బెంగళూరు దుర్ఘటనపై స్పందించిన ఆర్సీబీ యాజమాన్యం | RCB Release Apology Letter Following Unfortunate Turn Of Events At Chinnaswamy Stadium, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

బెంగళూరు దుర్ఘటనపై స్పందించిన ఆర్సీబీ యాజమాన్యం

Jun 5 2025 10:25 AM | Updated on Jun 5 2025 10:37 AM

RCB Release Apology Letter Following Unfortunate Turn Of Events At Chinnaswamy Stadium

నిన్న (జూన్‌ 4) జరిగిన బెంగళూరు దుర్ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం స్పందించింది. ఊహించని ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ మీడియా లేఖను విడుదల చేసింది. ఈ దురదృష్టకర ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యామని తెలిపింది. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది. అభిమానులు, బెంగళూరు ప్రజల భద్రత, శ్రేయస్సు తమకు ముఖ్యమని పేర్కొంది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌తో కలిసి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

కాగా, ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఊహించని రీతిలో రెండు లక్షలకు పైగా అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మంది​కి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై యావత్‌ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement