియన్స్- వాంఖడే స్టేడియం- 29 విజయాలు (47 మ్యాచ్లు)కేకేఆర్- ఈడెన్ గార్డెన్స్- 28 (40)రాజస్థాన్ రాయల్స్- సువాయ్ మాన్ సింగ్ స్టేడియం- 24 (31)ఆర్సీబీ- చిన్నస్వామి స్టేడియం- 21 (41)సన్రైజర్స్ హైదరాబాద్- ఉప్పల్ స్టేడియం- 21 (32)సీఎస్కే- చెపాక్ స్టేడియం- 20 (31) -
IPL 2025: నేటి (ఏప్రిల్ 18) మ్యాచ్కు వర్షం ముప్పు
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 18) ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ హెం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కవర్లతో కప్పి ఉంది. వర్షం పడే సూచనలు ఉన్నప్పుడే ఇలా చేస్తారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. మ్యాచ్ జరిగే సమయానికి 22 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదమేమీ లేనప్పటికీ పాక్షికంగా బ్రేకులు పడే ఛాన్స్ ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో ఆర్సీబీకి హోం గ్రౌండ్లో ఇది మూడో మ్యాచ్. ఇక్కడ ఆడిన గత రెండు మ్యాచ్ల్లో ఆర్సీబీ ఓడింది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రత్యర్థి ఇలాకాల్లో ఆడిన ప్రతి మ్యాచ్లోనూ గెలిచింది. ఈ సీజన్లో ఆర్సీబీ తమ సొంత మైదానంలో గుజరాత్, ఢిల్లీ చేతుల్లో ఓడింది. ఆర్సీబీ ఈ సీజన్లో కేకేఆర్, సీఎస్కే, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ను వారి సొంత ఇలాకాల్లో ఓడించింది. ప్రస్తుతం ఆర్సీబీ 6 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (+0.672) ఉంది. పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి నాలుగో స్థానంలో (+0.172) ఉంది. పంజాబ్ ఈ సీజన్లో గుజరాత్, లక్నో, సీఎస్కే, కేకేఆర్పై విజయాలు సాధించి, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ చేతుల్లో పరాజయంపాలైంది. పంజాబ్.. కేకేఆర్తో జరిగిన గత మ్యాచ్లో 111 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని రికార్డుల్లోకెక్కింది. అంతుకుముందు పంజాబ్ సన్రైజర్స్పై 245 పరుగులు చేసినప్పటికీ ఓటమిపాలైంది.పంజాబ్దే స్వల్ప పైచేయిపంజాబ్, ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే పంజాబ్దే స్వల్ప పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్ల్లో తలపడగా.. పంజాబ్ 17, ఆర్సీబీ 16 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిగా తలపడిన మూడు మ్యాచ్ల్లో ఆర్సీబీ విజయం సాధించింది.తుది జట్లు (అంచనా)..ఆర్సీబీ: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మపంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, విజయ్కుమార్ వైశాఖ్ -
IPL 2025: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ, పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తమ బ్యాటింగ్ విభాగాన్ని పటిష్ట పరచుకునే పనిలో పడింది. ఇప్పటికే గాయపడిన కెప్టెన్ రుతురాజ్ స్థానాన్ని ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రేతో భర్తీ చేసిన సీఎస్కే యాజమాన్యం తాజాగా మరో గాయపడిన ఆటగాడికి రీప్లేస్మెంట్ను ప్రకటించింది. లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన గుర్జప్నీత్ సింగ్ ఈ సీజన్ ఆరంభ దశలో గాయపడగా.. తాజాగా అతని స్థానాన్ని సౌతాఫ్రికా చిచ్చరపిడుగు, బేబీ ఏబీడీగా పిలువబడే డెవాల్డ్ బ్రెవిస్తో భర్తీ చేసింది. బ్రెవిస్ ఈ సీజన్ మెగా వేలంలో 75 లక్షల బేస్ ధర విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ.. సీఎస్కే మేనేజ్మెంట్ అతనికి బంపరాఫర్ ఇచ్చి ఏకంగా రూ. 2.2 కోట్లకు డీల్ సైన్ చేసుకుంది. వాస్తవానికి ఈ సీజన్లో సీఎస్కేకు ఓ ఓవర్సీస్ బెర్త్ ఖాళీగా ఉంది. ఎవరికీ రీప్లేస్మెంట్గా కాకుండానే బ్రెవిస్ను ఎంపిక చేసుకునే అవకాశం ఆ జట్టుకు ఉండింది. అయినా ఎందుకో వేచి చూసే ధోరణిని అవళంభించి గుర్జప్నీత్కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంది. విధ్వంసకర వీరుడిగా పేరు తెచ్చుకున్న బ్రెవిస్ను ఈ సీజన్ మెగా వేలంలో ఎందుకో ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు. బ్రెవిస్ గతంలో ముంబై ఇండియన్స్కు ఆడాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీల్లోనూ అతను ముంబై సిస్టర్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 21 ఏళ్ల బ్రెవిస్ సౌతాఫ్రికా తరఫున కేవలం రెండు మ్యాచ్లే ఆడినప్పటికీ.. అతన్ని ఆ దేశ దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్తో పోలుస్తారు. బ్రెవిస్ ఓవరాల్గా 81 టీ20లు ఆడి 145 స్ట్రయిక్రేట్తో పరుగులు చేశాడు. బ్రెవిస్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. సౌతాఫ్రికా దేశవాలీ సీజన్లో ఫార్మాట్లకతీతంగా అదరగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్లోనూ బ్రెవిస్ మంచి ప్రదర్శనలు చేశాడు. బ్రెవిస్ ఫామ్ కష్టాల్లో ఉన్న సీఎస్కేను గట్టెక్కిస్తుందేమో చూడాలి. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ను ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్ వాంఖడే వేదికగా ఏప్రిల్ 20న జరుగనుంది. ఈ సీజన్లో సీఎస్కే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసి ఆతర్వాత వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడింది. తాజా లక్నోతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే మళ్లీ గెలుపు గుర్రం ఎక్కింది. ఈ సీజన్లో సీఎస్కే ఏడు మ్యాచ్ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించి, నాలుగు పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ సీజన్లో సీఎస్కే బ్యాటింగ్ విభాగంలో చాలా బలహీనంగా కనిపిస్తుంది. రుతురాజ్ వైదొలగడంతో ఆ జట్టు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ చేరికతో సీఎస్కే బ్యాటింగ్ కష్టాలు తీరుతాయేమో చూడాలి. ఈ సీజన్లో సీఎస్కే బౌలింగ్లో పర్వాలేదనిపిస్తుంది. రుతరాజ్ గైర్హాజరీలో సీఎస్కే కెప్టెన్గా ధోని వ్యవహరిస్తున్నాడు. లక్నోపై గెలుపులో ధోని కీలకపాత్ర పోషించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, ఖలీల్ అహ్మద్, పతిరణ అద్భుతంగా రాణిస్తున్నారు. -
ఆరోజు నాకు కోపం వచ్చింది.. అందుకే అలా అరిచాను: రోహిత్ శర్మ
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో వ్యూహాలతోనే కాకుండా.. తనదైన శైలిలో సెటైర్లు పేలుస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. ఒక్కోసారి తన సరదా చేష్టలతో సహచర ఆటగాళ్లను ఆటపట్టించే హిట్మ్యాన్.. కీలక సమయాల్లో మాత్రం గంభీరంగా మారిపోతాడు. అలా ఇంగ్లండ్ (IND vs ENG)తో 2024 నాటి టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ అన్న మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి.గార్డెన్లో తిరిగేందుకు వచ్చారా?‘‘ఇక్కడ ఎవరూ ఖాళీగా.. పనీపాటా లేకుండా గార్డెన్లో తిరిగేందుకు రాలేదు’’ అంటూ సహచర ఆటగాళ్లను ఒకింత తీవ్ర స్వరంతోనే మందలించాడు. అప్పట్లో వైరల్ అయిన ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ‘‘ఆరోజు వైజాగ్లో మ్యాచ్. ఓవర్ పూర్తయ్యే సమయంలో మా వాళ్లు ఏదో వాకింగ్కు వచ్చినట్లు గార్డెన్లో నడిచినట్లుగా అటూ ఇటూ తిరుగుతున్నారు.ఒక్కరూ పరిగెత్తడం లేదు. మైదానంలో చురుగ్గా లేనేలేరు. మ్యాచ్ చేజారిపోతుందేమోననిపించింది. అది మాకు అతి ముఖ్యమైన, తప్పక గెలవాల్సిన మ్యాచ్. అందుకే ఈరోజు మనమంతా ఇంకాస్త ఎక్కువగా శ్రమించాలి అని మా వాళ్లకు ఆరోజు పొద్దునే గట్టిగా చెప్పాను.అందుకే నాకు కోపం వచ్చిందికానీ వాళ్లేమో గ్రౌండ్లో సరదాగా చక్కర్లు కొడుతున్నారు. అప్పుడు మేము ఒక్క వికెట్ అయినా తీయాలని పరితపించిపోతున్నాం. కానీ ఎవరూ అందుకు తగ్గ ప్రయత్నం చేసినట్లు అనిపించలేదు.అందుకే నాకు కోపం వచ్చింది. మా వాళ్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నా. ప్రత్యర్థి జట్టు భాగస్వామ్యాలను కూల్చాలని చెప్పా. అలాంటి సమయంలో సమిష్టిగా పనిచేస్తేనే ఫలితం వస్తుంది. అయితే, మా వాళ్లు ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నట్లు కనిపించింది. అందుకే అలా అన్నాను’’ అని రోహిత్ శర్మ జియోహాట్స్టార్తో మాట్లాడుతూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.106 పరుగుల తేడాతో గెలుపుకాగా గతేడాది ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లండ్ను 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలి టెస్టులో ఓడిన రోహిత్ సేన.. ఆ తర్వాత మిగతా నాలుగు గెలిచి.. 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇంత వరకు తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడి కేవలం 82 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభానికి ముందు చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో రోహిత్ టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందించాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లోనూ టీమిండియాను చాంపియన్గా నిలిపి దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.ఇక భారత్కు పొట్టి ప్రపంచకప్ అందించిన తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం లీగ్ క్రికెట్లో మాత్రమే అతడు పొట్టి ఫార్మాట్లో ఆడుతున్నాడు. కాగా ముంబై ఇండియన్స్కు ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్గా ఘనత సాధించిన రోహిత్ శర్మ.. గతేడాది నుంచి ఆటగాడిగా కొనసాగుతున్నాడు.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! -
‘ద్రవిడ్కు సంజూ నచ్చడు.. అందుకే ఇలా!’.. రాయల్స్ క్యాంపులో విభేదాలు?
