భారతీయ సినిమాల్లో మరీ ముఖ్యంగా దక్షిణాదిలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు,తమిళంలో స్టార్ హీరోలతో దాదాపుగా నటించింది. 'మగధీర' మూవీ ఈమెని ఓవర్ నైట్ స్టార్ చేస్తే తర్వాత వచ్చిన పలు చిత్రాలు ఈమెని స్టార్ హీరోయిన్గా నిలబెట్టాయి. అలా నటిగా ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడే 2020లో గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.
(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్)
పెళ్లి, పిల్లలు కారణంగా కొన్నాళ్ల గ్యాప్ తీసుకుంది. కానీ గత కొన్నేళ్లలో మళ్లీ నటిగా యాక్టివ్ అయిపోయింది. తెలుగులో బాలకృష్ణ సరసన ఓ మూవీ చేస్తోంది. మరోవైపు హిందీలో రామాయణ, ది ఇండియా స్టోరీ చిత్రాల్లోనూ నటించింది. ది ఇండియా స్టోరీ.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలో ఇస్తోంది. ఈ సందర్భంగా దక్షిణాది గురించి కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
దక్షిణాదిలో హీరోయిన్ బొడ్డు, నడుము చూపించడానికి ఆసక్తి చూపుతారనే ప్రశ్నకు కాజల్ బదులిస్తూ.. ఇంతకు ముందు అలాంటి అపోహ ఉండేదేమో గానీ గత కొద్దికాలంగా దక్షిణాది సినిమా అలాంటి విషయాల్లో చాలా మారిపోయిందని చెప్పుకొచ్చింది. గతంలో తమన్నా, తాప్సీ లాంటి వాళ్లు దక్షిణాది చిత్రపరిశ్రమతో సాయంతో స్టార్స్గా ఎదిగి తర్వాత మనపైనే విమర్శలు చేశారు. కాజల్ మాత్రం గుర్తింపు తీసుకొచ్చిన ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తోంది.
(ఇదీ చదవండి: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్?)


