Rohit-Kohli: ప్రస్తుతానికి ఎలాంటి కమిట్‌మెంట్స్‌ లేవు.. ఫోకస్‌ అంతా ఐపీఎల్‌పైనే..! | IPL 2025: Rohit Sharma And Virat Kohli Are Ready To Take Their Teams To Playoffs And Beyond | Sakshi
Sakshi News home page

Rohit-Kohli: ప్రస్తుతానికి ఎలాంటి కమిట్‌మెంట్స్‌ లేవు.. ఫోకస్‌ అంతా ఐపీఎల్‌పైనే..!

May 14 2025 5:22 PM | Updated on May 14 2025 5:46 PM

IPL 2025: Rohit Sharma And Virat Kohli Are Ready To Take Their Teams To Playoffs And Beyond

Photo Courtesy: BCCI

రోజుల వ్యవధిలో టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత క్రికెట్‌ దిగ్గజాలు ప్రస్తుతం తమ ఫోకస్‌ అంతా ఐపీఎల్‌ 2025పైనే పెట్టారు. ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు, మధ్యలో కూడా వారిపై ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌కు సంబంధించిన ఒత్తిడి ఉండేది. టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో వారిద్దరు ఫ్రీబర్డ్స్‌ అయ్యారు. 

వారిపై ఐపీఎల్‌ మినహా ఎలాంటి బాధ్యతా లేదు. ఈ ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ టీ20లకు గతేడాదే రిటైర్మెంట్‌ ప్రకటించారు. వారు ఇకపై భారత్‌ తరఫున వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటారు. భారత్‌ ఆడబోయే వన్డేలు సమీప భవిష్యత్తులో లేవు. దీంతో వారి దృష్టి మొత్తం ఐపీఎల్‌ 2025పైనే కేం‍ద్రీకృతమై ఉంది.

మే 17 నుంచి ఐపీఎల్‌ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్‌, కోహ్లి ముందున్న తక్షణ కర్తవ్యం వారి జట్లను ప్లే ఆఫ్స్‌కు చేర్చడం. ఇందు కోసం వారు అందరి కంటే ముందుగానే ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. ఐపీఎల్‌ రీవైజ్డ్‌ షెడ్యూల్‌కు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అన్న సందిగ్దత కొనసాగుతుండగా.. ఈ భారత సూపర్‌ స్టార్లు మాత్రం దాని తాలూకా ఆలోచనలు లేకుండా ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నారు. ఐపీఎల్‌ తదుపరి లెగ్‌ కోసం రోహిత్‌ మూడు రోజుల కిందటి ప్రాక్టీస్‌ మొదలుపెట్టగా.. విరాట్‌ ఇవాళే బరిలోకి దిగాడని తెలుస్తుంది.

ఐపీఎల్‌ పాక్షికంగా వాయిదా పడే సమయానికి రోహిత్‌, విరాట్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నాలుగు, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్‌ బెర్తుకు అతి చేరువలో ఉన్నాయి. 

ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై 7 విజయాలతో 14 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచి 16 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ముంబై ఈ సీజన్‌లో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 21న ఢిల్లీతో (ముంబై), మే 26న పంజాబ్‌తో (జైపూర్‌) తలపడనుంది. ముంబై ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ సాధిస్తుంది.

ఆర్సీబీ విషయానికొస్తే.. ఆ జట్టు ఈ సీజన్‌లో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 17న కేకేఆర్‌తో (బెంగళూరు), మే 23న సన్‌రైజర్స్‌తో (బెంగళూరు), మే 27న లక్నోతో (లక్నో) తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌ గెలిచినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది.

ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ తమ ఆరో టైటిల్‌ వేట కొనసాగిస్తుండగా.. ఆర్సీబీ తమ తొలి టైటిల్‌ దిశగా సానుకూల అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్‌మెంట్స్‌ లేని రోహిత్‌, విరాట్‌ తమ జట్లకు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement