
రెండు రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. జూన్ 3న జరిగిన ఫైనల్లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్పై గెలిచి, 18 ఏళ్ల ఐపీఎల్ ప్రస్తానంలో తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో కృనాల్ పాండ్యా అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన (4-0-17-2) చేసి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
తద్వారా ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఫైనల్ మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. కృనాల్ 2017 సీజన్లో తొలిసారి ఫైనల్లో (RPSపై) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
ఈ సీజన్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తర్వాత కృనాల్ పాండ్యా యాంకర్ రవిశాస్త్రితో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. 11 ఏళ్లలో పాండ్యా ఫ్యామిలీలో 9 ఐపీఎల్ ట్రోఫీలు ఉంటాయని హార్దిక్కు చెప్పినట్లు రివీల్ చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు కృనాల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ స్థాయికి చేరడానికి హార్దిక్, నేను కఠోరంగా శ్రమించామని తెలిపాడు. కృనాల్కు వ్యక్తిగతంగా ఇది నాలుగో టైటిల్ కాగా.. హార్దిక్ ఇదివరకే 5 ఐపీఎల్ టైటిల్స్ సాధించాడు.
2016లో కృనాల్ ఐపీఎల్ జర్నీ ముంబై ఇండియన్స్ తరఫున మొదలైంది. 2017, 2019, 2020 సీజన్లలో అతను ఆ ఫ్రాంచైజీ తరఫునే మూడు టైటిళ్లు గెలిచాడు. ఇప్పుడు ఆర్సీబీ తరఫున తన నాలుగో ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 34 ఏళ్ల ఈ బరోడా ఆఫ్ స్పిన్నర్ ఆర్సీబీ తరఫున తన నాలుగో ఐపీఎల్ టైటిల్ గెలవాలనుకున్నట్లు ఫ్రాంచైజీలో చేరిన మొదటి రోజే చెప్పాడు.
హార్దిక్ విషయానికొస్తే.. 2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్.. ఆ ఫ్రాంచైజీ తరఫున 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిళ్లు గెలిచాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా 2022లో తన ఐదో టైటిల్ను సాధించాడు. పాండ్యా సోదరులు కలిపి 9 టైటిళ్లు గెలవడం చూస్తే ఐపీఎల్ టైటిల్స్ అంటే ఆ ఇద్దరికి ఎంత పిచ్చో అర్దమవుతుంది.
ప్లేయర్లుగా అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్లు..
రోహిత్ శర్మ-6 (డెక్కన్ ఛార్జర్స్, ముంబై)
అంబటి రాయుడు-6 (ముంబై, సీఎస్కే)
ఎంఎస్ ధోని-5 (సీఎస్కే)
కీరన్ పోలార్డ్-5 (ముంబై)
హార్దిక్ పాండ్యా-5 (ముంబై, గుజరాత్)