IPL 2026: ఐపీఎల్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ | Two day delay expected IPL 2026 to begin from March 28: Report | Sakshi
Sakshi News home page

IPL 2026: ఐపీఎల్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Feb 27 2026 8:35 PM | Updated on Feb 27 2026 9:13 PM

Two day delay expected IPL 2026 to begin from March 28: Report

ఐపీఎల్‌-2025 విజేత ఆర్సీబీ (PC: BCCI)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 టోర్నమెంట్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌!!... ముందుగా షెడ్యూల్‌ చేసినట్లుగా మార్చి 26న కాకుండా.. రెండు రోజులు ఆలస్యంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ ఆరంభం కానున్నట్లు సమాచారం.

గతేడాది ఇలా
గతేడాది మార్చి 22న మొదలైన ఐపీఎల్‌.. జూన్‌ 3న ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఐపీఎల్‌-2026 టోర్నీ మార్చి 26న ఆరంభం కానుందని తొలుత పాలక మండలి ఫ్రాంఛైజీలకు తెలిపింది. డిసెంబరులో జరిగిన వేలానికి ముందు ఈ మేరకు సమాచారం అందించింది.

కారణం ఇదేనా?
అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఐపీఎల్‌ పందొమ్మిదో ఎడిషన్‌ మార్చి 28న మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఫైనల్‌ను మే 31న నిర్వహించనున్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. ఐపీఎల్‌ ఆరంభ తేదీకి సంబంధించి పాలక మండలి వచ్చే వారం సమావేశమై డేట్‌ ఫిక్స్‌ చేయనున్నట్లు వెల్లడించింది.

అసోం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈమేరకు తేదీల్లో మార్పు చేసినట్లు పేర్కొంది. కాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు తమిళనాడు (చెన్నై), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు పశ్చిమ బెంగాల్‌ (కోల్‌కతా) హోం గ్రౌండ్స్‌గా ఉండగా.. అసోంలోని గువాహటి రాజస్తాన్‌ రాయల్స్‌కి రెండో హోం గ్రౌండ్‌.

ఆర్సీబీకి స్టేడియం దొరికిందా?
ఇక ఐపీఎల్‌ రెండు రోజులు ఆలస్యంగా ఆరంభం కావడానికి అసెంబ్లీ ఎన్నికలు ఒక కారణం అయితే.. గత ఎడిషన్‌ విజేత ఆర్సీబీకి ఇంతవరకు తమ హోం గ్రౌండ్‌పై ఇంత వరకు స్పష్టత రానట్లు సమాచారం. కాగా మొట్టమొదటిసారి ట్రోఫీ గెలిచిన సంతోషాన్ని పంచుకునే క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తొందరపాటు చర్య విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. 

విజయోత్సవ విషాదం
బెంగళూరులోకి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవానికి ఎలాంటి అనుమతి లేకుండా పిలుపునివ్వగా భారీ ఎత్తున అభిమానులు కదలివచ్చారు. ఈ క్రమంలో  తొక్కిసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్సీబీ యాజమాన్యంపై కేసులు నమోదు కావడంతో పాటు తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 

దీంతో ఈసారి తమ హోం గ్రౌండ్‌ను చిన్నస్వామి నుంచి తరలించాలని ఆర్సీబీ నిర్ణయించుకుంది. కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ వేదికల కోసం ఇప్పటికే నవీ ముంబై, రాయ్‌పూర్‌, పుణెలను ఎంచుకుని ఆయా స్థానిక బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement