రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్‌ గోయెంకా విమర్శలు | Billionaire Harsh Goenka calls out Prada for selling Kolhapuri chappals | Sakshi
Sakshi News home page

రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్‌ గోయెంకా విమర్శలు

Jun 27 2025 4:08 PM | Updated on Jun 27 2025 5:21 PM

Billionaire Harsh Goenka calls out Prada for selling Kolhapuri chappals

ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా ఇటీవల ప్రదర్శించిన  చెప్పులు, వాటి ధరపై భారతీయ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా  స్పందించారు. అసలు కళాకారులకు క్రెడిట్ ఇవ్వకుండా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని  అంతర్జాతీయ బ్రాండ్లు లాభపడుతున్నాయంటూ  ఆయన విమర్శించారు.  ఇది చాలా విచారకరం అంటూ ట్వీట్‌ చేశారు.

 ప్రాడా పురుషుల పాదరక్షల స్ప్రింగ్ సమ్మర్ 2026  ఇటీవల  ప్రదర్శించింది.  వీటి డిజైన్‌ అచ్చం మన షోలాపూర్‌ చెప్పుల మాదిరిగానే రాజసాన్ని ఒలకబోస్తుట్టున్నాయి.  కానీ వాటి ధరే  1.2 లక్షలు  ఉండటం  హాట్ టాపిక్‌గా మారింది.  నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చించారు.

అటు బిలియనీర్‌ గోయెంకా కూడా దీనిపై స్పందించారు.ఈ చెప్పుల ఫోటోలు ట్వీట్‌ చేస్తూ, ఇవి  భారతదేశపు ఐకానిక్ కొల్హాపురి చెప్పులను పోలి ఉన్నాయి, కానీ ధర లక్షకు పై మాటే!అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు.  మన  చేతివృత్తులు వారు వీటినే రూ.400 కు తయారు చేస్తారు. అంటే  వారు ఎంత నష్టపోతున్నారు? ప్రపంచ బ్రాండ్లు మన సంస్కృతిని   సొమ్ము చేసుకుంటున్నాయి. విచారకరం!  అంటూ  గోయెంకా  రాసుకొచ్చారు.

ఈ హై-ఎండ్‌ ఫ్యాషన్ చప్పల్స్‌ని ప్రీమియం మెటీరియల్స్, ఇండియన్ డిజైన్‌తో రూపొందించినట్టు  ప్రాడా ప్రకటించింది. అయితే ఇండియాలో  షోలాపూర్‌ చెప్పులను పోలి ఉన్న ఈ చెప్పుల ధర  భారీ లగ్జరీగా ఉండటంతో నెటిజన్లు  విస్తుపోయిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement