ధర్మశాలలో బ్లాక్ అవుట్..? పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ మ్యాచ్ ర‌ద్దు | Punjab Kings-Delhi Capitals Match Called Off In Dharamsala | Sakshi
Sakshi News home page

IPL 2025: ధర్మశాలలో బ్లాక్ అవుట్..? పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ మ్యాచ్ ర‌ద్దు

May 8 2025 10:33 PM | Updated on May 8 2025 10:52 PM

Punjab Kings-Delhi Capitals Match Called Off In Dharamsala

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో భాగంగా ధ‌ర్మశాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్ ర‌ద్దు అయింది. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు. భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌ల న‌డుమ స్ధానికంగా బ్లాక్ అవుట్ విధించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. 

ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ స్వ‌యంగా రంగంలోకి దిగి ప్రేక్ష‌కుల‌ను స్టేడియం నుంచి బ‌య‌ట‌కు పంపించారు. జమ్మూలో జారీ చేయబడిన రెడ్ అలర్ట్ ఆధారంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ మ్యాచ్‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ధుమాల్ పేర్కొన్నారు. వర్షం కార‌ణంగా గంట ఆల‌స్యంగా మొద‌లైన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ స్కోర్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. 

ప్రియాన్ష్ ఆర్య ఔటైన వెంట‌నే స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ఒక్క‌సారిగా ఆగిపోయాయి. దీంతో  ఫ్లడ్ లైట్ల సమస్య తలెత్తడంతో మ్యాచ్ ఆగిపోయింద‌ని అంతా భావించారు. కానీ భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా అధికారులు ఉద్డేశ్వ‌పూర్వ‌కంగానే ఫ్లడ్ లైట్స్ ఆపి, మ్యాచ్ రద్దు చేశారు. అయితే టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగానే మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టుగా బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు చెరో పాయింట్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement