రూ. 40 లకే భోజనం, ఎక్కడ? నమ్మలేకపోతున్న ఫ్యాన్స్‌ | Singer Arijit Singh Hotel Heshel Offers Meals For Rs.40, Here Is Everything We Know | Sakshi
Sakshi News home page

రూ. 40 లకే భోజనం, ఎక్కడ? నమ్మలేకపోతున్న ఫ్యాన్స్‌

Jun 27 2025 10:52 AM | Updated on Jun 27 2025 2:25 PM

Arijit Singh  Hotel Heshel offers  Meals For Rs. 40 Here Is Everything We Know

ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ కేవలం తన పాటల ద్వారా మాత్రమే కాదు, తన గొప్పమనసుతో అందరి మనసులను దోచుకున్నాడు. సెలబ్రిటీలు అనేక  వ్యాపారాలకు, ఎండార్స్‌మెంట్లతో కోట్లకు పడగలెత్తుతున్న తరుణంలో తన రెస్టారెంట్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం 40 రూపాయలకే కమ్మటి భోజనం అందిస్తున్నాడు. ఎక్కడ?  ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు  ఉద్దేశం ఏంటి? తెలుసుకుందామా

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లోని తన స్వస్థలం జియాగంజ్‌లో హెషెల్ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించాడు అరిజిత్‌ సింగ్‌. కుటుంబ వ్యాపారంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశాడు.  ఈ రెస్టారెంట్ చాలా తక్కువ ధరకు, కేవలం రూ. 40కి ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాడు. తద్వారా మధురమైన గానంతోపాటు సామాజిక సేవతో మరోసారి ఎందరో హృదయాలను గెలుచుకున్నాడు.

మనీ కంట్రోల్‌ నివేదిక ప్రకారం ఈ హోటల్‌ కొత్తదేమీ కాదు. కుటుంబ వ్యాపారంలో భాగంగా గాయకుడు అరిజిత్ సింగ్ తండ్రి గురుదయాళ్ సింగ్  చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. అయితే సగటు మనిషికి,  మరీ ముఖ్యంగా విద్యార్థులకు  చాలా సరసమైన  ధరలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అరిజిత్‌. అంతేకాదు గౌరవప్రదంగా వడ్డించడ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఈ కొత్త ధరలను ప్రకటించినట్టు తెలుస్తోంది.

మనీ కంట్రోల్‌ నివేదిక ప్రకారం ఈ హోటల్‌ను గాయకుడు అరిజిత్ సింగ్ తండ్రి గురుదయాళ్ సింగ్ నిర్వహిస్తున్నారు.ఇది చాలా కాలంగా కొనసాగుతున్న కుటుంబ వ్యాపారంలో భాగం. అయితే సగటు మనిషికి,  మరీ ముఖ్యంగా విద్యార్థులకు  చాలా సరసమైన  ధరలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అరిజిత్‌. అంతేకాదు గౌరవప్రదంగా వడ్డించం కూడా అధిక ప్రాధాన్యత ఉంటుందట.

భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుడు అరిజిత్‌ సింగ్‌ ఒకడు. అతని కచేరీకోసం ప్రేక్షకులు డిమాండ్‌ బాగా ఉంటుంది. ఒక్కో షోకు దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడట. ముంబైలో రూ. 8 కోట్ల ఇల్లు,  లగ్జరీ కార్లు అతని సొంతం.  మొత్తంగా అరిజిత్‌ సింగ్‌  నెట్‌వర్త్‌ సుమారు 414 కోట్లు ఉంటుందని అంచనా.

అయితే కోట్ల రూపాయలు ఆర్జించే గాయకుడు అరిజిత్ సింగ్ లాంటి వారికి ఛారిటబుల్ ఫుడ్ ఆర్గనైజేషన్‌ను నడపడం పెద్ద విషయం కానప్పటికీ, అభిమానులు ఇప్పటికీ ఈ వార్త నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఈ పూర్తి భోజనం విద్యార్థులకు మాత్రమేనని అందరికీ కాదని పేర్కొంటున్నారు. 'ఫర్ ఎ చేంజ్' అనే సంస్థ మరో పోస్ట్‌లో, ఈ రెస్టారెంట్ సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తుందని  తెలిపింది. ఈ రెస్టారెంట్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తుందని, విద్యార్థులకు డిస్కౌంట్లను కూడా అందిస్తుందని, ఇది అరిజిత్ సమాజ సేవపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొపడం గమనార్హం.

భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే  పాపులర్‌ గాయకుల్లో ఒకరు అరిజిత్‌ సింగ్‌.  అతని కచేరీలకున్న డిమాండ్‌  అంతా ఇంతా కాదు. ఒక్కో షోకు దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడట. ముంబైలో రూ. 8 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు అతని సొంతం.  మొత్తంగా అరిజిత్‌ సింగ్‌  నెట్‌వర్త్‌ సుమారు 414 కోట్లు ఉంటుందని అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement