punjab kings
-
ఐపీఎల్ 2025 ఫైనల్లో ఓడినా భారీగా పెరిగిన శ్రేయస్ అయ్యర్ బ్రాండ్ విలువ
ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ సీజన్ ఆధ్యాంతం విశేషంగా రాణించిన ఆ జట్టు, తుది సమరంలో ఒత్తిడిలోనై ఆర్సీబీకి తలవంచింది. ఈ సీజన్లోనే పంజాబ్ పగ్గాలు చేపట్టిన శ్రేయస్.. ఆ జట్టును అద్బుతంగా ముందుండి నడిపించాడు. వ్యక్తిగంతానూ రాణించి, సహచరులకు మార్గదర్శకంగా నిలిచాడు.ఈ సీజన్లో పంజాబ్ టైటిల్ గెలవకపోయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా 100కు 100 శాతం మార్కులు సాధించాడు. ఈ సీజన్తో కెప్టెన్గా శ్రేయస్ ఇమేజ్ నింగికెగిసింది. ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు, మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్కు చేర్చిన తొలి కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో ఓడినా శ్రేయస్ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరగడం మరో విశేషం. శ్రేయస్ ప్రస్తుతం ఒక రోజు యాడ్లో నటిస్తే రూ.1.5 కోట్లు వసూలు చేస్తున్నాడు.శ్రేయస్ ఫీజు త్వరలోనే మరింత పెరుగుతుందని అతని ఎండార్స్మెంట్ వ్యవహారాలు చూసే నిఖిల్ బార్డియా తెలిపారు. నిఖిల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని RISE వరల్డ్వైడ్కు అధిపతిగా ఉన్నాడు. ఐపీఎల్-2025లో విజయవంతమైన కెప్టెన్సీ శ్రేయస్కు నాలుగైదు భారీ ఒప్పందాలు తెచ్చిపెడుతుందని నిఖిల్ అన్నారు. దీంతో శ్రేయస్ బ్రాండ్ విలువ 20-25 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.అయ్యర్ ప్రస్తుతం నైక్, డ్రీమ్11, ఇన్క్రెడ్ ఫైనాన్స్ వంటి బ్రాండ్లతో స్వల్పకాలిక నాన్-ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ కలిగి ఉన్నాడు. ఐపీఎల్ 2025 ప్రదర్శన తర్వాత శ్రేయస్కు ఆడియో, పురుషుల గ్రూమింగ్ బ్రాండ్లు, ప్రోటీన్ సప్లిమెంట్ బ్రాండ్లు, సువాసన సంస్థల నుండి విచారణలు వస్తున్నాయి. శ్రేయస్తో ఎండార్స్మెంట్ ఒప్పందాలకు డిమాండ్ పెరిగినప్పటికీ, ఏజెన్సీ ఫీజులు పెంచాలని యోచించడం లేదని నిఖిల్ తెలిపారు.కాగా, శ్రేయస్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో 17 మ్యాచ్ల్లో 50.33 సగటుతో 604 పరుగులు చేసి, పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రేయస్ ఒత్తిడిని తట్టుకుని 41 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా పంజాబ్ ఆ మ్యాచ్లో విజయం సాధించి 11 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేరింది.వ్యక్తితంగా శ్రేయస్కు ఇది వరుసగా రెండో ఫైనల్. గత సీజన్లో శ్రేయస్ కేకేఆర్ను ఫైనల్కు చేర్చడమే కాకుండా ఛాంపియన్గా నిలబెట్టాడు. గతేడాది జరిగిన మెగా వేలంలో శ్రేయస్ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్ల ధర వెచ్చింది సొంతం చేసుకుంది. తద్వారా శ్రేయస్ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అదే మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ను రూ.27 కోట్లకు దక్కించుకుంది. పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. -
శ్రేయస్ అయ్యర్... సారథిగా సూపర్
ధోనీ మాదిరిగా వ్యూహరచనలో మేటి... కోహ్లి తరహాలో దూకుడులో ఘనాపాటి... రోహిత్ను అనుకరిస్తున్నట్లు అనిపించినా... అతడికి అతడే సాటి! ‘అతడి చేయి పడితే రాయి కూడా రత్నంలా మెరుస్తుంది’... అన్న రీతిలో దశాబ్ద కాలానికి పైగా ‘ప్లే ఆఫ్స్’ మొఖం చూడని జట్టును తుదిపోరుకు చేర్చిన ఘనుడతడు! ఐపీఎల్ చరిత్రలో మరే సారథికి సాధ్యం కాని విధంగా మూడు వేర్వేరు జట్లను తుదిపోరుకు తీసుకెళ్లిన మొనగాడతడు! అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ జట్టును నడిపించడంలో నేర్పరి అతడు! మనం ఇంతసేపు చెప్పుకున్నది... ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినా తన నాయకత్వ చతురతతో అందరి మనసులు గెలిచిన పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ గురించే!! ధోనీ, రోహిత్ కూడా కెప్టెన్లుగా మూడు కంటే ఎక్కువ ఐపీఎల్ ఫైనల్స్ ఆడినా... ఆ ఇద్దరూ ఒకే జట్టును నడిపించారు. కానీ గత ఐదేళ్లలో అయ్యర్ మూడు వేర్వేరు ఫ్రాంఛైజీలకు తుదిపోరు మజా చూపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన ఏకైక ఫైనల్ శ్రేయస్ సారథ్యంలోనే కాగా... పదేళ్ల విరామం అనంతరం గతేడాది కోల్కతా నైట్రైడర్స్కు ముచ్చటగా మూడో కప్పు అందించింది కూడా అయ్యరే. పంజాబ్కు ట్రోఫీ కట్టబెట్టలేకపోయినా... సారథిగా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. ‘బాధ్యత సగం మాత్రమే పూర్తయింది. వచ్చే ఏడాది తప్పక కప్పు గెలుస్తాం’ అని ఫైనల్ అనంతరం ధీమా వ్యక్తం చేసిన అయ్యర్... భారత జట్టు భవిష్యత్తు నాయకత్వంపై భరోసా పెంచుతున్నాడు!!సాక్షి, క్రీడావిభాగం : 2024 ఐపీఎల్ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుచేసి... కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జట్టు మూడోసారి కప్పు కైవసం చేసుకుంది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ట్రోఫీ అందుకున్నా... ఆ సమయంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ జట్టు మెంటార్గా ఉండటంతో క్రెడిట్ అంతా అతడికే దక్కింది. తదనంతర పరిణామాల్లో గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా ఎదగగా... సమర్థ నాయకుడిని కేకేఆర్ వేలానికి వదిలేసింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన కోల్కతా జట్టు... ఈసారి లీగ్ దశ దాటలేకపోవడమే గాక... పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంటే... వేలంలో భారీ ధర పెట్టి శ్రేయస్ను దక్కించుకున్న పంజాబ్ రెండోసారి రన్నరప్గా నిలిచింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు శ్రేయస్ సారథ్య సామర్థ్యాన్ని వివరించేందుకు.దేశవాళీ మ్యాచ్లు ఆడకుండా నిర్లక్ష్యం వహించినందుకు బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోవడం... అపార ప్రతిభ ఉన్నా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక కాకపోవడం ఇవన్నీ పక్కన పెడితే... అతడిలో గొప్ప నాయకుడు ఉన్నాడని తాజా ఐపీఎల్ నిరూపించిందింది. ఆటగాడిగా అదుర్స్... ఈ సీజన్లో 17 మ్యాచ్లాడిన శ్రేయస్ 50.33 సగటుతో 604 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగి 175.07 స్ట్రయిక్రేట్తో పరుగులు రాబట్టాడు. అతడి గణాంకాలను అంకెల్లో కొలవడం కష్టమే! సీజన్ ఆరంభంలో గుజరాత్తో జరిగిన పోరులో సెంచరీకి సమీపించినా... జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయడంతోనే అయ్యర్ తీరు అందరినీ ఆకట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19 ఓవర్లు ముగిసేసరికి 220 పరుగులు చేసింది. అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీకి సమీపించాడు. చివరి ఓవర్లో స్ట్రయికింగ్లో ఉన్న శశాంక్ సింగ్ దగ్గరకు వెళ్లి ‘నా శతకం గురించి ఆలోచించకు. జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయి’ అని దిశానిర్దేశం చేశాడు. ఆ ఓవర్ మొత్తం ఆడిన శశాంక్ 23 పరుగులు రాబట్టగా... అయ్యర్ అజేయంగా నిలిచాడు. స్పిన్ను సమర్థవంతంగా ఆడతాడనే గుర్తింపును మరింత పెంచుకుంటూ... ఈసారి మిడిల్ ఓవర్స్లో భారీ షాట్లతో విరుచుకుపడి పరుగులు రాబట్టాడు. అందుకే సీజన్ మొత్తంలో 43 ఫోర్లే కొట్టిన అయ్యర్... 39 సిక్స్లతో అత్యధిక సిక్స్లు కొట్టిన వారి జాబితాలో నికోలస్ పూరన్ (40) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ముంబైపై అసమాన పోరాటం ఇక క్వాలిఫయర్–2లో ముంబై ఇండియన్స్పై శ్రేయస్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుమ్రా యార్కర్లను ఎదుర్కొనేందుకు మహామహులు ఇబ్బంది పడుతున్న తరుణంలో అతడు దాన్ని షార్ట్థర్డ్ మ్యాన్ దిశగా తరలించిన తీరు చూసి తీరాల్సిందే. ఆశలే లేని స్థితిలో అద్భుత పోరాటం కనబర్చిన ఈ ముంబైకర్... జట్టును ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు.‘అయ్యర్ అవుట్ అయినప్పుడే... పంజాబ్ పరాజయం ఖాయమైంది’ బెంగళూరుతో ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ప్రతి ఒక్కరి నోట వినిపించిన మాట ఇదే. అంతలా అభిమానుల నమ్మకాన్ని సంపాదించుకున్న శ్రేయస్... చేతి వరకు వచ్చిన కప్పు చేజారుతున్నా కాస్త కూడా చలించలేదు. చిరకాల కల నెరవేరడంతో ప్రపంచ మేటి ఆటగాడు విరాట్ కోహ్లి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తుంటే... సుదీర్ఘ కాలం ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించినా.. జట్టును విజేతగా నిలపలేకపోయిన ఏబీ డివిలియన్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ప్లేయర్లు సంబరాల్లో భాగమైపోయారు. ఇక ఆర్సీబీ అభిమానుల ఆనందానికైతే అవధులే లేవు! తన చుట్టూ ఇంత జరుగుతున్నా కనీసం ముఖ కవలికల్లో సైతం మార్పు కనబడని అయ్యర్ నింపాదిగా వచ్చే ఏడాది చూసుకుందాం అన్నట్లు ముందుకు సాగిపోయాడు. భవిష్యత్తు వన్డే కెప్టెన్! మైదానం బయట నుంచి పాంటింగ్ జట్టును తీర్చిదిద్దితే... ఆ వ్యూహాలను గ్రౌండ్లో ఆచరణలో పెట్టడంలో అయ్యర్ విజయవంతమయ్యాడు. బౌన్సీ పిచ్పై కైల్ జెమీసన్తో బ్యాక్ ఆఫ్ ది లెంత్ బంతులు వేయించడం... ముంబైతో మ్యాచ్లో వైడ్ యార్కర్లు వేసే విధంగా విజయ్ కుమార్ వైశాఖ్కు దిశానిర్దేశం చేయడం... అవసరమైనప్పుడు ‘నకల్ బాల్స్’ వేసే విధంగా ప్రోత్సహించడం ఇలా... ఒకటా రెండా సీజన్ ఆసాంతం శ్రేయస్ కెప్టెన్సీలో తనదైన పదును చూపాడు. క్వాలిఫయర్–2లో శశాంక్ సింగ్ నిర్లక్ష్యంతో రనౌట్ అయన సందర్భంలో సారథిగా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యర్... ప్రియాన్‡్ష, ప్రభ్సిమ్రన్ వంటి యువ ఆటగాళ్లను పెద్దన్నలా వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయగా... అందులో అయ్యర్ పేరు లేకపోవడం చూసి పంజాబ్ కోచ్ పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయినా దాన్ని పెద్దగా పట్టించుకోని శ్రేయస్... గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ‘నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు... ఫలితం గురించి ఆలోచించకు’ అన్న రీతిలో ఐపీఎల్పైనే దృష్టి పెట్టాడు. ప్రస్తుతం టెస్టు, టి20 జట్లలో రెగ్యులర్ ఆటగాడు కాని 30 ఏళ్ల అయ్యర్... వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత నాయకత్వ రేసులో ముందు నిలవడం ఖాయమే! -
IPL 2025: అన్ లక్కీ చహల్.. చరిత్రలో తొలి ఆటగాడు
టాలెంట్ ఎంతున్నా ఆవగింజంతైనా అదృష్టం ఉండాలన్న నానుడు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ విషయంలో మరోసారి నిరూపితమైంది. ఇతగాడు ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చలామణి అవుతున్నా (174 మ్యాచ్ల్లో 221 వికెట్లు).. ఇప్పటివరకు తాను ప్రాతినిథ్యం వహించిన ఒక్క ఫ్రాంచైజీకి కూడా టైటిల్ అందించలేకపోయాడు.2013 సీజన్లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన యుజీ.. ఇప్పటివరకు మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్స్ ఆడాడు. మూడింటిలో అతన్ని అదృష్టం వెక్కిరించింది. తొలిసారి యుజీ 2016 సీజన్లో ఫైనల్ ఆడగా.. ఆ మ్యాచ్లో అతను ప్రాతినిథ్యం వహించిన ఆర్సీబీకి సన్రైజర్స్ చేతిలో భంగపాటు ఎదురైంది. రెండో సారి 2022 సీజన్లో ఫైనల్ ఆడగా.. ఆ మ్యాచ్లో అతని జట్టు రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయంపాలైంది. తాజాగా యుజీ ఆడిన మూడో ఫైనల్లో అతని కొత్త జట్టు పంజాబ్.. అతని మాజీ జట్టు ఆర్సీబీ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఈ లెక్కన ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్స్ ఆడి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఏకైక ఆటగాడిగా చహల్ చరిత్రకెక్కాడు. ఇది తెలిసి క్రికెట్ అభిమానులు అతన్ని అన్ లక్కీ ఛార్మ్ అని అంటున్నారు. మూడు ఫైనల్స్లో అతను ఆటగాడిగా రాణించినా అతని జట్లను మాత్రం గెలిపించుకోలేకపోయాడు. మూడు ఫైనల్స్లో చహల్ పొదుపుగానే బౌలింగ్ చేసి ఒక్కో వికెట్ తీశాడు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ఛాంపియన్గా అవతరించింది. నిన్న (జూన్ 3) జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ సీజన్లో పంజాబ్, ఆర్సీబీ పోటీపోటీగా రాణించి ఫైనల్ వరకు చేరాయి. అయితే తుది సమరంలో ఆటగాళ్ల అనుభవం ఆర్సీబీని గట్టెక్కించింది. ఫైనల్లో ఓడినా శ్రేయస్ సేన శభాష్ అనిపించుకుంది. సీజన్ ఆధ్యాంతం ఆ జట్టు ఛాంపియన్ గేమ్ ఆడింది. అనుభవలేమి ఆటగాళ్లతో శ్రేయస్ జట్టును నడిపించిన తీరు అత్యద్భుతమని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. నిన్నటి ఫైనల్లో సైతం ఆ జట్టు అంత ఈజీగా ఆర్సీబీకి తలొగ్గలేదు. తొలుత అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ ఊహించిన దానికంటే తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. ఆతర్వాత బ్యాటింగ్లో సైతం మంచి ఆరంభాన్నే పొందినప్పటికీ మధ్యలో ఒత్తిడికి లోనై వికెట్లు చేజార్చుకుంది. అయినా ఆర్సీబీకి అంత ఈజీగా గెలుపును దక్కనివ్వలేదు. చివరి ఓవర్ వరుకు ఆ జట్టు బ్యాటర్ శశాంక్ సింగ్ పోరాడాడు. ఓటమి ఖాయమైనా శశాంక్ తగ్గేదేలేదన్నాడు. హాజిల్వుడ్ వేసిన చివరి ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 22 పరుగులు రాబట్టాడు. అయినా పంజాబ్ గెలుపుకు ఏడు పరుగులు తక్కువయ్యాయి. ఈ ఓటమితో పంజాబ్ గుండె ముక్కలైంది. ఈ యేడు శ్రేయస్ నేతృత్వంలో టైటిల్ ఖాయమని ఆ జట్టు అభిమానులు అనుకున్నారు. కానీ తుది మెట్టుపై ఆర్సీబీ అనుభవం గెలిచింది. ఆ జట్టుకు ఇదివరకే మూడు ఫైనల్స్ ఆడిన అనుభవం ఉండటంతో కీలక సమయంలో పరిస్థితులను బాగా హ్యాండిల్ చేసింది. ఫలితంగా 18 ఏళ్ల తమ టైటిల్ కలను సాకారం చేసుకుంది. -
Preity Zinta PBKSలో కేవలం రూ 35 కోట్ల పెట్టుబడి : లాభం ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2025లో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్వాలిఫైయర్-2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన పీబీకేఎస్, అదే తరహాలో టైటిల్ గెలుస్తుందని ఊహించిన అభిమానులకు తీరని నిరాశ మిగిలింది. 18 ఏళ్ల నిరీక్షణ తరువాత ఆసీబీ టైటిల్ను దక్కించుకుంది. పీబీకేఎస్ విలువ 925 మిలియన్ డాలర్లుఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి పోటీ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యజమాని బాలీవుడ్ నటి, ప్రీతి జింటా (Preity Zinta) ఆస్తి ఎంత, PBKS నెట్వర్త్ ఎంత అనే చర్చ నెట్టింట సందడిగా మారింది. ప్రీతి జింటా ఐపీఎల్ టీం పీబీకేఎస్ విలువ 925 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది.బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ సరసన ‘దిల్ సే’ మూవీతో ఆకట్టుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి రెండు దశాబ్దాలకు పైగాబాలీవుడ్ను ఏలింది. కెరీర్లో, ప్రీతి కల్ హో నా హో, వీర్ జారా, లక్ష్య, సలాం నమస్తే, సంఘర్ష్, కోయి... మిల్ గయా, క్యా కెహ్నా, కభీ అల్విదా నా కెహ్నా, చోరి చోరి చుప్కే చుప్కే, ది లాస్ట్ లియర్, సోల్జర్ , అనేక ఇతర చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించింది.ప్రీతి జీన్ గూడెనఫ్ను వివాహం తరువాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో సిర్థపడింది. నటనకు దూరంగా ఉంది. ప్రీతి-జీన్ దంపతులకు కవల పిల్లలున్నారు. అయితే, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ, ఐపీఎల్ జట్టు ఓనర్షిప్ ఇతర వ్యాపారాలు, ఎండార్స్మెంట్ల ద్వారా భారీ ఆస్తులను సంపాదించింది. 2008లో, ప్రీతి జింటా ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్కు సహ యజమానిగా, వ్యాపారవేత్తగా అవతరించింది.మనీ కంట్రోల్ సమాచారం ప్రకారం, 2008లో ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్కు సహ యజమానిగా ప్రీతి ఆ సమయంలో రూ. 35 కోట్లు పెట్టుబడి పెట్టగా, అది ఇప్పుడు 350 కోట్ల రూపాయలకు పెరిగింది. 2008లో పంజాబ్ కింగ్స్ ప్రారంభించినప్పుడు, దానిని విలువ 76 మిలియన్ డాలర్లుగా ఉంది. 2022 నాటికి 925 మిలియన్ డాలర్లకు పెరిగింది.ప్రీతి జింటా ఆస్తి రూ. 183 కోట్లు ప్రీతి జింటా నికర ఆస్తుల విలువ రూ. 183 కోట్లు, ఇందులో ఆమె బ్రాండ్ ప్రమోషన్లు, వ్యాపార సంస్థలు, ఐపీఎల్ జట్టులో వాటా కూడా ఉన్నాయి. ముంబైలోని పాలి హిల్స్లో రూ. 17 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ప్రీతి సొంతం. జీన్ గూడెనఫ్తో వివాహం తర్వాత ఆమె అమెరికాకు వెళ్లి బెవర్లీ హిల్స్లో నివసిస్తున్నప్పటికీ సిమ్లాలో రూ. 7 కోట్ల విలువైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది.బ్రాండ్ ఎండార్స్మెంట్ల ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ప్రీతి జింటా ప్రచారం చేసే ప్రతి బ్రాండ్ నుండి దాదాపు రూ. 1.5 కోట్ల నుండి రూ. 2 కోట్ల వరకు సంపాదిస్తుంది. ప్రీతి జింటా కార్ల విషయానికి వస్తే లగ్జరీ కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి. వీటిలో రూ. 132 లక్షల విలువైన లెక్సస్ 400 క్రాస్ఓవర్, రూ. 58 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ E క్లాస్, పోర్స్చే , BMW ఉన్నాయి. -
చాలా బాధగా ఉంది.. అతడే మ్యాచ్ను టర్న్ చేశాడు: శ్రేయస్ అయ్యర్
తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని కలలు కన్న పంజాబ్ కింగ్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్-2025 సీజన్లో ఆఖరి మొట్టుపై పంజాబ్ బోల్తా పడింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్ పోరులో 6 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది.ఆర్సీబీ నిర్ధేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని శ్రేయస్ సేన చేధించలేకపోయింది. లక్ష్య చేధనలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్(61), జోష్ ఇంగ్లిష్(39) మినహా మిగితా అందరూ తీవ్ర నిరాశపరిచారు.ఆర్సీబీ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ హార్ట్బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఫైనల్లో ఓటమి పాలైనప్పటికి.. ఈ టోర్నీ ఆసాంతం తమ కుర్రాళ్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారని అయ్యర్ కొనియాడాడు."ఈ మ్యాచ్లో ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. ఫైనల్లో ఓడినా మా కుర్రాళ్ళు ఆ సందర్భానికి తగ్గట్టు ఆడారు. ఈ మ్యాచ్లో ఆశించిన ఫలితం మాకు దక్కలేదు. కానీ మాకు మద్దతుగా నిలిచిన సపోర్ట్ స్టాఫ్, టీమ్ మేనేజ్మెంట్, ప్రతీ ఒక్కరికి క్రెడిట్ ఇవ్వాలి.మా యాజమాన్యం కూడా చాలా సపోర్ట్ చేశారు. మా గత మ్యాచ్ దృష్ట్యా 200 పరుగుల లక్ష్యం సులువు అనుకున్నాం. కానీ ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కృనాల్ తన బౌలింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతడికి చాలా అనుభవం ఉంది.తన ఎక్స్పీరియన్స్ను మరోసారి చూపించాడు. జట్టులోని ప్రతీ ఒక్కరూ బాగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. మా జట్టులోని చాలా మంది కుర్రాళ్లకు ఇదే తొలి సీజన్. అయిప్పటికి వారు ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. వారందరికి అభినందనలు. వారు లేకపోయింటే మేము ఇక్కడివరకు వచ్చేవాళ్లం కాదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. వచ్చే ఏడాది ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం. ఈ టోర్నీలో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. యువ ఆటగాళ్లు ఈ సీజన్ నుంచి చాలా అనుభవాన్ని పొందారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన చేస్తారని అశిస్తున్నాను. కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో మళ్లీ తిరిగివస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో అయ్యర్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా.. 18 ఏళ్లలో ఒకే ఒక్కడు -
IPL 2025: ఛాంపియన్గా ఆర్సీబీ.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. గత 17 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఐపీఎల్ కప్ ఎట్టకేలకు ఆర్సీబీ సొంతమైంది. ఐపీఎల్-2025 విజేతగా ఆర్సీబీ అవతరించింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించిన బెంగళూరు జట్టు.. తమ కలల ట్రోఫీని ముద్దాడింది. ఆర్సీబీ గెలుపుతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ‘‘ఈసాలా కప్ నమ్దు’’ నినాదాలతో స్టేడియం హోరెత్తి పోయింది. ఈ క్రమంలో విజేతగా నిలిచిన ఆర్సీబీ ఎంత ప్రైజ్మనీని గెల్చుకుంది, రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ టీమ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎన్ని కోట్లంటే?👉ఛాంపియన్స్గా నిలిచిన ఆర్సీబీకి ప్రైజ్మనీ రూపంలో రూ.20 కోట్లు లభించాయి. అదేవిధంగా రన్నరప్తో సరిపెట్టుకున్న పంజాబ్కు రూ.12.5 కోట్లు ప్రైజ్మనీ దక్కింది. ఇక క్వాలిఫయర్-2లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్లో టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ.6.5 కోట్లు లభించాయి.👉ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచిన సాయిసుదర్శన్కు రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 54.21 సగటుతో 759 పరుగులు చేశాడు.👉పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన ప్రసిద్ద్ కృష్ణకు రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన ప్రసిద్ద్.. 25 వికెట్లు పడగొట్టాడు.👉జితేశ్ శర్మ (సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్మనీ👉శశాంక్ సింగ్ (ఫాంటసీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్మనీ👉శశాంక్ సింగ్ (సూపర్ సిక్సర్స్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్మనీ👉ప్రియాన్ష్ ఆర్యా (మ్యాచ్లో అత్యధిక ఫోర్లు) రూ.లక్ష ప్రైజ్మనీ👉కృనాల్ పాండ్యా (గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్మనీ👉కృనాల్ పాండ్యా (మ్యాన్ ఆఫ్ది మ్యాచ్) రూ.5లక్షల ప్రైజ్మనీ👉సాయి సుదర్శన్ (ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల ప్రైజ్మనీ👉వైభవ్ సూర్యవంశి (సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్) టాటా కర్వ్ కారు విజేత👉సాయి సుదర్శన్ ( ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షల ప్రైజ్మనీ👉నికోలస్ పూర్ (సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షల ప్రైజ్మనీ👉సాయి సుదర్శన్ (ది గో ఫోర్స్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షల ప్రైజ్మనీ👉మొహ్మద్ సిరాజ్ (గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల ప్రైజ్మనీ👉కమిండు మెండిస్ (క్యాచ్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్👉ఫెయిర్ ప్లే అవార్డు (చెన్నై సూపర్ కింగ్స్) రూ.10లక్షల ప్రైజ్మనీ👉ప్రసిద్ధ్ కృష్ణ (పర్పుల్ క్యాప్) రూ.10లక్షల ప్రైజ్మనీ👉సాయి సుదర్శన్ (ఆరెంజ్ క్యాప్) రూ.10లక్ష ప్రైజ్మనీ👉సూర్యకుమార్ యాదవ్ (మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్) రూ.15లక్షల ప్రైజ్మనీ👉డీడీసీఏ (పిచ్ అండ్ గ్రౌండ్) రూ.50లక్షల ప్రైజ్మనీThis wasn’t luck. This was loyalty paying rent after 18 years. 🤌pic.twitter.com/kOfZ7aX7RF— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2025 -
ఆర్సీబీకి అందిన ద్రాక్ష
విరాట్ కోహ్లి 17 సీజన్లలో కలిపి 8 వేల పరుగులు చేసినా... క్రిస్ గేల్ విధ్వంసక బ్యాటింగ్తో 7 సీజన్లలో రికార్డులు బద్దలు కొట్టినా... డివిలియర్స్ 11 సీజన్లలో మరచిపోలేని మెరుపు ప్రదర్శనలు చూపించినా సాధ్యం కాలేదు... ఈ ముగ్గురు కలిసి 7 సీజన్లలో టి20 క్రికెట్ మజా ఏమిటో చూపిస్తూ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచినా... అసలు లక్ష్యం మాత్రం అందనంత దూరంలో నిలిచిపోయింది... గేల్ ఎప్పుడో టీమ్కు దూరమయ్యాడు...డివిలియర్స్ ఇక నా వల్ల కాదంటూ మూడు సీజన్ల క్రితం తప్పుకున్నాడు...వీరిద్దరితో కలిసి ఐపీఎల్లో ఓవరాల్గా టాప్–2 భాగస్వామ్యాలు నెలకొల్పిన కోహ్లి... ఆ తర్వాత డుప్లెసిస్తో కలిసి మరో మూడు సీజన్లు బ్యాటింగ్ భారం మోశాడు. కానీ ఎన్ని గొప్ప ఇన్నింగ్స్లు వచ్చినా ఐపీఎల్ ట్రోఫీ మాత్రం దక్కలేదు! అయితే ఎట్టకేలకు బెంగళూరు ఇప్పుడు తమ కలను నెరవేర్చుకుంది. కోహ్లి ఆనందభాష్పాలు చూస్తే ఈ విజయం విలువేమిటో తెలుస్తుంది! స్టార్లు కాకపోయినా.... పెద్ద పెద్ద పేర్లు ముఖ్యం కాదు... చిన్న ఆటగాళ్లే అయినా వారు చూపించే ప్రభావం ముఖ్యమని ఆర్సీబీ నిరూపించింది. టోర్నీలో పది మంది బ్యాటర్లు కనీసం అర్ధ సెంచరీలు సాధించారు. ఫైనల్కు ముందు జట్టు 10 మ్యాచ్లు గెలిస్తే 9 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచారు. ‘బిగ్ త్రీ’పై మాత్రమే ఆధారపడిన గెలుపును ఆశించిన జట్టులా ఈసారి బెంగళూరు ఏమాత్రం కనిపించలేదు.వైవిధ్యంతో పాటు బ్యాటింగ్ లోతును కూడా టీమ్ చూపించింది. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీ సారి నేనున్నానంటూ ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆదుకున్నారు. లీగ్ దశలో పంజాబ్పై టిమ్ డేవిడ్, చెన్నైపై షెఫర్డ్, లక్నోపై జితేశ్ ఆడిన ఇన్నింగ్స్లు అసాధారణ ప్రదర్శనలుగా నిలిచాయి. ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్థి వేదికపై ఆడిన 7 మ్యాచ్లూ గెలిచిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. సాల్ట్ను ఎంచుకొని... ఐపీఎల్ వేలం సమయంలో టీమ్ డైరెక్టర్ బొబాట్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘వారు ఎలా ఆడతారన్నది మేం ఆలోచించడం లేదు. మేం ఎలా ఆడించాలనే ఆలోచనే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే మేం ఆటగాళ్లను ఎంచుకున్నాం’ అని ఆయన చెప్పారు. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, మెంటార్ దినేశ్ కార్తీక్లతో పాటు పన్నిన వ్యూహాలు, ప్రణాళికలు బెంగళూరుకు అద్భుతంగా పని చేశాయి. కోహ్లికి జోడీగా విధ్వంసకర ఓపెనర్ కావాలంటూ కార్తీక్ పట్టుబట్టి మరీ సాల్ట్ను రూ. 11.25 కోట్లకు తీసుకునేలా చేశాడు. ఏకంగా 175 స్ట్రయిక్రేట్తో అతను 403 పరుగులు చేసి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కెప్టెన్ సూపర్... కెప్టెన్గా కూడా రజత పాటీదార్ను ఎంచుకోవడంలో ఆర్సీబీ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. భారత్ క్రికెట్లో స్టార్ ఆటగాడు కాకపోయినా... ముస్తాక్అలీ ట్రోఫీలో అతని నాయకత్వ లక్షణాలు చూసి ఎంచుకుంది. ఇది ఎంత గొప్పగా పని చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోల్కతా, చెన్నై, ముంబైలపై వారి వేదికల్లో ఎన్నో ఏళ్ల తర్వాత విజయాలు సాధించడంలో బ్యాటర్గా పాటీదార్ పాత్ర ఎంతో ఉంది. 312 పరుగులతో అతను రాణించాడు. సుయాశ్ శర్మ, యశ్ దయాళ్లను సరైన సమయంలో సమర్థంగా వాడుకోవడంలో అతని కెప్టెన్సీ ప్రతిభ కనిపించింది. ఇప్పుడు 17 సీజన్లలో సాధ్యం కాని ఘనతను కెపె్టన్గా తన తొలి సీజన్లోనే అందుకొని పాటీదార్ ఐపీఎల్ చరిత్రలో తన పేరును ఘనంగా లిఖించుకున్నాడు. అంతా కోహ్లిమయం... బెంగళూరు టీమ్ సభ్యులలో గతంలో కృనాల్ పాండ్యా, హాజల్వుడ్, భువనేశ్వర్, సాల్ట్ ఐపీఎల్ గెలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇతర యువ ఆటగాళ్ల కెరీర్ ఇంకా పూర్తిగా ఊపందుకోలేదు. ఇప్పటికిప్పుడు టైటిల్ గెలిచినా, ఓడినా వారికి పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ విరాట్ కోహ్లి పరిస్థితి అందరికంటే భిన్నం. అతను 18 సీజన్లుగా ఒకే జట్టుకు తన సర్వం ధారబోశాడు. ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. కానీ టైటిల్ మాత్రం గెలవలేని లోటు ప్రతీసారి వెంటాడేది. గతంలో మూడు ఫైనల్ మ్యాచ్లో ఓడిన బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా 2016 సీజన్లో ఏకంగా 973 పరుగులతో చెలరేగినా ఫైనల్లో పరాజయం అతడికి తీవ్ర వేదనను కలిగించింది. నాటినుంచి ఇప్పటి వరకు మళ్లీ జట్టు ట్రోఫీకి చేరువగా రాలేకపోయింది. కెరీర్ చరమాంకంలో ఉన్న అతను ఈసారి గెలవలేకపోతే మరింత ఆవేదన కలిగేది. ఇలాంటి స్థితిలో దక్కిన విజయం కోహ్లి కోసమే వచ్చినట్లుగా ఉంది. అందుకే మైదానమంతా కోహ్లి చుట్టే సంబరాలు. గతంలో జట్టులో భాగంగా ఉండి ట్రోఫీ గెలవలేని డివిలియర్స్, గేల్ కూడా కోహ్లి పక్కన ఉండి అతని సంతోషంలో భాగం కావడం విశేషం. -సాక్షి క్రీడా విభాగం ‘పసి పాపలా ప్రశాంతంగా నిద్రపోతా’ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఈ విజయం జట్టు సభ్యులది మాత్రమే కాదు అభిమానులది కూడా. నేను యువకుడిగా, ఆ తర్వాత కెరీర్ అత్యుత్తమ దశలో, ఇప్పుడు అనుభవజ్ఞుడిలా ఈ టీమ్తో ఉన్నాను. ప్రతీ సీజన్లోనూ ఇదే తరహాలో విజయం కోసం తీవ్రంగా శ్రమించాను. నేను చేయగలిగిందంతా చేశాను. చివరకు ఇప్పుడు దక్కిన భావన గొప్పగా ఉంది. ఈ రోజు వస్తుందని అనుకోలేదు. ఆఖరి బంతి తర్వాత భావోద్వేగాలను నియంత్రించుకున్నాను. ఏం జరిగినా ఇదే జట్టుతో ఉన్నాను. టీమ్ మేనేజ్మెంట్ కూడా నాతో నిలబడింది. ఇదే జట్టుతో టైటిల్ గెలవాలని కలగన్నాను. మరో టీమ్తో గెలిచి ఉంటే ఇంత ఆనందం దక్కకపోయేదేమో. నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే ఉన్నాయి. గతంలో చెప్పినట్లుగా నేను ఐపీఎల్ ఆడినంత వరకు ఇదే జట్టుతో ఉంటా. ఎంతో పోటీ, తీవ్రత ఉండే ఈ టోర్నీలో టైటిల్ విజయాన్ని ఎంతో ప్రాధాన్యత ఉంది. నేను ఇలాంటి పెద్ద టోర్నీలను గెలవాలని, చిరస్మరణీయ క్షణాలను కోరుకుంటా. కెరీర్లో అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. ఈ రోజు నేను ప్రశాంతంగా పసిపాపలా నిద్రపోతా. వేలంలో మా ఎంపికను చాలా మంది ప్రశ్నించారు. కానీ వాటిని తప్పని నిరూపించాం. –విరాట్ కోహ్లి -
RCB Vs PBKS: కల నిజమాయెగా.. కప్పు సొంతమాయెగా
ఎన్నిసార్లు గుండెకోతలు... ఎన్ని అవమానాల పర్వాలు... ఆర్సీబీ అభిమాని అంటే అదో చిన్నచూపుతో చూసిన ఎన్నో సందర్భాలు... ఎప్పటికీ విజేతగా నిలవదనే వ్యాఖ్యలు... గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడే సాధ్యం కాలేదు ఇప్పుడేమవుతుందిలే అనే జోస్యాలు... కొన్నిసార్లు లీగ్ దశకే పరిమితమైతే మరికొన్ని సార్లు ‘ప్లే ఆఫ్స్’కు చేరినా ముందంజ వేయని రోజులు... మూడు ఫైనల్స్లలో ఓడిన వేదన దీనికి అదనం. ఒకదశలో ఆర్సీబీ అభిమానుల నినాదం ‘ఈ సాల కప్ నమ్దే’ (ఈ ఏడాది కప్ మనదే) జోక్గా మారిపోయిన పరిస్థితి... కానీ 2008 నుంచి గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఆర్సీబీ జెండాను తమ మనసులో నింపుకున్న ఫ్యాన్స్ గర్వపడే క్షణం వచ్చేసింది...తమ టీమ్లోని 18వ నంబర్ జెర్సీకి కానుక ఇస్తున్నట్లుగా ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్గా నిలిచింది. లీగ్ దశలోనే అసాధారణ ప్రదర్శనలతో ‘ప్లే ఆఫ్స్’కు చేరి తొలి క్వాలిఫయర్లోనే గెలుపుతో ఫైనల్ చేరిన టీమ్ తుది పోరులోనూ అదే జోరును కొనసాగించింది... ఒకరు కాదు ఇద్దరు కాదు జట్టులోని సమష్టితత్వం ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఎన్నో చాలెంజ్లను అధిగమించి రాయల్గా సాధించిన ఈ ట్రోఫీని బెంగళూరులో సగర్వంగా ప్రదర్శించే సమయమిది... ఘనవిజయాలు, వైఫల్యాలు అన్నింటినీ చూస్తూ ఆర్సీబీ పట్ల విధేయత వీడకుండా జట్టుతోనే కొనసాగిన విరాట్ కోహ్లి కెరీర్లో మిగిలిన ఈ ఒక్క లోటు ఈ రోజుతో తీరిపోయింది. అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కొత్త చాంపియన్గా అవతరించింది. గతంలో మూడుసార్లు ఫైనల్ మ్యాచ్లలో (2009, 2011, 2016) ఓటమి పాలైన జట్టు ఎట్టకేలకు 18వ సీజన్లో ‘ఈ సాల కప్ నమ్దు’ (ఈ ఏడాది కప్ మనది) అంటూ ట్రోఫీని ముద్దాడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో రజత్ పాటీదార్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (35 బంతుల్లో 43; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులే చేయగలిగింది. శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా, జోష్ ఇన్గ్లిస్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్స్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (2/17) అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను బెంగళూరు వైపు తిప్పగా, ఒత్తిడిలో పంజాబ్ పూర్తిగా చిత్తయింది. ఫలితంగా రెండోసారి పంజాబ్ కింగ్స్ జట్టు రన్నరప్ట్రోఫీతో సరిపెట్టుకుంది. 2014లో తొలిసారి ఫైనల్ చేరిన పంజాబ్ జట్టు తుది పోరులో కోల్కతా నైట్రైడర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ పంజాబ్ కింగ్స్ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్కు రూ. 6 కోట్ల 50 లక్షలు దక్కాయి. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన... ఆర్సీబీ ఇన్నింగ్స్లో విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రధాన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేయడంతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. దూకుడుగా మొదలు పెట్టిన ఫిల్ సాల్ట్ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోగా, కోహ్లి జాగ్రత్తగా ఆడాడు. పవర్ప్లేలో జట్టు 55 పరుగులు చేసింది. తొలి వికెట్ పడ్డాక తర్వాతి నలుగురు బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంలో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రజత్ పాటీదార్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు), లివింగ్స్టోన్ (15 బంతుల్లో 25; 2 సిక్స్లు), జితేశ్ శర్మ (10 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగులు ఆశించినంత వేగంగా రాకపోయినా... జేమీసన్ వేసిన 17వ ఓవర్లో 3 సిక్స్లతో 23 పరుగులు రాబట్టడంతో స్కోరు దాదాపు 200 వరకు వెళ్లింది. అర్ష్ దీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్లో ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయింది. టపటపా... సీజన్ ఆసాంతం అద్భుత ఆరంభాలతో పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (19 బంతుల్లో 24; 4 ఫోర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (22 బంతుల్లో 26; 2 సిక్స్లు) అసలు పోరులో ఆ ధాటిని చూపించలేకపోయారు. తడబడుతూనే ఆడిన వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) పేలవ షాట్కు వెనుదిరగడంతో జట్టు విజయావకాశాలపై దెబ్బ పడింది. మరో ఎండ్లో దూకుడు ప్రదర్శించిన ఇన్గ్లిస్ను కృనాల్ పాండ్యా వెనక్కి పంపడంతో కింగ్స్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో శశాంక్ పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అయ్యర్ (బి) జేమీసన్ 16; కోహ్లి (సి అండ్ బి) అజ్మతుల్లా 43; మయాంక్ అగర్వాల్ (సి) అర్ష్ దీప్ (బి) చహల్ 24; పాటీదార్ (ఎల్బీ) (బి) జేమీసన్ 26; లివింగ్స్టోన్ (ఎల్బీ) (బి) జేమీసన్ 25; జితేశ్ శర్మ (బి) వైశాక్ 24; షెఫర్డ్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 17; కృనాల్ (సి) అయ్యర్ (బి) అర్ష్ దీప్ 4; భువనేశ్వర్ (సి) ప్రియాన్ష్ ఆర్య (బి) అర్ష్ దీప్ 1; యశ్ దయాళ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–18, 2–56, 3–96, 4–131, 5–167, 6–171, 7–188, 8–189, 9–190. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–40–3, జేమీసన్ 4–0–48–3, అజ్మతుల్లా 4–0–35–1, వైశాక్ 4–0–30–1, యుజువేంద్ర చహల్ 4–0–37–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య (సి) సాల్ట్ (బి) హాజల్వుడ్ 24; ప్రభ్సిమ్రన్ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 26; ఇన్గ్లిస్ (సి) లివింగ్స్టోన్ (బి) కృనాల్ 39; అయ్యర్ (సి) జితేశ్ (బి) షెఫర్డ్ 1; నేహల్ వధేరా (సి) కృనాల్ (బి) భువనేశ్వర్ 15; శశాంక్ సింగ్ (నాటౌట్) 61; స్టొయినిస్ (సి) యశ్ దయాళ్ (బి) భువనేశ్వర్ 6; అజ్మతుల్లా (సి) (సబ్) భందగే (బి) యశ్ దయాళ్ 1; జేమీసన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–43, 2–72, 3–79, 4–98, 5–136, 6–142, 7–145. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–38–2, యశ్ దయాళ్ 3–0–18–1, హాజల్వుడ్ 4–0–54–1, కృనాల్ పాండ్యా 4–0–17–2, సుయాశ్ శర్మ 2–0–19–0, షెఫర్డ్ 3–0–30–1. 6 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ గెలిచిన ఆరో భారతీయ కెపె్టన్గా రజత్ పాటీదార్ గుర్తింపు పొందాడు. గతంలో ధోని (చెన్నై సూపర్ కింగ్స్; 5 సార్లు), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్; 5 సార్లు), గౌతమ్ గంభీర్ (కోల్కతా నైట్రైడర్స్; 2 సార్లు), శ్రేయస్ అయ్యర్ (కోల్కతా నైట్రైడర్స్; ఒకసారి), హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్; ఒకసారి) ఈ ఘనత సాధించారు.10 ఇప్పటి వరకు జరిగిన 18 ఐపీఎల్ ఫైనల్స్లో 10 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ఎనిమిది సార్లు ఛేజింగ్ చేసిన జట్టుకు టైటిల్ లభించింది. 9 ఐపీఎల్–2025లో నమోదైన సెంచరీలు. మొత్తం 18 ఐపీఎల్ సీజన్లలో రెండుసార్లు మాత్రమే (2023లో 12 సెంచరీలు; 2024లో 14 సెంచరీలు) పది అంతకంటే ఎక్కువ సెంచరీలు వచ్చాయి.2 ముంబై ఇండియన్స్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తోపాటు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ సాధించిన రెండో జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గుర్తింపు పొందింది. స్మృతి మంధాన కెప్టెన్సీలో బెంగళూరు జట్టు 2024లో డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచింది.1 ఐపీఎల్ ఫైనల్లో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తొలి ఆటగాడిగా కృనాల్ పాండ్యా రికార్డుల్లోకెక్కాడు. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సందర్భంలోనూ కృనాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
IPL 2025: ఈ సాలా కప్ ఆర్సీబీదే.. ఫైనల్లో పంజాబ్పై ఘన విజయం
ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కల సాకారమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (జూన్ 3) జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. చివరి ఓవర్ను అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్ 3, ఒమర్జాయ్, విజయ్కుమార్ వైశాక్, చహల్ తలో వికెట్ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లినే టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్16, లివింగ్స్టోన్ 25, జితేశ్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇన్నింగ్స్ మధ్యలో ఒత్తిడికి లోనైన పంజాబ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఆఖర్లో శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) పంజాబ్ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే అప్పటకే మ్యాచ్ పంజాబ్ చేతుల్లో నుంచి జారి పోయింది. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రియాంశ్ ఆర్మ 24, ప్రభ్సిమ్రన్ సింగ్ 26, జోస్ ఇంగ్లిస్ 39, శ్రేయస్ అయ్యర్ 1, నేహల్ వధేరా 15, స్టోయినిస్ 6, ఒమర్జాయ్ 1 పరుగు చేసి ఔటయ్యారు.ఆర్సీబీ బౌలర్లులో కృనాల్ పాండ్యా (4-0-17-2) అద్బుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 2, యశ్ దయాల్, హాజిల్వుడ్, షెపర్డ్ తలో వికెట్ తీసుకున్నారు. VIRAT KOHLI IN TEARS - THE DREAM MOMENT FOR THE GOAT ❤️ pic.twitter.com/jPxUsccRUL— Johns. (@CricCrazyJohns) June 3, 2025ఈ గెలుపుతో ఆర్సీబీతో పాటు ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కల కూడా సాకారమైంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్న విరాట్ ఎట్టకేలకు 18వ సీజన్లో టైటిల్ కలను సాకారం చేసుకున్నాడు. విరాట్కు 18 నంబర్ మరోసారి కలిసొచ్చింది. విరాట్ జెర్సీ నంబర్ కూడా 18 అన్న విషయం తెలిసిందే. టైటిల్ గెలిచాక విరాట్ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. -
IPL 2025 Final: పంజాబ్పై ఆర్సీబీ విజయం
పంజాబ్పై ఆర్సీబీ విజయంఅహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (జూన్ 3) జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.ఓటమి దిశగా పంజాబ్16.4వ ఓవర్- పంజాబ్ ఓటమి దిశగా సాగుతుంది. 142 పరుగుల వద్ద ఆ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో సిక్సర్ బాదిన మరుసటి బంతికే స్టోయినిస్ (6) ఔటయ్యాడు. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్పంజాబ్ గెలుపుకు 24 బంతుల్లో 55 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. నేహల్ వధేరా (15), శశాంక్ సింగ్ (22) క్రీజ్లో ఉన్నారు. కష్టాల్లో పంజాబ్12.1వ ఓవర్- 98 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో బౌండరీ లైన్ వద్ద లివింగ్స్టోన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జోష్ ఇంగ్లిస్ (39) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్9.4వ ఓవర్- 79 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. రొమారియో షెపర్డ్ బౌలింగ్లో జితేశ్ శర్మ క్యాచ్ పట్టడంతో ఇన్ ఫామ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (1) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్8.3వ ఓవర్- 72 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్కు క్యాచ్ ఇచ్చి ప్రభ్సిమ్రన్ సింగ్ (26) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 70/1ప్రభ్సిమ్రన్ సింగ్ 25, జోష్ ఇంగ్లిస్ 16తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్4.6వ ఓవర్- 43 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో ప్రియాంశ్ ఆర్మ (24) ఔటయ్యాడు. టార్గెట్ 191.. 3 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 28/0ప్రభ్సిమ్రన్ 10, ప్రియాంశ్ ఆర్య 14200లోపు స్కోర్కే పరిమితమైన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 200లోపు స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్ను అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్ 3, ఒమర్జాయ్, విజయ్కుమార్ వైశాక్, చహల్ తలో వికెట్ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లినే టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్16, లివింగ్స్టోన్ 25, జితేశ్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ17.4వ ఓవర్-171 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో జితేశ్ శర్మ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ16.5వ ఓవర్- 167 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో లివింగ్స్టోన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లి ఔట్14.5వ ఓవర్- 131 పరుగుల వద్ద ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 35 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ విరాట్ను క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 103/3విరాట్ కోహ్లి 32, లివింగ్స్టోన్ 3మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రజత్ పటిదార్ 26(16) పరుగుల వద్ద జెమీసన్ బౌలింగ్లో ఔటయ్యారు.పది ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 87/2పది ఓవర్లలో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు సాధించింది. 9 ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 80/2ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు సాధించింది. కోహ్లీ 21(18), రజత్ పటిదార్ 17(9) క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ6.2వ ఓవర్- 56 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో అర్షదీప్కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (24) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 55/1మయాంక్ అగర్వాల్ 24, విరాట్ కోహ్లి 13తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ1.4వ ఓవర్- 18 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ (16) ఔటయ్యాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (జూన్ 3) జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్, ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.ఈ సీజన్లో ఐపీఎల్కు కొత్త ఛాంపియన్ రావడం ఖరారైపోయింది. ఆర్సీబీ, పంజాబ్ జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయాయి. ఆర్సీబీ 3 సార్లు, పంజాబ్ ఓసారి ఫైనల్కు చేరినా రన్నరప్తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లు పోటీపోటీగా రాణించి ఫైనల్ వరకు చేరాయి. లీగ్ దశలో పంజాబ్, ఆర్సీబీ సమంగా మ్యాచ్లు గెలిచి (14లో 9) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లో తలో మ్యాచ్ గెలిచాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్పై ఆర్సీబీ పైచేయి సాధించింది. జట్ల వివరాలు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ.పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్ -
IPL 2025 Final: అన్ని ఏఐ ప్లాట్ఫామ్లు 'ఆ జట్టే' ఛాంపియన్ అని అంటున్నాయి..!
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ ఇవాళ (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో విజేతపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ప్రదర్శనల ప్రకారం ఈ సీజన్లో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలానా జట్టు గెలుస్తుందని అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్లు జరగగా.. ఆర్సీబీ 2, పంజాబ్ ఓ మ్యాచ్లో గెలిచాయి. దీని ఆధారంగా ఆర్సీబీకే స్వల్ప ఎడ్జ్ ఉందని చెప్పవచ్చు.మానవమాత్రుల అంచనాలను పక్కన పెడితే.. కృత్రిమ మేధ (Artificial Intelligence, AI) ఏం చెబుతుందో చూద్దాం. ప్రచుర్యంలో ఉన్న టాప్ ఏఐ ప్లాట్ఫామ్లను ఐపీఎల్ 2025 విజేత ఎవరని అడగగా.. దాదాపు అన్ని ఏఐ ప్లాట్ఫామ్లు (గ్రోక్, జెమిని, ఛాట్జీపీటీ) ముక్తకంఠంతో ఆర్సీబీని విజేతగా తేల్చాయి.X GROK: అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, RCB ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ పంజాబ్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆ మ్యాచ్లో పంజాబ్ను 101 పరుగులకే ఆలౌట్ చేసి, 60 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ఆర్సీబీ ఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. జోష్ హాజిల్వుడ్ (11 మ్యాచ్ల్లో 21 వికెట్లు), సుయాష్ శర్మ నేతృత్వంలోని RCB బౌలింగ్ అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ (55.81 సగటుతో 614 పరుగులు), ఫిల్ సాల్ట్ విస్ఫోటకమైన ఫామ్లో ఉన్నారు.అహ్మదాబాద్లో RCB యొక్క చారిత్రక ప్రదర్శన (మొదట బ్యాటింగ్ చేసిన ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్లు గెలిచింది) మరియు ఒత్తిడిలో సామర్థ్యం వారికే స్వల్ప ఎడ్జ్ను ఇస్తాయి. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ వంటి నిపుణులు కూడా RCBకి మద్దతు ఇచ్చారు. వార్నర్ హాజిల్వుడ్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అంచనా వేశారు.అయితే, క్వాలిఫయర్ 2లో పంజాబ్ ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి తమను తక్కువ అంచనా వేయొద్దని అలర్ట్ చేస్తుంది. ఆ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ (87 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో పంజాబ్ను గెలిపించాడు. కైల్ జేమిసన్, యుజ్వేంద్ర చహల్ వంటి బౌలర్లతో పంజాబ్ బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. అయితే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో పతనం ఒత్తిడిలో పంజాబ్ బలహీనతను సూచిస్తుంది.ప్రస్తుత ఫామ్, సమతుల్య జట్టు, ఈ సీజన్లో వారి జోరును పరిగణనలోకి తీసుకుంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2025 ఫైనల్ను గెలుస్తుందని అంచనా. ఆర్సీబీ బ్యాటింగ్ లోతు మరియు పెద్ద మ్యాచ్లలో అనుభవం వారిని ఛాంపియన్లుగా చేస్తాయి. -
'అతడితో పంజాబ్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే వార్ వన్ సైడే'
ఐపీఎల్-2025 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ సిద్దమయ్యాయి. ఈ తుది పోరుకు ఇరు జట్లు ఆస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.ఈ హైవోల్జేజ్ మ్యాచ్కు ముందు భారత మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలని, పవర్ ప్లేలో ఔట్ కాకపోతే 250 పరుగులకు పైనా లక్ష్యమున్నా అతడు చేజ్ చేసేస్తాడని యోగరాజ్ పంజాబ్ను హెచ్చరించాడు."ఆరంభంలో విరాట్ కోహ్లిని ఔట్ చేయకపోతే పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అతడు పవర్ప్లేలో ఔట్ కాకపోతే 250 నుంచి 300 పరుగుల టార్గెట్నైనా కరిగించేగలడు. అయితే పంజాబ్ జట్టు అత్యుత్తమంగా ఉంది. వారు ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా ఆడారు. ఈ మ్యాచ్లో పంజాబ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ మొదటి పది ఓవర్లలో కోహ్లి ఔట్ కాకపోతే మ్యాచ్ వన్సైడ్ అయినట్లే. పంజాబ్ జట్టుకు అద్భుతమైన కెప్టెన్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒక టాలెంటెడ్ ప్లేయర్. ఈ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్, కోహ్లి మధ్య పోటీ అనే చెప్పుకోవాలి.ఆర్సీబీని గెలిపించేందుకు కోహ్లి ఉంటే, పంజాబ్లో అయ్యర్ ఉన్నాడు. పంజాబ్ గెలవాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.తుది జట్ల వివరాలు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా, యశ్ దయాళ్, హాజల్వుడ్.పంజాబ్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్సిమ్రన్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్దీప్ సింగ్. -
ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన డెంజరస్ ప్లేయర్?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ 18 ఏళ్ల ఐపీఎల్ ట్రోఫీ కలను నేరవేర్చుకునేందుకు అడుగు దూరంలో ఉంది. ఐపీఎల్-2025 ఫైనల్లో మంగళవారం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో ఆర్సీమీ తాడోపేడో తెల్చుకోనుంది. తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడాలని భావిస్తున్న బెంగళూరు జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫైనల్ మ్యాచ్కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో సాల్ట్ తన ఫ్యామిలీతో ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫైనల్కు ముందు రోజు ఆర్సీబీ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో అతడు పాల్గొనలేదు. దీంతో అతడు ఆఖరి మ్యాచ్లో ఆడేది అనుమానంగా మారింది."పంజాబ్తో మ్యాచ్ కోసం ఫిల్ సాల్ట్ ఆర్సీబీ జట్టుతో పాటు అహ్మదాబాద్కు చేరుకోలేదు. తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఇంగ్లండ్కు వెళ్లాలని సాల్ట్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇదివరకే ఆర్సీబీ మెనెజ్మెంట్కు తెలియజేశాడు" అని ఈఎస్సీఎన్ క్రిక్ ఇన్ ఫో తమ కథనంలో పేర్కొంది.అయితే ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో ఈ విషయంపై కెప్టెన్ రజత్ పాటిదార్, ప్రధాన కోచ్ అండీ ఫ్లవర్ కనీసం స్పందించలేదు. కీలక మ్యాచ్కు ముందు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని కోరుకుంటున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ తుది పోరుకు సాల్ట్ దూరమైతే ఆర్సీబీకి నిజంగా అది గట్టి ఎదురు దెబ్బే అవుతోంది. ఎందుకంటే ఈ ఏడాది సీజన్లో సాల్ట్ తన విధ్వంసకర బ్యాటింగ్తో ఆర్సీబీకి ఆదిరిపోయే ఆరంభాలను అందిస్తున్నాడు. . ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో 175.90 స్ట్రైక్రేటుతో 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. సాల్ట్ అందుబాటులో లేకపోతే అతడి స్ధానంలో కివీస్ ఆటగాడు టిమ్ సీఫర్ట్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. -
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
ఐపీఎల్-2025 తుది సమరానికి సమయం అసన్నమైంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ తుది పోరులో ఎలాగైనా గెలిచి తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతోన్నాయి.ఇరు జట్లు సమవుజ్జీలగా ఉండడంతో విజేత ఎవరన్నది క్రికెట్ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఆఖరి పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా క్వాలిఫయర్-2 లానే ఫైనల్కు కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది. ఆదివారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన సెకెండ్ క్వాలిఫయర్ మ్యాచ్ వర్షం కారణంగా దాదాపు రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది.ఇప్పుడు ఆక్యూవెధర్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం కూడా ఆహ్మదాబాద్లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో వర్షం వల్ల కానీ మరీ ఏ ఇతర కారణాల చేత ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని అభిమానుల తెగ చర్చించుకుంటున్నారు.మ్యాచ్ రద్దయితే..?ఫైనల్కు వర్షం ఆటంకం కలిగిస్తే.. మిగిలిన నాకౌట్ మ్యాచ్ల మాదిరిగానే ఈ మ్యాచ్కు కూడా 120 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు మాత్రం బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించింది. మంగళవారం(జూన్ 3) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన బుధవారం మ్యాచ్ను నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు.ఒకవేళ బుధవారం(జూన్ 4) కూడా మ్యాచ్ను నిర్వహించేందుకు అవకాశం లేకుంటే.. పాయింట్ల పట్టికలో టాపర్గా ఉన్న పంజాబ్ కింగ్స్ను విజేతగా ప్రకటిస్తారు. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది.చదవండి: మొదటి ట్రోఫీని ముద్దాడేందుకు... -
మొదటి ట్రోఫీని ముద్దాడేందుకు...
ఐపీఎల్ 2008లో మొదలైంది... తొలి సీజన్... రెండు.... మూడు... నాలుగు... ఇలా చూస్తూ చూస్తూ 17 సీజన్లు గడిచిపోయాయి. కానీ ఒక్కసారైనా విజేతగా నిలవాలనే ఆ రెండు జట్ల కోరిక మాత్రం నెరవేరలేదు. ఇన్నేళ్లలో ఎంతో మంది ఆటగాళ్లు మారారు... కోచ్లు కొత్తగా వచ్చారు, వ్యూహాలూ మారాయి... వైఫల్యాలతో నిష్క్రమించిన ప్రతీసారి వచ్చే ఏడు మనదే అవుతుందనే ఆశతో మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టడం, ఆపై కీలక దశలో కుప్పకూలడం సాధారణంగా మారిపోయాయి తప్ప ఐపీఎల్ టైటిల్ ద్రాక్ష అందనే లేదు... ఒక టీమ్ ఈ ప్రయత్నంలో మూడుసార్లు తుది పోరుకు చేరి నిరాశతో వెనుదిరగ్గా... మరో జట్టు ఒకే ఒక్కసారి ఆఖరి మెట్టుకు చేరి చతికిలపడింది... ఇప్పుడు ఆ రెండు టీమ్లలో ఒకరికి ఉపశమనం దక్కే సమయం వచ్చింది. ఐపీఎల్ 18వ సీజన్లో కొత్త జట్టు చాంపియన్గా నిలవడం ఖరారైన నేపథ్యంలో తొలిసారి ఈ టైటిల్ను ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరం. మొదటి ట్రోఫీ వేటలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. రాత్రి 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం అహ్మదాబాద్: ఐపీఎల్–18 సీజన్లో 73 హోరాహోరీ మ్యాచ్ల తర్వాత ఈ ఏడాది విజేతను తేల్చే అసలు సమరానికి అంతా సిద్ధమైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో ప్రదర్శనను చూస్తే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపించాయి. రన్రేట్ కారణంగా పంజాబ్ మొదటి స్థానంలో, బెంగళూరు రెండో స్థానంలో నిలిచినా... రెండు టీమ్లూ సమంగా తొమ్మిదేసి విజయాలు సాధించి 19 పాయింట్లతో నిలిచాయి.‘ప్లే ఆఫ్స్’కు ముందు ప్రత్యర్థులుగా తలపడిన మ్యాచ్లలో ఇరు జట్లు ఒక్కో విజయాన్ని అందుకోగా... క్వాలిఫయర్–1లో పంజాబ్ను చిత్తు చేసి బెంగళూరు పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరులో గెలిచి పంజాబ్ లెక్క సరి చేస్తుందా లేదా ఆర్సీబీ ఆధిత్యం కొనసాగుతుందా చూడాలి. మొత్తంగా ఎవరు గెలిచినా తొలి ట్రోఫీతో సంబరాలు అంబరాన్ని తాకడం ఖాయం. సమష్టి ప్రదర్శనతో... ఐపీఎల్లో ఆర్సీబీ 2016లో ఆఖరిసారిగా ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్లో ఓటమి తర్వాత ఆడిన ఎనిమిది సీజన్లలో జట్టు ప్రదర్శన అంతంత మాత్రమే. ముఖ్యంగా ఎవరో ఒక ఆటగాడి ప్రదర్శనపైనే ఆధారపడటం, అతను విఫలమైతే జట్టు కుప్పకూలడం తరచుగా సాగాయి. కానీ ఈ సీజన్ పూర్తి భిన్నంగా కనిపించింది. జట్టు పది మ్యాచ్లు గెలిస్తే తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచారు. ఒకరు విఫలమైతే మరొకరు ఆదుకోవడంతో కీలక సమయాల్లో కూడా జట్టు పట్టు వీడలేదు. ఇప్పుడు అదే శైలి, పోరాటతత్వం బెంగళూరును ఫైనల్కు చేర్చాయి. ఎప్పటిలాగే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 600కు పైగా పరుగులు, 8 అర్ధసెంచరీలతో జట్టుకు చుక్కానిలా నిలిచాడు. అతని ఓపెనింగ్లో సరైన జోడీగా ఫిల్ సాల్ట్ 387 పరుగులతో శుభారంభాలు అందించాడు.మిగతా బ్యాటర్లలో షెఫర్డ్, జితేశ్, కృనాల్ పాండ్యా కూడా ప్రభావవంతమైన ఇన్నింగ్స్లు ఆడారు. కెపె్టన్ పాటీదార్ గత ప్రదర్శనలతో పోలిస్తే ఈసారి అంత అద్భుతంగా ఆడకపోయినా... కెపె్టన్గా తొలి సీజన్లో జట్టును ఫైనల్ చేర్చిన ఘనత అతనికి దక్కింది. మైదానంలో కోహ్లి అనుభవం, సూచనలు అండగా ఉన్న పాటీదార్ నాయకత్వంలో టీమ్ టైటిల్ గెలిస్తే ఆర్సీబీ అభిమానుల కోరిన నెరవేర్చిన ప్రత్యేక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడు.బౌలింగ్లో కూడా టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. జట్టు బౌలింగ్ సత్తా తొలి క్వాలిఫయర్లో పంజాబ్పైనే కనిపించింది. ముఖ్యంగా హాజల్వుడ్ ఆ్రస్టేలియా నుంచి తిరిగి రావడం ఒక్కసారిగా జట్టు బలాన్ని పెంచింది. 21 వికెట్లతో అతను టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించగా... భువనేశ్వర్, యశ్ దయాళ్ సహకరించారు. లెగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ కూడా పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టిపడేయగలడు. ఆ నలుగురితో కలిసి... తొలి క్వాలిఫయర్ మ్యాచ్ను మినహాయిస్తే సీజన్ ఆసాంతం పంజాబ్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. ముఖ్యంగా రెండో క్వాలిఫయర్లో ముంబైని చిత్తు చేసిన తీరు ఆ జట్టు సామర్థ్యాన్ని చూపించింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ తన అసాధారణ బ్యాటింగ్తో 600కు పైగా పరుగులు చేయడంతో పాటు సమర్థ నాయకత్వంతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇద్దరు విదేశీ బ్యాటర్లు ఇన్గ్లిస్, స్టొయినిస్లకు కీలక సమయాల్లో ఒత్తిడిని దాటి చెలరేగిపోగల నైపుణ్యం ఉంది. అయితే పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర మరో నలుగురు బ్యాటర్లు పోషిస్తున్నారు.వీరంతా జాతీయ జట్టుకు ఆడని ‘అన్క్యాప్డ్’ ఆటగాళ్లే కావడం విశేషం. ఓపెనర్లు ప్రియాన్ష్ఆర్య, ప్రభ్సిమ్రన్తో పాటు నేహల్ వధేరా, శశాంక్ సింగ్ ఈ మ్యాచ్లో రాణిస్తే కింగ్స్కు తిరుగుండదు. పంజాబ్ బౌలింగ్లో కాస్త తడబాటు కనిపిస్తోంది. అర్ష్దీప్ ఆశించిన స్థాయిలో సరైన ఆరంభాలు ఇవ్వడం లేదు. జేమీసన్ మెరుగ్గా ఉన్నా, మూడో పేసర్ అజ్మతుల్లా బౌలింగ్ కూడా సాధారణంగానే ఉంది. చహల్ స్పిన్ మరోసారి కీలకం కానుంది. ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తే పంజాబ్కు గెలుపు కష్టం కాబోదు. తుది జట్ల వివరాలు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెపె్టన్), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా, యశ్ దయాళ్, హాజల్వుడ్. పంజాబ్: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్సిమ్రన్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్దీప్ సింగ్. పిచ్, వాతావరణం సీజన్ ఆరంభం నుంచి భారీ స్కోర్లు నమోదయ్యాయి. రెండో క్వాలిఫయర్ తర హాలోనే టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. వర్ష సూచన ప్రస్తుతానికి లేదు కానీ వాన వస్తే అదనపు సమయంతో పాటు బుధవారం ‘రిజర్వ్ డే’ కూడా ఉంది. -
ఇదేంటి అయ్యర్.. సహచర ఆటగాడిని అలా తిడతావా? వీడియో వైరల్
తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడేందుకు పంజాబ్ కింగ్స్ అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించిన పంజాబ్ కింగ్స్.. 11 ఏళ్ల తర్వాత తుది పోరుకు ఆర్హత సాధించింది. ఈ విజయంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. 204 పరుగుల భారీ లక్ష్య చేధనలో అయ్యర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెకెండ్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్.. ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాడు. అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 87 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. మంగళవారం జరగనున్న ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో తన సహనాన్ని కోల్పోయాడు. తన సహచర ఆటగాడు శశాంక్ సింగ్ను ఆసభ్యపదజాలంతో దూషించాడు. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ తన టీమ్ మేట్స్కు, ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లకు కరచాలనం చేస్తూ ముందుకు సాగాడు. ఈ క్రమంలో శశాంక్ సింగ్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అంతేకాకుండా పరుష పదజాలం వాడి అతడిని తిట్టాడు కూడా. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే శ్రేయస్ కోపానికి వెనక ఓ కారణం ఉంది.అసలేమి జరిగిదంటే?నేహాల్ వధేరా ఔటయ్యాక శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అయితే కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన శశాంక్ కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి రనౌటయ్యాడు. 17వ ఓవర్లో శశాంక్ (2) మిడ్ ఆన్ దిశగా షాట్ ఆడాడు. రన్ కోసం పరిగెత్తాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాన్స్ట్రైక్ ఎండ్లో స్టంప్స్ను గిరాటేశాడు. థర్డ్ అంపైర్కు రిఫర్ చేయగా రిప్లేలో శశాంక్ బ్యాట్ క్రీజుకు వెలుపుల ఉన్నట్లు కన్పించింది.దీంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. అయితే శశాంక్ నిర్లక్ష్యంగా పరిగెత్తడంతోనే ఔటయ్యాడు. కనీసం డైవ్ చేసి ఉన్నా ఔటయ్యే ప్రమాదం నుంచి ఈ పంజాబ్ ఆటగాడు తప్పించుకుని ఉండేవాడు. కీలకమైన సమయంలో శశాంక్ నిర్లక్ష్యంగా రనౌట్ కావడమే అయ్యర్ అగ్రహానికి కారణమైంది.చదవండి: IPL 2025: శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐAfter the match is over, Shreyas Iyer is saying something angrily to Shashank Singh, tell me what is he saying?#shreyashiyar |#ShashankSingh #IPLPlayoffs |#PBKSvsMI pic.twitter.com/Eo7s7YHSgn— Irfan isak shaikh (@irfan_speak786) June 1, 2025 -
శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ..
ఐపీఎల్-2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడే జట్టు ఏదో తేలిపోయింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్.. తుది పోరుకు ఆర్హత సాధించింది.మంగళవారం(జూన్ 3)న జరగనున్న ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ తొలి టైటిల్ కోసం అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. గెలుపు జోష్లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ అయ్యర్కు బీసీసీఐ జరిమానా విధించింది. ఈ ఏడాది సీజన్లో పంజాబ్ స్లో ఓవర్ రేట్ను నమోదు చేయడం ఇది రెండోసారి. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం అయ్యర్కు రూ.24 లక్షల ఫైన్ విధించారు. "శ్రేయస్ అయ్యర్కు జరిమానా విధించాం. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది రెండో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం శ్రేయస్కు రూ. 24 లక్షలు ఫైన్ వేశాము.మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఇందులో ఏది తక్కువైతే అది జరిమానా విధించడం జరిగింది’ అని ఐపీఎల్ అధికారులు వెల్లడించారు. కాగా ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 19 ఓవర్లలోనే చేధించింది.చదవండి: అతడొక అత్యద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్ -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పంజాబ్.. 11 ఏళ్ల తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్లు) ఆజేయంగా నిలిచి తన జట్టును ఫైనల్కు చేర్చాడు. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.18 ఏళ్లలో ఒకే ఒక్కడు..18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మూడు వేర్వేరు జట్లను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్గా శ్రేయస్ రికార్డులకెక్కాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తన ఐపీఎల్ కెరీర్ను ప్రారంభించిన శ్రేయస్.. 2020 సీజన్లో కెప్టెన్గా ఢిల్లీ జట్టును ఫైనల్కు చేర్చాడు. దురుదృష్టవశాత్తూ ఆఖరి మెట్టుపై ఢిల్లీ బోల్తా పడింది. అనంతరం ఐపీఎల్-2024 సీజన్లో శ్రేయస్ కెప్టెన్గా కోల్కతా నైట్రైడర్స్ను ఫైనల్కు తీసుకెళ్లడమే కాకుండా టైటిల్ కూడా అందించాడు. ఇప్పుడు పంజాబ్ను ఫైనల్కు చేర్చి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుది పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.చదవండి:అతడొక అత్యుద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్ -
క్వాలిఫయర్-2లో ముంబైపై పంజాబ్ ఘనవిజయం
-
PBKS VS MI, Qualifier 2: ఫైనల్లో పంజాబ్ కింగ్స్
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఫైవ్స్టార్ చాంపియన్లు (ముంబై, చెన్నై), మూడుసార్లు విజేత (కోల్కతా)ను చూసిన ఫ్యాన్స్ ఈ సీజన్లో కొత్త చాంపియన్ను చూడబోతున్నారు. తొలి క్వాలిఫయర్లో తేలిపోయిన పంజాబ్ కింగ్స్ రెండో క్వాలిఫయర్లో జూలు విదిల్చింది. 11 ఏళ్ల తర్వాత (2014) ఐపీఎల్లో ఫైనల్కు చేరింది. ఆదివారం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఇంటికి పంపింది. రేపు జరిగే ఫైనల్లో బెంగళూరు, పంజాబ్ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం తలపడతాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్లు), ఠాకూర్ తిలక్ వర్మ (29 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు), నమన్ ధీర్ (18 బంతుల్లో 37; 7 ఫోర్లు) దంచేశారు. అజ్మ తుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి గెలిచింది. నాయకుడు శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్లు) జట్టు గెలిచేదాకా నడిపించాడు. నేహల్ వధేరా (29 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. గెలిపించిన అయ్యర్ పంజాబ్కు అంతపెద్ద లక్ష్యం ఛేదించడానికి అవసరమైన శుభారంభం దక్కలేదు. మూడో ఓవర్లో ప్రభ్సిమ్రన్ (6), కాసేపటికే ప్రియాన్ష్ ఆర్య (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుకు చుక్కెదురైంది. దీంతో పవర్ప్లేలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన 64/2 స్కోరు చేసింది. ఇన్గ్లిస్ (21 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేసే ఆటను పాండ్యా అడ్డుకున్నాడు. దీంతో 72 పరుగులకే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నేహల్ వాధేరా జట్టు స్కోరును వంద దాటించారు. 12 ఓవర్లలో 109/3 స్కోరు చేసిన పంజాబ్... విజయానికి 48 బంతుల్లో 95 పరుగులు కష్టమనిపించింది. టాప్లీ 13వ ఓవర్లో అయ్యర్ కొట్టిన వరుస 3 సిక్స్లు, ఆ వెంటనే బౌల్ట్ బౌలింగ్లో వాధేరా కొట్టిన బౌండరీలతో ఈ రెండు ఓవర్లలోనే 33 పరుగులు సాధించడంతో కింగ్స్ రేసులో పడింది. నాలుగో వికెట్కు 84 పరుగులు జోడించాక వాధేర అవుటయ్యాడు. శశాంక్ (2) రనౌటైనా... 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అయ్యర్ భారీ సిక్స్లతో కింగ్స్ను గెలిపించాడు. దంచేసిన తిలక్, సూర్య రోహిత్ (8), బెయిర్స్టో (38)ల తర్వాత తిలక్, సూర్యకుమార్ అడపాదడపా మెరుపులతో జట్టు స్కోరు 10 ఓవర్లలో 100 పరుగులు దాటింది. ఈ జోడీ నిలబడి దూకుడు పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి. చహల్ ఓవర్లో సిక్సర్ బాదిన సూర్యకుమార్... జేమీసన్ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. ఇదే జోరుతో 4, 6 కొట్టిన అతన్ని చహల్ అవుట్ చేయడంతో మూడో వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లోనే తిలక్ను జేమీసన్ పెవిలియన్ చేర్చాడు. అయితే నమన్ ధీర్ ధనాధన్ బౌండరీలతో ఓవర్కు సగటున 10 రన్రేట్తో ముంబై స్కోరు దూసుకెళ్లింది. ఆఖరి ఓవర్లో నమన్ అవుట్ కాగా జట్టు 200 మార్క్ దాటింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) వైశాక్ (బి) స్టొయినిస్ 8; బెయిర్స్టో (సి) ఇన్గ్లిస్ (బి) వైశాక్ 38; తిలక్ వర్మ (సి) ప్రియాన్ష్ (బి) జేమీసన్ 44; సూర్యకుమార్ (సి) వధేరా (బి) చహల్ 44; హార్దిక్ పాండ్యా (సి) ఇన్గ్లిస్ (బి) అజ్మతుల్లా 15; నమన్ (సి) స్టొయినిస్ (బి) అజ్మతుల్లా 37; రాజ్ (నాటౌట్) 8; సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–19, 2–70, 3–142, 4–142, 5–180, 6–197. బౌలింగ్: అర్‡్షదీప్ సింగ్ 4–0–44–0, జేమీసన్ 4–0–30–1, స్టొయినిస్ 1–0–14–1, అజ్మతుల్లా 4–0–43–2, వైశాక్ 3–0–30–1, చహల్ 4–0–39–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) హార్దిక్ (బి) అశ్వని 20; ప్రభ్సిమ్రన్ (సి) టాప్లీ (బి) బౌల్ట్ 6; ఇన్గ్లిస్ (సి) బెయిర్స్టో (బి) హార్దిక్ 38; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 87; వధేరా (సి) సాంట్నర్ (బి) అశ్వని 48; శశాంక్ (రనౌట్) 2; స్టొయినిస్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–13, 2–55, 3–72, 4–156, 5–173. బౌలింగ్: బౌల్ట్ 4–0–38–1, టాప్లీ 3–0– 40–0, బుమ్రా 4–0–40–0, అశ్వని 4–0–55–2, సాంట్నర్ 2–0–15–0, పాండ్యా 2–0–19–1. -
IPL 2025 Qualifier 2, PBKS VS MI: మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి..?
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (జూన్ 1) పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు వరుస విరామాల్లో అడ్డుపడుతున్నాడు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి మ్యాచ్ 9 గంటల వరకు ప్రారంభం కాలేదు. 9 గంటల ప్రాంతంలో వర్షం జోరుగా కురుస్తుంది. 9:30 గంటల లోపు మ్యాచ్ ప్రారంభమైతేనే ఎలాంటి ఓవర్ల కోత లేకుండా మ్యాచ్ జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓవర్ల కోత లేకుండా మ్యాచ్ జరిగేలా లేదు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో లేని వర్షం మ్యాచ్ ప్రారంభ సమయానికి జోరందుకుంది.మ్యాచ్ రద్దైతే ఏంటి పరిస్థితి..?ఒకవేళ ఈ మ్యాచ్ పూర్తిగా రద్దైతే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటం చేత పంజాబ్ కింగ్స్ ఫైనల్కు చేరుతుంది. ప్లే ఆఫ్స్లో మ్యాచ్లకు రిజర్వ్ డే లేదు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందేమో చూడాలి.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ముంబై తరఫున గ్లీసన్ స్థానంలో రీస్ టాప్లే.. పంజాబ్ తరఫున హర్ప్రీత్ బ్రార్ స్థానంలో చహల్ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీఇంపాక్ట్ సబ్స్: అశ్వని కుమార్, కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవోన్ జాకబ్స్ -
PBKS VS MI, Qualifier 2 Updates: ముంబైపై పంజాబ్ విజయం
ఫైనల్లో పంజాబ్19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి ఫైనల్కు చేరిన పంజాబ్ కింగ్స్.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్169 పరుగుల వద్ద పంజాబ్ తన 5వ వికెట్ (షశాంక్) కోల్పోయింది.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ 156 పరుగుల వద్ద పంజాబ్ తన 4వ వికెట్ (నెహాల్) కోల్పోయింది.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ 72 పరుగుల వద్ద పంజాబ్ తన 3వ వికెట్ (జోష్) కోల్పోయింది.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్55 పరుగుల వద్ద పంజాబ్ తన 2వ వికెట్ (ప్రియాన్ష్) కోల్పోయింది.మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్3వ ఓవర్లో పంజాబ్ కింగ్స్ తన మొదటి వికెట్ కోల్పోయింది.పంజాబ్ టార్గెట్ 204 పరుగులుముంబై ఇండియన్స్ తమ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేశారు. దాంతో పంజాబ్కు 204 పరుగులు టార్గెట్గా నిర్దేశించారు.ఆరో వికెట్ కోల్పోయిన ముంబైచివరి ఓవర్లో ముంబై ఇండియన్స్ 6వ వికెట్ కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేశారుఐదో వికెట్ కోల్పోయిన ముంబై17.6వ ఓవర్- 180 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. అజ్మతుల్లా బౌలింగ్లో హార్దిక్ పాండ్యా (15) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై14.1వ ఓవర్- 142 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో తిలక్ వర్మ (44) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్తిలక్ వర్మ (43), సూర్యకుమార్ యాదవ్ (26) ధాటిగా ఆడుతున్నారు. ఫలితంగా ముంబై 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన ముంబై6.6వ ఓవర్- 70 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో జోస్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి జానీ బెయిర్స్టో (38) ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ /1జానీ బెయిర్స్టో 24, తిలక్ వర్మ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్2.2వ ఓవర్- 19 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్లో వైశాఖ్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (8) ఔటయ్యాడు.రోహిత్ శర్మకు లైఫ్1.5వ ఓవర్- రోహిత్ శర్మకు రెండో ఓవర్లోనే లైఫ్ లభించింది. జేమీసన్ బౌలింగ్లో ఒమర్జాయ్ కాస్త కష్టతరమైన క్యాచ్ డ్రాప్ చేశాడు. 9:45 గంటలకు ప్రారంభమైన మ్యాచ్.. ఎలాంటి ఓవర్ల కోత లేదువర్షం కారణంగా 2 గంటల 15 నిమిషాలు ఆలస్యమైన మ్యాచ్ ఎట్టకేలకు 9:45 గంటలకు ప్రారంభమైంది. ఆలస్యంగా ప్రారంభమైనా ఓవర్లలో ఎలాంటి కోత లేదు. తొలి ఇన్నింగ్స్ 11:15 గంటల వరకు జరుగుతుంది. ఇన్నింగ్స్ విరామ సమయాన్ని 10 నిమిషాలకే కుదించారు. 11:25 గంటలకు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది. 12:55 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో ఇవాళ (జూన్ 1) క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ముంబై తరఫున గ్లీసన్ స్థానంలో రీస్ టాప్లే.. పంజాబ్ తరఫున చహల్ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీఇంపాక్ట్ సబ్స్: అశ్వని కుమార్, కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవోన్ జాకబ్స్ -
ఫైనల్స్ కి చేరేదెవరు?
-
నేడు IPL 18వ సీజన్ లో మరో ఆసక్తికర పోరు
-
IPL 2025 Qualifier 2: పంజాబ్కు గుడ్ న్యూస్.. ముంబైకి బ్యాడ్ న్యూస్?
ఐపీఎల్-2025లో క్వాలిఫయర్-2కు సమయం అసన్నమైంది. ఆదివారం సెకెండ్ క్వాలిఫయర్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ కీలక మ్యాచ్కు పంజాబ్ కింగ్స్కు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమైన యుజ్వేంద్ర చాహల్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో క్వాలిఫయర్-2కు చాహల్ అందుబాటులో ఉండనున్నాడని రేవ్స్పోర్ట్స్ తమ రిపోర్ట్లో పేర్కొంది. కాగా చాహల్ గాయం నుంచి కోలుకుపోవడం పంజాబ్కు కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో చాహల్ పంజాబ్ జట్టుకు ప్రధాన స్పిన్నర్గా ఉన్నాడు. ఓ హ్యాటిక్ కూడా అతడి ఖాతాలో ఉంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన చాహల్.. 9.56 ఏకానమితో 14 వికెట్లు పడగొట్టాడు.చాహర్ డౌటే..మరోవైపు ఈ మ్యాచ్కు కూడా ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ అందుబాటులో ఉండేది అనుమానమే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చాహర్.. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ కోచింగ్ స్టాప్, కోచ్ మహేల జయవర్ధనేతో కలిసి ఫిట్నెస్ కసరత్తులు చేస్తున్నట్లు రేవ్స్పోర్ట్స్ తమ కథనంలో రాసుకొచ్చింది. కానీ అతడు ఇంకా కుంటుతున్నట్లు సదరు వెబ్సైట్ రాసుకొచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్కు చాహర్ దూరమైతే.. యువ పేసర్ అశ్వినీ కుమార్కు మరోసారి అవకాశం లభించనుంది.తుది జట్లు(అంచనా)పంజాబ్ కింగ్స్ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, కైల్ జామీసన్, చాహల్ముంబై ఇండియన్స్రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్ -
MI Vs PBKS: ఫైనల్ చేరేదెవరో!
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటికే ఫైనల్ చేరగా... రెండో ఫైనలిస్ట్ను తేల్చే సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం క్వాలిఫయర్–2లో ముంబై ఇండియన్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. క్వాలిఫయర్–1లో బెంగళూరు చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పంజాబ్... ఈ పోరులో సత్తా చాటి ఫైనల్లో మరోసారి బెంగళూరును ఎదుర్కోవాలని భావిస్తోంది. మరో వైపు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి... ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ను చిత్తుచేసిన ముంబై ఇదే జోరులో పంజాబ్పై గెలిచి ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. క్వాలిఫయర్–1లో టాపార్డర్ విఫలమవడంతో పంజాబ్ 101 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి మూటగట్టుకోగా... ఎలిమినేటర్లో గుజరాత్ బౌలింగ్ను ఓ ఆటాడుకుంటూ ముంబై భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ విజయం సాధించింది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ సమష్టి ప్రదర్శన ముందు... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన పంజాబ్ కింగ్స్ ఏమాత్రం నిలుస్తుందో చూడాలి! టాపార్డర్ రాణిస్తేనే... ఈ సీజన్లో ఆడిన 15 మ్యాచ్ల్లో ఏడింట రెండొందల పైచిలుకు స్కోర్లు చేసిన పంజాబ్ జట్టు... టాపార్డర్ ప్రదర్శనపై అతిగా ఆధారపడుతోంది. అన్క్యాప్డ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య నిలకడకు ఇన్గ్లిస్, శ్రేయస్ మెరుపులు తోడవడంతో పంజాబ్ వరస విజయాలు సాధించగలిగింది. అయితే సొంతగడ్డపై జరిగిన క్వాలిఫయర్–1లో మాత్రం ఈ నలుగురు మూకుమ్మడిగా విఫలమవడంతో... జట్టు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లను ‘ప్లే ఆఫ్స్’కు చేర్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి... రికీ పాంటింగ్ వ్యూహాలు తోడవడంతో ఈ సీజన్లో పంజాబ్ పట్టికలో అగ్ర స్థానం దక్కించుకోగలిగింది. దీంతోనే క్వాలిఫయర్–1లో ఓడినా... ఫైనల్ చేరేందుకు మరో అవకాశం దక్కింది. ఈ సీజన్లో ప్రభ్సిమ్రన్ 517 పరుగులతో పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు సాధించగా... శ్రేయస్ 516, ప్రియాన్ష్ 431 పరుగులు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఇన్గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్ సత్తాచాటాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్ల్లో బరిలోకి దిగని స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఈ మ్యాచ్ ఆడటం ఖాయమే. బౌలింగ్లో అర్ష్ దీప్ సింగ్, అజ్మతుల్లా, జెమీసన్, హర్ప్రీత్ బ్రార్ కీలకం కానున్నారు. గత మ్యాచ్ తప్పిదాలను సరిదిద్దుకోకపోతే... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ ఇక్కడితోనే ప్రయాణాన్ని ముగించాల్సి ఉంటుంది. బుమ్రానే ప్రధాన తేడా! ఐపీఎల్ నాకౌట్స్లో అపార అనుభవం ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి కలిసికట్టుగా కదంతొక్కి ఆరో టైటిల్ వేటకు చేరాలని చూస్తోంది. పలువురు ఆటగాళ్ల సేవలు కోల్పోయినా... వారి స్థానాలను భర్తిచేసే ఆటగాళ్లు ఉండటం ముంబైకి కలిసి రానుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత రికెల్టన్, విల్ జాక్స్ జట్టును వీడినా... గత మ్యాచ్లో తొలిసారి ముంబై జట్టుకు ప్రాతనిధ్యం వహించిన జానీ బెయిర్స్టో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కూడా టచ్లోకి రావడం ముంబై బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచింది. రోహిత్, బెయిర్స్టో జట్టుకు శుభారంభం అందిస్తుంటే... సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఈ సీజన్లో 673 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఆలస్యంగా వేగం పుంజుకున్న రోహిత్ 410 పరుగులు చేయగా... హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ ఫినిషర్ల పాత్ర పోషిస్తున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్కు కూడా దీపక్ చహర్ అందుబాటులో ఉండటం కష్టమే కాగా... గత మ్యాచ్ చివర్లో కండరాలు పట్టేసిన గ్లీసన్ బరిలోకి దిగుతాడా లేదా చూడాలి. ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రా కానున్నాడు. ఆశలే లేని స్థితిలో సైతం తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉన్న బుమ్రాను... పంజాబ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, జోస్ ఇన్గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, హర్ప్రీత్ బ్రార్, జెమీసన్, చాహల్, అర్ష్ దీప్. ముంబై ఇండియన్స్: హార్దిక్ (కెప్టెన్), రోహిత్ శర్మ, బెయిర్స్టో, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్, సాంట్నర్, రాజ్ బావా, గ్లీసన్, బుమ్రా, బౌల్ట్, అశ్వని కుమార్. పిచ్, వాతావరణం ఈ సీజన్లో అహ్మదాబాద్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరింట మొదట బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో టాస్ కీలక పాత్ర పోషించవచ్చు. మ్యాచ్కు వర్షం ముప్పులేదు. ఐపీఎల్లో నేడు (క్వాలిఫయర్–2)పంజాబ్ X ముంబైవేదిక: అహ్మదాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో -
Qualifier 2 PBKS vs MI: అలా జరిగితే ముంబై ఇండియన్స్ ఇంటికే?
ఐపీఎల్-2025లో క్వాలిఫయర్-2కు రంగం సిద్దమైంది. జూన్ 1(ఆదివారం) జరగనున్న సెకెండ్ క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. 2014 తర్వాత తొలిసారి ఫైనల్కు చేరుకునేందుకు పంజాబ్ ప్రయత్నిస్తుండగా.. ముంబై ఇండియన్స్ ఆరో ఐపీఎల్ టైటిల్ లక్ష్యంగా పెట్టుకుంది.క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు మొహాలీలోని ముల్లాన్పూర్ స్టేడియం ఆతిథ్యమివ్వగా.. ఇప్పుడు క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నాయి.క్వాలిఫయర్-2 రద్దు అయితే?ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ వర్షం లేదా ఏదైనా కారణం వల్ల రద్దు అయితే ఏంటి పరిస్థితి అని ఇరు జట్ల అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ మ్యాచ్కు బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించలేదు. దీంతో వర్షం లేదా వేరే ఇతర కారణం చేత మ్యాచ్ రద్దు అయితే.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్కు ఆర్హత సాధిస్తోంది. అంటే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఫైనల్లో అడుగుపెడుతోంది. ముంబై పాయింట్ల టేబుల్లో నాలుగో స్ధానంలో ఉంది. అయితే వర్షం ముప్పు పొంచిలేదు. వెధర్.కామ్ ప్రకారం.. 24 శాతం మాత్రమే వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. దీంతో మ్యాచ్ సజావుగా జరిగనుంది. కాగా ఫైనల్ మ్యాచ్ మాత్రం బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించింది. జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.తుది జట్లు(అంచనా)ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో (వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మచదవండి: రిలాక్స్.. నా పని నాకు బాగా తెలుసు: కోచ్ మాట వినని బుమ్రా -
పంజాబ్ ఓటమి.. పాపం.. చాహల్ గర్ల్ఫ్రెండ్ రియాక్షన్ చూశారా?
ఇటీవల ఆర్జే మహ్వశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నుంచే ఆమె పేరు తెగ వైరలవుతోంది. ఎందుకంటే టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో ఆమె కనిపించడమే ప్రధాన కారణం. దుబాయ్లో వీరిద్దరు జంటగా మెరవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆర్జే మహ్వశ్పైనే పడింది. ఇంతకీ చాహల్తో ఉన్న ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీశారు. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారేమో అంటూ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్లకు హాజరు కావడంతో డేటింగ్ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురువారం ఐపీఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్కు కూడా హాజరైంది. మొదటి నుంచి ఈ సీజన్లో చాహల్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆర్జే మహ్వశ్ మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో తుది జట్టులో చాహల్ లేకపోయినప్పటికీ ఆమె స్టేడియంలో సందడి చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలవ్వడంచో ఆర్జే మహ్వశ్ తీవ్ర నిరాశకు గురైంది. ఆనందంగా మ్యాచ్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఆమెకు పంజాబ్ ఓడిపోవడంతో అప్సెట్ అయినట్లు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. యుజ్వేంద్ర చాహల్ వేలు గాయం కారణంగా పంజాబ్ చివరి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.ఆర్జే మహ్వశ్- చాహల్ డేటింగ్ రూమర్స్..యుజ్వేంద్ర చాహల్ తన భార్య కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ నుంచి మార్చిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాహల్ -ఆర్జే మహ్వశ్ జంటగా కనిపించడంతో డేటింగ్ వార్తలొచ్చాయి. అయితే ఆర్జే మహవాష్ తాము కేవలం స్నేహితులమని స్పష్టం చేసింది. చాహల్ తన భార్యతో విడాకుల తర్వాత ఆర్జే మహ్వశ్తో అనేక సందర్భాల్లో జంటగా కనిపించారు. आज #RCBvsPBKS मैच का दो फोटो सबसे ज्यादा सुर्खियों में है।First Virat Kohli and Anushka Sharma Second Shubhankar mishra and Rj mahvashRCB INTO THE FINALS Congratulations RCB#IPLPlayoffs #Qualifier1 pic.twitter.com/T1agohOxUG— Chandan Yadav (@ChandankryadavN) May 29, 2025 -
'నీ ఈగోను జేబులో పెట్టుకో శ్రేయస్'.. పంజాబ్ కెప్టెన్పై మూడీ ఫైర్
ఐపీఎల్-2025 క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్కు ఘోర పరాభవం ఎదురైంది. గురువారం ముల్లాన్పూర్ వేదికగా ఆర్సీబీతో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు విల్లవిల్లాడారు.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 101 పరుగులకే ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ పది ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో దారుణ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ విమర్శల వర్షం కురిపించారు.పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయడం నేర్చుకో అయ్యర్ అంటూ ఆయన మండిపడ్డారు. కాగా కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బాధ్యతాయుతంగా ఆడాల్సిన శ్రేయస్.. హాజిల్వుడ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి వికెట్ కీపర్కు దొరికిపోయాడు. శ్రేయస్ కేవలం రెండు 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు.అదేవిధంగా టీ20ల్లో అయ్యర్పై హాజిల్వుడ్కు మంచి రికార్డు ఉంది. ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ అయ్యర్ను నాలుగు సార్లు టీ20ల్లో ఔట్ చేశాడు. అయినప్పటికి అతడి బౌలింగ్లో నిర్లక్ష్యంగా షాట్ ఆడి అయ్యర్ ఔటయ్యాడని మూడీ వంటి దిగ్గజాలు విమర్శలు గుప్పిస్తున్నారు."శ్రేయస్ అయ్యర్ పరిస్థితులకు తగ్గట్టు ఏ మాత్రం ఆడలేదు. కెప్టెన్గా తన బాధ్యతను కూడా మర్చిపోయాడు. గతంలో చాలా సార్లు తనను హాజిల్వుడ్ ఔట్ చేశాడని అయ్యర్కు బాగా తెలుసు. అయినప్పటికి జాగ్రత్తగా ఆడకుండా ఈగోకి పోయి తన వికెట్ను సమర్పించుకున్నాడు. కొన్నిసార్లు మన అహాన్ని జేబులో పెట్టుకుని ముందుకు సాగాలి. అప్పుడే విజయాలు సాధించగలము" అని మూడీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సీజన్ అసాంతం తన కెప్టెన్సీ, బ్యాటింగ్తో ఆకట్టుకున్న శ్రేయస్.. కీలకమైన మ్యాచ్లో మాత్రం విఫలమై విమర్శలను ఎదుర్కొంటున్నాడు. -
నేను సాకులు చెప్పను.. యుద్దం ఇంకా ముగియలేదు: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్-2025లో గురువారం ముల్లాన్పుర్ వేదికగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన పంజాబ్.. 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఫైనల్ చేరేందుకు ఇప్పుడు క్వాలిఫయర్-2లో తలపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలోనే కేవలం 101 పరుగులకే కుప్పకూలింది.స్టోయినిష్(26) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమిపాలైమని అయ్యర్ అంగీకరించాడు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు."ఈ రోజును అంతవేగంగా మర్చిపోలేము. డ్రెస్సింగ్ రూమ్కు తిరిగి వెళ్లి తప్పు ఎక్కడ జరిగిందో చర్చిస్తాము. ఏదేమైనప్పటికీ ఒక బ్యాటింగ్ యూనిట్గా తీవ్ర నిరాశపరిచాము. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాయు. అయితే కెప్టెన్గా నేను తీసుకున్న నిర్ణయాలపై నాకు ఎటువంటి సందేహం లేదు. మైదానంలో గానీ, మైదానం వెలుపల గానీ మేము అన్ని ఆలోచించాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటాము. ఈ మ్యాచ్లో మాత్రం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. అలా అని బౌలర్లను కూడా తప్పుబట్టలేము. ఎందుకంటే మా బౌలర్లు డిఫెండ్ చేసుకోవడానికి ఈ టోటల్ సరిపోదు. ముల్లాన్పూర్ పిచ్ను మేము సరిగ్గా అంచనా వేయలేకపోయాము. ఈ వికెట్పై బ్యాటింగ్ పరంగా మరింత ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది. ఈ మైదానంలో మేము ఆడిన మూడు మ్యాచ్లలోనూ బౌన్స్ ఎక్కువగా ఉంది. అయితే మేము ప్రొఫెషనల్ క్రికెటర్లు కాబట్టి, ఇటువంటి సాకులు చెప్పాలని అనుకోవడం లేదు. పరిస్థితులు ఎలా ఉన్న అందుకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాలి. ఇది చిన్న ఓటమి మాత్రమే.. యుద్దం ఇంకా పూర్తిగా ముగియలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో అయ్యర్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: ఏంటి కోహ్లి ఇది.. నీ స్దాయికి ఇది తగునా? ఫ్యాన్స్ కౌంటర్ -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి జట్టుగా రికార్డు
తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్-2025లో ఫైనల్ బెర్త్ను ఆర్సీబీ ఖారారు చేసుకుంది. గురువారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. నాలుగోసారి ఈ క్యాష్రిచ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్లో అద్బుతంగా రాణించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆర్సీబీ బౌలర్లు చెలరేగడంతో కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ ఇన్నింగ్స్లో మార్కస్ స్టోయినిస్ (17 బంతుల్లో 26 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 102 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఈ మ్యాచ్లో అద్బుత విజయం సాధించిన బెంగళూరు టీమ్ పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో ప్రత్యర్ధిని 15 ఓవర్లలోపే ఆలౌట్ చేసిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డులెక్కింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేదు.👉అదేవిధంగా ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్(20 ఓవర్ల ఫుల్ గేమ్)లో బంతులపరంగా అతిపెద్ద విజయాన్ని సాధించిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఈ మ్యాచ్ను ఆర్సీబీ 60 బంతులు మిగిలూండగానే ముగించింది. ఇంతకుముందు ఈ రికార్డు కోల్కతా నైట్రైడర్స్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024 ఫైనల్లో ఎస్ఆర్హెచ్పై 57 బంతులు మిగిలూండగానే కేకేఆర్ విజయం సాధించింది. తాజా మ్యాచ్తో కేకేఆర్ నైట్రైడర్స్ రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది.👉అయితే 2017 సీజన్లో ఎలిమినేటర్లో సన్రైజర్స్ హైదరాబాద్పై కేకేఆర్ కేవలం 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కానీ ఆ మ్యాచ్ను వర్షం కారణంగా ఆరు ఓవర్లకు కుదించారు. -
RCB Vs PBKS: నేను అతడికి పెద్ద అభిమానిని.. ఇంకా ఒకే ఒక మ్యాచ్: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుపెట్టింది. గురువారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి క్వాలిఫయర్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. తొమ్మిదేళ్ల తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆలౌటైంది.బెంగళూరు బౌలర్లలో సుయాష్ శర్మ, హాజిల్వుడ్ తలా మూడు వికెట్లు పడగొట్టి పంజాబ్ పతనాన్ని శాసించగా.. యశ్దయాల్ రెండు, షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్ తలా వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో స్టోయినిష్(26) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా..మయాంక్(19), కోహ్లి(12) పర్వాలేదన్పించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సుయాష్ శర్మపై రజత్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ మ్యాచ్లో స్పష్టమైన బౌలింగ్ ప్రణాళికలతో బరిలోకి దిగాము. మా ఫాస్ట్ బౌలర్లు పిచ్ కండీషన్స్ను బాగా ఉపయోగించుకున్నారు. ఇక సుయాష్ శర్మ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు బౌలింగ్ చేసిన విధానం ఒక అద్బుతం. చక్కటి లైన్ అండ్ లెంగ్త్లతో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేశాడు. కెప్టెన్గా అతడి బౌలింగ్పై నాకు ఒక క్లారిటీ ఉంది. స్టంప్స్ లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడమే అతడి బలం. సూయూష్ బౌలింగ్ను ఆర్దం చేసుకోవడం బ్యాటర్లకు చాలా కష్టం. నేనెప్పుడూ అతడిని కన్ఫ్యూజ్ చేయలేదు. ప్రతీ మ్యాచ్లోనూ అతడికి సపోర్ట్గా ఉన్నాము. ఈ క్రమంలో అతను కొన్ని పరుగులు ఇచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ టోర్నీ అసాంతం మేము చాలా మేము చాలా ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గోన్నాము. కాబట్టి ఒక రోజు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఇక ఫిల్ సాల్ట్ ప్రతీ మ్యాచ్లోనూ మాకు అద్బుతమైన ఆరంభాలను అందించాడు. ఈ మ్యాచ్లో మరోసారి తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. అతడికి నేను పెద్ద అభిమానిని. డగౌట్ నుంచి అతడి ఆటను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. చిన్నస్వామిలోనే కాదు మేము ఎక్కడికి వెళ్లినా మాకు సపోర్ట్గా నిలుస్తున్న ఆర్సీబీ అభిమానులకు ధన్యవాదాలు. మిమ్మల్ని మేము ప్రేమిస్తునే ఉంటాము, మీరు కూడా మాకు మద్దతు ఇస్తూ ఉండండి. మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఆ తర్వాత కలిసి సెలబ్రేట్ చేసుకుందాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో పాటిదార్ పేర్కొన్నాడు.చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు... -
పంజాబ్ను మట్టికరిపించిన పాటీదార్ సేన.. ఫైనల్కు దూసుకెళ్లిన ఆర్సీబీ (ఫొటోలు)
-
తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు...
ఐపీఎల్ ప్రారంభమైన నాటినుంచి తొలి టైటిల్ కోసం పోరాడుతూనే ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... ఈ సీజన్లో ట్రోఫీ దిశగా మరో ముందడుగు వేసింది. బౌలర్లు విజృంభించడంతో క్వాలిఫయర్–1లో పంజాబ్పై ఏకపక్ష విజయం సాధించిన బెంగళూరు... తొమ్మిదేళ్ల తర్వాత నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. హాజల్వుడ్ పేస్తో బెంబేలెత్తిస్తే... సుయాశ్ శర్మ గూగ్లీలతో పంజాబ్ పనిపట్టాడు. ఈ సీజన్లో ప్రధానంగా టాప్–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడ్డ పంజాబ్.. ఆ ముగ్గురు మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో ఓటమి పాలైంది. ముల్లాన్పూర్: సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) క్వాలిఫయర్–1లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ఐపీఎల్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తుచేసి తుదిపోరుకు చేరింది. బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టగా... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం వైపు నిలిచింది. మొదట పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ స్టొయినిస్ (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... ప్రభ్సిమ్రన్ సింగ్ (18), అజ్మతుల్లా ఓమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (2)తో పాటు ప్రియాన్ష్ ఆర్య (7), జోష్ ఇన్గ్లిస్ (4), నేహల్ వధేరా (8), శశాంక్ సింగ్ (3), ముషీర్ ఖాన్ (0) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సుయాశ్ శర్మ, హాజల్వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... యశ్ దయాళ్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో బెంగళూరు 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (12; 2 ఫోర్లు) త్వరగానే అవుట్ అయినా... ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుదిపోరులో క్వాలిఫయర్–2 విజేతతో బెంగళూరు ట్రోఫీ కోసం తలపడనుంది. ఒకరి వెంట ఒకరు... టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు శుభారంభం దక్కలేదు. ఈ సీజన్లో మెరుగైన ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు ప్రియాన్ష్ ప్రభ్సిమ్రన్ కీలక పోరులో ఆకట్టుకోలేకపోయారు. యశ్ దయాళ్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి ప్రియాన్ష్ సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా... భువనేశ్వర్ వేసిన మరుసటి ఓవర్లో రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చిన ప్రభ్సిమ్రన్ అదే జోరులో మరో షాటే ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 3 బంతులే ఆడి అవుట్ అయ్యాడు. హాజల్వుడ్ బంతిని కట్ చేసే ప్రయత్నంలో కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. హాజల్వుడ్ తన మరుసటి ఓవర్లో ఇన్గ్లిస్ను కూడా బుట్టలో వేసుకోగా... నేహల్ వధేరా ఇలా వచ్చి అలా వెళ్లాడు. స్టొయినిస్ కొన్ని షాట్లతో ఇన్నింగ్స్ను నడిపించే ప్రయత్నం చేసినా అతడికి సహాకారం అందించేవాళ్లే కరువయ్యారు. సుయాశ్ గూగ్లీని అర్థం చేసుకోలేక శశాంక్ క్లీన్ బౌల్డ్ కాగా... ఇంపాక్ట్ ప్లేయర్గా అనూహ్య అవకాశం దక్కించుకున్న ముషీర్ ఖాన్ ఐపీఎల్ అరంగేట్రంలో డకౌట్గా వెనుదిరిగాడు. బ్యాటర్లు వరసగా విఫలమవుతుండటంతో... ముషీర్కు తుది జట్టులో చోటు దక్కగా... ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే అతడు అవుట్అయ్యాడు. తన తదుపరి ఓవర్లో స్టొయినిస్ను కూడా సుయాశ్ పెవిలియన్కు పంపడంతో పంజాబ్ పనైపోయింది. ఆఖర్లో అజ్మతుల్లా విలువైన పరుగులు చేసి జట్టు స్కోరును వంద పరుగుల మార్క్ దాటించాడు. ఆడుతూ పాడుతూ.. బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభానికి ముందే పంజాబ్ పరాజయం ఖాయమైపోగా... నాలుగో ఓవర్లో కోహ్లిని ఔట్ చేసి జెమీసన్ కాస్త ఆసక్తి రేపినా... సాల్ట్ విజృంభణతో ఎలాంటి సంచలనానికి అవకాశం లేకుండా పోయింది. మూడో ఓవర్లో 4, 6 కొట్టిన సాల్ట్... ఐదో ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. జెమీసన్ ఓవర్లో వరసగా 4, 4, 6 కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 61/1తో నిలిచింది. మయాంక్ అగర్వాల్ (19; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రజత్ పాటీదార్ (15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. 23 బంతుల్లో సాల్ట్ హాఫ్సెంచరీ పూర్తి చేసుకోగా... భారీ సిక్స్తో పాటీదార్ మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) కృనాల్ (బి) దయాళ్ 7; ప్రభ్సిమ్రన్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 18; ఇన్గ్లిస్ (సి) భువనేశ్వర్ (బి) హాజల్వుడ్ 4; శ్రేయస్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 2; నేహల్ (బి) దయాళ్ 8; స్టొయినిస్ (బి) సుయాశ్ 26; శశాంక్ (బి) సుయాశ్ 3; ముషీర్ (ఎల్బీ) (బి) సుయాశ్ 0; అజ్మతుల్లా (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 18; హర్ప్రీత్ (బి) షెఫర్డ్ 4; జెమీసన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లలో ఆలౌట్) 101. వికెట్ల పతనం: 1–9, 2–27, 3–30, 4–38, 5–50, 6–60, 7–60, 8–78, 9–97, 10–101. బౌలింగ్: భువనేశ్వర్ 2–0–17–1; యశ్ దయాళ్ 4–0–26–2; హాజల్వుడ్ 3.1–0–21–3; సుయాశ్ శర్మ 3–0–17–3; కృనాల్ పాండ్యా 1–0–10–0, రొమారియో షెఫర్డ్ 1–0–5–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (నాటౌట్) 56; కోహ్లి (సి) ఇన్గ్లిస్ (బి) జెమీసన్ 12; మయాంక్ (సి) శ్రేయస్ (బి) ముషీర్ 19; రజత్ పాటీదార్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు: 4; మొత్తం (10 ఓవర్లలో 2 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–30, 2–84. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 2–0–20–0; జెమీసన్ 3–1–27–1; అజ్మతుల్లా 1–0–10–0; హర్ప్రీత్ బ్రార్ 2–0–18–0; ముషీర్ ఖాన్ 2–0–27–1. -
IPL 2025: పంజాబ్ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ
ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పంజాబ్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో రేపు (మే 30) జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో (గుజరాత్ వర్సెస్ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పాటిదార్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు.అతి పెద్ద విజయంఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో బంతుల పరంగా ఆర్సీబీ అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ మరో 60 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో ఈ రికార్డు కేకేఆర్ పేరిట ఉండేది. 2024 సీజన్ ఫైనల్లో కేకేఆర్ ఎస్ఆర్హెచ్పై 57 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.నాలుగోసారి..తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ అవుతుంది. ఆర్సీబీ 2009, 2011, 2016 సీజన్లలో కూడా ఫైనల్కు చేరింది. అయితే మూడు సందర్భాల్లో ఈ జట్టుకు ఓటమే ఎదురైంది. -
IPL 2025, Qualifier 1: ప్లే ఆఫ్స్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పంజాబ్
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో అతి తక్కువ ఓవర్లు ఆడిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉండేది. 2008 సీజన్లో ఢిల్లీ 16.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ చేసిన 101 పరుగుల స్కోర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోర్గానూ రికార్డైంది.ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో అత్యల్ప స్కోర్లు..82 - డెక్కన్ ఛార్జర్స్ vs RCB, DY పాటిల్, 2010 (3వ స్థానం ప్లేఆఫ్)87 - DC vs RR, ముంబై, 2008 SF101 - LSG vs MI, చెన్నై, 2023 ఎలిమినేటర్101 - PBKS vs RCB, ముల్లన్పూర్, క్వాలిఫైయర్ 1*104 - డెక్కన్ ఛార్జర్స్ vs CSK, DY పాటిల్, 2010 SFకాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 30 పరుగుల వద్ద కోహ్లి (12) వికెట్ కోల్పోయింది. 4 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 30/1గా ఉంది. సాల్ట్ (14), మయాంక్ అగర్వాల్ (0) క్రీజ్లో ఉన్నారు. -
IPL 2025, Qualifier 1: అరుదైన రికార్డు సాధించిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్
ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్లో 18 పరుగులకే ఔటైన ప్రభ్సిమ్రన్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఓ ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు పూర్తి చేసిన ఆరో అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్ తొలి సీజన్లో పంజాబ్కే చెందిన షాన్ మార్ష్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కాగా.. 2018లో సూర్యకుమార్ యాదవ్ (ఎంఐ), 2020 సీజన్లో ఇషాన్ కిషన్ (ఎంఐ), 2023 సీజన్లో యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్), 2024 సీజన్లో రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్) ఈ ఘనత సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా రికార్డుల్లో ఉన్నారు. ఈ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన ప్రభ్సిమ్రన్ 517 పరుగులు చేశాడు. ఈ సీజన్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 500 పరుగుల మార్కును దాటాడు (15 మ్యాచ్ల్లో 516 పరుగులు).ఇదిలా ఉంటే, ఆర్సీబీతో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ దాదాపుగా చేతులెత్తేసింది. ఈ జట్టు 13 ఓవర్లలో కేవలం 92 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశారు. సుయాశ్ శర్మ 3, జోష్ హాజిల్వుడ్, యశ్ దయాల్ తలో 2, భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 7, ప్రభ్సిమ్రన్ సింగ్ 18, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, మార్కస్ స్టోయినిస్ 26, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0 పరుగులకు ఔట్ కాగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడినా మరో అవకాశం (క్వాలిఫయర్-2) ఉంటుంది. -
IPL 2025, Qualifier 1: పంజాబ్పై ఆర్సీబీ ఘన విజయం
పంజాబ్పై ఆర్సీబీ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ఫైనల్కు చేరింది. పంజాబ్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో రేపు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో (గుజరాత్ వర్సెస్ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పాటిదార్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ7.5వ ఓవర్- 84 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ముషీర్ ఖాన్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్ (19) ఔటయ్యాడు. టార్గెట్ 102.. 30 పరుగుల వద్ద కోహ్లి ఔట్3.2వ ఓవర్- 102 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 30 పరుగుల వద్ద విరాట్ కోహ్లి (12) వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో జోస్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి విరాట్ ఔటయ్యాడు. రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. 78 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్10.3వ ఓవర్- 78 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్లో ప్రమాదకరంగా కనిపిస్తున్న మార్కస్ స్టోయినిస్ (26) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్8.5వ ఓవర్- 60 పరుగుల వద్ద పంజాబ్ ఏడో వికెట్ కోల్పోయింది. సుయాశ్ బౌలింగ్లో ముషీర్ ఖాన్ (0) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్8.2వ ఓవర్- 60 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్లో శశాంక్ సింగ్ (3) క్లీన్ బౌల్డయ్యాడు. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 6.3వ ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్లో నేహల్ వధేరా (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దయాల్, హాజిల్వుడ్ తలో 2, భువీ ఓ వికెట్ తీశారు. 38 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్5.1వ ఓవర్- 38 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్కు క్యాచ్ ఇచ్చి జోష్ ఇంగ్లిస్ (4) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్3.4వ ఓవర్- 30 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (2) ఔటయ్యాడు. ఇన్ ఫామ్ బ్యాటర్లు ప్రియాంశ్, ప్రభ్సిమ్రన్, శ్రేయస్ ఔట్ కావడంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్2.6వ ఓవర్- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఇన్ ఫామ్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (18) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్1.2వ ఓవర్- 9 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. యశ్ దయాల్ బౌలింగ్లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (7) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, స్టార్ బౌలర్ వచ్చేశాడుఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. పంజాబ్ తరఫున మార్కో జన్సెన్ స్థానంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ తరఫున స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ బరిలోకి దిగనున్నాడు. నువాన్ తుషార స్థానాన్ని జోష్ భర్తీ చేశాడు.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, కైల్ జామీసన్ఇంపాక్ట్ సబ్లు: విజయ్కుమార్ వైషాక్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్, జేవియర్ బార్ట్లెట్.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మఇంపాక్ట్ సబ్స్: మయాంక్ అగర్వాల్, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్. -
Qualifier 1: స్టార్ బౌలర్ దూరం.. బలహీనంగా కనిపిస్తున్న పంజాబ్ బౌలింగ్ విభాగం
ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగబోయే క్వాలిఫయర్-1కు ముందు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్కు ఆ జట్టు స్టార్ పేసర్ మార్కో జన్సెన్ దూరమయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ దృష్ట్యా అతను స్వదేశానికి వెళ్లిపోయాడు. జన్సెన్ స్థానాన్ని అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేసే అవకాశం ఉంది. కీలకమైన ఈ మ్యాచ్లో జన్సెన్ లేకపోవడం పంజాబ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చహల్ ఆడేది కూడా అనుమానమే..!నేటి మ్యాచ్లో పంజాబ్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఆడేది కూడా అనుమానమే అని తెలుస్తుంది. చహల్ కొద్ది రోజుల కిందట గాయపడ్డాడు (చేతి వేలికి). ఈ కారణంగా అతను గత రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. కీలక మ్యాచ్ కావడంతో పంజాబ్ యాజమాన్యం చహల్ను బరిలోకి దించే సాహసం చేయవచ్చు.జన్సెన్, చహల్ లాంటి నాణ్యమైన బౌలర్లు నేటి మ్యాచ్లో ఆడకపోతే పంజాబ్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వీరిద్దరు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల బౌలర్లు. వీరి గైర్హాజరీలో పంజాబ్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. నంబర్ వన్ టీ20 బౌలర్ అర్షదీప్ ఉన్నా ఒక్కడు ఏ మేరకు ప్రభావం చూపగలడో చూడాలి. జేమీసన్, ఒమర్జాయ్ లాంటి పేసర్లు ఉన్నా వారి నుంచి అతిగా ఆశించలేని పరిస్థితి. స్పిన్ విభాగంలో హర్ప్రీత్ బ్రార్పై కొద్దొగొప్పో నమ్మకాలు పెట్టుకోవచ్చు. ఒకవేళ చహల్ దూరమైతే అతని స్థానంలో విజయ్కుమార్ వైశాక్ ఆడవచ్చు. అయితే వైశాక్ చహల్ లేని లోటును భర్తీ చేయలేడు. వైశాక్ తుది జట్టులోకి వస్తే పంజాబ్ స్పిన్ విభాగాన్ని హర్ప్రీత్ బ్రార్ ఒక్కడే మోయాల్సి వస్తుంది. కాబట్టి గాయం తగ్గకపోయినా నేటి మ్యాచ్లో పంజాబ్ యాజమాన్యం చహల్ను బరిలోకి దించవచ్చు. భీకర ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లిని బలహీనంగా కనిపిస్తున్న ఈ పంజాబ్ బౌలింగ్ యూనిట్ ఏ మేరకు నిలువరించగలదో చూడాలి.బౌలింగ్ విషయాన్ని పక్కన పెడితే.. పంజాబ్ బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. ఈ జట్టులో దాదాపు అందరు బ్యాటర్లు మంచి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇంగ్లిస్ గత మ్యాచ్లో తడాకా చాటాడు. శ్రేయస్ సీజన్ ఆరంభం నుంచి మంచి టచ్లో ఉన్నాడు. నేహల్ వధేరా, శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ చివర్లో అద్భుతాలు చేయడం చూశాం. పంజాబ్ బ్యాటింగ్ విభాగాన్ని స్టోయినిస్ ఫామ్ ఒక్కటే కలవరపెడుతుంది. ఇతను కూడా నేటి మ్యాచ్లో టచ్లోకి వస్తే ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి.నేటి మ్యాచ్లో పంజాబ్ తుది జట్టు (అంచనా)..ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (WK), శ్రేయస్ అయ్యర్ (C), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, అర్ష్దీప్ సింగ్, వైషాక్ విజయ్కుమార్/యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ ప్లేయర్: ప్రభ్సిమ్రాన్ సింగ్ -
IPL 2025 Qualifier 1: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
ఐపీఎల్-2025 సీజన్ తొలి క్వాలిఫయర్లో గురువారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. సమ ఉజ్జీలగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోరు మరోసారి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే లీగ్ స్టేజిలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్లు కూడా అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు ఆర్హత సాధిస్తోంది. ఇక హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.చరిత్రకు అడుగు దూరంలో..ఈ మ్యాచ్లో కోహ్లి మరో 30 పరుగులు చేస్తే పంజాబ్ కింగ్స్పై అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు పంజాబ్పై కోహ్లి 1104 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ పంజాబ్ కింగ్స్పై 1034 పరుగులు చేశాడు.ఒకే ఒక ఫిప్టీ..ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక ఆర్ధశతకాలు నమోదు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేసేందుకు కోహ్లి అడుగుదూరంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో విరాట్ హాఫ్ సెంచరీ సాధిస్తే వార్నర్ సరసన చేరుతాడు. కోహ్లి ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. 2016 ఐపీఎల్ సీజన్లో వార్నర్ 9 ఫిప్టీలు సాధించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో విరాట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. తన అద్బుత ఇన్నింగ్స్లతో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కింగ్ కోహ్లి ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడి 602 పరుగులు చేశాడు.పంజాబ్తో మ్యాచ్కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజిత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారాచదవండి: ENG vs IND: 'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు' -
క్వాలిఫయర్-1.. ఆర్సీబీకి అదిరిపోయే న్యూస్
ఐపీఎల్-2025 క్వాలిఫయర్-1కు సర్వసిద్దమైంది. చంఢీగడ్లోని ముల్లాన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇరు జట్లు సమ ఉజ్జీలగా ఉండడంతో గెలుపు ఎవరిదో క్రికెట్ నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి గుడ్న్యూస్ అందినట్లు తెలుస్తోంది.హాజిల్ వుడ్ రీ ఎంట్రీ?గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్న జోష్ హాజిల్వుడ్ తిరిగి ఆర్సీబీ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. భుజం నొప్పితో బాధపడుతున్న ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. రొమిరియో షెఫర్డ్ స్దానంలో ప్లేయింగ్ ఎలెవన్లోకి హాజిల్వుడ్ రానున్నట్లు ఆర్సీబీ వర్గాలు వెల్లడించాయి.హాజిల్వుడ్ తిరిగొస్తే బెంగళూరు బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. ఇప్పటికే భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా వంటి స్పీడ్ స్టార్లు ఆర్సీబీ జట్టులో ఉన్నారు. మరోవైపు గత రెండు మ్యాచ్లలో ఇంప్టాక్ ప్లేయర్గా బరిలోకి దిగిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ సైతం ఈ మ్యాచ్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాడు. అయితే విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్ మాత్రం ఈ మ్యాచ్లో కూడా ఆడేది అనుమానమే. డేవిడ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతోంది.పంజాబ్తో మ్యాచ్కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజిత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారాచదవండి: ENG vs IND: 'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు' -
ఇవాల్టి నుంచి ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్ లు
-
PBKS Vs RCB: ఫైనల్ వేటలో...
ముల్లాన్పూర్: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న రెండు జట్లు... 18వ సీజన్ ఫైనల్ చేరేందుకు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గురువారం క్వాలిఫయర్–1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ ఆరంభం నుంచి ఆడుతున్న ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన ఇరు జట్లు... ఈ సారి నిలకడైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్’కు చేరాయి. లీగ్ దశలో 14 మ్యాచ్లాడిన పంజాబ్ కింగ్స్ 9 విజయాలు, 4 పరాజయాలు, ఒక ఫలితం తేలని మ్యాచ్తో 19 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. 2014 తర్వాత పంజాబ్ జట్టు ‘ప్లే ఆఫ్స్’కు చేరడం ఇదే తొలిసారి కాగా... అప్పుడు కూడా పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన పంజాబ్... తుదిపోరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ఇక మరోవైపు 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 4 పరాజయాలు ఒక ఫలితం తేలని మ్యాచ్తో 19 పాయింట్లు సాధించిన బెంగళూరు రన్రేట్లో కాస్త వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ సీజన్లో రెండు మ్యాచ్లు జరగగా... చెరొకటి గెలిచాయి. బెంగళూరులో జరిగిన పోరులో పంజాబ్ గెలవగా... ముల్లాన్పూర్లో జరిగిన పోరులో బెంగళూరు పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరనుండగా... ఓడిన జట్టుకు క్వాలిఫయర్–2 రూపంలో మరో అవకాశం ఉండనుంది. టాప్–3పైనే ఆశలు... ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’కు చేర్చిన కెప్టెన్గా ఘనత సాధించిన శ్రేయస్ అయ్యర్... పంజాబ్కు ప్రధాన బలం కానున్నాడు. మైదానం బయటి నుంచి రికీ పాంటింగ్ సలహాలు... లోపల శ్రేయస్ వ్యూహాలతో ఇప్పటికే పంజాబ్ కింగ్స్ అభిమానుల మనసులు గెలుచుకుంది. ముందుండి నడిపించే వాడే నాయకుడు అనే విధంగా శ్రేయస్ బ్యాట్తోనూ దుమ్మురేపుతున్నాడు. 14 మ్యాచ్ల్లో 51.40 సగటుతో అతడు 514 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తున్న శ్రేయస్ 171.90 స్ట్రయిక్రేట్తో ఈ పరుగులు చేయడం విశేషం. ఇక యువ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ 499 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య 424 పరుగులతో సత్తా చాటారు. ఈ ఇద్దరు అందిస్తున్న శుభారంభాలతోనే పంజాబ్ భారీ స్కోర్లు చేయగలిగింది. ఈ సీజన్లో పంజాబ్ నిలకడైన విజయాలకు ఈ ముగ్గురి ఫామే ప్రధాన కారణం. ఇన్గ్లిస్ మంచి టచ్లో ఉండగా... నేహల్ వధేరా, శశాంక్, స్టొయినిస్ అవసరమైన సమయంలో సత్తా చాటుతున్నారు. బౌలింగ్లో అర్ష్ దీప్ సింగ్, కైల్ జేమీసన్, అజు్మతుల్లా కీలకం కానున్నారు. జాతీయ జట్టు అవసరాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ స్వదేశానికి తిరిగి వెళ్లడం జట్టుకు కాస్త ఇబ్బంది కాగా... గాయం కారణంగా గత రెండు మ్యాచ్లకు అందుబాటులో లేని చాహల్ రాకతో స్పిన్ విభాగం పటిష్టమైంది. విరాట్పై పెను భారం లీగ్ ఆరంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్ కోహ్లి... 18వ సీజన్లో అయినా ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా... అనధికారిక కెపె్టన్గా కోహ్లిపైనే జట్టు అధికంగా ఆధారపడుతోంది. అందుకు తగ్గట్లే ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన విరాట్... 13 మ్యాచ్ల్లో 60.20 సగటుతో 602 పరుగులు చేశాడు. 147.91 స్ట్రయిక్రేట్తో పరుగులు రాబట్టిన కోహ్లి... 8 అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తన వికెట్ విలువ అర్థం చేసుకొని ఆడుతున్న కోహ్లి... ఈ సీజన్లో అత్యధిక స్కోరు ముల్లాన్పూర్లోనే పంజాబ్పై నమోదు చేసుకోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. కోహ్లి, సాల్ట్ జట్టుకు శుభారంభాలు అందిస్తుండగా... మయాంక్ అగర్వాల్, రజత్ పాటీదార్, జితేశ్ శర్మ చక్కటి ఫామ్లో ఉన్నారు. గత మ్యాచ్లో ఆశలే లేని స్థితిలో అద్భుత ప్రదర్శన చేసిన జితేశ్ శర్మ నుంచి ఫ్రాంఛైజీ అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. గాయం కారణంగా టిమ్ డేవిడ్ అందుబాటులో లేకపోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారగా... అతడి స్థానంలో లియామ్ లివింగ్స్టోన్ ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు. ఫిట్నెస్ సాధించిన జోష్ హాజల్వుడ్ తిరిగి రావడం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. తన వైవిధ్యమైన బౌలింగ్తో ఎలాంటి బ్యాటర్నైనా ఇబ్బంది పెట్టగల హాజల్వుడ్ ఈ మ్యాచ్లో కీలకం కానున్నాడు. భువనేశ్వర్, యశ్ దయాళ్తో కలిసి అతడు పేస్ భారాన్ని మోయనుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, జెమీసన్, హర్ప్రీత్, అర్ష్ దీప్, చాహల్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, జితేశ్, కృనాల్ పాండ్యా, లివింగ్స్టోన్, షెఫర్డ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, హజల్వుడ్, సుయాశ్ శర్మ. పిచ్, వాతావరణం ముల్లాన్పూర్ మైదానంలో ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు జరగగా... అందులో మూడు ఇన్నింగ్స్ల్లో స్కోర్లు 200 దాటాయి. మిగిలిన ఐదు ఇన్నింగ్స్ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బుధవారం పిచ్ ఎలా స్పందిస్తుందనేది కీలకం. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. ఐపీఎల్లో నేడు (క్వాలిఫయర్ –1)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్పూర్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో -
RCB VS PBKS Qualifier-1: అలా జరిగితే గెలవకపోయినా పంజాబ్ ఫైనల్కు చేరుతుంది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లీగ్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, పంజాబ్ తలపడతాయి. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. లీగ్ దశలో సాధించిన విజయాలు, నెట్ రన్రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారయ్యాయి. పంజాబ్, ఆర్సీబీ తలో 14 మ్యాచ్ల్లో చెరో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. పాయింట్లు సమంగా (19) ఉన్నా, ఆర్సీబీతో పోలిస్తే నెట్ రన్రేట్ మెరుగ్గా ఉండటంతో పంజాబ్కు తొలి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కింది.గుజరాత్ 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ కూడా పంజాబ్, ఆర్సీబీ మాదిరి 14 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించినా.. పంజాబ్, ఆర్సీబీ ఆడాల్సిన ఓ మ్యాచ్ (వేర్వేరుగా) రద్దైంది. దీంతో పంజాబ్, ఆర్సీబీలకు అదనంగా తలో పాయింట్ లభించింది.ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఎలా..?పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు (పంజాబ్, ఆర్సీబీ) మొదటి క్వాలిఫయర్లో తలపడతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఈ మ్యాచ్లో ఓడిన జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫయర్-2లో (జూన్ 1) పోటీ పడే అవకాశం దక్కుతుంది. క్వాలిఫయర్-2లో ఇంకో బెర్త్ ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా తెలుస్తుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడతాయి. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పోటీ పడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్లో ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు.. క్వాలిఫయర్-1లో గెలిచే జట్టుతో ఫైనల్లో (జూన్ 3) తలపడుతుంది.ఆర్సీబీ, పంజాబ్ క్వాలిఫయర్ మ్యాచ్ రద్దైతే..?పంజాబ్, ఆర్సీబీ మధ్య మే 29న జరగాల్సిన క్వాలిఫయర్-1 మ్యాచ్ ఏ కారణంగా అయినా రద్దైతే పంజాబ్ ఫైనల్కు చేరుతుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది కాబట్టి, ఆ జట్టుకు ఈ అవకాశం దక్కుతుంది. షెడ్యూల్ ప్రకారం క్వాలిఫయర్-1కు రిజర్వ్ డే లేదు. కాబట్టి తప్పనిసరిగా మ్యాచ్ జరిగి గెలిస్తేనే ఆర్సీబీ ఫైనల్కు చేరుతుంది. పంజాబ్కు అలా కాదు. ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైనా ఆ జట్టు ఫైనల్కు చేరుతుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఏ కారణంగా కూడా పంజాబ్, ఆర్సీబీ క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేదు. -
IPL 2025: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. ఎవరితో ఎవరు ఆడతారంటే?
ఐపీఎల్-2025లో లీగ్ దశ మ్యాచ్లు సోమవారం(మే 27)తో ముగిశాయి. ఈ మెగా టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ క్వాలిఫియర్-1కు ఆర్హత సాధించింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్లో ఏ జట్టు ఎవరితో తలపడుతుందో ఓ లుక్కేద్దాం. ఈ ఏడాది సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్దానంలో పంజాబ్ కింగ్స్(18) నిలవగా.. ఆర్సీబీ(18) రెండో స్ధానంలో నిలిచింది. పాయింట్ల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నప్పటికి బెంగళూరు కంటే పంజాబ్ రన్రేట్ మెరుగ్గా ఉండడంతో టాప్ ప్లేస్ను సుస్థిరం చేసుకుంది.క్వాలిఫయర్-1లో పంజాబ్, ఆర్సీబీ ఢీ..టాప్-2లో నిలిచిన పంజాబ్, ఆర్సీబీ మే 29న చంఢీగడ్ వేదికగా క్వాలిఫయర్-1లో తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు ఆర్హత సాధిస్తోంది. అయితే ఇక్కడ ఓడిన జట్టుకు కూడా ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. ఓటమి చెందిన జట్టు జూన్ 1న క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ లేదా గుజరాత్ టైటాన్స్ ఆడాల్సి ఉంటుంది. అక్కడ గెలిస్తే ఫైనల్కు చేరుకోవచ్చు. ఇక పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, మంబై ఇండియన్స్ మే 30న ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఇక్కడ గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్తో తలపడాల్సి ఉంటుంది. ఇక చివరగా ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.IPL 2025 ప్లేఆఫ్స్ షెడ్యూల్:క్వాలిఫయర్ 1: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మే 29, చండీగఢ్ఎలిమినేటర్: గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ - మే 30, చండీగఢ్క్వాలిఫయర్ 2: క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు vs ఎలిమినేటర్ విజేత - జూన్ 1, అహ్మదాబాద్ఫైనల్: క్వాలిఫయర్ 1 విజేత vs క్వాలిఫయర్ 2 విజేత - జూన్ 3, అహ్మదాబాద్ -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో అదరగొట్టింది. జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానాన్ని కైవసం చేసుకోంది.ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. అర్ష్దీప్, యాన్సెన్, వైశాక్ తలా 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. జోష్ ఇన్గ్లిస్ (42 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముంబై బౌలర్లలో సాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఒక్క వికెట్ సాధించారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన శ్రేయస్..ఐపీఎల్ చరిత్రలో మూడు వెర్వేరు జట్లును క్వాలిఫయర్స్కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్గా అయ్యర్ రికార్డులకెక్కాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తన ఐపీఎల్ కెరీర్ను ప్రారంభించిన శ్రేయస్.. 2020 సీజన్లో ఢిల్లీ జట్టును కెప్టెన్గా రెండవ స్ధానానికి చేర్చాడు.సెకెండ్ క్వాలిఫయర్లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. దురుదృష్టవశాత్తూ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అనంతరం ఐపీఎల్-2024 పాయింట్ల పట్టికలో శ్రేయస్ సారథ్యంలోని కోల్కతా నైట్ రైడర్స్ (KKR) అగ్రస్దానంలో నిలిచింది. ఫైనల్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసి మూడో ఐపీఎల్ టైటిల్ను కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పంజాబ్ను క్వాలిఫయర్స్కు చేర్చి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చదవండి: బెంగళూరుకు ‘ఆఖరి’ చాన్స్ -
PBKS Vs MI: విధ్వంసం సృష్టించిన ఇంగ్లిస్, ఆర్య.. ముంబైపై పంజాబ్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 26) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఓటమితో ముంబై నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.పాయింట్ల పట్టికలో ప్లే ఆఫ్స్కు చేరిన జట్లు..పంజాబ్- 19గుజరాత్- 18ఆర్సీబీ- 17 (ఇంకా ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంది)ముంబై- 16సత్తా చాటిన సూర్యకుమార్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన సూర్యకుమార్ మెరుపు అర్ద సెంచరీతో (57) సత్తా చాటాడు.ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24, తిలక్ వర్మ 1, విల్ జాక్స్ 17, హార్దిక్ పాండ్యా 26, నమన్ ధిర్ 20 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జన్సెన్, విజయ్కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.విధ్వంసం సృష్టించిన ఇంగ్లిస్, ప్రియాంశ్అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రియాంశ్ ఆర్య 62, జోష్ ఇంగ్లిస్ 73, శ్రేయస్ అయ్యర్ 26 (నాటౌట్), ప్రభ్సిమ్రన్ 13, నేహల్ వధేరా 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో సాంట్నర్ 2, బుమ్రా ఓ వికెట్ పడగొట్టారు. -
IPL 2025: ముంబైపై పంజాబ్ గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 26) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకోగా.. ముంబై నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా.. పంజాబ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రియాంశ్ ఆర్య 62, జోష్ ఇంగ్లిస్ 73, శ్రేయస్ అయ్యర్ 26 (నాటౌట్) పరుగులు చేసి పంజాబ్ను విజయతీరాలకు చేర్చారు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్14.1వ ఓవర్- 143 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (62) ఔటయ్యాడు. టార్గెట్ 185.. 13 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 131/1ప్రియాంశ్ ఆర్య 57, జోష్ ఇంగ్లిస్ 54టార్గెట్ 185.. 10 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 89/1ప్రియాంశ్ ఆర్య 37, జోష్ ఇంగ్లిస్ 358 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 75/1ఇంగ్లిస్ 25, ప్రియాంశ్ ఆర్య 34టార్గెట్ 185.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్4.2వ ఓవర్- 185 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో అశ్వనీ కుమార్కు క్యాచ్ ఇచ్చి ప్రభ్సిమ్రన్ సింగ్ (13) ఔటయ్యాడు. సత్తా చాటిన సూర్యకుమార్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన సూర్యకుమార్ మెరుపు అర్ద సెంచరీతో (57) సత్తా చాటాడు.ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24, తిలక్ వర్మ 1, విల్ జాక్స్ 17, హార్దిక్ పాండ్యా 26, నమన్ ధిర్ 20 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జన్సెన్, విజయ్కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్షదీప్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు (నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్) తీశాడు. 18 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 158/5సూర్యకుమార్ యాదవ్ 45, నమన్ ధిర్ 7 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై12.3వ ఓవర్- 106 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (17) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై 10.5వ ఓవర్- 87 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్లో అర్షదీప్కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (1) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ముంబై9.3వ ఓవర్- 81 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో నేహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (24) ఔటయ్యాడు.9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 79/19 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 79/1గా ఉంది. రోహిత్ శర్మ 23, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై5.1వ ఓవర్- 45 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది.జన్సెన్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి రికెల్టన్ (27) ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 50/0టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 45/0గా ఉంది. రికెల్టన్ 27, రోహిత్ శర్మ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (మే 26) జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, కైల్ జేమీసన్, విజయ్కుమార్ వైశాక్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షేడ్గే, జేవియర్ బార్ట్లెట్, ముషీర్ ఖాన్ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బవా, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజు -
IPL 2025: పంజాబ్ కింగ్స్కు శుభవార్త
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్కు ముందు పంజాబ్ కింగ్స్కు శుభవార్త అందింది. చేతి వేలి గాయం కారణంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్కు దూరంగా ఉన్న స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ప్లే ఆఫ్స్ సమయానికి అందుబాటులోకి రానున్నాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. ఓ ప్రముఖ వార్తా సంస్థ తమ కథనంలో రాసుకొచ్చింది. చహల్ను నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్లో బరిలోకి దించకూడదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిన నేపథ్యంలో చహల్ విషయంలో రిస్క్ తీసుకోకూడదని ఆ జట్టు యాజమాన్యం భావిస్తుంది.కాగా, చహల్ లేని లోటు పంజాబ్కు గత మ్యాచ్లో (ఢిల్లీతో) బాగా తెలిసొచ్చింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 206 పరుగుల భారీ స్కోర్ చేసినా పంజాబ్ దాన్ని కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్లో చహల్ ఆడి ఉంటే పంజాబ్ మరో విజయం నమోదు చేసేది. అలా జరిగి ఉంటే నేటి మ్యాచ్తో (ముంబై) సంబంధం లేకుండా ఆ జట్టు టేబుల్ టాపర్గా నిలిచేది.పంజాబ్ ఇవాళ (మే 26) జైపూర్ వేదికగా జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే పంజాబ్ టేబుల్ టాపర్గా నిలుస్తుంది. ముంబై గెలిచినా అగ్రస్థానానికి చేరుకుంటుంది. లీగ్ దశ మ్యాచ్లు పూర్తయ్యే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు అదనపు ప్రయోజనం (క్వాలిఫయర్-1లో ఓడినా ఫైనల్కు చేరేందుకు క్వాలిఫయర్-2లో పోటీ పడే అవకాశం ఉంటుంది) చేకూరుతుందన్న విషయం తెలిసిందే.పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు (ప్రస్తుతం)..గుజరాత్- 18 (0.254)పంజాబ్- 17 (0.327)ఆర్సీబీ- 17 (0.255)ముంబై- 16 (1.292)నేటి మ్యాచ్లో తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రభ్సిమ్రన్ సింగ్ (wk), ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/ప్రవీణ్ దూబేముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
MI Vs PBKS: ముంబై X పంజాబ్
జైపూర్: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే లక్ష్యంగా... సోమవారం పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ పోరుకు సిద్ధమైంది. లీగ్ దశలో 13 మ్యాచ్లు ఆడిన ముంబై 8 విజయాలు, 5 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానంలో ఉండగా... పంజాబ్ 13 మ్యాచ్ల్లో 17 పాయింట్లతో రెండో ‘ప్లేస్’లో కొనసాగుతోంది. టాప్–2లో నిలిచిన జట్లకు ఫైనల్కు చేరేందుకు మరో అదనపు అవకాశం ఉండటంతో... ఇరు జట్లు దానిపైనే దృష్టి సారించాయి. సీజన్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై జట్టు... ఆ తర్వాత వరుస విజయాలతో విజృంభిస్తుంటే... పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు స్టార్ ఆటగాళ్లతో నిండి ఉంటే... శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్పై ఎక్కువ ఆధారపడుతోంది. చిన్న బౌండరీల మైదానంలో భారీ స్కోర్లు నమోదవడం ఖాయం కాగా... ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న బుమ్రా ఫామ్లో ఉండటంతో ముంబైకి కాస్త మొగ్గు ఉంది. సూర్యకుమార్ యాదవ్ 583 పరుగులతో ఫుల్ ఫామ్లో ఉండగా... రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్ మంచి టచ్లో ఉన్నారు. హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ... ధాటిగా ఆడలేక ఇబ్బంది పడుతుండగా... హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ భారీ షాట్లతో జట్టుకు ఉపయుక్తకరమైన పరుగులు అందిస్తున్నారు. బౌలింగ్లో బుమ్రా, బౌల్ట్, దీపక్ చాహర్, సాంట్నర్ కీలకం కానున్నారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో 488 పరుగులు చేయగా... ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (486), ప్రియాన్‡్ష ఆర్య (362) దూకుడు మీదున్నారు. ఈ జంట మెరుగైన ఆరంభాలు అందిస్తుండటంతోనే ఆ జట్టు నిలకడ కొనసాగించగలుగుతోంది. జోష్ ఇన్గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, స్టొయినిస్తో పంజాబ్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్లో టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... చివర్లో స్టొయినిస్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగలిగింది. ఇలాగే ప్రతి మ్యాచ్లో ఒకరు విఫలమైనా మరొకరు బాధ్యత తీసుకుంటుండటం పంజాబ్ కింగ్స్కు కలిసి వస్తోంది. బ్యాటింగ్లో ముంబైకి దీటుగా ఉన్న పంజాబ్... బౌలింగ్లో మాత్రం కాస్త వెనుకబడ్డట్లు కనిపిస్తోంది. అర్‡్షదీప్ సింగ్, మార్కో యాన్సెన్పై అధిక భారం పడుతోంది. మరి కీలక పోరులో ముంబై విజయం సాధించి ముందంజ వేస్తుందా... లేక పంజాబ్ ప్రతాపం కనబరుస్తుందా చూడాలి! -
ప్లే ఆఫ్స్కు ముందు పంజాబ్ కింగ్స్కు భారీ షాక్
ఐపీఎల్-2025 సీజన్లో ప్లే ఆఫ్స్కు ముందు పంజాబ్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ సునీల్ జోషి ధ్రువీకరించాడు. అయితే చాహల్ ఏ గాయంతో బాధపడుతున్నాడన్న విషయాన్ని జోషి స్పష్టం చేయలేదు.గాయం కారణంగానే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్కు చాహల్ దూరమయ్యాడు. చాహల్ స్దానంలో ప్రవీణ్ దూబే జట్టులోకి వచ్చాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టిన దూబే.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు."చాహల్ చిన్న గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతడికి మేము విశ్రాంతి. అతడు మా తదుపరి మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో సునీల్ జోషీ పేర్కొన్నాడు.ఒకవేళ చాహల్ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్లకు దూరమైతే పంజాబ్కు అది గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్లో చాహల్ పంజాబ్ జట్టుకు ప్రధాన స్పిన్నర్గా ఉన్నాడు. ఓ హ్యాటిక్ కూడా అతడి ఖాతాలో ఉంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన చాహల్.. 9.56 ఏకానమితో 14 వికెట్లు పడగొట్టాడు.కాగా పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్-2 స్ధానం కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధించిన పంజాబ్కు ఇంకా ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. మే 26న జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్తో పంజాబ్ తలపడనుంది.చదవండి: IPL 2025: బ్రెవిస్, కాన్వే, మాత్రే మెరుపులు.. సీఎస్కే భారీ స్కోర్ -
PBKS VS DC: అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రీతి జింటా
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 24) జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ పంజాబ్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్ను గెలుపుతో ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.పంజాబ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. ప్రభసిమ్రన్ (28), జోష్ ఇంగ్లిస్ (32), స్టోయినిస్ (44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ప్రియాంశ్ ఆర్య (6), నేహల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11), అజ్మతుల్లా ఒమర్జాయ్ (1), మార్కో జన్సెన్ (0) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, విప్రాజ్, కుల్దీప్ తలో 2, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.ఢిల్లీ తరఫున సమీర్ రిజ్వి (58 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. కరుణ్ నాయర్ (44), కేఎల్ రాహుల్ (35), డుప్లెసిస్ (23), సెదీఖుల్లా అటల్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్) కూడా అదే తరహా ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 2, జన్సెన్, ప్రవీణ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.In a such a high profile tournament with so much technology at the Third Umpire’s disposal such mistakes are unacceptable & simply shouldn’t happen. I spoke To Karun after the game & he confirmed it was DEFINITELY a 6 ! I rest my case ! #PBKSvsDC #IPL2025 https://t.co/o35yCueuNP— Preity G Zinta (@realpreityzinta) May 24, 2025ప్రీతి జింటా ఆగ్రహం కాగా, ఈ మ్యాచ్లో జరిగిన ఓ తప్పిదంపై పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో శశాంక్ సింగ్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్పై కరుణ్ నాయర్ అద్భుతంగా బంతిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో బంతి చేతిలో ఉండగా.. కరుణ్ కాలు బౌండరీ లైన్ టచ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. కరుణ్ కూడా అది సిక్సరే అంటూ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు మాత్రం క్లారిటీ లేకపోవడంతో థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. థర్డ్ అంపైర్ క్రిస్ గఫెనే పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి సిక్సర్ కాదని తేల్చాడు. కరుణ్ కాలు బౌండరీ లైన్కు తాకినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపాడు. ఈ ఘటనపై ప్రీతి జింటా ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్ లాంటి హై ప్రొఫైల్ టోర్నమెంట్లో థర్డ్ అంపైర్ వద్ద అత్యుత్తమ టెక్నాలజీ ఉన్నా ఇలాంటి తప్పిదాలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి తప్పిదాలు అస్సలు జరగకూడదని నిరాశ వ్యక్తం చేశారు. ఆట తర్వాత కరుణ్తో మాట్లాడానని, అతను కూడా అది ఖచ్చితంగా సిక్సర్ అని ధృవీకరించాడని ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. -
IPL 2025: శ్రేయస్ ఖాతాలో చెత్త రికార్డు
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అనవసర రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్ చరిత్రలో 200 ప్లస్ లక్ష్యాలను డిఫెండ్ చేసుకునే క్రమంలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న కెప్టెన్గా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.శ్రేయస్ ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు 200 ప్లస్ లక్ష్యాలను కాపాడుకోవడంలో విఫలమయ్యాడు. శ్రేయస్ తర్వాత ఈ చెత్త రికార్డును ఎంఎస్ ధోని, ఫాఫ్ డుప్లెసిస్, శుభ్మన్ గిల్ సంయుక్తంగా షేర్ చేసుకున్నారు. వీరు ముగ్గురు తలో మూడు సందర్భాల్లో 200 ప్లస్ లక్ష్యాలను కాపాడుకోవడంలో విఫలమయ్యారు.ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 24) ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాభవం తర్వాత శ్రేయస్ ఈ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో శ్రేయస్ సారథ్యం వహించిన పంజాబ్.. 207 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఢిల్లీ మరో 3 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.శ్రేయస్ సారథ్యంలో 200 ప్లస్ టార్గెట్ను నిలువరించుకోలేకపోయిన సందర్భాలు..2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్పై 223 పరుగులు (కేకేఆర్ కెప్టెన్గా)2024 సీజన్లో పంజాబ్ కింగ్స్పై 261 పరుగులు (కేకేఆర్ కెప్టెన్గా)2025 సీజన్లో ఎస్ఆర్హెచ్పై 245 పరుగులు (పంజాబ్ కెప్టెన్గా)2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 206 పరుగులు (పంజాబ్ కెప్టెన్గా)జట్ల విషయానికొస్తే.. 200 ప్లస్ లక్ష్యాలను అత్యధిక సార్లు నిలువరించుకోలేకపోయిన జట్టుగా పంజాబ్ కింగ్స్ అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఏడు సందర్భాల్లో 200 ప్లస్ లక్ష్యాలను కాపాడుకోలేకపోయింది. పంజాబ్ తర్వాత ఆర్సీబీ, సీఎస్కే అత్యధిక సార్లు ఈ అపఖ్యాతిని మూటగట్టుకున్నాయి.200 ప్లస్ లక్ష్యాలను అత్యధిక సార్లు కాపాడుకోలేకపోయిన జట్లు..పంజాబ్- 7ఆర్సీబీ- 6సీఎస్కే- 5కేకేఆర్- 4గుజరాత్- 4రాజస్థాన్- 2ఎస్ఆర్హెచ్- 2ఢిల్లీ- 2ఎల్ఎస్జీ- 2నిన్నటి పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో పంజాబ్ 200 ప్లస్ లక్ష్యాన్ని సెట్ చేసిన కూడా కాపాడుకోలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (6)ను ముస్తాఫిజుర్ రహ్మాన్ సింగిల్ డిజిట్ స్కోరు వద్ద పెవిలియన్కు పంపాడు.అయితే, మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. కానీ శ్రేయస్ అవుటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ మళ్లీ నెమ్మదిగా సాగింది.నేహాల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11) నిరాశపరచగా.. మార్కస్ స్టొయినిస్ మెరుపులతో పంజాబ్ 200 పరుగుల మార్కు దాటింది. స్టొయినిస్ 16 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు. ఆఖర్లో హర్ప్రీత్ బ్రార్ 2 బంతుల్లో 7 పరుగులతో స్టొయినిస్తో కలిసి నాటౌట్గా నిలిచాడు.ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే, ఆరో ఓవర్ మూడో బంతికి రాహుల్ (21 బంతుల్లో 35) మార్కో యాన్సెన్ బౌలింగ్లో అవుట్ కాగా.. పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.ఆ తర్వాతి ఓవర్లలో డుప్లెసిస్ (15 బంతుల్లో 23) కూడా అవుటయ్యాడు. వన్డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) మెరుపులు మెరిపించగా .. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సెదీకుల్లా అటల్ (22) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సమీర్ రిజ్వీ ధనాధన్ దంచికొట్టాడు. 22 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు.. తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.మొత్తంగా 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 18 పరుగులతో అతడికి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని అందుకుంది. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ రెండు, మార్కో యాన్సెన్, ప్రవీణ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. కాగా అగ్ర స్థానంపై కన్నేసిన పంజాబ్ ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 17 పాయింట్లతో ఉన్న పంజాబ్ ఆఖరిదైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గెలిస్తేనే టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది. -
సైనిక వితంతువుల సంక్షేమ నిధికి ప్రీతి జింటా రూ.1.10 కోట్ల విరాళం
జైపూర్: క్రికెట్ జట్టు పంజాబ్ కింగ్స్ సహ యజమాని, సినీ నటి ప్రీతీ జింటా సైనిక వితంతువుల సంక్షేమ నిధి(ఏడబ్ల్యూడబ్ల్యూఏ)కి రూ.1.10 కోట్ల విరాళం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్)నిధిలోని జింటా వాటా నుంచి ఈ విరాళాన్ని ఆమె ప్రకటించారు. ఈ మొత్తాన్ని సౌత్ వెస్టర్న్ కమాండ్ ఆర్మీ విభాగంలోని వీర నారీమణుల సాధికారితకు, వారి పిల్లల చదువుల కోసం వెచ్చించనున్నారు. శనివారం జైపూర్లో జరిగిన ఏడబ్ల్యూడబ్ల్యూఏ సమావేశంలో ప్రీతీ జింటా ఈ విరాళాన్ని ప్రకటించారు. ‘సాయుధ బలగాల కుటుంబాలకు సాయంగా నిలవడం మన బాధ్యత. మన సైనికులు చేసిన త్యాగాలకు తగు మూల్యం ఎప్పటికీ తిరిగి చెల్లించలేం. కానీ, మనం వారి కుటుంబాలకు అండగా ఉండి ముందుకు సాగడానికి మద్దతునిద్దాం’అని ఆమె పేర్కొన్నారు. -
విజయంతో ముగించిన ఢిల్లీ
జైపూర్: ఈ ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చెరిన జట్లను ఇంటికెళ్లే జట్లు గట్టి దెబ్బే కొడుతున్నాయి. తాజాగా పట్టికలో ‘టాప్’పై గురిపెట్టిన పంజాబ్ కింగ్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లతో గెలిచి షాకిచ్చింది. తద్వారా ఢిల్లీ ఘన విజయంతో ఈ సీజన్ను ముగించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. ఆరంభంలో ఇన్గ్లిస్ (12 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ఆఖర్లో స్టొయినిస్ (16 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) దంచేశారు. అనంతరం ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసి గెలిచింది. కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్లు), మెరిపిస్తే... సమీర్ రిజ్వీ (25 బంతుల్లో 58 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్లు) గెలిచేదాకా నిలిచాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ఆర్య (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 6; ప్రభ్సిమ్రన్ (బి) విప్రాజ్ 28; ఇన్గ్లిస్ (స్టంప్డ్) స్టబ్స్ (బి) విప్రాజ్ 32; శ్రేయస్ (సి) మోహిత్ (బి) కుల్దీప్ 53; నేహల్ (సి) డుప్లెసిస్ (బి) ముకేశ్ 16; శశాంక్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 11; స్టొయినిస్ నాటౌట్ 44; అజ్మతుల్లా (సి) సమీర్ (బి) కుల్దీప్ 1; యాన్సెన్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 0; హర్ప్రీత్ నాటౌట్ 7; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–8, 2–55, 3–77, 4–118, 5–144, 6–172, 7–174, 8–197. బౌలింగ్: ముకేశ్ 4–0–49–1, ముస్తాఫిజుర్ 4–0–33–3, మోహిత్ శర్మ 4–0–47–0, విప్రాజ్ నిగమ్ 4–0–38–2, కుల్దీప్ 4–0–39–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) శశాంక్ (బి) యాన్సెన్ 35; డుప్లెసిస్ (సి) ప్రియాన్ష్(బి) హర్ప్రీత్ 23; కరుణ్ (బి) హర్ప్రీత్ 44; సాదికుల్లా (సి) అర్‡్షదీప్ (బి) ప్రవీణ్ 22; రిజ్వీ నాటౌట్ 58; స్టబ్స్ నాటౌట్ 18; ఎక్స్ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–55, 2–65, 3–93, 4–155. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–0, అజ్మతుల్లా 4–0–46–0, హర్ప్రీత్ 4–0–41–2, యాన్సెన్ 4–0–41–1, ప్రవీణ్ 2–0–20–1, స్టొయినిస్ 1.3–0–21–0. ఐపీఎల్లో నేడుగుజరాత్ X చెన్నైవేదిక: అహ్మదాబాద్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి కోల్కతా X హైదరాబాద్ వేదిక: ఢిల్లీరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: పంజాబ్ను ఓడించిన ఢిల్లీ
Punjab Kings vs Delhi Capitals- Jaipur Updates: పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. శ్రేయస్ అయ్యర్ సేనను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 53 పరుగులు) రాణించాడు. మార్కస్ స్టొయినిస్ ( 16 బంతుల్లో 44 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఇక 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో పని పూర్తి చేసింది. కేఎల్ రాహుల్ (35), ఫాఫ్ డుప్లెసిస్ (23)లు మెరుగ్గా ఆడగా.. కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) దంచికొట్టాడు. సమీర్ రిజ్వీ మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 58) సాధించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (18) అతడికి సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. సమీర్ రిజ్వీ తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ18.2: ఐపీఎల్లో తొలి అర్ధ శతకం బాదిన సమీర్ రిజ్వీ . 22 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.రిజ్వీ ధనాధన్18 ఓవర్లలో ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విజయానికి ఇంకో రెండు ఓవర్లలో 22 పరుగులు కావాలి.16 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 159/4కరుణ్ నాయర్ అవుట్ధనాధన్ ఇన్నింగ్స్తో దూకుడు మీదున్న కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44)ను హర్ప్రీత్ బ్రార్ బౌల్డ్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి రాగా.. సమీర్ రిజ్వీ 24 పరుగులతో ఉన్నాడు. ఢిల్లీ స్కోరు: 155/4 (15)14 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 146/3 యాభై రెండు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ. కరుణ్ 38, సమీర్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 36 బంతుల్లో 61 పరుగులు కావాలి.ఫోర్ల వర్షంప్రవీణ్ దూబే బౌలింగ్లో కరుణ్ నాయర్ వరుసగా నాలుగు బౌండరీలు బాదాడు. 11 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 110-3. కరుణ్ 27, సమీర్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ డౌన్10:1: సెదీకుల్లా (22) రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ప్రవీణ్ దూబే బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అతడు అవుటయ్యాడు. సమీర్ రిజ్వీ క్రీజులలోకి రాగా.. కరుణ్ 15 పరుగులతో ఉన్నాడు.పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 93/2 (10)సెదీకుల్లా 22, కరుణ్ నాయర్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.డుప్లెసిస్ అవుట్6.4: హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో డుప్లెసిస్ (23)రెండో వికెట్గా వెనుదిరిగాడు. సెదీకుల్లా అటల్ క్రీజులోకి వచ్చాడు. ఏడు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 66-2. కరుణ్ నాయర్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ5.3: కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. మార్కో యాన్సెన్ బౌలింగ్లో శశాంక్ సింగ్కు క్యాచ్ ఇచ్చి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ పెవిలియన్ చేరాడు. కరుణ్ నాయర్ క్రీజులోకి వచ్చాడు.5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 50-0శ్రేయస్ ఫిఫ్టీ, స్టొయినిస్ మెరుపులుఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మెరుగైన స్కోరు చేసింది.. జైపూర్ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. మిగతా వారిలో మార్కస్ స్టొయినిస్ ( 16 బంతుల్లో 44 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్19.3: ముస్తాఫిజుర్ బౌలింగ్లో ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన యాన్సెన్(0). పంజాబ్ స్కోరు: 197-8ఏడో వికెట్ డౌన్17.6: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి ఒమర్జాయ్ (1) పెవిలియన్ చేరాడు. పంజాబ్ స్కోరు: 174-7. మార్కో యాన్సెన్ క్రీజులోకి రాగా.. స్టొయినిస్ 20 పరుగులతో ఉన్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్17.1: కుల్దీప్ బౌలింగ్లో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (53) అవుటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి వచ్చాడు.శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకం17 ఓవర్లలో పంజాబ్ స్కోరు 171/5 (17). శ్రేయస్ అయ్యర్ 53, స్టొయినిస్ 18 పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్15.4: శశాంక్ సింగ్ (11) రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్లో వికెట్ కీపర్ స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి శశాంక్ పెవిలియన్ చేరాడు. మార్కస్ స్టొయినిస్ క్రీజులోకి వచ్చాడు. శ్రేయస్ 48 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 146-5(16)హాఫ్ సెంచరీకి చేరువలో శ్రేయస్15 ఓవర్లు ముగిసే సరికి శ్రేయస్ 46 పరుగులతో ఉండగా.. శశాంక్ సింగ్ 9 పరుగులతో ఆడుతున్నారు. పంజాబ్ స్కోరు: 142/4 (15)12.3: నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ముకేశ్ కుమార్ బౌలింగ్లో డుప్లెసిస్కు క్యాచ్ ఇచ్చి అవుటైన నేహాల్ వధేరా(16). శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 118-412 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 116/3 (12)శ్రేయస్ అయ్యర్ 33 పరుగులతో, నేహాల్ వధేరా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 97/3 (10)శ్రేయస్ అయ్యర్ 18 పరుగులతో, నేహాల్ వధేరా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్7.5: విప్రాజ్ నిగమ్ బౌలింగ్లో ప్రభ్సిమ్రన్ సింగ్ బౌల్డ్ (28). మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్. శ్రేయస్ 8 పరుగులతో ఉండగ.. నేహాల్ వధేరా క్రీజులోకి వచ్చాడు.ఏడు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ స్కోరు: 71/2 (7)ప్రభ్సిమ్రన్ సింగ్ 23, శ్రేయస్ అయ్యర్ ఏడు పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్5.3: విప్రాజ్ నిగమ్ బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్(32) షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు: 60-2ఐదు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ స్కోరు: 44/1 (5)ప్రభ్సిమ్రన్ సింగ్ 15, జోష్ ఇంగ్లిస్ 22 పరుగులతో ఆడుతున్నారు. పంజాబ్కు భారీ షాక్.. ఆర్య ఔట్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 6 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య.. ముస్తఫిజుర్ రెహ్మన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో భాగంగా జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు కూడా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతడి స్దానంలో ఫాఫ్ డుప్లెసిస్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. పంజాబ్ జట్టులోకి జోష్ ఇంగ్లిష్, మార్కస్ స్టోయినిష్ తిరిగి రాగా.. సెడిఖుల్లా అటల్ ఢిల్లీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి టాప్-2 స్ధానాన్ని సుస్థిరం చేసుకోవాలని పంజాబ్ భావిస్తుంటే.. ఢిల్లీ మాత్రం కింగ్స్ను ఓడించి తమ పరువు నిలబెట్టుకోవాలని యోచిస్తోంది,తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్ -
జోరు కొనసాగించాలని...
జైపూర్: సుదీర్ఘ విరామం అనంతరం ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడంపై దృష్టి పెట్టింది. 2014లో చివరిసారి ‘ప్లే ఆఫ్స్’కు చేరి రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్... ఆ తర్వాత 11 ఏళ్లకు మళ్లీ ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ‘టాప్–4’లో చోటు దక్కించుకుంది. ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ శిక్షణలో తొలి టైటిల్ వేట దిశగా సాగుతున్న పంజాబ్ కింగ్స్... ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 8న ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో... పాకిస్తాన్ క్షిపణి దాడులు చేయడంతో ఆ మ్యాచ్ను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు దాన్నే తాజాగా తటస్థ వేదిక జైపూర్లో నిర్వహించనున్నారు. ఈ సీజన్లో 12 మ్యాచ్లాడిన పంజాబ్ 8 విజయాలు, 3 పరాజయాలు, ఒక మ్యాచ్లో ఫలితం తేలకపోవడంతో... 17 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ పంజాబ్ నెగ్గితే... పాయింట్ల పట్టికలో టాప్–2లో నిలవడం ద్వారా ఫైనల్కు చేరేందుకు అదనంగా మరో అవకాశం పొందనుంది. మరోవైపు గత మ్యాచ్లో ముంబై చేతిలో ఓడి ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కు లీగ్లో ఇదే చివరి మ్యాచ్. ఆడిన 13 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 ఓటములు, ఒక మ్యాచ్లో ఫలితం తేలకపోవడంతో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరి పంజాబ్ జోరు కొనసాగిస్తుందా... లేక ఢిల్లీ సత్తా చాటుతుందా చూడాలి! టాపార్డర్ ఫుల్ జోష్లో... ఇప్పటి వరకు రెండు వేర్వేరు జట్లను ‘ప్లే ఆఫ్స్’కు తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్పై పంజాబ్ కింగ్స్ భారీగా ఆశలు పెట్టుకుంది. 2019, 20లో ఢిల్లీ జట్టును ‘ప్లే ఆఫ్స్’ చేర్చిన శ్రేయస్... 2024లో కోల్కతాకు మూడోసారి కప్పు అందించాడు. తాజా సీజన్లో అతడు 174.69 స్ట్రయిక్రేట్తో 435 పరుగులు చేశాడు. గతేడాదితో పోల్చుకుంటే అతడి బ్యాటింగ్లో దూకుడు పెరిగింది. ఈ సీజన్లో పవర్ప్లే ముగిసిన తర్వాత అత్యధిక స్ట్రయిక్ రేట్తో పరుగులు చేసిన రెండో ఆటగాడు శ్రేయస్ అయ్యరే. నికోలస్ పూరన్ 211.51 స్ట్రయిక్ రేట్తో పరుగులు రాబడితే... శ్రేయస్ 182.19 స్ట్రయిక్రేట్తో దంచి కొట్టాడు. ఓపెనర్లు ప్రియాన్‡్ష ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ జట్టుకు వరంగా మారారు. నిలకడ కొనసాగిస్తున్న ఈ జోడీ... ఢిల్లీతో ఈ నెలారంభంలో జరిగిన పోరులోనూ అదిరిపోయే ఆరంభం అందించింది. వీరిద్దరు తొలి వికెట్కు కేవలం 10 ఓవర్లలోనే 122 పరుగులు జోడించారు. ఈ సమయంలో అనివార్య కారణాల వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. ఈ సీజన్లో ప్రభ్సిమ్రన్ 38.17 సగటుతో 458 పరుగులు చేయగా... ప్రియాన్‡్ష ఆర్య 356 పరుగులు సాధించాడు.ఇన్గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, యాన్సెస్ రూపంలో కింగ్స్కు మెరుగైన బ్యాటింగ్ దళం ఉంది. బౌలింగ్లో అర్‡్షదీప్, యుజువేంద్ర చాహల్, యాన్సెన్, జేమీసన్ కీలకం కానున్నారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... లీగ్ నుంచి తిరుగుపయనమైన విదేశీ ఆటగాళ్లంతా తిరిగి అందుబాటులోకి రావడంతో పంజాబ్ కింగ్స్ మరింత బలంగా తయారైంది. అక్షర్ పటేల్ అనుమానమే! సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో ఒకదశలో సునాయాసంగా ‘ప్లే ఆఫ్స్’ చేరుతుందనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ముంబై చేతిలో ఓటమితో రేసు నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన ఏకైక మ్యాచ్లో మెరుగైన ఆటతీరు కనబర్చి గౌరవంగా సీజన్కు గుడబై చెప్పాలని చూస్తోంది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 56.00 సగటు, 148.67 స్ట్రయిక్రేట్తో 504 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్గా ఉండగా... అభిషేక్ పోరెల్ 301 పరుగులు చేశాడు. జ్వరం కారణంగా గత మ్యాచ్కు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో ఆడతాడో లేదో చూడాలి. అతడు అందుబాటులో లేకపోతే మరోసారి డు ప్లెసిస్ ఢిల్లీ జట్టును నడిపించనున్నాడు. డు ప్లెసిస్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్తో జట్టుకు మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.అయితే ఢిల్లీ అసలు సమస్య మాత్రం నిలకడగా వికెట్లు తీయగల ప్రధాన బౌలర్ లేకపోవడమే. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరమవడంతో ఢిల్లీ బౌలింగ్ డీలా పడింది. ముకేశ్ కుమార్, ముస్తఫిజుర్, చమీరా, కుల్దీప్ యాదవ్ ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరం. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, జోష్ ఇన్గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, మార్కో యాన్సెన్, జేమీసన్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్ దీప్ సింగ్, యుజువేంద్ర చహల్. ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, డు ప్లెసిస్, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, చమీరా, ముస్తఫిజుర్, ముకేశ్ కుమార్. -
IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారధుల్లో ఒకడైన శ్రేయస్ అయ్యర్ మరో కలికితురాయిని తన కీర్తి కిరీటంపై అమర్చుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ప్లే ఆఫ్స్కు చేర్చిన తొలి, ఏకైక కెప్టెన్గా రికార్డు సాధించాడు. 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ను రన్నరప్గా నిలబెట్టిన శ్రేయస్.. గత సీజన్లో (2024) కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపాడు. ఈ సీజన్లో పంజాబ్ ఫ్రాంచైజీ శ్రేయస్పై భారీ అంచనాలతో ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక ధర (రూ. 26.75 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే శ్రేయస్ తన తొలి ప్రయత్నంలోనే పంజాబ్ను ప్లే ఆఫ్స్కు చేర్చాడు. నిన్న (మే 18) రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించడంతో పంజాబ్ ప్లే ఆఫ్స్కు చేరింది. ఆ జట్టు 11 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించింది. చివరిగా 2014 సీజన్లో పంజాబ్ ప్లే ఆఫ్స్కు చేరింది. ఇప్పుడు తిరిగి శ్రేయస్ నేతృత్వంలో మరోసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. శ్రేయస్ తనుకు మాత్రమే సాధ్యమైన వైవిధ్యభరితమైన కెప్టెన్సీతో పంజాబ్ను ప్లే ఆఫ్స్కు చేర్చాడు. ఈ సీజన్లో పంజాబ్ శ్రేయస్ నేతృత్వంలో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 8 విజయాలు (ఓ మ్యాచ్ రద్దు) సాధించి 17 పాయింట్లతో (0.389) పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్కు ముందు ఆ జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లు పట్టికలో పంజాబ్ స్థానాన్ని డిసైడ్ చేస్తాయి. పంజాబ్ తమ చివరి రెండు లీగ్ మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (మే 24), ముంబై ఇండియన్స్తో (మే 26) తలపడాల్సి ఉంది.కాగా, నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్లో ఎనిమిదో విజయం నమోదు చేసింది. ఈ సీజన్లో చాలా మ్యాచ్ల్లో లాగే రాజస్థాన్ ఈ మ్యాచ్లోనూ గెలిచే స్థితిలో ఉండి ఓటమిపాలైంది. చివరి రెండు ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా.. 19 పరుగులకు మాత్రమే పరిమితమైంది.బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోర్ (219/5) చేసింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) దంచి కొట్టారు. ప్రభ్సిమ్రన్ (21), శ్రేయస్ అయ్యర్ (30), అజ్మతుల్లా ఒమర్జాయ్ (21 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ప్రియాంశ్ ఆర్య (9), మిచెల్ ఓవెన్ (0) విఫలమయ్యారు. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 2, మపాకా, రియాన్ పరాగ్, ఆకాశ్ మధ్వాల్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్ జురేల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్లు) రాయల్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. జన్సెన్, ఒమర్జాయ్ తలో రెండు వికెట్లు తీసి రాయల్స్ను దెబ్బకొట్టడంలో తమవంతు పాత్ర పోషించారు. -
IPL 2025: పంజాబ్ 11 ఏళ్ల తర్వాత...
జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. రాజస్తాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్పై గుజరాత్ టైటాన్స్ జట్టు నెగ్గడంతో... పంజాబ్ కింగ్స్ జట్టుకు మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ ఖరారైంది. చివరిసారి పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో మొదట పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్ జురేల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీశాడు. ధనాధన్ ఆరంభం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్కు 4, 0, 4, 4, 6, 4లతో జైస్వాల్ తొలి ఓవర్లోనే దీటైన ఆరంభమిచ్చాడు. రెండో ఓవర్ను వైభవ్ బౌండరీ, రెండు సిక్స్లతో చితగ్గొట్టాడు. దీంతో 2.5 ఓవర్లోనే రాజస్తాన్ 50 స్కోరు చేసేసింది. వైభవ్ చేసిన 40 పరుగులు 4 ఫోర్లు, 4 సిక్స్లతోనే సాధించడం విశేషం. ఐదో ఓవర్లో వైభవ్ అవుటవడంతో 76 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత యశస్వి ధాటిగా ఆడుతున్నా... సామ్సన్ (20), పరాగ్ (13) వికెట్లు పారేసుకోవడం ప్రతికూలమైంది. అయినా ధ్రువ్ జురేల్ భారీషాట్లతో ఆశలు రేపాడు. కానీ ఇంపాక్ట్ బౌలర్ హర్ప్రీత్ బ్రార్ కీలక వికెట్లను తీసి రాజస్తాన్ను దెబ్బకొట్టాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్‡్ష (సి) హెట్మైర్ (బి) తుషార్ 9; ప్రభ్సిమ్రన్ (సి) సామ్సన్ (బి) తుషార్ 21; ఒవెన్ (సి) సామ్సన్ (బి) క్వెనా మఫాక 0; నేహల్ (సి) హెట్మైర్ (బి) ఆకాశ్ 70; శ్రేయస్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 30; శశాంక్ (నాటౌట్) 59; అజ్మతుల్లా (నాటౌట్) 21; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–19, 2–34, 3–34, 4–101, 5–159. బౌలింగ్: ఫజల్హక్ 3–0–39–0, తుషార్ దేశ్పాండే 4–0–37–2, క్వెనా మఫాక 3–0–32 –1, పరాగ్ 3–0–26–1, హసరంగ 3–0–33–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఒవెన్ (బి) హర్ప్రీత్ 50; వైభవ్ (సి) బార్ట్లెట్ (బి) హర్ప్రీత్ 40; సామ్సన్ (సి) యాన్సెన్ (బి) అజ్మతుల్లా 20; పరాగ్ (బి) హర్ప్రీత్ 13; జురేల్ (సి) ఒవెన్ (బి) యాన్సెన్ 53; హెట్మైర్ (సి) బార్ట్లెట్ (బి) అజ్మతుల్లా 11; దూబే (నాటౌట్) 7; హసరంగ (సి) ప్రభ్సిమ్రన్ (బి) యాన్సెన్ 0; క్వెన మఫాక (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–109, 3–114, 4–144, 5–181, 6–200, 7–200. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–60–0, యాన్సెన్ 3–0–41–2, బార్ట్లెట్ 1–0–12–0, హర్ప్రీత్ బ్రార్ 4–0–22–3, చహల్ 4–0–30–0, అజ్మతుల్లా 4–0–44–2. -
రాజస్తాన్పై విజయం.. ప్లే ఆఫ్స్కు చేరువలో పంజాబ్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 10 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్(17 పాయింట్లు) రెండో స్ధానానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ టీమ్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండింటిలో ఓ మ్యాచ్లో విజయం సాధించినా చాలు పంజాబ్ ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధిస్తోంది.వధేరా, శశాంక్ మెరుపులుఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 70), శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే రెండు, మఫాక, పరాగ్, మధ్వాల్ తలా వికెట్ సాధించారు.ఆరంభం వచ్చినా..అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది. లక్ష్య చేధనలో రాజస్తాన్ ఓపెనర్లు(50), వైభవ్ సూర్యవంశీ(40) అద్బుతమైన ఆరంభం ఆందించారు.తొలి వికెట్కు 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ధ్రువ్జురెల్(53) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్ బౌలర్లలో హార్ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే' -
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ముంబై రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి చెలరేగారు. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్టో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. రాజస్తాన్ బౌలర్లపై పంజాబ్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 70) టాప్ స్కోరర్గా నిలవగా.. శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అత్యధిక ఐపీఎల్ స్కోర్ సాధించిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ఈ వేదికపై గతంలో రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో ముంబై రికార్డును శ్రేయస్ సేన బ్రేక్ చేసింది.అదేవిధంగా ఐపీఎల్ ఇన్నింగ్స్లో మిడిలార్డర్ నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు మొత్తం కలిపి అత్యధిక పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు కలిపి మొత్తంగా 180 పరుగులు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్(174) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ముంబైని పంజాబ్ అధిగమించింది.చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే' -
వధేరా, శశాంక్ మెరుపులు.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలోనే ఇన్ ఫామ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య(9) వికెట్ కోల్పోయినప్పటికి.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒక మిచెల్ ఓవెన్ తప్ప మిగితా అందరూ తమ పని తాము చేసుకుపోయారు.పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 70), శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే రెండు, మఫాక, పరాగ్, మధ్వాల్ తలా వికెట్ సాధించారు.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, తుషార్ దేశ్పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్హాక్ ఫరూఖీ, క్వేనా మఫాకా.ఇంపాక్ట్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, అశోక్ శర్మ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, మిచ్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్లెట్.ఇంపాక్ట్ సబ్స్: విజయ్కుమార్ వైషాక్, హర్ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్ -
అంత అన్నారు.. ఇంత అన్నారు! ఆఖరికి అరంగేట్రంలోనే డకౌట్
ఆస్ట్రేలియా యవ ఆల్రౌండర్ మిచెల్ ఓవెన్ తన ఐపీఎల్ కెరీర్ను పేలవంగా ఆరంభించాడు. ఐపీఎల్-2025లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తరపున ఓవెన్ అరంగేట్రం చేశాడు. అయితే తన తొలి మ్యాచ్లో మిచెల్ తీవ్ర నిరాశపరిచాడు.కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ఖాతా తెరవకుండానే మిచెల్ పెవిలియన్కు చేరాడు. రాజస్తాన్ యువ పేసర్ క్వేనా మఫాకా బౌలింగ్లో సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి ఓవెన్ పెవిలియన్కు చేరాడు. కాగా మరో ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ స్ధానంలో పంజాబ్ జట్టులోకి ఓవెన్ వచ్చాడు.ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు మాక్సీ గాయం కారణంగా దూరం కావడంతో.. మిచెల్ ఓవెన్ రూ.3 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. పంజాబ్ ఈ యువ ఆటగాడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఓవెన్ మాత్రం తన మొదటి మ్యాచ్లోనే తుస్సుమన్పించాడు.అంతకంటే ముందు మాక్స్వెల్ సైతం ఇదే తరహా ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు మాక్సీ స్థానంలో వచ్చిన ఓవెన్ కూడా అదే తీరును కనబరిస్తున్నాడు. అరంగేట్రంలోనే డౌకటైన ఓవెన్ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. మరో మాక్స్వెల్ జట్టులోకి వచ్చాడని వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. కాగా ఓవెన్కు మాత్రం టీ20ల్లో మెరుగైన రికార్డు ఉంది.ఈ టాస్మానియా ఆల్రౌండర్ ఇప్పటివరకు 35 టీ20 మ్యాచ్లు ఆడి 646 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 108. ఓవెన్ ఖాతాలో పది టీ20 వికెట్లు కూడా ఉన్నాయి. పంజాబ్ జట్టులో చేరకముందు ఓవెన్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ నుంచి ఆఫర్ రావడంతో పీఎస్ఎల్ మధ్యలోనే అతడు వైదొలిగాడు.Kwena Maphaka gets Mitchell Owen 0(2). ☝️Not a good start for Owen in the IPL. pic.twitter.com/XJtfKQtJpf— Rishabh Singh Parmar (@irishabhparmar) May 18, 2025 -
IPL 2025: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. తుది జట్లు ఇవే..!
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 18) మధ్యాహ్నం సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో (జైపూర్) జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా శాంసన్ గత కొన్ని మ్యాచ్లుగా దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేసింది. గాయపడ్డ నితీశ్ రాణా స్థానంలో సంజూ శాంసన్.. జోఫ్రా ఆర్చర్ స్థానంలో క్వేనా మపాకా తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మూడు మార్పులు చేసింది. మిచెల్ ఓవెన్, మార్కో జన్సెన్, ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ ఆ జట్టుకు నామమాత్రమే. మరోవైపు పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ముందువరుసలో ఉంది. ఆ జట్లు ఈ మ్యాచ్ గెలిస్తే, ప్లే ఆఫ్స్ రేసులో ముందుకెళ్తుంది.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(wk), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, తుషార్ దేశ్పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్హాక్ ఫరూఖీ, క్వేనా మఫాకా.ఇంపాక్ట్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, అశోక్ శర్మ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (WK), ప్రియాంష్ ఆర్య, మిచ్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్ (c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్లెట్.ఇంపాక్ట్ సబ్స్: విజయ్కుమార్ వైషాక్, హర్ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్ -
‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా పంజాబ్ కింగ్స్
జైపూర్: ఐపీఎల్లో అనూహ్యంగా ఆగిపోయిన తమ ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా శుభారంభం చేసిన తర్వాత మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో పంజాబ్ గెలుపు అవకాశం చేజార్చుకుంది. ఇప్పుడు లీగ్లో బలహీన జట్టుపై గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు మరింత చేరువ కావాలని జట్టు భావిస్తోంది. నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్తో పంజాబ్ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు ఇప్పటికే కోల్పోయిన రాజస్తాన్ లీగ్లో చివరి స్థానంలో నిలవకుండా ఉండాలని కోరుకుంటోంది. తొలిసారి మిచ్ ఓవెన్... ఐపీఎల్ వాయిదా పడటంతో పంజాబ్ ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఆసీస్ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్గ్లిస్ తిరిగి రావడానికి విముఖత చూపారు. దాంతో ఇప్పుడు తప్పనిసరి స్థితిలో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాక్స్వెల్ గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన మిచెల్ ఒవెన్ తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగడం ఖాయమైంది. విధ్వంసకర బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్న ఒవెన్ గత ఏడాది బిగ్బాష్ లీగ్లో టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు హోబర్ట్ హరికేన్స్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టాపార్డర్ బ్యాటర్ అయిన ఒవెన్... ప్రస్తుతం పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్, ప్రియాన్‡్ష ఆర్య అద్భుతంగా ఆడుతుండటంతో మిడిలార్డర్లో ఆడాల్సి రావచ్చు. బౌలింగ్ను పటిష్టపర్చుకోవడంలో భాగంగా కివీస్ పేసర్ కైల్ జేమీసన్ను పంజాబ్ ఆడించే అవకాశం ఉంది. శ్రేయస్, వధేరా, శశాంక్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. చహల్, అర్‡్షదీప్ ఫామ్లో ఉండటంతో పాటు మార్కో యాన్సెన్ కూడా మెరుగ్గా రాణిస్తుండటం పంజాబ్కు సానుకూలాంశం. బరిలోకి సంజు సామ్సన్... రాజస్తాన్ పేలవ ఆటతో చాలా ముందే ప్లే ఆఫ్స్ అవకాశాలు చేజార్చుకుంది. జట్టు 12 మ్యాచ్లలో 3 మ్యాచ్లే గెలిచింది. మిగిలిన మ్యాచ్లలోనైనా రాణించి పరువు కాపాడుకోవాలని టీమ్ భావిస్తోంది. నెల రోజుల క్రితం తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సంజు సామ్సన్ కోలుకొని ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా రాణిస్తుండటంతో అతను మూడో స్థానంలో ఆడతాడు. పరాగ్, జురేల్ కూడా రాణిస్తే రాయల్స్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. విదేశీ ఆటగాళ్లు హెట్మైర్, హసరంగ, తీక్షణ జట్టుతో చేరారు. అయితే టోర్నీ ఆరంభంనుంచి చాలా బలహీనంగా ఉన్న రాజస్తాన్ పేస్ బృందం ఆర్చర్, సందీప్ శర్మ దూరం కావడంతో ఇప్పుడు మరింత బలహీనంగా మారింది. తుషార్ దేశ్పాండే, ఆకాశ్ మధ్వాల్, నాండ్రే బర్గర్ పంజాబ్ బ్యాటర్లను ఎలా నిలువరిస్తారో చూడాలి. -
ఇది ‘ఇండియన్’ ప్రీమియర్ లీగ్: ఫారన్ ప్లేయర్లకు శ్రేయస్ కౌంటర్?
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి శనివారం నుంచి ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్ సీజన్ రీ స్టార్ట్ కానుంది. అయితే ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు చాలా మంది విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు. ఈ ఏడాది సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడడంతో ఫారన్ ప్లేయర్లు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో స్వదేశానికి వెళ్లిపోయిన ఆటగాళ్లలో కొంత మంది తిరిగి భారత్కు రావడానికి నిరాకరించారు. కొంతమంది జాతీయ విధుల కారణంగా దూరంగా ఉంటే, మరి కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్లో పాల్గోనేందుకు తిరిగి రాలేదు.సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు భారత్కు వచ్చినప్పటికి ప్లే ఆఫ్స్కు మాత్రం అందుబాటులో ఉండేది అనుమానమే. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆ వీడియోలో ఏముందంటే?ఐపీఎల్-2025 సెకెండ్ లెగ్ కోసం జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, జోష్ హేజిల్వుడ్, మార్కో జాన్సెన్ వంటి ఆటగాళ్లు తిరిగి వస్తారా? లేదా అని ఇద్దరు వ్యక్తులు సీరియస్గా చర్చించుకుంటారు. ఆ సమయంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జోక్యం చేసుకుని.. "మీరు మాట్లాడుకుంటున్న వాళ్లంతా నిజంగా టాలెంటెడ్ క్రికెటర్లే.కానీ ఇది 'ఇండియన్' ప్రీమియర్ లీగ్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఐపీఎల్ కొనసాగడానికి ఫారన్ ప్లేయర్స్ వస్తానే కాదు, ఇండియన్ ప్లేయర్స్ ఉంటే చాలు అని ఉద్దేశంతో అయ్యర్ అన్నాడు.Yatra pratibha avsara prapnotihi! ❤️ pic.twitter.com/UBRjCs8Bua— Punjab Kings (@PunjabKingsIPL) May 17, 2025 -
పంజాబ్ జట్టులోకి డేంజరస్ ప్లేయర్ ఎంట్రీ.. ఇక దబిడి దిబిడే?
ఐపీఎల్-2025 పునఃప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్కు గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్రౌండర్ మిచెల్ ఓవెన్ పంజాబ్ జట్టులో బుధవారం చేరాడు. గాయం కారణంగా ఐపీఎల్కు దూరమైన ఆరో ఆసీస్ ఆటగాడు మ్యాక్స్వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్ను పంజాబ్ మెనెజ్మెంట్ ఎంపిక చేసింది.కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మధ్యలో ఆగిపోవడంతో ఓవెన్.. పంజాబ్ జట్టుతో చేరడం కాస్త ఆలస్యమైంది. గురువారం(మే 15) నెట్ ప్రాక్టీస్ సెషన్స్లో పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. ఓవెన్ను సహచర ఆటగాళ్లకు పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ కింగ్స్ ఎక్స్లో షేర్ చేసింది. కాగా ఈ ఆసీస్ క్రికెటర్ ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో పెషావల్ జల్మి జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అతడు ఈనెల 9న ఆ జట్టు చివరి గ్రూప్ మ్యాచ్ ఆడాక ఓవెన్ ఐపీఎల్లో భాగం కావాల్సి ఉండేది. కానీ పీఎస్ఎల్ కూడా అర్ధాంతరంగా వాయిదా పడడంతో చివరి మ్యాచ్ ఆడకుండానే ఓవెన్ భారత్కు చేరుకున్నాడు.ఎవరీ మిచెల్ ఓవెన్..?23 ఏళ్ల మిచెల్ ఓవెన్ లిస్ట్-ఎ, ఫస్ట్క్లాస్ క్రికెట్ రెండింటిలోనూ టాస్మానియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 22, 2021న మార్ష్ వన్-డే కప్తో లిస్ట్-ఎ క్రికెట్లో అడుగుపెట్టిన ఓవెన్.. షెఫీల్డ్ షీల్డ్లో సౌత్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అక్టోబర్ 3, 2023న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. టీ20ల్లో కూడా అతడికి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 35 టీ20లు ఆడిన ఓవెన్ 647 పరుగులు చేశాడు. అందులో 452 పరుగులు ఈ ఏడాది బిగ్బాష్ సీజన్లో చేసినవే కావడం గమనార్హం. బీబీఎల్ 2024-25 సీజన్లో ఓవెన్ 452 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. సిడ్నీ థండర్తో జరిగిన ఫైనల్లో మ్యాచ్లో ఓవెన్ విధ్వసకర సెంచరీతో చెలరేగాడు.కేవలం 39 బంతుల్లోనే ఓవెన్ తన రెండో బీబీఎల్ సెంచరీ మార్క్ను ఓవెన్ అందుకున్నాడు. ఓవెన్కు పేస్ బౌలింగ్ చేసే సత్తాకూడా ఉంది. అతడు త్వరలోనే ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్-2025 సీజన్ మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.చదవండి: ICC: డబ్ల్యూటీసీ ప్రైజ్మనీ ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎన్ని కోట్లంటే? -
‘మాక్స్వెల్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా
ప్రీతి జింటా (Preity Zinta).. కేవలం నటిగానే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమానిగానూ గుర్తింపు సంపాదించారు. ఐపీఎల్ వేలం సమయంలో ఆటగాళ్ల కొనుగోలు విషయంలో అనుసరించే వ్యూహాలలో భాగమయ్యే ప్రీతి.. స్టేడియంలో తమ జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరచడంలోనూ ముందే ఉంటారు.ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో టైటిల్ దిశగా పంజాబ్ కింగ్స్ దూసుకుపోతుండటంతో ప్రీతి ఆనందంలో మునిగితేలుతున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తన వ్యక్తిగత విషయాలతో పాటు, పంజాబ్ జట్టుకు సంబంధించిన విశేషాలను కూడా షేర్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలో ఇటీవల ప్రీతి జింటాకు చేదు అనుభవం ఎదురైంది. ‘ఎక్స్’ వేదికగా ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించగా ఓ నెటిజన్ అనుచిత ప్రశ్నతో ప్రీతికి ఆగ్రహం తెప్పించాడు.మాక్స్వెల్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే..పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ప్రదర్శనను ప్రీతితో ముడిపెడుతూ.. ‘‘మేడమ్.. మీరు మాక్స్వెల్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే.. అతడు మీ జట్టుకు సరిగ్గా ఆడటం లేదు’’ అంటూ నీచంగా కామెంట్ చేశాడు. ఇందుకు ప్రీతి జింటా గట్టిగానే బదులిచ్చారు.ఇదే ప్రశ్న వారినీ అడగగలవా? ‘‘ఐపీఎల్ ఫ్రాంఛైజీల పురుష యజమానులను కూడా నువ్వు ఇదే ప్రశ్న అడగగలవా? లేదా మహిళను కాబట్టి నా పట్ల ఇలా వివక్షపూరితంగా కామెంట్ చేస్తున్నావా?క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేంత వరకు కార్పొరేట్ సెటప్లో మహిళలు ఎంతగా కష్టపడాల్సి వస్తుందో నాకసలు తెలియదు. నాకు తెలిసి నువ్వు ఏదో సరదా కోసమని ఇలా మాట్లాడి ఉంటావు.. కానీ దయచేసి ఇలా చెత్తగా ప్రవర్తించవద్దు.గత పద్దెమినిదేళ్లుగా నేను కష్టపడి సంపాదించుకున్న పేరుకు కాస్త గౌరవం ఇవ్వండి. అందుకు నేను కచ్చితంగా అర్హురాలినే. ఇలా లింగవివక్షకు పాల్పడటం సరికాదు.. ధన్యవాదాలు’’ అంటూ ప్రీతి జింటా దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపుగా ఖాయంకాగా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకున్న పంజాబ్.. టైటిల్ లేని లోటును ఈసారి ఎలాగైనా తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్లో ఇప్పటికి 11 మ్యాచ్లు పూర్తి చేసుకుని ఏడింట గెలిచింది. ప్రస్తుతం 15 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.ఇక ఇటీవల భారత్- పాకిస్తాన్ సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ధర్మశాలలో బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో హుటాహుటిన స్టేడియాన్ని ఖాళీ చేయించాల్సి రాగా.. ప్రీతి జింటా కూడా తన వంతు సాయం చేశారు.మరోవైపు.. ఐపీఎల్లో గతంలో పంజాబ్కు ప్రాతినిథ్యం వహించిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్.. ఐపీఎల్-2025లో తిరిగి జట్టుతో చేరాడు. అయితే, ఈసారి అతడి ప్రదర్శన అస్సలు బాగాలేదు. ఏడు మ్యాచ్లు ఆడి కేవలం 48 పరుగులే చేశాడు. ఇక గాయం కారణంగా మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. చదవండి: తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?: భారత మాజీ క్రికెటర్ -
IPL 2025: ఆటగాళ్లను రప్పించండి.. ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు?
ఐపీఎల్-2025 టోర్నీని వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలనిఫ్రాంఛైజీలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.అదే విధంగా.. విదేశీ ఆటగాళ్లను కూడా వీలైంత త్వరగా భారత్కు రప్పించాలని ఆదేశించినట్లు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మే 25న ఫైనల్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబుల్ హెడర్ మ్యాచ్లుఇందులో భాగంగా డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు) మ్యాచ్లు నిర్వహించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్ తాజా ఎడిషన్ 57 మ్యాచ్లు పూర్తైన తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే.పహల్గామ్ ఉగ్రదాడికి.. భారత్ ఆపరేషన్ సిందూర్తో గట్టిగా బదులిస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్- పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని భారత్ దాడులు చేస్తే.. పాకిస్తాన్ మాత్రం సామాన్యులు, భారత సైనిక స్థావరాలపై దాడులకు తెగబడింది. అయితే, భారత సైన్యం వీటిని సమ ర్థవంతంగా తిప్పికొట్టింది.అర్ధంతరంగా ముగిసిపోయిందిఈ క్రమంలో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది. శత్రువును దారి మళ్లించే క్రమంలో ధర్మశాలలో బ్లాకవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో ఆట మధ్యలోనే స్టేడియాన్ని ఖాళీ చేయించారు.ఈ నేపథ్యంలో తాజా ఐపీఎల్ సీజన్ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. అయితే, శనివారం భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, దాయాది మరోసారి తన వంకర బుద్ధిని చూపి.. దాడులకు తెగబడింది. తెల్లవారిన తర్వాత మాత్రం పరిస్థితులు కాస్త సద్దుమణినట్లు తెలుస్తోంది.ఆ జట్టుకు మాత్రం తటస్థ వేదికఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం భేటీ అయిన బీసీసీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘మంగళవారం నాటికి అన్ని ఫ్రాంఛైజీలు తమ మ్యాచ్లు జరిగే వేదికలకు ఆటగాళ్లను చేర్చాలని బోర్డు ఆదేశించింది.పంజాబ్ జట్టుకు మాత్రం తటస్థ వేదిక ఉంటుంది. కాబట్టి ఇంకా వారి గమ్యస్థానాన్ని నిర్దేశించలేదు. త్వరితగతిన టోర్నీని పూర్తి చేసేందుకు డబుల్ హెడర్ మ్యాచ్లు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది’’ అని తెలిపాయి.కాగా ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్-4లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఇక సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతేభారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘‘మిగిలిన మ్యాచ్లను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. వేదికలు, తేదీలు కొత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.స్టేక్హోల్డర్లు, జట్ల యజమానులు, ప్రసారకర్తలు.. ఇలా లీగ్లో భాగమైన ప్రతి ఒక్కరితో చర్చలు జరపాలి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.చదవండి: BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు! -
IPL 2025, DC VS PBKS: బ్లాక్ అవుట్కు ముందు బ్లో అవుట్
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న (మే 8) ధర్మశాల వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమైన మ్యాచ్ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. బ్లాక్ అవుట్ ప్రకటనకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ పరుగుల వరద పారించింది. ఆ జట్టు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్ ప్లేలో 69 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన ప్రియాంశ్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రభ్సిమ్రన్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి సీజన్లో వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించాడు. ప్రియాంశ్, ప్రభ్సిమ్రన్ పోటీపడి చెలరేగడంతో పంజాబ్ 10 ఓవర్లలో ఏకంగా 122 పరుగులు చేసింది.అనంతరం 11వ ఓవర్ తొలి బంతికే సీజన్ తొలి మ్యాచ్ ఆడుతున్న నటరాజన్ ప్రియాంశ్ ఆర్యను ఔట్ చేశాడు.అప్పుడే అధికారుల నుంచి బ్లాక్ అవుట్ సమాచారం రావడంతో స్టేడియం నిర్వహకులు ఓ ఫ్లడ్ లైట్ను బంద్ చేశారు. కొద్ది సేపటికి మరో రెండు ఫ్లడ్ లైట్లు కూడా బందయ్యాయి. దీని తర్వాత మరి కొద్ది సేపటికి మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆటగాళ్లు సహా స్టేడియం మొత్తం ఖాళీ చేయాలని అత్యవసర ప్రకటన వచ్చింది.తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు. మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠాన్కోట్ గుండా ఢిల్లీకి తరలించారు.బ్లాక్ అవుట్ అంటే ఏంటి..?యుద్ధం లేదా ఎమర్జెన్జీ పరిస్థితుల్లో నగరాన్ని మొత్తం చీకటి చేయడం. శత్రువుల వైమానిక దాడులను కష్టతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇలా చేస్తే శత్రువుల టార్గెట్ మిస్ అవుతుంది. ఫలితంగా దాడుల నుంచి రక్షణ పొందొచ్చు. -
చరిత్ర సృష్టించిన ప్రభ్సిమ్రన్ సింగ్.. తొలి ప్లేయర్గా రికార్డు
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కూడా ప్రభ్సిమ్రాన్ బ్యాట్ ఝూళిపించాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను ప్రభ్సిమ్రాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున వరుసగా అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్గా రికార్డులెక్కాడు. ఈ ఏడాది సీజన్లో ప్రభుసిమ్రాన్ వరుసగా హాఫ్ సెంచరీలను సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మాక్స్వెల్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా వరుసగా మూడు సార్లు పంజాబ్ తరపున హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.తాజా మ్యాచ్లో ఆర్ధశతకంతో మెరిసిన ప్రభ్సిమ్రాన్ వీరిని అధిగమించాడు. అదేవిధంగా ఐపీఎల్లో నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి అన్క్యాప్డ్ ప్లేయర్ కూడా ప్రభ్సిమ్రానే కావడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటికి (ఈ మ్యాచ్తో కలిపి) 12 ఇన్నింగ్స్లు ఆడిన ప్రభ్సిమ్రన్ 487 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్దానంలో కొనసాగుతున్నాడు.మ్యాచ్ రద్దు..కాగా భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ను నిర్వహకులు రద్దు చేశారు.భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నడుమ స్ధానికంగా బ్లాక్ అవుట్ విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్ను మధ్యలోనే ఆపేశారు. మ్యాచ్ రద్దు అయ్యే సమయానికి పంజాబ్ స్కోర్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. -
ధర్మశాలలో బ్లాక్ అవుట్..? పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మ్యాచ్ రద్దు
ఐపీఎల్-2025లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దు అయింది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ను నిర్వహకులు రద్దు చేశారు. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నడుమ స్ధానికంగా బ్లాక్ అవుట్ విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్ను మధ్యలోనే ఆపేశారు. ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ స్వయంగా రంగంలోకి దిగి ప్రేక్షకులను స్టేడియం నుంచి బయటకు పంపించారు. జమ్మూలో జారీ చేయబడిన రెడ్ అలర్ట్ ఆధారంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ మ్యాచ్ను రద్దు చేసినట్లు ధుమాల్ పేర్కొన్నారు. వర్షం కారణంగా గంట ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్కు దిగింది. పంజాబ్ స్కోర్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య ఔటైన వెంటనే స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ఫ్లడ్ లైట్ల సమస్య తలెత్తడంతో మ్యాచ్ ఆగిపోయిందని అంతా భావించారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఉద్డేశ్వపూర్వకంగానే ఫ్లడ్ లైట్స్ ఆపి, మ్యాచ్ రద్దు చేశారు. అయితే టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగానే మ్యాచ్ని రద్దు చేస్తున్నట్టుగా బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్ రద్దు కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు చెరో పాయింట్ లభించింది.#WATCH | Dharamshala: Sudhir, a cricket fan says, "The match has been called off because of security reasons. What do we have to be afraid of? We are in our country. If anyone, it should be Pakistan who should be afraid. Bharat Mata ki Jai." https://t.co/N3YDWolW07 pic.twitter.com/QjiNCQn9sZ— ANI (@ANI) May 8, 2025IPL Chairman requesting fans to leave the Dharamshala Stadium. pic.twitter.com/9rVqVfPa12— Bhagavad Gita 🪷 (@Geetashloks) May 8, 2025 -
పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దు
IPL 2025 PBKS vs DC Live Updates: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దుధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దు అయింది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ను నిర్వహకులు రద్దు చేశారు.పంజాబ్ తొలి వికెట్ డౌన్..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన ఆర్య.. టి. నటరాజన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 10.1 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య హాఫ్ సెంచరీపంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య హాఫ్ సెంచరీ సాధించాడు. ఆర్య 56 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 9 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. క్రీజులో ఆర్యతో పాటు ప్రభుసిమ్రాన్ సింగ్(45) ఉన్నారు.6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 69/06 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో ఆర్య(42), ప్రభ్సిమ్రాన్ సింగ్(26) ఉన్నారు.2 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 20/02 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(12), ప్రభ్సిమ్రాన్ సింగ్(3) ఉన్నారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మరి కాసేపట్లో టాస్అభిమానులు గుడ్ న్యూస్. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ 8:30 గంటలకు ప్రారంభం కానుంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో 8:00 గంటలకు టాస్ పడనుంది.టాస్ మరింత ఆలస్యం..ధర్మశాలలో ప్రస్తుతం వర్షం భారీగా కురుస్తోంది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది.ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ప్రస్తుతం వర్షం ఆగినప్పటికి, మైదానాన్ని మాత్రం కవర్లతో కప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది. -
Operation Sindoor: ఐపీఎల్-2025లో ఓ మార్పు
ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ (MI Vs PBKS)జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం (మే 11) ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో వేదికను ధర్మశాల (Dharmashala) నుంచి అహ్మదాబాద్కు మార్చారు.సిద్ధంగా ఉన్నాంగుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ఈ విషయం గురించి స్పోర్ట్స్టార్కు వెల్లడించారు. ‘‘చివరి నిమిషంలో ధర్మశాల నుంచి వేదికను మార్చాల్సి వచ్చినపుడు.. బీసీసీఐ మమ్మల్ని సంప్రదించింది. మ్యాచ్ నిర్వహణకు మేము సిద్ధంగా ఉన్నామని వారికి సమాచారం ఇచ్చాము’’ అని తెలిపారు.కాగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పంజాబ్ కింగ్స్కు రెండో సొంత మైదానం. ఇక్కడ మూడు మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ శ్రేయస్ సేన ఓ మ్యాచ్ ఆడింది. మే 3న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడి 37 పరుగులు తేడాతో గెలిచింది.ఇక ఈ రోజు అంటే మే 8న ఢిల్లీ క్యాపిటల్స్తో పంజాబ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో మే 11న ముంబై ఇండియన్స్ను ఢీకొట్టాల్సి ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రెండు రోజుల పాటు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు అక్కడికి ప్రయాణించే పరిస్థితి లేదు.వాంఖడేకు మారుస్తారనుకుంటేఈ నేపథ్యంలో వేదికను ముంబైలోని వాంఖడేకు మారుస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఏ జట్టుకు హోం అడ్వాంటేజీ ఉండకూడదనే ఉద్దేశంతో వేదికను తటస్థంగా అహ్మదాబాద్కు మార్చినట్లు సమాచారం. నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు ముంబై గురువారమే అక్కడికి చేరుకునే అవకాశం ఉండగా.. పంజాబ్ ఢిల్లీతో మ్యాచ్ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకోనుంది.భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లుకాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట ముష్కరులకు బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో దాయాది దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాద శిబిరాలపై దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. మిసైళ్లతోనూ దాడి చేయగా భారత్ విజయవంతంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో ధర్మశాలలో పంజాబ్- ఢిల్లీ మ్యాచ్కు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.ఇదిలా ఉంటే.. పంజాబ్ ఇప్పటికి పదకొండు మ్యాచ్లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ప్రస్తుతం 15 పాయింట్లు కలిగి ఉన్న పంజాబ్.. పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు ముంబై నాలుగో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!The many colours of IPL 🎨From the eyes of Painter Andy Brown 🧑🎨Presenting - 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗮𝗻𝗱 𝗖𝗮𝗻𝘃𝗮𝘀 ft. #TATAIPL 🌄WATCH the full video 🎥 🔽 -By @mihirlee_58 | #PBKSvDChttps://t.co/EfOvuYOD86 pic.twitter.com/wtbw0VMNMS— IndianPremierLeague (@IPL) May 8, 2025 -
MI Vs PBKS: ముంబై, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు!
న్యూఢిల్లీ/ధర్మశాల: ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం (మే 11) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం పంజాబ్ రెండో సొంత మైదానమైన ధర్మశాలలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా... ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రెండు రోజుల పాటు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై జట్టు ధర్మశాలకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన మ్యాచ్ను ముంబైలోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకార చర్యగా భారత సైన్యం... పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు విమానాశ్రయాలను మూసి వేసింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ కోసం ముంబై జట్టు ధర్మశాల చేరుకోవడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ‘ఈ మ్యాచ్ ముంబైలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని అన్నారు. కాగా... గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ యథావిథిగా జరగనుంది. ఈ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే ధర్మశాల చేరుకోవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ‘బీసీసీఐ నుంచి కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో గురువారం మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేశాం. అధికారికంగా చెప్పనంత వరకు షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తాం’ అని హిమాచల్ప్రదేశ్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు వేదిక మార్పునకు సంబంధించిన బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం వెల్లడించింది. ఇక ఐపీఎల్ సాగడంపై ఎలాంటి అనుమానాలు లేవని... ప్రభుత్వ సూచనల మేరకు లీగ్ నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు. -
IPL 2025: కెప్టెన్గా ధోనిని అధిగమించిన శ్రేయస్ అయ్యర్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుత సీజన్లో పంజాబ్ కింగ్స్ సారధిగా వ్యవహరిస్తున్న అయ్యర్.. వివిధ జట్ల తరఫున (ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్) 81 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించి 45 విజయాలు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో కనీసం 80 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన వారిలో శ్రేయస్దే అత్యధిక విజయాల శాతం.తాజాగా లక్నోపై విజయంతో (ధర్మశాల) ఐపీఎల్లో శ్రేయస్ విన్నింగ్ పర్సెంటేజీ 58.22కు చేరింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ అయిన ధోనిని శ్రేయస్ విన్నింగ్ పర్సెంటేజీ అంశంలో అధిగమించాడు. ఐదు సార్లు సీఎస్కేను ఛాంపియన్గా నిలబెట్టిన ధోని ప్రస్తుత సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో సీఎస్కేకు స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్లో 6 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన ధోని కేవలం ఒకే ఒకే మ్యాచ్లో (లక్నోపై) తన జట్టును విజయపథాన నడిపించాడు.తాజా వైఫల్యాల తర్వాత కెప్టెన్గా ధోని ట్రాక్ రికార్డు అమాంతం పడిపోయింది. అతని విన్నింగ్ పర్సంటేజీ 58.82 నుంచి 57.75కి దిగజారింది. ఈ మధ్యలో వరుస విజయాలు సాధించిన శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా ధోనిని అధిగమించారు.ఈ సీజన్లోనే పంజాబ్ కెప్టెన్గా నియమితుడైన శ్రేయస్ తన జట్టుకు అపురూపమైన విజయాలు అందిస్తూ ప్లే ఆఫ్స్ దిశగా నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో శ్రేయస్ నేతృత్వంలో పంజాబ్ ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 7 విజయాలతో 15 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానాంలో కొనసాగుతుంది. 2014 సీజన్ తర్వాత పంజాబ్ ఓ సీజన్లో 15 పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. నిన్న మ్యాచ్ జరిగిన ధర్మశాలతో పంజాబ్ 12 ఏళ్ల తర్వాత గెలిచింది. ఈ సీజన్లో పంజాబ్ శ్రేయస్ కెప్టెన్సీలో గతానికి భిన్నంగా సాగుతోంది. పంజాబ్ ఇదే జోరును కొనసాగిస్తే వారి టైటిల్ కల నెరవేరుతుంది. గత సీజన్లో కేకేఆర్ను ఛాంపియన్గా, అంతకుముందు ఢిల్లీని రన్నరప్గా నిలబెట్టిన శ్రేయస్.. పంజాబ్ తలరాత మారుస్తాడేమో చూడాలి.ప్రస్తుత ఐపీఎల్ కెప్టెన్ల విజయాల శాతం..శ్రేయస్ అయ్యర్- 58.22 (81 మ్యాచ్లు)ధోని- 57.75 (232 మ్యాచ్లు)హార్దిక్ పాండ్యా- 60.00 (55 మ్యాచ్లు)రిషబ్ పంత్- 52.77 (54 మ్యాచ్లు)రహానే- 40.00 (36 మ్యాచ్లు)కమిన్స్- 46.15 (26 మ్యాచ్లు)శుభ్మన్ గిల్- 54.54 (22 మ్యాచ్లు)అక్షర్ పటేల్- 50.00 (11 మ్యాచ్లు)రజత్ పాటిదార్- 72.72 (11 మ్యాచ్లు)రియాన్ పరాగ్- 25.00 (8 మ్యాచ్లు) -
IPL 2025: సింగ్ ఈజ్ కింగ్.. పైసా వసూల్ ప్రదర్శనలు చేస్తున్న అర్షదీప్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్షదీప్ సింగ్ పైసా వసూల్ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ పంజాబీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఆ సీజన్ మెగా వేలంలో ఆర్టీమ్ కార్డు ఉపయోగించి రూ. 18 కోట్లకు తిరిగి దక్కించుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే అర్షదీప్ ఈ సీజన్లో చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో పంజాబ్ సాధించిన ప్రతి విజయంలో అర్షదీప్ ప్రధానపాత్ర పోషించాడు. దాదాపు అన్ని మ్యాచ్ల్లో అర్షదీప్ వికెట్లు తీశాడు. వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా కూడా బౌలింగ్ చేశాడు. నిన్న ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లక్నో ప్రధాన బ్యాటర్లు, విధ్వంసకర వీరులు మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ను తన తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్కు పంపాడు. తద్వారా ఈ మ్యాచ్లో పంజాబ్ లక్నోపై ఆదిలోనే పట్టు సాధించి, చివరికి 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అర్షదీప్ మున్ముందు జరుగబోయే మ్యాచ్ల్లో కూడా ఇలాంటి ప్రదర్శనలే కొనసాగిస్తే పంజాబ్ తొలి టైటిల్ గెలవడం ఖాయం.ఈ సీజన్లో అర్షదీప్ ప్రదర్శనలు..2/36 vs GT (4)3/43 vs LSG (4)1/35 vs RR (4)0/39 vs CSK (4)1/37 vs SRH (4)1/11 vs KKR (3)2/23 vs RCB (3)1/26 vs RCB (3)0/0 vs KKR (0)- వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైంది2/25 vs CSK (3.2)3/16 vs LSG (4)నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్లో మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (4 బంతుల్లో 1) విఫలమైనా, మిగతా బ్యాటర్లంతా సత్తా చాటారు. వన్డౌన్లో వచ్చిన జోష్ ఇంగ్లిస్ 14 బంతుల్లో బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 30, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 45, నేహల్ వధేరా 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 16 పరుగులు చేశారు. ఆఖర్లో శశాంక్ సింగ్ తాండవం చేశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ సాయంతో అజేయమైన 33 పరుగులు చేశాడు. ఇదే సమయంలో స్టోయినిస్ (5 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా బ్యాట్ ఝులిపించాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ రాఠీ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. 73 పరుగులకే తమ కీలక బ్యాటర్ల వికెట్లన్నీ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లక్నో టాపార్డార్ పేకమేడలా కూలింది. అర్షదీప్ 27 పరుగులకే మార్క్రమ్ (13), మిచెల్ మార్ష్ (0), నికోలస్ పూరన్ను (6) ఔట్ చేశాడు. ఆతర్వాత ఒమర్జాయ్.. రిషబ్ పంత్ (18), డేవిడ్ మిల్లర్ను (11) పెవిలియన్కు పంపాడు. ఈ దశలో ఆయుశ్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రతిఘటించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 81 పరుగులు జోడించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమద్ ఔటయ్యే సమయానికి (16.4వ ఓవర్) లక్నో 20 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉండింది. దాదాపుగా అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి ఓవర్ తొలి బంతికి బదోని కూడా ఔటయ్యాడు. దీంతో లక్నో ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. అర్షదీప్ 3, ఒమర్జాయ్ 2, జన్సెన్, చహల్ తలో వికెట్ తీసి లక్నోను దెబ్బ కొట్టారు. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (15 పాయింట్లు) చేరి ప్లే ఆఫ్స్కు చేరువైంది. దాదాపు 10 సీజన్ల తర్వాత పంజాబ్ 15 పాయింట్లు సాధించింది. పంజాబ్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఢిల్లీ (మే 8), ముంబై ఇండియన్స్ (మే 11), రాజస్థాన్తో (మే 16) తలపడాల్సి ఉంది. -
2014 సీజన్లో కూడా ఇలాగే.. పంజాబ్ టైటిల్ గెలుస్తుందా..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్లే ఆఫ్స్కు చేరువైంది. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 7 విజయాలు (15 పాయింట్లు) సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్నా ఇప్పటివరకు టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ఒకటి. ఈ జట్టు 2014 సీజన్లో అత్యుత్తమంగా ఫైనల్కు చేరింది. 17 ఏళ్ల ప్రస్తానంలో పంజాబ్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. ఏకైక సారి.కాగా, 2014 సీజన్ తరహాలోనే పంజాబ్ ఈ సీజన్లోనూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ సీజన్ తర్వాత తొలిసారి ఈ సీజన్లోనే 15 పాయింట్లు సాధించింది. నాడు (2014) టేబుల్ టాపర్గా నిలిచి ప్లే ఆఫ్స్కు చేరిన పంజాబ్.. ఫైనల్లో కేకేఆర్ చేతిలో పరాజయంపాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ సీజన్లోలాగే పంజాబ్ ఈ సీజన్లోనూ పటిష్టంగా కనిపిస్తూ సామర్థ్యం మేరకు రాణిస్తుంది. ఇదే ఊపును మున్ముందు జరుగబోయే మ్యాచ్ల్లో కొనసాగిస్తే పంజాబ్ తమ తొలి టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.శ్రేయస్ అయ్యర్ రాకతో ఈ సీజన్లో పంజాబ్ ఫేట్ మారినట్లు స్పష్టమవుతుంది. గతంలో ఎన్నడూ లేనట్లు ఆ జట్టు ప్రతి మ్యాచ్లో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పంజాబ్ ఈ సీజన్లో సక్సెస్ సాధించడంలో ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. పాంటింగ్ ఆథ్వర్యంలో ప్రతి పంజాబ్ ఆటగాళ్లు ఉరకలేస్తున్నాడు. ఈ సీజన్లో పంజాబ్ బ్యాటింగ్ విభాగం అన్ని జట్ల కంటే పటిష్టంగా ఉంది. మెగా వేలంలో పాంటింగ్ కీలకంగా వ్యవహరించి ప్రియాంశ్ ఆర్య లాంటి యువ టాలెంట్ను అక్కున చేర్చుకున్నాడు. ఈ సీజన్లో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ విశేషంగా రాణిస్తున్నాడు. మెగా వేలానికి ముందు పంజాబ్ సిమ్రన్ను అట్టిపెట్టుకుంది. ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకానికి సిమ్రన్ న్యాయం చేస్తున్నాడు. మెగా వేలంలో రికార్డు ధర పెట్టి సొంతం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ వ్యక్తిగతంగా రాణించడమే కాకుండా కెప్టెన్గా కూడా విజయవంతమవుతున్నాడు. పంజాబ్ యాజమాన్యం ఎంతో నమ్మకంతో అట్టిపెట్టుకున్న శశాంక్ సింగ్, నేహల్ వధేరా ఓ మోస్తరు చేస్తూ పర్వాలేదనిపిస్తున్నారు.ఈ సీజన్లో పంజాబ్ విజయాల్లో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. అర్షదీప్ పైసా వసూల్ ప్రదర్శనలు చేస్తుండగా.. చహల్, జన్సెన్ సామర్థ్యం మేరకు రాణిస్తున్నారు.మొత్తంగా చూస్తే ఈ సీజన్లో పంజాబ్కు ఛాంపియన్ అయ్యేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఫామ్ లేమితో బాధపడుతున్న మ్యాక్స్వెల్ గాయం కారణంగా వైదొలగడం కూడా పంజాబ్కు కలిసొచ్చే అంశమే. అతడి స్థానంలో మరో విధ్వంసకర బ్యాటర్ మిచెల్ ఓవెన్ను అక్కున చేర్చుకుంది పంజాబ్ మేనేజ్మెంట్. ఆసీస్ ఆటగాళ్లు స్టోయినిస్, ఇంగ్లిస్ సామర్థ్యం మేరకు రాణిస్తే ఈ సీజన్లో పంజాబ్ టైటిల్ గెలవడాన్ని ఎవరూ ఆపలేరు. 2014 తర్వాత సీజన్ల వారీగా పంజాబ్ పాయింట్లు2015- 6 పాయింట్లు2016- 82017- 142018- 122019- 122020- 122021- 122022- 142023- 122024- 102025- 15* -
PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 4) రాత్రి జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్లో మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (4 బంతుల్లో 1) విఫలమైనా, మిగతా బ్యాటర్లంతా సత్తా చాటారు. వన్డౌన్లో వచ్చిన జోష్ ఇంగ్లిస్ 14 బంతుల్లో బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 30, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 45, నేహల్ వధేరా 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 16 పరుగులు చేశారు. ఆఖర్లో శశాంక్ సింగ్ తాండవం చేశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ సాయంతో అజేయమైన 33 పరుగులు చేశాడు. ఇదే సమయంలో స్టోయినిస్ (5 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా బ్యాట్ ఝులిపించాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ రాఠీ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. 73 పరుగులకే తమ కీలక బ్యాటర్ల వికెట్లన్నీ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లక్నో టాపార్డర్ పేక మేడలా కూలింది. అర్షదీప్ 27 పరుగులకే మార్క్రమ్ (13), మిచెల్ మార్ష్ (0), నికోలస్ పూరన్ను (6) ఔట్ చేశాడు. ఆతర్వాత ఒమర్జాయ్.. రిషబ్ పంత్ (18), డేవిడ్ మిల్లర్ను (11) పెవిలియన్కు పంపాడు. ఈ దశలో ఆయుశ్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రతిఘటించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 81 పరుగులు జోడించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమద్ ఔటయ్యే సమయానికి (16.4వ ఓవర్) లక్నో 20 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉండింది. దాదాపుగా అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి ఓవర్ తొలి బంతికి బదోని కూడా ఔటయ్యాడు. దీంతో లక్నో ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. అర్షదీప్ 3, ఒమర్జాయ్ 2, జన్సెన్, చహల్ తలో వికెట్ తీసి లక్నోను దెబ్బ కొట్టారు. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్కు చేరువయ్యింది. ఈ ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లక్నో ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్లు గెలిచినా ఇతర జట్ల జయాపజయాలపై వారి ఫేట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం లక్నో రన్ రేట్ (-0-469) కూడా చాలా తక్కువగా ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లలో ఈ ఒక్క జట్టు రన్రేట్ మాత్రమే మైనస్లో ఉంది. లక్నో ఒక వేళ మూడు మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కాలంటే భారీ తేడాతో గెలవాలి.మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. చాలా ఎక్కువ పరుగులు ఇచ్చాము. రాంగ్ టైమ్లో కీలక క్యాచ్లు వదిలేశాము. అది బాగా దెబ్బకొట్టింది. జారవిడిచిన క్యాచ్ల ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని అనుకున్నాము. మేము ఆదిలోనే లయ తప్పాము. అక్కడే మ్యాచ్ కోల్పోయాము. ఇప్పటికీ మా ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. తదుపరి మూడు మ్యాచ్లను గెలిస్తే, మేము ఖచ్చితంగా రేసులో ఉంటాము.సీజన్ మొత్తంలో మా టాపార్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. అయితే ప్రతి మ్యాచ్లో వారి నుంచే ఆశించలేము. ప్రతిసారి వారు జట్టును గెలిపించలేరు. మిగతా వారు కూడా బాధ్యత తీసుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్లో మేము భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. అది తీవ్రంగా బాధించింది -
పంజాబ్ పరాక్రమం
ధర్మశాల: ఐపీఎల్లో ఎప్పుడో 2014లో ఫైనల్ చేరిన పంజాబ్ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ‘టాప్–4’లో నిలిచేందుకు మరింత చేరువైంది. సమష్టి ప్రదర్శనతో చెలరేగిపోతున్న జట్టు ఆదివారం జరిగిన పోరులో 37 పరుగులతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్స్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్లు), శశాంక్ సింగ్ (15 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), జోష్ ఇన్గ్లిస్ (14 బంతుల్లో 30; 1 ఫోర్, 4 సిక్స్లు) జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఆయుశ్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్స్లు), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడైన బ్యాటింగ్తో పోరాడినా విజయానికి అది సరిపోలేదు. సమష్టిగా చెలరేగి... తొలి ఓవర్లోనే ప్రియాన్షి ఆర్య (1) అవుట్ కావడం మినహా ఇన్నింగ్స్ ఆసాంతం పంజాబ్ హవానే సాగింది. బరిలోకి దిగిన మిగతా ఆరుగురు బ్యాటర్లూ మెరుపు షాట్లతో దూకుడు ప్రదర్శించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. మయాంక్ తొలి ఓవర్లో ఇన్గ్లిస్ వరుసగా 3 సిక్సర్లతో చెలరేగిపోగా... అతని రెండో ఓవర్లో ప్రభ్సిమ్రన్ 2 సిక్స్లు, ఫోర్ బాదాడు. ప్రభ్సిమ్రన్ 21 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిడాఫ్లో సులువైన క్యాచ్ వదిలేసి పూరన్ పెద్ద తప్పిదం చేశాడు! పవర్ప్లేలో పంజాబ్ 66 పరుగులు చేసింది. 30 బంతుల్లో ప్రభ్సిమ్రన్ వరుసగా మూడో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. శ్రేయస్ కూడా కొన్ని చక్కటి షాట్లతో స్కోరు వేగం తగ్గకుండా చూడగా, వధేరా (16) కూడా ధాటిగా ఆడాడు. 16 ఓవర్లలో జట్టు స్కోరు 171/4. అవేశ్ వేసిన 18వ ఓవర్లో శశాంక్ 2 ఫోర్లు...ప్రభ్సిమ్రన్ వరుసగా 6, 4 6 బాదడంతో మొత్తం 26 పరుగులు లభించాయి. చివరి 4 ఓవర్లలో పంజాబ్ 65 పరుగులు రాబట్టింది. ఛేదనలో లక్నో పూర్తిగా తడబడింది. ఆరంభంతోనే చక్కటి బౌలింగ్తో 3 వికెట్లు తీసిన అర్ష దీప్ సింగ్ ప్రత్యరి్థని దెబ్బ కొట్టాడు. తన రెండో ఓవర్లో మిచెల్ మార్‡్ష (0), మార్క్రమ్ (13)లను వెనక్కి పంపిన అర్‡్షదీప్, తన తర్వాతి ఓవర్లో పూరన్ (6)ను కూడా అవుట్ చేయడంతో లక్నో కష్టాల్లో పడింది. రిషభ్ పంత్ (18) తన వైఫల్యాన్ని కొనసాగించగా, డేవిడ్ మిల్లర్ (11) కూడా ప్రభావం చూపలేకపోయాడు.స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్షి (సి) మయాంక్ (బి) ఆకాశ్ 1; ప్రభ్సిమ్రన్ (సి) పూరన్ (బి) రాఠీ 91; ఇన్గ్లిస్ (సి) మిల్లర్ (బి) ఆకాశ్ 30; శ్రేయస్ (సి) మయాంక్ (బి) రాఠీ 45; వధేరా (బి) ప్రిన్స్ 16; శశాంక్ (నాటౌట్) 33; స్టొయినిస్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 236. వికెట్ల పతనం: 1–2, 2–50, 3–128, 4–162, 5–216. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 4–0–30–2, మయాంక్ యాదవ్ 4–0–60–0, అవేశ్ ఖాన్ 4–0–57–0, దిగ్వేశ్ రాఠీ 4–0–46–2, ప్రిన్స్ యాదవ్ 4–0–43–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) అర్ష దీప్ సింగ్ 13; మార్‡్ష (సి) వధేరా (బి) అర్ష దీప్ సింగ్ 0; పూరన్ (ఎల్బీ) (బి) అర్ష దీప్ సింగ్ 6; పంత్ (సి) శశాంక్ (బి) అజ్మతుల్లా 18; బదోని (సి) అర్ష దీప్ సింగ్ (బి) చహల్ 74; మిల్లర్ (సి) శశాంక్ (బి) అజ్మతుల్లా 11; సమద్ (సి) అండ్ (బి) 45; అవేశ్ (నాటౌట్) 19; ప్రిన్స్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–15, 2–16, 3–27, 4–58, 5–73, 6–154, 7–188. బౌలింగ్: అర్ష దీప్ సింగ్ 4–0–16–3, యాన్సెన్ 4–0–31–1, అజ్మతుల్లా 4–0–33–2, చహల్ 4–0–50–1, వైశాక్ 3–0–49–0, స్టొయినిస్ 1–0–17–0. -
IPL 2025: లక్నోపై సూపర్ విక్టరీ.. ప్లే ఆఫ్స్కు చేరువలో పంజాబ్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ మరో అద్బుత విజయం నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ధర్మశాల వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 37 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. లక్నో బౌలర్లను పంజాబ్ బ్యాటర్లు ఊతికారేశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రాన్ సింగ్(91) టాప్ స్కోరర్గా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(45), శశాంక్ సింగ్(33), ఇంగ్లిష్(30) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.బదోని ఒక్కడే..అనంతరం 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్నో బ్యాటర్లలో అయూష్ బదోని(74) ఒంటరి పోరాటం చేయగా.. అబ్దుల్ సమద్(45) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఒమర్జాయ్ రెండు, జాన్సెన్, చాహల్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్దానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధించేందుకు కింగ్స్ అడుగు దూరంలో నిలిచారు. -
స్టేడియం బయటకు బంతి.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్! వీడియో
ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన శశాంక్ సింగ్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 33 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే శశాంక్ తన ఇన్నింగ్స్లో కొట్టిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలెట్గా నిలిచింది. పంజాబ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మయాంక్ యాదవ్ నాలుగో బంతిని శశాంక్ సింగ్కు బ్యాక్-ఆఫ్-ఎ-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని శశాంక్ సింగ్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్-లెగ్ మీదుగా 92 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. అతడి పవర్ దాటికి బంతి మైదానం బయట పడింది. ఈ క్రమంలో స్టాండ్స్లో కూర్చుని మ్యాచ్ను వీక్షిస్తున్న పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా అద్బుతమైన రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(91) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా.. శ్రేయస్ అయ్యర్(45), శశాంక్ సింగ్(33), ఇంగ్లిష్(30) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.Fetch that one from the mountains! 🏔#ShashankSingh lights up Dharamsala with a monstrous six. Power-hitting at it's finest! 🤩Watch the LIVE action in BHOJPURI ➡ https://t.co/Iz9KWvDwyp #IPLRace2Playoffs 👉 #PBKSvLSG | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star… pic.twitter.com/C24qxSp4lE— Star Sports (@StarSportsIndia) May 4, 2025 -
క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ సరసన ప్రభ్సిమ్రన్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్ (PBKS vs LSG)తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) పరుగుల వరద పారించాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ను చితక్కొడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే, దురదృష్టవశాత్తూ శతకానికి తొమ్మిది పరుగుల దూరంలో ప్రభ్సిమ్రన్ ఆగిపోయాడు.అయితేనేం.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్బుత ఆట తీరుతో క్రిస్ గేల్, కేఎల్ రాహల్ (KL Rahul)సరసన నిలిచాడు. గతేడాది నిలకడైన ప్రదర్శన కనబరిచిన ప్రభ్సిమ్రన్ సింగ్ను పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు భారీ ధరకు అట్టిపెట్టుకుంది. అతడి కోసం పర్సు నుంచి నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించింది.అందుకు తగ్గట్లుగానే ప్రభ్సిమ్రన్ ఈసారీ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్తో అలరిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా లక్నోతో మ్యాచ్లోనూ అతడు బ్యాట్ ఝులిపించాడు. మొత్తంగా 48 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 91 పరుగులు సాధించాడు.అయితే, దిగ్వేశ్ రాఠీ బౌలింగ్లో నికోలస్ పూరన్కు క్యాచ్ ఇవ్వడంతో ప్రభ్సిమ్రన్ ధనాధన్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక అతడికి ఈ సీజన్లో ఇది ఓపెనర్గా వరుసగా మూడో అర్ధ శతకం కావడం విశేషం. తద్వారా పంజాబ్ కింగ్స్ తరఫున ఒకే సీజన్లో ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ప్రభ్సిమ్రన్ చేరిపోయాడు.ఇక ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ఇప్పటికి పది మ్యాచ్లు పూర్తి చేసుకుని ఆరు గెలిచింది. ఒకటి వర్షం కారణంగా రద్దైంది. ఈ క్రమంలో 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా లక్నోతో మ్యాచ్లోనూ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకుపోతుంది.మరోవైపు.. ఈ సీజన్లో ఇప్పటికి (ఈ మ్యాచ్తో కలిపి) పదకొండు ఇన్నింగ్స్ ఆడిన ప్రభ్సిమ్రన్ 437 పరుగులు సాధించాడు. తద్వారా పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికి నాలుగు అర్థ శతకాలు ఉన్నాయి. ఇక లక్నోతో ఆదివారం నాటి మ్యాచ్లో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 236 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ప్రభ్సిమ్రన్ సింగ్తో పాటు జోష్ ఇంగ్లిస్ (14 బంతుల్లో 30), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 45), శశాంక్ సింగ్ (15 బంతుల్లో 33 నాటౌట్), మార్కస్ స్టొయినిస్ (5 బంతుల్లో 15) దంచికొట్టారు.ఒక సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఓపెనర్గా వరుసగా అత్యధిక అర్ధ శతకాలు సాధించింది వీరేక్రిస్ గేల్ (2018)- మూడుకేఎల్ రాహుల్ (2018)- మూడుకేఎల్ రాహుల్ (2019)- మూడుకేఎల్ రాహుల్ (2020)- మూడుప్రభ్సిమ్రన్ సింగ్ (2025*) మూడు.Sent the ball to enjoy the view 🏔😍Shashank Singh and Prabhsimran Singh with an entertaining partnership tonight 💪Scorecard ▶ https://t.co/YuAePC273s#TATAIPL | #PBKSvLSG pic.twitter.com/9WqFWRd3zt— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
IPL 2025: లక్నోపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
Punjab kings vs Lucknow super giants live updates: లక్నోపై పంజాబ్ కింగ్స్ ఘన విజయంఐపీఎల్-2025లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై 37 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్నో బ్యాటర్లలో అయూష్ బదోని(74) ఒంటరి పోరాటం చేయగా.. అబ్దుల్ సమద్(45) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఒమర్జాయ్ రెండు, జాన్సెన్, చాహల్ తలా వికెట్ సాధించారు.అయూష్ బదోని హాఫ్ సెంచరీ..పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో అయూష్ బదోని హాఫ్ సెంచరీ సాధించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి బదోని(67) తన అద్బుత ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 18 ఓవర్లు ముగిసేసరికి లక్నో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.14 ఓవర్లకు లక్నో స్కోర్: 126/514 ఓవర్లు ముగిసే సరికి లక్నో 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో బదోని(40), అబ్దుల్ సమద్(29) ఉన్నారు.కష్టాల్లో లక్నో.. 74 పరుగులకే 5 వికెట్లు237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 74 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రిషబ్ పంత్(18), డేవిడ్ మిల్లర్(11) వరుసగా పెవిలియన్కు చేరారు.అర్ష్దీప్ ఆన్ ఫైర్..లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్దీప్ సింగ్ నిప్పులు చేరుగుతున్నాడు. లక్నో తొలి మూడు వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. లక్నో టాప్ బ్యాటర్లు మార్ష్, మార్క్రమ్, పూరన్ను అర్ష్దీప్ పెవిలియన్కు పంపాడు. 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో 3 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.లక్నో తొలి వికెట్ డౌన్..237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. 2.1 ఓవర్లకు లక్నో స్కోర్: 15/1చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. లక్నో టార్గెట్ ఎంతంటేధర్మశాల వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(91) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా.. శ్రేయస్ అయ్యర్(45), శశాంక్ సింగ్(33), ఇంగ్లిష్(30) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.పంజాబ్ నాలుగో వికెట్ డౌన్నేహాల్ వధేరా రూపంలో పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన వధేరా.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 16 ఓవర్లకు పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో ప్రబ్సిమ్రాన్ సింగ్(74), శశాంక్(2) ఉన్నారు.పంజాబ్ మూడో వికెట్ డౌన్..శ్రేయస్ అయ్యర్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన అయ్యర్.. దిగ్వేష్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్సిమ్రాన్ సింగ్(51), వధేరా(5) ఉన్నారు.పంజాబ్ రెండో వికెట్ డౌన్జోష్ ఇంగ్లిష్ రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన ఇంగ్లిష్.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(9), ఫ్రబ్ సిమ్రాన్(35) ఉన్నారు.పంజాబ్ తొలి వికెట్ డౌన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ప్రియాన్ష్ ఆర్య.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో జోష్ ఇంగ్లిష్(23), ప్రభ్సిమ్రాన్ సింగ్(2) ఉన్నారు.ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో ఆకాష్ మహరాజ్ సింగ్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ జట్టులోకి మార్కస్ స్టోయినిష్ తిరిగొచ్చాడు.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, ఆకాష్ మహరాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్పంజాబ్ కింగ్స్(ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్ -
మాక్సీ స్థానంలో జట్టులోకి విధ్వంసకర వీరుడు.... పంజాబ్ ప్రకటన
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell) స్థానాన్ని మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ ఓవెన్ (Mitchell Owen)తో పంజాబ్ యాజమాన్యం భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఆదివారం ప్రకటన విడుదల చేసింది.గాయం కారణంగా దూరంకాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ను రూ. 4.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్పిన్నర్గా ఫర్వాలేదనిపించినా బ్యాటర్గా మాత్రం మాక్సీ తేలిపోయాడు. ఈ సీజన్లో ఏడు మ్యాచ్లాడిన అతను 48 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో 4 వికెట్లు తీశాడు. అయితే, వేలికి గాయం కావడంతో ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు మ్యాక్స్వెల్ అందుబాటులో ఉండడని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బుధవారం (ఏప్రిల్ 30) స్పష్టం చేశాడు.రూ. 3 కోట్లకుచెన్నైతో మ్యాచ్కు ముందు పంజాబ్ సారథి శ్రేయస్ మాట్లాడుతూ... ‘అనుకోకుండా మ్యాక్స్వెల్ గాయపడ్డాడు. అతడి వేలు విరిగింది. మ్యాక్స్వెల్ స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదు’ అని అన్నాడు. అయితే, తాజాగా మాక్సీ స్థానాన్ని మిచెల్ ఓవెన్తో భర్తీ చేశారు. రూ. 3 కోట్లకు పంజాబ్ అతడిని జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా టాస్మేనియాకు చెందిన మిచెల్ ఓవెన్ 34 ఇప్పటికి టీ20 మ్యాచ్లు ఆడి 646 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 108. ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఖాతాలో పది టీ20 వికెట్లు కూడా ఉన్నాయి.బీబీఎల్ సంచలనంఇక ప్రస్తుతం ఓవెన్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, అతడు త్వరలోనే పంజాబ్ కింగ్స్తో చేరతాడు. 2024-25 బిగ్బాష్ లీగ్లో 452 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. 200కు పైగా స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేసి హోబర్ట్ హ్యారికేన్స్ తొలిసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.కాగా సౌతాఫ్రికా స్టార్ కార్బిన్ బాష్ స్థానంలో మిచెల్ ఓవెన్ పెషావర్ జల్మీలో చేరాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆడేందుకు బాష్ కాంట్రాక్టు రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడిపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, ఓవెన్ మాత్రం ప్లే ఆఫ్స్ సమయానికి పంజాబ్ కింగ్స్తో చేరతాడని.. అంతవరకు పీఎస్ఎల్లో కొనసాగుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పీఎస్ఎల్ మే 18తో ముగుస్తుండగా.. మే 20 నుంచి ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లు మొదలుకానున్నాయి.వారి పేర్లు వినిపించాయిఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికి పది మ్యాచ్లు పూర్తి చేసుకుని ఆరు గెలిచి.. పన్నెండు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం నాటి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ విధ్వంసకరవీరుడికి యాజమాన్యం పిలుపునివ్వడం విశేషం.కాగా ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారయ్యే ముందు మ్యాక్స్వెల్ జట్టుకు దూరమవడంతో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. వెస్టిండీస్ ఆల్రౌండర్ రోస్టన్ ఛేజ్, దక్షిణాఫ్రికా యువ ఆటగాడు లెస్ డు ప్లోయ్, అఫ్గానిస్తాన్ ఆల్రౌండర్ సలామ్ ఖైల్లో ఒకరిని ఎంపిక చేసుకోవచ్చనే అంచనాలు నెలకొనగా.. అనూహ్యంగా మిచెల్ ఓవెన్ జట్టులోకి వచ్చాడు.చదవండి: RCB VS CSK: ఓటమికి నాదే బాధ్యత.. అతను గొప్పగా ఆడాడు: ధోని -
IPL 2025: రూ. 10 కోట్లు ఇచ్చి.. బెంచ్ మీద కూర్చోబెడతారా?
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్కు చేదు అనుభవమే మిగిలింది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ఈ జట్టు.. ఈసారి మాత్రం దారుణ వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకుంది. తాజాగా బుధవారం నాటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతి (CSK vs PBKS)లో ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సీఎస్కే నాయకత్వ బృంద తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో స్వీయ తప్పిదంతో ఓటమిని కొని తెచ్చుకున్నారని విమర్శించాడు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ను ఆడించకుండా తప్పు చేశారని భజ్జీ పేర్కొన్నాడు.రూ. 10 కోట్లు ఇచ్చి.. బెంచ్ మీద కూర్చోబెడతారా?‘‘పరిస్థితులకు తగ్గట్లుగా చెన్నై తమ జట్టును ఎంపిక చేసిందని ఎంతమాత్రమూ అనిపించలేదు. నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా.. ఈ ముగ్గురిని కలిపి గనుక ఈ మ్యాచ్లో ఆడిస్తే సీఎస్కే కచ్చితంగా మ్యాచ్ గెలిచేది.రూ. 10 కోట్లు పెట్టి అశ్విన్ను కొని.. అతడిని బెంచ్కే పరిమితం చేస్తున్నారు. ఈమాత్రం దానికి అంత ధర పెట్టాల్సిన అవసరం ఏమిటి?.. అతడిని ఎందుకు పక్కన పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. బహుశా ఎవరితోనైనా అతడు గొడవపడ్డాడేమో!’’ అని హర్భజన్ సింగ్ హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాడు.రూ. 9.75 కోట్లకు కొనుగోలుకాగా గతేడాది రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్.. ఈ ఏడాది తన సొంతగూటికి తిరిగి వచ్చేశాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ దిగ్గజ స్పిన్నర్ను సీఎస్కే రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.అయితే, అశూ సేవలను మాత్రం సీఎస్కే ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు. ఇప్పటి వరకు జట్టు పది మ్యాచ్లు ఆడగా ఇందులో మూడింటిలో అతడిని పక్కనపెట్టారు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు అశూ ఆడిన ఏడు మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు తీయగలిగాడు.చహల్ హ్యాట్రిక్ఇక పంజాబ్తో మ్యాచ్ విషయానికొస్తే.. సొంత మైదానం చెపాక్లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. 19.2 ఓవర్లలో 190 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పంజాబ్ యువ స్పిన్నర్ హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా నాలుగు వికెట్లతో మెరిసి చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.మరో స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ ఒక వికెట్ తీయగా.. పేసర్లలో అర్ష్దీప్ సింగ్, మార్కో యాన్సెన్ తలా రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.ఇక చెన్నై విధించిన లక్ష్యాన్ని పంజాబ్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (36 బంతుల్లో 54), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 72) అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ తీయగా.. పేసర్లు మతీశ పతిరణ, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు కూల్చారు. చదవండి: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. ఐపీఎల్ మొత్తానికి అతడు దూరం -
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ స్టార్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
పంజాబ్ కింగ్స్ యువ క్రికెటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో బుధవారం నాటి మ్యాచ్ సందర్భంగా ప్రభ్సిమ్రన్ ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై- పంజాబ్ తలపడ్డాయి. టాస్ గెలిచిన పంజాబ్ ఆతిథ్య సీఎస్కేను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ధోని సేన 19.2 ఓవర్లలో 190 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సామ్ కరన్ (88), డెవాల్డ్ బ్రెవిస్ (32) మాత్రమే రాణించారు.చెలరేగిన చహల్ఇక పంజాబ్ బౌలర్లలో యజువేంద్ర చహల్ నాలుగు వికెట్ల (4/32)తో చెలరేగగా.. అర్ష్దీప్ సింగ్, మార్కో యాన్సెన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిగతా వారిలో అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఈ క్రమంలో లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించిన పంజాబ్ కాసేపటికే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (23) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్తో కలిసి వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.దంచికొట్టిన ప్రభ్సిమ్రన్,శ్రేయస్ప్రభ్సిమ్రన్ 36 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేయగా.. శ్రేయస్ 41 బంతుల్లో 72 రన్స్తో అదరగొట్టాడు. వీరిద్దరికి తోడు ఆఖర్లో శశాంక్ సింగ్ (12 బంతుల్లో 23) రాణించడంతో 19.4 ఓవర్లలో పని పూర్తి చేసిన పంజాబ్.. చెన్నైని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో చెన్నై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. ప్రస్తుతం టాప్-2లో ఉన్న పంజాబ్ తమ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది.🚁🔥pic.twitter.com/iBABtLlQ4f— Punjab Kings (@PunjabKingsIPL) April 30, 2025ఇక ఈ మ్యాచ్లో అర్ధ శతకంతో ఆకట్టుకున్న ప్రభ్సిమ్రన్.. ఐపీఎల్లో 1100 పరుగుల మైలురాయిని దాటేశాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక పరుగులు సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్గా 24 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నిలిచాడు.కాగా 2019లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ప్రభ్సిమ్రన్.. ఇప్పటి వరకు అదే జట్టుతో కొనసాగుతున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటికి 44 మ్యాచ్లలో కలిపి 1102 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ధ శతకాలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది.ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్లు1. ప్రభ్సిమ్రన్ సింగ్ - 1102 పరుగులు2. మనన్ వోహ్రా- 1083 పరుగులు 3. రాహుల్ తెవాటియా- 1063 పరుగులు4. ఆయుశ్ బదోని- 886 పరుగులు5. మన్వీందర్ బిస్లా- 798 పరుగులు.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోనిHat-trick 👌Powerful start with the bat 🔥Captain's knock 🫡The Battle of Kings goes the @PunjabKingsIPL way again this season ❤Scorecard ▶ https://t.co/eXWTTv7Xhd #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Yk1SOZOzip— IndianPremierLeague (@IPL) April 30, 2025 -
ఐపీఎల్ లో చెన్నైపై పంజాబ్ కింగ్స్ విజయం
-
గెలుపు జోష్లో ఉన్న శ్రేయస్ అయ్యర్కు షాక్!
గెలుపు జోష్లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా చేసిన తప్పిదానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున రూ. 12 లక్షల మేర ఫైన్ వేసింది.ఐపీఎల్-2025 (IPL 2025)లో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. చెన్నైతో బుధవారం నాటి మ్యాచ్లో గెలిచి ఈ సీజన్లో ఆరో విజయం నమోదు చేసింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ పంజాబ్కు ఈ ఎడిషన్లో పదో మ్యాచ్.చహల్ మాయాజాలంఇందులో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ చేసిన పంజాబ్.. సీఎస్కేను 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ చేసింది. చెన్నై బ్యాటర్లలో సామ్ కరన్ (88), డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించగా.. పంజాబ్ బౌలర్లలో స్పిన్నర్ యజువేంద్ర చహల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.హ్యాట్రిక్ నమోదు చేసిన చహల్.. మొత్తంగా మూడు ఓవర్లలో కేవలం 32 పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో అర్ష్దీప్ సింగ్, మారోక యాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు వికెట్ల తేడాతో జయభేరిఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ఆకట్టుకున్న పంజాబ్.. చెన్నై బౌలర్ల విజృంభణతో ఆఖరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (23), ప్రభ్సిమ్రన్ సింగ్ (54) రాణించగా.. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో72) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో శశాంక్ సింగ్ (12 బంతుల్లో 23) వేగంగా ఆడగా.. 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పంజాబ్ 196 పరుగులు సాధించింది. చెన్నైపై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.అయితే, ఈ మ్యాచ్లో పంజాబ్ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఈ సీజన్లో ఇది తొలి తప్పిదం కాబట్టి.. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ మేర ఫైన్తో సరిపెట్టినట్లు ఐపీఎల్ పాలక మండలి తెలిపింది.ఐదుసార్లు చెన్నైని చెపాక్లో ఓడించి మరోవైపు.. పంజాబ్ చేతిలో ఓటమితో చెన్నై ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా సీఎస్కే సొంత మైదానం చెపాక్లో ఆ జట్టును అత్యధిక సార్లు ఓడించిన జట్టుగా పంజాబ్ రికార్డులకెక్కింది. ఐదుసార్లు చెన్నైని చెపాక్లో ఓడించి ముంబై రికార్డును సమం చేసింది. అంతకుముందు ముంబై ఇండియన్స్ తొమ్మిది మ్యాచ్లలో ఇదే వేదికపై ధోని సేనను ఓడించగా.. ఇప్పుడు పంజాబ్ కూడా ఆ ఘనత సాధించింది.చదవండి: #Glenn Maxwell: ఐపీఎల్-2025 నుంచి మాక్స్వెల్ ఔట్..Hat-trick 👌Powerful start with the bat 🔥Captain's knock 🫡The Battle of Kings goes the @PunjabKingsIPL way again this season ❤Scorecard ▶ https://t.co/eXWTTv7Xhd #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Yk1SOZOzip— IndianPremierLeague (@IPL) April 30, 2025 -
వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రయాణం ముగిసిపోయింది. పంజాబ్ కింగ్స్తో బుధవారం నాటి మ్యాచ్లో ఓడిన తర్వాత ధోని సేన అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.పంజాబ్తో మ్యాచ్లో తమ బ్యాటర్లు మెరుగ్గానే ఆడారని.. అయితే, కనీసం ఇంకో 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ఈరోజు తొలిసారి మా బ్యాటర్లు స్కోరు బోర్డుపై మెరుగైన సంఖ్యను ఉంచారు. కానీ ఇలాంటి పిచ్పై ఇది సరిపోదు.ఆఖరి నాలుగు బంతులు వృథా చేశాంమా వాళ్లు ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేది. అదే విధంగా మేము కీలక సమయాల్లో కీలక క్యాచ్లు జారవిడవడం కూడా ప్రభావం చూపింది.ఏదేమైనా ఈరోజు బ్రెవిస్, సామ్ అద్భుతంగా ఆడి విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, మేము దురదృష్టవశాత్తూ ఆలౌట్ అయ్యాము. ఆఖరి నాలుగు బంతులు వృథా చేశాం. అంతకంటే ముందు మా వాళ్లు నలుగురు అవుట్ అయ్యారు.అతడొక పోరాట యోధుడుఇలాంటి కీలక పోరులో ఒక్క బంతి ఆడటం కూడా మ్యాచ్ను మలుపు తిప్పుతుంది’’ అని ధోని పేర్కొన్నాడు. ఇక పంజాబ్తో మ్యాచ్లో అద్భుత అర్థ శతకంతో మెరిసిన సామ్ కరన్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడొక పోరాట యోధుడు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా కచ్చితంగా రాణిస్తాడు.అయితే, దురదృష్టవశాత్తూ పిచ్ దృష్ట్యా అతడికి ఎక్కువగా ఛాన్సులు ఇవ్వలేకపోయాం. కానీ ఈరోజు మా సొంతమైదానంలో టోర్నీలోనే అత్యుత్తమ వికెట్ మీద ఆడి తానేంటో నిరూపించుకున్నాడు.అతడొక అద్భుతమైన ఫీల్డర్ కూడామేము ఇంకొక్క పదిహేను పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని ధోని అన్నాడు. అదే విధంగా అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యాలు కనబరిచిన డెవాల్డ్ బ్రెవిస్ గురించి మాట్లాడుతూ.. ‘‘మిడిలార్డర్లో తను మొమెంటమ్ తీసుకువచ్చాడు.చిన్న అవకాశం దొరికినా బంతిని బౌండరీకి తరలించాలని చూస్తాడు. అంతేకాదు.. అతడొక అద్భుతమైన ఫీల్డర్ కూడా. జట్టులో సరికొత్త ఉత్సాహం నింపుతున్నాడు. అతడి ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాము. భవిష్యత్తులో అతడొక విలువైన ఆస్తిగా మారతాడు’’ అని ధోని ఈ సౌతాఫ్రికా యువ బ్యాటర్పై ప్రశంసలు కురిపించాడు.Brilliant Brevis catch: Composure. Presence of mind & Athleticism at its best 🫨Watch 🔽🎥#TATAIPL | #CSKvPBKS— IndianPremierLeague (@IPL) April 30, 2025 సీఎస్కేకే ఇదే తొలిసారికాగా చెపాక్ స్టేడియంలో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది చెన్నై. ఓపెనర్లు షేక్ రషీద్ (11), ఆయుశ్ మాత్రే (7) విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన సామ్ కరన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.మొత్తంగా 47 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతడికి తోడుగా డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించాడు. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లో 190 పరుగులు చేసి చెన్నై జట్టు ఆలౌట్ అయింది.ఇక ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నైని ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొనేలా చేసింది. అయితే, ఈ మ్యాచ్లో బేబీ ఏబీడీ బ్రెవిస్ అద్భుతమైన క్యాచ్లతో మెరిశాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (54) ఇచ్చిన క్యాచ్ను ఒడిసిపట్టాడు.అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్లో శశాంక్ సింగ్ (23) ఇచ్చిన క్యాచ్ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్న బ్రెవిస్ అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. బౌండరీ లైన్కు తాకే ప్రమాదం ఉండటంతో బంతిని మూడుసార్లు గాల్లోకి లేపి ఆ తర్వాత సురక్షితంగా క్యాచ్ పట్టాడు. కాగా గతేడాది కూడా చెన్నై టాప్-4కు చేరలేదన్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా రెండు సీజన్లలో చెన్నై ప్లే ఆఫ్స్ చేరకపోవడం ఇదే తొలిసారి.చదవండి: క్రికెట్ నీకు రెండో ఛాన్స్ ఇచ్చింది.. కానీ.. Hat-trick 👌Powerful start with the bat 🔥Captain's knock 🫡The Battle of Kings goes the @PunjabKingsIPL way again this season ❤Scorecard ▶ https://t.co/eXWTTv7Xhd #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Yk1SOZOzip— IndianPremierLeague (@IPL) April 30, 2025 -
CSK vs PBKS : చహల్ హ్యాట్రిక్, చెన్నై ఖేల్ ఖతం (ఫోటోలు)
-
చెన్నై ఖేల్ ఖతం
సొంతగడ్డపై వరుసగా ఐదో మ్యాచ్లో పరాజయంతో ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. పేలవ ప్రదర్శనతో ఎనిమిదో ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న ఐదుసార్లు చాంపియన్ మరో నాలుగు మ్యాచ్లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ కీలక విజయాన్ని నమోదు చేసింది. ముందుగా చహల్ ‘హ్యాట్రిక్’...బ్యాటింగ్లో శ్రేయస్, ప్రభ్సిమ్రన్ కలిసి జట్టును గెలిపించారు. చెన్నై: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోరులో పంజాబ్ 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. స్యామ్ కరన్ (47 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, బ్రెవిస్ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. యుజువేంద్ర చహల్ (4/32) ఒకే ఓవర్లో ‘హ్యాట్రిక్’ సహా నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్స్లు), ప్రభ్సిమ్రన్ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీలు సాధించారు. ఒకే ఓవర్లో 26 పరుగులు... చెన్నైకి ఓపెనర్లు సరైన ఆరంభం ఇవ్వలేకపోయారు. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ (11) తనకు లభించిన మరో అరుదైన అవకాశాన్ని వృథా చేసుకోగా, ఆయుశ్ మాత్రే (7) విఫలమయ్యాడు. హర్ప్రీత్ ఓవర్లో జడేజా (17) మూడు ఫోర్లు కొట్టినా అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఈ దశలో కరన్, బ్రెవిస్ భాగస్వామ్యంలో జట్టు నిలదొక్కుకుంది. కరన్ చెలరేగిపోగా, బ్రెవిస్ కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 50 బంతుల్లో 78 పరుగులు జోడించారు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 134/4. సూర్యాంశ్ షెడ్గే వేసిన తర్వాతి ఓవర్లో కరన్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో కరన్ వరుసగా 6, 6, 2 (నోబాల్), 2, 4, 4, 1 బాదడంతో మొత్తం 26 పరుగులు రావడం విశేషం. ఈ జోరులో కరన్ సెంచరీ, సీఎస్కే 200 దాటడం ఖాయంగా అనిపించాయి. అయితే చివరకు ఈ రెండూ జరగలేదు. యాన్సెన్ బౌలింగ్లో కరన్ అవుట్ కాగా...చహల్ వేసిన 19వ ఓవర్తో అంతా మారిపోయింది. 11 బంతుల వ్యవధిలో చెన్నై 6 వికెట్లు కోల్పోయింది. కీలక భాగస్వామ్యాలు... పంజాబ్ ఇన్నింగ్స్ మెరుగ్గా మొదలైంది. ప్రియాన్ష్ ఆర్య (15 బంతుల్లో 23; 5 ఫోర్లు), ప్రభ్సిమ్రన్ చక్కటి షాట్లతో 28 బంతుల్లో 44 పరుగులు జోడించారు. తొలి 6 ఓవర్లలో స్కోరు 51 పరుగులకు చేరింది. ప్రభ్సిమ్రన్, శ్రేయస్ రెండో వికెట్కు 50 బంతుల్లో 72 పరుగులు జత చేశారు. నూర్ ఈ జోడీని విడదీయగా, వధేరా (5) విఫలమయ్యాడు. మరోవైపు కరన్ ఓవర్లో సిక్స్, ఫోర్తో శ్రేయస్ 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ప్రభ్సిమ్రన్ వెనుదిరిగినా...శశాంక్ (23; 1 ఫోర్, 2 సిక్స్లు)తో కలిసి శ్రేయస్ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 11; ఆయుశ్ (సి) శ్రేయస్ (బి) యాన్సెన్ 7; స్యామ్ కరన్ (సి) ఇన్గ్లిస్ (బి) యాన్సెన్ 88; జడేజా (సి) ఇన్గ్లిస్ (బి) హర్ప్రీత్ 17; బ్రెవిస్ (బి) అజ్మతుల్లా 32; శివమ్ దూబే (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 6; ధోని (సి) వధేరా (బి) చహల్ 11; హుడా (సి) ఆర్య (బి) చహల్ 2; కంబోజ్ (బి) చహల్ 0; నూర్ (సి) యాన్సెన్ (బి) చహల్ 0; ఖలీల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 16; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 190. వికెట్ల పతనం: 1–21, 2–22, 3–48, 4–126, 5–172, 6–184, 7–186, 8–186, 9–186, 10–190. బౌలింగ్: అర్ష్ దీప్ 3.2–0–25–2, యాన్సెన్ 4–0– 30–2, అజ్మతుల్లా 4–0–39–1, హర్ప్రీత్ 2–0– 21–1, చహల్ 3–0–32–4, సూర్యాంశ్ 3–0– 40–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) ధోని (బి) అహ్మద్ 23; ప్రభ్సిమ్రన్ (సి) బ్రెవిస్ (బి) నూర్ 54; శ్రేయస్ (బి) పతిరణ 72; వధేరా (సి) జడేజా (బి) పతిరణ 5; శశాంక్ (సి) బ్రెవిస్ (బి) జడేజా 23; ఇన్గ్లిస్ (నాటౌట్) 6; సూర్యాంశ్ (సి) నూర్ (బి) అహ్మద్ 1; యాన్సెన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–44, 2–116, 3–136, 4–180, 5–188, 6–190. బౌలింగ్: ఖలీల్ 3.4–0–28–2, కంబోజ్ 2–0–20–0, జడేజా 3–0–32–1, నూర్ 4–0–39–1, స్యామ్ కరన్ 3–0–27–0, పతిరణ 4–0–45–2. చహల్ ‘హ్యాట్రిక్’ యుజువేంద్ర చహల్ తన తొలి 2 ఓవర్లలో 23 పరుగులిచ్చాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసే అవకాశం దక్కింది. వైడ్తో ఓవర్ మొదలు పెట్టగా తొలి బంతిని ధోని (11) సిక్సర్గా మలిచాడు. అయితే తర్వాతి బంతికే ధోని వెనుదిరగ్గా, మూడో బంతికి హుడా 2 పరుగులు తీశాడు. ఓవర్ చివరి మూడు బంతుల్లో వరుసగా హుడా (2), కంబోజ్ (0), నూర్ (0)లను చహల్ అవుట్ చేశాడు. ‘హ్యాట్రిక్’ పూర్తి కాగానే తనపై ఎన్నో మీమ్లకు కారణమైన ట్రేడ్ మార్క్ పొజిషన్లో కూర్చొని అతను సంబరాలు చేసుకున్నాడు. ఐపీఎల్లో చహల్ ‘హ్యాట్రిక్’ తీయడం ఇది రెండోసారి. 2022 సీజన్లో రాజస్తాన్ తరఫున ఆడుతూ కోల్కతాపై అతను హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఐపీఎల్లో ఒకటికంటే ఎక్కువసార్లు హ్యాట్రిక్ తీసిన మూడో ఆటగాడిగా అతను నిలిచాడు. గతంలో అమిత్ మిశ్రా 3 సార్లు, యువరాజ్ 2 సార్లు హ్యాట్రిక్ సాధించారు. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X ముంబై వేదిక: జైపూర్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే ఔట్
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది.సీఎస్కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో చాహల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. చాహల్తో పాటు అర్ష్దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 72 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్సిమ్రాన్ సింగ్(54) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సీఎస్కే బౌలర్లలో పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్,ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. తన బౌలింగ్ కోటాలో తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న చాహల్ను పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి 19వ ఓవర్ వేసేందుకు ఎటాక్లో తీసుకొచ్చాడు. ఓ ఓవర్లో చాహల్ అద్బుతం చేశాడు. తొలి బంతిని సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సిక్సర్గా మలచగా.. అనంతరం రెండో బంతికి భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హుడా మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక్కడ నుంచి చాహల్ మ్యాజిక్ మొదలైంది. నాలుగో బంతికి దీపక్ హుడా ఔట్ కాగా.. ఐదో బంతికి కాంబోజ్, ఆరో బంతికి నూర్ ఆహ్మద్ ఔటయ్యాడు. దీంతో చాహల్ ఖాతాలో రెండో ఐపీఎల్ హ్యాట్రిక్ వచ్చి చేరింది. ఓవరాల్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్..32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో చాహల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చాహల్ సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ తరపున హ్యాట్రిక్ వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా చాహల్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, అక్షర్ పటేల్, సామ్ కుర్రాన్ ఉన్నారు.👉ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్పై హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా చాహల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్గా కూడా ఈ ఫీట్ సాధించలేకపోయాడు.👉ఐపీఎల్లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్గా యువరాజ్ సింగ్ రికార్డును చాహల్ సమం చేశాడు. యువీ, చాహల్ రెండు సార్లు హ్యాట్రిక్ సాధించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో అమిత్ మిశ్రా(3) తొలి స్ధానంలో ఉన్నాడు.👉అదేవిధంగా ఐపీఎల్లో అత్యధిక సార్లు 4 వికెట్ల హాల్ సాధించిన బౌలర్గా చాహల్ నిలిచాడు. చాహల్ ఇప్పటివరకు 9 సార్లు నాలుగుకు పైగా వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సునీల్ నరైన్(8) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో నరైన్ రికార్డును చాహల్ బ్రేక్ చేశాడు.చదవండి: #Glenn Maxwell: ఐపీఎల్-2025 నుంచి మాక్స్వెల్ ఔట్.. -
ఐపీఎల్-2025 నుంచి మాక్స్వెల్ ఔట్..
ఐపీఎల్-2025లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ప్రయాణం ముగిసింది. చేతి వేలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మధ్యలోనే మాక్స్వెల్ వైదొలిగాడు. ప్రాక్టీస్ సెషన్లో మాక్స్వెల్ చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది.ఈ విషయాన్ని సీఎస్కేతో మ్యాచ్ సందర్బంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధ్రువీకరించాడు. టాస్ సమయంలో అయ్యర్ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ మాక్స్వెల్ చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది. నిజంగా మాకు ఇది గట్టి ఎదురుదెబ్బ. అతడి స్ధానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు అని పేర్కొన్నాడు. మాక్స్వెల్ ప్రస్తుతం జట్టుతో పాటు ఉన్నప్పటికి త్వరలోనే తన స్వదేశానికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది సీజన్లో మాక్స్వెల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్లో ఒకట్రెండు వికెట్లు పడగొట్టినప్పటికి, బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మాక్స్వెల్ 6 ఇన్నింగ్స్లలో 8.00 సగటు కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: ZIM vs BAN: మమ్మల్నే ఓడిస్తారా? ప్రతీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్ -
సీఎస్కే పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
Chennai Super Kings vs Punjab Kings Live Updates: సీఎస్కే పై పంజాబ్ కింగ్స్ ఘన విజయంఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో చాహల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. చాహల్తో పాటు అర్ష్దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 72 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్సిమ్రాన్ సింగ్(54) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సీఎస్కే బౌలర్లలో పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్,ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.ప్రభ్సిమ్రాన్ ఫిప్టీ..పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది.8 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 102/18 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్సిమ్రాన్ సింగ్(28), శ్రేయస్ అయ్యర్(15) ఉన్నారు.పంజాబ్ రెండో వికెట్ డౌన్..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఆర్య.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.నిలకడగా ఆడుతున్న పంజాబ్.. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో ఆర్య(15), ప్రభుసిమ్రాన్ సింగ్(8) ఉన్నారు.చాహల్ హ్యాట్రిక్.. 190 పరుగులకు సీఎస్కే ఆలౌట్చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. 19 ఓవర్ వేసిన చాహల్ నాలుగో బంతికి దీపక్ హుడా ఔట్ కాగా.. ఐదో బంతికి కాంబోజ్, ఆరో బంతికి నూర్ ఆహ్మద్ ఔటయ్యాడు. దీంతో చాహల్ ఖాతాలో రెండో ఐపీఎల్ హ్యాట్రిక్ చేరింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్తో పాటు అర్ష్దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.పంజాబ్ ఐదో వికెట్ డౌన్..సామ్ కుర్రాన్ రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. 88 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన కుర్రాన్.. జాన్సెన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. క్రీజులో ధోని(5), శివమ్ దూబే(2) ఉన్నారు.15 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 134/415 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. సామ్ కుర్రాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 56 పరుగులతో కుర్రాన్ తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.10 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 89/310 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో బ్రెవిస్(20), సామ్ కుర్రాన్(29) ఉన్నారు.సీఎస్కే మూడో వికెట్ డౌన్..రవీంద్ర జడేజా రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన జడేజా.. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.సీఎస్కే రెండో వికెట్ డౌన్..ఆయూష్ మాత్రే రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన మాత్రే.. మార్కో జాన్సెన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులో కుర్రాన్(8), రవీంద్ర జడేజా(5) ఉన్నారు.సీఎస్కే తొలి వికెట్షేక్ రషీద్ రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రషీద్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది.ఆచితూచి ఆడుతున్న సీఎస్కే..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. క్రీజులో షేక్ రషీద్(1), ఆయూష్ మాత్రే(6) ఉన్నారు.ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు గ్లెన్ మాక్స్వెల్ దూరమయ్యాడు. అతడి స్దానంలో సూర్యాంష్ షెగ్దే పంజాబ్ జట్టులోకి వచ్చాడు. తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, ఎంఎస్ ధోని(కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానాపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంష్ షెగ్దే, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్ -
IPL 2025, KKR VS PBKS: చరిత్ర సృష్టించిన ప్రభ్సిమ్రన్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి పంజాబ్ కింగ్స్ అన్ క్యాప్డ్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఏప్రిల్ 26) కేకేఆర్తో జరిగిన రద్దైన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. కెరీర్ ప్రారంభం నుంచి (2019) పంజాబ్ కింగ్స్కే ఆడుతున్న ప్రభ్సిమ్రన్ ఇప్పటివరకు 43 మ్యాచ్లు ఆడి 151.88 స్ట్రయిక్రేట్తో 1048 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన 10వ ఆటగాడిగా ప్రభ్సిమ్రన్ నిలిచాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున యువరాజ్ సింగ్, శిఖర్ ధవన్కు కూడా 1000 పరుగుల మార్కును తాకలేదు. పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ 2018-2021 మధ్యలో 55 మ్యాచ్లు ఆడి 2548 పరుగులు చేశాడు.పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..కేఎల్ రాహుల్- 2548షాన్ మార్ష్- 2477డేవిడ్ మిల్లర్- 1974మయాంక్ అగర్వాల్- 1513మ్యాక్స్వెల్- 1431క్రిస్ గేల్- 1339సాహా- 1190మనన్ వోహ్రా- 1106మన్దీప్ సింగ్- 1073ప్రభ్సిమ్రన్ సింగ్- 1048కుమార సంగక్కర- 1009కాగా, నిన్న కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సెంచరీకి చేరువలో (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఔటైన ప్రభ్సిమ్రన్ తన జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ప్రభ్సిమ్రన్ ఓ మోస్తరు ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 292 పరుగులు చేశాడు.నిన్నటి మ్యాచ్లో ప్రభ్సిమ్రన్ సహా ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ 25, జోస్ ఇంగ్లిస్ 11 (నాటౌట్) చేయగా.. మ్యాక్స్వెల్ (7) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. జన్సెన్ 7 బంతులు ఆడి కేవలం 3 పరుగులే చేసి ఔటయ్యాడు. కేకేఆర్ బౌలర్లలో వైభ్వ్ అరోరా 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం కేకేఆర్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్ తర్వాత వర్షం మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. వర్షం ప్రారంభమయ్యే సమయానికి కేకేఆర్ స్కోర్ 7/0గా (ఒక ఓవర్లో) ఉంది. ఈ మ్యాచ్లో లభించిన పాయింట్తో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ టాప్-3లో ఉన్నాయి. -
‘ఈడెన్’ను ముంచెత్తిన వాన
కోల్కతా: ఈ మ్యాచ్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘మెరుపులు... చినుకులు... రద్దు!’ పంజాబ్ ఓపెనర్ల బౌండరీతో మొదలైన ఈ మ్యాచ్ బ్యాటింగ్ వండర్గా సాగింది. మైదానంలో జోష్ తెచ్చింది. ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ ఇదంతా ఒక ఇన్నింగ్స్ వరకే పరిమితమైంది. కోల్కతా లక్ష్యఛేదన మొదలయ్యాక ఒకటే ఓవర్కు ఆట ముగించాల్సి వచ్చింది. వానొచ్చి మైదానంతో పాటు అంతకు ముందరి పరుగుల వరదను ముంచెత్తింది. భారీ వర్షంతో చాలా సేపు నిరీక్షించినా ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగారు.వీరిద్దరు తొలి వికెట్కు 72 బంతుల్లో 120 పరుగులు జోడించారు. ఆ తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి కోల్కతా నైట్రైడర్స్ ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ మ్యాచ్ రద్దు కావడం ఇదే మొదటిసారి! 120 దాకా జోరే జోరు! ఫోర్తో మొదలైన పంజాబ్ స్కోరు తర్వాత జోరందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్సిమ్రన్ల క్రమంగా హోరెత్తించడంతో మైదానం పరుగుల పండగ చేసుకుంది. ఇద్దరు ఫోర్లు, సిక్స్లను అలవోకగా దంచేయడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 4.3 ఓవర్లలో కింగ్స్ 50 స్కోరును దాటింది. హర్షిత్ పదో ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 4, 6, 4 బాదాడంతో 27 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. తర్వాత నరైన్ 11వ ఓవర్ను ఇద్దరు కలిసి చితగ్గొట్టారు. ప్రియాన్ష్ ఓ సిక్స్ కొడితే... ప్రభ్సిమ్రన్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 22 పరుగులొచ్చాయి. ఈ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. ఎట్టకేలకు 12వ ఓవర్లో రసెల్ ఓపెనింగ్ జోడీకి చెక్ పెట్టాడు. ప్రియాన్ష్ భారీ షాట్కు యత్నించి వైభవ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 38 బంతుల్లో ప్రభ్సిమ్రన్ అర్ధ సెంచరీ పూర్తయింది. సకారియా వేసిన 13వ ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 4, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. వరుణ్ వేసిన 14వ ఓవర్ను పూర్తిగా ఆడిన ప్రభ్సిమ్రన్ 4, 0, 4, 6, 4, 1లతో 19 పరుగుల్ని పిండుకున్నాడు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే 37 పరుగులు రావడంతో 121/1 స్కోరు కాస్తా 158/1గా ఎగబాకింది. 15వ ఓవర్లో ప్రభ్సిమ్రన్ అవుట్ కావడంతోనే స్కోరు, జోరు అన్నీ తగ్గాయి. మ్యాక్స్వెల్ (7), మార్కో యాన్సెన్ (3) నిరాశపరచగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయాడు. దీంతో ఆఖరి 6 ఓవర్లలో పంజాబ్ 43 పరుగులే చేయగలిగింది. ఈడెన్ గార్డెన్స్లో ఏ మ్యాచ్ జరిగినా గంట మోగించే ఆట ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పహల్గాంలో ఉగ్ర ఘాతుకానికి నివాళిగా ఈ సారి గంట మోగించకుండా నల్ల రిబ్బన్లతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. మ్యాచ్ ఆరంభానికి ముందు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) పహల్గాంలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) వైభవ్ (బి) రసెల్ 69; ప్రభ్సిమ్రన్ (సి) పావెల్ (బి) వైభవ్ 83; శ్రేయస్ నాటౌట్ 25; మ్యాక్స్వెల్ (బి) వరుణ్ 7; యాన్సెన్ (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 3; ఇన్గ్లిస్ నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–120, 2–160, 3–172, 4–184. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–34–2, చేతన్ సకారియా 3–0–39–0, హర్షిత్ రాణా 2–0–27–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–1, సునీల్ నరైన్ 4–0–35–0, రసెల్ 3–0–27–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ నాటౌట్ 1; నరైన్ నాటౌట్ 4; ఎక్స్ట్రాలు 2; మొత్తం (1 ఓవర్లో వికెట్ కోల్పోకుండా) 7. బౌలింగ్: యాన్సెన్ 1–0–6–0. మాల్దీవుల్లో సన్రైజర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్ల ఒత్తిడికి దూరంగా కాస్త విరామం తీసుకున్నారు. తర్వాతి మ్యాచ్కు వారం రోజుల వ్యవధి ఉండటంతో సరదాగా గడిపేందుకు ఆటగాళ్లంతా శనివారం మాల్దీవులకు వెళ్లారు. చెన్నైలో సూపర్ కింగ్స్తో మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత అక్కడినుంచే టీమ్ సభ్యులు మాల్దీవులకు చేరుకున్నారు. సన్రైజర్స్ తమ తర్వాతి పోరులో శుక్రవారం అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్లలో 3 గెలిచి 6 ఓడిన టీమ్... మిగిలిన ఐదు మ్యాచ్లూ గెలిస్తేనే ‘ప్లే ఆఫ్స్’ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X బెంగళూరువేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
#Glenn Maxwell: మరి ఇంత చెత్త బ్యాటింగా? జట్టు నుంచి తీసేయండి
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో మాక్స్వెల్ తీవ్ర నిరాశపరిచాడు. గత మ్యాచ్కు దూరంగా ఉన్న మాక్సీకి పంజాబ్ మెనెజ్మెంట్ తిరిగి తుది జట్టులో చోటు ఇచ్చింది.మార్కస్ స్టోయినిష్ స్ధానంలో జట్టులోకి వచ్చిన మాక్స్వెల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్.. కేకేఆర్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు. మరోసారి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మాక్సీ పెవిలియన్కు చేరాడు. వరుణ్ అద్బుతమైన బంతితో ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్లో 8 బంతులు ఎదుర్కొన్న మాక్స్వెల్..87.50 స్ట్రైక్ రేటుతో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన మాక్స్వెల్.. 8.00 సగటుతో కేవలం 48 పరుగులు చేశాడు. దీంతో మాక్స్వెల్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.ఐపీఎల్ చరిత్రలోనే చెత్త ప్లేయర్ అంటూ ఎక్స్లో ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(83) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్(25) రాణించారు.చదవండి: IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్ -
IPL 2025 PBKS Vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
KKR vs PBKS Live Updates: వర్షం కారణంగా మ్యాచ్ రద్దుఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కేకేఆర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ముగిసిన అనంతరం వరుణుడు మ్యాచ్కు అంతరాయం కలిగించాడు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుందని అంతాభావించారు. కానీ మైదానం సిద్దం చేసే సమయానికి వర్షం మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(83) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్(25) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రస్సెల్ తలా వికెట్ సాధించారు. మ్యాచ్కు వర్షం అంతరాయంఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించాడు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. కేకేఆర్ ముందు భారీ టార్గెట్ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(83) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్(25) రాణించారు.పంజాబ్ రెండో వికెట్ డౌన్..ప్రభుసిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 83 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సింగ్.. వైభవ్ ఆరోరా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 14.3 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 160/2పంజాబ్ తొలి వికెట్ డౌన్..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 69 పరుగులు చేసిన ఆర్య.. రస్సెల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 12 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 121 పరుగులు చేసింది. 11 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 112/011 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(62), ప్రభుసిమ్రాన్ సింగ్(47) ఉన్నారు.8 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 71/08 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(38), ప్రభుసిమ్రాన్ సింగ్(31) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న పంజాబ్ కింగ్స్..4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(28), ప్రభుసిమ్రాన్ సింగ్(13) ఉన్నారు.ఐపీఎల్-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం.ఈ మ్యాచ్లో పంజాబ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. జట్టులోకి తిరిగి మాక్స్వెల్, ఓమర్జాయ్ వచ్చారు. కేకేఆర్ రెండు మార్పులు చేసింది. రావ్మన్ పావెల్తో పాటు చేతన్ సాకరియా కేకేఆర్ తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రోవ్మన్ పావెల్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి -
'శ్రేయస్ చాలా బాధపడ్డాడు.. కేకేఆర్కు చుక్కలు చూపిస్తాడు'
ఐపీఎల్-2025లో శనివారం ఈడెన్గార్డెన్స్ వేదికగా కీలకపోరులో తలపడేందుకు పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ రేసులో ముందుకు వెళ్లళాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఐదో స్ధానంలో ఉండగా.. కోల్కతా ఏడో స్ధానంలో ఉంది. ఇరు జట్లకు ఇంకా ఆరు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్కు ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అయ్యర్ తన మాజీ జట్టు కేకేఆర్పై మరోసారి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దంగా ఉన్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.కాగా శ్రేయస్ అయ్యర్ గతేడాది సీజన్లో కెప్టెన్గా కేకేఆర్కు టైటిల్ను అందించాడు. కానీ అనూహ్యంగా మెగా వేలానికి ముందు అయ్యర్ను రిటైన్ చేసుకోకుండా కేకేఆర్ ఫ్రాంచైజీ అందరికి షాకిచ్చింది. కేకేఆర్ నిర్ణయంతో శ్రేయస్ కూడా నిరాశచెందాడు. తనతో రిటెన్షన్ కోసం కనీసం సంప్రదింపులు కూడా జరపనట్లు శ్రేయస్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే వేలంలోకి వచ్చిన అయ్యర్ను రూ.26 .75 కోట్ల భారీ ధరకు పంజాబ్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటికే కేకేఆర్ను ఓసారి పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని పంజాబ్ చరిత్ర సృష్టించింది. నేడు జరగనున్న మ్యాచ్లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని శ్రేయస్ సేన భావిస్తోంది."కేకేఆర్పై శ్రేయస్ అయ్యర్ చాలా కోపంగా ఉంటాడు. ఆటగాళ్లు ఫామ్లో లేకపోతే లేదా కెప్టెన్గా విఫలమైతే ఏ ఫ్రాంచైజీ అయినా వేలంలోకి విడిచిపెడుతోంది. కానీ అయ్యర్ కథ వేరు. టైటిల్ను అందించిన కెప్టెన్ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. నిజంగా ఈ నిర్ణయం ఎవరినైనా బాధిస్తుంది. టైటిల్ను అందించిన జట్టుకు ఏ కెప్టెనైనా ఉండాలని భావించడు.తనను రిటైన్ చేసుకోకపోవడంతో అయ్యర్ చాలా బాధపడ్డాడు. అయితే కేకేఆర్ విడిచిపెట్టడంతో అయ్యర్కు ఒకవంతు మంచే జరిగింది. అతడు భారీ ధరకు పంజాబ్ కింగ్స్ జట్టులోకి వచ్చాడు. మరోసారి కేకేఆర్పై తనంటో నిరూపించకోవాల్సిన సమయం వచ్చింది. పంజాబ్కు అయ్యర్ మరో రెండు పాయింట్లను తీసుకువస్తాడని ఆశిస్తున్నాను" అని స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.చదవండి: ఈసారి వేలం వేస్ట్.. ధోని కేవలం బ్రాండ్ కోసమే ఆడుతున్నాడు: సురేశ్ రైనా విమర్శలు -
KKR Vs PBKS: కోల్‘కథ’ మారేనా!
కోల్కతా: ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయిన జట్లు... 18వ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇలా నాలుగు జట్లు చక్కటి ఆటతీరుతో దూసుకెళ్తున్నాయి. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడి 5 విజయాలు, 3 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ నేడు జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో తలపడనుంది. గత సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్... ఇప్పుడు పంజాబ్ కింగ్స్ సారథిగా ఈడెన్ గార్డెన్స్లో అడుగు పెట్టనున్నాడు. పుష్కర కాలం తర్వాత కేకేఆర్కు మూడో ఐపీఎల్ ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ను ఫ్రాంఛైజీ వేలానికి వదిలేస్తే... పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకొని కెప్టెన్ను చేసింది. కోచ్ రికీ పాంటింగ్తో కలిసి శ్రేయస్ జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్లో కేకేఆర్ 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 95 పరుగులకు ఆలౌటైంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోల్కతా చూస్తుంటే... గెలుపు జోరు కొనసాగిస్తూ ‘ప్లే ఆఫ్స్’ వైపు మరో అడుగు ముందుకు వేయాలని పంజాబ్ భావిస్తోంది. మిడిలార్డర్పైనే భారం! డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కోల్కతా... నిలకడగా విజయాలు సాధించడంలో విఫలమవుతోంది. 8 మ్యాచ్ల్లో 3 విజయాలు, 5 పరాజయాలతో 6 పాయింట్లు సాధించిన కోల్కతా పట్టిక ఏడో స్థానంలో ఉంది. కెపె్టన్ అజింక్యా రహానే ఒక్కడే ఓ మాదిరిగా ఆడుతుండగా... మిగిలిన వాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. 8 మ్యాచ్ల్లో 271 పరుగులు చేసిన రహానే జట్టులో అందరికంటే ముందున్నాడు. 19 ఏళ్ల అంగ్క్రిష్ రఘువంశీ 197 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్... 135 పరుగులే చేయగా... ఓపెనర్లు క్వింటన్ డికాక్ 143, సునీల్ నరైన్ 147 కూడా మెరుపులు మెరిపించలేకపోతున్నారు. రింకూ సింగ్, రసెల్, రమణ్దీప్ సింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. రింకూ 8 మ్యాచ్ల్లో 133 పరుగులే చేయగా... రసెల్ 55, రమణ్దీప్ 30 పరుగులు చేశారు. ఈ ముగ్గురు ఫినిషింగ్ టచ్తో జట్టుకు భారీ స్కోర్లు అందిస్తారనుకుంటే... వారు వరస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. బౌలింగ్లోనూ కేకేఆర్కు ఏదీ కలిసి రావడం లేదు. వరుణ్ చక్రవర్తి, నరైన్, మోయిన్ అలీ వంటి ముగ్గురు ప్రధాన స్పిన్నర్లు ఉన్నప్పటికీ పిచ్ వారికి అనుకూలంగా రూపొందించుకోలేక పోయిన కేకేఆర్ దానికి మూల్యం చెల్లించుకుంటోంది. పేసర్లు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా ఫర్వాలేదనిపిస్తున్నారు. కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ మ్యాచ్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు కోల్కతా సిద్ధమైంది. అన్నీ రంగాల్లో బలంగా... కేకేఆర్తో పోల్చుకుంటే పంజాబ్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈ సీజన్లో శ్రేయస్ సారథ్యం... పాంటింగ్ వ్యూహాలు... ఓపెనర్ల మెరుపులు... చాహల్ స్పిన్ మాయాజాలం వెరసి పంజాబ్ బలంగా కనిపిస్తోంది. లీగ్ ఆరంభంలో దూకుడైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న శ్రేయస్... గత మూడు మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం కాస్త ఇబ్బంది పెడుతోంది. అయినప్పటికీ అతడు 8 మ్యాచ్ల్లో 263 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. అందులో 3 అర్ధశతకాలు ఉన్నాయి. ప్రియాన్ష్ఆర్య 254, ప్రభ్సిమ్రన్ సింగ్ 209, నేహల్ వధేరా 189, శశాంక్ సింగ్ 158 పరుగులు చేశారు. ఓపెనర్లు ఆర్య, ప్రభ్సిమ్రన్ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తుండగా... శ్రేయస్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్ మిడిలార్డర్లో బరిలోకి దిగనున్నారు. బౌలింగ్లో ప్రధాన పేసర్ అర్‡్షదీప్ సింగ్ ఆకట్టుకుంటుండగా... యుజ్వేంద్ర చాహల్ ఫామ్లో ఉన్నాడు. అర్ష్ దీప్ 11 వికెట్లు తీయగా... కేకేఆర్తో గత మ్యాచ్లో చాహల్ 4 ప్రధాన వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో సమతూకంగా ఉన్న పంజాబ్కు మార్కో యాన్సెన్, స్టొయినిస్ రూపంలో నిఖార్సైన ఆల్రౌండర్లు ఉండటం అదనపు బలంగా మారింది. ఈ ఇద్దరు మంచి టచ్లో ఉన్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేకేఆర్... పంజాబ్ జోరును ఎలా అడ్డుకుంటుందో చూడాలి!34 ఐపీఎల్ చరిత్రలో కోల్కతా, పంజాబ్ జట్లు ముఖాముఖిగా 34 సార్లు తలపడ్డాయి. 21 మ్యాచ్ల్లో కోల్కతా, 13 మ్యాచ్ల్లో పంజాబ్ గెలుపొందాయి. పంజాబ్పై కోల్కతా అత్యధిక స్కోరు 261 కాగా, అత్యల్ప స్కోరు 95 పరుగులు. కోల్కతాపై పంజాబ్ అత్యధిక స్కోరు 262 కాగా, అత్యల్ప స్కోరు 111 పరుగులు. -
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. పంజాబ్ కింగ్స్తో పోరులో కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్లో రోహిత్ శర్మ ఊర మాస్ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్ భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్... తనను ‘హిట్మ్యాన్’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.ముంబై: సిక్స్... ఫోర్... ముంబై ఇన్నింగ్స్ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ, టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ల ఆట మ్యాచ్లో హైలైట్స్ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ముందుగా చెన్నై సూపర్కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్లు) హోరెత్తించారు. దంచేసిన జడేజా, దూబే ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (20 బంతుల్లో 19; 1 ఫోర్)కు ఓపెనింగ్లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్ బాయ్’ ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్లతో అలరించాడు. తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్కు 79 పరుగులు జోడించారు. సిక్స్లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు. బాదుడే... బాదుడు రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ చేసిన రికెల్టన్ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్ నుంచి రోహిత్ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్ ఓవర్న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ను కోల్పోయింది. సూర్యకుమార్ రావడం... రోహిత్తో కలిసి ధనాధన్ షోను డబుల్ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్మ్యాన్’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: షేక్ రషీద్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 19; రచిన్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 5; ఆయుశ్ (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 32; జడేజా (నాటౌట్) 53; దూబే (సి) జాక్స్ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్: చహర్ 4–0–32–1, బౌల్ట్ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్ జాక్స్ 1–0–4–0, హార్దిక్ 2–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) ఆయుశ్ (బి) జడేజా 24; రోహిత్ (నాటౌట్) 76; సూర్యకుమార్ (నాటౌట్) 68; ఎక్స్ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్: ఖలీల్ 2–0–24–0, ఓవర్టన్ 2–0– 29–0, అశ్విన్ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0. ముల్లాన్పూర్: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోష్ ఇన్గ్లిస్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించాడు. కోహ్లి ఆఖరిదాకా... పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) వికెట్ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్ కోహ్లి, పడిక్కల్ నడిపించారు. వన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్ షాట్లతో ముల్లాన్పూర్ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 22; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 33; అయ్యర్ (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 6; ఇన్గ్లిస్ (బి) సుయశ్ 29; నేహల్ (రనౌట్) 5; శశాంక్ (నాటౌట్) 31; స్టొయినిస్ (బి) సుయశ్ 1; యాన్సెన్ (నాటౌట్) 25; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–0, యశ్ దయాళ్ 2–0–22–0, హాజల్వుడ్ 4–0–39–0, కృనాల్ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్ 2–0–18–1, సుయశ్ 4–0–26–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్గ్లిస్ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్) 73; పడిక్కల్ (సి) నేహల్ (బి) హర్ప్రీత్ 61; పాటీదార్ (సి) యాన్సెన్ (బి) చహల్ 12; జితేశ్ శర్మ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్ 3–0–28–1, హర్ప్రీత్ బ్రార్ 4–0–27–1, యాన్సెన్ 3–0–20–0, చహల్ 4–0–36–1, స్టొయినిస్ 1–0–13–0, నేహల్ 0.5–0–9–0. ఐపీఎల్లో నేడుకోల్కతా X గుజరాత్ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
పడిక్కల్ విధ్వంసం, సత్తా చాటిన విరాట్.. పంజాబ్పై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగగా.. ఆ మ్యాచ్లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో పంజాబ్ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్ను స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ వికెట్లు తీయకపోయినా.. పొదుపుగా బౌలింగ్ చేశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. -
PBKS VS RCB: యువరాజ్ సింగ్ను అధిగమించిన ప్రభ్సిమ్రన్ సింగ్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. పంజాబ్ హోం గ్రౌండ్ ముల్లాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. పంజాబ్, ఆర్సీబీ రెండు రోజుల కిందటే బెంగళూరులో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది.ఇవాళ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంది. కృనాల్ పాండ్యా (4-0-25-2), సుయాశ్ శర్మ (4-0-26-2), రొమారియో షెపర్డ్ (2-0-18-1) చెలరేగడంతో పంజాబ్ 18 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 22, ప్రభ్సిమ్రన్ సింగ్ 33, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1 పరుగు చేసి ఔట్ కాగా.. శశాంక్ సింగ్ 25, జన్సెన్ 14 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.ఈ మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ ఆ ఫ్రాంచైజీ దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ రికార్డును అధిగమించాడు. యువరాజ్ పంజాబ్ కింగ్స్ తరఫున 959 పరుగులు (51 మ్యాచ్ల్లో) చేయగా.. ఈ మ్యాచ్లో ప్రభ్సిమ్రన్ యువీ పరుగుల సంఖ్యను దాటేశాడు. ప్రభ్సిమ్రన్ పంజాబ్ తరఫున 42 మ్యాచ్ల్లోనే 965 పరుగులు చేశాడు. సగటు, స్ట్రయిక్రేట్లోనూ ప్రభ్సిమ్రన్ యువరాజ్ కంటే మెరుగ్గా ఉన్నాడు. పంజాబ్ తరఫున యువీ యావరేజ్ 22.30గా ఉండగా.. ప్రభ్సిమ్రన్ యావరేజ్ 22.97గా ఉంది. యువీ స్ట్రయిక్రేట్ 127.86గా ఉండగా.. ప్రభ్సిమ్రన్ స్ట్రయిక్రేట్ 150.55గా ఉంది.టాప్లో కేఎల్ రాహుల్.. 12వ స్థానంలో ప్రభ్సిమ్రన్ఐపీఎల్లో పంజాబ్ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ (2548) ఉన్నాడు. అతడి తర్వాత షాన్ మార్ష్ (2477), డేవిడ్ మిల్లర్ (1974), మయాంక్ అగర్వాల్ (1513), మ్యాక్స్వెల్ (1424), క్రిస్ గేల్ (1339), వృద్దిమాన్ సాహా (1190), మనన్ వోహ్రా (1106), మన్దీప్ సింగ్ (1073), కుమార సంగక్కర (1009), శిఖర్ ధవన్ (985) ఉన్నారు. ప్రభ్సిమ్రన్ ప్రస్తుతం పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 12వ స్థానంలో ఉన్నాడు.ప్రభ్సిమ్రన్ ప్రస్తానం ఇలా..2019 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ప్రభ్సిమ్రన్ 2023, 2024 సీజన్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 సీజన్లో 14 మ్యాచ్ల్లో 358 పరుగులు చేసిన ప్రభ్సిమ్రన్.. 2024 సీజన్లోనూ 14 మ్యాచ్ల్లో 334 పరుగులు చేశాడు. ప్రభ్సిమ్రన్ 2023 సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి వెలుగులోకి వచ్చాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు పంజాబ్ ప్రభ్సిమ్రన్ను రూ. 4 కోట్లకు రీటైన్ చేసుకుంది. ప్రస్తుత సీజన్లో ప్రభ్సిమ్రన్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేస్తూ పంజాబ్కు శుభారంభాలు అందిస్తున్నాడు.ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్, ఢిల్లీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడో ఓటమిని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో పాటిదార్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వర్షం వల్ల ఈ మ్యాచ్కు అంతరాయం కలుగగా.. పద్నాలుగు ఓవర్లకు కుదించారు.ఈ క్రమంలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 14 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ సాధించాడు.ఇక పంజాబ్ ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి.. 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ మూడు వికెట్లు దక్కించుకోగా.. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు కూల్చాడు.అతిపెద్ద గుణపాఠంఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar).. బ్యాటింగ్ వైఫల్యం వల్లే తాము ఓడిపోయామని పేర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘‘మా బ్యాటింగ్ విభాగం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.ఇలాంటి మ్యాచ్లలో భాగస్వామ్యాలు నమోదు చేయడం అత్యంత ముఖ్యం. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ మ్యాచ్లో మాకు ఇదే అతిపెద్ద గుణపాఠం.పరిస్థితులకు తగ్గట్లుగా మేము మా బ్యాటింగ్ శైలిని మార్చుకోవాల్సి ఉంది. అందుకే ఈరోజు పడిక్కల్ను ఆడించలేదు. ఇక వికెట్ కూడా అంత చెత్తగా ఏమీ లేదు. చాలా కాలంగా కవర్లు కప్పి ఉంచిన కారణంగా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు మేలు చేకూరింది.క్రెడిట్ వారికే.. మా బౌలర్లు కూడా సూపర్ఈ విజయంలో క్రెడిట్ పంజాబ్ బౌలర్లకే దక్కుతుంది. వికెట్ ఎలా ఉన్నా.. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. మా బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. అదే మాకు అతిపెద్ద సానుకూలాంశం. బ్యాటర్లు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఆడారు. కానీ కొన్నిసార్లు నిరాశ తప్పదు. బ్యాటింగ్ విభాగంలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాం’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.కాగా సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది 46వ ఓటమి. ఐపీఎల్ చరిత్రలో హోం గ్రౌండ్లో అత్యధిక మ్యాచ్లలో పరాజయం పాలైన జట్టుగా ఆర్సీబీ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్👉టాస్: పంజాబ్ కింగ్స్.. మొదట బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 95/9 (14)👉పంజాబ్ కింగ్స్ స్కోరు: 98/5 (12.1)👉ఫలితం: ఆర్సీబీపై ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డేవిడ్ (ఆర్సీబీ- 26 బంతుల్లో 50 నాటౌట్). .@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️They continue their winning streak with an all-round show over #RCB 👏Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్గా -
ఐపీఎల్ లో బెంగళూరుపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం
-
చాలెంజర్స్పై పంజా...
ముందు వాన... తర్వాత హైరానా! శుక్రవారం రాత్రి బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) పరిస్థితి ఇది. ఆలస్యమైన ఆటలో వికెట్ల వేటను చకచకా మొదలుపెట్టిన పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థిథని వారి సొంతగడ్డపై కుదేల్ చేసింది. కుదించిన ఓవర్లలో విదిల్చిన పంజాతో ఎదురైన స్వల్ప లక్ష్యాన్ని ఎంచక్కా ఛేదించిన కింగ్స్ ఈ ఐపీఎల్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో మూడోసారి బెంగళూరు ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడో మ్యాచ్లోనూ రాయల్ చాలెంజర్స్ బోణీ కొట్టలేకపోయింది. బెంగళూరు: పంజాబ్ కింగ్స్ బౌలింగ్ గర్జించింది. బెంగళూరును వణికించింది. కింగ్స్ను విజేతగా నిలబెట్టింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్లు) ఒక్కడే మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ , మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్ప్రీత్ బ్రార్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసి గెలిచింది. నేహల్ వధేరా (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడాడు. హాజల్వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. బెంగళూరు తమ తుదిజట్టును మార్చలేదు. పంజాబ్ మాత్రం రెండు మార్పులు చేసింది. మ్యాక్స్వెల్, సుర్యాంశ్ షెడ్గే స్థానాల్లో స్టొయినిస్, హర్ప్రీత్ బ్రార్ బరిలోకి దిగారు. అందరూ తొందరగానే... వర్షం వల్ల మ్యాచ్ చాలా ఆలస్యంగా ఆరంభమైంది. దీంతో మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించారు. కోహ్లి, సాల్ట్, లివింగ్స్టోన్లాంటి హిట్టర్లున్న జట్టులో ఏ నలుగురో, ఐదుగురో ఆడాల్సిన 14 ఓవర్లను ఏకంగా 11 మంది ఆడేశారు. టాపార్డర్, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ అందరూ తొందర, తొందరగా వికెట్లను పారేసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. సాల్ట్ (4), కోహ్లి (1), రజత్ పాటీదార్ (23), లివింగ్స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1) చేతులెత్తేశారు. డేవిడ్ ఒక్కడి మెరుపులతోనే... జట్టు స్కోరు 95/9. అంటే 11 మంది క్రీజులోకి వచ్చారన్నమాటే! అందరూ బ్యాటింగ్కు దిగినా... స్కోరులో సగంకంటే ఎక్కువ స్కోరు ఒక్కడే టిమ్ డేవిడ్ చేశాడు. ఏడో వరుసలో, ఏడో ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన డేవిడ్ అండగా నిలిచేవారే కరువైనా... ఆఖరి రెండు ఓవర్లలోనే అంతా మార్చాడు. 12 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్లకు 63 పరుగులు చేసింది. డేవిడ్ స్కోరు 19 కాగా... జేవియర్ 13వ ఓవర్లో 2 బౌండరీలు సహా 11 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ బ్రేక్కు ముందు... చివరి 14వ ఓవర్లో తొలి మూడు బంతులు వరుసగా... 0, 0, 0 పరుగే రాలేదు. తర్వాత మూడు బంతుల్ని డేవిడ్ భారీ సిక్సర్లు బాదడంతో 18 పరుగులొచ్చాయి. 48 పరుగులు చేసిన డేవిడ్ సహా అంతా ఇన్నింగ్స్ బ్రేక్ కావడంతో మైదానం వీడుతున్నారు. కానీ అంపైర్ చాలా ఆలస్యంగా నోబాల్ సిగ్నలిచ్చాడు. సహచరులతో కబుర్లాడుతూ డగౌట్ చేరుతున్న ఆటగాళ్లను వెనక్కి పిలిచి ఫ్రీ హిట్ ఆడించడంతో 2 పరుగులు తీసిన డేవిడ్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. నేహల్ మెరిపించాడు... సులువైన లక్ష్యం కావడంతో పంజాబ్కు ఛేదనలో పెద్దగా కష్టం ఎదురవలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (16), ప్రభ్సిమ్రాన్ (13), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7) ఇలా టాపార్డర్ వికెట్లు రాలినా... మిడిలార్డర్లో నేహల్ భారీ షాట్లతో విరుచుకు పడి జట్టును గెలిపించాడు. దీంతో ఒకే ఓవర్లో హాజల్వుడ్ అయ్యర్, ఇన్గ్లిస్ (14) వికెట్లను పడగొట్టినా... నేహల్ బ్యాటింగ్ బెంగళూరును మ్యాచ్లో పట్టుబిగించకుండా చేసింది. 11 బంతులు మిగిలుండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలురాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్గ్లిస్ (బి) అర్ష్ దీప్ 4; కోహ్లి (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ 1; పాటీదార్ (సి) జేవియర్ (బి) చహల్ 23; లివింగ్స్టోన్ (సి) ప్రియాన్‡్ష (బి) జేవియర్ 4; జితేశ్ (సి) నేహల్ (బి) చహల్ 2; కృనాల్ (సి అండ్ బి) యాన్సెన్ 1; టిమ్ డేవిడ్ (నాటౌట్) 50; మనోజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) యాన్సెన్ 1; భువనేశ్వర్ (సి) జేవియర్ (బి) హర్ప్రీత్ 8; యశ్ దయాళ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్ప్రీత్ 0; హజల్వుడ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో 9 వికెట్లకు) 95. వికెట్ల పతనం: 1–4, 2–21, 3–26, 4–32, 5–33, 6–41, 7–42, 8–63, 9–63. బౌలింగ్: అర్శ్దీప్ 3–0–23–2, జేవియర్ 3–0–26–1, యాన్సెన్ 3–0–10–2, చహల్ 3–0–11–2, హర్ప్రీత్ బ్రార్ 2–0–25–2. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) హాజల్వుడ్ 16; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) భువనేశ్వర్ 13; అయ్యర్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 7; ఇన్గ్లిస్ (సి) సుయశ్ (బి) హాజల్వుడ్ 14; నేహల్ (నాటౌట్) 33; శశాంక్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 1; స్టొయినిస్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 7; మొత్తం (12.1 ఓవర్లలో 5 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–22, 2–32, 3–52, 4–53, 5–81. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–26–2, యశ్ దయాళ్ 2.1–0–18–0, హాజల్వుడ్ 3–0–14–3, కృనాల్ 1–0–10–0, సుయశ్ 3–0–25–0. ఐపీఎల్లో నేడుగుజరాత్ X ఢిల్లీ వేదిక: అహ్మదాబాద్ , మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి రాజస్తాన్ X లక్నో వేదిక: జైపూర్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీపై పంజాబ్ విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఆర్సీబీపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జన్సెన్, చహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డేవిడ్తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. అయితే నేహల్ వధేరా (33 నాటౌట్) ఏమాత్రం జంక కుండా బ్యాటింగ్ చేసి పంజాబ్ను విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. యశ్ దయాల్ బౌలింగ్లో సిక్సర్ బాది స్టోయినిస్ (7 నాటౌట్) మ్యాచ్ను ముగించాడు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రియాంశ్ ఆర్య 16, ప్రభ్సిమ్రన్ సింగ్ 13, శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లిస్ 14, శశాంక్ సింగ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. -
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
పేసర్ అర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 18) జరుగుతున్న మ్యాచ్లో అర్షదీప్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అర్షదీప్ ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి వికెట్లు తీశాడు. 2019 సీజన్లో పంజాబ్లో చేరిన అర్షదీప్ ఇప్పటివరకు 86 వికెట్లు తీశాడు. అర్షదీప్కు ముందు పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు పియూశ్ చావ్లా పేరిట ఉండేది. చావ్లా పంజాబ్ తరఫున (2000-2013) 84 వికెట్లు తీశాడు. అర్షదీప్ను పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు వదిలేసింది. అయినా అతన్ని వేలంలో తిరిగి రూ. 18 కోట్లు పెట్టి దక్కించుకుంది.ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..86* - అర్ష్దీప్ సింగ్84 - పియూష్ చావ్లా73 - సందీప్ శర్మ61 - అక్షర్ పటేల్58 - మహ్మద్ షమీమ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో పంజాబ్ బౌలర్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఆర్సీబీ 8.2 ఓవర్లలో 42 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సహా జన్సెన్, చహల్ తలో రెండు వికెట్లు తీశారు. బార్ట్లెట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, రజత్ పాటిదార్ 23, లివింగ్స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1 పరుగు చేసి ఔటయ్యారు. టిమ్ డేవిడ్ (8), భువనేశ్వర్ కుమార్ (3) క్రీజ్లో ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 47/7గా ఉంది. -
IPL 2025: ఆర్సీబీపై పంజాబ్ విజయం
ఆర్సీబీపై పంజాబ్ విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జన్సెన్, చహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డేవిడ్తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. అయితే నేహల్ వధేరా (33 నాటౌట్) ఏమాత్రం జంక కుండా బ్యాటింగ్ చేసి పంజాబ్ను విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. యశ్ దయాల్ బౌలింగ్లో సిక్సర్ బాది స్టోయినిస్ (7 నాటౌట్) మ్యాచ్ను ముగించాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రియాంశ్ ఆర్య 16, ప్రభ్సిమ్రన్ సింగ్ 13, శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లిస్ 14, శశాంక్ సింగ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్2.4వ ఓవర్- 22 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్లో టిమ్ డేవిడ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ప్రభ్సిమ్రన్ (13) ఔటయ్యాడు. పంజాబ్ బౌలర్ల విజృంభణ.. 95 పరుగులకే పరిమితమైన ఆర్సీబీవర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అర్షదీప్, జన్సెన్, చహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డేవిడ్తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు. 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ సింగ్ 2, బార్ట్లెట్, జన్సెన్, చహల్ తలో వికెట్ తీశారు. పాటిదార్ (21), టిమ్ డేవిడ్ (5) క్రీజ్లో ఉన్నారు. 6.3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 38/5గా ఉంది. కోహ్లి ఔట్.. 21 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ2.4వ ఓవర్- 21 పరుగులకే ఆర్సీబీ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి (1) ఔటయ్యాడు. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్లో తొలి బంతికే బౌండరీ బాదిన సాల్ట్ నాలుగో బంతికి మరో భారీ షాట్కు ప్రయత్నించి వికెట్ కీపర్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ రెండు మార్పులు చేసింది. మ్యాక్స్వెల్ స్థానంలో స్టోయినిస్ జట్టులోకి వచ్చాడు. హర్ప్రీత్ బ్రార్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్ ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, నేహాల్ వధేరా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, విజయ్కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్జ్, గ్లెన్ మాక్స్వెల్, ప్రవీణ్ దూబే9:30 గంటలకు టాస్.. 14 ఓవర్ల మ్యాచ్టాస్ 9:30 గంటలకు పడనుంది. 9:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్ ప్లే 4 ఓవర్లుగా తేల్చారు. ముగ్గురు బౌలర్లు నాలుగు ఓవర్లు, ఓ బౌలర్ మిగతా రెండు ఓవర్లు బౌల్ చేయవచ్చు. తగ్గిన వర్షం.. తొలిగిన కవర్లు9:05 గంటలు- ఎట్టకేలకు వర్షం తగ్గుముఖం పట్టడంతో మైదాన సిబ్బంది కవర్లను తొలగించారు. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి వార్మప్ మొదలుపెట్టారు. ఎంతకీ తగ్గని వర్షం.. ఓవర్ల కోత మొదలైంది8:30 గంటలు-సాయంత్రం ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గడం లేదు. ఇకపై మ్యాచ్ ప్రారంభమైనా ఓవర్ల కోత తప్పదని తెలుస్తుంది.ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ హెం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలాడు. టాస్ ఆలస్యమయ్యే అవకాశముంది. గత రెండు, మూడు గంటల నుంచి వర్షం పడుతుండటంతో స్టేడియం మొత్తం కవర్లు కప్పి ఉంచారు. మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదమేమీ లేనప్పటి.. ఓవర్ల కోత ఉండవచ్చని తెలుస్తుంది. -
IPL 2025: నేటి (ఏప్రిల్ 18) మ్యాచ్కు వర్షం ముప్పు
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 18) ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ హెం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కవర్లతో కప్పి ఉంది. వర్షం పడే సూచనలు ఉన్నప్పుడే ఇలా చేస్తారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. మ్యాచ్ జరిగే సమయానికి 22 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదమేమీ లేనప్పటికీ పాక్షికంగా బ్రేకులు పడే ఛాన్స్ ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో ఆర్సీబీకి హోం గ్రౌండ్లో ఇది మూడో మ్యాచ్. ఇక్కడ ఆడిన గత రెండు మ్యాచ్ల్లో ఆర్సీబీ ఓడింది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రత్యర్థి ఇలాకాల్లో ఆడిన ప్రతి మ్యాచ్లోనూ గెలిచింది. ఈ సీజన్లో ఆర్సీబీ తమ సొంత మైదానంలో గుజరాత్, ఢిల్లీ చేతుల్లో ఓడింది. ఆర్సీబీ ఈ సీజన్లో కేకేఆర్, సీఎస్కే, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ను వారి సొంత ఇలాకాల్లో ఓడించింది. ప్రస్తుతం ఆర్సీబీ 6 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (+0.672) ఉంది. పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి నాలుగో స్థానంలో (+0.172) ఉంది. పంజాబ్ ఈ సీజన్లో గుజరాత్, లక్నో, సీఎస్కే, కేకేఆర్పై విజయాలు సాధించి, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ చేతుల్లో పరాజయంపాలైంది. పంజాబ్.. కేకేఆర్తో జరిగిన గత మ్యాచ్లో 111 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని రికార్డుల్లోకెక్కింది. అంతుకుముందు పంజాబ్ సన్రైజర్స్పై 245 పరుగులు చేసినప్పటికీ ఓటమిపాలైంది.పంజాబ్దే స్వల్ప పైచేయిపంజాబ్, ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే పంజాబ్దే స్వల్ప పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్ల్లో తలపడగా.. పంజాబ్ 17, ఆర్సీబీ 16 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిగా తలపడిన మూడు మ్యాచ్ల్లో ఆర్సీబీ విజయం సాధించింది.తుది జట్లు (అంచనా)..ఆర్సీబీ: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మపంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, విజయ్కుమార్ వైశాఖ్ -
సమఉజ్జీల సమరం!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఆరేసి మ్యాచ్లు ఆడిన ఇరు జట్లు నాలుగింట గెలిచి 8 పాయింట్లతో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. తాజా సీజన్లో ప్రత్యర్థి జట్ల మైదానాల్లో వరుస విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ... బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మాత్రం గెలుపు రుచి చూడలేకపోయింది. మాజీ చాంపియన్లు కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ను వారి వారి సొంత మైదానాల్లో ఓడించిన ఆర్సీబీ... బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. మరోవైపు గత మ్యాచ్లో 111 పరుగులే చేసినా... బౌలింగ్ బలంతో కోల్కతా నైట్రైడర్స్ను నిలువరించిన పంజాబ్ కింగ్స్ మంచి ఊపు మీద ఉంది. పంజాబ్ స్పిన్నర్లను బెంగళూరు బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. చహల్ మ్యాజిక్ కీలకం... శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య రూపంలో ప్రతిభావంతులైన ఓపెనర్లు అందుబాటులో ఉండగా... అయ్యర్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్తో మిడిలార్డర్ మెరుగ్గా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ ఫామ్ను ఐపీఎల్లో సైతం కొనసాగిస్తున్న అయ్యర్... తనకు అనువైన రోజు భారీ స్కోర్లతో చెలరేగుతున్నాడు. అదే సమయంలో నిలకడ కొనసాగించలేకపోతున్నాడు. మ్యాక్స్వెల్ బౌలింగ్లో అదనపు స్పిన్నర్గా సేవలందిస్తున్నా... బ్యాటర్గా మాత్రం అతడి స్థాయి ప్రదర్శన ఇంకా రాలేదు. బౌలింగ్లోనూ పంజాబ్కు విభిన్న ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మార్కో యాన్సెన్, అర్ష్ దీప్ సింగ్, జేవియర్ బార్ట్లెట్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. గత మ్యాచ్లో కోల్కతాపై 4 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన పంజాబ్ ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కీలకం కానున్నాడు. బెంగళూరు పిచ్పై అతడికి మంచి అవగాహన ఉండటం పంజాబ్కు అదనపు ప్రయోజనం చేకూర్చనుంది.చిన్నస్వామిలో బోణీ కొట్టేనా... ఈ సీజన్ ఆరంభం నుంచి మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రధానంగా బ్యాటర్లపైనే ఆధారపడుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ రూపంలో ఆ జట్టుకు ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్తో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే పవర్ప్లేతో పాటు స్లాగ్ ఓవర్లలో ధాటిగా ఆడుతున్న ఆర్సీబీ... మధ్య ఓవర్లలో మాత్రం సులువుగా పరుగులు రాబట్టలేకపోతోంది. ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బెంగళూరు బ్యాటర్లు తడబడుతున్నారు. గుజరాత్ స్పిన్నర్ సాయికిషోర్, ఢిల్లీ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ బౌలింగ్ ఆడలేక ఇబ్బంది పడ్డారు. బౌలింగ్లో హాజల్వుడ్, యశ్ దయాళ్, భువనేశ్వర్ కుమార్ పేస్ బారం మోయనుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. 33 ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖిగా 33 సార్లు తలపడ్డాయి. 16 మ్యాచ్ల్లో బెంగళూరు, 17 మ్యాచ్ల్లో పంజాబ్ విజయం సాధించాయి. 2023లో పంజాబ్తో ఆడిన ఏకైక మ్యాచ్లోనూ, గత ఏడాది పంజాబ్తో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ బెంగళూరు జట్టే గెలిచింది. పంజాబ్పై బెంగళూరు అత్యధిక స్కోరు 241 కాగా... అత్యల్ప స్కోరు 84. బెంగళూరుపై పంజాబ్ అత్యధిక స్కోరు 232 కాగా, అత్యల్ప స్కోరు 88. తుది జట్లు (అంచనా) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హాజల్వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ. పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, యాన్సెన్, జేవియర్, అర్ష్ దీప్ , స్టొయినిస్, చాహల్. -
చరిత్ర సృష్టించిన చాహల్.. తొలి బౌలర్గా రికార్డు
ఐపీఎల్-2025లో టీమిండియా వెటరన్, పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఎట్టకేలకు తన ఫామ్ను అందుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ముల్లాన్పూర్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చాహల్ అద్భుతం చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో పంజాబ్ కింగ్స్కు చారిత్రత్మక విజయాన్ని చాహల్ అందించాడు.ఓటమి తప్పదనుకున్న చోట చాహల్ తన బౌలింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతడు 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా 112 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్లో అత్యల్ప స్కోరును డిఫెండ్ చేసిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన చాహల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.నరైన్ రికార్డు సమం..ఐపీఎల్లో అత్యధిక సార్లు 4 వికెట్ల హాల్ సాధించిన బౌలర్గా సునీల్ నరైన్ రికార్డును చాహల్ సమం చేశాడు. ఇది చాహల్కు ఎనిమిదివ 4 వికెట్ల హాల్. నరైన్ కూడా సరిగ్గా 8 సార్లు 4 వికెట్లు సాధించాడు. అయితే ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ బౌలర్ మాత్రం చాహలే కావడం గమనార్హం. అదే విధంగా ఐపీఎల్లో కేకేఆర్పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా యుజీ నిలిచాడు. చాహల్ ఇప్పటివరకు కేకేఆర్పై 23 మ్యాచ్ల్లో 7.96 ఎకానమీ రేటుతో 33 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భువనేశ్వర్ కుమార్(32) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో భువీ అల్టైమ్ రికార్డును యుజీ బ్రేక్ చేశాడు. కాగా ఐపీఎల్లో లీడింగ్ వికెట్ టేకర్ చాహల్ (211) లీడింగ్ వికెట్ టేకర్ కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2025: మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్కు బీసీసీఐ అలెర్ట్? -
చాహల్.. వావ్ వాట్ ఏ టాలెంట్ మ్యాన్: మహవాష్ పోస్ట్ వైరల్
ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా మంగళవారం పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్లో కేకేఆర్పై 16 పరుగుల తేడాతో పంజాబ్ చారిత్రత్మక విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్నిడిఫెండ్ చేసుకుని పంజాబ్ చరిత్రను తిరిగ రాసింది. పంజాబ్ విజయంలో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ది కీలక పాత్ర. చాహల్ తన స్పిన్ మ్యాజిక్తో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. రహానే, రింకూ సింగ్, రమణ్దీప్, రఘువన్షి వంటి కీలక వికెట్లను పడగొట్టి కేకేఆర్ను దెబ్బతీశాడు. ఫలితంగా స్వల్ప లక్ష్య చేధనలో కేకేఆర్ 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప టార్గెట్ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇక చాహల్ అద్భుత ప్రదర్శనపై అతడి రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహవాష్ స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లెగ్ స్పిన్నర్ను ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేసింది. చాహల్తో కలిసి ఉన్న ఫోటోను అప్ లోడ్ చేసిన మహవాష్.. ‘వావ్ వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్. అందుకే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచావు. అసంభవ్’ అంటూ క్యాప్షన్ జత చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ధనశ్రీ వర్మతో చాహల్ విడాకులు తీసుకున్న తర్వాత మహవాష్తో ప్రేమయాణం కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లను చాహల్, మహ్వశ్ కలిసి వీక్షించడం, అతడు ఆడే మ్యాచ్లకు ఆమె హాజరవడం వంటివి ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే వారు మాత్రం తాము కేవలం స్నేహితులు మాత్రమే అని ఓ సందర్భంగా చెప్పకొచ్చారు.చదవండి: శ్రేయస్ అయ్యర్పై సర్వత్రా ప్రశంసలు -
కోల్ కతాపై పంజాబ్ ఘన విజయం
-
PBKS vs KKR: 111 తోనే పంజాబ్ పండుగ
సొంత మైదానంలో బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై పంజాబ్ కింగ్స్ పడుతూ లేస్తూ 111 పరుగులు చేసింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) విజయంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే కోల్కతా జట్టు పాయింట్ల పట్టికలో నంబర్వన్ స్థానానికి కూడా దూసుకుపోతుంది. ఎంత వేగంగా ఛేదిస్తారనే దానిపైనే చర్చ. 62/2 స్కోరుతో జట్టు గెలుపు దిశగా సాగింది. కానీ ఒక్కసారిగా అనూహ్యం జరిగింది. యుజువేంద్ర చహల్ పదునైన స్పిన్తో కేకేఆర్ పతనానికి శ్రీకారం చుట్టాడు. 17 పరుగుల వ్యవధిలో కోల్కతా 6 వికెట్లు కోల్పోయింది. అయితే రసెల్ ఒకే ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో మళ్లీ కేకేఆర్ విజయంపై అంచనాలు... కానీ యాన్సెన్ బంతితో రసెల్ ఆట ముగిసింది... మరో 29 బంతులు మిగిలి ఉండగానే కోల్కతా ఆలౌట్... పంజాబ్ అభిమానులతో మైదానం ఒక్కసారిగా హోరెత్తింది. శనివారం 245 పరుగులు చేసి కూడా సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన పంజాబ్ కింగ్స్...ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచింది. ముల్లాన్పూర్: ఐపీఎల్లో అరుదుగా కనిపించే తక్కువ స్కోర్ల మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. మంగళవారం జరిగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 15.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్సిమ్రన్ సింగ్ (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్స్కోరర్గా నిలిచాడు. అనంతరం కోల్కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. రఘువంశీ (28 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యుజువేంద్ర చహల్ (4/28) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఓపెనింగ్ మినహా... తొలి 19 బంతుల్లో 39/0... తర్వాతి 17 బంతుల్లో 15/4... పవర్ప్లేలో పంజాబ్ ఆటతీరు ఇది. ఓపెనర్ల ఆటతీరు చూస్తే ఈ మైదానంలో జరిగిన గత రెండు మ్యాచ్ల తరహాలోనే భారీ స్కోరు ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. నోర్జే ఓవర్లో ప్రియాన్ష్ఆర్య (12 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) రెండు ఫోర్లు కొట్టగా... అరోరా వేసిన తర్వాతి ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 4, 6, 4 బాదాడు. అదే ఓవర్లో ప్రియాన్ష్ కూడా ఫోర్ కొట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. రాణా తొలి బంతిని ప్రియాకూ సిక్స్ కొట్టే వరకు అంతా బాగుంది. కానీ ఆ తర్వాతి బంతి నుంచే కోల్కతా బౌలర్ల జోరు మొదలైంది. అదే ఓవర్లో ప్రియాన్ష్ , శ్రేయస్ అయ్యర్ (0)లను అవుట్ చేసిన రాణా తన తర్వాతి ఓవర్లో ప్రభ్సిమ్రన్ను కూడా వెనక్కి పంపాడు. అంతకు ముందే సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఇన్గ్లిస్ (2) కూడా వరుణ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 54/4కు చేరింది. ఇక ఆ తర్వాత పంజాబ్ కోలుకోలేకపోయింది. నైట్రైడర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పవర్ప్లే తర్వాత ఆడిన 57 బంతుల్లో 57 పరుగులు మాత్రమే చేసిన జట్టు 6 వికెట్లు కోల్పోయింది. వధేరా (10), మ్యాక్స్వెల్ (7), ఇంపాక్ట్ సబ్గా వచ్చిన సూర్యాంశ్ (4) ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, శశాంక్ సింగ్ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కూడా విఫలమయ్యాడు. టపటపా... ఛేదనలో కోల్కతాకు సరైన ఆరంభం లభించలేదు. మూడు బంతుల వ్యవధిలో ఒకే స్కోరు వద్ద ఓపెనర్లు నరైన్ (5), డికాక్ (2) వెనుదిరిగారు. అయితే అజింక్య రహానే (17), రఘువంశీ కలిసి కొన్ని చక్కటి షాట్లతో మూడో వికెట్కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే రహానే వెనుదిరిగిన తర్వాత కేకేఆర్ పతనం వేగంగా సాగిపోయింది. ఒక్కరు కూడా పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించే ప్రయత్నం చేయలేకపోయారు. చివర్లో రసెల్ (11 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. రహానే దురదృష్టవశాత్తూ ఎల్బీపై రివ్యూ కోరకపోవడం కూడా కేకేఆర్కు నష్టం కలిగించింది. అతని అవుట్ తర్వాతే పరిస్థితి మారింది. బాల్ ట్రాకింగ్లో ప్రభావం ఆఫ్ స్టంప్ బయట కనిపించింది. రివ్యూ కోరితే అతను నాటౌట్గా తేలేవాడు. చహల్ మ్యాజిక్ టోర్నీ తొలి 5 మ్యాచ్లలో ఏకంగా 83.50 సగటు, 11.13 చెత్త ఎకానమీతో కేవలం 2 వికెట్లు... 2 మ్యాచ్లలో మాత్రమే ఓవర్ల కోటా పూర్తి... వేలంలో రూ.18 కోట్లతో అమ్ముడుపోయిన చహల్ పేలవ ఫామ్ ఇది. కచ్చితంగా రాణించాల్సిన తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన అతను మ్యాజిక్ చూపించాడు. వరుస ఓవర్లలో రహానే, రఘువంశీలను అవుట్ చేసి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపిన అతను కీలక సమయంలో వరుస బంతుల్లో రింకూ, రమణ్దీప్లను వెనక్కి పంపి విజయానికి బాటలు వేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా తనకున్న గుర్తింపును నిలబెట్టుకుంటూ మళ్లీ రేసులోకి వచ్చాడు. ఐపీఎల్లో నేడుఢిల్లీ X రాజస్తాన్ వేదిక: న్యూఢిల్లీరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్(సి) రమణ్దీప్ (బి) రాణా 22; ప్రభ్సిమ్రన్ (సి) రమణ్దీప్ (బి) రాణా 30; శ్రేయస్ (సి) రమణ్దీప్ (బి) రాణా 0; ఇన్గ్లిస్ (బి) వరుణ్ 2; వధేరా (సి) వెంకటేశ్ (బి) నోర్జే 10; మ్యాక్స్వెల్ (బి) వరుణ్ 7; సూర్యాంశ్ (సి) డికాక్ (బి) నరైన్ 4; శశాంక్ (ఎల్బీ) (బి) అరోరా 18; యాన్సెన్ (బి) నరైన్ 1; బార్ట్లెట్ (రనౌట్) 11; అర్ష్ దీప్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.3 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–42, 4–54, 5–74, 6–76, 7–80, 8–86, 9–109, 10–111. బౌలింగ్: వైభవ్ అరోరా 2.3–0–26–1, నోర్జే 3–0–23–1, హర్షిత్ రాణా 3–0–25–3, వరుణ్ చక్రవర్తి 4–0–21–2, నరైన్ 3–0–14–2. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) సూర్యాంశ్ (బి) బార్ట్లెట్ 2; నరైన్ (బి) యాన్సెన్ 5; రహానే (ఎల్బీ) (బి) చహల్ 17; రఘువంశీ (సి) బార్ట్లెట్ (బి) చహల్ 37; వెంకటేశ్ (ఎల్బీ) (బి) మ్యాక్స్వెల్ 7; రింకూ సింగ్ (స్టంప్డ్) ఇన్గ్లిస్ (బి) చహల్ 2; రసెల్ (బి) యాన్సెన్ 17; రమణ్దీప్ (సి) శ్రేయస్ (బి) చహల్ 0; రాణా (బి) యాన్సెన్ 3; అరోరా (సి) ఇన్గ్లిస్ (బి) అర్ష్ దీప్ 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో ఆలౌట్) 95. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–62, 4–72, 5–74, 6–76, 7–76, 8–79, 9–95, 10–95. బౌలింగ్: యాన్సెన్ 3.1–0–17–3, బార్ట్లెట్ 3–0–30–1, అర్ష్ దీప్ 3–1–11–1, చహల్ 4–0–28–4, మ్యాక్స్వెల్ 2–0–5–1. -
KKR Vs PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా
ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. ఉత్కంఠగా సాగిన లో-స్కోరింగ్ గేమ్లో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది.పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి కేకేఆర్ను దెబ్బతీశాడు. రహానే, రింకూ సింగ్, రమణ్దీప్, రఘువన్షి వంటి కీలక వికెట్లను చాహల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు మార్కో జానెసన్ కూడా సంచలన ప్రదర్శన చేశాడు. జానెసన్ క్రీజులో ఉన్న విధ్వంసకర బ్యాటర్ రస్సెల్ను ఔట్ చేసి తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. 3.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జానెసన్.. కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లను పడగొట్టాడు. వీరిద్దిరితో పాటు పంజాబ్ విజయంలో అర్ష్దీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 19వ ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ పరుగులేమి ఇవ్వకుండా ఓ వికెట్ పడగొట్టాడు. కేకేఆర్ బ్యాటర్లలో కేకేఆర్ బ్యాటర్లలో రఘువన్షి(37) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు.పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర..112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకున్న పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప టార్గెట్ను కాపాడుకున్న తొలి జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. 2009 సీజన్లో సీఎస్కే 116 పరుగుల స్కోర్ను డిఫెండ్ చేసుకుంది. తాజా మ్యాచ్తో సీఎస్కే ఆల్టైమ్ రికార్డును పంజాబ్ బ్రేక్ చేసింది.ఐపీఎల్లో డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్లు..111 - పంజాబ్ కింగ్స్ vs కేకేఆర్, ముల్లన్పూర్, 2025116/9 - సీఎస్కే vs పంజాబ్ కింగ్స్, డర్బన్, 2009118 - ఎస్ఆర్హెచ్ vs ముంబై ఇండియన్స్, ముంబై , 2018119/8 - పంజాబ్ vs ముంబై ఇండియన్స్, డర్బన్, 2009119/8 - ఎస్ఆర్హెచ్ vs పుణే వారియర్స్, పూణే, 2013చదవండి: IPL 2025: కోల్కతాకు షాకిచ్చిన పంజాబ్.. ఉత్కంఠ పోరులో రికార్డు విజయం -
కోల్కతాకు షాకిచ్చిన పంజాబ్.. ఉత్కంఠ పోరులో రికార్డు విజయం
ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ డిఫెండ్ చేసుకుంది. పంజాబ్ బౌలర్ల దాటికి కేకేఆర్ 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది.ఓ దశలో సునాయసంగా గెలిచేలా కన్పించిన కేకేఆర్ను స్పిన్నర్ యుజేంద్ర చాహల్ దెబ్బతీశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు అర్ష్దీప్, మార్కో జానెసన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. జానెసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్, మాక్స్వెల్, బ్రాట్లెట్ తలా వికెట్ సాధించారు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప టార్గెట్ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ రికార్డులకెక్కింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువన్షి(37) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కూడా 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరితో పాటు నోకియా, వైభవ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(22), శశాంక్ సింగ్(18) కాస్త ఫర్వాలేదన్పించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0), గ్లెన్ మాక్స్వెల్(7) తీవ్ర నిరాశపరిచారు. -
KKR Vs PBKS: వరుణ్ స్పిన్ మ్యాజిక్.. మాక్స్వెల్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో కోల్కతా నైట్రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వరుణ్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన బౌలింగ్తో పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.ముఖ్యంగా పంజాబ్ డేంజరస్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ను చక్రవర్తి ఔట్ చేసిన తీరు గురుంచి ఎంత చెప్పకున్న తక్కువే. మాక్సీని అద్బుతమైన బంతితో వరుణ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన వరుణ్.. తొలి బంతిని మాక్సీకి బ్యూటిఫూల్ గూగ్లీని సంధించాడు.ఆ బంతిని మాక్స్వెల్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్భుతంగా టర్న్ అయ్యి స్టంప్స్ను గిరాటేసింది. ఇది చూసిన మాక్స్వెల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్లో వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన వరుణ్ 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేకేఆర్ బౌలర్ల దాటికి 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరితో పాటు నోకియా, వైభవ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(22), శశాంక్ సింగ్(18) కాస్త ఫర్వాలేదన్పించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0), గ్లెన్ మాక్స్వెల్(7) తీవ్ర నిరాశపరిచారు. Varun Chakaravarthy, with a touch of magic, completely deceives Maxwell!Watch the LIVE action ➡ https://t.co/nrMztYaJQ8#IPLonJioStar 👉 #PBKSvKKR | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/26ve87K7oX— Star Sports (@StarSportsIndia) April 15, 2025 -
పంజాబ్ కింగ్స్ సంచలన విజయం..
Punjab kings vs Kolkata Knight Riders Live Updates:పంజాబ్ కింగ్స్ సంచలన విజయం..ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో కేకేఆర్ చతకలపడింది. పంజాబ్ బౌలర్ల దాటికి 15. 1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు అర్ష్దీప్, మార్కో జానెసన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. జానెసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్, మాక్స్వెల్, బ్రాట్లెట్ తలా వికెట్ సాధించారు.చాహల్ మ్యాజిక్.. కష్టాల్లో కేకేఆర్స్వల్ప లక్ష్య చేధనలో కేకేఆర్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. 76 పరుగులకే కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో రస్సెల్(1), హర్షిత్ రాణా(1) ఉన్నారు. కేకేఆర్ విజయానికి 48 బంతుల్లో 35 పరుగులు కావాలి.కేకేఆర్ మూడో వికెట్ డౌన్..రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన రహానే.. చహల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి వెంకటేశ్ అయ్యర్ వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న రఘువన్షి, రహానే..6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రఘువన్షి(31), రహానే(13) ఉన్నారు.రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్..112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో జాన్సెన్ బౌలింగ్లో సునీల్ నరైన్(5) క్లీన్ బౌల్డ్ కాగా.. రెండో ఓవర్లో బ్రాట్లెట్ బౌలింగ్లో డికాక్(2) ఔటయ్యాడు.చెలరేగిన కేకేఆర్ బౌలర్లు.. 111 పరుగులకే పంజాబ్ ఆలౌట్ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ బౌలర్లు చేలరేగారు. కేకేఆర్ బౌలర్ల దాటికి పంజాబ్ 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు నోకియా, వైభవ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(22), శశాంక్ సింగ్(18) కాస్త ఫర్వాలేదన్పించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0), గ్లెన్ మాక్స్వెల్(7) తీవ్ర నిరాశపరిచారు.పీకల్లోతు కష్టాల్లో పంజాబ్ కింగ్స్..86 పరుగులకే పంజాబ్ కింగ్స్ 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 11 ఓవర్ వేసిన సునీల్ నరైన్.. తొలి బంతికి గ్లెన్ మాక్స్వెల్ క్లీన్ బౌల్డ్ కాగా, ఆఖరి బంతికి మార్కో జానెసన్ క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 8 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.పవర్ప్లేలోనే నాలుగు వికెట్లు..పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలోనే నాలుగో వికెట్ కోల్పోయింది. జోష్ ఇంగ్లిష్(2) వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కాగా.. ఫ్రబ్సిమ్రాన్ సింగ్(30) హర్షిత్ రాణా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.పంజాబ్కు షాక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ఆర్య.. హర్షిత్ రాణా బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత అదే ఓవర్లో నాలుగో బంతికి శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి పంజాబ్ 39 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో ఆర్య(16), ప్రభుసిమ్రాన్ సింగ్(17) ఉన్నారు.ఐపీఎల్-2025లో బ్లాక్ బాస్టర్ మ్యాచ్కు సమయం అసన్నమైంది. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. మార్కస్ స్టోయినిష్, లాకీ ఫెర్గూసన్ స్ధానాల్లో జోష్ ఇంగ్లిష్, బెర్ట్లట్ వచ్చాడు. వీరిద్దిరికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. కేకేఆర్ కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. కేకేఆర్ కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. మోయిన్ అలీ స్ధానంలో అన్రిచ్ నోర్జే వచ్చాడు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిచ్ నార్టే, వరుణ్ చక్రవర్తి -
IPL 2025: పంజాబ్, కేకేఆర్ చివరి సారి తలపడినప్పుడు ఏం జరిగిందో తెలుసా..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 15) బిగ్ ఫైట్ జరుగనుంది. చండీఘడ్ వేదికగా పంజాబ్, కేకేఆర్ కత్తులు దూసుకోనున్నాయి. ఈ రెండు జట్లు చివరి సారి తలపడినప్పుడు పరుగుల వరద పారింది. 2024 సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో కేకేఆర్ నిర్దేశించిన 262 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ఛేదన.ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ఫిల్ సాల్ట్ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (10 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్సర్లు), రసెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది.అనంతరం దాదాపుగా అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. జానీ బెయిర్స్టో విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పంజాబ్ ఆటగాళ్లలో బెయిర్స్టోతో పాటు ప్రభ్సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రిలీ రొస్సో (16 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), శశాంక్ సింగ్ (28 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించారు.నేటి మ్యాచ్లో అదే తరహాలో పరుగుల వరద పారాలని అభిమానులు ఆశిస్తున్నారు. పంజాబ్కు గత మ్యాచ్ తరహాలోనే బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నా, కేకేఆర్ కాస్త మెత్తబడినట్లనిపిస్తుంది. ఈ సీజన్లోనూ కేకేఆర్లో అదే ఆటగాళ్లు (శ్రేయస్ మినహా) కనిపిస్తున్నా, ఎందుకో పంజాబ్ కంటే కాస్త బలహీనంగా కనిపిస్తుంది. పంజాబ్, కేకేఆర్ ఐపీఎల్లో ఇప్పటివరకు 33 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 12 మ్యాచ్ల్లో గెలిచాయి. ఇటీవలకాలంలో ఈ ఇరు జట్లు తలపడినప్పుడు చెరో సారి విజయం పలకరించింది. చివరిసారి పంజాబ్ గెలవగా, అంతకుముందు కేకేఆర్, దానికి ముందు పంజాబ్ గెలిచాయి. నేటి మ్యాచ్లో పంజాబ్ తమ స్టార్ బౌలర్ ఫెర్గూసన్ సేవలు కోల్పోయింది. గత మ్యాచ్లో గాయం కారణంగా ఫెర్గూసన్ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఫెర్గూసన్ లేని కారణంగా పంజాబ్ గత మ్యాచ్లో (సన్రైజర్స్) 246 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని కూడా డిఫెండ్ చేసుకోలేకపోయింది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. విధ్వంసకర బ్యాటర్లు సునీల్ నరైన్, రసెల్, రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్ పెద్దగా ఫామ్లో లేరు. ఈ సీజన్లో కేకేఆర్ బౌలర్ల ప్రదర్శనతో నెట్టుకొస్తుంది. పంజాబ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో అతి భయానకంగా కనిపిస్తుంది. ఇప్పటికే అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర సెంచరీ బాదగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నాడు.తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, వైషాక్ విజయ్కుమార్కేకేఆర్: సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ (వికెట్కీపర్), అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్/మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా -
పంజాబ్ కింగ్స్కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఫెర్గూసన్ మోకాలికి గాయమైంది.అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీజన్ మొత్తానికి ఫెర్గూసన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని జట్టు బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ కూడా ధృవీకరించాడు. లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.అతడు ప్రస్తుతం జట్టుతో ఉన్నప్పటకి, మిగిలిన టోర్నమెంట్లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని హోప్స్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ఫెర్గూసన్ మంచి టచ్లో కన్పించాడు. ఫెర్గూసన్ పంజాబ్ తరపున నాలుగు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.అయితే అతడి స్ధానంలో జేవియర్ బార్ట్లెట్ లేదా అజ్మతుల్లా ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ ఏడాది సీజన్లో పంజాబ్ కింగ్స్ పర్వాలేదన్పిస్తోంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు పంజాబ్ మూడింట గెలుపొందింది.ఐపీఎల్-2025కు పంజాబ్ కింగ్స్ జట్టు..శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్, అర్ష్దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, నెహాల్ వధేరా, హర్ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, విజయ్కుమార్ వైషాక్, యశ్ ఠాకూర్, మార్కో జాన్సెన్, జోష్ ఇంగ్లిస్, హర్నూర్ పన్ను, కుల్దీప్ సేన్, ప్రియాంష్ ఆర్య, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్జ్, జేవియర్ బార్ట్లెట్, పైలా అవినాష్, ప్రవీణ్ దూబే.చదవండి: IPL 2025: అక్షర్ పటేల్కు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా -
పంజాబ్ పై 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ గెలుపు
-
సిక్సర్ల అభి ‘ షేక్ ’
తొలి ఐదు మ్యాచ్లలో కలిపి 51 పరుగులు...ఈ సీజన్లో అభిషేక్ శర్మ ప్రదర్శన ఇది. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న అతను తన గత ఏడాది ఆటను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్న ట్లున్నాడు. పంజాబ్పై మ్యాచ్లో ఒక్కసారిగా తన కసినంతా ప్రదర్శిస్తూ వీర విధ్వంసం సృష్టించాడు. కేవలం బౌండరీలతోనే 116 పరుగులు బాది శతకనాదం చేశాడు. ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అంటూ రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శిస్తూ ఈ ఇన్నింగ్స్ విలువేమిటో చెప్పాడు. అభిషేక్కు హెడ్ మెరుపులు తోడవడంతో 246 పరుగుల లక్ష్యాన్ని కూడా మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సన్రైజర్స్ సంచలనం సృష్టించింది. మరో వైపు సమష్టి ప్రదర్శనతో 245 పరుగులు చేసి కూడా ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ తీవ్ర నిరాశకు లోనైంది. ఓవరాల్గా 492 పరుగులతో అభిమానులకు ఫుల్ జోష్ దక్కింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నాలుగు వరుస పరాజయాల తర్వాత నిస్తేజంగా కనిపించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఘనమైన రీతిలో కోలుకుంది. తమ అసలు ఆటను ప్రదర్శిస్తూ లీగ్లో తమను తక్కువగా అంచనా వేయవద్దనే సందేశాన్ని ఇచ్చింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 82; 6 ఫోర్లు, 6 సిక్స్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (13 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం సన్రైజర్స్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్స్లు) ఐపీఎల్లో తన తొలి సెంచరీని నమోదు చేయగా, ట్రవిస్ హెడ్ (37 బంతుల్లో 66; 9 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 75 బంతుల్లో 171 పరుగులు జోడించారు. మెరుపు బ్యాటింగ్...పవర్ప్లేలో 89 పరుగులు...10 ఓవర్లు ముగిసే సరికి 120. తర్వాతి 5 ఓవర్లలో 57 పరుగులు...ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు... పంజాబ్ కింగ్స్ ఇలా దాదాపు అన్ని దశల్లోనూ ఒకే తరహాలో దూకుడుగా సాగింది. టాప్–7లో ఇద్దరు మినహా మిగతావారంతా చెలరేగిపోవడంతో భారీ స్కోరు సాధ్యమైంది. షమీ వేసిన తొలి ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 3 ఫోర్లతో మొదలు పెట్టగా, షమీ తర్వాతి ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 6, 6, 4 బాదాడు. కమిన్స్ తొలి ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్తో పంజాబ్ 16 పరుగులు రాబట్టింది. అయితే తన తొలి రెండు ఓవర్లలో 28 పరుగులిచ్చిన హర్షల్...ప్రియాన్‡్షను అవుట్ చేయడంలో సఫలమయ్యాడు. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మలింగ తన తొలి వికెట్గా ప్రభ్సిమ్రన్ను వెనక్కి పంపించాడు. ఆ తర్వాత శ్రేయస్, నేహల్ వధేరా (22 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం కూడా జోరుగా సాగింది. వీరిద్దరు మూడో వికెట్కు 40 బంతుల్లోనే 73 పరుగులు జోడించారు. అన్సారీ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాదిన శ్రేయస్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. శశాంక్ సింగ్ (2) విఫలం కాగా, మలింగ ఓవర్లో శ్రేయస్ 4 ఫోర్లతో చెలరేగాడు. అయితే రెండు బంతుల వ్యవధిలో మ్యాక్స్వెల్ (3), శ్రేయస్లను హర్షల్ అవుట్ చేయడంతో 18, 19 ఓవర్లలో కలిపి 13 పరుగులే వచ్చాయి. ఒకే ఓవర్లో 27 పరుగులు...షమీ వేసిన ఆఖరి ఓవర్లో కింగ్స్ పండగ చేసుకుంది. ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న స్టొయినిస్ ఈ ఓవర్లో చెలరేగిపోయాడు. చివరి 4 బంతుల్లో అతను వరుసగా 6, 6, 6, 6 బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి. బౌండరీల వర్షం...అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లో హెడ్ 2 ఫోర్లు కొట్టడంతో రైజర్స్ విధ్వంసం మొదలైంది. యాన్సెన్ ఓవర్లో అభిషేక్ నాలుగు ఫోర్లు కొట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో హెడ్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత యశ్ ఠాకూర్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్తో చెలరేగిపోయాడు. పవర్ప్లేలో జట్టు 83 పరుగులు సాధించింది. 19 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. మరో వైపు మ్యాక్స్వెల్ ఓవర్లో రెండు భారీ సిక్స్లు బాదిన హెడ్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. యాన్సెన్ వేసిన ఓవర్లో మళ్లీ శివమెత్తిన అభిషేక్ 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదాడు. చహల్ ఓవర్లో ఎట్టకేలకు హెడ్ వెనుదిరిగిన తర్వాత అదే ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి 40 బంతుల్లో అభిషేక్ సెంచరీ మార్క్ను చేరుకొని గర్జించాడు. ఆ తర్వాత చెలరేగి బౌండరీల వర్షం కురిపించిన అభిషేక్ జట్టును అలవోకగా విజయం దిశగా నడిపించాడు. సాహసవంతులకే అదృష్టం కలిసి వస్తుందన్నట్లు అభిషేక్కు రెండు లైఫ్లు లభించాయి. 28 వద్ద ఠాకూర్ బౌలింగ్లో క్యాచ్ ఇవ్వగా అది నోబాల్గా తేలింది. ఆ తర్వాత 56 వద్ద చహల్ తన బౌలింగ్లోనే సునాయాస క్యాచ్ను వదిలేశాడు. దీనిని అతను బ్రహ్మండంగా వాడుకున్నాడు. స్కోరు వివరాలుపంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) నితీశ్ రెడ్డి (బి) హర్షల్ 36; ప్రభ్సిమ్రన్ (సి) కమిన్స్ (బి) మలింగ 42; శ్రేయస్ (సి) హెడ్ (బి) హర్షల్ 82; వధేరా (ఎల్బీ) (బి) మలింగ 27; శశాంక్ (ఎల్బీ) (బి) హర్షల్ 2; మ్యాక్స్వెల్ (బి) హర్షల్ 3; స్టొయినిస్ (నాటౌట్) 34; యాన్సెన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 245. వికెట్ల పతనం: 1–66, 2–91, 3–164, 4–168, 5–205, 6–206. బౌలింగ్: మొహమ్మద్ షమీ 4–0–75–0, కమిన్స్ 4–0–40–0, హర్షల్ 4–0–42–4, ఇషాన్ మలింగ 4–0–45–2, అన్సారీ 4–0–41–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) మ్యాక్స్వెల్ (బి) చహల్ 66; అభిషేక్ (సి) (సబ్) దూబే (బి) అర్‡్షదీప్ 141; క్లాసెన్ (నాటౌట్) 21; ఇషాన్ కిషన్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 10; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–171, 2–222. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–37–1, యాన్సెన్ 2–0–39–0, యశ్ ఠాకూర్ 2.3–0–40–0, మ్యాక్స్వెల్ 3–0–40–0, ఫెర్గూసన్ 0.2–0–1–0, స్టొయినిస్ 0.4–0–6–0, చహల్ 4–0–56–1, శశాంక్ 2–0–27–0.75 ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో షమీ రెండో స్థానంలో నిలిచాడు. అతను 75 పరుగులివ్వగా, ఇదే సీజన్లో రాజస్తాన్ బౌలర్ ఆర్చర్ 76 పరుగులు ఇచ్చాడు.1 ఐపీఎల్లో భారత బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. కేఎల్ రాహుల్ (132) పేరిట ఉన్న రికార్డును అభిషేక్ శర్మ సవరించాడు.ఐపీఎల్లో నేడురాజస్తాన్ X బెంగళూరు వేదిక: జైపూర్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X ముంబై వేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
ఉప్పల్లో అభిషేక్ విధ్వంసం.. 40 బంతుల్లోనే సెంచరీ
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు బ్యాట్ను ఝూలిపించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో అభిషేక్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 246 పరుగుల భారీ లక్ష్య చేధనలో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉప్పల్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫెర్గూసన్, అర్ష్దీప్ సింగ్, జాన్సెన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను శర్మ ఊతికారేశాడు. ట్రావిస్ హెడ్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీని అందుకున్నాడు.ఓవరాల్గా కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 14 ఫోర్లు, 10 సిక్స్లతో 141 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 246 పరుగుల భారీ టార్గెట్ను సన్రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. సన్రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 66) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, చాహల్ తలా వికెట్ సాధించారు. కాగా ఐపీఎల్ చరిత్రలో రెండువ అత్యధిక స్కోర్ ఛేజ్ చేసిన జట్టుగా సన్రైజర్స్ నిలిచింది. -
పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవలం 17 బంతుల్లోనే
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే బౌండరీల వర్షం కురిపించారు. మహ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఊతికారేశారు.ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కేవలం 3 ఓవర్లలోనే 50 పరుగులను క్రాస్ చేసింది. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన టీమ్గా ఆర్సీబీ సరసన పంజాబ్ నిలిచింది. ఆర్సీబీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్పై కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకుంది. అయితే ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన రికార్డు కూడా పంజాబ్ కింగ్స్ పేరిటే ఉంది. 2011 ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్పై పంజాబ్ కేవలం 2.5 ఓవర్లలోనే 50 పరుగులను అందుకుంది. ఇక ప్రస్తుత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఈ ఏడాది సీజన్లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్లో ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 36), ఫ్రబ్ సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్తో 42) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఔటయ్యారు. అయితే ఈ ఏడాది సీజన్ మొత్తం ఒకే ఆటతీరుతో పంజాబ్ దూసుకుపోతుంది.చదవండి: IPL 2025: సెన్సేషనల్ సుదర్శన్.. ఆరు మ్యాచ్లలో 4 హాఫ్ సెంచరీలు -
పంజాబ్ కింగ్స్పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
Srh vs Pbks live Updates and highlights: పంజాబ్ కింగ్స్పై ఎస్ఆర్హెచ్ ఘన విజయంఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ తిరిగి పుంజుకుంది. ప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ నిర్ధేశించిన 246 పరుగుల భారీ టార్గెట్ను సన్రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. సన్రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ పంజాబీ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు.కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 14 ఫోర్లు, 10 సిక్స్లతో 141 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 66) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.అభిషేక్ శర్మ సెంచరీ..పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో తన తొలి ఐపీఎల్ సెంచరీని అభిషేక్ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 6 సిక్స్లు ఉన్నాయి.తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన హెడ్.. చాహల్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఎస్ఆర్హెచ్ విజయానికి 45 బంతుల్లో 74 పరుగులు కావాలి.11 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 154/011 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 154 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(59), అభిషేక్ శర్మ(88) ఉన్నారు.అభిషేక్ శర్మ ఫిప్టీఎస్ఆర్హెచ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి సన్రైజర్స్ వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(49), అభిషేక్ శర్మ(67) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఎస్ఆర్హెచ్..246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి సన్రైజర్స్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.క్రీజులో హెడ్(22), అభిషేక్ శర్మ(18) ఉన్నారు.పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ టార్గెట్ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 82) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రభ్సిమ్రాన్ సింగ్(42), ఆర్య(36), స్టోయినిష్(11 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎషాన్ మలింగ రెండు వికెట్లు సాధించాడు.హర్షల్ నాలుగు వికెట్లు..18 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాలో 42 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.శ్రేయస్ అయ్యర్ ఫిప్టీ..పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 2 ఫోర్లు, 5 సిక్స్లతో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అయ్యర్ 53 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.రెండో వికెట్ డౌన్..ప్రభ్ సిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన ప్రభ్ సిమ్రాన్.. ఎషాన్ మలింగ బౌలింగ్లో ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.పంజాబ్ తొలి వికెట్ డౌన్..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన ఆర్య.. హర్షల్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న పంజాబ్ ఓపెనర్లు..టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. 2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో ప్రభుసిమ్రాన్ సింగ్(17), ప్రియాన్ష్ ఆర్య(12) ఉన్నారు.ఐపీఎల్-2025లో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది.జట్టులోకి హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ వచ్చాడు. మలింగకు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. పంజాబ్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పు చేయలేదు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, -
SRH vs PBKS: సన్రైజర్స్కో విజయం కావాలి!
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు మ్యాచ్లలో పరాజయం... భారీ అంచనాలు పెట్టుకున్న టాప్–3 వరుసగా విఫలం...టోర్నీలో అన్ని జట్లకంటే చెత్త ఎకానమీ (10.73) నమోదు చేసిన బౌలర్లు... బౌలింగ్ సగటు కూడా అన్నింటికంటే ఎక్కువ (41.47)... బ్యాటర్ల నుంచి పరుగులు రావడం లేదు... బౌలర్ల ప్రదర్శన పేలవం... ఇలా అన్నీ సమస్యలే! ఇలాంటి స్థితిలో సన్రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో నేడు జరిగే సమరంలో పంజాబ్ కింగ్స్తో సన్రైజర్స్ తలపడుతుంది. ఆడిన నాలుగు మ్యాచ్లో మూడు విజయాలతో ఫామ్లో ఉన్న పంజాబ్ను రైజర్స్ ఏమాత్రం నిలువరిస్తుందనేది చూడాలి. మ్యాచ్ ముందు రోజు నగరంలో కాస్త చల్లటి వాతావరణం ఉన్నా... శనివారం రోజు వర్షసూచన లేదు. వరుస వైఫల్యాలు... హైదరాబాద్లో ఆడిన తొలి మ్యాచ్లో రాజస్తాన్పై 286 పరుగుల స్కోరుతో సీజన్ను సన్రైజర్స్ ఘనంగా ప్రారంభించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తర్వాతి నాలుగు మ్యాచ్లలో జట్టు వరుసగా 190, 163, 120, 152 పరుగులు చేసింది. అయితే ఇవేవీ విజయానికి సరిపోలేదు. తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్ సెంచరీని మినహాయిస్తే ఓవరాల్గా ఈ నాలుగు మ్యాచ్లలో కలిపి రైజర్స్ నుంచి 2 అర్ధసెంచరీలు నమోదయ్యాయి. క్లాసెన్ గరిష్టంగా 152 పరుగులే చేయగా... హెడ్ 148, అభిషేక్ 51 పరుగులు సాధించడం బ్యాటింగ్ పరిస్థితిని చూపిస్తోంది. నితీశ్ రెడ్డి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. స్కోర్లు మాత్రమే కాదు, జట్టు ఆటగాళ్లలో ఒక రకమైన నిరాసక్తత కనిపిస్తోంది. మైదానంలో చురుకుదనం లోపించగా... గత ఏడాది తరహాలో పరుగులు సాధించాలనే తపన, కసి బ్యాటర్లలో కనిపించడం లేదు. వరుస ఓటముల ప్రభావం కూడా ఆటగాళ్లపై పడింది.అయితే దీని నుంచి కోలుకొని మళ్లీ చెలరేగేందుకు ఈ మ్యాచ్కు మించి మంచి అవకాశం లభించదు. కెపె్టన్ కమిన్స్ వికెట్లు తీయకపోవడంతో పాటు ఏకంగా 11.16 ఎకానమీతో పరుగులు ఇస్తున్నాడు. షమీలాంటి ప్రధాన పేసర్ కూడా 9.29 ఎకానమీతో పరుగులు ఇవ్వడం చూస్తే బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. ఈసారి ఓడితే మాత్రం కోలుకొని ప్లే ఆఫ్స్ రేసులోకి రావడం సన్రైజర్స్కు దాదాపు అసాధ్యం కావచ్చు. జోరు మీదున్న కింగ్స్... శ్రేయస్ అయ్యర్, ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య... పంజాబ్ గెలిచి మూడు మ్యాచ్లలో వీరు ముగ్గురు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచిన ఆటగాళ్లు. అంటే జట్టు ఏ ఒక్కరి బ్యాటింగ్పైనే ఆధారపడటం లేదు. పరిస్థితిని బట్టి ఒక్కో ప్లేయర్ బాధ్యత తీసుకొని నడిపిస్తున్నాడు. ఈ ముగ్గురికి తోడు నేహల్ వధేరా, శశాంక్ సింగ్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అద్భుత ఫామ్లో ఉన్న అయ్యర్ 200 పరుగులు స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించాడు. స్టొయినిస్, మ్యాక్స్వెల్లాంటి ఆటగాళ్లు రాణించకపోయినా పంజాబ్ మెరుగైన స్థితిలో ఉంది. ఇదే జోరు కొనసాగిస్తే జట్టు మరో సారి భారీ స్కోరు సాధించడం ఖాయం. బౌలింగ్లో అర్ష్ దీప్, ఫెర్గూసన్ ముందుండి నడిపిస్తుండగా... యశ్ ఠాకూర్ కూడా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 11 ఓవర్లు వేసి ఒకే ఒక వికెట్ తీసిన చహల్ మాత్రం ఇంకా లయ అందుకోలేదు. అతనూ రాణిస్తే రైజర్స్ను కట్టడి చేయవచ్చు. తుది జట్లు (అంచనా) సన్రైజర్స్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్, కమిందు, అన్సారీ, హర్షల్, షమీ, రాహుల్ చహర్. పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్, వధేరా, శశాంక్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, యాన్సెన్, చహల్, అర్ష్ దీప్, ఫెర్గూసన్, యశ్ ఠాకూర్. -
సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి ‘అద్భుతం’ అతడే!
ప్రియాన్ష్ ఆర్య.. 24 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడి పేరు క్రికెట్ వర్గాల్లో మారుమ్రోగిపోతోంది. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో కేవలం 39 బంతుల్లోనే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ శతకం బాదాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు.సంచలన ఇన్నింగ్స్చెన్నైతో మ్యాచ్లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya).. ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో ఏకంగా 103 పరుగులు సాధించాడు. 245కు స్ట్రైక్రేటుతో దంచికొట్టి చెన్నైపై పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 88 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన సంచలన ఇన్నింగ్స్తో గట్టెక్కించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.This is what we pay our internet bills for... ❤️pic.twitter.com/mE38MmXFB0— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025 సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి ‘అద్భుతం’!ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రియాన్ష్ ఆర్యను ఆకాశానికెత్తాడు. టీమిండియా దిగ్గజం, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత అంతటి అద్భుతాన్ని ఇప్పుడే చూశానంటూ అతడిని కొనియాడాడు. మైదానం నలుదిశలా షాట్లతో హోరెత్తించాడని.. సీఎస్కేలో ఉన్న ప్రపంచస్థాయి బౌలర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు అమోఘమని ప్రశంసించాడు.‘‘ప్రియాన్ష్ ఆర్య... టీమిండియాకు సుదీర్ఘకాలం పాటు ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. సచిన్ టెండుల్కర్ తర్వాత.. విపత్కర పరిస్థితుల్లో అంత గొప్పగా ఆడిన రెండో ఆటగాడు ఇతడే. సచిన్ తర్వాత నేను చూసిన అద్భుతం ఇతడే.క్లిష్ట పరిస్థితుల్లో మేటి బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీ చేయడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా ఇంచుమించు 250 స్ట్రైక్రేటుతో శతక్కొట్టడం ఊహకు అందని విషయం. శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, ప్రభ్సిమ్రన్ సింగ్ అవుటైన తర్వాత.. ఒంటిచేత్తో పంజాబ్ను ఆదుకున్నాడు.ఆకాశమే హద్దుగాపాయింట్, కవర్లు.. ఒక్కటేమిటి మైదానం అన్ని వైపులకు బంతిని తరలిస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు. పతిరణ, జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్ వంటి బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో పంజాబ్ను గెలిపించాడు’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రియాన్ష్ ఆర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వీడియోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.వరుసగా నాలుగో ఓటమికాగా ముల్లాన్పూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత తొలుత బ్యాటింగ్ చేసింది. చెన్నై ఆరంభంలోనే వికెట్లు తీసి శుభారంభం అందించినా.. ప్రియాన్ష్ ఆర్య (103), శశాంక్ సింగ్ (52 నాటౌట్), మార్కో యాన్సెన్ (34 నాటౌట్) దంచికొట్టడంతో.. పంజాబ్ 20 ఓవర్లలో 219 పరుగులు స్కోరు చేసింది.లక్ష్య ఛేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమైపోయింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (23 బంతుల్లో 36), డెవాన్ కాన్వే (49 బంతుల్లో 69 రిటైర్డ్ అవుట్), శివం దూబే (42), మహేంద్ర సింగ్ ధోని (27) ఓ మోస్తరుగా ఆడారు. అయితే, విజయానికి 18 పరుగులు దూరంలో చెన్నై నిలిచిపోయింది. ఇక ఐపీఎల్-2025లో చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా.. పంజాబ్ ఇప్పటికి నాలుగింట మూడు గెలిచింది.ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ చెన్నై స్కోర్లుపంజాబ్: 219/6 (20)చెన్నై: 201/5 (20)ఫలితం: 18 పరుగుల తేడాతో చెన్నైపై పంజాబ్ గెలుపుచదవండి: ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్ -
చరిత్ర సృష్టించిన డెవాన్ కాన్వే
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే (Devon Conway) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా ఈ న్యూజిలాండ్ క్రికెటర్ ఈ ఘనత సాధించాడు.అంతా తలకిందులుకాగా ముల్లాన్పూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ .. సీఎస్కేను బౌలింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (0)ను డకౌట్ చేసి ముకేశ్ చౌదరి చెన్నైకి శుభారంభం అందించాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్, విధ్వంసకర బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (9)ను ఖలీల్ అహ్మద్ పెవిలియన్కు పంపాడు.ఇక స్టొయినిస్ (4) వికెట్ను కూడా ఖలీల్ తన ఖాతాలో వేసుకోగా.. నేహాల్ వధేరా (9), గ్లెన్ మాక్స్వెల్ (1)లను రవిచంద్రన్ అవుట్ చేశాడు. అయితే, వీళ్లందరినీ తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగిన చెన్నై బౌలర్లు ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, లోయర్ఆర్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్, మార్కో యాన్సెన్లను మాత్రం అడ్డుకోలేకపోయారు.ప్రియాన్ష్ 42 బంతుల్లో 103 పరుగులతో చెలరేగగా.. శశాంక్ 36 బంతుల్లో 52, యాన్సెన్ 19 బంతుల్లో 34 రన్స్తో అజేయంగా నిలిచారు. ఫలితంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్లు నష్టపోయి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది.కాన్వే నెమ్మదిగా..లక్ష్య ఛేదనలో సీఎస్కే ఓపెనర్లలో రచిన్ రవీంద్ర కాస్త వేగంగా (23 బంతుల్లో 36) ఆడగా.. డెవాన్ కాన్వే మాత్రం నెమ్మదిగా ఆడాడు. 49 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 69 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. అతడిని రిటైర్డ్ అవుట్గా నాయకత్వ బృందం వెనక్కి పిలిపించింది.Devon Conway with his maiden fifty this season ✅Shivam Dube flexing his arms ✅#CSK puts the foot on the accelerator 📈They need another 75 runs from 30 deliveries. Updates ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK | @ChennaiIPL pic.twitter.com/5JLVV9wc4u— IndianPremierLeague (@IPL) April 8, 202518 పరుగుల తేడాతో ఓటమిమిగతా వాళ్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) విఫలం కాగా.. శివం దూబే (42), ధోని (27) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగుల వద్ద నిలిచి ఓటమిని ఆహ్వానించింది.ఇదిలా ఉంటే.. కాన్వే పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా హాఫ్ సెంచరీ బాది.. ఐపీఎల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్లో అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న మూడో క్రికెటర్గా చరిత్రకెక్కాడు. కాన్వే 24 ఇన్నింగ్స్లోనే మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో షాన్ మార్ష్, లెండిల్ సిమ్మన్స్ ఈ న్యూజిలాండ్ బ్యాటర్ కంటే ముందున్నారు.ఐపీఎల్లో తక్కువ ఇన్నింగ్స్లో (ఫాస్టెస్ట్) వెయ్యి పరుగుల మార్కు చేరుకున్న క్రికెటర్లు1. షాన్ మార్ష్- 21 ఇన్నింగ్స్లో2. లెండిల్ సిమ్మన్స్- 23 ఇన్నింగ్స్లో3. డెవాన్ కాన్వే- 24 ఇన్నింగ్స్లో4. మాథ్యూ హెడెన్- 25 ఇన్నింగ్స్లో5. సాయి సుదర్శన్- 25 ఇన్నింగ్స్లో6. జానీ బెయిర్స్టో- 26 ఇన్నింగ్స్లో7. క్రిస్ గేల్- 27 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించారు.చదవండి: హై రిస్క్ బ్యాటింగ్.. అతడు అద్భుతం.. ఆ తప్పులే మా కొంప ముంచాయి: రుతురాజ్ Back to winning ways this season ✅First home win this season ✅@PunjabKingsIPL compile a comprehensive 1⃣8⃣-run victory over #CSK ❤️Scorecard ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/HtcXw4UYAK— IndianPremierLeague (@IPL) April 8, 2025 -
‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్ అద్భుతం’
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన సీఎస్కే.. తాజాగా పంజాబ్ కింగ్స్ చేతిలోనూ చేదు అనుభవం ఎదుర్కొంది. ముల్లాన్పూర్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకు పోరాడి విజయానికి పద్దెనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయింది.ఆ తప్పులే మా కొంప ముంచాయిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) స్పందిస్తూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ఫీల్డింగ్ తప్పిదాలే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘గత నాలుగు మ్యాచ్లలో ఒకే పొరపాటు.. అదే ఫీల్డింగ్. మేము క్యాచ్లు డ్రాప్ చేస్తూనే ఉన్నాం.అతడి బ్యాటింగ్ అద్భుతంతద్వారా ఆ బ్యాటర్లు అదనంగా 15, 20, 30 పరుగులు చేసేందుకు ఆస్కారం ఇస్తున్నాం. ఈరోజు ప్రియాన్ష్ ఆర్య అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి హై రిస్క్తో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, పరిస్థితులు అతడికి అనుకూలించాయి.ఇదే వికెట్పై మేమూ బ్యాటింగ్ చేశాం. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. అంతకుముందు కీలక సమయాల్లో క్యాచ్లు కూడా డ్రాప్ చేశాం. ఇంకో 10- 15 పరుగులు కట్టడి చేయాల్సింది. అలాగే ఇంకో మూడు- నాలుగు సిక్సర్లు బాదాల్సింది.బ్యాటింగ్ పరంగా పర్లేదుఏదేమైనా మా ఉత్తమ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే పవర్ ప్లేలో రాణించడం సానుకూలాంశం. బ్యాటింగ్ పరంగా మేము పర్లేదు. ముందుగా చెప్పినట్లు ఫీల్డింగ్లో మెరుగుపడాల్సి ఉంది’’ అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. ఫీల్డింగ్ను ఆస్వాదిస్తేనే తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయని.. టెన్షన్ పడితే మరిన్ని పొరపాట్లకు ఆస్కారం ఉంటుందే తప్ప లాభమేమీలేదని తమ ఫీల్డర్లకు సందేశం ఇచ్చాడు.క్యాచ్లు డ్రాప్ చేసి.. మూల్యం చెల్లించారుకాగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన సీఎస్కే ఆరంభంలోనే వరుస వికెట్లు తీసింది. కానీ యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య మెరుపు సెంచరీ (42 బంతుల్లో 103)తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ప్రియాన్ష్ ఇచ్చిన క్యాచ్ను బౌలర్ మిస్ చేశాడు.అదే విధంగా ఐదో ఓవర్ రెండో బంతికి స్టొయినిస్ ఇచ్చిన క్యాచ్ను విజయ శంకర్ వదిలేశాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి ప్రియాన్ష్ బంతిని గాల్లోకిలేపగా.. శంకర్ మరోసారి డ్రాప్ చేశాడు. ఇక అశ్విన్ బౌలింగ్లో పన్నెండవ ఓవర్ రెండో బంతికి ప్రియాన్ష్ సిక్సర్ బాదగా.. బంతిని అందుకున్న ముకేశ్ చౌదరి బౌండరీ లైన్ను తాకాడు.I.C.Y.M.I 𝗣𝗼𝘄𝗲𝗿💪. 𝗣𝗿𝗲𝗰𝗶𝘀𝗶𝗼𝗻👌. 𝗣𝗮𝗻𝗮𝗰𝗵𝗲💥. Priyansh Arya graced the home crowd with his effortless fireworks 🎆Updates ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/7JBcdhok58— IndianPremierLeague (@IPL) April 8, 2025ఆ తర్వాత పదిహేడో ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్లో శశాంక్ సింగ్ ఇచ్చిన సిట్టర్ను రచిన్ రవీంద్ర డ్రాప్ చేశాడు. ఇలా సీఎస్కే ఫీల్డింగ్ తప్పిదాల వల్ల పంజాబ్ బ్యాటర్లు.. ముఖ్యంగా ప్రియాన్ష్ చాలాసార్లు లైఫ్ పొందాడు. అతడికి తోడుగా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్) దుమ్ములేపారు.తప్పని ఓటమిఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సీఎస్కే ఐదు వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమై.. 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్కే బ్యాటర్లలో ఓపెనర్లు రచిన్ రవీంద్ర (23 బంతుల్లో 36), డెవాన్ కాన్వే (49 బంతుల్లో 69 రిటైర్డ్ అవుట్), శివం దూబే (27 బంతుల్లో 42) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో ధోని మెరుపు ఇన్నింగ్స్ (12 బంతుల్లో 27) ఆడాడు. అయితే, వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) మాత్రం మరోసారి విఫలమయ్యాడు.చదవండి: గ్లెన్ మాక్స్వెల్కు షాకిచ్చిన బీసీసీఐ! Back to winning ways this season ✅First home win this season ✅@PunjabKingsIPL compile a comprehensive 1⃣8⃣-run victory over #CSK ❤️Scorecard ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/HtcXw4UYAK— IndianPremierLeague (@IPL) April 8, 2025 -
PBKS Vs CSK: గ్లెన్ మాక్స్వెల్కు షాకిచ్చిన బీసీసీఐ!
పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell)కు ఐపీఎల్ పాలక మండలి షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత విధించింది. చెన్నై సూపర్ కింగ్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో అనుచిత ప్రవర్తనకు గానూ ఈ మేర జరిమానా వేసింది.ప్రియాన్ష్ మెరుపు శతకంఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్- చెన్నై జట్లు తలపడ్డాయి. సొంత మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర శతకం (42 బంతుల్లో 103) చెలరేగగా.. లోయర్ ఆర్డర్లో శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టినా.. ఈ ముగ్గురి ఇన్నింగ్స్ కారణంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది.చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమైంది. 18 పరుగుల తేడాతో చెన్నై ఓటమిఓపెనర్ రచిన్ రవీంద్ర (36) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం అర్ధ శతకం(49 బంతుల్లో 69) రాణించాడు.కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశపరచగా.. శివం దూబే 27 బంతుల్లో 42 రన్స్తో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో ధోని ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కానీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Sights we have come to cherish over many years 💛MS Dhoni produced a fighting knock of 27(12) 🔥Scorecard ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK | @msdhoni pic.twitter.com/Y3ksZl8ozS— IndianPremierLeague (@IPL) April 8, 2025 కీలక వికెట్ తీసిఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లోనూ గ్లెన్ మాక్స్వెల్ బ్యాటింగ్లో విఫలమయ్యాడు. ఆరో స్థానంలో వచ్చి రెండు బంతులు ఎదుర్కొని అశ్విన్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే, రచిన్ రవీంద్ర రూపంలో కీలక వికెట్ తీసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కానీ అనుచిత ప్రవర్తనకు గానూ అతడు పనిష్మెంట్ ఎదుర్కోవాల్సి వచ్చింది.జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్ఇందుకు సంబంధించి.. ‘‘గ్లెన్ మాక్స్వెల్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2లో గల లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు. నిబంధనల ప్రకారం అతడి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.అదే విధంగా.. మాక్సీ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత చేసింది. అయితే, ఏ ఘటనలో అతడికి జరిమానా విధించిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రూపొందించిన నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా వికెట్లను తన్నడం, బాదడం.. అడ్వర్టైజ్ బోర్డులు, బౌండరీ ఫెన్సింగ్, డ్రెసింగ్ రూమ్ అద్దాలు, కిటికీలు.. ఇతర సామాగ్రి దెబ్బతినేలా ప్రవర్తించడం వంటివి చేస్తే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయి.చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా -
చెన్నైపై పంజాబ్ ఘన విజయం
-
PBKS vs CSK: ప్రియాంశ్ పటాకా
‘కింగ్స్’ పోరులో చెన్నైపై పంజాబ్దే పైచేయి అయింది. యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య మెరుపులకు శశాంక్ సింగ్, యాన్సెన్ ఫినిషింగ్ టచ్ తోడవడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగా... ఛేదనలో చెన్నై చతికిలబడింది. కాన్వే, దూబే రాణించినా... మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలర్లు పుంజుకోవడంతో చెన్నైకి వరుసగా నాలుగో పరాజయం తప్పలేదు. ‘ఫినిషర్’ ధోని దూకుడు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది! ముల్లాన్పూర్: యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (42 బంతుల్లో 103; 7 ఫోర్లు, 9 సిక్స్లు) రికార్డు సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నైకిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రియాంశ్ ఆర్య సెంచరీతో కదంతొక్కగా... శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స్లు), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9)తో పాటు ప్రభ్సిమ్రన్ సింగ్ (0), స్టొయినిస్ (4), నేహల్ వధేరా (9), మ్యాక్స్వెల్ (1) విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కాన్వే (49 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకం సాధించగా... రచిన్ (37; 6 ఫోర్లు), శివమ్ దూబే (27 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ధోని (12 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) పోరాడారు. ఫటాఫట్... ఖలీల్ అహ్మద్ వేసిన తొలి బంతికే పాయింట్ మీదుగా సిక్స్ కొట్టిన ప్రియాంశ్ ఆర్య... రెండో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని ఈ 24 ఏళ్ల కుర్రాడు అదే ఓవర్లో మరో సిక్స్ బాదాడు. రెండో ఓవర్లో ప్రభ్సిమ్రన్ డకౌట్ కాగా... ఆర్య ఇంకో సిక్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఖలీల్ తదుపరి ఓవర్లో శ్రేయస్ను క్లీన్బౌల్డ్ చేయగా... నాలుగో ఓవర్లో ఆర్య ‘హ్యాట్రిక్’ ఫోర్లతో విరుచుకుపడ్డాడు.స్టొయినిస్ క్రీజులోకి వచ్చినంతసేపు కూడా నిలవలేకపోగా... అశ్విన్ ఓవర్లో 4, 6తో ఆర్య 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అశ్విన్ ఒకే ఓవర్లో నేహల్ , మ్యాక్స్వెల్ను ఔట్ చేశాడు. వికెట్లు పడుతున్నా దూకుడు తగ్గించని ఆర్య... అశ్విన్ ఓవర్లో మూడు సిక్స్లతో చెలరేగిపోయాడు. పతిరణ ఓవర్లో వరుసగా 6, 6, 6, 4 కొట్టిన ప్రియాంశ్ 13వ ఓవర్లోనే 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తదుపరి ఓవర్లో ఆర్య ఔట్ కాగా... చివర్లో యాన్సెన్, శశాంక్ చక్కటి షాట్లతో పంజాబ్కు భారీ స్కోరు అందించారు. 39 ప్రియాంశ్ ఆర్య సెంచరీకి తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది నాలుగో వేగవంతమైన శతకం. గేల్ (30 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో), మిల్లర్ (38 బంతుల్లో) ట్రావిస్ హెడ్ (39 బంతుల్లో) ముందున్నారు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ ఆర్య (సి) శంకర్ (బి) నూర్ 103; ప్రభ్సిమ్రన్ (బి) ముకేశ్ 0; శ్రేయస్ (బి) ఖలీల్ 9; స్టొయినిస్ (సి) కాన్వే (బి) ఖలీల్ 4; నేహల్ (సి) ధోని (బి) అశ్విన్ 9; మ్యాక్స్వెల్ (సి అండ్ బి) అశ్విన్ 1; శశాంక్ (నాటౌట్) 52; యాన్సెన్ (నాటౌట్) 34; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–17, 2–32, 3–54, 4–81, 5–83, 6–154. బౌలింగ్: ఖలీల్ 4–0–45–2; ముకేశ్ 2–0–21–1; అశ్విన్ 4–0–48– 2; జడేజా 3–0–18–0; నూర్ 3–0–32–1; పతిరణ 4–0–52–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (స్టంప్డ్) ప్రభ్సిమ్రన్ (బి) మ్యాక్స్వెల్ 37; కాన్వే (రిటైర్డ్ అవుట్) 69; రుతురాజ్ (సి) శశాంక్ (బి) ఫెర్గూసన్ 1; దూబే (బి) ఫెర్గూసన్ 42; ధోని (సి) చహల్ (బి) యశ్ 27; జడేజా (నాటౌట్) 9; శంకర్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–61, 2–62, 3–151, 4–171, 5–192, బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–39–0; యశ్ 4–0–39–1; మ్యాక్స్వెల్ 2–0–11–1; యాన్సెన్ 4–0–48–0; ఫెర్గూసన్ 4–0–40–2; స్టొయినిస్ 1–0–10–0; చహల్ 1–0–9–0.ఐపీఎల్లో నేడుగుజరాత్ X రాజస్తాన్ వేదిక: అహ్మదాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: మారని సీఎస్కే తీరు.. వరుసగా నాలుగో ఓటమి
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో సీఎస్కే పరాజయం పాలైంది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాన్ కాన్వే(49 బంతుల్లో 69) టాప్ స్కోరర్గా నిలవగా.. శివమ్ దూబే(27 బంతుల్లో 42), రచిన్ రవీంద్ర(36), ధోని(27) పర్వాలేదన్పించారు. ఈ మ్యాచ్లో కూడా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(1) నిరాశపరిచాడు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాక్స్వెల్,యష్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు. డెవాన్ కాన్వే రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు. సీఎస్కేకు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.ఆర్య విధ్వంసం.. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య(7 ఫోర్లు, 9 సిక్స్లతో 103) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రియాన్ష్ కేవలం 39 బంతుల్లోనే తొలి ఐపీఎల్ శతకాన్ని అందుకున్నాడు.అతడితో పాటు శశాంక్ సింగ్(52), జాన్సెన్(34) పరుగులతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించగా.. నూర్, ముఖేష్ చెరో వికెట్ సాధించారు. -
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యువ సంచలనం ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే సీఎస్కే బౌలర్లను ఆర్య ఊతికారేశాడు. ముల్లాన్పూర్ మైదానంలో సిక్సర్ల మోత మోగించాడు. పతిరానా, అశ్విన్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్ను సైతం 24 ఏళ్ల ఆర్య వదలేదు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి ప్రియాన్ష్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని ప్రియాన్ష్ అందుకున్నాడు. ఓవరాల్గా 42 బంతులు ఎదుర్కొన్న ఈ ఢిల్లీ క్రికెటర్.. 7 ఫోర్లు, 9 సిక్స్లతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అద్భుతమైన సెంచరీతో చెలరేగిన ఆర్య పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.👉ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ రికార్డును ఆర్య సమం చేశాడు. హెడ్ కూడా సరిగ్గా ఐపీఎల్-2024లో ఆర్సీబీపై కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో క్రిస్ గేల్(30 బంతులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో యూసఫ్ పఠాన్(37), మిల్లర్(38) ఉన్నారు.👉అదే విధంగా ఐపీఎల్లో అత్యంతవేగంగా సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు షాన్ మార్ష్(58) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో మార్ష్ రికార్డును ఆర్య బ్రేక్ చేశాడు. ఎవరీ ప్రియాన్ష్ ఆర్య..?24 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య లిస్ట్-ఎ క్రికెట్లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు పవన్ ఆర్య, రాధా బాల ఇద్దరూ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులగా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ విహార్లో పెరిగిన ప్రియాంష్కు చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ. ప్రియాన్ష్కు అతడి తల్లిదండ్రలు ఎంతో మద్దతుగా నిలిచారు. ఇటు క్రికెట్, అటు విద్యను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్య ముందుకు సాగాడు.ఆర్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్వామి శ్రద్ధానంద్ కళాశాల నుండి బి.ఎ. పూర్తి చేశాడు. ఇక ప్రియాన్స్ ఆర్యా 2019లో భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్తో కలిసి అతడు ఆడాడు.అయితే ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024 ద్వారా ప్రియాన్ష్ వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది డీపీఎల్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టి ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు. టోర్నీ ఆసాంతం ప్రియాన్ష్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఈ టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్రేటుతో 608 పరుగులు చేశాడు. టీ20ల్లో కూడా మంచి రికార్డు ఈ యువ క్రికెటర్కు ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 356 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది. ఐపీఎల్లో సీఎస్కే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా ఆర్య రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జై సూర్య పేరిట ఉండేది. జై సూర్య ముంబై ఇండియన్స్ తరపున సీఎస్కేపై 40 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్తో జైసూర్యను ఆర్య అధిగమించాడుఐపీఎల్లో సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్లు వీరేషాన్ మార్ష్ vs రాజస్తాన్ రాయల్స్ 2008మనీష్ పాండే vs దక్కన్ ఛార్జెర్స్, 2009పాల్ వాల్తాటి vs సీఎస్కే, 2009దేవదత్ పడిక్కల్ vs రాజస్తాన్, 2021రజత్ పాటిదార్ vs లక్నో , 2022యశస్వి జైస్వాల్ vs ముంబై ఇండియన్స్, 2022ప్రభసిమ్రాన్ సింగ్ vs ఢిల్లీ క్యాపిటల్స్, 2023ప్రియాంష్ ఆర్య vs సీఎస్కే, 2025* -
సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం..
IPL 2025 PBKS vs CSK Live Updates: సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం..ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ మళ్లీ విన్నింగ్ ట్రాక్లో పడింది. ముల్లాన్పూర్ వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాన్ కాన్వే(49 బంతుల్లో 69) టాప్ స్కోరర్గా నిలవగా.. శివమ్ దూబే(27 బంతుల్లో 42), రచిన్ రవీంద్ర(36), ధోని(27) పర్వాలేదన్పించారు. జాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాక్స్వెల్,యష్ ఠాకూర్ ఓ వికెట్ సాధించారు.సీఎస్కే మూడో వికెట్ డౌన్..శివమ్ దూబే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన దూబే.. ఫెర్గూసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. సీఎస్కే విజయానికి 18 బంతుల్లో 59 పరుగులు కావాలి. క్రీజులో కాన్వే(67), ధోని(3) ఉన్నారు.13 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 120/213 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజులో డెవాన్ కాన్వే(44), శివమ్ దూబే(30) ఉన్నారు.గైక్వాడ్ ఔట్..220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర(36) మాక్స్వెల్ బౌలింగ్లో స్టంపౌట్ కాగా.. రుతురాజ్ గైక్వాడ్(1) లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో పెవిలయన్కు చేరాడు. 8 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 69/24 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 45/04 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో డెవాన్ కాన్వే(15), రచిన్ రవీంద్ర(24) ఉన్నారు.సీఎస్కే ముందు భారీ టార్గెట్..ముల్లాన్పూర్ వేదికగా చెన్నై సూపర్కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య(7 ఫోర్లు, 9 సిక్స్లతో 103) సెంచరీతో చెలరేగగా.. శశాంక్ సింగ్(52), జాన్సెన్(34) పరుగులతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించగా.. నూర్, ముఖేష్ చెరో వికెట్ సాధించారు.17 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 182/617 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. క్రీజులో శశాంక్ సింగ్(41), జాన్సెన్(11) పరుగులతో ఉన్నారు.ప్రియాన్ష్ ఆర్య సూపర్ సెంచరీ..పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య సూపర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీని ఆర్య అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లలో 7 ఫోర్లు, 9 సిక్స్లు ఉన్నాయి. ఐపీఎల్లో ఆర్యది 4వ ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.అశ్విన్ ఆన్ ఫైర్..పంజాబ్ కింగ్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. నేహల్ వధేరా(9), మాక్స్వెల్(0)ను అశ్విన్ పెవిలియన్కు పంపాడు. 9 ఓవర్లు మగిసే సరికి పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(53), శశాంక్ సింగ్(4) ఉన్నారు.పంజాబ్ మూడో వికెట్ డౌన్మార్కస్ స్టోయినిష్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిష్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు మగిసే సరికి పంజాబ్ మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(53), వధేరా(7) ఉన్నారు. ఆర్యకు ఇదే తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.పంజాబ్ రెండో వికెట్ డౌన్..శ్రేయస్ అయ్యర్ రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి స్టోయినిష్ వచ్చాడు. పంజాబ్ తొలి వికెట్ డౌన్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముఖేష్ చౌదరి బౌలింగ్లో ప్రభుసిమ్రాన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(22), శ్రేయస్ అయ్యర్(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరన -
ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్గా పాటిదార్ అరుదైన ఘనత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్గా రజత్ పాటిదార్ (Rajat Patidar) పేరును ప్రకటించినప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. విరాట్ కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడి నీడలో ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు తనదైన ముద్ర వేయగలడా అనే సందేహాలు తలెత్తాయి. అంతేకాదు ‘కింగ్’ మాస్ క్రేజ్ అతడికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.డిఫెండింగ్ చాంపియన్పై గెలుపుతో మొదలుఅయితే, రజత్ పాటిదార్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆర్సీబీని విజయపథంలో నడిస్తున్నాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇటు బ్యాటర్గా.. అటు సారథిగా అద్భుతంగా రాణిస్తూ జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. పాటిదార్ సారథ్యంలో సీజన్ ఆరంభ మ్యాచ్లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR)ను మట్టికరిపించింది.చెన్నైని చెపాక్లో ఓడించికేకేఆర్ను తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్లో ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. గెలుపుతో సీజన్ను ఆరంభించింది. అనంతరం.. చెన్నై సూపర్ కింగ్స్పై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతేకాదు.. చెన్నైకి కంచుకోట అయిన చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ 2008 తర్వాత.. మళ్లీ విజయం సాధించడం ఇదే తొలిసారి.అయితే, తమ సొంత మైదానం ఎం. చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఆర్సీబీకి పరాభవం ఎదురైంది. హ్యాట్రిక్ విజయం అందుకోవాలన్న పాటిదార్ సేనపై గుజరాత్ టైటాన్స్ నీళ్లు చల్లింది. బెంగళూరు వేదికగా ఆర్సీబీని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, ఆర్సీబీ ఈ ఓటమి నుంచి త్వరగానే కోలుకుంది.ముంబై కంచుకోట బద్దలుముంబై ఇండియన్స్తో వాంఖడే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో భారీ స్కోరు సాధించి.. దానిని డిఫెండ్ చేసుకుంది. సొంత మైదానంలో ఈ ఫైవ్ టైమ్ చాంపియన్ను 12 పరుగుల తేడాతో ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టింది.ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్గాఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో.. ఒకే సీజన్లో కేకేఆర్ను ఈడెన్ గార్డెన్స్లో, చెన్నైని చెపాక్లో, ముంబైని వాంఖడేలో ఓడించిన తొలి కెప్టెన్గా నిలిచాడు. అద్భుతమైన నాయకత్వ నైపుణ్యాలతో ఈ మూడు చాంపియన్ జట్లను వారి సొంత మైదానంలోనే ఓడించిన సారథిగా అరుదైన ఘనత సాధించాడు.గతంలో పంజాబ్ కింగ్స్ 2012లో ఈ ఫీట్ నమోదు చేసింది. అయితే, అప్పుడు ఆ జట్టుకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు పనిచేశారు. ఆడం గిల్క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కేకేఆర్ను ఈడెన్ గార్డెన్స్లో ఓడించింది. అంతకుముందు డేవిడ్ హస్సీ కెప్టెన్సీలో ముంబైని వాంఖడేలో, చెన్నైని చెపాక్లో చిత్తు చేసింది. అయితే, పాటిదార్ సోలోగా ఈ ఘనత సాధించి.. చరిత్ర సృష్టించాడు.బ్యాటర్గానూ సూపర్హిట్ ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడింట గెలిచింది. మరోవైపు.. రజత్ పాటిదార్ ఇప్పటి వరకు నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 161 పరుగులు సాధించాడు. కేకేఆర్పై 16 బంతుల్లో 34, సీఎస్కేపై 32 బంతుల్లో 51 రన్స్ చేశాడు.అదే విధంగా.. గుజరాత్ టైటాన్స్పై 12 బంతుల్లో 12, ముంబైపై 32 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. చెన్నై, ముంబైపై ఆర్సీబీ విజయాల్లో బ్యాటర్గా కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు కూడా!.. ఏదేమైనా పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఇదే జోరు కనబరిస్తే.. ‘ఈసారి కప్ మనదే’ అని ప్రతిసారీ అనుకునే అభిమానుల కల నెరవేరవచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు!!A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల.. -
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 8) రెండు మ్యాచ్లు.. వారం మధ్యలో ఇలా ఎందుకంటే..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 8) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాత్రి మ్యాచ్లో పంజాబ్, సీఎస్కే ఢీకొట్టనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో జరుగనుండగా.. రాత్రి మ్యాచ్ పంజాబ్ హోం గ్రౌండ్ ముల్లన్పూర్ స్టేడియంలో జరుగనుంది.వారం మధ్యలో ఎందుకంటే..?తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు లేవు. అయితే ఏప్రిల్ 6న జరగాల్సిన కేకేఆర్, లక్నో మ్యాచ్ను నేటి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ రోజు శ్రీరామనవమి కావడంతో కోల్కతా పోలీసులు మ్యాచ్కు భద్రతా ఏర్పాట్లు చేయలేమని చెప్పారు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్ను వాయిదా వేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరియు బీసీసీఐని కోరింది. దీంతో కేకేఆర్, లక్నో మ్యాచ్ నేటి మధ్యాహ్నానికి వాయిదా పడింది.ప్రస్తుతం కేకేఆర్, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..కేకేఆర్: క్వింటన్ డికాక్/రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాలక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి, రవి బిష్ణోయ్రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో దుమ్మురేపుతున్న పంజాబ్ వరుస పరాజయాలతో చతికిలపడ్డ సీఎస్కేతో తలపడనుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింట విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. సీఎస్కే నాలుగింట మూడు ఓడి చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే 16, పంజాబ్ 14 మ్యాచ్ల్లో గెలిచాయి. 2022 సీజన్ నుంచి జరిగిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు పంజాబే గెలిచింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోని (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి/అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరణ -
ఆఖరిసారిగా అప్పుడే బాగా ఏడ్చాను: శ్రేయస్ అయ్యర్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ టీమిండియా సొంతం కావడంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ది కీలక పాత్ర. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఐదు మ్యాచ్లలోనూ అద్భుత ఆట తీరుతో రాణించి.. జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ఈ వన్డే టోర్నీలో మొత్తంగా 243 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ రన్స్కోరర్గా నిలిచాడు.తుదిజట్టులో చోటు కరువు?అయితే, ఈ మెగా ఈవెంట్కు ముందు శ్రేయస్ అయ్యర్కు తుదిజట్టులో చోటు దక్కే పరిస్థితే లేదు. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్ (Ind vs Eng ODIs)తో స్వదేశంలో టీమిండియా మూడు వన్డేలు ఆడగా.. తొలి మ్యాచ్కు విరాట్ కోహ్లి గాయం వల్ల దూరమయ్యాడు. ఫలితంగా శ్రేయస్ అతడి స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు.ఇక అప్పటి నుంచి అతడికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస మ్యాచ్లలో బ్యాట్ ఝులిపించి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించాడు. ఇక ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. భారత జట్టు మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్ (Dubai)లో ఆడిన విషయం తెలిసిందే. అయితే, తొలి మ్యాచ్కు ముందు శ్రేయస్ అయ్యర్ బాగా ఏడ్చాడట. ఇందుకు గల కారణాన్ని అతడు తాజాగా వెల్లడించాడు.ఆఖరిసారిగా అప్పుడే బాగా ఏడ్చానుక్యాండిడ్ విత్ కింగ్స్ ప్రోగ్రామ్లో భాగంగా ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను చివరగా ఏడ్చిన సందర్భం అంటే.. చాంపియన్స్ ట్రోఫీ అప్పుడే. మొదటి ప్రాక్టీస్ సెషన్లో నేను సరిగ్గా ఆడలేకపోయాను. దాంతో ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాను.అంతేకాదు.. నా మీద నాకు అంతులేని కోపం వచ్చింది. నిజానికి సాధరణంగా నేను అస్సలు ఏడ్వను. కానీ అప్పుడు ఎందుకు అంతలా బాధపడ్డానో నాకే తెలియదు. ఒక్కోసారి నాకు ఇది షాకింగ్గా అనిపిస్తుంది.అంతకు ముందు ఇంగ్లండ్ సిరీస్లో నేను బాగానే ఆడాను. అదే జోరును చాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించాలని ఫిక్సయ్యాను. అయితే, అలా తొలి సెషన్లోనే చేదు అనుభవం ఎదురుకావడం వల్ల నిరాశకు గురయ్యాను. తర్వాత అక్కడి పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని నాదైన శైలిలో ఆడాను’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.కనక వర్షంకాగా ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ను ఆ జట్టు వదులుకుంది. ఈ క్రమంలో మెగా వేలంలోకి వచ్చిన ఈ ముంబైకర్పై కాసుల వర్షం కురిసింది. పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. ఇక పంజాబ్ సారథిగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న అయ్యర్.. రెండింట గెలిచాడు.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్Sarpanch Saab's passion for the game... 🥹🤌🏻Watch the full heartfelt conversation between Shreyas Iyer and Sahiba Bali on our YT channel and Punjab Kings App. 📹 pic.twitter.com/t1PBDtCY6M— Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2025 -
RR Vs PBKS: జన్సెన్పై కోపంతో ఊగిపోయిన బాలీవుడ్ గాయని
బాలీవుడ్ గాయని, 'ముంజ్య' ఫేమ్ జాస్మిన్ సాండ్లాస్ పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ మార్కో జన్సెన్పై ఆగ్రహంతో ఊగిపోయింది. నిన్న (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. రియాన్ పరాగ్ అందించిన ఈజీ క్యాచ్ను జన్సెన్ నేలపాలు చేశాడు. pic.twitter.com/BCZ8bam1K7— THAT RCB GUY (@RcbWale34631) April 5, 2025దీంతో కోపం పట్టలేకపోయిన జాస్మిన్ జన్సెన్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటికీ ఆమె భావోద్వేగాలను నియంత్రించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఇదే సీజన్లో ఓ సీఎస్కే ఫ్యాన్ గర్ల్ కూడా ఇదే తరహాలో (ధోని క్యాచ్ పట్టినందుకు) హెట్మైర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. జన్సెన్ పరాగ్ క్యాచ్ నేలపాలు చేసినందుకు పంజాబ్ కింగ్స్ భారీ మూల్యమే చెల్లించుకుంది. లైఫ్ లభించాక పరాగ్ చెలరేగి ఆడాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ భారీ స్కోర్ (205/4) చేసింది. ఛేదనలో తడబడిన పంజాబ్ రెండు వరుస విజయాల తర్వాత సీజన్లో తొలి ఓటమిని చవిచూసింది.ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ సొంత మైదానమైన ముల్లన్పూర్ స్టేడియంలో జరిగింది. నూతనంగా ప్రారంభించబడిన ఈ స్టేడియంలో పంజాబ్ కింగ్స్కు ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. దీంతో స్టేడియంలో బీసీసీఐ గ్రాండ్గా ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించింది. ఈ వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ మరియు పంజాబీ గాయని జాస్మిన్ సాండ్లాస్ అద్భుతమైన ప్రదర్శనలతో అలరించింది. ఈ మ్యాచ్ కోసం వేలాదిగా తరలివచ్చిన అభిమానులు జాస్మిన్ పాటలకు ఉర్రూతలూగిపోయారు.ఓపెనింగ్ సెర్మనీ తర్వాత జాస్మిన్ పంజాబ్కు మద్దతు ఇస్తూ.. ఆ జట్టు జెర్సీ ధరించి స్టాండ్స్లో కనిపించింది. ఈ క్రమంలో జన్సెన్ రియాన్ పరాగ్ క్యాచ్ వదిలేయడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. జాస్మిన్ జన్సెన్పై కేకలు వేస్తున్న వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. జాస్మిన్ గతేడాది బాలీవుడ్లో రిలీజ్ అయిన హరర్ సినిమా ముంజ్యలో పాటలు పాడింది. ఈ పాటలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ముంజ్య సినిమా అతి తక్కువ పెట్టుబడితో భారీ వసూళ్లు చేసింది. -
IPL 2025: చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 5) రాత్రి పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాయల్స్ అన్ని విభాగాల్లో సత్తా చాటి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్లో మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. సంజూ శాంసన్ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు), రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించారు. ఆఖర్లో నితీశ్ రాణా (7 బంతుల్లో 12), హైట్మైర్ (12 బంతుల్లో 20), ధృవ్ జురెల్ (5 బంతుల్లో 13 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి రాయల్స్ స్కోర్ను 200 దాటించారు.కాగా, ఈ మ్యాచ్ జరుగుతున్న మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (ముల్లన్పూర్, చండీగఢ్) ఓ జట్టు (ఐపీఎల్లో) 200కు పైగా స్కోర్ చేయడం ఇదే మొదటిసారి. ఇక్కడ జరిగిన ఐదు ఐపీఎల్ మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా 200 పరుగుల స్కోర్ నమోదు కాలేదు. తాజా ప్రదర్శన అనంతరం యాదవీంద్ర సింగ్ స్టేడియంలో 200 ప్లస్ స్కోర్ నమోదు చేసిన తొలి ఐపీఎల్ జట్టుగా రాజస్థాన్ రాయల్స్ చరిత్ర సృష్టించింది.గత సీజన్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ చేసిన 192 పరుగులే ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ మైదానంలో అత్యధిక స్కోర్గా ఉండింది. ఓవరాల్గా చూసినా ఈ మైదానంలో ఇది మూడో 200 ప్లస్ స్కోర్ మాత్రమే. ఈ మైదానంలో ఇప్పటివరకు (ఐపీఎల్ కలుపుకుని) 29 టీ20 మ్యాచ్లు జరిగాయి.మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నమోదైన టాప్-5 అత్యధిక స్కోర్లు..205/4 - రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ (2025)192/7 - ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ (2024)183 ఆలౌట్ - పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (2024)182/9 - సన్రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ (2024)180/6 - పంజాబ్ కింగ్స్ vs సన్రైజర్స్ హైదరాబాద్ (2024)చెలరేగిన ఆర్చర్భారీ ఛేదనలో జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లోనే పంజాబ్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి బంతికే ప్రియాన్ష్ ఆర్యను క్లీన్ బౌల్డ్ చేసిన ఆర్చర్.. ఓవర్ చివరి బంతికి ఇన్ ఫామ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను కూడా ఆర్య తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు.ఆర్చర్తో పాటు (4-0-25-3) సందీప్ శర్మ (4-0-21-2), మహీశ్ తీక్షణ (4-0-26-2) కూడా రెచ్చిపోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేహల్ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) పంజాబ్ను గట్టెక్కించే ప్రయత్నాలు చేయగా అవి ఫలించలేదు. వీరిద్దరు మినహాయంచి పంజాబ్ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.రెండు వరుస విజయాల తర్వాత పంజాబ్కు ఈ సీజన్లో ఇది తొలి ఓటమి కాగా.. రెండు వరుస పరాజయాల తర్వాత రాయల్స్కు ఇది వరుసగా రెండో విజయం. -
PBKS Vs RR: ఈ నష్టం మంచిదే: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ జోరుకు అడ్డుకట్ట పడింది. వరుసగా 8 మ్యాచ్ల్లో విజయఢంకా మోగించిన అతను.. తొమ్మిదో మ్యాచ్లో ఓటమి చవి చూశాడు. ఈ క్రమంలో అత్యంత అరుదైన ట్రిపుల్ హ్యాట్రిక్ను (వరుసగా 9 మ్యాచ్ల్లో విజయం) మిస్ అయ్యాడు. 2024 సీజన్లో మొదలైన శ్రేయస్ జైత్రయాత్ర (కేకేఆర్ కెప్టెన్గా).. ఈ సీజన్లో నిన్నటి మ్యాచ్తో ముగిసింది. ఈ సీజన్లో పంజాబ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ తొలి రెండు మ్యాచ్ల్లో జట్టును విజయవంతంగా నడిపించాడు. నిన్న (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ను సీజన్ తొలి ఓటమి పలకరించింది.ఈ మ్యాచ్లో పంజాబ్ తొలుత బౌలింగ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని.. ఆతర్వాత బ్యాటింగ్లో చేతులెత్తేసింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్.. రాయల్స్ను 205 పరుగుల భారీ స్కోర్ చేయనిచ్చింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో తడబడి 155 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా రాయల్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో రాయల్స్కు రెండు వరుస పరాజయాల తర్వాత ఇది వరుసగా రెండో విజయం.రాయల్స్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు), రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. నేహల్ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) పంజాబ్ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఛేదనలో రాయల్స్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్ (4-0-25-3), సందీప్ శర్మ (4-0-21-2), మహీశ్ తీక్షణ (4-0-26-2) చెలరేగిపోవడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు.మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పుడు 180-185 పరుగులు వస్తాయని అనుకున్నాను. ఇక్కడ ఛేజింగ్కు ఆ స్కోర్ అయితే ఓకే. కానీ మా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. టోర్నీ ప్రారంభంలోనే ఈ తప్పిదం జరిగినందుకు సంతోషంగా ఉన్నాను. ఇది మంచి పిచ్. బంతి నెమ్మదిగా కదులుతుండింది. మా బౌలర్లు కూడా ఎక్కువ వేగంతో బంతులు వేయలేదు.ఛేదన ఆరంభంలో నిదానంగా ఆడైనా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. వరుసగా వికెట్లు కోల్పోయాము. ఒత్తిడిలో నేహల్ అద్భుతంగా ఆడాడు. అతను కొంత సమయం తీసుకున్నా ఆతర్వాత బౌలర్లపై ఎదురుదాడి చేయగలిగాడు. ఈ ఆట నుండి చాలా నేర్చుకోవచ్చు. ఈ నష్టం మంచిదేనని భావిస్తున్నాను. ముందుగా ఊహించినట్లుగా ఇవాళ మంచు కూడా పడలేదు. బౌలింగ్, బ్యాటింగ్లో మేము అమలు చేయలేకపోయిన విషయాలను పరిశీలించుకోవాలి. -
రాయల్స్ ఘనవిజయం
మూల్లన్పూర్: తొలి రెండు మ్యాచ్లలో చక్కటి ఆటతో విజయాలు సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్కు సొంత మైదానంలో ఆడిన మొదటి పోరులో ఓటమి ఎదురైంది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన రాజస్తాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో పంజాబ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ సంజు సామ్సన్ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. జైస్వాల్, సామ్సన్ తొలి వికెట్కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశారు. ఫెర్గూసన్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నేహల్ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేయగా, గ్లెన్ మ్యాక్స్వెల్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే 2 వికెట్లు సహా 43 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకున్న పంజాబ్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. వధేరా, మ్యాక్స్వెల్ ఐదో వికెట్కు 52 బంతుల్లో 88 పరుగులు జత చేసి ఆశలు రేపినా... విజయానికి అది సరిపోలేదు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఫెర్గూసన్ 67; సామ్సన్ (సి) అయ్యర్ (బి) ఫెర్గూసన్ 38; పరాగ్ (నాటౌట్) 43; నితీశ్ రాణా (సి) మ్యాక్స్వెల్ (బి) యాన్సెన్ 12; హెట్మైర్ (సి) మ్యాక్స్వెల్ (బి) అర్ష దీప్ 20; జురేల్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–89, 2–123, 3–138, 4–185. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–1, యాన్సెన్ 4–0–45–1, ఫెర్గూసన్ 4–0–37–2, మ్యాక్స్వెల్ 1–0–6–0, చహల్ 3–0–32–0, స్టొయినిస్ 4–0–48–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్షి (బి) ఆర్చర్ 0; ప్రభ్సిమ్రన్ (సి) హసరంగ (బి) కార్తికేయ 17; శ్రేయస్ అయ్యర్ (బి) ఆర్చర్ 10; స్టొయినిస్ (సి) అండ్ (బి) సందీప్ 1; వధేరా (సి) జురేల్ (బి) హసరంగ 62; మ్యాక్స్వెల్ (సి) జైస్వాల్ (బి) తీక్షణ 30; శశాంక్ సింగ్ (నాటౌట్) 10; సూర్యాంశ్ (సి) హెట్మైర్ (బి) సందీప్ 2; యాన్సెన్ (సి) హెట్మైర్ (బి) తీక్షణ 3; అర్ష దీప్ (సి) హసరంగ (బి) ఆర్చర్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–11, 3–26, 4–43, 5–131, 6–131, 7–136, 8–145, 9–151. బౌలింగ్: ఆర్చర్ 4–0–25–3, యు«ద్వీర్ 2–0–20–0, సందీప్ శర్మ 4–0–21–2, తీక్షణ 4–0–26–2, కార్తికేయ 2–0–21–1, హసరంగ 4–0–36–1. -
పంజాబ్ను చిత్తు చేసిన రాజస్తాన్..
IPL 2025 RR vs PBKS live updates and highlights: ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి.పంజాబ్కు తొలి ఓటమి..ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తొలి ఓటమి చవిచూసింది. ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో పంజాబ్ పరాజయం పాలైంది. 206 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా(62) టాప్ స్కోరర్గా నిలవగా.. మాక్స్వెల్(30) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ, థీక్షణ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు కార్తికేయ, హసరంగా ఓ వికెట్ చొప్పున పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(67) టాప్ స్కోరర్గా నిలవగా.. సంజూ శాంసన్(38), రియాన్ పరాగ్(45), హెట్మెయిర్(20) రాణించారు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు, అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సెన్ తలా వికెట్ సాధించారు.వదేరా ఔట్..పంజాబ్ కింగ్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. థీక్షణ బౌలింగ్లో మాక్స్వెల్(30) ఔట్ కాగా.. ఆ తర్వాతి ఓవర్లో హసరంగా బౌలింగ్లో వధేరా(62) ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్.. 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.వదేరా హాఫ్ సెంచరీ..ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన తర్వాత పంజాబ్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. 14 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో నేహల్ వధేరా(53), గ్లెన్ మాక్స్వెల్(30) ఉన్నారు. కష్టాల్లో పంజాబ్43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో వికెట్గా స్టోయినిష్, నాలుగు వికెట్గా ఫ్రబ్ సిమ్రాన్ ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో నేహాల్ వధేరా(9), మాక్స్వెల్(1) ఉన్నారు.పంజాబ్కు భారీ షాక్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే భారీ షాక్ తగలింది. తొలి ఓవర్లోనే పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆర్చర్ బౌలింగ్లో తొలి బంతికి ఆర్య ఔట్ కాగా.. ఆఖరి బంతికి శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులో ప్రభ్సిమ్రాన్ సింగ్, మార్కస్ స్టోయినిష్ ఉన్నారు.చెలరేగిన రాజస్తాన్ బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్ ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(67) టాప్ స్కోరర్గా నిలవగా.. సంజూ శాంసన్(38), రియాన్ పరాగ్(45), హెట్మెయిర్(20) రాణించారు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు, అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సెన్ తలా వికెట్ సాధించారు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్..నితీష్ రాణా రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రాణా.. జానెసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. క్రీజులో పరాగ్(12), హెట్మెయిర్(4) ఉన్నారు.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్..యశస్వి జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన జైశ్వాల్.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో రియాన్ పరాగ్(11), నితీష్ రాణా(11) ఉన్నారు.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్..యశస్వి జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన జైశ్వాల్.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో రియాన్ పరాగ్(11), నితీష్ రాణా(11) ఉన్నారు.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్కెప్టెన్ సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన శాంసన్.. ఫెర్గూసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(56), రియాన్ పరాగ్(5) ఉన్నారు.4 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్:40/04 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(25), సంజూ శాంసన్(15) ఉన్నారు.ఐపీఎల్-2025లో ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. రాజస్తాన్ మాత్రం తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో కెప్టెన్గా సంజూనే వ్యవహరించనున్నాడు. మరోవైపు తుషార్ దేశ్ పాండే గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో యుద్ద్వీర్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్.రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ -
పంజాబ్ జోరు కొనసాగేనా!
ముల్లాన్పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్... రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్కు సిద్ధమైంది. ‘డబుల్ హెడర్’లో భాగంగా శనివారం జరగనున్న రెండో పోరులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత పదేళ్లుగా ప్లే ఆఫ్స్కు చేరలేకపోయిన పంజాబ్ జట్టు... ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ శిక్షణ, శ్రేయస్ అయ్యర్ కెపె్టన్సీలో తాజా సీజన్లో జోరు మీదుంది. మరోవైపు తొలి సీజన్లో చాంపియన్గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ తిరిగి సత్తా చాటేందుకు రెడీ అయింది. ఆటేతర అంశాలతో వార్తల్లో నిలుస్తున్న రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై ఒత్తిడి అధికంగా ఉంది. గత మూడు మ్యాచ్ల్లో వరుసగా 1, 29, 4 పరుగులు చేసిన జైస్వాల్... ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. సీజన్ తొలి మూడు మ్యాచ్ల్లో కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగిన సంజూ సామ్సన్... ఈ మ్యాచ్లో సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో వికెట్ కీపింగ్ చేసేందుకు బీసీసీఐ అతడికి అనుమతినిచ్చింది. జైస్వాల్, సామ్సన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, హెట్మైర్, హసరంగతో రాయల్స్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, శుభమ్ శర్మ బౌలింగ్ భారం మోయనున్నారు. ఇక గత రెండు మ్యాచ్ల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన పంజాబ్ కింగ్స్... సొంతగడ్డపై తొలి మ్యాచ్లో అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. అటు విదేశీ హిట్టర్లు... ఇటు స్వదేశీ ప్లేయర్లతో పంజాబ్ పటిష్టంగా ఉంది. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తుండగా... శ్రేయస్ అయ్యర్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, శశాంక్ సింగ్, యాన్సెన్తో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అర్ష్ దీప్ సింగ్తో కలిసి ఫెర్గూసన్, యాన్సెన్ పేస్ భారం మోయనుండగా... యుజ్వేంద్ర చహల్ స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నాడు. పెద్ద బౌండరీలతో కూడిన ముల్లాన్పూర్ మైదానం స్పిన్కు అనుకూలించనుంది. గత సీజన్లో ఇక్కడ ఓ మాదిరి స్కోర్లే నమోదు కాగా... బౌలింగ్ బలంతోనే జట్లు విజయాలు సాధించాయి. తుది జట్లు (అంచనా) రాజస్తాన్ రాయల్స్: సామ్సన్ (కెప్టెన్ ), జైస్వాల్, రాణా, పరాగ్, జురేల్, హసరంగ, హెట్మైర్, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్, శుభమ్ దూబే. పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, శశాంక్ సింగ్, సుర్యాంశ్, యాన్సెన్, ఫెర్గూసన్, అర్ష్ దీప్, చహల్, వైశాక్. -
చాహల్తో డేటింగ్ రూమర్స్.. ఇలా దొరికిపోయిందేంటి?
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్వశ్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ తర్వాత అందరి దృష్టి ఆమెపైనే పడింది. అంతవరకు ముక్కు మొహం తెలియని ఆమె గురించి నెటిజన్స్ తెగ వెతికారు. ఇంతకీ ఆమె ఎవరంటూ ఆరా తీశారు. దీనికంతటికీ కారణం ఆ టీమిండియా క్రికెటరే. అతనితో కలిసి మ్యాచ్లో కనిపించడంతో ఒక్కసారిగా ఫేమ్లోకి వచ్చేసింది. టీమిండియా స్పిన్నర్ చాహల్తో కలిసి ఛాంపియన్ ట్రోఫీలో సందడి చేసింది. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక సందర్భంలో టాక్ వినిపిస్తూనే ఉంది. అంతేకాకుండా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి ఆర్జే మహ్వశ్ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి చాహల్తో కలిసి మాత్రం కనిపించలేదు. అతని ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం లక్నోలో వాలిపోయింది ముద్దుగుమ్మ. నగరంలో ప్రముఖ హోటల్లో ఆర్జే మహ్వశ్ ఈత కొడుతున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసింది.అయితే చాహల్తో డేటింగ్ రూమర్స్ వస్తున్న వేళ.. ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్జే మహ్వశ్ రావడంతో మరోసారి వీరిద్దరిపై రిలేషన్పై టాక్ నడుస్తోంది. నిజంగానే ఈ జంట డేటింగ్లో ఉన్నారా? అనే చర్చ మొదలైంది. కాగా.. చాహల్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ లీగ్ ఆడుతున్నారు. ఇటీవలే తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు కూడా తీసుకున్నారు. మార్చి 20, 2025న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.లక్నోలో ఆర్జే మహ్వశ్ కనిపించడంతో చాహల్తో డేటింగ్ నిజమేనంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్, లక్నో మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఆమె కనిపించడంతో రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. మీ రిలేషన్షిప్ను ఇంకెన్నాళ్లు సీక్రెట్గా ఉంచతారని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.ఎవరీ ఆర్జే మహ్వశ్?ఆర్జే మహ్వశ్ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్జే)గా పని చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది. చాహల్తో డేటింగ్ కథనాలు రావడంతో జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల ఒక్కసారిగా అమాంతం పెరిగింది. అంతేకాకుండా నవాజుద్దీన్ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. వీటితో పాటు హీరోయిన్గా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. -
మాకు సొంత మైదానం.. కానీ ఇక్కడ..: జహీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Ziants) ఓడిపోవడాన్ని ఆ జట్టు మెంటార్ జహీర్ ఖాన్ (Zaheer Khan) జీర్ణించుకోలేకపోతున్నాడు. పంజాబ్ కింగ్స్ గెలుపునకు పరోక్షంగా పిచ్ క్యూరేటరే కారణమంటూ విస్మయకర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్తో తలపడ్డ విషయం తెలిసిందే.లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన పంజాబ్.. లక్నో జట్టును తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే, ఏకనా వికెట్పై పరుగులు రాబట్టేందుకు లక్నో బ్యాటర్లు తడబడ్డారు.అయితే, 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి లక్నో కష్టాల్లో పడిన వేళ నికోలస్ పూరన్ (44), ఆయుశ్ బదోని (41), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 27)బ్యాట్ ఝులిపించారు. ఈ ముగ్గురి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది.16.2 ఓవర్లలోనే..ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (8) వికెట్ కోల్పోయినప్పటికీ పంజాబ్ అద్బుత రీతిలో పుంజుకుంది. వికెట్ కీపర్ ప్రభ్సిమ్రన్ సింఘ్ (34 బంతుల్లో 69) మెరుపు అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43) అజేయంగా నిలిచి జట్టు గెలుపును ఖరారు చేశారు. ఈ ముగ్గురి విజృంభణ కారణంగా 16.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి పంజాబ్ లక్నోపై ఘన విజయం సాధించింది.మాకు సొంత మైదానం..ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం లక్నో మెంటార్, టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. లక్నో తమకు సొంత మైదానం అయినా.. పిచ్ క్యూరేటర్ మాత్రం పంజాబ్కు మేలు చేయడం నిరాశపరిచిందన్నాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘సొంత మైదానంలో మ్యాచ్ అంటే.. అక్కడి జట్టుకే కాస్త ఫేవర్గా ఉంటుంది.కానీ ఇక్కడ పంజాబ్ క్యూరేటర్ ఉన్నారుకానీ ఈ విషయంలో లక్నో క్యూరేటర్ చేసిన పని వల్ల.. ఇది హోం మ్యాచ్ అన్న భావనే రాలేదు. ఇక్కడి వికెట్ ఇలాగే ఉంటుందేమో బహుశా!.. ఇక్కడ పంజాబ్ క్యూరేటర్ ఉన్నారనిపించింది. ఈ మ్యాచ్లో నాకు అన్నింటికంటే ఇదే ఎక్కువ నిరాశను కలిగించింది.క్యూరేటర్ మమ్మల్నే కాదు లక్నో అభిమానులను కూడా నిరాశకు గురిచేశారు. సొంతగడ్డపై లక్నో గెలుస్తుందని వారంతా భావించారు. కానీ ఇలా జరిగిపోయింది. జట్టుగా మేము పటిష్టంగా ఉన్నాము. మ్యాచ్లో ఓడిపోయామన్న వాస్తవాన్ని మేము అంగీకరిస్తున్నాం.వినూత్న రీతిలో.. ముందడుగుఅయితే, సొంతమైదానంలో ఓటమి కాస్త ఎక్కువ బాధించింది. ఇక్కడ మాకు ఇంకో ఆరు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మేము కచ్చితంగా మెరుగ్గా రాణిస్తామనే నమ్మకం ఉంది. సంప్రదాయ పద్ధతులను కాస్త పక్కనపెట్టి.. వినూత్న రీతిలో.. ముందడుగు వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము’’ అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.రహానే కూడా ఇలాగేకాగా లక్నో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని చెప్తారు. కానీ పంజాబ్తో మ్యాచ్లో లక్నో స్పిన్నర్లకు పెద్దగా కలిసిరాలేదు. రవి బిష్ణోయి, మణిమరన్ సిద్దార్థ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా.. దిగ్వేశ్ సింగ్ రాఠీ మాత్రం రెండు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. పంజాబ్ బౌలర్లలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, రిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆరంభమ్యాచ్లో ఓటమి తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే కూడా.. ఈడెన్ గార్డెన్స్ పిచ్ గురించి ఇదే తరహా వ్యా ఖ్యలు చేసిన విషయం తెలిసిందే.చదవండి: లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐStatement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025 -
శ్రేయస్ అయ్యర్కు ఆ క్రెడిట్ దక్కలేదు: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2025 (IPL 2025)లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై గెలిచిన పంజాబ్.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. పంత్ సేనను సొంత మైదానంలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండో గెలుపు నమోదు చేసిందిఇక ఈ రెండు విజయాల్లోనూ పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ది కీలక పాత్ర. గుజరాత్పై 42 బంతుల్లోనే 97 పరుగులతో చెలరేగిన అయ్యర్.. లక్నోతో మ్యాచ్లో 30 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ధనాధన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు.బ్యాటింగ్ నైపుణ్యాలు అద్భుతంఈ నేపథ్యంలో ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్పై టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. శ్రేయస్ బ్యాటింగ్ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. అదే విధంగా.. అయ్యర్ పట్ల కోల్కతా నైట్ రైడర్స్ వ్యవహరించిన తీరును గావస్కర్ ఈ సందర్భంగా విమర్శించాడు.శ్రేయస్ అయ్యర్కు ఆ క్రెడిట్ దక్కలేదు‘‘2024లో కేకేఆర్ను గెలిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. కానీ అతడికి దక్కాల్సిన, రావాల్సిన గుర్తింపు రాలేదు. కేకేఆర్ విజయంలో అతడికి క్రెడిట్ దక్కలేదు. ఏదేమైనా అతడి కెప్టెన్సీ రికార్డు ఎంతో గొప్పగా, ఆకట్టుకునే విధంగా ఉంది’’ అని గావస్కర్ ప్రశంసలు కురిపించాడు.కాగా ఐపీఎల్-2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కోల్కతా జట్టు చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల విరామం తర్వాత కేకేఆర్కు మరోసారి టైటిల్ దక్కడంలో అతడు కీలకంగా వ్యవహరించాడు. అయితే, ఈ విజయం మెంటార్ గౌతం గంభీర్ ఖాతాలో పడింది. శ్రేయస్ అయ్యర్ కంటే ఎక్కువగా గౌతీకే క్రెడిట్ దక్కింది.రూ. 26.75 కోట్లు ఖర్చు చేసిఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందే కేకేఆర్ ఫ్రాంఛైజీతో శ్రేయస్ అయ్యర్ తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2025 వేలంపాటలోకి వచ్చిన అతడి కోసం ఫ్రాంఛైజీలన్నీ ఎగబడ్డాయి. అయితే, ఎంత ధరకైనా వెనుకాడని పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసి ఆఖరికి అతడిని దక్కించుకుంది. కెప్టెన్గా అతడికి పగ్గాలు అప్పగించింది.ఈ క్రమంలో పైసా వసూల్ ప్రదర్శనతో శ్రేయస్ అయ్యర్ రాణిస్తుండటంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం సంతోషంలో మునిగిపోయింది. ఇదే జోరులో వరుస విజయాలు సాధించి.. తొలి టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తోంది. కాగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 117 మ్యాచ్లు పూర్తి చేసుకుని 3276 పరుగులు సాధించాడు. ఇందులో 23 అర్ధ శతకాలు ఉన్నాయి.ఐపీఎల్-2025: లక్నో వర్సెస్ పంజాబ్ స్కోర్లు👉లక్నో స్కోరు: 171/7 (20)👉పంజాబ్ స్కోరు: 177/2 (16.2)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోపై పంజాబ్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రభ్సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69).చదవండి: లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