IPL 2026
-
చెలరేగిన రాహుల్.. భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరిగిన 43వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. జైపూర్లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ తమ నిర్ణయానికి న్యాయం చేస్తూ భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రియాన్ పరాగ్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. రియాన్కు కాసేపు జురెల్ (42) సహకరించారు. ఆఖర్లో డొనొవన్ ఫెరియెరా గత మ్యాచ్ తరహాలో చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 2 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.రాజస్థాన్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4), షుభమ్ దూబే (6) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (20) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో రాణించగా.. జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ తొలి బంతి నుంచే గెలుపుపై కసితో ఆడింది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (62), కేఎల్ రాహుల్ (75) అద్భుతమైన అర్ద సెంచరీలతో జట్టు గెలుపుకు గట్టి పునాది వేశారు. అనంతరం నితీశ్ రాణా (33), ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్), అశుతోష్ శర్మ (26 నాటౌట్) తమవంతు పాత్రలు పోషించి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. 19.1 ఓవర్లలో ఢిల్లీ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. -
లక్నో జట్టులో ఆసీస్ విధ్వంసకర బ్యాటర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో ఏకంగా 6 పరాజయాలు చవిచూసి ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకుంది.ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లక్నోకు ఓ ఊరట కలిగించే వార్త అందింది. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ తాజాగా జట్టులో చేరాడు.ఇంగ్లిస్ను లక్నో ఈ సీజన్ వేలంలో రూ. 8.6 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ.. వివాహం కారణంగా అతను సీజన్ తొలి దశ మ్యాచ్లకు అందుబాటులో ఉండలేకపోయాడు. ఇంగ్లిస్ పెళ్లి ఏప్రిల్ 18న స్వదేశంలో జరిగింది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఆడిన ఇంగ్లిస్ 11 ఇన్నింగ్స్ల్లో 162.57 స్ట్రయిక్రేట్తో 278 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.ప్రస్తుతమున్న డూ ఆర్ డై పరిస్థితుల్లో ఇంగ్లిస్ సత్తా చాటితే లక్నోకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. లక్నో మే 4న జరిగే తమ తదుపరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ఇంగ్లిస్ అందుబాటులో ఉంటాడు.బ్రీట్జ్కే నిష్క్రమణఓ పక్క ఇంగ్లిస్ జట్టుకు అందుబాటులో రాగా.. మరో లక్నో ఆటగాడు జట్టుకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. బ్రీట్జ్కే తిరిగి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది.లక్నో ఇకపై జరిగే మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, సీఎస్కే (2 సార్లు), రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ లాంటి పటిష్టమైన జట్లతో తలపడాల్సి ఉంది. ఇలాంటి దశలో ఇంగ్లిస్ లాంటి విధ్వంసకర బ్యాటర్ జట్టుకు అందుబాటులోకి రావడం లక్నోకు శుభపరిణామం. -
వైభవ్ క్లీన్ బౌల్డ్.. ఓవరాక్షన్ చేసిన ఢిల్లీ బౌలర్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరుగుతున్న 43వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. జైపూర్లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఆదిలోనే షాక్లుతొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్కు ఆదిలోనే వరుస షాక్లు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) బంతుల వ్యవధిలో ఔటయ్యారు. ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన జైస్వాల్.. మూడో బంతికి స్టార్క్ బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు.7 బంతుల తర్వాత వైభవ్ జేమీసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదిన వైభవ్.. ఆతర్వాత బంతికే జేమీసన్ వేసిన అద్భుతమైన యార్కర్కు దొరికాడు. ఈ సీజన్లో అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న వైభవ్ను ఔట్ చేసిన ఆనందంలో జేమీసన్ ఓవరాక్షన్ చేశాడు.An in-swinging yorker 😲🔥🎥 Kyle Jamieson gets Vaibhav Sooryavanshi early 👊Wait for the celebration 👀Updates ▶️ https://t.co/6OOjzHtZiD#TATAIPL | #KhelBindaas | #RRvDC | @DelhiCapitals pic.twitter.com/6vxJ5ahlb3— IndianPremierLeague (@IPL) May 1, 2026ముఖానికి దగ్గరగా వెళ్లి ఆరుస్తూ, చప్పట్లు కొట్టాడు. జేమీసన్ చర్యను చాలా మంది తప్పుబడుతున్నారు. 15 ఏళ్ల పిల్లాడి పట్ల ఈ ప్రవర్తన సరికాదని అంటున్నారు.బీసీసీఐ చర్య తీసుకుంటుందా..?ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ప్రత్యర్థిని రెచ్చగొట్టేలా లేదా బెదిరించేలా ప్రవర్తిస్తే మ్యాచ్ రిఫరీ చర్య తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇది సాధారణ ఆగ్రహావేశ సెలబ్రేషన్గా పరిగణిస్తారా, లేక కోడ్ ఉల్లంఘనగా భావిస్తారా అన్నది మ్యాచ్ అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాయల్స్ 10.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును తాకింది. జైస్వాల్, సూర్యవంశీ ఔట్ కాగా.. జురెల్ (35), కెప్టెన్ రియాన్ పరాగ్ (54) క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ -
రాజస్థాన్పై ఢిల్లీ గెలుపు
రాజస్థాన్పై ఢిల్లీ గెలుపు226 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ తొలి బంతి నుంచే గెలుపుపై కసితో ఆడింది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (62), కేఎల్ రాహుల్ (75) అద్భుతమైన అర్ద సెంచరీలతో జట్టు గెలుపుకు గట్టి పునాది వేశారు. అనంతరం నితీశ్ రాణా (33), ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్), అశుతోష్ శర్మ (26 నాటౌట్) తమవంతు పాత్రలు పోషించి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. 19.1 ఓవర్లలో ఢిల్లీ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. నిస్సంక హాఫ్ సెంచరీ6 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 70-0గా ఉంది. నిస్సంక (50), కేఎల్ రాహుల్ (19) క్రీజ్లో ఉన్నారు. రాజస్థాన్ భారీ స్కోర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ తమ నిర్ణయానికి న్యాయం చేస్తూ భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రియాన్ పరాగ్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. రియాన్కు కాసేపు జురెల్ (42) సహకరించారు. ఆఖర్లో డొనొవన్ ఫెరియెరా గత మ్యాచ్ తరహాలో చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 2 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4), షుభమ్ దూబే (6) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (20) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో రాణించగా.. జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలో వికెట్ తీశారు. రియాన్ పరాగ్ (90) ఔట్16.4వ ఓవర్- సెంచరీకి చేరువైన తరుణంలో భారీ షాట్ ఆడబోయి రియాన్ పరాగ్ (90) ఔటయ్యాడు. స్టార్క్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 17 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 173-5గా ఉంది.జురెల్ (42) ఔట్11.4వ ఓవర్- 114 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి జురెల్ (42) ఔటయ్యాడు.సూర్యవంశీ (4) ఔట్1.5వ ఓవర్- జేమీసన్ బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో బంతికే వికెట్ కోల్పోయిన రాజస్థాన్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ మూడో బంతికే వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతితో యశస్వి జైస్వాల్ను (6) క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే జైస్వాల్ సిక్సర్ బాదాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరుగుతున్న 43వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. జైపూర్లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు..ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ -
ఎస్ఆర్హెచ్లోకి ప్రపంచకప్ హీరో
ఐపీఎల్ 2026 నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇవాళ (మే 1) ఓ కీలక ప్రకటన చేసింది. గాయపడిన ఆల్రౌండర్ శివమ్ మావి స్థానాన్ని అండర్-19 ప్రపంచకప్ 2026 హీరో, యువ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆర్ఎస్ అంబ్రిష్తో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. 18 ఏళ్ల అంబ్రిష్ ఈ ఏడాది భారత్ అండర్-19 ప్రపంచకప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో 11 వికెట్లు తీసి భారత తరఫున సంయుక్తంగా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. కుడిచేతి మీడియం పేసర్ అయిన అంబ్రిష్, ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తాడు. లోయర్ ఆర్డర్లో అతను ఉపయోగకర బ్యాటర్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ ఆల్రౌండ్ నైపుణ్యం ఎస్ఆర్హెచ్కు అదనపు బలంగా మారనుంది. ఇప్పటికే ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి దేశీయ యువ పేసర్లతో కలకలలాడుతున్న ఎస్ఆర్హెచ్కు అంబ్రిష్ మరో అస్త్రంగా మారే అవకాశం ఉంది.మావి విషయానికొస్తే.. ఈ సీజన్ వేలంలో ఇతన్ని ఎస్ఆర్హెచ్ రూ.75 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. అయితే అతను గజ్జలో గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతనికి ప్రత్యామ్నాయంగా ఎస్ఆర్హెచ్ అంబ్రిష్ను ఎంపిక చేసుకుంది (రూ. 30 లక్షలకు).ఇదిలా ఉంటే, సీజన్ ఆరంభంలో కాస్త అటుఇటుగా ఆడిన సన్రైజర్స్ కీలక దశ వచ్చే సరికి విజయాల బాట పట్టి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి, రన్రేట్ (0.832) కూడా మెరుగ్గానే కలిగి ఉంది. తాజాగా ముంబైపై 244 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఎస్ఆర్హెచ్.. మే 3న జరిగే తమ తదుపరి మ్యాచ్లో కేకేఆర్తో తలపడనుంది. -
వైభవ్ సూర్యవంశీ బలహీనత అదే: విండీస్ దిగ్గజం
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. యశస్వి జైస్వాల్తో కలిసి రాజస్తాన్కు శుభారంభాలు అందిస్తున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికి తొమ్మిది ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 400 పరుగులు సాధించాడు.ఫాస్టెస్ట్ సెంచరీలుతద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-3లో కొనసాగుతున్నాడు. కాగా గతేడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. ఈసారి సన్రైజర్స్ హైదరాబాద్పై 36 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఇక ప్రత్యర్థి బౌలర్ ఎవరన్న అంశంతో పనిలేకుండా బంతిని బాదడమే తన పని అంటున్న వైభవ్.. వరల్డ్క్లాస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా చుక్కలు చూపించాడు.బుమ్రాను వదల్లేదుముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా బుమ్రాకు సిక్సర్తో స్వాగతం పలికిన 15 ఏళ్ల వైభవ్.. అతడి బౌలింగ్లోనే మరో సిక్స్ కూడా పిండుకున్నాడు. దీంతో మహామహ బౌలర్లు సైతం వైభవ్ విధ్వంసానికి అడ్డుకట్ట వేడయం ఎలా? అంటూ తలలు పట్టుకుంటున్నారు.వైభవ్ సూర్యవంశీ బలహీనత అదే.. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరును ఉద్దేశించి వెస్టిండీస్ దిగ్గజం, క్రిక్ఇన్ఫో కామెంటేటర్ ఇయాన్ బిషప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ బ్యాటింగ్ బలహీనత ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘టెక్నికల్గా చెప్పాలంటే... అతడి బ్యాట్ స్వింగ్ అయ్యే విధానం యూనిక్గా ఉంటుంది. బేస్బాల్ మాదిరి స్వింగ్ అని చెప్పవచ్చు.We’ve seen this shot before 🚁 😉 Vaibhav Sooryavanshi gives Rajasthan Royals the perfect start in this chase. 💪#TATAIPL 2026 ➡️ #PBKSvRR | LIVE NOW 👉https://t.co/saW6caCqT8 pic.twitter.com/A5EgtrJ0Sp— Star Sports (@StarSportsIndia) April 28, 2026బ్యాటింగ్లో అతడి బలహీనత ఏమిటో కచ్చితంగా ఇదీ అని చెప్పడం కష్టం. అయితే, బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ (సాధారణంగా బ్యాటర్కు 7-8 మీటర్ల దూరంలో బాల్ను సంధిస్తే.. బంతి ఎక్కువగా బౌన్స్ అయి బ్యాటర్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది)తో అతడిని బోల్తా కొట్టించవచ్చు.పొరపాటున మిస్సయిందో!అయితే, బంతి త్వరగా టాప్ ఎడ్జ్కు గనుక రాకపోతే.. అతడు ఆ బాల్ను సిక్సర్గా మలచడం ఖాయం. అందుకే వైభవ్ బ్యాటింగ్ బలహీనత ఏమిటో కచ్చితంగా చెప్పలేమని ముందే చెప్పాను’’ అని ఇయాన్ బిషప్ పేర్కొన్నాడు. కాగా కేవలం టీ20లలోనే కాకుండా వైభవ్ భారత్ అండర్-19 జట్టు తరఫున ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో అలరిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ ఇటీవల వరల్డ్కప్ గెలవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. చదవండి: శ్రేయస్, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్గా ఊహించని పేరు! -
స్వదేశానికి వెళ్లిన సన్రైజర్స్ విదేశీ ప్లేయర్లు
ఐపీఎల్ 2026 మధ్యలో సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన ముగ్గురు శ్రీలంక ప్లేయర్లు (దిల్షన్ మధుషంక, ఎషాన్ మలింగ, కమిందు మెండిస్) అర్దాంతరంగా స్వదేశానికి వెళ్లారు. ఏప్రిల్ 29న ముంబై ఇండియన్స్పై ఘన విజయం తర్వాత ఇది జరిగింది. లంక క్రికెట్ బోర్డు మధుషంక, మలింగ, కమిందును అత్యవసరంగా స్వదేశానికి రావాలని సందేశం పంపింది.NEWS 🚨Sri Lankan cricketers Dilshan Madushanka, Eshan Malinga, and Kamindu Mendis, who are representing SRH in the IPL, arrived in Sri Lanka early this morning.#sportspavilionlk #ipl2026 #MIvsSRH #EshanMalinga #fypシ゚viralシfypシ゚viralシalシ pic.twitter.com/dMwWZJ74S8— DANUSHKA ARAVINDA (@DanuskaAravinda) April 30, 2026శ్రీలంక జట్టు త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆ పర్యటనకు సంబంధించిన వీసా బయోమెట్రిక్స్ పూర్తి చేసుకోవడానికి పై ముగ్గురు స్వదేశానికి వెళ్లారు. ఈ త్రయం విండీస్లో పర్యటించబోయే లంక జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.వీసా ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం, మధుషంక, మలింగ, కమిందు తిరిగి ఇవాళ ( మే 1) ఉదయం భారత్కు వచ్చి ఎస్ఆర్హెచ్ శిబిరంలో చేరారు. దీంతో మే 3న కేకేఆర్తో జరిగే కీలక మ్యాచ్కు వీరు అందుబాటులో ఉండనున్నారు. ఈ విషయం తెలియక సోషల్మీడియాలో రకరకాల పుకార్లు వినిపించాయి.ఈ ముగ్గురు ఎస్ఆర్హెచ్ యాజమాన్యంతో గొడవపడి స్వదేశానికి వెళ్లిపోయారని కొందరు.. గాయాల కారణంగా జట్టును వీడారని ఇంకొందరు ప్రచారం చేశారు. చివరికి లంక బోర్డు చెందిన కీలక అధికారి ఒకరు వివరణ ఇవ్వడంతో ఈ ఫేక్ ప్రచారానికి పుల్స్టాప్ పడింది.దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే, ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న వ్యక్తి (ఎషాన్ మలింగ) పై ముగ్గురిలో ఉన్నారు. మంచి లయలో ఉన్న ఎస్ఆర్హెచ్కు మలింగ లాంటి బౌలర్ ఒక్క మ్యాచ్కు దూరమైనా తీవ్ర పరిణామాలు ఉంటాయి.మలింగ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. మదుషంక ఒక మ్యాచ్లో ఆడి వికెట్ సాధించగా, కమిందు మెండిస్కు ఇంకా తుది జట్టులో అవకాశం రాలేదు.కాగా, సీజన్ ఆరంభంలో కాస్త అటుఇటుగా ఆడిన సన్రైజర్స్ కీలక దశ వచ్చే సరికి విజయాల బాట పట్టి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. పంజాబ్, ఆర్సీబీ టాప్-2లో ఉన్నాయి. -
Kohli vs Gill: ఏడిపించిన కోహ్లి.. ఇచ్చిపడేసిన గిల్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. గత వారం ఎదురైన పరాభవానికి సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం గుజరాత్- ఆర్సీబీ తలపడ్డాయి.కోహ్లి, గిల్ స్కోర్లు ఎంతంటే?ఇందులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులుకు ఆలౌటైంది. దేవ్దత్ పడిక్కల్ (24 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా, విరాట్ కోహ్లి (13 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.అనంతరం గుజరాత్ 15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. శుబ్మన్ గిల్ (18 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్లు), జోస్ బట్లర్ (19 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. 12 పరుగులు చేయడంతోపాటు, 2 వికెట్లు పడగొట్టి, 3 క్యాచ్లు పట్టిన జేసన్ హోల్డర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ దిగ్గజం, కింగ్ కోహ్లి- గుజరాత్ కెప్టెన్, ప్రిన్స్ గిల్ మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ సమయంలో గిల్ పట్ల పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఆ తర్వాత మాత్రం అతడిని టీజ్ చేశాడు. ఇందుకు గిల్ కూడా గట్టిగానే బదులిచ్చాడు.Vintage #ViratKohli energy! 🔥KING catches, PRINCE departs - Absolute cinema! 🙌 🎯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/jCKi1Qo4zA— Star Sports (@StarSportsIndia) April 30, 2026ఏడిపించిన కోహ్లి.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో గిల్ ఇచ్చిన క్యాచ్ పట్టిన కోహ్లి.. అతడు పెవిలియన్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసమయంలో కోహ్లి వైల్డ్గా సెలబ్రేట్ చేసుకోగా.. గిల్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్ డగౌట్లో కూర్చోగా.. ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి.. అతడిని అవుట్ చేసిన విధానాన్ని సైగలతో చూపిస్తూ టీజ్ చేశాడు.Virat Kohli: "Ye le thullu, kaise catch out kiya 😭"Shubman Gill: "Scoreboard dekh lo, kya hi farak padta hai? Hum jeet rahe hain!"Kohli: "Run-out hote-hote bacha tu, kaise bhaag raha tha!"Gill: "Chhodo jaane do, Virat bhai hai ❤️" pic.twitter.com/KCWwV0xDWk— GillTheWill (@GillTheWill77) May 1, 2026ఇచ్చిపడేసిన గిల్!ఇందుకు గిల్.. ‘స్కోరు బోర్డు చూడు భయ్యా.. నేను అవుటైతే ఏంటి? గెలిచేది మేమే’ అన్నట్లుగా తానూ సైగలతోనే కౌంటర్ వేశాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత.. ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గిల్- కోహ్లి ఆలింగనం చేసుకుని నవ్వులు చిందించారు.అయితే, ఆ తర్వాత కూడా గిల్ కోహ్లి, ఆర్సీబీని వదిలిపెట్టలేదు. కోహ్లి, తానూ ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘జేసన్ హోల్డర్.. ప్లే హోల్డ్ బోల్డ్.. ఈరోజు రాత్రి అత్యద్భుతమైన ప్రదర్శన’ అంటూ ఆర్సీబీ, కోహ్లిని టార్గెట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను హోల్డర్ పట్టాడు.అయితే, ఇది క్లీన్ క్యాచ్ కాదని కోహ్లి వాదించగా.. థర్డ్ అంపైర్ మాత్రం అవుట్గా ప్రకటించాడు. దీంతో వివాదం చెలరేగింది. అయితే, ఫలితం మాత్రం గుజరాత్కు మేలు చేసింది. మరోవైపు.. ఆర్సీబీ ప్లే బోల్డ్ అన్న నినాదంతో ముందుకు సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటినీ ప్రస్తావిస్తూ గిల్ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు.చదవండి: కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్ మాస్ వార్నింగ్! The award for the best senior and junior duo goes to… 😁#TATAIPL #GTvRCB #ShubmanGill #ViratKohli pic.twitter.com/4lccF2wv9u— Star Sports (@StarSportsIndia) April 30, 2026 -
భారత టీ20 జట్టులోకి అతడిని తిరిగి తీసుకోండి: సెహ్వాగ్
భువనేశ్వర్ కుమార్... ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకడిగా వెలుగొందాడు ఈ పేసర్. చివరగా 2022లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. తిరిగి పునరాగమనం చేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్నాడు. దేశీ, లీగ్ క్రికెట్లో మరోసారి తనను తాను నిరూపించుకుంటున్నాడు.చోటే లేదు!అయినప్పటికీ సెలక్టర్లు మాత్రం భువీని కనికరించడం లేదు. ఇప్పటికే పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నాయకుడిగా పాతుకుపోగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్ తదితరులు కూడా కీలక సభ్యులుగా కొనసాగతున్నారు. దీంతో భువీకి టీమిండియా తలుపులు దాదాపుగా మొత్తానికే మూసుకుపోయాయి.అయితే, భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ మాత్రం భువనేశ్వర్ కుమార్కు మరొక్క అవకాశం ఇవ్వాలని అంటున్నాడు. కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీని చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన భువీ.. తాజా ఎడిషన్లోనూ రాణిస్తున్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్తో గురువారం నాటి మ్యాచ్లోనూ ఈ రైటార్మ్ పేసర్ అదరగొట్టాడు.అత్యధిక వికెట్ల వీరుడిగానాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన భువీ.. 28 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. మొత్తంగా 2026 సీజన్లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్లలో కలిపి 17 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్ల వీరుడిగా ప్రస్తుతానికి పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ భువీపై ప్రశంసలు కురిపించాడు.తిరిగి టీ20 జట్టులోకి తీసుకోండిక్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీస్తున్నాడు. గుజరాత్తో మ్యాచ్లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.అతడి వయసు 35 లేదంటే 36 ఏళ్లు ఉండొచ్చు. అయితే, ఇదే విధంగా అద్భుతంగా బౌలింగ్ కొనసాగిస్తే.. టీ20 క్రికెట్లో అతడి పునరాగమనం గురించి టీమిండియా సెలక్టర్లు తప్పక ఆలోచించాలి. బుమ్రా- భువీ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. వింటేజ్ భువీ జట్టుకు తప్పక ఉపయోగపడతాడు’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.You miss, I hit! 🎯#BhuvneshwarKumar has dismissed #JosButtler for the 9th time in 20 T20 innings! 🤯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/QnL7Vybkp7— Star Sports (@StarSportsIndia) April 30, 2026చదవండి: IPL 2026: పాటిదార్ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
-
కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్ మాస్ వార్నింగ్!
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాల్లో హెన్రిచ్ క్లాసెన్ది కీలక పాత్ర. దాదాపుగా ప్రతీ మ్యాచ్లోనూ నిలకడగా రాణిస్తూ.. కష్టాల్లో ఉన్న వేళ జట్టును ఆదుకుంటున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. ఫ్రాంఛైజీ తనకోసం వెచ్చించిన రూ. 23 కోట్లకు తన ఆటతో న్యాయం చేస్తున్నాడు.414 పరుగులుఇప్పటికి ఈ సీజన్లో ఆడిన తొమ్మిది మ్యాచ్లలో కలిపి క్లాసెన్ 414 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చివరగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగిన క్లాసెన్.. 30 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.తదుపరి కోల్కతా నైట్ రైడర్స్తో ఆదివారం నాటి పోరు కోసం క్లాసెన్ సన్నద్ధవుతున్నాడు. ఇదిలా ఉంటే.. క్లాసెన్ పేరిట ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఉన్న దృశ్యాల ప్రకారం.. క్లాసెన్ తన కుటుంబంతో కలిసి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించాడు.నేను చెప్పేది జాగ్రత్తగా వినుఇందుకు క్లాసెన్ తనదైన శైలిలో గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ‘‘ఫొటోలు, వీడియోలు తీయొద్దు సరేనా!.. నేను చెప్పేది జాగ్రత్తగా విను.. రికార్డు చేయొద్దు ఒకేనా!’’ అని క్లాసెన్ హెచ్చరించాడు. ఇందుకు సదరు వ్యక్తి.. ‘‘నీ జట్టును వదిలెయ్.. నువ్వు బాగా ఆడుతున్నావు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులుగా.. ‘‘థాంక్యూ.. కానీ ఫొటో మాత్రం తీయొద్దు.POV: meeting a foreign cricketer in India…. Dude just give him and his family some privacy for gods sake.What a man Klaasy 🙏 cinema lo hero villain ki warning ela isthado ala ichadu 😂🔥 good man 🧡#SRH #IPL2026 pic.twitter.com/imwBT2c8wi— Varun Velamakanti 🦅 (@CricVarunSRH) April 30, 2026ఒకవేళ నేను అటు తిరగగానే నన్ను, నా కుటుంబాన్ని ఫొటో తీశావనుకో.. ఒట్టేసి చెబుతున్నా.. నువ్వు ఊహించని విధంగా బుద్ధి చెప్తా! దానిని నుంచి నువ్వు కోలుకోలేవు కూడా!.. నేను వెళ్తున్నా.. మళ్లీ చెప్తున్నా.. నీ కెమెరాలన్నీ పక్కనపెట్టు.. దయచేసి మమ్మల్ని ఫొటోలు తీయొద్దు’’ అని సున్నితంగానే కొట్టినంత పనిచేశాడు క్లాసెన్.అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!ఈ వీడియోపై ఆరెంజ్ ఆర్మీ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘క్లాసీ క్లాసెన్... ‘చెప్పినట్లు వినకుంటే.. అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!’ అని మాస్ స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు తోపు అన్నా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులేనని.. వారి గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని సదరు వ్యక్తికి చురకలు అంటిస్తున్నారు. కాగా సన్రైజర్స్ ఈ సీజన్లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్లు పూర్తి చేసుకుని ఆరు గెలిచింది. చదవండి: IPL 2026: పాటిదార్ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
కోహ్లి విధ్వంసం చేసినా కోలుకున్నాం.. ఆ క్రెడిట్ మొత్తం వారికే: గిల్
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టైటాన్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. మొదట ఆర్సీబీని 155 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్.. అనంతరం బ్యాటింగ్లోనూ సత్తాచాటింది.15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందిచాడు. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన తమ బౌలర్లను గిల్ కొనియాడాడు."కీలక మ్యాచ్లో విజయం సాధించింనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇలాంటి వికెట్పై ప్రత్యర్ధి జట్టును 160 పరుగులలోపు కట్డడి చేయడం అంత సులువు కాదు. కానీ మా బౌలర్లు మాత్రం ఆసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఫీల్డింగ్లో కూడా మెరుగ్గా రాణించాము. గత మ్యాచ్తో పోలిస్తే ఈ రోజు అన్ని విభాగాల్లో మేము పై చేయి సాధించాము. ప్రతీ ఒక్కరూ జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రెండో ఓవర్లో విరాట్ భాయ్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. కానీ ఆ తర్వాత మేము పుంజుకున్న తీరు చాలా బాగుంది. అతడి వికెట్తో తిరిగి మేము గేమ్లోకి వచ్చాము. నేనేమి ఈ మ్యాచ్లో ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగలేదు. నేను ఒక రిథమ్లో ఉన్నాను అన్పించింది. మొదటి బంతికి కాస్త అదృష్టం తోడైంది, రెండో బంతి నాకు కావాల్సిన స్లాట్లో పడింది. దీంతో ఈ రోజునే నాదే అనుకున్నాను.అందుకే బౌలర్లపై ఎదురుదాడికి దిగాను. ఇక తెవాటియా మా జట్టులో కీలక సభ్యుడు. ఈ రోజు అతడు మ్యాచ్ ఫినిష్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జోస్ భాయ్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకున్నా. కానీ ఆ తర్వాత వరుసగా మూడు వికెట్లు కోల్పోయాము. ఆ బాధ్యతను తెవాటియా తీసుకుని మ్యాచ్ను ముగించాడు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గిల్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో గిల్ 43 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: పాటిదార్ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
అంపైర్ది ముమ్మాటికీ తప్పే! అతడు అవుట్ కానేకాదు!
గుజరాత్ టైటాన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్-2026లో భాగంగా గత శనివారం బెంగళూరు వేదికపై 205 పరుగులు చేసి కూడా గుజరాత్ టైటాన్స్ ఓటమిని ఎదుర్కొంది. తాజాగా గురువారం నాటి మ్యాచ్లో సొంతగడ్డపై ‘రిటర్న్’ మ్యాచ్తో ఆర్సీబీని ఓడించింది. నాలుగు వికెట్ల తేడాతో పాటీదార్ సేనపై గెలుపొందింది.రీప్లేలో స్పష్టంగా కనిపించిందిఅయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా చోటుచేసుకున్న అనూహ్య ఘటన వివాదానికి దారితీసింది. అర్షద్ బౌలింగ్లో ఆర్సీబీ సారథి రజత్ పాటీదార్ (19) పుల్ షాట్ కొట్టగా... డీప్ స్క్వేర్లెగ్ నుంచి పరుగెత్తుతూ వచ్చిన జేసన్ హోల్డర్ (Jason Holder) ముందుకు దూకుతూ క్యాచ్ అందుకున్నాడు.అయితే హోల్డర్ క్యాచ్ పట్టిన తర్వాత బంతి నేలకు తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. తన ఎడమ చేతిలో బంతిని ఉంచుకున్న హోల్డర్ తనను తాను నియంత్రించుకునే క్రమంలో బంతిపైనే పూర్తిగా భారం వేసి మరీ పైకి లేచాడు.It’s heating up in Ahmedabad! 🔥#JasonHolder caught #RajatPatidar at the boundary, but the #RCB camp wasn’t convinced with the decision! 👀#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/GwfAoIelDj— Star Sports (@StarSportsIndia) April 30, 2026రిజర్వ్ అంపైర్తో కోహ్లి వాగ్వాదంఅయినప్పటికీ.. థర్డ్ అంపైర్ అభిజిత్ భట్టాచార్య మాత్రం బంతిని హోల్డర్ సరిగానే పట్టుకున్నాడని, బంతిని పూర్తి నియంత్రణలో ఉంచుకున్నాడని భావిస్తూ అవుట్గా ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి, కోచ్ ఆండీ ఫ్లవర్ రిజర్వ్ అంపైర్ పరాశర్ జోషితో గట్టిగా వాదించినా ఫలితం లేకుండా పోయింది.ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. పాటీదార్ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని అతడు తప్పుబట్టాడు. ‘‘నా దృష్టిలో హోల్డర్ పట్టింది అసలు క్యాచ్ కానేకాదు. క్రికెట్ చట్టంలోని 33.3 నియమం ప్రకారం..అంపైర్ది ముమ్మాటికీ తప్పే!బంతి ఒక్కసారి చేతిలోకి వచ్చినపుడు బాల్తో పాటు శరీరంపై కూడా ఆటగాడు పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. అప్పటి వరకు బంతి నేలను అస్సలు తాకకూడదు. ఆ సమయంలో ఆటగాడి చేయి నేలకు తాకినా సరే.. బంతి మాత్రం అస్సలు నేలకు తాకకూడదు.జేసన్ హోల్డర్ క్యాచ్ పట్టిన వెంటనే జారిపడ్డాడు. స్లైడ్ అవుతున్న సమయంలో అతడి శరీరం చలనంలో ఉంది కాబట్టి అతడు తనను తాను పూర్తిగా నియంత్రించుకోలేకోయాడు. అప్పుడే బంతి నేలకు తాకింది. అప్పటికి అది ఇంకా డెడ్బాల్ కానేలేదు.కాబట్టి ఆ క్యాచ్ పూర్తికానట్లే లెక్క. నా అభిప్రాయం ప్రకారం అంపైర్ తప్పుచేశాడు. బ్యాటర్(పాటీదార్)ను నాటౌట్గా ప్రకటించాల్సింది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. రూల్ ఇదేకాగా మేరీల్బోన్ క్రికెట్ క్లబ్ నియమం 33.2.2.1 ప్రకారం.. ఫీల్డర్ బంతిని అందుకున్నప్పుడు, అతడి చేతి వేళ్ల మధ్య నుంచి బాల్ నేలకు తాకినట్లయితే దాన్ని అవుట్గానే పరిగణిస్తారు. ఈ నియమాన్ని అనుసరించే థర్డ్ అంపైర్ పాటీదార్ను అవుట్గా ప్రకటించినట్లు తెలుస్తోంది.చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్ -
గుజరాత్ చేతిలో RCB ఘోర ఓటమి
-
భువనేశ్వర్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్గా రికార్డు
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఈ లీగ్లో భాగంగా గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి.. భువనేశ్వర్ మాత్రం మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భువీ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఎస్ఆర్హెచ్ పేసర్ ఇషన్ మలింగ(15 వికెట్లు)ను వెనక్కి నెట్టి భువీ(17 వికెట్లు) ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్లో మరో అరుదైన ఘనతను భువనేశ్వర్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత గడ్డపై 200 ఐపీఎల్ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్గా అతడు చరిత్ర సృష్టించాడు. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను ఔట్ చేయడంతో ఈ ఫీట్ను భువనేశ్వర్ సాధించాడు. భువీ తర్వాత స్ధానంలో చాహల్ (186 వికెట్లు) ఉన్నాడు. కాగా పలు ఐపీఎల్ సీజన్లు దక్షిణాఫ్రికా, యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో చాహల్(228) అగ్రస్ధానంలో ఉండగా.. భువనేశ్వర్ కుమార్(215) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు పుణే వారియర్స్ ఇండియా, సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ వంటి మూడు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. సన్రైజర్స్ తరపున వరుసగా రెండుసార్లు (2016, 2017) పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక బౌలర్గా భువీ నిలిచాడు.చదవండి: IPL 2026: పాటిదార్ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి.. కోహ్లి మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 28 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు.ముఖ్యంగా గుజరాత్ పేసర్ కగిసో రబాడకు కింగ్ కోహ్లి చుక్కలు చూపించాడు. రబాడ వేసిన రెండో ఓవర్లో కోహ్లి వరుసగా 5 సిక్స్లు బాది స్టేడియంను హోరెత్తించాడు. ఈ మ్యాచ్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి రెండు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి సాధించిన రికార్డులు ఇవే👉భారత గడ్డపై ఐపీఎల్లో 8,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ప్లేయర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలు రాయిని విరాట్ అందుకున్నాడు. కాగా పలు ఐపీఎల్ సీజన్లు దక్షిణాఫ్రికా, యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. విదేశీ గడ్డపై జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో మొత్తంగా అతడు 1000కు పైగా పరుగులు చేశాడు. ఓవరాల్గా కోహ్లి పేరిట 9230 ఐపీఎల్ రన్స్ ఉన్నాయి. కాగా కోహ్లి దారిదాపుల్లో ఎవరూ లేరు.భారత్లో అత్యధిక ఐపీఎల్ పరుగులు చేసిన ప్లేయర్లు వీరేవిరాట్ కోహ్లీ - 8,016రోహిత్ శర్మ - 6,274శిఖర్ ధావన్ - 5,819డేవిడ్ వార్నర్ - 5,689👉ఒకే ఓవర్లో 5 ఫోర్లు కొట్టిన మూడో ఆర్సీబీ బ్యాటర్గా క్రిస్ గేల్, షేన్ వాట్సన్ సరసన కోహ్లి నిలిచాడు. క్రిస్ గేల్, షేన్ వాట్సన్ గతంలో పుణే వారియర్స్ పై ఈ ఫీట్ సాధించారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో ఛేదించింది.కెప్టెన్ శుభ్మన్ గిల్(43) టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి(28), దేవ్దత్త్ పడిక్కల్(40) మినహా మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు.చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్ -
పాటిదార్ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?
ఐపీఎల్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో ఓటమిని చూవిచూసింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ఔటైన తీరు వివాదస్పదమైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన అర్షద్ ఖాన్ బౌలింగ్లో పాటిదార్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు గాల్లోకి లేచింది. ఈ సమయంలో డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ నుండి పరుగెత్తుకుంటూ వచ్చిన జేసన్ హోల్డర్ ఒక అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.అయితే అదే క్యాచ్ను అందుకునేందుకు రబాడ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయినప్పటికి హోల్డర్.. తనను రబాడ ఢీకొనే ప్రమాదం ఉన్నా లెక్కచేయకుండా డైవ్ చేసి తన ఎడమ చేత్తో బంతిని ఒడిసిపట్టాడు. దీంతో గుజరాత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. అయితే ఫీల్డ్ అంపైర్లు అది క్లీన్ క్యాచ్ అవునా? కాదా? థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. అయితే హోల్డర్ డైవ్ చేసే క్రమంలో బంతి నేలకు తగిలినట్లు రిప్లేలో కనిపించింది. దీంతో పాటిదార్ తనది నాటౌట్ అని బౌండరీ లైన్ వద్ద అగిపోయాడు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం అది క్లీన్ క్యాచ్ అంటూ ఔట్గా ప్రకటించాడు. ఇది చూసిన పాటిదార్ షాక్కు గురయ్యాడు. డగౌట్లో ఉన్న విరాట్ కోహ్లి, కోచ్ ఆండీ ఫ్లవర్ ఫోర్త్ అంపైర్తో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఆఖరికి 19 పరుగులు చేసిన పాటిదార్ నిరాశతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే బంతి నేలకు తగిలినట్లు కన్పించిన థర్డ్ అంపైర్ ఔట్ ఇలా ఇచ్చాడని ఆర్సీబీ ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓసారి పరిశీలిద్దాం.రూల్స్ ఏమి చెబుతున్నాయంటే?మేరీల్బోన్ క్రికెట్ క్లబ్ నియమం 33.2.2.1 ప్రకారం.. ఫీల్డర్ బంతిని అందుకున్నప్పుడు, అతడి చేతి వేళ్ల మధ్య నుంచి బంతికి నేలకు తాకినట్లయితే దాన్ని ఔట్గానే పరిగణిస్తారు. ఇప్పుడు పాటిదార్ విషయంలో కూడా అదే జరిగింది. బంతి హోల్డర్ వేళ్ల మధ్య ఉండగానే నేలను తాకిందని భావించిన థర్డ్ అంపైర్ అభిజిత్ భట్టాచార్య తన నిర్ణయాన్ని ఔట్గా ప్రకటించాడు.చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్THE CONTROVERSIAL CATCH - What are your thoughts on the decision? 👀 pic.twitter.com/rbrdEQtkRr— Johns. (@CricCrazyJohns) April 30, 2026 -
అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరుకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్లు వేసింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లి(28), దేవ్దత్త్ పడిక్కల్(40) మినహా మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. అనంతరం గుజరాత్ టైటాన్స్ ఈ లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(43) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని పాటిదార్ తెలిపాడు."ఈ పిచ్పై మేము సాధించిన స్కోర్ మాత్రం సరిపోదు. అయినప్పటికి మా బౌలర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. మ్యాచ్ను 16 ఓవర్లకు తీసుకొచ్చారు. ఇది మాకు ఒక సానుకూల ఆంశం. పిచ్పై ఉన్న పచ్చిక ఫాస్ట్ బౌలర్లకు బాగా సహకరించింది. అయితే శుభ్మన్ గిల్ పవర్ప్లేలో దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచాడు. కానీ అంత ఒత్తిడిలోనూ మా బౌలర్లు తిరిగి పుంజుకున్న తీరు నిజంగా అద్భుతం. గిల్ను ఆరంభంలోనే ఔట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఇక ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం.ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బ తీసింది. ఇక భువనేశ్వర్ కుమార్ గురుంచి మనందరికీ తెలిసిందే. అతడు టీ20 ఫార్మాట్లో ఎంతో అనుభవం ఉన్న బౌలర్. ఈ మ్యాచ్లో కూడా తన మార్క్ చూపించాడు.ఇక ఈ టోర్నీలో మాకు ఇంకా ఐదు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి మేము పాయింట్ల పట్టిక గురుంచి ఆలోచించడం లేదు. మా తదుపరి మ్యాచ్లో అత్యత్తుమ క్రికెట్ ఆడటమే మా లక్ష్యమని" పాటిదార్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లో మే7న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది.చదవండి: శ్రేయస్, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్గా ఊహించని పేరు! -
ఆర్సీబీకి షాకిచ్చిన గుజరాత్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీకి షాకిచ్చింది (4 వికెట్ల తేడాతో గెలుపు). అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన గుజరాత్ ఆర్సీబీని 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు.హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్లతో ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టారు. బౌలింగ్లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టి ఆర్సీబీని కుప్పకూల్చారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్వుడ్ డకౌటయ్యారు.అనంతరం 156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ తడబడుతూనే బ్యాటింగ్ చేసినప్పటికీ.. 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్ కుమార్ (4-0-28-3), రొమారియో షెపర్డ్ (4-0-30-2) ఇబ్బంది పెట్టినా.. శుభ్మన్ గిల్ (43), జోస్ బట్లర్ (39), రాహుల్ తెవాతియా (27 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడి గుజరాత్ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో సాయి సుదర్శన్ 6, వాషింగ్టన్ సుందర్ 12, షారుక్ ఖాన్ 8, జేసన్ హోల్డర్ 12, రషీద్ ఖాన్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ, షెపర్డ్తో పాటు సుయాశ్ శర్మ (3.5-0-44-1) వికెట్ తీశాడు. గత మ్యాచ్లో చెలరేగి బౌలింగ్ చేసిన హాజిల్వుడ్ (4-0-56-0) ఈ మ్యాచ్లో వికెట్ తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. -
అంపైర్పై ఫైర్ అయిన కోహ్లి
ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 30) జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యాడు. గుజరాత్ ఆటగాడు జేసన్ హోల్డర్ పట్టిన ఓ క్యాచ్ (రజత్ పాటిదార్ది) అనుమానాస్పదంగా ఉన్నా, థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించాడు. Virat Kohli is unhappy with the decision by the third umpire on the catch of Rajat Patidar ❌Out or not-out - What are your thoughts? 👀 #RCBvsGT pic.twitter.com/3ItI5ZngJP— Hassi (@hass_1707) April 30, 2026ఈ క్రమంలో మైదానంలోనే అంపైర్తో కోపంగా చర్చించాడు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో విరాట్పై చర్యలేమైనా ఉంటాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. అయితే, ప్రతి వాదనకూ నిషేధం విధించరు. తీవ్రతను బట్టి శిక్ష నిర్ణయిస్తారు.సాధారణంగా ఇలాంటి ఘటనలకు మ్యాచ్ ఫీజులో 25 నుంచి 50 శాతం వరకు జరిమానా, ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తారు. నిషేధం అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శారీరక దురుసుతనం లేదా తీవ్రమైన అవమానకర ప్రవర్తన ఉంటేనే కఠిన చర్యలు తీసుకుంటారు.ఇందుకు ఇటీవలి నితీశ్ రాణా ఉదంతం ఓ ఉదాహరణ. ఇదే సీజన్లో రాణా అంపైర్తో వాగ్వాదానికి దిగగా, అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఇదే తరహాలో విరాట్కు కూడా శిక్ష పడే అవకాశం ఉంది.Ball clearly touched the ground, it's a clear notout. Virat Kohli wasn't happy with Umpire decision.He schooled Umpire live in front of 130k fans😭🔥pic.twitter.com/2QrEN2nDCh— ` (@wokenupkohli) April 30, 2026కాగా, హోల్టర్ క్యాచ్ నిజంగా క్లీన్గా పట్టాడా లేదా అన్న అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కోహ్లీ స్పందనను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు నియంత్రణ కోల్పోయాడని విమర్శిస్తున్నారు. వాస్తవానికి రీ ప్లేల్లో హోల్డర్ క్యాచ్ పట్టిన సమయంలో బంతి నేలపై ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ క్షుణ్ణంగా పరిశీలించకుండా ఔట్ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ గుజరాత్ బౌలర్లు, ఫీల్డర్లు చెలరేగడంతో 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్లతో ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టారు. బౌలింగ్లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్వుడ్ డకౌటయ్యారు. -
దడదడలాడించిన విరాట్ కోహ్లి
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) జరుగుతున్న 42వ మ్యాచ్లో ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఊహించిన విధంగానే గుజరాత్ బౌలర్లు తొలుత బౌలింగ్ చేస్తూ చెలరేగిపోయారు. ఫలితంగా ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మధ్యలో ఆర్సీబీకి ఒకే ఒక ఊరట కలిగించే అంశం ఉంది. అదేంటంటే.. విరాట్ కోహ్లి. ఈ మ్యాచ్లో విరాట్ 13 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.చూడటానికి ఈ గణాంకాలు సాధారణంగానే ఉన్నా, ఈ ఇన్నింగ్స్ కెరీర్ తొలినాళ్లలో విరాట్లోని దూకుడుకు అభిమానులకు మరోసారి రుచి చూపించింది. ఈ ఇన్నింగ్స్లో విరాట్ గుజరాత్ బౌలర్ కగిసో రబాడపై విరుచుకుపడిన తీరు అమోఘంగా ఉండింది.Pace meets 𝙋𝙀𝙍𝙁𝙀𝘾𝙏𝙄𝙊𝙉 🤌🎥 Virat Kohli with 5️⃣ consecutive boundaries against Kagiso Rabada 🔥Updates ▶️ https://t.co/I5Hg8ybefh#TATAIPL | #KhelBindaas | #GTvRCB | @RCBTweets pic.twitter.com/mdunPUJiV0— IndianPremierLeague (@IPL) April 30, 2026ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రబాడ బౌలింగ్లో విరాట్ విశ్వరూపం ప్రదర్శించాడు. స్టార్ బౌలర్ అన్న కనికరం కూడా లేకుండా రెచ్చిపోయాడు. వరుసగా 5 బౌండరీలు బాది చుక్కలు చూపించాడు.పుల్ షాట్తో ఆరంభించిన కోహ్లీ.. కవర్స్, పాయింట్ ప్రాంతాల్లో అద్భుతమైన షాట్లతో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ కెరీర్లో కోహ్లీ ఒకే ఓవర్లో సాధించిన నాలుగో అత్యధిక స్కోరు ఇదే.* 30 పరుగులు vs గుజరాత్ లయన్స్ (2016)* 23 పరుగులు vs ఢిల్లీ (2013)* 22 పరుగులు vs డెక్కన్ ఛార్జర్స్ (2010)* 21 పరుగులు vs గుజరాత్ టైటాన్స్ (2026)మరో అరుదైన ఘనతఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్, షేన్ వాట్సన్ తర్వాత ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు బాదిన మూడో ఆర్సీబీ బ్యాటర్గా విరాట్ రికార్డుల్లోకెక్కాడు.రబాడ ఓవర్ తర్వాత సిరాజ్ వేసిన మరుసటి ఓవర్లోనూ ఓ సిక్సర్ బాదిన విరాట్.. రబాడ వేసిన ఆ మరుసటి ఓవర్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో విరాట్ విధ్వంసకర ఇన్నింగ్స్కు తెరపడింది. వాస్తవానికి ఈ సీజన్ ప్రారంభం నుంచే విరాట్ చాలా దూకుడుగా కనిపిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లో తన సహజ శైలికి భిన్నంగా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. సాధారణంగా విరాట్ ఎక్కువగా గ్రౌండ్ షాట్లు ఆడుతూ బౌండరీలు కొడుతుంటాడు. అయితే ఈ సీజన్లో అందుకు భిన్నంగా సిక్సర్లతో చెలరేగుతున్నాడు. ఈ సీజన్లో విరాట్ ఇప్పటికే 42 బౌండరీలతో పాటు 15 సిక్సర్లు బాదాడు.కాగా, ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు. హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. బౌలింగ్లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్వుడ్ డకౌటయ్యారు. -
ఆర్సీబీపై గుజరాత్ గెలుపు
ఆర్సీబీపై గుజరాత్ గెలుపు156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ తడబడుతూనే బ్యాటింగ్ చేసినప్పటికీ.. 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్ కుమార్ (4-0-28-3), రొమారియో షెపర్డ్ (4-0-30-2) ఇబ్బంది పెట్టినా.. శుభ్మన్ గిల్ (43), జోస్ బట్లర్ (39), రాహుల్ తెవాతియా (27 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడి గుజరాత్ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో సాయి సుదర్శన్ 6, వాషింగ్టన్ సుందర్ 12, షారుక్ ఖాన్ 8, జేసన్ హోల్డర్ 12, రషీద్ ఖాన్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ, షెపర్డ్తో పాటు సుయాశ్ శర్మ (3.5-0-44-1) వికెట్ తీశాడు. గత మ్యాచ్లో చెలరేగి బౌలింగ్ చేసిన హాజిల్వుడ్ (4-0-56-0) ఈ మ్యాచ్లో వికెట్ తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గెలుపు దిశగా గుజరాత్7 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 86-2గా ఉంది. బట్లర్ 33, సుందర్ 3 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 155 పరుగులకే ఆలౌటైన ఆర్సీబీఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు. హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. బౌలింగ్లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టారు. ఫలితంగా ఆర్సీబీ 155 పరుగులకే ఆలౌటైంది.ఆర్సీబీ ఇన్నింగ్స్లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్వుడ్ డకౌటయ్యారు. ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ13.6వ ఓవర్- 126 పరుగుల వద్ద ఆర్సీబీ ఏడో వికెట్ కోల్పోయింది.రషీద్ ఖాన్ బౌలింగ్లో పడిక్కల్ (40) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ8.1వ ఓవర్- 80 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్లో జితేశ్ శర్మ (1) అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హోల్డర్ సూపర్ క్యాచ్7.4వ ఓవర్- 79 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్లో జేసన్ హోల్డర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రజత్ పాటిదార్ (19) ఔటయ్యాడు. కోహ్లి ఔట్3.2వ ఓవర్- 35 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (28) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ2.4వ ఓవర్- 34 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి జేకబ్ బేతెల్ (5) ఔటయ్యాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) జరుగనున్న 42 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆర్సీబీ రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్ ఐదో స్థానంలో ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించగా.. గుజరాత్ 8లో నాలుగు విజయాలు నమోదు చేసింది. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), జాసన్ హోల్డర్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్వుడ్ -
చరిత్ర సృష్టించిన శార్దూల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కాని చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.ఈ చారిత్రక ఘటనలో పాత్రధారుడు ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్. 2026 ఎడిషన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 29) సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో శార్దూల్ ముంబై బౌలింగ్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి ఒక్క బంతి కూడా వేయలేదు.244 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ముంబై సారధి హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ 7వ ఓవర్ సమయంలో శార్దూల్ను ఇంపాక్ట్ ప్లేయర్గా (బౌలర్) తీసుకున్నాడు. అయితే మ్యాచ్ పూర్తయ్యే వరకు హార్దిక్ శార్దూల్తో ఒక్క బంతి కూడా వేయించకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.ఐపీఎల్ చరిత్రలో ఇంపాక్ట్ సబ్గా వచ్చి, ఏ విభాగంలోనూ పాల్గొనని తొలి ఆటగాడిగా శార్దూల్ చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రక తప్పిదం చేసినందుకు హార్దిక్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న వేల, ఇంపాక్ట్ ప్లేయర్గా శార్దూల్ను బరిలోకి దించి బౌలింగ్ చేయించకపోవడమేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.ఈ అంశాన్ని వూహ్యాత్మక తప్పిదంగా విశ్లేషిస్తూ హార్దిక్పై మండిపడుతున్నారు. ముంబై బ్యాటింగ్ కోచ్ పోలార్డ్ కూడా ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "శార్దూల్తో ఒక్క ఓవర్ కూడా వేయించలేదు.. నేను వెళ్లి కారణం అడుగుతాను" అంటూ వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 244 పరుగుల భారీ స్కోర్ను కూడా కాపాడుకోలేక చేతులెత్తేసింది. సన్రైజర్స్ బ్యాటర్లు ప్రతి ముంబై బౌలర్ను చీల్చిచెండాడి పరుగులు పిండుకున్నారు. ఫలితంగా సన్రైజర్స్ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే ఊదేసింది.ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. -
రియాన్ పరాగ్పై బీసీసీఐ చర్యలు
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు చేపట్టింది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా ప్రవర్తించిన తీరుకు జరిమానాతో సరిపెట్టింది. కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ పూర్తి స్థాయి కెప్టెన్గా నియమితుడైన రియాన్ పరాగ్.. సారథిగా ఆకట్టుకుంటున్నాడు.ఇ–సిగరెట్తో పొగ పీల్చి..పరాగ్ కెప్టెన్సీలో రాజస్తాన్ ఇప్పటికి తొమ్మిది మ్యాచ్లలో ఆరు గెలిచింది. అయితే, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా పరాగ్ (Riyan Parag) ప్రవర్తించిన తీరు వివాదానికి దారి తీసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెసింగ్ రూమ్లో ఉన్న రియాన్ పరాగ్ ‘వేపింగ్’ (ఇ–సిగరెట్తో పొగ పీల్చడం) చేశాడు.భారత్లో నిషేధంఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. నిజానికి ద్రవరూపంలో ఉండే నికొటిన్ను ఉపయోగించే ఇ–సిగరెట్లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించింది. అలాంటి ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో కెప్టెన్ స్థాయిలో ఉండి పరాగ్ నిబంధనలు అతిక్రమించడం చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలో బీసీసీఐ రియాన్ పరాగ్పై వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. ఓ జర్నలిస్టు మాత్రం అతడు చేసిన తప్పునకు విధించే శిక్ష విషయంలో ఐపీఎల్ నియమాల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది.మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతరియాన్ పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. క్రమశిక్షణారాహిత్యం కింద అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ ఆర్టికల్ ప్రకారం.. టోర్నీ గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటారు.ఇదిలా ఉంటే.. వేపింగ్పై నిషేధం ఉన్నప్పటికీ ఈమేరకు అతిక్రమనకు పాల్పడితే లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి తరుణంలో బీసీసీఐ మాత్రం తూతూమంత్రంగా చర్యలు తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి.చదవండి: IPL 2026: క్లాసెన్ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి? -
ట్రవిస్ హెడ్పై విమర్శలు.. ఎందుకిలా చేశావు?
సన్రైజర్స్ హైదరాబాద్ ట్రవిస్ హెడ్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్కు వస్తున్న సమయంలో హెడ్ ప్రవర్తించిన తీరు ఇందుకు కారణం.తొలి హాఫ్ సెంచరీతాజా ఎడిషన్లో ట్రవిస్ హెడ్ (Travis Head) ఎట్టకేలకు తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో ముంబై విధించిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సహచర ఓపెనర్ అభిషేక్ శర్మ (24 బంతుల్లో 45)తో కలిసి తొలి వికెట్కు ఏకంగా 129 పరుగులు జోడించాడు.మొత్తంగా ఈ మ్యాచ్లో 30 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 76 పరుగులు సాధించాడు. మరోవైపు.. హెన్రిచ్ క్లాసెన్ (30 బంతుల్లో 65 నాటౌట్) రాణించగా.. ఆఖర్లో సలీల్ అరోరా (10 బంతుల్లో 30 నాటౌట్) వేగంగా ఆడాడు. ఫలితంగా 18.4 ఓవర్లలోనే సన్రైజర్స్ లక్ష్యాన్ని ఛేదించి.. వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. తద్వారా ఈ సీజన్లో ఇప్పటికి తొమ్మిదింట ఆరో గెలుపును ఖాతాలో వేసుకుంది.రొబోటిక్ డాగ్ను కాలితో తన్నిన హెడ్ఇదిలా ఉంటే.. అభిషేక్ శర్మతో కలిసి హెడ్ బ్యాటింగ్కు వచ్చే సమయంలో.. ఐపీఎల్ రొబోటిక్ మస్కట్ ‘చంపక్’ అతడికి అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర అసంతృప్తికి లోనైన హెడ్.. ఆ రొబోటిక్ డాగ్ను కాలితో తన్నాడు. అంతేకాదు బ్యాట్తో కొట్టేందుకు కూడా ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రాపర్టీని తన్నిన కారణంగా హెడ్పై చర్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇటు ఐపీఎల్ పాలక మండలి గానీ.. అటు సన్రైజర్స్ కానీ స్పందించలేదు. కాగా ఐపీఎల్ ప్రవర్తనా నియావళి ప్రకారం.. క్రికెట్కు సంబంధించిన పరికరాలు, క్లాతింగ్, ఇతర వస్తువులకు మ్యాచ్ సమయంలో హాని చేస్తే జరిమానా విధిస్తారు.చంపక్ ఏం చేస్తుందంటే?ఇదిలా ఉంటే.. రోబో కుక్క ‘చంపక్’ను ఐపీఎల్లో గతేడాది ప్రవేశపెట్టారు. ఇదొక కదిలే బ్రాడ్కాస్ట్ కెమెరా. మైదానంలో లో-యాంగిల్లో క్రికెట్ షాట్లు, ఆటగాళ్ల కదలికలను రికార్డు చేస్తుంది. అంతేకాదు అంపైర్లు, ప్లేయర్లకు సరదాగా షేక్హ్యాండ్లు ఇస్తూ సందడి చేస్తుంది. హెడ్ సైతం సరదాగానే చంపక్ను తన్ని ఉంటాడని అతడి అభిమానులు అంటున్నారు.చదవండి: IPL 2026: క్లాసెన్ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి?Travis Head Reaction 🤣 pic.twitter.com/4JGHZNz4GA— 𝗠𝗮𝗻𝗶𝘀𝗵 (@ManishSRH) April 30, 2026 -
క్లాసెన్ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి?
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. క్లాసెన్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చి అద్భుత ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో క్లాసెన్ మరోసారి తన క్లాస్ చూపించాడు.244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తొలి వికెట్కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే అభిషేక్, హెడ్, ఇషాన్ కిషన్ వికెట్లను ఆరెంజ్ వెంటవెంటనే కోల్పోయింది. దీంతో ముంబై ఇండియన్స్ తిరిగి గేమ్లోకి వచ్చింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన క్లాసెన్.. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. క్లాసెన్ కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్లతో 65 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. అతడు దూకుడుగా ఆడడంతో లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలూండగానే సన్రైజర్స్ చేధించింది. ఈ నేపథ్యంలో క్లాసెన్ను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలని పీటర్సన్ కోరాడు.దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ప్రపంచకప్ను కూడా గెలవలేదు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికా వేదికగానే జరగనుంది. ప్రోటీస్ జట్టుకు తొలి వరల్డ్కప్ టైటిల్ గెలిచేందుకు ఇదొక మంచి అవకాశం. కాబట్టి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెంటనే క్లాసెన్ను తన రిటైర్మెంట్ను వెనుక్కి తీసుకోవాలని కోరాలి. ఒకవేళ అతడు తిరిగొస్తే సౌతాఫ్రికాకు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని" పీటర్సన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. క్లాసెన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. కుటుంబానికి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో పాటు టీ20 లీగ్లపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.అయితే ఐపీఎల్లో అతడు అద్భుతమైన ప్రదర్శన చేస్తుండడంతో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని మాజీలు సూచిస్తున్నారు. క్లాసెన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆశ్చర్యపోన్కర్లేదు. గతంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ కూడా తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని టీ20 ప్రపంచకప్-2026లో ఆడాడు. ఇప్పుడు క్లాసెన్ కూడా సూపర్ ఫామ్లో ఉండడంతో డికాక్ బాటలో నడిచే అవకాశముంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో క్లాసెన్ 59.14 సగటుతో 414 పరుగులు సాధించాడు. -
చారిత్రక మైలురాయిని తాకిన సన్రైజర్స్
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్పై బుధవారం జయభేరి మోగించిన కమిన్స్ బృందం... ఈ సీజన్లో వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. మొత్తంగా ఇప్పటికి తొమ్మిది మ్యాచ్లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచింది.వాంఖడే వేదికగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. రికెల్టన్ (55 బంతుల్లో 123 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... విల్ జాక్స్ (22 బంతుల్లో 46; 5 ఫోర్లు, 3 సిక్స్లు), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.52 బంతుల్లోనే 129 పరుగులుఅనంతరం హైదరాబాద్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. హెడ్ (30 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లాసెన్ (30 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగి జట్టును గెలిపించారు. అభిషేక్, హెడ్ తొలి వికెట్కు 52 బంతుల్లోనే 129 పరుగులు జత చేశారు.చారిత్రక మైలురాయిఇదిలా ఉంటే.. ముంబైపై విజయం ద్వారా సన్రైజర్స్ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఐపీఎల్లో సన్రైజర్స్కు ఇది వందో విజయం. కాగా 2013లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికి 205 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఇందులో 104 ఓడిపోగా.. వంద గెలిచింది. ఒకటి ఫలితం తేలకుండా ముగిసిపోయింది.నిలకడైన జట్టుగానూ పేరుఐపీఎల్లో 13 ఏళ్లుగా కొనసాగుతున్న సన్రైజర్స్ 2016లో తొలిసారి టైటిల్ గెలిచింది. ఇక 2018, 2024లో ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది. అంతేకాదు మరో నాలుగు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరింది. తద్వారా ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న జట్లలో ఒకటిగా ముందుకు సాగుతోంది. -
వరుస ఓటములు.. అయినా ముంబై ఇండియన్స్కు ప్లే ఆఫ్ ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ముంబై బ్యాటింగ్లో అదరగొట్టినప్పటికి, బౌలింగ్లో మాత్రం అందుకు భిన్నంగా ఘోరంగా విఫలమైంది. 244 పరుగుల భారీ టార్గెట్ను సైతం ముంబై బౌలర్లు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ముంబైకి ఇది ఆరువ ఓటమి. దీంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్ధానంలో ఉంది. పాయింట్ల పరంగా లక్నో సూపర్ జెయింట్స్తో ముంబై సమానంగా ఉన్నప్పటికి రన్రేట్ పరంగా హార్దిక్ సేన (-0.784) వారి కంటే కాస్త మెరుగ్గా ఉంది.ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే?ప్రస్తుతం నెగటివ్ రన్ రేట్తో ఉన్న ముంబైకి ప్రతి మ్యాచ్ ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా మారింది. ముంబైకి ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ముంబై ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది.అయితే ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే ముంబై మరోసారి లీగ్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టే సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా పేలవ ఫామ్ ముంబైకి ప్రధాన సమస్యగా మారింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రా ఈ ఏడాది సీజన్లో తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. జూనియర్ క్రికెటర్లు సైతం అతడి బౌలింగ్ను ఉతికారేస్తున్నారు. ఇప్పటివరకు అతడు కేవలం రెండే రెండు వికెట్లు సాధించాడు. ఆఖరిగా ముంబై ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఏదైన అద్భుతం జరగాలి.చదవండి: IPL 2026: భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం ఇదే? -
BCCI: రియాన్ పరాగ్ ఎస్కేప్.. ఊహించని ట్విస్ట్!
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్-2026లో భాగంగా.. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా అతడు డ్రెస్సింగ్రూమ్లో ‘వేపింగ్’ (ఇ–సిగరెట్తో పొగ పీల్చడం) చేసిన సంగతి తెలిసిందే. అతడు చేసిన పని టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రియాన్తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.లక్ష రూపాయల జరిమానా లేదాకాగా ద్రవరూపంలో ఉండే నికొటిన్ను ఉపయోగించే ఇ–సిగరెట్లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతిక్రమనకు లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.నిజానికి ఇప్పుడు పరాగ్ వివాదం ప్రభుత్వ నిబంధనలకంటే బీసీసీఐ కోణంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఐపీఎల్లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఒక జట్టుకు కెప్టెన్గా ఉంటూ అతడు ఇలా చేయడంపై చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రియాన్ పరాగ్పై కఠిన చర్యలు తీసుకోనుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఊహించని ట్విస్ట్అయితే, రియాన్ పరాగ్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విపుల్ కశ్యప్ అనే జర్నలిస్టు ఇందుకు సంబంధించి తాజా అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. రియాన్ పరాగ్పై బీసీసీఐ నేరుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీని సారాంశం.రియాన్ పరాగ్ తప్పించునే అవకాశంఐపీఎల్ లేదంటే బీసీసీఐ ప్రవర్తనా నియమావళిలో ‘వేపింగ్’కు సంబంధించి ఎలాంటి శిక్ష విధించాలన్న అంశంపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ తప్పించునే అవకాశం ఉండగా.. మ్యాచ్ అధికారులపై మాత్రం బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.🚨 BIG UPDATE FROM IPL 🚨Rajasthan Royals captain Riyan Parag could face a 2-match ban after an alleged dressing room incident.⚠️ Reports suggest he was caught vaping inside the dressing room.🔥 If confirmed, Yashasvi Jaiswal is likely to lead RR for the next two matches.… pic.twitter.com/bKD9zfpQko— True Vector (@TrueVector33) April 28, 2026ఆయనపై వేటు?ఓ ఆటగాడు అలాంటి నిషేధిత వస్తువును మైదానంలోకి తీసుకురావడమే గాకుండా.. ఓవైపు మ్యాచ్ జరుగుతుండగా డ్రెసింగ్ రూమ్లో వేపింగ్ చేయడాన్ని బీసీసీఐ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నట్లు సమాచారం. అతడికి ఆ అవకాశం ఇచ్చినందుకు గానూ మ్యాచ్ రిఫరీ లేదంటే ఇతర అధికారులపై వేటు పడనుందని సమాచారం.కాగా పంజాబ్ కింగ్స్- రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్కు అమిత్ శర్మ రిఫరీ. ఒకవేళ బీసీసీఐ గనుక రంగంలోకి దిగితే అతడికి పనిష్మెంట్ తప్పకపోవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ పంజాబ్కు ఈ సీజన్లో తొలిసారి ఓటమిని రుచిచూపించింది. శ్రేయస్ అయ్యర్ సేనను పరాగ్ బృందం ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో రియాన్ పరాగ్ 16 బంతుల్లో కేవలం 29 పరుగులు చేశాడు.UPDATE: రియాన్ పరాగ్పై బీసీసీఐ చర్యలుచదవండి: IPL 2026: భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం ఇదే? -
ఆరోగ్యం బాగోలేకపోయిన స్టేడియంకు వచ్చిన వినోద్ కాంబ్లీ
ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ చాన్నాళ్ల తర్వాత పబ్లిక్లో కన్పించారు. సచిన్ టెండూల్కర్ ప్రాణస్నేహితుడు అయిన కాంబ్లీ.. బుధవారం ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ను వీక్షించేందుకు వాంఖడే స్టేడియంకు వచ్చారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో కాంబ్లీ చాలా బలహీనంగా ఉండి, నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కన్పించారు. ఇద్దరు వ్యక్తులు ఆయనను చేతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. కేవలం 54 ఏళ్ల వయసులోనే ఆయన ఆరోగ్యం ఇంతలా క్షీణించడం చూసి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్టేడియంలోని ప్రేక్షకులు "గెట్ వెల్ సూన్ సార్" అని అరవగా.. ఆయన చిరునవ్వుతో థమ్సప్ చూపిస్తూ అందరికీ అభివాదం చేశారు. వినోద్ కాంబ్లీ గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, క్రికెట్ పట్ల ఉన్న మక్కువతో కాంబ్లీ స్టేడియం రావడం విశేషం.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్పై 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలోనే ఊదిపడేసింది.Vinod Kambli came to Wankhede Stadium today to watch the Mumbai Indians match. There was a time when he was considered an even better batsman than Sachin Tendulkar, but some bad habits ruined his career. Seeing him like this today doesn’t feel good, but it was nice to see that he… pic.twitter.com/AJOMh1FTX3— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 29, 2026 -
భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం ఇదే?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సీజన్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఆరో ఓటమిని నమోదు చేసింది. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది.243 పరుగుల భారీ టార్గెట్ను కూడా ముంబై కాపాడుకోలేక పోయింది. అయితే ఈ మ్యాచ్లో ముంబై జట్టు భారీ తప్పిదం చేసింది. బౌలర్లను ఊచకోత కోసిన ట్రావిస్ హెడ్ను అవుట్ చేసే అవకాశాన్ని ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోల్పోయింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండో బంతిని బ్యాక్ ఆఫ్ది లెంగ్త్ డెలివరీగా బౌల్ట్ సంధించాడు.ఆ బంతిని హెడ్ లెగ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్కు సమీపంగా వెళుతూ కీపర్ చేతుల్లో పడింది. దీనిని కీపర్, బౌలర్ ఎవరూ సరిగా గుర్తించకపోవడంతో ముంబై అప్పీల్కు కూడా ప్రయత్నించలేదు. తర్వాత రీప్లేలో చూడగా బంతి హెడ్ బ్యాట్కు తగిలినట్లుగా స్పష్టమైంది. ఈ సమయంలో హెడ్ స్కోరు 8 పరుగులు మాత్రమే. ఈ తప్పిదానికి ముంబై భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది. ఆ తర్వాత ఈ ఆసీస్ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హెడ్ కేవలం 30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లతో 76 పరుగులు చేసి ముంబై ఓటమిని శాసించాడు. ఒకవేళ 8 పరుగుల వద్ద హెడ్ ఔటై వుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో హెడ్ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్లను కూడా ముంబై ఫీల్డర్లు జారవిడిచారు.చదవండి: భయం వారి బ్లడ్లోనే లేదు.. తెలిసిందల్లా ఒక్కటే: పాట్ కమ్మిన్స్ -
రియాన్ పరాగ్పై బీసీసీఐ సీరియస్! వేటు తప్పదా?
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ ‘వేపింగ్’ (ఇ–సిగరెట్తో పొగ పీల్చడం) చేస్తూ టీవీ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే ద్రవరూపంలో ఉండే నికొటిన్ను ఉపయోగించే ఇ–సిగరెట్లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించింది.అయినప్పటికి నిషేధిత ఇ–సిగరెట్ వాడి పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. అతిక్రమనకు లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష కూడా ఉండవచ్చు. తాజాగా ఈ వ్యహరంపై బీసీసీఐ కూడా సీరియస్ అయింది."వేపింగ్ చట్టరీత్యా నేరం. కాబట్టి ఈ విషయంపై మేము రియాన్ను నుంచి వివరణ కోరతాము. అతడి సమాధానం ఆధారంగా ఐపీఎల్ కమిటీ తదుపరి చర్యలు తీసుకుంటుందని" బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నారు. కాగా ఇదే విషయంపై ఐపీఎల్ అధికారి కూడా ఒకరు స్పందించారు.‘చాలా మంది ఆటగాళ్లు ఇ–సిగరెట్లు వాడతారు. ఎన్నో కెమెరాలు తమ వైపు చూస్తుండగా డ్రెస్సింగ్రూమ్లో ఇలా ఎవరూ చేయరు. ఇంత బహిరంగంగా పట్టుబడటం పరాగ్ నిర్లక్ష్యాన్ని చూపించింది. బీసీసీఐ కచి్చతంగా దీనిపై చర్య తీసుకుంటుంది’ అని సదరు అధికారి వెల్లడించారు.మరోవైపు డ్రెస్సింగ్ రూమ్లో కూర్చునే క్రికెటర్ల గోప్యతకు సంబంధించి కూడా దీని ద్వారా ప్రశ్నలు తలెత్తాయి. ‘తాజా వివాదం గురించి కాదు కానీ డ్రెస్సింగ్ రూమ్ క్రికెటర్ల ప్రైవేట్ ప్రదేశం. అక్కడ ఆటగాళ్లు తమకు నచి్చనట్లుగా ఉంటారు. అక్కడి దృశ్యాలు కూడా కెమెరాలు రికార్డు చేయడం సరైంది కాదు. ఇది క్రికెటర్ల గోప్యతకు భంగం కలిగిస్తుంది. కెమెరామెన్లు మైదానంలో ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి’ అని బోర్డులోని మరో అధికారి అభిప్రాయపడ్డారు. ఒకవేళ విచారణలో పరాగ్ తప్పు చేసినట్లే తేలితే బీసీసీఐ ఒకట్రెండు మ్యాచ్లు నిషేధం విధించే అవకాశముంది.చదవండి: చాలా బాధగా ఉంది.. వారిని మాత్రం తప్పుబట్టను: హార్దిక్ -
భయం వారి బ్లడ్లోనే లేదు.. తెలిసిందల్లా ఒక్కటే: పాట్ కమ్మిన్స్
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. బుధవారం వాంఖడే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయాన్ని అందుకుంది. ముంబై నిర్ధేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఊదిపడేసింది.ఈ విజయంలో ట్రావిస్ హెడ్ (76 పరుగులు),అభిషేక్ శర్మ (45 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్),సలీల్ అరోరా (10 బంతుల్లో 30 నాటౌట్)లది కీలక పాత్ర. ఓపెనర్లు అభిషేక్, హెడ్కు 129 పరుగులు అందించగా.. క్లాసెన్, ఆరోరా దూకుడుగా ఆడి మ్యాచ్ను ఫినిష్ చేశారు. హైదరాబాద్కు ఐపీఎల్లో ఇది వందో విజయం కావడం గమానార్హం. మ్యాచ్ అనంతరం ఈ చారిత్రత్మక విజయంపై ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఎంతటి భారీ టార్గెట్నైనా ఛేదించే సత్తా తమ బ్యాటర్లకు ఉందని కమ్మిన్స్ అన్నాడు."244 పరుగుల లక్ష్యాన్ని చేధించడం అంత సులువు కాదు. కానీ మా బ్యాటింగ్ లైనప్ గురుంచి తెలుసు కాబట్టి ఖచ్చితంగా చేధిస్తామని అనుకున్నాను. మా బాయ్స్ నా నమ్మకాన్ని నిజం చేశారు. మా ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ గురుంచి ఎంత చెప్పిన తక్కువే. వారు ఆడుతున్న తీరు చూస్తుంటే భయం అన్నదే లేనిట్లు అన్పిస్తోంది. ముఖ్యంగా పిచ్ బాగున్నప్పుడు వారు ఆడే షాట్లకు బౌలర్లు బెంబేలెత్తాల్సిందే.వారికి బౌలింగ్ వేయాల్సిన అవసరం నాకు లేనందుకు సంతోషిస్తున్నాను. ఇక క్లాసెన్ మరోసారి తన క్లాస్ ఎంటో చూపించాడు. ప్రతీ మ్యాచ్లోనూ అతడు రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడు జట్టులో ఉన్నందుకు మా అదృష్టం. మరోవైపు యువ ఆటగాడు సలీల్ అరోరా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఛాన్స్ దొరికిన ప్రతీ మ్యాచ్లోనూ సత్తాచాటుతున్నాడు.కోచింగ్ స్టాఫ్ యువ ఆటగాళ్లలో నింపిన 'ఫియర్ లెస్' వైఖరి జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఐదేళ్ల క్రితం ఐపీఎల్కి, ఇప్పటి టోర్నీకి చాలా తేడా ఉంది. గతంలో 200 పరుగులు ఛేదించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఓవర్కు 12 పరుగులు చేయాల్సి ఉన్నా, బ్యాటర్లు దానిని సులువుగా ఛేదిస్తున్నారు.ఇటువంటి హైస్కోరింగ్ మ్యాచ్లలో బౌలర్ల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి మ్యాచ్లలో ఒక అద్భుతమైన 'యార్కర్' మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. మా జట్టులో ఈషన్ మలింగ వంటి అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. అతడు మా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.చదవండి: చాలా బాధగా ఉంది.. వారిని మాత్రం తప్పుబట్టను: హార్దిక్ -
244 టార్గెట్ ఊదేశారు.. SRHకి వరుసగా ఐదో విజయం
-
చాలా బాధగా ఉంది.. వారిని మాత్రం తప్పుబట్టను: హార్దిక్
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ కథ ఏ మాత్రం మారలేదు. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ బౌలర్లు డిఫెండ్ చేసుకోలేకపోయారు. సీనియర్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాలు దారుణంగా విఫలమయ్యారు. ఈ ఏడాది సీజన్లో ముంబైకి ఇది ఆరో ఓటమి. దీంతో ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ మెరుగు పడినప్పటికి, బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని హార్దిక్ అన్నాడు."భారీ స్కోర్ను నమోదు చేసినప్పటికి ఓడిపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. ఈ రోజు మంచు ప్రభావం పెద్దగా లేదు. వారు అద్భుతమైన షాట్లు ఆడారు. మేము కొన్ని చెత్త బంతులు వేశాం. సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయకపోవడంతో వారు దూసుకుపోయారు. గత మ్యాచ్తో పోలిస్తే మేము పుంజుకున్నాము అన్పించింది. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా చాలా మెరుగయ్యాం. కానీ బౌలింగ్ పరంగా మాత్రం విఫలమయ్యాము. 244 పరుగుల టార్గెట్ను మా బౌలర్లు డిఫెండ్ చేసుకోగలరని నమ్మాను. కానీ మేము అనుకున్నది ఈ రోజు జరగలేదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము.ఇక నా విషయానికి వస్తే.. చివరి మూడు బంతులు మినహా, మిగిలన ఓవర్లు మొత్తం బాగానే బౌలింగ్ చేశాను. అయితే కొన్ని క్యాచ్లను విడిచిపెట్టడం మా గెలుపు అవకాశాలను దెబ్బ తీసింది. క్రికెట్లో క్యాచ్లు పట్టినప్పుడే మొమెంటం మారుతుంది. మా కుర్రాళ్లందరూ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. బౌలింగ్ విభాగంలో ఈ సీజన్లో మాకు పెద్దగా ఆప్షన్లు లేవు. అందుబాటులో ఉన్న బౌలర్లనే రొటేట్ చేయాల్సి వస్తుంది. అయినప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మా బౌలర్లను బలిపశువులు చేయను. ఓటుములకు జట్టు మొత్తం బాధ్యత వహించాల్సిందే. ముంబై ఇండియన్స్ అంటే ఒక బ్రాండ్. కానీ మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాము. సొంత ప్రేక్షకుల ముందు మ్యాచ్లను ఓడిపోతుండడం చాలా బాధగా ఉంది. కొన్ని సందర్భాల్లో హోమ్ గ్రౌండ్లో ప్రత్యర్థి జట్టు పేరు మారుమోగుతుంటే ఆ బాధ మరింత ఎక్కువ అవుతోంది. అభిమానుల ప్రేమను తిరిగి పొందాలంటే మేము తిరిగి మ్యాచ్లను గెలవాలి. అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తాము. మా యజమానులు, కోచింగ్ స్టాఫ్ అందరూ ఎంతో సపోర్ట్గా ఉన్నారు. మేము లోపాలను సరిదిద్దుకుని తిరిగి పుంజుకుంటామని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో ఉంది.చదవండి: హెడ్, క్లాసెన్ ఊచకోత.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన సన్రైజర్స్ -
హెడ్, క్లాసెన్ ఊచకోత.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన సన్రైజర్స్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరిగిన 41వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ముంబైని 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.రికెల్టన్ రికార్డు సెంచరీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్ (123 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22, హార్దిక్ పాండ్యా 31, తిలక్ వర్మ 7, రాబిన్ మింజ్ 1 (నాటౌట్) పరుగు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో హింగే 2, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి, సాకిబ్ తలో వికెట్ తీశారు.సన్రైజర్స్ బ్యాటర్ల ఊచకోత244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అభిషేక్ శర్మ (45), ట్రవిస్ హెడ్ (76), హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్) ఊచకోత కోసి సన్రైజర్స్ను గెలిపించారు. ఆఖర్లో సలీల్ అరోరా (30 నాటౌట్) సైతం విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి 21 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. -
చరిత్ర సృష్టించిన రికెల్టన్.. ఫాస్టెస్ట్ సెంచరీ
ర్యాన్ రికెల్టన్.. ఈ పేరు ఇప్పుడు ముంబై ఇండియన్స్ అభిమానుల నోట మారుమోగుతోంది. ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఇవాళ (ఏప్రిల్ 29) జరుగుతున్న మ్యాచ్లో అతడు ఆడిన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే శతకం బాదాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు 18 ఏళ్లుగా సనత్ జయసూర్య ఖాతాలో ఉండింది. జయసూర్య ఐపీఎల్ అరంభ ఎడిషన్లో (2008) ముంబై ఇండియన్స్కు ఆడుతూ సీఎస్కేపై 45 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ రికార్డును రికెల్టన్ నేటి మ్యాచ్లో బద్దలు కొట్టాడు.ఐపీఎల్లో ముంబై తరఫున వేగవంతమైన సెంచరీలు44 బంతులు – ర్యాన్ రికెల్టన్45 బంతులు – సనత్ జయసూర్య45 బంతులు – తిలక్ వర్మ47 బంతులు – కెమరూన్ గ్రీన్ఈ సెంచరీతో రికెల్టన్ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల తరఫున అన్ని టీ20 లీగ్లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ దిగ్గజం రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. రికెల్టన్ ఎంఐ ఫ్రాంచైజీల (ముంబై ఇండియన్స్, ఎంఐ కేప్టౌన్) తరఫున మొత్తం 3 సెంచరీలు చేయగా.. రోహిత్ 2 సెంచరీలు (రెండూ ముంబై ఇండియన్స్ తరఫునే) చేశాడు. 2025 ఐపీఎల్ సందర్భంగా ఎంఐ ఫ్యామిలీలో చేరిన రికెల్టన్ కేవలం రెండేళ్ల వ్యవధిలో రోహిత్ శర్మ వంటి దిగ్గజాన్ని అధిగమించడం విశేషం.ఎంఐ ఫ్రాంచైజీల తరఫున అత్యధిక సెంచరీలు3 – ర్యాన్ రికెల్టన్ (ఐపీఎల్, SA20)2 – రోహిత్ శర్మ (ఐపీఎల్)2 – సూర్యకుమార్ యాదవ్ (ఐపీఎల్)2 – టామ్ బాంటన్రికెల్టన్ను ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 వేలంలో కేవలం రూ.1 కోటికే సొంతం చేసుకుంది. ఇతగాడు ఇప్పటికే ఎంఐ ఫ్రాంచైజీల తరఫున అత్యంత కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు.ఈ ఇన్నింగ్స్లో మొత్తం 55 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్ 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 123 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో రికెల్టన్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక స్కోర్123 (నాటౌట్)- ర్యాన్ రికెల్టన్114 (నాటౌట్)- సనత్ జయసూర్య112 (నాటౌట్)- క్వింటన్ డికాక్109 (నాటౌట్)- రోహిత్ శర్మ105 (నాటౌట్)- రోహిత్ శర్మ103 (నాటౌట్)- సూర్యకుమార్ యాదవ్కాగా, ఈ మ్యాచ్లో గాయపడిన డికాక్ స్థానంలో జట్టులోకి వచ్చిన రికెల్టన్ రికార్డు శతకం బాది ముంబై ఇండియన్స్కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఎందుకంటే, రికెల్టన్ సెంచరీకి ముందు డికాక్ కూడా ఓ అద్భుత శతకం బాదాడు. దీంతో తదుపరి మ్యాచ్ల్లో ఎవరిని ఆడించాలో మేనేజ్మెంట్కు అర్దం కావట్లేదు.భారీ స్కోర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్ (123 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22, హార్దిక్ పాండ్యా 31, తిలక్ వర్మ 7, రాబిన్ మింజ్ 1 (నాటౌట్) పరుగు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో హింగే 2, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి, సాకిబ్ తలో వికెట్ తీశారు. -
ముంబై ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ఎందుకు ధరించారో తెలుసా..?
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఇవాళ (ఏప్రిల్ 29) జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. దీని వెనుక ఓ హృదయ విదారక కారణం ఉంది.జట్టు సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె ఇటీవల అకాల మరణం చెందింది. ఆమె స్మారకార్థం, అలాగే ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ఆటగాళ్లు నల్ల ఆర్మ్బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు.ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. "మా సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె అకాల మరణం చెందింది. వారి కుటుంబానికి మద్దతుగా, ఆమె జ్ఞాపకార్థం ఈరోజు మా ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు" అని వెల్లడించారు.ఈ విషాద సమయంలో ఆ కుటుంబ గోప్యతను గౌరవిస్తూ, సంబంధిత సిబ్బంది వివరాలను ముంబై ఇండియన్స్ వెల్లడించలేదు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 15 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 181-3గా ఉంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. అతనికి జతగా హార్దిక్ పాండ్యా (2) క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. హింగే, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు. -
రోహిత్ శర్మ అభిమానులకు చేదు వార్త
ముంబై ఇండియన్స్ అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు స్టార్ బ్యాటర్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఇవాళ (ఏప్రిల్ 29) జరుగుతున్న కీలక పోరులో కూడా రోహిత్ ఆడటం లేదు. హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా అతడు వరుసగా నాలుగో మ్యాచ్కు దూరమయ్యాడు.టాస్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోహిత్ గాయంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. "రోహిత్ ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు. అతడు తిరిగి రావడానికి ఇంకొన్ని మ్యాచ్లు పట్టొచ్చు" అని స్పష్టం చేశాడు. దీంతో ముంబై అభిమానులు అతని రీ-ఎంట్రీ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.రోహిత్ గైర్హాజరీ ముంబైకి భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. అతని అనుభవం, ఆరంభ ఓవర్లలో దూకుడు జట్టుకు ఎంతో అవసరం. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఓపెనర్లుగా ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.ఆరంభ ఓవర్లలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. జాక్స్, రికెల్టన్ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 78-0గా ఉంది. జాక్స్ 38, రికెల్టన్ 37 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇప్పటివరకు బౌలింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఎసాన్ మలింగ ఒక్కడే జాక్స్-రికెల్టన్ జోడీ ధాటి నుంచి తప్పించుకున్నాడు. కమిన్స్, హింగే, హర్ష్ దూబే, సాకిబ్ హుసేన్ను వీరి జోడీ చెడుగుడు ఆడుకుంది.ఈ మ్యాచ్లో ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. డికాక్ స్థానంలో రికెల్టన్, సాంట్నర్ స్థానంలో రాబిన్ మింజ్ బరిలోకి దిగారు. ఎస్ఆర్హెచ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఓ మార్పు చేసింది. శివాంగ్ కుమార్ స్థానంలో హర్ష్ దూబే తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్ఫర్, అశ్వనీ కుమార్ -
వైభవ్ సూర్యవంశీ పొరపాటు.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వినిపిస్తున్నపేరు వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్లో సూర్యవంశీ ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 400 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం సీజన్లో వరుస విజయాలతో ఎదురులేకుండా సాగుతున్న పంజాబ్ కింగ్స్కు చెక్పెట్టిన రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా జైస్వాల్, వైభవ్ మరోసారి మెరుపు ఆరంభం ఇచ్చారు. చివర్లో ఫెరీరా, శుభమ్ దూబే ఫినిషింగ్ టచ్తో రాజస్తాన్ను గెలిపించారు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైభవ్ సూర్యవంశీ ఫీల్డింగ్కు వెళ్లే సమయంలో షూ వేసుకోకుండానే మైదానంలోకి వచ్చాడు. అయితే పొరపాటును గ్రహించిన వైభవ్ వెంటనే తన షూ పంపించాలంటూ డ్రెసింగ్ రూమ్కు సైగలు చేయడం కనిపించింది. పక్కనే ఉన్న రోమి భిందర్ కూడా వైభవ్కు సహాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 6 విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.Vaibhav Sooryavanshi forgot to wear his shoes and then asked someone to bring them onto the ground 😭Romi Bhinder is literally taking care of him like a father 🫡 pic.twitter.com/3TayVsGf78— TEJASH (@Tejashyyyyy) April 29, 2026చదవండి: లంక క్రికెట్లో సంక్షోభం.. బోర్డు మూకుమ్మడి రాజీనామా! -
ముంబైని చిత్తు చేసిన సన్రైజర్స్
ముంబైని చిత్తు చేసిన సన్రైజర్స్244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అభిషేక్ శర్మ (45), ట్రవిస్ హెడ్ (76), హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్) ఊచకోత కోసి సన్రైజర్స్ను గెలిపించారు. ఆఖర్లో సలీల్ అరోరా (30 నాటౌట్) సైతం విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి 21 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.అంతకుముందు రికెల్టన్ (123 నాటౌట్) శతక్కొట్టుడుతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22, హార్దిక్ పాండ్యా 31, తిలక్ వర్మ 7, రాబిన్ మింజ్ 1 (నాటౌట్) పరుగు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో హింగే 2, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి, సాకిబ్ తలో వికెట్ తీశారు.4 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్9.4వ ఓవర్- 4 పరుగుల వ్యవధిలో సన్రైజర్స్ 3 వికెట్లు కోల్పోయింది. తొలుత అభిషేక్, ఇషాన్ కిషన్ వరుస బంతుల్లో ఔట్ కాగా.. ఆతర్వాత హెడ్ (76) హార్దిక్ పాండ్యా బౌలింగ్లో జాక్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్తొమ్మిదో ఓవర్ 4, 5 బంతులకు సన్రైజర్స్ అభిషేక్ (45), ఇషాన్ కిషన్ (0) వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ (45) ఔట్8.4వ ఓవర్- 129 పరుగుల వద్ద సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఘజన్ఫర్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ శర్మ (45) ఔటయ్యాడు.సన్రైజర్స్ ఓపెనర్ల ఊచకోత244 పరుగుల లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (48), అభిషేక్ శర్మ (36) చెలరేగిపోతున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 92-0గా ఉంది. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్ (123 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్ జాక్స్ 46, సూర్యకుమార్ యాదవ్ 5, నమన్ ధిర్ 22, హార్దిక్ పాండ్యా 31, తిలక్ వర్మ 7, రాబిన్ మింజ్ 1 (నాటౌట్) పరుగు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో హింగే 2, ఎషాన్ మలింగ, నితీశ్ కుమార్ రెడ్డి, సాకిబ్ తలో వికెట్ తీశారు. నమన్ ధిర్ ఔట్13.4వ ఓవర్- 165 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. హింగే బౌలింగ్లో హర్ష్ దూబేకు క్యాచ్ ఇచ్చి నమన్ ధిర్ (22) ఔటయ్యాడు.రెండో వికెట్ డౌన్8.3వ ఓవర్- 110 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. ఎషాన్ మలింగ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (5) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై7.1వ ఓవర్- 93 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (46) ఔటయ్యాడు.దుమ్మురేపుతున్న ముంబై ఓపెనర్లుముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. జాక్స్, రికెల్టన్ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 78-0గా ఉంది. జాక్స్ 38, రికెల్టన్ 37 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇప్పటివరకు బౌలింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఎసాన్ మలింగ ఒక్కడే జాక్స్-రికెల్టన్ జోడీ ధాటి నుంచి తప్పించుకున్నాడు. కమిన్స్, హింగే, హర్ష్ దూబే, సాకిబ్ హుసేన్ను వీరి జోడీ చెడుగుడు ఆడుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరుగుతున్న 41వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్-సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఈ ఎడిషన్లో చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో రెండే విజయాలు సాధించింది. సన్రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టు మధ్యమధ్యలో తడబడినా, ఓ మోస్తరు ప్రదర్శనలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సన్రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించింది.తుది జట్లు..సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్ఫర్, అశ్వనీ కుమార్ -
అర్జున్ టెండుల్కర్ కీలక నిర్ణయం
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్కు ఐపీఎల్లో ఈ ఏడాది కూడా కలిసి రావడం లేదు. గతేడాది వరకు అతడు ముంబై ఇండియన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ జట్టు తరఫున అర్జున్ కేవలం ఐదు మ్యాచ్లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు.ఇక్కడా బెంచ్కే పరిమితంఅయితే, 2026 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar)ను లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసింది. కానీ.. ముంబై ఇండియన్స్ మాదిరే ఇక్కడ కూడా ఈ ఆల్రౌండర్ బెంచ్కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఈ సీజన్లో లక్నో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడగా.. అర్జున్కు ఒక్కసారి కూడా తుదిజట్టులో చోటు దక్కలేదు.అర్జున్ టెండుల్కర్ కీలక నిర్ణయంఇక ఇప్పటికి ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఏకంగా ఆరు ఓడి లక్నో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో అర్జున్ టెండుల్కర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లక్నో జట్టులో ఆడే పరిస్థితి లేని తరుణంలో టీ20 ముంబై లీగ్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు జర్నలిస్టు గౌరవ్ గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేశారు. రూ. 5 లక్షల కనీస ధరతోకాగా మే 2న ముంబైలో టీ20 ముంబై లీగ్ వేలం జరుగనుంది. ఇందులో రూ. 5 లక్షల కనీస ధరతో అర్జున్ టెండుల్కర్ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో ఇదే అత్యధిక ధర గల కేటగిరీ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ ఆల్రౌండర్ దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.బీసీసీఐ అనుమతితోనే..అయినప్పటికీ ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అర్జున్కు ఈ టీ20 లీగ్ వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చింది. నిబంధనల ప్రకారం.. సంవత్సర కాలం పాటు కూలింగ్ పీరియడ్ పూర్తైన తర్వాత స్థానిక ఆటగాళ్లు ఈ లీగ్లో తిరిగి పాల్గొనవచ్చని తెలిపింది.ఈ విషయం గురించి ఎంసీఏ కార్యదర్శి ఉన్మేష్ ఖన్వీకర్ స్పోర్ట్స్స్టార్తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం అతడు (అర్జున్).. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అసోసియేషన్ తరఫున టీ20 లీగ్లో ఆడటం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్లు వేరే లీగ్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. అలా అర్జున్ టెండుల్కర్, సిద్ధాంత్ అద్ధాత్రావు టీ20 ముంబై లీగ్ సీజన్-4లో ఆడేందుకు అనుమతి లభించింది’’ అని పేర్కొన్నాడు. చదవండి: సోదరి ఓటమి.. జడేజా ఇంట మరోసారి విభేదాలు! -
పాక్ ‘ఏఐ’ చిప్.. వైభవ్ అదిరిపోయే రిప్లై!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. 15 ఏళ్ల వయసులోనే అద్భత బ్యాటింగ్తో అదరగొడుతున్న వైభవ్ ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 400 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్పై అనుమానముందని, ఏఐ చిప్ ఇన్స్టాల్ చేసి ఉండొచ్చని, వెంటనే డోపింగ్ టెస్టుకు పంపించాలంటూ పాక్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ క్రికెట్ అనలిస్ట్కు వైభవ్ తన స్టైల్లో అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ‘దేవుడే నా బ్యాట్కు ఆ ఏఐ చిప్ను జోడించాడు. ఆ భగవంతుడే నా బ్యాట్కు దానిని జత చేసినట్లు నాకు స్వయంగా చెప్పాడు. అందుకే నేను ఆ బ్యాట్ను ఉపయోగించి పరుగులు సాధిస్తున్నా’ అని నవ్వుతూ పేర్కొన్నాడు.అసలేం జరిగింది?ఐపీఎల్ 2026 సీజన్లో అగ్రశ్రేణి బౌలర్లందరినీ ఉతికారేస్తున్న వైభవ్ సూర్యవంశీ బ్యాట్లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అతడి మెదడులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సరదాగా పేర్కొన్నారు. వైభవ్కు డోపింగ్ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు. ‘వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒకసారి వైభవ్ను చెక్ చేస్తే బాగుంటుంది. అతడి బుర్రలో ఏదైనా ఏఐ చిప్ ఇన్స్టాల్ చేసారా అన్నది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్కు పంపించి పరీక్షించాల్సిందే. వైభవ్ నాకు మనిషిలా అనిపించడం లేదు. అయితే అతడి మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. నిజంగానే వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో అతడి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. ఇక ఒక టీనేజీ కుర్రాడు కండలు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్యవంశీ 18 ఏండ్లు నిండకుండానే అతడి దేహదారుఢ్యం బలంగా కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో వైభవ్ ఆటలో మరింత రాటు దేలడం ఖాయం.’ అని చెప్పుకొచ్చారు.ఐపీఎల్ 19వ సీజన్లో వైభవ్ సూర్యవంశీ 400 పరుగుల మార్క్ను చేరుకున్నాడు. అయితే ఈ మార్క్ను అందుకునేందుకు వైభవ్కు అవసరమైన బంతులు కేవలం 167 మాత్రమే. ఈ నేపథ్యంలో పరుగుల పరంగా అతి తక్కువ బంతుల్లో 400 పరుగుల మార్క్ చేరుకున్న వేగవంతమైన ఆటగాడిగా వైభవ్ గుర్తింపు సాధించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆండ్రీ రసెల్ పేరిట ఉంది. 2019 సీజన్లో రసెల్ 188 బంతుల్లో 400 పరుగుల మార్క్ను అందుకున్నాడు. 2024 సీజన్లో అభిషేక్ శర్మ (195 బంతులు), 2025 సీజన్లో నికోలస్ పూరన్ (197 బంతులు), 2014 సీజన్లో మ్యాక్స్వెల్ (200 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.𝘉𝘢𝘵 𝘱𝘦 𝘈𝘐 𝘤𝘩𝘪𝘱 𝘩𝘢𝘪 𝘬𝘺𝘢 𝘵𝘶𝘮𝘩𝘢𝘳𝘦?Vaibhav answers 😂💗 pic.twitter.com/uZcqABbaGS— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2026చదవండి: ‘వైభవ్పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’ -
రోహిత్ ఆడడంపై ముంబై క్లారిటీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఆ జట్టు ఆడిన చివరి మూడు మ్యాచ్లకు డగౌట్కే పరిమితమయ్యాడు. అయితే ముంబై ఇండియన్స్ ఇవాళ ఎస్ఆర్హెచ్తో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్లోనైనా రోహిత్ బరిలోకి దిగుతాడా లేడా అన్నది అనుమానమే. తాజాగా ఈ విషయమై ముంబై ఇండియన్స్ స్పష్టత ఇచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని ముంబై యాజమాన్యం పేర్కొంది. అయితే ఎస్ఆ ర్హెచ్తో మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ నెట్స్లో ప్రాక్టీస్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు రోహిత్ కచ్చితంగా అందుబాటులో ఉంటాడని ముంబై అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ముంబై యాజమాన్యం మాత్రం రోహిత్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదనిపిస్తోంది. రోహిత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆడించాలని భావిస్తోంది. ఈరోజు ఉదయం వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్కు హాజరైన రోహిత్ శర్మ బ్యాటింగ్ జోలికి పోలేదు. వార్మప్, రన్నింగ్ అనంతరం కాసేపు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ సపోర్ట్ స్టాఫ్తో కాసేపు ముచ్చటించి మైదానం వీడాడు. ఏప్రిల్ 12న ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ సమయంలో రోహిత్కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఫిజియో మైదానంలోనే హిట్మ్యాన్కు ట్రీట్మెంట్ చేసినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో మరుసటి ఓవర్లోనే రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రోహిత్ మరోసారి బ్యాటింగ్కు రాలేదు. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్లాడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ మాత్రం మధ్యలో పరాజయాలు చవిచూసినా వరుసగా నాలుగు విజయాలు సాధించి జోరు కనబరుస్తోంది. 8 మ్యాచ్ల్లో 5 విజయాలు, ఒక ఓటమితో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.చదవండి: సోదరి ఓటమి.. జడేజా ఇంట మరోసారి విభేదాలు! -
సోదరి ఓటమి.. జడేజా ఇంట మరోసారి విభేదాలు!
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం జామ్నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రివాబా విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె వదిన, జడేజా సోదరి నైనాబా తాజాగా గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో జడేజా ఇంట మరోసారి రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. విషయంలోకి వెళితే.. ఇటీవల రాజ్కోట్కు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. నైనాబా జడేజా రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్లోని వార్డ్ నెం-2 నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. మంగళవారం మున్సి పల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో నైనాబా మరోసారి పరాజయం పాలయ్యారు. అయితే ఆమె ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, జడేజా జీవితంలో నైనాబాది కీలక పాత్ర అని చెప్పొచ్చు. జడేజా క్రికెట్ విజయ ప్రస్థానంలో నైనాబా ముఖ్యపాత్ర పోషించినట్లు జడ్డూ చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. ఇటీవలే మంత్రి హోదాలో రివాబా రాజ్కోట్ సందర్శనకు వచ్చినప్పుడు కూడా నైనాబా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడడం కనిపించింది.గతంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమయంలోనూ రివాబా జడేజా, నైనాబా జడేజా ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. అప్పట్లో జడేజా భార్య రివాబా జడేజాను జామ్నగర్ నార్త్ స్థానం నుంచి బీజేపీ ఎన్నికల బరిలో దించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ వెంటనే జడేజా సోదరి నైనాబాను స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చి జామ్నగర్లో ప్రచారానికి పంపింది. అయితే ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా వదిన నైనాబాపై విజయం సాధించింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ మరోసారి నైనాబా ఓటమి పాలవ్వడంతో మంత్రిగా ఉన్న రివాబా తన వదినపై రాజకీయంగా ఆధిక్యతను మరోసారి కొనసాగించింది. ఇక రవీంద్ర జడేజా ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సీజన్కు ముందు ట్రేడింగ్లో చెన్నై సూపర్కింగ్స్ నుంచి రాజస్తాన్ రాయల్స్కు మారిన జడేజా ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 132 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీశాడు.చదవండి: ‘వైభవ్తో పోల్చద్దు’.. జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు! -
ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. మంగళవారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్కు చుక్కలు చూపించిన వైభవ్.. తాజాగా అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్ వంటి స్పీడ్ స్టార్లను ఉతికారేశాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 43 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో వైభవ్ మరో సిక్స్ కొట్టి ఉంటే ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకునేవాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించేందుకు వైభవ్ అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 511 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 99 సిక్సర్లు బాదాడు.మరో సిక్సర్ బాదితో ఈ చారిత్రత్మక రికార్డు అతడి సొంతం అవుతుంది. ప్రస్తుతం ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం కిరాన్ పొలార్డ్(843 బంతులు) ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్లో మే1న జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో పొలార్డ్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేసే అవకాశముంది.కాగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యంత వేగంగా 400 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు. వైభవ్ ఈ ఫీట్ను కేవలం 167 బంతుల్లో మాత్రమే సాధించాడు.చదవండి: IND vs AFG: సంజూ, కిషన్లకు పోటీ.. టీమిండియా వైపు దూసుకొస్తున్న సరికొత్త ప్లేయర్ -
వైభవ్ సూర్యవంశీపై విద్వేష విషం.. వీడియో వైరల్
వైభవ్ సూర్యవంశీ.. గతేడాది కాలంగా భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న పేరు. దేశీ క్రికెట్, భారత్ అండర్-19 జట్టు తరఫున అదరగొట్టిన ఈ బిహారీ పిల్లాడు.. ఐపీఎల్-2026లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు.గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్లు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా రాణించిన వైభవ్.. అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లోనూ దుమ్ములేపాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.36 బంతుల్లోనే శతకంఇక తాజాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున మరోసారి అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్పై 36 బంతుల్లోనే శతకం సాధించాడు. తాజాగా మంగళవారం నాటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.ఆరెంజ్ క్యాప్తద్వారా ఈ సీజన్లో ఇప్పటికి ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు వైభవ్. తద్వారా అత్యధిక పరుగుల వీరులకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ చేతులు మారి ఈ లెఫ్టాండర్కు చేరింది. దీంతో మరోసారి వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.అదే సమయంలో కొంతమంది ‘అభిమానుల’ ముసుగులో వైభవ్ సూర్యవంశీని తిట్టిపోయడం ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో... టీమ్ బస్సులో వెళ్తున్న సమయంలో వైభవ్ ఇయర్ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నట్లు కనిపిస్తోంది.విద్వేష విషంఆ సమయంలో కొంతమంది బస్సు బయట నిల్చుని వైభవ్ను ఫొటోలు, వీడియోలు తీయాలని అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే, వైభవ్ మాత్రం వారి వైపు చూడకుండా తన పనిలో తాను మునిగిపోయాడు. దీంతో.. ‘‘చాలా ఎక్కువైంది. ఒక్కసారైనా చూడవచ్చు కదా! ఇంత ఓవరాక్షన్ ఎందుకు?’’ అంటూ వైభవ్పై విద్వేష విషం చిమ్మారు.Shameless how grown men are mocking a 15-year-old for 'attitude.' He’s just a kid trying to process the pressure of being a professional athlete. Let him breathe.💔 pic.twitter.com/HrDY6uY33D— CSK Xtra (@Im_Kushall) April 28, 2026సిగ్గులేకుండా..అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు వైభవ్ సూర్యవంశీకి మద్దతుగా నిలుస్తూ.. అక్కడున్న వాళ్లపై మండిపడుతున్నారు. ‘‘సిగ్గులేకుండా పదిహేనేళ్ల పిల్లాడిపై ఈ ‘పెద్ద మనుషులు’ విషం చిమ్ముతున్నారు. ఆటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ పిల్లాడిని ఆడిపోసుకుంటూ వెక్కిరిస్తున్నారు.ప్రపంచంలోనే భారీ క్రేజ్ ఉన్న ఐపీఎల్లో ఈ పిల్లాడు ఆడుతున్నాడు. వరల్డ్క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటూ చితక్కొడుతున్నాడు. ఆ ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో కాస్త సేద తీరితే.. తమవైపు చూడలేదంటూ ఇంతకు దిగజారుతారా? మీకిదో వ్యసనంగా మారింది. పాపం పిల్లాడిని కాస్త ఊపిరిపీల్చుకోనివ్వండి’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్ -
‘వైభవ్తో పోల్చద్దు’.. జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్కు రాజస్తాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. పంజాబ్ విధించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభమివ్వగా.. ఆఖర్లో శుభమ్ దూబే, డొనొవన్ ఫెరీరాలు దూకుడుగా ఆడి రాజస్తాన్ను గెలిపించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ను వైభవ్ సూర్యవంశీకి అందించాడు. ఈ సందర్భంగా జైస్వాల్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం తనకు సంతోషాన్నిస్తుందని చెప్పాడు. జైస్వాల్ మాట్లాడుతూ.. ‘నేను వయసులో పెద్దోడిని ఎంతమాత్రం కాదు. ఎందుకంటే నేనింకా చిన్నవాడినే. ఇక నా సహచర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో నన్ను పోల్చద్దు. వయసులో అతడు నాకంటే ఇంకా చిన్నవాడు. కాబట్టి అతడితో నన్ను పోలిస్తే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కానీ ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. అతను బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న నేను అలా చూస్తూ ఉండిపోతున్నా. వైభవ్లో ఉన్న ప్రతిభ అసాధారణం.’ అని తెలిపాడు. కాగా జైస్వాల్ వయసు 24 ఏండ్లు కాగా.. వైభవ్ సూర్యవంశీకి 15 ఏండ్లు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మ్యాచ్ గెలవడంపై కూడా జైస్వాల్ స్పందించాడు. ‘ఇది హై-స్కోరింగ్ గ్రౌండ్ అని మాకు తెలుసు. అందుకే ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. బంతులను అస్సలు వదలకూడదనే స్పష్టమైన ఆలోచనతో బరిలోకి దిగాం. 200 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఆ 'ఇంటెంట్' చాలా ముఖ్యం. అందరూ ప్రతి మ్యాచ్లో రాణించాలంటే కుదరదు. కానీ తమ జట్టులో ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంది. మేమంతా ఆ విషయంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాం. దానిని ఆచరణలో పెడితే సరైన సమయంలో ఫలితాలు వస్తాయని భావించాం. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం ఉంది. మేమంతా కలిసి ఈ ఆటను ఆస్వాదిస్తున్నాం.’ అని చెప్పుకొచ్చాడు.ఇక సీజన్లో జైస్వాల్ 9 మ్యాచ్ల్లో 306 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థశతకాలు ఉన్నాయి. ఇక సీజన్ ఆరంభం నుంచి బ్యాటింగ్లో చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీ 9 మ్యాచ్ల్లో 400 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అతడి ఖాతాలో ఒక సెంచరీ సహా రెండు హాఫ్ సెంచరీలున్నాయి. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.The duo that is fun to watch on the pitch and even off it 😄 💪🎥 Hear from Yashasvi Jaiswal on how it is batting with Vaibhav Sooryavanshi 🩷🤝#TATAIPL | #KhelBindaas | #PBKSvRR | @rajasthanroyals pic.twitter.com/HICh8l5VIc— IndianPremierLeague (@IPL) April 28, 2026చదవండి: చిక్కుల్లో ఆర్సీబీ బౌలర్.. ఎందుకంటే? -
చిక్కుల్లో ఆర్సీబీ బౌలర్.. ఎందుకంటే?
ఐపీఎల్ 2026 సీజన్ రెండో ఫేజ్ మ్యాచ్లు మొదలయ్యాయి. తొలి సగం ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్లో నిలవగా.. వరుస పరాజయాలతో లక్నో సూపర్జెయింట్స్ ఆఖరి స్థానానికి పరిమితమైంది. సీజన్ ఆరంభం నుంచి పంజాబ్, ఆర్సీబీ, రాజస్తాన్, ఎస్ఆర్హెచ్ విజయాలతో వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి.మరి రెండో సగం కూడా పూర్తయ్యేసరికి ఈ జట్లే టాప్-4లో ఉంటాయా లేక ఏమైనా మార్పులు ఉంటాయా అంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. ఇదిలా ఉంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ ఐపీఎల్ 19వ సీజన్కు సంబంధించి బెస్ట్ స్టేడియాల జాబితా (ఒకటి నుంచి పది వరకు)ను ఎక్స్ వేదికగా విడుదల చేశాడు. ఆర్సీబీకి ఆడుతున్న హాజిల్వుడ్ తన హోంగ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి నంబర్వన్ స్థానాన్ని ఇచ్చాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియానికి మాత్రం హాజిల్వుడ్ 10వ స్థానం కేటాయించడం అతడిని చిక్కుల్లో పడేసినట్లయింది. తాను చెన్నై గ్రౌండ్లో ఆడటాన్ని ఆస్వాదించలేకపోయానని, అక్కడ వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఆఖరి స్థానం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. హాజిల్వుడ్ ఇలా తమ హోంగ్రౌండ్కు ఆఖరి స్థానం ఇవ్వడంపై సీఎస్కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 'నచ్చకపోతే వదిలేయాలి అంతేకాని ఇలా చెన్నై స్టేడియాన్ని అవమానించేలా ర్యాంక్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం' అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మన సన్రైజర్స్ హైదరాబాద్ హొంగ్రౌండ్ అయిన ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి హాజిల్వుడ్ ఏడో ర్యాంక్ కేటాయించాడు.హాజిల్వుడ్ టాప్-10 స్టేడియాలు..1. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు2. నరేంద్రమోదీ స్టేడియం, అహ్మదాబాద్3. వాంఖడే స్టేడియం, ముంబై4. హెచ్పీసీఏ స్టేడియం, ధర్మశాల5. పీసీఏ స్టేడియం, మొహలీ6. ఈడెన్ గార్డెన్స్, కోల్కతా7. రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్8. ఎక్నా స్టేడియం, లక్నో9. అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ10. ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నైఐపీఎల్ 19వ సీజన్లో జోష్ హాజిల్వుడ్ ఆర్సీబీకి కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 12 పరుగులిచ్చిన 4 వికెట్లు తీసిన హాజిల్వుడ్ ఐపీఎల్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. మొత్తంగా ఐపీఎల్లో హాజిల్వుడ్ 44 మ్యాచ్లాడి 65 వికెట్లు పడగొట్టాడు. మూడుసార్లు నాలుగు వికెట్ల హాల్ అందుకున్నాడు. సీజన్లో ఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్ను గురువారం గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది.Hazlewood rankings Indian Stadiums: Chinnaswamy is No. 1 ❤️Ahmedabad has to be right up there 🙏Meanwhile, Chennai too hot for me so no. 10 😂 pic.twitter.com/J0VaPtbY5B— Aditya Saha (@Adityakrsaha) April 29, 2026చదవండి: ‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు! -
టీమిండియాకు సెలక్ట్ చేయమని అడగట్లేదు.. కానీ
భారత టీ20 జట్టులో స్థానం కోసం పోటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఈ రేసులో ముందు వరుసలో ఉండగా.. దేవదత్ పడిక్కల్, ఆకిబ్ నబీ, ప్రియాన్ష్ ఆర్య, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ పేర్లు కూడా తరచుగా వినిపిస్తున్నాయి.చివరగా అపుడేఅయితే, వీరందరి కంటే అర్హుడైన ఆటగాడు మరొకడు ఉన్నాడని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అంటున్నాడు. గత మూడేళ్లుగా మెరుగ్గా రాణిస్తున్నా అతడిని సెలక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా నిలిచిన భారత జట్టుతో ప్రయాణించాడు జైసూ. ఆ తర్వాత శ్రీలంకతో జూలైలో జరిగిన సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున చివరి టీ20 ఆడాడు. ఇక ఐపీఎల్లో మాత్రం రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా జైస్వాల్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజాగా పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో.. 27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు యశస్వి జైస్వాల్. పంజాబ్పై రాజస్తాన్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.టీమిండియాకు సెలక్ట్ చేయమని అడగట్లేదు.. కానీ‘‘గత మూడేళ్లుగా అతడి గణాంకాలు పరిశీలించండి. 2024లో వరల్డ్కప్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ఆ తర్వాత జట్టు నుంచి తప్పించేశారు. ప్రతి ఆటగాడి కెరీర్లో ఇలాంటివి సహజమే.అయితే, యశస్వి గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. అతడిని కచ్చితంగా భారత టీ20 జట్టుకు ఎంపిక చేయాలని నేను అనడం లేదు. జట్టులో ఇప్పుడు చోటు ఖాళీగా లేదని నాకు కూడా తెలుసు.సెలక్షన్ సంగతి పక్కనపెడితే..కానీ ఇక్కడ ఓ విషయం గమనించాల్సి ఉంది. గత మూడేళ్లుగా అతడు ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నాడు. సగటు, స్ట్రైక్రేటు కూడా బాగుంది. తన పనిని తాను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. అయినా సరే సెలక్షన్ సంగతి పక్కనపెడితే.. కనీసం చర్చల్లో కూడా ఎవరూ అతడి పేరు తీసుకురావడం లేదు.గంజిలో ఈగ లాగా తీసిపారేశారు. అతడు చేసిన తప్పేంటి?’’ అని ఆకాశ్ చోప్రా టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. కాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్లు ఆడిన జైస్వాల్ 306 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గతేడాది 14 మ్యాచ్లలో కలిపి 559.. అదే విధంగా 2024లో 16 మ్యాచ్లలో కలిపి 435 పరుగులు సాధించాడు యశస్వి జైస్వాల్. చదవండి: బాబర్ ఆజం ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర -
సంజూ, కిషన్లకు పోటీ.. టీమిండియా వైపు దూసుకొస్తున్న సరికొత్త ప్లేయర్
ప్రస్తుత భారత టీ20 జట్టులో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో అద్బుతమైన ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లోనూ వీరిద్దరూ సత్తాచాటారు. అయితే వీరికి పోటీగా ఇప్పుడు మరో వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియా వైపు దూసుకొస్తున్నాడు. అతడే పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్సిమ్రాన్ సింగ్. ఐపీఎల్-2026లో ప్రభ్సిమ్రాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఓపెనర్గా పంజాబ్ కింగ్స్కు అతడు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. ప్రభ్సిమ్రాన్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 57.67 సగటుతో 346 పరుగులు సాధించాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. మంగళవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లోనూ అతడు హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రభుసిమ్రాన్ తన ప్రదర్శనలతో నిలకడగా మారుపేరుగా మారాడు. గత సీజన్లోనూ అతడు సత్తాచాటాడు. ఐపీఎల్లో మాత్రమే కాకుండా దేశవాళీ టోర్నీల్లోనూ ప్రభుసిమ్రాన్ అదరగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పంజాబ్ తరపున 9 వన్డే మ్యాచ్ల్లో 55.38 సగటుతో 443 పరుగులు చేశాడు. అదేవిధంగా ఆస్ట్రేలియా-ఏతో జరిగిన వన్డే సిరీస్లో భారత్-ఎ తరపున 102 (68 బంతుల్లో) మెరుపు సెంచరీతో చెలరేగాడు. అప్పటిలోనే అతడిని సీనియర్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.సంజూ, కిషన్ స్ధానాలకు ఎసరు!ప్రభుసిమ్రాన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తుండడంతో అతడిని భారత జట్టు ఎంపిక చేయాలన్న వాదన మరోసారి వినిపిస్తోంది. అయితే టీ20 జట్టులో సంజూ శాంసన్, కిషన్ ఉండడంతో అతడికి చోటు దక్కే అవకాశం లేదు. కానీ వీరిద్దరిలో ఎవరైన విఫలమైతే కచ్చితంగా బ్యాకప్గా ప్రభ్సిమ్రాన్ ఉంటాడు. కాబట్టి వారిద్దరూ ప్రభ్సిమ్రాన్ను దృష్టిలో పెట్టుకుని ఆడాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా వారు జట్టులో చోటు కోల్పోక తప్పదు. అయితే ఈ ఏడాది జూన్లో అఫ్గానిస్తాన్తో జరిగే వన్డే సిరీస్కు ప్రభ్సిమ్రాన్ ఎంపికయ్యే అవకాశముంది. ఈ సిరీస్కు రెగ్యులర్ వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభ్సిమ్రాన్ను వికెట్ కీపర్గా ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. అతడితో యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్లు కూడా అఫ్గాన్తో వన్డేల్లో ఆడనున్నట్లు సమాచారం.చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్.. ? వారికి లక్కీ ఛాన్స్? -
తొలి ఓటమితో తడబడిన పంజాబ్ కింగ్స్.. దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్..
-
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ ధనాధన్ లీగ్లో భాగంగా మంగళవారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను వైభవ్ ఉతికారేశాడు. ఈ బిహార్ కుర్రాడు కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్తో ప్రస్తుత సీజన్లో వైభవ్ 400 పరుగుల మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్ సరికొత్త చరిత్ర👉ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యంత వేగంగా 400 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు. వైభవ్ ఈ ఫీట్ను కేవలం 167 బంతుల్లో మాత్రమే సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కోల్కతా నైట్రైడర్స్ దిగ్గంజ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. 2019 సీజన్లో రస్సెల్ 188 బంతుల్లో 400 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్తో రస్సెల్ను వైభవ్ అధిగమించాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.👉అదేవిధంగా ఒకే సీజన్లో 400 పైగా పరుగులు చేసిన అత్యంత పిన్నవయష్కిడిగా తిలక్ వర్మ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. తిలక్ 20 ఏళ్ల వయస్సులో ముంబై ఇండియన్స్ తరపున 2023 సీజన్లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.👉అలాగే ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో వైభవ్ ఇప్పటికే 37 సిక్సర్లతో రిషబ్ పంత్తో కలిసి సంయుక్తంగా ఐదవ స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ (42), శ్రేయాస్ అయ్యర్ (39) అగ్రస్థానాల్లో ఉన్నారు.ఇక ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 238.10 స్ట్రైక్ రేటుతో 400 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ వైభవ్ వద్దే ఉంది.చదవండి: IPL 2026: జైలుకు రియాన్ పరాగ్? -
అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్కు తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ పరాజయం పాలైంది. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఈ కొండంత లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో ఊదిపడేసింది.రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (51), డోనోవన్ ఫెరీరా ( 26 బంతుల్లో 52*), వైభవ్ సూర్యవంశీ(43), శుభమ్ దూబే(12 బంతుల్లో 31) అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు. తమకు ఎదురైన తొలి పరాజయంపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని అయ్యర్ చెప్పుకొచ్చాడు."ఈ వికెట్పై 222 పరుగులు చేయడం చాలా గొప్ప విషయం. పిచ్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికి మా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కచ్చితంగా వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అయినప్పటికి ఈ భారీ స్కోర్ను డిఫెండ్ చేసుకోలేకపోవడం నిరాశ కలిగించింది. బౌలింగ్లో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. మేము ఎక్కువగా స్లో బాల్స్, యార్కర్లు వేయాలని ప్లాన్ చేసుకున్నాం.కానీ మేము అనుకున్నది చేయలేకపోయాము. మిడిల్ ఓవర్లలో రాజస్తాన్ బ్యాటర్లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా ఫెరీరా, శుభమ్ దుబే చివరి ఓవర్లలో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వారిద్దరి మధ్య నెలకొన్ని భాగస్వామ్యమే మ్యాచ్ను మా నుంచి దూరం చేసింది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో బ్యాటర్లు మొదటి బంతి నుంచే విరుచుకుపడుతున్నారు.కాబట్టి బౌలర్లు పక్కా ప్లాన్తో రావడం కష్టమైన పని. ఈ రోజు మాకు బౌలింగ్లో కలిసిరాలేదు అంతే. ఇక నిరంతర ప్రయాణాలు, మ్యాచ్ల వల్ల మేము కాస్త అలిసిపోయాము. కానీ దాన్ని సాకుగా చెప్పలేము. మా తదుపరి మ్యాచ్కు కాస్త విరామం దొరికింది. మళ్లీ మా ప్రణాళికలు సిద్దం చేసుకుని బలంగా తిరిగి వస్తాం.ఈ సీజన్లో మాకు ఇది తొలి ఓటమి. ఈ ఓటమి నుచి చాలా పాఠాలు నేర్చుకున్నాము. మేము ఇప్పటికే 200 పరుగులకు పైగా ఛేజ్ చేశాం, అదే టార్గెట్ను డిఫెండ్ కూడా చేశాం. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితం గురుంచి పెద్దగా ఆలోచించం. అదేవిధంగా ఈ మ్యాచ్లో మా స్పిన్నర్లు హర్ప్రీత్ బ్రార్, చాహల్ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హర్ప్రీత్కు ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. అయినప్పటికి అతడు తన 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి మా టీమ్లో బెస్ట్ బౌలర్గా నిలిచాడు"అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో అయ్యర్ పేర్కొన్నాడు. పంజాబ్ తమ తదుపరి మ్యాచ్లో మే 3న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది.చదవండి: IPL 2026: జైలుకు రియాన్ పరాగ్? -
జైలుకు రియాన్ పరాగ్?
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో వేపింగ్ (ఇ-సిగరెట్ తాగడం) చేస్తూ టీవీ కెమెరాలకు చిక్కాడు. ప్రస్తుతం ఇది పెను సంచలనంగా మారింది. సాధరణంగా డ్రెస్సింగ్ రూమ్, స్టేడియం ఆవరణలో ధూమపానం చేయడం నిషిద్ధం. అంతేకాకుండా 2019 నుంచి భారత్లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల విక్రయం, వాడకంపైనా నిషేదం ఉంది. 'ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం' ప్రకారం.. మొదటిసారి తప్పు చేస్తే ఒక ఏడాది జైలు శిక్ష లేదా లక్ష వరకు జరిమానా విధించే అవకాశముంది.కొన్ని సందర్భాల్లో కేవలం జైలు శిక్ష మాత్రమే విధించవచ్చు. కాగా ఇప్పుడు అతడు ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో నిబంధనలను ఉల్లఘించినందుకు బీసీసీఐ కూడా కఠిన చర్యలు తీసుకోనుంది. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు బీసీసీఐ అతడిపై మ్యాచ్ల నిషేధంతో పాటు భారీ జరిమానా విధించే అవకాశముందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరాగ్ ఇ-సిగరెట్ వాడకంకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఒక జట్టుకు కెప్టెన్గా ఉండి, ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన చూపడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజస్తాన్ ఘన విజయంఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్కు రాజస్తాన్ ఓటమి రుచిని చూపించింది. పంజాబ్పై 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో ఊదిపడేసింది.రాజస్తాన్ విజయంలో (51), డోనోవన్ ఫెరీరా (52*) కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 222/4 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (59), మార్కస్ స్టోయినిస్ (62*) రాణించారు.చదవండి: ఫెరియెరా ఊచకోత.. పంజాబ్కు ఓటమి రుచి చూపించిన రాజస్థాన్Riyan parag was caught vaping in dressing room ,how it's allowed inside dressing room bcci whats happening pic.twitter.com/BsYHuunBuj— cherry_gems (@Introvert2core) April 28, 2026 Mann did anyone of you noticed this? Parag was caught vaping during the match between RR and PBKS pic.twitter.com/MXuEipsD0O— U' (@toxifyxe) April 28, 2026 -
ఫెరియెరా ఊచకోత.. పంజాబ్కు ఓటమి రుచి చూపించిన రాజస్థాన్
ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతూ, ఏకైక అజేయ జట్టుగా చలామణి అవుతున్న పంజాబ్ కింగ్స్కు రాజస్థాన్ రాయల్స్ ఓటమి రుచి చూపించింది. సొంతగడ్డ ముల్లాన్పూర్ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్లో పంజాబ్పై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో స్టోయినిస్ (22 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా బ్రిజేష్ శర్మ వేసిన చివరి ఓవర్లో స్టోయినిస్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఆ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4, 4 సాధించాడు. అంతకుముందు ప్రభ్సిమ్రన్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా పంజాబ్ ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్య (29), కూపర్ కన్నోల్లీ (30), శ్రేయస్ అయ్యర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్ బౌలర్లలో యశ్ రాజ్ పుంజా 2, ఆర్చర్, బర్గర్ తలో వికెట్ తీశారు.అనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. డొనోవన్ ఫెరియెరా (52 నాటౌట్), షుభమ్ దూబే (31 నాటౌట్) ఊచకోత కోసి రాయల్స్ను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు యశస్వి జైస్వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43) తమ సహజశైలిలో రెచ్చిపోయి రాయల్స్ గెలుపుకు గట్టి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన ధృవ్ జురెల్ (16) కాస్త తడబడినప్పటికీ.. అతని తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (29) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. ఇతని తర్వాత క్రీజ్లో కుదురుకున్న ఫెరియెరా, షుభమ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. పంజాబ్ బౌలర్లలో చహల్ 3, అర్షదీప్ ఓ వికెట్ తీశారు. -
పంజాబ్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్ ధరించడం వెనుక హృదయ విదారక కారణం
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 28) రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు నల్లటి ఆర్మ్ బ్యాండ్స్ ధరించి కనిపించారు. దీని వెనుక హృదయ విదారక కారణం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నిన్న తన తల్లిని కోల్పోయారు.ఇందుకు సంతాపంగా పంజాబ్ కింగ్స్ బృంద సభ్యులు మొత్తం నల్ల బ్యాండ్లు ధరించారు. ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒమర్జాయ్ తల్లి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పంజాబ్ కింగ్స్ తమ సోషల్మీడియా ఖాతాల్లో కూడా పోస్ట్ చేసింది."అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి మరణం పట్ల మా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ కింగ్స్ కుటుంబం మొత్తం అతనితో పాటు అతని కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది" అని పేర్కొంది.ఒమర్జాయ్ తన తల్లి అంత్యక్రియల నిమిత్తం స్వదేశానికి వెళ్లాడు. జట్టు కూర్పు సమస్యల కారణంగా ఒమర్జాయ్కు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. గత సీజన్లో పంజాబ్ తరఫున అతడు కొన్ని కీలక ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా బౌలింగ్లో తనదైన ముద్ర వేశాడు.ఒమర్జాయ్ ఐపీఎల్ ప్రయాణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగలేదు. 2024లో గుజరాత్ టైటాన్స్ తరఫున అరంగేట్రం చేసిన అతడు, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్లో చేరాడు.ఇదిలా ఉంటే, ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ 18 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ (59), ప్రియాంశ్ ఆర్య (29), కూపర్ కన్నోల్లీ (30), శ్రేయస్ అయ్యర్ (30) ఔట్ కాగా.. స్టోయినిస్ (24), సూర్యంశ్ (0) క్రీజ్లో ఉన్నారు. ఈ సీజన్లో పంజాబ్ అజేయ జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ప్రీతి జింటా దిమ్మతిరిగే కౌంటర్.. షాక్లో చాహల్!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ క్యాంపులో ప్రస్తుతం సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆ జట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉండటంతో, యజ్వేంద్ర చాహల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రీతి జింటాను ఉద్దేశించి సరదాగా పోస్టు పెట్టాడు. ‘మేడమ్.. నాకు ఒక మ్యాచ్లో ఓపెనర్గా బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తారా?’ అని సరదాగా అడిగాడు. దీనికి ప్రీతి జింటా తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘తప్పకుండా చాహల్.. నీ కోసం ఏదైనా చేస్తాను. ఐపీఎల్ ముగిసిన తర్వాత నీకు నచ్చిన మ్యాచ్లో ఓపెనింగ్ చేయొచ్చు. అప్పుడు ప్రబ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య కూడా ఏమీ అనుకోరని నాకు తెలుసు’ అంటూ లాఫింగ్ ఎమోజీ జత చేస్తూనే తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వడంతో చాహల్ షాక్ తినక తప్పలేదు.ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసిన పంజాబ్ పలు రికార్డులు తన పేరిట లిఖించింది. ఇప్పటికే పట్టికలో టాప్ స్థానంలో కొనసా గుతున్న పంజాబ్ ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే ప్లేఆఫ్స్కు చేరే తొలి జట్టుగా కూడా నిలవనుంది. గతేడాది ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్కే పరిమితమైన పంజాబ్ ఈసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది.Mam ek match mein open batting karne ka chance mil jaaye toh 🥹🤣🤣😁 #pzchat— Yuzvendra Chahal (@yuzi_chahal) April 27, 2026చదవండి: వైరల్గా మారిన జితేశ్ శర్మ చర్య! -
పంజాబ్పై రాజస్థాన్ గెలుపు
పంజాబ్పై రాజస్థాన్ గెలుపుఅనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. డొనోవన్ ఫెరియెరా (52 నాటౌట్), షుభమ్ దూబే (31 నాటౌట్) ఊచకోత కోసి రాయల్స్ను విజయతీరాలకు చేర్చారు. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్13.6వ ఓవర్- 151 పరుగుల వద్ద రాజస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో షెడ్గేకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (29) ఔటయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్11.2వ ఓవర్- 123 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో షెడ్గేకు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ (51) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్9.4వ ఓవర్- 105 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి జురెల్ (16) ఔటయ్యాడు. వైభవ్ సూర్యవంశీ ఔట్3.2వ ఓవర్- 51 పరుగుల వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో వైభవ్ సూర్యవంశీ (43) ఔటయ్యాడు.పంజాబ్ భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోర్ (222-4) చేసింది. ఆఖర్లో స్టోయినిస్ (22 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా బ్రిజేష్ శర్మ వేసిన చివరి ఓవర్లో స్టోయినిస్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఆ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4, 4 సాధించాడు. అంతకుముందు ప్రభ్సిమ్రన్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా పంజాబ్ ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్య (29), కూపర్ కన్నోల్లీ (30), శ్రేయస్ అయ్యర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్ బౌలర్లలో యశ్ రాజ్ పుంజా 2, ఆర్చర్, బర్గర్ తలో వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్17.6వ ఓవర్- 181 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. బర్గర్ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (30) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్13.6వ ఓవర్- 144 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. రాజ్ పుంజా బౌలింగ్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి ప్రభ్సిమ్రన్ (59) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్8.2వ ఓవర్- 96 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. యశ్ పుంజా బౌలింగ్లో ఫెరియెరాకు క్యాచ్ ఇచ్చి కూపర్ కన్నోల్లీ (30) ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత 80-17 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 80-1గా ఉంది. ప్రభ్సిమ్రన్ 27, కూపర్ కన్నోల్లీ 19 పరుగులతో అజేయంగా ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్2.5వ ఓవర్- క్రీజ్లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన ప్రియాంశ్ ఆర్మ (29) ఆర్చర్ బౌలింగ్లో బర్గర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 28) జరుగనున్న 40వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. పంజాబ్ హోం గ్రౌండ్ అయిన ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ప్రస్తుత ఎడిషన్లో ఏకైక అజేయ జట్టుగా కొనసాగుతున్న పంజాబ్ (7 మ్యాచ్ల్లో 6 విజయాలు, వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్ 8 మ్యాచ్ల్లో 5 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. హెట్మైర్ స్థానంలో షనక, రవి బిష్ణోయ్ స్థానంలో యశ్ రాజ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్ కూడా ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. సూర్యంశ్ షెడ్గే, లోకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజాపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), కూపర్ కొన్నోలీ, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ -
వైరల్గా మారిన జితేశ్ శర్మ చర్య!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కనబరుస్తోంది. సీజన్లో 8 మ్యాచ్లాడిన ఆర్సీబీ 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సమయంలో స్టాండ్స్లో ఉన్న ఒక ప్రేక్షకుడి చేతిలో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి జెండా గాలిలో ఎగురుకుంటూ మైదానంలోకి వచ్చింది. దీనిని గమనించిన ఆర్సీబీ వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఆ జెండాను అందుకొని తన జేబులో పెట్టుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. హాజిల్వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్ను మే1న రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది. The way Jitesh shows respect towards DC flag he is pure soul 🥺❤️ pic.twitter.com/1nyd5XpPN3— Ankur (@flick_class) April 28, 2026చదవండి: ‘కేఎల్ రాహుల్పై విషం చిమ్మడం ఆపండి!’ -
‘కేఎల్ రాహుల్పై విషం చిమ్మడం ఆపండి!’
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్కు ముందు కేఎల్ రాహుల్ విధ్వసంకర సెంచరీతో పంజాబ్పై భారీ స్కోరు చేసినప్పటికీ, ఆ మ్యాచ్ను కూడా కాపాడుకోవడంలో ఢిల్లీ క్యాపిటల్స్ విఫలమైంది. అయితే పంజాబ్తో మ్యాచ్లో 152 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ ఆర్సీబీతో మ్యాచ్లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే కేఎల్ రాహుల్ స్ట్రైకింగ్ తీసుకోకుండా డెబ్యు ఆటగాడు సాహిల్ పరాక్కు చాన్స్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయితే కేఎల్ రాహుల్కు భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ అండగా నిలబడ్డాడు. ‘ఆర్సీబీతో మ్యాచ్లో కేఎల్ రాహుల్.. డెబ్యూ ఆటగాడు సాహిల్ పరాక్కు స్ట్రైక్ ఇవ్వడంపై కొంతమంది జర్నలిస్టులు విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. అయితే సాహిల్ పరాక్ టెయిలెండర్ కాదు, అతడొక బ్యాటర్. అందుకే అతడిని ఓపెనర్గా ఎంచుకున్నారు. ఈ విషయం తెలియక రాహుల్ను అకారణంగా తిడుతున్నారు. పిచ్ పరిస్థితులపై అవగాహనలేమి ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆటతీరుకు కారణమయ్యింది. కానీ కేఎల్ రాహుల్ ఏదో తప్పు చేసినట్లు అందరూ అతడిపై క్రూరత్వం ప్రదర్శించడమేంటనేది నాకు అర్థం కావడం లేదు. అతడిపై విషం చిమ్మడం ఆపండి’ అని చెప్పు కొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. హాజిల్వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్ను మే1న రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది. ఇక దొడ్డ గణేశ్ టీమిండియా తరఫున ఒక వన్డే, నాలుగు టెస్టులు ఆడాడు.Saw a couple of journalists’ tweet yesterday where they blamed KL Rahul for exposing the debutant from ball one.FYI guys, that kid is no tail ender; he’s a proper batter and that’s why he was chosen to open. Can’t understand this toxicity around KL Rahul #IPL2026— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) April 28, 2026చదవండి: భారత్కు తప్పని చైనా గండం! -
చరిత్ర సృష్టించిన సుయాశ్ శర్మ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 27) జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ ప్రత్యర్దిని 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది.ఢిల్లీని 75 పరుగులకు కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ (3-0-5-3), హాజిల్వుడ్ (3.3-0-12-4), రసిక్ సలాం దార్ (2-0-21-1), సుయాశ్ శర్మ (4-1-7-1), కృనాల్ పాండ్యా (2-0-9-1) కీలకపాత్ర పోషించారు. వీరిలో భువీ, హాజిల్వుడ్ ఆరంభంలో చెలరేగగా.. ఆతర్వాత సుయాశ్ శర్మ పేట్రేగిపోయాడు. ఈ క్రమంలో సుయాశ్ చారిత్రక ప్రదర్శన నమోదు చేశాడు.తన కోటా 4 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చిన సుయాశ్, ఓ వికెట్ కూడా పడగొట్టాడు. అంతేకాదు, తన స్పెల్లో ఏకంగా 20 డాట్ బాల్స్ వేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో సంయుక్తంగా అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్గా అతడిని నిలిపింది. ఈ ఘనతను ఇంతకుముందు దీపక్ చాహర్ సాధించాడు. చాహర్ 2019 ఎడిషన్లో సీఎస్కేకు ఆడుతూ కేకేఆర్పై ఈ చారిత్రక గణాంకాలు నమోదు చేశాడు. ఇక్కడ దీపక్ చాహర్ పేస్ బౌలర్ కాగా.. ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్గా సుయాశ్ చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి టాప-5 బౌలర్లలో సుయాశ్ ఒక్కడే స్పిన్నర్గా ఉన్నాడు.ఐపీఎల్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్లు (టాప్-5)సుయాశ్ శర్మ- 20దీపక్ చాహర్- 20ఫిడేల్ ఎడ్వర్డ్స్- 19జహీర్ ఖాన్- 19మహ్మద్ షమీ- 19కాగా, ఈ చారిత్రక ప్రదర్శనలో సుయాశ్ ఇచ్చిన 7 పరుగుల్లో 3 వైడ్ల రూపంలో వచ్చాయి. ఇవి కూడా వేయకపోయుంటే సుయాశ్ ఐపీఎల్లో అత్యంత పొదుపైన స్పెల్ వేసిన బౌలర్గానూ రికార్డుల్లోకెక్కేవాడు. ఈ మ్యాచ్లో సుయాశ్ మధ్య ఓవర్లలో పరుగులకు పూర్తిగా అడ్డుకట్ట వేశాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది.ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా.. ఢిల్లీ ఏడో స్థానానికి పడిపోయింది. ఆర్సీబీ ఏప్రిల్ 30న జరుగబోయే తమ తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. -
పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!
క్రికెట్లో విరాట్ కోహ్లికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా అతడి ఆటోగ్రాఫ్ లేదా ఫొటోల కోసం ఎగబడడం చూస్తుంటాం. ఇక ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఆడింది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ రూం వద్ద ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం బ్యాట్తో అతడి వద్దకు పరిగెత్తాడు. రెండు మూడుసార్లు ఆ పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం తెగ ప్రయత్నించినప్పటికీ అధికారులు అతడిని అడ్డుకున్నారు. కోహ్లి కూడా ఆ పిల్లాడిని పట్టించుకోలేదు. దీంతో కోహ్లి తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడన్న కోపంతో తన చేతిలోని బ్యాట్ను విసిరేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఈ ఘటన మ్యాచ్కు ముందు జరిగిందా లేక తర్వాత జరిగిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ బుడ్డోడు మాత్రం తన చర్యతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. హాజిల్వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ను ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది.Virat Kohli Little fan broke down 😭💔Virat kohli ignored this little fan who was waiting to get his autograph 😭Wait for that child frustration 😭💔 pic.twitter.com/BszA4JX5NW— Jeet (@JeetN25) April 27, 2026చదవండి: ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే? -
ధోని వల్లేనా?.. నోర్ముయ్.. ముందు నీ సంగతి చూసుకో!
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయ పరంపర కొనసాగుతోంది. సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇటీవల పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 265 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది ఢిల్లీ. తాజాగా సోమవారం నాటి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఘోర పరాభవం పాలైంది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీకి ఐపీఎల్లో ఇది మూడో అత్యల్ప స్కోరు. అభిషేక్ పొరేల్ (33 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఒక్కడే పోరాడగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.బ్యాటర్లకు చుక్కలు‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హాజల్వుడ్ (4/12), భువనేశ్వర్ కుమార్ (3/5) అద్భుత బౌలింగ్తో క్యాపిటల్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అనంతరం బెంగళూరు 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఇక ఈ మ్యాచ్లో పాతుమ్ నిస్సాంక స్థానంలో ఢిల్లీ ఓపెనర్గా అరంగేట్రం చేసిన సాహిల్ పరేఖ్కు చేదు అనుభవమే మిగిలింది.ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఢిల్లీ హెడ్కోచ్ హేమంగ్ బదానీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గురించి మాట్లాడిన బదానీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడో చూడాలని ఉందన్నాడు.నోర్ముయ్.. నీ సంగతి చూసుకో ముందు!‘‘హేయ్ హేమంగ్.. ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నీ జట్టు ఎలా ఆడుతుందో చూడు. ఆ తర్వాత వేరేవాళ్ల గురించి మాట్లాడు. ఎక్కువగా మాట్లాడేవాళ్లు పెద్ద గొప్పేమీ కాదని నేను తరచూ చెబుతూ ఉంటాను.ఎంఎస్ ధోని వల్లే అతడు గెలిచాడా?అయితే, బదానీ చాలా ఎక్కువగా మాట్లాడేస్తాడు. కానీ ఇప్పుడు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు అతడిని విమర్శిస్తున్నారు. నిజానికి నువ్వు ఇతరుల గురించి మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటే బాగుండేది. ఆరోజు స్టీఫెన్ ఫ్లెమింగ్ గురించి ఏమన్నావో గుర్తుందా? ఎంఎస్ ధోని వల్లే అతడు గెలిచాడా?మరి నువ్వేం చేశావు? ఏమీ లేదు కదా!.. అయినా పృథ్వీ షా ఉండగా.. కేఎల్ రాహుల్కు ఓపెనింగ్ జోడీగా సాహిల్ను తీసుకువస్తావా?’’ అంటూ చిక్కా మండిపడ్డాడు. కాగా క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రస్తావన ప్రకారం.. గతంలో హేమంగ్ బదానీ స్టీఫెన్ ఫ్లెమింగ్ను ఉద్దేశించి..ఫ్లెమింగ్ మంచి కోచ్ కాదు‘‘ఫ్లెమింగ్ అంత పెద్ద కోచా? అలా అయితే, ఐపీఎల్ కాకుండా ఇతర టీ20 లీగ్లలో అతడు ఎందుకు విజయవంతం కావడం లేదు? ధోని వల్లే చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తోంది. ఆ జట్టులో అంతా ధోనినే. ఫ్లెమింగ్ మంచి కోచ్ అని ఎవరైనా అంటే నేను మాత్రం అందుకు అస్సలు అంగీకరించను’’ అని అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిక్కా బదానీకి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.చదవండి: PSL: డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు! -
ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే?
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 19వ సీజన్తో బిజీగా ఉన్నప్పటికీ తన మూలాలను మాత్రం మరిచిపోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టు ఢిల్లీ వీడినప్పటికీ కోహ్లి మాత్రం తన స్వస్థలంలోనే ఉండిపోయాడు. దీనికి ఒక ప్రధాన కారణముంది. వెస్ట్ ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మకు చెందిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ (డబ్ల్యూడీసీఏ) కొత్త బ్రాంచ్ను ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవానికి కోహ్లితో పాటు అతడి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ కూడా హాజరయ్యారు. ఇది తన కోచ్ రాజ్కుమార్ శర్మ క్రికెట్ అకాడమీ కావడంతో ఆయన మీద గౌరవంతో కోహ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీలోనే ఉండిపోయాడు. అయితే కార్యక్రమంలో భాగంగా అకాడమీ స్టూడెంట్లకు కోహ్లి అవార్డులు అందజేశాడు. ఈ నేపథ్యంలో ఒక స్టూడెంట్ కోహ్లి కాళ్లను మొక్కే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి వద్దని వారించి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అకాడమీలోని స్టూడెంట్స్ను ఉద్దేశించి కోహ్లి మాట్లాడాడు. ‘నేను నా జీవితంలో చిన్న వయసులోనే క్రీడలను నా కెరీర్గా ఎంచుకున్నాను. కానీ ఏది చేసినా నిజయితీతో చేయాలనుకున్నా. అందుకే క్రికెటర్ కావాలని ధృడంగా నిర్ణయించుకున్నా. ఈ సమయంలో నా కుటుంబం, ఉపాధ్యాయుల వద్ద నిజాయితీగా ఉన్నాను. ఇక వర్ధమాన క్రికెటర్లు తమ ఆశయాల పట్ల పూర్తి నిజాయితీ, నిబద్ధతతో ఉండాల్సిన అవసరముంది. మీరు కంటున్న కలల పట్ల, ఏమి చేయాలనుకుంటున్నారనే దానిపై పూర్తి క్లారిటీగా ఉంటే మంచింది. ఆ కలను నెరవేర్చుకునేందుకు వందశాతం నిజాయితీతో కష్టపడితే ఫలితం మనల్ని వెతుక్కుంటూ వస్తోంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక అకాడమీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కోహ్లి.. అది తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నాడు. ‘నేను ఎనిమిదేళ్ల వయసులో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను, ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా అకాడమీకి వస్తూనే ఉంటాను. ఇది నా బాల్యంలోని ఒక పెద్ద భాగం, ఇక్కడ క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చే పిల్లలందరూ దీనికి విలువ ఇస్తారని నేను ఆశిస్తున్నాను’ అని అతను ముగించాడు.ఐపీఎల్ 19వ సీజన్లో విరాట్ కోహ్లి 8 మ్యాచ్లాడి 351 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 44 బంతుల్లోనే 81 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక సోమవారం ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కోహ్లి ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఢిల్లీతో మ్యాచ్లో 23 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్లో 9వేల పరుగుల మార్క్ను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 9వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.#WATCH | Delhi: Cricket star Virat Kohli inaugurated a branch of West Delhi Cricket Academy at DPS RK Puram. His childhood coach, Rajkumar Sharma was also with him. pic.twitter.com/gQumDN5om8— ANI (@ANI) April 28, 2026చదవండి: ‘ఎందుకీ డబుల్ గేమ్?’.. వినేశ్పై డబ్ల్యూఎఫ్ఐ ఆగ్రహం -
‘తుదిజట్టులో దండుగ.. అదృష్టం కోసమే అతడిని ఆడిస్తున్నారు’
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి అదరగొట్టింది. ఐపీఎల్-2026లో భాగంగా సోమవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. ఆతిథ్య జట్టును 75 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ.. వికెట్ నష్టపోయి కేవలం 39 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.భువీ, హాజిల్వుడ్ విశ్వరూపంతద్వారా ఈ సీజన్లో ఆర్సీబీ ఎనిమిదింట ఆరో విజయం నమోదు చేసింది. ఢిల్లీతో మ్యాచ్లో ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. భువీ మూడు ఓవర్లలో కేవలం ఐదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చగా.. హాజిల్వుడ్ 3.3 ఓవర్లలో 12 రన్స్ ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.రొమారియో షెఫర్డ్ మాత్రంమిగిలిన వారిలో రసిఖ్ సలామ్ ధర్, సూయశ్ శర్మ, కృనాల్ పాండ్యా (Krunal Pandya) తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఓవైపు వీళ్లంతా అదరగొడితే.. ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ మాత్రం రెండు ఓవర్లలోనే 21 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.జట్టుకు భారంగాగతేడాది ఆర్సీబీ చాంపియన్గా నిలవడంలో రొమారియో షెఫర్డ్ తన వంతు పాత్ర పోషించాడు. బ్యాట్, బంతితో రాణించి జట్టు తొలిసారి ట్రోఫీ గెలిచేందుకు సాయపడ్డాడు. కానీ ఈ సీజన్లో మాత్రం షెఫర్డ్ తేలిపోతున్నాడు. ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్ ఆడి కేవలం 39 పరుగులు చేసిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్.. కేవలం మూడు వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ రొమారియో షెఫర్డ్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అతడు దండుగ అని.. కేవలం అదృష్టంగా భావించి మాత్రమే తుదిజట్టులో చోటు ఇస్తున్నారని చిక్కా అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో చోటు దండుగఈ మేరకు.. ‘‘ఆర్సీబీ బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉంది. అయితే, అందరిలోకెళ్లా రొమారియో షెఫర్డ్ ఒక్కడే వీక్ లింక్. అసలు ఆర్సీబీ అతడిని తుదిజట్టులో ఎందుకు ఆడిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు.బహుశా అతడిని లక్కీ చార్మ్గా భావిస్తున్నట్లున్నారు. గతేడాది.. తొలిసారిగా ట్రోఫీ గెలిచినపుడు అతడు జట్టులోనే ఉన్నాడు కదా!.. కాబట్టి కేవలం అదృష్టం కోసం మాత్రమే అతడిని ఆడిస్తున్నారు. లేదంటే.. ప్లేయింగ్ ఎలెవన్లో అతడికి చోటే దండుగ’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. కాగా వెస్టిండీస్ స్టార్ రొమారియో షెఫర్డ్ను ఆర్సీబీ రూ. 1.5 కోట్లకు రిటైన్ చేసుకుంది.చదవండి: PSL: డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు! -
‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2026 సీజన్లో దుమ్మురేపుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైవిధ్యమైన ఆటతో శ్రేయస్ తన ముద్ర ఎప్పుడో వేశాడు. టీమిండియా తరఫున వన్డేల్లో నిలకడగా మారుపేరుగా నిలిచిన శ్రేయస్ టీ20ల్లో మాత్రం ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్లో మాత్రం అదే టీ20ల్లో తన కెరీర్ బెస్ట్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్కు అతనొక కెప్టెన్ మాత్రమే కాదు.. బ్యాటర్గా, ఫినిషర్గానూ సత్తా చాటుతూ అన్ని పాత్రలను సమర్థంగా పోషిస్తున్నాడు. అయితే ఈ మార్పు వెనుక తనను చికాకు పెట్టేలా కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తన మైండ్లో ఉన్నట్లు శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఆ వ్యాఖ్యలతో తనను రెచ్చగొట్టారని, జనాలు అనుకుంటున్నది తప్పు అని నిరూపించాలని నిర్ణయించుకున్నట్లు అయ్యర్ తెలిపాడు. జియో హాట్స్టార్ నిర్వహించిన బిలీవ్ కార్యక్రమానికి హాజరైన అయ్యర్ మాట్లాడాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో తనకు బలహీనత ఉందన్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఆ కసి ఎంతలా ఉందంటే, ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్ ను అద్భుతమైన సిక్సర్గా మలచి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.అయ్యర్ మాట్లాడుతూ.. ‘నీ వల్ల కాదు, ఈ పరిస్థితిలో నువ్వు రాణించలేవు అని ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. అత్యున్నత స్థాయిలో ఆడుతున్న ఒక క్రికెటర్గా దానిని ఏమాత్రం అంగీకరించలేను. అందుకే నన్ను విమర్శించే వారు తప్పు అని నిరూపించాలని బలంగా నిర్ణయించుకున్నా’ అని తెలిపాడు.ఇక వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా తనపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలపై కూడా అయ్యర్ స్పందించాడు. ‘గాయం తర్వాత అయ్యర్ మునుపటిలా ఆడలేడు అన్న మాటలు బాగా వినిపించాయి. అయితే గాయం తర్వాత మన ఆలోచనా విధానం ఎలా ఉంది అనేదే ముఖ్యమని, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటిని విస్మరించాలి అనే విషయంలో నాకు స్పష్టత ఉంది. షార్ట్ బాల్ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రవీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్ వంటి కోచ్ల సలహాలు తీసుకుంటూ కఠోరంగా శ్రమించాను. గతంలో షార్ట్ బాల్ వస్తే సింగిల్ తీయడానికో లేదా డిఫెన్స్ ఆడడానికో ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నా మైండ్సెట్ పూర్తిగా మారింది. నా జోన్లోకి షార్ట్ బాల్ వస్తే కచ్చితంగా సిక్సర్ కొట్టాలనే లక్ష్యంతో ఆడుతున్నా. దాదాపు 300లకు పైగా బంతులను ఎదుర్కొంటాను. సైడ్ ఆర్మ్ త్రోల కంటే కూడా అసలైన బౌలర్లను ఎదుర్కోవడానికే మొగ్గు చూపుతాను. బౌలర్ బంతిని వదిలే ముందే సరైన పొజిషన్లోకి రావడం (రిథమ్ను) నేర్చుకున్నాను. ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలలో కనిపించే ఆ రిథమ్ను నేను కూడా అలవర్చుకున్నాను’ అని అయ్యర్ తన నిలకడైన ఆటతీరు వెనుక ఉన్న రహస్యాలను వివరించాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, మిగిలిన ఆరు మ్యాచ్ల్లో నెగ్గి 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పంజాబ్ కింగ్స్ మొదట ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోనుంది. ఇక అయ్యర్ ఏడు మ్యాచ్ల్లో 186 స్ట్రైక్రేట్తో 279 పరుగులు సాధించాడు.చదవండి: చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు -
బాధపడుతూ కూర్చోలేదు.. తప్పులు రిపీట్ చేయను: ఇషాన్
భారత క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు దూరమైన సమయంలో తాను కుంగిపోలేదన్నాడు. అందుకు బదులు దేశవాళీ టోర్నమెంట్లలో నిలకడగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. రెండున్నరేళ్లుకాగా క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంగా బీసీసీఐ దాదాపు రెండున్నరేళ్లు ఇషాన్ను పక్కనపెట్టింది. దీంతో జాతీయ జట్టుకు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... ఆ తర్వాత దేశవాళీల్లో భారీగా పరుగులు సాధించాడు.దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్గా వ్యవహరించిన ఇషాన్... 500 పైచిలుకు పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాడు. దీంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్నకు ముందు న్యూజిలాండ్తో సిరీస్లో అతడికి అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్మెంట్. ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్రసెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ కివీస్పై సత్తా చాటిన ఇషాన్.. ఆ తర్వాత వరల్డ్కప్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు.. టీమిండియా వరుసగా రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకోవడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టుకు సారథ్యం వహించిన ఇషాన్ జట్టుకు హ్యాట్రిక్ విజయాలు అందించాడు.ఇక రాజస్తాన్ రాయల్స్తో నివారం జరిగిన మ్యాచ్లో 31 బంతుల్లో 74 పరుగులు చేసిన ఇషాన్ జట్టును గెలిపించాడు. ఇందుకు గానూ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా పునరాగమనంపై స్పందించాడు.బాధపడుతూ కూర్చుంటే ఏమీ రాదు‘నేను భారత జట్టుకు దూరంగా ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదని నాకు నేను సర్ది చెప్పుకున్నా. బాధ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. తిరిగి జట్టులో చోటు దక్కాలంటే పరుగులు సాధించడమే మార్గం. అందుకే ఆటపై దృష్టి పెట్టా. మరింత మెరుగవుతూ నిలకడగా పరుగులు సాధించడం అలవాటు చేసుకున్నా.జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో మరింత అంకితభావంతో ఆడా. ఒక సీజన్లో 300 పరుగులు చేసినా పిలుపు రాకపోతే... 400, 500 ఇలా పరుగుల సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నా. చాన్నాళ్లుగా మూడో స్థానంలో ఆడటం అలవాటైంది. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.చేసిన తప్పులు పునరావృతం కాకుండా... ఒక్కో మ్యాచ్పై దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నా’ అని ఇషాన్ కిషాన్ పేర్కొన్నాడు. ఇక 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో రెండు సెంచరీలు నమోదు చేసిన వైభవ్పై ఇషాన్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. అతడు బంతిని బాదుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నాడు.చదవండి: ఆ పోలీస్ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు! -
ఆ పోలీస్ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు!
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు ఇటీవలే వెల్లడించారు. నిజానికి మైదానంలో ఎంగిడి పరిస్థితి చూసిన అభిమానులు మాత్రం వణికిపోయారు. ప్రాణాలతో బయటపడితే చాలు దేవుడా అంటూ ప్రార్థించారు. ఐపీఎల్-2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం పంజాబ్ కింగ్స్తో తలపడ్డ సంగతి తెలిసిందే.తల బలంగా నేలకు తాకిఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ రికార్డు స్థాయిలో 264 పరుగులు చేయగా.. పంజాబ్ లక్ష్య ఛేదనకు దిగింది. ఈ క్రమంలో పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఢిల్లీ ప్లేయర్ ఎంగిడి గాయపడ్డాడు. మిడాఫ్ ప్రాంతంలో బంతిని క్యాచ్ పట్టే క్రమంలో అతడు కిందపడ్డాడు.దీంతో తల బలంగా నేలకు తాకి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య బృందం అతడిని పరీక్షించింది. అయితే అతడి పరిస్థితి దిగజారినట్లు కనిపించడంతో అంబులెన్స్ను మైదానంలోకి రప్పించి.. మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ట్రాఫిక్ ఏసీపీ సంజయ్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి.. ఒక రకంగా ఎంగిడి ప్రాణం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.Lungi Ngidi got Injured while going for a catch Looks very serious 😰. Ambulance was called on ground 🚨. pic.twitter.com/GgU9g68Zsw— Jeet (@JeetN25) April 25, 202611 నిమిషాల్లోనే ఢిల్లీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, మ్యాచ్ జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియం నుంచి సాయంత్రం 6.16 గంటలకు బయల్దేరిన అంబులెన్స్.. రాజేంద్ర నగర్లో ఉన్న మాక్స్ ఆస్పత్రికి కేవలం 11 నిమిషాల్లోనే చేరుకుంది. సాధారణంగా ఈ ప్రయాణానికి 25-30 నిమిషాల సమయం పడుతుంది.Full marks to Delhi Traffic Police for creating a Green Corridor for seamless travel for the ambulance carrying Lungi Ngidi from Kotla to Max Hospital, Rajendra Nagar in just 11 minutes This was initiated by ACP Traffic Central District Sanjay Singh pic.twitter.com/ZRsZwdVzeZ— Vikrant Gupta (@vikrantgupta73) April 25, 2026అయితే, సంజయ్ సింగ్ చొరవ వల్ల ఎంగిడిని తీసుకువెళ్తున్న అంబులెన్స్ త్వరితగతిన ఆస్పత్రికి చేరుకుంది. గూగుల్ మ్యాప్స్పై ఆధారపడకుండా.. మెయిన్ రోడ్డు నుంచే వెళ్లాలని సంజయ్ సింగ్ అంబులెన్స్ డ్రైవర్కు సూచించారట. మొత్తంగా 60 మంది పోలీసులు వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా సమన్వయం చేసుకుని.. ఎంగిడి వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరడంలో కీలక పాత్ర పోషించారు.ఎవరీ సంజయ్ సింగ్?ఢిల్లీలో ప్రస్తుతం ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్నారు సంజయ్ సింగ్. ఆయనకు క్రికెట్ బ్యాగ్రౌండ్ ఉంది. గౌతం గంభీర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలతో ఆయన దేశీ క్రికెట్ ఆడారు.ఇక ఎంగిడి గురించి మీడియా సంజయ్ సింగ్ను అడుగగా.. ‘‘నేనూ ఓ క్రికెటర్నే. మైదానంలో తగిలే గాయాలు ఎంతటి ప్రమాదానికి దారితీస్తాయో నాకు బాగా తెలుసు. ఎంగిడి అంతర్జాతీయ క్రికెటర్. అతడు కుప్పకూలిన విధానం చూస్తే గాయం ఎంత తీవ్రమైందో నాకు అర్థమైంది’’ అని సహానుభూతి ప్రదర్శించారు.ఇదిలా ఉంటే.. ఢిల్లీ విధించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఊదేసింది. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఇక తాజాగా ఢిల్లీకి మరో పరాజయం ఎదురైంది. ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.చదవండి: మీకసలు బుద్ధుందా?.. వైభవ్ గురించి ఆమెను ఎందుకు అడిగారు?Lungi Ngidi has suffered a serious injury, and for the first time in IPL history, an ambulance has come onto the ground. This looks very serious—possibly a neck fracture, but hopefully it’s nothing that severe. 😱It is also quite shameful for the Arun Jaitley Stadium DJ to play… pic.twitter.com/CrFFc3grvB— Sonu (@Cricket_live247) April 25, 2026 -
‘కనీసం ఒక్క బ్యాటర్ ఆడినా కథ వేరుగా ఉండేది’
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్లో ఘోర పరాభవంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. అసలేం జరిగిందో తనకు ఇంకా అర్థం కావడం లేదని.. ఇంకా షాక్ నుంచి కోలుకోలేదని తెలిపాడు. ఐపీఎల్-2026లో భాగంగా సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ సోమవారం ఆర్సీబీతో తలపడింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అక్షర్ సేన.. 75 పరుగులకే కుప్పకూలింది. 1/0, 2/2, 3/2, 4/7, 5/7, 6/8... ఒక్కో వికెట్ పడుతుండగా ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లు ఇవి. టాప్–6 బ్యాటర్లంతా వరుసగా 0, 1, 1, 0, 5, 0 పరుగులతో చేతులెత్తేశారు... భువనేశ్వర్, హాజల్వుడ్ నిప్పులు చిమ్ముతుండగా సొంతగడ్డపై ఢిల్లీ విలవిల్లాడింది. టెస్టు మ్యాచ్ను తలపించేలాటెస్టు మ్యాచ్ను తలపించేలా బంతి అద్భుతంగా స్వింగ్ అవుతుండగా ఇద్దరు పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను ఆడుకున్నాడు. తొలి 23 బంతుల్లో ఢిల్లీ 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా, ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు (49) నమోదు కావడం ఖాయమనిపించింది. అయితే, అభిషేక్ పొరేల్ పట్టుదలతో ఎలాగోలా ఆ మార్క్ను అధిగమించినా ఢిల్లీ చివరకు 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆర్సీబీకి కేవలం 39 బంతులు సరిపోయాయి. ఒక వికెట్ కోల్పోయి పని పూర్తి చేసిన ఆర్సీబీ ఢిల్లీపై తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఇప్పటికీ అర్థం కావడం లేదుఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ స్పందిస్తూ.. ‘‘అసలేం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అందుకే టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము అంటారు. ఏదేమైనా మేమే ఈ పరాభవం నుంచి కోలుకుని ముందుకు సాగాల్సి ఉంది.ఐపీఎల్ చాలా కఠినమైన టోర్నమెంట్. ఒక్కరోజులోనే అంతా తారుమారై పోవచ్చు. ప్రతి మ్యాచ్లోనూ మెరుగ్గా రాణిస్తేనే రేసులో ఉంటాము. అయితే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు సాగలేము. ప్రతికూల ఆలోచనలతో ఉంటే తదుపరి మ్యాచ్పై కూడా ఆ ప్రభావం పడుతుంది.మా బ్యాటర్లను తప్పు పట్టాల్సిన పనిలేదుఈరోజు మాది కాదు. మా జట్టుతో కూడా ఇదే మాట చెబుతాను. ఈరోజు మా బ్యాటర్ల వైపు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి జట్టులో వరల్డ్క్లాస్ బౌలర్లు ఉన్నారు. వాళ్లు ఎక్కడైనా బంతిని స్వింగ్ చేయగలరు. కాబట్టి మా పవర్ప్లేలో వాళ్లు వికెట్లు తీసిన తీరు నన్ను పెద్దగా ఆశ్చర్యపరచలేదు.Done in style, Done with conviction ✅✅@rcbtweets claim 2️⃣ points registering a record chase in New Delhi 🔥Scorecard ▶️ https://t.co/HIiNNEutP0#TATAIPL | #KhelBindaas | #DCvRCB pic.twitter.com/IWcxJ3PLkV— IndianPremierLeague (@IPL) April 27, 2026 ఏదేమైనా మా ఓపెనర్లు, లేదంటే టాపార్డర్లో కనీసం ఒక్క బ్యాటర్ అయినా క్రీజులో కుదురుకుని ఉంటే కథ కాస్త వేరుగా ఉండేది. ఏదేమైనా క్రెడిట్ ఆర్సీబీ బౌలర్లకు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాడు. ఈ అవమానకర ఓటమి నుంచి కోలుకుని తాము ముందుకు సాగుతామని అక్షర్ పటేల్ ఈ సందర్భంగా తెలిపాడు.చదవండి: అటు కోహ్లి... ఇటు అజితేశ్... ప్లేయర్, అంపైర్గా నాటి సహచరులు -
అటు కోహ్లి... ఇటు అజితేశ్... ప్లేయర్, అంపైర్గా నాటి సహచరులు
న్యూఢిల్లీ: 2008 అండర్–19 వరల్డ్ కప్... విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత్ ఈ టోర్నీ గెలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 5 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన పేస్ బౌలర్ అజితేశ్ అర్గల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ 18 ఏళ్లలో ఇద్దరి ప్రస్థానం వేర్వేరుగా సాగింది. కోహ్లి దిగ్గజ క్రికెటర్ స్థాయికి చేరుకోగా, అజితేశ్ కెరీర్ పెద్దగా సాగలేదు. అండర్–19 స్థాయిలో ప్రతిభ చూపి ఆ తర్వాత కనుమరుగైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీలో 19 మ్యాచ్లకే పరిమితమైన అతడిని ఐపీఎల్లో పంజాబ్ జట్టు తీసుకున్నా... ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత అజితేశ్ అంపైరింగ్ వైపు మళ్లాడు. ఈ నెల 22న తొలిసారి ఐపీఎల్లో అంపైరింగ్ చేసిన అజితేశ్ తన మూడో మ్యాచ్లో కోహ్లిని కలుసుకున్నాడు. సోమవారం ఢిల్లీ, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో కోహ్లి ఆడుతుండగా, అజితేశ్ అంపైరింగ్ చేశాడు. మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆత్మీయత, ముచ్చట్లు ఆసక్తికర దృశ్యానికి చిరునామాగా నిలిచాయి. -
చెలరేగిన బౌలర్లు.. ఢిల్లీని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) జరిగిన 39వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3-0-5-3), హాజిల్వుడ్ (3.3-0-12-4) చెలరేగడంతో 75 పరుగులకే కుప్పకూలింది. భువీ, హాజిల్కు రసిక్ (2-0-21-1), సుయాశ్ (4-1-7-1), కృనాల్ (2-0-9-1) తోడవడంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది.ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అభిషేక్ పోరెల్ (30) పుణ్యమే. అతనితో పాటు డేవిడ్ మిల్లర్ (19), జేమీసన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో సాహిల్ పరాఖ్, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, నితీశ్ రాణా తలో పరుగు చేశారు. స్టబ్స్ 5, కుల్దీప్ 3 పరుగులు చేశారు.అనంతరం ఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఊదేసింది. 20 పరుగులు చేసి జేకబ్ బేతెల్ ఔట్ కాగా.. పడిక్కల్ (34 నాటౌట్), విరాట్ కోహ్లి (23 నాటౌట్) ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.బేతెల్ వికెట్ జేమీసన్కు దక్కింది. -
చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్లో పిచ్ ఆది నుంచి పేసర్లకు అనుకూలంగా మారడంతో ఆర్సీబీ బౌలర్లు హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్లు చెలరేగిపోయారు. చెరో మూడు ఓవర్లు వేసిన ఈ ఇద్దరు చెరో మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకోవడం విశేషం. బంతి అనూహ్యంగా బౌన్స్, స్వింగ్ అవ్వడంతో 10 పరుగుల్లోపే ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. ఇంత చెత్త ఆటలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టీ20ల్లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో సౌతాఫ్రికా క్రికెటర్గా డేవిడ్ మిల్లర్ నిలిచాడు. 11 పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు మిల్లర్ ఈ ఘనత సాధించాడు. మిల్లర్ టీ20ల్లో 12వేల పరుగులు పూర్తి చేయడానికి 565 మ్యాచ్లు (513 ఇన్నింగ్స్లు) తీసుకున్నాడు. మిల్లర్ కంటే ముందు క్వింటన్ డికాక్ (12,454 పరుగులు), పాఫ్ డుప్లెసిస్ (12,041 పరుగులు) ఈ ఫీట్ అందుకున్నారు. ఓవరాల్గా టీ20 క్రికెట్లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్న 13వ బ్యాటర్గా మిల్లర్ నిలిచాడు. ఇక టీ20ల్లో మిల్లర్ 56 సార్లు ఫిఫ్టీ మార్క్ సాధించాడు. నాలుగుసార్లు సెంచరీలు బాదాడు. ఇక 2012లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మిల్లర్ ఇప్పటివరకు 149 మ్యాచ్లాడి 3,100 పరుగులు చేశాడు. సెంచరీ సహా 14 అర్థశతకాలు చేశాడు. అయితే ఈ పద్నాలుగింటిలో 13 హాఫ్ సెంచరీలను మిల్లర్ లక్ష్యఛేదనలో సాధించడం మరో విశేషం. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్ 4, భువనేశ్వర్ 3 వికెట్లు తీశారు.𝐀 𝐟𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐫. 𝐀 𝐟𝐢𝐠𝐡𝐭𝐞𝐫. 𝐀 𝐓𝟐𝟎 𝐠𝐫𝐞𝐚𝐭 💪🔥1️⃣2️⃣0️⃣0️⃣0️⃣ runs of pure impact 💣🏏David Miller continues to deliver in crunch moments, cementing his legacy as one of the finest finishers in T20 cricket 👏👑#IPL2026 I #DavidMiller pic.twitter.com/pgKR8OEuGn— CricTracker (@Cricketracker) April 27, 2026చదవండి: అమ్మాయి చేసిన పనికి అభిషేక్ శర్మ షాక్! -
ముంబై ఇండియన్స్కు భారీ ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతూ, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ భుజం గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది.ఈ సీజన్లో సాంట్నర్ను గాయాల సమస్య వెంటాడింది. ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ అతని కుడి భుజానికి గాయమైంది. దీంతో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తదుపరి మ్యాచ్కు దూరమయ్యాడు.తరువాత కోలుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్పై మ్యాచ్లు ఆడాడు. అయితే ఏప్రిల్ 23న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన పోరులో మళ్లీ అదే భుజానికి గాయమైంది. దీంతో అతను సీజన్ మొత్తానికే దూరమవాల్సి వచ్చింది.సాంట్నర్ ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. ముంబై బౌలింగ్ విభాగంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు సాంట్నర్ దూరం కావడం ముంబై ఇండియన్స్కు భారీ దెబ్బగా పరిగణించబడుతుంది.ప్రత్యామ్నాయంగా మరో స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ను తీసుకున్నప్పటికీ.. అతను ఏ మేరకు ముంబై కష్టాలను తీర్చగలడో చూడాలి. సాంట్నర్ తరహాలోనే ఎడమచేతి స్పిన్నర్ అయిన మహారాజ్కు టీ20ల్లో అపార అనుభవం ఉంది. అతడు 218 టీ20 మ్యాచ్ల్లో 191 వికెట్లు పడగొట్టాడు.ముంబై ఏప్రిల్ 29న జరిగే తమ తదుపరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. కేశవ్ మహారాజ్ రాకతో జట్టు బౌలింగ్ దళానికి కొత్త బలం చేకూరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. -
అమ్మాయి చేసిన పనికి అభిషేక్ శర్మ షాక్!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం కొనసాగుతుంది. 8 మ్యాచ్ల్లో 380 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్న అభిషేక్ సెంచరీతో పాటు మూడు అర్థశతకాలు సాధించాడు. ఇక శనివారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు హోటల్ రూంకు చేరుకునే సమయంలో అభిషేక్ శర్మకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. అభిషేక్ శర్మను చూసి ఉత్సాహానికి లోనైన ఒక అమ్మాయి చేయి పట్టుకుని లాగింది. ఈ అనూహ్య ఘటనతో అభిషేక్ ఒక్కసారిగా షాకయ్యాడు. కాస్త ఇబ్బందిగానే అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భద్రతా సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో సెక్యూరిటీ లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. వరుస నాలుగు విజయాలు సాధించి సూపర్ ఫామ్లో ఉంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.Abhishek Sharma getting pulled by a girl at team hotel. Imagine if roles are reversed? pic.twitter.com/GCqMI05G4f— Deepu (@deepu_drops) April 26, 2026 చదవండి: ఏమిటీ ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’.. ఎంతమంది ఔటయ్యారంటే? -
ఏమిటీ ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’.. ఎంతమంది ఔటయ్యారంటే?
క్రికెట్ చరిత్రలో ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ అనేది చాలా పాత రూల్. ఈ నిబంధన ఎప్పటి నుంచో అమల్లో ఉంది. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్, లక్నో సూపర్జెయింట్స్ మధ్య మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔట్ కావడంతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. మరి అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ అంటే ఏమిటీ? అంతర్జాతీయ క్రికెట్లో దీనికున్న రూల్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమంది క్రికెటర్లు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యారనేది ఇప్పుడు తెలుసుకుందాం.అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ అంటే?క్రికెట్ చట్టాలను రూపొందించే ఎంసీసీ చట్టాల్లో అబ్స్ట్రాకింగ్ ది ఫీల్డ్ అనే నిబంధన ఉంది. 37.2 నిబంధన ప్రకారం ఓ బ్యాటర్ ఉద్దేశపూర్వంగా తన వికెట్ కాపాడుకోవడానికి బంతిని చేతితో అడ్డుకున్నట్లయితే దాన్ని అబ్స్ట్రాకింగ్ ది ఫీల్డ్ గా కింద పరిగణిస్తూ బ్యాటర్ను ఔట్గా ప్రకటిస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ఇలా 11 మంది ఆటగాళ్లు ఔట్ అయ్యారు. ఈ జాబితాలో ముష్ఫీకర్ రహీం 11వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టెస్టు క్రికెట్లో మాత్రం ఇద్దరే ఇలా పెవిలియన్కు చేరుకున్నారు. వీరిలో రహీం రెండవ ఆటగాడు కాగా.. 1951లో ఇంగ్లాండ్కు చెందిన లియోనార్డ్ హటన్ మొదటి ప్లేయర్. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క ఆటగాడు అబ్స్ట్రాకింగ్ ది ఫీల్డ్ కింద ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మొహిందర్ అమర్నాథ్ ఇలా ఔట్ అయ్యాడు.అంతర్జాతీయ క్రికెట్లో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ గా ఔటైన ఆటగాళ్లు..రస్సెల్ ఎండీన్, ఆండ్రూ హిల్డిచ్, మొహ్సిన్ ఖాన్, డెస్మండ్ హేన్స్, మొహిందర్ అమర్నాథ్, గ్రాహం గూచ్, డారిల్ కల్లినన్, స్టీవ్ వా, మైఖేల్ వాఘన్, చము చిభాభా, ముష్ఫికర్ రహీమ్.ఐపీఎల్లో నాలుగుసార్లు..ఇక ఐపీఎల్ విషయానికొస్తే ఇప్పటివరకు జరిగిన 19 సీజన్లలో నలుగురు ఆటగాళ్లు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యారు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా ఉండగా.. తాజాగా అంగ్క్రిష్ రఘువంశీ చేరాడు.యూసఫ్ పఠాన్ఐపీఎల్లో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ నిలిచాడు. 2013 సీజన్లో రైజింగ్ పుణే వారియర్స్తో కేకేఆర్ తలపడింది. కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో 72 పరుగులతో ఆడుతున్న యూసఫ్ పఠాన్ బౌలర్ స్ట్రైకింగ్ ఎండ్వైపు విసిరిన బంతికి అడ్డువచ్చాడు. దీంతో ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డువచ్చినట్లు పుణే ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు.అమిత్ మిశ్రా2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ షా ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్లో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వెనుదిరిగాడు. బౌలర్ వేసిన బంతిని ఎడ్జ్ తీసుకొని సింగిల్ కోసం పిచ్ మధ్యలో పరిగెత్తాడు. అయితే బంతిని తీసుకున్న కీపర్ నాన్స్ట్రైక్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు.కానీ అమిత్ మిశ్రా బంతికి అడ్డంగా వెళ్లడంతో అంపైర్ ఔట్ ఇవ్వక తప్పలేదు.రవీంద్ర జడేజా2024 సీజన్లో రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా సీఎస్కే బ్యాటర్ రవీంద్ర జడేజా రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే స్ట్రైక్ ఎండ్లో ఉన్న బ్యాటర్పరుగు వద్దని వారించడంతో జడేజా వెనక్కి పరిగెత్తే క్రమంలో తన దిశను మార్చుకున్నాడు. అప్పటికే బంతిని అందుకున్న కీపర్ శాంసన్ బంతిని విసరడం, అదే సమయంలో జడేజా అడ్డు రావడంతో అంపైర్ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటిచ్చాడు.అంగ్క్రిష్ రఘువంశీతాజాగా 2026 సీజన్లో కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ ఇదే తరహాలో ఔటయ్యాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఆఖరి బంతికి రఘువంశీ మిడ్-ఆన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్ ఆన్లో ఉన్న మహ్మద్ షమీ బంతిని వేగంగా అందుకోవడంతో.. రఘువంశీ సగం దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే వెనక్కి వెళ్లే క్రమంలో షమీ త్రో చేసిన బంతి రఘువంశీ కాలికి తగిలి వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లలేదు. అయితే రఘువంశీ కావాలనే తన దారిని మార్చుకుని వెనక్కి పరిగెత్తాడని పంత్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్కు అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. చాలా సేపు రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్.. రఘువంశీ కావాలనే ఫీల్డర్ విసిరిన బంతికి అడ్డుపడ్డాడని నిర్ధారించారు. దీంతో ఆర్టికల్ 37 ప్రకారం అతడిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద అవుట్గా ప్రకటించారు.𝗜.𝗖.𝗬.𝗠.𝗜A rare dismissal as Angkrish Raghuvanshi was given out 𝗼𝗯𝘀𝘁𝗿𝘂𝗰𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗳𝗶𝗲𝗹𝗱 😮WATCH how it all unfolded ▶️ https://t.co/uNqNFhXhoL#TATAIPL | #KhelBindaas | #LSGvKKR pic.twitter.com/tvKuRe4x5S— IndianPremierLeague (@IPL) April 26, 2026చదవండి: ‘నేను చాలా మారాను.. మునుపటి పాండ్యాను కాను’ -
ఆర్సీబీ ఘన విజయం
ఆర్సీబీ ఘన విజయంఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఊదేసింది. 20 పరుగులు చేసి జేకబ్ బేతెల్ ఔట్ కాగా.. పడిక్కల్ (34 నాటౌట్), విరాట్ కోహ్లి (23 నాటౌట్) ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.బేతెల్ వికెట్ జేమీసన్కు దక్కింది. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ2.5వ ఓవర్- 76 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో నటరాజన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జేకబ్ బేతెల్ (20) ఔటయ్యాడు. 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3-0-5-3), హాజిల్వుడ్ (3.3-0-12-4) చెలరేగడంతో 75 పరుగులకే కుప్పకూలింది. భువీ, హాజిల్కు రసిక్ (2-0-21-1), సుయాశ్ (4-1-7-1), కృనాల్ (2-0-9-1) తోడవడంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అభిషేక్ పోరెల్ (30) పుణ్యమే. అతనితో పాటు డేవిడ్ మిల్లర్ (19), జేమీసన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో సాహిల్ పరాఖ్, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, నితీశ్ రాణా తలో పరుగు చేశారు. స్టబ్స్ 5, కుల్దీప్ 3 పరుగులు చేశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ12.3వ ఓవర్- 62 పరుగుల వద్ద ఢిల్లీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో జేమీసన్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఏడో వికెట్ డౌన్8.6వ ఓవర్- 43 పరుగుల వద్ద ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. రసిక్ సలాం బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి డేవిడ్ మిల్లర్ (19) ఔటయ్యాడు.ఆరో వికెట్ డౌన్3.5వ ఓవర్- ఆర్సీబీ పేసర్లు చెలరేగిపోతున్నారు. 8 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో నితీశ్ రాణా (1) ఔటయ్యాడు. 7 పరుగులకే సగం వికెట్లు డౌన్2.4వ ఓవర్- 7 పరుగుల వద్దే ఢిల్లీ ఐదో వికెట్ కూడా కోల్పోయింది. భువీ బౌలింగ్లో వికెట్కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ () ఔటయ్యాడు. 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ2.1వ ఓవర్- ఢిల్లీ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భువీ బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్ (5) ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 7 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే భారీ షాక్లు తగిలాయి. రెండో బంతికే భువీ సాహిల్ పారఖ్ (0), రెండో ఓవర్ తొలి బంతికే కేఎల్ రాహుల్ను (1), రెండో బంతికి సమీర్ రిజ్విని (0) హాజిల్వుడ్ ఔట్ చేశాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) జరుగుతున్న 39వ మ్యాచ్లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ రెండో స్థానంలో, ఢిల్లీ ఏడో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఢిల్లీకి ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమే. తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): సాహిల్ పరాఖ్, కేఎల్ రాహుల్(w), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(సి), దుష్మంత చమీరా, కైల్ జామీసన్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్ -
రుతురాజ్ ఖాతాలో భారీ రికార్డు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 26) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో తన జట్టు ఓడినా, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. ఈ మ్యాచ్లో 4 సిక్సర్లు బాదిన రుతురాజ్ ఐపీఎల్లో సీఎస్కే తరఫున 100 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. రుతురాజ్కు ముందు ధోని (234), సురేశ్ రైనా (180), శివమ్ దూబే (106) మాత్రమే ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం రుతురాజ్ ఖాతాలో 101 సిక్సర్లు ఉన్నాయి.కాగా, నిన్నటి మ్యాచ్లో రుతురాజ్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో గౌరవప్రదమైన స్కోర్ అందించినప్పటికీ.. సీఎస్కే పరాజయంపాలైంది. రుతురాజ్ 60 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్లో రుతురాజ్ మినహా ఎవరూ రాణించలేదు. సంజూ శాంసన్ 11, ఉర్విల్ పటేల్ 4, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్, బ్రెవిస్ 2, శివమ్ దూబే 22, కార్తీక్ శర్మ 15, ఓవర్టన్ 18 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3, అర్షద్ ఖాన్ 2, సిరాజ్, సుతార్ తలో వికెట్ తీశారు.అనంతరం 159 పరుగుల సాధారణ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఆడుతుపాడుతూ ఛేదించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (87) భారీ అర్ద సెంచరీతో తన జట్టును గెలిపించాడు. అతనికి కెప్టెన్ గిల్ (33), బట్లర్ (39) సహకరించారు. సీఎస్కే బౌలర్లలో అకీల్ హొసేన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ తర్వాత గుజరాత్ ఐదో స్థానానికి ఎగబాకగా.. సీఎస్కే ఆరో స్థానానికి పడిపోయింది. -
‘నేను చాలా మారాను.. మునుపటి పాండ్యాను కాను’
ఐపీఎల్ 2026 సీజన్లో కృనాల్ పాండ్యా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జట్టులో కీలక ఆల్రౌండర్గా కొనసాగుతూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఒక క్రికెటర్గా తాను ఏంతో పరిణితి చెందానని, ఒకప్పటి పాండ్యాను కాదని.. చాలా మారిపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ నేపథ్యంలో కృనాల్ పాండ్యా క్రికెటర్గా తన ప్రయాణంతో పాటు ఆర్సీబీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పాండ్యా మాట్లాడుతూ.. ‘కాలక్రమేణా నేను మంచి వ్యక్తిగా మారాను. ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. నా తల్లిదండ్రులు నన్ను పెంచిన తీరుకు ఈ ఘనత దక్కుతుంది. ఒక మనిషిగా మాత్రం మారలేదు. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, ఆడటానికి ఇప్పటికీ అంతే ఉత్సాహంగా, ఆసక్తిగా ఉంటాను. నేను ఎప్పుడూ కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిని. నా కుటుంబాన్ని, పిల్లలను, భార్యను అమితంగా ప్రేమిస్తాను. నా తల్లిదండ్రులు ప్రతీ విషయంలో నాకు అండగా నిలిచారు. మీరు విజయాన్ని రుచి చూసినప్పుడు, రెండు విషయాలు జరగవచ్చు, ఒకటి మీరు పిచ్చివాళ్లు అయిపోతారు లేదా అది మిమ్మల్ని వినయవంతులుగా చేస్తుంది. నేను రెండో మార్గాన్ని ఎంచుకున్నాను. నేను ఎదిగే కొద్దీ, మరింత వినయవంతుడిగా మారాను, అందుకే నాకు కుటుంబం చాలా ముఖ్యం.’ అని చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున కేకేఆర్పై తొలి మ్యాచ్ ఆడిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. ‘ఆర్సీబీ తరఫున నా తొలి మ్యాచ్ ఆడటానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అప్పుడే ప్రారంభోత్సవం జరిగింది. షారుఖ్ సర్ వేదికపై ఉండటం, ప్రేక్షకులు నినాదాలు చేయడం నాకు గుర్తుంది. పవర్ప్లేలో నా మొదటి ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చాను. 10 ఓవర్లలో కేకేఆర్ 110 పరుగులు చేసింది, వాళ్లు వేగంగా పరుగులు రాబడుతున్నారు. తర్వాతి ఓవర్లో నేను అజింక్య రహానేను డీప్ స్క్వేర్ లెగ్ వద్ద అవుట్ చేశాను. అప్పుడు వెంకటేష్ అయ్యర్ హెల్మెట్ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో నేను ఒక బౌన్సర్ వేయాలనుకున్నా. అయితే వెంటనే వెంకటేశ్ అయ్యర్ తన హెల్మెట్ పెట్టుకున్నాడు. కానీ తర్వాతి బంతికే వెంకటేశ్ అయ్యర్ క్లీన్బౌల్డ్ అయ్యాడు.’ అని పేర్కొన్నాడు. వాంఖడేలో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో గెలవడాన్ని గుర్తుచేసుకున్న కృనాల్ పాండ్యా 2025 సీజన్లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడం తన కెరీర్లో మరిచిపోలేని క్షణమని తెలిపాడు. కోహ్లితో కలిసి ట్రోఫీని అందుకోవడం ఇప్పటికీ తన కళ్ల ముందు మెదులుతూనే ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో కృనాల్ పాండ్యా 7 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. ఓవరాల్గా ఐపీఎల్లో 149 మ్యాచ్లాడిన కృనాల్ 1792 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 101 వికెట్లు తీశాడు.చదవండి: థామస్ కప్లో సంచలనం.. క్వార్టర్స్కు భారత్ -
IPL 2026: ముంబై ఆటగాడికి ఊహించని అదృష్టం
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ గాయాల సమస్యలతో సతమతమవుతోంది. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కావడంతో, చెన్నై యాజమాన్యం ముంబైకి చెందిన యువ ఆల్రౌండర్ ఆయుశ్ వర్తక్ను మిడ్-సీజన్ ట్రయల్స్కు పిలిచింది.ఈ సీజన్లో చెన్నై పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కెప్టెన్ రుతురాజ్ నాయకత్వంలో ఎనిమిది మ్యాచ్ల్లో ఐదు పరాజయాలు చవిచూసింది. ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా ఉన్నప్పటికీ, గాయాలు జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి.లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని కాల్ఫ్ స్ట్రెయిన్ కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ఆయుశ్ మాత్రే, ఖలీల్ అహ్మద్ గాయాల కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు.ఈ నేపథ్యంలో ముంబై, పార్సీ జింఖానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అయుష్ వర్తక్ను చెన్నై ట్రయల్స్కు పిలిచింది. అతడు త్వరలోనే చెన్నై జట్టుతో కలవనున్నాడు.21 ఏళ్ల అయుష్ వర్తక్ దేశీయ క్రికెట్లో ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. కుడిచేతి మీడియం పేసర్గా, దిగువ వరుసలో వేగంగా పరుగులు చేసే బ్యాటర్గా మంచి పేరు సంపాదించాడు.నవి ముంబై టీ20 లీగ్లో అతడు 264 పరుగులు చేసి, 191 స్ట్రైక్రేట్ నమోదు చేశాడు. అదనంగా మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఇప్పటికే ఆకాశ్ మధ్వాల్ను అయుష్ మాత్రే స్థానంలో జట్టులోకి తీసుకున్న చెన్నై, ఖలీల్ అహ్మద్కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తోంది. ఆ లోటును వర్తక్ భర్తీ చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం చెన్నై జట్టులో డెవాల్డ్ బ్రెవిస్, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ప్రతి మ్యాచ్ను గెలవాల్సిందే. ఈ క్లిష్ట సమయంలో అయుష్ వర్తక్ వంటి యువ ఆటగాళ్లు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు. -
పంజాబ్ కింగ్స్ ప్లేయర్కు మాతృవియోగం
ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతూ, ఏకైక అజేయ జట్టుగా కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ టీమ్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి ఇవాళ (ఏప్రిల్ 27) కన్నుమూశారు. ఈ వార్త పంజాబ్ కింగ్స్ శిబిరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఒమర్జాయ్కు అతని జాతీయ జట్టు సహచరులు, పంజాబ్ కింగ్స్ బృంద సభ్యులు ప్రగాఢ సానూభూతి తెలుపుతున్నారు. ఈ విషాద వార్తను ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఒమర్జాయ్కు గురువుగా భావించే అస్గర్, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. "అల్లాహ్ ఆమెకు జన్నత్ ప్రసాదించాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను" అని ఎక్స్లో రాసుకొచ్చారు.ఈ హఠాత్పరిణామంతో ఒమర్జాయ్ ఐపీఎల్ను మధ్యలో వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఉండేందుకు అతడు త్వరలోనే ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లే అవకాశం ఉంది. అయితే మిగిలిన సీజన్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు ఇప్పటివరకు అపరాజితంగా కొనసాగుతోంది. బలమైన జట్టు కూర్పు కారణంగా ఒమర్జాయ్కు ఈ సీజన్లో ఇంకా ఒక్క అవకాశం కూడా రాలేదు.గత సీజన్లో పంజాబ్ తరఫున అతడు కొన్ని కీలక ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా బౌలింగ్లో తనదైన ముద్ర వేశాడు. ఒమర్జాయ్ ఐపీఎల్ ప్రయాణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగలేదు. 2024లో గుజరాత్ టైటాన్స్ తరఫున అరంగేట్రం చేసిన అతడు, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్లో చేరాడు. ఒమర్జాయ్కు ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదు. కాగా, పంజాబ్ రేపు సొంత మైదానం ముల్లాన్పూర్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. -
వైభవ్ ఇదేం పని.. ఫొటోకు వంద రూపాయలా?
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతుంది. 15 ఏళ్ల వయసులోనే అగ్రశ్రేణి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్న సూర్యవంశీ సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్లో నిలుస్తున్నాడు. ఈ సీజన్లో బ్యాట్తో విధ్వంసం సృష్టిస్తోన్న వైభవ్ తాజాగా తనతో ఫొటో దిగాలని వచ్చిన ఇద్దరు చిన్న పిల్లలను ఆటపట్టించడం ఆసక్తికరంగా మారింది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్తాన్ రాయల్స్ జట్టు తర్వాతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో ఆడేందుకు ముల్లన్పూర్కు పయనమైంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టులో కాసేపు ఆగిన వైభవ్ వద్దకు ఇద్దరు పిల్లలు వచ్చి ఫొటో దిగాలని అడిగారు. తాను ఫొటో దిగేందుకు రెడీనే అని, కానీ తాను ఏదీ ఉచితంగా చేయనని పేర్కొన్నాడు. వైభవ్ మాట్లాడుతూ.. ‘బ్రదర్.. నేను మీతో ఫొటో దిగాలంటే మీరు ఒక్కో ఫొటోకు నాకు వంద రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.’ అని పేర్కొన్నాడు. దీంతో పిల్లలు 200 రూపాయలు తీసుకొచ్చి వైభవ్ చేతిలో పెట్టారు. అయితే డబ్బులు పిల్లలకు తిరిగి ఇచ్చిన వైభవ్..‘ ఇది కేవలం ప్రాంక్ మాత్రమే.. మీ డబ్బులు మీరు తీసుకోండి’ అంటూ తెలిపాడు. ఆ తర్వాత ఇద్దరు చిన్నారులను దగ్గరికి తీసుకొని వారితో ఫొటో దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో దుమ్మురేపుతున్నాడు. శనివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో 36 బంతుల్లోనే సెంచరీ సాధించిన సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 234 స్ట్రైక్రేట్తో 357 పరుగులు చేశాడు. ఇందులో 31 బౌండరీలు, 32 సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్లాడి 5 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లీగ్లో రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ను మంగళవారం పంజాబ్ కింగ్స్తో ఆడనుంది.Baccha party always a step ahead 😂 pic.twitter.com/locrozR0Yh— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2026చదవండి: గిల్పై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు! -
'అతడు మరో జహీర్ ఖాన్.. వెంటనే టీమిండియాకు ఎంపిక చేయండి'
భారత క్రికెట్లో ప్రస్తుతం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల కొరత ఎక్కువగా ఉంది. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తర్వాత ఇప్పటివరకు సరైన బౌలర్లు దొరకలేదు. అర్ష్దీప్ సింగ్ ఉన్నప్పటికి కేవలం టీ20లకు మాత్రమే పరిమితమవుతున్నాడు. దీంతో భారత వన్డే, టెస్టు జట్టులో ఎడమ చేతి వాటం పేసర్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది.అయితే ఇప్పుడు మొహ్సిన్ ఖాన్ రూపంలో మరో లెప్ట్ ఆర్మ్ పేసర్ వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మొహ్సిన్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆదివారం ఏకానా స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో మొహ్సిన్ సంచలన ప్రదర్శన చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో తొలి ఐదు వికెట్ల హాల్ సాధించిన బౌలర్గా అతడు నిలిచాడు. అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధికంగా మూడు మెయిడెన్ ఓవర్లు వేశాడు. అందులో రెండు వికెట్ మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. మొహ్సిన్కు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. వైవిధ్యంగా బంతులు వేయడం అతడి స్పెషాలిటీ. అదే సమయంలో సరైన పేస్ కూడా జనరేట్ చేయగలడు. సరైన లైన్ అండ్ లెంగ్త్లో కూడా అతడు బౌలింగ్ చేస్తున్నాడు. కాగా అతడు దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018లో విజయ్ హజారే ట్రోఫీతో లిస్ట్-ఏ క్రికెట్లోకి, అదే ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో టీ20ల్లోకి అడుగుపెట్టాడు. అనంతరం 2020లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2018లో అతడిని ముంబై ఇండియన్స్ తొలిసారిగా కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు. కానీ జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాలతో ట్రావెల్ చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్-2022 వేలంలో మొహ్సిన్ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.ఆ సీజన్లో అతడు 9 మ్యాచ్ల్లోనే 14 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడు ఇప్పటివరకు 28 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 36 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా అతడి పేరిట 89 టీ20 వికెట్లు ఉన్నాయి. సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్న మొహ్సిన్ను భారత జట్టుకు ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. మరికొంతమంది ఒకడుగు ముందుకేసి భారత బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్తో పోలుస్తున్నారు.చదవండి: IPL 2026: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే?What a sensational spell this has been from Mohsin Khan as he completes a brilliant five-wicket haul.#Cricket #LSGvsKKRpic.twitter.com/YWOL7ZKk6J— CREX (@Crex_live) April 26, 2026 -
గిల్ వివాదాస్పద పోస్టు.. బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ విషయంలో ఆన్ఫీల్డ్, ఆఫ్ఫీల్డ్లో చాలా ఆసక్తికర విషయాలు జరుగుతున్నాయి. ఆరం భంలో వరుస పరాజయాలు, మధ్యలో విజయాలు, మళ్లీ ఓటమి.. ఇలా సీఎస్కే తన ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది. అయితే ఆన్ఫీల్డ్లో ఇలా ఉంటే ఆఫ్ఫీల్డ్లో సీఎస్కే కు అవమానాలు జరుగుతున్నాయి. సీజన్ ఆరంభంలో ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సీఎస్కే తాజాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్పై ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ గిల్పై సీఎస్కే చేసిన ఫిర్యాదు కాపీ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అసలేం జరిగింది?ఆదివారం (ఏప్రిల్ 26) చెన్నై వేదికగా గుజరాత్ టైటాన్స్తో చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) తలపడింది. అయితే ఈ మ్యాచ్లో సీఎస్కేపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ గిల్ తన ఇన్స్టాగ్రామ్లో సీఎస్కే ఫ్రాంచైజీని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఏఐతో రూపొందించిన తన ఫొటోను పంచుకున్న గిల్ చేతిలో పసుపు రంగు విజిల్ పట్టుకొని నవ్వుతూ కనిపించాడు. అయితే గిల్ పెట్టిన పోస్టు సీఎస్కే జెర్సీని, ఫ్రాంచైజీ నినాదం అయిన విజిల్ పోడును అవమానిస్తున్నట్లుగా ఉందంటూ సీఎస్కకే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది నకిలీదా లేక నిజమైనదేనా అన్నది ఇంకా తెలియదు. అయితే సీఎస్కే ఫ్రాంచైజీ గిల్పై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన కాపీ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.CSK filed another complaint this time against India skipper & star batter Shubham Gill... pic.twitter.com/w6iGlOydw1— The Cricket View (@TheCricketView) April 26, 2026గతంలో ఆర్సీబీపై ఫిర్యాదుఇక ఇదే సీజన్లో 11వ మ్యాచ్లో ఆర్సీబీ, సీఎస్కే తలపడ్డాయి. సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ’దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అంటూ ఓ ట్రాక్ను డీజే ప్లే చేశారు. అయితే ఇవి దక్షిణాదికి చెందిన ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు. ఈ ట్రాక్పై సీఎస్కే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అనే పదాలను వాడుతూ తమిళనాడు గుర్తింపును ఎగతాళి చేశారంటూ సీఎస్కే ఆర్సీబీ ఫ్రాంచైజీపై బీసీసీఐకి ఫిర్యాదులో చేసింది. కాగా ఐపీఎల్ 19వ సీజన్లో సీఎస్కే ఐదో ఓటమిని మూటగట్టుకుంది. సీఎస్కే విధించిన 159 పరుగుల టార్గెట్ను గుజరాత్ మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. సాయి సుదర్శన్ (87), గిల్ (33), బట్లర్ (39 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.చదవండి: ‘వైభవ్పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’ -
సిక్సర్ల వీరుడని బిల్డప్.. టీమిండియాకు ఆడుతున్నాడు కానీ!
ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్కు మరో ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా ఈ సీజన్లో ఎనిమిదింట ఐదో పరాజయం నమోదు చేసింది.ఈ మ్యాచ్లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 74 నాటౌట్) ఒక్కడే మెరుగైన స్కోరు సాధించాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివం దూబేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.సిక్సర్ల వీరుడని బిల్డప్‘‘శివం దూబే పరుగులు రాబట్టలేక సతమతమవుతున్నాడు. సిక్సర్ల దూబేగా అతడికి బాగా ప్రచారం కల్పించారు. కానీ అతడు ఐపీఎల్లో ప్రభావంతమైన ఇన్నింగ్స్ ఆడి దాదాపుగా రెండేళ్లు గడిచిపోయింది. కేవలం స్పిన్ బౌలింగ్లో మాత్రమే హిట్టింగ్ ఆడేవాడిగా ఉండిపోవద్దు దూబే.టీమిండియాకు ఆడుతున్నాడు కానీ..నిజానికి అంతర్జాతీయ క్రికెట్లో దూబే అద్బుతంగా ఆడుతున్నాడు. కానీ ఐపీఎల్లో తేలిపోతున్నాడు. ఈసారి ఐపీఎల్లో అతడు విఫలం కావడం చెన్నై సూపర్ కింగ్స్కు పెద్ద సమస్యగా పరిణమించింది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.కాగా గుజరాత్తో మ్యాచ్లో 17 బంతుల్లో 22 పరుగులు చేశాడు దూబే. ఈ సీజన్లో ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి మొత్తంగా కేవలం 150 పరుగులు సాధించాడు.రుతు ఒక్కడేఇక మ్యాచ్ విషయానికొస్తే.. బౌలర్ల క్రమశిక్షణకు టాపార్డర్ మెరుపులు తోడవడంతోగుజరాత్ టైటాన్స్ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. సొంతమైదానం చెపాక్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 74 నాటౌట్) ఎట్టకేలకు అర్ధశతకం సాధించగా... మిగతావాళ్లు విఫలమయ్యారు.సాయి అదరగొట్టేశాడుగుజరాత్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కగిసో రబాడ 3 వికెట్లు పడగొట్టగా... అర్షద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలిచింది. సాయి సుదర్శన్ (46 బంతులలో 87; 4 ఫోర్లు, 7 సిక్స్లు) దుమ్మురేపగా... కెప్టెన్శుబ్మన్ గిల్ (23 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్లు), బట్లర్ (30 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అతడికి అండగా నిలిచారు. చెన్నై బౌలర్లలో అకీల్, నూర్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: Virender Sehwag: వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు -
‘వైభవ్పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన సంచనల బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ బౌలర్లను చితక్కొడుతున్న వైభవ్ సూర్యవంశీ అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదేస్తున్నాడు. పనిలో పనిగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో శతకంతో రెచ్చిపోయాడు. ఇప్పటికే ఆడిన 8 మ్యాచ్ల్లో వైభవ్ సూర్యవంశీ 234 స్ట్రైక్రేట్తో 357 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. వైభవ్ ఇలాగే ఆడుతూ పోతే ఆరెంజ్ క్యాప్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అగ్రశ్రేణి బౌలర్లందరినీ ఉతికారేస్తున్న వైభవ్ సూర్యవంశీ బ్యాట్లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అతడి మెదడులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సరదా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగించింది. వైభవ్ సూర్యవంశీ బుర్రలో ఏఐ చిప్ను ఏమైనా ఇన్స్టాల్ చేశారేమోనని తనకు అనుమానంగా ఉందని తెలిపారు. టీనేజీ వయసులో ఉన్నప్పటికీ భారీ సిక్సర్లు ఎలా కొడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. వైభవ్కు డోపింగ్ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు. నౌమన్ నియాజ్ మాట్లాడుతూ.. ‘వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒకసారి వైభవ్ను చెక్ చేస్తే బాగుంటుంది. అతడి బుర్రలో ఏదైనా ఏఐ చిప్ ఇన్స్టాల్ చేసారా అన్నది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్కు పంపించి పరీక్షించాల్సిందే. వైభవ్ నాకు మనిషిలా అనిపించడం లేదు. అయితే అతడి మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. నిజంగానే వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో అతడి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. ఇక ఒక టీనేజీ కుర్రాడు కండలు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్యవంశీ 18 ఏండ్లు నిండకుండానే అతడి దేహదారుఢ్యం బలంగా కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో వైభవ్ ఆటలో మరింత రాటు దేలడం ఖాయం. ఇప్పుడు వైభవ్కు 15 ఏళ్లు. త్వరలోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశముంది.నిజానికి అతడి బ్యాటింగ్లో పెద్దగా టెక్నిక్స్ కనిపించవు. కానీ అతడి మణికట్టు బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కుల చూపిస్తూ డేంజరస్ బ్యాటర్గా తయారయ్యాడు’ అని చెప్పుకొచ్చారు. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్లాడి 5 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లీగ్లో రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ను మంగళవారం పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
ఐపీఎల్-2026లో సోమవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులను ఊరిస్తున్నాయి. ఢిల్లీతో మ్యాచ్లో కోహ్లి మరో 11 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.కోహ్లి ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 274 మ్యాచ్లు ఆడి మొత్తంగా 8,989 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 8 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మ్యాచ్లో కోహ్లి 62 పరుగులు సాధిస్తే, భారత గడ్డపై 10,000 టీ20 రన్స్ నమోదు చేసిన ప్లేయర్గా అవతరిస్తాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్గా కోహ్లి రికార్డులకెక్కుతాడు. అంతేకాకుండా తన టీ20 కెరీర్లో 450 సిక్సర్ల మార్కును చేరడానికి కోహ్లి కేవలం 3 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.కోహ్లి ఉన్న ఫామ్కు ఈ రికార్డులను అందుకోవడం పెద్ద విషయమేమి కాదు. ఈ ఏడాది సీజన్లోనూ ఎప్పటిలానే కోహ్లి పరుగులు వరద పారిస్తున్నాడు. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తన సొంతమైదానం(అరుణ్ జైట్లీ స్టేడియం)లో సత్తాచాటేందుకు కింగ్ సిద్దమయ్యాడు. కోహ్లి(328) ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్ధానంలో ఉన్నాడు.చదవండి: IPL 2026: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే? -
‘మా మామ గారికి అంకితం’
చాన్నాళ్ల తర్వాత ఐపీఎల్-2026లో కోల్కతా రైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఈ యూపీ ఆటగాడు అదరగొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి 51 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.కోల్కతా విజయంలో అంతా తానే..రింకూ ప్రదర్శన కారణంగానే కోల్కతా 155 పరుగుల మార్కు అందుకోగలిగింది. ఈ మ్యాచ్లో ఓవరాల్గా కోల్కతా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాలుగు సిక్స్లు.. ఫీల్డింగ్లో నాలుగు క్యాచ్లు, సూపర్ ఓవర్లో నాలుగు పరుగులు ఇలా... జట్టు విజయంలో రింకూనే కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మా మామ గారికే అంకితంఇక ఈ మ్యాచ్ను వీక్షించేందుకు రింకూ సింగ్ కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj) లక్నోలోని ఏకనా స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా రింకూ ప్రదర్శన పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘‘నేను ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. రింకూ మా మామ గారి కోసం ఆడాడు. ఈరోజు ఆయనను మేము ఎంతగానో మిస్సవుతున్నాము. రింకూ ప్రదర్శన మా మామ గారికే అంకితం’’ అని ప్రియా సరోజ్ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders)చిన్న పిల్లలా గంతులేశారుకాగా రింకూ సిక్సర్లు బాదుతున్న వేళ ప్రియా సరోజ్ చిన్న పిల్లలా గంతులేశారు. నవ్వులు చిందిస్తూ కాబోయే భర్త విజయాన్ని సెలబ్రేట చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన ప్రియా సరోజ్.. ఉత్తరప్రదేశ్లోని మచ్లిచహర్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున లోక్సభకు ఎంపికయ్యారు. రింకూతో పరిచయం ప్రేమగా మారగా.. గతేడాది పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే రింకూ తండ్రి మరణించిన విషయం విదితమే. చదవండి: వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే?
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం ఏకానా స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్పై సూపర్ ఓవర్లో లక్నో ఓటమి పాలైంది. గత సీజన్ మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్నోకు ఏదీ కలిసిరావడం లేదు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన లక్నో.. ఆరింట ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి చేరుకుంది. దీంతో లక్నో దాదాపుగా ప్లే ఆఫ్స్కు రేసు నుంచి నిష్క్రమించినట్లే. ముఖ్యంగా రిషబ్ పంత్ కెప్టెన్గా తన మార్క్ చూపించలేకపోతున్నాడు. డగౌట్లో ప్లాన్లు నిమిష నిమిషానికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒత్తిడి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఇలాంటి లోపాలే స్పష్టంగా కన్పించాయి. ఆఖరి ఓవర్లో దిగ్వేష్ రాఠీతో బౌలింగ్ చేయించడం, సూపర్ ఓవర్లో నికోలస్ పూరన్ను బ్యాటింగ్కు పంపడం వంటి నిర్ణయాలు లక్నో కొంపముంచాయి. ఈ నేపథ్యంలో లక్నో కెప్టెన్ రిషబ్ పంతపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్కు అప్పగించాలని జాఫర్ సూచించాడు. "లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉంది. వారి నుంచి ఇలాంటి ప్రదర్శలు అస్సలు ఊహించలేదు. ఒకవేళ నేనే లక్నో కోచింగ్ స్టాప్లో భాగమైంటే వెంటనే కెప్టెన్సీ మార్పు చేస్తాను. పంత్ను కెప్టెన్సీ బాధ్యతలను తప్పించి మార్క్రమ్కు అప్పగించేవాడని. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు చేసేవాడిని.మార్క్రమ్, మిచెల్ మార్ష్లతో ఓపెనింగ్ చేయిస్తాను. . మూడో స్థానంలో నికోలస్ పూరన్, ఆ తర్వాత నాలుగో స్థానంలో రిషబ్ పంత్, ఐదో స్థానంలో ఆయుష్ బదోని. ఆరో స్థానంలో అబ్దుల్ సమద్, ఏడో స్థానంలో ముకుల్ చౌదరిలను బ్యాటింగ్కు పంపేవాడిని. పంత్ లాంటి ఆటగాడికి కెప్టెన్సీ సెట్ కాదు. అతడు కేవలం బ్యాటర్గా గానే ఆడాలి. అప్పుడే అతడు పూర్తి స్వేఛ్చతో ఆడి మ్యాచ్లను గెలిపిస్తాడు. కాబట్టి కెప్టెన్సీ విషయంలో లక్నో పునరాలోచన చేయాలి. కెప్టెన్సీ బారంపై పంత్పై మోపొద్దు. అతడి స్ధానంలో మార్క్రమ్ను కెప్టెన్గా చేయండి. మార్క్రమ్కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ స్ధాయిలో సౌతాఫ్రికాను అతడు నడిపిస్తున్నాడు. అతడు అన్ని విధాలగా సమర్ధుడు అని జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. అయితే జాఫర్ ఒక్కడే కాదు చాలా మంది మాజీలు పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు. పంత్ కూడా అందుకు సముఖంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.పంత్ ఈ ఏడాది సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొగలనున్నాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా అతడి కెప్టెన్సీలోని లక్నో గత సీజన్లో కూడా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేదు. ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తోంది. -
అంగ్క్రిష్ రఘువంశీపై కఠిన చర్యలు
కోల్కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీపై ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో మ్యాచ్ ఫీజులో కోత విధించింది. ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లో ఏకనా స్టేడియంలో లక్నో- కోల్కతా జట్లు తలపడ్డాయి. అనూహ్య రనౌట్ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కోల్కతా బ్యాటింగ్కు దిగింది. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) ఆదిలోనే చెలరేగి ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (0), అజింక్య రహానే (10) వికెట్లు కూల్చాడు. ఇక వన్డౌన్లో వచ్చిన అంగ్క్రిష్ రఘువంశీ అనూహ్యంగా రనౌటయ్యాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతిని మిడాఫ్ దిశగా ఆడిన రఘువంశీ సింగిల్ కోసం ముందుకొచ్చాడు.అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్అయితే మరో ఎండ్లో ఉన్న కామెరాన్ గ్రీన్ నిరాకరించడంతో వెనుదిరిగాడు. ఈ క్రమంలో మిడాఫ్ దగ్గర బంతి అందుకున్న మహ్మద్ షమీ వికెట్ల వైపు విసిరాడు. ఆ బాల్ కాస్త రఘువంశీకి తాకగా... లక్నో జట్టు ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కోసం అప్పీల్ చేసింది.KKR ತಂಡಕ್ಕಂತೂ ಇದು ನಿಜಕ್ಕೂ ನುಂಗಲಾರದ ತುತ್ತು! 'Obstruction of Field' ಅಂತ Raghuvanshi ಗೆ ಔಟ್ ಕೊಡಲಾಗಿದೆ.☝️ ನಿಮ್ಮ ಪ್ರಕಾರ ಇದು Out? ಅಥವಾ Not Out? 👀 ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #LSGvsKKR | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL #AngkrishRaghuvanshi pic.twitter.com/cPsuy1J2p7— Star Sports Kannada (@StarSportsKan) April 26, 2026తీవ్ర అసంతృప్తిదీంతో పలుమార్లు రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్... రఘువంశీ దిశ మార్చుకున్నాడని నిర్ధారించి అతడిని అవుట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై రఘువంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోపంగా మైదానాన్ని వీడాడు. హెల్మెట్ను విసిరేసి అసంతృప్తి వెళ్లగక్కాడు.జరిమానాతో పాటు..ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి చర్యలకు దిగింది. ‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ పరికరాలు, క్లాతింగ్ తదితర వస్తువులకు హాని కలిగించకూడదు. లక్నోతో మ్యాచ్ సందర్భంగా రఘువంశీ ఈ నిబంధనను ఉల్లంఘించాడు.అందుకే అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డిమెరిట్ పాయింట్ కూడా జత చేస్తున్నాం’’ అని ప్రకటన విడుదల చేసింది. ఈ మ్యాచ్లో కోల్కతా- లక్నో జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సరిసమానంగా చెరో 155 పరుగులు చేశాయి. ఈ క్రమంలో సూపర్ ఓవర్ నిర్వహించగా.. కోల్కతా విజయం సాధించింది.చదవండి: LSG Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్లో లేకున్నా అందుకే అతడిని పంపించాం -
‘అందుకే శ్రేయస్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేశాం’
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దుమ్ములేపుతోంది. గతేడాది ఫైనల్కు చేరిన ఈ జట్టు.. ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఇందులో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. మిగిలిన ఆరింటిలోనూ గెలిచి జైత్రయాత్ర కొనసాగిస్తోంది.రెండేళ్లుగా పంజాబ్ అద్భుత విజయాలు సాధించడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడి రాకతో జట్టు రాతే మారిపోయింది. ఒకప్పుడు పసలేని జట్టుగా ఉన్న పంజాబ్కు ఇప్పుడు అమితమైన క్రేజ్ ఏర్పడింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నీరాజనాలు అందుకుంటోంది.రూ. 26.75 కోట్ల భారీ ధరకుకాగా 2024లో కెప్టెన్గా కోల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ను.. అనూహ్యంగా ఆ ఫ్రాంఛైజీ వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్ల భారీ ధరకు అయ్యర్ను కొనుగోలు చేసింది. పంజాబ్ కోచ్ రిక్కీ పాంటింగ్ పట్టుబట్టి మరీ ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా శ్రేయస్ను ఏరికోరి కొనుగోలు చేయించాడు.పైసా వసూల్ ప్రదర్శనపాంటింగ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శ్రేయస్ అయ్యర్ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడిన పంజాబ్.. 265 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనను సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (36 బంతుల్లో 71 నాటౌట్)తో మెరిశాడు.అందుకే శ్రేయస్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేశాంఈ నేపథ్యంలో హెడ్కోచ్ రిక్కీ పాంటింగ్ శ్రేయస్ అయ్యర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఐపీఎల్ వెబ్సైట్తో మాట్లాడుతూ.. ‘‘అతడొక గొప్ప వ్యక్తి. అందుకే వేలంలో అతడి కోసం ఎంత ఖర్చైనా పర్లేదని నేను కఠినంగా ముందుకు వెళ్తూనే ఉన్నాను.శ్రేయస్ ఒక గొప్ప నాయకుడు. పంజాబ్ జట్టును అతడు పునర్నిర్మిస్తాడని నేను గట్టిగా నమ్మాను. శ్రేయస్ ఆఖరి వరకు క్రీజులో ఉన్నాడంటే లక్ష్యం ఎంత పెద్దదైనా ఛేదించగలమని నాకు తెలుసు. ఇప్పుడు కూడా అతడు అద్భుతం చేశాడు. ‘నువ్వు ఆఖరి వరకు నిలబడ్డావంటే ఈ మ్యాచ్ మనం కచ్చితంగా గెలుస్తామని చెప్పాను’. అన్నట్లుగానే అతడు పని పూర్తి చేశాడు’’ అని రిక్కీ పాంటింగ్ శ్రేయస్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా గతేడాది 604 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఈ సీజన్లో ఇప్పటికి ఆరు ఇన్నింగ్స్ ఆడి 279 పరుగులు పూర్తి చేసుకున్నాడు.చదవండి: Vaibhav Sooryavanshi: పర్సనల్గా అంటే నచ్చదు.. అందుకే చితక్కొట్టాWho would have thought chasing 264 in T20 Cricket. 🤷- Shreyas Iyer led PBKS chased down 264 runs in 18.5 overs against DC. pic.twitter.com/iith1lLgiW— Kashif (@KashifNdmCric) April 25, 2026 -
వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు: సెహ్వాగ్
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు దేవ్దత్త్ పడిక్కల్, రజిత్ పాటిదార్ అద్బుతమైన ప్రదర్శనలు కనబరుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీని సూచిస్తున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ స్వయంగా పడిక్కల్ను భారత జట్టు ఎంపిక చేయాలని సిఫారస్సు చేశాడు.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతీ సీజన్లోనూ చాలా మంది మెరుగైన ప్రదర్శన చేస్తారని, అందరిని జాతీయ జట్టులోకి తీసుకోవాలంటే కుదరదని సెహ్వాగ్ అన్నాడు. కాగా పడిక్కల్ ఎప్పుడో ఐదేళ్ల కింద భారత తరపున రెండు టీ20లు ఆడగా.. పాటిదార్ ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు."పడిక్కల్ను కచ్చితంగా మళ్లీ భారత జట్టులోకి తీసుకోవాలని దినేష్ కార్తీక్ అంటున్నాడు. అయితే ప్రతీ సీజన్లోనూ చాలా మంది అత్యుత్తమ ప్రదర్శన చేసి టీమిండియాలో చోటు ఆశిస్తుంటారు. ఐపీఎల్లో బాగా ఆడిన ప్రతీ ఒక్కరికి తీసుకోవాలంటే ఎక్కడ అవుతోంది? భారత జట్టులో ప్రస్తుతం అస్సలు ఖాళీ ఉందా? భారత టీ20 సెటాప్ ప్రస్తుతం అద్భుతంగా ఉంది.ఇటీవలే వారు వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచారు. కాబట్టి రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లకు ప్రస్తుతం జట్టులో స్థానం లేదు. వీరికే కాదు యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్కు కూడా చోటు లేదు. ఈ ఐదుగురికి అవకాశమివ్వాలంటే ఎవరిని జట్టు నుంచి తీసేయాలి చెప్పండి?" అంటూ క్రిక్బజ్ చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: Rishabh Pant: ఐపీఎల్కే దిక్కు లేదు.. ఇంకా టీమిండియా కెప్టెన్ కావాలా? -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. ఐపీఎల్లో ఒకే ఒక్కడు
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో పద్దెమినిదేళ్లుగా ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ 2017లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు.144వ మ్యాచ్దాదాపు ఆరేళ్ల పాటు సన్రైజర్స్తో కొనసాగిన రషీద్ ఖాన్ (Rashid Khan).. 2022లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు. అప్పటి నుంచి గుజరాత్కే ఆడుతున్న ఈ స్పిన్ బౌలర్... ఐపీఎల్-2026లో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ భాగమయ్యాడు. తద్వారా ఐపీఎల్లో తన 144వ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు రషీద్ ఖాన్.ఏకైక ఆటగాడిగా రషీద్కాగా అరంగేట్రం నాటి నుంచి ఇప్పటి దాకా రషీద్ ఖాన్ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు. తద్వారా ఐపీఎల్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా.. అత్యధికంగా 144 మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడిగా రషీద్ రికార్డులకెక్కాడు. తద్వారా భారత క్రికెటర్ సురేశ్ రైనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.రైనా రికార్డు బద్దలుకాగా రైనా ఐపీఎల్లో మొత్తంగా 205 మ్యాచ్లు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2008లో అరంగేట్రం చేసిన అతడు 2016లో తొలిసారి మ్యాచ్ మిస్ అయ్యాడు. తనకు కూతురు జన్మించిన సందర్భంగా అతడు జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అప్పుడు రైనా గుజరాత్ లయన్స్ కెప్టెన్గా ఉన్నాడు. నాడు ఆర్సీబీతో మ్యాచ్ అతడు మిస్సయ్యాడు.గుజరాత్ అలవోకగా..మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చచ్చీ చెడి 158 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్ల ధాటికి 12 ఓవర్లలో 50 పరుగుల మార్క్ దాటిన సూపర్ కింగ్స్... 16వ ఓవర్లో మూడంకెల స్కోరు అందుకుంది. ఫుల్ ఫామ్లో ఉన్న గుజరాత్ ముందు ఈ లక్ష్యం మరీ చిన్నదైపోయింది. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ మరోసారి దంచికొట్టడంతో 20 బంతులు మిగిలుండగానే టైటాన్స్ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ వికెట్లేమీ తీయలేకపోయాడు. ఒక్క ఓవర్లోనే ఏకంగా 21 పరుగులు ఇచ్చుకున్నాడు. ఐపీఎల్లో అరంగేట్రం నుంచి ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు🏏రషీద్ ఖాన్- 144 మ్యాచ్లు- 2017-2026*- సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్🏏సురేశ్ రైనా- 143 మ్యాచ్లు- 2008-2016- చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ 🏏యూసఫ్ పఠాన్- 95 మ్యాచ్లు- 2008-2014- రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్🏏సుబ్రమణ్యం బద్రీనాథ్- 74 మ్యాచ్లు- 2008-2012- చెన్నై సూపర్ కింగ్స్🏏జితేశ్ శర్మ- 62 మ్యాచ్లు- 2022-2026*- పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.చదవండి: LSG Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్లో లేకున్నా అందుకే అతడిని పంపించాం🎥 High & handsome from Jos Buttler to seal victory for @gujarat_titans 💙An emphatic chase and a very important 2⃣ points 👏Scorecard ▶️ https://t.co/zJBovAaCoM #TATAIPL | #KhelBindaas | #CSKvGT pic.twitter.com/rcc3CD7gqM— IndianPremierLeague (@IPL) April 26, 2026 -
ఐపీఎల్కే దిక్కు లేదు.. ఇంకా టీమిండియా కెప్టెన్ కావాలా?
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఆదివారం ఏకానా స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ ఓవర్లో ఓటమి పాలైంది. ఈ ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్ రిషబ్ పంత్ అనే చెప్పాలి. కెప్టెన్గా అతడు తీసుకున్న తలతిక్క నిర్ణయాలే లక్నో కొంపముంచాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రిషబ్ పంత్ తొలుత కేకేఆర్ను బ్యాటింగ్కు అహ్హనించాడు.పంత్ తీసుకున్న నిర్ణయం సరైందే అని రెండో ఓవర్లోనే నిరూపించాడు పేసర్ మోహ్సిన్ ఖాన్. మోహ్సిన్ డేంజరస్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ను డకౌట్గా పెవలియన్కు పంపాడు. మోహ్సిన్ అక్కడితో అక్కడతో అగలేదు. తన పేస్ బౌలింగ్తో కేకేఆర్ టాపార్డర్, మిడిలార్డర్ను దెబ్బతీశాడు.అతడి బౌలింగ్ ధాటికి కేకేఆర్ కేవలం 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రమణ్దీప్ సింగ్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. ఇక క్రీజులో రెగ్యులర్ బ్యాటర్ రింకూ సింగ్ ఒక్కడే మిగిలాడు. దీంతో కేకేఆర్ కనీసం వంద పరుగులు మార్క్ అయినా దాటుతుందా అని అంతా భావించారు. రింకూ ఆచి తూచి ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.18 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 112 పరుగులుగా ఉండేది. 19 ఓవర్ వేసిన షమీ బౌలింగ్లో రింకూ 17 పరుగులు పిండుకున్నాడు. దీంతో కేకేఆర్ స్కోర్ 129 పరుగులకు చేరింది. అయితే ఈ సమయంలో పంత్ తీసుకున్న ఓ నిర్ణయం లక్నోను దెబ్బతీసింది. పేస్ బౌలర్ల ఓవర్ల కోటా పూర్తి కావడంతో ఆఖరి ఓవర్ స్పిన్నర్తో వేయించాల్సి వచ్చింది.సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ జార్జ్ లిండేతో పంత్ చివరి ఓవర్ వేయిస్తాడని అంతా భావించారు. కానీ పంత్ మాత్రం రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ అయిన దిగ్వేష్కు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంకేముంది రింకూలోని ఫినిషర్ బయటకు వచ్చాడు. వరుసగా నాలుగు సిక్స్లు బాది చివరి ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. మరో రెండు పరుగులు వైడ్ల రూపంలో వచ్చాయి. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగుల ఫైటింగ్ స్కోర్ చేయగల్గింది.జిడ్డు బ్యాటింగ్అనంతరం లక్ష్య చేధనలో రెండో ఓవర్లోనే లక్నోకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ను వైభవ్ ఆరోరా పెవిలియన్కు పంపాడు. అయితే ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. ఐడైన్ మార్క్రమ్(27 బంతుల్లో 31) కలిసి టెస్టు క్రికెట్ ఆడాడు.36 బంతుల్లో కేవలం 38 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు. తొలుత పంత్, మార్క్రమ్ నెమ్మదిగా ఆడడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. యాధావిథిగా నికోలస్ పూరన్ సింగిల్ డిజిట్ స్కోర్కే ఔటయ్యాడు. అయితే ఆఖరిలో ఆయూశ్ బదోని, హిమత్ సింగ్, షమీ బ్యాట్ ఝూళిపించడంతో స్కోర్లు సమమయ్యాయి.సూపర్ ఓవర్లోనూ..దీంతో సూపర్ ఓవర్లో ఫలితాన్ని తేల్చాల్చి వచ్చింది. సూపర్ ఓవర్లో కూడా పంత్ పేలవ కెప్టెన్సీ కన్పించింది. పేలవ ఫామ్తో సతమతమవుతున్న నికోలస్ పూరన్తో పాటు మార్క్రమ్లను ఓపెనర్లుగా లక్నో పంపింది. సునీల్ నరైన్ వేసిన సూపర్ ఓవర్లో తొలి బంతికి పూరన్ క్లీన్ బౌల్డ్ కాగా.. మూడో బంతికి మార్క్రమ్ ఔటయ్యాడు.దీంతో లక్నో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసింది. అనంతరం రింకూ సింగ్ తొలి బంతికే ఫోర్ బాది కేకేఆర్ను గెలిపించాడు. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి చేరుకుంది. ఈ క్రమంలో పంత్పై నెటిజన్లు ఫైరవతున్నారు. ఏ మాత్రం ఆటకేనా రూ.27 కోట్లు తీసుకుంటున్నావు అని పోస్ట్లు పెడుతున్నారు. ఐపీఎల్కే దిక్కులేదు.. నీకు ఇంకా టీమిండియా కెప్టెన్ కావాలా అంటూ ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు. కాగా రిషబ్ పంత్ ప్రస్తుతం టెస్టుల్లో టీమిండియా వైస్ కెప్టెన్గా ఉన్న సంగతి తెలిసిందే. ఒకనొక దశలో టీమిండియా టెస్టు కెప్టెన్ పంత్ అవుతాడని ప్రచారం జరిగింది.చదవండి: Vaibhav Sooryavanshi: పర్సనల్గా అంటే నచ్చదు.. అందుకే చితక్కొట్టా -
నన్నే అంటావా?.. అందుకే చితక్కొట్టా: వైభవ్ సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. గతేడాది భారత్ అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపిన ఈ బిహారీ పిల్లాడు.. ఐపీఎల్-2026లోనూ ఆకట్టుకుంటున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా వైభవ్.. 36 బంతుల్లోనే శతక్కొట్టాడు.బ్యాట్తోనే సమాధానంతద్వారా ఐపీఎల్లో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. గతేడాది గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లోనే వైభవ్ శతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే, సన్రైజర్స్పై కొట్టిన సెంచరీ తనకు అత్యంత ప్రత్యేకం అంటున్నాడు వైభవ్ సూర్యవంశీ. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నచ్చదని.. అందుకే బ్యాట్తోనే సమాధానం ఇచ్చానని తెలిపాడు. పరోక్షంగా సన్రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగేకు వైభవ్ కౌంటర్ వేశాడు.నన్ను వ్యక్తిగతంగా అంటే నచ్చదుసన్రైజర్స్తో మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తమ మేనేజర్ రోమీ భిందర్తో మాట్లాడుతూ.. ‘‘ఆ బౌలర్ (హింగే)ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన వ్యూహంతోనే బ్యాటింగ్కు దిగాను. గత మ్యాచ్లో నన్ను అతడు అవుట్ చేశాడు.ఆరోజు నేను నా ఫోన్ చెక్ చేశా. నా గురించి ఎవరు ఏమన్నారో చూశాను. సాధారణంగా నేను ఇలాంటి విషయాలు పట్టించుకోను. అయితే, ఎవరైనా నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. అది నాపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది’’ అని పేర్కొన్నాడు. తనను టార్గెట్ చేసిన ప్రఫుల్ హింగే బౌలింగ్లోనే విశ్వరూపం ప్రదర్శించడం పట్ల పదిహేనేళ్ల వైభవ్ ఈ మేరకు స్పందించాడు.గత మ్యాచ్లో తొలి బంతికేకాగా సన్రైజర్స్తో ఆడిన గత మ్యాచ్లో ప్రఫుల్ హింగే బౌలింగ్లో తొలి బంతికే అవుటైన వైభవ్ సూర్యవంశీ... ఈ సారి తొలి ఓవర్లోనే విశ్వరూపం కనబర్చాడు. నాలుగు సిక్స్లతో హింగేకు స్వాగతం పలికిన వైభవ్... కమిన్స్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతికి సైతం భారీ సిక్స్ కొట్టాడు.మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) త్వరగా అవుట్ కాగా... వైభవ్ ఇచ్చిన క్యాచ్ను రైజర్స్ ఫీల్డర్ అనికేత్ వదిలేశాడు. ఇదే జోరులో మరో రెండు సిక్స్లు బాదిన సూర్యవంశీ 15 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వైభవ్పై హింగే కామెంట్స్సకీబ్ ఓవర్లో వరుసగా 6, 4, 6తో వైభవ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. జైపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా వైభవ్ సెంచరీ వృథా అయింది.కాగా హైదరాబాద్లో వైభవ్ను అవుట్ చేసిన తర్వాత ప్రఫుల్ హింగే మాట్లాడుతూ.. ‘‘అతడికి (వైభవ్) బౌన్సర్ వేసి అవుట్ చేస్తానని మా వాళ్లకు ముందే చెప్పాను. అతడిని అవుట్ చేయాలన్నదే నా లక్ష్యం’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులుగా జైపూర్లో వైభవ్ హింగేపై ప్రతీకారం తీర్చుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో.. ‘‘పిల్లాడే గానీ... మనసులో ఇంత పెట్టుకున్నాడా? వీడు మామూలోడు కాదు’’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్లో లేకున్నా అందుకే అతడిని పంపించాంA first-ball duck a few days ago to the fastest century by an Indian last night. Vaibhav Sooryavanshi just refuses to give up 👏💗 pic.twitter.com/IqDaWvkAu9— Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2026 -
ఆంధ్ర నెట్ బౌలర్కు తీవ్ర గాయం.. సారీ చెప్పిన స్టొయినిస్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు నెట్ బౌలర్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు గిరి ప్రసాద్కు గాయమైంది. న్యూఢిల్లీలో శనివారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ కొట్టిన షాట్ నెట్స్ వద్ద ఉన్న గిరి ప్రసాద్ ముఖానికి బలంగా తాకింది. పరామర్శఫలితంగా తీవ్రంగా గాయపడ్డ గిరి ప్రసాద్ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేయించింది. ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని గ్రంధి కిరణ్ కుమార్ ఆస్పత్రికి వచ్చి గిరి ప్రసాద్ను పరామర్శించారు. సారీ చెప్పిన స్టొయినిస్తన షాట్తో గాయపడ్డ గిరి ప్రసాద్ను పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ స్టొయినిస్ కూడా వచ్చి పరామర్శించాడు. పొరపాటుగా జరిగిన దానికి క్షమించాలని కోరాడు. యువ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. అనంతరం గిరి ప్రసాద్తో సెల్ఫీ దిగిన స్టొయినిస్ టోపీపై తన ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన గిరి ప్రసాద్ గత సీజన్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్కు నెట్ బౌలర్గా ఉన్నాడు.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్లో లేకున్నా అందుకే అతడిని పంపించాం -
‘అందుకే సూపర్ ఓవర్లో అతడిని పంపించాం’
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ వైఫల్యం కొనసాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో రిషభ్ సేన ఓటమిపాలైంది. ఏకనా స్టేడియంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇరుజట్లు సమానంగా 155 పరుగులు సాధించాయి. ఈ క్రమంలో సూపర్ ఓవర్ నిర్వహించగా.. లక్నో ఓటమి పాలైంది.సూపర్ ఓవర్ సాగిందిలా... ‘సూపర్ ఓవర్’లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో మూడు బంతుల్లో ఒక్కపరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ వేసిన తొలి బంతికే నికోలస్ పూరన్ (0) క్లీన్ బౌల్డ్ కాగా... బౌండరీ వద్ద పావెల్, రింకూ సింగ్ పట్టిన చక్కటి రిలే క్యాచ్కు ఐడెన్ మార్క్రమ్ (0) వెనుదిరిగాడు. కెప్టెన్ రిషభ్ పంత్ (1 నాటౌట్) అజేయంగా నిలిచాడు.అంతా రింకూ మయంఇక రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా తొలి బంతికే గెలుపు ఖాతాలో వేసుకుంది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో రింకూ (4 నాటౌట్) తొలి బంతికే ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లో నాలుగు సిక్స్లు, ఫీల్డింగ్లో నాలుగు క్యాచ్లు, సూపర్ ఓవర్లో నాలుగు పరుగులు ఇలా... కోల్కతా విజయంలో ఎక్కడ చూసిన రింకూ సింగ్ ప్రతిభే ప్రస్ఫుటించింది. అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.#KKR win the first SUPER OVER of the season 🤩@kkriders with a hard earned win after 42 overs of topsy turvy cricket 👏Scorecard ▶️ https://t.co/elFxwvCeWO#TATAIPL | #KhelBindaas | #LSGvKKR pic.twitter.com/yIoX0vQOMv— IndianPremierLeague (@IPL) April 26, 2026అతడిని ఎలా ఆడిస్తారు?మరోవైపు.. ఫామ్లో లేని నికోలస్ పూరన్ను సూపర్ ఓవర్లో ఆడించడం పట్ల లక్నో నాయకత్వ బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించిన తీరు కూడా వైరల్గా మారింది. ‘‘మాకు కచ్చితంగా విరామం కావాలి. మళ్లీ సరికొత్తగా తిరిగివస్తాం. ఇలాంటి మ్యాచ్లలో ఒత్తిడి సహజం.అయితే, మేము దీనిపై బహిరంగంగా స్పందించాల్సిన అవసరం లేదు. అంతర్గతంగా కూర్చుని చర్చిస్తాం. ఒకరూ.. ఇద్దరూ కాదు.. ఇది సమిష్టి వైఫల్యం. కాబట్టి జట్టులోని ప్రతి ఒక్కరు ఇందుకు జవాబుదారీగా ఉండాల్సిందే.పంత్ స్పందన ఇదేఇక పూరన్ విషయంలోనూ మేమంతా కలిసికట్టుగానే నిర్ణయం తీసుకున్నాం. సూపర్ ఓవర్లో ఎవరిని పంపించాలన్న ప్రశ్న వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నిక్కీ పేరునే సూచించారు. అతడు ఇప్పుడు అత్యుత్తమ ఫామ్లో లేకపోవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే నిక్కీ వంటి స్టార్లపై నమ్మకం ఉంచాలి.అయితే, ఇక్కడ మా వ్యూహం ఫలించలేదు. మ్యాచ్లో సానుకూల అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాము. కానీ ఈరోజు మాకు అంతగా కలిసిరాలేదు. అయితే, విరామం తర్వాత మళ్లీ సరికొత్తగా తిరిగివస్తామనే నమ్మకం ఉంది’’ అని పంత్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో నికోలస్ పూరన్ 12 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు.. పంత్ 38 బంతుల్లో 42 పరుగులు రాబట్టగలిగాడు. చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్పై నెమ్మదిగా ఆడు' -
ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్లో లక్నోపై కేకేఆర్ విజయం
ఐపీఎల్-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మాజాను అందించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో కోల్కతా సూపర్ ఓవర్లో విజయం సాధించింది.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్ను రింకూ తన విరోచిత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు.రింకూ సింగ్ కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 83 పరుగులు అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్లో లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్తో కేకేఆర్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. మొహ్సిన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సెన్సేషనల్ షమీఅనంతరం లక్ష్య చేధనలో లక్నో కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కార్తీక్ త్యాగి వేసిన చివరి ఓవర్లో లక్నో విజయానికి 17 పరుగులు అవసరమవ్వగా.. షమీ చివరి బంతికి సిక్స్ కొట్టడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్తో ఫలితం తేల్చాలని అంపైర్లు నిర్ణయించారు. అయితేసూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో మూడు బంతుల్లో రెండు వికెట్ల నష్టానికి కేవలం ఒక్క పరుగు చేసింది. సునీల్ నరైన్ బౌలింగ్లో తొలి బంతికి పూరన్ క్లీన్ బౌల్డ్ కాగా.. రెండో బంతికి పంత్ సింగిల్ తీసి మార్క్రమ్కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి మార్క్రమ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. రూల్స్ ప్రకారం.. సూపర్ ఓవర్లో రెండు వికెట్లు వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత తొలి బంతికే రింకూ సింగ్ ఫోర్ కొట్టి కేకేఆర్ను గెలిపించాడు. -
ఫినిషర్ ఈజ్ బ్యాక్.. రఫ్ఫాడించిన రింకూ సింగ్
ఐపీఎల్-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ స్టార్ రింకూ సింగ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్ను రింకూ తన విరోచిత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఓ దశలో ఆచితూచి ఆడిన రింకూ.. చివరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.మహ్మద్ షమీ వేసిన 19 ఓవర్లో 17 పరుగులు రాబట్టిన రింకూ సింగ్.. ఆ తర్వాత ఆఖరి ఓవర్లో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీని ఓ ఆడుకున్నాడు. ఆ ఓవర్లో రింకూ వరుసగా నాలుగు సిక్స్లు బాది 26 పరుగులు పిండుకున్నాడు. మరో రెండు పరుగులు వైడ్స్ రూపంలో వచ్చాయి.కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రింకూ సింగ్.. 7 ఫోర్లు, 5 సిక్స్లతో 83 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రింకూ సింగ్కు ఐపీఎల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం.నిప్పులు చెరిగిన మొహ్సిన్ఇక రింకూ సునామీకి ముందు లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్తో కేకేఆర్ టాపర్డర్ను మోహ్షిన్ కుప్పకూల్చాడు. మొహ్సిన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో లిండే ఓ వికెట్ సాధించారు. మహ్మద్ షమీతో సహా మిగితా బౌలర్లందా దారుణంగా విఫలమయ్యారు.చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్పై నెమ్మదిగా ఆడు'Rinku Singh and multiple sixes in the last over - we've seen this before 🔥pic.twitter.com/6LOikbBKMG— Cricbuzz (@cricbuzz) April 26, 2026 -
ఇది అవుటా? నాటౌటా? పాపం రఘువంశీ
ఐపీఎల్-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీని దురదృష్టం వెంటాడింది. క్రికెట్లో అరుదుగా కన్పించే 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' (ఫీల్డింగ్కు ఆటంకం కలిగించడం) నిబంధన ప్రకారం రఘువంశీ ఔటయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ ప్రకారం ఔటైన నాలుగో బ్యాటర్గా రఘువంశీ నిలిచాడు.ఏమి జరిగిందంటే?కోల్కతా ఇన్నింగ్స్ 5వ ఓవర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఆఖరి బంతికి రఘువంశీ మిడ్-ఆన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్ ఆన్లో ఉన్న మహ్మద్ షమీ బంతిని వేగంగా అందుకోవడంతో.. రఘువంశీ సగం దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించాడు.అయితే వెనక్కి వెళ్లే క్రమంలో షమీ త్రో చేసిన బంతి రఘువంశీ కాలికి తగిలి వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లలేదు. అయితే రఘువంశీ కావాలనే తన దారిని మార్చుకుని వెనుక్కి పరిగెత్తాడని పంత్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్కు అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. చాలా సేపు రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్.. రఘువంశీ కావాలనే ఫీల్డర్ విసిరిన బంతికి అడ్డుపడ్డాడని నిర్ధారించారు.దీంతో ఆర్టికల్ 37 ప్రకారం అతడిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద అవుట్గా ప్రకటించారు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై రఘువంశీతో పాటు హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, మెంటార్లు షేన్ వాట్సన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. రఘువంశీ మైదానాన్ని వీడే క్రమంలో తన బ్యాట్ను, హెల్మెట్ను నేలకేసి కొట్టాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అతడు క్రీజులోకి చేరుకోవాలనే ఉద్దేశంతోనే అలా పరిగెత్తాడని, అలా ఎలా ఔట్ ఇస్తారని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. మరో యూజర్ రూల్స్ ప్రకారం ఇది అవుటేనని కామెంట్ చేశాడు. Obs 🥵Angkrish Raghuvanshi !! Obstructing the field #LSGvsKKR #CSKvsGTpic.twitter.com/2mTxfZlbJU— Baba Jaipuriya (@BabaJaipuriya) April 26, 2026 -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ఫాస్టెస్ట్ ఇండియన్గా
ఐపీఎల్-2026లో చెపాక్ మైదానం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ నిరాశపరిచాడు. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన శాంసన్.. గుజరాత్పై మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. 15 బంతుల్లో 11 పరుగులు చేసి సంజూ ఔటయ్యాడు.అయితే ఈ మ్యాచ్లో శాంసన్ విఫలమైనప్పటికి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 5000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడి శాంసన్ రికార్డు సృష్టించాడు. సంజూ కేవలం 3555 బంతుల్లో ఈ ఫీట్ను అందుకున్నాడు.ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే లెజెండ్ సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా 3620 బంతుల్లో ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్గా ఈ జాబితాలో దిగ్గజాలు ఏబీ డివిలియర్స్ (3288 బంతులు), డేవిడ్ వార్నర్ (3554 బంతులు) తొలి రెండు స్ధానాల్లో ఉన్నారు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్కేపై 6 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఓపెనర్ సాయిసుదర్శన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 87) మరోసారి అదరగొట్టాడు.అత్యంత తక్కువ బంతుల్లో 5000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:సంజూ శాంసన్ – 3555 బంతులుసురేష్ రైనా – 3620 బంతులుకేఎల్ రాహుల్ – 3688 బంతులుఎంఎస్ ధోని – 3691 బంతులురోహిత్ శర్మ – 3817 బంతులువిరాట్ కోహ్లీ – 3827 బంతులుచదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్పై నెమ్మదిగా ఆడు' -
చితక్కొట్టిన సాయి సుదర్శన్.. సీఎస్కేను చిత్తు చేసిన గుజరాత్
ఐపీఎల్-2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. సీఎస్కే నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.గుజరాత్ ఓపెనర్ సాయిసుదర్శన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 87) మరోసారి సత్తాచాటాడు. అతడితో పాటు జోస్ బట్లర్(39 నాటౌట్), శుభ్మన్గిల్(33)రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఆకిల్ హోస్సేన్, నూర్ అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు.రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్అంతకముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శాంసన్, బ్రెవిస్ వంటి స్టార్ ప్లేయర్లు ఆరంభంలోనే ఔటైనప్పటికి.. రుతురాజ్ మాత్రం ఆచితూచి ఆడుతూ జట్టుకు గౌరప్రదమైన స్కోర్ను అందించాడు.60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 6 ఫోర్లు, 4 సిక్స్లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓవర్టన్(6 బంతుల్లో 18) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ మూడు, అర్షద్ ఖాన్, సుత్తార్, సిరాజ్ తలా వికెట్ సాధించారు. గుజరాత్కు ఇది నాలుగో విజయం. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరుకుంది.చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్పై నెమ్మదిగా ఆడు' -
లక్నో వర్సెస్ కేకేఆర్ మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ సిద్దార్ధ్ స్ధానంలో లిండే తుది జట్టులోకి వచ్చాడు. కేకేఆర్ మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే(కెప్టెన్), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), కెమెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రోవ్మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగిలక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్ -
'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్పై నెమ్మదిగా ఆడు'
ఐపీఎల్-2026 సీజన్లో శనివారం జైపూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. వైభవ్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీని సాధించి ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.అయినప్పటికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో వైభవ్ వీరోచిత సెంచరీ వృథా అయిపోయింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్తో సూర్యవంశీతో మాట్లాడుతూ కన్పించాడు. తాజాగా వారి సంభాషణకు సంబంధించిన వివరాలను కిషన్ అభిమానులతో పంచుకున్నాడు."వైభవ్ ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడో తనకు వివరించాను. అతడు నిజంగా ఒక అద్భుతమైన ఆటగాడు. అతడు గనుక మరికొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే స్కోరు 250 దాటేది. అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు తలుచుకుంటుంటే భయమేస్తోంది. అతడి వికెట్ తీయడం మాకు కలిసొచ్చింది" అని కిషన్ వెల్లడించాడు.అంతేకాకుండా మా జట్టుపై కొంచెం నెమ్మదిగా ఆడు, నీ రహస్యాలన్నీ నాకు తెలుసు" అని సరదాగా వైభవ్ను హెచ్చరించినట్లు కిషన్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.చదవండి: నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్ -
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీఎస్కే స్కోరెంతంటే?
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు తన ఫామ్ను అందుకున్నాడు. ఈ లీగ్లో భాగంగా చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రుతురాజ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నప్పటికి రుతురాజ్ మాత్రం ఆచితూచి తమ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ను అందించాడు.60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 6 ఫోర్లు, 4 సిక్స్లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు జేమీ ఓవర్టన్(6 బంతుల్లో 18) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో రబాడ మూడు, అర్షద్ ఖాన్, సుత్తార్, సిరాజ్ తలా వికెట్ సాధించారు. గత మ్యాచ్లో సెంచరీతో సత్తాచాటిన సంజూ సంశాన్.. గుజరాత్పై మాత్రం 11 పరుగులు చేసి ఔటయ్యాడు. -
అతడొక అద్భుతం.. నా ఫేవరేట్ ప్లేయర్: కమ్మిన్స్
ఐపీఎల్-2026లో శనివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో వైభవ్ సంచలన సెంచరీతో చెలరేగాడు. వైభవ్ కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో తన రెండో ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడు వైభవ్ ఆటతీరుకు సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సైతం ఫిదా అయిపోయాడు. మ్యాచ్ అనంతరం వైభవ్పై కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు."వైభవ్ నా కొత్త ఫేవరెట్ ప్లేయర్. అతడు బ్యాటింగ్ స్కిల్స్ నిజంగా అద్భుతం. బంతిని చాలా బలంగా కొడుతున్నాడు. వైభవ్ బ్యాటింగ్ చూడటానికి చాలా బాగుంది. అతడికి బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం లైన్ తప్పినా బంతిని మైదానం వెలుపల పడటం ఖాయమని" కమ్మిన్స్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్లో సూర్యవంశీ.. కమ్మిన్స్ను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు. కాగా15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే వరల్డ్క్లాస్ బౌలర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్వుడ్, అర్ష్దీప్ సింగ్లకు తన పవర్ ఏంటో చూపించాడు. ఈ ఏడాది సీజన్లో సూర్యవంశీ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 357 పరుగులు చేశాడు.చదవండి: నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్ -
నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తమ హోం గ్రౌండ్లో ఆడిన తొలి మ్యాచ్లోనే ఘోర ఓటమి చవిచూసింది. శనివారం జైపూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ పరాజయం పాలైంది. 229 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ బౌలర్లు కాపాడులేకపోయారు.అంతేకాకుండా కెప్టెన్ రియాన్ పరాగ్ తల తిక్క నిర్ణయాలు కూడా రాజస్తాన్ ఓటమికి ఓ కారణంగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో టాప్ క్లాస్ స్పిన్నర్లు రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాలతో పరాగ్ చెరో ఓవర్ మాత్రమే వేయించాడు. భారీగా పరుగులు సమర్పించుకున్న బ్రిజేష్ శర్మతో మాత్రం పరాగ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించాడు.కెప్టెన్సీతో మాత్రమే కాదు బ్యాటింగ్ పరంగా రియాన్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు.ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో పరాగ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన పరాగ్ కేవలం 88 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 20 పరుగులగా ఉంది. ఈ నేపథ్యంలో పరాగ్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. "రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం రియాన్ పరాగ్ కెప్టెన్సీపై పునరాలోచన చేయాలి. అతడు తమకు సరైన కెప్టెన్ కాదా అన్నది రాజస్తాన్ మరోసారి ఆలోచించాలి. మీరు 25 మందినీ ఇంటర్వ్యూ చేసి పరాగ్ను ఎంపిక చేసి ఉండొచ్చు. కానీ అతడు లీడర్గా నిరూపించుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా అతడి వ్యూహాలు ఎంటో ఆర్ధం కావడం లేదు. హైదరాబాద్తో మ్యాచ్లో వికెట్ టేకింగ్ బౌలర్లైన రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాలతో ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయించాడు. వారికి మరో ఓవర్ ఇచ్చి ఉండాల్సింది. ఒక్క ఓవర్ మాత్రమే ఇస్తే వికెట్లు ఏలా తీస్తారు? అతడు బ్యాటర్గా కూడా విఫలమవుతున్నాడు. ఆ ప్రభావం కచ్చితంగా అతడి కెప్టెన్సీపై పడుతుంది. పరుగులు ఎలా సాధించాలన్న తపనతో కెప్టెన్సీపై ఏకాగ్రతను కోల్పోతున్నాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకం బాదేశాడు, నేను సీనియర్ని, ఎందుకు పరుగులు చేయలేకపోతున్నాను అని పరాగ్ తెగ ఆలోచిస్తుంటాడు. పదేపదే ఎక్కువగా ఆలోచించడంతో అతడిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని" క్రిక్బజ్ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీకి తీవ్ర గాయం.. ఐపీఎల్ నుంచి అవుట్? -
సీఎస్కే వర్సెస్ గుజరాత్ మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్ జట్టులోకి అర్షద్ ఖాన్ రాగా.. సీఎస్కే జట్టులోకి ఉర్విల్ పటేల్ వచ్చాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్ -
పొద్దున్నే విరాట్, రాత్రికి అభిషేక్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) డబుల్ హెడర్ మ్యాచ్లు జరిగాయి. ఆసక్తికరంగా రెండూ హై స్కోరింగ్ మ్యాచ్లే అయ్యాయి. రెండు మ్యాచ్ల్లో సిక్సర్లు, బౌండరీల వర్షం, సెంచరీల హోరు, పరుగుల వరద పారింది. ఈ క్రమంలో నిన్నటి రోజుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికే ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ఏకంగా నలుగురి చేతులు మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.ఉదయం వరకు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉండగా.. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 67 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు.సాయంత్రానికి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రంగంలోకి దిగి మెరుపు సెంచరీతో ఆరెంజ్ క్యాప్ను రాహుల్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. రాత్రికి అదే మ్యాచ్లో సన్రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ తన బ్యాట్కు పని చెప్పి, గంటలు కూడా గడవకముందే వైభవ్ నుంచి ఆరెంజ్ క్యాప్ లాగేసుకున్నాడు.ఇలా ఒకే రోజులో ఆరెంజ్ క్యాప్ నాలుగు సార్లు చేతులు మారడంతో సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా స్పందించారు. ఆరెంజ్ క్యాప్ 24 గంటల మెడికల్ షాప్ ఉద్యోగిలా షిఫ్ట్లు మారుతోంది అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, మరొకరు "ఉదయం కోహ్లీ, మధ్యాహ్నం కేఎల్, సాయంత్రం వైభవ్, రాత్రికి అభిషేక్.. ఐపీఎల్ 2026 పూర్తిగా సినిమానే" అని అన్నాడు. ఇలాంటి రకరకాల మీమ్స్తో సోషల్మీడియా హోరెత్తింది.కాగా, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ పట్టికలో అభిషేక్ శర్మ 380 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్ తలో 357 పరుగులతో రెండో స్థానాన్ని పంచుకున్నారు. సన్రైజర్స్ మరో ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 349 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 328 పరుగులతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఉదయం అగ్రస్థానంలో ఉండిన కోహ్లి రాత్రి కంతా ఐదో స్థానానికి పడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. -
SRHపై బుడ్డోడి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్
-
పంజాబ్ కింగ్స్ మరో చరిత్ర
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్పై 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్య ఛేదన ఐపీఎల్లోనే కాకుండా యావత్ పొట్టి క్రికెట్లోనే అత్యధికం. ఈ మ్యాచ్కు ముందు వరకు కూడా ఈ రికార్డు పంజాబ్ పేరిటే ఉండేది. 2024 ఎడిషన్లో ఈ జట్టు కేకేఆర్పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.టీ20 చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్లు ఇవేపంజాబ్ కింగ్స్- 265/4- ప్రత్యర్ధి- ఢిల్లీ క్యాపిటల్స్పంజాబ్ కింగ్స్-262/2- ప్రత్యర్ధి-కేకేఆర్సౌతాఫ్రికా- 259/4- ప్రత్యర్ధి- వెస్టిండీస్బ్రిస్బేన్ హీట్-258/2- ప్రత్యర్ధి- పెర్త్ స్కార్చర్స్ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో పంజాబ్ మరో భారీ రికార్డు కూడా నెలకొల్పింది. ఇప్పటివరకు తలో ఐదు సార్లు ఛాంపియన్లైన సీఎస్కే, ముంబై ఇండియన్స్ కూడా సాధించలేని ఘనతను సాధించింది.శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న ఈ జట్టు.. తొలి ఏడు మ్యాచ్లలో ఆరు విజయాలు నమోదు చేయగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు లీగ్ మ్యాచ్ల అనంతరం 13 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఈ గణాంకాల ద్వారానే పంజాబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది.ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టూ తొలి ఏడు మ్యాచ్ల తర్వాత 13 పాయింట్లు సాధించలేదు. 12 పాయింట్లు మాత్రమే గరిష్టంగా ఉండేది. ఆ ఘనతను ముంబై, చెన్నై, గుజరాత్, రాజస్థాన్ వంటి పలు జట్లు సాధించాయి. ఇప్పుడు పంజాబ్ ఆ రికార్డును చెరిపేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.Most points in an #ipl after 7 games13 - PBKS (2026)12 - MI (2010), CSK (2014), PBKS (2014), CSK (2015), GL (2016), MI (2017), CSK (2019), GT (2022), RR (2024) pic.twitter.com/8EK78fGVzR— Erika Morris (@ErikaMorris79) April 25, 2026కాగా, నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి ఢిల్లీ.. కేఎల్ రాహుల్ (152 నాటౌట్), నితీశ్ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (43), ప్రభ్సిమ్రన్ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్) నమ్మశక్యం కాని బ్యాటింగ్తో మ్యాచ్ను ముగించాడు. ఫలితంగా పంజాబ్ ఈ సీజన్లో తమ జైత్రయాత్రను కొనసాగించింది. -
వైభవ్ సూర్యవంశీ గాయంపై అధికారిక అప్డేట్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తొడ కండరాలు పట్టేయడంతో వైభవ్ నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినా నొప్పి తగ్గలేదు. నడిచేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్ల సాయంతో వైభవ్ మైదానాన్ని వీడాడు. ఇదే మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసి భీకర ఫామ్లో ఉండిన వైభవ్ మైదానాన్ని వీడటంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.వైభవ్ గాయం చాలా తీవ్రమైందని, దీని దెబ్బకు సీజన్ మొత్తానికి దూరం కావాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి రాయల్స్ అసిస్టెంట్ కోచ్ విక్రమ్ రాథోడ్ చెక్ పెట్టాడు. వైభవ్ గాయం తీవ్రంగా లేదని మ్యాచ్ అనంతరం అధికారికంగా వెల్లడించాడు. దీంతో రాయల్స్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.రాథోడ్ మాటల్లో.. "వైభవ్ హ్యామ్స్ట్రింగ్లో కొద్దిగా అసౌకర్యం అనిపించింది. అందుకు చికిత్స అందించారు. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు. మరో రోజు లేదా రెండు రోజుల్లో పూర్తి స్థితి తెలుస్తుంది. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.రాథోడ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైభవ్ రాయల్స్ తదుపరి మ్యాచ్ సమయానికంతా సిద్దంగా ఉంటాడని తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల విశ్రాంతి తీసుకుంటే సరిపొతుందని స్పష్టమవుతుంది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ 28న పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. ఆ మ్యాచ్ సమయానికి వైభవ్ తప్పక అందుబాటులో ఉండే అవకాశం ఉంది.ఒకవేళ వైభవ్ ఆ మ్యాచ్ సమయానికి అందుబాటులో లేకపోతే రాయల్స్కు తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో వైభవ్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. తాజాగా తాను గాయపడిన మ్యాచ్లోనూ 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో రాయల్స్ పరాజయంపాలైంది. -
వాళ్లు కొట్టినప్పుడు, మేమూ కొడతామనుకున్నా: శ్రేయస్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో గుజరాత్ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో ఏడు బంతులు మిగిలుండగానే సునాయాసంగా ఊదేసింది. ఈ గెలుపు అనంతరం పంజాబ్ కింగ్స్ సారధి శ్రేయస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని అన్నాడు. శ్రేయస్ మాటల్లో..నిజంగా చెప్పాలంటే, మాటలు రావడం లేదు. మైదానంలో తీవ్ర ఎండ, మరోవైపు బౌలర్లు వరుసగా బౌండరీలు, సిక్సర్లు ఇస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మాకు తెలుసు.పిచ్ స్పిన్కు సహకరిస్తుందని ముందుగా భావించినప్పటికీ, ఆశించినంత మలుపు లభించలేదు. చహల్ బౌలింగ్కు వచ్చిన తర్వాత మాత్రమే బంతి కొద్దిగా ఆగినట్లు అనిపించింది.కేఎల్ రాహుల్ ఆడిన తీరు అద్భుతం. అతని షాట్లు కళ్లకు పండుగలా అనిపించాయి. అతను ఎలాంటి ఒత్తిడిలోనూ లేనట్లు కనిపించాడు.భారీ లక్ష్యాన్ని ఛేదించే ముందు నా ఆలోచన ఒక్కటే. వాళ్లు ఎంత చేసినా, మనం ఒక్క పరుగు ఎక్కువ చేయాలి. వాళ్లు కొట్టగలిగినప్పుడు, మేమూ కొడతామనుకున్నా. ఆ సమయంలో అదే నా మైండ్సెట్.డ్రెస్సింగ్రూమ్లో కూడా ఇదే చర్చ జరిగింది. గత మ్యాచ్ల్లో 220కి పైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన అనుభవం మాకు ధైర్యాన్నిచ్చింది.ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్ పవర్ప్లేలోనే దూకుడుగా ఆడి బలమైన పునాది వేశారు. వారి ఆరంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించారు.బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించిన అయ్యర్, ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నామని అన్నాడు.కాగా, చారిత్రక గెలుపు తర్వాత పంజాబ్ను చూసి మిగతా జట్లంతా వణికిపోతున్నాయి. వీరికి ఎంత లక్ష్యమైతే సరిపోతుందని లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ మునుపెన్నడూ లేనంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతే ఏకైక అజేయ జట్టుగా చలామణి అవుతుంది. మున్ముందు కూడా పంజాబ్ ఇదే జోరును కొనసాగిస్తే, ఈసారి టైటిల్ గెలవకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. గత సీజన్లో ఇదే శ్రేయస్ నేతృత్వంలో పంజాబ్ రన్నరప్తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. -
పంజాబ్ చేతిలో ఓటమిని సహచరులపైకి నెట్టిన అక్షర్ పటేల్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఓటమిని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తన ఫీల్డర్ల ఖాతాలోకి వేశాడు.మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందిస్తూ.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు."మేము మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తున్నాం. ఇలాంటి పిచ్పై బౌలర్లకు ఫీల్డర్లు సహకరించకపోతే, ఓడిపోవడమే సరైన ఫలితం" అంటూ కఠినంగా వ్యాఖ్యానించాడు.ముఖ్యంగా ఫీల్డింగ్ వైఫల్యమే మ్యాచ్ను చేజార్చిందని స్పష్టం చేశాడు. కరుణ్ నాయర్ శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన రెండు కీలక క్యాచ్లను వదిలేయడం జట్టుకు భారీ మూల్యం చెల్లింపజేసిందని అన్నాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అయ్యర్ 36 బంతుల్లో అజేయమైన 71 పరుగులు చేసి పంజాబ్ను విజయతీరాలకు చేర్చాడని తెలిపాడు.అక్షర్ తన బౌలర్లపైనా అసహనం వ్యక్తం చేశాడు. పవర్ప్లేలో ప్రత్యర్థి పరుగుల వేగాన్ని నియంత్రించడంలో బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నాడు. ఢిల్లీ బౌలర్లందరూ ఓవరుకు 11కి పైగా పరుగులు సమర్పించడం జట్టు పరిస్థితిని మరింత దయనీయంగా మార్చిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.కుల్దీప్ రెండు వికెట్లు తీసినా 46 పరుగులు ఇచ్చాడు. తాను, నటరాజన్, ముకేశ్ కుమార్, ఆకిబ్ నబీ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నామని అన్నాడు. ఈ వికెట్పై 264 పరుగుల స్కోర్ చాలా మంచిదని అభిప్రాయపడ్డాడు. లక్ మా పక్షాన ఉండి, క్యాచ్లు పట్టుంటే ఈజీగా గెలిచేవాళ్లమని తెలిపాడు. ఈ సీజన్లో మేం ఓడిన మ్యాచ్లు చూస్తే చాలా వరకు క్లోజ్ మ్యాచ్లు. వాటిలో కొన్ని అవకాశాలను ఓడిసి పట్టుకుని ఉంటే, రెండు-మూడు అదనపు విజయాలు మా ఖాతాలో ఉండేవని అని అభిప్రాయపడ్డాడు. తప్పులు పదేపదే రిపీట్ చేస్తుంటే, అవకాశాలు మళ్లీమళ్లీ రావని అసహనం వ్యక్తం చేశాడు.కాగా, ఈ మ్యాచ్లో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి కేఎల్ రాహుల్ (152 నాటౌట్), నితీశ్ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (43), ప్రభ్సిమ్రన్ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్) నమ్మశక్యం కాని బ్యాటింగ్తో మ్యాచ్ను ముగించాడు. ఫలితంగా పంజాబ్ ఈ సీజన్లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. -
ఇలాంటి స్కోర్లను మా బ్యాటర్లు ఊదేస్తారు.. కమిన్స్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. అభిషేక్ శర్మ (57), ఇషాన్ కిషన్ (74), నితీశ్ కుమార్ రెడ్డి (36) మెరుపు విన్యాసాల కారణంగా ఎస్ఆర్హెచ్ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఊదేసింది.ఈ గెలుపుపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇలా స్పందించాడు. సీజన్లో తొలి మ్యాచ్ (ఈ సీజన్లో కమిన్స్కు ఇదే తొలి మ్యాచ్) ఎలా సాగుతుందో ఎప్పుడూ కొంత అనిశ్చితి ఉంటుంది. కానీ మా సన్నాహాలు అద్భుతంగా జరిగాయి. అనుభవంతో ఆటను త్వరగా అర్థం చేసుకోగలుగుతున్నాను.ప్రస్తుతం టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్ల ఆటగా మారిపోయింది. ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచ్లు బౌలర్లకు పెద్ద సవాలే. కానీ రెండు ఖరీదైనా ఓవర్లు వేసినా, మళ్లీ తిరిగి వచ్చి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే టీ20 అందం.యువ బౌలర్ల ప్రదర్శనపై కమిన్స్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. ప్రఫుల్ హింగే ప్రస్తావన తీసుకొచ్చాడు. వీరిని ఇషాన్ కిషన్ అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ లాంటి సీనియర్లు ఉండనే ఉన్నారని అన్నాడు. డగౌట్ బౌలర్లతో కలకలలాడుతుందని తెలిపాడు. యువ బౌలర్లు స్పష్టమైన ప్రణాళికలతో రాణిస్తున్నారని కొనియాడాడు.మధ్య విరామ సమయంలో జట్టు చాలా ప్రశాంతంగా ఉందని వెల్లడించాడు. ప్రత్యర్థి స్కోరు 250 దాటే అవకాశముండగా, 220 వద్ద నిలిపేయడం కీలకమైందని చెప్పాడు. పవర్ప్లేలోనే మ్యాచ్పై పట్టుసాధించాలని భావించామని తెలిపాడు. ప్రస్తుతమున్న ఫామ్లో మా బ్యాటర్లు ఇలాంటి లక్ష్యాలను సులభంగా ఊదేయగలరని విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా, కమిన్స్ వ్యాఖ్యల్లో తన బృందంపై నమ్మకం, ధీమా కొట్టొచ్చినట్లు కనిపించింది. తన గైర్హాజరీలో ఇషాన్ జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని అభిప్రాయపడ్డాడు. అలాగే బౌలర్లు, ముఖ్యంగా యువ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటర్ల మెరుపు విన్యాసాలపై ధీమా కనిపించింది. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. -
అదే మా కొంపముంచింది.. సన్రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం రియాన్ పరాగ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. వైభవ్ సూర్యవంశీ (103) శతక్కొట్టుడుతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా, సన్రైజర్స్ ఇషాన్ కిషన్ (74), అభిషేక్ శర్మ (57) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో సన్రైజర్స్ రాయల్స్ను వెనక్కు నెట్టి (నాలుగో స్థానానికి) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఇలా స్పందించాడు.భారీ స్కోరు చేసినప్పటికీ, క్యాచ్లు వదిలేయడం జట్టుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నైపుణ్య పరంగా చూస్తే మేం బాగా ఆడాం. కానీ కీలక సమయంలో చాలా క్యాచ్లు వదిలేశాం. అభిషేక్ శర్మ లాంటి నాణ్యమైన ఆటగాళ్లకు రెండో అవకాశం ఇస్తే, అతను దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు. అదే జరిగింది.228 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, ఇంకా 10 నుంచి 15 పరుగులు వెనుకపడ్డాం. చివరి రెండు ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లు అద్భుతమైన యార్కర్లతో పరుగులను నియంత్రించారు.బౌలింగ్ మార్పులపై వివరణ ఇస్తూ.. ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో తాను, మరో స్పిన్నర్ కలిసి వికెట్ కోసం ప్రయత్నించాం. అయితే పిచ్ స్పిన్కు అనుకూలంగా లేకపోవడంతో మా ప్రణాళిక ఫలించలేదు.ఆర్చర్ ప్రదర్శన చాలా అద్భుతం. ఈ సీజన్ అంతా అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా క్లాసిక్ స్పెల్ వేశాడు. కొన్ని టాప్ ఎడ్జ్లు ఫీల్డర్ల మధ్య పడటం అతని దురదృష్టం.తదుపరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఎదుర్కొననుండటంపై స్పందిస్తూ.. ప్రతి వేదిక కొత్త సవాల్. చండీగఢ్ పిచ్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం సిద్ధం చేసుకుంటాము.ఒక రోజు విరామం ఉంది. మానసికంగా ఫ్రెష్ అయి, తప్పులను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. ఫీల్డింగ్ వైఫల్యాలను అధిగమిస్తే రాజస్థాన్ రాయల్స్ మరింత ప్రమాదకర జట్టుగా మారడం ఖాయమని రియాన్ అభిప్రాయపడ్డాడు.కాగా, ఈ మ్యాచ్లో రాయల్స్ ఓటమికి ఫీల్డింగ్ వైఫల్యాలు, క్యాచ్లు జారవిడచడమే ప్రధాన కారణమైనప్పటికీ.. బ్యాటింగ్లో లోపాలు సైతం గమినించదగ్గవే. వాస్తవానికి ఈ మ్యాచ్లో ఆ జట్టు ఇంకా భారీ స్కోర్ చేసుండాల్సింది. సూర్యవంశీ క్రీజ్లో ఉన్నంత సేపు సునాయాసంగా 250 ప్లస్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔటైన వెంటనే సీన్ రివర్స్ అయ్యింది. ఫెరియెరా మెరుపులు మినహా మధ్య వరుస బ్యాటర్లెవ్వరూ రాణించలేదు. అలాగే ఈ మ్యాచ్లో రియాన్ కెప్టెన్గానూ విఫలమయ్యాడు. పిచ్ను సరిగ్గా అంచనా వేయలేక ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయోగించాడు. స్ట్రయిట్ స్పిన్నర్లు రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాతో తలో ఓవర్ మాత్రమే వేయించి మూల్యం చెల్లించుకున్నాడు. మొత్తంగా ఈ ఓటమితో రాయల్స్ చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. -
ప్రపంచ రికార్డుపై ‘పంజా’బ్
ఆహా ఏమా మ్యాచ్... ఏమా కొట్టుడు! ఒకరిని మించి ఒకరు వంతులు వేసుకున్నట్లు... ప్రత్యర్థి బౌలర్లపై ఏదో పగ పట్టినట్లు... బంతిమీద ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లు... ఫోర్లు, సిక్స్లు ఒకటే మోత! మొదట కేఎల్ రాహుల్, నితీశ్ రాణా దంచి కొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ చరిత్రలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసుకుంటే... పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలుండగానే దాన్నిఊదేసింది.ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ప్లేయర్గా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టిస్తే... మేమేం తక్కువా అన్నట్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ విశ్వరూపం చూపారు. దీంతో ఐపీఎల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ తమ పేరిటే ఉన్న రికార్డును మరింత మెరుగు పరుచుకుంది. రెండు జట్లు కలిపి 49 ఫోర్లు, 33 సిక్స్లు బాదిన ఈ మ్యాచ్లో మొత్తం 529 పరుగులు నమోదు కాగా... శనివారం అభిమానులు పైసా వసూల్ పరుగుల పండగను వీక్షించారు.న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ ఖాతాలో ఆరో విజయం చేరింది. శనివారం జరిగిన పోరులో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (67 బంతుల్లో 152 నాటౌట్; 16 ఫోర్లు, 9 సిక్స్లు) భారీ సెంచరీతో కదం తొక్కగా... నితీశ్ రాణా (44 బంతుల్లో 91; 11 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు.వీరిద్దరు రెండో వికెట్కు 220 పరుగులు జోడించడంతో... ఢిల్లీ కొండంత స్కోరు చేయగలిగింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు. ఈ క్రమంలో ఐపీఎల్లో మూడో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్గా రాహుల్ నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 265 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (26 బంతుల్లో 76; 9 ఫోర్లు, 5 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 71 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్లు) హాఫ్సెంచరీలతో విజృంభించగా... ప్రియాన్ష్ ఆర్య (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్లు) దంచికొట్టాడు. రాహుల్ రాక్స్... ఈ సీజన్లో తొలిసారి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ ఆరంభం నుంచే... దూకుడుగా ఆడింది. మూడో ఓవర్లో నిసాంక (11) వెనుదిరగగా... అక్కడి నుంచి రాహుల్, రాణా మోత మొదలైంది. ఈ జంట వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ 68/1తో నిలిచింది. ఈ క్రమంలో రాహుల్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... బార్ట్లెట్ వేసిన 12వ ఓవర్లో రాణా వరుసగా 6, 4, 4, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. అర్‡్షదీప్ ఓవర్లో 4, 6, 4, 4 కొట్టిన రాహుల్ యాన్సెన్ ఓవర్లో మరో రెండు ఫోర్లతో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వైశాక్ వేసిన 16వ ఓవర్లో రాహుల్ 6, 6, 6, 4తో విజృంభించాడు. సెంచరీకి సమీపించిన నితీశ్ రాణా భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ కాగా... రాహుల్ ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. 6 ఓవర్లలో 116 పరుగులు కొండంత లక్ష్యం ముందున్నా పంజాబ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ , ప్రభ్సిమ్రన్ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు రాకెట్ను తలపించింది. అక్షర్ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్స్లు ఒక ఫోర్తో ఆర్య 20 పరుగులు రాబట్టుకోగా... అఖీబ్ ఓవర్లో ప్రభ్సిమ్రన్ 3 సిక్స్లు బాదాడు. ఐదో ఓవర్లో నటరాజన్ 9 పరుగులే ఇవ్వగా... ముకేశ్ వేసిన ఆరో ఓవర్లో ప్రభ్సిమ్రన్ 6 ఫోర్లు కొట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ 116 పరుగులు చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటైనా... శ్రేయస్ మిగిలిన పని పూర్తిచేశాడు. శ్రేయస్ క్యాచ్ మిస్ ఈ మ్యాచ్లో ఢిల్లీ ఫీల్డింగ్ పేలవంగా సాగింది. విప్రాజ్ నిగమ్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ ఇచ్చిన క్యాచ్ను కరుణ్ నాయర్ వదిలేశాడు. అదే ఓవర్లో నేహల్ వధేరా (25; 3 ఫోర్లు, 1 సిక్స్) క్యాచ్ను ఒడిసి పట్టిన కరుణ్... శ్రేయస్ ఇచ్చిన సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. అప్పటికి పంజాబ్ విజయానికి 31 బంతుల్లో 63 పరుగులు అవసరం కాగా... శ్రేయస్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. తదుపరి ఓవర్ రెండో బంతికి సైతం శ్రేయస్ ఇచ్చిన సులువైన క్యాచ్ను మరోసారి కరుణ్ నాయర్ జారవిడిచాడు. దీన్ని సది్వనియోగ పరుచుకున్న అయ్యర్... అదే ఓవర్లో 6, 4, 6, 6 కొట్టి సమీకరణాన్ని సులభతరం చేశాడు. నటరాజన్ ఓవర్లోనూ 6, 4 బాదిన శ్రేయస్ 26 బంతుల్లో పిఫ్టీ మార్క్ దాటడంతో పాటు... శశాంక్ సింగ్ (19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.152 ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ చేసిన స్కోరు. ఐపీఎల్లో ఓ భారత బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. అభిõÙక్ శర్మ (141) రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్గా క్రిస్ గేల్ (175; 2013లో), మెక్కల్లమ్ (158; 2008లో) తర్వాత లీగ్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ రాహుల్.ఎన్గిడికి గాయం... పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఢిల్లీ ప్లేయర్ ఎన్గిడి గాయపడ్డాడు. మిడాఫ్ ప్రాంతంలో బంతిని క్యాచ్ పట్టే క్రమంలో ఎన్గిడి కిందపడ్డాడు. దీంతో తల బలంగా నేలకు తాకి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య బృందం అతడిని పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి స్థానంలో విప్రాజ్ నిగమ్ ‘కన్కషన్ సబ్స్టిట్యూట్’గా మైదానంలోకి వచ్చాడు. కాగా మ్యాచ్ అనంతరం ఎన్గిడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది.⇒ 1 ఐపీఎల్లో ఇదే (265) అత్యధిక పరుగుల ఛేదన. 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్పై 262 పరుగుల లక్ష్యాన్ని చేధించిన పంజాబ్ కింగ్స్... ఇప్పుడు దానికంటే కాస్త ఎక్కువ స్కోరును ఛేదించింది.⇒ 220 రెండో వికెట్కు రాహుల్, నితీశ్ రాణా జోడించిన పరుగులు. ఐపీఎల్లో ఏ వికెట్కైనా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. 2016లో విరాట్ కోహ్లి–ఏబీ డివిలియర్స్ జోడీంచిన 229 పరుగుల భాగస్వామ్యం ‘టాప్’లో ఉంది.⇒ 2 ఈ మ్యాచ్లో పంజాబ్ 5.2 ఓవర్లలో 100 పరుగుల మార్క్ అందుకుంది. ఐపీఎల్లో ఇది రెండో వేగవంతమైంది. 2024లో ఢిల్లీపైనే సన్రైజర్స్ హైదరాబాద్ 5 ఓవర్లలోనే వంద పరుగులు చేసింది. ఓవరాల్గా పవర్ప్లే (6 ఓవర్లలో) పంజాబ్ 116 పరుగులు చేసి రెండో స్థానంలో ఉంది. సన్రైజర్స్ 125తో అగ్ర స్థానంలో ఉంది.స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: నిసాంక (సి) ప్రభ్సిమ్రన్ (బి) అర్‡్షదీప్ 11; రాహుల్ (నాటౌట్) 152; నితీశ్ (సి) శ్రేయస్ (బి) బార్ట్లెట్ 91; మిల్లర్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1–28, 2–248. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–49–1; బార్ట్లెట్ 4–0–69–1; యాన్సెన్ 4–0–45–0; వైశాక్ 3–0–48–0; చాహల్ 4–0–42–0; స్టొయినిస్ 1–0–11–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య (సి) రిజ్వీ 43; ప్రభ్సిమ్రన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 76; కూపర్ (బి) కుల్దీప్ 17; శ్రేయస్ (నాటౌట్) 71; నేహల్ (సి) (సబ్) కరుణ్ (బి) విప్రాజ్ 25; శశాంక్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 14; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–126, 2–132, 3–145, 4–201. బౌలింగ్: అఖీబ్ 2–0–41–0; ముకేశ్ 3–0–55–0; అక్షర్ 4–0–44–1; నటరాజన్ 3.5–0–54–0; కుల్దీప్ 4–0–46–2; విప్రాజ్ నిగమ్ 2–0–24–1. -
ఎస్ఆర్హెచ్ ఘన విజయం.. పలు రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా శనివారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (74), అబిషేక్ శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో నితీశ్ కుమార్ (36), క్లాసెన్ (29) కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టును గెలిపించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా, ఫెరీరా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (103) సెంచరీతో చెలరేగగా, ధ్రువ్ జురేల్ (51) అర్థసెంచరీతో రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీయగా, ప్రఫుల్ హింగే, కెప్టెన్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఐదు విజయాలు సాధించగా.. ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. దీంతో ఎస్ఆర్హెచ్ 10 పాయింట్లు సాధించి రాజస్తాన్తో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్రేట్తో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్తాన్ మూడో ఓటమితో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. 2023 సీజన్ నుంచి రాజస్తాన్ రాయల్స్పై ఎస్ఆర్హెచ్కు ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. గతంలో సీఎస్కే (2010 నుంచి 2013 మధ్య) రాజస్తాన్ రాయల్స్పై ఆరు వరుస విజయాలు సాధించింది. 2019 నుంచి 2022 మధ్య ఆర్సీబీ.. రాజస్తాన్పై 5 వరుస విజయాలు అందుకుంది. 2018 నుంచి 2020 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వరుస విజయాలు నమోదు చేసింది.ఐపీఎల్లో 200 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ఎస్ఆర్హెచ్కు ఇది ఐదోసారి. ఇక పంజాబ్ కింగ్స్ 11 సార్లు 200 ప్లస్ స్కోర్లు ఛేదించి తొలి స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ (ఆరు సార్లు) రెండో స్థానంలో కొనసాగుతోంది. రాజస్తాన్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లు ఐదేసి సార్లు ఛేదించి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఛేదించిన జట్లలో ఎస్ఆర్హెచ్ చోటు దక్కించుకుంది. రాజస్తాన్పై 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఎస్ఆర్హెచ్ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాలు పంజాబ్ కింగ్స్ (ఢిల్లీపై 265, కేకేఆర్పై 262 పరుగుల టార్గెట్), ఎస్ఆర్హెచ్ (పంజాబ్పై 246 పరుగుల టార్గెట్) మూడో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఆర్సీబీ (లక్నోపై 228 పరుగుల టార్గెట్) ఉంది.జైపూర్ వేదికపై రాజస్తాన్పై 228 పరుగుల టార్గెట్ను ఛేదించిన ఎస్ఆర్హెచ్ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. 2023లో ఇదే రాజస్తాన్పై 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తాజాగా ఆ రికార్డును సవరించింది.4️⃣h consecutive win ✅4️⃣th highest successful chase in #TATAIPL history ✅#SRH paint the Pink City ORANGE with a clinical win 🎨🧡Scorecard ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @SunRisers pic.twitter.com/bKWZOIAgZo— IndianPremierLeague (@IPL) April 25, 2026 -
వైభవ్ సూర్యవంశీకి తీవ్ర గాయం.. ఐపీఎల్ నుంచి అవుట్?
ఐపీఎల్-2026లో భాగంగా జైపూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్యవంశీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో వైభవ్ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు.వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయినా కొంచెం అతడికి నొప్పి తగ్గలేదు. వైభవ్ నడిచేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్ల సాయంతో వైభవ్ మైదానాన్ని వీడాడు. ఇది నిజంగా రాజస్తాన్ రాయల్స్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. వైభవ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కూడా భారీ సెంచరీతో సూర్యవంశీ చెలరేగాడు. కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 103 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. అయితే టోర్నీ కీలక సమయంలో వైభవ్ గాయపడడం రాజస్తాన్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఒకవేళ వైభవ్ గ్రేడ్-3లో ఉన్నట్లయితే పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతోంది. అదే జరిగితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ను వైభవ్ వైదొలగనున్నాడు.కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్తో పాటు అతడితో పాటు పాటు ధ్రువ్ జురెల్(51), ఫెరీరా(33) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, షకీబ్ హసన్, నితీశ్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు. -
ఒకే మ్యాచ్లో 529 పరుగులు.. 33 సిక్స్లు, 49 ఫోర్లతో
ఐపీఎల్-2026లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఎప్పటికీ మర్చిపోలేరు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో మైదానంలో సంతోషం, ఉత్కంఠ, భయం అన్నీ కన్పించాయి.తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్లు) భారీ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్లో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోర్. దీంతో ఢిల్లీ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ యువ ఆటగాళ్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లు), ప్రియాంశ్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లు) దూకుడుగా ఆడుతూ ఢిల్లీపై ఒత్తిడి పెంచారు. అయితే ఓ వైపు పంజాబ్ ఓపెనర్లు విధ్వంసం కొనసాగుతుండగా.. మరోవైపు మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ లుంగి ఎంగిడీ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో ఎంగిడీ తలకు బలమైన గాయమైంది. అంబులెన్స్లో అతడిని ఆస్పత్రికి తరలించారు.దీంతో మైదానంలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. మళ్లీ మ్యాచ్ ప్రారంభమయ్యాక పంజాబ్ విధ్వంసం కొనసాగింది. ఓపెనర్లు ఔటయ్యాక శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లు) ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఢిల్లీ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది. టీ20 క్రికెట్లో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ తమ రికార్డును తామే బ్రేక్ చేసింది.49 ఫోర్లు.. 33 సిక్సర్లు.. 529 రన్స్మొత్తంగా ఈ మ్యాచ్లో పరుగుల వర్షం కురిసింది. ఇరు జట్లు కలిపి మొత్తంగా 529 పరుగులు చేశాయి. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీ బ్యాటర్లు కలిసి 49 ఫోర్లు, 33 సిక్సర్లు బాదారు. కాగా లెక్కలేనన్ని డ్రాప్ క్యాచ్లు ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాయి. తొలుత కేఎల్ రాహుల్ క్యాచ్ను 12 పరుగుల వద్ద శశాంక్ సింగ్ విడిచిపెట్టాడు.ఫలితంగా రాహుల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఆ తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన రెండు ఈజీ క్యాచ్లను కరుణ్ నాయర్ జారవిడిచాడు. దీంతో అయ్యర్ అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు.చదవండి: IPL 2026: లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్ అప్డేట్ -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు వరల్డ్ రికార్డ్స్ బ్రేక్
ఐపీఎల్-2026లో జైపూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. వైభవ్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఉతికారేశాడు.గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు సైతం చుక్కలు చూపించాడు. సవాయి మాన్సింగ్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో తన రెండో ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.వైభవ్ మొత్తంగా 103 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే మ్యాచ్లో తన హాఫ్ సెంచరీని వైభవ్ కేవలం 15 బంతుల్లోనే సాధించాడు. వైభవ్ ఈ ఏడాది సీజన్లో హాఫ్ సెంచరీ కేవలం 15 బంతుల్లో పూర్తి చేయడం ఇది మూడోసారి. ఈ క్రమంలో వైభవ్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్ సాధించిన సంచలన రికార్డులు ఇవే👉ఐపీఎల్లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు బాదిన ప్లేయర్గా వైభవ్ రికార్డు సృష్టించాడు. వైభవ్ కేవలం 15 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(గేల్ 21 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది.👉టీ20 ఫార్మాట్లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ వరల్డ్ రికార్డు సాధించాడు. కేవలం 26 ఇన్నింగ్స్ల్లోనే సూర్యవంశీ ఈ రికార్డును అందుకున్నాడు.👉ఐపీఎల్లో 20 ఏళ్ల లోపు వయసులో 5 కంటే ఎక్కువసార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.👉ఐపీఎల్లో అత్యధిక సార్లు 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా వైభవ్ రికార్డులకెక్కాడు. వైభవ్ మూడు సార్లు ఈ ఘనతను అందుకున్నాడు.👉అదేవిధంగా ఇది ఐపీఎల్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. తొలి స్ధానంలో క్రిస్ గేల్(30) ఉండగా.. సెకెండ్ ప్లేస్లో సూర్యవంశీ(35)నే ఉన్నాడు.Records under threat every time he bats 🔥Vaibhav Sooryavanshi hits a 36-ball century, third-fastest in #TATAIPL history. #TATAIPL 2026 | #RRvSRH | LIVE NOW 👉https://t.co/HHSiOA288w pic.twitter.com/NggaHKljUS— Star Sports (@StarSportsIndia) April 25, 2026 -
లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్ అప్డేట్
ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పీడ్ స్టార్ లుంగీ ఎంగిడీ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తలకు బలమైన గాయం కావడంతో అతడిని వెంటనే అంబులెన్స్లో పూసా రోడ్డులోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎంగిడీ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు ఢిల్లీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్, ఆర్సీబీ వంటి ఫ్రాంచైజీలు కూడా ఎంగిడీ త్వరంగా కోలుకోవాలని పోస్ట్లు పెట్టారు.అసలేమి జరిగిందంటే?ఇన్నింగ్స్ రెండో ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన మూడో బంతిని ప్రియాన్ష్ ఆర్య మిడాఫ్ భారీ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతికి గాల్లోకి లేచింది. మిడాఫ్లో ఉన్న ఎంగిడీ బంతిని అందుకునేందుకు వెనుకకు పరిగెత్తాడు. బంతిని అందుకు క్రమంలో ఎంగిడీ బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి తల వెనుక భాగం మైదానంకు బలంగా తాకింది. మెడ నొప్పి, తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడికి ఏ మాత్రం రీలీఫ్ రాలేదు. దీంతో మైదానం నుంచి నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. పంజాబ్ రికార్డు ఛేజింగ్ చేసింది. -
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతం చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ రికార్డు విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది.తద్వారా టీ20 క్రికెట్లో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ తమ రికార్డును తామే బ్రేక్ చేసింది. అంతకముందు ఐపీఎల్-2024 సీజన్లో కేకేఆర్ నిర్ధేశించిన 262 రన్స్ టార్గెట్ని పంజాబ్ ఛేజ్ చేసింది.దంచి కొట్టిన పంజాబ్ ఓపెనర్లు265 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్కు ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లు), ప్రియాంశ్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లు) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్ప్లేలోనే ఏకంగా 116 పరుగులు చేసింది.అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లు) విధ్వంసం సృష్టించాడు. నేహల్ వధేరా (25), శశాంక్ సింగ్ (19 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఫలితంగా ఈ చారిత్రత్మక విజయాన్ని పంజాబ్ విజయాన్ని అందించాడు. అయితే ఈమ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన ఈజీ క్యాచ్లను ఢిల్లీ ఫీల్డర్ కరుణ్ నాయర్ విడిచిపెట్టాడు. దీంతో ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.రాహుల్ సూపర్ సెంచరీతొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు నితీష్ రాణా(44 బంతుల్లో 91) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.టీ20 చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్లు ఇవేపంజాబ్ కింగ్స్- 265/4- ప్రత్యర్ధి- ఢిల్లీ క్యాపిటల్స్పంజాబ్ కింగ్స్-262/2- ప్రత్యర్ధి-కేకేఆర్సౌతాఫ్రికా- 259/4- ప్రత్యర్ధి- వెస్టిండీస్బ్రిస్బేన్ హీట్-258/2- ప్రత్యర్ధి- పెర్త్ స్కార్చర్స్ -
రాజస్తాన్పై సన్రైజర్స్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా శనివారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేధించింది. ఇషాన్ కిషన్ (74), అబిషేక్ శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో నితీశ్ కుమార్ (36), క్లాసెన్ (29) కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టును గెలిపించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా, ఫెరీరా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (103) సెంచరీతో చెలరేగగా, ధ్రువ్ జురేల్ (51) అర్థసెంచరీతో రాణించాడు.16 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 193/3రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయానికి చేరువలో ఉంది. 229 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. నితీశ్కుమార్ 21, క్లాసెన్ 18 పరుగులతో ఆడుతున్నారు.6 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (34), ఇషాన్ కిషన్ (35) పరుగులతో క్రీజులో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్7 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన హెడ్.. ఆర్చర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 38/1. క్రీజులో ఇషాన్ కిషన్(35), అభిషేక్ శర్మ(4) ఉన్నారు.వైభవ్ సూపర్ సెంచరీ.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ టార్గెట్జైపూర్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్లతో 103) సూపర్ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు పాటు ధ్రువ్ జురెల్(51), ఫెరీరా(33) రాణించారు.వైభవ్ సూర్యవంశీ సెంచరీవైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్152 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్.. నితీశ్ రెడ్డి బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 153/2100 దాటిన రాజస్తాన్ రాయల్స్ స్కోర్ రాజస్తాన్ రాయల్స్ స్కోర్ 100 దాటింది. 9 ఓవర్ల నాటికి 104/1 స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ15 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్36 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన యశశ్వి జైశ్వాల్.. ఎషాన్ మలింగ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 63/1వైభవ్ సూర్యవంశీ దూకుడురాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతున్నాడు. ప్రపుల్ హింగే వేసిన తొలి ఓవర్లో వైభవ్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత కమ్మిన్స్ బౌలింగ్లో వైభవ్ భారీ సిక్సర్ బాదాడు. 2 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 36/0బౌలింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ఐపీఎల్-2026లో జైపూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగొచ్చాడు.కమ్మిన్స్ తిరిగి రావడంతో ఇషాన్ కిషన్ కేవలం ప్లేయర్గా మాత్రమే బరిలోకి దిగాడు. దిల్షాన్ మధుశంక స్ధానంలో కమ్మిన్స్ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్ రాయల్స్ మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుసన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగరాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ విశ్వరూపం ప్రదర్శించాడు. పంజాబ్ బౌలర్లను కేఎల్ రఫ్పాడించాడు. అరుణ్ జైట్లీ మైదానంలో రాహుల్ బౌండరీల వర్షం కురిపించాడు.అతడు బ్యాటింగ్ ధాటికి పంజాబ్ ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించాల్సి వచ్చింది. రాహుల్ను ఔట్ చేయడం ఎవరి తరం కాలేదు. ఈ క్రమంలో రాహుల్ కేవలం 47 బంతుల్లోనే తన ఆరువ ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఓవరాల్గా కేవలం 67 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 16 ఫోర్లు, 9 సిక్స్లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ విధ్వంసకర సెంచరీతో రాహుల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రాహుల్ సాధించిన రికార్డులు ఇవే👉ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత క్రికెటర్గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రాహుల్ కంటే ముందు ఏ ఒక్క భారత ఆటగాడు కూడా 150 పరుగుల మార్క్ను అందుకోలేకపోయాడు. ఇంతకుముందు వరకు సన్రైజర్స్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ సాధించిన 141 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉండేది.👉ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో ఇది మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోర్. తొలి రెండు స్ధానాల్లో క్రిస్ గేల్ (175*), బ్రెండన్ మెకల్లమ్ (158*) ఉన్నారు.👉ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా రాహుల్(47) నిలిచాడు. గతంలో ఈ రికార్డు క్వింటన్ డికాక్(48) పేరిట ఉండేది.👉ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో క్రిస్ గేల్తో కలిసి మూడో స్ధానంలో రాహుల్ నిలిచాడు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లి(8), జోస్ బట్లర్ (7) ఉన్నారు.- 2 HUNDREDS FOR PBKS.- 2 HUNDREDS FOR LSG.- 2 HUNDREDS FOR DC.ONE & ONLY, KL RAHUL 🥶🔥 pic.twitter.com/hCX2PVJfLp— Johns. (@CricCrazyJohns) April 25, 2026 -
లుంగీ ఎంగిడీకి తీవ్ర గాయం.. గ్రౌండ్లోకి అంబులెన్స్
ఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ లుంగీ ఎంగిడీ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో ఎంగిడీ తలకు బలమైన గాయమైంది. పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్లో మూడో బంతిని ప్రియాన్ష్ ఆర్య.. మిడాఫ్ దిశగా షాట్ ఆడాడు.అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. దీంతో మిడాఫ్లో ఉన్న ఎంగిడీ వెనుకకు వెళ్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి అతడు వెల్లకిలా పడిపోయాడు. తల వెనుక భాగం మైదానంకు బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతూ కదలకుండా అలా ఉండిపోయాడు. వెంటనే ఫిజియోలు మైదానంలోకి ప్రాథమిక చికిత్స అందించారు. కానీ గాయం తీవ్రమైనది కావడంతో మైదానంలోకి అంబులెన్స్ను పిలిపించి ఆస్పత్రికి తరలించారు. ఎంగిడి మెడకు కూడా తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది.దీంతో అతడు మెడకు 'నెక్ బ్రేస్' అమర్చి జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మైదానం మొత్తం ఒక్కసారి సైలెంట్ అయిపోయింది. ఎంగిడీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.Lungi Ngidi has suffered a serious injury, and for the first time in IPL history, an ambulance has come onto the ground. This looks very serious—possibly a neck fracture, but hopefully it’s nothing that severe. 😱It is also quite shameful for the Arun Jaitley Stadium DJ to play… pic.twitter.com/CrFFc3grvB— Sonu (@Cricket_live247) April 25, 2026 -
ఈజీ క్యాచ్ వదిలేశాడు.. కట్ చేస్తే! సెంచరీతో చుక్కలు చూపించాడు
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ మరోసారి ఫీల్డింగ్లో తీవ్రనిరాశపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో మూడు క్యాచ్లను జారవిడిచిన శశాంక్.. ఇప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్పై అదే తీరును కనబరిచాడు. కేఎల్ రాహుల్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను శశాంక్ విడిచిపెట్టాడు.ఢిల్లీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రాహుల్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బంతి నేరుగా డీప్ స్వ్కెర్ లెగ్లో ఉన్న శశాంక్ సింగ్ చేతికి వెళ్లింది. కానీ అతడు సులువైన క్యాచ్ను జారవిడిచాడు. ఇందుకు పంజాబ్ కింగ్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. 12 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాహుల్.. భారీ సెంచరీతో కదం తొక్కాడు. రాహుల్ కేవలం 67 బంతుల్లో16 ఫోర్లు, 9 సిక్స్లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు నితీష్ రాణా (44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 91) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక రాహుల్ క్యాచ్ విడిచిపెట్టిన శశాంక్ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత చెత్త ఫీల్డర్ను ఇప్పటివరకు చూడలేదు అంటూ పోస్ట్లు పెడుతున్నారు. శశాంక్ ఫీల్డింగ్ పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా, హెడ్కోచ్ రికీ పాంటింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.pic.twitter.com/PUqbiGtTB8— crictalk (@crictalk7) April 25, 2026 -
ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఘనత
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఘనత సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును సమం చేసింది. ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికి ఆరు మ్యాచ్లు పూర్తి చేసుకుంది.ఆరింట మూడు గెలిచి..వీటిలో మూడు గెలిచిన ఢిల్లీ.. మూడు ఓడిపోయింది. తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై విజయం సాధించిన అక్షర్ సేన.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్నూ ఓడించింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఢిల్లీ.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలోనూ ఓటమి పాలైంది.ఆ తర్వాత ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ చివరగా సన్రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ను ఢీకొట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ టాస్ గెలిచాడు. తద్వారా ఐపీఎల్లో వరుసగా తొమ్మిదిసార్లు టాస్ గెలిచిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్.. సీఎస్కే, సన్రైజర్స్ రికార్డును సమం చేసింది.ఐపీఎల్లో వరుసగా అత్యధికసార్లు టాస్ గెలిచిన జట్లు ఇవేసన్రైజర్స్ హైదరాబాద్- 9 సార్లు (2015-16 సీజన్) చెన్నై సూపర్ కింగ్స్- 9 సార్లు (2019)ఢిల్లీ క్యాపిటల్స్- 9 సార్లు (2025-26 సీజన్)చెన్నై సూపర్ కింగ్స్- 8 సార్లు (2018-19)రాజస్తాన్ రాయల్స్- 8 సార్లు (2023).🚨 TOSS 🚨@DelhiCapitals have won the toss & will bat first against @PunjabKingsIPL in New Delhi.Updates ▶️ https://t.co/0oSkMZgNAV#TATAIPL | #KhelBindaas | #DCvPBKS pic.twitter.com/jKNpfCh1lo— IndianPremierLeague (@IPL) April 25, 2026 -
కేఎల్ రాహుల్ విధ్వంసం.. 47 బంతుల్లో సెంచరీ
ఐపీఎల్-2026లో అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శతక్కొట్టాడు. 12 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాహుల్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పంజాబ్ బౌలర్లను ఉతికారేశాడు.అతడు బ్యాటింగ్ ధాటికి బౌండరీలు చిన్నబోయాయి. ఈ క్రమంలో రాహుల్ కేవలం 47 బంతుల్లోనే తన ఆరువ ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రాహుల్కు తన ఐపీఎల్ కెరీర్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా కేవలం 67 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 16 ఫోర్లు, 9 సిక్స్లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.రాహుల్కు ఇదే ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో రాహుల్తో పాటు నితీష్ రాణా (44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 91) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోర్ సాధించింది.- 2 HUNDREDS FOR PBKS.- 2 HUNDREDS FOR LSG.- 2 HUNDREDS FOR DC.ONE & ONLY, KL RAHUL 🥶🔥 pic.twitter.com/hCX2PVJfLp— Johns. (@CricCrazyJohns) April 25, 2026 -
'సన్రైజర్స్ కెప్టెన్గా అతడే ఉండాలి'.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా దిగ్గజం, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్-2026 సీజన్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్లో కమ్మిన్స్ బరిలోకి దిగడం ఖాయమైంది. దీంతో తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ తన బాధ్యతలను కమ్మిన్స్కు అప్పగించే అవకాశముంది.అయితే కమ్మిన్స్ గైర్హజారీలో సన్రైజర్స్ జట్టును కిషన్ అద్బుతంగా నడిపించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్గా, బ్యాటర్గా కిషన్ విజయవంతమయ్యాడు. దీంతో కమ్మిన్స్ తిరిగొచ్చినా కెప్టెన్గా కిషన్నే కొనసాగించాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. కానీ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఇందుకు విరుద్ధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను కమ్మిన్స్ తిరిగి తీసుకోవాలని సెహ్వాగ్ తెలిపాడు."కమ్మిన్స్ తిరిగి రావడం ఎస్ఆర్హెచ్కు అతిపెద్ద ప్లస్ పాయింట్. అయితే కిషన్ నుంచి కమ్మిన్స్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలి. కమ్మిన్స్ జట్టుకు దూరంగా ఉండటం వల్లే ఇషాన్ కిషన్కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు కమ్మిన్స్ తిరిగి అందుబాటులోకి వచ్చాడు. కాబట్టి అతడే జట్టును నడిపించాలి. కమ్మిన్స్ ఒక సీనియర్ కెప్టెన్ మాత్రమే అద్బుతమైన ఆల్రౌండర్ కూడా. సరైన సమయంలో కమ్మిన్స్ అందుబాటులోకి వచ్చాడు. అయితే కమ్మిన్స్ ప్లేయింగ్ ఎలెవన్లోకి ఎవరి స్ధానంలో వస్తాడన్నదే ప్రశార్ధకంగా మారింది. అతడిని మధుశంక స్ధానంలో తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది" క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: సీఎస్కేకు భారీ షాక్.. జట్టును వదిలి వెళ్లిపోయిన కెప్టెన్! -
సీఎస్కేకు భారీ షాక్.. జట్టును వదిలి వెళ్లిపోయిన కెప్టెన్!
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 26) చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో సీఎస్కే తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు చెన్నై జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కుటుంబ అత్యవసర పరిస్థితి (Family Emergency) కారణంగా సీఎస్కే జట్టును వీడి పుణేకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అతడు జట్టుతో పాటు చెన్నైకి ప్రయాణించలేదు. అయితే అతడు తిరిగి ఎప్పుడు జట్టుతో చేరుతాడన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ సీఎస్కే అభిమానులు మాత్రం వీలైనంత త్వరగా రుతురాజ్ జట్టుతో కలవాలని కోరుకుంటున్నారు.మరోవైపు సీఎస్కే లెజండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని.. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆడనున్నట్లు సమాచారం. సీఎస్కే హెడ్ కోచ్ మైఖల్ హస్సీ సైతం ధోని రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.ఒకవేళ రుతురాజ్ గుజరాత్తో మ్యాచ్కు అందుబాటులో లేకపోతే ఎంఎస్ ధోని మరోసారి జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన సూపర్ కింగ్స్.. మూడింట విజయం సాధించి పాయింట్ట పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి! -
DC vs PBKS: ఢిల్లీపై పంజాబ్ కింగ్స్ రికార్డు విజయం
Delhi Capitals vs Punjab kings Updates: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ తమ రికార్డును తామే తిరగరాసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(76), శ్రేయస్ అయ్యర్(71), ప్రియాన్ష్ ఆర్య(43) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు.శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(51), శశాంక్ సింగ్(1) ఉన్నారు. పంజాబ్ విజయానికి 34 బంతుల్లో 65 పరుగులు కావాలి.పంజాబ్ మూడో వికెట్ డౌన్పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కూపర్ కానలీ.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 147/3పంజాబ్ రెండో వికెట్ డౌన్పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 26 బంతుల్లో 76 పరుగులు చేసిన ప్రబ్సిమ్రాన్ సింగ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.పంజాబ్ తొలి వికెట్ డౌన్126 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు.6 ఓవర్లకు పంజాబ్ స్కోరు ఎంతంటే?265 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (38 నాటౌట్), ప్రభ్ సిమ్రన్ (71 నాటౌట్) అద్బుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి బ్యాటింగ్ ధాటికి పంజాబ్ స్కోర్ కేవలం 6 ఓవర్లలో ఏకంగా 116 పరుగులు దాటేసింది.ఢిల్లీ రికార్డు స్కోరుఐపీఎల్ చరిత్రలో తమ అత్యధిక స్కోరును ఢిల్లీ నమోదు చేసింది. పంజాబ్తో మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 264 పరుగులు సాధించింది. సెంచరీ మిస్18.3: బార్ట్లెట్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన నితీశ్ రాణా. 44 బంతుల్లో 91 పరుగులు చేసిన రాణా. స్కోరు: 248-2(18.3). క్రీజులోకి మిల్లర్. సూపర్ ట్విస్టు16.6: చహల్ బౌలింగ్లో మార్కస్ స్టొయినిస్కు క్యాచ్ ఇచ్చి అవుటైన నితీశ్ రాణా. 39 బంతుల్లో 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్గా వెనుదిరిగిన వన్డౌన్ బ్యాటర్. అయితే, ఇక్కడ ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ రివ్యూకు వెళ్లగా అది సిక్సర్గా తేలింది. దీంతో నితీశ్ రాణాకు లైఫ్ లభించింది. అయితే, స్కోరు: 226-1(17). కేఎల్ రాహుల్ 129 పరుగులతో ఉన్నాడు.కేఎల్ రాహుల్ సెంచరీ47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో వంద పరుగులు మార్కు అందుకున్న ఓపెనింగ్ బ్యాటర్. స్కోరు: 189-1(15). నితీశ్ రాణా 36 బంతుల్లో 72 పరుగులతో రాహుల్కు తోడుగా ఉన్నాడు.దుమ్ములేపిన నితీశ్ రాణా11.3: జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్లో ఫోర్ బాది యాభై పరుగులు పూర్తి చేసుకున్న నితీశ్ రాణా. బార్ట్లెట్ ఓవర్లో 6,4,4,4,4,6 బాదిన నితీశ్. ఢిల్లీ స్కోరు: 142-1(12)పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 102-1రాహుల్ 56, నితీశ్ రాణా 35 పరుగులతో ఉన్నారు.రాహుల్ హాఫ్ సెంచరీ9.1: విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. 26 బంతుల్లో రాహుల్ ఫిఫ్టీ.A loud cheer at Arun Jaitley Stadium as #KLRahul completes a fine fifty off 26 balls! 🤌Will he keep going & guide #DC to a huge total? 💙#TATAIPL 2026 | #DCvPBKS | LIVE NOW 👉https://t.co/iY4R1ZY1Yn pic.twitter.com/IsGMZ1NN4g— Star Sports (@StarSportsIndia) April 25, 2026పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 68-1(6)కేఎల్ రాహుల్ 16 బంతుల్లో 35 పరుగులతో, నితీశ్ రాణా 13 బంతుల్లో 22 పరుగులతో ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్28 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన నిస్సాంక.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు.2 ఓవర్లకు ఢిల్లీ స్కోరెంతంటే?2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(12), నిస్సాంక(11) ఉన్నారు.బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గత మ్యాచ్లో ఆడిన జట్లునే కొనసాగించాయి.తుది జట్లుపంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఢిల్లీ క్యాపిటల్స్ : కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్ -
గొయెంకాపై తప్పుడు పోస్ట్లు పెడితే కఠిన చర్యలు
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్కు యజమాని అయిన సంజీవ్ గొయెంకా విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. తన పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాడుతూ అవమానకరమైన పోస్టులు, వీడియోలు రూపొందిస్తున్నారని గొయెంకా ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తన ముఖాన్ని ఇతరుల శరీరాలకు జతచేసి, హింసాత్మక లేదా అనుచిత దృశ్యాల్లో చూపిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు గొయెంకాకు వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కల్పించింది. ఐపీఎల్ 2026 సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫింగ్, ఏఐ ఆధారిత కంటెంట్పై తాత్కాలిక ఆంక్షలు విధించింది.గొయెంకా తరఫున సీనియర్ న్యాయవాది సందీప్ సేథి వాదనలు వినిపించారు. "ఇది సరదా కాదు, వ్యంగ్యం కాదు. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం" అని కోర్టుకు తెలిపారు. ఇటువంటి కంటెంట్ వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు ఆయన వ్యాపార సంస్థలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రజా ప్రముఖులు విమర్శలను, వ్యంగ్యాన్ని భరించాల్సి ఉంటుందని పేర్కొంటూనే.. డిజిటల్ మార్ఫింగ్, డీప్ఫేక్ల ద్వారా తప్పుడు కథనాలు సృష్టించడం మాత్రం అనుమతించలేమని స్పష్టం చేసింది.ప్రత్యేకంగా గొయెంకాపై ఐపీఎల్ నేపథ్యంలో వైరల్ అవుతున్న కంటెంట్ హద్దులు దాటిందని కోర్టు అభిప్రాయపడింది. వ్యంగ్యానికి, అవమానానికి మధ్య స్పష్టమైన రేఖ ఉందని తెలిపింది.ఈ ఉత్తర్వులతో గోయెంకా పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని వక్రీకరించి ప్రచారం చేసే కంటెంట్ను తొలగించేందుకు మార్గం సుగమమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి!
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడచూసినా వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ. ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడుతున్న ఈ బిహారీ పిల్లాడిని.. త్వరలోనే టీమిండియాకు ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. పదిహేనేళ్ల వయసులోనే ఎంతో పరిణతి సాధించిన క్రికెటర్లా అతడు షాట్లు బాదడం చూసి ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ సైతం ముచ్చటపడ్డాడు.ఇక ఇర్ఫాన్ పఠాన్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి భారత మాజీ క్రికెటర్లు అయితే వీలైనంత త్వరగా వైభవ్ను అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు.తొందరపాటు చర్యే అవుతుందిరెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్కు సన్నద్ధమయ్యే క్రమంలో అతడు ఏడాదికి కావాల్సినంత ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎమర్జింగ్ టూర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇండియా-‘ఏ’ టూర్లకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.వైభవ్ (Vaibhav Suryavanshi)కు ఇది రెండో ఐపీఎల్ సీజన్. గతేడాది అదరగొట్టిన అతడు.. ఈ ఏడాది కూడా శుభారంభం అందుకుని దానిని కొనసాగిస్తున్నాడు. ఈ పిల్లాడంటే నాకూ ఇష్టమే. అతడు విజయవంతం కావాలని నాలాగే ఎంతో మంది కోరుకుంటున్నారు.అయితే, వైభవ్ విషయంలో తొందరపాటు వద్దనేది నా అభిప్రాయం. ఇప్పటికే యశస్వి జైస్వాల్ భారత టీ20 జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. 2024 టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కుతుందని అతడు చూశాడు. కానీ అలా జరుగలేదు. జైస్వాల్తో పాటు ఎంతోమంది లైన్లో ఉన్నారు.ప్రియాన్ష్ ఆర్య కూడా టీమిండియా తలుపులు బాదుతున్నాడు. ప్రియాన్ష్, వైభవ్ సూర్యవంశీ.. ఈ ఇద్దరూ ఆసియా ఎమర్జింగ్ స్టార్స్ టోర్నీలో ఆడారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేస్తే బాగుంటుంది.సులువుగా క్యాప్ దక్కిందే అనే భావన రాకూడదువైభవ్ విషయంలో ఆలోచించినట్లే అందరి విషయంలోనూ ఆలోచించాలి. వైభవ్ను ఐర్లాండ్ లేదంటే జింబాబ్వే టూర్కు పంపితే మంచిదే. అక్కడ కూడా అతడు రాణిస్తాడనే అనుకుంటున్నా. భిన్నమైన పిచ్ పరిస్థితులు అతడికి అలవడతాయి.ముందుగా చెప్పినట్లు వైభవ్ ఒక్కడే కాదు.. మిగతా వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. టీమిండియా క్యాప్నకు ఒక విలువ ఉంది. దానిని అందించే తీరు విస్మయంగా మాత్రం ఉండకూడదు. అంటే.. అందరితో పోలిస్తే.. ఆ ఆటగాడికి సులువుగా క్యాప్ దక్కిందే అనే భావన రాకూడదు.వైభవ్ టీమిండియాకు ఆడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అతడు ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తేనే బాగుంటుంది. అలా అయితేనే అతడి కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగుతుంది’’ అని అశ్విన్ అన్నాడు.వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి!వైభవ్ విషయంలో తొందరపాటు వద్దని.. యశస్వి జైస్వాల్, ప్రియాన్ష్ ఆర్య వంటి సీనియర్లకు ముందుగా అవకాశం ఇస్తే బాగుంటుందని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా గడ్డపై భారత అండర్-19 జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో రాణించిన వైభవ్.. వరల్డ్కప్ ఫైనల్లో 175 పరుగులతో సత్తా చాటి జట్టును విజేతగా నిలిపాడు.ఇక ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఇప్పటికి ఏడు ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. 254 పరుగులు రాబట్టాడు. టాప్ రన్ స్కోరర్ల జాబితాలో టాప్-6లో కొనసాగుతున్నాడు. రాయల్స్కే చెందిన యశస్వి జైస్వాల్ 245 పరుగులు చేయగా.. పంజాబ్ స్టార్ ప్రియాన్ష్ ఆర్య ఐదు మ్యాచ్లలో 211 పరుగులు చేశాడు.చదవండి: అందుకే శ్రేయస్ అయ్యర్ను వదులుకున్నాం: కేకేఆర్ మాజీ కోచ్ -
విరాట్పై విషం చిమ్మిన ఇంగ్లండ్ దిగ్గజం
ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం మైఖేల్ వాన్ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని మరోసారి కెలికాడు. తాజాగా తన దేశానికే చెందిన సామ్ బిల్లింగ్స్ విరాట్ను పొగుడుతూ సోషల్మీడియాలో ఓ పోస్ట్ చేయగా.. అందుకు బదులుగా వ్యంగ్యంగా స్పందించాడు. తాజాగా గుజరాత్పై విరాట్ మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ చేసిన అనంతరం సామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో "ఫుల్ ఫ్లోలో ఉన్న విరాట్ను చూడటం కంటే గొప్పది ఏముంటుంది..?" అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన వాన్, "ఉంది.. జో రూట్" అంటూ విరాట్పై అక్కసును వెళ్లగక్కాడు.వాస్తవానికి వాన్కు విరాట్ను కెలకడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. విరాట్కు ఫాబ్-4లో ఉండే అర్హత లేదంటూ కొన్ని సార్లు.. విరాట్ ఫాబ్-4లో అథముడని మరికొన్ని సార్లు కామెంట్లు చేశాడు. తాజాగా విరాట్ కంటే రూట్ చాలా బెటర్ అన్న అర్దం వచ్చేలా బిల్లింగ్స్ ట్వీట్పై స్పందించి శునకానందం పొందాడు. వాన్ విరాట్పై చేసిన ట్వీట్ సోషల్మీడియాలో వైరలైంది. వాన్పై విరాట్ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కొందరు, వాన్కు ఇలాంటి చెత్త ప్రవర్తన కొత్తేమీ కాదంటూ లైట్ తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో విరాట్ మెరుపు హాఫ్ సెంచరీ (81) చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్తో అతను మరిన్ని ఘనతలు సాధించాడు. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్గా అవతరించడమే కాకుండా.. ఐపీఎల్లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ తరఫున 400 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. విరాట్తో పాటు దేవ్దత్ పడిక్కల్ (55) కూడా మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ అద్భుత శతకం వృధా అయ్యింది. -
తీవ్ర అసంతృప్తి.. కోపంతో ఊగిపోయిన కోహ్లి!
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి మెరుపులు మెరిపించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.అయితే, ఒకానొక దశలో సెంచరీ దిశగా పయనించిన కోహ్లి.. అనూహ్య రీతిలో అవుటయ్యాడు. జేసన్ హోల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కోహ్లి బ్యాట్ను ప్యాడ్కేసి కొడుతూ కోపంగా మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా బెంగళూరు వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో ఆర్సీబీ గుజరాత్ తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు సాధించింది.‘సున్నా’ వద్ద కోహ్లికి లైఫ్! ఇక లక్ష్య ఛేదనలో భాగంగా సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆర్సీబీ స్టార్ జాకబ్ బెతెల్ (14) ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు.. కోహ్లి ఆడిన తొలి బంతికే షార్ట్ మిడ్వికెట్ వద్ద వాషింగ్టన్ సుందర్ సునాయాస క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత కోహ్లి చక్కటి షాట్లతో దూసుకుపోగా టైటాన్స్ భారీ మూల్యం చెల్లించింది.మరో ఎండ్లో పడిక్కల్ (27 బంతుల్లో 55)... కోహ్లికంటే వేగంగా పరుగులు రాబట్టి ఆర్సీబీ పనిని సులువు చేశాడు. తొలి బంతికే సిక్స్తో మొదలు పెట్టిన అతను సిరాజ్ ఓవర్లో మరో సిక్స్ కొట్టాడు. రషీద్ ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్ కొట్టగా... ప్రసిధ్ ఓవర్లో పడిక్కల్ 2 సిక్స్లు, ఫోర్ బాదాడు. ఆపై రషీద్ ఓవర్లోనూ 2 సిక్స్లతో చెలరేగిన పడిక్కల్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకోవడం విశేషం. ఆ తర్వాత 30 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది.హోల్డర్ వైల్డ్గా సెలబ్రేషన్స్.. తీవ్ర అసంతృప్తిలో కోహ్లిపడిక్కల్ను రషీద్ అవుట్ చేయగా, హోల్డర్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టిన కోహ్లి తర్వాతి బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. దీంతో సున్నా వద్ద లైఫ్ పొంది సెంచరీ దిశగా పయనించిన కోహ్లి ఇన్నింగ్స్కు పద్నాలుగో ఓవర్లో తెరపడింది. హోల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయి కోపంగా కోహ్లి వెనుదిరగగా.. హోల్డర్ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు.Set batters gone 😯🎥 Rashid Khan and Jason Holder hit the timber \|/Updates ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @gujarat_titans pic.twitter.com/zVUsxy1NB2— IndianPremierLeague (@IPL) April 24, 2026ఇక ఆర్సీబీ మిగిలిన ఆటగాళ్లలో జితేశ్ శర్మ (10), కెప్టెన్ రజత్ పాటీదార్ (8) విఫలమైనా... కృనాల్ పాండ్యా (12 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (10 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు. చదవండి: అందుకే శ్రేయస్ అయ్యర్ను వదులుకున్నాం: కేకేఆర్ మాజీ కోచ్ -
ఆ మూడు ఓవర్లలో తడబడ్డాం: గిల్
ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్, ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.వాస్తవానికి గుజరాత్ ఈ మ్యాచ్లో ఇంకా భారీ స్కోర్ చేయాల్సింది. అయితే చివరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు అనూహ్యంగా పుంజుకొని వారిని కట్టడి చేశారు. ఛేదన సమయంలోనూ గుజరాత్కు పైచేయి సాధించే అవకాశం ఉండింది. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు తీయగలిగినా, ఆతర్వాత ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయింది. చివరికి మూల్యం చెల్లించుకుంది.మ్యాచ్ అనంతరం గిల్ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకున్నాడు. అతని మాటల్లో.. పవర్ప్లే ముగిసే సమయానికి మంచి స్థితిలో ఉన్నాం. కానీ, 16 నుంచి 19వ ఓవర్ వరకు ఆశించిన రీతిలో పరుగులు చేయలేకపోయాము. ఆ మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాంప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలంటే మధ్య ఓవర్లలో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. అయితే, పవర్ప్లే తర్వాత మా బౌలర్లు ఆ పనిని చేయలేకపోయారు. ఆ సమయంలో కొన్ని మంచి బంతులు వేసినా, అవసరమైన స్థాయిలో లెంగ్త్ను మెయిన్టైన్ చేయలేకపోయారు.సుతార్కు బంతి ఇవ్వడంపై వివరణపిచ్ స్పిన్కు సహకరిస్తోందని తాను బ్యాటింగ్ చేసే సమయంలోనే గమనించాను. ముఖ్యంగా కృనాల్ వేసిన బంతులు బాగా టర్న్ అయ్యాయి. అందుకే చివర్లో మానవ్ సుతార్కు అవకాశం ఇచ్చాను.మరో రెండు వికెట్లు పడుంటే మ్యాచ్ మళ్లీ తమవైపు తిరిగేది.సాయి సుదర్శన్పై సరదా వ్యాఖ్యసాయి ఇటీవల రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచినా, ఈ మ్యాచ్లో అద్భుతంగా పుంజుకున్నాడు. అతని ప్రదర్శనపై గిల్ ప్రశంసలు కురిపించాడు. వచ్చే మ్యాచ్లో అయినా సాయి తనకు పవర్ప్లేలో స్ట్రైక్ ఇస్తాడని ఆశిస్తున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. -
GTపై RCB ఘన విజయం
-
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు భారీ రికార్డులు చేరాయి. ఈ దిగ్గజ బ్యాటర్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్ద సెంచరీ (44 బంతుల్లో 81) చేసి తన జట్టును గెలిపించాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ బౌండరీలు, సిక్సర్ల ద్వారా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతలను ఇప్పటివరకు ఏ ఆటగాడు సాధించలేదు.వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 300 సిక్సర్లను మాత్రం క్రిస్ గేల్ (కేకేఆర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ- 357), రోహిత్ శర్మ (డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్- 310) సాధించారు. గుజరాత్పై మ్యాచ్ తర్వాత విరాట్ ఖాతాలో 807 ఫోర్లు, 303 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ల విషయంలో మాత్రం ప్రస్తుతమున్న ఆటగాళ్లలో విరాట్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. ఐపీఎల్లో విరాట్ తర్వాత అత్యధిక బౌండరీలు సాధించిన ఘనత మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (768) పేరిట ఉంది. ప్రస్తుమున్న ఆటగాళ్లలో విరాట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (653) ఉన్నారు.50 హాఫ్ సెంచరీస్ఈ హాఫ్ సెంచరీతో విరాట్ మరో ఘనత కూడా సాధించాడు. ఈ హాఫ్ సెంచరీ అతనికి ఐపీఎల్లో ఓపెనర్ 50వది. ఈ ఘనతను విరాట్కు ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే సాధించాడు. తాజా ఇన్నింగ్స్తో విరాట్ ప్రస్తుత సీజన్లో లీడింగ్ రన్స్కోరర్గానూ అవతరించాడు. 7 ఇన్నింగ్స్ల్లో 328 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్, ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
ఆర్సీబీ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.5 ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది. ఈ గెలుపు ద్వారా ఆర్సీబీ ఓ అరుదైన ఘనత సాధించింది. సొంత మైదానం బెంగళూరులో తమ 50వ విజయాన్ని నమోదు చేసింది. తద్వారా ముంబై ఇండియన్స్ (వాంఖడే), కేకేఆర్ (కోల్కతా), సీఎస్కే (చెన్నై) జట్ల సరసన చేరింది. ఈ జట్లు కూడా తమతమ సొంత వేదికలపై 50 విజయాలు నమోదు చేశాయి. గత 18 సీజన్లలో కలిపి బెంగళూరులో 46 విజయాలు నమోదు చేసిన ఆర్సీబీ, ఈ ఒక్క సీజన్లో ఇప్పటికే (5 మ్యాచ్ల్లో) 4 విజయాలు సాధించింది. ఈ సీజన్లో బెంగళూరులో ఆర్సీబీకి ఎదురైన ఏకైక పరాజయం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో. ఈ మ్యాచ్లో 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారానూ ఆర్సీబీ ఓ ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 ప్లస్ టార్గెట్ను ఛేదించిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. అలాగే ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఛేదించిన 206 పరుగుల లక్ష్యం ఆ జట్టుకు ఐపీఎల్లో రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా నిలిచింది.ఐపీఎల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించిన టాప్-5 జట్లుపంజాబ్ కింగ్స్- 10ముంబై ఇండియన్స్- 6ఆర్సీబీ-5రాజస్థాన్- 5ఎస్ఆర్హెచ్- 5ఐపీఎల్లో ఆర్సీబీ ఛేదించిన 200 ప్లస్ లక్ష్యాలు228 vs LSG, లక్నో, 2025206 vs GT, బెంగళూరు, 2026*204 vs KXIP, బెంగళూరు, 2010202 vs SRH, బెంగళూరు, 2026201 vs GT, అహ్మదాబాద్, 2024ఐపీఎల్లో ఒక వేదికపై ఒక జట్టు సాధించిన అత్యధిక విజయాలు58 - MI (వాంఖడే)55 - KKR (కోల్కతా)53 - CSK (చెన్నై)50 - RCB (బెంగళూరు)*40 - SRH (హైదరాబాద్)*సూపర్ ఓవర్ విజయాలతో కలిపికాగా, నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కాడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
గర్జించిన కోహ్లి, పడిక్కల్.. ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), పడిక్కల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజయాన్ని అందుకుంది. చివర్లో హైడ్రామా నెలకొన్నప్పటికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్), కృనాల్ పాండ్యా (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, సుయాశ్ శర్మ, హాజిల్వుడ్ తలా ఒక వికెట్ తీశారు.సాయి సుదర్శన్ సెంచరీటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు ఈ ఇద్దరు 128 పరుగులు జోడించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఆది నుంచే బ్యాటింగ్లో జోరు ప్రదర్శించాడు. గిల్ ఔటయ్యే సమయానికి సాయి సుదర్శన్ 85 పరుగులతో ఆడుతున్నాడు. జట్టు స్కోరు 128 ఉంటే అందులో సాయి సుదర్శన్వే ఎక్కువ పరుగులు ఉండడం అతడి విధ్వంసాన్ని చూపిస్తోంది. గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఇక 58 బంతుల్లో సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ వెనుదిరిగిన అనంతరం గుజరాత్ స్కోరు మందగించింది. ఆఖర్లో సుందర్ (19 నాటౌట్), హోల్డర్ (23 నాటౌట్) మెరవడంతో గుజరాత్ 200 ప్లస్ స్కోరును దాటింది.కోహ్లి మాస్.. పడిక్కల్ క్లాస్ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో జాకబ్ బెతల్ (14) షారుక్ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన పడిక్కల్తో కలిసి కోహ్లి విధ్వంసం సృష్టించాడు. మైదానం నలుమూలలా బౌండరరీలు కొట్టిన కోహ్లి ఆర్సీబీని విజయం దిశగా నడిపించాడు. కోహ్లికి తోడు పడిక్కల్కూడా రాణించడంతో ఆర్సీబీ లక్ష్యం దిశగా సాగింది. ఈ దశలో అర్థసెంచరీ సాధించిన పడిక్కల్ ఔటయ్యాడు. అప్పటికే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి సెంచరీ దిశగా సాగాడు. కానీ 81 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అయితే కోహ్లి ఔటైన తర్వాత ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఛేదించాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో ఆఖర్లో టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యాలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆర్సీబీని గెలుపు తీరాలకు చేర్చారు. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది ఐదో విజయం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. అటు గుజరాత్ కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 3 విజయాలు, నాలుగు పరాజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.Clinical at home...Again! ❤️@RCBTweets jump to 2⃣nd spot on the points table with another win in front of a roaring Bengaluru crowd 🥳Scorecard ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @RCBTweets pic.twitter.com/pYTwF4yzbo— IndianPremierLeague (@IPL) April 24, 2026 -
చరిత్ర సృష్టించిన సుదర్శన్.. తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. గత మ్యాచ్లో అహ్మదాబాద్లో 'గోల్డెన్ డక్' అయిన సుదర్శన్.. ఈమ్యాచ్లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు.ఈ తమిళనాడు క్రికెటర్ ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. తొలి రెండు ఓవర్లు కాస్త ఆచితూచి ఆడిన సుదర్శన్, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 58 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సుదర్శన్.. 11 ఫోర్లు, 5 సిక్స్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. సుదర్శన్కు ఇది మూడో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం.ఈ క్రమంలో సాయిసుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్లు పరంగా అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును చేరుకున్న ఆటగాడిగా సాయి సుదర్శన్ రికార్డులకెక్కాడు. అతడు కేవలం 47 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(48 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది. బంతులు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో అభిషేక్ శర్మ(1193) అగ్రస్ధానంలో ఉన్నాడు.బంతులు పరంగా అత్యంతవేగంగా 2000 పరుగులు చేసిన భారత ప్లేయర్లు వీరే1193 - అభిషేక్ శర్మ1211 - వీరేంద్ర సెహ్వాగ్1306 - రిషబ్ పంత్1326 - యశస్వి జైస్వాల్1353 - యూసుఫ్ పఠాన్1361 - సాయి సుదర్శన్Krunal Pandya ಅವರ ಬೌನ್ಸರ್ ಎಸೆತಕ್ಕೆ Sai Sudharsan ಅಟ್ಟಿದ ಭರ್ಜರಿ ಸಿಕ್ಸರ್!😱🔥ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #RCBvsGT | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL pic.twitter.com/0BTEiT4tnC— Star Sports Kannada (@StarSportsKan) April 24, 2026 -
'సెంచరీలు కొట్టండి.. లేదంటే అంతే మీ పని'
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 103 పరుగుల తేడాతో ముంబై చిత్తు అయింది. ఐపీఎల్ చరిత్రలో పరుగుల తేడా పరంగా ముంబై ఇండియన్స్కు ఇదే అతి పెద్ద ఓటమి.దీంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై ఆ జట్టు యజమాని ఆకాశ్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ముంబై డౌగౌట్కు దగ్గరలో ఉన్న ఆకాశ్.. సోఫాలో నుంచి లేచి నిలబడి.. ‘‘అంతా అయిపోయింది. ఇంకేం చూస్తారు.. పదండి పదండి’’ అన్నట్లుగా ప్రేక్షకులకు సైగ చూస్తూ స్టేడియాన్ని వీడారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ అంబానీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై వరుస వైఫల్యాలపై ఆకాశ్ గుర్రుగా ఉన్నారని బసిత్ అలీ అన్నాడు.ఆకాష్ అంబానీకి గనుక కోపం వస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. అప్పుడు ఆటగాళ్లను ఆయన దండిస్తాడు. భాయ్ ఇకపై మ్యాచ్లు గెలవండి, సెంచరీలు కొట్టండి అని తమ ఆటగాళ్లకు ఆకాష్ గట్టిగా చెబుతాడు అని బసిత్ అలీ ఎగతాళిగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ముంబై జట్టు సెలక్షన్పై కూడా అతడు విమర్శలు కురిపించాడు. ముఖ్యంగా వరుసగా రెండు మ్యాచ్లలో విఫలమైన యువ ఆటగాడు డానిష్ మలేవార్ను జట్టులోకి తీసుకోవడాన్ని అతడు తప్పబట్టాడు. "ఈ కొత్త ఓపెనర్ ఎవరు? అతడిని ముంబై ఎందుకు ఆడిస్తోంది? అతనేమన్నా సిఫార్సుతో జట్టులోకి వచ్చాడా? అని అలీ మండిపడ్డాడు. అయితే ముంబై ఫ్యాన్స్ మాత్రం బసిత్ అలీకి కౌంటరిస్తున్నారు. ముందు మీ పీఎస్ఎల్ సంగతి చూసుకోండి, ఆ తర్వాత ఐపీఎల్ గురుంచి మాట్లాడు అంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. కాగా ఐపీఎల్కు పోటీగా ప్రారంభమైన పీఎస్ఎల్-2026 సీజన్ అట్టర్ ప్లాప్ అయింది. -
IPL 2026: గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), పడిక్కల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజయాన్ని అందుకుంది. చివర్లో హైడ్రామా నెలకొన్నప్పటికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్), కృనాల్ పాండ్యా (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రజత్ పటీదార్ మానవ్ సుతర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి సుందర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం బెంగళూరు 15.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నాడు.దూకుడుగా ఆడుతున్న పడిక్కల్5 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(16), దేవ్దత్త్ పడిక్కల్(18) ఉన్నారు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన బెతల్.. సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు.ఆర్సీబీ ముందు భారీ టార్గెట్చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయిసుదర్శన్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 58 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సుదర్శన్.. 11 ఫోర్లు, 5 సిక్స్లతో 100 పరుగులు చేశాడు.అతడితో పాటు శుభ్మన్ గిల్(32), జోస్ బట్లర్(25), జాసన్ హోల్డర్(23) రాణించారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలా వికెట్ సాధించారు.గుజరాత్ మూడో వికెట్ డౌన్గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన జోస్ బట్లర్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు.గుజరాత్ రెండో వికెట్ డౌన్గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 100 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 16 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 170/2సాయిసుదర్శన్ సెంచరీగుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయిసుదర్శన్ సెంచరీతో మెరిశాడు. 57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సుదర్శన్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 155-1గుజరాత్ తొలి వికెట్ డౌన్128 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్మన్ గిల్.. సుయాశ్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు.7 ఓవర్లకు గుజరాత్ స్కోర్:61/07 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(48), శుభ్మన్ గిల్(11) ఉన్నారు.ఆచితూచి ఆడుతున్న గుజరాత్2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(8), శుభ్మన్ గిల్(1) ఉన్నారు.ఐపీఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో జాకబ్ బెతల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు వెస్టిండీస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ గుజరాత్ టైటాన్స్ తరపున అరంగేట్రం చేశాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్ -
ఆర్సీబీ జట్టులోకి విధ్వంసకర వీరుడు?
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో ఆర్సీబీ తలపడనుంది. తమ ఆఖరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ఓటమిపాలైన ఆర్సీబీ తిరిగి పుంజుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో బెంగళూరు తుది జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు బెంచ్కే పరిమితమైన ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్.. గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగే అవకాశముంది. రొమారియో షెపర్డ్ స్దానంలో బెతల్ను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బెతల్ మూడు రోజులుగా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తూ కన్పించాడు.బెతల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సెమీఫైనల్లో భారత్పై సంచలన సెంచరీతో మెరిశాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 105 పరుగులు చేసి టీమిండియాను వణికించాడు. ఇప్పుడు ఐపీఎల్లో కూడా అదే దూకుడును కనబరిచేందుకు జాకబ్ సిద్దమయ్యాడు.ఇక జోష్ హాజిల్వుడ్ స్ధానంలో కివీస్ పేసర్ జాకబ్ డఫీ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. డఫీ తను ఆడిన ప్రతీ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ హాజిల్వుడ్ రావడంతో అతడు గత రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు.ఇప్పుడు అతడిని తిరిగి మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకొచ్చేందుకు ఆర్సీబీ మేనెజ్మెంట్ సిద్దమైంది. ఇక ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ.. నాలుగింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది.ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జాకబ్ బెతల్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, డఫీ, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఇంతకీ అతడికి పాస్పోర్ట్ ఉందా? -
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఇంతకీ అతడికి పాస్పోర్ట్ ఉందా?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, డేవిడ్ లాయిడ్, అలస్టైర్ కుక్, అలెక్స్ హార్ట్లీప్రశంసల వర్షం కురిపించారు. ఈ దిగ్గజ క్రికెటర్లు తాజాగా వైభవ్ ప్రదర్శనపై 'స్టిక్ టు క్రికెట్' (Stick to Cricket) పాడ్కాస్ట్లో ఆసక్తికర చర్చ జరిపారు.ఈ సందర్భంగా వీరంతా వైభవ్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఐర్లాండ్తో టూర్తో వైభవ్ సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేస్తాడని వాన్ జోస్యం చెప్పాడు. వైభవ్ ఒక అద్బుతమైన ఆటగాడని, అతడి టాలెంట్ చూస్తుంటే ముచ్చటెస్తుందని అలెక్స్ హార్ట్లీ అభిప్రాయపడ్డాడు.కాగా తన అరంగేట్ర ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ సెంచరీతో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2026లో కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన సూర్యవంశీ, 220.87 స్ట్రైక్ రేటుతో 256 పరుగులు చేశాడు.ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల మధ్య జరిగిన సంబాషణ ఇదేమైఖల్ వాన్: సూర్యవంశీ నిజంగా ఒక సంచలన ఆటగాడు, ఈ ఏడాది ఐపీఎల్లో అతడి స్ట్రైక్ రేట్ 236గా ఉంది.డేవిడ్ లాయిడ్: అతడు ఇప్పుడు స్కూల్కి వెళ్లాలి కదా? మధ్యలో స్కూల్ అలా మానేయకూడదు కదా వాన్!వాన్: అతడు మళ్లీ స్కూల్కు వెళ్తాడని నేను అనుకోను డేవ్. వైభవ్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో ఉంటాడని నేను అనుకుంటా? ఒకవేళ నేను సెలక్టర్ అయితే ఇంగ్లండ్ సిరీస్ కోసం వైభవ్ను కచ్చితంగా ఎంపిక చేస్తాను.టఫ్నెల్: అవును కచ్చితంగా సీనియర్ జట్టులోకి వచ్చేందుకు అతడు అర్హుడు.అలస్టైర్ కుక్: ఇంతకి వైభవ్ దగ్గర పాస్పోర్ట్ ఉందా?(నవ్వుతూ)వాన్: అతడికి 20 ఏళ్లు ఉంటే మనందరం ఆశ్చర్యపోయేవాళ్లం కాదు. కానీ 15 ఏళ్లలోనే ఇలా ఆడుతున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. బుమ్రాను సైతం అతడు వదల్లేదు.హార్ట్లీ: వైభవ్కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు అత ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా, నిర్భయంగా ఆడుతున్నాడు. కచ్చితంగా అతడిని భారత జట్టుకు ఎంపిక చేయాలి.వాన్: భారత టీ20 జట్టుకు కొత్త ఓపెనర్ అతడే. మరో ఎండ్లో జైస్వాల్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ వైభవ్ ప్రదర్శనల కారణంగా జైశ్వాల్ వెలుగులోకి రాలేకపోతున్నాడు. -
‘అందుకే శ్రేయస్ అయ్యర్ను వదులుకున్నాం’
భారత దేశీ క్రికెట్లో కోచ్గా చంద్రకాంత్ పండిట్కు మంచి పేరుంది. అతడి మార్గదర్శనంలోనే మధ్యప్రదేశ్ తొలి రంజీ టైటిల్ అందుకుంది. రంజీ 2021-22 సీజన్లో చాంపియన్గా నిలిచింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్ హెడ్కోచ్గా చంద్రకాంత్ పండిట్ బాధ్యతలు చేపట్టాడు.చంద్రకాంత్ మార్గ నిర్దేశనం, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలో కేకేఆర్ 2024లో చాంపియన్గా అవతరించింది. అయితే, వీరి కంటే నాటి మెంటార్ గౌతం గంభీర్కే క్రెడిట్ ఎక్కువగా వచ్చింది. ఇక 2024 తర్వాత కేకేఆర్ శ్రేయస్ను వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది.ఏకంగా ఫైనల్కుఅందుకు తగినట్లుగానే శ్రేయస్ అయ్యర్ బ్యాటర్గా, కెప్టెన్గా రాణించి పంజాబ్ను గతేడాది ఫైనల్కు చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలో పంజాబ్ ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు.. శ్రేయస్ను వదులుకున్న కేకేఆర్ వరుస పరాజయాలతో డీలా పడి.. విమర్శలు మూటగట్టుకుంటోంది.ఈ నేపథ్యంలో కేకేఆర్ మాజీ హెడ్కోచ్ చంద్రకాంత్ పండిట్ శ్రేయస్ అయ్యర్ను వదులుకోవడంపై తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ ఆరోజు మేము అతడి సేవలు కోల్పోయాము. శ్రేయస్ అద్భుతమైన ఆటగాడు. కెప్టెన్గా కేకేఆర్కు ట్రోఫీ అందించాడు.అతడు జట్టును నడిపించే విధానానికి నేను అభిమానిని. అయితే, కొన్నిసార్లు దీర్ఘకాల ప్రయోజనాలు, వ్యూహాల దృష్ట్యా కొంతమంది ప్లేయర్లను వదులుకోవాల్సి వస్తుంది. నిజానికి ఆరోజు కేకేఆర్ కోచ్గా నేను ఈ విషయంలో చాలా బాధపడ్డాను.అందుకే అతడిని వదులుకున్నాముఅయితే, కావాలని మేము అతడిని వదులుకోలేదు. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. శ్రేయస్ ఒక్కడినే కాదు.. ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లను కూడా మేము వదిలేశాము. ఏదేమైనా కోచ్గా ఉన్న సమయంలో కేకేఆర్ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతా, సీఈఓ వెంకీ మైసూర్ నాకు అండగా ఉన్నారు’’ అని చంద్రకాంత్ పండిట్ రెవ్స్పోర్ట్స్తో పేర్కొన్నాడు.కాగా 2025 సీజన్ తర్వాత చంద్రకాంత్ పండిట్కు ఉద్వాసన పలికిన కేకేఆర్.. 2026కు గానూ అభిషేక్ నాయర్ను హెడ్కోచ్గా ప్రకటించింది. గతేడాది అజింక్య రహానే కెప్టెన్సీలో పద్నాలుగింట కేవలం ఐదు గెలిచిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికి ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. చదవండి: ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు? -
అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథే: సెహ్వాగ్
ఐపీఎల్-2026లో ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మూడింట గెలిచింది. ముంబై ఇండియన్స్తో గురువారం నాటి మ్యాచ్లో ఏకపక్ష విజయం సాధించి పాయింట్ల సంఖ్యను ఆరుకు పెంచుకుంది. సొంతమైదానం వాంఖడేలో ముంబైని చెన్నై చిత్తు చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.మూడు మ్యాచ్లలో రెండు శతకాలుఅయితే, టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) మాత్రం చెన్నై విషయంలో భిన్నంగా స్పందించాడు. ఒక్కరిపై ఆధారపడితే చెన్నై ఈసారి కూడా గట్టెక్కలేదని అభిప్రాయపడ్డాడు. కాగా చెన్నై ఇప్పటికి మూడు విజయాలు సాధించగా.. ఈ మూడింటిలో సంజూ శాంసన్ రెండు అజేయ సెంచరీలతో జట్టును గెలిపించాడు.ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 115 పరుగులు చేసిన సంజూ.. తాజాగా ముంబైపై 101 పరుగులు సాధించాడు. ఈ రెండు మ్యాచ్లలో మిగతా బ్యాటర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. ఇక కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లోనూ సంజూ 48 పరుగులతో టాప్రన్స్కోరర్గా నిలిచి జట్టుకు విజయం అందించాడు.అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథేఈ నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం చెన్నై జట్టును అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ ఆ జట్టు గెలిచిన ప్రతి సందర్భంలోనే ఒకే ఒక్క బ్యాటర్ పరుగులు రాబట్టాడు. అతడు పరుగులు చేయడంలో విఫలమైన రోజు కథ వేరుగా ఉంటోంది.ఒకవేళ అతడు మళ్లీ గనుక ఫెయిలైతే పాత కథే పునరావృతం అవుతుంది. కాబట్టి ఒకే ఒక్క బ్యాటర్పై ఆధారపడటం సరికాదు. సంజూతో పాటు పరుగులు రాబట్టే ఆయుశ్ మాత్రే దురదృష్టవశాత్తూ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్ మీద చెన్నై ఆశలు పెట్టుకుంది. సంజూతో కలిసి వాళ్లు కూడా రాణిస్తేనే సీఎస్కే ప్రయాణం ముందుకు సాగుతుంది’’ అని క్రిక్బజ్ షోలో పేర్కొన్నాడు. ఏదేమైనా సంజూ శాంసన్ సంచలన ఇన్నింగ్స్తో ముంబైపై చెన్నైకి విజయం అందించాడని సెహ్వాగ్ ప్రశంసించాడు.కాగా రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన చెన్నై.. కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.చదవండి: ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?What composure. What striking 💛𝐒𝐚𝐧𝐣𝐮 𝐒𝐦𝐚𝐬𝐡𝐢𝐧𝐠 𝐒𝐚𝐦𝐬𝐨𝐧 🔥Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @ChennaiIPL | @IamSanjuSamson pic.twitter.com/2Hr9Ui0UEn— IndianPremierLeague (@IPL) April 23, 2026 -
ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై 99 పరుగుల తేడాతో గెలిచిన హార్దిక్ సేన.. అదే జోరు కొనసాగించలేకపోయింది. సొంత మైదానం వాంఖడే వేదికగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా సీజన్లో ఏడింట ఐదో పరాజయాన్ని నమోదు చేసింది.సంజూ సెంచరీతో గెలిపించాడుటాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అడపాదడపా వికెట్లు తీసినా.. ఓపెనర్ సంజూ శాంసన్ దూకుడును మాత్రం అడ్డుకోలేకపోయారు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆచితూచి ఆడుతూనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. తిలక్ వర్మ (29 బంతుల్లో 37; 5 ఫోర్లు), సూర్యకుమార్ (30 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించారు. అకీల్ హొసీన్కు 4 వికెట్లు దక్కాయి.ముంబై బ్యాటర్లు పెవిలియన్కు క్యూఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆది నుంచే తడబడటం తీవ్ర ప్రభావం చూపింది. ఓపెనర్లు డానిష్ మలేవార్ (0), క్వింటన్ డికాక్ (7).. వన్డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. సూర్య, తిలక్ కాసేపు పోరాడిన ఫలితం లేకుండా పోయింది. మిగిలిన వారిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, రూథర్ఫర్డ్ 0, శార్దూల్ ఠాకూర్ 6, క్రిష్ భగత్ 7, జస్ప్రీత్ బుమ్రా 2 పరుగులు చేశారు.ఆకాశ్ అంబానీ ఆగ్రహంఈ క్రమంలో వరుసగా వికెట్లు పడుతూ.. ఓటమి దిశగా ముంబై వెళ్తున్న వేళ.. ఆ జట్టు యజమాని ఆకాశ్ అంబానీ తీవ్రంగా స్పందించారు. బ్లూ సోఫాలో నుంచి లేచి నిలబడి.. ‘‘అంతా అయిపోయింది. ఇంకేం చూస్తారు.. పదండి పదండి’’ అన్నట్లుగా ప్రేక్షకులకు సైగ చేస్తూ స్టేడియాన్ని వీడారు. There is absolutely nothing going right for Mumbai Indians right now. Just look at Akash Ambani walking off mid-game and he walked right in front of the dugout and didn’t even look at the players. He literally asked the fans to leave the stadium as well. The lack of unity is… pic.twitter.com/8nplMjRYLN— OldMonkOfCricket (@OldMonkOfCric) April 24, 2026ఆ సమయంలో మైదానంలోని ఆటగాళ్ల వైపు ఆకాశ్ అంబానీ కోపంగా చూసినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద ఓటమి. అందుకే ఆకాశ్ అంబానీ ఎన్నడూ లేని విధంగా అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.చదవండి: PSL: పీసీబీకి దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్ -
జేమీపై తిలక్ వర్మ ఫైర్.. మధ్యలో సూర్య.. ఆఖరికి!
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్కు ప్రత్యేక అభిమానులు ఉంటారు. చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ జట్ల మధ్య పోటీ అంటే అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. ఐపీఎల్-2026లో భాగంగా గురువారం నాటి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.అయితే, ఈ మ్యాచ్లో చెన్నై ముంబైపై ఏకపక్ష విజయం సాధించింది. సొంతమైదానం వాంఖడేలో హార్దిక్ సేనను రుతురాజ్ బృందం ఏకంగా 103 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఐపీఎల్లో పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం.జేమీతో గొడవపడ్డ తిలక్ వర్మఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై బ్యాటర్లు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్- చెన్నై బౌలింగ్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ మధ్య వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా తిలక్ జేమీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇంతలో సూర్య కూడా జోక్యం చేసుకుని జేమీని నిందించగా.. అతడు గట్టిగానే బదులిచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే.. చెన్నై విధించిన 208 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి కుదేలైంది. ఈ క్రమంలో తిలక్ వర్మ- సూర్య ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.ఫీల్డర్ను చూడనివ్వవా?ఇక ముంబై ఇన్నింగ్స్ పదో ఓవర్లో జేమీ ఓవర్టన్ బంతితో రంగంలోకి దిగి స్లో బాల్ సంధించగా.. తిలక్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో సూర్య- తిలక్ కలిసి సింగిల్ పూర్తి చేసుకోగా.. తిలక్ ఇంకో రన్ కోసం పిలుపునిచ్చాడు. అయితే, సూర్య ఇందుకు నిరాకరించగా.. తిలక్ వేగంగా నాన్-స్ట్రైకర్ ఎండ్వైపు చేరుకున్నాడు.అయితే, అదే సమయంలో ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న జేమీ.. తిలక్కు అడ్డుగా వచ్చి రనౌట్ చేయాలని చూశాడు. దీంతో తిలక్ వర్మ సీరియస్ అయ్యాడు. తనను కావాలనే జేమీ అటకాయించాడని.. ఫీల్డర్ను చూడకుండా చేశాడని ఫైరయ్యాడు. దీంతో జేమీ కూడా ధీటుగా బదులివ్వగా సూర్య జోక్యం చేసుకున్నాడు.Heat. Pressure. Drama 😤This rivalry never disappoints 🔥#TATAIPL 2026 | #MIvCSK | LIVE NOW 👉 https://t.co/vkBKeocOG2 pic.twitter.com/hETDJPFFK3— Star Sports (@StarSportsIndia) April 23, 2026సూర్య కూడా ఫైర్.. అంపైర్ల జోక్యంతోఅయితే, సూర్యకు కూడా జేమీ కౌంటర్ ఇవ్వగా పరిస్థితి విషమిస్తుందని భావించిన అంపైర్లు వీరిని విడదీశారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత జేమీని తిలక్ వర్మ హత్తుకున్నాడు. దీంతో ఈ వివాదం ఇక్కడితో సమసిపోయినట్లు అయింది.ఈ మ్యాచ్లో తిలక్ 29 బంతుల్లో 37 పరుగులు చేయగా.. సూర్య 30 బంతుల్లో 36 రన్స్ చేశాడు. అయితే, సీఎస్కే బౌలర్ల దూకుడు ముందు వీరు నిలవలేకపోయారు. ఫలితంగా 19 ఓవర్లలో కేవలం 104 పరుగులు చేసి ముంబై ఆలౌట్ అయింది.చదవండి: Hardik pandya: బ్యాటింగ్ రాదు.. బౌలింగ్ రాదు! నీకు కెప్టెన్సీ అవసరమా?