‘రాజస్తాన్ రాయల్స్ నాయకత్వ బృందంలో విభేదాలు తలెత్తాయా?.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)- కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) మధ్య సఖ్యత కొరవడిందా?.. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయా?’.. అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అవుననేందుకు ఆస్కారం ఇస్తున్నాయి.ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. సీజన్ ఆరంభానికి ముందే హెడ్కోచ్ ద్రవిడ్ గాయపడ్డాడు. అయినప్పటికీ వీల్చైర్లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.మరోవైపు.. ఐపీఎల్ ఆరంభానికి ముందు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఎడిషన్లో తొలి మూడు మ్యాచ్లకు అతడు కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే అందుబాటులో ఉన్నాడు. సారథిగా, వికెట్ కీపర్గా జట్టు అతడి సేవలను కోల్పోయింది.ఇక సంజూ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ వచ్చిన రియాన్ పరాగ్ (Riyan Parag) సారథ్యంలో.. మూడు మ్యాచ్లలో రాజస్తాన్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అయితే, సంజూ వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఈ క్రమంలో చివరగా ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం నాటి మ్యాచ్లో రాయల్స్ తలపడింది.అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్ నిర్వహించగా.. ఢిల్లీ రాయల్స్ను ఓడించి గెలుపు జెండా ఎగురవేసింది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా సంజూ పక్కటెముకల నొప్పితో రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు.ఇదిలా ఉంటే.. సూపర్ ఓవర్ సమయంలో రాజస్తాన్ రాయల్స్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. రియాన్ పరాగ్తో పాటు షిమ్రన్ హెట్మెయిర్ను రాయల్స్ బ్యాటింగ్కు పంపింది. వీరిద్దరు రనౌట్ అయి ఐదు బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి జట్టు ఓటమికి పరోక్ష కారణమయ్యారు.𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 PC: BCCIనిజానికి ఈ మ్యాచ్లో నితీశ్ రాణా అద్భుత అర్ధ శతకం (28 బంతుల్లో 51)తో రాణించాడు. కానీ మేనేజ్మెంట్ మాత్రం అతడిని సూపర్ ఓవర్లో పంపలేదు. ఇక సూపర్ ఓవర్కు ముందు ద్రవిడ్ డగౌట్లో తన సహాయక సిబ్బంది, ఆటగాళ్లతో ప్రణాళికల గురించి చర్చించాడు.ఆ సమయంలో కెప్టెన్ సంజూ మాత్రం తనకు ఈ విషయం పట్టనట్లుగా ఆటగాళ్ల వెనుక అటూ ఇటూ తిరిగాడు. మధ్యలో సహచర ఆటగాడు రమ్మని పిలిచినా తనకు ఇష్టం లేదన్నట్లుగా వద్దంటూ చేతితో సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాయల్స్ క్యాంపులో విభేదాలు అన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఇది చూసిన సంజూ అభిమానులు ద్రవిడ్కు సంజూ నచ్చడని.. అందుకే ఇక్కడా తనకు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్-2025లో ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న రాజస్తాన్ కేవలలం రెండే గెలిచింది.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! I knew there was definitely a rift within the setup when there were absolutely no discussions or chat in the dugout before the super over.Everyone was standing quite in a circle in the dugout.Look at Sanju's hand signal in the first video,he is deliberately ignoring everyone. https://t.co/DfxmlwGgBG pic.twitter.com/688ji3MXrS— Delhi Capitals Fan (@pantiyerfc) April 17, 2025 -
MI vs SRH: వాళ్లిద్దరి తప్పేమీ లేదు!.. క్లాసెన్ కొంపముంచాడు!
ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klassen) ఓ పొరపాటు చేశాడు. అతడి తప్పిదం కారణంగా ముంబై ఓపెనర్ రియాన్ రికెల్టన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. క్లాసెన్ తప్పు వల్ల లైఫ్ పొందిన అతడు తన స్కోరుకు మరో పది పరుగులు జతచేసి.. ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.162 పరుగులుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గురువారం ముంబై- హైదరాబాద్ (MI vs SRH) జట్లు తలపడ్డాయి. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య ముంబై ఇండియన్స్.. రైజర్స్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కమిన్స్ బృందం 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది.సన్రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ (28 బంతుల్లో 37) కూడా రాణించాడు. ఇక రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఓపెనర్ రోహిత్ శర్మ(16 బంతుల్లో 26) కమిన్స్ బౌలింగ్లో అవుటయ్యాడు.కమిన్స్కు క్యాచ్ ఇచ్చిఇక మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. జీషన్ అన్సారీ బౌలింగ్లో కమిన్స్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అతడు అవుటయ్యాడని భావించి మైదానం వీడే సమయానికి.. హై డ్రామా చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన ఫోర్త్ అంపైర్.. రికెల్టన్ పెవిలియన్కు వెళ్లకుండా ఆపేశాడు. జీషన్ వేసిన బంతిని నో బాల్గా ప్రకటించాడు.క్లాసెన్ చేసిన తప్పు వల్లనిజానికి రికెల్టన్ను అవుట్ చేసే విషయంలో బౌలర్గా జీషన్ అన్సారీ.. ఫీల్డర్గా క్యాచ్ అందుకోవడంలో కమిన్స్ ఎలాంటి పొరపాటు చేయలేదు. కానీ వికెట్ కీపర్ క్లాసెన్ చేసిన తప్పు వల్ల రికెల్టన్కు లైఫ్ వచ్చింది.కారణం ఇదేవిషయం ఏమిటంటే.. క్యాచ్ను అందుకునే లేదా స్టంపింగ్ ప్రయత్నంలో వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు రాకూడదు. ఇది అందరికీ తెలిసిన, చాలా కాలంగా అమల్లో ఉన్న నిబంధనే. కానీ గురువారం ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అన్సారీ వేసిన బంతిని రికెల్టన్ ఆడి కమిన్స్కు క్యాచ్ ఇచ్చాడు.అయితే దీనిని ‘నోబాల్’గా ప్రకటిస్తూ అంపైర్లు నాటౌట్గా ప్రకటించారు. రికెల్టన్ షాట్ ఆడక ముందే క్లాసెన్ గ్లవ్స్ ముందుకు రావడం ఇందుకు కారణం. ఇది ఐసీసీ నిబంధన 27.3.1కు విరుద్ధం. అందుకే అంపైర్లు నోబాల్ ఇచ్చారు. క్లాసెన్ కూడా తాను చేసిన తప్పును వెంటనే అంగీకరిస్తూ సైగ చేయడం గమనార్హం. వాంఖడేలో జయభేరిఇక ముంబై బ్యాటర్లలో రికెల్టన్ 31 పరుగులు చేయగా.. విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (21 నాటౌట్) రాణించారు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ముంబై మరో పదకొండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 18.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసి.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లుహైదరాబాద్: 162/5 (20)ముంబై: 166/6 (18.1)ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్పై ముంబై విజయం.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! -
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
సీనియర్ ఆటగాళ్లతో సఖ్యత లేకపోవడమే టీమిండియా కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar)పై వేటుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. డ్రెసింగ్రూమ్లో నాయర్ వ్యవహారశైలి పట్ల జట్టులోని కీలక సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని.. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే బీసీసీఐ (BCCI)అతడిని తప్పించిందని తెలుస్తోంది. కాగా భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందికి సంబంధించి బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీమ్ అసిస్టెంట్ కోచ్గా ఉన్న అభిషేక్ నాయర్పై వేటు వేసింది. ఎనిమిది నెలల క్రితమే బాధ్యతలు తీసుకున్న నాయర్ను బాధ్యతల నుంచి తప్పించేందుకు బోర్డు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. మూడు నెలల తర్వాతస్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో 0–3తో ఓటమి, ఆపై ఆస్ట్రేలియా గడ్డపై 1–3తో సిరీస్ కోల్పోయిన తర్వాత జనవరిలో బీసీసీఐ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించింది.ఇందులో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్తో పాటు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాతే కోచింగ్ బృందంలో ఎవరి పైనైనా చర్యలు ఉండవచ్చని అర్థమైంది. ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత అభిషేక్ నాయర్ను బోర్డు తప్పించింది. హెడ్ కోచ్గా గంభీర్ కాంట్రాక్ట్ను 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఖాయం చేసిన బీసీసీఐ... నాయర్ను నియమించినప్పుడు అతని పదవీ కాలం విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు.కొటక్ ఎంపికతోనే... 2024 ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు కోసం గంభీర్, అభిషేక్ నాయర్ కలిసి పని చేశారు. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. గంభీర్ హెడ్ కోచ్గా ఎంపికయ్యాక ఎలాంటి దరఖాస్తులు, ఇంటర్వ్యూలు లేకుండా తనకు నచ్చిన వారిని ఎంచుకునేందుకు బోర్డు అవకాశం ఇచ్చింది. రోహిత్ శర్మకు మంచి స్నేహితుడుఈ క్రమంలో నాయర్ను అతను అసిస్టెంట్ కోచ్గా తీసుకున్నాడు. రోహిత్ శర్మకు మంచి స్నేహితుడైన నాయర్... అటు కెప్టెన్, ఇటు కోచ్గా మధ్య మంచి సంధానకర్తగా కూడా పని చేయగలడని భావించడం కూడా అతని ఎంపికకు మరో కారణం.భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన ముంబై ఆల్రౌండర్ నాయర్కు దేశవాళీ క్రికెట్లో మంచి రికార్డుంది. అధికారికంగా ఏ జట్టుకు కోచ్గా పని చేయకపోయినా కూడా వ్యక్తిగతంగా ఎంతో మంది బ్యాటర్ల ఆటను మెరుగుపర్చడంలో అతని పాత్ర చాలా ఉంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వెంకటేశ్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రఘువంశీ ఇదే మాట చెప్పారు.అపుడే నాయర్ భవిష్యత్తుపై సందేహాలునిజానికి చాంపియన్స్ ట్రోఫీకి అప్పటికే ఉన్న సహాయక సిబ్బందితో పాటు అదనంగా మరో అసిస్టెంట్ కోచ్ సితాన్షు కొటక్ను పంపడంతోనే నాయర్ భవిష్యత్తుపై సందేహాలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. మరోవైపు ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్కు చెందిన టి.దిలీప్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్లను కూడా తప్పిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. పని తీరు గురించి కాకుండా వీరి పదవీకాలం ముగియడమే కారణమని తెలుస్తోంది. బోర్డు కొత్త నిబంధనల (ఎస్ఓపీ) ప్రకారం సహాయక సిబ్బంది పదవీకాలం గరిష్టంగా మూడేళ్లే ఉండాలి. గంభీర్ ఏమాత్రం వ్యతిరేకించలేదుఇదిలా ఉంటే.. పట్టుబట్టి మరీ అభిషేక్ నాయర్ను తన సహాయక సిబ్బందిలో చేర్చుకున్న గంభీర్.. అతడిని తప్పించే సమయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘నాయర్పై వేటు వేయడాన్ని గంభీర్ ఏమాత్రం వ్యతిరేకించలేదు.డష్కాటే, మోర్నీ మోర్కెల్ను తన సిబ్బందిలో చేర్చుకునేందుకు గంభీర్ బోర్డుతో ఎన్నో సంప్రదింపులు జరిపాడు. అనేక చర్చల తర్వాతే వారిని సిబ్బందిలో చేర్చుకునే అవకాశం వచ్చింది. వారిని వదులుకునేందుకు మాత్రం అతడు సిద్ధంగా లేడు. అయితే, అభిషేక్ నాయర్ విషయం మాత్రం వేరు’’ అని పేర్కొన్నాయి.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! -
అసభ్యకర ఫొటోలు పంపేవారు.. ఆ సీనియర్ క్రికెటర్ కార్లో కూర్చోమంటూ..
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ బిడ్డ అనయా బంగర్ (Anaya Bangar) సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. తాను ఆర్యన్ (Aryan Bangar)గా ఉన్నపుడు క్రికెటర్లతో మంచి అనుబంధం ఉండేదని.. అయితే, అనయాగా మారిన తర్వాత కొంత మంది నిజస్వరూపాలు బయటపడ్డాయంటూ విస్మయకర విషయాలు వెల్లడించింది. సీనియర్ ఆటగాడు ఒకరు తనకు అండగా మాట్లాడినట్లు నటించి.. తనతో నిద్రించాలని ఉందంటూ అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.అమ్మాయిగా మారిపోయిన ఆర్యన్కాగా టీమిండియా మాజీ కోచ్ అయిన సంజయ్ బంగర్- కశ్మీర దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. వీరిలో ఆర్యన్ పెద్దవాడు. అతడు కూడా తండ్రి బాటలోనే క్రికెటర్గా ఎదగాలనే ఆశయంతో దేశీ టోర్నీల్లో ఆడాడు. కానీ శరీర ధర్మానికి అనుగుణంగా తాను అబ్బాయిని కాదు.. అమ్మాయినని గుర్తించి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్నాడు.తద్వారా అమ్మాయిగా మారిపోయిన ఆర్యన్.. అనయా బంగర్గా కొత్త పేరుతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అనయా యునైటెడ్ కింగ్డమ్లో జీవిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘లలన్టాప్’నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. క్రికెట్ ప్రపంచంలో ఎంతో మంది విషపూరితమైన మగాళ్లు ఉన్నారంటూ అనయా బంగర్ సంచలన విషయాలు వెల్లడించింది.నేను అమ్మాయిని.. అమ్మాయిలాగే ఉండాలి‘‘నాకు అప్పుడు ఎనిమిది- తొమ్మిదేళ్ల వయసు ఉంటుంది. మా అమ్మ కబోర్డ్లోని దుస్తులు తీసుకుని వేసుకునే వాడిని. అద్దంలో చూసుకుని మురిసిపోయేవాడిని. అప్పుడే నాకు.. ‘నేను అమ్మాయిని.. అమ్మాయిలాగే ఉండాలి’ అనే కోరిక కలిగింది.దేశీ క్రికెట్లో నేను ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి ప్రసిద్ధ క్రికెటర్లతో ఆడాను. అప్పుడు నా శరీర ధర్మం గురించి బయటపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడిని.ఎందుకంటే.. నాన్నకు క్రికెటర్గా, టీమిండియా కోచ్గా గొప్ప పేరుంది. అందుకే నా విషయాన్ని దాచాల్సి వచ్చింది. క్రికెట్ ప్రపంచం మొత్తం అభద్రతాభావం, మగాళ్ల ఆధిపత్యంతో నిండిపోయింది.దుస్తుల్లేకుండా ఫొటోలు పంపేవారునా గురించి తెలిసిన తర్వాత కొంత మంది మంచి మాటలు చెబుతూ అండగా నిలబడ్డారు. మరికొందరు మాత్రం వేధించారు. అప్పుడప్పుడు దుస్తుల్లేకుండా వారి ఫొటోలు నాకు పంపించేవారు.ఓ వ్యక్తి అయితే అందరి ముందు నన్ను తిట్టేవాడు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి వ్యక్తిగత ఫొటోలు పంపమని అడిగేవాడు. ఇంకో సందర్భంలో ఓ వెటరన్ క్రికెటర్ తన బుద్ధిని బయటపెట్టాడు.పద కార్లో కూర్చో.. నీతో కలిసినా పరిస్థితి గురించి అతడికి చెప్పగానే.. ‘పద కార్లో కూర్చో.. నీతో కలిసి నిద్రించాలని నాకు ఆశగా ఉంది’ అంటూ చెత్త మాటలు మాట్లాడాడు’’ అని అనయా బంగర్ తాను ఎదర్కొన్న చేదు అనుభవాల గురించి పంచుకుంది.చదవండి: ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్ -
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్- సన్రైజర్స్ హైదరాబాద్ (MI vs SRH) మ్యాచ్ సందర్భంగా గురువారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan).. ముంబై జట్టు యజమాని నీతా అంబానీ (Nita Ambani)ని కలిశాడు. ముంబై చేతిలో ఓటమి అనంతరం తన మాజీ ఓనర్ దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించాడు.ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్బదులుగా ఇషాన్ కిషన్ చేతిని పట్టుకుని.. తల్లి మాదిరి ప్రేమపూర్వకంగా నీతా అంబానీ అతడి చెంప నిమిరారు. ఓటమికి కుంగిపోవాల్సిన పనిలేదన్నట్లుగా ఇషాన్ను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాపై మీమ్స్ పేలుతున్నాయి. ‘‘తమ జట్టుతో ప్రయాణించిన మాజీ ఆటగాడి పట్ల నీతా తల్లిలా ప్రేమను కురిపిస్తుంటే.. గోయెంకా మాత్రం ఒక్క మ్యాచ్లో ఓడినా తమ కెప్టెన్లను అందరి ముందే ఉతికి ఆరేస్తాడు.. ఇదే ఈ ఇద్దరికి ఉన్న తేడా’’ అంటూ ముంబై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా 2016లో ఇషాన్ కిషన్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. గుజరాత్ లయన్స్ అతడిని రూ. 35 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయగా.. రెండేళ్ల పాటు అదే జట్టుకు ఆడి 319 పరుగులు చేశాడు.ముంబైతో సుదీర్ఘ అనుబంధంఅయితే, గుజరాత్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ నుంచి కనుమరుగైన తర్వాత ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ను కొనుగోలు చేసింది. 2018 వేలంలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ను సొంత చేసుకోగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ ఏడాది 500కు పైగా పరుగులు సాధించాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2022 వేలంలో అత్యధికంగా రూ. 15.25 కోట్ల ధర పలికాడు.రూ. 11.25 కోట్లకు రైజర్స్కు సొంతంఅయితే, మెగా వేలం-2025కి ముందు ముంబై ఇషాన్ కిషన్ను వదిలేసింది. ఈ క్రమంలో వేలంపాటలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు ఇషాన్ను కొనుక్కుంది. ఇప్పటి వరకు ఐపీఎల్-2025లో విధ్వంసకర శతకం (106 నాటౌట్) బాదడం మినహా ఇషాన్ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఏడు మ్యాచ్లలో కలిపి అతడు సాధించిన పరుగులు 138. నాలుగు వికెట్ల తేడాతో సన్రైజర్స్ ఓటమిఇక ముంబై- సన్రైజర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన కమిన్స్ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు నష్టపోయి 18.1 ఓవర్లలో టార్గెట్ను పూర్తి చేసింది. బంతితో, బ్యాట్తో రాణించిన ముంబై ఆల్రౌండర్ విల్ జాక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఫ్ స్పిన్నర్ అయిన జాక్స్ మూడు ఓవర్ల బౌలింగ్లో కేవలం 14 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ (28), ఇషాన్ కిషన్ (2) రూపంలో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో వన్డౌన్లో వచ్చిన విల్ జాక్స్ 26 బంతుల్లో 36 పరుగులు సాధించాడు.చదవండి: ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో కమిన్స్ బృందం నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో సమిష్టి వైఫల్యం కారణంగా ఈ సీజన్లో ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది.అంతేకాదు.. ఐపీఎల్ తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు సొంత మైదానం వెలుపల ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins)తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.ఇలాంటి వికెట్ మీద కష్టమే..‘‘వాంఖడే వికెట్పై పరుగులు రాబట్టడానికి కష్టపడాల్సి వచ్చింది. బ్యాటింగ్కు వచ్చినప్పుడు సులువుగానే రన్స్ చేయొచ్చనే అనిపించింది. కానీ అనూహ్యంగా పిచ్ పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.ఎక్కడిక్కడ మమ్మల్ని కట్టడి చేశారు. మేము కూడా బాగానే బ్యాటింగ్ చేశాం. ఇలాంటి వికెట్ మీద 160 అనేది మెరుగైన స్కోరే. కానీ మేము ఇంకాస్త బెటర్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఈరోజు మా వాళ్లు పవర్ప్లేలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పోలేదు.మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీనిర్లక్ష్య రీతిలో హిట్టింగ్ కూడా ఆడలేదు. కానీ ఇలా జరిగిపోయింది. మేము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. ఇక మా బౌలింగ్ విషయానికొస్తే డెత్ ఓవర్లలో మా ప్రదర్శన పర్వాలేదనిపించింది.ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన బౌలర్తో 1-2 ఓవర్లు మాత్రమే వేయించగలము అనిపించింది. అందుకే రాహుల్ చహర్ను తీసుకువచ్చాం. ఫైనల్కు చేరుకోవాలంటే హోం గ్రౌండ్ వెలుపల ఎక్కువగా మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది.కానీ దురదృష్టవశాత్తూ ఈ సీజన్లో మేము ఇంత వరకు ఇతర వేదికలపై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాం. పొరపాట్లను సమీక్షించుకుని సానుకూలంగా ముందుకు వెళ్తాం. తదుపరి మా సొంత మైదానంలో మ్యాచ్ ఆడబోతున్నాం. మాకు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది కాబట్టి.. అనుకున్న ఫలితం రాబట్టగలమని నమ్ముతున్నాం’’ అని ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.శైలికి భిన్నంగాకాగా వాంఖడే వేదికగా టాస్ ఓడిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. దూకుడైన తమ శైలికి భిన్నంగా రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40), ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 28) నెమ్మదిగా ఆడారు. ఇషాన్ కిషన్ (2), నితీశ్ రెడ్డి (21 బంతుల్లో 19) పూర్తిగా విఫలం కాగా.. క్లాసెన్ (28 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించాడు.ఆఖర్లో అనికేత్ వర్మ (8 బంతుల్లో 18 నాటౌట్), కమిన్స్ (4 బంతుల్లో 8 నాటౌట్) కాస్త వేగంగా ఆడగా.. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి రైజర్స్ ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీయగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ విల్ జాక్స్ రెండు వికెట్లు కూల్చాడు.పాండ్యా మెరుపులుఇక లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (31), రోహిత్ శర్మ (26) ఫర్వాలేదనిపించగా.. విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్) రాణించారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్ (9 బంతుల్లో 21)తొ మెరిసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. రైజర్స్ కెప్టెన్ కమిన్స్కు మూడు, ఇషాన్ మలింగకు రెండు, హర్షల్ పటేల్కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్కు జాక్ పాట్..?Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
వన్డే వరల్డ్కప్ టోర్నీకి పాక్ అర్హత
లాహోర్: ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్కప్ క్రికెట్ టోర్నమెంట్కు పాకిస్తాన్ జట్టు అర్హత సాధించింది. పాకిస్తాన్లో జరుగుతున్న వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో టాప్–2లో నిలిచిన జట్లకు ప్రపంచకప్ బెర్త్లు లభిస్తాయి. గురువారం థాయ్లాండ్తో జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 87 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 205 పరుగులు చేసింది. సిద్రా అమిన్ (80; 9 ఫోర్లు), కెపె్టన్ సనా ఫాతిమా (62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం థాయ్లాండ్ జట్టు 34.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో సనా ఫాతిమా, నష్రా సంధూ, రమీన్ షమీమ్ 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకుంది. శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో పాకిస్తాన్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయినా ఆ జట్టుకు వచ్చిన ఢోకా లేదు.బంగ్లాదేశ్ గెలిస్తే ఎనిమిది పాయింట్లతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందుతుంది. బంగ్లాదేశ్ ఓడిపోయి... వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ల్లో గెలిస్తే ఈ మూడు జట్లు 6 పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. రన్రేట్ పరంగా బంగ్లాదేశ్కే మరో బెర్త్ దక్కే అవకాశం ఉంది. -
సమఉజ్జీల సమరం!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఆరేసి మ్యాచ్లు ఆడిన ఇరు జట్లు నాలుగింట గెలిచి 8 పాయింట్లతో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. తాజా సీజన్లో ప్రత్యర్థి జట్ల మైదానాల్లో వరుస విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ... బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మాత్రం గెలుపు రుచి చూడలేకపోయింది. మాజీ చాంపియన్లు కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ను వారి వారి సొంత మైదానాల్లో ఓడించిన ఆర్సీబీ... బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. మరోవైపు గత మ్యాచ్లో 111 పరుగులే చేసినా... బౌలింగ్ బలంతో కోల్కతా నైట్రైడర్స్ను నిలువరించిన పంజాబ్ కింగ్స్ మంచి ఊపు మీద ఉంది. పంజాబ్ స్పిన్నర్లను బెంగళూరు బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. చహల్ మ్యాజిక్ కీలకం... శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య రూపంలో ప్రతిభావంతులైన ఓపెనర్లు అందుబాటులో ఉండగా... అయ్యర్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్తో మిడిలార్డర్ మెరుగ్గా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ ఫామ్ను ఐపీఎల్లో సైతం కొనసాగిస్తున్న అయ్యర్... తనకు అనువైన రోజు భారీ స్కోర్లతో చెలరేగుతున్నాడు. అదే సమయంలో నిలకడ కొనసాగించలేకపోతున్నాడు. మ్యాక్స్వెల్ బౌలింగ్లో అదనపు స్పిన్నర్గా సేవలందిస్తున్నా... బ్యాటర్గా మాత్రం అతడి స్థాయి ప్రదర్శన ఇంకా రాలేదు. బౌలింగ్లోనూ పంజాబ్కు విభిన్న ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మార్కో యాన్సెన్, అర్ష్ దీప్ సింగ్, జేవియర్ బార్ట్లెట్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. గత మ్యాచ్లో కోల్కతాపై 4 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన పంజాబ్ ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కీలకం కానున్నాడు. బెంగళూరు పిచ్పై అతడికి మంచి అవగాహన ఉండటం పంజాబ్కు అదనపు ప్రయోజనం చేకూర్చనుంది.చిన్నస్వామిలో బోణీ కొట్టేనా... ఈ సీజన్ ఆరంభం నుంచి మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రధానంగా బ్యాటర్లపైనే ఆధారపడుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ రూపంలో ఆ జట్టుకు ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్తో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే పవర్ప్లేతో పాటు స్లాగ్ ఓవర్లలో ధాటిగా ఆడుతున్న ఆర్సీబీ... మధ్య ఓవర్లలో మాత్రం సులువుగా పరుగులు రాబట్టలేకపోతోంది. ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బెంగళూరు బ్యాటర్లు తడబడుతున్నారు. గుజరాత్ స్పిన్నర్ సాయికిషోర్, ఢిల్లీ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ బౌలింగ్ ఆడలేక ఇబ్బంది పడ్డారు. బౌలింగ్లో హాజల్వుడ్, యశ్ దయాళ్, భువనేశ్వర్ కుమార్ పేస్ బారం మోయనుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. 33 ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖిగా 33 సార్లు తలపడ్డాయి. 16 మ్యాచ్ల్లో బెంగళూరు, 17 మ్యాచ్ల్లో పంజాబ్ విజయం సాధించాయి. 2023లో పంజాబ్తో ఆడిన ఏకైక మ్యాచ్లోనూ, గత ఏడాది పంజాబ్తో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ బెంగళూరు జట్టే గెలిచింది. పంజాబ్పై బెంగళూరు అత్యధిక స్కోరు 241 కాగా... అత్యల్ప స్కోరు 84. బెంగళూరుపై పంజాబ్ అత్యధిక స్కోరు 232 కాగా, అత్యల్ప స్కోరు 88. తుది జట్లు (అంచనా) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హాజల్వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ. పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, యాన్సెన్, జేవియర్, అర్ష్ దీప్ , స్టొయినిస్, చాహల్. -
రైజర్స్ ఓటమి బాట
ఐదు రోజుల క్రితం అద్భుత ఆటతో 245 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు సమష్టి వైఫల్యంతో మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు వరుస ఓటముల తర్వాత గత మ్యాచ్లో గెలిచిన జట్టు ఖాతాలో మళ్లీ ఓటమి చేరింది. బ్యాటింగ్లో మెరుపులు కనిపించక టీమ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత ఛేదనలో ముంబై ఇండియన్స్ కొంత తడబడినా... మరో 11 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకోవడంలో సఫలమైంది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన పోరులో ముంబై 4 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ద మ్యాచ్’ విల్ జాక్స్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ర్యాన్ రికెల్టన్ (23 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. కనిపించని దూకుడు... ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్కు అదృష్టం కలిసొచ్చింది. దీపక్ చహర్ వేసిన బంతి అభిక్ బ్యాట్ ఎడ్జ్ను తీసుకొని స్లిప్ వైపు దూసుకెళ్లగా విల్ జాక్స్ దానిని అందుకోలేకపోయాడు. అనంతరం అతను కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. మరోవైపు ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) బ్యాటింగ్లో సహజమైన ధాటి కనిపించలేదు. చహర్ ఓవర్లో అభిషేక్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఒక్కసారిగా ముంబై బౌలర్ల ఆధిపత్యం మొదలైంది. కట్టుదిట్టమైన బంతులతో వారు రైజర్స్ను నిలువరించారు. తొలి వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యం (45 బంతుల్లో) తర్వాత అభిషేక్ను పాండ్యా వెనక్కి పంపాడు. 24 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చినా... నోబాల్తో బతికిపోయిన హెడ్ దానిని వాడుకోలేకపోయాడు. ఇషాన్ కిషన్ (2) మళ్లీ విఫలం కాగా, నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 19; 1 ఫోర్) మరోసారి ప్రభావం చూపలేకపోయాడు. పవర్ప్లే ముగిసిన తర్వాత 7–17 ఓవర్ల మధ్యలో రైజర్స్ 5 ఫోర్లు మాత్రమే కొట్టగా... ఇన్నింగ్స్లో 17వ ఓవర్ వరకు ఒక్క సిక్స్ కూడా రాలేదు. చివర్లో 2 ఓవర్ల కారణంగా (మొత్తం 43 పరుగులు) రైజర్స్ స్కోరు 160 దాటింది. చహర్ వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ వరుసగా 6, 4, 4, 6 బాదగా... పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో అనికేత్ 2 సిక్స్లు, కమిన్స్ ఒక సిక్స్ కొట్టారు. కీలక భాగస్వామ్యం.. ఎప్పటిలాగే ఫటాఫట్ షాట్లతో ఛేదనను మొదలు పెట్టిన రోహిత్ శర్మ (16 బంతుల్లో 26; 3 సిక్స్లు) మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు సిక్సర్లు బాదాడు. మలింగ ఓవర్లో రికెల్టన్ మూడు ఫోర్లు కొట్టగా, 4 పరుగుల వద్ద జాక్స్ ఇచ్చిన క్యాచ్ను హెడ్ వదిలేశాడు. రికెల్టెన్ అవుటైన తర్వాత జాక్స్, సూర్యకుమార్ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మూడో వికెట్కు 29 బంతుల్లో 52 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరిద్దరు ఏడు పరుగుల తేడాతో వెనుదిరిగినా... కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి గెలుపు దిశగా నడిపించారు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) (సబ్) బావా (బి) పాండ్యా 40; హెడ్ (సి) సాంట్నర్ (బి) జాక్స్ 28; ఇషాన్ కిషన్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 2; నితీశ్ కుమార్ రెడ్డి (సి) తిలక్ వర్మ (బి) బౌల్ట్ 19; క్లాసెన్ (బి) బుమ్రా 37; అనికేత్ వర్మ (నాటౌట్) 18; కమిన్స్ (నాటౌట్) 18; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–59, 2–68, 3–82, 4–113, 5–136. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–47–0, బౌల్ట్ 4–0–29–1, బుమ్రా 4–0–21–1, విల్ జాక్స్ 3–0–14–2, హార్దిక్ పాండ్యా 4–0–42–1, సాంట్నర్ 1–0–8–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) హెడ్ (బి) హర్షల్ పటేల్ 31; రోహిత్ (సి) హెడ్ (బి) కమిన్స్ 26; విల్ జాక్స్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 36; సూర్యకుమార్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 26; తిలక్ వర్మ (నాటౌట్) 21; పాండ్యా (సి) ఇషాన్ కిషన్ (బి) మలింగ 21; నమన్ (ఎల్బీ) (బి) మలింగ 0; సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–32, 2–69, 3–121, 4–128, 5–162, 6–162. బౌలింగ్: షమీ 3–0–28–0, కమిన్స్ 4–0–26–3, ఇషాన్ మలింగ 4–0–36–2, అన్సారీ 3.1–0–35–0, హర్షల్ 3–0–31–1, రాహుల్ చహర్ 1–0–9–0. ఐపీఎల్లో నేడుబెంగళూరు X పంజాబ్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: కలిసి కట్టుగా రాణించిన ముంబై.. చిత్తుగా ఓడిన సన్రైజర్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది (6 వికెట్లు కోల్పోయి). ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. -
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ తమ సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. సన్రైజర్స్తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 3 సిక్సర్లు బాదిన రోహిత్ వాంఖడే స్టేడియంలో (ఐపీఎల్లో) ఇప్పటివరకు 102 సిక్సర్లు కొట్టాడు. ఒకే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, డివిలియర్స్ సరసన చేరాడు. ఈ ముగ్గురు కూడా ఆర్సీబీకి ఆడుతూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 130 సిక్సర్లు బాదగా.. గేల్ 127, డివిలియర్స్ 118 సిక్సర్లు కొట్టారు. ఐపీఎల్లో ఈ ముగ్గురితో పాటు రోహిత్ మాత్రమే ఒకే వేదికలో సిక్సర్ల సెంచరీని పూర్తి చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఆదిలో విధ్వంసం సృష్టించి, ఆతర్వాత ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ 16 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేసి తొలి వికెట్గా వెనుదిరిగాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/2గా ఉంది. రోహిత్ ఔటయ్యాక మరో ఓపెనర్ రికెల్టన్ (31) కూడా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం విల్ జాక్స్ (14), సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ముంబై గెలవాలంటే 66 బంతుల్లో మరో 81 పరుగులు చేయాలి. -
IPL 2025: గ్లెన్ ఫిలిప్స్కు ప్రత్యామ్నాయ ఆటగాడు అతడే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో టేబుల్ సెకెండ్ టాపర్గా ఉన్న గుజరాత్ టైటాన్స్ తమ గాయపడిన ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా శ్రీలంక పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్ దసున్ షనకను ఎంపిక చేసుకుంది. షనక 2023 సీజన్లో కూడా గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్ మెగా వేలంలో షనక అన్ సోల్డ్గా మిగిలిపోయినప్పటికీ.. ఫిలిప్స్ గాయపడటంతో అతనికి అవకాశం వచ్చింది. షనక త్వరలోనే గుజరాత్ టైటాన్స్తో జతకడతాడని సమాచారం. షనక 2023 సీజన్లో గుజరాత్ తరఫున 3 మ్యాచ్లు ఆడి కేవలం 26 పరుగులే చేశాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన షనకకు ఆ సీజన్లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. 2023 సీజన్లో గుజరాత్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో రన్నరప్గా నిలిచింది. షనక ఈ ఏడాది ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (దుబాయ్) టైటిల్ గెలిచిన దుబాయ్ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 33 ఏళ్ల కుడి చేతి వాటం ఆల్రౌండర్ అయిన షనక శ్రీలంక తరఫున 6 టెస్ట్లు, 71 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. షనక టెస్ట్ల్లో ఓ హాఫ్ సెంచరీ 13 వికెట్లు.. వన్డేల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు, 27 వికెట్లు.. టీ20ల్లో 5 హాఫ్ సెంచరీలు, 33 వికెట్లు తీశాడు. షనక వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. షనక తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో గుజరాత్ తరఫునే మూడు మ్యాచ్లు ఆడాడు.ఫిలిప్స్ విషయానికొస్తే.. ఈ సీజన్లోనే సన్రైజర్స్ నుంచి గుజరాత్కు వచ్చిన ఫిలిప్స్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఏప్రిల్ 6న సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఫిలిప్స్ గాయపడ్డాడు. గాయం తీవ్రమైంది కావడంతో ఫిలిప్స్ సీజన్ మొత్తానికే దూరమ్యాడు.గుజరాత్ ఈ సీజన్ను నిదానంగా ఆరంభించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి, రెండింట ఓటమిపాలైంది. గుజరాత్ తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 19న అహ్మదాబాద్లో జరుగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడి ఐదింట గెలిచింది. ఆర్సీబీ, పంజాబ్ చెరో 6 మ్యాచ్లు ఆడి తలో 4 విజయాలతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. లక్నో, కేకేఆర్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్, సీఎస్కే వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో నిలిచాయి. -
MI VS SRH: రికార్డుల్లోకెక్కిన ట్రావిస్ హెడ్.. గేల్, మ్యాక్స్వెల్ కంటే వేగంగా..!
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 10 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 75/2గా ఉంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), ఇషాన్ కిషన్ (3 బంతుల్లో 2) ఔట్ కాగా.. ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 25; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (5 బంతుల్లో 3) క్రీజ్లో ఉన్నారు. ఇప్పటివరకు ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సన్రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీపక్ చాహర్ 3 ఓవర్లలో 26 పరుగులు.. బౌల్ట్ ఓ ఓవర్లో 10 పరుగులు.. బుమ్రా 2 ఓవర్లలో 10, విల్ జాక్స్ 2 ఓవర్లలో 12 (ఇషాన్ వికెట్), హార్దిక్ 2 ఓవర్లలో 17 పరుగులిచ్చారు (అభిషేక్ వికెట్). ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అభిషేక్, హెడ్లకు మూడు లైఫ్లు లభించాయి. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్, హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో హెడ్ క్యాచ్ ఔటైనప్పటికీ నో బాల్ కావడంతో బ్రతికిపోయాడు.1000 పరుగుల క్లబ్లో హెడ్ఈ మ్యాచ్లో హెడ్ ఐపీఎల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. హెడ్ కేవలం 575 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో వేగవంతమైన క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్లో ఆండ్రీ రసెల్ మాత్రమే హెడ్ కంటే వేగంగా 1000 పరుగులు పూర్తి చేశాడు. రసెల్ 545 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. హెడ్.. విధ్వంసకర వీరులు క్రిస్ గేల్ (615), మ్యాక్స్వెల్ (610) కంటే వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.ఐపీఎల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు.. 545 - ఆండ్రీ రస్సెల్575 - ట్రావిస్ హెడ్*594 - హెన్రిచ్ క్లాసెన్604 - వీరేంద్ర సెహ్వాగ్610 - గ్లెన్ మాక్స్వెల్615 - క్రిస్ గేల్617 - యూసుఫ్ పఠాన్617 - సునీల్ నరైన్ -
IPL 2025: రాయల్స్తో మ్యాచ్.. డకౌటైనా రికార్డుల్లోకెక్కిన కరుణ్ నాయర్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 16) జరిగిన ఆసక్తికర పోరులో రాజస్థాన్ రాయల్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఆటగాడు కరుణ్ నాయర్ డకౌటైనా ఓ అరుదైన రికార్డును సెట్ చేశాడు. ఐపీఎల్లో ఐదు టై అయినా మ్యాచ్ల్లో భాగమైన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.జస్ప్రీత్ బుమ్రా, క్రిస్ గేల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పోలార్డ్, కేఎల్ రాహుల్, నితీశ్ రాణా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో నాలుగు టై మ్యాచ్ల్లో భాగంగా ఉన్నారు. వీరందరితో పోలిస్తే కరుణ్ అతి తక్కువ మ్యాచ్లు (78) ఆడి అత్యధికంగా ఐదు టై మ్యాచ్ల్లో భాగమైన ఆటగాడిగా నిలిచాడు.ఐపీఎల్లో కరుణ్ భాగమైన టై మ్యాచ్లు..2013లో ఆర్సీబీ వర్సెస్ సన్రైజర్స్2014లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ 2014లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్2015లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ2025లో ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ఢిల్లీ, రాయల్స్ తాజా మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (49), కేఎల్ రాహుల్ (38), ట్రిస్టన్ స్టబ్స్ (34 నాటౌట్), అక్షర్ పటేల్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్ 2, తీక్షణ, హసరంగ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ చేసినన్ని పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. రాయల్స్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (51), సంజూ శాంసన్ (31 రిటైర్డ్ హర్ట్), నితీశ్ రాణా (51) రాణించినా చివరి ఓవర్లో రాయల్స్ తడబడింది. స్టార్క్ 18, 20వ ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్స్ గెలుపును అడ్డుకున్నాడు. చివరి బంతికి రాయల్స్ గెలుపుకు 2 పరుగులు అవసరం కాగా.. జురెల్ ఒక్క పరుగు మాత్రమే తీసి రనౌటయ్యాడు. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైందిసూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. స్టార్క్ ఇక్కడ కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 11 పరుగులు మాత్రమే చేసింది. ఇద్దరు ఆటగాళ్లు ఔట్ కావడంతో రాయల్స్ కేవలం 5 బంతులు మాత్రమే ఆడగలిగింది. నాలుగు, ఐదు బంతుల్లో రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ రనౌటయ్యారు.12 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. నాలుగో బంతికే లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది. ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ బరిలోకి దిగారు. రాహుల్ తొలి బంతికి 2, రెండో బంతికి బౌండరీ, మూడో బంతికి సింగిల్ తీయగా.. స్టబ్స్ నాలుగో బంతికి సిక్సర్ బాది ఢిల్లీని గెలిపించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది 15వ టై మ్యాచ్ కాగా.. 2022 నుంచి ఇదే మొదటిది. -
IPL 2025: సన్రైజర్స్పై ముంబై ఇండియన్స్ విజయం
సన్రైజర్స్పై ముంబై ఇండియన్స్ విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది (6 వికెట్ల నష్టానికి). ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై14.3వ ఓవర్- 128 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్లో అన్సారీకి క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (36) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై12.4వ ఓవర్- 121 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్లో జీషన్ అన్సారీకి క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (26) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/29 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/2గా ఉంది. రోహిత్ ఔటయ్యాక మరో ఓపెనర్ రికెల్టన్ (31) కూడా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం విల్ జాక్స్ (14), సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ముంబై గెలవాలంటే 66 బంతుల్లో మరో 81 పరుగులు చేయాలి.హ్యాట్రిక్ ఫోర్లతో రఫ్ఫాడించిన రికెల్టన్ఎషాన్ మలింగ బౌలింగ్లో (6వ ఓవర్) రికెల్టన్ హ్యాట్రిక్ ఫోర్లతో రఫ్ఫాడించాడు. 5.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 54/1. రికెల్టన్ 21, విల్ జాక్స్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్163 పరుగుల లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఔటయ్యాడు. రోహిత్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో హెడ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 3.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 32/1గా ఉంది. రికెల్టన్ (5), జాక్స్ క్రీజ్లో ఉన్నారు.సత్తా చాటిన ముంబై బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన సన్రైజర్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు. 18.1 ఓవర్ల తర్వాత 136/5అనికేత్ వర్మ (1), కమిన్స్నత్తనడకన సాగుతున్న ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ నిదానంగా బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు ఇన్నింగ్స్ నత్తనడకను తలపిస్తుంది. అభిషేక్ (40), హెడ్ (28), ఇషాన్ (2) ఔట్ కాగా.. నితీశ్ (14), క్లాసెన్ (4) క్రీజ్లో ఉన్నారు. 14 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 95/3గా ఉంది. మూడో వికెట్ డౌన్.. హెడ్ ఔట్11.1వ ఓవర్- 82 పరుగుల వద్ద సన్రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. అప్పటికే రెండు లైఫ్లు లభించిన హెడ్ (28) విల్ జాక్స్ బౌలింగ్లో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన సన్రైజర్స్.. ఇషాన్ కిషన్ ఔట్8.4వ ఓవర్- 68 పరుగుల వద్ద సన్రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. విల్ జాక్స్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ (2) స్టంపౌటయ్యాడు. హెడ్ (22), నితీశ్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సన్రైజర్స్.. అభిషేక్ ఔట్7.3వ ఓవర్-సన్రైజర్స్ 59 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రాజ్ బవాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (40) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 65/1గా ఉంది. హెడ్ (20), ఇషాన్ కిషన్ (1) క్రీజ్లో ఉన్నారు. 7 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 53/0అభిషేక్ 36, ట్రవిస్ హెడ్ 14కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ముంబై బౌలర్లుటాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంది. తొలి ఓవర్లోనే ఓపెనర్లు అభిషేక్, హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తొలి నాలుగు ఓవర్లు చాహర్, బౌల్ట్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు కేవలం బాదడమే లక్ష్యంగా పెట్టుకుని సఫలం కాలేకపోతున్నారు. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/0గా ఉంది. అభిషేక్ 20, హెడ్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఏడులో, ఎస్ఆర్హెచ్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.తుది జట్లు..ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, అశ్వని కుమార్, రాజ్ బావా, రాబిన్ మింజ్సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగసన్రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్లు: అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్ -
పాకిస్తాన్ సూపర్ లీగ్లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్తో పోలిస్తే..!
