కేరళలో విషాదం.. భారీ వర్షాలకు కుప్పకూలిన పాత భవనం | Kerala Thrissur Kodakara Building Collapse Incident updates | Sakshi
Sakshi News home page

కేరళలో విషాదం.. భారీ వర్షాలకు కుప్పకూలిన పాత భవనం

Jun 27 2025 11:32 AM | Updated on Jun 27 2025 12:35 PM

Kerala Thrissur Kodakara Building Collapse Incident updates

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. తాజాగా.. త్రిస్సూర్‌ సమీపంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 27 మంది భవనంలో చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇప్పటికే 14 మంది బయటకు తీసుకొచ్చింది. 

తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. శుక్రవారం ఉదయం కొడకర ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలి ముగ్గురు మరణించారు. భవనం పాతదని, అందులో వలస కార్మికులు నివసిస్తున్నారని సమాచారం. మరణించిన ముగ్గురూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులేనని అధికారులు ప్రకటించారు. 

  • మృతులు:

రాహుల్ (19) – ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

రుపెల్ (21) – మృతదేహంగా వెలికితీశారు

అలీమ్ (30) – శవంగా గుర్తింపు

సుమారు 40 ఏళ్ల భవనం కావడం, లాటరైట్ ఇటుకలతో నిర్మించబడడంతో భారీ వర్షాలకు కూలి ఉంటుందని అధికారులు పప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ బిడ్డింగ్‌ పక్కనే కొడకర పంచాయతీ కార్యాలయం  ఉన్నప్పటికీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఫైర్‌, రెస్క్యూ బృందాలు జేసీబీలు, భారీ యంత్రాలు ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement