పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవ‌లం 17 బంతుల్లోనే | PBKS fastest team fifty in IPL 2025 | Sakshi
Sakshi News home page

IPL 2025: పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవ‌లం 17 బంతుల్లోనే

Apr 12 2025 8:30 PM | Updated on Apr 12 2025 8:37 PM

PBKS fastest team fifty in IPL 2025

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెన‌ర్లు ప్ర‌భు సిమ్రాన్ సింగ్‌, ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ నుంచే బౌండరీల వర్షం కురిపించారు. మహ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఊతికారేశారు.

ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కేవ‌లం 3 ఓవ‌ర్ల‌లోనే 50 ప‌రుగుల‌ను క్రాస్ చేసింది. త‌ద్వారా ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన టీమ్‌గా ఆర్సీబీ స‌ర‌స‌న‌ పంజాబ్ నిలిచింది. ఆర్సీబీ కూడా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై కేవ‌లం 18 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీని అందుకుంది. అయితే ఓవ‌రాల్‌గా ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన రికార్డు కూడా పంజాబ్ కింగ్స్ పేరిటే ఉంది. 

2011 ఐపీఎల్ సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై పంజాబ్ కేవ‌లం 2.5 ఓవ‌ర్ల‌లోనే 50 ప‌రుగుల‌ను అందుకుంది. ఇక ప్ర‌స్తుత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ప‌వ‌ర్ ప్లేలో వికెట్ న‌ష్టానికి 89 ప‌రుగులు చేసింది. ఈ ఏడాది సీజన్‌లో ఇదే అత్య‌ధిక ప‌వ‌ర్ ప్లే స్కోర్ కావ‌డం గ‌మ‌నార్హం. 

కాగా ఈ మ్యాచ్‌లో ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 36), ఫ్రబ్ సిమ్రాన్ సింగ్‌(23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఔట‌య్యారు. అయితే ఈ ఏడాది సీజన్ మొత్తం ఒకే ఆట‌తీరుతో పంజాబ్ దూసుకుపోతుంది.
చ‌ద‌వండి: IPL 2025: సెన్సేషనల్ సుద‌ర్శ‌న్‌.. ఆరు మ్యాచ్‌ల‌లో 4 హాఫ్ సెంచ‌రీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement