breaking news
IPL 2026
-
ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో టీమిండియా ఆటగాడు, మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా తిరిగి తన సొంత గూటికి చేరాడు. ఐపీఎల్-2026 మినీ వేలంలో పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ ఓపెనర్ బ్యాటర్ను ఢిల్లీ క్యాపిటల్స్ కనీస ధర రూ.75 లక్షలకే సొంతం చేసుకుంది. వేలం తొలి సెట్లో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత సెకెండ్ యాక్సిలరేటెడ్ రౌండ్లో కూడా పృథ్వీ షాను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దీంతో అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. రెండు రౌండ్లలో తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో పృథ్వీ షా నిరాశచెందాడు. వెంటనే పృథ్వీ షా..తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేస్తూ ఇట్స్ ఒకే అని రాసుకొచ్చాడు. కానీ ఆఖరిలో ఢిల్లీ క్యాపిటల్స్ కనికరించింది. చివరి రౌండ్లో అతడిని ఢిల్లీ కొనుగోలు చేసింది. యాక్సిలరేటెడ్ ప్రాసెస్లో ఎంపికైన 11 మంది ఆటగాళ్లలో షా కూడా ఉన్నాడు. దీంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. ముందు పెట్టిన పోస్ట్ను డిలీట్ చేసి.. కొత్తగా మరో పోస్ట్ పెట్టాడు. బ్యాక్ టూ మై ఫ్యామిలీ అంటూ అతడు రాసుకొచ్చాడు.కాగా 2018లో కెప్టెన్గా భారత్కు అండర్-19 ప్రపంచకప్ను అందించిన పృథ్వీ షాను.. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతడు ఢిల్లీ జట్టులో కీలక సభ్యునిగా మారాడు. పృథ్వీ డీసీకి ఏడు సీజన్ల పాటు ఆడాడు. ఐపీఎల్-2021 వరకు కేవలం రూ. 1.20 అందుకున్న పృథ్వీ షా జీతం ఒక్కసారిగా 525 శాతం పెరిగింది. ఐపీఎల్-2022 సీజన్లో అతడిని రూ.7.50 కోట్లకు ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అనంతరం ఐపీఎల్-2023, 2024 సీజన్లలో ఈ మహరాష్ట్ర ఆటగాడు రూ.8 కోట్లు అందుకున్నాడు. కానీ పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యల వల్ల అతడిని ఐపీఎల్-2025 సీజన్కు ముందు ఢిల్లీ వేలంలోకి విడిచిపెట్టింది. వేలంలోకి వచ్చిన పృథ్వీ షాను ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు. మళ్లీ ఇప్పుడు ఏడాది తర్వాత ఢిల్లీ మరోసారి అతడికి అవకాశమిచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర తరపున ఆడుతున్న షా.. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఆ ఫామ్ను ఐపీఎల్లో కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి.చదవండి: ఐపీఎల్కు కరీంనగర్ కుర్రాడు -
కామెరాన్ గ్రీన్పై కోట్లాభిషేకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలంలో ఆ్రస్టేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ పంట పండింది. ఊహించినట్లుగా అతను అత్యధిక విలువ పలికాడు. అయితే అంచనాలకు మించి రికార్డు స్థాయిలో రూ. 25.20 కోట్లకు కోల్కతా నైట్రైడర్స్ గ్రీన్ను సొంతం చేసుకోవడం విశేషం. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. వేలానికి ముందు చేతిలో భారీ మొత్తం ఉన్న కేకేఆర్ అదే తరహాలో దానిని ఖర్చు కూడా చేసింది. లంక పేసర్ పతిరణ కోసం రూ. 18 కోట్లు చెల్లించడంతో పాటు ముస్తఫిజుర్ రహమాన్ను కూడా రూ. 9.20 కోట్లు ఇచ్చి తమ జట్టులోకి తీసుకుంది. భారత్కు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ కోసం చెన్నై రూ. 14.20 కోట్ల చొప్పున, కశ్మీర్ పేసర్ ఆఖిబ్ నబీ కోసం ఢిల్లీ రూ.8.40 కోట్లు వెచ్చించడం మంగళవారం వేలంలో హైలైట్గా నిలిచిన అంశం. ఓవరాల్గా 10 ఫ్రాంచైజీలు కలిపి వేలంలో మొత్తం 77 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. వీరిలో 29 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అబుదాబి: ఐపీఎల్–2026 కోసం 10 జట్లలో ఉన్న ఖాళీలు పూరించేందుకు నిర్వహించిన మినీ వేలం ఆసక్తికరంగా సాగింది. ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు ఊహించని విధంగా అసాధారణ ధర దక్కగా... మరికొందరిని తక్కువ మొత్తానికి జట్లు ఎంచుకున్నాయి. ఇప్పటికే తమకంటూ గుర్తింపు ఉన్న పలువురు క్రికెటర్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో ‘అన్సోల్డ్’గా మిగిలిపోయారు. మెగా వేలంతో పోలిస్తే సాధారణంగా ఆయా జట్ల వద్ద ఎక్కువ మొత్తం అందుబాటులో లేకపోవడంతో పాటు తక్కువ మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉండటంతో ‘సప్లయ్–డిమాండ్’ సూత్రం ప్రకారం సహజంగానే కొందరికి భారీ మొత్తాలు దక్కాయి. ఓవరాల్గా 359 మంది ఆటగాళ్లు వేలానికి రాగా, అన్ని జట్లూ కలిపి ఇందు కోసం మొత్తం రూ. 215.45 కోట్లు ఖర్చు చేశాయి. గ్రీన్ వేలం సాగిందిలా... వేలంలో నాలుగో ఆటగాడిగా గ్రీన్ పేరు వచ్చింది. ముంబై ముందుగా మొదలు పెట్టగా, ఆ తర్వాత రాజస్తాన్, కోల్కతా జత కలిశాయి. రాజస్తాన్, కేకేఆర్ కలిసి దీనిని రూ.13.60 కోట్ల వరకు తీసుకెళ్లాయి. అయితే చెన్నై రూ.13.80 కోట్లు చెప్పడంతో మళ్లీ పోటీ మొదలైంది. రాజస్తాన్ రేసు నుంచి తప్పుకోగా... రెండు జట్ల మధ్య పోటీ సాగింది. చివరకు రూ.25.20 కోట్ల వద్ద కేకేఆర్ ఖాయం చేసుకుంది. పతిరణ కోసం ముందుగా ఢిల్లీ ఆసక్తి చూపించినా, లక్నో, కేకేఆర్ కలిసి పెద్ద మొత్తానికి తీసుకెళ్లాయి. ఆఖరికి పతిరణ కూడా నైట్రైడర్స్తోనే చేరాడు. ముందుగా పేరు వచ్చినప్పుడు ఇంగ్లండ్ ఆల్రౌండర్ లివింగ్స్టోన్ను ఎవరూ తీసుకోలేదు. అయితే మళ్లీ చివర్లో వచ్చినప్పుడు అతని కోసం మూడు జట్లు కేకేఆర్, లక్నో, సన్రైజర్స్ పోటీ పడగా రూ.13 కోట్లతో రైజర్స్ గెలుచుకుంది. అన్క్యాప్డ్ ఆటగాళ్ల జోరు... భారీ సిక్సర్లతో ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆకట్టుకున్న రాజస్తాన్కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మ కోసం రూ. 30 లక్షలతో ముంబై బిడ్డింగ్ మొదలు పెట్టింది. అయితే ముంబై, లక్నో తప్పుకున్న తర్వాత కేకేఆర్, చెన్నై వేలాన్ని ముందుకు తీసుకెళ్లాయి. గత ఏడాది చెన్నై టీమ్తో కలిసి అతను ప్రాక్టీస్ చేశాడు. రూ.13 కోట్ల వద్ద ముగుస్తున్న దశలో సన్రైజర్స్ అడుగు పెట్టింది కానీ చివరకు కార్తీక్ చెన్నై చెంతకే చేరాడు. జడేజా తరహాలో లెఫ్టార్మ్ స్పిన్, దూకుడుగా బ్యాటింగ్ చేయగల ఉత్తరప్రదేశ్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం కూడా పోటీ బాగా నడిచింది. మొత్తం ఆరు జట్లు అతడిని తీసుకునే ప్రయత్నంలో విలువను పెంచుతూ వెళ్లడం విశేషం. ఆఖరికి ప్రశాంత్ను సీఎస్కే తమ జట్టులోకి తీసుకుంది. గత కొంత కాలంగా దేశవాళీ క్రికెట్లో సంచలన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్న కశ్మీర్ పేస్ బౌలర్ ఆఖిబ్ నబీ కోసం కూడా జట్లు పోటీ పడ్డాయి. మొదటి నుంచి ఎక్కువ ఆసక్తి కనబరిచిన ఢిల్లీ చివరి వరకు హైదరాబాద్తో పోటీ పడి నబీని సొంతం చేసుకుంది. గ్రీన్కు దక్కేది రూ. 18 కోట్లే!వేలంలో రూ.25.20 కోట్లకు పలికినా కామెరాన్ గ్రీన్కు గరిష్టంగా రూ.18 కోట్లు మాత్రమే లభిస్తాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మినీ వేలంలో విదేశీ ఆటగాడికి ఎంత విలువ పలికినా... ఆటగాళ్ల గరిష్ట రీటెయినింగ్ ఫీజు (రూ.18 కోట్లు) లేదా మెగా వేలంలో ఆటగాడికి దక్కిన మొత్తం (రూ.27 కోట్లు; రిషభ్ పంత్)కు ఇది మించరాదు. రెండింటిలో ఏది తక్కువైతే అంతే మొత్తం లభిస్తుంది. మిగిలిన రూ.7.20 కోట్లు బీసీసీఐ ఆటగాళ్ల సంక్షేమ నిధికి చేరతాయి.అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే చెన్నై: కార్తీక్ శర్మ (రూ.14.20 కోట్లు), ప్రశాంత్ వీర్ (రూ.14.20 కోట్లు), రాహుల్ చహర్ (రూ.5.20 కోట్లు), మాట్ హెన్రీ (రూ.2 కోట్లు), అకీల్ హొసీన్ (రూ.2 కోట్లు), మాథ్యూ షార్ట్ (రూ.1.50 కోట్లు), జాక్ ఫూల్్క్స (రూ.75 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.75 లక్షలు), అమన్ ఖాన్ (రూ.40 లక్షలు). ఢిల్లీ: ఆఖిబ్ నబీ (రూ.8.40 కోట్లు), నిసాంక (రూ.4 కోట్లు), జేమీసన్ (రూ.2 కోట్లు), ఎన్గిడి (రూ.2 కోట్లు), డకెట్ (రూ. 2 కోట్లు), మిల్లర్ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్ పరాఖ్ (రూ.30 లక్షలు). గుజరాత్: హోల్డర్ (రూ.7 కోట్లు), బాంటన్ (రూ. 2 కోట్లు), అశోక్ శర్మ (రూ.90 లక్షలు), ల్యూక్వుడ్ (రూ.75 లక్షలు), పృథ్వీరాజ్ (రూ. 30 లక్షలు). కోల్కతా: గ్రీన్ (రూ. 25.20 కోట్లు), పతిరణ (రూ.18 కోట్లు), ముస్తఫిజుర్ (రూ.9.20 కోట్లు), తేజస్వి సింగ్ (రూ.3 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్ అలెన్ (రూ.2 కోట్లు), సీఫెర్ట్ (రూ.1.50 కోట్లు), ఆకాశ్దీప్ (రూ.1 కోటి), రాహుల్ త్రిపాఠి (రూ. 75 లక్షలు), ద„Š కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్ రంజన్ (రూ.30 లక్షలు), ప్రశాంత్ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ.30 లక్షలు). లక్నో: ఇన్గ్లిస్ (రూ.8.60 కోట్లు), ముకుల్ చౌధరీ (రూ.2.60 కోట్లు), అక్షత్ రఘువంశీ (రూ.2.20 కోట్లు), నోర్జే (రూ. 2 కోట్లు), హసరంగ (రూ. 2 కోట్లు), నమన్ తివారి (రూ.1 కోటి). ముంబై: డి కాక్ (రూ.1 కోటి), మయాంక్ రావత్ (రూ. 30 లక్షలు), అథర్వ అంకోలేకర్ (రూ. 30 లక్షలు), మొహమ్మద్ ఇజ్హార్ (రూ. 30 లక్షలు), డానిశ్ మాలేవర్ (రూ. 30 లక్షలు). పంజాబ్: డ్వార్షుయిస్ (రూ.4.40 కోట్లు), కనోలీ (రూ.3 కోట్లు), నిషాద్ (రూ. 30 లక్షలు), ప్రవీణ్ దూబే (రూ. 30 లక్షలు). రాజస్తాన్: రవి బిష్ణోయ్ (రూ.7.20 కోట్లు), మిల్నే (రూ.2.40 కోట్లు), రవి సింగ్ (రూ.95 లక్షలు), సుశాంత్ మిశ్రా (రూ.90 లక్షలు), కుల్దీప్ సేన్ (రూ.75 లక్షలు), బ్రిజేశ్ శర్మ (రూ. 30 లక్షలు), పేరాల అమన్రావు (రూ. 30 లక్షలు), విఘ్నేశ్ (రూ. 30 లక్షలు), యశ్రాజ్ (రూ. 30 లక్షలు). బెంగళూరు: వెంకటేశ్ అయ్యర్ (రూ. 7 కోట్లు), మంగేశ్ యాదవ్ (రూ.5.20 కోట్లు), డఫీ (రూ.2 కోట్లు), కాక్స్ (రూ.75 లక్షలు), కనిష్క్ (రూ. 30 లక్షలు), విహాన్ (రూ. 30 లక్షలు), విక్కీ (రూ. 30 లక్షలు), సాత్విక్ (రూ. 30 లక్షలు). హైదరాబాద్: లివింగ్స్టోన్ (రూ.13 కోట్లు), జేక్ ఎడ్వర్డ్స్ (రూ.3 కోట్లు), సలీల్ అరోరా (రూ.1.50 కోట్లు), శివమ్ మావి (రూ.75 లక్షలు), ఫులెట్రా (రూ. 30 లక్షలు), ప్రఫుల్ (రూ. 30 లక్షలు), అమిత్ కుమార్ (రూ. 30 లక్షలు), ఓంకార్ (రూ. 30 లక్షలు), సాకిబ్ హుస్సేన్ (రూ. 30 లక్షలు), శివాంగ్ కుమార్ (రూ. 30 లక్షలు). వేలంలో అత్యధిక విలువ పలికిన టాప్ ఆటగాళ్లు1. కామెరాన్ గ్రీన్ (కోల్కతా) రూ. 25.20 కోట్లు 2. పతిరణ (కోల్కతా) రూ. 18 కోట్లు 3. కార్తీక్ శర్మ (చెన్నై) రూ.14.20 కోట్లు 4. ప్రశాంత్ వీర్ (చెన్నై) రూ. 14.20 కోట్లు 5. లివింగ్స్టోన్ (హైదరాబాద్) రూ. 13 కోట్లు 6. ముస్తఫిజుర్ (కోల్కతా) రూ. 9.40 కోట్లు 7. జోష్ ఇన్గ్లిస్ (లక్నో) రూ. 8.60 కోట్లు 8. ఆఖిబ్ నబీ (ఢిల్లీ) రూ. 8.40 కోట్లు 9. రవి బిష్ణోయ్ (రాజస్తాన్) రూ. 7.20 కోట్లు 10. జేసన్ హోల్డర్ (గుజరాత్) రూ. 7 కోట్లు 11. వెంకటేశ్ అయ్యర్ (బెంగళూరు) రూ. 7 కోట్లు -
సంచలనం.. 19 ఏళ్ల కుర్రాడికి రూ.14.20 కోట్లు! ఎవరీ కార్తీక్ శర్మ?
అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2026 మినీ వేలంలో అన్క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శర్మకు జాక్ పాట్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్గా ప్రశాంత్ వీర్ రికార్డును కార్తీక్ సమం చేశాడు. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కార్తీక్ శర్మ కోసం కోల్కతా నైట్ రైడర్స్ (KKR), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిడ్డింగ్ వార్ నెలకొంది. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ పోటీ నుంచి తప్పుకోవడంతో అతడు సీఎస్కే సొంతమయ్యాడు. ఈ క్రమంలో కార్తీక్ శర్మ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తిచూపుతున్నారు.ఎవరీ కార్తీక్ శర్మ?రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ.. పవర్ హిట్టింగ్కు పెట్టింది పేరు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. దేశవాళీ క్రికెట్లో తన సంచలన బ్యాటింగ్తో రాజస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కార్తీక్కు తన చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ. స్ట్రీట్ క్రికెట్తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన కార్తీక్.. ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ టీ20 లీగ్ అయిన ఐపీఎల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. కార్తీక్ శర్మ ఆఖరిలో వచ్చి తన బ్యాట్తో మెరుపులు మెరిపించగలడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (SMAT) ఐదు మ్యాచ్ల్లో 160.24 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 133 పరుగులు చేశాడు. సీఎస్కే అతడిని ఫినిషర్గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. వేలానికి ముందే అతడిని సీఎస్కే ట్రయల్స్కు పిలిచింది. కార్తీక్ ఇప్పటివరకు రాజస్తాన్ తరపున 12 టీ20లు ఆడి 164 స్ట్రైక్ రేట్తో 334 పరుగులు చేశాడు. అంతేకాకుండా 8 మ్యాచ్లు ఆడి 479 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే ఉత్తరాఖండ్పై సెంచరీతో సత్తాచాటాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 9 మ్యాచ్లు ఆడి 445 పరుగులు సాధించాడు. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకునే అతడిపై భారీ మొత్తాన్ని సీఎస్కే వెచ్చించింది. అదేవిధంగా మరో యువ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను సైతం రూ.14.20 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసింది. ఈ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసమే సీస్కే రూ.28 కోట్లపైన ఖర్చు చేసింది.చదవండి: IPL 2026: రూ.30 లక్షలతో ఎంట్రీ.. కట్ చేస్తే! ఏకంగా రూ.14.20 కోట్లు -
నేడు ఐపీఎల్–2026 ‘మినీ’ వేలం.. 77 స్థానాలు.. 359 మంది ఆటగాళ్లు
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2026కు సంబంధించి మినీ వేలానికి రంగం సిద్ధమైంది. తమ జట్టులో మిగిలిన స్థానాలు పూరించుకునేందుకు లీగ్లో 10 జట్లు పోటీ పడనున్నాయి. అబుదాబి వేదికగా నేడు జరిగే ఈ వేలంలో మొత్తం 77 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 359 క్రికెటర్లు వేలానికి అందుబాటులో ఉండగా... ఖాళీల్లో గరిష్టంగా 31 మంది విదేశీ ఆటగాళ్ళను తీసుకునేందుకు అవకాశం ఉంది. వేలం మంగళవారం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. అన్ని జట్లలోకి గరిష్టంగా కోల్కతా నైట్రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు ఉండగా, వారికే అందరికంటే ఎక్కువగా 13 మంది ఆటగాళ్ల అవసరం ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో 10 ఖాళీలు ఉండగా, చేతిలో మొత్తం రూ. 25.50 కోట్లు ఉన్నాయి. అత్యధిక కనీస ధర రూ.2 కోట్లతో ఏకంగా 40 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఎంత మంది విలువ పైపైకి వెళుతుందనేది ఆసక్తికరం. అయితే విదేశీ ఆటగాడికి ఎవరికైనా గరిష్టంగా రూ. 18 కోట్లు మాత్రమే దక్కుతాయి. వేలంలో అంతకంటే ఎక్కువ మొత్తానికి అతడిని సొంతం చేసుకున్నా... ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల గరిష్ట రిటెన్షన్ విలువ (రూ.18 కోట్లు), మెగా వేలంలో ఒక ఆటగాడికి దక్కిన మొత్తం (పంత్కు రూ. 27 కోట్లు)కంటే ఇది ఎక్కువగా ఉండరాదు. వేలంలో అంతకంటే ఎక్కువగా వచ్చినా మిగిలిన మొత్తం బీసీసీఐకే వెళుతుంది. గ్రీన్పై భారీ అంచనాలు! మినీ వేలంలో కొందరు ఆటగాళ్లపై ప్రధానంగా అందరి దృష్టీ నిలిచింది. ఆ్రస్టేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్కు అందరికంటే ఎక్కువ విలువ పలికే అవకాశం కనిపిస్తోంది. 2023లో ముంబై ఇండియన్స్ తరఫున చక్కటి ప్రదర్శన కనబర్చిన గ్రీన్... 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఫర్వాలేదనిపించాడు. గాయం కారణంగా గత సీజన్కు అతను దూరమయ్యాడు. రసెల్ రిటైర్ రావడంతో కేకేఆర్కు అలాంటి ఆటగాడి అవసరం ఉండగా, మిడిలార్డర్లో ఆల్రౌండర్ కోసం చెన్నై చూస్తోంది. భారీ హిట్టర్, గత ఏడాది ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన లివింగ్స్టోన్ కూడా ఎక్కువ మొత్తం ఆకర్షించవచ్చు. ఇతర విదేశీ ఆటగాళ్లలో డికాక్, పతిరణ, జేమీ స్మిత్పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నారు. కాన్వే, మిల్లర్, హసరంగ, ముల్డర్, నోర్జే తదితరులు కూడా వేలంలో అందుబాటులో ఉన్నారు. భారత క్రికెటర్లలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పెద్ద మొత్తం అందుకోవచ్చు. వెంకటేశ్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, ఆకాశ్దీప్, రాహుల్ చహర్ తదితరులు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఏడాది వరకు ఐపీఎల్లో తమదైన ముద్ర వేసిన మ్యాక్స్వెల్, డుప్లెసిస్ ఈసారి వేలానికి అందుబాటులోకి లేకపోగా, రసెల్ ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించాడు. -
ఐపీఎల్ 2026కి సంబంధించి బిగ్ అప్డేట్.. డేట్ మారింది
ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి బిగ్ అప్డేట్ అందింది. లీగ్ ప్రారంభ తేదీ మారినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ పేర్కొంది. ముందుగా ప్రకటించినట్లు ఐపీఎల్ 2026 మార్చి 15న కాకుండా మార్చి 26న ప్రారంభం కానున్నట్లు తెలిపింది. మే 31తో ముగియనున్నట్లు పేర్కొంది. ఇవాళ (డిసెంబర్ 15) అబుదాబీలో జరిగిన ఫ్రాంఛైజీల మీటింగ్లో ఈ విషయం ఖరారైనట్లు వెల్లడించింది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ విషయంలో ఇంకా స్పష్టత లేనట్లు ప్రకటించింది.సాధారణంగా సీజన్ ఓపెనర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ (ఆర్సీబీ) హోం గ్రౌండ్లో జరుగుతుంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంపై సందిగ్దత నెలకొనడంతో ఈ విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. పై విషయాలను ఐపీఎల్ సీఈవో హేమంగ్ అమిన్ తమతో షేర్ చేసుకున్నట్లు క్రిక్బజ్ వెల్లడించింది.కాగా, రేపు అబుదాబీ వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలకు సంబంధించి 77 స్లాట్లు భర్తీ కానున్నాయి. ఇందులో 31 విదేశీ స్లాట్లు కాగా.. మిగతావన్నీ దేశీయ ఆటగాళ్లతో భర్తీ చేయబడతాయి. 10 ఫ్రాంచైజీల వద్ద రూ. 237.55 కోట్ల నిధులు ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ. 64.30 కోట్లు, రెండో అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 43.40 కోట్లు ఉన్నాయి. ఈ వేలంలో తాజా అడిషన్స్తో పాటు (అభిమన్యు ఈశ్వరన్) మొత్తం 369 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
కేకేఆర్ కీలక నిర్ణయం..! కెప్టెన్గా అతడే?
ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు కోల్కతా నైట్ రైడర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయో సీజన్లో కూడా తమ జట్టు కెప్టెన్గా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేను కొనసాగించాలని కేకేఆర్ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు సమాచారం.డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనున్న మినీ వేలానికి కూడా అతడు హాజరు కానున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. గత సీజన్లో రహానే కెప్టెన్సీలో కేకేఆర్ దారుణ ప్రదర్శన కనబరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన నైట్రైడర్స్ ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్దానంలో నిలిచింది. అజింక్య తన కెప్టెన్సీ మార్క్ను చూపించలేకపోయాడు. దీంతో ఐపీఎల్-2026లో రహానేను కేకేఆర్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ కేకేఆర్ యాజమాన్యం మాత్రం రహానేకు మరో అవకాశమిచ్చేందుకు సిద్దమైంది. ఇదే విషయంపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.ఈ సీజన్లో అజింక్య రహానే ఇన్నింగ్స్ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి. అదేవిధంగా మరోసారి అతడు కేకేఆర్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశముంది. ఎందుకంటే కెప్టెన్సీ సత్తా ఉన్న ఆటగాడు ఎవరూ వేలంలో లేరు. యువ ఆటగాడు రఘువంశీ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అతడిని వికెట్ కీపర్ బ్యాటర్గా ఉపయోగించుకోవాలని కేకేఆర్ భావిస్తుందని బంగర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.గ్రీన్పై కన్ను..కాగా కేకేఆర్ రూ. 64.30 కోట్లు పర్స్తో వేలంలోకి వెళ్లనుంది. ఇది అన్ని జట్ల కంటే అత్యధిక మనీ కేకేఆర్ వద్దే ఉంది. నైట్రైడర్స్ మొత్తంగా 13 స్ధానాలను భర్తీ చేయనుంది. అందులో విదేశీ ఆటగాళ్ల స్ధానాలు ఆరు ఉన్నాయి. ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను దక్కించుకునేందుకు కేకేఆర్ ప్రయత్నించే అవకాశముంది.ఈ వేలానికి ముందు కేకేఆర్ రహానే పాటు రింకూ సింగ్, సునీల్ నరైన్, రోవ్మన్ పావెల్, వరుణ్ చక్రవర్తి, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, అంకుల్ రాయ్, రమన్దీప్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, వైభవ్ అరోరాతో సహా మొత్తం 12 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.వదేలిసిన ఆటగాళ్లు వీరే..ఆండ్రీ రస్సెల్ (₹12 కోట్లు)వెంకటేష్ అయ్యర్ (₹23.75 కోట్లు)క్వింటన్ డి కాక్రహమనుల్లా గుర్బాజ్అన్రిచ్ నోర్ట్జేమొయిన్ అలీచదవండి: IPL 2026: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ బౌలర్ల మీదే! -
IPL 2026: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ బౌలర్ల మీదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 వేలంలో దేశీ ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా, రవి బిష్ణోయి, సర్ఫరాజ్ ఖాన్ తదితరులు ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా.. పాటు విదేశీ ప్లేయర్లు కామెరాన్ గ్రీన్, క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ వంటి వారు హైలైట్ కానున్నారు. స్టార్లను మినహాయించితే ఈ ఐదుగురు భారత అన్క్యాప్డ్ బౌలర్లు కూడా ఈసారి వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది.ఆకిబ్ నబీజమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ. అనుభవం, నైపుణ్యాలు కలిగిన ఈ ఫాస్ట్బౌలర్ కోసం ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపడం ఖాయం. తాజా దేశీ సీజన్లలో అతడు అద్భుత ప్రదర్శన కనబరచడం ఇందుకు కారణం. 2025-26 రంజీ సీజన్లో అదరగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ దుమ్ములేపాడు.ఈ సీజన్లో ఏడు మ్యాచ్లు 15 వికెట్లు కూల్చిన ఆకిబ్.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు.. మధ్యప్రదేశ్తో మ్యాచ్లో బ్యాట్తోనూ సత్తా చాటాడు. వేలానికి ముందు అతడి ఈ అత్యుత్తమ ప్రదర్శన ఫ్రాంఛైజీలను ఊరిస్తోంది.ఈడెన్ ఆపిల్ టామ్కేరళకు చెందిన తాజా బౌలింగ్ సంచలనం ఈడెన్ ఆపిల్ టామ్. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటికి ఆడిన ఏడు మ్యాచ్లలో రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు 20 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్. తాజా రంజీ సీజన్లో మధ్యప్రదేశ్పై (4/55 & 2/33) ఉత్తమ గణాంఖాలు నమోదు చేశాడు.ఇక మొత్తంగా ఏడు ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో కలిపి 19 వికెట్లు కూల్చాడు ఆపిల్. అయితే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడికి అనుభవం లేదు. అయినప్పటికీ అతడి నైపుణ్యాల కారణంగా కనీస ధర రూ. 20లక్షలకైనా అమ్ముడుపోయే అవకాశం ఉంది.రాజ్ లింబానిఅండర్-19 వరల్డ్కప్లో ఫైనల్ చేరిన భారత జట్టులో రాజ్ లింబాని సభ్యుడు. 2024లో టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం పేసర్.. ఇప్పటికి 11 మ్యాచ్లలో కలిపి 16 వికెట్లు కూల్చాడు. కొత్త బంతితో అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో అతడు అదరగొట్టాడు. డెత్ ఓవర్లలోనూ తనదైన శైలిలో రాణించాడు.ఆకాశ్ మధ్వాల్2023లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు ఆకాశ్ మధ్వాల్. ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్ ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటాడు. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్కు మారి అక్కడా తనను తాను నిరూపించుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్లో 17 మ్యాచ్లు ఆడి 23 వికెట్లు తీశాడు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో ఈ యార్కర్ల కింగ్ పెద్దగా సత్తా చాటలేకపోయాడు. ఉత్తరాఖండ్ తరపున ఆరు మ్యాచ్లలో మూడు వికెట్లే తీశాడు. అయితే, అతడి అనుభవం దృష్ట్యా ఈసారి మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది.అశోక్ శర్మసయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో రాజస్తాన్ తరఫున సత్తా చాటుతున్నాడు అశోక్ శర్మ. ఇప్పటికి ఏడు మ్యాచ్లలో కలిపి ఏకంగా 19 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లకు నెట్బౌలర్గా పనిచేసిన అశోక్ శర్మ ఈసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు. -
IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ తన విషయంలో స్పష్టత ఇచ్చాడు. ఈసారి క్యాష్ రిచ్ లీగ్లో తాను బౌలింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తన మేనేజర్ తప్పిదం వల్లే రిజిస్ట్రేషన్ విషయంలో తప్పు జరిగి ఉండవచ్చని పేర్కొన్నాడు.110 మంది విదేశీ ప్లేయర్లు అబుదాబి వేదికగా డిసెంబరు 16 (మంగళవారం)న మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. మొత్తంగా ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం 350 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. ఇందులో 240 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 110 మంది విదేశీ ప్లేయర్లు ఇందులో ఉన్నారు.అయితే, ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) ఈసారి పూర్తిస్థాయి బ్యాటర్ స్లాట్లో తన పేరును నమోదు చేసుకోవడం చర్చనీయాంశమైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో ప్యూర్ బ్యాటర్ స్లాట్లో సెట్ 1లోనే అతడు వేలంలోకి రానున్నాడు. దీంతో గ్రీన్ ఈ సీజన్లో బౌలింగ్ చేయడేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఇది అతడి ధరపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..ఈ నేపథ్యంలో కామెరాన్ గ్రీన్ తన పేరు బ్యాటర్గా మాత్రమే నమోదు కావడంపై స్పందించాడు. యాషెస్ సిరీస్ (Ashes Series)లో భాగంగా అడిలైడ్లో మూడో టెస్టుకు ముందు రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ‘‘నేను బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నన్ను బ్యాటర్గా మాత్రమే రిజిస్టర్ చేశారన్న విషయం మా మేనేజర్కు తెలిసే ఉండదు.పొరపాటున అతడు తప్పుడు ఆప్షన్ ఎంపిక చేసి ఉంటాడు. ఇదెలా జరిగిందో తెలియదు’’ అని గ్రీన్ చెప్పుకొచ్చాడు. కాగా 2023లో రూ. 17.50 కోట్ల ధరతో ఐపీఎల్లో అడుగుపెట్టిన గ్రీన్.. ముంబై ఇండియన్స్ తరఫున 452 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు.గ్రీన్పై భారీ అంచనాలుఈ క్రమంలో 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ పేస్ ఆల్రౌండర్ను ట్రేడ్ చేసుకోగా.. 255 రన్స్ రాబట్టడంతో పాటు.. 10 వికెట్లు కూల్చాడు. అయితే, 2025లో గ్రీన్ గాయపడటంతో ఈ సీజన్లో ఆడలేకపోయాడు. ఈసారి మాత్రం ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్లలో ఒకడిగా గ్రీన్పై భారీ అంచనాలు ఉన్నాయి.చదవండి: ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు రెడీ: తిలక్ వర్మ -
భారీగా తగ్గిన ధర!.. మళ్లీ కేకేఆర్కే వెంకటేశ్ అయ్యర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలానికి సమయం ఆసన్నమైంది. అబుదాబి వేదికగా డిసెంబరు 16న వేలంపాట నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ (KKR) అత్యధికంగా రూ. 63.30 కోట్ల పర్సుతో రంగంలోకి దిగనుంది.పదమూడు ఖాళీలువేలానికి ముందు తమ జట్టులోని అత్యంత ఖరీదైన ఆల్రౌండర్లు వెంకటేశ్ అయ్యర్ (27.75 కోట్లు), ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు)ను వదులుకోవడంతో కేకేఆర్ పర్సులో భారీగా సొమ్ము చేరింది. ఇక ఆ జట్టులో పదమూడు ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఆరు విదేశీ ప్లేయర్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.మాక్ వేలంఇదిలా ఉంటే.. గతంలో మాదిరే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈసారి కూడా మాక్ వేలం నిర్వహించాడు. ఇందులో పది ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ అభిమానులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వెంకటేశ్ అయ్యర్ పేరు వేలంలోకి రాగానే... చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అతడి కోసం పోటీపడ్డాయి.భారీగా తగ్గిన ధర!.. ఇంతలో కేకేఆర్ కూడా రంగంలోకి దిగింది. చెన్నై, ముంబైలతో పోటీపడి ఎట్టకేలకు వెంకటేశ్ అయ్యర్ను దక్కించుకుంది. అయితే, గతేడాది పేలవ ప్రదర్శన దృష్ట్యా ఈసారి వెంకీ ధర ఆరు కోట్లు తగ్గిపోయింది. మాక్ వేలంలో కేకేఆర్ అతడిని రూ. 17.5 కోట్లకు కొనుక్కుంది. కాగా 2025లో పదకొండు మ్యాచ్లలో కలిపి కేవలం 142 పరుగులే చేశాడు. సీజన్ మొత్తంలో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ను కేకేఆర్ ఏకంగా రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. గతేడాది అతడు ఆర్సీబీ (రూ. 8.75 కోట్లు) తరఫున పేలవంగా ఆడాడు. ఐదు మ్యాచ్లలో కలిపి 90 పరుగులే చేశాడు. రెండు వికెట్లు తీశాడు. అయితే, ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు మాక్ వేలంలో కేకేఆర్ లివింగ్స్టోన్ను కొనుక్కోవడం గమనార్హం.చదవండి: ఆసియా కప్- 2025: భారత్ ఘన విజయం -
ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే!
ఐపీఎల్-2026 మినీ వేలానికి సమయం అసన్నమవుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలం కోసం ఆయా ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి. అయితే ఈసారి వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరు అవుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత ఏడాది జెడ్డాలో జరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు రిషబ్ పంత్ను భారీ మొత్తం రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర. అయితే ఈసారి కూడా ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్రాంచైజీల వద్ద మొత్తం పర్స్ విలువ రూ. 230 కోట్లకు పైగా ఉంది.పర్స్ బ్యాలెన్స్ అత్యధికం ఏ జట్టుదంటే?ఐపీఎల్-2026 మినీ వేలంలో అత్యధిక పర్స్ వాల్యూ కోల్కతా నైట్రైడర్స్(64.30 కోట్లు) వద్ద ఉంది. ఆ తర్వాత స్ధానాల్లో చెన్నై సూపర్ కింగ్స్ (43.40 కోట్లు), సన్రైజర్స్ హైదరాబాద్ (25.50 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 22.95 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ (21.80 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(16.40 కోట్లు), రాజస్థాన్ రాయల్స్(16.05 కోట్లు), గుజరాత్ టైటాన్స్(12.90 కోట్లు), పంజాబ్ కింగ్స్ (11.50 కోట్లు), ముంబై ఇండియన్స్(2.75 కోట్లు) ఉన్నాయి. అత్యధికంగా కేకేఆర్ జట్టులో అత్యధికంగా 13 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అత్యల్పంగా పంజాబ్ కింగ్స్లో నాలుగు స్ధానాల్లో ఖాళీలు ఉన్నాయి.గ్రీన్పై కాసుల వర్షం!ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. గాయం కారణంగా గత సీజన్కు దూరమయ్యాడు. అయితే సాధారణంగా ఆల్-రౌండర్ అయిన గ్రీన్, ఈసారి వేలంలో తన పేరును 'బ్యాటర్ల' విభాగంలో నమోదు చేసుకున్నాడు.దీంతో వేలంలో మొదటి సెట్లలోనే అతడు పేరు వస్తుంది. మొదటిలో ఫ్రాంచైజీల వద పర్స్ మొత్తం ఫుల్గా ఉండడంతో అతడి కోసం పోటీ పడడం ఖాయం. గ్రీన్ను సొంతం చేసుకునేందుకు కోల్కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశముందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.కేకేఆర్ సరైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు. గత సీజన్ వరకు జట్టులో ఉన్న ఆండ్రీ రస్సెల్ను కేకేఆర్ విడుదల చేసింది. ఆ తర్వాత అతడు ఏకంగా ఐపీఎల్కే రిటైర్మెంట్ ప్రకటించి కేకేఆర్ పవర్ కోచ్గా ఎంపికయ్యాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని గ్రీన్తో భర్తీ చేయాలని కేకేఆర్ భావిస్తోంది.సీఎస్కే కూడా సామ్ కుర్రాన్ను రాజస్తాన్కు ట్రేడ్ చేయడంతో వారికి కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం. కాబట్టి చెన్నై కూడా అతడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత రిపోర్ట్లు ప్రకారం.. అతడు వేలంలో రూ. 20 కోట్లకు పైగా ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది. గ్రీన్ చివరగా ఐపీఎల్ 2024లో ఆర్సీబీ తరపున ఆడాడు. ఆ సీజన్లో 255 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.బిష్ణోయ్ కోసం ఎస్ఆర్హెచ్ స్కెచ్!కామెరూన్ గ్రీన్తో పాటు టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయే ఛాన్స్ ఉంది. గత సీజన్ వరకు లక్నోలో భాగంగా ఉన్న బిష్ణోయ్ను సదరు ఫ్రాంచైజీ వేలంలోకి విడిచిపెట్టింది. దీంతో స్పిన్ బౌలర్ల అవసరమున్న ఫ్రాంచైజీల అతడి కోసం పోటీ పడనున్నాయి.ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఎస్ఆర్హెచ్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ ఒకరు లేరు. జీషన్ అన్సారీ ఉన్నప్పటికి అతడికి అంతర్జాతీయ స్దాయిలో అనుభవం లేదు. కాబట్టి బిష్ణోయ్ను తమ జట్టులోకి తీసుకోవాలని కావ్య మారన్ వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా సీఎస్కే కూడా పోటీ పడే అవకాశముంది. ఎందుకంటే సీఎస్కేలో లెగ్ స్పిన్నర్ ఒక్కరూ కూడా లేదు. జడేజాను సైతం సీఎస్కే వదులుకుంది. మతీషా పతిరానా కోసం కూడా ఎస్ఆర్హెచ్ ప్రయత్నించే ఛాన్స్ ఉంది. మహ్మద్ షమీ స్దానాన్ని అతడితో భర్తీ చేయాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తుందంట.పృథ్వీషాపై సీఎస్కే కన్ను..ఇక గత సీజన్లో అన్సోల్డ్గా మిగిలిపోయిన పృథ్వీ షా.. ఈసారి మాత్రం ఫ్రాంచైజీలను ఆకర్షించే అవకాశం ఉంది. పృథ్వీషా ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ముంబై నుంచి మహారాష్ట్రకు మకాంను మార్చిన పృథ్వీ.. ఫార్మాట్తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. అతడిని సీఎస్కే సొంతం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే అతడితో సీఎస్కే యాజమాన్యం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దూకడైన ఆటకు పృథ్వీ పెట్టింది పేరు.వెంకటేశ్ అయ్యర్కు షాక్ తప్పదా?ఇక కేకేఆర్ మాజీ ఆల్రౌండర్, మధ్యప్రదేశ్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్కు మరోసారి షాక్ తగిలే అవకాశముంది. గత సీజన్లో అయ్యర్ను రూ. 23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ అయ్యర్ తన ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. దీంతో అతడిని నైట్రైడర్స్ వేలంలోకి విడిచిపెట్టింది. అయితే అయ్యర్ వేలంలోకి వచ్చినప్పటికి భారీ ధర దక్కే అవకాశం లేదు. ఎందుకంటే అతడు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ప్రభావం వేలంపై ఆడే అవకాశముంది. -
ఐపీఎల్లో బ్యాన్.. కట్ చేస్తే! ఆ ఆటగాడికి కోట్లు కుమ్మరించిన కావ్య మారన్
ఇంగ్లండ్ వైట్-బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసింది. ఐపీఎల్ బ్యాన్ ఎదుర్కొంటున్న బ్రూక్కు సన్రైజర్స్ ఎలా ఆఫర్ చేసిందా అని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి కథనం చదవాల్సిందే.ఇంగ్లండ్కు చెందిన 'ది హండ్రెడ్' (The Hundred) 2026 సీజన్ కోసం సన్రైజర్స్ లీడ్స్ (గతంలో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్) తమ రిటెన్షన్ పక్రియను మొదలు పెట్టింది. ఈ క్రమంలో సన్రైజర్స్ హ్యారీ బ్రూక్ను ఏకంగా 4,70,000 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 5.62 కోట్లు) వెచ్చించి రిటైన్ చేసుకుంది.పేరు మార్పు..ది హాండ్రెడ్ లీగ్ 2025 సీజన్కు ముందు నార్తరన్ సూపర్చార్జర్స్ ఫ్రాంచైజీలో 49% వాటాను సన్రైజర్స్ హైదరాబాద్ యజమానులైన సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. మిగితా 1 శాతం వాటా యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది.కానీ ఆ తర్వాత కావ్య మారన్ యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో చర్చలు జరిపి మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసింది. ఈ క్రమంలో గత నెలలో నార్తరన్ సూపర్చార్జర్స్ పేరును సన్రైజర్స్ లీడ్స్గా మార్చారు. ఇక బ్రూక్ విషయానికి వస్తే.. 2021 నుంచి సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీలో ఉన్నాడు. ఆ తర్వాత 2024లో కెప్టెన్గా అతడు ఎంపికయ్యాడు. ఫ్రాంచైజీ తరపున లీడింగ్ రన్స్కోరర్గా బ్రూక్ కొనసాగుతున్నాడు. రాబోయో సీజన్లో కూడా అతడు జట్టును ముందుండి నడిపించనున్నాడు. 'ది హండ్రెడ్' లీగ్ 2026 వేలం వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.ఐపీఎల్ నిషేధంహ్యార్ బ్రూక్ ప్రస్తుతం ఐపీఎల్ నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్-2025 వేలంలో బ్రూక్ను రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ నుంచి తప్పుకొంటున్నట్లు బ్రూక్ తెలిపాడు.అయితే బీసీసీఐ రూల్ ప్రకారం.. సరైన కారణాలు లేకుండా ఆటగాళ్లు టోర్నమెంట్ నుండి వైదొలిగితే వారిపై నిషేధం పడుతోంది. ఈ క్రమంలోనే బ్రూక్పై బీసీసీఐ వేటు వేసింది. హ్యారీ బ్రూక్ 2028 వేలం వరకు ఐపీఎల్కు దూరంగా ఉండాల్సిందే.చదవండి: BCCI: శుభ్మన్ గిల్కు మరో బిగ్ ప్రమోషన్..! -
కావ్య మారన్ మాస్టర్ ప్లాన్..! యార్కర్ల కింగ్పై కన్ను?
ఐపీఎల్-2026 మినీ వేలానికి సమయం అసన్నమవుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలను మొత్తం పది ఫ్రాంచైజీలు సిద్దం చేసుకుంటున్నాయి.గతేడాది సీజన్లో ఆరోస్ధానానికి పరిమితమైన సన్రైజర్స్ హైదరాబాద్ సైతం వేలంలో చాకచాక్యంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఈ మినీ ఆక్షన్కు ముందు ఎస్ఆర్హెచ్ దాదాపు తమ కోర్ టీమ్ను అంటిపెట్టుకుంది.అయితే మహ్మద్ షమీ లాంటి కీలక పేసర్ను లక్నోకు సన్రైజర్స్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్-2025లో షమీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ కారణంతోనే అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు వేలంలో అతడి స్ధానాన్ని మరో ఫ్రంట్ లైన్ సీమర్తో భర్తీ చేయాలని ఎస్ఆర్హెచ్ యోచిస్తోంది.పతిరానపై కన్ను..సన్రైజర్స్ హైదరాబాద్ పర్స్లో 25.50 కోట్లు ఉన్నాయి. కనిష్టంగా ముగ్గురు, గరిష్టంగా పది మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే షమీ స్ధానాన్ని మినీ వేలంలో స్వదేశీ పేసర్తో భర్తీ చేయడం కష్టం. వేలంలో చెప్పుకోదగ్గ స్వదేశీ ఫాస్ట్ బౌలర్ ఎవరూ లేరు. అందుకే శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరానాపై ఎస్ఆర్హెచ్ కన్నేసినట్లు తెలుస్తోంది. పతిరానా గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ మినీ వేలానికి ముందు అతడిని సీఎస్కే విడిచిపెట్టింది.దీంతో అతడిపై వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది. పతిరానా కోసం అవసరమైతే తమ పర్స్లో ఉన్న సగం మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సన్రైజర్స్ సిద్దమైనట్లు సమాచారం. ఐపీఎల్ పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరుగాంచాడు. పతిరానా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికి.. సీఎస్కే లెజెండ్ ధోని సారథ్యంలో ఎంతగానో రాటుదేలాడు. మిడిల్ ఓవర్లలో కూడా తన పేస్ బౌలింగ్ బ్యాటర్లను కట్టడి చేయగలడు. అంతేకాకుండా ఈ జూనియర్ మలింగా యార్కర్లను కూడా అద్భుతంగా సంధించగలడు. దీంతో అతడిని ఎలాగైనా కొనుగోలు చేసి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా ఉపయోగించుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితావిదేశీ ఆటగాళ్లు (6): పాట్ కమిన్స్✈️ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్✈️ (వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్✈️, కమిందు మెండిస్✈️, ఇషాన్ మలింగ✈️, బ్రైడన్ కార్స్✈️.దేశీయ ఆటగాళ్లు (9): అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, స్మరణ్ రవిచంద్రన్, జీషన్ అన్సారీ.SRH విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాఅభినవ్ మనోహర్, ఆడమ్ జంపా✈️, అథర్వ తైడే (వికెట్ కీపర్), రాహుల్ చాహర్, సచిన్ బేబీ, సిమర్జీత్ సింగ్, వియాన్ ముల్డర్✈️.చదవండి: బీసీసీఐ కీలక సమావేశం.. -
భారత ఆటగాడి కోటాలో ఐపీఎల్ వేలంలోకి ఎంటరైన ఆస్ట్రేలియా ఆల్రౌండర్
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ అద్భుతం జరిగింది. ఓ విదేశీ ఆటగాడు భారతీయ ఆటగాడి కోటాలో వేలంలోకి ప్రవేశించాడు. భారత్లో (ఢిల్లీలో) పుట్టి, ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్లో భాగంగా ఉన్న 29 ఏళ్ల నిఖిల్ చౌదరి 2026 సీజన్ వేలంలోకి చివరి నిమిషంలో భారత ఆటగాడి కోటాలో ఎంట్రీ ఇచ్చాడు.ఆస్ట్రేలియాలో టాస్మానియా తరఫున పూర్తి స్థాయి ఫస్ట్క్లాస్ ఆడుతూ, బిగ్బాష్ లీగ్లో హోబార్ట్ హరికేన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఖిల్.. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలిచాడు. ఊహించని ఈ పరిణామం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు.ఓ ఆటగాడు విదేశీ లీగ్ల్లో ఆడుతూ, ఐపీఎల్లో దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలవడం ఇదే మొదటిసారి. లెగ్ స్పిన్ ఆల్రౌండర్ అయిన నిఖిల్ వేలంలో సెట్ 35లో (ఆల్రౌండర్లు) షార్ట్లిస్ట్ అయ్యాడు. షార్ట్లిస్ట్ అయిన 350 మంది ఆటగాళ్ల జాబితాలో నిఖిల్ పేరు ప్రత్యేకంగా నిలిచింది. టీమిండియాకు ఆడాలన్నదే అతని కల, కానీ..!నిఖిల్కు చిన్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలన్నదే కల. ఢిల్లీలో పుట్టి పెరిగిన అతను.. శుభ్మన్ గిల్తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు. అయితే COVID-19 సమయంలో నిఖిల్ పర్యాటకుడిగా వెళ్లి ఆస్ట్రేలియాలో చిక్కుకుపోయాడు.దీంతో అతని కెరీర్కు పుల్స్టాప్ పడిందని అంతా అనుకున్నారు. అయితే నిఖిల్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాలనుకున్న తన కలను సజీవంగానే ఉంచుకున్నాడు. అందులో భాగంగా అతను ఆస్ట్రేలియా తరఫున తన కొత్త జర్నీని స్టార్ట్ చేశాడు. నిరంతర సాధన చేస్తూ 2023–24 సీజన్లో హోబార్ట్ హరికేన్స్ తరఫున బిగ్ బాష్ లీగ్ ఆడే అవకాశం దక్కించుకున్న నిఖిల్.. తొలి సీజన్లోనే ఆకట్టుకున్నాడు. ఫలితంగా అతనికి ఈ ఏడాదే టాస్మానియా తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం కూడా దక్కింది. అరంగేట్రం మ్యాచ్లోనే నిఖిల్ చెలరేగిపోయాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. గత నెలలో బ్యాటర్గానూ సత్తా చాటి, న్యూ సౌత్ వేల్స్పై శతకంతో విరుచుకుపడ్డాడు. -
ఐపీఎల్-2026 వేలంలో బిగ్ ట్విస్ట్..! ఫైనల్ లిస్ట్ ఖరారు
ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేలంలో పాల్గోనే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం కోసం మొత్తం 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 350 మంది షార్ట్లిస్ట్ అయినట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. ఈ లిస్ట్లో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన 35 మంది ఆటగాళ్లు ఉండటం గమనార్హం. సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తొలుత తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో మొదటి ప్రకటించిన జాబితాలో అతడు పేరు లేదు. కానీ చివరి నిమిషంలో తన మనసును మార్చుకుని వేలంలో పాల్గోవాలని నిర్ణయించుకున్నాడు.దీంతో కొన్ని ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు డి కాక్ను తుది జాబితాలో చేర్చారు. డికాక్ తన బేస్ ధరను 50 శాతం తగ్గించుకున్నాడు. కనీస ధర రూ. రూ.కోటి రూపాయలతో అతడు వేలం బరిలోకి దిగనున్నాడు. ఈ 35 మంది క్రికెటర్లలో శ్రీలంక, సౌతాఫ్రికా ప్లేయర్లతో పాటు భారత దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇక వేలానికి సంబంధించిన విదివిధానాలు బీసీసీఐ ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలను మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.వేలం రూల్స్ ఇవే..ఈ మినీ వేలం మొదట క్యాప్డ్ (Capped) ఆటగాళ్లతో ప్రారంభమవుతుంది. ఇందులో బ్యాటర్లు, ఆల్-రౌండర్లు, వికెట్ కీపర్-బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఉంటారు. తరువాత అన్క్యాప్డ్ (Uncapped) ఆటగాళ్లతో పూర్తి రౌండ్ కొనసాగుతుంది.మొదటి 70 మంది ఆటగాళ్ల పేక్లు పూర్తయిన తర్వాత మిగిలిన ప్లేయర్ల కోసం యాక్సిలరేటెడ్ రౌండ్ను నిర్వహించనుంది. చివగా తొలి మూడు రౌండ్లలో అమ్ముడుపోని ఆటగాళ్లు ఆఖరిలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అయితే ఈసారి మార్క్యూ లిస్ట్ రౌండ్ ఉండదు. తొలి రౌండ్లో కెమెరూన్ గ్రీన్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, డేవిడ్ మిల్లర్ వంటి విదేశీ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. అదే విధంగా వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్కు కూడా భారీ ధర దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ వేలంలో అన్ని జట్లు కలిపి మొత్తం 77 స్లాట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో 31 విదేశీ స్థానాలు ఉన్నాయి.ఐపీఎల్ వేలంలో కొత్త ఆటగాళ్లువిదేశీ ఆటగాళ్లు: అరబ్ గుల్ (ఆఫ్ఘనిస్తాన్), మైల్స్ హమ్మండ్ (ఇంగ్లండ్), డాన్ లాటెగాన్ (ఇంగ్లండ్), క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), కానర్ ఎస్టర్హూజెన్ (దక్షిణాఫ్రికా), జార్జ్ లిండే (దక్షిణాఫ్రికా), బయాండా మజోలా (దక్షిణాఫ్రికా), ట్రావీన్ మాథ్యూ (శ్రీలంక), డిసురి లంకాల్ (పెర్నాగెసల్ వెల్సాల్ లంకా), డిసురి లంకాల్ (శ్రీలంక), అకీమ్ అగస్టే (వెస్టిండీస్).భారత ఆటగాళ్లు: సాదేక్ హుస్సేన్, విష్ణు సోలంకి, సబీర్ ఖాన్, బ్రిజేష్ శర్మ, కనిష్క్ చౌహాన్, ఆరోన్ జార్జ్, జిక్కు బ్రైట్, శ్రీహరి నాయర్, మాధవ్ బజాజ్, శ్రీవత్స ఆచార్య, యష్రాజ్ పుంజా, సాహిల్ పరాఖ్, రోషన్ వాఘ్సారే, యష్ డిచోల్కర్, అయాజ్క్ వల్కర్, ధుర్మిల్త్ ఖాన్, ధుర్మిల్త్ ఖాన్ పురవ్ అగర్వాల్, రిషబ్ చౌహాన్, సాగర్ సోలంకి, ఇజాజ్ సవారియా, అమన్ షెకావత్.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
యువ సంచలనంపై ముంబై కన్ను.. ఎవరీ ముకుల్ చౌదరి?
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు ఓ యువ సంచలనం అద్భుత ప్రదర్శలనతో అన్ని ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీపై అతడు ఇన్నింగ్స్ అభిమానులను, టాలెంట్ స్కౌట్స్ను సైతం ఆశ్చర్యపరిచింది.ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చే సత్తా అతడిది. తన విధ్వంసకర బ్యాటింగ్తో దేశవాళీ క్రికెట్లో నయా ఫినిషర్గా పేరు గాంచాడు. అతడే రాజస్తాన్ పవర్ హిట్టర్ 21 ఏళ్ల ముకుల్ చౌదరి.ఢిల్లీపై అద్బుతం.. ఎవరీ ముకుల్ చౌదరి?రాజస్తాన్లోని ఝుంఝునుకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరి దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఫస్ట్ క్లాస్, సీనియర్ టీ20 క్రికెట్ మ్యాచ్లు ఇప్పటివరకు పెద్దగా ఆడకపోయినప్పటికి.. అండర్-23 టోర్నీల్లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఢిల్లీపై విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో 176 పరుగుల లక్ష్య చేధనలో రాజస్తాన్ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయం అని భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన ముకల్ అద్భుతం చేశాడు.ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగి తన జట్టును ఒంటి చేత్తే గెలిపించాడు. కేవలం 26 బంతుల్లోనే 1 ఫోర్లు, 7 సిక్స్లతో 62 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముకుల్ 2023లో రాజస్తాన్ సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. కానీ అతడికి పెద్దగా అవకాశాలు లభించలేదు. అతడు ఇప్పటివరకు మూడేసి చొప్పున ఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్లు ఆడాడు.లీడింగ్ రన్ స్కోరర్గా..ముకుల్ ఇటీవల ముగిసిన అండర్ 23 వన్డే టోర్నమెంట్లో రాజస్తాన్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్డే టోర్నీలో అతడు 102.83 సగటుతో 617 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి.అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 147గా ఉంది. అదేవిధంగా టోర్నమెంట్లో అత్యధికంగా 34 సిక్సర్లు బాదాడు. ఈ ప్రదర్శనలతో సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టిని అతడు ఆకర్షించాడు. దీంతో దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో ఆడే అవకాశం చౌదరికి లభించింది.ఈసారి మాత్రం తన వచ్చిన అవకాశాన్ని అతడు అందిపుచ్చుకున్నాడు. పేస్, స్పిన్ రెండింటినీ అతడు సమర్థవంతంగా ఎదుర్కోగలడు. అంతేకాకుండా అతడి షాట్ సెలక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది.ముంబై కన్ను..కాగా ఈ యువ సంచలనంపై ముంబై ఇండియన్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. నవంబర్ ఆఖరి వారంలో అతడు ముంబై నిర్వహించిన ట్రయల్స్కు హాజరైనట్లు సమాచారం. రియాన్ రికెల్టన్కు బ్యాకప్ వికెట్ కీపర్-బ్యాటర్గా ముకుల్ను తీసుకోవాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు టాలెంట్ స్కౌట్స్ కూడా అతడి బ్యాటింగ్ వీడియోలను పరిశీలిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది.చదవండి: చాలా చాలా బాధగా ఉంది.. మా సత్తా ఏంటో చూపిస్తాం: స్టోక్స్ -
అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్.. వణికిపోయిన బ్యాటర్లు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో మంగళవారం మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో సచిన్ తనయుడు, గోవా ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలుత బౌలింగ్లో 3 వికెట్లతో సత్తాచాటిన అర్జున్.. అనంతరం బ్యాటింగ్లో 16 పరుగులు చేశాడు. అర్జున్ పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మధ్యప్రదేశ్ ఓపెనర్లు అంకుష్ సింగ్, శివాంగ్ కుమార్లను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత డేంజరస్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ను అద్భుతమైన బంతితో జూనియర్ టెండూల్కర్ బోల్తా కొట్టించాడు. బ్యాటింగ్లో ఓపెనర్గా వచ్చిన అర్జున్ దూకుడుగా ఆడి గోవాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సీజన్లో అతడిని గోవా టీమ్ మెనెజ్మెంట్ ఓపెనర్గా ప్రమోట్ చేసింది. కానీ బౌలింగ్లో రాణిస్తున్న అర్జున్.. బ్యాటింగ్లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.లక్నోలోకి అర్జున్కాగా అర్జున్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. రాబోయో ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు అతడు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ 2026కు ముందు ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ను లక్నో ట్రేడ్ చేసుకుంది. అర్జున్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్తో వున్నప్పటికి.. 2023 సీజన్లో అరంగేట్రం చేశాడు. ఈ జూనియర్ టెండూల్కర్ ఇప్పటివరకు ముంబై ఫ్రాంచైజీ తరపున కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. జట్టులో బుమ్రా, బౌల్ట్ వంటి బౌలర్లు ఉండడంతో అర్జున్కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇప్పుడు లక్నో తరపున అర్జున్కు ఎక్కువగా ఛాన్స్ లభించే సూచనలు కన్పిస్తున్నాయి.గోవా ఘన విజయం..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్పై గోవా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎంపీ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని గోవా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.కెప్టెన్ సుయాష్ ప్రభుదేశాయ్(50 బంతుల్లో 75) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు అభినవ్ 55 పరుగులతో రాణించాడు.చదవండి: సర్ఫరాజ్ మెరుపు సెంచరీ.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో -
ఐపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని ఈ ఆటగాడికే జాక్పాట్..!
ఐపీఎల్ మినీ వేలం (IPL 2026 Mini Auction) ఈనెల (డిసెంబర్) 16న అబుదాబీలో జరుగనున్న విషయం తెలిసిందే. క్రిక్బజ్ నివేదిక ప్రకారం ఈసారి వేలంలో 15 దేశాలకు చెందిన 1355 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 77 స్లాట్లు.. ఇందులో 31 విదేశీ స్లాట్ల కోసం ఈ ఆటగాళ్ల మధ్య పోటీ జరుగుతుంది. ఈసారి వేలం బరిలో హేమాహేమీలు ఉన్నట్లు తెలుస్తుంది. భారత్ నుంచి పృథ్వీ షా, వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్.. ఆస్ట్రేలియా నుంచి కెమెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్.. ఇంగ్లండ్ నుంచి జానీ బెయిర్స్టో, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, టామ్ కర్రన్.. శ్రీలంక నుంచి వనిందు హసరంగ, మతీష పతిరణ.. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర.. బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నవీన్-ఉల్-హక్.. సౌతాఫ్రికా నుంచి గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే తదితరులు పాల్గొంటున్నారు.వీరిలో ఏ ఫ్రాంచైజీ ఎవరిని దక్కించుకుంటుంది, ఎంతిచ్చి సొంతం చేసుకుంటుందన్న అంశంపై క్రికెట్ ప్రపంచమంతా చర్చించుకుంటుంది. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నా, ఫ్రాంచైజీల అవసరాల దృష్ట్యా ఓ విషయమైతే స్పష్టమవుతుంది. ఈసారి వేలంలో ఇంగ్లండ్ డాషింగ్ వికెట్కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (Jamie Smith) జాక్పాట్ కొట్టవచ్చు.అదెలా అంటే.. వేలంలో అత్యధిక పర్స్ నిలువ ఉన్న కేకేఆర్కు వికెట్కీపర్ బ్యాటర్ అవసరం. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీ ఇటీవలే రహ్మానుల్లా గుర్బాజ్, క్వింటన్ డికాక్లను వదిలేసింది. దీంతో కేకేఆర్ జేమీ స్మిత్ కోసం ఎంతైనా ఖర్చు చేయవచ్చు. వారి వద్ద 64.30 కోట్లు ఉన్నాయి. ఇందులో జేమీ కోసం సగం వెచ్చించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.రెండోది.. వేలంలో రెండో అత్యధిక పర్స్ నిల్వ ఉన్న సీఎస్కేకు బ్యాకప్ ఓవర్సీస్ ఓపెనర్ అవసరం. జేమీ ఓపెనర్గా మెరుపులు మెరిపించగల సమర్దుడు. దేశవాలీ పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను ఓపెనర్గా సక్సెస్ అయ్యాడు.జేమీ కోసం పోటీపడే ఆస్కారమున్న మరో ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఫ్రాంచైజీకి విదేశీ ఓపెనింగ్ బ్యాటర్ అవసరముంది.జేమీ కోసం పోటీపడే ఛాన్స్ ఉన్న నాలుగో ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్. పంజాబ్ ఇటీవలే వికెట్కీపర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ను వదిలేసుకుంది. దీంతో అతని ప్రత్యామ్నాయంగా జేమీ కోసం పోటీపడవచ్చు. ఈ అవసరాల దృష్ట్యా త్వరలో జరుగనున్న ఐపీఎల్ మినీ వేలంలో జేమీ స్మిత్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడవచ్చు. -
IPL 2026: వేలానికి వేళాయే..!
2026 ఐపీఎల్ సీజన్కు సంబంధించి ఇప్పటి నుంచే హడావుడి మొదలైంది. ట్రేడింగ్, రిటెన్షన్ల ప్రక్రియ ముగియగానే ఫ్రాంచైజీలకు వేలం ఫీవర్ పట్టుకుంది. ఈసారి వేలంలో రికార్డు స్థాయిలో 1355 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారని క్రిక్బజ్ నివేదిక తెలిపింది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని దక్కించుకుంటుంది, ఎంతిచ్చి సొంతం చేసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబీలో జరుగనుంది.15 దేశాల ఆటగాళ్లుక్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ఈసారి వేలంలో భారత్ సహా 15 దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యూఎస్ఏతో పాటు మలేషియా లాంటి దేశం నుంచి ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.బరిలో హేమాహేమీలుఈసారి వేలం బరిలో హేమాహేమీలు ఉన్నట్లు తెలుస్తుంది. భారత్ నుంచి పృథ్వీ షా, వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్.. ఆస్ట్రేలియా నుంచి కెమెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్.. ఇంగ్లండ్ నుంచి జానీ బెయిర్స్టో, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, టామ్ కర్రన్.. శ్రీలంక నుంచి వనిందు హసరంగ, మతీష పతిరణ.. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర.. బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నవీన్-ఉల్-హక్.. సౌతాఫ్రికా నుంచి గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే తదితరులు పాల్గొంటున్నారు.వెంకటేష్ అయ్యర్ మరోసారి జాక్పాట్ కొడతాడా..?గత సీజన్ వేలంలో భారత ఆటగాడు వెంకటేష్ అయ్యర్ రూ. 23.75 కోట్ల రికార్డు ధర దక్కించుకొని జాక్పాట్ కొట్టాడు. భారీ అంచనాలతో కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది. అయితే వెంకటేష్ నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కేకేఆర్ అతన్ని వదిలించుకుంది. దీంతో ఈసారి అతను వేలం బరిలో నిలిచాడు. గత సీజన్లా కాకపోయినా ఈసారి కూడా వెంకటేష్కు భారీ మొత్తమే లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అతను అత్యధిక బేస్ప్రైజ్ అయిన 2 కోట్ల విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. భారత్ నుంచి వెంకటేష్తో పాటు రవి బిష్ణోయ్ మాత్రమే ఈ విభాగంలో పోటీపడుతున్నాడు.2 కోట్ల బేస్ప్రైజ్ విభాగంలో ఎవరెవరు..?2 కోట్ల బేస్ప్రైజ్ విభాగంలో ఈసారి మొత్తం 45 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్, కెమరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జేమీ స్మిత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కూపర్ కన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, జోష్ ఇంగ్లిస్, ముస్తాఫిజుర్ రహ్మాన్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, డానియల్ లారెన్స్, లియామ్ లివింగ్స్టోన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్వెల్, గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, పతిరణ, తీక్షణ, హసరంగ, షాయ్ హోప్, అల్జరీ జోసఫ్ తదితరులు ఈ విభాగంలో తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు.భారత్ నుంచి ఎవరెవరు..?ఈసారి వేలంలో భారత్ నుంచి మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, రాహుల్ చాహర్, రవి బిష్ణోయ్, ఆకాశ్దీప్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ మావి, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా, కుల్దీప్ సేన్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సందీప్ వారియర్ మరియు ఉమేశ్ యాదవ్ పాల్గొంటున్నారు.మలేషియా నుంచి కూడా..?ఈసారి వేలంలో మలేషియా నుంచి ఒకరు తమ పేరును నమోదు చేసుకున్నారు. భారత మూలాలున్న ఆల్రౌండర్ విరన్దీప్ సింగ్ రూ. 30 లక్షల బేస్ ప్రైస్ విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.కోటి విభాగంలో షకీబ్బంగ్లాదేశ్ వెటరన్, 9 ఐపీఎల్ సీజన్లు ఆడిన అనుభవమున్న షకీబ్ ఉల్ హసన్ ఈసారి రూ. కోటి బేస్ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.77 స్లాట్ల కోసం పోటీ77 స్లాట్లు..ఇందులో 31 విదేశీ స్లాట్ల కోసం 1355 మంది ఆటగాళ్లు పోటీపడునున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీల వద్ద రూ. 237.55 కోట్ల నిధులు ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ. 64.30 కోట్లు, రెండో అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 43.40 కోట్లు ఉన్నాయి. -
నీ ఒంటికి వేరే జెర్సీ సూట్ అవ్వదు: షారుఖ్ ఖాన్ పోస్ట్ వైరల్
వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు వీడ్కోలు పలికాడు. గత పన్నెండు సీజన్లుగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. 2026 మినీ వేలానికి ముందు లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్పందిస్తూ.. రసెల్ను ఉద్దేశించి ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు.నీ ఒంటిపై కేకేఆర్ తప్ప ఏ జట్టు జెర్సీ అయినా..‘‘మాకెన్నో మధురమైన, అద్భుతమైన జ్ఞాపకాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆండ్రీ. నీ అద్భుత ఆట తీరుతో క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నావు. కేకేఆర్ (KKR)కు నువ్వు అందించిన సేవలు మరువలేనివి.ఇక క్రీడాకారుడిగా నీ జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. పవర్ కోచ్గా మాతో నీ ప్రయాణం కొనసాగుతుంది. నీ తెలివి, శక్తిని మన ఆటగాళ్లకు బదిలీ చేసెయ్. వారిని చాంపియన్లుగా నిలిపే ఉత్ప్రేరకంగా మారు.ఏదేమైనా నీ ఒంటిపై కేకేఆర్ తప్ప ఏ జట్టు జెర్సీ అయినా అంత బాగా కనిపించదు ఆండ్రీ. లవ్ యూ రసెల్. ఆటను ప్రేమించే ప్రతి ఒక్కరి తరఫున నేను ఈ మాట చెబుతున్నా’’ అంటూ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan).. రసెల్తో తమ జట్టుకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో వ్యక్తపరిచాడు. కాగా... కేకేఆర్ యాజమాన్యం రసెల్ (Andre Russell)ను తమ జట్టు ‘పవర్ కోచ్’గా నియమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.నాలో సిక్స్లు కొట్టే సత్తా ఉందిఇదిలా ఉంటే.. 2012 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న 37 ఏళ్ల రసెల్ 2014 నుంచి ఇప్పటి వరకు కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటైర్మెంట్ సందర్భంగా.. ‘కేకేఆర్తో బంధం విడదీయలేనిది. ఇప్పటికీ నాలో సిక్స్లు కొట్టే సత్తా... మ్యాచ్లు గెలిపించగల పట్టుదల ఉన్నాయి. కానీ వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయం అని భావించా.ఇక మీద కొత్త అవతారంలో దర్శనమిస్తా. 2026 సీజన్లో అదే ఉత్సాహంతో కేకేఆర్ ‘పవర్ కోచ్’గా పనిచేయనున్నాను. 12 సీజన్లుగా కోల్కతా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఇక్కడ నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇతర లీగ్ల్లో ఆటగాడిగా కొనసాగుతున్నా... ఐపీఎల్లో మాత్రం ప్లేయర్గా కాకుండా వేరే బాధ్యతలు నిర్వర్తించనున్నా. ఇంకా ఆడే సత్తా ఉన్నప్పుడే తప్పుకోవాలనేది నా అభిమతం.ఎంతో నమ్మకముంచారుఅందుకే ఇంకొన్నాళ్లు ఆడే దమ్ము ఉన్నప్పటికీ ముందే వీడ్కోలు పలుకుతున్నా. ఆటగాడిగా రిటైర్ అయినా... కేకేఆర్ కుటుంబంలో నేనెప్పుడూ భాగమే. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఫ్రాంచైజీ యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చించా. వాళ్లు నాపై ఎంతో నమ్మకముంచారు. ఇన్నాళ్లు మైదానంలో ప్లేయర్గా నిర్వర్తించిన బాధ్యతలను ఇకపై ‘పవర్ కోచ్’గా డగౌట్లో ఉండి చక్కబెట్టమని సూచించారు. అందుకు అంగీకరించా’ అని రసెల్ వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు.కాగా తొలి రెండు సీజన్ల పాటు ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రసెల్... ఓవరాల్గా ఐపీఎల్లో 140 మ్యాచ్లాడి 174.18 స్ట్రయిక్రేట్తో 2,651 పరుగులు చేశాడు. పేస్ ఆల్రౌండర్గా తన బౌలింగ్తోనూ ఎన్నో మ్యాచ్ల్లో జట్టుకు విజయాలు అందించిన రసెల్ 123 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
ఆండ్రీ రసెల్ కీలక నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)- 2026 వేలానికి వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఆటగాడిగా మాత్రమే క్యాష్ రిచ్ లీగ్కు గుడ్బై చెప్పిన రసెల్.. మరో కొత్త అవతారంలో అభిమానుల ముందుకు రానున్నట్లు తెలిపాడు.ఐపీఎల్-2026 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) సహాయక సిబ్బంది బృందంలో చేరనున్నట్లు రసెల్ వెల్లడించాడు. ఈ సందర్భంగా కేకేఆర్ జట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని తెలిపేలా రసెల్ (Andre Russel) ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. సుదీర్ఘ కాలంగా తనకు అండగా నిలిచిన కేకేఆర్ యాజమాన్యంతో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. వేలంలోకి వదిలిన కేకేఆర్కాగా 2012లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన రసెల్.. 2014లో కేకేఆర్లో చేరాడు. ఇక అప్పటి నుంచి కోల్కతానే ప్రయాణం సాగించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. గతేడాది టైటిల్ గెలిచిన కేకేఆర్ టీమ్లో అతడు మెంబర్ కూడా!ఈ క్రమంలో ఐపీఎల్-2025 వేలానికి ముందు కేకేఆర్ రసెల్ను రూ. 12 కోట్ల భారీ మొత్తానికి రిటైన్ చేసుకుంది. ఈ ఏడాది 10 ఇన్నింగ్స్ ఆడి 167 పరుగులు చేసిన రసెల్.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ సీజన్లో రహానే సారథ్యంలోని కేకేఆర్ చేదు ఫలితాలు చవిచూసింది. రెండో ఇన్నింగ్స్లోనూ కేకేఆర్తోనే..ఈ నేపథ్యంలో తమ ఖరీదైన ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), రసెల్ (రూ. 12 కోట్లు) 2026 వేలానికి ముందు కేకేఆర్ విడిచిపెట్టింది. దీంతో రసెల్ను తిరిగి తక్కువ ధరకు కేకేఆర్ దక్కించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. అతడు రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. అయితే, కోచింగ్ సిబ్బందిలో ఒకడిగా కేకేఆర్తో కొనసాగుతానన్న 37 ఏళ్ల రసెల్ ప్రకటన పట్ల ఆ జట్టు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐపీఎల్లో 140 మ్యాచ్లు ఆడిన రస్సెల్ 2,651 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు తీశాడు. చదవండి: IPL: సంచలన నిర్ణయం తీసుకున్న 'డుప్లెసిస్' -
అమ్మకానికి మరో ఐపీఎల్ టీమ్!
మెగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో మరో జట్టు యాజమాన్యం మారనుందా? ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్ను అమ్మకానికి పెట్టారు. తాజాగా మరో జట్టు కూడా ఇదే బాటలో పయనిస్తోందన్న సమాచారం బయటకు వచ్చింది. ఇంతకీ ఆ రెండో జట్టు ఏది? ఈ రెండు జట్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్న కొనుగోలుదారులు ఎవరో తెలుసుకోవాలని ఉందా?ఒకటి కాదు, రెండు ఐపీఎల్ జట్లు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా (Harsh Goenka) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టును విక్రయించనున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఈ రెండు టీమ్లను దక్కించుకునేందుకు నలుగురైదుగురు కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు లేదా అమెరికా చెందిన వారు ఈ జట్లను దక్కించుకోవచ్చన్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి ఆర్సీబీ, ఆర్ఆర్ జట్ల యాజమాన్యం మారే అవకాశాలు ఉన్నట్టు దీన్నిబట్టి స్పష్టమవుతోంది.రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీకి మనోజ్ బాదాలే యజమానిగా ఉన్నారు. ఆయనకు చెందిన ఎమర్జింగ్ మీడియా IPL లిమిటెడ్కు ఈ జట్టులో దాదాపు 65% వాటా ఉంది. రెడ్బర్డ్ క్యాపిటల్ పార్టనర్స్, మీడియా-వ్యాపార దిగ్గజం లాచ్లాన్ ముర్డోచ్ మైనారిటీ వాటాదారులుగా కొనసాగుతున్నారు. రెడ్బర్డ్ క్యాపిటల్ పార్టనర్స్ సుమారు 15% వాటాను కలిగి ఉంది. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం దివంగత షేన్ వార్న్ కుటుంబానికి కూడా చిన్న షేర్ ఉన్నట్టు తెలుస్తోంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైప్పటి నుంచి రాజస్థాన్ రాయల్స్ కార్యకలాపాలు, వ్యూహాత్మక నిర్ణయాలలో మనోజ్ బాదాలే కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, 2008లో ఐపీఎల్ తొలి టైటిల్ను రాజస్థాన్ రాయల్స్ గెలిచిన సంగతి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది.మార్చి నాటికి ఆర్సీబీ అమ్మకం పూర్తి2025 ఐపీఎల్ టైటిల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చే ఏడాది సీజన్కు ముందే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీని విక్రయించే ప్రక్రియను నవంబర్ 5న అధికారికంగా ప్రారంభించినట్లు ప్రస్తుత యాజమాన్యం డియాజియో ధ్రువీకరించింది. అమ్మకపు ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ముగుస్తుందని భావిస్తున్నట్టు తెలిపింది. చదవండి: స్మృతి పెళ్లి వివాదం.. చాట్లను బయటపెట్టింది నేనే..I hear, not one, but two IPL teams are now up for sale- RCB and RR. It seems clear that people want to cash in the rich valuations today. So two teams for sale and 4/5 possible buyers! Who will be the successful buyers- will it be from Pune, Ahmedabad, Mumbai, Bengaluru or USA?— Harsh Goenka (@hvgoenka) November 27, 2025 -
ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో?
ఐపీఎల్-2026 మినీ వేలం కోసం ముంబై ఇండియన్స్ (MI) తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఈ మినీ వేలానికి ముందు జమ్మూ కాశ్మీర్ పేస్ బౌలర్ ఆకిబ్ నబీని ముంబై ఇండియన్స్ ట్రయల్స్కు పిలిచినట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. నబీ శుక్రవారం ఘన్సోలీలోని ఎంఐ ఫెసిలిటీలో ట్రయల్స్కు హాజరైనట్లు సమాచారం. అబుదాబి డిసెంబర్ 16న జరగనున్న వేలంలో అతడిని కొనుగోలు చేయాలని ముంబై యాజమాన్యం బావిస్తుందంట. కాగా ఈ 29 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ గత కొన్నాళ్లగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. గత రంజీ సీజన్లో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన నబీ(44).. ప్రస్తత సీజన్లో కూడా అద్బుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు.ఈ జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ 29 వికెట్లతో సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. అయితే నబీ రెడ్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికి.. టీ20ల్లో మాత్రం అతడి గణాంకాలు అంత గొప్పగా లేవు. అయినప్పటికి తన పేస్, స్వింగ్తో పత్యర్ధి బ్యాటర్లను భయపెట్టే సత్తా అతడి వద్ద ఉంది. 2019 టీ20ల్లో అరంగేట్రం చేసిన నబీ.. 27 మ్యాచ్లలో 26.39 సగటుతో 28 వికెట్లు తీశాడు. అదే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 36 మ్యాచ్లు ఆడి 19.98 సగటుతో 125 వికెట్లు పడగొట్టాడు. కాగా మినీ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు ట్రేడ్ అయిన అర్జున్ టెండూల్కర్ స్థానాన్ని నబీతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అర్జున్ ముంబై తరపున రెండు సీజన్లలో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే 3 వికెట్లు పడగొట్టాడు. అయితే ముంబై జట్టులో జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్ వంటి అద్భుతమైన బౌలర్లు ఉండడంతో అర్జున్ పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో ముంబై అతడిని రూ.30 లక్షల బేస్ ప్రైస్కు లక్నోకు ట్రేడ్ చేసింది. ప్రస్తుతం ముంబై పర్స్లో కేవలం రూ.2.7 కోట్లు మాత్రమే ఉన్నాయి.చదవండి: ఇంకా ఏం రాస్తున్నాడు?.. వైభవ్ ఏం తప్పు చేశాడు?: కోచ్పై మాజీ క్రికెటర్ ఫైర్ -
'అతడొక అద్భుతం.. ఆర్సీబీ ప్లాన్ ఇదే'
ఐపీఎల్-2026 వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత సీజన్ మెగా వేలంలో లివింగ్స్టోన్ను రూ.8.75 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ ఆర్సీబీ యాజమాన్యం నమ్మకాన్ని ఈ ఇంగ్లీష్ క్రికెటర్ నిలబెట్టుకోలేకపోయాడు.ఎనిమిది మ్యాచ్లలో కేవలం 16 సగటుతో 112 పరుగులు చేసి తీవ్ర నిరాశపరిచాడు. దీంతో అతడిని వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. వారి పర్స్ బలాన్ని పెంచుకోవడం కోసం ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టుకు టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ కీలక సూచన చేశాడు.వచ్చే నెలలో జరగనున్న మినీ వేలంలో లివింగ్స్టోన్ను తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయాలని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మతో పాటు మూడో స్పిన్నర్గా లివింగ్స్టోన్ను ఉపయోగించుకోవచ్చని అతడు తెలిపాడు."ఐపీఎల్-2026 మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లియామ్ లివింగ్స్టోన్ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. వారు తమ పర్స్ బలాన్ని పెంచుకోవడం కోసం అతడిని వేలంలోకి విడిచిపెట్టి ఉండొచ్చు. గత సీజన్లో లివింగ్స్టోన్పై భారీ మొత్తాన్ని వెచ్చించారు. కాబట్టి ఈసారి ఆ మొత్తంతో ఇద్దరు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆర్సీబీ ప్రయత్నించవచ్చు. లివింగ్స్టోన్కు అద్భుతమైన ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆర్సీబీ ఒకవేళ పుణే(హోం గ్రౌండ్)లో ఆడితే అతడు మూడో స్పిన్నర్గా ఉపయోగపడతాడు.అదేవిధంగా వేలంలో ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వల్ కోసం ఆర్సీబీ ప్రయత్నించాలి. గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అతడిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. అతడు చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు. పిచ్ కాస్త డ్రైగా ఉంటే అతడు బంతిని అద్భుతంగా సీమ్ చేయగలడు. అదే అతడి బలం" అని తన యూట్యూబ్ ఛానల్లో కైఫ్ పేర్కొన్నాడు. మరోవైపు.. రిలీజ్ జాబితా విడుదల చేయడానికి ముందు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం లివింగ్స్టోన్ను ఆర్సీబీ వదిలించుకుంటేనే మంచిదని పేర్కొన్న విషయం తెలిసిందే. ఒకవేళ అతడిని తిరిగి కొనుగోలు చేయాలన్న తక్కువ ధరకు లభించే అవకాశం ఉందని పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరిగే అవకాశముంది.చదవండి: Ashes: ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
IPL 2026 Auction: ఫ్రాంచైజీల బలహీనతలు, లోటుపాట్లు
ఐపీఎల్ 2026 మినీ వేలానికి (IPL 2026 Auction) నెల రోజులు సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్, ట్రేడింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అన్ని ఫ్రాంచైజీల్లో 77 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ స్లాట్ల భర్తీతో ఫ్రాంచైజీలు తమ బలహీనతలను, లోటుపాట్లను పూడ్చుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీల వద్ద మిగిలి ఉన్న పర్స్ విలువ కీలకమవనుంది. కేకేఆర్ అత్యధిక పర్స్ నిలువతో వేలానికి వెళ్లనుండగా, ముంబై ఇండియన్స్ అత్యల్ప పర్సు విలువతో వేలం బరిలో నిలువనుంది. ఫ్రాంచైజీల వారీగా బలహీనతలు, లోటుపాట్లు..చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పర్స్: ₹43.4 కోట్లు స్లాట్లు: 9 (విదేశీ 4) బలహీనతలు: - జడేజా RRకి వెళ్లడం, ధోనిలో ఫినిషింగ్ సామర్థ్యం తగ్గడంతో లోయర్ మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తుంది. - పతిరణ విడుదలతో పేస్ విభాగం కూడా బలహీనంగా మారింది. - అశ్విన్ రిటైర్మెంట్, జడేజా ఆర్ఆర్కు వెళ్లడంతో స్పిన్ విభాగంలో ఖాళీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పర్స్: ₹21.8 కోట్లు స్లాట్లు: 8 (విదేశీ 4) బలహీనతలు: - అనుభవజ్ఞుడైన టాపార్డర్ బ్యాటర్ లేడు. - డుప్లెసిస్, జేక్ ఫ్రేసర్ విడుదల. - పోరెల్, విప్రాజ్, అశోతోష్, రిజ్వి లాంటి యువ ఆటగాళ్లు ఉన్నా, వారిపై మాత్రమే ఆధారపడలేని పరిస్థితి. కోల్కతా నైట్ రైడర్స్ (KKR) పర్స్: 64.3 కోట్లు స్లాట్లు: 13 (విదేశీ 6) బలహీనతలు: - ఓపెనింగ్ జంట లేకపోవడం (గుర్బజ్, డికాక్ విడుదల). - కెప్టెన్సీ కోసం సరైన ఆటగాడు అవసరం. - పేస్ విభాగంలో సంక్షోభం (నోర్జే, రస్సెల్ లేకపోవడం). రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పర్స్: ₹16.4 కోట్లు స్లాట్లు: 8 (విదేశీ 2) బలహీనతలు: - హాజిల్వుడ్, భువనేశ్వర్కు బ్యాకప్ సీమర్ లేడు. - గాయాలతో సతమతమవుతున్న హాజిల్వుడ్ అందుబాటులో ఉండటంపై స్పష్టత ఉండదు. - భువనేశ్వర్ వయసు పెరుగుతుంది. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) పర్స్: ₹25.5 కోట్లు స్లాట్లు: 10 (విదేశీ 2) బలహీనతలు: - లోయర్ మిడిలార్డర్ బలహీనంగా ఉంది. సరైన ఫినిషర్ లేడు. - స్పిన్ విభాగంలో అనుభవజ్ఞులు లేరు (చాహర్, జంపా విడుదల). లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పర్స్: ₹22.95 కోట్లు స్లాట్లు: 7 (విదేశీ 4) బలహీనతలు: - లోయర్ మిడిలార్డర్లో నమ్మదగిన బ్యాటర్ లేడు. - బౌలింగ్ విభాగం బలహీనం (బిష్ణోయి, ఆకాష్ దీప్ విడుదల). గుజరాత్ టైటాన్స్ (GT) పర్స్: ₹12.9 కోట్లు స్లాట్లు: 6 (విదేశీ 5) బలహీనతలు: - మిడిలార్డర్ బలహీనం. - రూథర్ఫోర్డ్ విడుదల, తెవాటియా, సుందర్ పెద్దగా ప్రభావం చూపకపోవడం. పంజాబ్ కింగ్స్ (PBKS) పర్స్: ₹11.5 కోట్లు స్లాట్లు: 4 (విదేశీ 2) బలహీనతలు: - మ్యాక్స్వెల్, ఇంగ్లిస్ స్థానాల్లో ఆ స్థాయి విధ్వంసకర ఆటగాళ్లు అవసరం. - వీరు లేకపోవడంతో మిడిలార్డర్ బలహీనం. రాజస్థాన్ రాయల్స్ (RR) పర్స్: ₹16.05 కోట్లు స్లాట్లు: 9 (విదేశీ 1) బలహీనతలు: - స్పిన్ విభాగం బలహీనం (తీక్షణ, హసరంగ విడుదల). - ఒక్క విదేశీ స్లాట్ మాత్రమే మిగిలి ఉండటం. ముంబై ఇండియన్స్ (MI) పర్స్: ₹2.75 కోట్లు స్లాట్లు: 5 (విదేశీ 1) బలహీనతలు: - అన్ని విభాగాలు బలంగా ఉన్నప్పటికీ, మిడిలార్డర్లో విధ్వంసకర బ్యాటర్ అవసరం. - ఒక్క విదేశీ స్లాటే ఉండటం. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ విధ్వంసకర శతకం -
IPL 2026: ‘పెంచి, పోషించి.. అతడిని ఎలా వదిలేశారు?’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పన్నెండు మంది ఆటగాళ్లను వదిలేసింది. క్యాష్ రిచ్ లీగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) జట్టును వీడగా.. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర వంటి ప్లేయర్లను వదిలించుకుంది.అయితే, సీఎస్కే ‘బేబి మలింగ’, శ్రీలంక పేసర్ మతీశ పతిరణను కూడా వేలంలోకి వదలడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. చెన్నైని ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) ప్రియ శిష్యుడిగా పేరొందాడు పతిరణ. ధోని నాయకత్వం, మార్గదర్శనంలో అంచెలంచెలుగా ఎదిగి సీఎస్కే ప్రధాన పేసర్లలో ఒకడిగా మారాడు.రూ. 20 లక్షలతో చేరి.. 13 కోట్లకు..ఐపీఎల్-2022 సీజన్ సందర్భంగా రీప్లేస్మెంట్ ప్లేయర్గా రూ. 20 లక్షలతో సీఎస్కేలో చేరాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే.. 2023లో రూ. 20 లక్షలకు జట్టుతో ఉన్న ఈ యువ పేసర్.. చెన్నై ఐదోసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 12 మ్యాచ్లు ఆడి ఏకంగా 19 వికెట్లు కూల్చి సత్తా చాటాడు.ఇక గతేడాది రూ. 20 లక్షలకు పతిరణను రిటైన్ చేసుకోగా.. గాయం వల్ల ఆడలేకపోయాడు. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఏకంగా రూ. 13 కోట్లు వెచ్చించి చెన్నై అతడిని అట్టిపెట్టుకుంది. అయితే, ఈసారి పతిరణ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 12 మ్యాచ్లు ఆడి కేవలం 13 వికెట్లు తీశాడు. ఎకానమీ 10.13.పెంచి, పోషించి.. అతడిని ఎలా వదిలేశారు?ఈ నేపథ్యంలోనే చెన్నై పతిరణను విడిచిపెట్టడం గమనార్హం. ఈ విషయంపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘పతిరణ కోసం సీఎస్కే చాలా ఖర్చు చేసింది. అతడిని పెంచి, పోషించి.. తీర్చిదిద్దింది.అతడు కూడా జట్టు కోసం శ్రమించాడు. విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నిజానికి పతిరణ ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్లలో ఆడుతున్నాడు. వేర్వేరు వికెట్లపై ఎలా బౌలింగ్ చేయాలో అతడికి అవగాహన ఉంది. నైపుణ్యం గల బ్యాటర్లను కూడా పతిరణ బోల్తా కొట్టించగలడు.అలాంటి బౌలర్ను.. ముఖ్యంగా తాము పెద్ద చేసిన బౌలర్ను సీఎస్కే ఎలా వదిలేసిందో నాకైతే అర్థం కావడం లేదు. గతేడాది కాస్త వెనుకబడినా అతడు తిరిగి పుంజుకోగలడు. అతడిపై మరోసారి నమ్మకం ఉంచాల్సింది’’ అని సబా కరీం అభిప్రాయపడ్డాడు.సీఎస్కేలోకి సంజూ శాంసన్ఇదిలా ఉంటే.. సుదీర్ఘకాలంగా తమతో ఉన్న రవీంద్ర జడేజాతో పాటు.. సామ్ కర్రాన్ను వేలానికి ముందే రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ చేసింది సీఎస్కే. ఇందుకు బదులుగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ను తమ జట్టులోకి చేర్చుకుంది. ఇక ఐపీఎల్-2026 సీజన్లోనూ రుతురాజ్ గైక్వాడ్నే తమ కెప్టెన్గా కొనసాగిస్తామని ఇప్పటికే సీఎస్కే స్పష్టం చేసింది.చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ లిస్టుమతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).చదవండి: IPL 2026: ‘కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతా’ -
IPL 2026: ‘సన్రైజర్స్కు అతడు దొరకడు.. ఈసారి..’
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీని వదులుకుంది. రూ. 10 కోట్ల మొత్తానికి లక్నో సూపర్ జెయింట్స్కు అతడిని ట్రేడ్ చేసింది. అదే విధంగా.. ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. ఫలితంగా వేలం కోసం సన్రైజర్స్ పర్సులో రూ. 25.50 కోట్లు మిగిలాయి.ఇక డిసెంబరు 16న అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం (IPL 2026 Auction) జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్రైజర్స్ యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. బ్యాటింగ్ పరంగా జట్టు బాగుంటే చాలదని.. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపాడు.బౌలింగ్ విభాగంపై శ్రద్ధ పెడితేనే..ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరి మదిలోనూ ఒకే ప్రశ్న. బౌలింగ్ పరంగా సన్రైజర్స్ పరిస్థితి ఎలా ఉంది?.. ఈసారి వాళ్లు కచ్చితంగా తమ బౌలింగ్ విభాగంపై శ్రద్ధ పెట్టి పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది.బ్యాటింగ్లో వాళ్లకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్క సీజన్లో బాగా ఆడలేనంత మాత్రాన వాళ్ల బ్యాటింగ్ విభాగం చెత్తదేమీ అయిపోదు. అయితే, బౌలింగ్ పరంగా మాత్రం జట్టు బలహీనంగా ఉంది. నాకు తెలిసి వాళ్లు ఈసారి కామెరాన్ గ్రీన్ కోసం ప్రయత్నించవచ్చు.సన్రైజర్స్కు అతడు దొరకడుకానీ అతడు వాళ్లకు దొరకడనే అనిపిస్తోంది. సన్రైజర్స్కు ముందుగా నాణ్యమైన స్పిన్నర్ అవసరం ఉంది. ఆ జట్టులో స్పిన్నర్లు లేరు. జీషన్ అన్సారీ ఒక్కడే ఏం చేయగలడు? అతడికి తోడుగా మరికొంత మంది స్పిన్నర్లు కావాలి. నాకు తెలిసి ఆదిల్ రషీద్పై దృష్టి పెడతారేమో!వాళ్లకు ఇప్పుడు వికెట్లు తీయగల స్పిన్నర్ కావాలి. మూడు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చినా కనీసం మూడు వికెట్లు తీసే స్పిన్ బౌలర్ కావాలి. అన్రిచ్ నోర్జే లాంటి ఫాస్ట్ బౌలర్ కూడా దొరికితే ఇంకా మంచిది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.వేలానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు వీరేప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్. సన్రైజర్స్ రిలీజ్ చేసిన ప్లేయర్లురాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), వియాన్ ముల్దర్ (రూ. 70 లక్షలు), అథర్వ టైడే (రూ. 30 లక్షలు), సచిన్ బేబి (రూ. 30 లక్షలు), మొహమ్మద్ షమీ (రూ. 10 కోట్లు- ట్రేడింగ్).చదవండి: IPL 2026: ‘కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతా’ -
IPL 2026: ‘కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతా’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటిదాకా వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) ఒకే జట్టుతో కొనసాగాడు. రూ. 20 లక్షల కనీస ధరతో ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను 2021లో కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్ (KKR) వరుస అవకాశాలు ఇచ్చి అతడిని ప్రోత్సహించింది.ఇందుకు తగ్గట్లుగానే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వెంకటేశ్ అయ్యర్.. ఫ్రాంఛైజీ నమ్మకాన్ని చూరగొన్నాడు. ఫలితంగా జట్టులో చేరిన మరుసటి ఏడాదే అంటే.. 2022లో వేలానికి ముందు కేకేఆర్ అతడిని ఏకంగా రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. భారీ హైక్ ఇచ్చి వరుస మ్యాచ్లలో ఆడించింది.మెరుపు అర్ధ శతకంతో ఇక 2023, 2024 సీజన్లలోనూ వెంకీకి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించింది. గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్ అయ్యర్ది కీలక పాత్ర. ముఖ్యంగా ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మూడో స్థానంలో వచ్చిన వెంకీ మెరుపు అర్ధ శతకంతో చెలరేగాడు.హైదరాబాద్ విధించిన 114 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (32 బంతుల్లో 39) ఓ మోస్తరుగా రాణించగా.. సునిల్ నరైన్ (6) విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో వన్డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచి.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా చెన్నై వేదికగా రైజర్స్ను ఓడించిన కేకేఆర్ ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.ఏకంగా రూ. 23.75 కోట్లుఈ క్రమంలో ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు వెంకటేశ్ అయ్యర్ను కేకేఆర్ రిలీజ్ చేసింది. ఆక్షన్లో భారీ పోటీ నెలకొన్నా.. రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసి అతడిని మళ్లీ సొంతం చేసుకుంది. తద్వారా అతడి మొదటి జీతానికి దాదాపు 3900 శాతం హైక్ ఇచ్చింది.కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతాఅయితే, ఈసారి వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా నిరాశపరిచాడు. పదకొండు మ్యాచ్లలో కలిపి కేవలం 142 పరుగులే సాధించిన అతడు.. సీజన్ మొత్తంలో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. దీంతో తాజాగా మరోసారి కేకేఆర్ వెంకటేశ్ను వేలంలోకి వదిలింది. కానీ ఈసారి అతడిని మళ్లీ సొంతం చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించకపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో వెంకటేశ్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. క్రిక్ట్రాకర్తో మాట్లాడుతూ.. ‘‘నాలాంటి ఆటగాళ్లకు ఐపీఎల్లో ఆడటమే గొప్ప అదృష్టం. ఏ జట్టుకు ఆడినా.. నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా.ఒకవేళ నా హృదయం చెప్పినట్లు వినాలంటే.. ఇప్పటికీ కేకేఆర్తోనే ఉండాలని కోరుకుంటున్నా. కేకేఆర్తో కలిసి చాంపియన్గా నిలిచాను. అక్కడే కొనసాగాలని అనుకుంటున్నాను. కేకేఆర్కు మరింత పేరు తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నాను.నాయకత్వ బృందంలో ఉండటం ఇష్టంఎందుకంటే ఐదేళ్ల పాటు వాళ్లు నాపై పూర్తి నమ్మకం ఉంచారు. నన్ను ప్రోత్సహించారు. అయితే, ఈసారి వేలంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడాల్సి వస్తుంది. ఏదేమైనా.. ఎక్కడికి వెళ్లినా నా సర్వస్వం ధారబోసి జట్టును గెలిపించేందుకు కృషి చేస్తానని అందరికీ తెలుసు.బ్యాటింగ్, బౌలింగ్ పరంగానే కాదు.. నాయకత్వ బృందంలో ఉండటం నాకు ఇష్టం. కెప్టెన్కు అవసరమైన సలహాలు ఇచ్చేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటాను’’ అని వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా 2025లో వెంకీని కెప్టెన్ చేస్తారని భావించగా.. అనూహ్య రీతిలో కేకేఆర్ వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేను సారథిగా నియమించింది. అతడి కెప్టెన్సీలో ఘోర పరాభవం చవిచూసింది. పద్నాలుగింట కేవలం ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. చదవండి: IND Vs PAK: మళ్లీ భారత్ × పాకిస్తాన్ ఫైనల్? -
IPL 2026: ‘అతడొక డమ్మీ కెప్టెన్.. చేసేదంతా వేరొకరు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్ సందడి మొదలైపోయింది. ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు రిటెన్షన్, రిలీజ్ జాబితాలు విడుదల చేసి వేలానికి సిద్ధమైపోయాయి. అబుదాబి వేదికగా డిసెంబరు 16న జరుగనున్న వేలం పాటలో పాల్గొనేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎనిమిది జట్లు తమ కెప్టెన్లను ఖరారు చేశాయి. ఇందులో ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)నే తమ సారథిగా కొనసాగిస్తానని చెప్పడం విశేషం. రవీంద్ర జడేజాను ఇచ్చేసి.. రాజస్తాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్ (Sanju Samson)కు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే, యాజమాన్యం మాత్రం రుతు వైపే మొగ్గుచూపింది.ఇప్పుడే జట్టులో చేరిన సంజూ శాంసన్ను ప్రస్తుతానికి వైస్ కెప్టెన్గా నియమించాలని సీఎస్కే మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడొక డమ్మీ కెప్టెన్.. రుతురాజ్ గైక్వాడ్ కేవలం పేపర్ మీద మాత్రమే సారథిగా కనిపిస్తాడని.. అతడొక డమ్మీ కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోనినే మైదానం లోపల, వెలుపల నిజమైన సారథిగా వ్యవహరిస్తాడని కైఫ్ పేర్కొన్నాడు.‘‘ధోని బ్యాటింగ్ చేయడానికి తుదిజట్టులోకి రాడు. 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయడానికి.. 20 ఓవర్ల పాటు కెప్టెన్సీ చేయడానికి మాత్రమే జట్టులో ఉంటాడు. మిగతా ఆటగాళ్లు ఎలా ఆడాలో మైదానంలోనే మార్గదర్శనం చేస్తాడు.అంతా ధోని కనుసన్నల్లోనేగైక్వాడ్ను గైడ్ చేయడానికే ధోని మైదానంలో ఉంటాడు. మెంటార్గా, కెప్టెన్గా మాత్రమే ధోని మైదానంలో దిగుతాడు. పేపర్ మీద మాత్రం గైక్వాడ్ పేరు కెప్టెన్గా ఉంటుంది. అయితే, మైదానంలో, మైదానం వెలుపల అంతా ధోని కనుసన్నల్లోనే నడుస్తుంది.కాబట్టి ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడని అనుకోవడం పొరపాటే. తనకు తానుగా ధోని ఈ నిర్ణయం తీసుకుంటే తప్ప.. అతడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశమే లేదు’’ అని కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ధోని వారసుడిగాకాగా చెన్నైని ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన దిగ్గజ కెప్టెన్ ధోని. అయితే, 2022లో తన వారసుడిగా రవీంద్ర జడేజాను ధోని ప్రకటించగా.. వరుస మ్యాచ్లలో ఓటమి నేపథ్యంలో జడ్డూ మధ్యలోనే వైదొలిగాడు. దీంతో మళ్లీ ధోనినే పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత 2024లో రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. కానీ 2025లో గాయం వల్ల రుతు కూడా మధ్యలోనే దూరం కాగా.. మళ్లీ ధోనినే సారథిగా వ్యవహరించాడు. చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు! -
సంజూ ఎంట్రీ.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన సీఎస్కే
టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘన స్వాగతం పలికింది. అదిరిపోయే వీడియోతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను తమ జట్టులోకి ఆహ్వానించింది. ఇందులో మలయాళీ డైరెక్టర్, నటుడు బాసిల్ జోసెఫ్ (Basil Joseph) కూడా కనిపించడం విశేషం.రూ. 18 కోట్లు చెల్లించిఐపీఎల్-2026 వేలానికి ముందే సీఎస్కే సంజూ శాంసన్ (Sanju Samson)ను తమ ఫ్రాంఛైజీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. రూ. 18 కోట్లు చెల్లించి మరీ రాజస్తాన్ రాయల్స్ నుంచి సంజూను సీఎస్కే సొంతం చేసుకుంది. రాయల్స్ కెప్టెన్ను తమ జట్టులో చేర్చుకునేందుకు.. దాదాపు పదమూడేళ్లుగా తమతో కలిసి ప్రయాణం చేస్తున్న స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై వదులుకుంది.వైస్ కెప్టెన్గా సంజూ!జడ్డూతో పాటు.. సామ్ కర్రాన్ను కూడా రాజస్తాన్ రాయల్స్కు ఇచ్చేసి.. సంజూను ట్రేడ్ చేసుకుంది సీఎస్కే. అంతేకాదు.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు డిప్యూటీగా.. వైస్ కెప్టెన్గా సంజూను నియమించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. ఇక సంజూకు స్వాగతం పలుకుతూ.. ‘‘చేటా ఈజ్ హియర్ (అన్న వచ్చేశాడు)’’ సీఎస్కే షేర్ చేసిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది.భారీ కటౌట్ఇందులో బాసిల్ జోసెఫ్.. ‘‘సోదరా.. సమయం వచ్చింది. పని మొదలుపెట్టండి.. ఎలాంటి తప్పిదాలు జరగకూడదు. మన వాళ్లందరినీ తీసుకురండి. సమయానికల్లా అంతా సిద్ధమైపోవాలి’’ అని చెప్పగా ఓ బృందమంతా కలిసి రాత్రీపగలు కష్టపడి సంజూ భారీ కటౌట్ను ఏర్పాటు చేస్తాయి. ఈ క్రమంలోనే సంజూ కూడా ఎల్లో జెర్సీ వేసుకుని రెడీ అయిపోతాడు. ఆఖర్లో విక్రమ్ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సంజూ ఎంట్రీకి మరింత హైప్ ఇచ్చారు. ‘‘రావాలనుకున్నపుడే.. సరైన సమయంలోనే వచ్చా’’ అన్న క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా సంజూ శాంసన్ చాలా ఏళ్లుగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్నాడు. 2022లో జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే, గతేడాది ఫిట్నెస్ సమస్యల వల్ల ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయాడు. ఇందుకు తోడు మేనేజ్మెంట్తో విభేదాలు తలెత్తాయనే వార్తలు రాగా.. సంజూ సీఎస్కేకు మారడం గమనార్హం. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 172 ఇన్నింగ్స్ ఆడిన సంజూ 4704 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు! View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. ప్రత్యర్థులకు చుక్కలే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలు స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చాయి. తమ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉన్న క్రికెటర్లను కూడా వేలంలోకి విడిచిపెట్టాయి. టాటా.. బైబైముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ తమ అత్యంత ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్తో పాటు.. చాలా ఏళ్లుగా జట్టుతో కొనసాగుతున్న దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్కు స్వస్తి పలికింది. వీరిద్దరితో పాటు సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ (Quinto De Kock)ను కూడా జట్టు నుంచి రిలీజ్ చేసింది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell)ను వదిలేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ భారత స్పిన్నర్ రవి బిష్ణోయి (Ravi Bishnoi)ని వదిలించుకుంది. అదే విధంగా.. టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ను కూడా రిలీజ్ చేసింది.వదిలేశారుఇక చెన్నై సూపర్ కింగ్స్ సైతం ఊహించని రీతిలో శ్రీలంక యువ పేసర్, ధోని ప్రియ శిష్యుడిగా పేరొందిన మతీశ పతిరణను వేలంలోకి వదిలింది. రాహుల్ త్రిపాఠి సేవలకు కూడా గుడ్బై చెప్పింది.అదే విధంగా ఈ సీజన్తో ట్రోఫీ గెలవాలన్న కల నెరవేర్చుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మయాంక్ అగర్వాల్ను వదిలివేయగా.. సన్రైజర్స్ హైదరాబాద్ అభినవ్ మనోహర్కు టాటా చెప్పేసింది. రాజస్తాన్ రాయల్స్ ఆకాశ్ మధ్వాల్కు వీడ్కోలు పలకగా.. అరంగేట్రంలోనే దుమ్ములేపిన కేరళ బౌలర్ విఘ్నేశ్ పుతూర్ను వదిలేసింది.ఫ్రాంఛైజీలు వదిలేసిన ఈ పదకొండు ఆటగాళ్లు కలిస్తే గొప్ప ప్లేయింగ్ ఎలెవన్ను తయారు చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు. వీళ్లంతా కలిసి ఉండే తుదిజట్టుతో ప్రత్యర్థి జట్టును వణికించవచ్చని అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఎవరెవరు ఏ స్థానంలో సరిపోతారంటే?టాపార్డర్క్వింటన్ డికాక్ కెప్టెన్గా, వికెట్ కీపర్గా బెస్ట్ ఆప్షన్. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఓపెనర్గానూ విధ్వంసం సృష్టించగలడు. ఇక అతడికి తోడుగా మయాంక్ అగర్వాల్ కొత్త బంతిని ఎదుర్కోవడంలో సత్తా చాటగలడు. మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠి కుదురుకున్నాడంటే అతడికి తిరుగు ఉండదు.మిడిలార్డర్లో పవర్ హిట్టర్స్ఇక త్రిపాఠి తర్వాతి స్థానంలో ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ భేష్. ఐదో స్థానంలో గ్లెన్ మాక్స్వెల్ పవర్హిట్టర్గా దంచేయగలడు. ముఖ్యంగా స్పిన్ను ఈ ఆల్రౌండర్ సమర్థంగా ఎదుర్కోగలడు. అదే విధంగా.. ఆఫ్ స్పిన్తో బౌలింగ్ విభాగంలోనూ సేవలు అందించగలడు.ఆరో స్థానంలో ఆండ్రీ రసెల్ను మించిన వీరుడు ఎవరూ ఉండరు. విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడే ఈ విండీస్ దిగ్గజం ఫినిషర్గా సత్తా చాటగలడు. ఆ తర్వాత అభినవ్ మనోహర్ బ్యాటింగ్కు వస్తే బాగుంటుంది. దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలడు.బౌలింగ్ విభాగం.. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్డెత్ ఓవర్లలో లంక పేసర్ మతీశ పతిరణ స్పెషలిస్టు బౌలర్గా దుమ్ములేపగలడు. అతడికి తోడుగా ఆకాశ్ మధ్వాల్ ఉంటే సరి. ఇక ఆకాశ్ దీప్ కొత్త బంతితో స్వింగ్ రాబట్టి ప్రత్యర్థులను భయపెట్టగలడు. పవర్ ప్లేలో కెప్టెన్ అనుకున్న ఫలితాన్ని రాబట్టగలడు.స్పిన్నర్ల కోటాలో రవి బిష్ణోయి నాయకుడిగా ఉంటే.. విఘ్నేశ్ పుతూర్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా అతడికి తోడుగా ఉండగలడు. మిడిల్ ఓవర్లలో ఇద్దరూ చక్కగా బంతిని రొటేట్ చేసుకుంటూ సమన్వయంతో ముందుకు సాగితే జట్టుకు తిరుగు ఉండదు.ఫ్రాంఛైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్క్వింటన్ డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్, గ్లెన్ మాక్స్వెల్, ఆండ్రీ రసెల్, అభినవ్ మనోహర్, ఆకాశ్ మధ్వాల్, రవి బిష్ణోయి, ఆకాశ్ దీప్, మతీశ పతిరణఇంపాక్ట్ సబ్స్టిట్యూట్: విఘ్నేశ్ పుతూర్.చదవండి: సాయి, పడిక్కల్ కాదు!.. గిల్ స్థానంలో ఊహించని ఆటగాడుపది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
'ఆ ఆటగాడి' కోసం తిరిగి ప్రయత్నించనున్న సీఎస్కే
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సంజూ శాంసన్ కోసం రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ను వదులుకున్న ఆ జట్టు (ట్రేడింగ్).. ఊహించని విధంగా పేస్ సంచలనం మతిష పతిరణను (Matheesha Pathirana) వేలానికి వదిలేసింది.2022 ఎడిషన్లో సీఎస్కే తరఫునే ఐపీఎల్ అరంగేట్రం చేసిన పతిరణ.. ఆ మరుసటి సీజన్లో సీఎస్కే టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆతర్వాత కూడా ఎల్లో ఆర్మీ తరఫున విశేషంగా రాణించిన పతిరణ, గత సీజన్లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.ఈ కారణంగానే సీఎస్కే యాజమాన్యం 'బేబీ మలింగ'ను వేలానికి వదిలేసిందని అంతా అనుకున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ తాజాగా స్పష్టం చేశారు.జట్టు వ్యూహాల్లో భాగంగా పతిరణను వదులుకోక తప్పలేదని వివరణ ఇచ్చారు. పర్సు బరువు పెంచుకోవడం కోసం ఈ నిర్ణయం తప్పలేదని అన్నారు. పతిరణను వేలంలో తిరిగి దక్కించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని తెలిపారు. పతిరణ విడుదలతో రూ. 13 కోట్లు ఖాళీ అవుతాయని, జట్టును బలంగా నిర్మించడానికి పెద్ద పర్సు అవసరమని, అందుకే పతిరణను విడుదల చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.పతిరణ విడుదలతో సీఎస్కే పర్సు విలువ రూ. 43 కోట్లకు చేరింది. దీంతో కేకేఆర్ తర్వాత వేలంలో పాల్గొనబోయే అతి విలువైన జట్టు సీఎస్కేనే అవుతుంది. ప్రస్తుతం కేకేఆర్ వద్ద రూ. 64 కోట్లు ఉండగా.. సీఎస్కే వద్ద రూ. 43 కోట్లు ఉన్నాయి.కాగా, తాము విడుదల చేసిన పతిరణను తిరిగి పొందడం సీఎస్కేకు అంత సులువైన పని కాదు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన అతడి కోసం ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయి. సీఎస్కే ఏ వ్యూహంతో (తక్కువ ధరకు పొందాలని) అయితే పతిరణను విడుదల చేసిందో, ఆ వ్యూహం బెడిసికొట్టవచ్చు.చదవండి: హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన ఆస్ట్రేలియా ఫుట్బాలర్ -
IPL 2026: ఎనిమిది మంది కెప్టెన్లు ఫిక్స్!.. మరి ఆ రెండు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్కు ఫ్రాంఛైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అట్టిపెట్టుకునే, విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన పది జట్లు.. వేలానికి సన్నద్ధమయ్యాయి. ఖరీదు అనుకున్న ఆటగాళ్లను ఆక్షన్లోకి వదిలి.. తిరిగి తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని కొన్ని ఫ్రాంఛైజీలు భావిస్తుండగా.. భారం అనుకున్న ఆటగాళ్లను మరికొన్ని ఫ్రాంఛైజీలు ట్రేడ్ చేసుకున్నాయి.జడ్డూకు బదులుగా సంజూఇక ట్రేడింగ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాజస్తాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన ఒప్పందం హైలైట్గా నిలిచింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్కు ఇచ్చేసిన సీఎస్కే.. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ను తమ ఫ్రాంఛైజీలోకి ఆహ్వానించింది. సంజూ రిటైన్ ధర రూ. 18 కోట్లు చెల్లించి మరీ రాజస్తాన్ నుంచి అతడిని చెన్నై ట్రేడ్ చేసుకుంది.రుతురాజ్ గైక్వాడ్కే ఓటుఈ నేపథ్యంలో సంజూకు సీఎస్కే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగగా.. చెన్నై మాత్రం రుతురాజ్ గైక్వాడ్కే ఓటు వేసింది. రిటెన్షన్, రిలీజ్ జాబితా విడుదల చేసిన వెంటనే రుతును తమ కెప్టెన్గా కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.ఇక సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తాజాగా అదే బాటలో నడువగా.. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలు కూడా తమ పాత కెప్టెన్లనే 2026లోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.ఇంకా సారథిని ప్రకటించని ఆ రెండు జట్లుఅయితే, కెప్టెన్ సంజూను సీఎస్కేకు ట్రేడ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ మాత్రం కొత్త సారథి పేరును ఇంకా ప్రకటించలేదు. మరోవైపు.. కోల్కతా నైట్ రైడర్స్ కూడా తమ కెప్టెన్గా అజింక్య రహానేను కొనసాగిస్తారా? లేదా? అన్న విషయం గురించి స్పష్టతనివ్వలేదు. కాగా డిసెంబరు 16న అబుదాబి వేదికగా ఐపీఎల్-2026 మినీ వేలం జరుగనుంది.ఐపీఎల్-2026లో జట్ల కెప్టెన్లు వీరే👑చెన్నై సూపర్ కింగ్స్- రుతురాజ్ గైక్వాడ్👑సన్రైజర్స్ హైదరాబాద్- ప్యాట్ కమిన్స్👑గుజరాత్ టైటాన్స్- శుబ్మన్ గిల్👑లక్నో సూపర్ జెయింట్స్- రిషభ్ పంత్👑రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రజత్ పాటిదార్👑ఢిల్లీ క్యాపిటల్స్- అక్షర్ పటేల్👑పంజాబ్ కింగ్స్- శ్రేయస్ అయ్యర్👑ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా.చదవండి: వెంకటేశ్ అయ్యర్కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
రూ. 30 లక్షలతో రిటైన్.. కట్ చేస్తే! ఎస్ఆర్హెచ్ బ్యాటర్ డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2025/26 సీజన్లో కర్ణాటక స్టార్ బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. హుబ్లీ వేదికగా చండీగఢ్తో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్లో రవిచంద్రన్ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. స్మరణ్ 362 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్లతో 227 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇది అతడికి రెండో ద్విశతకం కావడం గమనార్హం. అంతకుముందు కేరళతో జరిగిన మ్యాచ్లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. ఓవరాల్గా స్మరణ్కు ఇది మూడో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ. ఈ మ్యాచ్లోనే అతడు 1,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఫీట్ను కేవలం 13 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలోనే సాధించడం విశేషం.రవిచంద్రన్ డబుల్ సెంచరీ ఫలితంగా కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్ను 547/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. స్మరణ్తో పాటు కరుణ్ నాయర్(95), శ్రేయస్ గోపాల్(62), శిఖర్ శెట్టి(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. చండీఘడ్ బౌలలర్లలో జగజీత్ సింగ్, విషు తలా రెండు వికెట్లు సాధించారు.ఎస్ఆర్హెచ్లో స్మరణ్..ఐపీఎల్లో స్మరణ్ రవిచంద్రన్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.. గత సీజన్లో గాయపడిన ఆడమ్ జంపా స్థానంలో స్మరణ్ను ఎస్ఆర్హెచ్ తమ జట్టులోకి తీసుకుంది. అతని బేస్ ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే ప్రాక్టీస్ సెషన్లో స్మరణ్ గాయపడడంతో సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. అతడి స్దానంలో హర్ష్ దూబేకి అవకాశం దక్కింది. అయితే ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు సన్రైజర్స్ అతడిని రిటైన్ చేసుకుంది.చదవండి: 'ఏమి చేయాలో అతడికి తెలుసు.. మధ్యలో నీ జోక్యమెందుకు' -
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా అతడే..
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ తమ సారథి ప్యాట్ కమిన్స్పై విశ్వాసం ఉంచింది. 2026 సీజన్లో కూడా కమిన్స్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తాడని సన్రైజర్స్ యాజమాన్యం సోమవారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. కమిన్స్ వరుసగా మూడో సీజన్లో జట్టు నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నాడు. 2024లో కమిన్స్ కెప్టెన్సీలో ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచిన జట్టు... గత సీజన్లో 14 మ్యాచ్లలో 6 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో ముగించింది. ప్లే ఆఫ్స్కు చేరడంలో విఫలమైనా... 15 మంది ఆటగాళ్లను టీమ్ అట్టిపెట్టుకుంది. కమిన్స్ సారథ్యంలో రెండు సీజన్లు కలిపి 30 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ 15 గెలిచి, 14 ఓడింది. మరో మ్యాచ్లో ఫలితం తేలలేదు. ప్రస్తుతం కమిన్స్ వెన్నునొప్పి గాయం నుండి కోలుకుంటున్నాడు.ఈ క్రమంలో అతడు పెర్త్ వేదికగా జరగనున్న యాషెస్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అయితే డిసెంబర్ 4 నుంచి బ్రిస్బేన్లో ప్రారంభమయ్యే రెండో టెస్టు నాటికి కమ్మిన్స్ పూర్తి ఫిట్నెస్ సాధించినున్నట్లు తెలుస్తోంది.ముచ్చటగా మూడో సీజన్..కాగా 31 ఏళ్ల కమ్మిన్స్ ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ సీజన్ మెగా వేలంలో అతడిని రూ.20.50 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, 2023 ODI ప్రపంచ కప్లో ఆసీస్ను కమ్మిన్స్ విజేతగా నిలపడంతో తమ జట్టు పగ్గాలను కమ్మిన్స్కు ఎస్ఆర్హెచ్ అప్పగించింది. కెప్టెన్గా తన అరంగేట్ర సీజన్లో ఎస్ఆర్హెచ్ను ఫైనల్ వరకు కమ్మిన్స్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత సీజన్లో ఆరెంజ్ ఆర్మీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. అయినప్పటికి మరోసారి కమ్మిన్స్పై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మరోసారి నమ్మకం ఉంచింది. ఇక ఐపీఎల్-2026 వేలానికి ముందు సన్రైజర్స్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ(రూ.10 కోట్లు)ని లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసింది. స్టార్ స్పిన్నర్లు ఆడమ్ జంపా, రాహుల్ చాహర్లను కూడా సన్రైజర్స్ విడుదల చేసింది.ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే..పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్. స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, జీషన్ అన్సారీ.చదవండి: IND vs PAK: పాక్తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం -
ఐపీఎల్-2026 వేలానికి ముందు పిచ్చెక్కించిన బౌలర్
ఐపీఎల్-2026 వేలానికి ముందు ఓ దేశవాలీ బౌలర్ పిచ్చెక్కించే ప్రదర్శనతో చెలరేగాడు. రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా హర్యానాతో జరుగుతున్న మ్యాచ్లో అదిరిపోయే గణాంకాలతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సర్వీసస్ స్పిన్నర్ అమిత్ శుక్లా 20 ఓవర్లలో కేవలం 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. ఓ దశలో శుక్లా (Amit Shukla) పరుగులేమీ ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు.ఈ సంచలన ప్రదర్శనతో శుక్లా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించాడు. వచ్చే నెలలో జరుగబోయే వేలంలో ఫ్రాంచైజీలు ఇతగాడి కోసం ఎగబడే అవకాశం ఉంది. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ కావడం శుక్లా అదనంగా కలిసి రావచ్చు. ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యకు చెందిన శుక్లా అడపాదడపా బ్యాటింగ్ (కుడి చేతి) కూడా చేయగలడు. 22 ఏళ్ల శుక్లా అండర్-19 విభాగంలో పంజాబ్ తరఫున ఆడాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన శుక్లా 32 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 138 పరుగులు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్లో శుక్లా కేవలం ఏడు ఇన్నింగ్స్ల్లోనే 23 వికెట్లు తీసి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శిస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సర్వీసస్ 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.అంతకుముందు అమిత్ శుక్లా మాయాజాలం దెబ్బకు హర్యానా తొలి ఇన్నింగ్స్లో 111 పరుగులకే కుప్పకూలింది. శుక్లా కెరీర్లో అత్యుత్తమ గణాంకాలతో హర్యానా నడ్డి విరిచాడు. దీనికి ముందు సర్వీసస్ తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులకే ఆలౌటైంది. చదవండి: షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్, పాక్ క్రికెటర్లు -
రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్గా కుమార సంగక్కర
ఐపీఎల్-2026 సీజన్కు ముందు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ కోచింగ్ స్టాప్లో కీలక మార్పులు చేసింది. తమ జట్టు హెడ్కోచ్గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను రాజస్తాన్ నియమించింది. గత సీజన్లో రాయల్స్ ప్రధాన కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ స్దానాన్ని సంగక్కర భర్తీ చేయనున్నాడు.హెడ్కోచ్తో పాటు రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా కూడా అతడు తన సేవలను అందించాడు. సంగక్కర గతంలో కూడా ఇదే పదవుల్లో కొనసాగాడు. ఈ శ్రీలంక మాజీ కెప్టెన్ 2021లో రాజస్థాన్ ఫ్రాంచైజీలో చేరాడు. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా కెరీర్ ప్రారంభించిన అతడు కోచ్గా నియమితులయ్యాడు. అతడి దిశానిర్దేశనంలో రాజస్తాన్ నాలుగు పర్యాయాలు ప్లే ఆఫ్స్ ఆడింది. అయితే ఐపీఎల్-2025 సీజన్కు ముందు రాహుల్ ద్రవిడ్ రాకతో సంగాను రాజస్తాన్ పక్కన పెట్టింది. ఇప్పుడు ద్రవిడ్ తన పదవి నుంచి వైదొలగడంతో సంగక్కర మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని రాయల్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరిచింది. రాజస్తాన్ రాయల్స్కు రెండో ఐపీఎల్ టైటిల్ను అందించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను అని అతడు పేర్కొన్నాడు.అదేవిధంగా బ్యాటింగ్ కోచ్గా ఉన్న విక్రమ్ రాథోడ్ను లీడ్ అసిస్టెంట్ కోచ్గా రాజస్తాన్ ప్రమోట్ చేసింది. మాజీ న్యూజిలాండ్ స్టార్ షేన్ బాండ్ బౌలింగ్ కోచ్గా కొనసాగనున్నాడు. ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ట్రెవర్ పెన్నీ తిరిగి అసిస్టెంట్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.రాజస్తాన్కు కొత్త కెప్టెన్..ఇక ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్కు కొత్త కెప్టెన్ రానున్నాడు. మినీ వేలానికి ముందు రాజస్తాన్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ సంజూ శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్ను ట్రేడ్ చేసింది. సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్ వంటి స్టార్ ఆల్రౌండర్లను రాజస్తాన్ సొంతం చేసుకుంది. అయితే రాబోయో సీజన్లో రియాన్ పరాగ్ రాజస్తాన్ కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశముంది.చదవండి: IND vs SA: తొలి టెస్టులో ఓటమి.. గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం -
IPL 2026: వేలానికి సిద్ధం.. ఎవరి పర్సులో ఎంత?.. ఎన్ని ఖాళీలు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2026 వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధమయ్యాయి. తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న యాజమాన్యాలు.. భారం అనుకున్న ప్లేయర్లను వదిలించుకున్నాయి. ఇందులో ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు) వదిలేయడం హైలైట్గా నిలిచింది.వేలంలోకి వదిలేశాయిమరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని రూ. 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ రూ. 13 కోట్ల ఆటగాడు శ్రీలంక పేసర్ మతీశ పతిరణను జట్టు నుంచి రిలీజ్ చేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ భారత స్పిన్నర్ రవి బిష్ణోయి (రూ. 11 కోట్లు)ని వేలంలోకి వదిలింది.ఇక తాజా సీజన్లో చెత్త ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell- రూ. 4.2 కోట్లు)ను పంజాబ్ కింగ్స్ వదలించుకుంది. కాగా నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంఛైజీ పర్సు వాల్యూ రూ. 110 కోట్లు. మరి తాజాగా అట్టిపెట్టుకున్న, వదిలేసిన ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన తర్వాత ఏ జట్టు పర్సులో ఎంత ఉంది? ఆయా జట్లలో ఉన్న ఖాళీలు ఎన్ని? తదితర వివరాలు చూద్దాం.పది ఫ్రాంఛైజీల పర్సులో వేలం కోసం అందుబాటులో ఉన్న డబ్బు💰గుజరాత్ టైటాన్స్- రూ. 12.9 కోట్లు💰సన్రైజర్స్ హైదరాబాద్- రూ. 25.5 కోట్లు💰లక్నో సూపర్ జెయింట్స్- రూ. 22.95 కోట్లు💰పంజాబ్ కింగ్స్- రూ. 22.95 కోట్లు💰రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రూ. 16.4 కోట్లు💰ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 21.8 కోట్లు💰ముంబై ఇండియన్స్- రూ. 2.75 కోట్లు💰కోల్కతా నైట్ రైడర్స్- రూ. 64.3 కోట్లు💰రాజస్తాన్ రాయల్స్- రూ. 16.05 కోట్లు💰చెన్నై సూపర్ కింగ్స్- రూ. 43.4 కోట్లు👉కాగా వెంకటేశ్ అయ్యర్తో పాటు రూ. 12 కోట్ల విలువైన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ను వదులుకోవడంతో కోల్కతా ఖాతాలో అన్ని ఫ్రాంఛైజీల కంటే ఎక్కువ సొమ్ము ఉంది.ఏ జట్టులో ఎన్ని ఖాళీలు?🏏గుజరాత్ టైటాన్స్- 5 (✈️నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏సన్రైజర్స్ హైదరాబాద్- 10 (✈️ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏లక్నో సూపర్ జెయింట్స్- 6 (✈️నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏పంజాబ్ కింగ్స్- 4 (✈️ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - 8 (✈️ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏ఢిల్లీ క్యాపిటల్స్- 8 (✈️ఐదుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏ముంబై ఇండియన్స్- 5 (✈️ఒక విదేశీ ప్లేయర్కు చోటు)🏏కోల్కతా నైట్ రైడర్స్- 13 (✈️ఆరుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏రాజస్తాన్ రాయల్స్- 9 (✈️ఒక విదేశీ ప్లేయర్కు చోటు)🏏చెన్నై సూపర్ కింగ్స్- 9 (✈️నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు). చదవండి: IPL 2026: పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరేIPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు -
IPL 2026: జడేజా జెర్సీ మారింది
ముంబై: ఐపీఎల్ ‘ఫైవ్ స్టార్’ చాంపియన్లలో ఒకటైన చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) పెనుమార్పే చేసింది. గత రెండు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో చతికిలబడిన ఈ జట్టు వచ్చే సీజన్కు ముందు పతాక శీర్షికలకెక్కే నిర్ణయం తీసుకుంది. అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను అనూహ్యంగా బదిలీ చేసేసింది. సీఎస్కే దిగ్గజ కెప్టెన్ ధోని స్వయంగా ‘సర్ రవీంద్ర జడేజా’ అంటూ నెత్తిన పెట్టుకున్న సహచరుణ్ని... టాపార్డర్ డాషింగ్ బ్యాటర్ సంజూ సామ్సన్ కోసం రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ ట్రాన్స్ఫర్ చేసింది. రాయల్స్ జడేజాను తీసుకోగా, సామ్సన్ చెన్నై చెంత చేరాడు. మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) తమ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ను విడుదల చేసింది. రెండుసార్లు రిటెయిన్ చేసుకున్న ఫ్రాంచైజీ ఎట్టకేలకు కరీబియన్ ఆల్రౌండర్తో 11 ఏళ్ల బంధాన్ని తెంచుకుంది. రూ.23.75 కోట్లు వేలంలో పాడి మరీ కొనుక్కొన్న వెంకటేశ్ అయ్యర్ను వెంటనే ఒక సీజన్కే సాగనంపింది. సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వెటరన్ సీమర్ మొహహ్మద్ షమీని లక్నో సూపర్ జెయంట్స్ ట్రేడ్లో తీసుకుంది. మొత్తం పది ఫ్రాంచైజీల్లో అత్యధిక పర్స్ మొత్తం కోల్కతా వద్దే ఉంది. కేకేఆర్ పర్స్లో రూ. 64.30 కోట్లుండగా, 6 విదేశీ ఆటగాళ్లు సహా 13 మందిని వేలంలో కొనాలి. అత్యల్ప పర్స్ ముంబై జట్టులో ఉంది. ముంబై ఇండియన్స్ వద్ద కనీసం మూడు కోట్లయినా లేవు. చేతిలో ఉన్న రూ.2.75 కోట్లతో ఒక విదేశీ ప్లేయర్ సహా ఐదు మందిని కొనుగోలు చేయాలి. చెప్పుకోదగ్గ మార్పులు చెన్నై ఒక్క జడేజాతో సరిపెట్టలేదు. విదేశీ స్టార్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, స్యామ్ కరన్లాంటి హిట్టర్లతో పాటు ‘యార్కర్ స్పెషలిస్ట్’ పతిరణను వదులుకుంది. కేకేఆర్ రసెల్, అయ్యర్, డికాక్, మొయిన్ అలీలాంటి బ్యాటర్లతో పాటు సఫారీ పేసర్ నోర్జేని సాగనంపింది. పంజాబ్ కింగ్స్ మేటి విదేశీ హిట్టర్లను విడుదల చేసింది. మ్యాక్స్వెల్, ఇన్గ్లిస్లను వదిలేసుకుంది. తొలి సీజన్ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ తమ తురుపుముక్క, నాలుగు సీజన్లు జట్టును నడిపించిన సంజూ సామ్సన్నే కాదు హసరంగ, తీక్షణ, నితీశ్ రాణాలను వద్దనుకుంది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను వేలంలో ఏ జట్టు కన్నెత్తి చూడకపోయినా ప్రాథమిక ధరకే కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ఈసారి అర్జున్ను లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడింగ్లో కొనేందుకు సమ్మతించింది.పాత గూటికి... సీఎస్కేతో జడేజా బంధం సుదీర్ఘమైందే కానీ... మొదలైంది మాత్రం రాజస్తాన్ రాయల్స్తోనే! లీగ్ మొదలైన ఏడాదే (2008) తొలి చాంపియన్గా నిలిచిన రాయల్స్ జట్టు సభ్యుడు జడేజా ఆ మరుసటి ఏడాది కూడా రాజస్తాన్తోనే ఉన్నాడు. కానీ కాంట్రాక్టు ఒప్పందం ఉల్లంఘన కారణంతో 2010లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతనిపై ఏడాది నిషేధం విధించింది. 2011లో కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ కేరళ (ఇప్పుడు లేదు)కు ఆడాడు. 2012 నుంచి ఈ సీజన్ వరకు మధ్యలో రెండేళ్లు (2016, 2017లో సీఎస్కేపై నిషేధం కారణంగా గుజరాత్ లయన్స్) తప్ప సూపర్కింగ్స్లో విజయవంతమైన ఆల్రౌండర్గా ఉన్నాడు.ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాచెన్నై: రవీంద్ర జడేజా, ఆండ్రీ సిద్ధార్్థ, దీపక్ హుడా, కాన్వే, రచిన్ రవీంద్ర, పతిరణ, స్యామ్ కరన్, కమలేశ్ నాగర్కోటి, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వంశ్ బేడీ, విజయ్ శంకర్. ఢిల్లీ: డొనోవాన్ ఫెరీరా, దర్శన్, డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, మన్వంత్, మోహిత్ శర్మ, సిద్దీఖుల్లా. గుజరాత్: రూథర్ఫర్డ్, షనక, కొయెట్జీ, కరీమ్, కుల్వంత్, మహిపాల్ లామ్రోర్. కోల్కతా: రసెల్, వెంకటేశ్ అయ్యర్, నోర్జే, చేతన్ సకారియా, సిసోడియా, మొయిన్ అలీ, డికాక్, గుర్బాజ్, జాన్సన్. లక్నో: శార్దుల్ ఠాకూర్, డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాశ్దీప్, షామర్ జోసెఫ్, ఆర్యన్, యువరాజ్, రాజ్యవర్ధన్. ముంబై: అర్జున్ టెండూల్కర్, జాకబ్స్, కరణ్ శర్మ, లిజాద్, ముజీబుర్ రహ్మాన్, టోప్లీ, శ్రీజిత్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్. పంజాబ్: మ్యాక్స్వెల్, ఇన్గ్లిస్, ఆరోన్, జేమీసన్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే. రాజస్తాన్: సామ్సన్, నితీశ్ రాణా, ఆకాశ్, అశోక్, ఫజల్హక్, కార్తీకేయ, కునాల్ రాథోడ్, తీక్షణ, హసరంగ. బెంగళూరు: లివింగ్స్టోన్, ఇన్గిడి, మయాంక్ అగర్వాల్, మనోజ్, స్వస్తిక్ చికారా, మోహిత్ రాఠి. హైదరాబాద్: షమీ, అథర్వ, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, ముల్డర్, ఆడమ్ జంపా, సిమర్జీత్, రాహుల్ చహర్. -
సన్రైజర్స్ వ్యూహం.. అతడు జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?
ఐపీఎల్-2026 వేలం నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంఛైజీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని.. లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసింది ఎస్ఆర్హెచ్. తాజాగా వచ్చే సీజన్కు గానూ అట్టిపెట్టుకునే, వదిలేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా (Adam Zampa), సిమర్జీత్ సింగ్ వంటి ఆటగాళ్లను వదిలించుకుని పర్సును నింపుకొంది. షమీని ట్రేడ్ చేయడం ద్వారా రూ. 10 కోట్లను ఖాతాలో వేసుకుంది. అయితే, ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగా సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ను సన్రైజర్స్ వేలంలోకి వదల్లేదు.అతడు జట్టుతోనే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ట్రవిస్ హెడ్ వంటి స్టార్ ప్లేయర్లతో పాటు.. క్లాసెన్ను అట్టిపెట్టుకుంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఐపీఎల్-2025లో సన్రైజర్స్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. 13 ఇన్నింగ్స్లో కలిపి 487 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అజేయ శతకం (105) ఉండటం విశేషం.ఈ సీజన్లో సన్రైజర్స్ పద్నాలుగింట కనీసం ఆరైనా గెలిచిందంటే అందుకు కారణమైన వాళ్లలో క్లాసెన్ ముఖ్యుడు. అయితే, అతడి ప్రైజ్ ట్యాగ్ (రూ. 23 కోట్లు) కారణంగానే వేలంలోకి వదులుతారనే ఊహాగానాలు వచ్చినా.. ఫ్రాంఛైజీ మాత్రం ఆ పని చేయలేదు.పర్సులో వేలం కోసం రూ. 25.50 కోట్లురాబోయే సీజన్కు ముందు మొత్తానికి సన్రైజర్స్ ఎనిమిది మంది ఆటగాళ్లను వదిలేసింది. ఇందులో ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండగా.. ఆరుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. వీరిని రిలీజ్ చేయడం ద్వారా సన్రైజర్స్ పర్సులో వేలం కోసం రూ. 25.50 కోట్లు మిగిలాయి. మొత్తంగా పది స్లాట్లు ఖాళీ ఉండగా.. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు చోటు ఉంటుంది.సన్రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్. సన్రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరేరాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), వియాన్ ముల్దర్ (రూ. 70 లక్షలు), అథర్వ టైడే (రూ. 30 లక్షలు), సచిన్ బేబి (రూ. 30 లక్షలు), మొహమ్మద్ షమీ (రూ. 10 కోట్లు- ట్రేడింగ్).చదవండి: వెంకటేశ్ అయ్యర్కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
ఐపీఎల్-2026 మినీ వేలానికి (IPL 2026 Auction) ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడేళ్లుగా తమతో ఉన్న రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ చేసింది. జడ్డూకు బదులుగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)ను జట్టులోకి చేర్చుకుంది.ఏకంగా రూ. 18 కోట్లుసంజూ కోసం సీఎస్కే ఏకంగా రూ. 18 కోట్లు చెల్లించగా.. రాయల్స్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడేజాతో పాటు సామ్ కర్రాన్ను సీఎస్కే నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇక కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు సీఎస్కే ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కేఈ నేపథ్యంలోనే సంజూకు సీఎస్కే కెప్టెన్సీ అప్పగిస్తారనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ఊహాగానాలకు సీఎస్కే ఫ్రాంఛైజీ స్వయంగా తెరదించింది. రుతురాజ్ గైక్వాడ్నే తమ కెప్టెన్గా కొనసాగిస్తామని శనివారం స్పష్టం చేసింది. ‘‘ముందుకు నడిపించే సారథి.. మా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధ్రువీకరించింది.వైస్ కెప్టెన్గా?అంతేకాదు.. సంజూను వికెట్ కీపర్గానూ ఉపయోగించుకునేందుకు సీఎస్కే సిద్ధంగా లేనట్లే. దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఉండగా.. కీపింగ్ సేవలు వేరే ఎవరి చేతికి ఇచ్చేందుకు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపదన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి సంజూ సీఎస్కేలో ఓ సాధారణ క్రికెటర్గా మాత్రమే ఉంటాడు. అయితే, టాపార్డర్లో అతడు కీలక ఆటగాడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రుతుకు డిప్యూటీగా వైస్ కెప్టెన్గా నియమితుడైనా ఆశ్చర్యం లేదు.కేవలం నాలుగే గెలిచికాగా గత నాలుగు సీజన్లుగా రాజస్తాన్ రాయల్స్ సారథిగా ఉన్న సంజూ.. 2022లో జట్టును ఫైనల్కు చేర్చాడు. ఇదిలా ఉంటే.. 2024 సీజన్లో ధోని నుంచి పగ్గాలు అందుకున్న రుతురాజ్ కెప్టెన్గా ఇంత వరకు తనదైన ముద్ర వేయలేదు. తాజా ఎడిషన్లో గాయం కారణంగా అతడు మధ్యలోనే నిష్క్రమించగా.. మళ్లీ ధోనినే జట్టును ముందుకు నడిపించాడు.అయితే, ఈసారి సీఎస్కే ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివరన పదోస్థానంలో నిలిచింది. అందుకే ఐపీఎల్-2026కు ముందే చాలా మంది ఆటగాళ్లను వదిలించుకున్న సీఎస్కే.. వేలంలో మెరికల్లాంటి ప్లేయర్లను కొనుగోలు చేయాలనే వ్యూహంతో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లుమతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).చదవండి: వెంకటేశ్ అయ్యర్కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
వెంకటేశ్ అయ్యర్కు భారీ షాక్.. ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే
ఐపీఎల్-2026 వేలానికి ముందు తాము విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా (IPL 2026 Release List)ను పది ఫ్రాంఛైజీలు శనివారం విడుదల చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ మతీశ పతిరణ (రూ. 13 కోట్లు)ను వదిలించుకోవడం.. ఢిల్లీ క్యాపిటల్స్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ (రూ. 9 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ రవి బిష్ణోయి (రూ. 11 కోట్లు), పంజాబ్ కింగ్స్ గ్లెన్ మాక్స్వెల్ (రూ. 4.2 కోట్లు) విడుదల చేయడం హైలైట్గా నిలిచాయి.ఇక కోల్కతా నైట్ రైడర్స్ తమ ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer- రూ. 23.75 కోట్లు)ను రిలీజ్ చేయడం వీటన్నింటికంటే ప్రాధాన్యం సంతరించుకుంది.చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ లిస్టుమతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరేలియామ్ లివింగ్స్టోన్, లుంగి ఎంగిడి, మయాంక్ అగర్వాల్, టిమ్ సీఫర్ట్, బ్లెస్సింగ్ ముజర్బానీ, మనోజ్ భండాగే, మోహిత్ రాఠీ, స్వస్తిక్ చికారా.ముంబై ఇండియన్స్ వదిలేసిన ఆటగాళ్లురీస్ టాప్లీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, సత్యనారాయణ రాజు, లిజాడ్ విలియమ్స్, అర్జున్ టెండుల్కర్ (ట్రేడింగ్), కర్ణ్ శర్మ, బెవాన్ జేకబ్స్, కేఎల్ శ్రీజిత్.రాజస్తాన్ రాయల్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లువనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, ఫజల్హక్ ఫారూకీ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ, సంజూ శాంసన్ (ట్రేడింగ్), నితీశ్ రాణాఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ లిస్టుఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెగర్క్, మోహిత్ శర్మ, డొనొవాన్ ఫెరీరా, మన్వంత్ కుమార్, దర్శన్ నల్కాండే, హ్యారీ బ్రూక్.పంజాబ్ కింగ్స్ వదిలేసిన ప్లేయర్లుగ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్రవీణ్ దూబే, కుల్దీప్ సేన్, జోష్ ఇంగ్లిస్గుజరాత్ టైటాన్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లుకరీం జనత్, గెరాల్డ్ కోయెట్జి, దసున్ షనక, మహిపాల్ లామ్రోర్, కుల్వంత్ ఖెజ్రోలియా, షెర్ఫానే రూథర్ఫర్డ్ (ట్రేడింగ్)సన్రైజర్స్ హైదరాబాద్ విడిచిపెట్టిన ఆటగాళ్లురాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా, సిమర్జీత్ సింగ్, వియాన్ ముల్దర్, అథర్వ టైడే, సచిన్ బేబి, మొహమ్మద్ షమీ (ట్రేడింగ్).లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ లిస్టురవి బిష్ణోయి, డేవిడ్ మిల్లర్, ఆకాశ్ దీప్, షమార్ జోసెఫ్,ఆర్యన్ జుయాల్, యువరాజ్ చౌదరి, రాజ్వర్థన్ హంగ్రేర్కర్, శార్దూల్ ఠాకూర్ (ట్రేడింగ్)కోల్కతా నైట్ రైడర్స్ రిలీజ్ లిస్టువెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, క్వింటన్ డికాక్, స్పెన్సర్ జాన్సన్, రహ్మానుల్లా గుర్బాజ్, అన్రిచ్ నోర్జే, మొయిన్ అలీ, చేతన్ సకారియా, లవనిత్ సిసోడియా, మయాంక్ మార్కండే.చదవండి: IPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు -
IPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు విడుదల చేశాయి. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన చేశాయి.గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ జాబితా ఇదే (Gujarat Titans Retention List)శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), అనూజ్ రావత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, సాయి కిశోర్, కగిసో రబడ, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.సన్రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ జాబితా (SRH Retention List)ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్.ఢిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు (DC Retention List)అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్.కోల్కతా నైట్ రైడర్స్ రిటెన్షన్ జాబితా (KKR Retention List)అజింక్య రహానే, రోవ్మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువన్షి, సునిల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మనీశ్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణ్దీప్ సింగ్, రింకూ సింగ్లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే (LSG Retention List)అబ్దుల్ సమద్, దిగ్వేశ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్, ఐడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్, నికోలస్ పూరన్. ఆకాశ్ సింగ్, మణిమరన్ సిద్దార్థ్, ప్రిన్స్ యాదవ్. అర్జున్ టెండుల్కర్ (ముంబై నుంచి ట్రేడింగ్), మాథ్యూ బ్రిట్జ్జ్కే, రిషభ్ పంత్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మొహమమ్మద్ షమీ (సన్రైజర్స్ నుంచి ట్రేడింగ్), ఆయుశ్ బదోని, మిచెల్ మార్ష్.ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా (MI Retention List)అల్లా ఘజన్ఫర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ (లక్నో నుంచి ట్రేడింగ్), అశ్వనీ కుమార్, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్ఫర్డ్ (ట్రేడింగ్), కార్బిన్ బాష్, రఘు శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్, రాజ్ అంగద్బవా, తిలక్ వర్మ, హార్దిక్పాండ్యా, రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విల్ జాక్స్, మయాంక్ మార్కండే (ట్రేడింగ్), రియాన్ రికెల్టన్.పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ లిస్టు (PBKS Retention List)అర్ష్దీప్ సింగ్, మిచెల్ ఓవెన్, శ్రేయస్ అయ్యర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముషీర్ ఖాన్. సూర్యాంశ్ షెడ్గే, హర్నూర్ పన్నూ, నేహాల్ వధేరా, విష్ణు వినోద్, హర్ప్రీత్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్, వైశాక్ విజయ్కుమార్, లాకీ ఫెర్గూసన్, ప్రియాంశ్ ఆర్య, జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, పైలా అవినాశ్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టొయినిస్, శశాంక్ సింగ్, యజువేంద్ర చహల్.రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే (RR Retention List)ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, డొనొవాన్ ఫెరీరా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్), యుధ్వీర్ చరక్, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, క్వెనా మఫాక, షిమ్రన్ హెట్మెయిర్, లువాన్ డ్రి ప్రిటోరియస్, శుభమ్ దూబే, నండ్రీ బర్గర్, తుషార్ దేశ్పాండే, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), వైభవ్ సూర్యవంశీ.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అట్టిపెట్టుకున్న ప్లేయర్ల జాబితా (RCB Retention List)అభినందన్ సింగ్, నువాన్ తుషార, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, యశ్ దయాళ్, జేకబ్ బెతెల్, రసిఖ్ ధార్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, జోష్ హాజిల్వుడ్, సూయాంశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్. -
అందుకే రాజస్తాన్ను వీడాను: సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీ ట్రేడ్ డీల్స్ పూర్తి చేసుకున్నాయి. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసేందుకు శనివారమే (నవంబరు 15) ఆఖరి తేదీ కావడంతో తాము ట్రేడ్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడిస్తున్నాయి.జడ్డూ అటు.. సంజూ ఇటుఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాజస్తాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన భారీ ట్రేడ్ వార్తల్లో నిలిచింది. ముందుగా ఊహించినట్లే సీఎస్కే.. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను.. రాజస్తాన్కు ఇచ్చేసి.. ఆ జట్టు సారథి సంజూ శాంసన్ను తమ చెంతకు చేర్చుకుంది.ధరలో మార్పుఅయితే, ఈ ఒప్పందంలో భాగంగా సీఎస్కే సంజూకు రాజస్తాన్ గతంలో చెల్లించిన మొత్తాన్ని ఇచ్చి రూ. 18 కోట్లకు తీసుకోగా.. రాజస్తాన్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడ్డూతో పాటు సామ్ కర్రన్ (రూ. 2.4 కోట్లు)ను కూడా సీఎస్కే నుంచి తీసుకుంది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ను వీడిన నేపథ్యంలో సంజూ శాంసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. సమయం వచ్చింది గనుకే తాను జట్టును వీడానంటూ అతడు స్పష్టతనిచ్చాడు.నా సర్వస్వం ధారబోశానుఈ మేరకు.. ‘‘మనం ఇక్కడ (ప్రపంచంలో) కొన్నాళ్ల పాటే ఉంటాము. ఫ్రాంఛైజీ కోసం నా సర్వస్వం ధారబోశాను. క్రికెట్ను గొప్పగా ఆస్వాదించాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, బంధాలు పోగు చేసుకున్నాను. ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరిని నా కుటుంబ సభ్యుడిగానే భావించాను. ఇప్పుడు సమయం వచ్చింది.. అందుకే నేను ఈ జట్టును వీడి వెళ్తున్నా.నాకు ఇక్కడ లభించిన దానికి నేను ఎల్లప్పుడూ రుణపడే ఉంటాను’’ అంటూ సంజూ శాంసన్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా రాయల్స్తో చేరిన తొలి నాళ్లలో దిగిన ఫొటోను సంజూ షేర్ చేశాడు. కాగా 2013లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో చేరిన కేరళ స్టార్ సంజూ.. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్కు మారాడు. రెండేళ్లు అదే జట్టుకు ఆడాడు.ఫైనల్కు చేర్చిన సారథిఆ తర్వాత మళ్లీ 2018లో రాయల్స్లోకి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 2025 వరకు జట్టుతో కొనసాగాడు. కెప్టెన్గా రాజస్తాన్ను ముందుకు నడిపించిన సంజూ 2022 సీజన్లో ఫైనల్కు చేర్చాడు. అయితే, గుజరాత్ టైటాన్స్తో టైటిల్ పోరులో ఓడిన రాజస్తాన్ రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 176 మ్యాచ్లు ఆడిన సంజూ.. 4704 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు ఉండటం విశేషం.చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్ -
సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్
ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ను ముంబై ఇండియన్స్ విడిచిపెట్టింది. ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ను లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది. అతడి బేస్ ప్రెస్ రూ. 30 లక్షలకే లక్నో సొంతం చేసుకుంది.అర్జున్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్తో వున్నప్పటికి.. 2023లో ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి అడుగుపెట్టాడు. ఈ జూనియర్ టెండూల్కర్ ఇప్పటివరకు ముంబై ఫ్రాంచైజీ తరపున కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇక అర్జున్ ట్రేడ్పై ముంబై ఎక్స్ వేదికగా స్పందించింది. "ముంబై ఇండియన్స్ కుటుంబంలో విలువైన సభ్యుడిగా కొనసాగినందుకు అర్జున్కు ధన్యవాదాలు. లక్నో సూపర్ జెయింట్స్తో నీ ప్రయాణం విజయవంతం కావాలి. నీ సత్తాను నిరూపించుకునేందుకు మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ అర్జున్" అని ఎంఐ ఎక్స్లో రాసుకొచ్చింది.ఇక రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య భారీ స్వాప్ ట్రేడ్ డీల్ ముగిసింది. రాజస్తాన్ నుంచి సంజూ శాంసన్ను సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. అందుకు బదులుగా సీఎస్కే సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజాలను రాయల్స్కు పంపించింది.ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..1.రవీంద్ర జడేజా- చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్2. సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్ టూ చెన్నై సూపర్ కింగ్స్3. సామ్ కుర్రాన్ -చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్4. మహ్మద్ షమీ- సన్రైజర్స్ హైదరాబాద్ టూ లక్నో సూపర్ జెయింట్స్5. నితీష్ రాణా- రాజస్థాన్ రాయల్స్ టూ ఢిల్లీ క్యాపిటల్స్6.అర్జున్ టెండూల్కర్- ముంబై ఇండియన్స్ టూ లక్నో సూపర్ జెయింట్స్7. మయాంక్ మార్కండే- కోల్కతా నైట్ రైడర్స్ టూ ముంబై ఇండియన్స్8. డోనోవన్ ఫెరీరా - ఢిల్లీ క్యాపిటల్స్ టూ రాజస్థాన్ రాయల్స్9. శార్దూల్ ఠాకూర్ - లక్నో సూపర్ జెయింట్స్ టూ ముంబై ఇండియన్స్చదవండి: IND vs SA: టీమిండియాకు ఊహించని షాక్.. ఆట మధ్యలోనే -
సీఎస్కేలోకి శాంసన్, రాజస్తాన్లోకి జడేజా..
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య స్వాప్ ట్రేడ్ డీల్ అధికారికంగా పూర్తి అయింది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ను సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. అందుకు బదులుగా సీఎస్కే స్టార్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్లను రాజస్తాన్కు పంపింది.గత సీజన్కు ముందు జడేజాను రూ.18 కోట్ల భారీ వెచ్చించి సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఇప్పుడు జడేజా ధరను రూ.14 కోట్లకు తగ్గించి రాజస్తాన్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్లో రవీంద్ర జడేజా రూ.14 కోట్లు అందుకోబోతున్నాడు. సామ్ కుర్రాన్ను మాత్రం రూ. 2.4 కోట్ల ప్రస్తుత ధరకే రాయల్స్ తమ జట్టులోకి తీసుకుంది. అయితే సంజూ శాంసన్ మాత్రం ధర మారలేదు. అతడు సీఎస్కే నుంచి రూ.18 కోట్లు అందుకోనున్నాడు. ఈ ట్రేడ్ డీల్ను సీఎస్కే సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. తమ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించినందుకు సీఎస్కే యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. జడేజా 12 సీజన్ల పాటు సీఎస్కే తరపున ఆడాడు.లక్నోకి సచిన్ తనయుడు..ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి నేడే ఆఖరి రోజు కావడంతో మరికొన్ని ముఖ్యమైన ట్రేడ్ డీల్స్ జరిగాయి. సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీని రూ.10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది.అదేవిధంగా లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను కోల్కతా నైట్రైడర్స్ నుంచి ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల బెస్ప్రైస్కు ట్రేడ్ చేసుకుంది. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను అతడి ధర రూ.30 లక్షలకు లక్నో ట్రేడ్ చేసుకుంది.Aaj rumour nahi, headline likhna. Ravindra 𝑻𝒉𝒂𝒍𝒂𝒑𝒂𝒕𝒉𝒚 Jadeja is coming home ⚔️🔥 pic.twitter.com/XJT5b5plCy— Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2025ఇప్పటివరకు జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..1.రవీంద్ర జడేజా- చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్ 2. సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్ టూ చెన్నై సూపర్ కింగ్స్3. సామ్ కుర్రాన్ -చెన్నై సూపర్ కింగ్స్ టూ రాజస్థాన్ రాయల్స్4. మహ్మద్ షమీ- సన్రైజర్స్ హైదరాబాద్ టూ లక్నో సూపర్ జెయింట్స్5. నితీష్ రాణా- రాజస్థాన్ రాయల్స్ టూ ఢిల్లీ క్యాపిటల్స్ 6.అర్జున్ టెండూల్కర్- ముంబై ఇండియన్స్ టూ లక్నో సూపర్ జెయింట్స్ 7. మయాంక్ మార్కండే- కోల్కతా నైట్ రైడర్స్ టూ ముంబై ఇండియన్స్8. డోనోవన్ ఫెరీరా - ఢిల్లీ క్యాపిటల్స్ టూ రాజస్థాన్ రాయల్స్9. శార్దూల్ ఠాకూర్ - లక్నో సూపర్ జెయింట్స్ టూ ముంబై ఇండియన్స్ -
కావ్య మారన్ సంచలన నిర్ణయం!?
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు భారీ ట్రేడ్ డీల్కు రంగం సిద్దమైంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ట్రేడ్ చేసుకోనున్నట్లు సమాచారం. ఎస్ఆర్హెచ్-ఎల్ఎస్జీ మధ్య రూ. 10 కోట్ల 'ఆల్-క్యాష్ డీల్' (నగదు రూపంలో మాత్రమే చెల్లించి) ఫైనల్ అయినట్లు క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది.గత ఏడాది సీజన్ మెగా వేలంలో షమీని రూ. 10 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. అయితే ఈ రైట్ ఆర్మ్ పేసర్ మాత్రం తన స్ధాయికి తగ్గప్రదర్శన చేయలేకపోయాడు. 9 మ్యాచ్లలో 11.23 ఎకానమీ రేటుతో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఇది అతడి ఐపీఎల్ కెరీర్లోనే అత్యంత దారుణమైన ప్రదర్శన.దీంతో అతడిని మినీ వేలంలో విడిచిపెట్టేందుకు సన్రైజర్స్ ఓనర్ కావ్యమారన్ సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. అంతలోనే షమీని తమ జట్టులోకి తీసుకునేందుకు సన్రైజర్స్ యాజమాన్యంతో లక్నో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తమ జట్టులో సీనియర్ పేసర్ ఒక్కరు కూడా లేకపోవడంతో ఈ ట్రేడ్ డీల్ కోసం ఎల్ఎస్జీ ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. లక్నో జట్టులో మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ వంటి యువ పేసర్లు ఉన్నప్పటికి.. వారు ఫిట్నెస్ సమస్యలతో సతమవుతున్నారు. తాజాగా లక్నో చేసిన పోస్ట్ కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. వన్డే వరల్డ్కప్-2023లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ను షమీ క్లీన్ బౌల్డ్ చేసిన ఫోటోను లక్నో పోస్ట్ చేసింది. అయితే అందులో షమీ కన్పించకుండా ఎల్ఎస్జీ జాగ్రత్త పడింది.ఆ నలుగురికి టాటా బైబై..ఇక లక్నో సూపర్ జెయింట్స్ మినీ వేలంలో తమ పర్స్ విలువను పెంచుకోవడానికి నలుగురు ఆటగాళ్లను విడుదల చేయాలని నిర్ణయించుకుందంట. డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, షామర్ జోసెఫ్లను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో లక్నో పర్స్ విలువ రూ.27.25 కోట్లు పెరగనుంది. కాగా ఐపీఎల్-2026 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్ను ఫ్రాంచైజీలు శనివారం (నవంబర్ 15)సాయంత్రం లోపు బీసీసీఐకి సమర్పించాలి.చదవండి: ‘అసలే అతడు మరుగుజ్జు కదా!’.. బుమ్రా వ్యాఖ్యలపై స్పందించిన సౌతాఫ్రికా కోచ్! -
IPL 2026: కేకేఆర్ కీలక ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ శిక్షణా సిబ్బందిలో న్యూజిలాండ్ దిగ్గజ బౌలర్ను చేర్చుకుంది. కాగా అభిషేక్ నాయర్ను ఇప్పటికే హెడ్కోచ్గా ప్రమోట్ చేసిన కేకేఆర్.. ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ను అసిస్టెంట్ కోచ్గా నియమించుకున్నట్లు గురువారం వెల్లడించింది.‘వాట్సన్కు కేకేఆర్ కుటుంబం స్వాగతం పలుకుతోంది. ప్లేయర్గా, కోచ్గా ఈ ఆస్ట్రేలియన్కున్న విశేషానుభవం మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆటగాడిగా నిరూపించుకున్న అతడి కోచింగ్లో మా జట్టు సన్నాహాలు మరో స్థాయిలో ఉంటాయని ఆశిస్తున్నాం. అతడి సేవలతో మా జట్టు ఉన్నతశిఖరాలు అధిరోహిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని కోల్కతా ఫ్రాంచైజీ సీఈఓ వెంకీ మైసూర్ అన్నారు.ఇక తన నియామకం పట్ల ఆనందం వ్యక్తం చేసిన వాట్సన్... కేకేఆర్ బృందంలో చేరేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. కోల్కతా మరోసారి టైటిల్ గెలిచేందుకు తనవంతు కృషి చేస్తానన్నాడు. కాగా ఈ మాజీ ఆల్రౌండర్ కంగారూ తరఫున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టి20ల0 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పైచిలుకు పరుగులు, 280 వికెట్లు తీశాడు. 2007, 2015 వన్డే ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడిగా ఉన్నాడు.ఐపీఎల్లోనూ వాట్సన్ది సుదీర్ఘమైన కెరీర్ అని చెప్పొచ్చు. ప్రారంభ ఐపీఎల్ సీజన్ 2008 నుంచి 2020 వరకు 12 ఏళ్ల పాటు లీగ్ క్రికెట్ ఆడాడు. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్కింగ్స్ టైటిళ్లలోనూ భాగమయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సైతం అతను ప్రాతినిధ్యం వహించాడు.ఇదిలా ఉంటే.. తాజాగా తమ కొత్త బౌలింగ్ కోచ్ పేరును కేకేఆర్ ప్రకటించింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీని బౌలింగ్ కోచ్గా నియమించినట్లు తెలిపింది. కాగా ఇంతకు ముందు భరత్ అరుణ్ కేకేఆర్ బౌలింగ్ కోచ్గా ఉండగా.. అతడు లక్నో సూపర్ జెయింట్స్లో చేరేందుకు కోల్కతా ఫ్రాంఛైజీని వీడాడు. ఈ క్రమంలో సౌతీతో అరుణ్ భరత్ స్థానాన్ని కేకేఆర్ భర్తీ చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఇక సౌతీ 2021, 2023 సీజన్లలో ఆటగాడిగా కేకేఆర్కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. చంద్రకాంత్ పండిట్ మార్గదర్శనంలో 2023లో టైటిల్ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. కాగా.. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు సౌతీ ఆడాడు.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున 2008- 2024 వరకు ఆడిన సౌతీ.. 107 టెస్టులు, 161 వన్డేలు, 126 టీ20లలో కలిపి 776 వికెట్లు కూల్చాడు. తద్వారా కివీస్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐపీఎల్లో మొత్తంగా 54 మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. 47 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.కేకేఆర్ బౌలింగ్ కోచ్గా నియమితుడు కావడం పట్ల 36 ఏళ్ల సౌతీ స్పందిస్తూ.. ‘‘కేకేఆర్ నా సొంత జట్టు లాంటిది. కొత్త పాత్రలో జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. 2026లో జట్టు విజయం సాధించేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని హర్షం వ్యక్తం చేశాడు. -
ముంబై ఇండియన్స్లోకి శార్థూల్ ఠాకూర్..
ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు ఆటగాడిని ట్రేడ్ చేసిన మొదటి జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ నిలిచింది. లక్నో తమ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను ముంబై ఇండియన్స్కు ట్రేడ్ చేసింది. ఇరు జట్ల మధ్య ఒప్పందం అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు ఐపీఎల్ మెనెజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది."ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్.. ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. రెండు ఫ్రాంచైజీ మధ్య ట్రేడ్ డీల్ విజయవంతమైంది. గత సీజన్లో గాయపడిన ఆటగాడి స్ధానంలో శార్ధూల్ను రూ.2 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే మొత్తాన్ని ముంబై చెల్లించేందుకు సిద్దమైంది" అని ఐపీఎల్ మెనెజ్మెంట్ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ డీల్ పూర్తిగా ఆల్ క్యాష్ డీల్ (All-Cash Deal) ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ డీల్కు ఒక్కరోజు ముందు శార్దూల్కు బదులుగా అర్జున్ టెండూల్కర్ను ఇచ్చిపుచ్చుకునేందుకు లక్నో, ముంబై ఇండియన్స్ సిద్దమయ్యాయి అని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టి రూమర్సే తాజా ప్రకటనతో రుజువయ్యాయి. కాగా ఐపీఎల్-2025 వేలంలో ఠాకూర్ను ఏ జట్టు కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అయితే లక్నో పేసర్ మోహ్సిన్ ఖాన్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్దానంలో శార్ధూల్కు ఆడే అవకాశం లభించింది.రూ. 2 కోట్ల బెస్ప్రైస్కు లక్నో అతడిని దక్కించుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన శార్ధూల్.. 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక శార్ధూల్ ట్రేడ్ విషయాన్ని ముంబై ఇండియన్స్ కూడా ధ్రువీకరించింది. "డ్రీమ్స్ సిటీ అయిన ముంబైకి స్వాగతం అని ముంబై ఇండియన్స్ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. కాగా ఠాకూర్ ముంబై నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. శార్ధూల్ 2015లో పంజాబ్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. అతడు ఎక్కువ సీజన్ల పాటు సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే శార్ధూల్ ముంబై ఇండియన్స్ తరపున ఆడనుండడం ఇదే తొలిసారి. ఇక ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను నవంబర్ 15లోపు బీసీసీఐకి సమర్పించాలి.చదవండి: ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే -
కేకేఆర్ జట్టులోకి షేన్ వాట్సన్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు 'అసిస్టెంట్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ను కేకేఆర్ నియమించింది. కోల్కతా హెడ్ కోచ్ అభిషేక్ నాయర్తో కలిసి వాట్సన్ పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధ్రువీకరించాడు.షేన్ వాట్సన్ను కేకేఆర్ కుటంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆటగాడిగా, కోచ్గా అతడి అనుభవం మా జట్టు సన్నద్దతకు ఉపయోగపడుతోంది. టీ20 ఫార్మాట్పై అతడి అవగహన మా జట్టును మరో స్ధాయి తీసుకువెళ్తుందని ఆశిస్తున్నాము అని వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ట్రాక్ రికార్డు అదుర్స్కాగా ఐపీఎల్లో షేన్ వాట్సన్ ఆటగాడిగా, కోచ్గా తన సేవలను అందించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన వాట్సన్.. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. 2013 సీజన్లో కూడా మరోసారి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు. ఐపీఎల్-2018 సీజన్లో సీఎస్కే ఛాంపియన్గా నిలవడంలో వాట్సన్ది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో షేన్ చెలరేగాడు. ఇకఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్గా కూడా వాట్సన్ పనిచేశాడు. ఇప్పుడు తొలిసారి కేకేఆర్ కోచింగ్ స్టాప్లో ఈ ఆసీస్ దిగ్గజం భాగంకానున్నాడు. ఇక కేకేఆర్ అసిస్టెంట్ కోచ్గా ఎంపిక కావడం పట్ల షేన్ వాట్సన్ ఆనందం వ్యక్తం చేశాడు. కోల్కతా నైట్రైడర్స్ వంటి అద్భుత ఫ్రాంచైజీలో భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం. కోల్కతాకు మరో టైటిల్ను అందించడానికి అన్ని విధాలగా కృషి చేస్తానని వాట్సన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2024 ఛాంపియన్స్గా నిలిచిన కేకేఆర్.. గత సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. దీంతో హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్పై కేకేఆర్ వేటు వేసింది.చదవండి: నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న మరో భారత స్టార్ క్రికెటర్ -
ఐపీఎల్ చరిత్రలో అతి భారీ ట్రేడ్ డీల్స్ ఇవే..!
ఐపీఎల్ 2026కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, ట్రేడ్ డీల్కు రేపే (నవంబర్ 15) చివరి తేదీ. ఈ నేపథ్యంలో పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాడిని ట్రేడ్ చేసుకుంటుంది, పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతుంది.ట్రేడ్ డీల్స్కు సంబంధించి చాలా అంశాలు ప్రచారంలో ఉన్నా, ఓ విషయం మాత్రం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. సుదీర్ఘ చర్చల అనంతరం రాజస్థాన్ రాయల్స్-సీఎస్కే ఓ డీల్ కుదుర్చుకున్నాయని సమాచారం. రాయల్స్ సంజూ శాంసన్ను సీఎస్కేకు ఇచ్చి, బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ను ట్రేడింగ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ట్రేడ్ డీల్ ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో గతంలో జరిగిన ట్రేడ్ డీల్స్, అందులో భాగంగా జరిగిన భారీ క్యాష్ డీల్స్పై ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చాలా ట్రేడ్ డీల్స్ జరిగాయి. ట్రేడ్ డీల్ అంటే ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకోవడం ఓ పద్దతి. రెండోది వేలం బయట ఆటగాళ్లను కొనుగోలు చేయడం (క్యాష్ డీల్).ఈ ట్రేడింగ్ విండో తొలిసారి 2009 ఎడిషన్ ప్రవేశ పెట్టబడింది. ఆ ఎడిషన్లో ఆర్సీబీ నుంచి జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్కు మారాడు. ముంబై ఇండియన్స్ నుంచి రాబిన్ ఉతప్ప ఆర్సీబీకి ట్రేడ్ అయ్యాడు.అలాగే ఢిల్లీ డేర్ డెవిల్స్ నుంచి ఆశిష్ నెహ్రా ముంబై ఇండియన్స్కు మారగా.. ముంబై ఇండియన్స్ నుంచి శిఖర్ ధవన్ ఢిల్లీ డేర్ డెవిల్స్కు ట్రేడ్ అయ్యాడు.2012లో దినేశ్ కార్తీక్ క్యాష్ డీల్లో భాగంగా పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్కు మారాడు.2013లో రాస్ టేలర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పూణే వారియర్స్కు.. 2015లో పార్థివ్ పటేల్ ఆర్సీబీ నుంచి ముంబై ఇండియన్స్కు.. మన్విందర్ బిస్లా కేకేఆర్ నుంచి ఆర్సీబీకి క్యాష్ డీల్ ద్వారా బదిలి అయ్యారు. 2016లో కేదార్ జాదవ్ను ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి స్వాప్ చేసుకుంది.2019లో మన్దీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్ విషయంలో ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ మధ్య స్వాపింగ్ జరిగింది.2019లో శిఖర్ ధవన్ను డీసీ ఎస్ఆర్హెచ్ నుంచి ట్రేడ్ చేసుకుంది. శిఖర్కు బదులుగా ఎస్ఆర్హెచ్ డీసీ నుంచి విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, నదీమ్ను పొందింది. 2019- అశ్విన్ (పంజాబ్ నుంచి ఢిల్లీకి, క్యాష్ డీల్, రూ. 7.6 కోట్లు)2019- రహానే (రాజస్థాన్ నుంచి ఢిల్లీకి,స్వాపింగ్, రహానేకు బదులుగా మయాంక్ మార్కండే, రాహుల్ తెవాటియా రాయల్స్కు ట్రేడ్ అయ్యారు)2019- ట్రెంట్ బౌల్ట్ (ఢిల్లీ నుంచి ముంబై ఇండియన్స్, క్యాష్ డీల్, రూ. 3.2 కోట్లు)2020- రాబిన్ ఉతప్ప (రాజస్థాన్ నుంచి సీఎస్కే, క్యాష్ డీల్)2020- డేవియల్ సామ్స్, హర్షల్ పటేల్ (డీసీ నుంచి ఆర్సీబీ, స్వాపింగ్)2022- శార్దూల్ ఠాకూర్ (డీసీ నుంచి కేకేఆర్, క్యాష్ డీల్, రూ. 10.75 కోట్లు)2023- ఆవేశ్ ఖాన్-దేవ్దత్ పడిక్కల్ (లక్నో నుంచి రాజస్థాన్, స్వాపింగ్)2024- హార్దిక్ పాండ్యా- గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్ (క్యాష్ డీల్, రూ. 15 కోట్లు)2024- కెమరాన్ గ్రీన్- ముంబై ఇండియన్స్ నుంచి ఆర్సీబీ (క్యాష్ డీల్, రూ. 17.5 కోట్లు)- ఐపీఎల్ చరిత్రలో ఇదే అతి భారీ క్యాష్ డీల్చదవండి: IPL 2026: రేపే 'డెడ్లైన్' -
IPL 2026: రేపే 'డెడ్లైన్'
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా ఐదు నెలల సమయం ఉండగానే ఫ్రాంచైజీలన్నీ తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. ఆటగాళ్ల రిటెన్షన్కు నవంబర్ 15 డెడ్లైన్ కావడంతో మార్పులు చేర్పుల విషయంలో తలమునకలై ఉన్నాయి. మరో పక్క ట్రేడ్ డీల్స్ విషయంలోనూ చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి.సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ను వీడి సీఎస్కేలో చేరడం.. రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ సీఎస్కే నుంచి రాయల్స్కు ట్రేడ్ కావడం దాదాపుగా ఖరరాపోయింది. మరి కొంత మంది ఆటగాళ్ల విషయంలోనూ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి.కేఎల్ రాహుల్ కోసం కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కేకేఆర్ స్పిన్నర్ మయాంక్ మార్కండే, ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ కోసం ముంబై ఇండియన్స్ ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ సైతం ఓ కీలక ఆటగాడిని ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యాక, ఫ్రాంచైజీలు వేలంపై దృష్టి సారిస్తాయి. వేలంలో ఎవరెవరిని తీసుకోవాలో ఇప్పటి నుంచే ఓ ప్లాన్ వేసుకుంటున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను ముంబై ఇండియన్స్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. అర్జున్ టెండూల్కర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ యత్నిస్తున్నట్లు సమాచారం.ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడి కోసం ప్రయత్నించే అవకాశం ఉందన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.కాగా, ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ మెగా టోర్నీ మే 31న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. మినీ వేలం డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో జరిగే అవకాశం ఉంది.చదవండి: హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం -
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఎవరూ ఊహించని ఆటగాడు..!
ఐపీఎల్ 2026కి ముందు సంచలన ట్రేడ్ డీల్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ను దక్కించుకునేందుకు ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ను వదులుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఫార్మాలిటీస్ కూడా పూర్తైనట్లు సమాచారం. డీల్లో భాగంగా సంజూ సీఎస్కేలో చేరేందుకు.. జడేజా, కర్రన్ రాయల్స్లో తరఫున ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారట.అయితే చివరి నిమిషంలో రవీంద్ర జడేజా ఓ మెలిక పెట్టినట్లు ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి. రాయల్స్లో చేరితే తనకు కెప్టెన్సీ ఇవ్వాలని జడ్డూ కండీషన్ పెట్టాడట. ఇందుకు రాయల్స్ యాజమాన్యంలోని కొందరు అంగీకరించినప్పటికీ.. ఓ కీలక వ్యక్తి అడ్డు పడినట్లు సమాచారం.సంజూ ఫ్రాంచైజీని వీడాలనుకున్నప్పుడు సదరు వ్యక్తి అప్పటికే జట్టులో ఉన్న ఇద్దరి పేర్లను కెప్టెన్సీ కోసం పరిశీలిస్తానని మాట ఇచ్చాడట. ఇప్పుడు కొత్తగా జడ్డూ కెప్టెన్సీ కోసం డిమాండ్ చేయడంతో యాజమాన్యంలో భేదాభిప్రాయాలు వచ్చాయని సమాచారం. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే సీఎస్కేతో ట్రేడ్ డీల్ క్యాన్సల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా, సంజూ రాయల్స్ను వీడే విషయం ఖరారైన తర్వాత యాజమాన్యం ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్ పేర్లను కెప్టెన్సీ కోసం పరిశీలిస్తుంది. గత సీజన్లో సంజూ గైర్హాజరీలో రియాన్ పరాగ్ నాయకుడిగా వ్యవహరించినా.. అతని పేరు ప్రస్తావనకు రాలేదు. కొత్తగా జడేజా పేరు తెరపైకి రావడంతో రాయల్స్ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఐపీఎల్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.జడ్డూ ప్రొఫైల్ని బట్టి చూస్తే.. రాయల్స్ కెప్టెన్గా నియమించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అతని ఐపీఎల్ కెరీర్ ఈ ఫ్రాంచైజీతోనే మొదలైంది. అతనికి ఐపీఎల్లో కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. పైగా ఇటీవలికాలంలో అతను టీమిండియా విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు.సంజూ విషయానికొస్తే.. డీల్ కుదిరి అతను సీఎస్కేలో చేరినా కెప్టెన్సీ దక్కే అవకాశం మాత్రం లేదు. సీఎస్కేలో సంజూ సాధారణ ఆటగాడిగా కొనసాగాల్సి ఉంటుంది. రుతురాజ్ను కెప్టెన్సీ నుంచి తప్పించే యోచనలో సీఎస్కే యాజమాన్యం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. పై విషయాలపై క్లారిటీ రావాలంటే నవంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజులోపు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంది. చదవండి: ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ -
IPL 2026: ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త
2025, జూన్ 3.. ఆర్సీబీ అభిమానుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఆ రోజు ఆర్సీబీ (RCB) తమ తొలి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లకు, ముఖ్యంగా అభిమానులకు ఆ ఆనందం ఎంతో సేపు మిగల్లేదు. మరుసటి రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. అభిమానుల ఉత్సాహం, అధికారుల నిర్లక్ష్యం కలిసినప్పుడు ఎంతటి విషాదం చోటు చేసుకుంటుందో ఈ ఘటన రుజువు చేసింది.సురక్షితం కాదుఈ ఘోర విషాదంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి జాన్ మైఖేల్ డికున్హా నేతృత్వంలో ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చిన్నస్వామి స్టేడియం మ్యాచ్ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది. ఈ స్టేడియం భారీ జనసమూహాలు గుమి కూడటానికి అనర్హంగా ప్రకటించింది. కమిషన్ నిర్ణయం వల్ల ఆర్సీబీ 2026 ఐపీఎల్ సీజన్లో తమ హోం మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశం కోల్పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సమాచారం తెలిసింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ తమ తాత్కాలిక హోం గ్రౌండ్గా పూణేలోని గహున్జే స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.ఓ ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం.. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పుణేలోని గహున్జే స్టేడియాన్ని ఆర్సీబీకి తాత్కాలిక హోం గ్రౌండ్గా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ అంశంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని సాంకేతిక అంశాలు పరిష్కారమైతే, ఆర్సీబీకి పుణే వేదికగా మారే అవకాశం ఉంది.ఆర్సీబీ అభిమానులకు చేదు వార్తఈ వార్త ఆర్సీబీ అభిమానులకు తీరని శోకాన్ని కలిగిస్తుంది. 17 ఏళ్ల తర్వాత తొలి టైటిల్ సాధిస్తే.. ఆ సంతోషాన్ని హోం గ్రౌండ్లో ఆస్వాదించలేమా అని వారు వాపోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో తాము హోం గ్రౌండ్లో మ్యాచ్లు ఆడలేమని తెలిసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అన్నీ కుదిరి హోం గ్రౌండ్ పూణేకి మారితే ఆర్సీబీకి సొంత అభిమానులు దూరమయ్యే ప్రమాదం ఉంది. కొత్త వాతావరణంలో ఆర్సీబీ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఇమడటానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంపై బీసీసీఐ నుంచి కాని ఐపీఎల్ నుంచి కాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: IND vs SA: భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్ -
ఆరోజే ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026 Auction)- 2026 సీజన్ వేలం వరుసగా మూడో ఏడాది విదేశీ గడ్డపైనే జరగనుంది. తాజా సీజన్ వేలం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబి నగరాన్ని వేదికగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. కాగా 2023లో దుబాయ్, 2024లో జిద్దాలో ఐపీఎల్ లీగ్ వేలం నిర్వహించారు. అయితే, వేలంపాటకు సంబంధించిన తేదీ విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో వేలం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా పది ఫ్రాంఛైజీలు నవంబరు 15 నాటికి తాము అట్టిపెట్టుకునే, విడిచిపెట్టే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా ఐదేసి సార్లు ట్రోఫీ గెలవగా.. కోల్కతా నైట్ రైడర్స్ మూడు, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి చాంపియన్గా నిలిచాయి. ఇక 2009లో డక్కన్ చార్జర్స్ టైటిల్ గెలుచుకుంది. ఈ ఏడాది ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడగా.. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ల కల ఇంకా తీరలేదు.ఇదీ చదవండి: సరికొత్త చరిత్రజమ్మూ కశ్మీర్ జట్టు తమ రంజీ ట్రోఫీ చరిత్రలో ఘనతకెక్కే విజయాన్ని సాధించింది. గత 65 ఏళ్లుగా ఢిల్లీ చేతిలో ఇంటా బయటా ఓడిపోతూ వచ్చిన కశ్మీర్ ఇప్పుడు ఢిల్లీ గడ్డపై ఢిల్లీనే వణికించి గెలిచింది. గ్రూప్ ‘డి’లో జరిగిన ఈ మ్యాచ్లో జమ్మూ కశ్మీర్ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై జయభేరి మోగించింది. ఇది గాలివాటం గెలుపు కానేకాదు. మ్యాచ్ మొదలైన మొదటి రోజు నుంచి ఢిల్లీ బ్యాటర్లను జమ్మూ బౌలర్లు ఆకిబ్ నబీ (5/35), వంశజ్ (2/57), ముస్తాక్ (2/50) సమష్టిగా దెబ్బకొట్టారు.తర్వాత బ్యాటింగ్లో కెప్టెన్ పారస్ డోగ్రా తొలి ఇన్నింగ్స్ శతకం, ఢిల్లీ రెండో ఇన్నింగ్స్ను వంశజ్ (6/68), సాహిల్ (3/73) ఇలా ప్రతి ఒక్కరు కశ్మీర్ను గెలిపించేందుకు ప్రతీ రోజు కష్టపడ్డారు. 1960 నుంచి ఇప్పటివరకు ఢిల్లీ, జమ్మూ కశీ్మర్ జట్లు 43 సార్లు తలపడితే ఇందులో 37 మ్యాచ్ల్లో ఢిల్లీదే గెలుపు. గత సీజన్ వరకు ఢిల్లీపై గెలుపన్నదే ఎరుగని కశీ్మర్ జట్టు ఎట్టకేలకు తాజా సీజన్లో అసాధారణ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. ఇక్బాల్ అజేయ శతకం మంగళవారం 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 55/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన కశ్మీర్ 43.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (147 బంతుల్లో 133 నాటౌట్; 20 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతను బాదుతున్న బౌండరీలు, భారీ సిక్స్లతో విరుచుకుపడుతున్న వైనం చూస్తే ఇది నాలుగు రోజుల ఫస్ట్క్లాస్ మ్యాచా లేదంటే వన్డేనా అన్న సందేహం కలుగకమానదు.ఒంటిచేత్తో గెలిపించడం అంటే ఇదేనేమో అనిపించేలా దంచేశాడు. అవుటైన ముగ్గురు శుభమ్ (8), వివ్రంత్ శర్మ (3), వంశజ్ (8)లు చేసిందేమీ లేదు. ఇక్బాల్తో పాటు అజేయంగా నిలిచిన సారథి పారస్ డోగ్రా (10 నాటౌట్) పెద్ద స్కోరేం కాదు. ఈ నలుగురి కంటే కూడా ఎక్స్ట్రాల (17) రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం!.. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘డి’లో 7 పాయింట్లతో ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలవకపోగా (రెండు డ్రా)... ఇప్పుడు కశ్మీర్ చేతిలో చిత్తుగా ఓడటంతో ఢిల్లీ నాకౌట్ అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది.చదవండి: ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!.. మిగతా అందరూ ఉండాల్సిందే! -
ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!
ఐపీఎల్-2026 వేలం (IPL 2026 Auction) నేపథ్యంలో పది ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకోవాల్సిన, వదిలివేయాల్సిన ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. నవంబరు 15 నాటికి లిస్టును ఖరారు చేయాల్సి ఉండగా.. ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంఛైజీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ తమ జట్టును కొనసాగించాలని సూచించాడు. అంతగా అవసరం అయితే.. ఓ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే విడిచిపెట్టాలని అభిప్రాయపడ్డాడు.కాగా పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చాంపియన్గా అవతరించింది. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. అదే సమయంలో విజయోత్సవం సందర్భంగా తొక్కిసిలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.అమ్మకానికి ఆర్సీబీఇదిలా ఉంటే.. ఆర్సీబీ ప్రస్తుతం అమ్మకానికి వచ్చింది. డియాజియో తాము ఆర్సీబీని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో జట్టుకు కొత్త యజమానులు రావడం ఖాయం కాగా.. రిటెన్షన్ లిస్టుపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ ఆరంభం నుంచి.. అంటే 2008 నుంచి భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఒక్కడే జట్టుతో ఉన్న విషయం తెలిసిందే.ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీ ఈసారి ఇద్దరిని మాత్రమే విడుదల చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం జట్టు కూర్పు బాగుంది. అలాంటపుడు మార్పులు చేయడం సరికాదనే చెప్పాలి.లియామ్ లివింగ్స్టోన్, రసిఖ్ దర్ సలామ్లను విడుదల చేసినా పెద్దగా నష్టం లేదు. అంతకు మించి మార్పులు వద్దు. మిగిలిన అందరినీ అట్టిపెట్టుకోవాలి. నిజానికి లివింగ్స్టోన్ ఖరీదైన ఆటగాడు. ఈ సీజన్లో అంత గొప్పగా కూడా ఆడలేదు.రజత్ పాటిదార్, విరాట్ కోహ్లి తర్వాత జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్ వస్తారు. కాబట్టి మిడిలార్డర్లో లివింగ్స్టోన్ను తీసేసి.. ఇంకా మెరుగ్గా ఆడగలిగే బ్యాటర్ను కొనుగోలు చేస్తే సరిపోతుంది.అతడికి అంత మొత్తం ఎక్కువేపేస్ విభాగంలో యశ్ దయాళ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, రొమారియో షెఫర్డ్, నువాన్ తుషార ఉన్నారు. వీరికి తోడుగా భారత ఫాస్ట్ బౌలర్ను తెచ్చుకుంటే సరి. రసిఖ్కు అంత మొత్తం ఎక్కువే. కాబట్టి అతడిని వదిలేసి మరొకరిని తీసుకుంటే మరో ప్లేయర్ కోసం డబ్బు కూడా మిగులుతుంది’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా లివింగ్స్టోన్ను రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ.. రసిఖ్ కోసం ఏకంగా రూ. 6 కోట్లు వెచ్చించింది. లివింగ్స్టోన్ ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లు ఆడి కేవలం 112 పరుగులు చేయగా.. రసిఖ్ రెండు మ్యాచ్లలో కలిపి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. చదవండి: శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం! -
రాజస్తాన్ రాయల్స్ కొత్త కెప్టెన్గా అతడే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్తో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson) బంధం ముగిసినట్లు తెలుస్తోంది. పదకొండు సీజన్లుగా రాజస్తాన్ జట్టుతో కొనసాగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. కెప్టెన్గానూ సేవలు అందించాడు.ఐపీఎల్లో మొట్టమొదటి విజేత అయిన రాజస్తాన్ను.. పద్నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన సారథ్యంలో రెండోసారి ఫైనల్ (2022)కు చేర్చాడు సంజూ. అయితే దురదృష్టవశాత్తూ గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో ఓడిపోవడంతో రాజస్తాన్తో పాటు కెప్టెన్గా కప్పు గెలవాలన్న సంజూ ఆశలకు గండిపడింది.యాజమాన్యంతో విభేదాలుకాగా గత కొంతకాలంగా సంజూకు.. రాజస్తాన్ జట్టు యాజమాన్యంతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 వేలానికి ముందే ట్రేడింగ్ ద్వారా జట్టు మారేందుకు సంజూ నిశ్చియించుకున్నాడనే ప్రచారం తాజాగా జోరందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సంజూను రాజస్తాన్ నుంచి ట్రేడింగ్ (స్వాప్ డీల్) ద్వారా దక్కించుకోవడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను రాజస్తాన్కు ఇచ్చి.. అందుకు బదులుగా సంజూను సీఎస్కే దక్కించుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. రాజస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. రియాన్ పరాగ్ కాదు!కాగా సంజూ గైర్హాజరీలో అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ జట్టును ముందుకు నడిపించాడు. ఐపీఎల్-2025లో సంజూ ఫిట్నెస్ సమస్యల వల్ల కెప్టెన్సీని దూరంగా ఉండగా.. పరాగ్ సారథిగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఈసారి రాజస్తాన్ మరీ దారుణంగా పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పరాగ్కు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా... టీమిండియా నయా సంచలనం ధ్రువ్ జురెల్ పేరు తెర మీదకు వచ్చింది.కెప్టెన్సీ రేసులో ఇద్దరురూ. 20 లక్షల కనీస ధరతో రాజస్తాన్ క్యాంపులోకి వచ్చిన జురెల్ అనతికాలంలోనే.. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ క్రమంలోనే అతడిని ఫ్రాంఛైజీ రూ. 14 కోట్ల భారీ మొత్తానికి గతేడాది రిటైన్ చేసుకుంది. గత కొంతకాలంగా అతడు సూపర్ఫామ్లో ఉన్నాడు. టీమిండియాలోనూ కీలక సభ్యుడిగా మారాడు.అంతేకాదు.. అనధికారిక టెస్టు సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గా పనిచేసిన అనుభవం కూడా జురెల్కు ఉంది. అదే విధంగా.. అండర్-19 స్థాయిలో 2020 వరల్డ్కప్లో భారత జట్టు వైస్ కెప్టెన్గానూ జురెల్ సేవలు అందించాడు. ఇక యూపీ టీ20 లీగ్లో గోరఖ్పూర్ లయన్స్ జట్టుకు సారథి కూడా జురెలే!ఈ నేపథ్యంలో పరాగ్ను కాదని.. మేనేజ్మెంట్ జురెల్ వైపే మొగ్గుచూపుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, మరికొందరు విశ్లేషకులు మాత్రం టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కే రాజస్తాన్ పగ్గాలు అప్పగిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.కాగా 2020లో రాజస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన జైస్వాల్.. ఇప్పటికి 66 మ్యాచ్లలో కలిపి 2166 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ ఖాతాలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే, 23 ఏళ్ల జైసూకు ఏ స్థాయిలోనూ కెప్టెన్గా పనిచేసిన అనుభవం మాత్రం లేదు. అయితే, అతడి అవకాశాలను మాత్రం కొట్టిపడేయలేము.రాయల్స్ కొత్త కెప్టెన్గా అతడే!రాజస్తాన్ రాయల్స్ కొత్త హెడ్కోచ్ కుమార్ సంగక్కర.. జురెల్తో పాటు జైస్వాల్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడని చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొనడం గమనార్హం. అయితే, ఇంపాక్ట్ రూల్ ప్రకారం ఓపెనర్గా జైసూకు ప్రత్యామ్నాయం ఉంటుంది. కానీ వికెట్ కీపర్గా 24 ఏళ్ల జురెల్ కొనసాగుతాడు! కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్లో తప్పకుండా ఉంటాడు. అందుకే అతడికే కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’ -
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్కు బెదిరింపులు
ఐపీఎల్లో (IPL) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున మెరిసిన యువ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ (Vipraj Nigam) బెదిరింపులకు గురయ్యాడు. నవంబర్ 9న అతడికి ఓ అంతర్జాతీయ ఫోన్ నంబర్ నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓ మహిళ అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ, ఓ వీడియోను లీక్ చేస్తానని బెదిరించింది.తొలుత విప్రాజ్ దీన్ని ఫేక్ కాల్గా భావించి, నంబర్ను బ్లాక్ చేశాడు. అయినా సదరు మహిళ వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి విప్రాజ్ను పదేపదే ఇబ్బంది పెట్టింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన విప్రాజ్ వెంటనే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన పరువుకు భంగం కలిగించడం, మానసికంగా వేధించడం ద్వారా తన క్రికెట్ కెరీర్ను నాశనం చేయాలనే కుట్ర జరుగుతోందని అతను ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు కాల్ వివరాలు, ఫోన్ నంబర్ల మూలాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై విప్రాజ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న తమ కుమారుడిని బద్నాం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.21 ఏళ్ల విప్రాజ్ గత సీజన్లోనే (2025) ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన విప్రాజ్ అరంగేట్రం సీజన్లోనే అదరగొట్టాడు. 14 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి, 142 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగి పలు మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు.గతేడాదే విప్రాజ్ ఉత్తరప్రదేశ్ తరఫున దేశవాలీ అరంగేట్రం చేశాడు. 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 5 లిస్ట్-ఏ మ్యాచ్లు, 15 టీ20లు ఆడి మొత్తంగా 32 వికెట్లు తీశాడు. చదవండి: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్కు తీవ్ర అస్వస్థత -
'అతడొక గన్ ప్లేయర్.. కచ్చితంగా రిటైన్ చేసుకోవాలి'
ఐపీఎల్-2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ చేసేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. జడేజాకు బదులుగా రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ను సీఎస్కే తీసుకోవాలని నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే కచ్చితంగా జడ్డూను తమతో పాటు అట్టిపెట్టుకోవాలని రైనా సూచించాడు. జడేజా ఐపీఎల్-2011 సీజన్ నుంచి సీఎస్కే జట్టులో కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023 సీజన్ విజేతగా సీఎస్కే నిలవడంలో జడ్డూది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు ఐదో టైటిల్ను అందించాడు. అంతకుముందు 2019, 2017 సీజన్లో సీఎస్కే ఛాంపియన్గా నిలవడంలో జడ్డూ తన వంతు పాత్ర పోషించాడు. అటువంటి ప్లేయర్ను వదులుకోవడానికి సీఎస్కే సిద్దమైందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు.రవీంద్ర జడేజాను సీఎస్కే రిటైన్ చేసుకోవాలి. అతడొక గన్ ప్లేయర్. గత కొన్ని సీజన్లగా సీఎస్కే ఎన్నో విజయాలను అందించాడు. కాబట్టి 'సర్ రవీంద్ర జడేజా' జట్టులో కచ్చితంగా ఉండాలి అని రైనా పేర్కొన్నాడు. అదేవిధంగా సీఎస్కే జట్టులో చేయాల్సిన మార్పులు కూడా అతడు సూచించాడు."చెన్నై డెవాన్ కాన్వేను జట్టు నుంచి విడుదల చేయాలి. సీఎస్కే కచ్చితంగా మినీ వేలంలో ఒక లోకల్ ఓపెనర్ కొనుగోలు చేసుకోవాలి. ఇక విజయ్ శంకర్, దీపక్ హుడాను కూడా రిలీజ్ చేయాలి. వీరిద్దరికి ఇప్పటికే చాలా అవకాశాలు లభించాయి. కానీ వాటిని వారు అందిపుచ్చుకోలేకపోయారు. ఈసారి కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వాలని" రైనా చెప్పుకొచ్చాడు. -
సీఎస్కే అభిమానులకు శుభవార్త
2026 ఐపీఎల్ (IPL) సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఎగిరే గంతేసే శుభవార్త అందింది. ఆ ఫ్రాంచైజీ లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని (MS Dhoni) వచ్చే సీజన్ కూడా ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశాడు. ధోనికి ఇప్పట్లో రిటైరయ్యే యోచన కూడా లేదని తెలిపాడు.కాగా, ధోని రిటైర్మెంట్పై ఊహాగానాలు ప్రతి సీజన్కు ముందు పరిపాటిగా మారాయి. అయితే ధోని మాత్రం ఏయేటికాయేడు వాటిని పటాపంచలు చేస్తూ బరిలోకి దిగుతున్నాడు. 2026 సీజన్కు ముందు కూడా ఇదే సీన్ కొనసాగింది. ధోని వచ్చే సీజన్లో బరిలోకి దిగడని ప్రచారం జరిగింది. తాజాగా కాశీ విశ్వనాథ్ వ్యాఖ్యలతో ధోని రిటైర్మెంట్పై ప్రచారానికి తెరపడింది.ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగి, ఇప్పటికీ ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ధోని ఇంకెంత కాలం ఐపీఎల్ ఆడతాడని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏయేటికాయేడు ఈ సీజనే ధోనికి లాస్ట్ అని అనుకున్నా, అతను మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ కెరీర్ను పొడిగిస్తున్నాడు.2026లోనూ ధోనిని మైదానంలో చూడబోతున్నామన్న వార్త అతని అభిమానులను పిచ్చెక్కిస్తుంది. సింహం మరోసారి బరిలోకి దిగబోతుందంటూ వారు సంబరాలు చేసుకుంటున్నారు.ఆల్టైమ్ గ్రేట్ఐపీఎల్ ప్రారంభం నుంచి (మధ్యలో రెండు సీజన్లు మినహా) సీఎస్కేతోనే ఉన్న ధోని.. ఆ ఫ్రాంచైజీకి ఐదు టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023)అందించాడు. గత సీజన్లో మాత్రం సీఎస్కే ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. కెప్టెన్ రుతురాజ్ గాయపడటంతో ధోనినే కెప్టెన్సీ బాధ్యతలు మోశాడు. ఆ సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో తొలిసారి ఆఖరి స్థానంలో నిలిచింది.మోకాలి సమస్యరిటైర్మెంట్కు (అంతర్జాతీయ క్రికెట్కు) ముందు నుంచి ధోనిని గాయాల సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా కెరీర్ మధ్య నుంచి ధోని మోకాలి సమస్యతో బాధ పడుతున్నాడు. 2023లో అతని ఎడమ మోకాలికి ప్రధాన శస్త్రచికిత్స జరిగింది. ఆతర్వాత అతను knee brace ధరించి, పెయిన్ కిల్లర్స్ వాడుతూ అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహించాడు. 44 ఏళ్ల వయసులోనూ ధోని ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ఆటపై తన ప్రేమను కొనసాగిస్తున్నాడు.చదవండి: సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. బ్యాటింగ్కు దిగిన టీమిండియా -
ఆసీస్ దిగ్గజానికి కీలక పదవి
ఐపీఎల్ 2026కి ముందు ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీకి (Tom Moody) కీలక పదవి దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఫ్రాంచైజీ మూడీని గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా నియమించింది. ఈ పదవి చేపట్టాక మూడీ ఎల్ఎస్జీతో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్లో డర్బన్ సూపర్ జెయింట్స్, హండ్రెడ్ లీగ్లో మాంచెస్టర్ ఆధారిత ఫ్రాంచైజీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తాడు.గతంలో ఈ పదవిలో టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ ఉండేవాడు. జహీర్ తప్పుకున్న తర్వాత మూడీని ఈ పదవి వరించింది. మూడో రానున్న ఐపీఎల్ సీజన్లో రిషబ్ పంత్ (కెప్టెన్), జస్టిన్ లాంగర్ (హెడ్ కోచ్), కేన్ విలియమ్సన్ (స్ట్రాటజిక్ అడ్వైజర్), భరత్ అరుణ్ (బౌలింగ్ కోచ్), లాన్స్ క్లూసెనర్తో (అసిస్టెంట్ కోచ్) కలిసి పని చేస్తాడు. మూడీకి కోచింగ్తో పాటు ఫ్రాంచైజీ మేనేజ్మెంట్లో అపార అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని క్యాష్ చేసుకునేందుకే ఎల్ఎస్జీ మూడీని తమ ఫ్రాంచైజీల గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా నియమించింది. మూడీ పర్యవేక్షణలో (కోచ్గా) సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి, ఏకైక టైటిల్ (2016) సాధించింది.మూడీ ప్రొఫైల్..2000 సంవత్సరం ప్రారంభంలో ఆటకు వీడ్కోలు పలికిన మూడీ.. 2005-07 మధ్యలో శ్రీలంక జాతీయ జట్టుకు కోచ్గా పని చేశాడు. అతని జమానాలో శ్రీలంక 2007 వరల్డ్ కప్ ఫైనల్కు చేరింది.అదే ఏడాది మూడీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వహించాడు.అంతర్జాతీయ స్థాయిలో కోచ్గా రాణించిన మూడీ.. 2008-10 మధ్యలో ఐపీఎల్లో Kings XI Punjab (ఇప్పుడు Punjab Kings) జట్టుకు కోచ్గా సేవలందించాడు.2013లో Sunrisers Hyderabad ఫ్రాంచైజీలో హెడ్ కోచ్గా చేరి, 2016లో ఆ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. 2019 వరకు అదే బాధ్యతలు నిర్వహించిన మూడీ.. 2020 డిసెంబర్లో అదే ఫ్రాంచైజీకి Director of Cricketగా తిరిగి వచ్చాడు.చదవండి: జైస్వాల్ సూపర్ సెంచరీ -
ఢిల్లీ క్యాపిటల్స్కు సంజూ శాంసన్..!
ఐపీఎల్ 2026 వేలానికి ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీని వీడనున్నాడా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. రాజస్తాన్ నుంచి శాంసన్ను ట్రేడ్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్ నుంచి రాయల్స్, సంజు శాంసన్ మధ్య విభేదాలు తలెత్తాయి.దీంతో సంజూను రాజస్తాన్ మెనెజ్మెంట్ విడిచిపెట్టేందుకు ఆసక్తిగా ఉందంట. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న శాంసన్ సైతం రాజస్తాన్ నుంచి బయటకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. వచ్చే సీజన్లో శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నట్లు సమాచారం.రాజస్తాన్లోకి స్టబ్స్..రాజస్తాన్ ఫ్రాంచైజీ శాంసన్కు బదులుగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను ఇవ్వాలని ఢిల్లీని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు ఢిల్లీ యాజమాన్యం ఒప్పుకోలేదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కానీ రాహుల్కు బదులుగా దక్షిణాఫ్రికా బ్యాటర్ అయిన ట్రిస్టన్ స్టబ్స్ను ఇచ్చేందుకు తాము సిద్దమని ఢిల్లీ తెలిపినట్లు తెలుస్తోంది. అందుకు రాజస్తాన్ అంగీకరించినట్లు వినికిడి. స్టబ్స్తో పాటు ఓ అన్క్యాప్డ్ భారత ఆటగాడిని పంపమని ఆర్ఆర్ కోరిందంట.ఎందుంకంటే సంజు శాంసన్ ధర రూ.18 కోట్లు కాగా, స్టబ్స్ విలువ రూ.10 కోట్లు. ఎనిమిది కోట్లు వ్యత్యాసం రావడంతో ఓ అన్క్యాప్డ్ ఆటగాడిని తీసుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఆర్ఆర్కు మంచి ఫినిషర్ లేని లోటును స్టబ్స్ తీర్చగలడు. ఒకవేళ అన్క్యాప్డ్ ఆటగాడిని ఢిల్లీ ట్రేడ్ చేయకపోతే, మిగిలిన మొత్తాన్ని (సుమారు రూ.8 కోట్లు) రాజస్తాన్కు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఐపీఎల్-2026 వేలంలో రాజస్తాన్ పర్స్ విలువ పెరుగుతుంది. కాగా సంజూ శాంసన్ తన ఐపీఎల్ అరంగేట్రం ఢిల్లీ క్యాపిటల్స్(అప్పటిలో ఢిల్లీ డేర్డేవిల్స్) తరపునే చేశాడు. -
కేకేఆర్ హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్..
ఐపీఎల్-2026 సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ను కేకేఆర్ నియమించింది. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధ్రువీకరించారు.గత సీజన్లో హెడ్కోచ్గా పనిచేసిన చంద్రకాంత్ పండిట్ స్థానాన్ని నాయర్ భర్తీ చేయనున్నాడు. "అభిషేక్ నాయర్ 2018 నుంచి కేకేఆర్ సెటాప్లో భాగంగా ఉన్నాడు. ఎంతో మంది మా ఆటగాళ్లను అభిషేక్ తీర్చిదిద్దాడు. హెడ్ కోచ్గా అతడు మా జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నామని" వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా నాయర్ 2018 నుంచి కేకేఆర్ బ్యాక్ రూమ్ స్టాఫ్లో భాగంగా ఉన్నాడు. అంతకుముందు కేకేఆర్ అకాడమీలో యువ ఆటగాళ్లను తాయారు చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.నాయర్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. భారత జట్టు సహాయక కోచ్గా కూడా నాయర్ పనిచేశాడు. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ కారణంగా అసిస్టెంట్ కోచ్లపై వేటు వేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో నాయర్ తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఐపీఎల్-2025లో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్గా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు కేకేఆర్ జట్టు ప్రధాన కోచ్గా కూడా అతడు బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కాగా నాయర్ ఇటీవలే డబ్ల్యూపీఎల్ జట్టు యూపీ వారియర్స్ హెడ్ కోచ్గా కూడా ఎంపికయ్యాడు. -
ఆ జట్టు హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్!?
ఐపీఎల్-2026 సీజన్కు ముందు తమ కోచింగ్ స్టాప్లో సమూల మార్పులు చేసేందుకు సిద్దమైంది. మొన్నకు మొన్న మెంటార్ జహీర్ ఖాన్పై వేటు వేసిన లక్నో యాజమాన్యం.. ఇప్పుడు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ను తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆండీ ఫ్లవర్ తర్వాత లక్నో ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన లాంగర్.. భారత ఆటగాళ్లతో సరైన బంధాన్ని ఏర్పరచుకోలేకపోయారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారత్కు చెందిన మాజీ క్రికెటర్ను తమ హెడ్ కోచ్గా నియమించాలని లక్నో భావిస్తున్నట్లు సమాచారం.హెడ్ కోచ్గా యువరాజ్..?ఇన్సైడ్ స్పోర్ట్ కథనం ప్రకారం.. లక్నో ఫ్రాంచైజీ మెనెజ్మెంట్ తమ జట్టు ప్రధాన కోచ్గా భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుందంట. యువరాజ్ సింగ్తో ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. యువీ ఇప్పటివరకు ఏ ప్రొఫెషనల్ జట్టుకు హెడ్ కోచ్గా పనిచేయకపోయినా.. అబుదాబి టి10 లీగ్లో మాత్రం మెంటార్గా వ్యవహరించాడు. అయితే పంజాబ్కు చెందిన ఎంతో మంది యువ ఆటగాళ్లను మాత్రం తన అనుభవంతో యువీ తీర్చిదిద్దాడు. ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రియాన్ష్ ఆర్య వంటి సంచలన ప్లేయర్లు యువరాజ్ శిష్యులే. ఒకవేళ యువరాజ్ నిజంగా కోచ్గా వస్తే లక్నో తలరాత మారినట్లే.ఇక ఇది ఇలా ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్ ఇటీవల కొన్ని కొత్త నియమాకాలు చేపట్టింది. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ వ్యూహాత్మక సలహాదారుగా (Strategic Advisor), బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్, స్పిన్ బౌలింగ్ కోచ్గా కార్ల్ క్రోవ్ లక్నో జట్టులోకి చేరారు. కాగా గత సీజన్లో పంత్ సారథ్యంలోని లక్నో జట్టు ప్లే ఆఫ్స్కు చేరడంలో విఫలమైంది.చదవండి: స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్!.. వరుడు ఎవరంటే? -
కేకేఆర్ హెడ్ కోచ్గా రోహిత్ శర్మ ఫిట్నెస్ గురు
ఐపీఎల్ 2025లో నిరాశజనక ప్రదర్శన తర్వాత కోల్కతా నైట్రైడర్స్ (KKR) తమ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ను తప్పించింది. తాజాగా పండిట్ స్థానాన్ని మాజీ ముంబై ఆల్రౌండర్ అభిషేక్ నాయర్తో (Abhishek Nayar) భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ నిర్ణయాన్ని గత వారం నాయర్కు తెలియజేసినట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.నాయర్ గతంలో కేకేఆర్ అకాడమీకి కీలకంగా పనిచేశాడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను వెలికితీయడంలో అతని పాత్ర ముఖ్యమైంది. గత సంవత్సరం సహాయక సిబ్బందిగా కేకేఆర్లో చేరిన నాయర్, ఇప్పుడు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.42 ఏళ్ల నాయర్, ఇటీవల మహిళల ఐపీఎల్లో (WPL) యూపీ వారియర్జ్కు (UP Warriorz) హెడ్ కోచ్గా పనిచేశాడు. అతని కోచింగ్ శైలి వ్యక్తిగతంగా ఆటగాళ్లను ఫిట్నెస్, ఫామ్ పరంగా తిరిగి పుంజుకునేలా చేస్తుంది. నాయర్ ఇటీవలే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మలో (Rohit Sharma) ఊహించిన ఫిట్నెస్ పరివర్తను తీసుకొచ్చాడు. నాయర్ సహకారంతో రోహిత్ ఏకంగా 10 కిలోల బరువు తగ్గి స్లిమ్గా తయారయ్యాడు. నాయర్ రోహిత్కు మంచి మిత్రుడు కూడా. నాయర్ రోహిత్కు మాత్రమే కాకుండా కేఎల్ రాహుల్ తదితర ఆటగాళ్లకు కూడా ఫిట్నెస్ గురుగా ఉన్నాడు.వ్యక్తిగత కోచ్గా, ఫిట్నెస్ గురుగా మంచి పేరున్న నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్గా మాత్రం రాణించలేకపోయాడు. ఇటీవలే బీసీసీఐ అతన్ని ఆ పదవి నుంచి తప్పించింది. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ నియమితుడయ్యాక నాయర్ను ప్రత్యేకంగా తన బృందంలో చేర్చుకున్నాడు. అయితే జట్టు వైఫల్యాల కారణంగా నాయర్ ఎంతో కాలం భారత సహాయ కోచ్గా ఉండలేకపోయాడు.ఇదిలా ఉంటే, గత సీజన్లో కేకేఆర్ పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్ల్లో కేవలం 5 విజయాలు మాత్రమే సాధించి, ప్లేఆఫ్స్కు చేరలేకపోయింది. తదుపరి సీజన్లో కేకేఆర్ నాయర్పై భారీ ఆశలు పెట్టుకుంది. కేకేఆర్ హెడ్ కోచ్ పదవిపై అధికారిక ప్రకటన వచ్చాక నాయర్ యూపీ వారియర్జ్ కోచ్గా కూడా కొనసాగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.చదవండి: చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన న్యూజిలాండ్ -
IPL 2026: శ్రేయస్ అయ్యర్ టీమ్లో కీలక చేరిక
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్కు ముందు గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ జోషి (2023-2025) స్థానంలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను (Sairaj Bahutule) కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించింది. బహుతులే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ పదని నుంచి వైదొలిగాడు. తదుపరి సీజన్లో బహుతులే రికీ పాంటింగ్ (హెడ్ కోచ్) నేతృత్వంలోని కోచింగ్ బృందంలో చేరతాడు. ఈ టీమ్లో బ్రాడ్ హడ్డిన్, జేమ్స్ హోప్స్ అసిస్టెంట్ కోచ్లుగా ఉన్నారు. బహుతులే చేరిక శ్రేయస్ (Shreyas Iyer) బృందానికి అదనపు బలాన్ని ఇస్తుందని పంజాబ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. 51 ఏళ్ల బహుతులేకు దేశవాలీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతను బెంగాల్, కేరళ, విదర్భ, గుజరాత్ జట్లకు కోచింగ్ను అందించాడు. భారత యువ బౌలర్లను తీర్చిదిద్దడంలో సాయిరాజ్ది అందవేసిన చెయ్యిగా చెబుతారు.సాయిరాజ్ చేరికపై పంజాబ్ కింగ్స్ సీఈవో సతీష్ మీనన్ స్పందించాడు. అతని మాటల్లో.. "ముందుగా సునీల్ జోషికి కృతజ్ఞతలు. ఇప్పుడు బహుతులే చేరడం మాకు గర్వకారణం. అతని అనుభవం, వ్యూహాత్మక దృష్టి మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది".పంజాబ్ కింగ్స్తో డీల్ ఖరారయ్యాక సాయిరాజ్ కూడా స్పందించాడు. పంజాబ్ కింగ్స్లో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ జట్టు ప్రత్యేకమైన క్రికెట్ ఆడుతుంది. యువ ప్రతిభను మెరుగుపరచడంలో నా పాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. కాగా, పంజాబ్ కింగ్స్ గత సీజన్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై తృటిలో టైటిల్ను చేజార్చుకుంది. శ్రేయస్ అయ్యర్ గత సీజన్లోనే పంజాబ్ కింగ్స్ పగ్గాలు చేపట్టి అద్భుతంగా ముందుండి నడిపించాడు. వ్యక్తిగతంగానూ రాణించాడు. శ్రేయస్ అంతకుముందు సీజన్లో (2024) కేకేఆర్కు విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. గత సీజన్ వేలంలో శ్రేయస్ను పంజాబ్ యాజమాన్యం రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకుంది.చదవండి: NZ VS ENG: సిరీస్ ఇంగ్లండ్ వశం.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా బ్రూక్ -
సంజీవ్ గోయెంకా స్పెషల్ రిక్వెస్ట్..? రిషబ్ పంత్ టీమ్లోకి కేన్ విలియమ్సన్
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్(LSG) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(Kane Williamson)తో ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే విలియమ్సన్ లక్నో జట్టులో ప్లేయర్గా కాదు.. స్ట్రాటజిక్ అడ్వైజర్గా చేరనున్నాడంట. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఓనర్ సంజీవ్ గోయెంకా సూచన మెరకు లక్నో టీమ్ మెనెజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఐపీఎల్-2022 సీజన్తో ఈ క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్.. ఇప్పటివరకు నాలుగు ఎడిషన్లను పూర్తి చేసుకుంది. కానీ యాజమాన్యం అంచనాలను అందుకోవడంలో సూపర్ జెయింట్స్ విఫలమైంది. మొదటి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్కి చేరిన లక్నో.. ఆ తర్వాతి రెండు ఎడిషన్లలో ఏడో స్ధానానికి పరిమితమైంది. మొదట గౌతమ్ గంభీర్, మోర్నే మోర్కెల్ కోచింగ్ స్టాఫ్లో ఉండగా ఇప్పుడు జస్టిన్ లాంగర్ ప్రధాన కోచ్గా ఉన్నారు. అయితే గత సీజన్లో తమ జట్టు మెంటార్గా పనిచేసిన టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్పై ఎల్ఎస్జీ వేటు వేసింది. అంతేకాకుండా ఐపీఎల్-2026 సీజన్కు ముందు తమ బౌలింగ్ కోచ్గా భారత మాజీ పేసర్ భరత్ అరుణ్ను లక్నో నిమమించింది. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కార్ల్ క్రోవ్ లక్నో స్పిన్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.గత రెండు సీజన్లలో గ్రూపు స్టేజికే పరిమితమైన తమ జట్టును కేన్ మామ తన అనుభవంతో విజయం పథంలో నడిపిస్తాడని లక్నో భావిస్తోంది. లక్నోలో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మార్క్రమ్, మార్ష్, పంత్, పూరన్ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికి.. బౌలింగ్ యూనిట్ మాత్రం వారికి తలనొప్పిగా మారింది. గత సీజన్లో మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్ వంటి పేసర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కనీసం కేన్ రాకతో నైనా లక్నో తలరాత మారుతుందో లేదో వేచి చూడాలి. విలియమ్సన్ చివరగా ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు.చదవండి: IND vs AUS: ఆసీస్తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! మ్యాచ్ విన్నర్కు నో ఛాన్స్? -
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ వేలం?
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలాన్ని భారత్లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తున్నట్లు సమాచారం. గత రెండు సీజన్లకు సంబంధించిన వేలాన్ని దుబాయ్, సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా కండక్ట్ చేశారు.క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం.. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఈ క్యాష్రిచ్ వేలాన్ని భారత్కు తిరిగి తీసుకొచ్చేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం. ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ త్వరలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (GC) దీనిపై సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.అదేవిధంగా ఈ మినీ అక్షన్ను డిసెంబర్ 13 నుండి 15 మధ్య నిర్వహించే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే గతేడాది మాత్రం బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్, అప్పటి బీసీసీఐ కార్యదర్శి జై షా విదేశీ పర్యటన కారణంగా కాస్త ముందుగానే(నవంబర్ 24, 25 తేదీల్లో) వేలం జరిగింది.కాగా ఐపీఎల్ వేలం ఇప్పటివరకు ఎక్కువసార్లు బెంగళూరులోనే జరిగింది. మొత్తం 7 సార్లు ఈ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అక్షన్ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చింది. అయితే గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో అహ్మదాబాద్ అత్యంత ప్రాధాన్యతగల వేదికగా అవతరించింది. 2022లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు అరంగేట్రం నుంచి గత నాలుగు ఐపీఎల్ ఫైనల్స్లో అహ్మదాబాద్ వేదికగానే జరిగింది. దీంతో ఈసారి బీసీసీఐ మినీ వేలాన్ని మొదటిసారిగా అహ్మదాబాద్లో నిర్వహించే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.ఇప్పటివరకు ఐపీఎల్ వేలం జరిగిన వేదికలు🔹 2008 – ముంబై🔹 2009 – గోవా🔹 2010 – బెంగళూరు🔹 2011 – బెంగళూరు🔹 2012 – బెంగళూరు🔹 2013 – చెన్నై🔹 2014 – బెంగళూరు🔹 2015, 2016, 2017, 2018 – బెంగళూరు.🔹 2019 – జైపూర్🔹 2020 – కోల్కతా🔹 2021 – చెన్నై🔹 2022 – బెంగళూరు🔹 2023 – దుబాయ్ (UAE)🔹 2024 – జెడ్డా (సౌదీ అరేబియా)చదవండి: గెలుపు వాకిట్లో భారత్ -
ఐపీఎల్ 2026కు సంబంధించి బిగ్ అప్డేట్
ఐపీఎల్ 2026కు (IPL 2026) సంబంధించి బిగ్ అప్డేట్ తెలుస్తుంది. ఈ సీజన్ వేలం డిసెంబర్ 13–15 మధ్య తేదీల్లో జరగనుందని సమాచారం. బీసీసీఐతో చర్చించిన ఫ్రాంచైజీల ప్రతినిధులు ఈ తేదీలను సూచించారని తెలుస్తుంది. ఈ విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్దే తుది నిర్ణయంగా ఉంటుంది.రిటెన్షన్కు ఇదే డెడ్లైన్..!అన్ని ఫ్రాంచైజీలు నవంబర్ 15లోగా తమ రిటెన్షన్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. విడుదల చేయబోయే ఆటగాళ్ల పేర్లను అంతకుముందే ఖరారు చేయాలి.ఈసారి వేలం భారత్లోనే..?గత రెండు సీజన్లలో (2023 దుబాయ్, 2024 జెడ్డా) విదేశాల్లో జరిగిన వేలం, ఈసారి భారత్లోనే జరిగే అవకాశముంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్లో భారీ మార్పులు..?చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్తాన్ రాయల్స్ (RR) గత సీజన్లో అట్టడుగు స్థానాల్లో ముగించడంతో వచ్చే సీజన్కు ముందు భారీ మార్పులకు ఆస్కారముంటుంది.సీఎస్కే.. దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి లాంటి లోకల్ వెటరన్లను వదిలించుకోవచ్చు. అశ్విన్ ఎలాగూ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి, అతనికి ఇస్తున్న రూ. 9.75 కోట్లను కూడా వేలంలో వాడుకోవచ్చు.రాజస్తాన్ విషయానికొస్తే.. వేలానికి ముందే ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్ సంజూ శాంసన్ను ట్రేడింగ్ విండో ఆప్షన్ ద్వారా విడుదల చేసే అవకాశముంది. ఇతర ఫ్రాంచైజీలు ఏవైనా సంజూపై ఆసక్తి కనబరిస్తే.. ట్రేడింగ్ జరగవచ్చు.ఆర్ఆర్ యాజమాన్యం సంజూతో పాటు వనిందు హసరంగ, మహీష్ తీక్షణను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి విషయంలో కుమార సంగక్కర (కోచ్) కీలకపాత్ర పోషిస్తాడు.వెంకటేష్ అయ్యర్పై వేటుగత సీజన్ వేలంలో ఎవరూ ఊహించని రీతిలో రూ. 23.75 కోట్ల ధర దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్ను కేకేఆర్ వదిలించుకోవచ్చు. గత సీజన్లో అతను దారుణంగా విఫలమయ్యాడు.గ్రీన్కు భారీ ధర..?ఈ సీజన్ వేలంలో ఆసీస్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కెమారూన్ గ్రీన్కు భారీ ధర దక్కే అవకాశం ఉంది. గత సీజన్లో గాయంతో మిస్ అయిన గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. చదవండి: విండీస్తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా -
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్పు.. కొత్త కోచ్గా ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కీలక మార్పు చేసింది. రెండు టైటిళ్లు గెలిపించిన చార్లెట్ ఎడ్వర్డ్స్ (Charlotte Edwards) స్థానంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లిసా కైట్లీని (Lisa Keightley) హెడ్ కోచ్గా నియమించింది. చార్లెట్ ఇంగ్లండ్ జాతీయ మహిళల జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు నేపథ్యంలో గత కొంతకాలంగా ఎంఐ హెడ్ కోచ్ పదవి ఖాళీగా ఉంది. 54 ఏళ్ల లిసా తన కెరీర్లో ఆస్ట్రేలియా తరఫున 92 మ్యాచ్లు (9 టెస్ట్లు, 82 వన్డేలు, 1 టీ20) ఆడారు. 1997, 2005 ప్రపంచకప్ విజేత జట్టులో భాగమయ్యారు. ఆటకు వీడ్కోలు చెప్పిన తర్వాత కోచింగ్ రంగంలోకి అడుగుపెట్టి, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్ జట్లకు కోచ్గా సేవలందించారు.తాజాగా ఆమె నార్తర్న్ సూపర్చార్జర్స్ (Women's Hundred League) విజేతగా నిలిపారు. లిసాకు మహిళల బిగ్బాష్ లీగ్లో (WBBL) సిడ్నీ థండర్కు కోచ్గా పని చేసిన అనుభవం కూడా ఉంది.ఎంఐ హెడ్ కోచ్గా ఎంపికైన అనంతరం లిసా మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ లాంటి అద్బుతమైన ఫ్రాంచైజీలో భాగం కావడం గర్వంగా ఉంది. WPLలో బెంచ్మార్క్ సెట్ చేసిన జట్టుతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని అన్నారు.ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు మూడు WPL సీజన్లలో రెండు టైటిళ్లు (2023, 2025) గెలిచింది. 2024 ఎడిషన్లో మాత్రం ఎలిమినేటర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. గెలిచిన రెండు సీజన్లలో ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ను ఫైనల్లో ఓడించింది. 2026 ఎడిషన్లో లిసా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ కోసం పోరాడనుంది.చదవండి: BCCI: వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు టీమిండియా ప్రకటన.. అతడిపై వేటు -
రాజస్థాన్ రాయల్స్కు మరో బిగ్ షాక్
తదుపరి ఐపీఎల్ సీజన్ (2026) ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి నుంచే మార్పులు చేర్పుల ప్రక్రియ మొదలుపెట్టింది. తొలుత కెప్టెన్ సంజూ శాంసన్ ఫ్రాంచైజీ వీడతాడని అనుకున్నా.. అతని కంటే ముందే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. తాజాగా రాయల్స్కు మరో కీలక వ్యక్తి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది.ఆ ఫ్రాంచైజీ CEO జేక్ లష్ మెక్క్రమ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. వచ్చే నెలలో అతను అధికారికంగా వైదొలగనున్నట్లు తెలుస్తుంది. జోహన్నెస్బర్గ్లో నిన్న (సెప్టెంబర్ 9) జరిగిన SA20 వేలంలో రాజస్థాన్ రాయల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన Paarl Royals టేబుల్ వద్ద జేక్ కనిపించలేదు. జేక్ 2021లో కేవలం 28 ఏళ్ల వయసులో రాయల్స్ CEOగా బాధ్యతలు చేపట్టి వార్తల్లో నిలిచాడు. కాగా, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం గత సీజన్ పేలవ ప్రదర్శన అనంతరం ఫ్రాంచైజీలో సమూల ప్రక్షాళన చేపట్టాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే కీలక పదవుల్లో వారికి పొమ్మనలేక పొగ పెట్టింది. ఈ క్రమంలో తొలుత ఫ్రాంచైజీ మార్కెటింగ్ హెడ్, ఆతర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, తాజాగా సీఈఓ నిష్క్రమణ జరిగాయి.త్వరలో కెప్టెన్ సంజూ శాంసన్ కూడా రాయల్స్కు గుడ్ బై చెప్పడం దాదాపుగా ఖరారైంది. రాయల్స్ యాజమాన్యం ఇంత మంది తప్పిస్తున్నా, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్న కుమార సంగక్కరను మాత్రం కొనసాగించనున్నట్లు తెలుస్తుంది. రాయల్స్ 2025 సీజన్లో 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.గత సీజన్లో ఆ జట్టు తరఫున అద్బుతమైన ప్రదర్శనలు నమోదైనా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. చాలావరకు గెలవాల్సిన మ్యాచ్ల్లో ఆ జట్టు ఒత్తిడిలోనై పరాజయాలపాలైంది. గత సీజన్లో రాయల్స్కు వైభవ్ సూర్యవంశీ రూపంలో ఆణిముత్యం దొరికాడు. వైభవ్ గత సీజన్లో ఎలా పేట్రేగిపోయాడో అందరం చూశాం. -
టీ20 వరల్డ్కప్-2026 టోర్నీకి డేట్స్ ఫిక్స్..! వివరాలు ఇవే
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్కప్-2026కు తేదీలను ఐసీసీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఈఎస్పీఎన్ రిపోర్ట్ ప్రకారం.. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వరకు జరగనున్నట్లు సమాచారం. ఐపీఎల్-2026కు ముందే ఈ పొట్టి ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. ఈ మార్య్కూ ఈవెంట్కు శ్రీలంక, భారత్లోని మొత్తం ఐదు స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే సదరు రిపోర్ట్ ప్రకారం.. ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్ను మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇంకా ఫైన్లైజ్ చేయలేదంట.కానీ ఫైనల్ మ్యాచ్కు వేదికలగా ఆహ్మదాబాద్, కొలంబోలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పాక్ ఫైనల్కు చేరుకుంటే కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో తుది పోరు జరిగే అవకాశముంది.ఫార్మాట్ ఇదే..ఇక టీ20 వరల్డ్కప్-2026 ఫార్మాట్ విషయానికి వస్తే.. గత ఎడిషన్ మాదిరిగానే నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం జట్లను నాలుగు గ్రూపులగా విభజిస్తారు. ప్రతీ గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. లీగ్ స్టేజిలో ప్రతీ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడుతోంది.లీగ్ దశ ముగిసే సమయానికి ప్రతీ గ్రూపులో టాప్-2లో నిలిచే జట్లు సూపర్-8కు ఆర్హత సాధిస్తాయి. సూపర్-8 రౌండ్లో టాప్ 4 జట్లు సెమీఫైనల్లో అడుగుపెడతాయి. ఆ తర్వాత సెమీస్లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.ఈ ప్రపంచకప్లో ఓవరాల్గా 55 మ్యాచ్లు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ మెగా టోర్నీ కోసం 15 జట్లు తమ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. మిగిలిన ఐదు జట్లు ఆఫ్రికన్, ఆసియా, తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి ఆర్హత సాధించనున్నాయి.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన డెవాల్డ్ బ్రెవిస్.. కాస్ట్లీ ప్లేయర్గా చరిత్ర -
గుజరాత్ టైటాన్స్లోకి ఆసీస్ విధ్వంసకర వీరుడు?
గుజరాత్ టైటాన్స్.. తమ ఐపీఎల్ అరంగేట్ర సీజన్లోనే ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్-2022 టైటిల్ను హార్దిక్ పాండ్యా పాండ్యా సారథ్యంలోని గుజరాత్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సీజన్లోనూ తమ జట్టును రన్నరప్గా హార్దిక్ నిలిపాడు.కానీ అనుహ్యంగా ఐపీఎల్-2024కు ముందు ట్రాన్స్ఫర్ విండో ద్వారా గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్కు హార్దిక్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ బాధ్యతలు చేపట్టనప్పటికి జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. ఐపీఎల్-2025లో ప్లే ఆఫ్స్లో ఇంటిముఖం పట్టిన గుజరాత్.. అంతకముందు సీజన్లో లీగ్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.హార్దిక్ గుజరాత్ను వీడి రెండు సీజన్లు అవుతున్నప్పటి అతడి స్ధానాన్ని సరైన ఆటగాడు ఎవరూ భర్తీ చేయలేకపోయారు. హార్దిక్ బ్యాట్, బంతితో రాణించి గుజరాత్ విజయాల్లో భాగమయ్యేవాడు. అయితే ఈసారి మినీవేలంలో అయినా హార్దిక్ తగ్గ ఆటగాడిని కొనుగోలు చేయాలని గుజరాత్ యాజమాన్యం భావిస్తుందంట.గ్రీన్పై కన్ను..?ఐపీఎల్-2026 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరగనుంది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్పై గుజరాత్ టైటాన్స్ కన్నేసినట్లు తెలుస్తోంంది. గ్రీన్ గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకున్న గ్రీన్ వచ్చే ఏడాది సీజన్లో ఆడనున్నాడు.ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ తరపున అదరగొడుతున్నాడు. ఈ 26 ఏళ్ల ఆటగాడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని గుజరాత్ యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్న గ్రీన్.. త్వరలోనే బౌలింగ్కు చేసేందుకు అందుబాటులో ఉండనున్నాడు. గ్రీన్ ఇప్పటికే ఐపీఎల్లో రెండు సార్లు రూ. 17.50 కోట్లు అమ్ముడుపోయాడు. ముంబై ఇండియన్స్, ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. గత రెండేళ్లలో టీ20ల్లో అతడి స్ట్రైక్ రేట్ 150 కంటే ఎక్కువగా ఉంది. ఐపీఎల్ 2026 వేలంలో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో ఒకడిగా గ్రీన్ ఉన్నాడు. గ్రీన్కు ఓ ఐపీఎల్ సెంచరీ కూడా ఉంది. -
ఐపీఎల్ వేలంలో ఆ నలుగురికి భారీ ధర!.. అతడిని ముంబై కొనొచ్చు!
ఐపీఎల్ మినీ వేలం-2026 నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంపాటలో ఇంగ్లండ్ ఆటగాళ్లకు మంచి ధర దక్కుతుందని అంచనా వేశాడు. ‘ది హండ్రెడ్’ లీగ్ (The Hundred)లో సత్తా చాటిన ‘ఆ నలుగురు’ అధిక ధరకు అమ్ముడుపోతారంటూ జోస్యం చెప్పాడు.ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపించాడుఅయితే, వాళ్లు ఇంత వరకు ఒక్కసారి కూడా క్యాష్ రిచ్ లీగ్లో ఆడకపోవడం విశేషం. ఇంతకీ ఎవరా నలుగురు?!... తన యూట్యూబ్ షో అశ్ కీ బాత్లో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు ఐపీఎల్లో ఆడని ప్లేయర్..కానీ ఈసారి వేలంలో మాత్రం అధిక ధర పలికే అవకాశం ఉంది. అతడు మరెవరో కాదు జోర్డాన్ కాక్స్ (Jordan Cox).ఓవల్ ఇన్విసిబుల్స్ తరఫున అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. 24 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపించాడు. ముంబై ఇండియన్స్ అతడపై ఆసక్తి చూపవచ్చు. అతడిని సొంతం చేసుకోవచ్చు కూడా!సోనీ బేకర్ సూపర్ఇక రెండో ఆటగాడు ఎవరంటే.. టీమిండియాతో టెస్టు సిరీస్లో జోష్ టంగ్ మెరుగ్గా ఆడాడు. అయితే, మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున అతడు బౌలర్గా గొప్పగా రాణించాడు. అదే జట్టు నుంచి మరో ప్లేయర్ కూడా మెరుగ్గా ఆడాడు. అతడే సోనీ బేకర్.అద్భుతమైన ఇన్స్వింగర్లతో ప్రత్యర్థులను భయపెట్టాడు. కొత్త బంతితో మెరుగ్గా రాణించాడు. ఇక రెహాన్ అహ్మద్ .. ఈసారి బౌలింగ్తో కన్నా బ్యాటింగ్తో వార్తల్లో నిలిచాడు. మూడు, నాలుగు స్థానాల్లో వచ్చి రాణించాడు. లెగ్ స్పిన్నర్గానూ సేవలు అందించగలడు’’ అని పేర్కొన్నాడు.నలుగురి ప్రదర్శన ఇలాకాగా ది హండ్రెడ్ లీగ్లో మాంచెస్టర్ ఒరిజినల్స్కు ప్రాతినిథ్యం వహించిన పేసర్ జోష్ టంగ్.. పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. ఓవల్ ఇన్విసిబుల్స్ తరఫున ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్.. 367 పరుగులు సాధించాడు.ఇక మాంచెస్టర్ ఒరిజినల్స్కు ఆడిన యువ పేసర్ సోనీ బేకర్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటగా.. ట్రెంట్ రాకెట్స్కు ప్రాతినిథ్యం వహించిన స్పిన్ ఆల్రౌండర్ రెహాన్ అహ్మద్.. 189 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు కూడా తీశాడు. ఇదిలా ఉంటే.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్.. ఇటీవలే ఐపీఎల్కూ కూడా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: ‘భారత క్రికెట్ బాగుండాలంటే.. రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు ఆడాలి’ -
కేకేఆర్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్..!?
రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్గా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025కు ముందు రాయల్స్ ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. కేవలం ఒక్క సీజన్కే తన పదవికి రాజీనామా చేశాడు.అయితే ఫ్రాంచైజీలో అంతర్గత విభేదాల కారణంగా ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. కానీ రాజస్తాన్ మాత్రం అతడు తప్పుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు ద్రవిడ్ తదుపరి అడుగు ఏంటన్న చర్చ క్రికెట్ వర్గాల్లో నెలకొంది.కేకేఆర్ హెడ్ కోచ్గా.. ఐపీఎల్-2026కు ముందు రాహుల్ ద్రవిడ్ను తమ జట్టు హెడ్కోచ్గా నియమించుకోవాలని కోల్కతా నైట్రైడర్స్ భావిస్తుందంట. ఈ ఏడాది సీజన్ తర్వాత కేకేఆర్ ప్రధాన కోచ్ పదవి నుంచి చంద్రకాంత్ పండిత్ తప్పుకొన్నాడు. ప్రస్తుతం కేకేఆర్ హెడ్కోచ్ పదవి ఖాళీగా ఉంది.దీంతో అతడి స్ధానాన్నిఅనుభవజ్ఞుడైన ద్రవిడ్తో భర్తీ చేయాలని కోల్కతా యాజయాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ కరేబియన్ దీవుల నుంచి వచ్చిన వెంటనే ద్రవిడ్తో సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. కానీ ద్రవిడ్ కేకేఆర్ ఆఫర్ను అంగీకరిస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే గత ఏడు ఎనిమిదేళ్ల నుంచి వివిధ జట్లకు కోచింగ్ ఇస్తూ ద్రవిడ్ బీజీబీజీగా గడిపాడు. అతడు ప్రస్తుతం తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో భారత హెడ్కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకొన్నాడు. అయితే కేకేఆర్ అతడికి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఆఫర్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఐపీఎల్-2025లో అట్టర్ ప్లాప్..కాగా ఈ ఏడాది సీజన్లో అజింక్య రహానే సారథ్యంలోని కోల్కతా జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ 14 మ్యాచ్లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో నైట్రైడర్స్ నిలిచింది. కెప్టెన్ రహానేపై కూడా వేటు పడే అవకాశముంది.చదవండి: Ashes 2025: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. బుమ్రాను ఫాలో కానున్న కమ్మిన్స్!? -
ఆర్సీబీని భయపెడుతున్న భువనేశ్వర్ కుమార్
వచ్చే ఐపీఎల్ సీజన్కు ముందు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీని భయపెడుతున్నాడు. గత సీజన్లో ఆర్సీబీని ఛాంపియన్గా నిలపడంలో కీలకపాత్ర పోషించిన భువీ.. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర్ప్రదేశ్ టీ20 లీగ్లో చెత్త ప్రదర్శనలు చేస్తూ ఆందోళన కలిగిస్తున్నాడు. ఈ లీగ్లో లక్నో ఫాల్కన్స్కు ఆడుతున్న భువీ.. ఇవాళ (ఆగస్ట్ 27) మీరట్ మెవెరిక్స్తో జరిగిన మ్యాచ్లో ఓ ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకుని ఆర్సీబీ యాజమాన్యాన్ని, ఆ ఫ్రాంచైజీ అభిమానులను ఉలిక్కి పడేలా చేశాడు. భువీపై ఆర్సీబీ వచ్చే సీజన్లో కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అతడి నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనలు ఆర్సీబీ యాజమాన్యాన్ని తప్పక కలవరపెడతాయి. భువీ చెత్త ప్రదర్శన ఈ ఒక్క ఓవర్కే పరిమితం కాలేదు. ఈ సీజన్లో అతనాడిన 5 మ్యాచ్ల్లోనూ ఇలాగే ఉంది. 8కిపైగా ఎకానమీతో, కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. మీరట్తో జరిగిన మ్యాచ్లో భువీ తన తొలి మూడు ఓవర్లు బాగానే వేశాడు. అందులో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నాలుగో ఓవర్లోనే భువీని ప్రత్యర్థి బ్యాటర్ రితురాజ్ శర్మ ఆడుకున్నాడు. మొదటి బంతిని సిక్సర్గా మలిచిన రితు.. ఆతర్వాత వరుసగా నాలుగు బౌండరీలు కొట్టి, చివరి బంతికి మరో సిక్సర్ బాదాడు. ఈ ఓవర్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టిన రితు 29 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా భువీ ఈ మ్యాచ్లో తన కోటా నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 49 పరుగులు సమర్పించుకున్నాడు. భువీతో పాటు మిగతా లక్నో బౌలర్లందరినీ కూడా చెడుగుడు ఆడుకున్న మీరట్ బ్యాటర్లు తమ జట్టుకు భారీ స్కోర్ను అందించారు. స్వస్తిక్ చికారా (55), రితురాజ్ శర్మ (74 నాటౌట్), రింకూ సింగ్ (57), రితిక్ వట్స్ (8 బంతుల్లో 35 నాటౌట్) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన లక్నో 18.2 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. జీషన్ అన్సారీ (4-0-23-3), యశ్ గార్గ్ (4-0-25-3), కార్తీక్ త్యాగి (2.2-0-9-2), విజయ్ కుమార్ (3-0-20-2) లక్నోను దెబ్బకొట్టారు. లక్నో ఇన్నింగ్స్లో సమీర్ చౌధరీ (46) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
ఆర్సీబీ కోచ్ లేదంటే మెంటార్గా వస్తా: ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB de Villiers)కు ఉన్న ఫ్యాన్ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్తోనూ అభిమానులను అలరించాడు.ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)తో తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన డివిలియర్స్.. 2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)లో చేరాడు. రిటైర్మెంట్ వరకు అదే జట్టుతో కొనసాగిన ఏబీడీకి ఆర్సీబీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. కోహ్లితో కలిసి సంబరాలుఐపీఎల్-2025 ఫైనల్లో ఆర్సీబీ గెలవగానే యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్తో కలిసి డివిలియర్స్ కూడా విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీకి మద్దతుగా వచ్చి.. ఆర్సీబీ పదిహేడేళ్ల సుదీర్ఘకల నెరవేరగానే డివిలియర్స్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు.ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పటికీ డివిలియర్స్ తమ జట్టులో భాగంగానే భావిస్తారు. అతడు తిరిగి వస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా తమ అభిలాషను తెలుపుతూ ఉంటారు. ఇక ఇందుకు సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. డివిలియర్స్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు.కోచ్ లేదంటే మెంటార్గా..అయితే, ఆటగాడిగా రీఎంట్రీ కాకుండా.. కోచ్ లేదంటే మెంటార్ పాత్రలో ఆర్సీబీలో చేరే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. ‘‘భవిష్యత్తులో నేను మళ్లీ ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం ఉంది. అయితే, సీజన్ ఆసాంతం ప్రొఫెషనల్ విధులు నిర్వర్తించేందుకు నేను సిద్ధంగా లేను.మనసంతా ఆర్సీబీతోనేఆరోజులు ముగిసిపోయాయి. ఏదేమైనా నా మనసు ఎల్లప్పుడూ ఆర్సీబీతోనే ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంఛైజీ నాకు కోచ్ లేదా మెంటార్గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తే.. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో ఐపీఎల్లో పునరాగమనం చేస్తే కచ్చితంగా ఆర్సీబీతోనే ఉంటాను’’ అని డివిలియర్స్ వార్తా సంస్థ IANSతో పేర్కొన్నాడు.పరుగుల వీరుడుకాగా సౌతాఫ్రికా తరఫున 2004- 2018 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు డివిలియర్స్. తన కెరీర్లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 8765, 9577, 1672 పరుగులు సాధించాడు.ఇక ఐపీఎల్లో 184 మ్యాచ్లు ఆడిన ఏబీ డివిలియర్స్ 5162 పరుగులు సాధించాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. 2021లో ఆర్సీబీ తరఫున కోల్కతా నైట్ రైడర్స్తో పోరులో డివిలియర్స్ చివరగా తన ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వారే: ఛతేశ్వర్ పుజారా -
IPL 2026: సీఎస్కేలోకి పృథ్వీ షా..? వీడియో చూసి ఫిక్స్ అయిపోయిన అభిమానులు
ముంబై యువ ఓపెనర్ పృథ్వీ షా గత కొంతకాలంగా బ్యాడ్ రీజన్స్ వల్ల వార్తల్లో నిలిచాడు. ఫామ్ లేమి, వివాదాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా ముంబై దేశవాలీ జట్లలో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్ 2025 వేలంలోనూ అమ్ముడుపోలేదు.టీమిండియా తరఫున అరంగేట్రం టెస్ట్లోనే సెంచరీ చేసి, భవిష్యత్ తారగా కీర్తించబడిన షా.. స్టేటస్ ఇచ్చిన కిక్కు తలకెక్కడంతో కొద్ది రోజుల్లోనే అదఃపాతాళానికి పడిపోయాడు.ఈ క్రమంలో తొలుత ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. ఆతర్వాత విజయ్ హజారే ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు. ముంబై విజేతగా నిలిచిన ముస్తాక్ అలీ టోర్నీలో భాగమైనా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.ముంబై తరఫున అవకాశాలు రావని భావించిన షా.. ఇటీవలే మహారాష్ట్రకు మకాం మార్చాడు. బుచ్చిబాబు టోర్నీలో అరంగేట్రం ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. కొత్త ప్రయాణాన్ని సెంచరీతో ప్రారంభించడంతో పృథ్వీ షా 2.0 వర్షన్ అని జనం అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే, బుచ్చిబాబు టోర్నీని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. పృథ్వీ షా చెన్నై వేదికగా ఛత్తీస్ఘడ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఈ సెంచరీ తర్వాత చాలామంది అభిమానుల్లాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఎస్కే కూడా షాను ప్రశంసించింది. First 💯 for Maharashtra in Chennai✅Shaw makes it special 💛#WhistlePodu #BuchiBabu pic.twitter.com/o5zGZA2MlU— Chennai Super Kings (@ChennaiIPL) August 21, 2025తమ అధికారిక సోషల్మీడియా ఖాతాలో షా మాట్లాడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో షా చెన్నైతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు. అతనికి చెన్నై అంటే చాలా ప్రత్యేకమని చెబుతాడు.ఈ వీడియోలో షా మాట్లాడిన తీరు, సీఎస్కే యాజమాన్యం అతనికి ప్రత్యేకంగా ఇచ్చిన ఎలివేషన్ చూస్తే వారి మధ్య ఏదో జరిగిందన్న విషయం స్పష్టమవుతుంది. సాధారణంగా సీఎస్కే యాజమాన్యం ఎప్పుడూ, తమ వాడు కాని ఏ ఆటగాడికి ఇంత హైప్ ఇవ్వదు. ఇవ్వలేదు. అలాంటిది సీఎస్కే షాను ప్రత్యేకించి ప్రమోట్ చేయడం చూస్తే, వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం వీరి మధ్య డీల్ కుదిరిందా అని అనిపించకమానదు. సీఎస్కే హ్యాండిల్లో షా వీడియో చూసిన తర్వాత అభిమానులు ఈ విషయాన్ని నిర్దారించుకున్నారు. ఒకవేళ ఇదే జరిగితే షా వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆయుశ్ మాత్రేతో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. -
విధ్వంసకర శతకం.. కేకేఆర్ యాజమాన్యానికి సవాల్ విసిరిన రమన్దీప్ సింగ్
కేకేఆర్ ఆల్రౌండర్ రమన్దీప్ సింగ్ బుచ్చిబాబు టోర్నీలో చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో పంజాబ్కు ఆడుతున్న అతను.. హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని, 101 బంతుల్లో 111 పరుగులు చేసి ఔటయ్యాడు.రమన్దీప్ శతక్కొట్టడంతో ఈ మ్యాచ్లో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్లో రమన్దీప్ వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. పరిమిత ఓవర్ల ఆటగాడిగా ముద్రపడిన రమన్దీప్.. మల్టీ డే ఫార్మాట్లోనూ సత్తా చాటి ఆ ముద్రను చెరిపేసుకున్నాడు.భారత క్రికెట్లో అరుదుగా కనిపించే సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్లలో రమన్దీప్ ఒకడు. పవర్ హిట్టింగ్కు పేరుగాంచిన ఇతను భారత్ తరఫున 2 టీ20లు ఆడాడు. దేశవాలీ క్రికెట్లో మెరుపులు కారణంగా రమన్దీప్కు ఐపీఎల్ అవకాశం దక్కింది. ఇతన్ని కేకేఆర్ యాజమాన్యం గత సీజన్కు ముందు రూ. 4 కోట్లకు రీటైన్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.అయితే రమన్దీప్ యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. బ్యాట్తో, బంతితో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఈ విషయంలో రమన్దీప్ను నిందించడం కంటే మేనేజ్మెంటే అతన్ని సరిగ్గా వినియోగించుకోలేదని చెప్పాలి. అవకాశం ఇచ్చిన అరకొర మ్యాచ్ల్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు పంపింది. బౌలింగ్లో అస్సలు వినియోగించుకోలేదు. తాజా ప్రదర్శనతో రమన్దీప్ కేకేఆర్ యాజమాన్యానికి సవాల్ విసిరాడు. తన సేవలను సరిగ్గా వినియోగించుకోవాలని పరోక్ష హెచ్చరిక చేశాడు.ఇదిలా ఉంటే, బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా ఆటగాళ్ల హవా కొనసాగుతుంది. నిన్న ముంబై తరఫున సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో చెలరేగగా.. ఇవాళ మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా, పంజాబ్ తరఫున రమన్దీప్ సింగ్ సెంచరీలతో కదంతొక్కారు. -
వేలానికి సంజూ శాంసన్..?
రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ఫ్రాంచైజీ మారే అంశం ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్గా నడుస్తుంది. సంజూకు రాయల్స్లో కొనసాగే ఉద్దేశం లేదని ప్రచారం జరుగుతున్న వేల.. ఐపీఎల్ ట్రేడింగ్ విండో తెరుచుకుంది. ట్రేడింగ్ ద్వారా సంజూను దక్కించుకునేందుకు సీఎస్కే, కేకేఆర్ పోటీపడుతున్నట్లు సమాచారం.అయితే సంజూ విషయంలో రాయల్స్ డిమాండ్లకు ఆ ఫ్రాంచైజీలు ససేమిరా అంటున్నట్లు తెలుస్తుంది. క్యాష్ డీల్ వరకు ఓకే కానీ, తమ ఆటగాళ్లను వదులుకునే ప్రసక్తే లేదని సదరు ఫ్రాంచైజీలు చెప్పినట్లు సమాచారం.సంజూను సీఎస్కే కోరుకున్నట్లైతే ప్రతిగా నగదుతో పాటు ఇద్దరు ఆటగాళ్లను రాయల్స్ డిమాండ్ చేసిందట. రవీంద్ర జడేజా, శివమ్ దూబేలను తమకు ఇవ్వాలని రాయల్స్ కోరినట్లు సమాచారం. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ సంజూను ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే బదులుగా అంగ్క్రిష్ రఘువంశీ, రమన్దీప్ సింగ్లను ఇవ్వాలని రాయల్స్ డిమాండ్ చేసిందట.సంజూ ట్రేడింగ్ విషయంలో రాయల్స్ డిమాండ్లను ఇరు ఫ్రాంచైజీలు తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో రాయల్స్ సంజూను వేలానికి వదిలేస్తుందని మరో ప్రచారం మొదలైంది. ఇదే జరిగితే సంజూ కోసం సీఎస్కే, కేకేఆర్తో పాటు మరిన్ని ఫ్రాంచైజీలు పోటీపడవచ్చు.ఇది ఓ రకంగా సంజూకు లాభదాయకమే అని చెప్పాలి. ప్రస్తుతమున్న ధరతో (రూ. 18 కోట్లు) పోలిస్తే అతనికి మరింత ధర లభించే అవకాశముంటుంది. అయితే సంజూ లాంటి ఆటగాడిని వేలం వరకు పోనివ్వకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎస్కే, కేకేఆర్ లాంటి ఫ్రాంచైజీలకు సంజూ లాంటి ఆటగాడి అవసరం చాలా ఉందని, ఈ ఫ్రాంచైజీలు రాయల్స్తో సయోధ్యకు రావచ్చని అంచనా వేస్తున్నారు.ట్రేడింగ్ ద్వారా సంజూ ఎపిసోడ్కు పుల్స్టాప్ పడితే ఓకే కానీ, వేలం వరకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఏమైనా జరగవచ్చు. సంజూకు పంత్కు మించిన ధర కంటే ఎక్కువ లభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగని అంత మొత్తం లభిస్తుందని కూడా చెప్పలేని పరిస్థితి. పర్సుల విషయంలో ఫ్రాంచైజీలకు పరిమితులు ఉన్నాయి.కాగా, జోస్ బట్లర్ విషయంలో సంజూ శాంసన్కు, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తుంది. తాను వద్దని చెప్పినా రాయల్స్ బట్లర్ను వేలానికి వదిలేసిందని సంజూ అలకపూనాడని ప్రచారం జరుగుతుంది. అంతే కాక జట్టులో తన ప్రాధాన్యత కూడా తగ్గిందని సంజూ భావిస్తున్నట్లు సమాచారం. ధృవ్ జురెల్ (వికెట్కీపింగ్), వైభవ్ సూర్యవంశీ (ఓపెనర్) రూపంలో తన స్థానానికి ప్రమాదం పొంచి ఉందని సంజూ భావిస్తుండవచ్చు.ఇలాంటి ఎన్ని ప్రచారాలు సాగినా సంజూ ఐపీఎల్ భవితవ్యంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
సంజూ రాయల్స్ నుంచి వైదొలగాలనుకోవడానికి అతడే ప్రధాన కారణం..?
ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో సంజూ శాంసన్ ట్రేడ్ డీల్కు సంబంధించిన చర్చలు హాట్హాట్గా నడుస్తున్నాయి. అసలు కారణాలు తెలియరానప్పటికీ సంజూ రాజస్థాన్ రాయల్స్ను వీడాలనుకుంటున్న విషయం స్పష్టమైపోయింది. రాయల్స్ సైతం సంజూ అభిమతాన్ని గౌరవమిస్తూ, అతన్ని వదిలేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఎస్కేతో ట్రేడ్ డీల్ గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.సంజూకు బదులుగా రాయల్స్ సీఎస్కే నుంచి ఇద్దరిని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సీఎస్కే యాజమాన్యం ఇందుకు సమ్మతిస్తున్నట్లు లేదు. సంజూను తాము తీసుకుంటే కేవలం క్యాష్ డీల్ మాత్రమే ఉంటుందని, తమ ఆటగాళ్లను ఎవరినీ వదిలిపెట్టుకునే ప్రసక్తే లేదని సీఎస్కే స్పష్టం చేసినట్లు సమాచారం.ఈ ప్రచారాల నడుమ సంజూ రాయల్స్ను వీడాలనుకోవడానికి కారణమిదే అంటూ ఓ వార్త సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. సంజూ రాయల్స్ను వద్దనుకోవడానికి జోస్ బట్లర్ ప్రధాన కారణమన్నది ఆ వార్త సారాంశం. రాయల్స్ యాజమాన్యం 2025 మెగా వేలానికి ముందు బట్లర్ను రీటైన్ చేసుకోలేదు. ఇది సంజూకు అస్సలు మింగుడు పడలేదంట. జోస్ 2018-2024 వరకు రాయల్స్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించినప్పటికీ అతన్ని రీటైన్ చేసుకోకపోవడం సంజూకు అస్సలు నచ్చలేదట. ఈ కారణంగానే అతను మేనేజ్మెంట్తో విభేదించినట్లు సమాచారం. సంజూ రాయల్స్ను వద్దనుకోవడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మొదటిది.. గత సీజన్లో అతని గైర్హాజరీలో (గాయం కారణంగా) వైభవ్ సూర్యవంశీ ఓపెనర్గా పాతుకుపోవడం. రెండవది.. యాజమాన్యం అతని ప్రత్యామ్నాయంగా ధృవ్ జురెల్కు ప్రాధాన్యత ఇవ్వడం. ఈ కారణాల వల్ల సంజూకు రాయల్స్ యాజమాన్యానికి గ్యాప్ పెరిగిందని తెలుస్తుంది.తన మాట చెల్లని చోట, తన స్థానం యాజమాన్యానికి భారమైన చోట ఉండటం ఇష్టం లేకనే సంజూ రాయల్స్ను వీడాలని అనుకున్నాడని పలు నివేదికలు చెబుతున్నాయి. 2013లో రాయల్స్లో జాయిన్ అయిన సంజూ.. 2021 సీజన్ నంచి ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సంజూ నేతృత్వంలో రాయల్స్ 2022 సీజన్లో రన్నరప్గా నిలిచింది. సంజూ, జోస్ బట్లర్ కలిసి రాయల్స్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు.ఇంత చేసినా తన మాట చెల్లకుండా బట్లర్ను వదిలేయడం సంజూను చాలా బాధించినట్లు తెలుస్తుంది. బట్లర్ను కాదని రాయల్స్ యాజమాన్యం తనతో సహా యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, జురెల్, హెట్మైర్, సందీప్ శర్మను అట్టిపెట్టుకుంది. రాయల్స్ వద్దనుకున్నా బట్లర్ను గుజరాత్ టైటాన్స్ వేలంలో రూ. 15.75 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. -
సంజూకు బదులు జడ్డూ, రుతురాజ్.. సీఎస్కే నిర్ణయం ఇదే..!
ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో సంజూ శాంసన్ ట్రేడ్ డీల్కు సంబంధించిన అంశం హాట్హాట్గా నడుస్తుంది. సంజూ రాజస్థాన్ రాయల్స్ను వీడటం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో సీఎస్కే అతన్ని ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ట్రేడ్ డీల్లో భాగంగా రాయల్స్ సంజూకు బదులు సీఎస్కేకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లను అడిగినట్లు సమాచారం. కొంత నగదుతో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ లేదా శివమ్ దూబేలలో ఎవరో ఒకరిని డిమాండ్ చేసిందని తెలుస్తుంది. అయితే ఈ డీల్కు సీఎస్కే యాజమాన్యం ససేమిరా అనిందని క్రిక్బజ్ పేర్కొంది.సంజూకు బదులు నగదు డీల్ జరుగుతుందే కానీ, తమ ఆటగాళ్లలో ఏ ఒక్కరిని వదులుకునేది లేదని సీఎస్కే రాయల్స్కు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ రాయల్స్, సీఎస్కే మధ్య డీల్ కుదరకపోతే సంజూను ట్రేడ్ డీల్ ద్వారా దక్కించుకునేందుకు వేరే ఫ్రాంచైజీలు కూడా పోటీపడవచ్చు. ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోతే సంజూ ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం 2027 సీజన్ వరకు రాయల్స్తోనే కొనసాగాల్సి వస్తుంది.సీఎస్కేకు వెళ్లాలన్నది సంజూ వ్యక్తిగత ఆప్షన్గా తెలుస్తుంది. రాయల్స్లో ఇమడలేకపోవడంతో అతను సీఎస్కే వైపు చూస్తున్నట్లు సమాచారం. ఫ్రాంచైజీ మారాలనుకున్న విషయాన్ని సంజూ చాలా గోప్యంగా ఉంచుతూనే లోలోపల పావులు కదుపుతున్నట్లు వినికిడి. మొత్తానికి సంజూ తమతో అసౌకర్యంగా ఉన్నాడన్న విషయాన్ని రాయల్స్ యాజమాన్యం గ్రహించింది. సంజూ నిర్ణయాన్ని ఫ్రాంచైజీ గౌరవించే అవకాశం ఉంది. ఏ ఫ్రాంచైజీతో ట్రేడ్ డీల్ కుదరకపోతే సంజూను వేలానికి వదిలేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే సంజూకు రికార్డు ధర లభించే అవకాశం ఉంటుంది. సీఎస్కేతో పాటు కేకేఆర్, గుజరాత్ ఫ్రాంచైజీలు సంజూ కోసం ఎగబడవచ్చు. -
ఐపీఎల్-2025లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! టీమిండియా లెజెండ్పై వేటు?
ఐపీఎల్-2026 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ సపోర్ట్ స్టాప్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ జట్టు మెంటార్, టీమిండియా పేస్ బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్పై వేటు వేసేందుకు లక్నో యాజమాన్యం సిద్దమైనట్లు తెలుస్తోంది.గత ఐపీఎల్ సీజన్లో లక్నో దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుసగా రెండో సీజన్లోనూ ప్లే ఆఫ్స్కు చేరడంలో లక్నో విఫలమైంది. 14 మ్యాచ్లలో కేవలం ఆరింట మాత్రమే విజయం సాధించిన సూపర్ జెయింట్స్.. పాయింట్ల పట్టికలో ఏడో స్ధానంతో సరిపెట్టుకుంది.కాగా ఐపీఎల్-2024 సీజన్కు ముందు గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీతో జత కట్టిన తర్వాత లక్నో కోచింగ్ స్టాప్లో జహీర్ చేరాడు. ఆ ఏడాది సీజన్నూ లక్నో ఏడో స్ధానంతో ముగించింది. జహీర్ మెంటార్గా ఉంటూనే లక్నో బౌలింగ్ కోచ్ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు.అయితే జాక్ మెంటార్షిప్ పట్ల లక్నో మెన్జ్మెంట్ ఆసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడికి వీడ్కోలు పలికి మరొకరిని నియమించాలని సూపర్ జైంట్స్ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఇప్పటికే లక్నో కొత్త బౌలింగ్ కోచ్ అరుణ్ భరత్ ఎంపికయ్యాడు. త్వరలో కొత్త మెంటార్ను కూడా లక్నో నియమించనుంది. అంతేకాకుండా ఆర్పీస్జీ గ్రూపు ఆద్వర్యంలో ఉన్న అన్ని జట్లను పర్యవేక్షించేందుకు కొత్త క్రికెట్ డైరెక్టర్ను కూడా నియమించేందుకు సంజీవ్ గోయోంకా సిద్దమైనట్లు తెలుస్తోంది.మరోవైపు భారీ అంచనాలు పెట్టుకున్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ సైతం రాణించలేకపోయాడు. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ మినహా మిగితా మ్యాచ్లలో పంత్ విఫలమయ్యాడు. కాగా పంత్ను రూ. 27 కోట్ల రికార్డు ధరకు లక్నో ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన బ్రెవిస్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డు -
IPL 2026: ‘ఈసారి వేలంలో అతడికే అత్యధిక ధర’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలం గురించి టీమిండియా దిగ్గజ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంపాటలో భారత ప్లేయర్ల కంటే విదేశీ క్రికెటర్ల వైపే ఫ్రాంఛైజీలు మొగ్గుచూపుతాయని అంచనా వేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈసారి ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని అంచనా వేశాడు.ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై (CSK), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు చెత్త ప్రదర్శన కనబరిచాయి. ఐదుసార్లు చాంపియన్గా ఘనమైన రికార్డు ఉన్న చెన్నై జట్టు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన కేకేఆర్ ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.వారిని వదిలేసేందుకు సిద్ధంఈ నేపథ్యంలో కెప్టెన్ అజింక్య రహానే సహా వెంకటేశ్ అయ్యర్ వంటి వారిని వదిలించుకునేందుకు కేకేఆర్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. సీఎస్కే సైతం రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేలను విడిచిపెట్టాలనే సూచనలు వస్తున్నాయి. ఇక అశ్విన్ సైతం సీఎస్కేను వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.ఇలాంటి తరుణంలో అశ్విన్ ఐపీఎల్-2026 మినీ వేలం గురించి మాట్లాడాడు. ‘‘ఈసారి మినీ వేలం జరుగబోతోంది. కాబట్టి ఇందులో భారత ఆటగాళ్లను మనం చూడలేమని చెప్పవచ్చు. కచ్చితంగా ఈసారి రేసులోకి కొత్త ఆటగాళ్లు వస్తారు.అంతేకాదు.. ఈసారి ఖరీదైన ఆటగాళ్లుగా విదేశీ ప్లేయర్లు నిలుస్తారు. ఏదేమైనా.. ఏ ఫ్రాంఛైజీ అయినా సరే భారత్కు చెందిన ప్రముఖ క్రికెటర్ను విడుదల చేసింది అంటే.. అంతకంటే రిస్క్ మరొకటి ఉండదని చెప్పవచ్చు.నా అభిప్రాయం ప్రకారం.. ఈసారి ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధర పలుకుతారు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్లోకి రీప్లేస్మెంట్ ఆటగాడిగా వచ్చిన మిచెల్ ఓవెన్.. ఆసీస్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ వేలంకి వస్తారు. వీరికి భారీ ధర దక్కడం ఖాయం.ముఖ్యంగా విదేశీ ఆల్రౌండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మినీ ఆక్షన్లో అన్ని జట్లు రూ. 25. 30 కోట్ల వరకు ఖర్చుపెట్టే అవకాశం ఉంది’’ అని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే👉రిషభ్ పంత్- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 27 కోట్లు- 2025 వేలం👉శ్రేయస్ అయ్యర్- పంజాబ్ కింగ్స్- రూ. 26.75 కోట్లు- 2025 వేలం👉వెంకటేశ్ అయ్యర్- కోల్కతా నైట్ రైడర్స్- రూ. 23.75 కోట్లు- 2025 వేలం👉మిచెల్ స్టార్క్- కోల్కతా నైట్ రైడర్స్- రూ. 24.75 కోట్లు- 2024 వేలం👉ప్యాట్ కమిన్స్- సన్రైజర్స్ హైదరాబాద్- రూ. 20.50 కోట్లు- 2024 వేలం👉సామ్ కరాన్- పంజాబ్ కింగ్స్- రూ. 18.50 కోట్లు- 2023 వేలం👉కామెరాన్ గ్రీన్- ముంబై ఇండియన్స్- రూ. 17.50 కోట్లు- 2023 వేలం👉బెన్ స్టోక్స్- చెన్నై సూపర్ కింగ్స్- రూ. 16.25 కోట్లు- 2023 వేలం👉క్రిస్ మోరిస్- రాజస్తాన్ రాయల్స్- రూ. 16.25 కోట్లు- 2021 వేలం👉యువరాజ్ సింగ్- ఢిల్లీ డేర్డెవిల్స్- రూ. 16 కోట్లు- 2015 వేలం👉నికోలస్ పూరన్- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 16 కోట్లు- 2023 వేలం.చదవండి: జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు -
IPL : తలైవర్ ఫ్యాన్ Thala గూటికి..
-
రాజస్తాన్ రాయల్స్తో నా జర్నీ ఒక అద్భుతం.. వారికి థ్యాంక్స్: శాంసన్
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గురుంచి పలు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2026 సీజన్కు ముందు శాంసన్ రాజస్తాన్ రాయల్స్ను వీడి చెన్నై సూపర్ కింగ్స్లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.2013లో రాజస్తాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసిన సంజూ.. 2021లో ఆ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. 30 ఏళ్ల సంజూ రాయల్స్ తరపున 11 సీజన్ల పాటు ఆడాడు. అయితే గత సీజన్లో సంజూ గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు. దీంతో పలు మ్యాచ్లకు రియాన్ పరాగ్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ సమయంలో జట్టు యాజమాన్యంతో సంజూకు విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. జట్టు కూర్పు, ఓపెనింగ్ స్థానం విషయంలో సంజూ ఆంసృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ తాజాగా రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."రాజస్తాన్ రాయల్స్కు నాకు ప్రపంచం లాంటింది. కేరళలోని ఒక గ్రామం నుంచి నాకు నా టాలెంట్ను నిరూపించుకునేందుకు రాజస్తాన్ అవకాశమిచ్చింది. రాహుల్ ద్రవిడ్ సార్, మనోజ్ బదలే సారు నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. రాయల్స్ ఫ్రాంచైజీ వల్లే క్రికెట్ ప్రపంచానికి నేను పరిచయమయ్యాను. అంతేకాకుండా నాపై ఎంతో నమ్మకంతో కెప్టెన్సీ కూడా అప్పగించారు. రాయల్స్తో ఈ ప్రయాణం నిజంగా ఒక అద్బుతం. రాజస్తాన్ వంటి ఫ్రాంచైజీలో ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుడను. ఇంతకు మించి నేను చెప్పలేను అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.చదవండి: SA Vs AUS 1st T20I: టిమ్ డేవిడ్ విధ్వంసం.. దెబ్బకు 16 ఏళ్ల వార్నర్ రికార్డు బ్రేక్ -
సీఎస్కేకు సంజూ శాంసన్.. రాజస్తాన్ కెప్టెన్గా అశ్విన్?
ఐపీఎల్-2026కు ముందు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్కు వీడ్కోలు పలకనున్నాడా? అంటే అవునానే సమాధానమే ఎక్కువవగా వినిపిస్తోంది. శాంసన్ ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలోకి వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ను రాయల్ యాజమాన్యం విడిచిపెట్టేందుకు సిద్దంగా లేనప్పటికి.. సంజూ మాత్రం ఎలాగైనా బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2021లో రాజస్తాన్ కెప్టెన్గా ఎంపికైన శాంసన్.. ఐదు సీజన్ల పాటు జట్టును బాగానే నడిపించాడు.ఐపీఎల్-2022లో రాయల్స్ను ఫైనల్కు చేర్చిన సంజూ.. ఆ తర్వాత 2024 సీజన్లో రాజస్తాన్ ఫ్లే ఆఫ్స్కు చేరుకుంది. ఈ ట్రేడింగ్ రూమర్స్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి రాజస్తాన్ జట్టులోకి వస్తాడని, అంతేకాకుండా ఆ టీమ్ కెప్టెన్గా ఎంపికవుతాడని చోప్రా జోస్యం చెప్పాడు."రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సీఎస్కేకి ట్రేడ్ అయ్యే అవకాశముంది. ఒకవేళ అతడు చెన్నై జట్టులోకి వచ్చిన కెప్టెన్సీ పగ్గాలు అయితే అప్పగించరు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ను కొన్ని సీజన్ల పాటు కెప్టెన్గా సీఎస్కే కొనసాగించవచ్చు.ఇదే క్రమంలో అశ్విన్ తిరిగి రాజస్తాన్ రాయల్స్కు వెళ్లవచ్చు. అంతేకాకుండా ఆ జట్టు పగ్గాలను అప్పగించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. సంజూ బయటకు వెళ్లిపోతే రాజస్తాన్ కెప్టెన్గా ఎవరు అవుతారన్నది ప్రస్తుతం నేను ఆలోచిస్తున్నాను.ధ్రువ్ జురెల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునేందుకు సిద్దంగా లేడు. అందుకు ఇంకా సమయం పడుతుంది. యశస్వి జైశ్వాల్ కెప్టెన్ అవ్వాలనే కోరిక అయితే ఉంది. కానీ అతడిపై కెప్టెన్సీ భారాన్ని రాజస్తాన్ మోపుతుందని నేను అనుకోవడం లేదు. రియాన్ పరాగ్ వైపు మొగ్గు చూపే అవకాశముంది. అతడు గత సీజన్లో పర్వాలేదన్పించాడు.సంజూ సీఎస్కేకు వెళ్తే వారికి ఫ్యూచర్ వికెట్ కీపింగ్కు ఎటువంటి ఢోకా ఉండదు. కాబట్టి ఎంఎస్ ధోని తనకు నచ్చినది చేయగలడు. అదేవిధంగా ఆర్ఆర్కు ఆఫ్ స్పిన్నర్ కూడా అవసరం. గత సీజన్లో వనిందుకు హసరంగా, మహీష్ తీక్షణ అంత మెరుగ్గా రాణించలేకపోయారు. కాబట్టి అశ్విన్ను తీసుకుంటే వారికి ఆఫ్ స్పిన్నర్తో పాటు కెప్టెన్సీ అప్షన్ కూడా లభిస్తోంది. -
IPL 2026: నన్ను విడిచిపెట్టండి.. వెళ్లిపోతా!.. సీఎస్కేకు గుడ్బై?
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే ట్రేడింగ్ రూపంలో జట్లలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సంజూ శాంసన్ (Sanju Samson). రాజస్తాన్ రాయల్స్కు కెప్టెన్గా రాణించిన ఈ కేరళ బ్యాటర్.. వచ్చే ఎడిషన్లో ఈ ఫ్రాంఛైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.తాను ఫిట్గా ఉన్నా రియాన్ పరాగ్ (Riyan Parag)కు కెప్టెన్సీ ఇవ్వడం, మెగా వేలంలో జోస్ బట్లర్ను విడిచిపెట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో సంజూ.. రాయల్స్ను వీడేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.సీఎస్కేకు అశ్విన్ గుడ్బై?ఈ క్రమంలో తెరమీదకు వచ్చిన మరో ఆసక్తికర వార్త ఇందుకు బలం చేకూరుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. తనను విడిచిపెట్టమని సీఎస్కేను కోరాడని దాని సారాంశం. దీనిని బట్టి సీఎస్కే అశూను రాయల్స్కు ఇచ్చి.. వారి నుంచి సంజూను ట్రేడ్ చేసుకోనుందనే ప్రచారం ఊపందుకుంది.కాగా 2009లో అశ్విన్ సీఎస్కేతోనే తన ఐపీఎల్ కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత రైజింగ్ పుణె సూపర్జెయింట్ (ఇప్పుడు మనుగడలో లేదు), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడాడు. ఇక 2022లో రాజస్తాన్ రాయల్స్లో చేరిన అశ్విన్.. గతేడాది వరకు అక్కడే విజయవంతంగా కొనసాగాడు.రూ. 9.75 కోట్లకు కొనుగోలుఅయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని విడుదల చేయగా.. సీఎస్కే రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ.. ఈ సీజన్లో అశ్విన్కు తొమ్మిది మ్యాచ్లలో ఆడే అవకాశం మాత్రమే దక్కింది. అయితే, అందులోనూ అతడు నిలకడగా రాణించలేకపోయాడు. కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వేరే జట్టుకు మారతాడా?యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇచ్చే క్రమంలో మేనేజ్మెంట్ అశూను పలు మ్యాచ్లలో బెంచ్కే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ సీఎస్కేను వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, రాయల్స్ అతడిని తిరిగి తీసుకుంటుందా? లేదంటే వేరే జట్టుకు మారతాడా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా ఐపీఎల్లో అశ్విన్ మొత్తంగా 220 మ్యాచ్లు ఆడి 187 వికెట్లు కూల్చాడు.ఇక గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడే అశూ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియా తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ చెన్నై ప్లేయర్.. టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు కూల్చాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3503, 707, 184 పరుగులు సాధించాడు.చదవండి: అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. ఆసియాకప్లో ఆడాల్సిందే: గంగూలీ -
సంజూ శాంసన్కు మీకిస్తే బదులుగా ఇద్దరిని ఇవ్వండి.. రాయల్స్ డిమాండ్..!
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ను వీడాలని అనుకుంటున్నట్లు సోషల్మీడియా కోడై కూస్తుంది. ఈ ప్రచారం నిజమేనని తాజాగా పరిణామాలు సూచిస్తున్నాయి.ఏ ఫ్రాంచైజీ అయినా సంజూను ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని అనుకున్నట్లైతే బదులుగా ఇద్దరు ఆటగాళ్లతో పాటు నగదును కూడా ఇవ్వాలని రాయల్స్ మేనేజ్మెంట్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.ఈ విషయం ప్రచారంలోకి వచ్చిన తర్వాత రాయల్స్ యాజమాన్యం సంజూను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది. వాస్తవానికి ఈ డీల్ను రాయల్స్ యాజమాన్యం సంజూపై అమితాసక్తి ప్రదర్శిస్తున్న సీఎస్కే కోసం తీసుకొచ్చిందట.సంజూను వారికిస్తే బదులుగా ఓ విదేశీ ప్లేయర్ను, ఓ దేశీయ ఆటగాడిని ఇవ్వాలని ప్రతిపాదన పెట్టిందట. ఈ డీల్పై సీఎస్కే సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాయల్స్ యాజమ్యానం ఎవరిని కోరుకుంటుందనే దానిపై ఆ ఫ్రాంచైజీ తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది.ఈ ప్రక్రియ పూర్తివడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సంజూకు రాయల్స్తో 2027 సీజన్ వరకు ఒప్పందం ఉంది. వారు రిలీజ్ చేస్తే తప్ప అతను వేరే ఫ్రాంచైజీకి వెళ్లలేడు.వాస్తవానికి సంజూకు యాజమాన్యంతో చాలా మంది సంబంధాలు ఉన్నాయి. పైగా కోచ్ ద్రవిడ్కు సంజూ ప్రియ శిష్యుడు. మరి ఏ విషయంలో వీరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయో తెలియడం లేదు.2025 సీజన్కు ముందు మార్పులు చేర్పుల విషయంలో యాజమాన్యానికి-సంజూకు మధ్య గ్యాప్ ఏర్పడినట్లు వినికిడి. ఆ గ్యాప్ సీజన్ పూర్తయ్యే సరికి తారాస్థాయికి చేరింది. మొత్తానికి సంజూ రాయల్స్ను వీడాలని గట్టిగా అనుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్కే అతన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది.గత ఐపీఎల్ సీజన్ ముగిసాక సీఎస్కే సీఈవో, ఆ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ సంజూను అమెరికాలో కలిసారని సమాచారం. వారి మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగి సంజూ సీఎస్కేకు వస్తే, సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడా లేక రుతురాజ్ను తప్పించి అతనికి కెప్టెన్సీ అప్పగిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.రుతురాజ్ ఇప్పుడిప్పుడే ధోని అండర్లో కెప్టెన్గా ఓనమాలు దిద్దుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో సంజూ కోసం అతన్ని కెప్టెన్సీ త్యాగం చేయమని సీఎస్కే మేనేజ్మెంట్ ఆడగకపోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.2013లో రాయల్స్తోనే ఐపీఎల్ జర్నీ ప్రారంభించిన సంజూ.. మధ్యలో రెండేళ్లు మినహా ఐపీఎల్ కెరీర్ మొత్తం ఆ ఫ్రాంచైజీతోనే కొనసాగాడు. 2019, 2020 సీజన్లలో అదిరిపోయే ప్రదర్శనలు చేసిన అతను.. 2021 సీజన్లో రాయల్స్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. సంజూ నేతృత్వంలో ఆ జట్టు 2022 సీజన్ ఫైనల్స్కు చేరింది. -
సీఎస్కేలోకి బెన్ డకెట్..!
వచ్చే ఐపీఎల్ సీజన్ (2026) కోసం ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. గడిచిన సీజన్లో ఆ జట్టు పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో (14 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలు) నిలిచింది. ఈ కారణంగానే సీఎస్కే యాజమాన్యం భారీ ప్రక్షాళన చేపట్టే అవకాశం ఉంది.ఈ క్రమంలో సీఎస్కే ఓ కీలక ఆటగాడిగాని జట్టులో చేర్చుకోవచ్చని తెలుస్తుంది. ఇంగ్లండ్ బజ్బాల్ టెక్నిక్లో భాగమైన బెన్ డకెట్పై సీఎస్కే కన్నేసినట్లు తెలుస్తుంది. డకెట్ను జట్టులో చేర్చకోవడం వల్ల సీఎస్కే అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.గత సీజన్లో సీఎస్కేకు సరైన ఓపెనింగ్ బ్యాటర్ లేక పవర్ప్లేల్లో తేలిపోయింది. ఆ జట్టుకు ఒక్క మ్యాచ్లో కూడా మెరుపు ఆరంభం లభించలేదు. సీఎస్కే గత సీజన్ మొత్తం ఓపెనర్లతో ప్రయోగాలు చేసింది. రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, డెవాన్ కాన్వే, షేక్ రషీద్, ఆయుశ్ మాత్రేతో రకరకాల కాంబినేషన్లతో ప్రయోగాలు చేసిన సత్ఫలితాలు రాలేదు. డకెట్ ఆ జట్ట పవర్ప్లే కష్టాలకు సరైన పరిష్కారం కావచ్చు. డకెట్కు పవర్ప్లేల్లో మంచి రికార్డు ఉంది. దూకుడైన ఆటతీరుతో అతను ప్రాతినిథ్యం వహించిన జట్లకు మెరుపు ఆరంభాలను అందించాడు. టీ20ల్లో డకెట్కు 140కు పైగా స్ట్రయిక్రేట్ ఉంది. పవర్ప్లేల్లోనే కాకుండా క్రీజ్లో కుదురుకుంటే ఇన్నింగ్స్ మొత్తం దడదడలాడించేస్తాడు డకెట్.గత సీజన్లో సీఎస్కే ఎదుర్కొన్న మరో కీలకమైన సమస్య స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడం. ఈ సమస్యకు కూడా డకెట్ సరైన పరిష్కారం కావచ్చు. డకెట్కు స్పిన్నర్లపైన మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతడికున్న అద్బుతమైన టెక్నిక్తో స్పిన్నర్లకు ఎడాపెడా వాయించేస్తాడు. స్పిన్నర్లపై అతని స్వీప్ షాట్లు, ముఖ్యంగా రివర్స్ స్వీప్లు అమితంగా ఆకట్టుకుంటాయి. పై కారణాలకు పరిష్కారం దిశగా సీఎస్కే వచ్చే సీజన్ కోసం డకెట్ను తప్పక కొనుగోలు చేస్తుందని టాక్ నడుస్తుంది. ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోయే 30 ఏళ్ల డకెట్ ప్రస్తుతం భారత్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో సత్తా చాటుతున్నాడు. మెరుపు బ్యాటింగ్తో అతడు ఈ సిరీస్లో ఇంగ్లండ్కు తురుపుముక్కగా ఉన్నాడు. -
గైక్వాడ్పై వేటు.. సీఎస్కే కెప్టెన్గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను?
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ టి నటరాజన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడా? అంటే అవునానే అంటున్నారు క్రికెట్ నిపుణులు. వచ్చే ఏడాది సీజన్ ముందు నటరాజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సీఎస్కే ట్రేడ్ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ తమిళనాడు ఫాస్ట్ బౌలర్ సీఎస్కే క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతుండడం ట్రేడ్ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సీఎస్కే ట్రైనింగ్ జెర్సీని నటరాజన్ ధరించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్-2025 వేలంలో నటరాజన్ను రూ. 10.75 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది.దీంతో అతడికి కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. మిచెల్ స్టార్క్, చమీరా, ముఖేష్ కుమార్ వంటి స్టార్ పేసర్లు ఉండడంతో అతడు ఎక్కువ భాగం బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని ఢిల్లీ కూడా వదులుకోవడానికి సిద్దంగా ఉంది.2017లో అరంగేట్రం..ఈ తమిళనాడు పేసర్ 2017లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా 2018, 2019 సీజన్లకు నట్టు దూరమయ్యాడు. తిరిగి మళ్లీ ఐపీఎల్-2020 ఎస్ఆర్హెచ్తో జతకట్టాడు. ఆరెంజ్ ఆర్మీతో ఐదేళ్ల పాటు తన ప్రయణాన్ని కొనసాగించాడు.అయితే గత సీజన్ మెగా వేలానికి ముందు అతడిని సన్రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో అతడు ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు 63 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన నటరాజన్.. 67 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నటరాజన్ గత నాలుగేళ్లగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. టీమిండియా తరపున 7 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. గాయాల కారణంగా అతడు భారత జట్టులో చోటు కోల్పోవల్సి వచ్చింది.కేఎల్ రాహుల్పై కన్ను..?అదేవిధంగా మరో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్పై కూడా సీఎస్కే కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాహుల్ను సీఎస్కే ట్రేడ్ చేసుకోవాలని భావిస్తుందంట. రుతురాజ్పై వేటు వేసి రాహుల్కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని సీఎస్కే యాజమాన్యం యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాహుల్ రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్లు ఆడి 539 పరుగులతో ఢిల్లీ తరపున లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.చదవండి: అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్ -
IPL 2026: రహానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్గా టీమిండియా ఓపెనర్!
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఐపీఎల్-2026కు ముందు కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుందన్నది ఆ వార్త సారాంశం. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ కర్ణాటక ఆటగాడిని రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్లు ఆడి 539 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.కేకేఆర్ అట్టర్ ప్లాప్..అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ 14 మ్యాచ్లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో నైట్రైడర్స్ నిలిచింది.ఈ క్రమంలోనే రాహుల్ను ఎలాగైనా ట్రేడ్ చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని కేకేఆర్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేకేఆర్ ప్రస్తుత జట్టులో భారత వికెట్ కీపర్ ఒక్కరు కూడా లేరు. జట్టులోని ఇద్దరు కీపర్లు(క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్భాజ్) విదేశాలకు చెందినవారే.అయినా వీరిద్దరూ తమ స్ధాయికి తగ్గప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. అందుకే రాహుల్ను తీసుకుంటే కెప్టెన్గా, వికెట్ కీపర్గా, బ్యాటర్గా ఉపయోగపడతాడని కేకేఆర్ యోచిస్తోంది. కానీ రాహుల్ వంటి అద్బుతమైన ఆటగాడిని ట్రేడ్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పుకొంటుందో లేది వేచి చూడాలి. మరోవైపు చంద్రకాంత్ పండిత్ కేకేఆర్ హెడ్కోచ్కు రాజీనామా చేశాడు. అతడి స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ను ప్రధాన కోచ్గా నియమించేందుకు కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఐపీఎల్-2026 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరిగే అవకాశముంది.చదవండి: టీమిండియా అద్భుత పోరాటం.. కానీ ఓ చెత్త రికార్డు.. ప్రపంచంలోని తొలి జట్టుగా.. -
IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం
2026 ఐపీఎల్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఇప్పటి నుంచే వ్యూహరచన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్ను నియమించుకుంది. కేకేఆర్ నుంచి తాజాగా బయటికి వచ్చిన భరత్ అరుణ్తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.అరుణ్ కేకేఆర్ 2024 సీజన్లో విజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ సీజన్లో కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఛాంపియన్గా నిలిచింది. అరుణ్ అంతకుముందు టీమిండియా తరఫున కూడా అద్భుతాలు చేశాడు. 2014-2021 వరకు భారత జట్టు బౌలింగ్ కోచ్గా పని చేసి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు.అరుణ్ 2022లో కేకేఆర్తో జతకట్టి నాలుగు సీజన్ల పాటు ఆ జట్టుతో కొనసాగాడు. తాజాగా కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తన పదవి నుంచి వైదొలగడంతో అరుణ్ కూడా బయటికి వచ్చేశాడు. లక్నో బౌలింగ్ కోచ్గా అరుణ్ ఏడాది మొత్తం అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. మధ్యలో వేరే ఏ ఒప్పందాలు చేసుకోకూడదు. దీనికి సమ్మతించే అరుణ్ సంజీవ్ గెయెంకా జట్టుతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.వాస్తవానికి ఇప్పటివరకు లక్నోకు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్ లేడు. స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్ ప్రవీణ్ తాంబేతో పని కానిచ్చేస్తుంది. తాజాగా అరుణ్ను స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్గా నియమించుకోవడంతో లక్నో బౌలింగ్ విభాగం బలపడే అవకాశం ఉంది. ఆ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మెంటార్గా ఉన్నాడు. గత సీజన్లో అతనే బౌలింగ్ కోచ్ బాధ్యతలను మోశాడు.2022 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో తొలి రెండు సీజన్లు మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కు చేరగా.. గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు గత సీజన్లోనే కేఎల్ రాహుల్ను మార్చి రిషబ్ పంత్ను కొత్త కెప్టెన్గా తెచ్చుకుంది. పంత్కు లక్నో యాజమాన్యం రికార్డు స్థాయిలో 27 కోట్లు చెల్లించి ఒప్పందం చేసుకుంది.గత సీజన్లో ఇతర జట్లతో పోలిస్తే లక్నో బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపించింది. ఆ జట్టులో ఆవేశ్ ఖాన్, ఆకాశ్దీప్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్ సింగ్, మయాంక్ యాదవ్ పేసర్లుగా ఉండగా.. మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఉన్నారు. -
IPL 2026: కేకేఆర్ హెడ్కోచ్గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (KKR) జట్టుకు కొత్త హెడ్కోచ్ రాబోతున్నాడు. ఇందుకోసం యాజమాన్యం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కేకేఆర్ ప్రధాన కోచ్గా పనిచేసిన చంద్రకాంత్ పండిత్ శిక్షణ బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.ఆయన సేవలు వెలకట్టలేనివిరెండేళ్లుగా కేకేఆర్తో ప్రయాణం చేసిన చంద్రకాంత్... ఇకపై కొనసాగబోవడం లేదని ఫ్రాంచైజీ యాజమాన్యం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కొత్త అవకాశాలను అన్వేషించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫ్రాంచైజీ హెడ్ కోచ్గా కొనసాగాలనుకోవడం లేదు. రెండేళ్లుగా జట్టుకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. 2024లో కోల్కతా చాంపియన్గా నిలవడంలో చంద్రకాంత్ కీలక పాత్ర పోషించారు.క్రమశిక్షణ, అంకితభావంతో బలమైన జట్టును రూపొందించారు. జట్టుపై ఆయన ప్రభావం ఎంతగానో ఉంది. భవిష్యత్తులోనూ ఆయన విజయవంతం కావాలని ఆశిస్తున్నాం’ అని ఫ్రాంచైజీ ప్రకటనలో పేర్కొంది.గతేడాది టైటిల్.. ఈసారి పేలవ ప్రదర్శనకాగా కోచింగ్లో అపార అనుభవం ఉన్న చంద్రకాంత్ శిక్షణలో కేకేఆర్ జట్టు 2024లో మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకుంది. అయితే ఈ ఏడాది డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన కోల్కతా... స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్లలో కేవలం ఐదింట మాత్రమే నెగ్గి పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.ఇక ఐపీఎల్లో కేకేఆర్కు ఇదే పేలవ ప్రదర్శన కాగా... ఈ సీజన్లో మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే ‘ప్లే ఆఫ్స్’ రేసుకు దూరమై నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ జట్టును వీడటం గమనార్హం.కాగా దేశవాళీల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రకాంత్ పండిత్... 2023 ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు కేకేఆర్ జట్టుతో చేరారు. కాగా ఆ ఏడాది ఏడో స్థానంలో నిలిచిన కోల్కతా... తర్వాతి సంవత్సరం ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. 2024లో ఐపీఎల్ ట్రోఫీతో పాటు లీగ్ చరిత్రలో అత్యధిక పాయింట్లు, అత్యుత్తమ రన్రేట్ సైతం కేకేఆర్ నమోదు చేసుకుంది. హెడ్కోచ్గా ఇయాన్ మోర్గాన్?ఇక చంద్రకాంత్ పండిట్ నిష్క్రమణ నేపథ్యంలో కేకేఆర్ తమ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ను హెడ్కోచ్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. 2020, 2021 సీజన్లలో మోర్గాన్ కేకేఆర్ సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో కోల్కతా జట్టు 24 మ్యాచ్లకు గానూ పదకొండు గెలిచింది.ఇదిలా ఉంటే.. చంద్రకాంత్ పండిట్తో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా కేకేఆర్ను వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే అతడు చెన్నై సూపర్ కింగ్స్తో జట్టుకట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే, గతేడాది జట్టును చాంపియన్గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను వదులుకున్న కేకేఆర్.. తాజాగా హెడ్కోచ్కు కూడా ఉద్వాసన పలికింది. ఇక శ్రేయస్ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయగా.. ఐపీఎల్-2025లో జట్టును ఫైనల్కు చేర్చాడు. మరోవైపు.. కేకేఆర్ అజింక్య రహానేను తమ కెప్టెన్గా నియమించుకోగా పేలవ ప్రదర్శనతో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండా నిష్క్రమించింది.ఐపీఎల్-2025లో కేకేఆర్ కోచింగ్ సిబ్బంది వీరే👉మెంటార్: డ్వేన్ బ్రావో👉హెడ్కోచ్: చంద్రకాంత్ పండిత్👉బౌలింగ్ కోచ్: భరత్ అరుణ్👉స్పిన్ బౌలింగ్ కోచ్: కార్ల్ క్రోవ్👉ఫిజియోథెరపిస్ట్: ప్రశాంత్ పంచాడ👉స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్: క్రిస్ డొనాల్డ్సన్👉టీమ్ మేనేజర్: అడ్రియాన్ వాన్ బెంట్లీ.చదవండి: WCL 2025: స్టువర్ట్ బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్లో ఇండియా


