పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ కెరీర్లో మరో ప్రత్యేక రికార్డు సాధించాడు. 2026 ఎడిషన్లో భాగంగా నిన్న (మే 11) ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పవర్ప్లేలోనే హాఫ్ సెంచరీ బాది రికార్డుపుటల్లో చోటు దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్లో ప్రియాంశ్ తొలి బంతి నుంచే దూకుడు ప్రదర్శించాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది ఖాతా ప్రారంభించాడు. ఆ తర్వాత ఏ బౌలర్నీ వదలకుండా కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.
ఈ ఇన్నింగ్స్తో ప్రియాంశ్ పవర్ప్లేలో అత్యధిక 50+ స్కోర్లు నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సరసన చేరాడు.
ఐపీఎల్ పవర్ప్లేల్లో అత్యధిక 50+ స్కోర్లు (భారత ఆటగాళ్లు):
* వైభవ్ సూర్యవంశీ – 4
* ప్రియాంశ్ ఆర్య – 3
అలాగే ఐపీఎల్లో తొలి బంతికే (ఇన్నింగ్స్) అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్ ఇన్నింగ్స్ తొలి బంతికి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు:
* యశస్వి జైస్వాల్ – 4
* ప్రియాంశ్ ఆర్య – 3
విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, సంజూ శాంసన్ తదితరులు తలో సారి ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్లు కొట్టారు.
ఇదిలా ఉంటే, ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్య రికార్డు ఇన్నింగ్స్తో చెలరేగినా పంజాబ్ కింగ్స్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రియాంశ్తో పాటు శ్రేయస్ అయ్యర్ (59 నాటౌట్) కూడా సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలో తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అద్భుత అర్ద సెంచరీలతో ఢిల్లీని గెలిపించారు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది.


