Priyansh Arya
-
RCB Vs PBKS: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సాల్ట్
పంజాబ్తో జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ ఆటగాడు ఫిల్ సాల్ట్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద నమ్మశక్యం కాని రీతిలో ప్రియాంశ్ ఆర్య క్యాచ్ అందుకున్నాడు. ఆర్సీబీ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతికి ఇది జరిగింది. ఈ వికెట్ హాజిల్వుడ్ ఖాతాలో పడింది. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.A GAME CHANGING CATCH BY SALT 🥶 pic.twitter.com/SxdpRgA4Se— Johns. (@CricCrazyJohns) June 3, 2025మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 200లోపు స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్ను అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్ 3, ఒమర్జాయ్, విజయ్కుమార్ వైశాక్, చహల్ తలో వికెట్ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లినే టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్16, లివింగ్స్టోన్ 25, జితేశ్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం 191 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (24), ప్రభ్సిమ్రన్ సింగ్ (26), శ్రేయస్ అయ్యర్ (1) ఔట్ కాగా.. జోష్ ఇంగ్లిస్ (31), నేహల్ వధేరా (1) క్రీజ్లో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీశారు. -
PBKS Vs MI: విధ్వంసం సృష్టించిన ఇంగ్లిస్, ఆర్య.. ముంబైపై పంజాబ్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 26) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఓటమితో ముంబై నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.పాయింట్ల పట్టికలో ప్లే ఆఫ్స్కు చేరిన జట్లు..పంజాబ్- 19గుజరాత్- 18ఆర్సీబీ- 17 (ఇంకా ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంది)ముంబై- 16సత్తా చాటిన సూర్యకుమార్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన సూర్యకుమార్ మెరుపు అర్ద సెంచరీతో (57) సత్తా చాటాడు.ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24, తిలక్ వర్మ 1, విల్ జాక్స్ 17, హార్దిక్ పాండ్యా 26, నమన్ ధిర్ 20 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జన్సెన్, విజయ్కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.విధ్వంసం సృష్టించిన ఇంగ్లిస్, ప్రియాంశ్అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రియాంశ్ ఆర్య 62, జోష్ ఇంగ్లిస్ 73, శ్రేయస్ అయ్యర్ 26 (నాటౌట్), ప్రభ్సిమ్రన్ 13, నేహల్ వధేరా 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో సాంట్నర్ 2, బుమ్రా ఓ వికెట్ పడగొట్టారు. -
IPL 2025: ధనాధన్గా దూసుకొచ్చారు
14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో కోట్లు కొల్లగొట్టిన బిహార్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ... బరిలోకి దిగిన మూడో మ్యాచ్లోనే రికార్డు సెంచరీతో తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు! ప్రదాన ఆటగాళ్లంతా విఫలమవుతున్న చోట... నేనున్నానంటూ బాధ్యతలు భూజానికెత్తుకున్న 17 ఏళ్ల ఆయుశ్ మాత్రే ఆడింది తక్కవ మ్యాచ్లే అయినా... చెన్నై భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు!పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు గుబులు పుట్టిస్తుంటే... ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అభిషేక్ పొరెల్ తన నిలకడతో ఆకట్టుకున్నాడు. తాజా ఐపీఎల్ సీజన్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న అన్క్యాప్డ్ ఓపెనర్లపై కథనం... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ వారం రోజులపాటు వాయిదా పడింది. ఇప్పటి వరకు 58 మ్యాచ్లు జరిగాయి. మరో 12 లీగ్ మ్యాచ్లు... ఆ తర్వాత 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగాల్సి ఉన్నాయి. వారం రోజుల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి ఐపీఎల్ టోర్నీ ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో స్టార్ ఆటగాళ్లకంటే ఏమాత్రం అంచనాలు లేని యువ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. హేమాహేమీలతో పోటీపడుతూ... తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ముఖ్యంగా యువ ఓపెనర్ల జోరు ఎక్కువ కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ (రాజస్తాన్ రాయల్స్), ఆయుశ్ మాత్రే (చెన్నై సూపర్ కింగ్స్), అభిషేక్ పొరెల్ (ఢిల్లీ క్యాపిటల్స్)... ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ (పంజాబ్ కింగ్స్) ఈ కోవలోకే వస్తారు. టీమిండియా గడప తొక్కాలంటే... ఐపీఎల్లో రాణించడం తప్పనిసరిలా మారిపోయిన ప్రస్తుతం తరుణంలో ఈ సీజన్లో ఈ ఐదుగురు ఆటగాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ఇందులో ఒక్కొక్కరి శైలి ఒక్కో రకం కాగా... అందరి లక్ష్యం భారీగా పరుగులు సాధించడమే. తాజా సీజన్లో అన్క్యాప్డ్ (జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు) ప్లేయర్లుగా బరిలోకి దిగి పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా విరుచుకుపడుతున్న ఈ యువతరం... భారత క్రికెట్ భవిష్యత్తుపై మరింత భరోసా పెంచుతోంది. ఆహా... ఆయుశ్ ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆయుశ్ మాత్రేకు అనూహ్యంగా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఈ యువ ఓపెనర్ను రూ. 30 లక్షలు ఇచ్చి జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే 15 బంతుల్లో 32 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం ఓపెనర్... బెంగళూరుతో మ్యాచ్లో 48 బంతుల్లో 94 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బౌలర్ ఎవరైనా లెక్కచేయకపోవడం... బంతి తన పరిధిలో ఉంటే చాలు విరుచుకుపడటం ఆయుశ్ ప్రధాన అ్రస్తాలు. ఈ సీజన్లో చెన్నై జట్టు పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఆయుశ్ మెరుపులు పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే సాధారణ ఆటగాళ్లను సైతం మ్యాచ్ విన్నర్లుగా తీర్చిదిద్దగల ధోని సారథ్యంలో మాత్రే భవిష్యత్తులో మరింత రాటుదేలడం ఖాయమే. మ్యాచ్లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 5 163 94 181.11అభిషేక్ అదుర్స్ఈ ఏడాది అంచనాలకు మించి రాణిస్తున్న ఆటగాళ్లలో అభిషేక్ పొరెల్ ఒకడు. గతేడాది ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచగా... దాన్ని పొరెల్ నిలబెట్టుకుంటున్నాడు. తాజా సీజన్లో సహచర ఓపెనర్లు నిలకడ కనబర్చలేకపోయినా... పొరెల్ మాత్రం ప్రభావం చూపాడు. 22 ఏళ్ల ఈ ఎడం చేతి వికెట్ కీపర్... కేఎల్ రాహుల్ తర్వాత ప్రస్తుతం ఢిల్లీ జట్టులో రెండో అత్యధిక స్కోరర్గా కొనసాగుతున్నాడు. పేస్తో పాటు స్పిన్ను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగల పొరెల్ నైపుణ్యం అతడిని క్లాస్ ప్లేయర్ల జాబితాలో చేర్చుతుంది. బంతిపై మరీ పగబడినట్లు కాకుండా... సుతారాంగా అతడు కొట్టే షాట్లు క్రీడాభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. బ్యాటింగ్లో భళా అనిపించుకుంటున్న పొరెల్... స్ట్రయిక్ రొటేషన్ ప్రాధానత్యను అర్థం చేసుకుంటూ ఇన్నింగ్స్ను నడిపిస్తున్న తీరు ముచ్చటేస్తోంది. మ్యాచ్లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 265 51 149.71వైభవ్ జ్వాలఐపీఎల్లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ బాది... తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మూడో మ్యాచ్లోనే రికార్డు సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెటే శ్వాసగా పెరిగిన ఈ బిహార్ ఎడంచేతి వాటం ఓపెనర్... గుజరాత్ టైటాన్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన పోరులో 7 ఫోర్లు, 11 సిక్స్లతో చెలరేగిపోయాడు. రెండొందల పైచిలుకు లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవకుండా విరుచుకుపడి టి20ల్లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 94 పరుగుల వద్ద ఉండి కూడా ధైర్యంగా సిక్స్ కొట్టి మూడంకెల స్కోరు అందుకున్న ఈ కుర్రాడు. ఆ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా... అతడిలో ప్రతిభకు కొదవలేదని మాత్రం నిరూపితమైంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాదిరిగా వైభవ్క కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంచనాల ఒత్తిడి దరి చేరనివ్వకుండా... నిలకడ కొనసాగిస్తే వీరిలో కొందరు ఆటగాళ్లు టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.మ్యాచ్లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 5 155 101 209.45ఫటాఫట్.. ప్రభ్సిమ్రన్ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శన చేస్తోంది అంటే... దాని ప్రధాన కారణాల్లో ఓపెనింగ్ జోడీ ప్రదర్శన ముఖ్యమైంది. ఒక ఎండ్లో ఆర్య అదరగొడుతుంటే... మరో ఎండ్ నుంచి ‘పిట్ట కొంచం కూత ఘనం’లాగా ప్రభ్సిమ్రన్ చెలరేగిపోతున్నాడు. ఫలితంగానే చాన్నాళ్ల తర్వాత పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ దిశగా సజావుగా సాగుతోంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ శిక్షణ, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భయం లేకుండా ఆడుతున్న 24 ఏళ్ల ప్రభ్సిమ్రన్ సింగ్... జట్టు నమ్మదగ్గ ఆటగాళ్లలో ఒకడిగా మారిపోయాడు. లక్నోపై 48 బంతుల్లోనే 91 పరుగులు చేసిన ప్రభ్సిమ్రన్... స్లో పిచ్పై కోల్కతా స్పిన్నర్లను ఎదుర్కొని 83 పరుగులు చేశాడు. పవర్ప్లేను పూర్తిగా వినియోగించుకుంటూ భారీగా పరుగులు రాబడుతున్న ఈ కుడి చేతి వాటం బ్యాటర్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు.మ్యాచ్లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 487 91 170.87ప్రియాన్ష్ ‘స్పెషల్ టాలెంట్’ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్తో ‘స్పెషల్ టాలెంట్’ అని ప్రశంసలు అందుకున్న 23 ఏళ్ళ ప్రియాన్ష్ ఆర్య... చెన్నైపై సెంచరీ బాది ప్రకంపనలు సృష్టించాడు. బంతిని నిశితంగా గమనించడంతో పాటు దాని వేగాని ప్రియాన్ష్ ఆర్య..కి అనుగుణంగా షాట్లను ఎంపిక చేసుకొని అప్పటికప్పుడు వాటిని అమలు చేయడంలో ప్రియాన్ష్ దిట్ట. ముల్లాన్పూర్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో ప్రియాన్ష్... ఇన్నింగ్స్ను పరిశీలిస్తే ఇది అవగతమవుతుంది.బ్యాటింగ్కు అంతగా అనుకూలంగా లేని పిచ్పై ఆర్య అదరగొట్టి ఐపీఎల్లో ఐదో వేగవంతమైన శతకం (39 బంతుల్లో) చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఢిల్లీకి చెందిన ఈ ఎడం చేతివాటం బ్యాటర్... ఫోర్ల కంటే ఎక్కువ సిక్స్లు కొట్టడంలో సిద్ధహస్తుడు. అభిమానులు ముద్దుగా ‘లెఫ్ట్ హ్యాండ్ సెహ్వాగ్ ’ అని పిలుచుకుంటున్న ఆర్య... ఈ సీజన్లో పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్తో కలిసి జట్టుకు మెరుగైన ఆరంభాలు అందించడం... పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబడుతుండటంతో... మిడిలార్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతోంది.మ్యాచ్లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 417 103 194.85 -
IPL 2025, DC VS PBKS: బ్లాక్ అవుట్కు ముందు బ్లో అవుట్
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న (మే 8) ధర్మశాల వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమైన మ్యాచ్ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. బ్లాక్ అవుట్ ప్రకటనకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ పరుగుల వరద పారించింది. ఆ జట్టు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్ ప్లేలో 69 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన ప్రియాంశ్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రభ్సిమ్రన్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి సీజన్లో వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించాడు. ప్రియాంశ్, ప్రభ్సిమ్రన్ పోటీపడి చెలరేగడంతో పంజాబ్ 10 ఓవర్లలో ఏకంగా 122 పరుగులు చేసింది.అనంతరం 11వ ఓవర్ తొలి బంతికే సీజన్ తొలి మ్యాచ్ ఆడుతున్న నటరాజన్ ప్రియాంశ్ ఆర్యను ఔట్ చేశాడు.అప్పుడే అధికారుల నుంచి బ్లాక్ అవుట్ సమాచారం రావడంతో స్టేడియం నిర్వహకులు ఓ ఫ్లడ్ లైట్ను బంద్ చేశారు. కొద్ది సేపటికి మరో రెండు ఫ్లడ్ లైట్లు కూడా బందయ్యాయి. దీని తర్వాత మరి కొద్ది సేపటికి మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆటగాళ్లు సహా స్టేడియం మొత్తం ఖాళీ చేయాలని అత్యవసర ప్రకటన వచ్చింది.తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు. మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠాన్కోట్ గుండా ఢిల్లీకి తరలించారు.బ్లాక్ అవుట్ అంటే ఏంటి..?యుద్ధం లేదా ఎమర్జెన్జీ పరిస్థితుల్లో నగరాన్ని మొత్తం చీకటి చేయడం. శత్రువుల వైమానిక దాడులను కష్టతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇలా చేస్తే శత్రువుల టార్గెట్ మిస్ అవుతుంది. ఫలితంగా దాడుల నుంచి రక్షణ పొందొచ్చు. -
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేశారు. ఈ నలుగురిలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే.. నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే. పైగా నలుగురు 27 ఏళ్ల లోపు వారే. ఈ నలుగురు 45 బంతుల్లోపే సెంచరీలు పూర్తి చేశారు. వీరిలో ఇద్దరు సన్రైజర్స్ ఆటగాళ్లు కాగా.. ఒకరు పంజాబ్, ఒకరు రాజస్థాన్ ఆటగాడు.ఈ సీజన్లో తొలి సెంచరీని సన్రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ చేశాడు. సీజన్ రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఇషాన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన ఇషాన్, మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్లో ఇషాన్ చేసిన ఈ సెంచరీ 15వ వేగవంతమైన సెంచరీ.ఈ సీజన్లో రెండో సెంచరీని పంజాబ్ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య చేశాడు. సీజన్ 22వ మ్యాచ్లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ప్రియాంశ్ మూడంకెల స్కోర్ను సాధించాడు. ఈ మ్యాచ్లో ప్రియాంశ్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు.ప్రియాంశ్ ఈ సెంచరీని కేవలం 39 బంతుల్లో పూర్తి చేశాడు. ఐపీఎల్లో ఇది ఆరో వేగవంతమైన సెంచరీ. ప్రియాంశ్ ఈ రికార్డును సన్రైజర్స్ ఆటగాడు ట్రవిస్ హెడ్తో షేర్ చేసుకున్నాడు. ట్రవిస్ కూడా గత సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 39 బంతుల్లో శతక్కొట్టాడు.ఈ సీజన్లో మూడో సెంచరీని సన్రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ చేశాడు. సీజన్ 27వ మ్యాచ్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో 55 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 14 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 141 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అభిషేక్ది ఏడో వేగవంతమైన సెంచరీ.ఈ సీజన్లో నాలుగో సెంచరీని రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చేశాడు. సీజన్ 47వ మ్యాచ్లో వైభవ్ గుజరాత్ టైటాన్స్పై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో కేవలం 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. ఐపీఎల్లో ఫాస్టెస్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ (30 బంతుల్లో) పేరిట ఉంది.వైభవ్ ఈ సెంచరీ చేసే సమయానికి అతని వయసు కేవలం 14 ఏళ్ల 32 రోజులు. ఈ సెంచరీతో వైభవ్ చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో వైభవ్ అత్యంత పిన్న వయస్కుడు. -
చరిత్ర సృష్టించిన జైస్వాల్.. ఐపీఎల్లో తొలి ప్లేయర్గా..
రాజస్తాన్ రాయల్స్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఇంత వరకు సాధ్యం కాని రికార్డు సాధించాడు. ఎదుర్కొన్న మొదటి బంతికే మూడుసార్లు సిక్సర్ బాదిన ఏకైక బ్యాటర్గా అరుదైన ఘనత సాధించాడు.రాయాల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్ సందర్భంగా జైస్వాల్ గురువారం ఈ ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఆర్సీబీ- రాజస్తాన్ (RCB vs RR) గురువారం తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.205 పరుగులుఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (26) ఫర్వాలేదనిపించగా.. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 70) దంచికొట్టాడు. దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 50), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 23), జితేశ్ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. జైస్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసేందుకు ఆర్సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రంగంలోకి దిగగా.. తొలి బంతినే జైసూ సిక్సర్గా మలిచాడు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్స్ కొట్టిన క్రికెటర్ల జాబితాలో ఉన్న జైసూ.. మూడుసార్లు ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో జైస్వాల్ మొత్తంగా 19 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఏకంగా 49 పరుగులు రాబట్టాడు. అయితే, జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో రొమారియో షెఫర్డ్కు క్యాచ్ ఇవ్వడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్కు తెరపడింది.అంతేకాదు.. రాజస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా పతనమైంది. నితీశ్ రాణా (28), రియాన్ పరాగ్ (22), ధ్రువ్ జురెల్ (47) పోరాడినా.. 20 ఓవర్లలో రాజస్తాన్ 194 పరుగులే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఐపీఎల్లో తొలి బంతికే సిక్సర్లు బాదిన క్రికెటర్లు1.యశస్వి జైస్వాల్- 32. నమన్ ఓజా-13. మయాంక్ అగర్వాల్- 14. సునిల్ నరైన్- 15. విరాట్ కోహ్లి- 16. రాబిన్ ఊతప్ప- 17. ఫిల్ సాల్ట్- 18. ప్రియాన్ష్ ఆర్య- 1.చదవండి: ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా విరాట్ కోహ్లి ఘనత Woke up and said Pehla ball, JaisBall 🔥 pic.twitter.com/pg4w29Jl2G— Rajasthan Royals (@rajasthanroyals) April 24, 2025 -
అతడి బ్యాటింగ్కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
వరుస పరాజయాల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ (PBKS)ను చిత్తు చేసి.. ఆరెంజ్ ఆర్మీని సంతోషపెట్టింది. ఉప్పల్లో పరుగుల వరద పారించి మరోసారి తమదైన దూకుడుతో జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) సంతోషం వ్యక్తం చేశాడు.అభిషేక్ శర్మ బ్యాటింగ్కు వీరాభిమానిని‘‘నిజంగా ఇదొక అద్బుత విజయం. మా శైలిలో దూకుడుగా ఆడి గెలిచాం. ఈ వికెట్ చాలా చాలా బాగుంది. ఇక్కడ బౌలర్ ఓ ఓవర్లో పది పరుగుల కంటే తక్కువ రన్స్ ఇచ్చాడంటే అదే గొప్ప. అందుకే మేము పంజాబ్ విధించిన లక్ష్యాన్ని సులువుగానే ఛేదించగలమనే ఆత్మవిశ్వాసం కలిగింది.నేను అభిషేక్ శర్మ బ్యాటింగ్కు వీరాభిమానిని. ఏదేమైనా మేము బ్యాటింగ్ శైలిని మార్చుకునేందుకు సిద్ధంగా లేము. గతేడాది మా వాళ్లు ఎలా ఆడారో అందరికీ తెలుసు. ఈసారి కూడా అదే శైలిని కొనసాగిస్తాం. మా బ్యాటర్ల నైపుణ్యాలపై మాకు నమ్మకం ఉంది.వాళ్లు అద్భుతమైన వాళ్లుఇక ఆరెంజ్ ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?!... వాళ్లు అద్భుతమైన వాళ్లు.. మా కోసం సన్రైజర్స్ జెండాలు రెపరెపలాడిస్తూ.. చుట్టూ అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తారు’’ అంటూ ప్యాట్ కమిన్స్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.వరుసగా నాలుగు ఓడికాగా ఐపీఎల్-2025లో తొలుత ఉప్పల్లో రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ ఆడిన కమిన్స్ బృందం.. ఘన విజయంతో సీజన్ను మొదలుపెట్టింది. కానీ ఆ తర్వాత వరుసగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది.విధ్వంసకర బ్యాటింగ్తో విజయాల బాట ఈ నేపథ్యంలో అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసే సన్రైజర్స్ శైలిపై విమర్శలు వెల్లువెత్తగా కెప్టెన్ కమిన్స్తో పాటు.. హెడ్కోచ్ డానియల్ వెటోరీ కూడా తమ విధానం మారదని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే శనివారం నాటి మ్యాచ్లో సన్రైజర్స్ విధ్వంసకర బ్యాటింగ్తో తిరిగి విజయాల బాట పట్టింది.ఉప్పల్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. రైజర్స్ స్టైల్లోనే ఆడిన అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. ప్రియాన్ష్ ఆర్య (13 బంతుల్లో 36), ప్రభ్సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42).. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 82) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆఖర్లో మార్కస్ స్టొయినిస్ (11 బంతుల్లో 34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అభిషేక్ విశ్వరూపంసన్రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక భారీ లక్ష్య ఛేదనలో రైజర్స్ ఏమాత్రం తడబడలేదు. సొంత మైదానంలో ట్రవిస్ హెడ్ (37 బంతుల్లో 66) బ్యాట్ ఝులిపించగా.. అభిషేక్ శర్మ (55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141) న భూతో న భవిష్యత్ అన్నట్లుగా భారీ శతకం బాదాడు. హెన్రిచ్ క్లాసెన్ (14 బంతుల్లో 21 నాటౌట్), ఇషాన్ కిషన్ (6 బంతుల్లో 9 నాటౌట్) పని పూర్తి చేశారు. 18.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన రైజర్స్.. పంజాబ్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. చదవండి: ఎగిరి గంతులేసిన కావ్యా మారన్.. అభిషేక్ తల్లిని హగ్ చేసుకుని మరీ! వీడియో 𝘼 𝙣𝙤𝙩𝙚-𝙬𝙤𝙧𝙩𝙝𝙮 𝙏𝙊𝙉 💯A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on 🔝 in this chase 💪Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w— IndianPremierLeague (@IPL) April 12, 2025 -
పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవలం 17 బంతుల్లోనే
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే బౌండరీల వర్షం కురిపించారు. మహ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఊతికారేశారు.ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కేవలం 3 ఓవర్లలోనే 50 పరుగులను క్రాస్ చేసింది. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన టీమ్గా ఆర్సీబీ సరసన పంజాబ్ నిలిచింది. ఆర్సీబీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్పై కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకుంది. అయితే ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన రికార్డు కూడా పంజాబ్ కింగ్స్ పేరిటే ఉంది. 2011 ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్పై పంజాబ్ కేవలం 2.5 ఓవర్లలోనే 50 పరుగులను అందుకుంది. ఇక ప్రస్తుత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఈ ఏడాది సీజన్లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్లో ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 36), ఫ్రబ్ సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్తో 42) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఔటయ్యారు. అయితే ఈ ఏడాది సీజన్ మొత్తం ఒకే ఆటతీరుతో పంజాబ్ దూసుకుపోతుంది.చదవండి: IPL 2025: సెన్సేషనల్ సుదర్శన్.. ఆరు మ్యాచ్లలో 4 హాఫ్ సెంచరీలు -
సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి ‘అద్భుతం’ అతడే!
ప్రియాన్ష్ ఆర్య.. 24 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడి పేరు క్రికెట్ వర్గాల్లో మారుమ్రోగిపోతోంది. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో కేవలం 39 బంతుల్లోనే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ శతకం బాదాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు.సంచలన ఇన్నింగ్స్చెన్నైతో మ్యాచ్లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya).. ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో ఏకంగా 103 పరుగులు సాధించాడు. 245కు స్ట్రైక్రేటుతో దంచికొట్టి చెన్నైపై పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 88 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన సంచలన ఇన్నింగ్స్తో గట్టెక్కించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.This is what we pay our internet bills for... ❤️pic.twitter.com/mE38MmXFB0— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025 సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి ‘అద్భుతం’!ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రియాన్ష్ ఆర్యను ఆకాశానికెత్తాడు. టీమిండియా దిగ్గజం, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత అంతటి అద్భుతాన్ని ఇప్పుడే చూశానంటూ అతడిని కొనియాడాడు. మైదానం నలుదిశలా షాట్లతో హోరెత్తించాడని.. సీఎస్కేలో ఉన్న ప్రపంచస్థాయి బౌలర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు అమోఘమని ప్రశంసించాడు.‘‘ప్రియాన్ష్ ఆర్య... టీమిండియాకు సుదీర్ఘకాలం పాటు ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. సచిన్ టెండుల్కర్ తర్వాత.. విపత్కర పరిస్థితుల్లో అంత గొప్పగా ఆడిన రెండో ఆటగాడు ఇతడే. సచిన్ తర్వాత నేను చూసిన అద్భుతం ఇతడే.క్లిష్ట పరిస్థితుల్లో మేటి బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీ చేయడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా ఇంచుమించు 250 స్ట్రైక్రేటుతో శతక్కొట్టడం ఊహకు అందని విషయం. శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, ప్రభ్సిమ్రన్ సింగ్ అవుటైన తర్వాత.. ఒంటిచేత్తో పంజాబ్ను ఆదుకున్నాడు.ఆకాశమే హద్దుగాపాయింట్, కవర్లు.. ఒక్కటేమిటి మైదానం అన్ని వైపులకు బంతిని తరలిస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు. పతిరణ, జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్ వంటి బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో పంజాబ్ను గెలిపించాడు’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రియాన్ష్ ఆర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వీడియోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.వరుసగా నాలుగో ఓటమికాగా ముల్లాన్పూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత తొలుత బ్యాటింగ్ చేసింది. చెన్నై ఆరంభంలోనే వికెట్లు తీసి శుభారంభం అందించినా.. ప్రియాన్ష్ ఆర్య (103), శశాంక్ సింగ్ (52 నాటౌట్), మార్కో యాన్సెన్ (34 నాటౌట్) దంచికొట్టడంతో.. పంజాబ్ 20 ఓవర్లలో 219 పరుగులు స్కోరు చేసింది.లక్ష్య ఛేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమైపోయింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (23 బంతుల్లో 36), డెవాన్ కాన్వే (49 బంతుల్లో 69 రిటైర్డ్ అవుట్), శివం దూబే (42), మహేంద్ర సింగ్ ధోని (27) ఓ మోస్తరుగా ఆడారు. అయితే, విజయానికి 18 పరుగులు దూరంలో చెన్నై నిలిచిపోయింది. ఇక ఐపీఎల్-2025లో చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా.. పంజాబ్ ఇప్పటికి నాలుగింట మూడు గెలిచింది.ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ చెన్నై స్కోర్లుపంజాబ్: 219/6 (20)చెన్నై: 201/5 (20)ఫలితం: 18 పరుగుల తేడాతో చెన్నైపై పంజాబ్ గెలుపుచదవండి: ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్ -
ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్- చెన్నై సూపర్ కింగ్స్ (PBKS vs CSK) మధ్య మంగళవారం నాటి మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ జోష్లో ఉన్న రుతురాజ్ సేనకు.. ఆ తర్వాత వరుస షాకులు తగిలాయి. పంజాబ్ యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya) ఆకాశమే హద్దుగా చెలరేగి.. చెన్నై బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు.పంజాబ్ @ 219 తాను ఇచ్చిన క్యాచ్లను డ్రాప్ చేసి లైఫ్ ఇచ్చిన ప్రత్యర్థి జట్టుపై ఏమాత్రం కనికరం లేకుండా వీరబాదుడు బాదాడు. కేవలం 42 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఏకంగా తొమ్మిది సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు. అయితే, నూర్ అహ్మద్ బౌలింగ్లో విజయ్ శంకర్ క్యాచ్ పట్టడంతో ఎట్టకేలకు ప్రియాన్ష్ ఆర్య సునామీ ఇన్నింగ్స్కు తెరపడింది.అయితే, ఈ ఆనందాన్ని శశాంక్ సింగ్, మార్కో యాన్సెన్ సీఎస్కే ఎక్కువ సేపు నిలవనీయలేదు. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన శశాంక్ సింగ్ 36 బంతుల్లో 52.. యాన్సెన్ 19 బంతుల్లో 34 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది.చిన్న పిల్లలా గెంతులేస్తూఅయితే, ఇన్నింగ్స్ రెండో బంతికే ప్రియాన్ష్ ఆర్య ఇచ్చిన క్యాచ్ మిస్ చేయడం ద్వారా.. పంజాబ్ భారీ స్కోరుకు చేజేతులా బీజం వేసిన సీఎస్కే.. ఆ తర్వాత మరో రెండుసార్లు లైఫ్ ఇచ్చింది. దీంతో అతడు మెరుపు శతకంతో దుమ్ములేపాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా చిన్న పిల్లలా గెంతులేస్తూ ప్రియాన్ష్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నారు.This is what we pay our internet bills for... ❤️pic.twitter.com/mE38MmXFB0— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025 స్టాండ్స్లో అటూ ఇటూ పరిగెడుతూ ప్రీతి.. ధోని సీరియస్మరోవైపు.. శశాంక్ సింగ్ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. నూర్ అహ్మద్ బౌలింగ్లో షాట్కు యత్నించగా.. టాప్ ఎడ్జ్కు తాకి బంతి గాల్లోకి లేచింది. అయితే, అతడు ఇచ్చిన క్యాచ్ను రచిన్ రవీంద్ర డ్రాప్ చేశాడు. అప్పటికి శశాంక్ సింగిల్ పూర్తి చేసుకున్నాడు. అయితే, మరో చెత్త విషయం ఏమిటంటే.. ఓవర్త్రో కారణంగా పంజాబ్కు మరో అదనపు పరుగు లభించింది.ఈ క్రమంలో ప్రీతి జింటా.. స్టాండ్స్లో అటూ ఇటూ పరిగెడుతూ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, అదే సమయంలో చెన్నై మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని కోపం పట్టలేక సీరియస్ లుక్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.Preity zinta cutie enjoying shashank’s catch drop😇😇Thankyou csk 🤣🤣 #CSKvsPBKS #pbksvscsk pic.twitter.com/xpCdtuuz6v— gαנαℓ (@Gajal_Dalmia) April 8, 2025ఇక పంజాబ్ విధించిన 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చెన్నై చతికిల పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసి.. 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సీఎస్కే బ్యాటర్లలో ఓపెనర్లు రచిన్ రవీంద్ర (36), డెవాన్ కాన్వే (69 రిటైర్డ్ అవుట్), శివం దూబే (42), ధోని (27) ఫర్వాలేదనిపించారు. కాగా ఈ సీజన్లో చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా.. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. Back to winning ways this season ✅First home win this season ✅@PunjabKingsIPL compile a comprehensive 1⃣8⃣-run victory over #CSK ❤️Scorecard ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/HtcXw4UYAK— IndianPremierLeague (@IPL) April 8, 2025చదవండి: PBKS Vs CSK: గ్లెన్ మాక్స్వెల్కు షాకిచ్చిన బీసీసీఐ! -
‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్ అద్భుతం’
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన సీఎస్కే.. తాజాగా పంజాబ్ కింగ్స్ చేతిలోనూ చేదు అనుభవం ఎదుర్కొంది. ముల్లాన్పూర్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకు పోరాడి విజయానికి పద్దెనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయింది.ఆ తప్పులే మా కొంప ముంచాయిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) స్పందిస్తూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ఫీల్డింగ్ తప్పిదాలే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘గత నాలుగు మ్యాచ్లలో ఒకే పొరపాటు.. అదే ఫీల్డింగ్. మేము క్యాచ్లు డ్రాప్ చేస్తూనే ఉన్నాం.అతడి బ్యాటింగ్ అద్భుతంతద్వారా ఆ బ్యాటర్లు అదనంగా 15, 20, 30 పరుగులు చేసేందుకు ఆస్కారం ఇస్తున్నాం. ఈరోజు ప్రియాన్ష్ ఆర్య అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి హై రిస్క్తో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, పరిస్థితులు అతడికి అనుకూలించాయి.ఇదే వికెట్పై మేమూ బ్యాటింగ్ చేశాం. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. అంతకుముందు కీలక సమయాల్లో క్యాచ్లు కూడా డ్రాప్ చేశాం. ఇంకో 10- 15 పరుగులు కట్టడి చేయాల్సింది. అలాగే ఇంకో మూడు- నాలుగు సిక్సర్లు బాదాల్సింది.బ్యాటింగ్ పరంగా పర్లేదుఏదేమైనా మా ఉత్తమ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే పవర్ ప్లేలో రాణించడం సానుకూలాంశం. బ్యాటింగ్ పరంగా మేము పర్లేదు. ముందుగా చెప్పినట్లు ఫీల్డింగ్లో మెరుగుపడాల్సి ఉంది’’ అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. ఫీల్డింగ్ను ఆస్వాదిస్తేనే తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయని.. టెన్షన్ పడితే మరిన్ని పొరపాట్లకు ఆస్కారం ఉంటుందే తప్ప లాభమేమీలేదని తమ ఫీల్డర్లకు సందేశం ఇచ్చాడు.క్యాచ్లు డ్రాప్ చేసి.. మూల్యం చెల్లించారుకాగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన సీఎస్కే ఆరంభంలోనే వరుస వికెట్లు తీసింది. కానీ యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య మెరుపు సెంచరీ (42 బంతుల్లో 103)తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ప్రియాన్ష్ ఇచ్చిన క్యాచ్ను బౌలర్ మిస్ చేశాడు.అదే విధంగా ఐదో ఓవర్ రెండో బంతికి స్టొయినిస్ ఇచ్చిన క్యాచ్ను విజయ శంకర్ వదిలేశాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి ప్రియాన్ష్ బంతిని గాల్లోకిలేపగా.. శంకర్ మరోసారి డ్రాప్ చేశాడు. ఇక అశ్విన్ బౌలింగ్లో పన్నెండవ ఓవర్ రెండో బంతికి ప్రియాన్ష్ సిక్సర్ బాదగా.. బంతిని అందుకున్న ముకేశ్ చౌదరి బౌండరీ లైన్ను తాకాడు.I.C.Y.M.I 𝗣𝗼𝘄𝗲𝗿💪. 𝗣𝗿𝗲𝗰𝗶𝘀𝗶𝗼𝗻👌. 𝗣𝗮𝗻𝗮𝗰𝗵𝗲💥. Priyansh Arya graced the home crowd with his effortless fireworks 🎆Updates ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/7JBcdhok58— IndianPremierLeague (@IPL) April 8, 2025ఆ తర్వాత పదిహేడో ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్లో శశాంక్ సింగ్ ఇచ్చిన సిట్టర్ను రచిన్ రవీంద్ర డ్రాప్ చేశాడు. ఇలా సీఎస్కే ఫీల్డింగ్ తప్పిదాల వల్ల పంజాబ్ బ్యాటర్లు.. ముఖ్యంగా ప్రియాన్ష్ చాలాసార్లు లైఫ్ పొందాడు. అతడికి తోడుగా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్) దుమ్ములేపారు.తప్పని ఓటమిఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సీఎస్కే ఐదు వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమై.. 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్కే బ్యాటర్లలో ఓపెనర్లు రచిన్ రవీంద్ర (23 బంతుల్లో 36), డెవాన్ కాన్వే (49 బంతుల్లో 69 రిటైర్డ్ అవుట్), శివం దూబే (27 బంతుల్లో 42) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో ధోని మెరుపు ఇన్నింగ్స్ (12 బంతుల్లో 27) ఆడాడు. అయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) మాత్రం మరోసారి విఫలమయ్యాడు.చదవండి: గ్లెన్ మాక్స్వెల్కు షాకిచ్చిన బీసీసీఐ! Back to winning ways this season ✅First home win this season ✅@PunjabKingsIPL compile a comprehensive 1⃣8⃣-run victory over #CSK ❤️Scorecard ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/HtcXw4UYAK— IndianPremierLeague (@IPL) April 8, 2025 -
PBKS Vs CSK: గ్లెన్ మాక్స్వెల్కు షాకిచ్చిన బీసీసీఐ!
పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell)కు ఐపీఎల్ పాలక మండలి షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత విధించింది. చెన్నై సూపర్ కింగ్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో అనుచిత ప్రవర్తనకు గానూ ఈ మేర జరిమానా వేసింది.ప్రియాన్ష్ మెరుపు శతకంఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్- చెన్నై జట్లు తలపడ్డాయి. సొంత మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర శతకం (42 బంతుల్లో 103) చెలరేగగా.. లోయర్ ఆర్డర్లో శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టినా.. ఈ ముగ్గురి ఇన్నింగ్స్ కారణంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది.చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమైంది. 18 పరుగుల తేడాతో చెన్నై ఓటమిఓపెనర్ రచిన్ రవీంద్ర (36) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం అర్ధ శతకం(49 బంతుల్లో 69) రాణించాడు.కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశపరచగా.. శివం దూబే 27 బంతుల్లో 42 రన్స్తో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో ధోని ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కానీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Sights we have come to cherish over many years 💛MS Dhoni produced a fighting knock of 27(12) 🔥Scorecard ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK | @msdhoni pic.twitter.com/Y3ksZl8ozS— IndianPremierLeague (@IPL) April 8, 2025 కీలక వికెట్ తీసిఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లోనూ గ్లెన్ మాక్స్వెల్ బ్యాటింగ్లో విఫలమయ్యాడు. ఆరో స్థానంలో వచ్చి రెండు బంతులు ఎదుర్కొని అశ్విన్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే, రచిన్ రవీంద్ర రూపంలో కీలక వికెట్ తీసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కానీ అనుచిత ప్రవర్తనకు గానూ అతడు పనిష్మెంట్ ఎదుర్కోవాల్సి వచ్చింది.జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్ఇందుకు సంబంధించి.. ‘‘గ్లెన్ మాక్స్వెల్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2లో గల లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు. నిబంధనల ప్రకారం అతడి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.అదే విధంగా.. మాక్సీ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత చేసింది. అయితే, ఏ ఘటనలో అతడికి జరిమానా విధించిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రూపొందించిన నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా వికెట్లను తన్నడం, బాదడం.. అడ్వర్టైజ్ బోర్డులు, బౌండరీ ఫెన్సింగ్, డ్రెసింగ్ రూమ్ అద్దాలు, కిటికీలు.. ఇతర సామాగ్రి దెబ్బతినేలా ప్రవర్తించడం వంటివి చేస్తే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయి.చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా -
PBKS vs CSK: ప్రియాంశ్ పటాకా
‘కింగ్స్’ పోరులో చెన్నైపై పంజాబ్దే పైచేయి అయింది. యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య మెరుపులకు శశాంక్ సింగ్, యాన్సెన్ ఫినిషింగ్ టచ్ తోడవడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగా... ఛేదనలో చెన్నై చతికిలబడింది. కాన్వే, దూబే రాణించినా... మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలర్లు పుంజుకోవడంతో చెన్నైకి వరుసగా నాలుగో పరాజయం తప్పలేదు. ‘ఫినిషర్’ ధోని దూకుడు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది! ముల్లాన్పూర్: యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (42 బంతుల్లో 103; 7 ఫోర్లు, 9 సిక్స్లు) రికార్డు సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నైకిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రియాంశ్ ఆర్య సెంచరీతో కదంతొక్కగా... శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స్లు), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9)తో పాటు ప్రభ్సిమ్రన్ సింగ్ (0), స్టొయినిస్ (4), నేహల్ వధేరా (9), మ్యాక్స్వెల్ (1) విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కాన్వే (49 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకం సాధించగా... రచిన్ (37; 6 ఫోర్లు), శివమ్ దూబే (27 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ధోని (12 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) పోరాడారు. ఫటాఫట్... ఖలీల్ అహ్మద్ వేసిన తొలి బంతికే పాయింట్ మీదుగా సిక్స్ కొట్టిన ప్రియాంశ్ ఆర్య... రెండో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని ఈ 24 ఏళ్ల కుర్రాడు అదే ఓవర్లో మరో సిక్స్ బాదాడు. రెండో ఓవర్లో ప్రభ్సిమ్రన్ డకౌట్ కాగా... ఆర్య ఇంకో సిక్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఖలీల్ తదుపరి ఓవర్లో శ్రేయస్ను క్లీన్బౌల్డ్ చేయగా... నాలుగో ఓవర్లో ఆర్య ‘హ్యాట్రిక్’ ఫోర్లతో విరుచుకుపడ్డాడు.స్టొయినిస్ క్రీజులోకి వచ్చినంతసేపు కూడా నిలవలేకపోగా... అశ్విన్ ఓవర్లో 4, 6తో ఆర్య 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అశ్విన్ ఒకే ఓవర్లో నేహల్ , మ్యాక్స్వెల్ను ఔట్ చేశాడు. వికెట్లు పడుతున్నా దూకుడు తగ్గించని ఆర్య... అశ్విన్ ఓవర్లో మూడు సిక్స్లతో చెలరేగిపోయాడు. పతిరణ ఓవర్లో వరుసగా 6, 6, 6, 4 కొట్టిన ప్రియాంశ్ 13వ ఓవర్లోనే 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తదుపరి ఓవర్లో ఆర్య ఔట్ కాగా... చివర్లో యాన్సెన్, శశాంక్ చక్కటి షాట్లతో పంజాబ్కు భారీ స్కోరు అందించారు. 39 ప్రియాంశ్ ఆర్య సెంచరీకి తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది నాలుగో వేగవంతమైన శతకం. గేల్ (30 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో), మిల్లర్ (38 బంతుల్లో) ట్రావిస్ హెడ్ (39 బంతుల్లో) ముందున్నారు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ ఆర్య (సి) శంకర్ (బి) నూర్ 103; ప్రభ్సిమ్రన్ (బి) ముకేశ్ 0; శ్రేయస్ (బి) ఖలీల్ 9; స్టొయినిస్ (సి) కాన్వే (బి) ఖలీల్ 4; నేహల్ (సి) ధోని (బి) అశ్విన్ 9; మ్యాక్స్వెల్ (సి అండ్ బి) అశ్విన్ 1; శశాంక్ (నాటౌట్) 52; యాన్సెన్ (నాటౌట్) 34; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–17, 2–32, 3–54, 4–81, 5–83, 6–154. బౌలింగ్: ఖలీల్ 4–0–45–2; ముకేశ్ 2–0–21–1; అశ్విన్ 4–0–48– 2; జడేజా 3–0–18–0; నూర్ 3–0–32–1; పతిరణ 4–0–52–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (స్టంప్డ్) ప్రభ్సిమ్రన్ (బి) మ్యాక్స్వెల్ 37; కాన్వే (రిటైర్డ్ అవుట్) 69; రుతురాజ్ (సి) శశాంక్ (బి) ఫెర్గూసన్ 1; దూబే (బి) ఫెర్గూసన్ 42; ధోని (సి) చహల్ (బి) యశ్ 27; జడేజా (నాటౌట్) 9; శంకర్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–61, 2–62, 3–151, 4–171, 5–192, బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–39–0; యశ్ 4–0–39–1; మ్యాక్స్వెల్ 2–0–11–1; యాన్సెన్ 4–0–48–0; ఫెర్గూసన్ 4–0–40–2; స్టొయినిస్ 1–0–10–0; చహల్ 1–0–9–0.ఐపీఎల్లో నేడుగుజరాత్ X రాజస్తాన్ వేదిక: అహ్మదాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యువ సంచలనం ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే సీఎస్కే బౌలర్లను ఆర్య ఊతికారేశాడు. ముల్లాన్పూర్ మైదానంలో సిక్సర్ల మోత మోగించాడు. పతిరానా, అశ్విన్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్ను సైతం 24 ఏళ్ల ఆర్య వదలేదు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి ప్రియాన్ష్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని ప్రియాన్ష్ అందుకున్నాడు. ఓవరాల్గా 42 బంతులు ఎదుర్కొన్న ఈ ఢిల్లీ క్రికెటర్.. 7 ఫోర్లు, 9 సిక్స్లతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అద్భుతమైన సెంచరీతో చెలరేగిన ఆర్య పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.👉ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ రికార్డును ఆర్య సమం చేశాడు. హెడ్ కూడా సరిగ్గా ఐపీఎల్-2024లో ఆర్సీబీపై కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో క్రిస్ గేల్(30 బంతులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో యూసఫ్ పఠాన్(37), మిల్లర్(38) ఉన్నారు.👉అదే విధంగా ఐపీఎల్లో అత్యంతవేగంగా సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు షాన్ మార్ష్(58) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో మార్ష్ రికార్డును ఆర్య బ్రేక్ చేశాడు. ఎవరీ ప్రియాన్ష్ ఆర్య..?24 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య లిస్ట్-ఎ క్రికెట్లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు పవన్ ఆర్య, రాధా బాల ఇద్దరూ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులగా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ విహార్లో పెరిగిన ప్రియాంష్కు చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ. ప్రియాన్ష్కు అతడి తల్లిదండ్రలు ఎంతో మద్దతుగా నిలిచారు. ఇటు క్రికెట్, అటు విద్యను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్య ముందుకు సాగాడు.ఆర్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్వామి శ్రద్ధానంద్ కళాశాల నుండి బి.ఎ. పూర్తి చేశాడు. ఇక ప్రియాన్స్ ఆర్యా 2019లో భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్తో కలిసి అతడు ఆడాడు.అయితే ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024 ద్వారా ప్రియాన్ష్ వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది డీపీఎల్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టి ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు. టోర్నీ ఆసాంతం ప్రియాన్ష్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఈ టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్రేటుతో 608 పరుగులు చేశాడు. టీ20ల్లో కూడా మంచి రికార్డు ఈ యువ క్రికెటర్కు ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 356 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది. ఐపీఎల్లో సీఎస్కే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా ఆర్య రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జై సూర్య పేరిట ఉండేది. జై సూర్య ముంబై ఇండియన్స్ తరపున సీఎస్కేపై 40 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్తో జైసూర్యను ఆర్య అధిగమించాడుఐపీఎల్లో సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్లు వీరేషాన్ మార్ష్ vs రాజస్తాన్ రాయల్స్ 2008మనీష్ పాండే vs దక్కన్ ఛార్జెర్స్, 2009పాల్ వాల్తాటి vs సీఎస్కే, 2009దేవదత్ పడిక్కల్ vs రాజస్తాన్, 2021రజత్ పాటిదార్ vs లక్నో , 2022యశస్వి జైస్వాల్ vs ముంబై ఇండియన్స్, 2022ప్రభసిమ్రాన్ సింగ్ vs ఢిల్లీ క్యాపిటల్స్, 2023ప్రియాంష్ ఆర్య vs సీఎస్కే, 2025* -
లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టి షాకిచ్చింది. వికెట్ తీసిన సంబరంలో ‘అతి’ చేసినందుకు గానూ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత వేయడంతో పాటు.. అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను జత చేసింది. అసలేం జరిగిందంటే..ఐపీఎల్-2025లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో మ్యాచ్ ఆడింది. ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. ఐడెన్ మార్క్రమ్ (18 బంతుల్లో 28), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 44), ఆయుశ్ బదోని (33 బంతుల్లో 41), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 27) రాణించారు.అర్ష్దీప్ సింగ్కు మూడు వికెట్లుఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో లక్నో జట్టు ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో మెరవగా.. లాకీ ఫెర్గూసన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ప్రియాన్ష్ ఆర్య విఫలంఇక లక్ష్య ఛేదన మొదలుపెట్టిన కాసేపటికే పంజాబ్.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వికెట్ కోల్పోయింది. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ అవుట్సైడ్ ఆఫ్ దిశగా.. సంధించిన షార్ట్ బంతిని ఆడే క్రమంలో బ్యాట్ టాప్ ఎడ్జ్కు తగిలింది. అయితే, షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి లేచిన బంతిని.. మిడాన్ నుంచి పరిగెత్తుకుని వచ్చిన ఫీల్డర్ శార్దూల్ ఠాకూర్ ఒడిసిపట్టాడు.రాఠీ ‘ఓవరాక్షన్’ఈ క్రమంలో మొత్తంగా తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ప్రియాన్ష్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అయితే, అతడు క్రీజు వీడుతున్న సమయంలో దగ్గరికి పరిగెత్తుకు వచ్చిన దిగ్వేశ్ రాఠీ ‘ఓవరాక్షన్’ చేశాడు. పుస్తకంలో అతడి పేరును రాసుకుంటున్నట్లుగా వికెట్ తీసిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.#DigveshRathi provides the breakthrough as #PriyanshArya heads back!P.S: Don't miss the celebration at the end! 👀✍🏻Watch LIVE action of #LSGvPBKS ➡ https://t.co/GLxHRDQajv#IPLOnJiostar | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! | #IndianPossibleLeague pic.twitter.com/TAhHDtXX8n— Star Sports (@StarSportsIndia) April 1, 2025 ఈ నేపథ్యంలో దిగ్వేశ్ రాఠీ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ పాలక మండలి అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ మీడియా అడ్వైజరీ కమిటీ ప్రకటన విడుదల చేసింది. జరిమానా‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5లో గల లెవల్ 1 నిబంధనను దిగ్వేశ్ రాఠీ అతిక్రమించాడు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం ప్రకారం అతడిపై చర్యలు తీసుకున్నాం’’ అని పేర్కొంది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్ జతచేసినట్లు వెల్లడించింది.కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేశ్ సింగ్ రాఠీ ఈ ఏడాదే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నో మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నం వేదికగా ఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ స్పిన్నర్ తొలి మ్యాచ్లోనే రెండు వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు మొత్తంగా మూడు మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు.పంజాబ్ ఘన విజయంఇక మ్యాచ్ విషయానికొస్తే.. ప్రియాన్ష్ ఆర్య వికెట్ తీసిన ఆనందం లక్నోకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69) అర్ధ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43) ధనాధన్ దంచికొట్టి అజేయంగా ఇన్నింగ్స్తో.. జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.చదవండి: రూ. 27 కోట్లు దండుగ!.. పంత్కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా! -
గవర్నమెంట్ స్కూల్ టీచర్ కొడుకు.. కట్ చేస్తే! తొలి మ్యాచ్లోనే విధ్వంసం
ఢిల్లీ బ్యాటింగ్ సంచలనం ప్రియాన్ష్ ఆర్య తన ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఐపీఎల్-2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్పై పంజాబ్ కింగ్స్ తరపున ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఆర్య అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్లో ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఓపెనర్గా బరిలోకి దిగిన ప్రియాన్ష్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆర్య.. ఆ తర్వాత మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. గుజరాత్ స్టార్ పేసర్లు మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్ బౌలింగ్లను ప్రియాంష్ ఊతికారేశాడు. ఈ మ్యాచ్లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఆర్య.. 7 ఫోర్లు, 2 సిక్స్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి దూకుడుకు గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అడ్డుకట్టవేశాడు. ఇక అరంగేట్రంలోనే దుమ్ములేపిన ప్రియాన్ష్ ఆర్య గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ ప్రియాన్ష్ ఆర్య..?24 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య లిస్ట్-ఎ క్రికెట్లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు పవన్ ఆర్య, రాధా బాల ఇద్దరూ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులగా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ విహార్లో పెరిగిన ప్రియాంష్కు చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ. ప్రియాన్ష్కు అతడి తల్లిదండ్రలు ఎంతో మద్దతుగా నిలిచారు. ఇటు క్రికెట్, అటు విద్యను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్య ముందుకు సాగాడు.ఆర్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్వామి శ్రద్ధానంద్ కళాశాల నుండి బి.ఎ. పూర్తి చేశాడు. ఇక ప్రియాన్స్ ఆర్యా 2019లో భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్తో కలిసి అతడు ఆడాడు. అయితే ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024 ద్వారా ప్రియాన్ష్ వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది డీపీఎల్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టి ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు. టోర్నీ ఆసాంతం ప్రియాన్ష్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఈ టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్రేటుతో 608 పరుగులు చేశాడు. టీ20ల్లో కూడా మంచి రికార్డు ఈ యువ క్రికెటర్కు ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 356 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది. -
రూ.30 లక్షల ధరతో ఎంట్రీ.. కట్ చేస్తే కోట్ల వర్షం! ఎవరీ ప్రియాన్ష్?
ఐపీఎల్-2025 మెగా వేలంలో ఢిల్లీ యువ సంచలనం ప్రియాన్ష్ ఆర్యపై కాసుల వర్షం కురిసింది. ప్రియాన్ష్ ఆర్యను రూ. 3.80 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కైవసం చేసుకుంది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆర్య కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. కాసేపు పంజాబ్, ఢిల్లీ మధ్య పోటీ నెలకొంది. అనంతరం ఢిల్లీ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రియాన్ష్య పంజాబ్ సొంతమయ్యాడు.ఎవరీ ప్రియాన్ష్ ఆర్య..?23 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య లిస్ట్-ఎ క్రికెట్లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. ప్రియాన్స్ ఆర్యా 2019లో భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్తో కలిసి అతడు ఆడాడు.అయితే ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024 ద్వారా ప్రియాన్ష్ వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది డీపీఎల్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టి ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు. టోర్నీ ఆసాంతం ప్రియాన్ష్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఈ టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్రేటుతో 608 పరుగులు చేశాడు. టీ20ల్లో కూడా మంచి రికార్డు ఈ యువ క్రికెటర్కు ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 356 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది. -
ప్రియాన్ష్.. నీ కోసం ఐపీఎల్ ఎదురుచూస్తోంది
ప్రియాంష్ ఆర్య.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒక యువ సంచలనం. ఈ లీగ్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రియాన్ష్ ఆర్య తన అద్బుత ప్రదర్శనలతో అందరని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గత వారంలో . నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు బాదిన ఈ యువ సంచలనం.. ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. అతడి హిట్టింగ్ స్కిల్స్ గురించి ఎంతచెప్పుకున్న తక్కువే.ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు తన సిక్సర్లతో భారత దిగ్గజం యువరాజ్ సింగ్ను గుర్తు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 8 మ్యాచ్లు ఆడిన ప్రియాన్ష్.. 576 పరుగులు చేసి టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ లీగ్లో దుమ్ములేపుతున్న ఆర్య తన మనసులోని మాటను బయట పెట్టాడు.ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలన్న తన కోరికను 23 ఏళ్ల ఆర్య వ్యక్తం చేశాడు. అందుకు గల కారణాన్ని కూడా ఆర్య వెల్లడించాడు. కోహ్లి తనకు రోల్మోడల్ అని, అతడితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవాలనకుంటున్నాని ప్రియాన్ష్ చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ ఎదురుచూస్తోంది..ఇక ఈ ఏడాది ఆఖరిలో ఐపీఎల్-2025 మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో ప్రియాంష్ ఆర్యపై కాసుల వర్షం కురిసే అవకాశముంది. ఇటువంటి యువ సంచలనాల కోసమే ఫ్రాంఛైజీలు వేయికళ్లుతో ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆర్యపై ఓ కన్నేసి ఉంటాయి.నా దృష్టి అంతా ఆ టోర్నీపైనే..ఐపీఎల్ గురించి ప్రస్తుతం నేను ఆలోచించడం లేదు. ఎందుకంటే ఐపీఎల్ చాలా పెద్ద క్రికెట్ టోర్నీ. ఈ లీగ్ కోసం ఆలోచించడం, ఒత్తడిని ఎదుర్కొవడం రెండూ ఒకటే. వేలం కూడా నా ఆలోచన లేదు. ఆడే అవకాశం వస్తే అది నా శ్రమకు దక్కిన ఫలితంగా భావిస్తాను. అయితే నా దృష్టింతా ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీపైనే ఉంది. నా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి ఇది గొప్ప అవకాశం. అక్కడ అద్భుతప్రదర్శన జట్టును గెలిపించడమే నా లక్ష్యమని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్య పేర్కొన్నాడు.