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ ఐపీఎల్కు పోటీగా జరుగుతుంది. ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కాగా.. పీఎస్ఎల్ ఏప్రిల్ 11న ప్రారంభమైంది. ఐపీఎల్తో పోటీపడే క్రమంలో ఈ సీజన్లో పీఎస్ఎల్ ఆటగాళ్ల పారితోషికాలకు భారీగా పెంచింది.గతంలో పీఎస్ఎల్లో విదేశీ ఆటగాళ్లు 2 కోట్లలోపు (భారత కరెన్సీలో), పాక్ ఆటగాళ్లు కోటిన్నర లోపు పారితోషికాన్ని అందుకున్నారు. అయితే ఈ సీజన్లో డేవిడ్ వార్నర్ అత్యధికంగా 2.57 కోట్ల రూపాయలను పారితోషికంగా పొంది రికార్డు సృష్టించాడు. పీఎస్ఎల్ 2025లో వార్నర్దే అత్యధిక పారితోషికం. వార్నర్ తర్వాత అత్యధికంగా డారిల్ మిచెల్ రూ. 1.88 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడు. వార్నర్, మిచెల్ తర్వాత అత్యధిక పారితోషికాన్ని పాక్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, ఫకర్ జమాన్, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్, నసీం షా, మొహమ్మద్ రిజ్వాన్, మాథ్యూ షార్ట్, షాదాబ్ ఖాన్ అందుకుంటున్నారు. వీరింతా భారత కరెన్సీలో కోటి 88 లక్షలను పారితోషికంగా అందుకుంటున్నారు. ఈ సారి పీఎస్ఎల్లో స్థానిక ఆటగాళ్లకంటే విదేశీ ఆటగాళ్లకే అధిక పారితోషికం ఇవ్వడం విశేషం.భారత్లో జరిగే ఐపీఎల్తో పోలిస్తే.. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆటగాళ్లకు లభించే పారితోషికం నామమాత్రమే. ఐపీఎల్-2025లో అత్యధిక ధర పొందిన రిషబ్ పంత్ పారితోషికంతో పోలిస్తే వార్నర్ పారితోషికం 10 శాతం లోపే. పంత్ను ఈ సీజన్లో మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో పంత్ అందుకుంటున్న మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం. వార్నర్ తొలుత ఐపీఎల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసి, అక్కడ ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో పీఎస్ఎల్వైపు మళ్లాడు. ఈ సీజన్ వేలంలో అతన్ని కరాచీ కింగ్స్ సొంతం చేసుకుని కెప్టెన్సీ కూడా అప్పగించింది.పాకిస్తాన్ సూపర్ లీగ్లో అత్యధిక పారితోషికాలు పొందుతున్న ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్)- 2.57 కోట్లు (భారత కరెన్సీలో)డారిల్ మిచెల్ (లాహోర్ ఖలందర్స్)- 1.88 కోట్లుబాబర్ ఆజమ్ (పెషావర్ జల్మీ)- 1.88 కోట్లుఫకర్ జమాన్ (లాహోర్ ఖలందర్స్)- 1.88 కోట్లుషాహీన్ అఫ్రిది (లాహోర్ ఖలందర్స్)- 1.88 కోట్లుసైమ్ అయూబ్ (పెషావర్ జల్మీ)- 1.88 కోట్లునసీం షా (ఇస్లామాబాద్ యునైటెడ్)- 1.88 కోట్లుమొహమ్మద్ రిజ్వాన్ (ముల్తాన్ సుల్తాన్స్)- 1.88 కోట్లుమాథ్యూ షార్ట్ (ఇస్లామాబాద్ యునైటెడ్)- 1.88 కోట్లుషాదాబ్ ఖాన్ (ఇస్లామాబాద్ యునైటెడ్)- 1.88 కోట్లుఐపీఎల్ 2025లో టాప్-5 పారితోషికాలు.. రిషబ్ పంత్ (లక్నో)- 27 కోట్లుశ్రేయస్ అయ్యర్ (పంజాబ్)- 26.75 కోట్లువెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)- 23.75 కోట్లుఅర్షదీప్ సింగ్ (పంజాబ్)- 18 కోట్లుచహల్ (పంజాబ్)- 18 కోట్లు -
అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్కు జాక్ పాట్..?
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ జాక్ పాట్ కొట్టనున్నాడని తెలుస్తుంది. త్వరలో బీసీసీఐ ప్రకటించబోయే సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కించుకోనున్నాడని సమాచారం. అభిషేక్తో పాటు టీమిండియా యువ ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోనున్నారని తెలుస్తుంది. పై నలుగురికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ల్లో గ్రేడ్-సి హోదా దక్కవచ్చు. ఈ నలుగురికి గ్రేడ్-సి దక్కితే అనేక వెసలుబాటులతో పాటు ఏడాదికి రూ. కోటి వార్షిక వేతనం లభిస్తుంది.బీసీసీఐ స్టాండర్డ్ పాలసీ ప్రకారం.. ఓ ఆటగాడు నిర్దిష్ట వ్యవధిలో (కాంట్రాక్ట్ ప్రకటించే ముందు ఏడాదిలో అక్టోబర్ నుండి సెప్టెంబర్ వరకు) కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడి ఉంటే సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్-సిలో చేర్చబడతారు. అభిషేక్ నిర్దిష్ట వ్యవధిలో టీమిండియా తరఫున 12 టీ20లు ఆడాడు. మొత్తంగా అతను భారత్ తరఫున 17 టీ20లు ఆడాడు.నితీశ్ విషయానికొస్తే.. 21 ఏళ్ల ఈ ఆంధ్ర ఆల్ రౌండర్ భారత్ తరఫున ఐదు టెస్టులు, నాలుగు టీ20లు ఆడాడు. నిర్దిష్ట వ్యవధిలోనే నితీశ్ ఈ మ్యాచ్లను ఆడాడు. నితీశ్ గతేడాది చివర్లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్ట్ల్లో పాల్గొన్నాడు. ఆ సిరీస్లో సత్తా చాటడంతోనే నితీశ్ రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు.హర్షిత్ రాణా విషయానికొస్తే.. ఇతడు సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు ఆడాల్సిన మ్యాచ్లను ఆడనప్పటికీ, బీసీసీఐ ఇతని విషయంలో ఉదారంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది. రాణా టీమిండియా తరఫున కేవలం రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టీ20 మాత్రమే ఆడాడు. రాణా.. మూడు ఫార్మాట్లలో దేనిలోనూ విడిగా ప్రమాణాలను నెరవేర్చలేదు. కానీ అతనికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.వరుణ్ చక్రవర్తి విషయానికొస్తే.. ఇతడు భారత్ తరఫున నాలుగు వన్డేలు, 18 టీ20లు ఆడి బీసీసీఐ కాంట్రాక్ట్ పొందేందుకు అర్హుడిగా ఉన్నాడు.పై నలుగురితో సహా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకునే వారిలో మరో పెద్ద పేరు ఉండనుంది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో రఫ్ఫాడించిన శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శ్రేయస్కు ఏ- గ్రేడ్ దక్కే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించవచ్చు.ప్రస్తుతం బీసీసీఐ కాంట్రాక్ట్లు కలిగిన ఆటగాళ్లు..గ్రేడ్-ఏ ప్లస్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.గ్రేడ్-ఏ: అశ్విన్, మొహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా.గ్రేడ్-బి: సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.గ్రేడ్-సి: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పాటీదార్. -
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఐపీఎల్ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్న వేల పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. యూరోపియన్ టీ10 లీగ్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్లో ఇటలీకి చెందిన జైన్ నఖ్వీ కేవలం 26 బంతుల్లోనే శతకొట్టాడు. పొట్టి క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉండేది. సాహిల్ 2024లో సైప్రస్తో జరిగిన టీ20 మ్యాచ్లో 27 బంతుల్లో సెంచరీ చేశాడు. సాహిల్ తర్వాత వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాళ్లు ఉర్విల్ పటేల్, అభిషేక్ శర్మ పేరిట సంయుక్తంగా ఉంది. ఉర్విల్, అభిషేక్ తలో 28 బంతుల్లో (టీ20ల్లో) సెంచరీలు చేశారు. వీరి తర్వాత అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 2013 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి ఆడుతూ పూణే వారియర్స్పై 30 బంతుల్లో శతక్కొట్టాడు.టాప్-10 ఫాస్టెస్ట్ సెంచరీలు..జైన్ నఖ్వీ- 26 బంతుల్లోసాహిల్ చౌహాన్- 27ఉర్విల్ పటేల్- 28అభిషేక్ శర్మ- 28క్రిస్ గేల్- 30రిషబ్ పంత్- 32లుబ్బే- 33నికోల్ లాఫ్టన్- 33సికందర్ రజా- 33ఆండ్రూ సైమండ్స్- 34నమ్మశక్యంకాని స్ట్రైక్రేట్తో..నఖ్వీ ఇన్నింగ్స్ విషయానికొస్తే.. ఈ ఇన్నింగ్స్లో అతను మొత్తం 37 బంతులు ఎదుర్కొని నమ్మశక్యంకాని 432.43 స్ట్రైక్ రేట్తో 24 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 160 పరుగులు చేశాడు. నఖ్వీ ఇన్నింగ్స్లో మరో విశేషమేమిటంటే.. రెండు సార్లు ఒకే ఓవర్లో అతను వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు. టీ20ల్లో యువరాజ్ సింగ్, హజ్రతుల్లా జజాయ్, కీరన్ పోలార్డ్, తిసారా పెరీరా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన వారిలో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. యూరోపియన్ టీ10లో లీగ్లో భాగంగా టీమ్ సివిడేట్, మార్ఖోర్ మిలానో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 23 ఏళ్ల జైన్ నఖ్వీ మార్ఖోర్ మిలానో తరఫున ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మార్ఖోర్ మిలానో.. జైన్ నఖ్వీ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడటంతో 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. మార్ఖోర్ మిలానో ఇన్నింగ్స్లో జైన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సివిడేట్ జట్టు 9 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటై 104 పరుగుల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. సివిడేట్ తరపున షాబాజ్ మసూద్ అత్యధికంగా 34 పరుగులు చేశాడు.నఖ్వీ కెరీర్ ఇలా..జైన్ నఖ్వీ అంతర్జాతీయ క్రికెట్లో ఇటలీ తరఫున ఆడుతున్నాడు. అతను ఇప్పటివరకు 4 టీ20 మ్యాచ్లు ఆడి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. -
PSLతో పోలికా?.. ఐపీఎల్కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పోలుస్తూ పాక్ రిపోర్టర్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ రెండింటిలో గొప్ప లీగ్ ఏదో చెప్పాలంటూ అతడు అడిగిన ప్రశ్నకు లాహోర్ ఖలందర్స్ స్టార్, ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్లోనూ సత్తాకాగా ప్రపంచంలోని అత్యంత ఆదరణ పొందిన, ఖరీదైన టీ20 లీగ్గా ఐపీఎల్ వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో భాగమైన ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు సౌతాఫ్రికా టీ20 లీగ్లోనూ జట్లను కొనుగోలు చేసి.. అక్కడా సత్తా చాటుతున్నాయి. ఇక ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.ఐపీఎల్తో పోటీకి దిగిపదిహేడేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఐపీఎల్కు ఇంత వరకు ప్రపంచంలోని ఏ టీ20 లీగ్ కూడా పోటీ ఇవ్వలేకపోతోంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాత్రం ఈసారి ఐపీఎల్తో ఢీకొట్టింది. మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025 మే 25న ముగియనుండగా.. పీఎస్ఎల్ను ఏప్రిల్ 11- మే 18 వరకు నిర్వహించేందుకు పీసీబీ షెడ్యూల్ ఖరారు చేసింది.ఫలితంగా.. ఐపీఎల్తో పోటీ కారణంగా ప్రేక్షక ఆదరణ లేక పీఎస్ఎల్ వెలవెలబోతోంది. అయితే, కొంత మంది పాక్ జర్నలిస్టులు మాత్రం ఐపీఎల్తో పీఎస్ఎల్ను పోలుస్తూ విదేశీ ఆటగాళ్లను తికమకపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా లాహోర్ ఖలందర్ స్టార్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ను ఓ రిపోర్టర్.. ప్రపంచంలోని ఇతర లీగ్లతో పోలిస్తే పీఎస్ఎల్ స్థానమేమిటి? అంటూ ప్రశ్నించారు.PSLతో పోలికా?.. ఐపీఎల్కు ఏదీ సాటి రాదుఈ ప్రశ్నను అర్థం చేసుకున్న సామ్ బిల్లింగ్స్.. ‘‘నా నుంచి మీరేదో చిలిపి సమాధానం ఆశిస్తున్నారు.. అంతే కదా!.. ప్రపంచంలో ఎక్కడైనా ప్రేక్షకులను కలిగి ఉండటం క్రికెట్కు ఉన్న ప్రత్యేకత. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. ఇలా ఎక్కడ క్రికెట్ ఆడినా అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోవడం క్రికెటర్లుగా మా బాధ్యత.కాబట్టి వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న లీగ్లను పోల్చి చూస్తూ.. ర్యాంకులు ఇవ్వడం కాస్త కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇతర లీగ్లతో పోలిస్తే.. ఐపీఎల్ ప్రీమియర్ కాంపిటిషన్ అన్న మాట వాస్తవం. ఐపీఎల్తో పోలిస్తే ప్రతి లీగ్.. దానికంటే వెనుబడి ఉన్నట్లే.ఇంగ్లండ్లో మేము.. ఇక్కడ పీఎస్ఎల్ మాదిరే ప్రపంచంలోని రెండో అత్యుత్తమ టీ20 లీగ్గా పేరొందాలనే ప్రయత్నాలు చేస్తున్నాము. ఆస్ట్రేలియాకు చెందిన బిగ్బాష్ లీగ్ పరిస్థితి కూడా ఇంతే.ఏదేమైనా ప్రతీ లీగ్ దానికదే ప్రత్యేకం. నేనైతే ప్రపంచంలోని అత్యుత్తమ లీగ్లలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నా’’ అని సామ్ బిల్లింగ్ పేర్కొన్నాడు. పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ కచ్చితంగా బెటర్ అంటూ పరోక్షంగా తన మనసులో మాటను వెల్లడించాడు.గతంలో ఐపీఎల్లో ఆడిన బిల్లింగ్స్కాగా 33 ఏళ్ల సామ్ బిల్లింగ్స్ 2015-16లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున పీఎస్ఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అంటే.. 2023 నుంచి లాహోర్ ఖలందర్స్కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ ఆడిన బిల్లింగ్స్.. 2018, 2019లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. చివరగా 2022లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: Rohit Sharma: కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం -
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆవిర్భావం తర్వాత దేశంలో ఎన్నో స్థానిక టీ20 లీగ్లు పుట్టుకొచ్చాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TPL), ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL), కర్ణాటక ప్రీమియర్ లీగ్, పంజాబ్ ప్రీమియర్ లీగ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఇందులో భాగం.ఇక ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కూడా గత రెండు సీజన్లుగా టీ20 ముంబై లీగ్ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మే 26- జూన్ 5 వరకు మూడో ఎడిషన్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే, ఈ సీజన్ను మరింత ప్రత్యేకంగా నిలిపేందుకు ఎంసీఏ మాస్టర్ ప్లాన్ వేసింది. దేశవాళీ క్రికెట్లో ముంబైకి టీమిండియా స్టార్లందరినీ రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంది.సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సహా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే, శివం దూబే, పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్ తదితరులకు టీ20 ముంబై లీగ్లో తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా ఎంసీఏ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.కాగా ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత టీమిండియా టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ టూర్కి ఎంపిక కాని ముంబై సభ్యులంతా స్థానిక టీ20 లీగ్లో పాల్గొనాలని ఎంసీఏ వారికి స్పష్టం చేసినట్లు సమాచారం.అదనంగా రూ. 15 లక్షలు ఈ విషయం గురించి ఎంసీఏ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘ముంబైకి ఆడే టీమిండియా ఆటగాళ్లందరూ ముంబై టీ20 లీగ్లో ఆడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ లీగ్ మొదలవుతుంది. కాబట్టి.. టీమిండియా తరఫున విధుల్లో లేని వారు తప్పకుండా ఇందులో పాల్గొనాలి.ఒకవేళ గాయాల బెడదతో బాధపడుతూ ఉంటే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ లీగ్లో పాల్గొనే భారత జట్టు ఆటగాళ్లకు వేలం ఫీజుకు అదనంగా రూ. 15 లక్షలు ఇవ్వాలని ఎంసీఏ నిర్ణయించింది. త్వరలోనే ఆటగాళ్ల కనీస ధరను నిర్ణయిస్తాం.ఈ సీజన్లో ముంబై టీ20 లీగ్కు అనూహ్య స్పందన వస్తోంది. 2800కి పైగా ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ముంబైకర్లకు క్రికెట్ అంటే ఎంత మక్కువో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. టీమిండియాకు భవిష్యత్ తారలను అందించేందుకు మేము చేసే ప్రయత్నం తప్పక ఫలిస్తుంది’’ అని సదరు ఎంసీఏ అధికారి పేర్కొన్నారు. కాగా.. వీలైతే రోహిత్ శర్మను కూడా రంగంలోకి దింపి ఈ లీగ్కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే యోచనలో ఎంసీఏ ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: Rohit Sharma: కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం