RCB
-
ఆ రోజు ఏం జరిగింది?
బనశంకరి(కర్ణాటక): ఈ నెలారంభంలో ఆర్సీబీ జట్టు సంబరాల సమయంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద సంభవించిన తొక్కిసలాట దుర్ఘటనలో బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ జగదీశ్ మెజస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. బుధవారం 14 మంది క్షతగాత్రుల వాంగ్మూలం నమోదు చేశారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోగా, 50 మందికి పైగా గాయపడడం తెలిసిందే. కలెక్టర్ పిలుపుతో కేజీ రోడ్డులోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పలువురు బాధితులు గాయాలతోనే వచ్చారు. ఆ రోజు ఏం జరిగింది అని ఒక్కొక్కరి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. స్టేడియం అంటే భయం మోనీశ్ అనే క్షతగాత్రుడు మాట్లాడుతూ.. కలెక్టర్ నోటీస్ ఇవ్వడంతో వచ్చానని, ఘటన గురించి ప్రశ్నలు అడగడంతో సమాధానం ఇచ్చానని తెలిపారు. దుర్ఘటనకు ఆర్సీబీ మేనేజ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఉందని, ఒకేసారి రెండుచోట్ల కార్యక్రమం ఏర్పాటు చేయకుండా ఉండాల్సిందన్నారు. రెండురోజులు తరువాత వేడుకలు జరపాల్సిందన్నారు. విధానసౌధ వద్ద ఎక్కువమంది పోలీసులు ఉండగా, స్టేడియం వద్ద తక్కువ సంఖ్యలో నియమించారు. ఇకపై స్టేడియంలో మ్యాచ్ చూడాలంటే భయం వేస్తుందని వాపోయాడు. ముందుగా టికెట్లు ఇచ్చినట్లయితే ఈ దుర్ఘటన జరిగేది కాదని అన్నారు. మరోవైపు నూతన పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించారు. తొక్కిసలాటలు జరిగిన గేట్ల వద్దకు వెళ్లి సమాచారం సేకరించారు. -
సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం
సాక్షి, బెంగళూరు: సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 5న ఎం చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ అభిమానుల తొక్కిసలాటలో 11మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తొక్కిసలాట మరణాలపై జవాబుదారీతనం, ఈ సంఘటనను ప్రభుత్వం నిర్వహించిన తీరు, దాని పర్యవసానాల గురించి పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది.ఐపీఎల్-18లో ఆర్సీబీ విజయం సాధించింది. ఇందులో భాగంగా జూన్ 5న ఆర్సీబీ టీం విజయోత్సవ వేడుకలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగాయి. అయితే, ఈ వేడుకలు విషాదానికి దారితీశాయి. తమ అభిమాన క్రికెటర్లను వీక్షించేందుకు పరిమితి మించి పబ్లిక్ రావడం, తగు చర్యలు తీసుకోకపోవడంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు.. కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఘటనకు గల కారణాలు, భవిష్యత్తులో మరోసారి ఈ తరహా విషాదాలు భవిష్యత్తులో చోటు చేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. జూన్ 10న కేసు విచారణ చేపట్టింది.ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తరుఫు వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్(ఏజీ)ను పలు ప్రశ్నలు సంధించింది. తొక్కిసలాట ఘటనపై విచారణను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) నుంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)కి బదిలీ చేసింది. సీసీబీ ఇప్పటికే నిందితుణ్ని అరెస్ట్ చేసింది.కర్ణాటక ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు తొమ్మిది ప్రశ్నలు 1.ఆర్సీబీ సెలబ్రేషన్స్ నిర్వహించాలని ఎప్పుడు? ఎక్కడ నిర్ణయం తీసుకున్నారు? 2.ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?3.పబ్లిక్ని,క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?4.ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు స్టేడియం దగ్గర మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేశారు?5.వేడుక జరిగే సమయంలో ఎంతమంది ఉండవచ్చు అనే దానిపై ముందస్తుగా ఏదైనా అంచనా వేశారా? 6.గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందించారా? లేకపోతే ఎందుకు?7. గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి ఎంత సమయం పట్టింది?8.ఈ తరహా వేడుకలు నిర్వహణ సమయంలో 50వేలు అంతకంటే ఎక్కువ మంది జనసమూహాన్ని నిర్వహించడానికి ఏదైనా ఎలాంటి విధానాన్ని అవలబించారు? రూపొందించబడిందా?9. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏదైనా అనుమతి కోరారా?ఈ ప్రశ్నలకు ప్రభుత్వం తన సమాధానాలను సీల్డ్ కవర్లో అందించాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కర్ణాటక ప్రభుత్వం తరుఫున ఏజే కోర్టులో తన వాదనల్ని వినిపించారు. నిందితులు తమ అరెస్టుల చట్టబద్ధతను సవాలు చేయడానికి, ఉపశమనం పొందడానికి దర్యాప్తు, అరెస్టు సంస్థల మధ్య వ్యత్యాసాన్ని ఉదహరిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా తొక్కిసలాటపై బహిరంగ కోర్టులో మరిన్ని వివరాలను వెల్లడించలేమని అన్నారు.సోమవారం, తొక్కిసలాటకు సంబంధించి అరెస్టయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతినిధి నిఖిల్ సోసలే తన అరెస్టు చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు. ఈవెంట్ నిర్వహించిన డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్లో సీఎం సిద్ధరామయ్యతో సహా పలువురు ప్రముఖుల్ని కార్యక్రమానికి ఆహ్వానించారని పేర్కొంది. వాటికి స్పందించేందుకు ఏజే సమయం కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది. Shocking visuals from RCB event — people carried off after stampede, organisers failed miserably. pic.twitter.com/6RqfONWjDJ— South Asian Digest (@SADigestOnline) June 4, 2025 -
అమ్మకానికి ఆర్సీబీ..?
గత కొన్ని రోజులుగా ఆర్సీబీ అభిమానులు మిశ్రమ అనుభవాలను ఎదుర్కొంటున్నారు. జూన్ 3న ఆ జట్టు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తమ తొలి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ గెలుపును ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ అభిమానులు అవథుల్లేకుండా ఎంజాయ్ చేశారు. అయితే ఆ మరుసటి రోజే ఓ ఊహించని ఘటన ఆర్సీబీ అభిమానులను కృంగదీసింది. విజయోత్సవాల్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన నుండి తేరుకోకఉందే ఆర్సీబీ అభిమానులకు మరో షాకింగ్ వార్త తెలిసింది. ఈ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు ఓ ప్రముఖ దినపత్రిక తమ కథనంలో పేర్కొంది. సదరు కథనం ప్రకారం, ఆర్సీబీ చేతులు మారే అవకాశం ఉంది. ప్రస్తుత యాజమాన్యం (డియాజియో అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్) ఆర్సీబీని సుమారు 2 బిలియన్ డాలర్లకు విక్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఎందుకు విక్రయించాలని అనుకుంటుందంటే..?ఆర్సీబీకి భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ప్రజాదరణ ఉంది. ఈ ఫ్రాంచైజీ ఒక్కసారే టైటిల్ గెలిచినా (అది కూడా ఈ ఏడాదే) ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బ్రాండ్లలో ఒకటిగా చలామణి అవుతుంది. దీన్నే ప్రస్తుత యాజమాన్యం క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఫ్రాంచైజీ యొక్క పెరుగుతున్న విలువను ఉపయోగించుకుని ఎక్కువ భాగం కాకపోయినా, కొన్ని వాటాలైనా విక్రయించాలని యునైటెడ్ స్పిరిట్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తద్వారా యునైటెడ్ స్పిరిట్స్ భారీగా లబ్ది పొందే అవశామున్నట్లు సమాచారం. యునైటెడ్ స్పిరిట్స్ ఆర్సీబీని విక్రయించడానికి మరో కారణం కూడా ఉండొచ్చని తెలుస్తుంది. గత కొన్ని సీజన్ల నుండి బీసీసీఐ పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ కంటెంట్ ప్రకటనలపై అనేక ఆంక్షలు విధించింది. దీని వల్ల యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తుల యొక్క ప్రచారం కష్టతరం అవుతుంది. ఇది తమ కంపెనీ వృద్ధికి ఆటంకం కలిగిస్తుందని యునైటెడ్ స్పిరిట్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆందోళనలో ఫ్యాన్స్ఇదిలా ఉంటే, యాజమాన్యం చేతులు మారే ప్రచారం మొదలైనప్పటి నుంచి ఆర్సీబీ అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వారు ఎంతగానో ఇష్టపడే ఆర్సీబీ పేరు మారుతుందేమోనని దిగాలు పడుతున్నారు.విజయ్ మాల్యా నుంచి చేజిక్కించుకున్న డియాజియోఆర్సీబీకి భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యా పురుడు పోశాడు. వేర్వేరు కారణాల వల్ల మాల్యా తన స్పిరిట్స్ వ్యాపారాన్ని డియాజియోకు విక్రయించడంతో వారి భారత విభాగం 'యునైటెడ్ స్పిరిట్స్' ఆర్సీబీ యాజమాన్యాన్ని చేజిక్కించుకుంది. డియాజియో గురించి చెప్పాలంటే.. ఇది 1997లో స్థాపించబడిన బ్రిటిష్ కంపెనీ. ఈ బ్రాండ్ ఆల్కహాలిక్ మరియు నాన్ ఆల్కహాలిక్ పానీయాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ. -
బామ్మ కోరిక నెరవేర్చిన ఆర్సీబీ స్టార్
ఆర్సీబీ స్టార్ బ్యాటర్, ఇంగ్లండ్ ఆల్రౌండర్ జేకబ్ బేతెల్ ఓ ముసలి మహిళా అభిమాని కోరిక తీర్చాడు. వెస్టిండీస్తో నిన్న (జూన్ 8) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ యువకుడు తన బామ్మ కోసం ఓ సిక్స్ కొట్టాలని బేతెల్ను కోరాడు. అడిగిందే తడువుగా బేతెల్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో (రెండో బంతి) సిక్సర్ కొట్టి బామ్మ కోరిక నెరవేర్చాడు. అల్జరీ జోసఫ్ వేసిన ఆ ఓవర్లో అంతకుముందు బంతికి కూడా బేతెల్ సిక్సర్ బాదాడు. అదే ఓవర్లో ఐదో బంతిని కూడా సిక్సర్గా మలిచిన బేతెల్, చివరి బంతికి ఔట్ కావడం కొసమెరుపు. ఈ మ్యాచ్లో బేతెల్ ఆడిన ఇన్నింగ్స్ ఛేదనలో ఇంగ్లండ్ గెలుపుకు దోహదపడింది. ఈ ఇన్నింగ్స్లో బేతెల్ 10 బంతులు ఆడి 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 26 పరుగులు చేశాడు. తద్వారా విండీస్ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. జాన్సన్ ఛార్లెస్ (47), షాయ్ హోప్ (49) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఇన్నింగ్స్ చివర్లో రోవ్మన్ పావెల్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (1 బంతిలో 6 పరుగులు (నాటౌట్)) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.పావెల్, షెపర్డ్, హోల్డర్, ఛేజ్ విజృంభించడంతో విండీస్ చివరి 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు చేసింది. ఆదిల్ రషీద్ వేసిన 19 ఓవర్లో హోల్డర్, షెపర్డ్ ఊచకోత కోశారు. ఈ ఓవర్లో ఇరువురు కలిసి 5 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆ ఓవర్లో 31 పరుగులు వచ్చాయి. అంతకుముందు 17 ఓవర్లో 20, 18వ ఓవర్లో 8, ఆఖరి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి.అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలిచింది. బెన్ డకెట్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు), బేతెల్ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్లు), టామ్ బాంటన్ (11 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్లు సిరీస్ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది. సిరీస్లోని చివరిదైన మూడో టీ20 మంగళవారం సౌతాంప్టన్లో జరుగుతుంది. -
నన్ను రమ్మని పిలిచారు అంతే.. నాకు ఇంకేమీ తెలీదు: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025 టైటిల్ను గెలిచిన సందర్భంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ల సన్మానం కార్యక్రమం.. పెను విషాదాన్ని మిగిల్చింది. గతవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ ఈవెంట్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృత్యువాత పడగా, 48 మంది వరకూ గాయపడ్డారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ ధ్వజమెత్తింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా అది ప్రభుత్వ వైఫల్యం అని విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. దీనిపై తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘ఆర్సీబీకి సంబంధించిన ఈవెంట్ను తాము నిర్వహించలేనప్పుడు ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుందని అంటున్నారు. ‘నన్ను ఆ ఈవెంట్కు రమ్మని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) ఆహ్వానించింది. నా వద్దకు వచ్చి మరీ కేఎస్సీఏ పెద్దలు నన్ను ఆహ్వానించారు. గవర్నర్ కూడా ఆ ఈవెంట్కు వస్తున్నారని నాకు చెప్పారు. నేను కూడా ఆ ఈవెంట్కు వెళ్లా. అంతేకానీ మేము ఆ ఈవెంట్ను నిర్వహించలేదు. నన్ను రమ్మన్నారు.. వెళ్లాను.. అంతకుమించి నాకైతే ఏమీ తెలీదు’ అని స్పష్టం చేశారు. ఆ కార్యక్రమాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఐపీఎల్ టైటిల్ను సాధించాలనే చిరకాల కోరిక ఆర్సీబీకి ఎట్టకేలకు లభించడంతో ఆ జట్టును ఘనంగా సన్మానించాలనుకున్నారు. దాంతో ఆదరా బాదరగా ఈవెంట్ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. లక్షల్లో అభిమానల హాజరుకావడంతో ఆ ఈవెంట్ కాస్తా విషాదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కేఎస్సీఏలతో పాటు కర్ణాటక ప్రభుత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ టీమ్ పెద్ద ఈవెంట్ను నిర్వహిస్తంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ విమర్శల వర్షం కురిసింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు సంజాయిషీలు ఇస్తూనే వస్తున్నారు. -
ఆర్సీబీలోకి బుమ్రా, సూర్యకుమార్, పంత్: విజయ్ మాల్యా డ్రీమ్ టీమ్
ఐపీఎల్-2025 ఛాంపియన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించిన ఆర్సీబీ.. తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి టైటిల్ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ యాజమాని విజయ్ మాల్యా పేరు తెరపైకి వచ్చింది.ఎందుకంటే ఆర్సీబీకి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ గుర్తింపును తీసుకురావడంలో ఆయనది కీలక పాత్ర. ఐపీఎల్ ఆరంభం వేలంలో విరాట్ కోహ్లిని కూడా ఆర్సీబీ సొంతం చేసుకోవడం మాల్యా నిర్ణయమే. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ క్రికెటర్లను తమ జట్టులోకి తీసుకు రావడానికి ఆయన కృషి చేశారని క్రికెట్ నిపుణులు ఇప్పటికి అభిప్రాయపడుతుంటారు. ఆర్సీబీ తొలి టైటిల్ విజయనంతరం మాల్యా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ క్రమంలో తాజాగా రాజ్ షమానీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాల్యా తన ఆర్సీబీ డ్రీమ్ టీమ్ను ఎంచుకున్నాడు. ఇప్పటికిప్పుడు బెంగళూరు జట్టులోకి ఏ ప్లేయర్లను కొనుగోలు చేస్తారన్న ప్రశ్న మాల్యాకు ఎదురైంది."నాకు అవకాశం వస్తే.. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ను కొనుగోలు చేస్తాను. వీరి మినహా నాకు మరెవరూ అవసరం లేదు. ఈ నలుగురు ప్లేయర్లు జట్టులో ఉంటే చాలు, ట్రోఫీ ఈజీగా గెలవచ్చు" అని మాల్యా పేర్కొన్నారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న మాల్యా.. ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్నాడుచదవండి: French Open 2025: ఫ్రెంచ్ ‘క్వీన్’ కోకో.. ఫైనల్లో సబలెంకా ఓటమి -
రాష్ట్రాన్నిబట్టి న్యాయం మారుతుందా?
కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన ఘోర విషాదం క్రీడాభిమానులు అందరినీ విచారంలోకి నెట్టింది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో 18 ఏళ్ల ఎదురుచూపులు తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి కప్పు గెలవడంతో విజయోత్సవాలు జరిగాయి. అయితే జనం అంత స్థాయిలో వస్తారని ఊహించలేదో.. పోలీసుల నిర్లక్ష్యమో తెలియదు కాని 11 మంది నిండుప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనేక మంది గాయాలపాలయ్యరు. దీనిపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది. దీనిని స్వాగతించవచ్చు. కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరు జట్టు ప్రతినిధులను అరెస్టు కూడా చేసింది. సిటీ పోలీస్ కమిషనర్తో సహా ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది.ఈ ఘటన జరిగిన వెంటనే తెలుగు వారికి కొన్ని ఘటనలు గుర్తుకు వస్తాయి. రాజమండ్రి వద్ద పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కనీసం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అవ్వలేదు. అంత పెద్ద ఘటనపై అప్పట్లో న్యాయ వ్యవస్థ కూడా స్పందించలేదు. అంతేకాదు.. కందుకూరు, గుంటూరులలో జరిగిన టీడీపీ ర్యాలీలలో, తిరుపతి, సింహాచలం పుణ్యక్షేత్రాలలో జరిగిన ఘటనల్లో పలువురు మరణించినా తూతూ మంత్రపు చర్యలే జరిగాయి. న్యాయ వ్యవస్థ స్పందించినట్లు కనబడదు. పాలన, న్యాయ వ్యవస్థలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యవహరించవచ్చా?.బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట విషయానికి వస్తే, కొన్ని సందర్భాలలో ప్రజలు ఫ్రెంజీ అవుతారనిపిస్తుంది. చిత్రం ఏమిటంటే ఐపీఎల్ టోర్నమెంట్ జట్లలో స్థానికత నేతి బీరకాయ చందమే. బెంగుళూరు జట్టులో స్థానికులు లేదా కర్ణాటకకు చెందిన వారు అతి కొద్ది మంది. టోర్నీ మొత్తం వ్యాపారమే. క్రికెటర్లు కోట్ల రూపాయలకు అమ్ముడు పోతుంటారు. ఈ మొత్తాలు ఆట సమయంలో వారిని ఒత్తిడికి గురి చేస్తూంటాయి కూడా. బాగా ఆడలేకపోతే నిర్వాహకుల ఆగ్రహానికి గురవుతూంటారు. లక్నో జట్టుకు ఆడుతున్న సమయంలో కేఎల్ రాహుల్ను టీమ్ యజమాని బహిరంగంగా నిందించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇది కూడా ఒక కోణం. ఒక్కొక్క జట్టు రెండేసి సార్లు మరో జట్టుతో తలపడేలా ప్లాన్ చేశారు. పోటీల నిర్వహణ తీరును మనం తప్పు పట్టనక్కర్లేదు. సుమారు 18 ఏళ్లుగా దేశ ప్రజలను బాగా ఆకట్టుకున్న టోర్నీ ఇది. బెట్టింగులు కూడా జోరుగా సాగుతుంటాయని అంచనా. ఆటను ఆటగా చూడడం వరకు ఓకే కాని అది పిచ్చిగా మారకూడదు.బెంగుళూరు జట్టు గెలిచిన మాట నిజం. కానీ, అందులో ఎందరు ఆ నగరం లేదా రాష్ట్ర ప్లేయర్లు ఉన్నారు?. దానిని కూడా గమనించకుండా గెలిచిన జట్టును అభినందించడానికి వేలు, లక్షల సంఖ్యలో తరలి రావడం ఏమిటి?. ఫలితంగా తొక్కిసలాట జరగడం ఏమిటి?. అంతమంది మరణించడం ఏమిటి. కొన్ని యూరప్ దేశాలలో ఫుట్ బాల్ మ్యాచ్ తర్వాత ఘర్షణలు చోటు చేసుకుని అనేక మంది మరణించిన సందర్భాలు ఉన్నాయి. మన దేశంలో ఆ పరిస్థితి పెద్దగా కనిపించదు. అంతవరకు బాగానే ఉందనుకుంటే ఈ విజయోత్సవ కార్యక్రమం ప్రమాదం తెచ్చిపెట్టింది. ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు స్పందించి తొమ్మిది ప్రశ్నలు వేసి వివరంగా నివేదిక సమర్పించాలని కోరింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. నగర పోలీస్ కమిషనర్ దయానంద్, మరో ఐదుగురిని సస్పండ్ చేశారు. ఆర్సీబీ ప్రతినిధులను కూడా అరెస్టు చేశారు. యజమానులను అరెస్టు చేయాలని చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఒక థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి, ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఘటనలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి ఇందులో అర్జున్ తప్పు ఏ మేరకు ఉందన్న మీమాంస ఉంది. చంద్రబాబు గత టర్మ్లో రాజమండ్రి వద్ద పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు. ఆ తొక్కిసలాటకు కారణం చంద్రబాబు నాయుడు కుటుంబం. వీఐపీ ఘాట్ వద్ద కూడా సామాన్య ప్రజలకు కేటాయించిన ఘాట్లో స్నానం చేయడం, దానిని ప్రచార డాక్యుమెంటరీగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ చిత్రీకరించడం, ఆ క్రమంలో జనం పెరిగిపోయి గేట్లను ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట సంభవించడం జరిగింది.ఆ తర్వాత దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ కూడా మాయమైందని చెబుతారు. ఇంతమంది మృతి చెందిన ఘటనపై ఆనాటి న్యాయ వ్యవస్థ స్పందించలేదు. అలాగే పాలనా వ్యవస్థ కనీసం సీనియర్ అధికారులను కాదు కదా!.. ఒక్క కానిస్టేబుల్ ను కూడా సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే చంద్రబాబు చేసిన తప్పిదాలు కూడా బయటకు వస్తాయనే కదా! న్యాయ విచారణ కు ఆదేశం అంటూ ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో కమిషన్ వేశారు. ఆయనేమో ఇదంతా మీడియా ప్రచారం వల్ల అని తేల్చారు తప్ప చంద్రబాబు జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. దానిపై చాలా విమర్శలు వచ్చాయి. ఇక చంద్రబాబేమో ప్రమాదాలు ఎక్కడ జరగడం లేదు.. పూరీలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా.. అంటూ పుష్కరాల తొక్కిసలాట మరణాలను తక్కువ చేసే యత్నం చేశారు.అదే కాదు.. తిరుపతి శేషాచలం కొండలలో 20 మంది ఎర్ర చందనం కూలీలను ఎన్ కౌంటర్ చేస్తే కూడా న్యాయ వ్యవస్థ ఆశించిన రీతిలో స్పందించ లేదన్న విమర్శ ఉంది. ఆ కూలీలు తమిళులు కావడంతో అక్కడి ప్రభుత్వం వారికి పరిహారం ఇచ్చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం వారిని నేరస్తులుగా పరిగణిస్తే, ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వారిని గుర్తించింది. ఈ మధ్యనే తిరుపతి తొక్కిసలాట, సింహాచలం ఆలయ గోడ కూలిన ఘటనలపై న్యాయవ్యవస్థ సుమోటోగా తీసుకోలేదు. విశాఖపట్నంలో సుధాకర్ అనే డాక్టర్ తాగి రోడ్డుపై అల్లరి చేసి ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తుంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి పోలీస్ స్టేషన్కు తీసుకువెళితే అప్పట్లో హైకోర్టు ఏకంగా సీబీఐ విచారణకే ఆదేశించిందింది. అదేమీ తేలలేదు. అది వేరే విషయం.మరి కొద్ది రోజుల క్రితం తెనాలిలో ముగ్గురు దళిత, ముస్లిం యువకులను పోలీసులు నడిరోడ్డులో అరికాళ్లపై లాఠీలతో కొడుతూ హింసించి వీడియో తీస్తే న్యాయ వ్యవస్థ ఎందుకు అదే స్థాయిలో స్పందించలేదో తెలియదు. న్యాయ వ్యవస్థలు కొన్ని ప్రభుత్వాల పట్ల సానుకూల ధోరణితో, మరికొన్ని ప్రభుత్వాల పట్ల వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న భావన ప్రజలలో నెలకొంది. ప్రత్యేకించి ఏపీలో జగన్ టైమ్లో న్యాయ వ్యవస్థ స్పందించిన తీరుపై చాలా విమర్శలు వచ్చేవి. చంద్రబాబుకు ఎప్పుడో అరుదుగా తప్ప న్యాయ వ్యవస్థ నుంచి ఎలాంటి ఇబ్బందులు రావన్న భావన నెలకొంది. అలాగే ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలను బట్టి కాకుండా, ధర్మం, న్యాయాలను బట్టి వ్యవస్థలు స్పందించడం అవసరం అని చెప్పవలసి ఉంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బెంగళూరు విషాదం: పాపం.. ఆ 11 మంది
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి వివరాలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసింది. మృతుల్లో ఎక్కువగా ఇతర ప్రాంతాలవాసులు ఉన్నారు. చదువుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ బెంగళూరులో ఉంటున్నవారు ప్రాణాలు కోల్పోయారు. చిన్న వయసులోనే మృత్యువు బారిన పడ్డారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. కాగా, మృతుల తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 194 కింద కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. మృతుల వివరాలు దివ్యాన్షి (14), నివాసం.. యలహంక కట్టిగేనహళ్లిశివలింగ (17), యాదగిరి జిల్లా హూనిగేరి గ్రామంమనోజ్కుమార్ (18), తుమకూరు జిల్లా నాగసంద్ర గ్రామంచిన్మయ శెట్టి (19), బెంగళూరు దొడ్డకల్లసంద్రశ్రవణ్ కేటీ (20), చిక్కబళ్లాపుర జిల్లా కురటిహళ్లి గ్రామంపూర్ణచంద్ర (20) మండ్య జిల్లా రాయసముద్రభూమిక్ లక్ష్మణ్(21), ఎం.ఎస్.రామయ్య లేఔట్, బెంగళూరుఅక్షతా పాయ్ (26), ఉత్తర కన్నడ జిల్లా రవీంద్రనగరప్రజ్వల్(22), యలహంక న్యూ టౌన్సహన (23), కోలారు ఎస్.వీ.లేఔట్కామాక్షిదేవి (29), తమిళనాడు కోయంబత్తూరు జిల్లా ఉడుమాలపేట్దివ్యాన్షిఆర్సీబీ జట్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అన్నమయ్య జిల్లాకు చెందిన బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గురువారం మీడియాకు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం వండాడికి చెందిన బి.శివకుమార్, అశ్విని దంపతులు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ బెంగళూరులోని యలహంకలో స్థిరపడ్డారు. వారి కుమార్తె దివ్యాన్షి(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. దివ్యాన్షికి ఆర్సీబీ జట్టు అంటే ఎనలేని అభిమానం. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు ఆమె కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. కానీ తొక్కిసలాటలో దివ్యాన్షి ప్రాణాలు కోల్పోయింది. శివలింగ10వ తరగతి బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణుడైన శివలింగ, పాఠశాల నుంచి తన బదిలీ సర్టిఫికేట్ (TC) తీసుకోవడానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఆర్సీబీ అంటే అతడికి ఎంతో అభిమానం. తన ఫేవరేట్ ప్లేయర్లను చూసేందుకు వెళ్లి చిన్న వయసులోనే మరణించాడు. యాద్గిర్ జిల్లాలోని హోనిగెరె గ్రామానికి చెందిన అతడి తల్లిదండ్రులు బెంగళూరులో రోజువారీ కూలీలుగా ఉన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆశతో 10 సంవత్సరాల క్రితం బెంగళూరు వలస వచ్చారు. కొడుకు అకాల మరణంతో వారి జీవితం అంధకారమయం అయింది.భూమిక్ లక్ష్మణ్బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య లేఔట్లో ఉంటూ ఇంజినీరింగ్ చదువుతున్న భూమిక్ లక్ష్మణ్.. పది మంది స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియానికి వెళ్లాడు. తొక్కిసలాటలో స్నేహితుల నుంచి విడిపోయాడు. అదే అతడిని ఆఖరిసారిగా ప్రాణాలు చూడడం. హాసన్ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. తమ ఒక్కగానొక్క కొడుకు హఠాన్మరణం చెందడంతో భూమిక్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.మనోజ్ కుమార్బెంగళూరులోని హెబ్బాళ సమీపంలోని కెంపాపుర రెసిడెన్సీ కాలేజీలో బీబీఎం చదువుతున్న 18 ఏళ్ల మనోజ్ కుమార్ తల్లిదండ్రులు, సోదరితో కలిసి యలహంకలో ఉండేవాడు. తాను అభిమానించే ఆర్సీబీ జట్టు విజయోత్సవంలో పాలుపంచుకోవాలని వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. మనోజ్ తండ్రి దేవరాజ్ ఎన్టీ(45) పానీపూరి అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా ఎడెయూరు సమీపంలోని నాగసంద్ర గ్రామం.. దేవరాజ్ సొంతూరు. తన కొడుకు చనిపోయాడంటే అతడు నమ్మలేకపోతున్నాడు. పెద్ద చదువులు చదివి తమను ఉద్దరిస్తాడనుకున్న కొడుకు అర్థాంతరంగా తనువు చాలించడంతో మనోజ్ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.శ్రవణ్చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో బీడీఎస్ విద్యార్థి శ్రవణ్ కూడా ఉన్నాడు. కర్ణాటకలోని చింతామణికి చెందిన అతడు.. అంబేద్కర్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న 20 ఏళ్ల శ్రవణ్ అకాల మరణం చెందాడు.సహనబెంగుళూరులోని బాష్ కంపెనీలో ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్న సహన (23) సహోద్యోగులతో కలిసి విక్టరీ పరేడ్ వీక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. ఉపాధ్యాయులైన తల్లిదండ్రులతో కలిసి కోలారులోని ఎస్జి కాలనీలో నివాసం ఉండే సహన.. ఆర్సీబీ మీద అభిమానంతో చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి అశువులు బాసింది. తన పెద్ద కూతురైన సహనకు త్వరలో పెళ్లి చేయాలనుకున్నామని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని ఆమె తండ్రి సురేశ్ కుమార్ కన్నీటిపర్యంతమయ్యారు.చదవండి: కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టానుప్రజ్వల్ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగొస్తాడని ఆ తల్లిదండ్రులు ఎదురు చూశారు. కానీ అంతలోనే పిడుగు లాంటి వార్త వినాల్సి వస్తోందని వారు అస్సలు ఊహించలేదు. తొక్కిసలాటలో తమ కుమారుడు మరణించాడని తెలిసి ప్రజ్వల్ ఫ్యామిలీ శోకసంద్రంలో ముగినిపోయింది. 22 ఏళ్ల ప్రజ్వల్ ఇంటర్వ్యూ ముగిసిన చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి హఠాన్మరణం పాలయ్యాడు. దీంతో యలహంక న్యూ టౌన్ ప్రాంతంలోని అతడి నివాసంలో విషాద ఛాయలు అలముకున్నాయి.కామాక్షిదేవిఅమెజాన్లో పనిచేస్తున్న 29 ఏళ్ల కామాక్షిదేవి.. విరాట్ కోహ్లి అభిమాని. ఐపీఎల్ విజేత అయిన RCB విజయోత్సవంలో పాల్గొనేందుకు చిన్నస్వామి స్టేడియానికి వెళ్లిన ఆమె అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా ఉడుమాలపేట్ ఆమె స్వస్థలం. అక్షతా పాయ్, చిన్మయ శెట్టి, పూర్ణచంద్ర కూడా తొక్కిసలాటలో చనిపోయారు. -
బెంగళూరు తొక్కిసలాట.. విరాట్ కోహ్లిని అరెస్ట్ చేయండి..!
ఆర్సీబీ విజయోత్సవాల నేపథ్యంలో జరిగిన బెంగళూరు తొక్కిసలాట దారుణమైన మలుపు తీసుకుంది. సోషల్మీడియాలో కొందరు ఈ విషాద ఘటనకు విరాట్ కోహ్లిని బాధ్యున్ని చేస్తూ, అరెస్ట్కు డిమాండ్ చేస్తున్నారు. '#ArrestKohli' హ్యాష్ట్యాగ్ ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. బెంగళూరులో జరిగిన ప్రాణనష్టానికి విరాట్ కోహ్లీనే కారణమని ఓ వర్గం ఆరోపిస్తుంది. కోహ్లికి వ్యతిరేకంగా ట్విటర్లో 36 వేలకు పైగా ట్వీట్లు ఉన్నాయి. తమను చూడటానికి వచ్చి జనాలు ప్రాణాలు కోల్పోయారని తెలిసి కూడా కోహ్లి పట్టీపట్టనట్లు ఉన్నాడని చాలా మంది ఆరోపిస్తున్నారు. దుర్ఘటన విషయం తెలియగానే కోహ్లి బెంగళూరు వదిలి పారిపోయాడని అంటున్నారు. ఆర్సీబీ యాజమాన్యం చుట్టూ ఉచ్చుబిగుసుకున్న తరుణంలో కోహ్లి లండన్కు పారిపోవాలని చూస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కోహ్లి దేశం విడిచి పారిపోయేలోపు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ (పుష్ప-2 తొక్కిసలాట) అరెస్ట్ను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కోహ్లికి మానవత్వమే లేదని అంటున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కూడా ముందుకు రావడం లేదని అంటున్నారు. కోట్లకు కోట్లు సంపాదిస్తూ, బాధిత కుటుంబాలకు కనీస ఆర్దిక సాయం ప్రకటించలేదని దుయ్యబడుతున్నారు.మరోపక్క కోహ్లికి మద్దతుగా నిలుస్తున్న వారు కూడా ఉన్నారు. ఎవరూ కోరుకోని, ఊహించని ఘటనకు కోహ్లిని ఎలా బాధ్యున్ని చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కోహ్లి అరెస్ట్ను డిమాండ్ చేయడం మూర్ఖత్వమని అంటున్నారు. కోహ్లి దేశం విడిచి పారిపోతున్నాడనటానికి ఆధారాలు ఉన్నాయా అని నిలదీస్తున్నారు. కోహ్లి త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శిస్తాడని భరోసా ఇస్తున్నారు. అర్దిక సాయం ప్రకటించి చేతులు దులుపుకోవడం ఇష్టం లేకే, కోహ్లి ఎలాంటి ఆర్దిక సాయం ప్రకటించలేదని అంటున్నారు. కోహ్లి అంటే గిట్టని వారే ఈ రకమైన ప్రచారానికి పూనుకున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ విషయంలో కోహ్లికి మద్దతుగా నిలిచే వారంతా ముందుక రావాలని పిలుపునిస్తున్నారు. 11 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమరని అంటూనే, ప్రాణ నష్టాన్ని కోహ్లికి ఆపాదించడం కరెక్ట్ కాదని అంటున్నారు. కాగా, బెంగళూరు దుర్ఘటనకు సంబంధించి ఇవాళ (జూన్ 6) ఉదయం ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అరెస్టు చేశారు. ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.ఇదిలా ఉంటే, ఆర్సీబీ 18 ఏళ్ల ఐపీఎల్ జర్నీలో తొలిసారి టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్పై విజయం సాధించి, తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు గెలుపును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని భావించింది. ట్రోఫీ గెలిచిన మరుసటి రోజు బెంగళూరులో ఓపెన్ టాప్ బస్లో పరేడ్ నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే దీనికి పోలిసుల అనుమతి లభించకపోవడంతో చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమానికి పూనుంది. ఇది కాస్తా విషాదాంతంగా ముగిసింది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే లక్షల సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్ద గుమికూడారు. స్టేడియం లోపలికి వెళ్లడానికి ఉచిత పాస్లు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ఓ ప్రాంతం వద్దకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల యువకులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. -
బెంగళూరు దుర్ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై ధ్వజమెత్తిన గంభీర్
బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా (జూన్ 4న) జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా స్పందించాడు. మృతులకు సంతాపం తెలుపుతూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరుతున్న సందర్భంగా నిన్న బీసీసీఐ హెడ్ క్వార్టర్స్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో గిల్తో పాటు పాల్గొన్న గంభీర్ విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఇలా అన్నాడు. ముందుగా నేను రోడ్ షోలకు వ్యతిరేకం. 11 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు. విజయోత్సవాల కంటే జనం ప్రాణాలు ముఖ్యం. రోడ్ షో విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం లేకపోతే నిర్వహించకుండా ఉండాల్సింది. ఈ ఘటనకు ఆర్సీబీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి.గెలుపు సంబరాలు చేసుకోవద్దని నేను అనను. కానీ దానికీ ఓ పద్దతి ఉంటుంది. ఇతరుల ప్రాణాలు రిస్క్ అయ్యే విధంగా సంబరాలు ఉండకూడదు. ఇంత ప్రాణ నష్టం కలిగించిన రోడ్ షోలను భవిష్యత్తులో నిర్వహించకూడదు.కాగా, ఆర్సీబీ 18 ఏళ్ల ఐపీఎల్ జర్నీలో తొలిసారి టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్పై విజయం సాధించి, తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు గెలుపును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని భావించింది. ట్రోఫీ గెలిచిన మరుసటి రోజు బెంగళూరులో ఓపెన్ టాప్ బస్లో పరేడ్ నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే దీనికి పోలిసుల అనుమతి లభించకపోవడంతో చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమానికి పూనుంది. ఇది కాస్తా విషాదాంతంగా ముగిసింది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే లక్షల సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్ద గుమికూడారు. స్టేడియం లోపలికి వెళ్లడానికి ఉచిత పాస్లు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ఓ ప్రాంతం వద్దకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 13 నుంచి35 ఏళ్ల మధ్య వయసు గల యువకులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. -
కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను
యశవంతపుర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విగతజీవి అయ్యాడు. ఇంజనీరింగ్ చదువుతున్న భూమిక్ మృతితో తండ్రి తల్లడిల్లిపోతున్నారు. 100 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి భూమిక్ కోసం పెట్టానంటూ కొడుకు శవం వద్ద తండ్రి బోరుమంటున్న వీడియో అందరినీ కలిచివేస్తోంది.హాసన్ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. బెంగళూరులో ఉంటు ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. కాలేజీ స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియం వద్దకెళ్లి తొక్కిసలాటలో మరణించాడు. విక్టోరియా ఆస్పత్రిలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.పోస్టుమార్టం చేయొద్దుఎంతో ముద్దుగా పెంచాను. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని తండ్రి రోదించాడు. నా కొడుక్కి పోస్టుమార్టం చేయవద్దు, కోసి ముక్కలు చేయొద్దు అని ప్రాధేయపడ్డాడు. సీఎం, డీసీఎం వచ్చి పరామర్శిస్తారు, కానీ నా కుమారుడు రాడంటూ తండ్రి లక్ష్మణ బోరుమన్నాడు. అంబులెన్స్ లేని కారణంగా జీపులో భూమిక్ మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.కన్నీటి మధ్య అంత్యక్రియలుతుమకూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన మనోజ్ (20) అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య జిల్లాలోని కుణిగల్ తాలూకా ఎడెయూరు సమీపంలోని నాగసంద్ర గ్రామంలోని వారి తోటలో జరిగాయి. అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.బెంగళూరులోని హెబ్బాళ సమీపంలోని కెంపాపుర రెసిడెన్సీ కాలేజీలో బీబీఎం చదువుతున్న మనోజ్ యలహంకలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉండేవాడు. బుధవారం స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడ్డాడు.ప్రభుత్వానిదే బాధ్యత: మంత్రియశవంతపుర: తొక్కిసలాటకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీబీటీ మంత్రి ప్రియాంక ఖర్గే తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటన జరగిఉండరాదు, ఎక్కువమంది అభిమానులు రావడంతో జరిగింది.సరైన వ్యవస్థలను కల్పించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం నుంచి లోపం జరిగిన మాట వాస్తవమే, అంగీకరిస్తున్నాం అన్నారు. ఒక ప్లాన్ ప్రకారం కార్యక్రమంను నిర్వహించి ఉంటే బాగుండేదని అన్నారు. మంత్రి ప్రకటనను జేడీఎస్ ఎక్స్లో పోస్టు చేసింది.చదవండి: పెళ్లి చేసి పంపాలనుకున్నాం.. పాడె కట్టి సాగనంపారు -
తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన విచారణలో బెంగళూరు పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. సీఎం సిద్దరామయ్య ఆదేశాల మెరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మెనెజ్మెంట్పై చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను శుక్రవారం అరెస్టు చేశారు.ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.నిఖిల్ సోసాలేను పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి అరెస్ట్పై ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటివరకు ఇంకా స్పందించలేదు. కాగా బుధవారం (జూన్ 4) జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతిచెందారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు.ఇక ఈ ఘటనపై గురువారం విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం మండిపడింది. ఈ ఘటన వెనుక కారణాలను తేల్చాలని సిద్దరామయ్య సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సీఐడీ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఇప్పటికే బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్, డీసీపీ శేఖర్, ఇన్స్పెక్టర్ గిరీశ్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిందిచదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్కు కొత్త పేరు ఖరారు -
ప్రాణాంతక నిర్లక్ష్యం
హద్దులెరుగని అభిమానం, నిర్వాహకుల అంతులేని నిర్లక్ష్యం, తన బాధ్యతేమిటో పూర్తిగా మరి చిన ప్రభుత్వం... వెరసి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సాయంత్రం 11 నిండు ప్రాణాలు బలయ్యాయి. మరో 50 మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, అందులో అయిదుగురి స్థితి ఆందోళనకరంగా ఉన్నదంటున్నారు. దుర్మరణం పాలైన వారిలో ఎక్కువమంది టీనేజ్ వయస్కులు. ఎంతో భవిష్యత్తుగల యువత ప్రాణాలు ఇలా హఠాత్తుగా కడతేరిపోవటం వారి తల్లిదండ్రులకూ, తోబుట్టువులకూ మాత్రమే కాదు... సమాజం మొత్తానికి తీవ్ర దుఃఖం కలిగించే అంశం. ఒక కథనం ప్రకారం ఈ కార్యక్రమానికి రాయల్ చాలెంజెర్స్బెంగళూరు(ఆర్సీబీ), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ), డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థల్లో ఏ ఒక్కరూ అనుమతి తీసుకోలేదు! ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇప్పుడు సిటీ పోలీసు కమిషనర్నూ, డెప్యూటీ కమిషనర్నూ సస్పెండ్ చేశామంటున్నారు. మంచిదే. ఇతరుల మాటేమిటి? సెలబ్రిటీలు వచ్చినప్పుడూ, రాజకీయ సభలప్పుడూ, మతసంబంధ ఉత్సవాల సంద ర్భాల్లో భారీయెత్తున జనం గుమిగూడటం... తొక్కిసలాటలు, మరణాలు రివాజుగా మారాయి. కానీ ప్రభుత్వాలు, పోలీసులు నేర్చుకున్నదేమీ ఉండటం లేదని ఇవి పునరావృతం అవుతున్న తీరు చూస్తే తెలుస్తుంది. ఈ ఏడాది జనవరి మొదట్లోనే తిరుపతిలో టీటీడీ నిర్వాకం కారణంగా తొక్కి సలాటకు ఆరుగురు బలయ్యారు. ఆ నెలాఖరులో ప్రయాగ్రాజ్లో కుంభమేళా వద్ద ఇలాంటి దుర్ఘటనలోనే 30 మంది చనిపోయారు. ఆ మరుసటి నెలలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట వల్ల 18 మంది కన్నుమూశారు. ఎన్ని ప్రాణాలు పోతే ప్రభుత్వాలు మేల్కొంటాయి? సామాజిక మాధ్యమాల ప్రభావమేమిటో అందరికీ తెలుసు. వాటిల్లో ఆ కార్యక్రమం గురించి ఆర్బీసీయే విస్తృత ప్రచారం చేసింది. తామున్నచోటికి అభిమాన ఆటగాళ్లు రాబోతున్నారని యువత ఉవ్విళ్లూరటం అసాధారణమేమీ కాదు. మన దేశంలో క్రికెట్కు మరే క్రీడకూ లేనంత ఆకర్షణ ఉంది. విరాట్ కోహ్లీ వస్తున్నాడంటే అది మరిన్ని వందల రెట్లు పెరుగుతుంది. ఇవి చాలవా పకడ్బందీ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవటానికి? నిజానికి బెంగళూరు, దాని శివారు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే అభిమానుల కోలాహలం మొదలైందని, బుధవారం ఉదయం నుంచి అది క్రమేపీ పెరుగుతూ పోయిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇదంతా గమనించాక సాయంత్రం కార్యక్రమానికి అభిమానులు పోటెత్తుతారన్న అంచనా వుండొద్దా? బుధవారం వీధులన్నీ కిక్కిరిసిన వైనం గమనించి క్రికెటర్ల ర్యాలీని రద్దుచేసి కూడా 35,000 మందికి మాత్రమే సరిపడే స్టేడియంలో వేడుకలు సజావుగా ముగుస్తాయని ఎలా అనుకోగలిగారు? అందులోనూ ఈ కార్యక్రమానికి టిక్కెట్ విక్రయాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేవు. మొత్తానికి స్టేడియంకు వెళ్తే తమ అభి మాన క్రికెటర్లనూ, వారు గెల్చుకున్న కప్పునూ స్వయంగా చూడొచ్చన్న సందేశం ప్రచారమైంది. పర్యవసానంగా నియంత్రణకు అందని రీతిలో లక్షల సంఖ్యలో అభిమానులు గుమిగూడారు.కార్యక్రమం కోసం 5,000 మంది పోలీసులను మోహరించామని, అయినా ఈ విషాదం చోటు చేసుకున్నదని కంటతడి పెడుతూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు. పోలీసులు తమ శాయశాక్తులా విధులు నిర్వర్తించారని, దాదాపు మూడు లక్షలమంది రావటంతో విఫల మయ్యామని ఆయన వివరించారు. కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే భద్రతా ఏర్పాట్ల కోసం 1,000 మంది పోలీసుల్ని రంగంలోకి దించామని ప్రభుత్వ న్యాయవాది రాష్ట్ర హైకోర్టులో చెప్పారు. ఇది ప్రభుత్వ యంత్రాంగంలో నెలకొన్న అయోమయాన్ని సూచిస్తోంది. అసలు ఆ వేయి మందైనా ఉన్నారా అనే సంశయాన్ని కలగజేస్తోంది. ప్రత్యక్ష సాక్షులైతే పోలీసుల సంఖ్య మొదటి నుంచీ తక్కువేనంటున్నారు. ఇంతమంది గుమిగూడే సందర్భాల్లో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) సలహా తీసుకోవాలి. కానీ అదీ జరిగినట్టు లేదు. అసలు ఎవరు ఏ గేటువైపు వెళ్లాలో, ఎవరెక్కడ కూర్చోవాలో సూచించే బోర్డులు లేవు. మహిళలు, పిల్లల కోసమైనా విడిగా ప్రవేశద్వారం ఉండాలని నిర్వాహకులకు తోచలేదు. అభిమానుల్ని క్యూలో నియంత్రించేవారూ లేరు, పకడ్బందీ బ్యారికేడ్లూ లేవు. ఉన్న కొన్ని బ్యారికేడ్లూ తొక్కిసలాటలో ధ్వంసమయ్యాయి. ఇన్ని లోపాలు పెట్టుకుని ఊహించని స్థాయిలో జనం వచ్చిపడటంవల్లే ఇదంతా జరిగిందని చెబితే సరిపోతుందా? అసలు ఫైనల్ మ్యాచ్ జరిగిన 24 గంటలలోపే క్రికెటర్లకు నగరంలో సన్మానం చేయాలన్న తొందరెందుకు? అందుకోసం ఒకటి రెండు రోజుల వ్యవధి తీసుకుంటే జరిగే నష్టమేమిటి? జనం వేలంవెర్రిగా అభిమానించే క్రికెటర్లు వస్తున్నప్పుడూ, వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించాలనుకున్నప్పుడూ తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం వుంటుందన్న అంచనా లేకపోవటం సహించరానిది. అప్పుడెప్పుడో ఆఫ్రికా దేశాల్లోనూ, వర్తమానంలో పాలస్తీనాలోనూ రోజుల తరబడి పస్తులుండి అనుకోకుండా ఆహార పదార్థాలతో వచ్చిన వ్యాన్ కోసం జనం ఎగబడి తొక్కిసలాటలు చోటుచేసుకున్న ఉదంతాలున్నాయి. ప్రాణాలు నిలుపుకోవా లన్న వారి తాపత్రయాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వెర్రి అభిమానం కోసమో, విశ్వాసాల కోసమో ఎగబడటం, ప్రాణాలు కోల్పోవటం, ప్రభుత్వాలు తమ బాధ్యతేమీ లేదన్నట్టు ప్రవర్తించటం, మళ్లీ మరో విషాదం చోటుచేసుకునేవరకూ అంతా సవ్యంగా వున్నట్టు నటించటం ఎంతకాలం? కనీసం ఈ ఉదంతమైనా దేశంలో అందరి కళ్లూ తెరిపించాలి. ఇలాంటివి జరగనీయరాదని సంకల్పించాలి. -
రాష్ట్రమంతా చూసింది.. మమ్మల్ని క్షమించండి: డిప్యూటీ సీఎం
బెంగళూరు: ఐపీఎల్ టైటిల్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) గెలిచిన సందర్బంలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో తొక్కిసలాట(Bengaluru Stampede) జరిగి 11 మంది మృత్యువాత పడటంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకర సంఘటనగా పేర్కొన్న డీకే శివకుమార్.. దీనికి తమ ప్రభుత్వం తరఫున క్షమాపణలు తెలియజేశారు. ‘ఈ సంఘటనను రాష్టం అంతా చూసిందని, ఇది చాలా మనోవేదనకు గురి చేసే సంఘటనని, తొక్కిసలాట జరగడం పదకొండు మంది చనిపోవడం అత్యంత బాధాకరం. మేము ప్రజలకు క్షమాపణలు చెప్పడం తప్పిస్తే ప్రస్తుతం ఏమీ చేయలేము. ఆ విషాద ఘటన గురించి ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంఇ. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అక్కడ ఏం జరిగిందో అంతా చూశారు. దీన్ని రాజకీయం చేయడం మంచిది కాదు. ఇక్కడ జరిగింది వేరు.. రాజకీయం చేయాలనుకోవడం లేదు’ అని డీకే శివకుమార్ జాతీయ మీడియా చానల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ తొక్కిసలాటలో చనిపోయింది అంతా కూడా యువకులే. వారి జీవితాలు ఇలా అయినందుకు చాలా బాధగా ఉంది. అయితే గవర్నమెంట్ వైఫల్యంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని మీరు బావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇక్కడ ఎవర్ని బాధ్యుల్ని చేయాలని అనుకోవడం లేదన్నారు. ఈ ఘటనపై బీజేపీ అడుగుతున్న ప్రశ్నలకు తాము పారిపోవాలని అనుకోవడం లేదన్నారు డీకే శివకుమార్. ఈ ఘటనపై వారికి కచ్చితంగా సమాధానం చెబుతామన్నారు. ఇక ఈ ఈవెంట్కు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని పోలీస్ కమిషనర్ చెబుతుండగా, ఆర్సీబీ ఒక స్టేట్మెంట్తో బయటకు రావడంపై ప్రశ్నించగా, ఇప్పుడు దానిపై మాట్లాడదలుచుకోలేదన్నారు తాను కేవలం ఎంతో ముఖ్యమైన ప్రజల జీవితాల గురించే ఆలోచిస్తున్నానన్నారు డీకే శివకుమార్.బెంగళూరు పోలీస్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటుతొక్కిసలాట ఘటనపై బెంగళూరు సీపీపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. సీపీతో పాటు అడిషనల్ సీపీ, ఏసీపీ, డీసీపీలను సైతం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విచారణకు సీఐడీని ఆదేశించింది. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై హైకోర్టు ఆగ్రహంఆర్సీబీ, కేఎస్సీఏలకు షాక్ -
ఆర్సీబీ, కేఎస్సీఏలకు షాక్
బెంగళూరు: ఐపీఎల్ టైటిల్ను ఎట్టకేలకు గెలిచామన్న ఆనందం ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఆర్సీబీ టైటిల్ సాధించిన తర్వాత నిన్న(బుధవారం, జూన్ 4వ తేదీ) బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడ్డారు. దాంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకోవడమే కాకుండా హైకోర్టు వరకూ వెళ్లింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హైకోర్టు.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఏజీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేన్లపై కేసు బుక్ చేశారు కర్ణాటక పోలీసులు. ఈ తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసులు.. ఆర్సీబీ, కేఎస్సీఏలపై కేసు నమోదు చేశారు. అనంతరం దీన్ని క్రిమినల్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)కి అప్పగించారు. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా మేజిస్ట్రేట్ జి. జగదీషా కేఎస్సీఏ, ఆర్సీబీలకు నోటీసులు పంపనున్నారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై హైకోర్టు ఆగ్రహం -
పాండ్యా కుటుంబంలో 9 ఐపీఎల్ ట్రోఫీలు ఉంటాయని హార్దిక్కు చెప్పాను: కృనాల్
రెండు రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. జూన్ 3న జరిగిన ఫైనల్లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్పై గెలిచి, 18 ఏళ్ల ఐపీఎల్ ప్రస్తానంలో తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో కృనాల్ పాండ్యా అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన (4-0-17-2) చేసి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఫైనల్ మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. కృనాల్ 2017 సీజన్లో తొలిసారి ఫైనల్లో (RPSపై) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.ఈ సీజన్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తర్వాత కృనాల్ పాండ్యా యాంకర్ రవిశాస్త్రితో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. 11 ఏళ్లలో పాండ్యా ఫ్యామిలీలో 9 ఐపీఎల్ ట్రోఫీలు ఉంటాయని హార్దిక్కు చెప్పినట్లు రివీల్ చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు కృనాల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ స్థాయికి చేరడానికి హార్దిక్, నేను కఠోరంగా శ్రమించామని తెలిపాడు. కృనాల్కు వ్యక్తిగతంగా ఇది నాలుగో టైటిల్ కాగా.. హార్దిక్ ఇదివరకే 5 ఐపీఎల్ టైటిల్స్ సాధించాడు.2016లో కృనాల్ ఐపీఎల్ జర్నీ ముంబై ఇండియన్స్ తరఫున మొదలైంది. 2017, 2019, 2020 సీజన్లలో అతను ఆ ఫ్రాంచైజీ తరఫునే మూడు టైటిళ్లు గెలిచాడు. ఇప్పుడు ఆర్సీబీ తరఫున తన నాలుగో ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 34 ఏళ్ల ఈ బరోడా ఆఫ్ స్పిన్నర్ ఆర్సీబీ తరఫున తన నాలుగో ఐపీఎల్ టైటిల్ గెలవాలనుకున్నట్లు ఫ్రాంచైజీలో చేరిన మొదటి రోజే చెప్పాడు.హార్దిక్ విషయానికొస్తే.. 2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్.. ఆ ఫ్రాంచైజీ తరఫున 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిళ్లు గెలిచాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా 2022లో తన ఐదో టైటిల్ను సాధించాడు. పాండ్యా సోదరులు కలిపి 9 టైటిళ్లు గెలవడం చూస్తే ఐపీఎల్ టైటిల్స్ అంటే ఆ ఇద్దరికి ఎంత పిచ్చో అర్దమవుతుంది.ప్లేయర్లుగా అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్లు..రోహిత్ శర్మ-6 (డెక్కన్ ఛార్జర్స్, ముంబై)అంబటి రాయుడు-6 (ముంబై, సీఎస్కే)ఎంఎస్ ధోని-5 (సీఎస్కే)కీరన్ పోలార్డ్-5 (ముంబై)హార్దిక్ పాండ్యా-5 (ముంబై, గుజరాత్) -
కొడుకు మృతిపై తల్లడిల్లిన తల్లి : కన్నీటి పర్యంతమైన డిప్యూటీ సీఎం
ఐపీఎల్ 2025లో టైటిల్ దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవంలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బెంగళూరులోని విధాన సౌధా, చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సమయంలోఅనేక హృదయవిదారక దృశ్యాలు, కథనాలు అందర్నీ కలచి వేస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్ మీద పిచ్చితో, తమ అభిమాన క్రికెటర్లను చూడాలన్న ఆశతో వచ్చిన యువకులు ప్రాణాలు కోల్పోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురించేసింది. ఇది ఇలా ఉంటే "పోస్ట్మార్టం చేయకుండానే తన కొడుకు మృతదేహాన్ని ఇవ్వాలని బిడ్డను కోల్పోయిన తల్లి వేడుకుంది. దీనిపై ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DK Shivakumar) భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి బాధను అర్థం చేసుకోగలం. కానీ అది చట్టపరమైన ప్రక్రియ అంటూ శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.నిన్న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన తండ్రిని ఓదార్చడం ఎవ్వరి తరమూ కాలేదు. ‘‘కనీసం నా కొడుకు మృతదేహాన్ని నాకు ఇవ్వండి. పోస్ట్మార్టం చేయవద్దు, ముక్కలుగా కోయవద్దు..’’ అంటూ అధికారులను వేడుకున్నాడు. తనకు తెలియకుండానే వచ్చాడు..ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవ్వరొచ్చినా నా బిడ్డను తీసుకురాలేరు అంటూ కన్నీరుమున్నీరయ్యాడుకేంద్ర మంత్రి శోభా కరండ్లజే శివకుమార్ వెంటనే రాజీనామా చేయాలని తొక్కిసలాటపై దర్యాప్తు చేయడానికి హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. ఈ విషాదంపై బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కాగా సంఘటన జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పారు. 35వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియంలో భారీ జనసమూహం సరిపోలేదన్నారు. మరోవైపు ఊహించని దానికంటే సుమారు 8 లక్షల మంది జనం రావడంతోనే ప్రమాదం జరిగిందని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర తెలిపారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే ఈ విషయంపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ప్రకటించారు. -
బెంగళూరు దుర్ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఆర్సీబీ విజయోత్సవాల నేపథ్యంలో నిన్న (జూన్ 4) జరిగిన బెంగళూరు దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది.ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బుధవారం (జూన్ 4) ఆర్సీబీ విజయోత్సవాలు జరుపుకోవద్దని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా ఆర్సీబీ యాజమాన్యం పట్టించుకోలేదు. విజయోత్సవ వేడులు బుధవారానికి బదులు ఆదివారం (జూన్ 8) నిర్వహించుకోవాలని సూచించారు.టైటిల్ గెలిచిన మరుసటి రోజే వేడుకలు నిర్వహిస్తే అభిమానుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, ఇది తీవ్రమైన గందరగోళానికి దారి తీయవచ్చని హెచ్చరించారు. అయినా ఆర్సీబీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ఆదివారం వరకైతే విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని వాదించింది.వేడుకలు ఆదివారానికి వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదించారు. వేడి మీద వేడుకలు నిర్వహించకపోతే తమకు డ్యామేజ్ అవుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్సీబీ యాజమాన్యం వాదనతోనే ముందుకెళ్లింది.ఆర్సీబీ టైటిల్ను గెలిచిన మరు క్షణం నుంచే బెంగళూరు వీధుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. జట్టు విజయోత్సవాలు జరుపుకుంటున్న అభిమానులు తెగ హడావుడి చేశారు. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మానం జరుగుతుందని తెలియడంతో అభిమానులు భారీ సంఖ్యలో గుమికూడారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గుమికూడవద్దని పోలీసులు ముందే హెచ్చరించినా అభిమానులు వినలేదు. తొక్కిసలాట జరిగిన సమయంలో స్టేడియం చుట్టూ రెండు లక్షలకు పైగా జనం ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలి ఐపీఎల్ టైటిల్ సాధించడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొలుత ఆర్సీబీ యాజమాన్యం ఓపెన్ టాప్ బస్లో ఆటగాళ్ల ఊరేగింపుకు ప్లాన్ చేసింది. అయితే తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు వస్తాయని పోలీసులు వారించడంతో వెనక్కు తగ్గింది. తీరా చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్యాన కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తే, అది చివరికి విషాదాంతమైంది. -
ఆర్సీబీకి మాల్యా అభినందనలు.. ఎస్బీఐ ట్వీట్ వైరల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ను గెలుచుకోవడంతో కర్ణాటకలో సందడి నెలకొంది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించిన ఆర్సీబీ ఈ విజయంతో సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుతో పాటు దేశం అంతటా ఈ సంబరాలు జోరుగా సాగుతున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైన ట్వీట్ ఈ వేడుకల్లో ఆసక్తిగా నిలిచింది.భారత్లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి దేశం విడిచి వెళ్లిపోయిన వ్యాపారవేత్త, ఆర్సీబీ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతోపాటు పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆర్సీబీ జట్టును అభినందించిన మాల్యా ‘18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్స్ నిలిచింది. 2025 టోర్నమెంట్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆర్సీబీకి అభినందనలు! ఈ సారి కప్పు మనదే’ అని ట్వీట్ చేశారు. అదికాస్తా వైరల్గా మారింది. అందుకు అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు.RCB are IPL Champions finally after 18 years. Superb campaign right through the 2025 tournament. A well balanced team Playing Bold with outstanding coaching and support staff. Many congratulations ! Ee sala cup namde !!— Vijay Mallya (@TheVijayMallya) June 3, 2025‘దయచేసి ఈ శుభ సందర్భంగా కీర్తినగర్లోని ఎస్బీఐ బ్రాంచికి ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్లండి సర్..’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా మాల్యా ట్వీట్కు ఎస్బీఐ నుంచి వచ్చినట్లు ఉన్న రిప్లై (సర్, భారత్కు రండి. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం)ను జోడిస్తూ అందుకే ఎక్స్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు.That’s why I like X pic.twitter.com/hR3QIEwJWV— Harsh Goenka (@hvgoenka) June 4, 2025ఇదీ చదవండి: మస్క్ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రిఎస్బీఐ ట్వీట్ నిజమేనా?వైరల్గా మారుతున్న మాల్యా ట్వీట్కు వస్తున్న రిప్లైలు ఆసక్తిగా మారుతున్న తరుణంలో ఎస్బీఐ నుంచి వచ్చిన రిప్లైను ధ్రువీకరించాలని ఏఐ అసిస్టెంట్ గ్రోక్ను ఓ యూజర్ కోరాడు. దానికి ప్రతిస్పందనగా ఇది కల్పితమై ఉండొచ్చని గ్రోక్ సూచించింది. ఏదేమైనా #EeSalaCupNamde అనే హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండ్ అయింది. -
బెంగళూరు దుర్ఘటనపై స్పందించిన ఆర్సీబీ యాజమాన్యం
నిన్న (జూన్ 4) జరిగిన బెంగళూరు దుర్ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం స్పందించింది. ఊహించని ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ మీడియా లేఖను విడుదల చేసింది. ఈ దురదృష్టకర ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యామని తెలిపింది. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది. అభిమానులు, బెంగళూరు ప్రజల భద్రత, శ్రేయస్సు తమకు ముఖ్యమని పేర్కొంది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్తో కలిసి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.కాగా, ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఊహించని రీతిలో రెండు లక్షలకు పైగా అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 𝗢𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹 𝗦𝘁𝗮𝘁𝗲𝗺𝗲𝗻𝘁: 𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 𝗕𝗲𝗻𝗴𝗮𝗹𝘂𝗿𝘂We are deeply anguished by the unfortunate incidents that have come to light through media reports regarding public gatherings all over Bengaluru in anticipation of the team’s arrival this… pic.twitter.com/C0RsCUzKtQ— Royal Challengers Bengaluru (@RCBTweets) June 4, 2025 -
RCB: హైదరాబాద్లో తప్పిన ముప్పు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సన్మానం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొందరు చనిపోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోనూ ఇలాంటి ముప్పు తప్పింది. బుధవారం రాత్రి ఆర్సీబీ (RCB) జట్టు ఐపీఎల్ కప్పు గెలిచిన వెంటనే ట్యాంక్బండ్, తెలుగు తల్లి చౌరస్తా, అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్లతో పాటు అనేక ప్రాంతాలు క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. ద్విచక్ర వాహనాలపై ఫీట్లు చేస్తూ యువకులు కేరింతలు కొట్టారు. రహదారులపై పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు.ఎన్డీఆర్ మార్గ్, సచివాలయం, తెలుగుతల్లి చౌరస్తా ప్రాంతాల్లో కొందరు రెచ్చిపోయారు. అక్కడ ఆగిన వాహనాల పైకి ఎక్కి హంగామా చేశారు. ద్విచక్ర వాహనాల హారన్లు మోగిస్తూ, మితిమీరిన వేగంతో నడిపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు (Police) వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారులు అదనపు బలగాలను ఆ ప్రాంతాలకు పంపారు. వీళ్లు అక్కడ ఉన్న యువకుల్ని చెదరగొట్టి పరిస్థితుల్ని చక్కదిద్దారు. చదవండి: ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా -
బెంగళూరు విషాదం.. కమల్ హాసన్ ట్వీట్!
బెంగళూరులో జరిగిన విషాదంపై కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని పోస్ట్ చేశారు. ఈ ఘటన హృదయ విదారకంగా అనిపించిందని.. తీవ్రమైన బాధలో ఉన్నానని రాసుకొచ్చారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు.కాగా.. ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ నిర్వహించిన పరేడ్ విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియంలోకి ఒక్కసారిగా అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదిమందికి పైగా మృతి చెందారు. చాలామంది ఫ్యాన్స్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ బాధితులకు అండగా నిలవాలంటూ ట్వీట్ చేశారు.మరోవైపు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ ఇవాళే థియేటర్లలో విడుదలైంది. అయితే కన్నడ భాషపై ఆయన కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో కర్ణాటకలో రిలీజ్ చేయలేదు. ఇప్పటికే థగ్ లైఫ్ మూవీ కన్నడ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. Heart wrenching tragedy in Bangalore. Deeply distressed and my heart reaches out to the families of the victims in this moment of grief. May the injured recover soon.— Kamal Haasan (@ikamalhaasan) June 4, 2025 -
మాటలు రావడం లేదు.. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై విరుష్క
బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విక్టరీ పరేడ్ సెలబ్రేషన్స్ తీవ్ర విషాదాన్ని నింపాయి. బుధవారం నగరంలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ఆర్సీబీ స్టార్ప్లేయర్ విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మాటలు రావడం లేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది‘ అంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజీ స్పందించింది. ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. ‘‘చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల మేం తీవ్రంగా కలత చెందాం. ఈ మధ్యాహ్నం జట్టు రాకను అంచనా వేస్తూ బెంగళూరు అంతటా అభిమానులు భారీ ఎత్తున గుమిగూడారు. అయితే మీడియా ద్వారా మేం ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకున్నాం. ప్రతీ ఒక్కరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారికి ఆర్సీబీ సంతాపం తెలుపుతోంది. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ప్రాణ నష్టం మమ్మల్ని మరింత కలిచి వేసింది. ఈ సంఘటన గురించి మా దృష్టికి వచ్చిన వెంటనే మా కార్యక్రమాన్ని ఆపేసాం. స్థానిక అధికారుల మార్గదర్శకత్వం, సలహాలను పాటించే ఈ వేడుకలను నిర్వహించాం. అభిమానులంతా సురక్షితంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం.’’అని తెలిపింది. మరోవైపు ఇదే ప్రకటనను కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఐపీఎల్లో 18 ఏళ్ల నిరీక్షణ ఫలించి, ఆర్సీబీ తొలిసారి టైటిల్ కప్ కైవసం చేసుకోవడంతో అసంఖ్యాక అభిమానులు సంబరాల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. వాస్తవానికి ఆర్సీబీ యాజమాన్యం విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రకటించింది. అయితే, ఉదయం ఆలస్యంగా ట్రాఫిక్ పోలీసులు ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అప్పటికే భారీగా చేరుకున్న అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది. బుధవారం మధ్యాహ్నానికే విధానసౌధ, ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్ పరిసర ప్రాంతాలకు సుమారు రెండు లక్షల మంది అభిమానులు చేరుకున్నారని ఒక అంచనా. ఈ అంచనా పోలీసుల అంచనాని మించిపోయి వాళ్ల చేతులు దాటిపోయింది. అదే సమయంలో.. ఏడో నెంబర్ గేటు దగ్గర విపరీతమైన రద్దీ, ఫ్రీ టికెట్ పుకార్లు, వర్షం, స్టేడియంలో జనాల బరువుకు కాలువ పైకప్పు కుప్పకూలిపోవడం.. ఇలా ఒకేసారి అన్నింటితో పరిస్థితి అదుపుతప్పడంతో తీవ్రమైన తొక్కిసలాటకు కారణమైందని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఈ ఘటనకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) కారణమనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ఘటనపై కేఎస్సీఏ విచారం వ్యక్తం చేసింది. ’చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న దురదృష్ట ఘటనపై ఆర్సీబీ, కేఎస్సీఏ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.’అని ఓ ప్రకటనను విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయలు అందజేస్తామని కేఎస్సీఏ ప్రకటించింది. ఇక.. ఈ దుర్ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. అది తమ ఈవెంట్ కాదని, అయితే నిర్వహణలో లోపాలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ అన్నారు. "పూర్తి వాస్తవాలు తెలియకుండా నేను ఇప్పుడు ఎవరినీ నిందించదలచుకోలేదు. గత ఏడాది వెస్టిండీస్లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ముంబైలో బీసీసీఐ విజయోత్సవ సభ నిర్వహించినప్పుడు, స్థానిక క్రికెట్ సంఘం, ముంబై పోలీసులు, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి పక్కా ప్రణాళిక రచించాం. లక్షలాది మంది హాజరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అన్ని నిబంధనలు పాటించాం" అని సైకియా తెలిపారు. -
విపరీతంగా జనం రావడం వల్లనే..
సాక్షి, బెంగళూరు: ఊహించని విధంగా అశేషంగా జనం రావడంతో ఈ దుర్ఘటన జరిగిందని తొక్కిసలాటపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కావేరి నివాసంలో మీడియాతో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఆర్సీబీ విజయోత్సవ ంలో పాల్గొనేందుకు ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలు వచ్చారన్నారు. 35 వేల సీట్ల సామర్థ్యం ఉన్న చిన్నస్వామి స్టేడియానికి సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మంది అభిమానులు, ప్రజలు చేరుకోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. అభిమాన గణం ఒక్కసారిగా లోపలకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించినట్లు, 33 మంది గాయపడినట్లు వెల్లడించారు. మరో 14 మందికి అతి స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. ప్రభుత్వం తరఫున సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇంత మంది ఈ కార్యక్రమనికి వస్తారని అస్సలు ఊహించలేదని చెప్పారు. మృతులందరూ యువతేనని, ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. విచారణ జరిపిస్తాం: సీఎం ఇలాంటి దుర్ఘటన జరగాల్సినది కాదని, దీనిపై ఉన్నతస్థాయి విచారణ చేపడతామని, ఒకవేళ భద్రతా లోపం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. బెంగళూరు కలెక్టర్ నేతృత్వంలో మెజిస్టీరియల్ తనిఖీ జరుగుతుందన్నారు. విచారణకు 15 రోజులు గడువు ఇస్తానని, నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపక్షాల ధ్వజం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, బీజేపీ పక్ష నేత అశోక్లు ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. -
14 ఏళ్లకే నూరేళ్లు
బనశంకరి: ఐపీఎల్ కప్ సొంతం చేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం సిలికాన్ నగరంలో ఘోర విషాదాన్ని నింపింది. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ జట్టుకు సన్మానోత్సవం ఉండగా, కళ్లారా చూడాలని వేలాది మంది జనసాగరంలా తరలివచ్చారు. గేట్ –12 వద్ద వారిని నిలువరించడానికి పోలీసులు లాఠీచార్జీ చేయడం, జనం నలుదిక్కులా పరుగులు తీశారు, బ్యారికేడ్లను తోసివేసి గేట్లు విరగ్గొట్టి స్టేడియంలోకి చొరబడ్డారు.ఈ గందరగోళంలో తొక్కిసలాట సంభవించింది. ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ వెళ్లడంతో పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. అరుపులు, కేకలు, ఏడుపులు మిన్నంటాయి. ఏం జరుగుతోందో ఎవరికీ తెలియలేదు. అనేకమంది స్పహ తప్పి పడిపోయారు. దీంతో జనమే బాధితులను చేతుల మీద, భుజాల మీద ఎత్తుకుని అంబులెన్సుల కోసం పరుగులు తీశారు. ఏదో యుద్ధ ప్రాంతంలోని ఘోర కలిలా మారిపోయింది. అచేతనంగా పడిపోయిన కొందరికి సీపీఆర్ కూడా చేయసాగారు. బాధితులను సమీప బౌరింగ్, వైదేహి, మాల్య ఆస్పత్రులకు తీసుకెళ్లారు. బాలిక, యువతీ యువకులు కలిసి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామందికి కాళ్లు, చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చిన్న చిన్న గాయాలైన కొందరు చికిత్స తరువాత డిశ్చార్జి అయ్యారు. తమవారికి ఏమైందో తెలియక అనేకమంది బంధుమిత్రులు రోదిస్తూ పరుగులు తీశారు.శివమొగ్గలో బైకిస్టు మృతి శివమొగ్గ: శివమొగ్గ నగరంలో మంగళవారం రాత్రి యువకులు ఆర్సీబీ విజయోత్సవం జరుపుకొన్నారు. గోపి సర్కిల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఈ సమయంలో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎడాపెడా బాదడంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. కొంత మంది యువకులకు గాయాలయ్యాయి. అలాగే ఉషా నర్సింగ్ హోం సర్కిల్ సమీపంలో రెండు బైక్లు ఢీకొని ఓ బైకిస్టు దుర్మరణం చెందాడు, మరో ఇద్దరు యువకులు గాయపడి ఆస్పత్రిలో చేరారు.14 ఏళ్లకే నూరేళ్లు 14 ఏళ్ల దివ్యాంశి అనే బాలిక కూడా మరణించింది. 9వ తరగతి చదివే బాలిక తల్లిదండ్రులు శివకుమార్, అశి్వనితో కలిసి ఆర్సీబీ టీంని చూడాలని స్టేడియానికి వచ్చింది. తొక్కిసలాటలో చిక్కి చనిపోయింది.సీఎం పరామర్శ బౌరింగ్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య , హోంమంత్రి పరమేశ్వర్ చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వమే వైద్యఖర్చులను భరిస్తుందని తెలిపారు. కొందరు యువకులు మాట్లాడుతూ స్టేడియం వద్ద కనీస ఏర్పాట్లు లేవని, స్టేడియం లోపలికి వెళ్తామంటే గేట్లు తీయలేదని, పైగా పోలీసులు లాఠీలతో కొట్టడంతో జనం పరిగెత్తారని ఆరోపించారు. -
RCB విజయోత్సవంలో ఘోర విషాదం
-
తొక్కిసలాటపై రాజకీయ దుమారం.. సీఎం నోట కుంభమేళా మాట
సాక్షి, బెంగళూరు: గెలుపు సంబరాల్లో ఘోరం చోటుచేసుకుంది.. అభిమానుల కేరింతలు, కోలాహలంతో సందడిగా ఉన్న ప్రాంగణం ఒక్కసారిగా ఆర్తనాదాలతో మార్మోగింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాలకు అసంఖ్యాకంగా అభిమానులు తరలిరావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద పరిస్థితి అదుపుతప్పి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతిచెందగా 47 మంది గాయపడ్డారు. ఈ విషాదంపట్ల ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య... మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ), ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ కలిసి రూ. 5 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించాయి. మరోవైపు ఈ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పరస్పర రాజకీయ విమర్శలకు దిగాయి. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ‘‘ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. సరైన ప్రణాళిక లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందుకే ఈ ఘోరం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని ఆరోపిస్తోంది. ఇంకోవైపు.. జేడీఎస్ కీలక నేత, కేంద్ర మంత్రి కుమారస్వామి డిప్యూటీ సీఎం శివకుమార్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘క్రికెటర్లను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు ఎవరు వెళ్లారు?. ఈవెంట్కు డిప్యూటీ సీఎం మద్దతుదారులు ఎందుకు వచ్చారు?. అమాయకమైన అభిమానుల మృతికి బాధ్యత ఎవరు వహిస్తారు?’’ అని ప్రశ్నించారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్మీట్లో సీఎం సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన నోట కుంభమేళా తొక్కిసలాట ప్రస్తావన రావడం గమనార్హం.‘‘ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. సరైన ప్రణాళిక లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందుకే ఈ ఘోరం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని ఆరోపించింది. కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఖౌy్చ∙ఇజ్చి ్ఛnజ్ఛటటఆ్ఛnజ్చ uటu) విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా అధిక సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఇలాంటి తొక్కిసలాట ఘటనలు జరిగేవే. ఇంతకంటే దారుణమైనవి కూడా జరిగాయి. ఈ ఏడాది ఆరంభంలో.. మహా కుంభమేళాలోనూ ఇది జరిగింది. ఆ ఘటనలో 50 నుంచి 60 మంది చనిపోయారు కదా. అలాగని ఇప్పుడు జరిగిన ఘటన నుంచి తప్పించుకోవాలని మేం అనుకోం. ఇది ప్రభుత్వం నిర్వహించిన ఈవెంట్ కాదు. క్రికెట్ అసోషియేషన్ నిర్వహించింది. ఈవెంట్కు ప్రభుత్వం కేవలం అనుమతి మాత్రమే ఇచ్చింది. పూర్తి బందోబస్తును అందించింది. అయినప్పటికీ.. స్టేడియం కెపాసిటీ 35 వేలు అయితే.. మూడు లక్షల మంది వచ్చారు. ఘటనలో 11 మంది మరణించగా.. గాయపడిన వాళ్లంతా త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అదృష్టవశాత్తూ.. విధాన సౌధ వద్ద జనం గుమిగూడినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు అని సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ఈ ఏడాది మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించారని, 60 మంది గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏం జరిగిందంటే? ఆర్సీబీ అభిమానులు మంగళవారం రాత్రి నుంచే బెంగళూరులో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టు తమ హోం గ్రౌండ్లో అభిమానుల సమక్షంలో ఆనందం పంచుకోవాలని భావించింది. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి జట్టు సభ్యులు వచ్చారు. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేరుగా హెచ్ఏఎల్ విమానాశ్రయానికి వెళ్లి వారికి స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం ముందుగా విధాన సౌధ వద్ద కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ కార్యక్రమం సజావుగానే సాగింది. అక్కడి నుంచి ఓపెన్ టాప్ బస్సులో ‘విక్టరీ పరేడ్’తో చిన్నస్వామి స్టేడియానికి ఆటగాళ్లు చేరుకోవాల్సి ఉంది. అయితే.. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి పోటెత్తడంతో మైదానం పూర్తిగా నిండిపోయింది. అయినప్పటికీ బయట కూడా భారీగా ఫ్యాన్స్ నిరీక్షిస్తూ ఉండిపోయారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. భారీ సంఖ్యలో జనం గుమిగూడడంతో అక్కడ ఉన్న డ్రెయిన్ కూలిపోయింది. దీంతో ఆందోళనకు గురైన వాళ్లంతా చెల్లాచెదురుకాగా.. చివరకు ఇదే తొక్కిసలాటకు దారితీసింది. వారిని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ తోపులాటలో శ్వాస అందక కొందరు సొమ్మసిల్లారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించేందుకు కూడా వీల్లేని స్థితిలో అభిమానులు పోటెత్తారు. చివరకు క్షతగాత్రులను బౌరింగ్ ఆస్పత్రికి, వైదేహీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రణాళికా లోపమే కారణం?దాదాపు ఏడాది క్రితం భారత టి20 జట్టు వరల్డ్ కప్ గెలిచి వచ్చిన తర్వాత ముంబైలో ఓపెన్ టాప్ బస్సులో విజయయాత్ర జరిగింది. అయితే అంతటి మహానగరంలో కూడా ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా అధికారులు, పోలీసులు చక్కటి ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు ఆర్సీబీ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిజానికి టీమ్ మేనేజ్మెంట్ చాలా హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఫైనల్ జరిగిన 24 గంటల్లోపే బెంగళూరు వచ్చేసి ఇలాంటి ఈవెంట్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సన్నాహాలకు కనీస సమయం కూడా ఇవ్వకుండా ప్రోగ్రామ్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టీమ్ ఫ్యాన్స్కు పిలుపు ఇచ్చేసింది. మంగళవారం రాత్రి నుంచి ఇంకా గెలుపు ఆనందంలోనే ఉన్న అభిమానులకు ఈ కార్యక్రమం దానికి కొనసాగింపులా కనిపించి అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు. పోలీసులు చివరకు పరిస్థితిని వివరించి ఓపెన్ టాప్ బస్సు ర్యాలీ జరగకుండా నిలువరించినా... అప్పటికే పెద్ద నష్టం జరిగిపోయింది. ఒకవైపు తొక్కిసలాటతో మైదానం బయట పరిస్థితి విషాదం నెలకొన్నప్పటికీ మరోవైపు స్టేడియంలో వేడుకలు కొనసాగాయి. అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఆర్సీబీ అధికారులకు ఫోన్ చేసి వెంటనే కార్యక్రమం ఆగిపోయేలా చేశారు. జనాన్ని అదుపు చేయడం చాలా కష్టంగా మారిందని, పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. -
బెంగళూరు తొక్కిసలాట.. ఏ సమయంలో ఏం జరిగిందంటే..?
బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు సమాచారం. స్టేడియంలోకి ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. స్టేడియం గేట్ దగ్గర ఉన్న పైకప్పు కూలడంతో తొక్కిసలాట ప్రారంభమైందని తెలుస్తుంది. ఒక్కసారిగా ఫ్యాన్స్ స్టేడియంలోకి దూసుకురావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలో లాఠీచార్జ్ జరిగింది. స్టేడియం ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారికి బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బౌరింగ్ ఆసుపత్రిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బాధితులను పరామర్శించారు.తొక్కిసలాట దురదృష్టకరమని కర్ణాటక డిప్యూటీ సీఎం అన్నారు. అభిమానులను అదుపు చేయలేకపోయామని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు డీకే క్షమాపణ చెప్పారు.ఘోరం జరిగిందిలా..మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాలకు ఆర్సీబీ టీమ్ బెంగళూరుకు చేరింది4:47 విధాన సభ ప్రాంగణానికి ఆర్సీబీ టీమ్5:10కి భారీ వర్షంలోనే ఆర్సీబీ టీమ్కు సత్కారం5:16 చిన్నస్వామి స్టేడియం దగ్గర లాఠీచార్జ్5:16 భారీ కేడ్లు దూకిన ఫ్యాన్స్, తొక్కిసలాట5:30 ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరా5:47 స్టేడియం వద్దకు చేరుకున్న ఆంబులెన్స్5:50 ఎనిమిది మంది చనిపోయినట్లు ప్రకటన5:53 చేతులెత్తేసిన పోలీసులు6:01 పది మంది చనిపోయినట్లు ప్రకటన -
RCB Stampede: దూసుకొచ్చిన ఫ్యాన్స్ చేతులెత్తేసిన పోలీసులు
-
RCB సంబరాల్లో విషాదం.. ఏడుగురు మృతి
-
ఆర్సీబీ విజయోత్సవంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురి దుర్మరణం (ఫోటోస్)
-
ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం.. 11 మంది మృతి
బెంగళూరులో జరుగుతున్న ఆర్సీబీ విజయోత్సవ సంబురాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరగడంతో 11 మృతి చెందినట్లు తెలుస్తుంది. 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది.స్టేడియంలోకి ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. జనాలను అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారని తెలుస్తుంది. VIRAT GOAT KOHLI - A FRAME FOR AGES IN IPL HISTORY 🥺❤️ pic.twitter.com/dse03LdrOQ— Johns. (@CricCrazyJohns) June 4, 2025స్టేడియం బయట విషాద ఛాయలు అలుముకున్నా లోపల ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం మాత్రం యధాతథంగా కొనసాగింది. ఆర్సీబీ ఆటగాళ్లంతా వేదికపై వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 18 ఏళ్ల తమ ఐపీఎల్ టైటిల్ కలను సాకారం చేసినందుకు గాను ఆర్సీబీ ఆటగాళ్లకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.తొలుత ఆర్సీబీ యాజమాన్యం ఓపెన్ టాప్ బస్లో విక్టరీ పరేడ్ను ప్లాన్ చేసింది. అయితే ఈ సమస్యలను ముందే ఊహించి పోలీసులు విక్టరీ పరేడ్కు అనుమతి నిరాకరించారు. అయినా అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీగా చేరుకున్నారు. అభిమానులు ఈ స్థాయిలో తరలి రావడంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తుంది. కాగా, 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. నిన్న (జూన్ 3) జరిగిన 2025 సీజన్ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి టైటిల్ను కైవసం చేసుకుంది. 18 సీజన్ల ప్రస్థానంలో నాలుగు సార్లు ఫైనల్కు చేరిన ఆర్సీబీ నాలుగో ప్రయత్నంలో టైటిల్ కలను సాకారం చేసుకుంది. ఈ టైటిల్ కోసం ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా 18 సీజన్లు వేచి చూడాల్సి వచ్చింది. 18 ఏళ్లుగా ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ ఎట్టకేలకు 18వ ఎడిషన్లో టైటిల్ కలను సాకారం చేసుకున్నాడు. ప్రతి సీజన్కు ముందు ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ నమదే అంటూ ఎదురుచూసేవారు. ఎట్టకేలకు వారి కల కూడా 18వ ప్రయత్నంలో సాకారమైంది. -
IPL 2025 Final: శ్రేయస్ అయ్యర్ను ఎగతాళి చేసిన ఆర్సీబీ ఎక్స్ట్రా ప్లేయర్..?
17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. నిన్న (జూన్ 3) జరిగిన 2025 సీజన్ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. 18 సీజన్ల ప్రస్థానంలో నాలుగు సార్లు ఫైనల్కు చేరిన ఆర్సీబీ నాలుగో ప్రయత్నంలో చివరి మెట్టును దాటింది. ఈ టైటిల్ కోసం ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా 18 సీజన్లు వేచి చూడాల్సి వచ్చింది. 18 ఏళ్లుగా ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ ఎట్టకేలకు 18వ ఎడిషన్లో టైటిల్ కలను సాకారం చేసుకున్నాడు. ప్రతి సీజన్కు ముందు ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ నమదే అంటూ ఎదురుచూసేవారు. ఎట్టకేలకు వారి కల 18వ ప్రయత్నంలో సాకారమైంది.టైటిల్ గెలిచాక ఆర్సీబీ ఆటగాళ్లు ఉద్వేగభరితమైన సంబరాలు చేసుకున్నారు. విజయం ఖరారు కాగానే విరాట్ నెలకొరిగి కన్నీరు పెట్టుకోగా.. మిగతా ఆటగాళ్లంతా అతన్ని చుట్టుముట్టారు. ట్రోఫీ సెలబ్రేషన్స్ సందర్భంగా కెప్టెన్ పాటిదార్ విరాట్నే ట్రోఫీ లిఫ్ట్ చేయాల్సిందిగా కోరాడు. విరాట్ చిన్నపిల్లాడిలా మైమరచిపోయి సంబరాలు చేసుకున్నాడు. Swastik you can mock Shreyas Iyer's victory dance , but you can't replicate what he has achieved.Be humbled pic.twitter.com/ysRPubyUFI— RONIT. (@Hyperx96) June 3, 2025ఎక్స్ట్రా ప్లేయర్ స్వస్తిక్ చికారా విరాట్ను ఇంప్రెస్ చేసే క్రమంలో గంగ్నమ్ స్టయిల్ డ్యాన్స్ చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లి, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక శ్రేయస్ అయ్యర్ ఇదే తరహా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తాజాగా చికారా గంగ్నమ్ స్టయిల్ డ్యాన్స్ వేయడంతో శ్రేయస్ అయ్యర్ను ఎగతాళి చేశాడనే అభిప్రాయం కలుగుతుంది. ఆర్సీబీ వ్యతిరేకులు ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ సమయంలో చికారా శ్రేయస్ గురించి ఆలోచించకపోయి ఉండవచ్చు. కేవలం విరాట్ను ఇంప్రెస్ చేయడంలో భాగంగానే ఆ డ్యాన్స్ చేసి ఉండవచ్చు. ఈ సీజన్ ప్రారంభం నుంచి చికారా విరాట్ మెప్పు పొందడమే పనిగా పెట్టుకున్నాడు. విరాట్ ఎక్కడికెళ్లిన అతని పక్కనే చికారా ఉండేవాడు. 20 ఏళ్ల చికారాకు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. ఈ సీజన్లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. చికారాకు క్లీన్ హిట్టర్గా పేరుంది. భవిష్యత్తులో అతను విరాట్తో ఆడే అవకాశాలు లేకపోలేదు. విరాట్ మరికొన్ని సీజన్లు ఐపీఎల్ ఆడితే చికారా కల నెరవేరవచ్చు. -
కోహ్లి ఆర్సీబీ గెలుపుతో ఢిల్లీ పోలీసులు యువతకు సందేశం..!
ఏ విజయమైన స్ఫూర్తిని, చక్కటి సందేశాన్ని అందిస్తుంది. అంతేగాదు ఎందరో పరాజితుల్లో కొండంత ఆశలను నింపి..సాధనకు ఉపక్రమించేలా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే..గెలుపును అందుకోవడంపై గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఐపీఎల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులనే ఆశ్చర్యపరిచేలా ఆర్సీబీ ఘన విజయం అందుకుంది. ఎన్నాళ్లుగానో ఐపీఎల్లో విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి అందని ద్రాక్షలా ఉండిపోయిందో తెలిసిందే. ఎట్టకేలకు 18వ సీజన్లో ఆ కలను సాకారం చేసుకుంది ఆర్సీబీ. ఇక్కడ ఆర్సీబీ విజయం ఓ చక్కటి సందేశం తోపాటు స్ఫూర్తిని కూడా నింపింది. రావడం లేదు, అందుకోలేకపోతున్నా అన్న నిరాశ నిస్ప్రుహలకు ఒక్క గెలుపుతో చెక్పెట్టొచ్చని ఆర్సీబీ విజయంతో తేటతెల్లమైంది. ఓపికతో నిరీక్షించేవాడు ఎన్నటికైన విజయం అందుకుంటాడు. విసుగే చెందాక ప్రయత్నిస్తేనే విజయమనే నిధిని అందుకోగలమనే సామెతకు నిర్వచనంగా మారింది ఆర్సీబీ. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ తెరపడేలా ఘన విజయం అందుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మనం కూడా ఓటములతో సతమతమవుతున్నప్పుడూ..చుట్టూ ఉన్నవాళ్లు అస్సలు గెలుస్తావా అన్నట్లు చూసే చూపులు తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని ఓర్చుకుంటూ ఓపికతో లక్ష్యంపైనే ఫోకస్ పెట్టేవాడిని ఎన్నటికైనా విజయలక్ష్మీ వరిస్తుందనడానికి ఉదాహరణగా ఆర్సీబీ ఆటగాళ్లు నిలిచారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఈ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్నాడు. ఎట్టకేలకు 18వ సీజన్లో తన కలను సాకారం చేసుకున్నాడు. విచిత్రంగా విరాట్ జెర్సీ నంబర్ కూడా 18 కావడం మరింత విశేషం. చెప్పాలంటే విరాట్ కోహ్లి ఓపికకు దక్కే ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీ పోలీసులు ఓ విన్నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చూడండి విరాట్ కోహ్లీగెలుపు కోసం 18 ఏళ్లు వేచి ఉన్నాడు. అలాగే డ్రైవింగ్ చేసేందుకు 18 ఏళ్లు నిండే వరకు ఓపిక పట్టండి. అలా కాకుండా టీనేజర్లుగా ఉన్నప్పుడే త్వరపడి కన్నవాళ్లకు శోకం మిగల్చడం లేదా అవతల ప్రయాణికుల ప్రాణాలను పొట్టబెట్టుకుని నేరస్థులుగా మిగిలిపోవడం జరుగుతుంది అని తమ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేగాదు అందులో టీనేజర్లు చట్టబద్ధంగా డ్రైవింగ్ వయస్సు వచ్చే వరకు వేచి ఉండండి లేదంటే అసహనం తెచ్చిపెట్టే అనర్థాలకు బలైపోతారని క్యాప్షెన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. నిజంగా ఒక గెలుపు ఎన్నో రకాలుగా స్ఫూర్తిని నింపుతుందంటే ఇదే కదూ..!. View this post on Instagram A post shared by DelhiPolice (@delhi.police_official) (చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్టాపిక్గా హర్ష్గోయెంకా ప్రసంగం) -
జనసంద్రగా మారిన బెంగళూరు.. ఐపీఎల్ విజేత ఆర్సీబీకి ఘన స్వాగతం
బెంగళూరు నగర వీధుల జనసంద్రంగా మారాయి. ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఇవాళ మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. ఎయిర్పోర్ట్లో ఆర్సీబీ సభ్యులకు ఘన స్వాగతం లభించింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ బృంద సభ్యులంతా ప్రత్యేక బస్సులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసేందుకు బయల్దేరారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ 'విధాన సౌధ' ముందు సిద్దరామయ్య చేతుల మీదుగా ఆర్సీబీ సభ్యులకు సన్మానం జరుగనుంది. WHAT A WELCOME FOR RCB IN BENGALURU. pic.twitter.com/8KFfcxiWj4— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025విధాన సౌధకు వెళ్లే దారిలో ఆర్సీబీ అభిమానులు ఇసుకేస్తే రాలనంతగా ఉన్నారు. ఆర్సీబీ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనంపై పూల వర్షం కురుస్తుంది. ఆర్సీబీ, విరాట్ కోహ్లి నామస్మరణతో బెంగళూరు నగర వీధులు మార్మోగిపోతున్నాయి. ఆర్సీబీ బృంద సభ్యులు ప్రయాణిస్తున్న బస్సులో విరాట్ కోహ్లి ముందు కూర్చుకున్నాడు. విరాట్ బస్సు అద్దాల గుండా అభిమానులకు అభివాదం చేస్తున్నాడు. విరాట్ తన భార్య అనుష్కతో పాటు ఉన్నాడు.MASSIVE CROWD OUTSIDE CHINNASWAMY STADIUM...!!! 🙏👊 pic.twitter.com/hK7Hpbcmi8— Johns. (@CricCrazyJohns) June 4, 2025ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ జరగడం లేదు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసిన తర్వాత పోలీసులు విక్టరీ పరేడ్కు అనుమతిచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదలా ఉంచితే, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్ల సత్కార కార్యక్రమం జరుగనుంది. టికెట్, పాస్ ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని పోలీసులు చెప్పారు.🚨 KARNATAKA DEPUTY CM WELCOMING KOHLI & RCB TEAM 🚨 [ANI] pic.twitter.com/y6V338rWfx— Johns. (@CricCrazyJohns) June 4, 2025విరాట్ బృందానికి వెల్కమ్ చెప్పిన కర్ణాటక డీసీఎంబెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆర్సీబీ బృంద సభ్యులకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (డీసీఎం) డీకే శివకుమార్ ఘన స్వాగతం పలికాడు. డీకే విరాట్ కోహ్లికి ప్రత్యేకంగా పూలు ఇచ్చి స్వాగతం పలికాడు. డీకే విరాట్ను ఆర్సీబీ జెండాతో పాటు కర్ణాటక జెండా పట్టుకోవాల్సిందిగా కోరాడు. THE CROWD OUTSIDE VIDHANA SOUDHA FOR RCB 🤯 pic.twitter.com/13YK0AzpYz— Johns. (@CricCrazyJohns) June 4, 2025 -
IPL 2025: ఆర్సీబీ అభిమానులకు నిరాశ
ఇండియన్స్ ప్రీమియర్ లీగ్లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ చేజిక్కించుకుంది. నిన్న (జూన్ 3) జరిగిన ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్ను 6 పరుగుల తేడాతో ఓడించి తమ తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడినా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. చివరి బంతి వరకు పోరాడింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన పంజాబ్ టైటిల్ గెలవలేకపోయినా ప్రతి క్రికెట్ అభిమాని మనసును దోచుకుంది. యువ జట్టుతో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ అద్భుతంగా నడిపించాడు. వ్యక్తిగతంగా రాణించడంతో పాటు జట్టుకు మంచి మార్గదర్శిగా నిలిచాడు. మరోవైపు సీజన్ ప్రారంభం నుంచి పంజాబ్తో పోటీపడిన ఆర్సీబీ ఫైనల్లో తమ అనుభవాన్నంత రంగరించి టైటిల్ను చేజిక్కించుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ అభిమానుల 17 ఏళ్ల కల నెరవేరింది. ప్రతి సీజన్లో ఆ జట్టు అభిమానులు ఈ సాలా కప్ నమదే అంటూ ఎదురుచూసేవారు. ఎట్టకేలకు వారి కల 18వ ప్రయత్నంలో సాకారమైంది. 18 ఏళ్లుగా ఆర్సీబీకే ఆడుతున్న విరాట్ కోహ్లి కూడా ప్రతి సీజన్కు ముందు ఈ సాలా కప్ నమదే అనుకుంటూ బరిలోకి దిగేవాడు. ఎట్టకేలకు అతని కల కూడా ఈ సీజన్తో సాకారమైంది.18వ ప్రయత్నంలో టైటిల్ గెలిచాక ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవథుల్లేవు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సాధించిన టైటిల్ కావడంతో ప్రతి అభిమాని తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. టైటిల్ గెలిచాక ఆర్సీబీ అభిమానుల సంబురాలు అంబరాన్నంటాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అభిమానులు హడావుడి చేశారు. ఆర్సీబీ యాజమాన్యం ఈ రోజు బెంగళూరులో విజయోత్సవ ర్యాలీని ప్లాన్ చేసింది. ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ నిర్వహించాలని అనుకుంది. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందన్న కారణంగా విక్టరీ పరేడ్ను అనుమతివ్వలేమని ఆర్సీబీ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. పోలీసుల నిర్ణయంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.అయితే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సత్కార కార్యక్రమానికి మాత్రం అనుమతి లభించింది. అయితే ఇక్కడ కూడా పరిమితులతోనే కార్యక్రమం జరుపుకోవాలని సూచనలు అందాయి. టికెట్, పాస్ ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. -
బెంగళూరు విజయం.. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సెలబ్రేషన్స్ చూశారా?
ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో సంబురాలు మిన్నంటాయి. కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోహ్లీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత విజయం సాధించడంతో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆనందం పట్టలేకపోయింది. ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. అనంతరం కోహ్లీని కౌగిలించుకుని ఎమోషనలైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనుష్క శర్మ వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి కోహ్లీని హత్తుకుని ఓదార్చింది.(ఇది చదవండి: ఆర్సీబీ విజయం.. అత్తారింటికి దారేది సీన్తో లింక్!)అనుష్క గురించి కోహ్లీ మాట్లాడుతూ.. "అనుష్క నాకు అన్ని కష్టాల్లోనూ అండగా నిలిచింది. వందశాతం ఆర్సీబీకి మద్దతుగా ప్రతి మ్యాచ్కు వస్తోంది. ఈ విజయం అనుష్క శర్మ గర్వంగా భావిస్తుందని కోహ్లీ అన్నారు. తను నాతో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలిచింది. ఆమెకు బెంగళూరుతో చాలా అనుబంధం కలిగి ఉంది. ఎందుకంటే తను కూడా బెంగళూరు అమ్మాయి. అందుకే ఈ గెలుపు ఆమెకు కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ విజయంతో తను చాలా గర్వంగా ఉంది.' అని అన్నారు.After IPL win, Virat posed with Anushka, whom he always credits for his success.🔥🔥🔥🔥#iplfinal2025 #RCBvsPBKSfinal #ViratKohli #AnushkaSharma#RCBChampion #ABdeVilliers pic.twitter.com/NGubvamHav— Gagan Meena (@GaganMeena47) June 4, 2025Thank you Anushka Sharma for taking care of this Kid for us 😭❤️ thank you so being there every time he needed someone so strong who can control that storm in him Thank you for being our Lady luck ❤️RCB RCB RCB #AnushkaSharma #EeSalaCupNamde pic.twitter.com/MZpZ9glX6c— Rahul | 🇮🇳 (@TheGoatNDevil) June 3, 2025 -
ఆర్సీబీ విజయం.. అత్తారింటికి దారేది సీన్తో లింక్!
ఆర్సీబీ టీమ్ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి వరల్డ్ కప్ గెలిచినంత సంబురాలు చేసుకున్నారు. ముఖ్యంగా కోహ్లీ అభిమానుల సంబురాలు మిన్నంటాయి. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్ గెలవడంతో సినీ ప్రముఖులు సైతం అభినందనలు చెబుతున్నారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏకంగా డ్యాన్స్ చేస్తూ బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.అయితే ఆర్సీబీ విజయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. జియో హాట్స్టార్ తెలుగు తన ట్విటర్ వేదికగా బెంగళూరు విజయంపై ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఆర్సీబీ విజయాన్ని.. పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేదీ క్లైమాక్స్ సీన్తో పోల్చింది. రైల్వేస్టేషన్లో పవన్ కల్యాణ్ తన అత్తను చూసి భావోద్వేగానికి గురయ్యే వీడియోను పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఆర్సీబీ టీమ్ క్రేజ్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఇదెక్కడి సింక్రా మావ అంటూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. This part of my life, this little part, is called happiness. 🥹😭🏆#EeSaalaCupNamde #RCBvsPBKS #IPLFinal #Victory #JioHotstarTelugu pic.twitter.com/4k3rBcgLQ6— JioHotstar Telugu (@JioHotstarTel_) June 3, 2025 -
ఆర్సీబీ విజయంపై అల్లు అర్జున్ ట్వీట్.. అయాన్ ఫుల్ ఎమోషనల్!
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు టీమ్ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ క్షణం కోసమే 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని ట్విటర్ వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. వెయిట్ ఈజ్ ఓవర్.. ఈ సాలా కప్ నమ్దే అంటూ బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్సీబీ జట్టుకు, అభిమానులకు అభినందనలు తెలిపారు.ఆర్సీబీ మ్యాచ్ గెలిచన అనంతరం అల్లు అర్జున్ కుమారడు అయాన్ ఫన్నీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తాను కోహ్లీకి వీరాభిమానినని అయాన్ ఆనందం వ్యక్తం చేశాడు. తలపై వాటర్ బాటిల్తో నీళ్లు పోసుకుని బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసిన బన్నీ నవ్వుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫుల్లీ ఎమోషనల్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు ఐకాన్ స్టార్.కాగా.. గతేడాది పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాలకు కాస్తా విరామం ఇచ్చాడు. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయనున్నారు. ఇటీవలే పుష్ప-2 సినిమాకు ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డ్ అందుకున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) THE WAIT IS OVER . “Ee sala cup namde!” At last! ❤️We’ve been waiting for this day for 18 years.A big, big congratulations to RCB! ❤️ pic.twitter.com/2khiWPLWKV— Allu Arjun (@alluarjun) June 3, 2025 -
RCB vs PBKS: ఈసాలా కప్ నమ్దూ.. నెరవేరిన ఆర్సీబీ కల (ఫోటోలు)
-
RCB Vs PBKS: ఈ సాలా కప్ నమ్దు.. 18 ఏళ్ల కల.. ఏడ్చేసిన కోహ్లి
-
ఐపీఎల్ 2025 విజేత RCB.. 18 ఏళ్ల కల
-
IPL 2025: ఈ సాలా కప్ ఆర్సీబీదే.. ఫైనల్లో పంజాబ్పై ఘన విజయం
ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కల సాకారమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (జూన్ 3) జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. చివరి ఓవర్ను అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్ 3, ఒమర్జాయ్, విజయ్కుమార్ వైశాక్, చహల్ తలో వికెట్ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లినే టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్16, లివింగ్స్టోన్ 25, జితేశ్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇన్నింగ్స్ మధ్యలో ఒత్తిడికి లోనైన పంజాబ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఆఖర్లో శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) పంజాబ్ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే అప్పటకే మ్యాచ్ పంజాబ్ చేతుల్లో నుంచి జారి పోయింది. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రియాంశ్ ఆర్మ 24, ప్రభ్సిమ్రన్ సింగ్ 26, జోస్ ఇంగ్లిస్ 39, శ్రేయస్ అయ్యర్ 1, నేహల్ వధేరా 15, స్టోయినిస్ 6, ఒమర్జాయ్ 1 పరుగు చేసి ఔటయ్యారు.ఆర్సీబీ బౌలర్లులో కృనాల్ పాండ్యా (4-0-17-2) అద్బుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 2, యశ్ దయాల్, హాజిల్వుడ్, షెపర్డ్ తలో వికెట్ తీసుకున్నారు. VIRAT KOHLI IN TEARS - THE DREAM MOMENT FOR THE GOAT ❤️ pic.twitter.com/jPxUsccRUL— Johns. (@CricCrazyJohns) June 3, 2025ఈ గెలుపుతో ఆర్సీబీతో పాటు ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కల కూడా సాకారమైంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్న విరాట్ ఎట్టకేలకు 18వ సీజన్లో టైటిల్ కలను సాకారం చేసుకున్నాడు. విరాట్కు 18 నంబర్ మరోసారి కలిసొచ్చింది. విరాట్ జెర్సీ నంబర్ కూడా 18 అన్న విషయం తెలిసిందే. టైటిల్ గెలిచాక విరాట్ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. -
IPL 2025 Final: పంజాబ్పై ఆర్సీబీ విజయం
పంజాబ్పై ఆర్సీబీ విజయంఅహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (జూన్ 3) జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.ఓటమి దిశగా పంజాబ్16.4వ ఓవర్- పంజాబ్ ఓటమి దిశగా సాగుతుంది. 142 పరుగుల వద్ద ఆ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో సిక్సర్ బాదిన మరుసటి బంతికే స్టోయినిస్ (6) ఔటయ్యాడు. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్పంజాబ్ గెలుపుకు 24 బంతుల్లో 55 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. నేహల్ వధేరా (15), శశాంక్ సింగ్ (22) క్రీజ్లో ఉన్నారు. కష్టాల్లో పంజాబ్12.1వ ఓవర్- 98 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో బౌండరీ లైన్ వద్ద లివింగ్స్టోన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జోష్ ఇంగ్లిస్ (39) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్9.4వ ఓవర్- 79 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. రొమారియో షెపర్డ్ బౌలింగ్లో జితేశ్ శర్మ క్యాచ్ పట్టడంతో ఇన్ ఫామ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (1) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్8.3వ ఓవర్- 72 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్కు క్యాచ్ ఇచ్చి ప్రభ్సిమ్రన్ సింగ్ (26) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 70/1ప్రభ్సిమ్రన్ సింగ్ 25, జోష్ ఇంగ్లిస్ 16తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్4.6వ ఓవర్- 43 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో ప్రియాంశ్ ఆర్మ (24) ఔటయ్యాడు. టార్గెట్ 191.. 3 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 28/0ప్రభ్సిమ్రన్ 10, ప్రియాంశ్ ఆర్య 14200లోపు స్కోర్కే పరిమితమైన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 200లోపు స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్ను అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్ 3, ఒమర్జాయ్, విజయ్కుమార్ వైశాక్, చహల్ తలో వికెట్ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లినే టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్16, లివింగ్స్టోన్ 25, జితేశ్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ17.4వ ఓవర్-171 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో జితేశ్ శర్మ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ16.5వ ఓవర్- 167 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో లివింగ్స్టోన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లి ఔట్14.5వ ఓవర్- 131 పరుగుల వద్ద ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 35 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ విరాట్ను క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 103/3విరాట్ కోహ్లి 32, లివింగ్స్టోన్ 3మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రజత్ పటిదార్ 26(16) పరుగుల వద్ద జెమీసన్ బౌలింగ్లో ఔటయ్యారు.పది ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 87/2పది ఓవర్లలో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు సాధించింది. 9 ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 80/2ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు సాధించింది. కోహ్లీ 21(18), రజత్ పటిదార్ 17(9) క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ6.2వ ఓవర్- 56 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో అర్షదీప్కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (24) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 55/1మయాంక్ అగర్వాల్ 24, విరాట్ కోహ్లి 13తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ1.4వ ఓవర్- 18 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ (16) ఔటయ్యాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (జూన్ 3) జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్, ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.ఈ సీజన్లో ఐపీఎల్కు కొత్త ఛాంపియన్ రావడం ఖరారైపోయింది. ఆర్సీబీ, పంజాబ్ జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయాయి. ఆర్సీబీ 3 సార్లు, పంజాబ్ ఓసారి ఫైనల్కు చేరినా రన్నరప్తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లు పోటీపోటీగా రాణించి ఫైనల్ వరకు చేరాయి. లీగ్ దశలో పంజాబ్, ఆర్సీబీ సమంగా మ్యాచ్లు గెలిచి (14లో 9) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లో తలో మ్యాచ్ గెలిచాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్పై ఆర్సీబీ పైచేయి సాధించింది. జట్ల వివరాలు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ.పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్ -
IPL 2025 Final: అన్ని ఏఐ ప్లాట్ఫామ్లు 'ఆ జట్టే' ఛాంపియన్ అని అంటున్నాయి..!
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ ఇవాళ (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో విజేతపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ప్రదర్శనల ప్రకారం ఈ సీజన్లో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలానా జట్టు గెలుస్తుందని అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్లు జరగగా.. ఆర్సీబీ 2, పంజాబ్ ఓ మ్యాచ్లో గెలిచాయి. దీని ఆధారంగా ఆర్సీబీకే స్వల్ప ఎడ్జ్ ఉందని చెప్పవచ్చు.మానవమాత్రుల అంచనాలను పక్కన పెడితే.. కృత్రిమ మేధ (Artificial Intelligence, AI) ఏం చెబుతుందో చూద్దాం. ప్రచుర్యంలో ఉన్న టాప్ ఏఐ ప్లాట్ఫామ్లను ఐపీఎల్ 2025 విజేత ఎవరని అడగగా.. దాదాపు అన్ని ఏఐ ప్లాట్ఫామ్లు (గ్రోక్, జెమిని, ఛాట్జీపీటీ) ముక్తకంఠంతో ఆర్సీబీని విజేతగా తేల్చాయి.X GROK: అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, RCB ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ పంజాబ్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆ మ్యాచ్లో పంజాబ్ను 101 పరుగులకే ఆలౌట్ చేసి, 60 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ఆర్సీబీ ఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. జోష్ హాజిల్వుడ్ (11 మ్యాచ్ల్లో 21 వికెట్లు), సుయాష్ శర్మ నేతృత్వంలోని RCB బౌలింగ్ అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ (55.81 సగటుతో 614 పరుగులు), ఫిల్ సాల్ట్ విస్ఫోటకమైన ఫామ్లో ఉన్నారు.అహ్మదాబాద్లో RCB యొక్క చారిత్రక ప్రదర్శన (మొదట బ్యాటింగ్ చేసిన ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్లు గెలిచింది) మరియు ఒత్తిడిలో సామర్థ్యం వారికే స్వల్ప ఎడ్జ్ను ఇస్తాయి. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ వంటి నిపుణులు కూడా RCBకి మద్దతు ఇచ్చారు. వార్నర్ హాజిల్వుడ్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అంచనా వేశారు.అయితే, క్వాలిఫయర్ 2లో పంజాబ్ ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి తమను తక్కువ అంచనా వేయొద్దని అలర్ట్ చేస్తుంది. ఆ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ (87 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో పంజాబ్ను గెలిపించాడు. కైల్ జేమిసన్, యుజ్వేంద్ర చహల్ వంటి బౌలర్లతో పంజాబ్ బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. అయితే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో పతనం ఒత్తిడిలో పంజాబ్ బలహీనతను సూచిస్తుంది.ప్రస్తుత ఫామ్, సమతుల్య జట్టు, ఈ సీజన్లో వారి జోరును పరిగణనలోకి తీసుకుంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2025 ఫైనల్ను గెలుస్తుందని అంచనా. ఆర్సీబీ బ్యాటింగ్ లోతు మరియు పెద్ద మ్యాచ్లలో అనుభవం వారిని ఛాంపియన్లుగా చేస్తాయి. -
IPL 2025: 'ఈ లెక్కన' ఈ సారి ఆర్సీబీదే టైటిల్..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 29) జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఐపీఎల్లో ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ అవుతుంది. గడిచిన మూడు సందర్భాల్లో ఈ జట్టు రన్నరప్తో సరిపెట్టుకుంది.ఆర్సీబీ ఫైనల్కు చేరిన సీజన్లు..2009- డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి2011- సీఎస్కే చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి2016- ఎస్ఆర్హెచ్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి2025- ?కాగా, ఈ సీజన్లో ఆర్సీబీ ఫైనల్కు చేరాక ఓ ఆసక్తికర విషయం ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రతి సీజన్లో ఈ సాలా కప్ నమదే అనే ఆర్సీబీ అభిమానులకు ఇది ఊపునిచ్చే అంశం. అదేంటంటే.. 2018 నుంచి క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్ గెలిచింది. ఈ విషయం తెలిసి ఆర్సీబీ అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ ఒక్క సెంటిమెంట్ చాలు మేము ఈ యేడు కప్ కొడతామని చెప్పడానికంటూ చాటింపు చేసుకుంటున్నారు.సెంటిమెంట్ విషయాన్ని పక్కన పెడితే, ఈ యేడు ఆర్సీబీకి టైటిల్ గెలిచే జట్టుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆర్సీబీ ఈ సీజన్లో గత సీజన్లకు చాలా భిన్నంగా కనిపిస్తుంది. టైటిల్ గెలవాలన్న కసి ఆ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే వారి ప్రదర్శనలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ప్రతి సీజన్లో వీక్గా కనిపించే ఆర్సీబీ బౌలింగ్ విభాగం ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. నిన్న జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో అది నిరూపితమైంది. ఇదే జోరును ఆర్సీబీ బౌలర్లు ఫైనల్ మ్యాచ్లోనూ కొనసాగిస్తే, ఆ జట్టును టైటిల్ గెలవకుండా ఎవరూ ఆపలేరు.ఈ సారి ఆర్సీబీకి పటిష్టమైన జట్టుతో పాటు సెంటిమెంట్లు కూడా వర్కౌటయ్యేలా ఉన్నాయి. క్వాలిఫయర్-1 సెంటిమెంట్తో పాటు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ సెంటిమెంట్ కూడా ఆ జట్టుకు ఈ సారి కలిసొచ్చేలా ఉంది. కోహ్లి జెర్సీ నంబర్ 18, ఐపీఎల్ సీజన్ సంఖ్య కూడా 18.2018 నుంచి క్వాలిఫయర్-1 గెలిచిన జట్లు, టైటిల్ గెలిచిన జట్ల వివరాలు..2018- క్వాలిఫయర్-1 విజేత సీఎస్కే- టైటిల్ విజేత కూడా సీఎస్కేనే2019- క్వాలిఫయర్-1 విజేత ముంబై ఇండియన్స్- టైటిల్ విజేత కూడా ముంబై ఇండియన్సే2020- క్వాలిఫయర్-1 విజేత ముంబై ఇండియన్స్- టైటిల్ విజేత కూడా ముంబై ఇండియన్సే2021- క్వాలిఫయర్-1 విజేత సీఎస్కే- టైటిల్ విజేత కూడా సీఎస్కేనే2022- క్వాలిఫయర్-1 విజేత గుజరాత్- టైటిల్ విజేత కూడా గుజరాతే2023- క్వాలిఫయర్-1 విజేత సీఎస్కే- టైటిల్ విజేత కూడా సీఎస్కేనే2024- క్వాలిఫయర్-1 విజేత కేకేఆర్- టైటిల్ విజేత కూడా కేకేఆరే2025- క్వాలిఫయర్-1 విజేత ఆర్సీబీ- టైటిల్ విజేత..? -
ఫైనల్స్ కు ఆర్సీబీ..
-
IPL 2025: పంజాబ్ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ
ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పంజాబ్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో రేపు (మే 30) జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో (గుజరాత్ వర్సెస్ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పాటిదార్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు.అతి పెద్ద విజయంఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో బంతుల పరంగా ఆర్సీబీ అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ మరో 60 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో ఈ రికార్డు కేకేఆర్ పేరిట ఉండేది. 2024 సీజన్ ఫైనల్లో కేకేఆర్ ఎస్ఆర్హెచ్పై 57 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.నాలుగోసారి..తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ అవుతుంది. ఆర్సీబీ 2009, 2011, 2016 సీజన్లలో కూడా ఫైనల్కు చేరింది. అయితే మూడు సందర్భాల్లో ఈ జట్టుకు ఓటమే ఎదురైంది. -
IPL 2025, Qualifier 1: పంజాబ్పై ఆర్సీబీ ఘన విజయం
పంజాబ్పై ఆర్సీబీ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ఫైనల్కు చేరింది. పంజాబ్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో రేపు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో (గుజరాత్ వర్సెస్ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పాటిదార్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ7.5వ ఓవర్- 84 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ముషీర్ ఖాన్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్ (19) ఔటయ్యాడు. టార్గెట్ 102.. 30 పరుగుల వద్ద కోహ్లి ఔట్3.2వ ఓవర్- 102 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 30 పరుగుల వద్ద విరాట్ కోహ్లి (12) వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో జోస్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి విరాట్ ఔటయ్యాడు. రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. 78 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్10.3వ ఓవర్- 78 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్లో ప్రమాదకరంగా కనిపిస్తున్న మార్కస్ స్టోయినిస్ (26) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్8.5వ ఓవర్- 60 పరుగుల వద్ద పంజాబ్ ఏడో వికెట్ కోల్పోయింది. సుయాశ్ బౌలింగ్లో ముషీర్ ఖాన్ (0) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్8.2వ ఓవర్- 60 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్లో శశాంక్ సింగ్ (3) క్లీన్ బౌల్డయ్యాడు. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 6.3వ ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్లో నేహల్ వధేరా (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దయాల్, హాజిల్వుడ్ తలో 2, భువీ ఓ వికెట్ తీశారు. 38 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్5.1వ ఓవర్- 38 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్కు క్యాచ్ ఇచ్చి జోష్ ఇంగ్లిస్ (4) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్3.4వ ఓవర్- 30 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (2) ఔటయ్యాడు. ఇన్ ఫామ్ బ్యాటర్లు ప్రియాంశ్, ప్రభ్సిమ్రన్, శ్రేయస్ ఔట్ కావడంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్2.6వ ఓవర్- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఇన్ ఫామ్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (18) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్1.2వ ఓవర్- 9 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. యశ్ దయాల్ బౌలింగ్లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (7) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, స్టార్ బౌలర్ వచ్చేశాడుఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. పంజాబ్ తరఫున మార్కో జన్సెన్ స్థానంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ తరఫున స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ బరిలోకి దిగనున్నాడు. నువాన్ తుషార స్థానాన్ని జోష్ భర్తీ చేశాడు.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, కైల్ జామీసన్ఇంపాక్ట్ సబ్లు: విజయ్కుమార్ వైషాక్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్, జేవియర్ బార్ట్లెట్.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మఇంపాక్ట్ సబ్స్: మయాంక్ అగర్వాల్, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్. -
IPL 2025 Qualifier 1: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
ఐపీఎల్-2025 సీజన్ తొలి క్వాలిఫయర్లో గురువారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. సమ ఉజ్జీలగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోరు మరోసారి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే లీగ్ స్టేజిలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్లు కూడా అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు ఆర్హత సాధిస్తోంది. ఇక హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.చరిత్రకు అడుగు దూరంలో..ఈ మ్యాచ్లో కోహ్లి మరో 30 పరుగులు చేస్తే పంజాబ్ కింగ్స్పై అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు పంజాబ్పై కోహ్లి 1104 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ పంజాబ్ కింగ్స్పై 1034 పరుగులు చేశాడు.ఒకే ఒక ఫిప్టీ..ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక ఆర్ధశతకాలు నమోదు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేసేందుకు కోహ్లి అడుగుదూరంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో విరాట్ హాఫ్ సెంచరీ సాధిస్తే వార్నర్ సరసన చేరుతాడు. కోహ్లి ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. 2016 ఐపీఎల్ సీజన్లో వార్నర్ 9 ఫిప్టీలు సాధించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో విరాట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. తన అద్బుత ఇన్నింగ్స్లతో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కింగ్ కోహ్లి ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడి 602 పరుగులు చేశాడు.పంజాబ్తో మ్యాచ్కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజిత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారాచదవండి: ENG vs IND: 'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు' -
ఇవాల్టి నుంచి ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్ లు
-
విజయ్ మాల్యా ట్వీట్.. గట్టిగా తగులుకున్న నెటిజన్లు
బ్యాంకులకు రూ. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ మాల్యాను తాజాగా సోషల్మీడియాలో యూజర్లు గట్టిగా తగులుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుపై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్కు విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు.ఆర్సీబీని ప్రశంసిస్తూ ‘ఎక్స్’(ట్విటర్)లో విజయ్ మాల్యా ఓ పోస్ట్ పెట్టాడు. అంతే దొరికాడురా అంటూ నెటిజన్లు గట్టిగా తగులుకున్నారు. ఆయన చేసిన పోస్టును ట్రోల్ చేస్తూ చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు భారత్కు తిరిగి రావాలని కోరారు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఇండియా రావచ్చుగా.. అని ఒకరు ట్వీట్ చేయగా భారత్లో ప్లేఆఫ్స్ చూడటానికి రండి.. అంటూ మరొకరు ట్వీట్ చేశారు. 'కమ్ బ్యాక్ టు ఇండియా మ్యాన్'.. "ఎప్పుడు వస్తున్నావు?".. ఇలా మరికొందరు కామెంట్లు చేశారు.ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ గా పేరొందిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంతో దివాలా తీశాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఎస్బీఐ నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియంకు రూ .9,000 కోట్లకు పైగా ఎగ్గొట్టి ఆర్థిక మోసం, మనీలాండరింగ్ ఆరోపణల మధ్య 2016లో దేశం నుండి పారిపోయాడు. ప్రస్తుతం యూకేలో ఉంటున్న మాల్యా.. దివాలా, భారత్ కు అప్పగింతపై న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. -
IPL 2025: ప్లే ఆఫ్స్లో ఆర్సీబీ చరిత్ర ఇదీ..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా క్వాలిఫయర్-1లో పోటీ పడే అవకాశాన్ని (ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది) కూడా దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరడం ఇది పదోసారి. ఇన్ని ప్రయత్నాల్లో ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మూడు సందర్భాల్లో (2009, 2011, 2016) ఫైనల్ వరకు చేరినా రిక్తహస్తాలతో వెనుదిరిగింది.ఐపీఎల్ చరిత్రలో 15 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ.. ఐదు మ్యాచ్ల్లో గెలిచి, పదింట ఓడింది. ప్లే ఆఫ్స్లో ఆర్సీబీని అత్యంత దురదృష్టమైన జట్టు అని అంటారు. లీగ్ దశలో చెలరేగి ఆడే ఈ జట్టు నాకౌట్ మ్యాచ్లు వచ్చే సరికి ఢీలా పడిపోతుంది. గతమంతా ఇలాగే సాగింది. కానీ ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తుంది.ఆర్సీబీ ఈ సీజన్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఇందుకు నిన్న (మే 27) లక్నోతో జరిగిన మ్యాచే నిదర్శనం. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లి వికెట్ సహా నాలుగు వికెట్లు కోల్పోయినా ఏ మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా అబ్బురపడే విజయం సాధించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు.ఈ గెలుపుతో ఆర్సీబీ క్వాలిఫయర్-1లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. మే 29న జరిగే ఈ పోటీలో ఆర్సీబీ టేబుల్ టాపర్ పంజాబ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఓడినా ఆర్సీబీకి మరో అవకాశం ఉంటుంది. జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పోటీ పడే ఛాన్స్ ఉంటుంది. గుజరాత్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతతో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో తలపడుతుంది.ప్లే ఆఫ్స్లో ఆర్సీబీ ప్రస్తానం..2009- ఫైనల్లో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి2010- సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమి2011- ఫైనల్లో సీఎస్కే చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి2015- క్వాలిఫయర్-2లో సీఎస్కే చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి2016- ఫైనల్లో సన్రైజర్స్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి2020- ఎలిమినేటర్లో సన్రైజర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి2021- ఎలిమినేటర్లో కేకేఆర్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి2022- క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి2024- ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి2025- క్వాలిఫయర్-1లో పంజాబ్ ప్రత్యర్థి -
RCB VS PBKS Qualifier-1: అలా జరిగితే గెలవకపోయినా పంజాబ్ ఫైనల్కు చేరుతుంది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లీగ్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, పంజాబ్ తలపడతాయి. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. లీగ్ దశలో సాధించిన విజయాలు, నెట్ రన్రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారయ్యాయి. పంజాబ్, ఆర్సీబీ తలో 14 మ్యాచ్ల్లో చెరో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. పాయింట్లు సమంగా (19) ఉన్నా, ఆర్సీబీతో పోలిస్తే నెట్ రన్రేట్ మెరుగ్గా ఉండటంతో పంజాబ్కు తొలి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కింది.గుజరాత్ 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ కూడా పంజాబ్, ఆర్సీబీ మాదిరి 14 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించినా.. పంజాబ్, ఆర్సీబీ ఆడాల్సిన ఓ మ్యాచ్ (వేర్వేరుగా) రద్దైంది. దీంతో పంజాబ్, ఆర్సీబీలకు అదనంగా తలో పాయింట్ లభించింది.ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఎలా..?పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు (పంజాబ్, ఆర్సీబీ) మొదటి క్వాలిఫయర్లో తలపడతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఈ మ్యాచ్లో ఓడిన జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫయర్-2లో (జూన్ 1) పోటీ పడే అవకాశం దక్కుతుంది. క్వాలిఫయర్-2లో ఇంకో బెర్త్ ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా తెలుస్తుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడతాయి. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పోటీ పడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్లో ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు.. క్వాలిఫయర్-1లో గెలిచే జట్టుతో ఫైనల్లో (జూన్ 3) తలపడుతుంది.ఆర్సీబీ, పంజాబ్ క్వాలిఫయర్ మ్యాచ్ రద్దైతే..?పంజాబ్, ఆర్సీబీ మధ్య మే 29న జరగాల్సిన క్వాలిఫయర్-1 మ్యాచ్ ఏ కారణంగా అయినా రద్దైతే పంజాబ్ ఫైనల్కు చేరుతుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది కాబట్టి, ఆ జట్టుకు ఈ అవకాశం దక్కుతుంది. షెడ్యూల్ ప్రకారం క్వాలిఫయర్-1కు రిజర్వ్ డే లేదు. కాబట్టి తప్పనిసరిగా మ్యాచ్ జరిగి గెలిస్తేనే ఆర్సీబీ ఫైనల్కు చేరుతుంది. పంజాబ్కు అలా కాదు. ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైనా ఆ జట్టు ఫైనల్కు చేరుతుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఏ కారణంగా కూడా పంజాబ్, ఆర్సీబీ క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేదు. -
ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో సోమవారం ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్తో ఆర్సీబీ టాప్-2 ప్లేస్ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. లక్నో యువ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠి మరోసారి తన చర్యతో వార్తల్లోకెక్కాడు.అసలేమి జరిగిందంటే?228 పరుగుల భారీ లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి(54) ఔటయ్యాక స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ క్రీజులోకి వచ్చాడు. జితేష్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బదడం మొదలుపెట్టాడు. జితేష్ క్రీజులోకి వచ్చినప్పటికే ఆర్సీబీ కావల్సిన రన్ రేట్ ఓవర్కు 13పైగా ఉంది. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌలర్లను ఎంతమంది మార్చిన అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు.ఈ క్రమంలో అతడి దూకుడును అడ్డుకట్ట వేసేందుకు స్పిన్నర్ దిగ్వేష్ను తిరిగి పంత్ ఎటాక్లోకి తెచ్చాడు. దీంతో 17 ఓవర్ వేసిన దిగ్వేష్ ఓవరాక్షన్ చేశాడు. జితేష్ను తన బౌలింగ్తో ఆపలేకపోయిన దిగ్వేష్.. అతడిని మన్కడింగ్ చేసి పెవిలియన్కు పంపాలని ప్రయత్నించాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని వేసే క్రమంలో నాన్ స్ట్రైక్లో ఉన్న జితేష్ క్రీజు దాటడం గమనించిన దిగ్వేష్ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్ను పడగొట్టాడు. వెంటనే రనౌట్కు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. పలు మార్లు రిప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్.. అప్పటికే దిగ్వేశ్ బౌలింగ్ యాక్షన్ పూర్తి చేయడంతో నిబంధనల ప్రకారం నాటౌట్గా ప్రకటించాడు.పంత్ క్రీడా స్పూర్తి.. అయితే ఇదే సమయంలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. థర్డ్ అంపైర్ తన నిర్ణయం ప్రకటించికముందే పంత్ తమ అప్పీల్ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో జితేత్.. పంత్కు వద్దకు వెళ్లి అలిగంనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కోహ్లి ఫైర్..కాగా దిగ్వేష్ మన్కడింగ్కు ప్రయత్నించడంతో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్ప విరాట్ కోహ్లి ఊగిపోయాడు. తన చేతిలో ఉన్న బాటిల్ను కిందకు విసిరి కొట్టాడు. అస్సలు నీవు ఏమి చేస్తున్నావు అన్నట్లు కోహ్లి సీరియస్ రియాక్షన్ ఇచ్చాడు. కాగా దిగ్వేష్ ఇప్పటికే తన మితిమీరిన ప్రవర్తనతో ఓ మ్యాచ్ నిషేదాన్ని కూడా ఎదుర్కొన్నాడు.థర్డ్ అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడంటే?మెరిల్బోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను రనౌట్ చేయాలనుకుంటే యాక్షన్ను పూర్తి చేయకముందే ఔట్ చేయాలి. అంటే చేతిని పూర్తిగా తిప్పకముందే వికెట్లను గిరాటు వేయాలి. కానీ దిగ్వేష్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్ను పూర్తి చేసి స్టంప్స్ను పడగొట్టాడు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. Watch out for Virat’s reaction after Digvesh attempted mankid on Jitesh Sharma. #IPL2025 #IPL #JiteshSharma pic.twitter.com/sAKf6Ck7TV— Akhilesh Dhar (@akhileshdhar1) May 27, 2025 -
ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB
-
RCB Vs LSG: వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన జితేశ్.. ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ (227/3) చేసింది. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ విజయవంతమైంది. ఆ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. అతనికి మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు) సహకరించాడు. అంతకుముందు విరాట్ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు. లక్నో బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 2, ఆకాశ్ సింగ్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్ సెకెండ్ టాపర్గా నిలిచి ప్లే ఆఫ్స్కు చేరింది.మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. -
IPL 2025: లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
లక్నోపై ఆర్సీబీ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ (227/3) చేసింది. అనంతరం ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు.14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 156/4జితేశ్ శర్మ 22, మయాంక్ అగర్వాల్ 32నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ11.2వ ఓవర్- 123 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో ఆయుశ్ బదోనికి క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (54) ఔటయ్యాడు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీవరుస బంతుల్లో ఆర్సీబీ వికెట్లు వికెట్లు కోల్పోయింది. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్లో పాటిదార్, లివింగ్స్టోన్ వరుసగా ఔటయ్యారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ7.5వ ఓవర్- 90 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్లో అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి రజత్ పాటిదార్ (14) ఔటయ్యాడు. విరాట్కు (42) జతగా లివింగ్స్టోన్ క్రీజ్లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ5.4వ ఓవర్- 61 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆకాశ్ సింగ్ బౌలింగ్లో దిగ్వేశ్ రాఠీకి క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (30) ఔటయ్యాడు. కోహ్లికి (29) జతగా పాటిదార్ క్రీజ్లోకి వచ్చాడు.ఒకే ఓవర్లో 4 ఫోర్లు బాదిన కోహ్లి228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ను ప్రారంభించింది. విలియమ్ ఓరూర్కీ వేసిన రెండో ఓవర్లో కోహ్లి ఏకంగా నాలుగు ఫోర్లు బాదాడు. ఇదే ఓవర్లో సాల్ట్ కూడా ఓ ఫోర్ కొట్టాడు. 3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 39/0గా ఉంది. సాల్ట్ 17, కోహ్లి 21 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. శతక్కొటిన పంత్.. లక్నో భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ (227/3) చేసింది. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.రిషబ్ పంత్ సెంచరీలక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. బెంగళూరుతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 50 బంతుల్లో 100 పరుగులు చేశాడు.రెండో వికెట్ కోల్పోయిన లక్నో15.3వ ఓవర్- 177 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (67) ఔటయ్యాడు. రిషబ్ పంత్ 83 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 14 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 150/1మిచెల్ మార్ష్ 54, రిషబ్ పంత్ 7012 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 127/1మిచెల్ మార్ష్ 45, రిషబ్ పంత్ 58ధాటిగా ఆడుతున్న పంత్ఈ మ్యాచ్లో వన్డౌన్గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ ధాటిగా ఆడుతున్నాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. మరో ఎండ్లో మిచెల్ మార్ష్ ఓ మోస్తరుగా ఆడుతున్నాడు. 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేశాడు. 9 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 84/1గా ఉంది.6 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 55/1మిచెల్ మార్ష్ 15, రిషబ్ పంత్ 20తొలి వికెట్ కోల్పోయిన లక్నో2.4వ ఓవర్- 25 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. నువాన్ తుషార బౌలింగ్లో మాథ్యూ బ్రీట్జ్కీ (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీఐపీఎల్ 2025లో ఇవాళ (మే 27) చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. లక్నో వేదికగా ఎల్ఎస్జీ, ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(w/c), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషారఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్.లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, విలియం ఓర్కేఇంపాక్ట్ సబ్స్ - ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరి -
IPL 2025: ఆర్సీబీకి బిగ్ న్యూస్
ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి శుభవార్త అందింది. గాయం కారణంగా గత కొద్ది మ్యాచ్లకు దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ తిరిగి అందుబాటులోకి వచ్చాడు. హాజిల్వుడ్ నిన్న (మే 24) రాత్రి ఆర్సీబీ క్యాంప్లో చేరాడు. ఆర్సీబీ మే 27న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు హాజిల్వుడ్ అందుబాటులో ఉంటాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేయడంలో ఈ మ్యాచ్ అత్యంత కీలకమవుతుంది. లక్నోపై గెలిస్తే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో ముగించవచ్చు.ఐపీఎల్ పాక్షికంగా వాయిదా పడిన తర్వాత హాజిల్వుడ్ మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండడని తొలుత వార్తలు వచ్చాయి. గాయంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా షెడ్యూలై ఉండటంతో హాజిల్వుడ్ అందుబాటులోకి రావడం అసాధ్యమే అని అంతా అనుకున్నారు. He's hereಬಂದ್ಬಿಟ್ಟవచ్చేసాడుவந்துட்டான்वो आगयाവന്നിരിക്കുന്നുWelcome back, Josh Reginald Hazlewood! 🫡❤🔥 pic.twitter.com/pttA5DX3N8— Royal Challengers Bengaluru (@RCBTweets) May 25, 2025అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ.. హాజిల్వుడ్ చివరి లీగ్ మ్యాచ్కు (లక్నోతో) ముందే ఆర్సీబీ క్యాంప్లో చేరాడు. హాజిల్వుడ్ తమ క్యాంప్లో చేరిన విషయాన్ని ఆర్సీబీ అధికారికంగా వెల్లడించింది. హాజిల్వుడ్ ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి 18 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ సాధించిన విజయాల్లో అతనిది కీలకపాత్ర. ప్లే ఆఫ్స్కు హాజిల్వుడ్ అందుబాటులోకి రావడం ఆర్సీబీ శుభపరిమాణం.ఇదిలా ఉంటే, హాజిల్వుడ్ లేని లోటు ఆర్సీబీలో కొట్టొచ్చినట్లు కనిపించింది. సన్రైజర్స్తో తాజాగా (మే 23) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు ఏకంగా 231 పరుగులు సమర్పించుకున్నారు. యశ్ దయాల్ 3 ఓవర్లలో 36, భువనేశ్వర్ 4 ఓవర్లలో 43, ఎంగిడి 4 ఓవర్లలో 51, సుయాశ్ శర్మ 3 ఓవర్లలో 45 పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ భారీ లక్ష్య ఛేదనలో తడబడింది. ఫలితంగా 42 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?
-
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్కు భారీ షాక్.. రూ. 24 లక్షల జరిమానా
ఐపీఎల్-2025లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 42 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. అయితే ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్కు భారీ షాక్ తగిలింది. సన్రైజర్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ పాటిదార్కు రూ. 24 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ విధించింది. అలాగే జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు స్లో ఓవర్ రేట్ను నమోదు చేయడం ఇది రెండో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జరిమానా విధించారు. కాగా ఈ మ్యాచ్లో బెంగళూరు సారధిగా జితేష్ శర్మ వ్యవహరించినప్పటికి.. రూల్స్ ప్రకారం ఎవరైతే ఫుల్ టైమ్ కెప్టెన్గా ఉంటారో వారే ఫైన్ను భరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పాటిదార్పై జరిమానా పడింది. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ కు కూడా స్లో ఓవర్ రేట్ (Slow over rate) కారణంగా జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కమిన్స్ కు తొలిసారి స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షలు జరిమానా పడింది.చదవండి: ENG vs ZIM: 22 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్తో టెస్టు.. ఓటమి దిశగా జింబాబ్వే -
బెంగళూరుపై హైదరాబాద్ విజయం
-
విరాట్ కోహ్లికి హగ్ ఇస్తా
యశవంతపుర(కర్ణాటక): బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఓ వీడియో కలకలం రేపింది. మ్యాచ్ జరిగే సమయం లో పిచ్లోకి చొరబడి విరాట్ కోహ్లికి హగ్ చేస్తానంటూ శరణ్ అనే వ్యక్తి ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు. అది వైరల్ అవు తుండగానే బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు శరణ్ అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్టాలో లైక్స్, వీవ్స్ కోసం ఈ విధంగా వ్యవహరించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. -
IPL 2025: ఆర్సీబీ జట్టులోకి జింబాబ్వే ప్లేయర్.. అతడికి ప్రత్యామ్నాయంగా ఎంపిక
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు 8 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడం ఇది పదోసారి. ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024, 2025 సీజన్లలో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్కు ముందు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ రెండూ గెలిచి మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో లీగ్ దశను ముగించాలని భావిస్తుంది. తదుపరి మ్యాచ్ల్లో ఆర్సీబీ.. సన్రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది.గుజరాత్, పంజాబ్ కూడా..!నిన్న (మే 18) రాత్రి ఢిల్లీపై విజయం సాధించడంతో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్లు ఒకేసారి ఖరారయ్యాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్రైజర్స్తో జరిగే మ్యాచ్లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్కే, రాజస్థాన్, సన్రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ఎంగిడికి ప్రత్యామ్నాయంగా ముజరబానీవచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతని స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీతో భర్తీ చేసింది. ముజరబానీ.. ఆర్సీబీ లక్నోతో ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్కు అందుబాటులో ఉంటాడు. ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ (సీఎస్కే) ఆడిన ఎంగిడి అందులో మూడు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.🚨 BLESSING MUZARABANI WILL PLAY FOR RCB IN PLAYOFFS 🚨- He replaces Lungi Ngidi. pic.twitter.com/kzZ1rLrGgl— Johns. (@CricCrazyJohns) May 19, 2025ముజరబానీ విషయానికొస్తే.. కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన 28 ఏళ్ల ముజరబానీ.. జింబాబ్వే తరఫున 12 టెస్ట్లు, 55 వన్డేలు, 70 టీ20లు ఆడి 198 వికెట్లు పడగొట్టాడు. గత కొంతకాలంగా ముజరబానీ టీ20ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. అందుకే ఆర్సీబీ ఈ ఆఫ్రికా ఆణిముత్యాన్ని వెతికి పట్టుకుంది. ముజరబానీ.. సికందర్ రజా తర్వాత ఐపీఎల్ ఆడనున్న రెండో జింబాబ్వే క్రికెటర్. -
IPL 2025: ప్లే ఆఫ్స్కు చేరిన ఆర్సీబీ.. యాదృచ్ఛికంగా..!
ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరింది. నిన్న (మే 18) రాత్రి ఢిల్లీపై గుజరాత్ విజయం సాధించడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైంది. ఢిల్లీపై గెలుపుతో గుజరాత్తో పాటు ఆర్సీబీ, పంజాబ్ ఒకేసారి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్రైజర్స్తో జరిగే మ్యాచ్లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్కే, రాజస్థాన్, సన్రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.పదోసారిఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 8 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడం ఇది పదోసారి. ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024, 2025 సీజన్లలో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.యాదృచ్ఛికంగుజరాత్ ఢిల్లీపై గెలవడంతో అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆర్సీబీ.. యాదృచ్ఛికంగా గత సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన రోజునే (మే 18) ఈ సీజన్లోనూ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మ్యాచ్ ఆడకుండా, గెలవకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కావడంపై ఆర్సీబీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్లే ఆఫ్స్కు ముందు మరో రెండు మ్యాచ్లు ఆడనున్న ఆర్సీబీ.. ఆ రెండూ గెలిచి మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో లీగ్ దశను ముగించాలని భావిస్తుంది. తదుపరి మ్యాచ్ల్లో ఆర్సీబీ.. సన్రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది.కాగా, ఈ సీజన్లో ఆర్సీబీ డ్రీమ్ రన్ను కొనసాగిస్తుంది. హేమాహేమీ జట్లకు షాకిస్తూ తొలి టైటిల్ దిశగా దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఆర్సీబీ సాధించిన విజయాలు రికార్డుల్లోకెక్కాయి. 17 ఏళ్ల తర్వాత సీఎస్కేను వారి సొంత మైదానంలో ఓడించిన ఆ జట్టు.. పదేళ్ల తర్వాత ముంబై ఇండియన్స్ను వారి సొంత ఇలాకాలో (వాంఖడే) మట్టికరిపించింది. ఇదే సీజన్లో కేకేఆర్ను కూడా వారి సొంత మైదానంలో (ఈడెన్ గార్డెన్స్) ఓడించిన ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కేను, ముంబై ఇండియన్స్ను, కేకేఆర్ను వారి సొంత మైదానాల్లో ఓడించిన రెండో జట్టుగా (ఒకే సీజన్లో) రికార్డుల్లోకెక్కింది.ఇదిలా ఉంటే, నిన్న రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్లో డుప్లెసిస్ 5, అభిషేక్ పోరెల్ 30, అక్షర్ పటేల్ 25, ట్రిస్టన్ స్టబ్స్ 21 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిధ్కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం ఓపెనర్లు సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్లు), శుబ్మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్లు) చెలరేగిపోవడంతో గుజరాత్ 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. -
ఆర్సీబీ ఫైనల్కు వెళ్తే భారత్కు వస్తా: ఏబీ డివిలియర్స్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. గత రెండు మూడు సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది మాత్రం ఆర్సీబీ అందరి అంచనాలకు భిన్నంగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్లో పాటిదార్ సేన దుమ్ములేపుతోంది.బ్యాటింగ్లో విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, పాటిదార్ చెలరేగుతుంటే.. బౌలింగ్లో జోష్ హాజిల్వుడ్, కృనాల్ పాండ్యా,భువనేశ్వర్ కుమార్ వంటి వారు అదరగొడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు జట్టు ఫ్లే ఆఫ్స్కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక మ్యాచ్లో గెలిచినా చాలు ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆర్సీబీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర ప్రకటన చేశాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ఫైనల్స్కు చేరుకుంటే తను ఆ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు భారత్కు వస్తానని డివిలియర్స్ వాగ్ధానం చేశాడు."ఆర్సీబీ ఫైనల్కు చేరుకుంటే, నేను ఆ స్టేడియంలో కచ్చితంగా ఉంటాను. విరాట్ కోహ్లితో కలిసి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడం కంటే నాకు గొప్ప అనుభూతి అంటూ మరొకటి ఉండదు. ఆర్సీబీ చాలా ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం ప్రయత్నిస్తోంది" అంటూ డివిలియర్స్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్.. 2011లో ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ జట్టులో చేరాడు. ఆ తర్వాత రిటైర్ అయ్యే వరకు 11 సీజన్ల పాటు ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లికి, ఏబీడీకి మంచి స్నేహ బంధం ఉంది.చదవండి: టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్ -
బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం
-
IPL 2025 Resumption: రేపటి ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ జరిగేనా..?
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా వారం వాయిదా పడిన ఐపీఎల్ 2025 రేపు (మే 17) జరుగబోయే కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్తో పునఃప్రారంభం కానుంది. అయితే లీగ్ పునఃప్రారంభానికి వరుణుడు అడ్డుపడేలా ఉన్నాడు. రేపటి మ్యాచ్కు వేదిక అయిన బెంగళూరులో నిన్నటి నుండి వర్షం జోరుగా కురుస్తుంది. రేపు మ్యాచ్ జరిగే సమయంలో కూడా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవారం రోజులు బెంగళూరులో ఇదే వాతావరణం కొనసాగనున్నట్లు తెలుస్తుంది. రేపటి మ్యాచ్ కోసం కేకేఆర్, ఆర్సీబీ జట్లు ఇదివరకే బెంగళూరుకు చేరుకున్నాయి. వర్షం కారణంగా ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్లు రద్దయ్యాయి. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకు పరిమితమయ్యారు. Tim David enjoying the Bengaluru rain. 😂🔥 pic.twitter.com/nOKhZhHukO— Johns. (@CricCrazyJohns) May 16, 2025వర్షంలో ఎంజాయ్ చేసిన టిమ్నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వర్షం కురుస్తుండగా ఆ జట్టు ఆటగాడు టిమ్ డేవిడ్ చేసిన విన్యాసాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. టిమ్ షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ తెగ ఎంజాయ్ చేశాడు.కొన్ని ఓవర్లైనా జరుగుందిచిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో భారీ వర్షం కురిసినా రేపటి మ్యాచ్ కొన్ని ఓవర్ల పాటైనా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.పూర్తిగా రద్దైతే..వర్షం కారణంగా రేపు జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ పూర్తిగా రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ మరో పాయింట్ లభించినా టాప్ ప్లేస్కు ఎగబాకుతుంది. కేకేఆర్ విషయానికొస్తే.. ఇప్పటికే అనధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు రేపటి మ్యాచ్ రద్దైతే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలుగుతుంది.పాటిదార్, హాజిల్వుడ్ దూరంరేపటి మ్యాచ్కు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ దూరం కానున్నాడని తెలుస్తుంది. లీగ్ వాయిదాకు ముందే గాయపడిన అతను ఇంకా కోలుకోలేదని సమాచారం. పాటిదార్ స్థానంలో రేపటి మ్యాచ్లో జితేశ్ శర్మ ఆర్సీబీకి సారథ్యం వహించవచ్చు. మరోవైపు భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా స్వదేశానికి వెళ్లిన ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ కూడా రేపటి మ్యాచ్కు అందుబాటులో ఉండడని తెలుస్తుంది. హాజిల్వుడ్ లీగ్ తదుపరి లెగ్ ఆడేందుకు అంగీకారం తెలిపినప్పటికీ.. భారత్కు ఇంకా తిరిగి రావాల్సి ఉంది. -
IPL 2025 Resumption: ఆర్సీబీకి శుభవార్త.. హాజిల్వుడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..?
మే 17 నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానున్న వేల ఆర్సీబీకి శుభవార్త అందింది. భారత్-పాక్ మధ్య యుద్దం కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన ఆ ఫ్రాంచైజీ ప్లేయర్లంతా తిరిగి వచ్చేందుకు అంగీకరించారని తెలుస్తుంది. జాతీయ విధుల కారణంగా జేకబ్ బేతెల్ ఒక్కడే తదుపరి లెగ్కు అందుబాటులో ఉండడని సమాచారం.స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ తిరిగొచ్చేందుకు అంగీకరించడం ఆర్సీబీకి అతి పెద్ద శుభవార్త. వాస్తవానికి హాజిల్వుడ్ ఐపీఎల్ వాయిదా పడకముందే గాయపడ్డాడు. రీ షెడ్యూల్ తర్వాత అతను అందుబాటులో రావడం దాదాపుగా అసాధ్యమేనని అంతా అనుకున్నారు. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే (జూన్ 11) డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో హాజిల్వుడ్ జాతీయ విధులకే ప్రాధ్యాన్యత ఇస్తాడని ప్రచారం జరిగింది.అయితే ఆర్సీబీ యాజమాన్యం చర్చల కారణంగా హాజిల్వుడ్ సీజన్ అయిపోయే వరకు ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. మరోవైపు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా తమ ఆటగాళ్లకు లీగ్ అయిపోయే వరకు కొనసాగేందుకు అనుమతి ఇవ్వడంతో లుంగి ఎంగిడి సేవలు కూడా ఆర్సీబీ లీగ్ అయిపోయే వరకు వినియోగించుకోనుంది.మిగతా విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. ఫిల్ సాల్ట్ విండీస్తో జరిగే వన్డే సిరీస్కు ఎంపిక కాలేదు. దీంతో అతను ప్లే ఆఫ్స్లో ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. టిమ్ డేవిడ్, లివింగ్స్టోన్ వారి జట్లలో సభ్యులుగా లేరు. వీరి నుంచి కూడా ఎలాంటి సమస్య లేదు. ఐర్లాండ్తో సిరీస్కు ఎంపికైనా రొమారియో షెపర్డ్ తమ బోర్డును ఒప్పించుకుని లీగ్ మొత్తానికి అందుబాటులోకి వచ్చాడు. మొత్తంగా చూస్తే.. విదేశీ ఆటగాళ్లంతా లీగ్ అయిపోయే వరకు అందుబాటులో ఉండటం ఆర్సీబీకి శుభపరిణామంగా చెప్పవచ్చు.ఈ సీజన్లో ఆర్సీబీ గతంలో ఎన్నడూ లేనట్లుగా హాట్ ఫేవరెట్గా కనిపిస్తుంది. విదేశీ ఆటగాళ్లతో పాటు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా పూర్తిగా అందుబాటులో ఉండటం (టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం), అందులోనూ భీకర ఫామ్లో ఉండటం ఆర్సీబీ తొలి టైటిల్ కలను నెరవేర్చేలా కనిపిస్తుంది. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ దేశీయ ఆటగాళ్లు కూడా అత్యంత ప్రమాదకరంగా ఉన్నారు. బౌలర్లలో యశ్ దయాల్, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఆర్సీబీ ప్రస్తుమున్న ప్రధాన సమస్య వారి కెప్టెన్ రజత్ పాటిదార్ ఒక్కడే. పాటిదార్ గాయంతో బాధపడుతుండటంతో పాటు పెద్దగా ఫామ్లో లేడు. అతనితో పాటు వికెట్ కీపర్ జితేశ్ శర్మకు కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు. వీరిద్దరు కూడా లైన్లోకి వచ్చారంటే ఈ సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలవకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. దేవ్దత్ పడిక్కల్ స్థానంలో వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా టాపార్డర్లో మ్యాజిక్ చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (11 మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు) ఉన్న ఆర్సీబీ.. ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 17న కేకేఆర్తో (బెంగళూరు), మే 23న సన్రైజర్స్తో (బెంగళూరు), మే 27న లక్నోతో (లక్నో) తలపడనుంది. ఈ మూడు మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. -
IPL 2025 Resumption: ఆర్సీబీకి అదిరిపోయే వార్త
ఐపీఎల్ పునఃప్రారంభానికి ముందు ఆర్సీబీకి అదిరిపోయే వార్త అందింది. ఆ జట్టు సంచలన ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ లీగ్ తదుపరి లెగ్లో పాల్గొనేందుకు భారత్కు తిరిగి వచ్చాడు. అతనితో పాటు కేకేఆర్ ఆటగాళ్లు సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ కూడా ఇండియాలో ల్యాండ్ అయినట్లు కేకేఆర్ మెంటార్ డ్వేన్ బ్రావో సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు.Romario Shepherd is on his way for the IPL A major boost for RCB! ⭐ pic.twitter.com/OB5Uvsg7AL— Cricket Winner (@cricketwinner_) May 14, 2025ఐపీఎల్ పునఃప్రారంభం కానున్న మే 17వ తేదీ కేకేఆర్, ఆర్సీబీ బెంగళూరు వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం షెపర్డ్, నరైన్, రసెల్ బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సీజన్లోనే ఆర్సీబీతో జతకట్టిన షెపర్డ్.. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి వార్తల్లోకెక్కాడు. ఈ ఫిఫ్టి ఆర్సీబీ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి కాగా.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైంది. ఈ ఇన్నింగ్స్ తర్వాత షెపర్డ్పై అంచనాలు ఒక్కసారిగా పెరిపోయాయి. ఆర్సీబీ అభిమానులు షెపర్డ్ను తమ తురుపుముక్కలా భావించడం మొదలు పెట్టారు.కాగా, కొద్ది రోజుల ముందు వరకు షెపర్డ్ లీగ్ తదుపరి లెగ్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దత ఉండింది. ఈ దశ ఐపీఎల్ మ్యాచ్లు జరిగే తేదీల్లోనే వెస్టిండీస్ ఐర్లాండ్తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన విండీస్ జట్టుకు షెపర్డ్ ఎంపికయ్యాడు. దీంతో అతను ఐపీఎల్కు తిరిగి రాడని అంతా అనుకున్నారు. అయితే అతను విండీస్ క్రికెట్ బోర్డు అనుమతి తీసుకుని ఐపీఎల్కు తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. ఐర్లాండ్తో విండీస్ వన్డే సిరీస్ మే 21, 23, 25 తేదీల్లో జరుగనుంది.ప్రస్తుతానికి షెపర్డ్ ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చాడు కానీ, ప్లే ఆఫ్స్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మరో క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరిగే రోజుల్లో వెస్టిండీస్ ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ జట్టుకు కూడా షెపర్డ్ ఎంపికయ్యాడు. ఐర్లాండ్తో సిరీస్ అంటే విండీస్ క్రికెట్ బోర్డు లైట్గా తీసుకుంది కానీ ఇంగ్లండ్తో సిరీస్ కాబట్టి షెపర్డ్కు తప్పక ఆడాల్సిందేనని పట్టుబట్టవచ్చు. ఈ నేపథ్యంలో షెపర్ట్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం అనుమానమే.ఇదిలా ఉంటే, ఈ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించేందుకు మరో అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఆ జట్టు తదుపరి లెగ్లో ఆడాల్సిన మూడు మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (11 మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు) ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడబోయే మ్యాచ్ల్లో కేకేఆర్ (మే 17), సన్రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది. -
Rohit-Kohli: ప్రస్తుతానికి ఎలాంటి కమిట్మెంట్స్ లేవు.. ఫోకస్ అంతా ఐపీఎల్పైనే..!
రోజుల వ్యవధిలో టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెట్ దిగ్గజాలు ప్రస్తుతం తమ ఫోకస్ అంతా ఐపీఎల్ 2025పైనే పెట్టారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు, మధ్యలో కూడా వారిపై ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్కు సంబంధించిన ఒత్తిడి ఉండేది. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారిద్దరు ఫ్రీబర్డ్స్ అయ్యారు. వారిపై ఐపీఎల్ మినహా ఎలాంటి బాధ్యతా లేదు. ఈ ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ టీ20లకు గతేడాదే రిటైర్మెంట్ ప్రకటించారు. వారు ఇకపై భారత్ తరఫున వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటారు. భారత్ ఆడబోయే వన్డేలు సమీప భవిష్యత్తులో లేవు. దీంతో వారి దృష్టి మొత్తం ఐపీఎల్ 2025పైనే కేంద్రీకృతమై ఉంది.మే 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్, కోహ్లి ముందున్న తక్షణ కర్తవ్యం వారి జట్లను ప్లే ఆఫ్స్కు చేర్చడం. ఇందు కోసం వారు అందరి కంటే ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఐపీఎల్ రీవైజ్డ్ షెడ్యూల్కు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అన్న సందిగ్దత కొనసాగుతుండగా.. ఈ భారత సూపర్ స్టార్లు మాత్రం దాని తాలూకా ఆలోచనలు లేకుండా ప్రాక్టీస్లో నిమగ్నమై ఉన్నారు. ఐపీఎల్ తదుపరి లెగ్ కోసం రోహిత్ మూడు రోజుల కిందటి ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. విరాట్ ఇవాళే బరిలోకి దిగాడని తెలుస్తుంది.ఐపీఎల్ పాక్షికంగా వాయిదా పడే సమయానికి రోహిత్, విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నాలుగు, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ బెర్తుకు అతి చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన ముంబై 7 విజయాలతో 14 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ 11 మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచి 16 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ముంబై ఈ సీజన్లో మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 21న ఢిల్లీతో (ముంబై), మే 26న పంజాబ్తో (జైపూర్) తలపడనుంది. ముంబై ఈ రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ బెర్త్ సాధిస్తుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఆ జట్టు ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 17న కేకేఆర్తో (బెంగళూరు), మే 23న సన్రైజర్స్తో (బెంగళూరు), మే 27న లక్నోతో (లక్నో) తలపడనుంది. ఈ మూడు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తమ ఆరో టైటిల్ వేట కొనసాగిస్తుండగా.. ఆర్సీబీ తమ తొలి టైటిల్ దిశగా సానుకూల అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేని రోహిత్, విరాట్ తమ జట్లకు ఐపీఎల్ టైటిల్ గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. -
పాకిస్తాన్ హెడ్ కోచ్గా ఆర్సీబీ మాజీ కోచ్
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్గా ఆర్సీబీ మాజీ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ (న్యూజిలాండ్) నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ ఇవాళ (మే 13) వెల్లడించారు. 50 ఏళ్ల హెస్సెన్ మే 26న బాధ్యతలు చేపడతారు. పాకిస్తాన్ హెడ్ కోచ్గా హెస్సన్ కాంట్రాక్ట్ ఎంత వరకు ఉంటుందో తెలియరాలేదు.కోచ్గా హెస్సన్కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 2012 నుండి 2018 వరకు అతను న్యూజిలాండ్ జట్టుకు కోచ్గా వ్యవహరించాడు. హెస్సన్ కోచ్గా ఉండగా న్యూజిలాండ్ అద్భుత విజయాలు సాధించి మూడు ఫార్మాట్లలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. హెస్సన్కు ఐపీఎల్లోనూ మంచి ట్రాక్ రికార్డే ఉంది. 2019 నుంచి 2023 సీజన్ వరకు అతను ఆర్సీబీ హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వహించాడు.ప్రస్తుతం హెస్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్కు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. హెస్సన్కు ముందు పాక్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్గా ఆకిబ్ జావిద్ వ్యవహరించాడు. గతేడాది అక్టోబర్లో అప్పటి హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఆకిబ్ జావిద్ తాత్కాలిక హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వహించాడు. హెస్సన్ కొత్త కోచ్గా నియమితుడు కావడంతో తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావిద్ పాక్ క్రికెట్ జట్టు హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్గా నియమితుడయ్యాడు. ఈ హోదాలో అతను పాక్ సెలెక్షన్ కమిటీలోనూ భాగస్తుడు కావచ్చు.పాక్ పరిమిత ఓవర్ల జట్లకు హెడ్ కోచ్గా హెస్సన్ ప్రయాణం త్వరలో బంగ్లాదేశ్తో జరుగబోయే సిరీస్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే భారత్, పాక్ మధ్య యుద్దం, తదనంతర పరిస్థితుల కారణంగా ఈ సిరీస్ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న సమాచారం మేరకు పాక్, బంగ్లాదేశ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ మే 25, 27, 30, జూన్ 1, 3 తేదీల్లో జరుగనుంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు ఫైసలాబాద్, మిగతా మూడు మ్యాచ్లు లాహోర్లో జరుగనున్నాయి. -
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఐపీఎల్ పునఃప్రారంభానికి లైన్ క్లియర్ అయ్యింది. మే 8న రద్దైన ఐపీఎల్ 2025, మే 17 నుంచి పునఃప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ నిన్న రాత్రి ప్రకటించింది. మే 8న 10 ఓవర్ల పాటు సాగి రద్దైన ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ ఈ నెల 24న మొదటి నుంచి నిర్వహించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్కు నిన్న ప్రకటించిన రీ షెడ్యూల్కు చాలా తేడాలున్నాయి. వేదికలు చాలా వరకు మారాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ల వేదికలు ఖరారు కావాల్సి ఉంది. క్యాష్ రిచ్ లీగ్ జూన్ 3న జరిగే ఫైనల్తో ముగుస్తుంది.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 వాయిదా పడటం ప్లే ఆఫ్స్కు అతి చేరువలో ఉన్న ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టింది. ఆ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండటం, గాయాల బారిన పడటంతో జట్టును వీడనున్నారు. ఐపీఎల్ వాయిదాకు ముందే ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయపడ్డారు. పాటిదార్ ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత కూడా కొన్ని మ్యాచ్లు మిస్ అవుతాడు. పాటిదార్ స్థానంలో కొన్ని మ్యాచ్లకు విరాట్ కోహ్లి లేదా జితేశ్ శర్మ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది.రీ షెడ్యూల్లో ఆర్సీబీ ఆడబోయే మ్యాచ్లకు ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఐపీఎల్ పూర్తికాక ముందే (మే 29) ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ మొదలవుతుంది. ఐపీఎల్ పూర్తైన వారం రోజులకే (జూన్ 11) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు జట్లకు చెందిన ఆటగాళ్లు ఆర్సీబీ ఆడబోయే తదుపరి మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు.ఆర్సీబీ జట్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు: ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్వెస్టిండీస్ ఆటగాళ్లు: రొమారియో షెపర్డ్మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐపీఎల్ ఫైనల్ తర్వాత వారం రోజుల సమయమున్నా (డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం).. ఆ దేశ క్రికెట్ బోర్డు ఐపీఎల్ ఆడటం ఆటగాళ్ల చాయిస్కే వదిలిపెట్టింది. దీంతో ఆ దేశ టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైన జోష్ హాజిల్వుడ్ తదుపరి ఐపీఎల్ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం దాదాపు అసాధ్యమేనని తెలుస్తుంది. హాజిల్వుడ్ పోతే ఎంగిడి ఉన్నాడులే అనుకుంటే అతను కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్నే తన మొదటి ఛాయిస్గా ఎంచుకోవచ్చు.ఈ లెక్కన చూస్తే ఆర్సీబీలో టిమ్ డేవిడ్ మినహా ఒక్క విదేశీ ఆటగాడు కూడా మిగిలే అవకాశం లేదు. శ్రీలంక పేసర్ నువాన్ తుషార ఉన్నా అతను ఏ మేరకు అందుబాటులో ఉంటాడో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మొత్తంగా చూస్తే, ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీని ఐపీఎల్ వాయిదా పడటం దారుణంగా దెబ్బకొట్టింది. ఆ జట్టు తదుపరి మ్యాచ్ల్లో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే లయ తప్పే ప్రమాదముంది. ఈ సీజన్పై ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సాలా కప్ నమ్మదే అని ఆర్సీబీ అభిమానులు ఇప్పుడిప్పుడే నమ్మడం మొదలుపెట్టారు. ఈ లోపే భారత్, పాక్ మధ్య యుద్దం మొదలై ఆర్సీబీ గెలుపు జోష్ను దెబ్బకొట్టింది. మరి, ఉన్న వనరులతో ఆర్సీబీ మున్ముందు మ్యాచ్ల్లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఐపీఎల్ వాయిదాకు ముందు ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, స్వస్థిక్ చికారా, మయాంక్ అగర్వాల్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రాఠీ, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ, లుంగి ఎంగిడి, రసిఖ్ దార్ సలామ్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. -
IPL 2025: పడిక్కల్కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించిన ఆర్సీబీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ 11 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ, ప్లే ఆఫ్స్ బెర్త్కు అతి సమీపంలో ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు ముందు మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ల్లో లక్నో (మే 9), సన్రైజర్స్ (మే 13), కేకేఆర్లతో (మే 17) తలపడనుంది.కాగా, ఆర్సీబీకి సీఎస్కేతో ఆడిన గత మ్యాచ్లో ఓ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వన్డౌన్ ఆటగాడు, ఇన్ఫామ్ ప్లేయర్ దేవ్దత్ పడిక్కల్ గాయపడ్డాడు. తాజాగా ఆర్సీబీ యాజమాన్యం పడిక్కల్ స్థానాన్ని భర్తీ చేసింది. పడిక్కల్కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేసింది. మయాంక్ను ఆర్సీబీ కోటి రూపాయలకు దక్కించుకుంది. 34 ఏళ్ల మయాంక్కు ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2011 నుంచి అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 127 మ్యాచ్లు ఆడి 2661 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్లో మయాంక్ సన్రైజర్స్లో ఉన్నాడు. ఈ సీజన్ మెగా వేలంలో మయాంక్ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. తమ తొలి టైటిల్ వేటను విజయవంతంగా సాగిస్తున్న ఆర్సీబీకి మున్ముందు ఆడబోయే కీలక మ్యాచ్ల్లో మయాంక్ ఏ మేరకు తోడ్పడతాడో చూడాలి. మయాంక్కు గతంలో (2011) ఆర్సీబీకి ఆడిన అనుభవం ఉంది. మయాంక్ స్వస్థలం బెంగళూరే కావడం అతనికి కలిసొచ్చే అంశం. మయాంక్ దేవ్ స్థానాన్ని భర్తీ చేయగలడో లేదో చూడాలి. దేవ్ ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి 247 పరుగులు చేశాడు.హ్యారీ బ్రూక్కు ప్రత్యామ్నాయంగా అటల్లీగ్ ప్రారంభానికి ముందు వైదొలిగిన హ్యారీ బ్రూక్ స్థానాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు సెదిఖుల్లా అటల్తో భర్తీ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి 13 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగుతుంది. -
మేకను బలి ఇచ్చిన అభిమానులపై కేసు
దొడ్డబళ్లాపురం: విరాట్ కోహ్లి కటౌట్ ముందు మేకను బలి ఇచ్చిన ఆర్సీబీ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా మారమ్మనహళ్లిలో చోటుచేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్పై రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించారు. దీంతో ఆనందం పట్టలేని అభిమానులు మారమ్మనహళ్లిలో విరాట్ కోహ్లి కటౌట్ పెట్టి మేకను బలి ఇచ్చారు. సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో మొళకాల్మూరు పోలీసులు పాలయ్య, జయణ్ణ, తిప్పేస్వామిలపై కేసు నమోదు చేశారు. -
RCB vs CSK: స్టేడియంలో వీఐపీ కుటుంబాల ఘర్షణ
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మే 3వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ–సీఎస్కే జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ హోరాహోరీగా జరగ్గా, ఇటు ప్రేక్షకులు కూడా రగడకు దిగినట్లు తెలిసింది. ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారుల కుటుంబాలు కొట్టుకున్నట్టు సమాచారం. ఒక ఐపీఎస్ అధికారి, ఐటీ శాఖ కమిషనర్ తమ కుటుంబ సభ్యులతో మ్యాచ్ను చూడడానికి స్టేడియానికి వచ్చారు. అధికారుల పిల్లలు సీటు విషయంలో గొడవపడ్డారు. దీంతో అధికారులు, వారి భార్యలు దూషణలకు దిగి కలబడినట్లు తెలిసింది. కబ్బన్ పార్క్ పోలీస్స్టషన్లో కేసులు పెట్టుకున్నారు. -
IPL 2025: వీవీఐపీల మధ్య ఘర్షణ.. లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఐపీఎస్ అధికారి భార్య
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా మే 3న జరిగిన ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ సందర్భంగా ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో వీవీఐపీ ప్రేక్షకుల బాక్స్లో (బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో) రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఒక కుటుంబం ఇన్కమ్ ట్యాక్స్ ప్రముఖులకు చెందినది కాగా.. మరో కుటుంబం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కుటుంబానికి చెందినది. ఈ రెండు కుటుంబాల మధ్య సీట్ల విషయంలో మొదలైన గొడవ చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఐపీఎల్ అధికారి భార్య ప్రత్యర్థి వర్గంపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆమెను, ఆమె కుమార్తెను లైంగికంగా వేధించారని కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.ఇదిలా ఉంటే, నువ్వా నేనా అన్నట్లు సాగిన ఆ మ్యాచ్లో సీఎస్కేపై ఆర్సీబీ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (55), విరాట్ కోహ్లి (62), రొమారియో షెపర్ట్ (53 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆఖర్లో షెపర్ట్ సునామీలా విరుచుకుపడి ఆర్సీబీకి భారీ స్కోర్ అందించాడు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ హాఫ్ సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైంది.ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్ ఆ ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. చివరి బంతి వరుకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్కేను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. చివరి ఓవర్లో సీఎస్కే గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా.. యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జడేజా, ధోని, దూబే లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నా 12 పరుగులకే పరిమితం చేశాడు. -
RCB VS CSK: చరిత్రలో తొలిసారి ఇలా..!
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్పై ఇంటా బయటా (ఒకే సీజన్లో) విజయాలు సాధించింది. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 3) హోం గ్రౌండ్లో సీఎస్కేపై విక్టరీ సాధించిన ఆర్సీబీ.. ఈ సీజన్ అవే మ్యాచ్లోనూ (సీఎస్కే హోం గ్రౌండ్లో) సీఎస్కేను చిత్తు చేసింది. బెంగళూరులో సీఎస్కేపై 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన ఆర్సీబీ.. మే 28న చెన్నైలో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ ప్రారంభం నుండి ఆర్సీబీ సీఎస్కేపై ఎప్పుడూ ఒకే సీజన్లో ఇంటా బయటా విజయాలు సాధించలేదు.ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీ, నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. జేకబ్ బేతెల్ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ద సెంచరీలతో చెలరేగారు. ఆఖరి రెండు ఓవర్లలో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డు స్థాయిలో 54 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ 19, 20 ఓవర్లలో సాధించిన అత్యధిక పరుగులు ఇవే. ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్న షెపర్డ్.. పతిరణ వేసిన చివరి ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.సీఎస్కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0).అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. చివరి బంతి వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులకే పరిమితమైంది. జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో చెలరేగినా ఆర్సీబీ చేతిలో సీఎస్కే 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది.సీఎస్కే గెలుపుకు చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. దయాల్, కృనాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే. -
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం
-
RCB VS CSK: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు (ఓ సీజన్లో) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్తో కలుపుకుని విరాట్ మొత్తం ఎనిమిది సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. విరాట్ తర్వాత అత్యధిక సీజన్లలో 500 ప్లస్ పరుగులు సాధించిన ఘనత డేవిడ్ వార్నర్కు దక్కుతుంది. వార్నర్ ఏడు సీజన్లలో ఈ ఘనత సాధించాడు. విరాట్, వార్నర్ తర్వాత కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్ అత్యధిక సీజన్లలో 500 ప్లస్ స్కోర్లు చేశారు. రాహుల్ 6, ధనవ్ 5 సీజన్లలో 500 ప్లస్ స్కోర్లు చేశాడు. నిన్న (మే 3) సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో విరాట్ ఎనిమిదో సారి ఓ సీజన్లో 500 ప్లస్ పరుగులు పూర్తి చేశాడు.విరాట్ 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన సీజన్లు..2015- 505 పరుగులు2025- 505*2018- 5302011- 5572013- 6342023- 6392024- 7412016- 973కాగా, నిన్నటి మ్యాచ్లో 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసిన విరాట్.. ఐపీఎల్లో ఎనిమిదో సారి 500 ప్లస్ పరుగులు సాధించడంతో పాటు మరిన్ని రికార్డులు సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన విరాట్.. ఏడు అర్ద సెంచరీల సాయంతో 505 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ (సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్) సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్లో విరాట్ సాధించిన మరిన్ని రికార్డులు..👉ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 1146 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ పంజాబ్ కింగ్స్పై 1134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో వార్నర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.👉 సీఎస్కేపై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 10 సార్లు యాబైకిపైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉండేది. ధవన్ సీఎస్కేపై 9 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు.👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్లో ఒకే జట్టు తరపున 300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్(263) ఉన్నాడు.👉టీ20 క్రికెట్లో ఒకే వేదికలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్నస్వామి స్టేడియంలో 151 కొట్టాడు.👉ఐపీఎల్లో 8500 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ప్లేయర్గా కోహ్లి రికార్డులెక్కాడు.మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన సమరంలో సీఎస్కేపై ఆర్సీబీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. సీఎస్కే గెలుపుకు చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ విజయవంతంగా కాపాడుకుంది. యశ్ దయాల్ చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.సీఎస్కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్ ఆ ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. చివరి బంతి వరుకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్కేను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. ఈ మ్యాచ్లో మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ వరుస బంతుల్లో ఔట్ కావడం సీఎస్కేకు టర్నింగ్ పాయింట్. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఎంగిడి ఈ ఇద్దరి వికెట్లు తీసి ఆర్సీబీని గేమ్లోకి తెచ్చాడు.చివరి మూడు ఓవర్లలో (సుయాశ్, భువీ, దయాల్) ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సీజన్లో తొలిసారి భువీ వికెట్ లేకుండా అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (4-0-55-0). -
RCB VS CSK: షెపర్డ్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 3) జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై ఆర్సీబీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో ఆర్సీబీ చివరి ఓవర్లో 15 పరుగులను విజయవంతంగా కాపాడుకుంది. యశ్ దయాల్ చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైపోయినట్లే.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.సీఎస్కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్ ఆ ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.చరిత్ర సృష్టించిన ఆర్సీబీషెపర్డ్ విధ్వంసకాండ ధాటికి ఐపీఎల్లో ఆర్సీబీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇన్నింగ్స్ 19, 20 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో షెపర్డ్ చెలరేగిపోవడంతో ఆర్సీబీ చివరి రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 54 పరుగులు సాధించింది. గత సీజన్లో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ చివరి రెండు ఓవర్లలో 53 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఢిల్లీ రికార్డును బద్దలు కొట్టింది.చివరి 13 బంతుల్లో (నో బాల్తో కలుపుకుని) షెపర్డ్ ఒక్కడే 12 బంతులు ఎదుర్కొని.. 6 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు.చివరి రెండు ఓవర్లలో షెపర్డ్ (బంతుల వారీగా)19వ ఓవర్: 6, 6, 4, 6, 6 (నో బాల్), 0, 4 (ఖలీల్ అహ్మద్ వేసిన ఓవర్)20వ ఓవర్: 1, 4, 0, 4, 6, 6 (పతిరణ వేసిన ఓవర్)చివరి బంతి వరకు పోరాడిన సీఎస్కేఅనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. చివరి బంతి వరుకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్కేను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. ఈ మ్యాచ్లో మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ వరుస బంతుల్లో ఔట్ కావడం సీఎస్కే కొంప ముంచింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఎంగిడి ఈ ఇద్దరి వికెట్లు తీసి ఆర్సీబీని గేమ్లోకి తెచ్చాడు.బ్రెవిస్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంపైర్ నిర్ణయం డౌట్ ఫుల్గా ఉన్నా బ్రెవిస్ నిర్ణీత సమయంలో రివ్యూ తీసుకోకుండా లేట్ చేశాడు. తీరా రివ్యూలో చూస్తే అతడు నాటౌట్ అని తేలింది. ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న బ్రెవిస్ చివరి వరకు క్రీజ్లో ఉండి ఉంటే సీఎస్కే తప్పక గెలిచేది.చివరి మూడు ఓవర్లలో (సుయాశ్, భువీ, దయాల్) ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సీజన్లో తొలిసారి భువీ వికెట్ లేకుండా అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (4-0-55-0). -
సీఎస్కే నోటి కాడి గెలుపును లాగేసుకున్న యశ్ దయాల్.. గత సీజన్లోనూ ఇంతే..!
ఆర్సీబీ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ యశ్ దయాల్ చెన్నై సూపర్ కింగ్స్ నోటి కాడి గెలుపును లాగేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 3) జరిగిన మ్యాచ్లో ఇది జరిగింది. ఆర్సీబీ నిర్దేశించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ సీఎస్కే విజయం దిశగా సాగుతుండింది. చివరి ఓవర్లో ఆ జట్టు గెలుపుకు 15 పరుగులు కావాలి. ఈ దశలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ యశ్ దయాల్కు బంతినందించాడు. దయాల్ కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా 15 పరుగులను విజయవంతంగా కాపాడుకున్నాడు. క్రీజ్లో ధోని, జడేజా, దూబే ఉన్నా ఏమీ చేయలేకపోయారు.తొలి రెండు బంతులకు రెండు సింగిల్స్ ఇచ్చిన దయాల్.. మూడో బంతికి ధోనిని ఔట్ చేశాడు. ఆ తర్వాత నాలుగో బంతికి దూబే సిక్సర్ బాదగా, అది కాస్త నో బాల్ అయ్యింది. దీంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. సీఎస్కే గెలుపు చివరి మూడు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే కావాలి. క్రీజ్లో దూబే, జడేజా ఉన్నారు. ఈ దశలో సీఎస్కే గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. అయితే దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి చివరి మూడు బంతులకు మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో సీఎస్కే 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దయాల్ గత సీజన్లోనూ ఇలాగే సీఎస్కే నోటి కాడి గెలుపును లాగేసుకున్నాడు. ఆ మ్యాచ్లోనూ దయాల్ చివరి ఓవర్ను అద్భుతంగా బౌలింగ్ చేసి 16 పరుగులను విజయవంతంగా కాపాడుకున్నాడు.ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. చివరి మ్యాచ్ల్లోనైనా గెలిచి పరువు కాపాడుకుందామనుకుంటే దయాల్ ఈ మ్యాచ్లో సీఎస్కేను దెబ్బకొట్టాడు. సీఎస్కే ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైపోయినట్లే.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (55), విరాట్ కోహ్లి (62), రొమారియో షెపర్ట్ (53 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్లో ఆర్సీబీ మధ్యలో కాస్త తడబడినా, ఆఖర్లో షెపర్ట్ సునామీలా విరుచుకుపడి భారీ స్కోర్ అందించాడు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ హాఫ్ సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైంది. సీఎస్కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే ఆదిలో నిదానంగా ఆడినా.. ఆ తర్వాత గేర్ మార్చింది. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఆయుశ్ మాత్రే చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో 5 ఫోర్లు, సిక్సర్ సహా 26 పరుగులు రాబట్టాడు. ఆతర్వాత కూడా జోరు కొనసాగించిన మాత్రే సీఎస్కేను విజయతీరాలు దాటించే ప్రయత్నంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో మాత్రే 48 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి తృటిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. మరో ఎండ్లో రవీంద్ర జడేజా కూడా చెలరేగడంతో ఈ సీజన్లో సీఎస్కే తొలిసారి అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. జడేజా 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి తమ జట్టుకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఈ మ్యాచ్లో సీఎస్కేకు టర్నింగ్ పాయింట్ డెవాల్డ్ బ్రెవిస్ వికెట్. ఆయుశ్ మాత్రే ఔటైన మరుసటి బంతికే బ్రెవిస్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంపైర్ నిర్ణయం డౌట్ ఫుల్గా ఉన్నా బ్రెవిస్ నిర్ణీత సమయంలో రివ్యూ తీసుకోకుండా లేట్ చేశాడు. తీరా రివ్యూలో చూస్తే అతడు నాటౌట్ అని తేలింది. ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న బ్రెవిస్ చివరి వరకు క్రీజ్లో ఉండి ఉంటే సీఎస్కే తప్పక గెలిచేది. చివరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. జడేజా 77, శివమ్ దూబే 8 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సీజన్లో తొలిసారి భువీ వికెట్ లేకుండా అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (4-0-55-0). -
శ్రేయాంకతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ (ఫొటోలు)
-
IPL 2025: ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం చేస్తున్న భువీ.. ఈ క్రమంలో అరుదైన ఘనత
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం (టైటిల్ సాధించడం) చేస్తున్న వ్యక్తుల్లో భువనేశ్వర్ కుమార్ ముఖ్యుడు. ఈ సీజన్లో భువీ ఆడిన ప్రతి మ్యాచ్లో సత్తా చాటి ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 9 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.తాజాగా (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేయడమే (4 ఓవర్లలో 33 పరుగులు) కాకుండా 3 వికెట్లు తీసి ఆర్సీబీ గెలుపులో ముఖ్య భూమిక పోషించాడు. ఈ క్రమంలో ఓ ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పియూశ్ చావ్లాను (192) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం భువీ ఖాతాలో 193 వికెట్లు (185 మ్యాచ్ల్లో) ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 169 మ్యాచ్ల్లో 214 వికెట్లు తీసి టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లుయుజ్వేంద్ర చహల్- 214భువనేశ్వర్ కుమార్- 193పియూశ్ చావ్లా- 192సునీల్ నరైన్- 187రవిచంద్రన్ అశ్విన్- 185ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భువీ ప్రదర్శనలు..సీఎస్కేపై 1/20 (ఆర్సీబీ గెలుపు)గుజరాత్పై 1/23 (ఆర్సీబీ ఓటమి)ముంబై ఇండియన్స్పై 1/48 (ఆర్సీబీ గెలుపు)ఢిల్లీ క్యాపిటల్స్పై 2/26 (ఆర్సీబీ ఓటమి)రాజస్థాన్ రాయల్స్పై 1/32 (ఆర్సీబీ గెలుపు)పంజాబ్ కింగ్స్పై 2/26 (ఆర్సీబీ ఓటమి)పంజాబ్ కింగ్స్పై 0/26 (ఆర్సీబీ గెలుపు)రాజస్థాన్ రాయల్స్పై 1/50 (ఆర్సీబీ గెలుపు)ఢిల్లీ క్యాపిటల్స్పై 3/33 (ఆర్సీబీ గెలుపు)35 ఏళ్ల భువీ ఆర్సీబీకి ముందు సన్రైజర్స్ హైదరాబాద్, పూణే వారియర్స్కు ప్రాతినిథ్యం వహించాడు. సన్రైజర్స్ తరఫున విశేషంగా రాణించిన భువీ.. ఆ ఫ్రాంచైజీ తరఫున 157 వికెట్లు తీశాడు. మధ్యలో రెండు సీజన్లు పుణేకు ఆడి 31 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఆడుతూ 9 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు. భువీ తన ఐపీఎల్ కెరీర్లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ (సీజన్లో అత్యధిక వికెట్లు) హోల్డర్గా నిలిచాడు. 2016, 20167 సీజన్ల వరుసగా ఈ ఫీట్ను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో కేవలం డ్వేన్ బ్రావో, హర్షల్ పటేల్ మాత్రమే రెండు సార్లు పర్పుల్ క్యాప్ సాధించారు.నిన్న జరిగిన ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్ విషయానికొస్తే.. భువీతో పాటు హాజిల్వుడ్ (4-0-36-2), సుయాశ్ శర్మ (4-0-22-0), కృనాల్ పాండ్యా (4-0-28-1) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 162 పరుగుల స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ ఆదిలో తడబడినప్పటికీ (4 ఓవర్లలో 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది).. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ (4-0-19-2), కుల్దీప్ యాదవ్ (4-0-28-0), చమీరా (3-0-24-1) బాగానే బౌలింగ్ చేసినప్పటికీ.. లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఆ జట్టు బౌలర్లలో స్టార్క్ (3-0-31-0), ముకేశ్ కుమార్ (3.3-0-51-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఢిల్లీపై గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) ఈ జట్టు సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. మే 9న ఎల్ఎస్జీని లక్నోను ఢీకొంటుంది. ఆతర్వాత సన్రైజర్స్, కేకేఆర్లను బెంగళూరులో ఎదుర్కొంటుంది. -
IPL 2025: ప్రభ కోల్పోతున్న ఢిల్లీ .. ఇలాగే కొనసాగితే కష్టం..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ను వరుసగా నాలుగు విజయాలతో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ సాగే కొద్ది ప్రభ కోల్పోతున్నట్లు కనిపిస్తుంది. చివరి ఐదు మ్యాచ్ల్లో ఆ జట్టు మూడు పరాజయాలు ఎదుర్కొని రెండే విజయాలు సాధించింది. ఇందులో ఒకటి సూపర్ ఓవర్లో (రాజస్థాన్ రాయల్స్) గెలిచింది. తాజాగా (ఏప్రిల్ 27) ఈ జట్టు సొంత మైదానంలో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. ఈ ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. లీగ్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఢిల్లీని వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. తాజాగా ఢిల్లీపై గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. గుజరాత్ రెండో స్థానానికి పడిపోయింది. ఢిల్లీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 6 విజయాలు, 3 పరాజయలతో 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఆ జట్టు రన్రేట్ 0.482గా ఉంది. గుజరాత్, ముంబై కూడా చెరో 12 పాయింట్లు కలిగినప్పటికీ వారి రన్రేట్ ఢిల్లీ కంటే మెరుగ్గా ఉంది. ఢిల్లీ తదుపరి ఆడబోయే మ్యాచ్ల్లో ఇలాంటి ప్రదర్శనే కొనసాగిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదముంది. లీగ్ ప్రారంభంలో అద్భుత విజయాలు సాధించిన జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోలేని సందర్భాలు చాలా ఉన్నాయి. ఢిల్లీ ఇకనైనా జాగ్రత్త పడితేనే టైటిల్ వేట కొనసాగించగలదు.నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి అతి తక్కువ స్కోర్కు (162) పరిమితమైన ఢిల్లీ.. ఆ తర్వాత బౌలింగ్లోనూ పెద్దగా ప్రభావం చూపలేక ఓటమిపాలైంది. ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేస్తూ ఢిల్లీ చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై ఢిల్లీ బ్యాటర్లు తడబడ్డారు. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇక్కడ క్రెడిట్ ఆర్సీబీ బౌలర్లకు ఇవ్వాలి. భువనేశ్వర్ కుమార్ (4-0-33-3), హాజిల్వుడ్ (4-0-36-2), సుయాశ్ శర్మ (4-0-22-0), కృనాల్ పాండ్యా (4-0-28-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ కూడా ఆదిలో తడబడినప్పటికీ (4 ఓవర్లలో 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది).. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ (4-0-19-2), కుల్దీప్ యాదవ్ (4-0-28-0), చమీరా (3-0-24-1) బాగానే బౌలింగ్ చేసినప్పటికీ.. లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఆ జట్టు బౌలర్లలో స్టార్క్ (3-0-31-0), ముకేశ్ కుమార్ (3.3-0-51-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్లో ఢిల్లీ అన్ని విభాగాల్లో సామర్థ్యం మేరకు రాణించలేక ఓటమిపాలైంది.మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 10-15 పరుగులు తక్కువగా చేశామని భావిస్తున్నాను. మేము బ్యాటింగ్ చేసేటప్పుడు మంచు కారణంగా వికెట్ కాస్త కఠినంగా ఉండింది. ఆర్సీబీ బ్యాటింగ్ చేసే సమయానికి వికెట్ సులువుగా మారింది. ఈ మ్యాచ్లో మేము కొన్ని ఈజీ క్యాచ్లను మిస్ చేశాము. ఆ క్యాచ్లను పట్టి ఉండాల్సింది. మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాము. ఓ బ్యాటర్ కొంత సమయం క్రీజ్లో గడిపి ఉంటే వేగంగా పరుగులు సాధించగలిగేవాడు. అదనంగా 10-15 పరుగులు వచ్చేవి. బ్యాటింగ్ ఆర్డర్లో ఓ స్థానం కిందికి రావడంపై స్పందిస్తూ.. రాహుల్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే అతన్ని 4వ స్థానంలో పంపాము. మైదానంలో ఓ వైపు చిన్నగా ఉంది. రాహుల్ను ముందుగా పంపడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పాడు. -
DC VS RCB: 3267 రోజుల తర్వాత చేసిన అర్ద సెంచరీ.. క్రెడిట్ విరాట్కే: కృనాల్ పాండ్యా
ఆర్సీబీ ఆటగాడు కృనాల్ పాండ్యా ఆల్రౌండరే అయినప్పటికీ.. ఐపీఎల్లో అతను బ్యాట్కు ఎక్కువగా పని చెప్పలేదు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కృనాల్ చాలాకాలం తర్వాత బ్యాట్తో రాణించాడు. ఈ మ్యాచ్లో 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు (నాటౌట్) చేసిన కృనాల్ ఆర్సీబీని గెలిపించాడు. ఈ గెలుపులో కృనాల్ది ప్రధానపాత్ర. తొలుత బౌలింగ్లో రాణించిన (4-0-28-1) అతను.. ఆతర్వాత బ్యాట్తో చెలరేగిపోయాడు. 3267 రోజుల తర్వాత కృనాల్ ఐపీఎల్లో చేసిన తొలి అర్ద శతకం ఇదే. 137 మ్యాచ్ల ఐపీఎల్ కెరీర్లో కృనాల్కు ఇది కేవలం రెండో అర్ద శతకం మాత్రమే. అతని తొలి అర్ద శతకం కూడా ఢిల్లీపైనే చేశాడు. 2016 సీజన్లో ఇది జరిగింది. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగే కృనాల్ పెద్దగా భారీ స్కోర్లు చేయనప్పటికీ.. మ్యాచ్ను ప్రభావితం చేసే స్వీట్ అండ్ షార్ట్ ఇన్నింగ్స్లు ఆడతాడు.నిన్నటి మ్యాచ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (26/3, 4 ఓవర్లు) బరిలోకి దిగిన కృనాల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో తొలుత నిదానంగా ఆడిన కృనాల్.. ఆతర్వాత గేర్ మార్చి విధ్వంసం సృష్టించాడు. తొలి 28 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసిన కృనాల్.. ఆతర్వాత ఎదుర్కొన్న 19 బంతుల్లో ఏకంగా 48 పరుగులు పిండుకున్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో రెచ్చిపోయిన కృనాల్ ముకేశ్ కుమార్ బౌలింగ్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఆతర్వాత కుల్దీప్ బౌలింగ్లో ఓ సిక్సర్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో బ్యాట్తో పాటు బంతితో కూడా సత్తా చాటినందుకు కృనాల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.మ్యాచ్ అనంతరం కృనాల్ మాట్లాడుతూ ఇలా ఆన్నాడు. నా పాత్రకు న్యాయం చేసినందుకు ఆనందంగా ఉంది. విరాట్తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సులువగా ఉంటుంది. అతను ప్రతి బంతికి ప్రోత్సహిస్తుంటాడు. ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. విరాట్ గైడెన్స్లో నేనే మంచి ఇన్నింగ్స్ ఆడాను. తొలి 20 బంతులు పరుగుల కోసం ఇబ్బంది పడ్డాను. అయితే విరాట్ నింపిన స్పూర్తితో లయను అందుకుని భారీ షాట్లు ఆడగలిగాను. క్రెడిట్ విరాట్కి దక్కుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. మే 9న ఎల్ఎస్జీని లక్నోను ఢీకొంటుంది. ఆతర్వాత సన్రైజర్స్, కేకేఆర్లను బెంగళూరులో ఎదుర్కొంటుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉన్న ఆర్సీబీ ఇంకో మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. -
DC VS RCB: భారీ రికార్డును తృటిలో మిస్సైన విరాట్
ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఏప్రిల్ 27) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డును తృటిలో మిస్ అయ్యాడు. ఈ మ్యాచ్లో విరాట్ మరో 5 పరుగులు చేసుంటే ఐపీఎల్లో ఓ ప్రత్యర్థిపై (ఏ ప్రత్యర్థిపై అయినా) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పి ఉండేవాడు. ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ పంజాబ్ కింగ్స్పై 1134 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఓ ప్రత్యర్థిపై ఓ ఆటగాడు చేసిన అత్యధిక పరగులు ఇవే. నిన్నటి మ్యాచ్లో ఢిల్లీపై చేసిన 51 పరుగులతో ఆ ఫ్రాంచైజీపై విరాట్ చేసిన పరుగుల సంఖ్య 1130 పరుగులకు చేరింది. ఈ మ్యాచ్లో విరాట్ మరో 5 పరుగులు చేసుంటే వార్నర్ రికార్డు బద్దలు కొట్టి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకుని ఉండేవాడు. ఈ మ్యాచ్లో విరాట్ 47 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి దుష్మంత చమీరా బౌలింగ్లో మిచెల్ స్టార్క్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఐపీఎల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు1134 - డేవిడ్ వార్నర్ vs PBKS1130 - విరాట్ కోహ్లీ vs DC*1104 - విరాట్ కోహ్లీ vs PBKS1093 - డేవిడ్ వార్నర్ vs KKR1084 - విరాట్ కోహ్లీ vs CSK1083 - రోహిత్ శర్మ vs KKRకాగా, నిన్నటి మ్యాచ్లో విరాట్ బాధ్యాతాయుతమైన హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ ఇన్నింగ్స్తో విరాట్ సైతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నాడు. విరాట్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 6 అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి ఢిల్లీని స్వల్ప స్కోర్కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. -
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ప్రదర్శన జోరుగా సాగుతుంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. నిన్న (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్ను వారి సొంత ఇలాకాలో ఓడించిన ఆ జట్టు ఓ అరుదైన ఘనత సాధించింది. ఈ సీజన్లో 7 వేర్వేరు వేదికల్లో మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. తొలుత కేకేఆర్పై కోల్కతాలో, ఆతర్వాత సీఎస్కేపై చెన్నైలో, ఎంఐపై ముంబైలో, ఆర్ఆర్పై జైపూర్లో, పంజాబ్పై చంఢీఘడ్లో, ఆర్ఆర్పై బెంగళూరులో, తాజాగా డీసీపై ఢిల్లీలో విజయాలు సాధించింది.ఈ సీజన్లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్ను వారి సొంత మైదానంలో (లక్నో) ఓడిస్తే చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఆర్సీబీ లక్నోలో విజయం సాధిస్తే ఈ సీజన్లో ఆడిన 7 అవే మ్యాచ్ల్లో (ప్రత్యర్థి సొంత మైదానాల్లో జరిగే మ్యాచ్లు) విజయాలు సాధించిన జట్టుగా నిలుస్తుంది. తద్వారా ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. గతంలో ఏ జట్టు ఓ సీజన్లో ఆడిన అన్ని అవే మ్యాచ్ల్లో గెలవలేదు.ఆర్సీబీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 అవే మ్యాచ్లతో పాటు ఓ హోం గ్రౌండ్ (బెంగళూరు) మ్యాచ్లో విజయాలు సాధించింది. మే 9న జరిగే మ్యాచ్లో ఆర్సీబీ ఎల్ఎస్జీని లక్నోను ఢీకొంటుంది. అంతుకుముందు సీఎస్కేతో బెంగళూరులో (మే 3) తలపడుతుంది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సీఎస్కే, ఎల్ఎస్జీ మ్యాచ్ల తర్వాత సన్రైజర్స్, కేకేఆర్లతో బెంగళూరులోనే తలపడనుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉన్న ఆర్సీబీ ఇంకో మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. -
IPL 2025: మరోసారి 'ఆ బిరుదుకు' సార్థకత చేకూర్చిన విరాట్ కోహ్లి
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హవా కొనసాగుతుంది. నిన్న (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసిన అతను.. లీడింగ్ రన్ స్కోరర్గా అవతరించాడు. ఈ సీజన్లో విరాట్ ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 6 అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద సెంచరీలు ఛేజింగ్లో చేసినవే కావడం విశేషం.ఫార్మాట్ ఏదైనా విరాట్కు ఛేజింగ్ మాస్టర్గా బిరుదు ఉంది. ఆ బిరుదుకు విరాట్ మరోసారి సార్థకత చేకూర్చాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ఛేజింగ్కు దిగిన నాలుగు సందర్భాల్లో విరాట్ 4 అర్ద సెంచరీలు చేసి తన జట్టును గెలిపించాడు. ఇందులో మూడు సార్లు నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా విరాట్లో ఇంకా చేవ తగ్గలేదు.బ్యాటర్గా సూపర్ ఫామ్లో ఉండటమే కాకుండా తన జట్టును దాదాపు ప్రతి మ్యాచ్లో గెలిపిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ విఫలమైన మ్యాచ్ల్లో మాత్రమే ఆర్సీబీ ఓడింది. విరాట్ 30కి పైగా స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. అంతలా విరాట్ ఈ యేడు ఆర్సీబీ విజయాలను ప్రభావితం చేస్తున్నాడు. ప్రస్తుతం విరాట్ను చూస్తుంటే కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.ఇదే జోరును అతను మరో ఐదారు మ్యాచ్లు కొనసాగిస్తే ఆర్సీబీ ఈసారి టైటిల్ గెలవడం ఖాయం. ఆర్సీబీ ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేనంత జోష్లో కనిపిస్తుంది. జట్టులో అందరూ రాణిస్తున్నారు. కెప్టెన్గా పాటిదార్ తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు. కోహ్లి భీకర ఫామ్లో ఉన్నాడు. బౌలర్లలో హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కృనాల్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్లతో అదరగొడుతున్నాడు. పడిక్కల్, టిమ్ డేవిడ్ ఇరగదీస్తున్నారు.పాటిదార్ బ్యాటర్గా ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. జితేశ్ శర్మ, రొమారియో షెపర్డ్కు తమను తాము నిరూపించుకునే అవకాశం రాలేదు. యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ వికెట్లు తీయలేకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. పేసర్ యశ్ దయాల్ నాట్ బ్యాడ్ అనిపిస్తున్నాడు.విరాట్ ఓపెనింగ్ పార్ట్నర్గా ఎవరూ సెట్ కాకపోవడమే ప్రస్తుతం ఆర్సీబీ వేధిస్తున్న ఏకైక సమస్య. సాల్ట్ ఓ మ్యాచ్లో మెరిసినా మిగతా అన్ని మ్యాచ్ల్లో తేలిపోయాడు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో జేకబ్ బేతెల్ను ప్రయోగించినా అతను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఒక్క సమస్యను పక్కన పెడితే ఈ సీజన్లో ఆర్సీబీ టైటిల్ ఫేవరెట్లలో ముందు వరుసలో ఉంది. కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. -
IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్లో కోహ్లి, హాజిల్వుడ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ డిమినేషన్ కొనసాగుతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. నిన్న (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్ను వారి సొంత ఇలాకాలో ఓడించిన అనంతరం టాప్ ప్లేస్కు దూసుకొచ్చింది. ఈ గెలుపుతో కొద్ది రోజుల కిందట బెంగళూరులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రత్యర్థి హోం గ్రౌండ్స్లో ఆడిన ప్రతి మ్యాచ్లో గెలిచింది.నిన్నటి మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనల తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోరు), జోష్ హాజిల్వుడ్ (4-0-36-2 కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానానికి దూసుకొచ్చారు. బ్యాటింగ్లో విరాట్ (10 మ్యాచ్ల్లో 443 పరుగులు) టాప్ రన్ స్కోరర్గా.. బౌలింగ్లో హాజిల్వుడ్ (10 మ్యాచ్ల్లో 18 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచారు. ఓవరాల్గా ఈ సీజన్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయిస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతుంది.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు (ఆరెంజ్ క్యాప్)విరాట్ కోహ్లి- 443సూర్యకుమార్ యాదవ్- 427సాయి సుదర్శన్- 417నికోలస్ పూరన్- 404మిచెల్ మార్ష్- 378ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (పర్పుల్ క్యాప్)జోష్ హాజిల్వుడ్- 18ప్రసిద్ద్ కృష్ణ- 16నూర్ అహ్మద్- 14ట్రెంట్ బౌల్ట్- 13కృనాల్ పాండ్యా- 13అత్యధిక హాఫ్ సెంచరీలు- విరాట్ (6)పాయింట్ల పట్టిక1. ఆర్సీబీ (14 పాయింట్లు, 0.521 రన్రేట్)2. గుజరాత్ టైటాన్స్ (12, 1.104)3. ముంబై ఇండియన్స్ (12, 0.889)4. ఢిల్లీ క్యాపిటల్స్ (12, 0.482)5. పంజాబ్ కింగ్స్ (11, 0.177)కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (51), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు (18.3 ఓవర్లలో). ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. -
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం
-
కృనాల్ ఆల్రౌండ్ షో.. ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్బుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లి తమ అద్బుత ఇన్నింగ్స్లతో విజయతీరాలకు చేర్చారు. కృనాల్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 73 పరుగులు చేయగా.. విరాట్ 46 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.ఆఖరిలో టిమ్ డేవిడ్(5 బంతుల్లో 19) మెరుపులు మెరిపించాడు. ఈ విజయంతో చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ చేతిలో ఎదురైన పరాభావానికి ఆర్సీబీ బదులు తీర్చుకుంది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా.. చమీరా ఓ వికెట్ సాధించాడు. మరో వికెట్ రనౌట్ రూపంలో లభించింది.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(41) టాప్ స్కోరర్గా నిలవగా.. స్టబ్స్(34),ఫాఫ్ డుప్లెసిస్(22), అభిషేక్ పోరెల్(28) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హాజిల్వుడ్ రెండు, దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్దానికి చేరుకుంది. -
IPL 2025: విరాట్ 30కి పైగా స్కోర్ చేశాడా, ఆర్సీబీ గెలిచినట్లే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 27) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీని ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ, ఆర్సీబీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ 8 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ తొమ్మిదింట ఆరు గెలిచి అదే 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఇరు జట్ల రన్రేట్లు కూడా దగ్గరగా ఉన్నాయి. ఢిల్లీ 0.657 రన్రేట్తో ఆర్సీబీ (0.482) కంటే కాస్త మెరుగ్గా ఉంది.ఇరు జట్లు ఈ సీజన్లో తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 10న ఆర్సీబీ ఇలాకా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో కేఎల్ రాహుల్ (93 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని ఒంటిచేత్తో గెలిపించాడు. మ్యాచ్ అనంతరం 'ఇది నా అడ్డా' అంటూ రాహుల్ చేసుకున్న సెలబ్రేషన్స్ సోషల్మీడియాలో వైరలయ్యాయి.ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ (4-0-18-2), కుల్దీప్ యాదవ్ (4-0-17-2), ముకేశ్ కుమార్ (3-1-26-1), మోహిత్ శర్మ (2-0-10-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని కట్టడి చేశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో సాల్ట్ (37), కోహ్లి (22), రజత్ పాటిదార్ (25), కృనాల్ పాండ్యా (18), టిమ్ డేవిడ్ (37 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ కూడా తొలుత తడబడింది. ఆ జట్టు 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్, స్టబ్స్ (38 నాటౌట్) ఢిల్లీని ఆదుకుని విజయతీరాలకు చేర్చారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ 2, యశ్ దయాల్, సుయాశ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో ఎదురైన పరాభవానికి ఆర్సీబీ నేటి మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఈ సీజన్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీ ప్రత్యర్థుల సొంత మైదానల్లో అపజయమనేదే లేకుండా దూసుకుపోతుంది. నేటి మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్లో కావడంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ తప్పక గెలుస్తుందని అంతా అనుకుంటున్నారు.ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషిస్తున్నాడు. విరాట్ 30కి పైగా స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. విరాట్ విఫలమైన మూడు మ్యాచ్ల్లో (గుజరాత్పై 7, ఢిల్లీపై 22, పంజాబ్పై 1) ఆర్సీబీ ఓడింది. ఈ లెక్కన చూస్తే నేడు ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్లో విరాట్ 30కి పైగా స్కోర్ చేస్తే ఆర్సీబీ గెలవడం ఖాయమని సెంటిమెంట్లు చెబుతున్నాయి. ఈ సీజన్లో విరాట్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీల సాయంతో 392 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. -
పాకిస్తాన్ హెడ్ కోచ్గా ఆర్సీబీ మాజీ డైరెక్టర్..?
పాకిస్తాన్ పురుషల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి ఆకిబ్ జావేద్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాక్ ఘోర ప్రదర్శన అనంతరం జావేద్ తన పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో హెడ్ కోచ్ లేకుండానే పాక్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది.అక్కడ కూడా అదే తీరును మెన్ ఇన్ గ్రీన్ కనబరిచింది. పాక్ జట్టు ఈ ఏడాది జూలై ఆఖరిలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ వ్యవధిలో తమ జట్టు కొత్త హెడ్ కోచ్ను ఎంపిక చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. పాకిస్తాన్ హెడ్ కోచ్ రేసులో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్రికెట్ మాజీ డైరెక్టర్ మైక్ హెస్సన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే అతడితో పీసీబీ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.హెస్సన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రధాన కోచ్గా ఉన్నాడు. అతడి నేతృత్వంలోనే ఇస్లామాబాద్ యునైటెడ్ గతేడాది పీఎస్ఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్లో కోచ్గా అతడికి అపారమైన అనుభవం ఉంది. గతంలో న్యూజిలాండ్ కోచ్గా, ఆర్సీబీ క్రికెట్ డైరక్టర్గా హెస్సన్ పనిచేశాడు. ఈ క్రమంలోనే అతడిని తమ హెడ్ కోచ్గా నియమించాలని పీసీబీ భావిస్తోందంట. అయితే హెడ్ కోచ్ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సైమన్ కాటిచ్, న్యూజిలాండ్ ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ ల్యూక్ రోంచిలతో కూడా పీసీబీ సంప్రదింపులు జరిపినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.చదవండి: IPL 2025: రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్.. ఇక కష్టమే మరి? -
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో విరాట్ ఛేదనలో అద్భుతమైన హాఫ్ సెంచరీతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అదరగొట్టి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్లో విరాట్కు ఇది మూడో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఓవరాల్గా 19వది.ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో విరాట్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. రోహిత్ కూడా ఐపీఎల్లో ఇప్పటివరకు 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. విరాట్, రోహిత్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు క్రిస్ గేల్ (22) పేరిట ఉంది. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్, రోహిత్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్లు)19 - రోహిత్ శర్మ (263 మ్యాచ్లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్లు)ఈ మ్యాచ్లో విరాట్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్- 66 (62, 4)శిఖర్ ధవన్- 53 (51, 2)రోహిత్ శర్మ- 45 (43, 2)కేఎల్ రాహుల్- 43 (39, 4)ఏబీ డివిలియర్స్- 43 (40, 3)ఐపీఎల్లో విరాట్ పేరిట ఉన్న రికార్డు..అత్యధిక పరుగులుఅత్యధిక శతకాలుఅత్యధిక 50 ప్లస్ స్కోర్లుఅత్యధిక బౌండరీలుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్ను స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ చేసి ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. -
పడిక్కల్ విధ్వంసం, సత్తా చాటిన విరాట్.. పంజాబ్పై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగగా.. ఆ మ్యాచ్లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో పంజాబ్ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్ను స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ వికెట్లు తీయకపోయినా.. పొదుపుగా బౌలింగ్ చేశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. -
PBKS VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో భారీ రికార్డు సొంతం
పరుగుల యంత్రం విరాట్ కోహ్లి మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్- 66 (62, 4)శిఖర్ ధవన్- 53 (51, 2)రోహిత్ శర్మ- 45 (43, 2)కేఎల్ రాహుల్- 43 (39, 4)ఏబీ డివిలియర్స్- 43 (40, 3)మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్పూర్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (73) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. జితేశ్ శర్మ (11) సిక్సర్ బాది మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో దేవ్దత్ పడిక్కల్ (61) మెరుపు అర్ద సెంచరీ చేయగా.. సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీఈ మ్యాచ్లో గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పంజాబ్ను కిందికి దించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి. -
ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకున్నారని.. ఒక్కరు కూడా బుద్ధిని ఉపయోగించలేకపోయారంటూ ఘాటుగా విమర్శించాడు.హోం గ్రౌండ్లో వరుస పరాజయాలు కాగా సొంత మైదానంలో ఇతర జట్లు ఇరగదీస్తుంటే ఆర్సీబీ మాత్రం.. హోం గ్రౌండ్లో వరుస పరాజయాలు నమోదు చేస్తోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ పాటిదార్ సేన ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఈ పోరును 14 ఓవర్లకు కుదించారు.పెవిలియన్కు క్యూ ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే వరుసగా షాకులు తగిలాయి. పంజాబ్ పేసర్ అర్ష్దీప్ బౌలింగ్లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (Virat Kohli- 1) వెనువెంటనే వెనుదిరిగారు. ఇక వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ (23) నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా చహల్ అతడిని పెవిలియన్కు చేర్చాడు.2️⃣ sharp catches 🫡2️⃣ early strikes ✌Arshdeep Singh and #PBKS with a solid start ⚡Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/jCt2NiuYEH— IndianPremierLeague (@IPL) April 18, 2025 డేవిడ్ మెరుపుల వల్లమిగిలిన వాళ్లలో లియామ్ లివింగ్స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1) పూర్తిగా విఫలం కాగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ 14 ఓవర్లలో 95 పరుగులు చేయగలిగింది.𝘽𝙊𝙊𝙈 💥Nehal Wadhera is in a hurry to finish it for #PBKS 🏃Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/upMlSvOJi9— IndianPremierLeague (@IPL) April 18, 2025ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినా నేహాల్ వధేరా ధనాధన్ ఇన్నింగ్స్ (19 బంతుల్లో 33 నాటౌట్) కారణంగా.. పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో పంజాబ్తో మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్ల తీరుపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?‘‘ఆర్సీబీ బ్యాటింగ్ మరీ తీసికట్టుగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యపు షాట్లు ఆడారు. ఒక్కరంటే ఒక్కరు కూడా.. మంచి బంతికి అవుట్ కాలేదు. అంతా సాధారణ బంతులే ఆడలేక పెవిలియన్ చేరారు.ఆర్సీబీ బ్యాటర్లలో ఒక్కరైనా కామన్ సెన్స్ ఉపయోగించి ఉంటే బాగుండేది. వాళ్ల చేతిలో గనుక వికెట్లు ఉండి ఉంటే స్కోరు 14 ఓవర్లలో కనీసం 110- 120గా ఉండేది. తద్వారా విజయం కోసం పోరాడే పరిస్థితి ఉండేది. కానీ వీళ్లు మాత్రం చేతులెత్తేశారు.సొంత మైదానంలో ఆర్సీబీ గెలవలేకపోతోంది. పాటిదార్ ఇందుకు పరిష్కారాన్ని కనుగొనాలి. నిజానికి ఆర్సీబీ బౌలర్లు బాగానే ఆడుతున్నారు. కానీ బ్యాటర్లే చిత్రంగా ఉన్నారు. సొంత మైదానంలో అందరూ వరుసగా విఫలమవుతున్నారు’’ అని క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇటు కోహ్లి.. అటు భువీకాగా ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగు గెలిచి పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లోనూ ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లలో కలిపి అతడు 249 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి ఓపెనింగ్ జోడీ అయిన ఫిల్ సాల్ట్ 212 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. కెప్టెన్ పాటిదార్ ఇప్పటికి 209 పరుగులు సాధించాడు. బౌలర్లలో ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్ టాప్లో ఉన్నాడు. ఈ సీజన్లో భువీ ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు తీశాడు.చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్ -
ఐపీఎల్ లో బెంగళూరుపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం
-
IPL 2025: చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీపై పంజాబ్ విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఆర్సీబీపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జన్సెన్, చహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డేవిడ్తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. అయితే నేహల్ వధేరా (33 నాటౌట్) ఏమాత్రం జంక కుండా బ్యాటింగ్ చేసి పంజాబ్ను విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. యశ్ దయాల్ బౌలింగ్లో సిక్సర్ బాది స్టోయినిస్ (7 నాటౌట్) మ్యాచ్ను ముగించాడు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రియాంశ్ ఆర్య 16, ప్రభ్సిమ్రన్ సింగ్ 13, శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లిస్ 14, శశాంక్ సింగ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. -
IPL 2025: ఆర్సీబీపై పంజాబ్ విజయం
ఆర్సీబీపై పంజాబ్ విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జన్సెన్, చహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డేవిడ్తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. అయితే నేహల్ వధేరా (33 నాటౌట్) ఏమాత్రం జంక కుండా బ్యాటింగ్ చేసి పంజాబ్ను విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. యశ్ దయాల్ బౌలింగ్లో సిక్సర్ బాది స్టోయినిస్ (7 నాటౌట్) మ్యాచ్ను ముగించాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రియాంశ్ ఆర్య 16, ప్రభ్సిమ్రన్ సింగ్ 13, శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లిస్ 14, శశాంక్ సింగ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్2.4వ ఓవర్- 22 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్లో టిమ్ డేవిడ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ప్రభ్సిమ్రన్ (13) ఔటయ్యాడు. పంజాబ్ బౌలర్ల విజృంభణ.. 95 పరుగులకే పరిమితమైన ఆర్సీబీవర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అర్షదీప్, జన్సెన్, చహల్, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డేవిడ్తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు. 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ సింగ్ 2, బార్ట్లెట్, జన్సెన్, చహల్ తలో వికెట్ తీశారు. పాటిదార్ (21), టిమ్ డేవిడ్ (5) క్రీజ్లో ఉన్నారు. 6.3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 38/5గా ఉంది. కోహ్లి ఔట్.. 21 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ2.4వ ఓవర్- 21 పరుగులకే ఆర్సీబీ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి (1) ఔటయ్యాడు. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్లో తొలి బంతికే బౌండరీ బాదిన సాల్ట్ నాలుగో బంతికి మరో భారీ షాట్కు ప్రయత్నించి వికెట్ కీపర్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ రెండు మార్పులు చేసింది. మ్యాక్స్వెల్ స్థానంలో స్టోయినిస్ జట్టులోకి వచ్చాడు. హర్ప్రీత్ బ్రార్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్ ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, నేహాల్ వధేరా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, విజయ్కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్జ్, గ్లెన్ మాక్స్వెల్, ప్రవీణ్ దూబే9:30 గంటలకు టాస్.. 14 ఓవర్ల మ్యాచ్టాస్ 9:30 గంటలకు పడనుంది. 9:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్ ప్లే 4 ఓవర్లుగా తేల్చారు. ముగ్గురు బౌలర్లు నాలుగు ఓవర్లు, ఓ బౌలర్ మిగతా రెండు ఓవర్లు బౌల్ చేయవచ్చు. తగ్గిన వర్షం.. తొలిగిన కవర్లు9:05 గంటలు- ఎట్టకేలకు వర్షం తగ్గుముఖం పట్టడంతో మైదాన సిబ్బంది కవర్లను తొలగించారు. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి వార్మప్ మొదలుపెట్టారు. ఎంతకీ తగ్గని వర్షం.. ఓవర్ల కోత మొదలైంది8:30 గంటలు-సాయంత్రం ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గడం లేదు. ఇకపై మ్యాచ్ ప్రారంభమైనా ఓవర్ల కోత తప్పదని తెలుస్తుంది.ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ హెం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలాడు. టాస్ ఆలస్యమయ్యే అవకాశముంది. గత రెండు, మూడు గంటల నుంచి వర్షం పడుతుండటంతో స్టేడియం మొత్తం కవర్లు కప్పి ఉంచారు. మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదమేమీ లేనప్పటి.. ఓవర్ల కోత ఉండవచ్చని తెలుస్తుంది. -
IPL 2025: నేటి (ఏప్రిల్ 18) మ్యాచ్కు వర్షం ముప్పు
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 18) ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ హెం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కవర్లతో కప్పి ఉంది. వర్షం పడే సూచనలు ఉన్నప్పుడే ఇలా చేస్తారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. మ్యాచ్ జరిగే సమయానికి 22 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదమేమీ లేనప్పటికీ పాక్షికంగా బ్రేకులు పడే ఛాన్స్ ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో ఆర్సీబీకి హోం గ్రౌండ్లో ఇది మూడో మ్యాచ్. ఇక్కడ ఆడిన గత రెండు మ్యాచ్ల్లో ఆర్సీబీ ఓడింది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రత్యర్థి ఇలాకాల్లో ఆడిన ప్రతి మ్యాచ్లోనూ గెలిచింది. ఈ సీజన్లో ఆర్సీబీ తమ సొంత మైదానంలో గుజరాత్, ఢిల్లీ చేతుల్లో ఓడింది. ఆర్సీబీ ఈ సీజన్లో కేకేఆర్, సీఎస్కే, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ను వారి సొంత ఇలాకాల్లో ఓడించింది. ప్రస్తుతం ఆర్సీబీ 6 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (+0.672) ఉంది. పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి నాలుగో స్థానంలో (+0.172) ఉంది. పంజాబ్ ఈ సీజన్లో గుజరాత్, లక్నో, సీఎస్కే, కేకేఆర్పై విజయాలు సాధించి, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ చేతుల్లో పరాజయంపాలైంది. పంజాబ్.. కేకేఆర్తో జరిగిన గత మ్యాచ్లో 111 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని రికార్డుల్లోకెక్కింది. అంతుకుముందు పంజాబ్ సన్రైజర్స్పై 245 పరుగులు చేసినప్పటికీ ఓటమిపాలైంది.పంజాబ్దే స్వల్ప పైచేయిపంజాబ్, ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే పంజాబ్దే స్వల్ప పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్ల్లో తలపడగా.. పంజాబ్ 17, ఆర్సీబీ 16 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిగా తలపడిన మూడు మ్యాచ్ల్లో ఆర్సీబీ విజయం సాధించింది.తుది జట్లు (అంచనా)..ఆర్సీబీ: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మపంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, విజయ్కుమార్ వైశాఖ్ -
RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో సెంచరీ
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన విరాట్.. టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి భారత్ మరియు ఆసియా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్గా చూసినా డేవిడ్ వార్నర్ మాత్రమే విరాట్ కంటే ముందు టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. వార్నర్ 400 టీ20 మ్యాచ్ల్లో 108 హాఫ్ సెంచరీలు చేయగా.. విరాట్ తన 388వ టీ20 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు. టీ20ల్లో విరాట్ 388 ఇన్నింగ్స్లు ఆడి 9 సెంచరీలు, 100 హాఫ్ సెంచరీల సాయంతో 13100 పైచిలుకు పరుగులు చేశాడు.THE HISTORIC MOMENT - 100 FIFTIES FOR KING KOHLI IN T20 HISTORY 🎯 pic.twitter.com/e4uvnxh0Vd— Johns. (@CricCrazyJohns) April 13, 2025టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన టాప్-5 ప్లేయర్లువార్నర్- 108విరాట్- 100బాబర్ ఆజమ్- 90గేల్- 88బట్లర్- 86కాగా, రాయల్స్తో మ్యాచ్లో విరాట్ రికార్డు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 17.3 ఓవర్లలో ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) బౌండరీ కొట్టి మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు. విరాట్ హాఫ్ సెంచరీల సెంచరీని విరాట్ సిక్సర్తో అందుకోవడం విశేషం. ప్రస్తుత సీజన్లో విరాట్కు ఇది మూడో హాఫ్ సెంచరీ. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ సీజన్లో విరాట్ 6 మ్యాచ్ల్లో 62 సగటున, 143.35 స్ట్రయిక్ రేట్తో 248 పరుగులు చేశాడు. 6 మ్యాచ్ల్లో 349 పరుగులు చేసిన పూరన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ ప్లేస్లో ఉన్నాడు. -
RCB Vs RR: రికార్డు అర్ద శతకంతో సత్తా చాటిన విరాట్.. రాయల్స్పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవర్లలో ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టీ20 కెరీర్లో 100 హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) బౌండరీ కొట్టి మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. రాయల్స్ అదే ఏడో స్థానంలో కొనసాగుతుంది. -
IPL 2025, RR VS RCB: సంజూ శాంసన్ను టార్గెట్ చేస్తున్న అభిమానులు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చెత్త ప్రదర్శన కొనసాగుతుంది. ఈ సీజన్లో శాంసన్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా సీజన్ తొలి మ్యాచ్లో. తాజాగా శాంసన్ ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో అతడు 19 బంతుల్లో బౌండరీ సాయంతో 15 పరుగులు మాత్రమే చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. ఈ మ్యాచ్లో శాంసన్ పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుత సీజన్లో శాంసన్ పేలవ ప్రదర్శన కొనసాగుతుండటంతో రాయల్స్ అభిమానులు విసిగిపోయారు. శాంసన్ను తిట్టిపోస్తున్నారు. మెగా వేలానికి ముందు కీలక ఆటగాళ్లను వదులుకున్న విషయంలోనూ శాంసన్నే టార్గెట్ చేస్తున్నారు. ఈ సీజన్లో రాయల్స్ దుస్థితికి శాంసనే కారకుడని విమర్శిస్తున్నారు.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో శాంసన్ స్కోర్లు..15(19)41(28)38(26)20(16)13(11)66(37)ఈ మ్యాచ్లో స్టంపౌటైన శాంసన్ మరో అనవసరపు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్లో స్టంపౌట్తో కలుపుకుని శాంసన్ ఐపీఎల్లో ఇప్పటివరకు 6 సార్లు డకౌటయ్యాడు. యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో (ఐపీఎల్లో) అత్యధిక సార్లు స్టంపౌటైన రికార్డు ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఉంది. డుప్లెసిస్ ఐపీఎల్లో ఇప్పటివరకు ఏడు సార్లు స్టంపౌటయ్యాడు.ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్లు (ప్రస్తుతమున్న వారిలో)..7 - ఫాఫ్ డుప్లెసిస్6 - సంజు శాంసన్5 - మోయిన్ అలీ5 - దీపక్ హుడా5 - విరాట్ కోహ్లీ5 - మన్దీప్ సింగ్5 - అజింక్య రహానే5 - డేవిడ్ వార్నర్మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ 15 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. శాంసన్ (15), రియాన్ పరాగ్ (30) ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (64), ధృవ్ జురెల్ (1) క్రీజ్లో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, యశ్ దయాల్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ప్రస్తుతం రాయల్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ ఐదో స్థానంలో ఉంది. రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి, మూడింట ఓడగా.. ఆర్సీబీ 5 మ్యాచ్ల్లో మూడు గెలిచి రెండిటిలో ఓటమిపాలైంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన ఢిల్లీ టాప్ ప్లేస్లో ఉండగా.. గుజరాత్, లక్నో, కేకేఆర్ వరుసగా స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ ఆరు, సన్రైజర్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్ వరుసగా 8 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి. -
RR VS RCB: రాజస్థాన్ రాయల్స్పై ఆర్సీబీ ఘన విజయం
రాజస్థాన్ రాయల్స్పై ఆర్సీబీ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవర్లలో ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టీ20 కెరీర్లో 100 హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) బౌండరీ కొట్టి మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. రాయల్స్ అదే ఏడో స్థానంలో కొనసాగుతుంది. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ8.4వ ఓవర్- 92 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. కుమార్ కార్తికేయ బౌలింగ్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి ఫిలిప్ సాల్ట్ (65) ఔటయ్యాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాల్ట్ 174 పరుగుల ఛేదనలో సాల్ట్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సాల్ట్కు (59) జతగా మరో ఎండ్లో కోహ్లి 22 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 8 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 82/0గా ఉంది. టార్గెట్ 174.. ధాటిగా ఆడుతున్న కోహ్లి, సాల్ట్174 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ వికెట్ నష్టపోకుండా 50 పరుగులుగా ఉంది. విరాట్ 16, సాల్ట్ 34 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రాణించిన జైస్వాల్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన రాయల్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు. మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్.. జైస్వాల్ ఔట్15.6వ ఓవర్- 126 పరుగుల వద్ద రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ (75) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. జురెల్కు జతగా హెట్మైర్ క్రీజ్లోకి వచ్చాడు.రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్13.2వ ఓవర్- 105 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. యశ్ దయాల్ బౌలింగ్లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (30) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 57, ధృవ్ జురెల్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాయల్స్6.5వ ఓవర్- 49 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో సంజూ శాంసన్ (15) స్టంపౌటయ్యాడు. శాంసన్ అప్పటికే పరుగులు చేసేందుక ఇబ్బంది పడుతున్నాడు. 7 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 50/1గా ఉంది. జైస్వాల్ 32, రియాన్ పరాగ్ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. 5 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 36/0రాయల్స్ ఇన్నింగ్స్ నిదానంగా సాగుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 36/0గా ఉంది. యశస్వి జైస్వాల్ 29, సంజూ శాంసన్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 19/0టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాయల్స్ నిదానంగా ఆడుతుంది. 3 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 19/0గా ఉంది. జైస్వాల్ 13, సంజూ శాంసన్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. జైపూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గత మ్యాచ్లో ఆడిన జట్టునే బరిలోకి దించుతుండగా.. రాయల్స్ ఓ మార్పు చేసింది. ఫజల్ హక్ ఫారూకీ స్థానంలో వనిందు హసరంగ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీతో బరిలోకి దిగింది. చెట్లు నాటే విషయంలో అవగాహన నిమిత్తం ఆర్సీబీ గత కొన్ని సీజన్లుగా ఓ మ్యాచ్లో గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగుతుంది.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్లు: శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్ చరక్, ఫజల్హాక్ ఫరూకీ, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్ -
RCB Vs DC: ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మరోసారి తమ హోం గ్రౌండ్లో చతికలపడింది. ఈ మెగా టోర్నీలో భాంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్లో రెండు విభాగాల్లోనూ బెంగళూరు నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.ఆర్సీబీ పవర్ ప్లేలో మెరుపు ఆరంభం లభించినప్పటికీ, ఆ తర్వాత వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి మోస్తారు స్కోర్కే పరిమితమైంది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(37) పరుగులతో మెరుపు ఆరంభం ఇవ్వగా..టిమ్ డేవిడ్(18 బంతుల్లో 32, 2 ఫోర్లు, 4 సిక్స్లు) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు.అనంతరం 164 పరుగుల టార్గెట్ను ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ మరోసారి తన క్లాస్ను చూపించాడు. తన సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత కాస్త నెమ్మదిగా ఆడినప్పటికి మిడిల్ ఓవర్లలో మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 53 బంతులు ఎదుర్కొన్న రాహుల్..7 ఫోర్లు, 6 సిక్స్లతో 93 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రాహుల్తో పాటు స్టబ్స్(38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీకి బౌలింగ్లో అద్బుతమైన ఆరంభం లభించింది. 60 పరుగులకే ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ మిడిల్ ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు తేలిపోయారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు, యశ్దయాల్, సుయాష్ శర్మ తలా వికెట్ సాధించారు.ఆర్సీబీ చెత్త రికార్డు..ఈ మ్యాచ్లో ఓటమి చవిచూసిన ఆర్సీబీ.. అత్యంత చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఐపీఎల్లో ఒకే వేదికలో అత్యధిక ఎదుర్కొన్న జట్టుగా చెత్త రికార్డును నెలకొల్పింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది 45వ ఓటమి. తద్వారా ఈ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉండేది. ఢిల్లీ జట్టు అరుణ్ జైట్లీ స్టేడియంలో 44 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. తాజా ఓటమితో ఢిల్లీని బెంగళూరు జట్టు అధిగమించింది. -
RCB VS DC: మరో సెంచరీకి అడుగు దూరంలో ఉన్న విరాట్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 10) ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలిచి అజేయ జట్టుగా కొనసాగుతుండగా.. ఆర్సీబీ నాలుగింట మూడు గెలిచి, ఓ మ్యాచ్లో ఓడింది.నేటి మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో విరాట్ హాఫ్ సెంచరీ చేస్తే టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుంటాడు. తద్వారా పొట్టి క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ ఒక్కడే 100 హాఫ్ సెంచరీలు (108) పూర్తి చేశాడు. గత మ్యాచ్లోనే టీ20ల్లో 13000 పరుగుల మార్కును తాకిన విరాట్ నేటి మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధిస్తే మరోసారి రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో విరాట్ 386 ఇన్నింగ్స్లు ఆడి 9 సెంచరీలు, 99 హాఫ్ సెంచరీల సాయంతో 13050 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానంలో ఉన్నాడు.నేటి మ్యాచ్ విషయానికొస్తే.. గత రికార్డుల ప్రకారం ఢిల్లీపై ఆర్సీబీదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 31 సార్లు తలపడగా ఆర్సీబీ 19, ఢిల్లీ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్లో ఫలితం రాలేదు. అయితే ప్రస్తుత సీజన్లో పరిస్థితి చూస్తే మాత్రం ఢిల్లీకే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఢిల్లీ ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. కొత్త కెప్టెన్ అక్షర్ నేతృత్వంలో ఓటమెరుగని జట్టుగా దూసుకుపోతుంది. ఢిల్లీ ఈ సీజన్లో అన్ని విభాగాల్లో సత్తా చాటుతూ లక్నో, సన్రైజర్స్, సీఎస్కేలపై అద్భుత విజయాలు సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 200కు పైగా లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఏకైక జట్టు ఢిల్లీ మాత్రమే. ఢిల్లీ జట్టులో డుప్లెసిస్, కేఎల్ రాహుల్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ వరుస వైఫల్యాలే జట్టును కలవరపెడుతున్నాయి.మరోవైపు ఆర్సీబీ కూడా ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేనట్లుగా ఆది నుంచే అదరగొడుతుంది. తొలి మ్యాచ్లో కేకేఆర్, రెండో మ్యాచ్లో సీఎస్కేలకు షాకిచ్చిన ఈ జట్టు మూడో మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడి ఆతర్వాతి మ్యాచ్లోనే మళ్లీ గెలుపు బాట (ముంబైపై విజయంతో) పట్టింది. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ ఆటగాళ్లు కూడా అద్భుత ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్లో విరాట్, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ.. బౌలింగ్లో హాజిల్వుడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తుది జట్లు (అంచనా)..ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యష్ దయాల్, రసిఖ్ సలామ్/సుయాష్ శర్మఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/T నటరాజన్, ముఖేష్ కుమార్ -
MI VS RCB: కృనాల్ పాండ్యాకు అచ్చొచ్చిన ఏప్రిల్ 7
ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యాకు ఏప్రిల్ 7 భలే అచ్చొచ్చే తేదీలా ఉంది. యాధృచ్చికమో ఏమో తెలీదు కానీ ఈ తేదీన కృనాల్ చెలరేగిపోతాడు. గత కొన్నేళ్లుగా ఈ తేదీలో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. 2023 సీజన్ నుంచి ఏప్రిల్ 7న ఆడిన ప్రతి మ్యాచ్లో కృనాల్ సత్తా చాటాడు. 2023 సీజన్లో కృనాల్ లక్నో సూపర్ జెయింట్స్కు ఆడుతూ సన్రైజర్స్ హైదరాబాద్పై అదరగొట్టాడు. ఆ మ్యాచ్లో కృనాల్ తొలుత బంతితో చెలరేగి (4-0-18-3), ఆతర్వాత బ్యాట్తోనూ రాణించాడు (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, సిక్స్). ఫలితంగా లక్నో సన్రైజర్స్పై ఘన విజయం సాధించింది. ఈ ప్రదర్శనకు గానూ కృనాల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.2024 సీజన్లో ఏప్రిల్ 7న నాడు కృనాల్ ప్రాతినిథ్యం వహించిన లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్తో తలపడింది. ఆ మ్యాచ్లో కృనాల్ బంతితో అదరగొట్టి (4-0-11-3) తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా 2025 ఏప్రిల్ 7న కృనాల్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ తేదీన ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో కృనాల్ చివరి ఓవర్ వేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా అతను కొత్తగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. గత మూడేళ్లలో ఏప్రిల్ 7న ఆడిన మ్యాచ్ల్లో కృనాల్ రెచ్చిపోవడం చూస్తే ఈ తేదీ అతనికి అచ్చొచ్చిందిగా చెప్పవచ్చు. ఈ మూడు సందర్భాల్లో కృనాల్ రాణించడంతో పాటు అతని జట్టును కూడా గెలిపించాడు. ఓ సందర్భంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలిచాడు. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన కృనాల్ ఈ సీజన్లోనే ఆర్సీబీలో చేరాడు. మెగా వేలంలో ఆర్సీబీ కృనాల్ను రూ. 5.75 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు కృనాల్ మూడేళ్లు (2022, 2023, 2024) లక్నో సూపర్ జెయింట్స్కు ఆడాడు. దానికి ముందు వరుసగా ఆరు సీజన్లు (2016, 17, 18, 19, 20, 21) ముంబై ఇండియన్స్కు ప్రాతనిథ్యం వహించాడు. కృనాల్ జట్టులో ఉండగా ముంబై ఇండియన్స్ మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది.లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన 34 ఏళ్ల కృనాల్ ఇప్పటివరకు 131 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 1652 పరుగులు, 83 వికెట్లు తీశాడు.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీ ముంబై ఇండియన్స్ను వారి సొంత ఇలాకాలో దాదాపు పదేళ్ల తర్వాత ఓడించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.విరాట్ కోహ్లి (67), రజత్ పాటిదార్ (64), జితేశ్ శర్మ (40 నాటౌట్), పడిక్కల్ (37) సత్తా చాటారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ తలో 2 వికెట్లు తీయగా.. విజ్ఞేశ్ పుతుర్ ఓ వికెట్ పడగొట్టాడు. ఛేదనలో ముంబై చివరి ఓవర్ వరకు పోరాడి 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ముంబైని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ 4, హాజిల్వుడ్, యశ్ దయాల్ తలో 2, భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. -
MI VS RCB: చరిత్ర సృష్టించిన భువీ
ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్గా అవతరించాడు. నిన్న (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ వికెట్ తీయడం ద్వారా భువీ ఈ ఘనత సాధించాడు. భువీ ఐపీఎల్ 179 మ్యాచ్లు ఆడి 184 వికెట్లు తీశాడు. భువీ తర్వాత ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్గా డ్వేన్ బ్రావో ఉన్నాడు. బ్రావో 161 మ్యాచ్ల్లో 183 వికెట్లు తీశాడు.ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 పేసర్లు184 - భువనేశ్వర్ కుమార్ (179 మ్యాచ్లు)183 - డ్వేన్ బ్రావో (161 మ్యాచ్లు)170 - లసిత్ మలింగ (122 మ్యాచ్లు)165 - జస్ప్రీత్ బుమ్రా (134 మ్యాచ్లు)144 - ఉమేష్ యాదవ్ (148 మ్యాచ్లు)ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 163 మ్యాచ్ల్లో 206 వికెట్లు తీశాడు. చహల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఘనత పియూశ్ చావ్లాకు దక్కుతుంది. చావ్లా 192 మ్యాచ్ల్లో 192 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చహల్ , చావ్లా తర్వాత భువీ, బ్రావో, అశ్విన్ ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు206 - యుజ్వేంద్ర చహల్ (163 మ్యాచ్లు)192 - పియూశ్ చావ్లా (192 మ్యాచ్లు)184 - భువనేశ్వర్ కుమార్ (179 మ్యాచ్లు)183 - డ్వేన్ బ్రావో (161 మ్యాచ్లు)183 - రవిచంద్రన్ అశ్విన్ (216 మ్యాచ్లు)కాగా, నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ముంబై ఇండియన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేసి చివరివరకు పోరాడింది. అయితే లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తద్వారా ఆర్సీబీ 10 ఏళ్ల తర్వాత ముంబై ఇండియన్స్ను వారి సొంత ఇలాకాలో ఓడించింది. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీకి 4 మ్యాచ్ల్లో ఇది మూడో గెలుపు. ముంబైకి 5 మ్యాచ్ల్లో నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉండగా.. ముంబై చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.నిన్నటి మ్యాచ్లో విరాట్ కోహ్లి (67), రజత్ పాటిదార్ (64), జితేశ్ శర్మ (40 నాటౌట్), పడిక్కల్ (37) సత్తా చాటి ఆర్సీబీ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. బౌల్ట్, హార్దిక్ తలో 2 వికెట్లు తీయగా.. విజ్ఞేశ్ పుతుర్ ఓ వికెట్ పడగొట్టాడు. ఛేదనలో ముంబైకు ఆదిలోనే షాక్ తగిలింది. మంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (17) రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ రికెల్టన్ (17) నాలుగో ఓవర్లో పెవిలియన్కు చేరాడు. విల్ జాక్స్ (22), సూర్యకుమార్ యాదవ్ (28) క్రీజ్లో నిలదొక్కుకునే క్రమంలో ఔటయ్యారు. ఈ దశలో తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ముంబైని గెలుపు దిశగా తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ముంబై చివరి ఓవర్ వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఆర్సీబీ బౌలర్ కృనాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అంతకుముందు భువీ 18వ ఓవర్లో తిలక్ వర్మను.. 19వ ఓవర్లో హాజిల్వుడ్ హార్దిక్ పాండ్యాను ఔట్ చేశారు. -
IPL 2025, MI VS RCB: భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి
ఐపీఎల్ 2025 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 7) మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తమ సొంత మైదానంలో (వాంఖడే స్టేడియంలో) ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుండగా.. వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ కాస్త ఢీలాగా కనిపిస్తుంది. అయితే నేటి మ్యాచ్లో ముంబైకి కూడా జోష్ రావచ్చు. ఈ మ్యాచ్తో వారి తరుపుముక్క జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా ఆర్సీబీ మ్యాచ్తోనే పునరాగమనం చేయనున్నాడు. నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరో శుభవార్త కూడా ఉంది. గాయం కారణంగా గత మ్యాచ్కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ కూడా నేటి మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. బుమ్రా, రోహిత్ చేరికతో ముంబై ఇండియన్స్లో కొత్త జోష్ వచ్చింది. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి మూడింట ఓడింది. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచి, కేవలం ఒకే మ్యాచ్లో ఓడింది.ముంబైదే పైచేయిహెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీపై ముంబైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్ల్లో తలపడగా.. ముంబై 19, ఆర్సీబీ 14 మ్యాచ్ల్లో గెలుపొందాయి.భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లిముంబైతో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. నేటి మ్యాచ్లో విరాట్ మరో 17 పరుగులు చేస్తే టీ20ల్లో 13000 పరుగుల మైలురాయిని తాకుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12983 పరుగులు (385 ఇన్నింగ్స్ల్లో 41.47 సగటున) ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానంలో ఉన్నాడు. విరాట్ టీ20ల్లో 13000 పరుగులు పూర్తి చేస్తే ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో క్రిస్ గేల్ (455 ఇన్నింగ్స్ల్లో 14562 పరుగులు), అలెక్స్ హేల్స్ (490 ఇన్నింగ్స్ల్లో 13610), షోయబ్ మాలిక్ (514 ఇన్నింగ్స్ల్లో 13557), కీరన్ పోలార్డ్ (617 ఇన్నింగ్స్ల్లో 13537) మాత్రమే విరాట్ కంటే అత్యధిక పరుగులు చేశారు.ప్రస్తుత సీజన్లో విరాట్ ఓ మోస్తరు ఫామ్లో ఉన్నాడు. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీ (59 నాటౌట్) చేసిన అతను.. సీఎస్కేపై (31) పర్వాలేదనిపించి, గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో (7) విఫలమయ్యాడు. కేకేఆర్ మ్యాచ్లో విరాట్ ఆర్సీబీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. విరాట్ ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. విరాట్ ఐపీఎల్లో 247 ఇన్నింగ్స్లు ఆడి 8101 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.తుది జట్లు (అంచనా)..ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బవా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్ఆర్సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ -
ఆర్సీబీ ఫ్యాన్స్కు ఉచిత ప్రయాణం.. ఆటో డ్రైవర్ మంచి మనసు
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ మొదలైదంటే ఈ సారి కప్ నమ్దే అంటూ అభిమానులు చేసే హంగామా ఎంత అంత కాదు. కనీసం 18వ సీజన్లోనైనా తమ ఆరాధ్య జట్టు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆర్సీబీ తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు.అజ్మల్ సుల్తాన్ అనే ఆటో డ్రైవర్ ఆర్సీబీ జెర్సీ ధరించిన వారికి ఉచిత ప్రయాణం కల్పిస్తానని ప్రకటించాడు. ఆర్సీబీ జెర్సీ ధరించి ఉంటే రైడ్ ఫ్రీ అని తన ఆటో వెనక అజ్మల్ రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అభిమానం అంటే ఇదే నీదేనే అన్నా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇక ఐపీఎల్-2025 సీజన్లో ఆర్సీబీ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. తమ తొలి రెండు మ్యాచ్ల్లో ఘన విజయాలు అందుకున్న బెంగళూరు జట్టు.. బుధవారం తమ సొంతమైదానంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(54) టాప్ స్కోరర్గా నిలవగా.. జితేష్ శర్మ(33), టిమ్ డేవిడ్(32) రాణించారు.గుజరాత్ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు సాయికిషోర్ రెండు, అర్షద్, ప్రసిద్ద్, ఇషాంత్ తలా వికెట్ సాధించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. జోస్ బట్లర్(73) ఆజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సాయిసుదర్శన్(49) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్తో తలపడనుంది.చదవండి: SRH: వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు.. ఇలా అయితే కష్టమే: భారత మాజీ క్రికెటర్ -
IPL 2025: ఊహకందని రికార్డును సొంతం చేసుకున్న ఇషాంత్ శర్మ
గుజరాత్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఊహకందని ఐపీఎల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 2) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ వికెట్ తీసిన ఇషాంత్.. 18 ఏళ్ల తేడాతో ఒకే ఫ్రాంచైజీ కెప్టెన్లను ఔట్ చేసిన అరుదైన ఘనతను సాధించాడు. తొలి ఐపీఎల్ సీజన్లో (2008) నాటి ఆర్సీబీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ను ఔట్ చేసిన ఇషాంత్.. తాజాగా అదే ఫ్రాంచైజీ ప్రస్తుత కెప్టెన్ రజత్ పాటిదార్ను పెవిలియన్కు పంపాడు.ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి రేర్ ఫీట్ను ఎవరూ సాధించలేదు. 18 ఏళ్ల తేడాతో ఒకే ఫ్రాంచైజీ కెప్టెన్లను ఔట్ చేసిన తొలి మరియు ఏకైక బౌలర్ ఇషాంత్ శర్మనే. 2008 సీజన్లో కేకేఆర్ తరఫున ఆడుతూ తన స్పెల్ తొలి ఓవర్లోనే నాటి ఆర్సీబీ కెప్టెన్ను ఔట్ చేసిన ఇషాంత్ శర్మ.. ఐపీఎల్ 2025 సీజన్లో ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ను కూడా తన స్పెల్ తొలి ఓవర్లోనే పెవిలియన్కు పంపాడు.అప్పుడూ, ఇప్పుడూ ఆర్సీబీ కెప్టెన్లను ఔట్ చేసింది చిన్నస్వామి స్టేడియంలోనే కావడం మరో విశేషం. ఇక్కడ ఒకే ఒక్క తేడా ఏంటంటే.. నాడు తన స్పెల్ తొలి బంతికే ఆర్సీబీ కెప్టెన్ను ఔట్ చేసిన ఇషాంత్.. ప్రస్తుత సీజన్లో తన స్పెల్ రెండో బంతికి ఆర్సీబీ కెప్టెన్ను పెవిలియన్కు పంపాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న అతి తక్కువ మంది ఆటగాళ్లలో ఇషాంత్ ఒకడు. 36 ఏళ్ల ఈ ఢిల్లీ పేసర్ 2018 సీజన్ మినహాయించి ప్రతి ఐపీఎల్లో ఆడాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బౌలర్లు, ఆతర్వాత బ్యాటర్లు చెలరేగడంతో ఆర్సీబీపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీసి ఆర్సీబీకి దెబ్బకొట్టాడు. సిరాజ్తో పాటు సాయికిషోర్ (2), అర్షద్ ఖాన్ (1), ప్రసిద్ద్ కృష్ణ (1), ఇషాంత్ శర్మ (1) కూడా వికెట్లు తీశారు. సిరాజ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్ను గెలిపించారు. -
IPL 2025: విరాట్ కోహ్లికి గాయం
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో నిన్న (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తుండగా (బౌండరీని ఆపే క్రమంలో) విరాట్ చేతి బొటన వేలికి గాయమైంది. నొప్పితో విరాట్ విలవిలలాడిపోయాడు. విరాట్ ఇలా గాయపడటం చాలా అరుదుగా జరుగుతుంది. నొప్పి భరించలేక విరాట్ నేలకొరగడంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఫిజియో ఫస్ట్ ఎయిడ్ చేయడంతో విరాట్ కొద్ది సేపటికే రికవర్ అయినట్లు కనిపించాడు. అయినా విరాట్ అభిమానుల్లో ఆందోళన అలాగే ఉండింది. గాయం తర్వాత విరాట్లో ముందున్నంత యాక్టివ్నెస్ కనిపించలేదు. దీంతో అభిమానులు విరాట్ తదుపరి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా లేదా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. విరాట్ గాయంపై ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సానుకూల అప్డేట్ ఇవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విరాట్ గాయం చిన్నదేనని ఫ్లవర్ ప్రకటించాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబైని వాంఖడే మైదానంలో జరుగనుంది.కాగా, నిన్నటి మ్యాచ్లో విరాట్ ఘోరంగా విఫలమయ్యాడు. 6 బంతుల్లో బౌండరీ సాయంతో 7 పరుగులు మాత్రమే చేసి అనామక అర్షద్ ఖాన్ బౌలింగ్లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విరాట్ వికెట్ పడిన తర్వాత ఆర్సీబీ టాపార్డర్ అంతా పెవిలియన్కు క్యూ కట్టింది. పడిక్కల్ (4), సాల్ట్ (14), పాటిదార్ (12) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ దశలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్), లివింగ్స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో ఆర్సీబీ ఓ మోస్తరు స్కోర్ (169/8) చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ అద్బుతంగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకు గానూ అతడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సాయి కిషోర్ (4-0-22-2), అర్షద్ ఖాన్ (2-0-17-1), ప్రసిద్ద్ కృష్ణ (4-0-26-1), ఇషాంత్ శర్మ (2-0-27-1) కూడా తలో చేయి వేసి ఆర్సీబీని కట్టడి చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్ను గెలిపించారు. ఆఖర్లో బట్లర్, రూథర్ఫోర్డ్ బ్యాట్ను ఝులిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్కు ముందు టాప్ ప్లేస్లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది. -
IPL 2025: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్తో నిన్న (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్లో శుభ్మన్ గిల్ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్గా డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. బ్రావో 158 ఇన్నింగ్స్ల్లో 183 వికెట్లు తీయగా.. ఈ మార్కు తాకడానికి భువీకి 178 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 161 ఇన్నింగ్స్ల్లో 206 వికెట్లు తీశాడు. చహల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఘనత పియూశ్ చావ్లాకు దక్కుతుంది. చావ్లా 191 ఇన్నింగ్స్ల్లో 912 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చహల్ , చావ్లా తర్వాత భువీ, బ్రావో ఉన్నారు. వీరిద్దరితో సమానంగా అశ్విన్ కూడా 183 వికెట్లు తన ఖాతాలో కలిగి ఉన్నాడు. యాష్కు 183 వికెట్ల మార్కును తాకడానికి 211 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి.కాగా, నిన్న సొంత మైదానంలో (చిన్నస్వామి స్టేడియం) గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్లో ఆ జట్టుకు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆదిలోనే వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్కు (169/8) పరిమితమైంది. లివింగ్స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) పోరాడటంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీసి ఆర్సీబీకి దెబ్బకొట్టాడు. సిరాజ్ తన మాజీ జట్టుపై మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. సిరాజ్తో పాటు సాయికిషోర్ (2), అర్షద్ ఖాన్ (1), ప్రసిద్ద్ కృష్ణ (1), ఇషాంత్ శర్మ (1) కూడా వికెట్లు తీశారు. సిరాజ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్ను గెలిపించారు. ఆఖర్లో బట్లర్, రూథర్ఫోర్డ్ బ్యాట్ను ఝులిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్కు ముందు టాప్ ప్లేస్లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది. -
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) వేదికగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి గుజరాత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మధ్యలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్ 14, విరాట్ కోహ్లి 7, పడిక్కల్ 4, పాటిదార్ 12, కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) గుజరాత్ను గెలిపించారు. తొలుత నిదానంగా ఆడిన బట్లర్.. ఆతర్వాత గేర్ మార్చి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆఖర్లో రూథర్ఫోర్డ్ (ఇంపాక్ట్ ప్లేయర్) తనదైన శైలితో చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టాప్ ప్లేస్లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది. -
RCB VS GT: అదిరిపోయే రీతిలో ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు చెలరేగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఆ జట్టు 16 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. లివింగ్స్టోన్ (33), టిమ్ డేవిడ్ (6) క్రీజ్లో ఉండటంతో ఆర్సీబీ ఇంకా ఆశలు పెట్టుకుంది.రెండు వరుస విజయాల తర్వాత ఆర్సీబీ ఈ మ్యాచ్లో చెత్త ప్రదర్శన చేస్తుంది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఆర్సీబీని పేసర్ అర్షద్ ఖాన్ తొలి దెబ్బేశాడు. రెండో ఓవర్లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (7) ఔట్ చేశాడు. ఆతర్వాత ఆర్సీబీ మాజీ ఆటగాడు సిరాజ్ లైన్లోకి వచ్చాడు. సిరాజ్ అతని వరుస ఓవర్లలో పడిక్కల్ (4), సాల్ట్ను (14) క్లీన్ బౌల్డ్ చేశాడు. Mo Siraj 🔥pic.twitter.com/2cbgtJIhNi— CricTracker (@Cricketracker) April 2, 2025ఆతర్వాత ఇషాంత్ అద్భుతమైన బంతితో కెప్టెన్ పాటిదార్ను (12) ఎల్బీడబ్ల్యూ చేశాడు. లేట్గా (11వ ఓవర్) బౌలింగ్కు దిగిన సాయికిషోర్ తన రెండో ఓవర్లోనే మంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన జితేశ్ శర్మను (33) ఔట్ చేశాడు. సాయి కిషోర్ తన మూడో ఓవర్లో మరో ఫలితం రాబట్టాడు. ఈసారి కిషోర్ కృనాల్ పాండ్యాను (5) బోల్తా కొట్టించాడు. భారీ హిట్టర్లు లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్ క్రీజ్లో ఉండటంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోర్పై ఆశలు పెట్టుకుంది.కాగా, ఈ మ్యాచ్లో సిరాజ్ సాల్ట్ వికెట్ తీసిన విధానం అందరినీ ఆకర్శించింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతికి సాల్ట్ సిరాజ్ బౌలింగ్లో 105 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ఆతర్వాతి బంతికి సిరాజ్ సాల్ట్పై తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. సాల్ట్ వికెట్లు వదిలి మరో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. సిరాజ్ బంతిని నేరుగా వికెట్లపైకి సంధించి సాల్ట్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు తీసిన నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్లే కావడం విశేషం. సిరాజ్ బౌలింగ్లో సాల్ట్ కొట్టిన సిక్సర్ ఈ సీజన్లో అత్యంత భారీ సిక్సర్గా రికార్డైంది. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఆటగాడు ట్రవిస్ హెడ్ కూడా 105 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. -
IPL 2025: ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) గుజరాత్ను గెలిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్12.3వ ఓవర్: 107 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ 49 పరుగులు చేసి హాజిల్వుడ్ బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్ఛేదనను నిదానంగా ప్రారంభించిన గుజరాత్ ఆతర్వాత గేర్ మార్చి లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. 11.5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47), జోస్ బట్లర్ (39) ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. గేర్ మార్చిన బట్లర్అప్పటివరకు నిదానంగా ఆడిన బట్లర్ రసిక్ సలామ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో గేర్ మార్చాడు. ఆ ఓవర్లో బట్లర్ 2 సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 75/1గా ఉంది. బట్లర్ 26, సాయి సుదర్శన్ 32 పరుగులతో ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవాలంటే 66 బంతుల్లో 95 పరుగులు చేయాలి. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్4.4వ ఓవర్: 170 పరుగుల ఛేదనలో గుజరాత్ 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో లివింగ్స్టోన్కు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (14) ఔటయ్యాడు. సాయి సుదర్శన్ (15), జోస్ బట్లర్ క్రీజ్లో ఉన్నారు. టార్గెట్ 170.. నిదానంగా ఆడుతున్న గుజరాత్170 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ నిదానంగా ఆడుతుంది. మూడు ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 15 పరుగులు మాత్రమే చేసింది. శుభ్మన్ గిల్ 7, సాయి సుదర్శన్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. లివింగ్స్టోన్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?టాస్ ఓడి గుజరాత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మధ్యలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్ 14, విరాట్ కోహ్లి 7, పడిక్కల్ 4, పాటిదార్ 12, కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ బాది చివరి బంతికి ఔటైన టిమ్ డేవిడ్ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీసిరాజ్ బౌలింగ్లో బట్లర్ క్యాచ్ పట్టడంతో లివింగ్స్టోన్ (54) ఔటయ్యాడు.లివింగ్స్టోన్ హాఫ్ సెంచరీరషీద్ ఖాన్ బౌలింగ్లో రెండు వరుస సిక్సర్లు బాది లివింగ్స్టోన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరో వికెట్ డౌన్14.2వ ఓవర్: 104 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి కృనాల్ పాండ్యా (5) ఔటయ్యాడు. లివింగ్స్టోన్ (24), టిమ్ డేవిడ్ (1) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ12.4వ ఓవర్: 94 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్లో తెవాటియాకు క్యాచ్ ఇచ్చి జితేశ్ శర్మ (33) ఔటయ్యాడు. లివింగ్స్టోన్కు (19) జతగా కృనాల్ పాండ్యా క్రీజ్లోకి వచ్చాడు. 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 73/410 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 73/4గా ఉంది. లివింగ్స్టోన్ (8), జితేశ్ శర్మ (23) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 6.2వ ఓవర్: ఆర్సీబీ కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఆ జట్టు 42 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్లో కెప్టెన్ రజత్ పాటిదార్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. లివింగ్స్టోన్, జితేశ్ శర్మ క్రీజ్లో ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ.. 35 పరుగులకే 3 వికెట్లు డౌన్4.4వ ఓవర్: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టిన అనంతరం ఫిల్ సాల్ట్ (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రజత్ పాటిదార్కు (6) జతగా లివింగ్స్టోన్ క్రీజ్లోకి వచ్చాడు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఆర్సీబీ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్లో విరాట్ను ఆర్షద్ ఖాన్ ఔట్ చేయగా.. మూడో ఓవర్లో సిరాజ్ అద్భుతమైన బంతితో పడిక్కల్ను (4) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆర్సీబీకి షాక్.. రెండో ఓవర్లోనే విరాట్ ఔట్ఆర్సీబీకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (7) అర్షద్ ఖాన్ బౌలింగ్లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 12/1గా ఉంది. పడిక్కల్ (4), సాల్ట్ (1) క్రీజ్లో ఉన్నారు. తొలి ఓవర్లోనే సాల్ట్ బతికిపోయాడు..!సాల్ట్కు తొలి ఓవర్లోనే లైఫ్ లభించింది. సిరాజ్ బౌలింగ్లో వికెట్కీపర్ జోస్ బట్లర్ చేతిలోకి వచ్చిన క్యాచ్ను వదిలేశాడు. అంతకుముందు తొలి బంతికే సాల్ట్ ఔట్ కావాల్సింది. అయితే బంతి ఫీల్డర్లు లేని చోట ల్యాండైంది.ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ తలపడనున్నాయి. ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ ఓ మార్పు చేయగా.. ఆర్సీబీ గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగిస్తుంది. గుజరాత్ తరఫున రబాడ స్థానంలో అర్షద్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. రబాడ వ్యక్తిగత కారణాల చేత ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, యశ్ దయాల్గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మగుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.కాగా, ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో రెండింట గెలిచి టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. గుజరాత్ రెండింట ఓ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆర్సీబీ.. కేకేఆర్, సీఎస్కేపై విజయాలు సాధించగా.. గుజరాత్.. పంజాబ్ చేతిలో ఓడి, ముంబై ఇండియన్స్పై గెలుపొందింది. -
ధోనీపై విమర్శలు!
-
ఈ ఆర్సీబీకి ఏమైంది.. వరుసగా మ్యాచ్లు గెలిచేస్తుంది.. టైటిల్ కూడా గెలుస్తుందా ఏంది..?
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ గత 17 సీజన్లతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు తొలి మ్యాచ్ నుంచే విజయాల బాట పట్టింది. సాధారణంగా ఆర్సీబీ తొలి మ్యాచ్లను పెద్దగా పట్టించుకోదు. ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరిన ప్రతిసారి ఆఖరి మ్యాచ్ల్లోనే విజయాలు సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీ వరుసగా కేకేఆర్, ముంబై ఇండియన్స్పై విజయాలు నమోదు చేసింది. ఈ రెండు విజయాలు ప్రత్యర్థుల అడ్డాలో రావడం మరింత ప్రత్యేకం. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ను ఆర్సీబీ ఈడెన్ గార్డన్స్లో ఓడించింది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సీఎస్కేను 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్లో మట్టికరిపించింది.ఈ సీజన్లో ఆర్సీబీ జట్టుగా కూడా బలంగా కనిపిస్తుంది. గత సీజన్లలోలా ఒకరిద్దరిపై ఆధారపడినట్లు కనిపించడం లేదు. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ కామ్గా ఉంటూ ఆశ్చర్యకర రీతిలో వ్యూహాలు పన్నుతుకున్నాడు. పాటిదార్ కెప్టెన్సీ కూడా ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలుపును సూచిస్తుంది. పాటిదార్ వ్యక్తిగతంగా కూడా రాణించడం ఆర్సీబీకి మరో శుభ సూచకం. ఈ సీజన్లో ఆర్సీబీ గెలిచిన రెండు మ్యాచ్ల్లో పాటిదార్ చాలా మూల్యమైన ఇన్నింగ్స్లు ఆడాడు. పాటిదార్ బలంగా షాట్లు ఆడుతూ స్పిన్నర్లను బెంబేలెత్తిస్తున్నాడు. పాటిదార్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే.. ఆర్సీబీ ఈసారి ఖచ్చితంగా అద్భుతం చేస్తుంది.ఈ సీజన్లో ఆర్సీబీకి మరో శుభ సూచకం హాజిల్వుడ్ ఫామ్. హాజిల్వుడ్ ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్నాడు. ఆర్సీబీ గెలిచిన రెండు మ్యాచ్ల్లో అతడు కీలకపాత్ర పోషించాడు. ఈ రెండు మ్యాచ్ల్లో హాజిల్వుడ్ ఆదిలోనే వికెట్లు తీసి ప్రత్యర్ధులను డిఫెన్స్లో పడేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీకి లభించిన మరో ఎక్స్ ఫ్యాక్టర్ ఫిల్ సాల్ట్. సాల్ట్ ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడి జట్టుకు బలమైన పునాది వేశాడు. తొలి మ్యాచ్లో అర్ద సెంచరీతో మెరిసిన విరాట్.. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ పర్వాలేదనిపించాడు.తొలి మ్యాచ్లో తన స్పిన్ బౌలింగ్తో అద్బుతం చేసిన కృనాల్ పాండ్యా కూడా ఈ సీజన్లో ఆర్సీబీకి టైటిల్ అందించేలా ఉన్నాడు. దేవ్దత్ పడిక్కల్, జితేశ్ శర్మ కూడా లైన్లోకి వస్తే ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ మరింత పటిష్టంగా తయారవుతుంది. విదేశీ విధ్వంకర వీరులు లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్ తమ సామర్థ్యం మేరకు రాణిస్తే ఈ సీజన్లో టైటిల్ గెలవకుండా ఆర్సీబీని ఎవ్వరూ ఆపలేరు. ఆర్సీబీలో దేశీయ బౌలింగ్ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. భువనేశ్వర్ కుమార్ చేరిక ఆర్సీబీ పేస్ విభాగానికి మరింత ఊపునిచ్చింది. యశ్ దయాల్ సీఎస్కేతో మ్యాచ్లో ఒకే ఒవర్లో రెండు వికెట్లు తీసి మంచి టచ్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. స్పిన్నర్ సుయాశ్ శర్మ తొలి మ్యాచ్లో మ్యాజిక్ చేశాడు. సీఎస్కేతో మ్యాచ్లో సుయాశ్ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా ఆర్సీబీ ఈ సీజన్లో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ప్రతి సీజన్కు ముందు ఈ సాలా కప్ నమ్మదే అని డప్పు కొట్టుకునే ఆర్సీబీ ఫ్యాన్స్ గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువగా హడావుడి చేయడం లేదు. ఇదీ ఓ రకంగా ఆర్సీబీ టైటిల్ గెలుపుకు సూచకంగా తీసుకోవచ్చు. అన్నిటి కంటే ఎక్కువగా ఈ సారి అంకెల కో ఇన్సిడెన్స్ ఆర్సీబీకి కలిసొస్తుందేమో అనిపిస్తుంది. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18 కాగా.. ఈ ఐపీఎల్ సీజన్ సంఖ్య కూడా పద్దెనిమిదే కావడం విశేషం. మరి 18 సీజన్ ఆర్సీబీ టైటిల్ విన్నింగ్ సీజన్ అవుతుందో లేదో వేచి చూడాలి. -
మంచి స్కోర్ చేశాము.. సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించడం చాలా ప్రత్యేకం: పాటిదార్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సీఎస్కేతో నిన్న (మార్చి 28) జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. కష్ట సాధ్యమైన పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం అద్భుతంగా బౌలింగ్ చేసి విజయంవంతంగా లక్ష్యాన్ని కాపాడుకుంది. బ్యాటింగ్లో రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. బౌలింగ్లో హాజిల్వుడ్ (4-0-21-3), లవింగ్స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) మ్యాజిక్ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది.ఈ మ్యాచ్లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకోగా.. సీఎస్కే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఓటమిపాలైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సీఎస్కే కీలక సమయాల్లో క్యాచ్లు జారవిడచడంతో పాటు ఫీల్డింగ్లో అనవసర తప్పిదాలు చేసి అదనపు పరుగులు సమర్పించుకుంది. నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా మిగతా బౌలర్లు సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్లోగా ఉన్న పిచ్పై సీఎస్కే బౌలర్లు 20-30 పరుగులు అదనంగా ఇచ్చారు.అనంతరం కష్ట సాధ్యమైన ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. కనీస పోరాటం కూడా చూపలేక మ్యాచ్ను ఆర్సీబీకి అప్పగించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా రచిన్ రవీంద్ర (41) ఒక్కడే క్రీజ్లో నిలబడి ఏదో చేసే ప్రయత్నం చేశాడు. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎస్కేకు పిచ్ నుంచి కూడా ఎలాంటి సహకారం లభించలేదు. వికెట్ చాలా స్లోగా ఉండింది. కొత్త బంతి కూడా వారికి కలిసి రాలేదు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ వికెట్పై మంచి స్కోర్ చేశాము. వికెట్ చాలా స్లోగా ఉండింది. బ్యాటర్లకు ఇది అంత సులభం కాదు. సీఎస్కేను వారి సొంత అభిమానుల మధ్య ఓడించడం చాలా ప్రత్యేకం. ఈ వికెట్పై ఛేజింగ్ చేయడం అంత సులభం కాదని తెలుసు. అందుకే 200 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నేను క్రీజ్లో ఉన్నంత సేపు ప్రతి బంతికి భారీ షాట్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఓ రకంగా సఫలమయ్యాను. స్పిన్నర్లకు ఈ ట్రాక్ చాలా ఉపయోగకరంగా ఉండింది. అందుకే ముందుగానే స్పిన్నర్లను బరిలోకి దించాలని అనుకున్నాము. లివింగ్స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హాజిల్వుడ్ తన తొలి ఓవర్లో, ఆతర్వాత కొత్త బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ రెండు సందర్భాలు మ్యాచ్ను మాకు అనుకూలంగా మార్చాయి. మేము పరుగులు సాధించగలిగినా వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. -
చెన్నైపై సత్తా చాటిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
-
IPL 2025: ఇలాగే గెలుస్తూ పోతే టైటిల్ మాదే: ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్
ఆర్సీబీ నయా కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్ ఫుల్టైమ్ కెప్టెన్గా తన కెరీర్ను గెలుపుతో ప్రారంభించాడు. నిన్న (మార్చి 22) జరిగిన సీజన్ ఓపెనర్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో పాటిదార్ కెప్టెన్గా తన ఖాతాను ఓపెన్ చేయడంతో పాటు ఈ సీజన్లో ఆర్సీబీకి తొలి విజయాన్నందించాడు.ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని మరో 22 బంతులు మిగిలుండగానే ఛేదించే అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి కొత్త జోష్తో టైటిల్ వేటను ప్రారంభించింది.కొత్తగా వచ్చిన ఫిల్ సాల్ట్, కృనాల్ పాండ్యా ఆర్సీబీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి (59 నాటౌట్) తన సహజశైలిలో అద్భుతంగా ఆడి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. హాజిల్వుడ్, యశ్ దయాల్, పాటిదార్ ఆర్సీబీ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. సుయాశ్ శర్మ (4-0-47-1), రసిక్ సలామ్ (3-0-35-1) తలో వికెట్ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. తొలి మ్యాచ్లో గెలుపు అనంతరం పాటిదార్ ఇలా అన్నాడు. ఇలాగే గెలుస్తూ పోతే ఈ సీజన్లో టైటిల్ తమదే అని ధీమా వ్యక్తం చేశాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్ కావడంతో కాస్త ఒత్తిడికి గురైనట్లు తెలిపాడు. మొత్తంగా ఇది తనకు మంచి రోజని అన్నాడు. సుయాష్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంపై స్పందిస్తూ.. తనకు అభ్యంతరం లేదని తెలిపాడు. సుయాష్ తమ ప్రధాన వికెట్ టేకింగ్ బౌలరని అన్నాడు. కెప్టెన్గా అతనికి మద్దతు ఇచ్చానని తెలిపాడు. పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించిన కృనాల్ పాండ్యాను పొగడ్తలతో ముంచెత్తాడు. గెలుపు క్రెడిట్లో కృనాల్, సుయాష్కు మెజార్టీ వాటా దక్కుతుందని తెలిపాడు. 13 ఓవర్ల తర్వాత వారు ధైర్యం, దృఢ సంకల్పం చూపించారని కితాబునిచ్చాడు. వారిలో వికెట్లు తీయాలనే తపన అద్భుతంగా ఉండిందని కొనియాడాడు.కోహ్లి గురించి మాట్లాడుతూ.. అతని లాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టమని అన్నాడు. కోహ్లి లాంటి ఆటగాడు జట్టులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుందని తెలిపాడు. క్రీడలో గొప్ప ఆటగాడి (కోహ్లి) నుంచి నేర్చుకోవడానికి ఇది తనకు గొప్ప అవకాశమని అన్నాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్పై స్పందిస్తూ.. అది ముందుగా నిర్ణయించుకుని ఆడిన షాట అని తెలిపాడు. కాగా, 2021 సీజన్ నుంచి కేకేఆర్తో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆర్సీబీ ఆరింట ఓడింది. గత రెండు సీజన్లలో నాలుగు మ్యాచ్ల్లో నాలుగింట ఓటమిపాలైంది. తాజా గెలుపుతో ఆర్సీబీ కేకేఆర్పై తమ ట్రాక్ రికార్డు కాస్త మెరుగుపర్చుకుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లో సీఎస్కే ఢీకొంటుంది. మార్చి 28న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక నేటి (మార్చి 23) మ్యాచ్ల విషయానికొస్తే.. ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్లో).. రాత్రి మ్యాచ్లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ (చెన్నై) ఢీకొంటాయి. -
IPL తొలి మ్యాచ్ లో బెంగళూరు బోణీ
-
IPL 2025: తొలి మ్యాచ్లో కేకేఆర్పై ఆర్సీబీ ఘన విజయం
IPL 2025 RCB vs KKR 1st Match Live Updates: బోణీ కొట్టిన ఆర్సీబీ..ఐపీఎల్-2025లో ఆర్సీబీ బోణీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(59) టాప్ స్కోరర్గా నిలవగా.. ఫిల్సాల్ట్(31 బంతుల్లో 56), పాటిదార్(16 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా,సునీల్ నరైన్ తలా వికెట్ సాధించారు.విజయం దిశగా ఆర్సీబీ..తొలి మ్యాచ్లో ఆర్సీబీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి ఇంకా 18 పరుగులు కావాలి. క్రీజులో విరాట్ కోహ్లి(50), రజిత్ పాటిదార్(30) పరుగులతో ఉన్నారు.విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ..ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కేవలం 30 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్లతో కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లి 54 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 134/2తొలి వికెట్ డౌన్..95 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి దేవ్దత్త్ పడిక్కల్ వచ్చాడు. 9 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 96/16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 80/06 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(49), విరాట్ కోహ్లి(29) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ..175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(26), విరాట్ కోహ్లి(11) ఉన్నారు.రహానే హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(56) టాప్ స్కోరర్గా నిలవగా.. సునీల్ నరైన్(44),రఘువంశీ(30) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, సుయాష్ శర్మ, సలీం తలా వికెట్ సాధించారు.173 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన కేకేఆర్హర్షిత్ రానా(5) ఔట్ఏడో వికెట్ కోల్పోయిన కేకేఆర్168 పరుగుల వద్ద ఆర్సీబీ ఏడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన రఘువంశీ యశ్ దయాల్ బౌలింగ్లో ఔటయ్యాడు.18 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 165/618 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజ్లో రఘు వంశీ(28), రమణ్ దీప్ సింగ్(5) ఉన్నారు.కేకేఆర్ ఆరో వికెట్ డౌన్.. రస్సెల్ ఔట్రస్సెల్ రూపంలో కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రస్సెల్.. సుయాష్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.కృనాల్ సూపర్ బాల్.. రింకూ ఫ్యూజ్లు ఔట్కేకేఆర్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. 12 పరుగులు చేసిన రింకూ సింగ్.. కృనాల్ పాండ్యా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి అండ్రీ రస్సెల్ వచ్చాడు. 15 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 145/5నాలుగో వికెట్ డౌన్..వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన అయ్యర్.. కృనాల్ పాండ్యా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 141/4రహానే ఔట్..109 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన రహానే.. కృనాల్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి రఘువన్షి వచ్చాడు. 11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 110/3కేకేఆర్ రెండో వికెట్ డౌన్.. సునీల్ నరైన్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన నరైన్.. రసీఖ్ ధార్ సలీం బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి వెంకటేశ్ అయ్యర్ వచ్చాడు.రహానే హాఫ్ సెంచరీ..కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే హాఫ్ సెంచరీతో మెరిశాడు. 54 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు సునీల్ నరైన్(34) ఉన్నాడు. 9 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 96/1దూకుడుగా ఆడుతున్న రహానే..6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే(39) దూకుడుగా ఆడుతున్నాడు.4 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 25/14 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ అజింక్య రహానే(16), వెంకటేశ్ అయ్యర్(5) పరుగులతో ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. జోష్ హాజిల్వుడ్ తొలి ఓవర్లోనే కేకేఆర్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్(4)ను పెవిలియన్కు పంపాడు. క్రీజులోకి కెప్టెన్ అజింక్య రహానే వచ్చాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..ఐపీఎల్-2025 తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి పోరులో ఆర్సీబీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్వుడ్, యష్ దయాల్కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి 👉ఐపీఎల్-18వ సీజన్ ట్రోఫీని ఆవిష్కరించిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే.👉షారుఖ్ ఖాన్తో కలిసి డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లి, రింకూ సింగ్👉 కోల్కతా జట్టు సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్తో కలిసి ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ప్రసంగిస్తున్నాడు. వీరితో కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ జతకట్టాడు.డ్యాన్స్తో అదరగొడుతున్న దిశాబాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తన డ్యాన్స్తో అభిమానులను అలరిస్తోంది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది.👉తన గాత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న శ్రేయా ఘోషల్ఈడెన్ గార్డెన్స్లో ఐపీఎల్-2025 ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) తన గాత్రంతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. పుష్ఫ-2 సినిమాలోని ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాటను తెలుగులో పాడటం విశేషం.Shreya Ghosal is here. ❤️ pic.twitter.com/apPUNS1mG4— Kohlistic🔥 (@Kohlistic18) March 22, 2025👉ఈడెన్ గార్డెన్స్ షారుఖ్ ఖాన్ సందడిప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా జట్టు సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా ప్రసంగించాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్గా వెలుగొందిన క్రికెట్ లీగ్లో భాగం కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.👉మరి కాసేపటిలో ఓపెనింగ్ సెర్మనీఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు మరి కాసేపటిలో ప్రారంభం కానున్నాయి. ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషల్, అర్జిత్ సింగ్, కరణ్ ఔజ్లా అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తన డ్యాన్స్ ప్రదర్శనతో అదరగొట్టబోతోంది. ఇందుకోసం వీరు నలుగురు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్కు చేరుకున్నారు.👉ఐపీఎల్-2025కు సర్వం సిద్దం.. ఐపీఎల్-2025 సీజన్కు మరి కాసేపటిలో తెరలేవనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. రాత్రి ఏడు గంటలకు టాస్ పడనుంది. 👉స్టేడియానికి చేరుకున్న ఇరు జట్లుఇక తొలి మ్యాచ్ కోసం కేకేఆర్, ఆర్సీబీ జట్లు ఈడెన్గార్డెన్స్ మైదానానికి చేరుకున్నాయి. ఫ్యాన్స్ కూడా భారీగా తరలివస్తున్నారు. ఈడెన్గార్డెన్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.👉అభిమానులకు గుడ్న్యూస్కోల్కతాలో గత రెండు రోజులగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి మ్యాచ్కు వరుణుడు అడ్డింకిగా మారుతాడో ఏమో అని అభిమానులు ఆందోళను చెందుతున్నారు. అయితే ఐపీఎల్ లవర్స్కు ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతం కోల్కతాలో వర్షం పడడం లేదు. ఆకాశం మేఘావృతం ఉన్నప్పటికి వాతావరణం పొడిగా ఉంది.Reached Eden garden.. kya mast dikh rha hai yaar stadium#KKRvsRCB #KKRvsRCB pic.twitter.com/adGP1GcRhl— Ajay anshu (@Ajayanshu5) March 22, 2025 -
KKR Vs RCB: కోల్కతాలో వర్షం.. కేకేఆర్, ఆర్సీబీ మధ్య రేపటి మ్యాచ్ జరిగేనా..?
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలేలా ఉన్నాడు. కేకేఆర్, ఆర్సీబీ మధ్య రేపు (మార్చి 22) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశముందని తెలుస్తుంది. రేపు మ్యాచ్ జరిగే సమయానికి (రాత్రి 7:30 గంటలకు) వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయని వాతావరణ నివేదికలు ఇదివరకే స్పష్టం చేశాయి. దీన్ని నిజం చేస్తూ ఇవాల్టి నుంచే వర్షం మొదలైంది. NO RAIN pleaseeee!!!!pic.twitter.com/YgfkvBSfx0— CricTracker (@Cricketracker) March 21, 2025ఇవాళ రాత్రి 8 గంటల ప్రాంతంలో కోల్కతాలోని ఈడెన్ గార్డన్స్ మైదానంలో వర్షం కురుస్తూ ఉండింది. ఇవాల్టి పరిస్థితి చూసి రేపటి మ్యాచ్ జరిగేనా అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ సమయానికి వర్షం తగ్గిపోవాలని దేవుడిని వేడుకుంటున్నారు. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు చాలాకాలంగా కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీజన్ ఆరంభ మ్యాచ్ రద్దైతే వారి బాధ వర్ణణాతీతం.మరోవైపు రేపటి మ్యాచ్కు ముందు ఈడెన్గార్డెన్స్లో ఐపీఎల్-18వ సీజన్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెనింగ్ సెర్మనీ దాదాపుగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సొంత మైదానంలో జరిగే తొలి మ్యాచ్ విజయం సాధించి సీజన్ను ఘనంగా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. అయితే వారి ఆశలు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో కేకేఆర్ కొత్త కెప్టెన్ ఆజింక్య రహానే సారథ్యంలో బరిలోకి దిగనుంది. గత సీజన్లో కేకేఆర్కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కు వెళ్లాడు. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా 'ఈ సాలా కప్ నమ్మదే' అనుకుంటూ ఉంది. అయితే వీరి ఆశలకు వర్షం ఆదిలోనే బ్రేకులు వేసేలా ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ కూడా కొత్త కెప్టెన్తో బరిలోకి దిగుతుంది. రజత్ పాటిదార్ ఆర్సీబీ నూతన నాయకుడిగా నియమితుడయ్యాడు.ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్ -
ఈ ఏడాది ఐపీఎల్లో కోహ్లి బ్రేక్ చేయగలిగే ఐదు భారీ రికార్డులు
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రేపటి నుంచి (మార్చి 22) ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్లో రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది.అత్యధిక బౌండరీలుఈ సీజన్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సీజన్లో కోహ్లి మరో 64 బౌండరీలు బాదితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉంది. ధవన్ ఖాతాలో 768 బౌండరీలు ఉండగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 705 బౌండరీలు ఉన్నాయి.అత్యధిక హాఫ్ సెంచరీలుఈ సీజన్లో విరాట్ మరో నాలుగు హాఫ్ సెంచరీలు చేస్తే.. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (హాఫ్ సెంచరీ ప్లస్ సెంచరీలు) చేసిన బ్యాటర్గా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ ఖాతాలో 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 63 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉన్నాయి.తొలి భారతీయుడిగా రికార్డుఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ మరో 114 పరుగులు చేస్తే.. టీ20 క్రికెట్లో 13000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12886 పరుగులు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ ప్రపంచవాప్తంగా అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14562), అలెక్స్ హేల్స్ (13610), షోయబ్ మాలిక్ (13537), కీరన్ పోలార్డ్ (13537), డేవిడ్ వార్నర్ (12913) టాప్-5లో ఉన్నారు.తొలి ప్లేయర్గా..!ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ మరో 24 పరుగులు చేస్తే ఆసియా ఖండంలో 11000 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.విరాట్ ఆసియాలో ఇప్పటివరకు 10976 పరుగులు స్కోర్ చేశాడు.ఓపెనర్గా 5000 పరుగులుఈ ఐపీఎల్లో విరాట్ మరో 97 పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్ల జాబితాలో చేరతాడు.ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్ -
IPL 2025: రజత్ను ఆశీర్వదించండి.. ఆర్సీబీ అభిమానులకు విరాట్ పిలుపు
యువ ఆటగాడు రజత్ పాటీదార్ సుదీర్ఘ కాలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కెప్టెన్గా కొనసాగుతాడని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. రజత్ను ఆశీర్వదించాలని ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ సందర్భంగా పిలుపునిచ్చాడు. గత సీజన్లో డు ప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించగా... ఈ సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీ సారథ్య బాధ్యతలను రజత్ పాటీదార్కు అందించింది. విరాట్ మాటల్లో..‘రజత్ పెద్ద బాధ్యతలు అందుకున్నాడు. సుదీర్ఘ కాలం అతడు సారథిగా కొనసాగుతాడు. జట్టును నడిపంచేందుకు అతడికి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయి’ అని విరాట్ అన్నాడు. ఇక లీగ్ ఆరంభం (2008) నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి... ఇదంతా ఆర్సీబీ అభిమానుల ప్రేమాభిమానాల వల్లే సాధ్యమైందని అన్నాడు. ‘18 సంవత్సరాలుగా ఆర్సీబీకి ఆడుతున్నా. ఇదో అద్భుతమైన అనుభూతి. ప్రతి సీజన్కు ముందు అదే ఉత్సాహం నన్ను మరింత ఉత్తేజపరుస్తోంది. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఈ బృందంతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచాక అంతర్జాతీయ స్థాయిలో ఈ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ఆ తర్వాత తొలిసారి ఐపీఎల్ ఆడనున్నాడు.గౌరవం.. ఆనందం.. సక్రమంగా నిర్వర్తిస్తా: పాటీదార్బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని రజత్ పాటీదార్ అన్నాడు. ‘విరాట్, డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్టుకు సారథిగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ల ఆటను చూస్తూనే పెరిగా. చిన్నప్పటి నుంచే ఆర్సీబీ అంటే ప్రత్యేక అభిమానం. కెప్టెన్సీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా’ అని ఆర్సీబీ జట్టు సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాటీదార్ వ్యాఖ్యానించాడు. -
IPL 2025: ఓపెనర్లుగా కోహ్లి, సాల్ట్.. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ ఎడిషన్ మరో 5 రోజుల్లో (మార్చి 22) ప్రారంభం కానుంది. లీగ్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో జరుగనుంది.అన్ని సీజన్లకు ముందు లాగే ఈ సారి కూడా ఆర్సీబీ 'ఈ సాలా కప్ నమ్మదే' అన్న నినాదంతో బరిలోకి దిగుతుంది. 17 సీజన్లలో ఒక్క సారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తుంది. ఈ సారి ఓ అంశం ఆర్సీబీ టైటిల్ కలను సాకారం చేసేలా సూచిస్తుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్.. ఈ సారి ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య మ్యాచ్ అవుతున్నాయి. విరాట్ జెర్సీ నంబర్ 18 కాగా.. ఈ యేడు ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య కూడా పద్దెనిమిదే. ఇలాగైనా విరాట్ లక్కీ నంబర్ 18 ఆర్సీబీకి టైటిల్ సాధించిపెడుతుందేమో చూడాలి.ఇదిలా ఉంటే, గత సీజన్లతో పోలిస్తే ఆర్సీబీ ఈ సీజన్లో కాస్త ఫ్రెష్గా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ (రజత్ పాటిదార్), కొత్త ఆటగాళ్లతో బెంగళూరు ఫ్రాంచైజీ ఉరకలేస్తుంది. మెగా వేలానికి ముందు విరాట్ (21 కోట్లు), రజత్ పాటిదార్ (11 కోట్లు), యశ్ దయాల్ను (5 కోట్లు) మాత్రమే అట్టిపెట్టుకున్న ఆర్సీబీ.. మ్యాక్స్వెల్, డుప్లెసిస్, సిరాజ్ లాంటి స్టార్లను వదిలేసింది.మెగా వేలంలో ఆర్సీబీకి 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేవలం 22 మందితోనే సరిపెట్టుకుంది. వేలంలో ఆర్సీబీ ఫిల్ సాల్ట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లను.. హాజిల్వుడ్, ఎంగిడి లాంటి స్టార్ విదేశీ పేసర్లను కొనుగోలు చేసింది. దేశీయ స్టార్లు జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దేవ్దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యాపై కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ నమ్మకముంచింది.ఈ సీజన్ కోసం ఆర్సీబీ ఎంపిక చేసుకున్న జట్టును చూస్తే.. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ను ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా ధృవీకరించాడు. వన్డౌన్లో కెప్టెన్ రజత్ పాటిదార్.. నాలుగో స్థానంలో లివింగ్స్టోన్, ఐదో స్థానంలో జితేశ్ శర్మ, ఆరో ప్లేస్లో టిమ్ డేవిడ్, ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా, బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.ఆర్సీబీ మొత్తం జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, జితేశ్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా, లియామ్ లివింగ్స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్ భాండగే, జాకబ్ బెథెల్, జోష్ హాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం దార్, సుయశ్ శర్మ, నువాన్ తుషారా, లుంగి ఇన్గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రతీ, యశ్ దయాల్. -
RCB ఫ్యాన్స్ ను కెలికిన రాయుడు
-
IPL 2025: కోహ్లీ ఈసారైనా టైటిల్ సాధించేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. అయితే ఈ జట్టు ఇంతవరకూ ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేకపోవడం ఒకింత ఆశ్చర్యకరం. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలేసే స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మస్కట్ గా ఉన్న ఈ జట్టుకి ఎందుకో ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయాడు.ఐపీఎల్ 2025 ప్రారంభం రోజున (మార్చి 22) కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్లో గతేడాది టైటిల్ విజేత కోల్కతా నైట్ రైడర్స్ జరిగే మ్యాచ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఒకవేళ అదృష్టం కలిసి రానందువల్ల ఆర్సీబీ ఇంతవరకు టైటిల్ సాధించలేకపోయిందని భావించినట్టయితే, ఈ సీజన్ అందుకు చాల అనుకూలమైనది గా భావించాలి. ఎందుకంటే ఐపిఎల్ సీజన్ 18 స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఐకానిక్ జెర్సీ నంబర్ 18 తో సరిగ్గా సరిపోతుంది. చాలా కాలంగా జెర్సీ నంబర్ 18 కి పర్యాయపదంగా ఉన్న విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఈ సారైనా టైటిల్ సాధించి పెడతాడని అతని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రజత్ పాటిదార్ కి కెప్టెన్సీ బాధ్యతలుఇక జట్టు కూర్పును చూస్తే, దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న 31 ఏళ్ల రజత్ పాటిదార్ కి ఆర్సీబీ ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. ఐపీఎల్లో తొలిసారి కెప్టెన్సీ చేపట్టనున్నప్పటికీ, పాటిదార్ 2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ లో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇందులో మధ్యప్రదేశ్ జట్టు రన్నరప్గా నిలిచింది. మెగా వేలం ద్వారా గణనీయమైన మార్పులు చేసిన తర్వాత ఆర్సీబీ కొత్త దృక్పథంతో, కొత్త ఉత్సాహంతో ఐపీఎల్-2025లోకి అడుగుపెడుతుంది. గత సీజన్లో ఆర్సీబీ వరుసగా ఆరు మ్యాచ్లను గెలిచి టాప్ నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్లకు అర్హత సాధించింది. చివరికి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్లో పరాజయం చవిచూసింది. ఆర్సీబీ మరోసారి సామర్థ్యంతో నిండిన జట్టును నిర్మించింది. శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్, బలీయమైన బౌలింగ్, నాయకత్వ అనుభవం, కలగలిసి ఈ సీజన్ లోనైనా తొలి టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఫిల్ సాల్ట్ తో కోహ్లీ ఓపెనింగ్ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ను ఆర్సీబీ రూ. 11.50 కోట్లకు తీసుకుంది. గత సీజన్లో కేకేఆర్ టైటిల్ గెలుచుకోవడంలో సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్ల్లో 182.01 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 435 పరుగులు సాధించాడు. గత సీజన్లో ఓపెనర్గా అతను సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆర్సీబీలో సాల్ట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉన్నందున, జట్టు అసాధారణమైన టాప్ ఆర్డర్ను సమకూర్చుకుంది. మిడిల్ ఆర్డర్లో రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టోన్ మరియు టిమ్ డేవిడ్ ఉండటం జట్టు లైనప్ను మరింత బలోపేతం అవుతుంది. యావ బ్యాట్స్మన్ జితేష్ శర్మ కీపింగ్ విధులను కూడా నిర్వహిస్తాడు.సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ రావడంతో వారి బౌలింగ్ లైనప్కు గణనీయమైన బలాన్నిచ్చింది. ముంబై ఇండియన్స్తో బిడ్డింగ్ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హాజిల్వుడ్ సేవలను పొందేందుకు ఆర్సీబీ రూ. 12.50 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా లుంగి ఎంగిడి, నువాన్ తుషార వంటి ఫాస్ట్ బౌలర్లను చేర్చుకోవడం వలన ఆర్సీబీ బౌలింగ్ బలీయంగా ఉంది.ఫీల్ సాల్ట్: గత సంవత్సరం కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించడం లో కీలక పాత్ర పోషించిన సాల్ట్ ఈసారి జట్టులో చేరడంతో ఆర్సీబీ బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. గత సీజన్లో ఓపెనర్గా అద్భుతంగా రాణించిన సాల్ట్ మళ్ళీ అదే రీతిలో విజృభించి ఆడతాడని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్: ఎంతో అనుభవ్గుణుడైన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ జట్టులో చేరడంతో ఆర్సీబీ బౌలింగ్ లైనప్కు గణనీయమైన పదును లభించింది. కొత్త బంతిని స్వింగ్ మరియు డెత్ ఓవర్లలో యార్కర్లను వేసే సామర్థ్యం ఉన్న భువనేశ్వర్ జట్టు బౌలింగ్ కి కీలకం అనడంలో సందేహం లేదు. రజత్ పాటిదార్: ఆర్సీబీ తొలి సారి ఐపీఎల్ టైటిల్ సాధించాల్సిన బృహత్తర బాధ్యత రజత్ పాటిదార్ పై ఉంది. మంచి ఫామ్ తో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న రజత్ పాటిదార్ జట్టును ముందుండి నడిపించడం ఆర్సీబీకి చాల ముఖ్యం.విరాట్ కోహ్లీ: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ కి ఐపీల్ సీజన్ 18 చాల కీలకం. చాలా సంవత్సరాలుగా ఐపీఎల్ ట్రోఫీని గెలవాలనే కోహ్లీ ఆకాంక్ష ఈ సారైనా నెరవేరుతుందేమో చూడాలి.ఆర్సీబీ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యష్ దయాల్, జోష్ హాజిల్వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టోన్, రసిక్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భండగే, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికర, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రథీ. -
న్యూ లుక్లో విరాట్.. సోషల్మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరికొత్త లుక్లో కనిపించాడు. కోహ్లి న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను విరాట్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ ఇన్స్టాలో షేర్ చేయగా.. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఈ ఫొటోలకు అలీమ్ ఖాన్ 'ది గోట్ ఎనర్జీ' అని క్యాప్షన్ ఇచ్చారు. "వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ కోసం కొత్త స్నిప్. రేజర్ షార్ప్ గా కనిపిస్తున్నాడు" అని ఆలీమ్ ఖాన్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. నయా లుక్లో ఫోటోలను చూసి తమదైనశైలిలో స్పందిస్తున్నారు. కొత్త లుక్లో కింగ్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim)ఇదిలా ఉంటే మరో 8 రోజుల్లో (మార్చి 22) ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లోనే విరాట్ జట్టు ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కోల్కతా వేదికగా జరుగనుంది. అన్నీ ఫ్రాంచైజీలు ఐపీఎల్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమతమ జట్లలో చేరుతున్నారు. విరాట్ మరి కొద్ది రోజుల్లో ఆర్సీబీ క్యాంప్లో చేరే అవకాశం ఉంది. ఆర్సీబీ తమ ప్రాక్టీస్ను ఇదివరకే షురూ చేసింది. విరాట్ కొన్ని యాడ్ షూట్స్ కారణంగా జట్టుతో కలవడం ఆలస్యమైంది.విరాట్తో కూడిన టీమిండియా కొద్ది రోజుల కిందట ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో విరాట్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతను 5 మ్యాచ్ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 218 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో విరాట్ ఐదో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.ఈ టోర్నీలో పాక్తో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసిన విరాట్.. కీలకమైన సెమీఫైనల్లో ఆసీస్పై మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమి వల్ల అపవాదులు ఎదుర్కొన్న విరాట్.. ఈ టోర్నీతో తిరిగి పూర్వ వైభవం సాధించాడు. విరాట్ ఇదే ఫామ్ను ఐపీఎల్లోనూ కొనసాగించాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ నమ్మదే అంటూ డప్పు కొట్టుకుంటున్నారు.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్గా వ్యవహరించిన డుప్లెసిస్ను సైతం తప్పించి కొత్త కెప్టెన్గా రజత్ పాటిదార్ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ -
ఆర్సీబీకి ఆడాలని ఆరాటపడుతున్న పాక్ ఫాస్ట్ బౌలర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ ఐపీఎల్ ఆడాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. ప్రత్యేకించి ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాలని కలలు కంటున్నాడు. భారత్తో దౌత్యపరమైన సంబంధాలు సరిగ్గా లేని కారణంగా పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్లో ఎంట్రీ లేని విషయం తెలిసిందే. అయితే అమీర్ బ్రిటన్ పౌరసత్వం పొంది తన ఐపీఎల్ కల నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాడు. అమీర్కు 2026 నాటికి యూకే పాస్ట్పోర్ట్ వస్తుంది. అప్పుడు ఐపీఎల్ వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.విరాట్ అంటే అమితమైన అభిమానంఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అమీర్కు విరాట్ కోహ్లి అంటే అమితమైన అభిమానం. ఈ విషయాన్ని అమీర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. 2016 టీ20 ప్రపంచకప్కు ముందు కోహ్లి తనకు బ్యాట్ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని అమీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇదే సందర్భంగా అమీర్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి ప్రతిభను ఆరాధించే వ్యక్తి అని కొనియాడాడు. కోహ్లి తనకు బ్యాట్ ఇచ్చినప్పుడు ఉప్పొంగిపోయానని చెప్పుకొచ్చాడు. తాను కోహ్లి బ్యాటింగ్ను ఆరాధిస్తానని.. కోహ్లి తన బౌలింగ్ను గౌరవిస్తాడని తెలిపాడు. కోహ్లి ఇచ్చిన బ్యాట్తో చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడానని గుర్తు చేసుకున్నాడు. అమీర్ ఆర్సీబీలో చేరితే ఆ జట్టు టైటిల్ కల నెరవేరుతుందని మరో పాకిస్తాన్ ఆటగాడు అహ్మద్ షెహజాద్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ బౌలింగ్ సమస్యలు పరిష్కరించడానికి అమీర్ లాంటి బౌలర్ అవసరమని షెహజాద్ అన్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ ఎల్లప్పుడూ బలంగా ఉంది. వారికి బౌలింగే పెద్ద సమస్య. అమీర్ వారితో చేరితే వారు టైటిల్ గెలుస్తారని షెహజాద్ జోస్యం చెప్పాడు.కాగా, 32 ఏళ్ల అమీర్ 2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తిరిగి 2024లో (టీ20 ప్రపంచకప్ కోసం) రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. అయితే 2024 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అమీర్ను ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అమీర్ ప్రపంచవ్యాప్తంగా వివిథ లీగ్ల్లో (ఐపీఎల్ మినహా) ఆడుతున్నాడు.ఇదిలా ఉంటే, ఆర్సీబీ ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్తో తలపడనుంది. మార్చి 22న జరిగే ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగనుంది. ఈ ఏడాది ఆర్సీబీ నూతన కెప్టెన్గా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. గత రెండు సీజన్లలో సారథ్యం వహించిన డుప్లెసిస్ను ఆర్సీబీ మెగా వేలానికి ముందు వదులుకుంది.ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్,స్వస్థిక్ చికార, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో ఆర్సీబీ షెడ్యూల్మార్చి 22- కేకేఆర్తోమార్చి 28- సీఎస్కేఏప్రిల్ 2- గుజరాత్ఏప్రిల్ 7- ముంబైఏప్రిల్ 10- ఢిల్లీఏప్రిల్ 13- రాజస్థాన్ఏప్రిల్ 18- పంజాబ్ఏప్రిల్ 20- పంజాబ్ఏప్రిల్ 24- రాజస్థాన్ఏప్రిల్ 27- ఢిల్లీమే 3- సీఎస్కేమే 9- లక్నోమే 13- సన్రైజర్స్మే 17- కేకేఆర్ -
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీకి శుభవార్త
2025 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభవార్త అందింది. ఈ ఏడాది ఐపీఎల్కు దూరమవుతాడనుకున్న జేకబ్ బేతెల్ (ఇంగ్లండ్ ఆటగాడు) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. బేతెల్ మొదటి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటాడని సమాచారం. బేతెల్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. చిన్న వయసులోనే అద్భుతమైన స్ట్రోక్ ప్లేయర్గా గుర్తుంపు తెచ్చుకున్న బేతెల్ను ఆర్సీబీ గతేడాది మెగా వేలంలో రూ.2.6 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. బేతెల్ మిడిలార్డర్లో విధ్వంకర బ్యాటింగ్ చేయడంతో పాటు ఉపయోగకరమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. బేతెల్ ఇప్పటివరకు 63 టీ20లు ఆడి 136.77 స్ట్రయిక్రేట్తో 1127 పరుగులు చేశాడు. గతేడాది చివర్లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన బేతెల్ 3 టెస్ట్లు, 9 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. బేతెల్ టెస్ట్ల్లో 3, వన్డేల్లో 2, టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. బేతెల్ మొత్తంగా అంతర్జాతీయ కెరీర్లో 674 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. 21 ఏళ్ల బేతెల్కు ఇది తొలి ఐపీఎల్ అవుతుంది. ఆర్సీబీ.. మార్చి 22న కోల్కతాలో జరిగే లీగ్ ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్తో తలపడుతుంది. ఈ ఏడాదే ఆర్సీబీ నూతన కెప్టెన్గా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు.ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్,స్వస్థిక్ చికార, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో ఆర్సీబీ షెడ్యూల్మార్చి 22- కేకేఆర్తోమార్చి 28- సీఎస్కేఏప్రిల్ 2- గుజరాత్ఏప్రిల్ 7- ముంబైఏప్రిల్ 10- ఢిల్లీఏప్రిల్ 13- రాజస్థాన్ఏప్రిల్ 18- పంజాబ్ఏప్రిల్ 20- పంజాబ్ఏప్రిల్ 24- రాజస్థాన్ఏప్రిల్ 27- ఢిల్లీమే 3- సీఎస్కేమే 9- లక్నోమే 13- సన్రైజర్స్మే 17- కేకేఆర్ -
ఆర్సీబీ చెత్త ప్రదర్శన.. స్వల్ప స్కోర్కే పరిమితం
డబ్ల్యూపీఎల్ 2025 ఎడిషన్లో ఆర్సీబీ మరో చెత్త ప్రదర్శన చేసింది. గుజరాత్ జెయింట్స్తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. స్టార్ బ్యాటర్లందరూ విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ స్మృతి మంధన 20 బంతుల్లో 10, ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న ఎల్లిస్ పెర్రీ 4 బంతులు ఎదుర్కొని డకౌటైంది. ఓపెనర్ వ్యాట్ హాడ్జ్ 4, రిచా ఘోష్ 9 పరుగులకు ఔటయ్యారు. కనిక అహూజా (28 బంతుల్లో 33), రాఘ్వి బిస్త్ (22), జార్జియా వేర్హమ్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో కిమ్ గార్త్ (14) రెండంకెల స్కోర్ చేసింది. స్నేహ్ రాణా ఒక పరుగుతో అజేయంగా నిలిచింది. గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్ (4-0-17-1), తనూజా కన్వర్ (4-0-16-2), కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ (4-0-22-1), డియాండ్రా డొట్టిన్ (4-0-31-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.కాగా, డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ సీజన్ బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి రెండు మ్యాచ్ల్లో అద్బుత ప్రదర్శనలు నమోదు చేసి వరుస విజయాలు సాధించింది. అయితే ఆతర్వాత ఏమైందో ఏమో కాని ఆర్సీబీ లయ తప్పింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొంది. యూపీ వారియర్జ్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలే చేసినప్పటికీ.. సూపర్ ఓవర్లో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఆ జట్టు నాలుగింట రెండు మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఈ సీజన్లో నాలుగింట మూడు మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ జట్టు ఐదింట మూడు మ్యాచ్ల్లో గెలిచింది. మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ నాలుగింట రెండు మ్యాచ్ల్లో గెలిచింది. నాలుగో స్థానంలో ఉన్న వారియర్జ్ ఐదింట రెండు మ్యాచ్లు గెలిచింది. గత రెండు సీజన్లలాగే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. -
ఆర్సీబీ నూతన కెప్టెన్ రజత్ పాటిదార్ పర్సనల్ ( ఫోటోలు )
-
WPL 2025: గుజరాత్ బ్యాటర్ సిక్సర్ల సునామీ.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం
మహిళల ఐపీఎల్ (WPL) మూడో సీజన్ ఇవాళ (ఫిబ్రవరి 14) ఘనంగా ప్రారంభమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శన (టేబుల్ లాస్ట్) కనబర్చిన గుజరాజ్ జెయింట్స్ (GG) తలపడుతున్నాయి. వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకపోవడం తప్పని ఆర్సీబీకి ఇన్నింగ్స్ మధ్యలో అర్థమైంది. మాజీ కెప్టెన్, ఓపెనర్ బెత్ మూనీ అర్ద సెంచరీతో రాణించి జెయింట్స్ ఇన్నింగ్స్కు మంచి పునాది వేసింది. మూనీ 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసి ఔటైంది. మరో ఓపెనర్ లారా వోల్వార్డ్ 10 బంతుల్లో బౌండరీ సాయంతో కేవలం 6 పరుగులకే నిష్క్రమించి నిరాశపర్చింది. వన్డౌన్లో వచ్చిన దయాలన్ హేమలత 9 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టింది. అనంతరం బరిలోకి దిగిన ఈ సీజన్ కొత్త కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.గార్డ్నర్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్లో డియాండ్ర డొట్టిన్ కూడా సుడిగాల ఇన్నింగ్స్ ఆడింది. డొట్టిన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు చేసింది. ఆఖర్లో సిమ్రన్ షేక్, హర్లీన్ డియోల్ కూడా బ్యాట్ ఝులిపించారు. సిమ్రన్ బంతుల్లో బౌండరీ, సిక్సర్ సాయంతో 11 పరుగులు.. హర్లీన్ 4 బంతుల్లో 2 బౌండరీల సాయంతో 9 పరుగులు (నాటౌట్) చేశారు. ఇన్నింగ్స్ 18, 19 ఓవర్లలో గార్డ్నర్, సిమ్రన్ చెలరేగి పోయారు. ఈ రెండు ఓవర్లలో గార్డ్నర్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదింది. సిమ్రన్ బౌండరీ, సిక్సర్తో చెలరేగింది. ఫలితంగా 40 పరుగులు వచ్చాయి.25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గార్డ్నర్ఈ మ్యాచ్లో గార్డ్నర్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. తద్వారా లీగ్ చరిత్రలో నాలుగో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేసింది. డబ్ల్యూపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు గుజరాత్కే చెందిన సోఫీ డంక్లీ పేరిట ఉంది. డంక్లీ 2023 సీజన్లో ఆర్సీబీపై 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. లీగ్లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ఢిల్లీకి చెందిన షఫాలీ వర్మ పేరిట ఉంది. షఫాలీ 2023 సీజన్లో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది.ఆతర్వాత 2023 సీజన్లో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ముంబై కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 22 బంతుల్లో అర్ద సెంచరీ చేసింది. ఈమె తర్వాత గ్రేస్ హ్యారిస్ (యూపీ), కిరణ్ నవ్గిరే (యూపీ), ఇవాళ గార్డ్నర్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. సిక్సర్ల సునామీఈ మ్యాచ్లో గార్డ్నర్ సిక్సర్ల సునామీ సృష్టించింది. గార్డ్నర్ ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా అందరిపై విరుచుకుపడింది. ఈ మ్యాచ్లో ఆమె ఏకంగా 8 సిక్సర్లు బాదింది. లీగ్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్లో ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2023 సీజన్లో సోఫీ డివైన్ కూడా గుజరాత్పై 8 సిక్సర్లు కొట్టింది. -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్.. అధికారిక ప్రకటన
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నూతన కెప్టెన్ను ప్రకటించింది. వచ్చే సీజన్లో ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్ (Rajat Patidar) వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారికంగా వెల్లడించింది. 31 ఏళ్ల పాటిదార్ గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలో కీలక ప్లేయర్గా వ్యవహిరిస్తున్నాడు. తొలుత ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లి మళ్లీ బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారమంతా ఊహాగానాలే అని తేలిపోయింది. విరాట్కు కెప్టెన్సీ చేసే ఉద్దేశం లేకనే పాటిదార్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పాటిదార్.. గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్ను ఫైనల్కు చేర్చాడు. పాటిదార్కు రంజీల్లో మధ్యప్రదేశ్కు కెప్టెన్గా పని చేసిన అనుభవం ఉంది. పాటిదార్ కొన్ని సందర్భాల్లో ఆర్సీబీ కెప్టెన్గానూ (తాత్కాలిక) వ్యవహరించాడు. తాజా పరిణామంతో పాటిదార్ ఆర్సీబీ ఎనిమిదో కెప్టెన్గా ఎంపికయ్యాడు. గతంలో రాహుల్ ద్రవిడ్ (2008), కెవిన్ పీటర్సన్ (2009), అనిల్ కుంబ్లే (2009), డేనియల్ వెటోరీ (2011), విరాట్ కోహ్లి (2011), షేన్ వాట్సన్ (2017), ఫాప్ డుప్లెసిస్ (2022) ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించారు.2022 నుంచి 2024 వరకు ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్ను మెగా వేలంలో తిరిగి రీటైన్ చేసుకోకపోవడంతో 2025 సీజన్కు ముందు ఆర్సీబీ కెప్టెన్ లేకుండా ఉండింది. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పాటిదార్ అప్పటినుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు. పాటిదార్.. తనదైన శైలిలో విధ్వంసం సృష్టించి ఆర్సీబీ మిడిలార్డర్లో డ్యాషింగ్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాటిదార్.. స్పిన్ మరియు పేస్ బౌలింగ్ను సమర్దవంతంగా ఎదుర్కొంటాడు. ఐపీఎల్ కెరీర్లో 27 మ్యాచ్లు ఆడిన పాటిదార్ 158.85 స్ట్రయిక్రేట్తో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీలు ఉన్నాయి.పాటిదార్ను ఇటీవల ముగిసిన మెగా వేలానికి ముందు ఆర్సీబీ రూ. 11 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. ఆర్సీబీ రీటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో పాటిదార్ ఒకడు. పాటిదార్ కాకుండా ఆర్సీబీ విరాట్ కోహ్లి, యశ్ దయాల్ను రీటైన్ చేసుకుంది.కాగా, ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే. 2009, 2011, 2016లో రన్నకప్గా నిలిచిన ఈ జట్టు.. 2015, 2020, 2021, 2022, 2024 సీజన్లలో ప్లే ఆఫ్స్కు చేరింది. -
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ తర్వాత ఆర్సీబీ వెన్నులో వణుకు..!
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ తర్వాత ఆర్సీబీ (RCB) వెన్నులో వణుకు మొదలైంది. ఈ సిరీస్లో ఆర్సీబీకి చెందిన ఇంగ్లండ్ ఆటగాళ్లు (England Players) దారుణంగా విఫలం కావడమే ఇందుకు కారణం. ఇంగ్లండ్కు చెందిన ఫిల్ సాల్ట్ (Phil Salt), లియామ్ లివింగ్స్టోన్ (Liam Livingstone), జేకబ్ బేతెల్ను (Jacob Bethell) ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఈ ముగ్గురు తాజాగా ముగిసిన సిరీస్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక చతికిలపడ్డారు.రూ. 11.50 కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఫిల్ సాల్ట్ చివరి టీ20 మినహా సిరీస్ మొత్తంలో విఫలమయ్యాడు. రూ. 8.75 కోట్ల ధర పలికిన లియామ్ లివింగ్స్టోన్ ఒక్క మూడో టీ20లో మాత్రమే కాస్త పర్వాలేదనిపించాడు. రూ. 2.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన జేకబ్ బేతెల్ సిరీస్ మొత్తంలో ఒక్క మ్యాచ్లో కూడా రాణించలేక తస్సుమనిపించాడు.భారీ అంచనాలతో కొనుగోలు చేసిన తమ ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో ఆర్సీబీ యాజమాన్యానికి గుబులు పుట్టుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి (మెగా వేలంలో) తప్పు చేశామా అని ఆత్మపరిశీలన చేసుకుంటుంది. మరోవైపు ఇంగ్లండ్ విధ్వంసకర వీరుల త్రయం తమ ఫేట్ను మారుస్తుందని ఆర్సీబీ అభిమానులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇంగ్లండ్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనల తర్వాత వారి అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. 'ఈ సాలా కప్ నమ్మదే' అంటూ ప్రతి యేడు డప్పు కొట్టుకునే ఆర్సీబీ అభిమానులకు 2025 సీజన్ ప్రారంభానికి ముందే తమ భవిష్యత్తు అర్దమైపోయింది. ఐపీఎల్ ప్రారంభానికి మరో నెలన్నర రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మధ్యలో ఆర్సీబీకి చెందిన ఇంగ్లండ్ బ్యాటింగ్ త్రయం టీ20లు ఆడేది లేదు. మరి ఐపీఎల్ బరిలోకి నేరుగా దిగి వీరేమి చేస్తారో వేచి చూడాలి.కాగా, భారత్తో ముగిసిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ 1-4 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ మొత్తంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమయ్యారు. ఈ సిరీస్లోని మూడో టీ20లో మాత్రమే ఇంగ్లండ్ విజయం సాధించగలిగింది. ఆ మ్యాచ్లోనూ భారత ఆటగాళ్ల స్వయంకృతాపరాధాల వల్లే ఇంగ్లండ్ గెలవగలిగింది.ఈ సిరీస్లో భారత ప్రదర్శన విషయానికొస్తే.. భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ వీరలెవెల్లో విజృంభించగా.. బౌలింగ్లో వరుణ్ చక్రవరి అంచనాలకు మించి రాణించాడు. ఈ సిరీస్లో లీడింగ్ రన్ స్కోరర్.. లీడింగ్ వికెట్ టేకర్లు వీరిద్దరే. చివరి టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసకర శతకం బాదిన అభిషేక్.. ఈ సిరీస్లో 5 మ్యాచ్ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 219.69 స్ట్రయిక్రేట్తో 276 పరుగులు చేశాడు. వరుణ్ ఈ సిరీస్లో 5 మ్యాచ్లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. -
ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్.. సీజన్ మెత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
డబ్ల్యూపీఎల్-2025 సీజన్ ఆరంభానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్(Sophie Devine) ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యారు. డొమాస్టిక్ క్రికెట్కు కొంత కాలంగా దూరంగా ఉండాలని డివైన్ నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. అయితే సోఫీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించలేదు. ఇది నిజంగా ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే గతేడాది డబ్ల్యూపీఎల్ టైటిల్ ఆర్సీబీ గెలుచుకోవడంలో డివైన్ది కీలక పాత్ర.2024 డబ్ల్యూపీఎల్ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన డివైన్.. 136 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో ఈ ఏడాది సీజన్కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఇక ఈ స్టార్ ఆల్రౌండర్ నిర్ణయానికి బోర్డు పూర్తిగా మద్దతునిచ్చిందని ఉమెన్స్ హై పెర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ హెడ్ లిజ్ గ్రీన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు."ఆటగాళ్ల ఫిట్నెస్, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. మా హై పెర్ఫార్మెన్స్ యూనిట్ స్టాఫ్ నుంచి సోఫీకి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుందని మేము భావిస్తున్నాము. సోఫీకి ఇప్పుడు విశ్రాంతి ఎక్కువగా లభిస్తుంది. ఇది న్యూజిలాండ్ క్రికెట్కు సానుకూల ఆంశమని" గ్రీన్ వెల్లడించారు.కాగా డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో బరోడా వేదికగాగుజరాత్ జెయింట్స్తో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ టోర్నీకి వడోదరా (కొటాంబి స్టేడియం), బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం), ముంబై (బ్రబోర్న్ స్టేడియం), లక్నో (ఎకానా క్రికెట్ స్టేడియం) ఆతిథ్యమివ్వనున్నాయి.డబ్ల్యూపీఎల్-2025 సీజన్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇదే..స్మృతి మంధాన, ఎస్ మేఘన, రిచా ఘోష్, ఎలీస్ పెర్రీ, జార్జియా వేర్హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనా, , రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్, కేట్ క్రాస్, కనికా అహుజా, డాని-వ్యాట్ (యూపీ వారియర్స్ నుంచి ట్రేడ్).చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో రెండో టీ20.. వరల్డ్ రికార్డుపై కన్నేసిన అర్ష్దీప్ -
ఆర్సీబీలోకి ఇంగ్లండ్ ఆల్రౌండర్
ఇంగ్లండ్ ఆల్రౌండర్ ఛార్లీ డీన్ మహిళల ఆర్సీబీ జట్టుకు ఎంపికైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఆల్రౌండర్ సోఫీ మోలినెక్స్ గాయపడటంతో ఆమె స్థానంలో ఛార్లీ డీన్ ఆర్సీబీలోకి వచ్చింది. డీన్ను ఆర్సీబీ 30 లక్షలకు సొంతం చేసుకుంది. మోకాలి గాయం కారణంగా మోలినెక్స్ డబ్ల్యూపీఎల్ తదుపరి ఎడిషన్కు (2025) దూరం కానుందని ఆర్సీబీ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్గా ఉంది. గత ఎడిషన్ ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.మోలినెక్స్: లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన మోలినెక్స్ ఆసీస్ తరఫున 3 టెస్ట్లు, 13 వన్డేలు, 28 టీ20లు ఆడింది. మోలినెక్స్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 71 వికెట్లు (టెస్ట్ల్లో 7, వన్డేల్లో 23, టీ20ల్లో 41 వికెట్లు) తీసింది.ఛార్లీ డీన్: రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన డీన్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్ట్లు, 39 వన్డేలు, 36 టీ20లు ఆడింది. ఇందులో మొత్తంగా 122 వికెట్లు (టెస్ట్ల్లో 7, వన్డేల్లో 69, టీ20ల్లో 46 వికెట్లు) తీసింది.కాగా, మహిళల ఐపీఎల్ ఇప్పటివరకు రెండు ఎడిషన్ల పాటు విజయవంతంగా సాగింది. తొలి ఎడిషన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్లో ఆర్సీబీ ఛాంపియన్గా నిలిచింది. మూడో ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 వరకు జరుగనుంది. 2025 డబ్ల్యూపీఎల్ మొత్తం నాలుగు వేదికల్లో జరుగనుంది. బెంగళూరు, లక్నో, ముంబై, వడోదరాలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్లు జరుగనున్నాయి. తదుపరి సీజన్కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.డబ్ల్యూపీఎల్-2025లో పాల్గొనే జట్లు, ఆటగాళ్ల వివరాలు..ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా రోడ్రిగెజ్, మెగ్ లాన్నింగ్, షఫాలీ వర్మ, స్నేహ దీప్తి, తనియా భాటియా, సారా బ్రైస్, నందిని కశ్యప్, అలైస్ క్యాప్సీ, అన్నాబెల్ సదర్ల్యాండ్, అరుంధతి రెడ్డి, జెస్ జొనాసెన్, మారిజన్ కాప్, మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే, నికీ ప్రసాద్, నల్లపురెడ్డి చరణి, టిటాస్ సాధుగుజరాత్ జెయింట్స్: భారతి ఫుల్మలి, లారా వోల్వార్డ్ట్, ఫోబ్ లిచ్ఫీల్డ్, ప్రియా మిశ్రా, సిమ్రన్ షేక్, బెత్ మూనీ, ఆష్లే గార్డ్నర్, దయాలన్ హేమలత, హర్లీన్ డియోల్, సయాలి సత్గరే, తనూజా కన్వర్, డేనియల్ గిబ్సన్, డియండ్రా డొట్టిన్, కష్వీ గౌతమ్, మన్నత్ కశ్యప్, మేఘనా సింగ్, షబ్నమ్ షకీల్, ప్రకాశిక నాయక్ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా, కమలిని, అమన్దీప్ కౌర్, అమన్జోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, కీర్తన బాలకృష్ణన్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సజనా, అక్షిత మహేశ్వరి, సంస్కృతి గుప్త, నదినే డి క్లెర్క్, సైకా ఇషాఖీ, షబ్నిమ్ ఇస్మాయిల్ఆర్సీబీ: డేనియల్ వ్యాట్ హాడ్జ్, సబ్బినేని మేఘన, స్మృతి మంధన, రిచా ఘోష్, ఆశా శోభన, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, కనిక అహుజా, శ్రేయాంక పాటిల్, సోఫీ డివైన్, జోషిత, ప్రేమా రావత్, రాఘవి బిస్త్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, రేణుకా సింగ్, జాగ్రవి పవార్, ఛార్లీ డీన్యూపీ వారియర్జ్: కిరణ్ నవ్గిరే, శ్వేతా సెహ్రావత్, వృందా దినేశ్, ఆరూషి గోయల్, అలైసా హీలీ, చమారీ ఆటపట్టు, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, తహిల మెక్గ్రాత్, ఉమా ఛెత్రీ, క్రాంతి గౌడ్, అంజలి శర్వాని, గౌహెర్ సుల్తానా, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకోర్, అలానా కింగ్ -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది. బిగ్ బాష్ లీగ్లో పేలవ ఫామ్లో ఉండిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ జేకబ్ బేతెల్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. హోబర్ట్ హరికేన్స్తో ఇవాళ (జనవరి 14) జరిగిన మ్యాచ్లో బేతెల్ మెరుపు అర్ద సెంచరీ (50 బంతుల్లో 87; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించాడు. ఫలితంగా అతని జట్టు మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. JACOB BETHELL - A SPECIAL PLAYER. 🌟The Highlights of Jacob Bethel's 87(50) in the BBL and all players combined made 61(70) - Bethel, The Future of RCB. 🔥pic.twitter.com/zIyhli7iOi— Tanuj Singh (@ImTanujSingh) January 14, 2025మెల్బోర్న్ ఇన్నింగ్స్లో బేతెల్ మినహా ఎవరూ రాణించలేదు. టిమ్ సీఫర్ట్ (24), కెప్టెన్ సదర్ల్యాండ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జోష్ బ్రౌన్ 6, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ 7, హ్యారీ డిక్సన్ 1, టామ్ రోజర్స్ 5 (నాటౌట్), ఫెర్గస్ ఓనీల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఇల్లిస్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.155 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 7 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (24), కాలెబ్ జువెల్ (1) ఔట్ కాగా.. చార్లీ వకీం (12), నిఖిల్ చౌదరీ (4) క్రీజ్లో ఉన్నారు. రెనెగేడ్స్ బౌలర్లలో ఫెర్గస్ ఓనీల్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో హరికేన్స్ గెలవాలంటే 78 బంతుల్లో 105 పరుగులు చేయాలి.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో జేకబ్ బేతెల్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ జేకబ్ బేతెల్పై భారీ అంచనాలే పెట్టుకుంది. అయితే బీబీఎల్ తొలి అర్ద భాగంలో బేతెల్ తుస్సుమనిపించాడు.బీబీఎల్-2025లో బేతెల్ ప్రదర్శనలు..87(50) vs హోబర్ట్ హరికేన్స్1(8) vs మెల్బోర్న్ స్టార్స్2(9) vs పెర్త్ స్కార్చర్స్49(36) vs మెల్బోర్న్ స్టార్స్21(21) vs అడిలైడ్ స్ట్రైకర్స్2(4) vs సిడ్నీ థండర్30(22) vs పెర్త్ స్కార్చర్స్3(6) vs హోబర్ట్ హరికేన్స్ -
IPL 2025: ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే వార్త
ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే వార్త. ఇటీవలే ఆ జట్టులోకి వచ్చిన స్టార్ ఆటగాడు టిమ్ డేవిడ్ బిగ్బాష్ లీగ్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. టిమ్ వరుసగా రెండు మ్యాచ్ల్లో సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. టిమ్ అరివీర భయంకరమైన ఫామ్ చూసి ఆర్సీబీ అభిమానులు సంబురపడిపోతున్నారు. టిమ్ ఇదే ఫామ్లో ఉంటే ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గడం ఖాయమని చర్చించుకుంటున్నారు.టిమ్ తాజాగా సిడ్నీ థండర్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో టిమ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. గెలవడం కష్టం అనుకున్న మ్యాచ్లో టిమ్ విశ్వరూపం ప్రదర్శించి తన జట్టును (హోబర్ట్ హరికేన్స్) ఒంటిచేత్తో గెలిపించాడు. టిమ్ చివరి వరకు క్రీజ్లో ఉండి హరికేన్స్ను విజయతీరాలకు చేర్చాడు.- 62*(28) & Won POTM.- 68*(38) & Won POTM.THE DESTRUCTION OF TIM DAVID IN THE BBL - Fantastic news for RCB. 🥶 pic.twitter.com/OSwD9Px6DP— Tanuj Singh (@ImTanujSingh) January 10, 2025దీనికి ముందు అడిలైడ్ స్ట్రయికర్స్తో జరిగిన మ్యాచ్లోనూ టిమ్ ఉగ్రరూపం దాల్చాడు. ఆ మ్యాచ్లో టిమ్ 28 బంతులు ఎదర్కొని 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. ఛేదనలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బరిలోకి దిగిన టిమ్.. జట్టును విజయతీరాలకు చేర్చేంతవరకు ఔట్ కాలేదు. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఛేదనలో హరికేన్స్ టాపార్డర్ బ్యాటర్లు పెద్దగా రాణించకపోగా.. టిమ్ పెద్దన్న పాత్రి పోషించి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.సిడ్నీ థండర్తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టిమ్ హరికేన్స్ను ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. థండర్ ఇన్నింగ్స్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (88 నాటౌట్) ఒక్కడే రాణించాడు. సామ్ బిల్లింగ్స్ (28), ఒలివర్ డేవిస్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ రెండు వికెట్లు తీయగా.. స్టాన్లేక్, క్రిస్ జోర్డన్, నిఖిల్ చౌదరీ తలో వికెట్ పడగొట్టారు.165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్.. టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో 16.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. హరికేన్స్ టాపార్డర్ బ్యాటర్లు మిచెల్ ఓవెన్ (13), మాథ్యూ వేడ్ (13), చార్లీ వకీమ్, నిఖిల్ చౌదరీ (29) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన టిమ్ నేనున్నానంటూ తన జట్టును గెలిపించాడు. క్రిస్ జోర్డన్ (18 నాటౌట్) సహకారంతో టిమ్ హరికేన్స్ను గెలుపు తీరాలకు చేర్చాడు. థండర్ బౌలర్లలో జార్జ్ గార్టన్ రెండు వికెట్లు పడగొట్టగా... వెస్ అగర్, టామ్ ఆండ్రూస్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 28 ఏళ్ల టిమ్ను ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకుంది. టిమ్ను ఆర్సీబీ 3 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ వరకు టిమ్ ముంబై ఇండియన్స్కు ఆడాడు. ముంబై ఇండియన్స్కు ఆడుతున్నప్పుడు టిమ్ ధర 8.25 కోట్లుగా ఉండేది. -
టిమ్ డేవిడ్ ఊచకోత.. ఆర్సీబీకి మరో గుడ్ న్యూస్
వివిధ టోర్నీలో ఇవాళ (జనవరి 5) ఇద్దరు ఆర్సీబీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. బిగ్బాష్ లీగ్లో టిమ్ డేవిడ్ (Tim David) (హోబర్ట్ హరికేన్స్), విజయ్ హజారే ట్రోఫీలో రజత్ పాటిదార్ (Rajat Patidar) విధ్వంసం సృష్టించారు. అడిలైడ్ స్ట్రయికర్స్తో జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్లో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డేవిడ్.. ఓవరాల్గా 28 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. డేవిడ్ విధ్వంసం ధాటికి అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని హరికేన్స్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (49), అలెక్స్ రాస్ (47) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టుకు భారీ స్కోర్ను అందించారు. ఓలీ పోప్ (33), జేమీ ఓవర్టన్ (27 నాటౌట్) పర్వాలేదనిపించారు. హరికేన్స్ బౌలర్లలో వకార్ సలామ్ఖీల్ 2, క్రిస్ జోర్డన్, స్టాన్లేక్, రిలే మెరిడిత్ తలో వికెట్ పడగొట్టారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ డేవిడ్ అడిలైడ్ స్ట్రయికర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. మిచెల్ ఓవెన్ (37), మాథ్యూ వేడ్ (27), నిఖిల్ చౌదరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో లాయిడ్ పోప్, కెమరూన్ బాయ్స్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ థార్న్టన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.శతక్కొట్టిన రజత్ పాటిదార్విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ సెంచరీతో కదంతొక్కాడు. బెంగాల్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో పాటిదార్ 137 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 132 పరుగులు (నాటౌట్) చేశాడు. పాటిదార్ శతక్కొట్టడంతో ఈ మ్యాచ్లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ సుదీప్ ఘరామీ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. సుదీప్ ఛటర్జీ (47) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాట్ ఝులింపించాడు. షమీ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 42 పరుగులు చేశాడు.అనంతరం బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయినప్పటికీ రజత్ పాటిదార్.. శుభమ్ శ్యామ్సుందర్ శర్మ (99) సాయంతో మధ్యప్రదేశ్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో ఇద్దరు ఆటగాళ్లు 99 పరుగుల వద్ద ఔటయ్యారు.భీకర ఫామ్లో పాటిదార్దేశవాలీ క్రికెట్లో రజత్ పాటిదార్ భీకరఫామ్లో ఉన్నాడు. రజత్ వరుసగా 76(36), 62(36), 68(40), 4(7), 36(16), 28(18), 66*(29), 82*(40), 55(33), 21*(15), 2(7), 2(3), 14(16), 132*(137) స్కోర్లు చేశాడు. రజత్ గత 14 ఇన్నింగ్స్ల్లో 6 అర్ద శతకాలు, ఓ శతకం బాదాడు. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్ ప్రదేశ్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. జార్ఖండ్తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్లో భువీ ఈ ఫీట్ను సాధించాడు. ఈ మ్యాచ్ 17వ ఓవర్లో భువీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్ ఉంది. HAT-TRICK FOR BHUVNESHWAR KUMAR IN SYED MUSHTAQ ALI 🦁- Great news for RCB in IPL 2025...!!! pic.twitter.com/mDw13DhRM4— Johns. (@CricCrazyJohns) December 5, 2024ఈ మ్యాచ్లో భువీతో పాటు నితీశ్ రాణా (4-0-19-2), మొహిసిన్ ఖాన్ (2.5-0-38-2), వినీత్ పన్వార్ (4-0-39-1), విప్రాజ్ నిగమ్ (2-0-18-1), శివమ్ మావి (3-0-28-1) రాణించడంతో జార్ఖండ్పై ఉత్తర్ ప్రదేశ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రింకూ సింగ్ 28 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలువగా.. ప్రియమ్ గార్గ్ 31, సమీర్ రిజ్వి 24, నితీశ్ రాణా 16, శివమ్ మావి 15 పరుగులు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో బాల్ కృష్ణ 3 వికెట్లు తీయగా.. వివేకానంద్ తివారి 2, వికాస్ కుమార్, వికాశ్ సింగ్, అనుకుల్ రాయ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్.. 19.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. అనుకుల్ రాయ్ (44 బంతుల్లో 91) జార్ఖండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. విరాట్ సింగ్ (23), రాబిన్ మింజ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ (8) విఫలమయ్యాడు.ఆర్సీబీలో చేరిన భువీఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. భువీపై ఆర్సీబీ 10.75 కోట్లు వెచ్చించింది. మెగా వేలానికి ముందు భువనేశ్వర్ను సన్రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది. భువీ 2014 నుంచి సన్రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భువీకి పవర్ ప్లే మరియు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరుంది. భువీ 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో పర్పుల్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ 2016లో టైటిల్ సాధించడంలో భువీ కీలకపాత్ర పోషించాడు. -
జాక్పాట్ కొట్టిన ఆర్సీబీ ప్లేయర్
ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బేతెల్ జాక్పాట్ కొట్టాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) డెవలప్మెంట్ కాంట్రాక్ట్లో ఉన్న బేతెల్.. తాజాగా ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్ను దక్కించుకున్నాడు. ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్ జాబితాలో జో రూట్,జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. తాజాగా బేతెల్ వీరి సరసన చేరాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పేస్ త్రయం జోఫ్రా ఆర్చర్, మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్ తమ కాంట్రాక్ట్ను 2026 వరకు పొడిగించుకున్నారు. దీంతో ఈ ముగ్గురు కూడా రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేరిపోయారు.కాగా, 21 ఏళ్ల బేతెల్ ఈ ఏడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ల్లో వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బేతెల్ టెస్ట్ అరంగేట్రం కూడా చేశాడు. బేతెల్ మూడు ఫార్మాట్లకు తగ్గ ప్లేయర్. అందుకే అతనికి రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. బేతెల్ను ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్తో తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో బేతెల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. బేతెల్ ఇంగ్లండ్ తరఫున ఒక టెస్ట్, 8 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. ఇందులో 4 అర్ద సెంచరీలు ఉన్నాయి. -
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆసక్తికర ఘటన
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు చెరి ముగ్గురు ఆటగాళ్లను కుండ మార్పిడి చేసుకున్నాయి. 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, నువాన్ తుషార 2024 సీజన్లో ముంబై ఇండియన్స్కు ఆడారు. 2024 సీజన్లో ఆర్సీబీకి ఆడిన విల్ జాక్స్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ.. 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ వశమయ్యారు. వేలంలో ఓ ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి మారడం సాధారణమే అయినప్పటికీ.. ఏకంగా ముగ్గురు ఆటగాళ్ల కుండ మార్పిడి జరగడం సిత్రమే.కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొనగా ఆయా ఫ్రాంచైజీలు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగిలిన వారు దేశీయ ఆటగాళ్లు.వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల భారీ మొత్తం వెచ్చింది సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో కూడా ఇదే భారీ మొత్తం కావడం విశేషం. ఐపీఎల్ 2025 వేలంలో సెకెండ్ హైయ్యెస్ట్ పేమెంట్ శ్రేయస్ అయ్యర్కు దక్కింది. శ్రేయస్ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్కు దక్కింది. వెంకటేశ్ను కేకేఆర్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. -
ఐపీఎల్ కాంట్రాక్ట్ పట్టాడు.. మరుసటి రోజే..!
ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బేతెల్ ఈ మధ్యకాలంలో వరుసగా లక్కీ ఛాన్స్లు కొట్టేస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్లో టీ20, వన్డే అరంగేట్రం చేసిన బేతెల్.. నిన్ననే (నవంబర్ 25) ఐపీఎల్ కాంట్రాక్ట్ పట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో బేతెల్ను ఆర్సీబీ 2.6 కోట్లకు సొంతం చేసుకున్నాడు. తాజాగా బేతెల్ మరో లక్కీ ఛాన్స్ కొట్టాడు. బేతెల్కు ఇంగ్లండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ నెల 28 నుంచి న్యూజిలాండ్తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్లో బేతెల్ వన్డౌన్లో బ్యాటింగ్ చేస్తాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. వరుస అవకాశాల నేపథ్యంలో బేతెల్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. 21 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన బేతెల్కు దేశవాలీ క్రికెట్లో పెద్దగా ట్రాక్ రికార్డు లేనప్పటికీ వరుస అవకాశాలు వస్తున్నాయి. బేతెల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వార్విక్షైర్ తరఫున 20 మ్యాచ్లు ఆడి 25.44 సగటున 738 పరుగులు చేశాడు. 7 వికెట్లు తీశాడు. ఇటీవల జరిగిన హండ్రెడ్ లీగ్లో బేతెల్ బర్మింగ్హమ్ ఫీనిక్స్ తరఫున 7 మ్యాచ్లు ఆడి 165 పరుగులు చేశాడు. బేతెల్ ఇంగ్లండ్ తరఫున 8 వన్డేలు ఆడి హాఫ్ సెంచరీ సాయంతో 167 పరుగులు చేశాడు. 7 టీ20ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 173 పరుగులు చేశాడు. వన్డేల్లో బేతెల్ నాలుగు వికెట్లు తీశాడు.ఇంగ్లండ్ జట్టు ప్రకటనఈ నెల 28 నుంచి క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగబోయే తొలి టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (నవంబర్ 26) ప్రకటించారు. ఈ మ్యాచ్లో బేతెల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగనుండగా.. రెగ్యులర్గా ఆ స్థానంలో బ్యాటింగ్ చేసే ఓలీ పోప్ ఆరో స్థానానికి డిమోట్ అయ్యాడు. వికెట్కీపర్ జోర్డన్ కాక్స్ గాయపడటంతో పోప్ వికెట్కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ రానుండగా.. బేతెల్ మూడో స్థానంలో, జో రూట్ నాలుగులో, హ్యారీ బ్రూక్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగనున్నారు. అనంతరం ఆరో స్థానంలో ఓలీ పోప్, ఆతర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ బరిలోకి దిగనున్నారు.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లను, స్పిన్నర్ను బరిలోకి దించనుంది. పేసర్లుగా క్రిస్ వోక్స్, గస్ట్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ బరిలోకి దిగనుండగా.. ఏకైక స్పిన్నర్గా షోయబ్ బషీర్ ఎంపికయ్యాడు.న్యూజిలాండ్తో తొలి టెస్ట్కు ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఓలీ పోప్ (WK), బెన్ స్టోక్స్ (C), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ -
ఆర్సీబీ బ్యాటర్ ఊచకోత
అబుదాబీ టీ10 లీగ్లో ఆర్సీబీ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న లివింగ్స్టోన్.. ఢిల్లీ బుల్స్తో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లో అజేయమైన హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. లివింగ్స్టోన్ ఊచకోత కారణంగా బంగ్లా టైగర్స్.. ఢిల్లీ బుల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. నిఖిల్ చౌదరీ 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. ఢిల్లీ ఇన్నింగ్స్లో ఆడమ్ లిత్ (1), టామ్ బాంటన్ (8), టిమ్ డేవిడ్ (1), ఫేబియన్ అలెన్ (6) విఫలం కాగా.. జేమ్స్ విన్స్ (27), రోవ్మన్ పావెల్ (17), షాదాబ్ ఖాన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, జాషువ లిటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా టైగర్స్.. లివింగ్స్టోన్ విధ్వంసం సృష్టించడంతో 9.4 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. లివింగ్స్టోన్తో పాటు దసున్ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షాహిద్ ఇక్బాల్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అబుదాబీ టీ10 లీగ్ ప్రస్తుత ఎడిషన్లో బంగ్లా టైగర్స్కు ఇది తొలి విజయం. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కాగా, నిన్న (నవంబర్ 25) ముగిసిన ఐపీఎల్ వేలంలో లివింగ్స్టోన్ను ఆర్సీబీ 8.75 కోట్లకు సొంతం చేసుకుంది. -
IPL 2025: ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా..!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా ఓంకార్ సాల్వి నియమితుడయ్యాడని తెలుస్తుంది. సాల్వి ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత (2024-25) రంజీ సీజన్ ముగిసిన అనంతరం సాల్వి ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపడతాడని సమాచారం.దేశవాలీ క్రికెట్లో సాల్వికి లో ప్రొఫైల్ మరియు ప్లేయర్ ఫేవరెట్ కోచ్గా పేరుంది. సాల్వికి ఐపీఎల్లో ఇది రెండో కమిట్మెంట్. గతంలో సాల్వి కోల్కతా నైట్రైడర్స్ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్గా పని చేశాడు.కాగా, సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు 2023-24 రంజీ సీజన్ ఛాంపియన్గా నిలిచింది. ఇది రంజీల్లో ముంబైకు 42వ టైటిల్. ఈ సీజన్ ఫైనల్లో ముంబై విదర్భపై 102 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబైకు ఎనిమిదేళ్ల తర్వాత లభించిన తొలి రంజీ టైటిల్ ఇది.సాల్వి హెడ్ కోచ్గా ఉండగా ముంబై ఈ ఏడాది ఇరానీ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. ముంబై ఇరానీ కప్ గెలవడం 27 తర్వాత ఇది తొలిసారి. ఇరానీ కప్ ఫైనల్లో ముంబై రెస్ట్ ఆఫ్ ఇండియాపై గెలిచింది. ముంబై ఒకే సీజన్లో రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ గెలవడం చాలాకాలం తర్వాత ఇదే మొదలు.ఓంకార్ సాల్వి సోదరుడు ఆవిష్కార్ సాల్వి భారత్ మహిళల క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఆవిష్కార్ సాల్వి హెడ్ కోచ్గా ఉండగా పంజాబ్ క్రికెట్ జట్టు గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.ప్రస్తుతం 40ల్లో ఉన్న ఓంకార్ సాల్వి టీమిండియా తరఫున ఎప్పుడూ ఆడలేదు. సాల్వికి దేశవాలీ క్రికెట్లో కూడా అనుభవం తక్కువే. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సాల్వి కేవలం ఒకే ఒక మ్యాచ్ (2005లో రైల్వేస్ తరఫున) ఆడాడు. సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు ప్రస్తుత రంజీ సీజన్లో అద్బుత ప్రదర్శన చేస్తుంది. ఈ సీజన్లో ముంబై ఐదు మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.