breaking news
kerala
-
పంబ-సన్నిధానం రోప్ వే ప్రాజెక్టులు వేగవంతం..
పంపాను శబరిమల సన్నిధానంతో అనుసంధానించే పూర్తి రోప్వేని సకాలంలో పూర్తి చేసేలా చర్యలుతీసుకోవాలని కేరళ రాష్ట్ర దేవస్వం పెన్షనర్ల సమాఖ్య పునలూర్ గ్రూప్ కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.శబరిమలను సందర్శించే లక్షలాది మంది యాత్రికులకు ఈ రోప్వే గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుందని, ఈ ప్రాజెక్టును మరింత ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.గత ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం కులతుపుళ గ్రామంలో 4.5336 హెక్టార్ల భూమిని కేటాయించింది. అయితే, యుడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. అలాగే ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత వరకు త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, శబరిమల అభివృద్ధి కార్యకలాపాలపై తన నియంత్రణను బలోపేతం చేసుకునేందుకు కేరళ ప్రభుత్వం కొత్త శబరిమల అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయనుంది. దీనివల్ల అభివృద్ధి సంబంధిత విషయాలలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) పరిపాలనా పాత్ర తగ్గుతుందని భావిస్తున్నారు.ఈ అధికార సంస్థ తొలి సమావేశం సెప్టెంబర్ 11న జరగనుంది.శబరిమల మాస్టర్ ప్లాన్ కింద ప్రాజెక్టులను కాలపరిమితిలోగా అమలు జరిగేలా చూడటమే ఈ కొత్త ప్రాధికార సంస్థ ప్రధాన లక్ష్యం. ఇది సన్నిధానంచుట్టుపక్కల ప్రాంతాలలో యాత్రికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం, అభివృద్ధి ప్రాజెక్టులను సమన్వయం చేయడం, నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించడం వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. అంతేగాదు ఈ సంస్థ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, అటవీ శాఖ, పోలీస్ శాఖతో సహా శబరిమల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ విభాగాల పనితీరును ఈ అథారిటీ సమన్వయం చేస్తుందని చెబుతున్నారు అధికారులు.(చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..
-
విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్లో సింగర్ హఠాన్మరణం
దుబాయ్: ప్రముఖ మలయాళీ గాయకుడు నిసార్ వయనాడ్ (Nisar Wayanad) దుబాయ్లోని ఒక ఆసుపత్రిలో అకస్మాత్తుగా కన్నుమూశారు. అజ్మాన్లో జరగాల్సిన ఒక సంగీత విభావరి (షో)కి కొన్ని గంటల ముందే ఆయన తుదిశ్వాస విడవడం యూఏఈలోని మలయాళీ కమ్యూనిటీని, ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. లైవ్ కన్సర్ట్ కాస్తా సంతాప సభగా మారిపోయింది.ఆయన గత నెలలో ఒక సంగీత కార్యక్రమం కోసం దుబాయ్కి వచ్చారు. జ్వరం రావడంతో వైద్య చికిత్స తీసుకున్నారు. రాబోయే రోజుల్లో దుబాయ్, సౌదీ అరేబియాలో పలు కార్యక్రమాల్లో ఆయన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మలయాళ సినిమాల్లో పాటలు పాడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఇంతలోనే ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులను, స్నేహితులను, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. నిసార్ గొంతు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ గాత్రాన్ని పోలి ఉండటంతో సంగీత కార్యక్రమాల వేదికలపై ఆయనకు విశేష ప్రజాదరణ ఉండేది.గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నిసార్, సాధారణ పారాసిటమాల్ మాత్రలు వాడుతున్నారు. శనివారం మధ్యాహ్నంపరిస్థితి విషమించడంతో దుబాయ్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సాయంత్రం మరణించారు. సెప్టిసీమియా (రక్తంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) వల్ల అవయవాలు విఫలమై, బాడీలో అసిడోసిస్ పెరగడం వల్ల మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.శనివారం అర్ధరాత్రి వేళ ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సుమారు 300 మందికి పైగా అభిమానులు, మిత్రులు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. రికార్డు స్థాయిలో కేవలం 4 గంటల్లోనే రాత్రి 3 గంటల ప్రాంతంలో జనాజా ప్రార్థనలు పూర్తి చేసి, పార్థివ దేహాన్ని కేరళలోని ఆయన స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.దుబాయ్లోని కల్చరల్ ఈవెంట్లలో తన గాత్రంతో అభిమానులను సంపాదించుకున్న నిసార్ కేరళలోని వయనాడ్ జిల్లాకు చెందిన వారు. నిసార్ అసలు పేరు నిస్సార్ అరోత్ ఇబ్రహీం. హిందీ, మలయాళ పాటలతో పాటు ఉదిత్ నారాయణ్, అర్జిత్ సింగ్, అతీఫ్ అస్లామ్ పాటలను అద్భుతంగా పాడేవారు. ఆయనకు భార్య షహానా నిసార్, ఇద్దరు కుమార్తెలు (సింబ్రీనా, అంబ్రీనా) ఉన్నారు.ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ!ప్రముఖుల సంతాపంఆయన అకాల మరణం పట్ల ఆర్జే మిథున్ రమేష్, ప్లేబ్యాక్ సింగర్ అఫ్సల్, ఇతర యూఏఈ ఈవెంట్ నిర్వాహకులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.ఇదీ చదవండి : పవిత్ర గంగలో మూడు మునకలు: అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి -
బస్సును ముద్దాడిండు డ్రైవరన్న
-
కారు-లారీ ఢీ.. 8 మంది బీటెక్ విద్యార్థుల దుర్మరణం
కేరళ త్రిసూర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఎనిమిది మరణించారు. మృతుల్లో ఏడుగురు తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. మరొకరు డ్రైవర్గా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.తమిళనాడు దిండిగల్లో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కారులో వెళ్తున్నారు. కైపమంగళం సమీపంలోని పనంబిక్కున్ను సెంటర్ వద్ద NH-66పై శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో ఆ కారు ప్రమాదానికి గురైంది. గురువాయూర్ వైపు నుంచి కొడుంగల్లూర్ వెళ్తున్న టైంలో.. హైవేపై నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు. కారు నుజ్జు నుజ్జు కావడంతో అందులో చిక్కుకున్నవాళ్లను బయటకు తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఊపిరి వదిలారు. ప్రమాదానికి గురైన కారు తమిళనాడు రిజిస్ట్రేషన్తోనే ఉంది. మృతదేహాలను త్రిసూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి అమిత వేగం ఒక కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న రహదారిపై డైవర్షన్, తగిన హెచ్చరికలు, లైటింగ్ వంటి అంశాలపైనా పోలీసులు పరిశీలన చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ మూడు లారీలు నిలిపి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: మంచి స్కూల్స్ అడిగితే తప్పా? -
డ్యామ్ల నిర్వహణకు ఏఐ వ్యవస్థ
త్రిశూర్: వరద ప్రమాదాలను తగ్గించేందుకు, డ్యామ్ల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేందుకు కేరళం రాష్ట్రానికి చెందిన పదిహేడేళ్ల యువకుడు నొవెయిన్ సరికొత్త కృత్రిమ మేధ వ్యవస్థను రూపొందించాడు. డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని, అలల తిరోగమన ప్రవాహాలను విశ్లేషించడం ద్వారా వరద ముప్పును తప్పించుకునేందుకు ఎంత తొందరగా డ్యామ్ నుంచి నీరు విడుదల చేయాలో అంచనా వేస్తుందీ వ్యవస్థ. దీనివల్ల వరద ముప్పు తగ్గడమే కాకుండా.. నీటిని సంరక్షించేందుకు కూడా వీలేర్పడుతుందని నొవెయిన్ చెబుతున్నాడు. 2018లో కేరళంలోని చాలక్కుడి ప్రాంతంలో వరదలు, ఆ సమయంలో ఆ ప్రాంతంలోని డ్యామ్ల పరిస్థితులపై వచ్చిన కథనాలతో స్ఫూర్తి పొంది తానీ వ్యవస్థను రూపొందించినట్లు చెప్పారు. పెద్ద పెద్ద డ్యామ్ల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలనని తాను నమ్మానని, పలు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలన్న సంకల్పంతో ముందుకెళ్లానని, విజయం సాధించానని వివరించారు. ప్రస్తుతం తాను నమూనా వ్యవస్థను మాత్రమే తయారు చేశానని, మరింత సమర్థంగా పనిచేసే అసలు మోడళ్ల అభివృద్ధికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. నొవెయిన్ ఆవిష్కరణకు ప్రఖ్యాత ఎల్రక్టానిక్స్ కంపెనీ శాంసంగ్ తన సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ‘సాల్వ్ టుమారో’పోటీలో ప్రథమ స్థానం లభించింది. యువ ఇన్నొవేటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పోటీలో 40 మంది పాల్గొన్నారని, నొవెయిన్కు చెందిన అకూస్టీనోడ్ సిస్టమ్స్ మొదటి స్థానంలో నిలిచిందని శాంసంగ్ ఒక ప్రకటనలో తెలిపింది. -
సంకల్పమే నడిపించింది!
వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే నిరూపించాడు కేరళలోని వయనాడ్కు చెందిన 74 ఏళ్ల టి.జె. మార్స్. మైనస్ 20 డిగ్రీల చలిలో, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వీచే మంచుగాలులను సైతం తట్టుకుని యూరప్లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎల్బ్రస్ని అధిరోహించాడు. మౌంట్ ఎల్బ్రస్ ఎక్కిన అత్యంత వృద్ధ భారతీయుడిగా నిలిచి రికార్డు సృష్టించాడు. ట్రెక్కింగ్పై ఆసక్తి ఉన్న టి.జె. మార్స్ మొదట తన 70 ఏళ్ల వయసులో (2021)లో చేంగేరి హిల్స్ ట్రెక్కింగ్తో తన ఈ నూతన ప్రయాణం ప్రారంభించాడు. ఆ తర్వాత కేరళలోని బ్రహ్మగిరి, బాణాసుర పర్వతాలను అధిరోహించాడు. అప్పటి నుంచి తనపై తనకు మరింత నమ్మకం కుదిరి 2024లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్, 2025లో ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన శిఖరం ‘మౌంట్ కిలిమంజారో’లను ఎక్కి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు. ప్రస్తుతం తాను చేసిన మౌంట్ ఎల్బ్రస్ సాహస యాత్ర ఎంతో కష్టంతో కూడుకున్నదనీ... శారీరక దృఢత్వం కంటే మానసిక సంకల్పమే తనను ముందుకు నడిపిందని మార్స్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన ట్రెక్కింగ్ కేవలం ఈ పర్వతంతోనే ఆగిపోదని, వచ్చే ఏడాది మరొక ఎత్తైన పర్వతాన్ని అధిరోహిస్తానని ఉత్సాహంగా చెబుతున్నాడు 74 ఏళ్ల యువకుడు. -
Viral: భావోద్వేగంతో బస్సుకు వీడ్కోలు
పనే దైవం అంటారు మన పెద్దలు. పాల్ కురియన్ కూడా తాను చేసే పనిని దైవ సమానంగా భావించాడు. తాను పనిలో చేరినప్పటి నుంచి అంకితభావంతో చాలా శ్రద్ధగా పనిచేశాడు. 18 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన చివరి వరకు అంతే అంకితభావంతో సేవలు అందించాడు. పాల్ కురియన్ ఇటీవల పదవీ విరమణ చేశాడు. రిటైర్మెంట్ చివరి రోజున ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆయన పేరు వార్తల్లోకి ఎక్కింది.ఎవరీ పాల్ కురియన్?కేరళంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్గా పనిచేశారు పాల్ కురియన్. ఇడుక్కిలోని కుమిలీ, కట్టప్పనా డిపోల్లో ఆయన సేవలు అందించారు. ఆయన ఉద్యోగ జీవితం సాఫీగా సాగిందని, బస్సు స్టీరింగ్ పట్టుకున్నప్పటి నుంచి ఒక్క ప్రమాదం కూడా జరగలేదని కేఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 2న చివరిసారిగా బస్సు నడిపారు. బస్సును వదిలివెళుతూ భావోద్వేగానికి లోనయ్యారు. బస్సును పార్క్ చేసి స్టీరింగ్ను అప్యాయంగా ముద్దాడారు. తనకు ఎంతోకాలం ఉపాధి కల్పించిన బస్సుకు శిరసు వంచి నమస్కరించారు. నాలుగు టైర్లను ప్రేమగా తాకి దండాలు పెట్టారు.చాన్స్ ఇస్తే మళ్లీ వస్తాఈ సందర్భంగా పాల్ కురియన్ మాట్లాడుతూ.. ఆగస్టు 31నే అధికారికంగా రిటైర్ అయ్యాను. సెస్టెంబర్ 2న ఫిజికల్ చివరిసారిగా డ్యూటీ చేశాను. గత ఎనిమిదేళ్లుగా తమిళనాడులోని కంబం, కొట్టాయం మధ్య బస్సు ఇంటర్ స్టేట్ సర్వీసు నడిపాను. నేను నడిపిన బస్సుతో చాలా ఏళ్లుగా అనుబంధం ఏర్పడింది. ఇంతకాలం నన్ను, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన బస్సుకు నా రిటైర్మెంట్ రోజున నమస్కారాలు తెలిపానని చెప్పాడు. పనిని ప్రేమిస్తే భారంగా అనిపించదని అన్నారు. కాగా, తనకు మళ్లీ డ్రైవర్గా అవకాశం కల్పిస్తే స్టీరింగ్ పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని పాల్ కురియన్ చెప్పారు.ఇదీ చదవండి: హైవేపై 'ఫ్యామిలీ' భోజనం!నెటిజన్ల ప్రశంసలుపాల్ కురియన్.. బస్సుకు సమస్కరిస్తున్న వీడియోను కేఎస్ఆర్టీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో చూసినవారంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిబద్ధతతో పనిచేసే వారికి మన్ననలు దక్కుతాయనడానికి పాల్ కురియన్ మంచి ఉదాహరణ అంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. A KSRTC driver in Kerala bid an emotional farewell to his bus after completing his final trip before retirement. Paul Kurian of the Kumily depot kissed the steering wheel and saluted the bus after his last duty on 2 September, a moment that has touched many online.#kerala… pic.twitter.com/xsxNghIBBi— Salar News (@EnglishSalar) September 3, 2026 -
వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలు
రిటైర్ అయిన తరువాత ఏం చేయాలి? కాలక్షేపం ఎలా? మరీ ముఖ్యంగా డబ్బులు ఎలా మధనపడే వారికి కేరళకు చెందిన రిటైర్డ్ టీచర్ రేమాబాయి జీవితం స్ఫూర్తినిస్తుంది. ఇంతకీ ఆమె చేశారు? తెలుసుకుందాం ఈ కథనంలో.కేరళలోని కొల్లమ్కు చెందిన రేమాబాయి జువాలజీ టీచర్గా,హెడ్మిస్ట్రెస్గా 30 ఏళ్ల పాటు విద్యారంగంలో సేవలందించారు. 2022 మే 31న ఆమె పదవీ విరమణ చేశారు. ఆమె భర్త, ఒక రిటైర్డ్ సీనియర్ బ్యాంక్ మేనేజర్. అలాగే సర్జన్లైన ఆమె కుమారుడు, కోడలు ఢిల్లీలో పనిచేస్తున్నారు. అయితే అదే ఏడాది తల్లి మరణం, ఒంటరితనం వల్ల ఏర్పడిన మానసిక వేదనను జయించడానికి ఆమె తన ఇంటి పెరటి స్థలంలో మొక్కల పెంపకం ప్రారంభించారు. అలా డ్రాగన్ ఫ్రూట్ సాగును చేపట్టారు. దీని మీద బాగా పరిశోధించి 'మలేషియన్ కింగ్' (Malaysian King) రకానికి చెందిన రెడ్ డ్రాగన్ ఫ్రూట్ను ఎంచుకున్నారు. కేవలం 1,750 చదరపు అడుగుల పెరటి స్థలంలో 90 కాంక్రీట్ స్తంభాలు, పాత టైర్ల సాయంతో 360 మొక్కలతో సాగు ప్రారంభించారు. ప్రారంభంలో 360 మొక్కలు నెలకు రూ. 50వేలకు మించి ఆదాయాన్ని అందించగా,ఆ తరువాత ఆదాయం సుమారు రూ. 1.5 లక్షలకు పెరిగింది. ఈ ఫలితాలు, మరింత భూమి కొనకుండానే తన సాగును విస్తరించడానికి ఆమెను ప్రోత్సహించాయి. ఫలితంగా నెలకు రూ. 4 లక్షలు ఆర్జించేస్థాయికి చేరుకున్నారు. అంతేకాదు ‘జెసీ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా డ్రాగన్ ఫ్రూట్ సాగులో తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. డ్రాగన్ ఫ్రూట్ -మిద్దెతోట మిద్దెపై మట్టిలేని సాగు (Soil-less Cultivation): పెరట్లోనే కాకుండా తన ఇంటి మిద్దెపై (Terrace) బరువు కాకుండా ఉండటానికి మట్టికి బదులుగా ఇంట్లోనే తయారు చేసిన కంపోస్ట్, ఆవు పేడను డ్రమ్ములు/బారెళ్లలో నింపి మొక్కలను పెంచడం ప్రారంభించారు. సేంద్రీయ పద్ధదితో ఆమె సక్సెస్ను అందుకోవడం విశేషం. పాత వంటగది వ్యర్థాలు, ఆకులు, కొబ్బరి/పనస వ్యర్థాలు మరియు చేపల వ్యర్థాలతో ఫ్రిష్ అమినో యాసిడ్స్ వంటి 15 రకాల ద్రవ ఎరువులను తయారు చేసి పంటకు అందించారు. దీనివల్ల సాధారణంగా 5-6 నెలలు మాత్రమే వచ్చే దిగుబడి, ఆమె వద్ద ఏడాదికి 10 నెలల పాటు నిరంతరాయంగా వస్తోంది.ఇదీ చదవండి: ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారుపెరడు, మిద్దె సాగు ద్వారా నెలకు సగటున 750 కేజీల పండ్ల ఉత్పత్తి లభిస్తుంది. హోల్సేలర్లు, ఆర్గానిక్ స్టోర్లు కేజీ రూ. 175 చొప్పున ఆమె ఇంటి నుంచే కొనుగోలు చేస్తారు. పండ్ల అమ్మకాలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ మొక్కల కొమ్మలను (Stem Cuttings) ఒక్కోటి రూ. 70 చొప్పున విక్రయిస్తున్నారు. భారత్తో పాటు మాల్దీవులు, శ్రీలంకలోని 2,500 మందికి పైగా కస్టమర్లకు వీటిని విక్రయించారు. (తెలంగాణకు ఒకే రోజులో 5,500 కొమ్మలు సరఫరా చేశారు). అటు పండ్ల విక్రయం, ఇటు కొమ్మల అమ్మకాల ద్వారా ప్రస్తుతం ఆమె నెలకు దాదాపు రూ. 4 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. ఇదీ చదవండి: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కత్తిపోట్లు, సంచలన విషయాలు -
అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!
ఏ స్వామికైనా ప్రసాదం నారికేళం, అరటిపండ్లు వంటివి భక్తులు నివేదించడం చూశాం. అలాగే ఆలయంలో స్వామివారికి ప్రసాదంగా లడ్డూలు, చక్కెర పొంగలి, పరమాన్నం, పులిహోర, అటుకులు వంటివి నైవేద్యంగా పెడతారు. పురాతన ఆచారం, ఆలయం విశిష్టత అక్కడ కొలువైన స్వామి ఆధారంగా నైవేద్య సమర్పణ అనేది ఉంటుంది. ఆ తర్వాత దేవతకు సమర్పించిన ఆ నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తుంటారు. ఇది అత్యంత సర్వసాధారణం. దక్షిణాది వాళ్లు కార్తికేయ, సుబ్రమణ్యస్వామి, మరుగన్ వంటి పేర్లతో ఆరాధించే ఆ శరవణభవుడుకి అక్కడ ఏం సమర్పిస్తారో తెలిస్తే విస్తుపోతారు. అది కూడా ఓ చిన్నపిల్లవాడి కారణంగా ఆ పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం, ఆచారంగా మారడం విశేషం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందంటే..కేరళలోని అలెప్పీలోని తెక్కన్ పళని సుబ్రహ్మణ్య స్వామి మహా క్షేత్రం అనే తలవాడి ఆలయం అత్యంత పురాతన ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది 300 ఏళ్ల నాటి పురాతన ఆలయం. ఇక్కడ కార్వికేయుడు బాలమురుగన్ రూపంలో భక్తుల పూజలందుకుంటున్నాడు. అయితే ఇక్కడ స్వామి వారికి మంచ్బార్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆఖరికి ఈ ఆలయానికి వచ్చే భక్తులు సైతం మంచ్ బార్లనే తీసుకొస్తుంటారు. అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి మొదలైందంటే..ఆ బాలుడి కారణంగా..స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. ఒక ముస్లిం బాలుడు ఆడుకుంటూ..ఆ ఆలయ గంటను మోగించడంతో అతని తల్లిదండ్రులు మందలించారు. ఆ రాత్రి అతనికి తీవ్ర జ్వరం రావడంతో, కలవరింతల్లో మురుగని నామస్మరణ చేశాడు. మరుసటి రోజు తల్లిదండ్రులు అతన్ని ఆలయానికి తీసుకురాగా, పూజారి ఏదైనా స్వామివారికి నివేదించండి అని చెప్పగా ఆ బాలుడు పట్టుబట్టి మరి తన వద్ద ఉన్న 'మంచ్' చాక్లెట్ను సమర్పించాడు. ఆనాటి నుంచి స్వామివారికి మంచ్ చాక్లెట్లు సమర్పించడం ఆచారంగా మారింది. అంతేగాదు స్వామివారికి పూలదండలకు బదులుగా మంచ్ చాక్లెట్ల దండనే సమర్పిస్తారు. ఆ కారణంగానే ఈ ఆలయానికి ‘మంచ్ మురుగన్’ ఆలయం అని పేరొచ్చింది. అయితే ఇటీవల ఈ ఆలయాన్ని రేహా అదానీ అనే కంటెంట్ క్రియేటర్ దర్శించుకుంది. అక్కడ స్వామివారికి మంచ్ చాక్లెట్లు సమర్పించడం చూసి ఆశ్చర్యంతో..ఆ స్వామివారి సందర్శనకు సంబంధించిన వీడియోని పంచుకుంది. అంతేగాదు తనకు ప్రసాదంగా పూజార్లు ఇచ్చిన మంచ్ చాక్లెట్ని చూపిస్తూ ఆనందంగా ఆస్వాదించింది. నెటిజన్లు కూడా తాము కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకున్నామని, అక్కడ మంచ్ చాక్లెట్లు చాలా రుచిగా ఉంటాయంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Reha Adani (@stitchyourmap) (చదవండి: ఆ అక్కా తమ్ముళ్లది విమాన బంధం..! ఇద్దరూ..) -
అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో కేరళకు చెందిన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. అదే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నివసించే వారి స్నేహితురాలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతులను త్రిస్సూర్ సమీపంలోని ముడిక్కోడ్కు చెందిన అంజన (35), తిరువనంతపురం కేశవదాసపురానికి చెందిన యాన్ మేరీ మాథ్యూ (40)గా గుర్తించారు. నిందితురాలు అనిల అనే మహిళను శాన్ జోస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నిందితురాలు యాన్ మేరీ ఇంటిలోకి చొరబడి కత్తితో పొడిచి చంపగా, అంజనను కారుతో ఢీకొట్టి హతమార్చినట్లు బంధువులు ఆరోపించారు. ఉద్యోగ సంబంధిత వివాదమే యాన్ మేరీపై దాడికి కారణమని భావిస్తుండగా, అంజన హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. యాన్ మేరీ గత పదేళ్లుగా అమెరికాలో ఇంజనీర్గా పనిచేస్తుండగా, ఆమె భర్త పల్లాత్ర జాకబ్ కూడా అక్కడే నివసిస్తున్నారు.అంజన గత ఆరేళ్లుగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త విజేష్ కూడా కాలిఫోర్నియాలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఘటనపై త్రిస్సూర్ కలెక్టర్ శిఖా సురేంద్రన్ స్పందిస్తూ, పూర్తి వివరాలను సేకరించి విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపిస్తున్నామని, మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: నదులన్నీ విషతుల్యం.. చేపల వేటపై నిషేధం! -
ముఖ్యమంత్రి కాన్వాయ్ను అడ్డుకుని కాంగ్రెస్ నేత వాగ్వాదం
తిరువనంతపురంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ కాన్వాయ్ను కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ అడ్డుకున్నారు. సతీశన్ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవారేనన్న విషయం తెలిసిందే. సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురు జయంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు చెంపజంతికి వెళ్తున్న సతీశన్ కాన్వాయ్ను కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్న దృశ్యాలు ఓ వీడియోలో కనిపించాయి. ఆ బృందం చెంతిలో శ్రీ నారాయణ గురు కార్యక్రమాన్ని నిర్వహించింది. సతీశన్ ఆ కార్యక్రమానికి హాజరు కావాలని వారు కోరుకున్నారు.సుమారు 30 సెకన్ల తర్వాత సతీశన్ వాహనం నుంచి బయటకు వచ్చారు. తిరువనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ నేత అనిల్ కుమార్తో ఆయన మాట్లాడుతున్నట్లు కనిపించింది. అనంతరం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొన్ని నిమిషాల తర్వాత సతీశన్ తిరిగి వాహనంలోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.చెంతి కార్యక్రమం ఆయన అధికారిక కార్యక్రమాల జాబితాలో లేదని సతీశన్ కార్యాలయం తెలిపింది. కుమార్పై పోలీసులు భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. అక్రమంగా నిర్బంధించడం, నేరపూరిత బెదిరింపులు, ప్రభుత్వ ఉద్యోగి అధికారిక విధులు నిర్వర్తించకుండా బలప్రయోగంతో అడ్డుకోవడం వంటి ఆరోపణలు ఇందులో ఉన్నాయి.నిందితుడు ముఖ్యమంత్రిని ‘నాకు కోపం వస్తే ఏం చేస్తావు?’ అని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రిని బహిరంగంగా అవమానించడంతో పాటు కాన్వాయ్ వెంట ఉన్న పోలీసు సిబ్బంది అధికారిక విధులను అడ్డుకున్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.వాహనాన్ని నేను అడ్డుకోలేదు: కుమార్ అయితే ముఖ్యమంత్రి వాహనాన్ని తాను అడ్డుకోలేదని కుమార్ అన్నారు. వాగ్వాదం సందర్భంగా సతీశన్ వ్యవహరించిన తీరును విమర్శిస్తూ, ‘‘కాలేజీ విద్యార్థులు గొడవపడుతున్నట్లు ప్రవర్తించారు’’ అని అన్నారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇది పార్టీలోని వర్గ రాజకీయాల్లో భాగం. వర్గపోరాటమే సమస్య’’ అని చెప్పారు.చెంతి కార్యక్రమ నిర్వాహకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొందరు, కొన్ని నెలల క్రితం సచివాలయంలో సతీశన్ను కలిసి కార్యక్రమాలకు ఆహ్వానించిన ఫొటోను తరువాత విడుదల చేశారు. కుమార్ అరెస్టుపై జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు సుహైల్ షాజహాన్ కూడా నిరసన వ్యక్తం చేశారు.‘‘వారు ఏ వర్గానికి, ఏ పక్షానికి చెందినవారైనా సరే, వ్యక్తిగతంగా చూస్తే పార్టీ కోసం ప్రాణాలను పణంగా పెట్టి, నిరంతరం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్త అనిల్ను ఈ విధంగా అరెస్టు చేయడం చూసి నేను బాధపడ్డాను’’ అని శ్రీకార్యం పోలీస్ స్టేషన్లో ఆయనను కలిసిన అనంతరం విలేకరులతో చెప్పారు. ముఖ్యమంత్రి పట్ల కుమార్ అగౌరవంగా ప్రవర్తించినట్లు తాను చూడలేదని అన్నారు. కుమార్, ఆయన మద్దతుదారులు సతీశన్ వాహనాన్ని అడ్డుకున్నారన్న ఆరోపణను కూడా షాజహాన్ ఖండించారు. -
CCTV Footage: కేరళంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
16 ఏళ్ల స్టూడెంట్ ఘనత..! తండ్రికే జీతం ఇస్తున్న తనయుడు..
తండ్రిని పాకెట్మనీ అడిగే వయసులో తండ్రికే ఉపాధి ఇచ్చి..జీతం ఇస్తున్నాడో యువకుడు. పైగా తన తండ్రినే ఎందుకు నియమించుకున్నాడో ఇచ్చిన వివరణ సైతం అదుర్స్. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు. మరి పేరెంట్స్కే గర్వకారణమైన ఆ తనయుడు ఎవరంటే..అతడే కేరళలోని కొచ్చి, కున్నుంపురంకి చెందిన 16 ఏళ్ల రౌల్జాన్ అజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజనెన్స్ ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పేరుతెచ్చుకుంటున్నాడు ఈ యువకుడు. అతడు కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్ చదువుతున్నప్పుడే ఏఐ కంపెనీని నడుపుతుండటం విశేషం. ఆ కంపెనీ సాయంతో ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడం, ఈ టెక్నాలజీలో ప్రజలకు శిక్షణ ఇవ్వడం వంటివి చేస్తుంటాడు. నిజానికి అజుకి ఏఐ పట్ల ఉన్న అభిరుచే ఒక స్టార్టప్ కంపెనీకి దారితీసింది. పైగా తండ్రిపై ఆధారపడే టీనేజ్ యువకుల మాదిరిగా కాకుండా తన నాన్ననే తన కంపెనీలో ఉద్యోగిగా నియమించుకుని, నెలకు రూ. 2 లక్షల జీతం ఇస్తుండటం విశేషం. ఏఐలో పట్టు ఎప్పుడు సాధించాడంటే..తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఏఐ సాంకేతికతను నేర్చుకోవడంపై దృష్టి సారించాడు. ఆ తర్వాత ఒక స్టార్టప్ను స్థాపించాడు. అందులో ప్రస్తుతం తన తండ్రితో సహా సుమారు 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతేగాదు ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.అజు ఈ టెక్నాలజీని వీడియో ఎడిటింగ్ ద్వారా తెలుసుకున్నాడు. ఇక తండ్రి వల్ల తనకు ఈ ఏఐ సాంకేతికపై పట్టు సాధించగలిగినట్లు చెబుతున్నాడు. ఎలాగంటే..తన తండ్రికి అడోబ్లో ఉద్యోగం వచ్చినప్పుడు, తనకు అన్ని ప్రీమియం టూల్స్కు ఉచిత యాక్సెస్ లభించిందని, దానివల్ల ఏఐ గురించి పూర్తిస్థాయిలో నేర్చుకోగలిగానని అంటున్నాడు. ఆ తర్వాత స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం మీబాట్ అనే సొంత రోబోట్ను తయారు చేసినట్లు తెలిపాడు. ఇక తన తండ్రినే కంపెనీలో ఎందుకు నియమించుకున్నాడంటే..తాను ఫోన్ నుంచి కావల్సినంత జ్ఞానాన్ని ఆర్జించగలను కానీ, ఆయనకున్న అపార అనుభవం తనకు లేదని చెప్పుకొచ్చాడు. పైగా ఆయనకు అమెజాన్, అడోబ్, విప్రో, ఐబీఎం వంటి కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉంది, అందువల్ల ఆయన నుంచి తాను మరిన్ని విషయాలు సులభంగా నేర్చుకోగలగడం తోపాటు ఆయన అనుభవం కంపెనీ మార్కెటింగ్కి చక్కగా ఉపయోగాపడుతుందని చెబుతున్నాడు. కాగా, అజు స్టార్టప్ ఏఐ టెక్నాలజీస్, థింక్క్రాఫ్ట్ అకాడమీని నడుపుతోంది. ఇవి ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, విదేశీ విద్యార్థులు చాలా సునాయాసంగా ఏఐ నైపుణ్యాలను పుణికి పుచ్చుకునేలా ట్రైన్ చేస్తాయి. అక్కడితో ఆగిపోలేదు అజు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో RESQ AI, MeBot, ZapGap, Investo AI, FeedFye, 15 AI సాధనాలను రూపొందించారు. అంతేగాదు అజు కంపెనీ ఏకంగా వరల్డ్వైడ్గా వివిధ రిమోట్ ఉద్యోగులను కలిగి ఉంటూ ఇంటర్నేషనల్ రేంజ్లో గుర్తింపు పొందుతుండటం విశేషం.(చదవండి: రోజువారీ కూలీ నుంచి ..రూ. 15 లక్షల వార్షిక వేతనం, పీహెచ్డీ..!) -
ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)
-
ఓనం స్పెషల్.. నిఖిలా ఉంది ఇలా (ఫొటోలు)
-
‘కేరళ రీల్’.. పదేళ్ల తర్వాత కన్నవారి చెంతకు దివ్యాంగుడు!
కాలికావు: కేరళలో తీసిన పది సెకన్ల ఇన్స్టాగ్రామ్ రీల్.. దాదాపు పదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ దివ్యాంగుడిని తిరిగి తన కుటుంబంతో కలిపింది. తామరస్సేరిలోని ఓ డ్రై ఫ్రూట్స్ సంస్థలో పనిచేస్తున్న ఎంకే మహమ్మద్ యాసిర్ మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తామరస్సేరి సమీపంలోని ‘కారుణ్యదీపం ప్రతీక్షా భవన్’ అనే దివ్యాంగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న వేడుకలను వీడియో తీస్తుండగా, సమూహంలో ఉన్న ఒక యువకుడు కెమెరా వైపు చూసి చిరునవ్వు చిందించడం యాసిర్ దృష్టిని ఆకర్షించింది. ఇద్దరూ పరస్పరం చేతులు ఊపుకోగా, ఆ క్లుప్త సంభాషణ దృశ్యాన్ని యాసిర్ ఇన్స్టాగ్రామ్లో రీల్గా పోస్ట్ చేశారు.ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో యువకుడిని గుర్తించిన పలువురు ముందుగా యాసిర్ను సంప్రదించారు. అనంతరం ఆ యువకుడి బంధువులు కూడా యాసిర్తో మాట్లాడారు. సుమారు పదేళ్ల క్రితం ముంబై రైల్వే స్టేషన్లో తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుడిగా (జార్ఖండ్ నివాసి) బంధువులు అతడిని గుర్తించారు. ముంబై నుంచి ప్రయాణించే క్రమంలో దారితప్పిన అతడు కోజికోడ్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు.అప్పట్లో చైల్డ్లైన్ సంస్థ ద్వారా అతడిని వెల్లిమాడుకున్నులోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 18 ఏళ్లు నిండిన తర్వాత తామరస్సేరిలోని కారుణ్యదీపం ప్రతీక్షా భవన్కు మార్చగా, అక్కడ అతడు ‘రషీద్’ అనే పేరుతో జీవిస్తున్నాడు. ఇటీవల బంధువులు వీడియో కాల్ ద్వారా అతడిని చూసి కన్నీటిపర్యంతమై, దశాబ్ద కాలం నాటి తమ నిరీక్షణకు ముగింపు పలికారు. ప్రస్తుతం అతడు సాంఘిక సంక్షేమ శాఖ సంరక్షణలో ఉన్నందున, అధికారిక లాంఛనాలు పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతున్నదని కారుణ్యదీపం ప్రతీక్షా భవన్ సీఈవో నవాస్ తెలిపారు.ఇది కూడా చదవండి: యూట్యూబ్లో ‘సీక్రెట్ హౌస్’ చూసి ఇద్దరు చిన్నారులు మాయం! -
బీజేపీకి గుడ్బై.. ఆ వెంటనే విజయ్ TVK బంపర్ ఆఫర్!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన తమిళగ వెట్రి కజగం (TVK) రాజకీయంగా విస్తరించేందుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకే పరిమితం కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ అవకాశాలను ఇప్పటికే పరిశీలించింది. ఈ క్రమంలో తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన నటుడు దేవన్కు మాంచి ఆఫర్ ఇచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా బీజేపీపై రగిలిపోతున్న ఆ సీనియర్ నటుడే ఓ జాతీయ మీడియా చానెల్కు వెల్లడించారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా అంది వచ్చిన అవకాశాన్ని విజయ్ టీవీకే సకాలంలో అందిపుచ్చుకుంది. అద్భుత విజయంతో అధికారం చేపట్టింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ కన్ను పక్క రాష్ట్రాలపై పడింది. విజయ్ క్రేజ్, అలాగే.. రాజకీయ పరిస్థితులను బేరీజూ వేసుకుని విస్తరణకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే కేరళలో టీవీకే విస్తరణకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మలయాళ ఇండస్ట్రీలో సీనియర్ నటుడైన దేవన్కు.. టీవీకే పార్టీ తాజాగా కేరళ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆఫర్ చేసింది. దేవన్ ఆగస్టు 16న బీజేపీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయన బీజేపీపై భగ్గుమన్నారు. దాదాపు ఐదేళ్లు పార్టీలో ఉన్నప్పటికీ తనకు ఎలాంటి బాధ్యత ఇవ్వలేదని, పనిచేయాలన్నా అవకాశం కల్పించలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాజీనామా చేసిన మరుసటి రోజే సీఎం విజయ్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని దేవన్ తెలిపారు.#WATCH | Kollam, Keralam: On joining TVK after resigning from BJP, Malayalam actor Devan said, "...I've been working for the BJP very affirmatively, aggressively, taking a lot of risks. But they couldn't understand my mission and my planning. They are against all these things. I… pic.twitter.com/q9PW7Ur3Tp— ANI (@ANI) August 23, 2026ఆ తర్వాత టీవీకేకి చెందిన ఇద్దరు నేతలు తన ఇంటికి వెళ్లి దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపినట్లు చెప్పారు. అనంతరం సీనియర్ నేతలతో గూగుల్ మీట్ ద్వారా కూడా చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఈ చర్చల్లో కేరళ TVK రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తనకు ఆఫర్ చేసినట్లు దేవన్ తెలిపారు.విజయ్తో భేటీ తర్వాతే ప్రకటనదేవన్ త్వరలో చెన్నై వెళ్లి విజయ్ను కలవనున్నారు. సెప్టెంబర్ 10 తర్వాత ఈ భేటీ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విజయ్తో చర్చించిన అనంతరం TVKలో చేరిక, కేరళ పార్టీ బాధ్యతలు చేపట్టడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.విజయ్, దేవన్కు సినిమా రోజుల నుంచే మంచి పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. ఆ అనుబంధమే ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త సమీకరణానికి దారితీస్తుందన్న ఆసక్తి నెలకొంది.తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే!మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన దేవన్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. బాషా, ధర్మక్షేత్రం, రౌడీ మొగుడు, శుభాకాంక్షలు, పెళ్లి చేసుకుందాం, చన్నకేశవరెడ్డి, దేశముదురు, ఏ మాయ చేశావె, ఢమరుకం, హార్ట్ ఎటాక్, రాజుగారి గది-2, సాహో వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. దేవన్కు రాజకీయాలు కొత్తేమీ కాదు. విద్యార్థి దశలో కాంగ్రెస్, KSUతో అనుబంధం ఉన్న ఆయన.. 2004లో కేరళ పీపుల్స్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో దాన్ని నవ కేరళ పీపుల్స్ పార్టీగా పునరుద్ధరించి, 2021లో బీజేపీలో విలీనం చేశారు. అనంతరం కేరళ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసి TVK వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం కేరళలో అధికార, ప్రతిపక్ష కూటముల మీద జనాలకు అసంతృప్తి నెలకొందని, మాంచి స్ట్రాటజీతో ముందుకెళ్తే టీవీకే రాణించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారాయన.కేరళలో ‘కొత్త ప్రత్యామ్నాయం’..కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్.. ఈ రెండు కూటముల మధ్యే అధికార పంపిణీ రొటీన్గా మారింది. ఈ మధ్యలో బీజేపీ ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమోనని భావించినా ఫలితం దక్కలేదు. ప్రజలు కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, విజయ్ నేతృత్వంలోని TVK వైపు యువత, విద్యార్థులు ఆసక్తి చూపించొచ్చని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్కు కేరళలో మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఆయన డబ్బింగ్ సినిమాలు విపరీతంగా ఆడేవి. గతంలో అక్కడికి వెళ్లిన ఆయన.. అభిమానులతో దిగిన సెల్ఫీలు సైతం నెట్టింట పంచుకునేవారు. విజయ్ రాజకీయ ఎంట్రీ, విజయాన్ని సైతం అక్కడి ప్రజలు నిశితంగా గమనించారు. దీంతో ఆయన ఎంట్రీ ఇస్తే ఆదరణ దక్కవచ్చని దేవన్ అంటున్నారు. టీవీకేలోకి దేవన్ ఎంట్రీ జరిగితే.. కేరళలో TVKకి తొలి కీలక అడుగు పడినట్లే. అయితే ఒకవైపు తమిళనాడులో పార్టీని బలోపేతం చేస్తూనే.. కేరళలో సినీ రంగంలో పరిచయం ఉన్న నేతను ముందుకు తీసుకురావడం ద్వారా విజయ్ తన పార్టీని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారా అన్న చర్చ మొదలైంది.ఇదీ చదవండి: ఎస్ఐ చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు -
డార్క్ లైట్ టు లైమ్లైట్
కాజియాకు నలుగురిలో కలవడం అంటే ఇష్టం. టీనేజీలోకి వచ్చిన తరువాత ఆ ఇష్టం వెనకడుగు వేసింది. ‘నల్లపిల్ల’ అని ఎవరైనా వెక్కిరిస్తారేమో అనే భయం ఆమెలో ఉండేది. ఆ భయం కాస్తా ఆత్మన్యూనతగా మారింది. ఆత్మన్యూనత నుంచి ఆత్మవిశ్వాసంలోకి వచ్చిన తరువాత తనను తాను అద్భుతంగా తీర్చిదిద్దుకుంది కేరళలోని మావెళిక్కరకు చెందిన కాజియా లిజ్ మెజో.తాజాగా...ఈ నెల 23న జైపూర్లో జరిగిన ఫైనల్లో కాజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘మిస్ యూనివర్స్ ఇండియా’ టైటిల్ను గెలిచిన తొలి కేరళ మహిళగా చరిత్ర సృష్టించింది. నవంబర్లో ప్యూర్టోరికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. 19 సంవత్సరాల కాజియా న్యాయశాస్త్ర విద్యార్థిని. దేశవ్యాప్తంగా 52 మంది మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నారు. వీరందరిలో కాజియా పిన్న వయస్కురాలు. వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్గా, అనుశీ సాత్వలేకర్ సెకండ్ రన్నరప్గా నిలిచారు.అబుదాబి (యూఏఈ)లో పెరిగిన కాజియా ‘బేబీ షో’లో పాల్గొనడం ద్వారా చిన్న వయసులోనే రంగస్థలంపై మెరిసింది. ఆ తరువాత కాలంలో శాస్త్రీయ నృత్యం వైపు అడుగులు వేసింది. అందరిలాగే బాల్యం అంటే కాజియాకు చాలా ఇష్టం. ‘చిన్నపిల్లగా ఉన్నప్పుడు భయమనేదే ఉండదు. సరదాగా గడపడం, అందమైన దుస్తులు ధరించడం, కార్టూన్ ప్రపంచంలోకి దూరడం..ఇలాంటి అద్భుతాలెన్నో బాల్యంలో ఉంటాయి’ అంటుంది కాజియా.అభద్రత... ఆత్మన్యూనత...టీనేజ్లోకి అడుగుపెట్టిన కాజియా బాల్యంలోని సంతోషానికి దూరం అయింది. డిజిటల్ ప్రపంచంలోని సోకాల్డ్ సౌందర్య ప్రమాణాల వైపు మొగ్గు చూపడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయింది.‘నేను నలుపుగా ఉండడం వల్ల విపరీతమైన అభద్రతాభావానికి గురయ్యేదాన్ని. రకరకాల ఫెయిర్ నెస్ క్రీమ్ల యాడ్స్ చూస్తుండేదాన్ని. వాటిని చూసిన తరువాత నా శరీరాకృతి సరిగ్గా లేదు అనిపించేది.నా ప్రతి ఫొటోకు ఫిల్టర్స్ ఉపయోగించేదాన్ని. కళ్లను పెద్దవిగా చేయడానికి, చర్మపు రంగులను మార్చేదాన్ని’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది కాజియా.మార్పు మొదలైంది...మొదట్లో నలుగురిలో కలవడానికి ఇష్టపడే కాజియా, ‘నేను నలుపుగా ఉంటాను’ అని అతిగా ఆలోచించడం వల్ల ఆత్మన్యూనతకు గురయ్యేది. నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడేది. అద్దంలో తన ముఖం తనకే నచ్చకపోయేది. అయితే, కొంతకాలం తరువాత తనను తాను సమీక్షించుకోవడం వల్ల ఆ తరువాత కాలంలో కాజియాలో చాలా మార్పు వచ్చింది. ‘బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పది’ అనే విషయాన్ని తెలుసుకుంది. ఆత్మన్యూనత పోయింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.విజయ పరంపర...ఆత్మవిశ్వాసం దిశగా తనను తాను తీర్చిదిద్దుకున్న కాజియా 2024లో ‘మిస్ టీన్ దివా’ టైటిల్ గెలుచుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయి పోటీలకు మార్గం సుగమం చేసుకుంది. 2025లో ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్’లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మొదటి రన్నరప్గా నిలిచింది. ఆ తరువాత ‘మిస్ యూనివర్స్ కేరళ’ విజేతగా నిలిచింది.అలా జరగకూడదు...‘సోషల్ మీడియా చాలా కృత్రిమమైనది. ఆ కృత్రిమత్వపు మాయలో పడిపోవద్దు. ఆత్మవిశ్వాసం లేని పిల్లలను విషపూరిత భావాలతో భయపెడితే సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నట్లు?’ అని ప్రశిస్తోంది కాజియా. తాను ఒకప్పుడు ఎదుర్కొన్న డిజిటల్ ఒత్తిడి ఎవరూ ఎదుర్కోవద్దు అంటుంది. పరిపూర్ణత (పర్ఫెక్షన్) కోసం పాకులాడే ధోరణిని ఆమె వ్యతిరేకిస్తోంది. పేజెంట్ పోటీదారులు అనుసరించే జీవనశైలిని అనుసరించడానికి కాజియా నిరాకరిస్తోంది.మల్టీ టాలెంట్...మోడల్, శాస్త్రీయ నృత్యకారిణి మాత్రమే కాదు కాజియా గాయని కూడా. డ్రమ్స్, వయోలిన్ వాయిస్తుంది. టెడెక్స్ వేదికలపై పర్యావరణ పరిరక్షణ నుంచి ఆత్మవిశ్వాసం వరకు రకరకాల అంశాలపై స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇస్తోంది. మాలీవుడ్ సినిమా ‘షైలాక్’తో నటిగా తొలి అడుగులు వేసింది.‘నీ లక్ష్యాలు ఏమిటో ఒక నోట్బుక్లో రాసుకో’ అని కజియాను తల్లి ప్రోత్సహించేది. ‘హాలివుడ్ వాక్ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించాలి’....ఇలాంటి ఎన్నో లక్ష్యాలతో ఆ నోట్బుక్ నిండిపోయింది. పెద్ద కలలు కనే సాహసం ఆ రోజు నుంచే మొదలైంది.‘ఆ సాహమే నన్ను ఇక్కడికి వరకు తీసుకువచ్చింది’ అంటుంది కాజియా.నిశ్శబ్దమంటే...ఫైనల్ రౌండ్లో అడిగిన ‘మీ జీవితంలో నిశ్శబ్దానికున్న శబ్దాన్ని ఎలా వర్ణిస్తారు?’ అనే ప్రశ్నకు–‘‘నేను ఈ వేదిక పైకి వచ్చే ముందు వరకు ఇక్కడ అంతా నిశబ్దమే. నటిగా, డ్యాన్సర్గా, అందాల పోటీలపై ఆసక్తి ఉన్న అమ్మాయిగా ఇలాంటి వేదికపైనే ఎదిగాను. ఈ వేదిక పైకి వచ్చే ముందు నిశబ్దంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. అలాంటి ప్రదేశంలోనే నేను ఉన్నాను, నా దేశంలో ఉన్నాను’’ అంటూ జవాబు ఇచ్చింది కాజియా.దేవుడు ఇచ్చే తోట!విజేత అంటే ఎవరో కాదు, ఒకసారి ఓడిపోయి గెలుపు కోసం మరోసారి ప్రయత్నించిన వ్యక్తి మాత్రమే. మీరు దేవుడిని ఒక పువ్వు అడిగారు. అది వెంటనే మీకు దొరక్క పోవచ్చు. గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే... ఒక పువ్వు కాదు, ఒక తోటే మీకు ఇవ్వడానికి దేవుడు ప్రయత్నాలు చేస్తున్నాడని! అయితే దేవుడు ఆ తోట ఇచ్చే వరకు మనం ఓపికగా ఉండాలి. ఆశాభావంతో ఉండాలి. సోషల్ మీడియాలో కనిపించేవాటిని చూసి గుడ్డిగా నమ్మకూడదు. అనుసరించకూడదు.– కాజియా -
ఆర్థిక కష్టాలు.. కూతురి కోసం ఇంట్లోనే ‘కోర్టు’ నిర్మించి.. ఇలా
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పుల్లెల గాయత్రి గోపీచంద్- ట్రెసా జాలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మెగా టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో ఈ జోడి కాంస్యంతో మెరిసింది. ఆ సమయంలో పుల్లెల గాయత్రి తండ్రి, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, చీఫ్ నేషనల్ కోచ్ గోపీచంద్ కూడా ఢిల్లీలోనే ఉండి మ్యాచ్ను వీక్షించాడు.తన కుమార్తె గాయత్రి, ట్రెసా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోయాడు. నిజానికి బ్యాడ్మింటన్ గురించి తెలిసిన వారికి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కూతురు గాయత్రి తండ్రి అడుగుజాడల్లో బ్యాడ్మింటన్ను కెరీర్గా ఎంచుకుని ముందుకు సాగుతోంది.అయితే, గాయత్రి- ట్రెసా సాధించిన విజయం మరో వ్యక్తి కళ్లు కూడా ఆనందంతో చెమర్చేలా చేసింది. ఆయన మరెవరో కాదు ట్రెసా తండ్రి జాలీ మాథ్యూ. కేరళకు చెందిన ఆయన కూతురి కోసం స్వయంగా బ్యాడ్మింటన్ కోర్టును నిర్మించాడు. అన్నీ తానై కూతురిని ముందుకు నడిపి ఆమెను ఈస్థాయికి చేర్చాడు.పీఈటీ టీచర్.. వాలీబాల్ కోచ్కేరళలోని చెరుప్పుళ అనే చిన్న పట్టణం. అక్కడ బ్యాడ్మింటన్ కోర్టులు లేవు. అయితే, జామీ మాథ్యూ మాత్రం తన కూతురి కల నెరవేరాలంటే తాను శ్రమించక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. జాలీ మాథ్యూ పీఈటీ టీచర్. అంతేకాదు ఆయన వాలీబాల్ కోచ్ కూడా!ఇంటి ఆవరణలోనే..తన ఇంటి ఆవరణలోనే వాలీబాల్ కోర్టును నిర్మించి.. అక్కడే యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేవాడు. ట్రెసా, ఆమె అక్కడ పక్కన నిలబడి వారి ఆటను చూస్తూ ఉండేవారు. తన కూతుళ్లు ఇద్దరు ఆసక్తిగా వాలీబాల్ను వీక్షించడం చూసిన మాథ్యూ.. ఇద్దరూ వాలీబాల్ ప్లేయర్లు అవుతారని ఊహించారు. అయితే, ట్రెసాకు బ్యాడ్మింటన్లో మరింత ఆసక్తి ఉందని గమనించి ఆ దిశగా ప్రోత్సహించాడు.ఈ విషయం గురించి మాథ్యూ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘ట్రెసాకు ఆటల పట్ల అమితాసక్తి ఉండేది. నేను ఇంట్లోనే చాలా మంది అమ్మాయిలకు వాలీబాల్ శిక్షణ ఇచ్చాను. నా కూతుళ్లకు కూడా ఎందుకు ట్రెయినింగ్ ఇవ్వకూడదనే ప్రశ్న తలెత్తింది.ఇండోర్ కోర్టు నిర్మించి..ట్రెసా బాగా ఆసక్తిగా ఉండేది. అయితే, బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టాక తన ఆసక్తి మారిపోయింది. అయితే, మా ప్రాంతంలో అసలు బ్యాడ్మింటన్ కోర్టులు లేవు. అందుకే నేనే మా ఇంట్లో ఓ ఇండోర్ కోర్టు కట్టించి.. అక్కడే ట్రెసాకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను.ఆర్థికంగా కష్టాలు అయితే, గాలితో కూడిన వర్షం పడినప్పుడు టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయేవి. దీంతో ప్రాక్టీస్ కష్టమయ్యేది. ఆర్థికంగా కూడా కష్టాలు మొదలయ్యాయి. ఓసారి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కు వెళ్లాము. అప్పుడే మన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థమైంది.స్థానిక ర్యాంకింగ్స్ ఆధారంగానే కేరళ జట్టుకు ఎంపిక చేస్తారనే విషయం తెలిసింది. వివిధ లోకల్ టోర్నీల్లో ఆడేందుకు మేము రాష్ట్రమంతా తిరిగేవాళ్లము. కానీ మాకు స్పాన్సర్లు దొరకలేదు. డబ్బుకు బాగా ఇబ్బంది అయ్యేది. ఏ అసోసియేషన్ కూడా మాకు సాయం చేయలేదు. దీంతో ఖర్చుల భారం తడిసిమోపెడు అయ్యేది.అయితే, ఆశయం నుంచి మేము ఎప్పుడూ దూరం కాలేదు. నిజానికి ట్రెసా చదువులో ముందు ఉండేది. మా ఊర్లో పిల్లలంతా డాక్టర్, ఇంజనీర్.. లేదంటే మరేదైనా ఉద్యోగం కోసం చదివేవాళ్లు. ఊర్లో ఎంతో మంది ఇంజనీర్లు ఉండవచ్చు. కొంతమంది డాక్టర్లూ ఉండొచ్చు. కానీ భారత్కు ఆడిన ప్లేయర్లు ఎంతో మంది ఉండరు కదా!అనిల్.. ఆ తర్వాత గోపీచంద్ట్రెసా ముందు దేశానికి ఆడాలి. ఆ తర్వాత ఒలింపిక్స్కు వెళ్లాలి. అక్కడా పతకం గెలవాలి. ఇదే మా ధ్యేయం. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాము. నా స్నేహితుడు అనిల్ రామంద్రన్.. కన్నూరు యూనివర్సిటీ స్పోర్ట్స్ హెడ్, బ్యాడ్మింటన్ స్పెషలిస్టు. ఆయనే నా కూతురికి కోచింగ్ ఇచ్చాడు.ఆ తర్వాత గోపీచంద్ను కలిశాము. టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (TOPS)కి ట్రెసా ఎంపికైనపుడు ఆమె ప్లస్ వన్ చదువుతోంది. ఆ సమయంలో హైదరాబాద్లో సీనియర్క్యాంపులో ఉన్న గోపీచంద్కు రిపోర్టు చేసేది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది’’ అని జాలీ మాథ్యూ పుత్రికోత్సాహంతో పొంగిపోయాడు.కాగా జూనియర్ లెవల్లో ప్రతిభ కనబరిచిన గాయత్రి, ట్రెసాను కలిపి డబుల్స్ జోడీగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి జట్టుగా కొనసాగిన వీళ్లిద్దరు.. దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత తొలిసారి భారత్కు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పతకం అందించారు. ఇక గాయత్రి, ట్రెసాలకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.చైనా జంట చేతిలో పరాజయంన్యూఢిల్లీ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో గాయత్రి–ట్రెసా జంట 21–18, 13–21, 8–21 స్కోరుతో చైనాకు చెందిన వరల్డ్ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ జంట ల్యూ షెంగ్ షూ – టాన్ నింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 71 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో భారత జంట తొలి గేమ్ను గెలుచుకున్నా...ఆపై పట్టు కోల్పోయింది.ఈ మ్యాచ్కు ముందు చైనా జోడితో ఏడు సార్లు తలపడి ఒకే ఒక సారి గెలిచిన భారత ద్వయం ఈ సారి కూడా ప్రభావం చూపలేకపోయింది. మ్యాచ్లో తొలి గేమ్ ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో గాయత్రి–ట్రెసా 7–2తో ముందంజ వేయగా, వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించిన చైనా జంట 11–7తో నిలిచింది. ఆ తర్వాత హోరాహోరీగా తలపడటంతో స్కోర్లు 12–12 నుంచి 18–18 వరకు చేరాయి. ఈ దశలో ట్రెసా క్రాస్ కోర్ట్ విన్నర్తో భారత్కు పాయింట్ దక్కగా, టాన్ వరుసగా రెండు సార్లు షటిల్ను నెట్కు కొట్టడంతో గేమ్ ముగిసింది.అభిమానుల ప్రోత్సాహం మధ్య ఆట కొనసాగించిన భారత జోడి రెండో గేమ్లోనూ మెరుగైన ప్రదర్శనతో స్కోరును 12–12 వరకు చేర్చింది. అయితే ఈ స్థితిలో ఒక్కసారిగా చైనా జోడి చెలరేగిపోయింది. పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తూ వరుసగా 8 పాయింట్లు సొంతం చేసుకొని 20–12కు దూసుకుపోయింది. ఆ తర్వాత మరో పాయింట్ సాధించడంతో గేమ్ చైనా వశమైంది. మూడో గేమ్లో పూర్తిగా చైనా హవానే సాగింది. 3–2తో ముందంజ వేసిన తర్వాత చైనా ఎక్కడా తగ్గలేదు. 8–5 నుంచి 15–5 వరకు ఆధిక్యంలో ఉన్న చైనా ఆ తర్వాత అలవోక పాయింట్లతో మ్యాచ్ను సొంతం చేసుకుంది. -
ఆమెకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని వరించేలా చేసిన ప్రశ్న ఇదే..!
కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆదివారం జైపూర్లో జరిగిన అందాల పోటీల ఫైనల్లో 52 మంది అందగత్తెలను ఓడించి జాతీయ టైటిల్ను గెలుచుకున్నారు. కజియా లిజ్ మెజో కొత్త మిస్ యూనివర్స్ ఇండియా 2026గా నిలిచారు. అయితే ఆమె గెలుపుకి కారణమైన సన్నివేశంకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అదేంటంటే అందులో కజియాకే కిరీటాన్ని కట్టబెట్టేలా చేసిన ఆసక్తికర ప్రశ్న అందర్నీ ఈమితంగా ఆకర్షించింది. నిజానికి మిస్ యూనివర్స్ ఇండియా ప్రకారం, ఈ ఏడాది ఫైనలిస్టులకు 20 ప్రశ్నలు ఇచ్చి..వారికి సమాధానాలు రాయడానికి 90 నిమిషాల సమయం ఇచ్చారు. అయితే కజియా రెండుప్రశ్నలకు ఇచ్చిన సమాధానం న్యాయనిర్థేతల మనసునే గెలుచుకుంది. అవేంటో చూసేద్దామా.యాక్ట్ నౌ వ్యవస్థాపకుడు, గ్లామనంద్ గ్రూప్లో సోషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ అయిన రాజీవ్ కె. శ్రీవాస్తవ మీ జీవితంలో నిశ్శబ్దం ధ్వనిని వర్ణించగలరా అని అడగగా..అందుకు కజియా ఇలా సమాధానం ఇచ్చింది. "నాకు, నిశ్శబ్దం అంటే, నేను కొద్ది నిమిషాల క్రితం ఈ వేదికపైకి ప్రవేశించే ముందు అనుభవించిన ప్రశాంతతనే నిశబ్దంగా విశ్వసిస్తా. ఎందుకంటే నేను ఒక శాస్త్రీయ నృత్యకారిణిగా, ఒక నటిగా, అందాల పోటీల ప్రేమికురాలిగా వేదికపైనే పుట్టి పెరిగాను. అందువల్ల ఈ వేదికపైకి అడుగు పెట్టే ముందు నిశ్శబ్దాన్ని, ప్రశాంతతను, అత్యంత ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తాను. ఎందుకంటే అది నాకు నా సొంత ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. నా దృష్టిలో, అదే నిశ్శబ్దం. అని ఆమె చాలా అద్భుతంగా చెప్పారామె. అలాగే కజియా తన తన దృష్టిలో అందం అంటే ఏంటో కూడా పంచుకున్నారు. ఆమె ఇలా అన్నారు, "నా దృష్టిలో, నిజమైన అందం అంటే దృఢ సంకల్పం; ధైర్యం, పదే పదే పైకి లేవాలనే నిశ్శబ్ద నిర్ణయం, ఏదైనా సాధించడానికి ముందే నమ్మకం ఉంచడం. అలాగే నా దృష్టిలో, అందమైన ఆత్మవిశ్వాసంతో ఉండటం అంటే సాహసంతో ఉండటమని అర్థం." అని సగర్వంగా చెప్పారామె. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Pageantomania | Beauty Pageant (@pageantomania)(చదవండి: ట్రావెల్ వీడియోల్లో ఇంత కిక్ ఉందా? ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్నే..) -
19 ఏళ్ల కేరళ అమ్మాయికి మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఏకంగా 52 మంది బ్యూటీలను..(ఫొటోలు)
-
మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత : ఎవరీ కేరళ బ్యూటీ
Miss Universe India 2026 ఒకప్పుడు తన ముఖాన్ని, తన ఫోటోలను చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడిన ఒక యువతి ఆత్మవిశ్వాసంతో ఎదిగి అందాల రాణిగా తనను తాను చాటుకుంది. ఆగస్టు 23న జైపూర్లో జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ గ్రాండ్ ఫినాలేలో 52 మంది పోటీదారులను వెనక్కి నెట్టి కాజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) విజేతగా నిలిచారు. సుమారు 9వేల మంది దరఖాస్తుదారుల నుండి ప్రాంతీయ పోటీలు, ఆడిషన్లు , వైల్డ్కార్డ్ ఎంట్రీల ద్వారా ఆమెను ఎంపిక చేశారు. ఈ విజయంతో, నవంబర్లో పోర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో కాజియా భారతదేశం తరఫున పోటీ పడనున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా ఫినాలే ఈవెంట్కు సుస్మితా సేన్ (1994 మిస్ యూనివర్స్), సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలా, రియా సింహా (మిస్ యూనివర్స్ ఇండియా 2024), ఫిల్మ్ ప్రొడ్యూసర్ ప్రగ్యా కపూర్, డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్తుతి ఖారే శుక్లా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడం విశేషం. కేవలం ఏడాది క్రితం టీన్-టైటిల్లో రన్నర్-అప్గా తన అందాల పోటీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఒక యువతి ఇండియా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకోవడం, ప్యూర్టో రికోలో ప్రపంచ వేదికపై పోటీపడే అవకాశం లభించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఇదీ చదవండి: బిడ్డకు మేనమామ ఉంగరం : బిడ్డింగ్ దక్కించుకున్న జ్యుయల్లర్స్ ఇవే!ఎవరీ కాజియా లిజ్ మెజో?అబుదాబిలో పెరిగిన కేరళ అమ్మాయి మెజో (Mejo) 2007లో జన్మించింది. మావెలిక్కరకు చెందిన మెజో అబ్రహం సుజా మెజోల కుమార్తె అయిన ఆమె, ప్రస్తుతం కొచ్చిలో ఉంటూ బెంగళూరులో న్యాయశాస్త్రం (లా) చదువుతోంది. అంతుకుముందు ఆమె అబుదాబిలోని ఎమిరేట్స్ నేషనల్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ స్కూల్, అబుదాబి ఇండియన్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. చిన్న వయసులోనే ఆమెకు వేదికపై ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించింది. 2012లో అబుదాబిలో శాస్త్రీయ నృత్య శిక్షణ ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత అనేక సృజనాత్మక రంగాలలో నైపుణ్యాలను పెంపొందించుకుంది. 2024లో అందాల పోటీలలో పాల్గొనడం ప్రారంభించింది . 'మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025' పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 'ఫస్ట్ రన్నరప్'గా నిలిచింది. కొన్ని నెలల తర్వాత, ఆమె ఉన్నత స్థాయి పోటీకి (కేటగిరీకి) మారి, రాష్ట్ర స్థాయి టైటిల్ను గెలుచుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కొచ్చిలో జరిగిన పోటీలో మాళవిక రాజేంద్రన్ దేవ్ , లిజ్ జైమోన్ జాకబ్లను ఓడించి, ఆమె 'బీనా కన్నన్ కౌచర్ మిస్ యూనివర్స్ కేరళ 2026' కిరీటాన్ని గెలుచుకుంది. View this post on Instagram A post shared by PAGEANTS UNIVERSE (@pageants_universe)ఈ సందర్భం గత కొన్నేళ్లు తాను అనుభవించిన ఆత్మన్యూనత గురించి గా మెజో వివరించింది. చాలా కాలందాకా తన రూపం వ్యక్తిత్వం పట్ల తనకు ఆత్మవిశ్వాసం ఉండేది కాదని ఆమె చెప్పింది. fake it till you make it అనే దృక్పథం తనలో మార్పు తెచ్చిందని ఆమె పేర్కొంది. వేదికపైకి వెళ్లే ముందు కూడా, అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిని తానేనని తనకు తాను చెప్పకునే దాన్నని ఆమె చెప్పింది.ఇదీ చదవండి: రోజు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్అలాగే అందాల పోటీల పట్ల ఆమెకు ఆసక్తి కలగడానికి టీవీలో చూసిన ఒక సంఘటనే కారణమని చెప్పుకొచ్చింది. 2021లో హర్నాజ్ సంధు 'మిస్ యూనివర్స్' కిరీటాన్ని గెలుచుకోవడం చూసిన తర్వాత తనకు అందాల పోటీలపై ఆసక్తి కలిగిందని మెజో చెప్పింది. ఎన్నాళ్లో ఎదురు చూసి, చివరికి ఆమె టైటిల్ దక్కించుకోవడం తనకు స్ఫూర్తినిచ్చిందని ఆమె పేర్కొంది. -
Viral Video: పెళ్లి కూతురి మానవత్వం.. పీటలపై నుంచి లేచి వచ్చి చికిత్స
-
పెళ్లిలో అనూహ్య పరిణామం : పెళ్లి దుస్తుల్లోనే వధువు చికిత్స
కేరళలోని పనూర్లో డా. షిరీన్, డా. రిజాజ్ల వివాహ వేడుకలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. తన వివాహ వేడుకలో అనారోగ్యానికి గురైన ఇద్దరు కేటరింగ్ సిబ్బందికి ప్రథమ చికిత్స అందించేందుకు పెళ్లి వేడుకలను కాసేపు నిలిపివేయడం విశేషంగా నిలిచింది. పెళ్లి దుస్తుల్లోనే ఉన్న వధువు డా. షిరీన్ సకాలంలో వైద్యం అందించి అందరి మన్ననలు అందుకున్నారు. అంతేకాదు కొత్త పెళ్లికొడుకు, భర్త రిజాజ్ కూడా ఆమెనుకొనియాడారు కేరళమ్లోని కన్నూర్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.కన్నూర్ జిల్లా పనూర్కు చెందిన డాక్టర్ షిరిన్ సుబాయిర్కు డాక్టర్ రియాజ్తో పెళ్లి జరుగుతోంది. ఆ సమయంలో విందు వడ్డించే బృందంలో ఉన్న ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది తెలిసిన వెంటనే పెళ్లి దుస్తుల్లో ఉన్న డాక్టర్ షిరిన్ అక్కడికి చేరుకున్నారు. ఇద్దరిలో ఒకరికి ముక్కు నుంచి రక్తం వస్తుండగా మరొకరు స్పృహతప్పి పడిపోయారు. ముక్కు నుంచి రక్రస్రావం ఆగేందుకు ముందుకు వంగి ముక్కులోని మెత్తడి భాగాన్ని 15 నిమిషాలు గట్టిగా పట్టుకోవాలని, ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస పీల్చుకోవాలని సూచించారు. మరో మహిళను వెల్లకిలా కాళ్లు కాస్తంత ఎత్తులో ఉంచి పడుకోవాలని సూచించారు. వారిద్దరికీ కాస్త స్వస్తత చేకూరాక, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వారికి పురమాయించారు.ఇదీ చదవండి: 16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడు ఇదంతా కొందరు వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది. ‘ఆ సమయంలో వారికి అక్కడ ఏది అత్యవసరమో అదే చేశా. ఇందులో నా గొప్పతనమేదీ లేదు. ఎవరికైనా ఇలా చేస్తా. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం కంటే ముందుగా ఇలాంటి చిన్నచిన్న పనులు చేస్తే, వారికి ప్రమాదం చాలా వరకు తప్పుతుంది’అని డాక్టర్ షిరీన్ అంటున్నారు. ప్రస్తుతం ఈమె ఒట్టపాలెంలోని వల్లువనాడ్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఎండీ ఫస్టియర్ చేస్తున్నారు. భర్త డాక్టర్ రియాజ్ ఆంధ్రప్రదేశ్లోని ఓ ఆస్పత్రిలో మెడిసిన్ పీజీ చేస్తున్నారు. ఇదీ చదవండి: మూడేళ్ల నుంచే వేధింపులు, చివరికి 70 కిలోలు తగ్గింది కానీ నరకం -
ఓనం కేరళం! పండుగలో పిల్లలకు మోస్ట్ ఫేవరెట్ ఏంటో తెలుసా?
పిల్లలూ... ఇప్పుడు కేరళంలో ఓనమ్ పండగ సీజన్. మనకు దసరా, సంక్రాంతి ఎలాగో... కేరళ వాళ్లకు ‘ఓనమ్’ అలా అన్నమాట. ఇది వాళ్ల పెద్ద పండుగ. పూర్వం కేరళను ‘మహాబలి’ అనే ఒక మంచి రాజు పాలించేవాడట. ఆయనంటే ప్రజలందరికీ చాలా ఇష్టం.ఆ రాజు ఏటా ఒకసారి ఆకాశం నుంచి భూమికి వచ్చి, తన ప్రజలందరూ ఎలా ఉన్నారో చూసి వెళ్తాడని అక్కడి వాళ్ల నమ్మకం. ఆ రాజుగారికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికే ఈ ఓనమ్ పండుగ చేసుకుంటారు. ఈ పండుగకు పిల్లలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు! పది రోజుల పాటు రోజూ పొద్దున్నే లేచి, తోటల్లో కలర్ఫుల్ పూలను కోసుకొస్తారు. ఇంటి ముందు ‘పూకళం’ అంటే పూలతో పెద్ద పెద్ద ముగ్గులు భలే అందంగా పెడతారు. పట్టు లంగాలు, తెల్లటి సాంప్రదాయ బట్టలు వేసుకుని దేవదూతల్లా రెడీ అవుతారు.ఈ పండుగలో పిల్లలకు మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ ఏంటో తెలుసా? ‘పులికలి’ అనే టైగర్ డ్యాన్స్! కొందరు మనుషులు ఒంటికి పులి లాగా రంగులు వేసుకుని, డప్పుల చప్పుళ్లకు వీధుల్లో డాన్స్ చేస్తుంటే పిల్లలు తెగ నవ్వుకుంటారు. అలాగే నదుల్లో పెద్ద పెద్ద పడవ పందాలు జరుగుతుంటే చూసి చప్పట్లు కొడతారు. ఇక పండగ రోజు అరిటాకులో పాయసం, బోలెడు వంటకాలతో కడుపునిండా విందు భోజనం తింటారు. మరి ఈసారి ఓనమ్ పండుగకు మీరు కూడా ఇంట్లో పూల ముగ్గులు వేసి ఎంజాయ్ చేస్తారా!ఇవి కూడా చదవండి: 'జుడో' పోటీ..! బలం కంటే తెలివితో ప్రత్యర్థిని ఓడించగలమా? -
చీర బోర్డర్ వెనుక ఇంత చరిత్ర ఉందా?
భారతీయ వస్త్రధారణలో చీరలకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ముఖ్యంగా చీరలకు ఉండే బంగారు రంగు బోర్డర్ కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు. దాని వెనుక ఎంతో సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత ఉంది.భారతీయ సంస్కృతిలో స్వర్ణాన్ని పవిత్రతకు, అదృష్టానికి, ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు. చీరలకు బంగారు బోర్డర్ జోడించడం వల్ల ఆ వస్త్రానికి ఒక శుభసూచకమైన రూపం వస్తుంది. అందుకే వివాహాలు, పూజలు, పండుగలు, ఇతర వేడుకలలో బంగారు అంచు ఉన్న చీరలను ధరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.చారిత్రాత్మకంగా పట్టు నూలుతో పాటు అసలైన వెండి, బంగారు తీగలను ఉపయోగించి సరిహద్దులను నేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. రాజులు, జమీందారులు, ధనిక వర్గాల మహిళలు తమ సామాజిక హోదాను ప్రతిబింబించేలా వెడల్పాటి బంగారు బోర్డర్లు ఉన్న చీరలను ధరించేవారు. బోర్డర్ ఎంత వెడల్పుగా ఉంటే, వారి హోదా అంత ఉన్నతంగా పరిగణించబడేది.తమిళనాడుకు చెందిన కాంజీవరం పట్టు చీరల ప్రధాన ఆకర్షణే వాటి కాంతివంతమైన రంగులు, దట్టమైన బంగారు జరీ బోర్డర్లు. చీర రంగుకు కాంట్రాస్ట్ రంగులో ఉండే ఈ బంగారు బోర్డర్లు దక్షిణ భారత వివాహ వేడుకలలో ప్రత్యేక కళను తీసుకువస్తాయి.కేరళ సాంప్రదాయ చీరలలో తెల్లటి లేదా లేత క్రీమ్ రంగు నూలుపై సరళమైన బంగారు అంచు మాత్రమే ఉంటుంది. మిగిలిన చీరంతా సాధారణంగా ఉన్నప్పటికీ, ఆ బంగారు బోర్డర్ మాత్రమే చీరకు పరిపూర్ణమైన సౌందర్యాన్ని ఇస్తుంది. ఓణం, విషు వంటి పండుగలలో ఇది వారి సాంస్కృతిక గుర్తింపుగా నిలుస్తుంది.ఇవి చదవండి: బట్టలను తిరగేసి ఇస్త్రీ చేస్తే ఏమవుతుంది? -
కేరళ గుడిలో విదేశీ ఎంపీతో మళ్లీ వివాహం!
ప్రేమకు సరిహద్దులు లేవని ఈ జంట కారణంగా మరోసారి నిరూపితమైంది. ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు గానీ దాన్ని గెలిపించుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటారు, ఎంత కాలమైన నిరీక్షిస్తారు. అచ్చం అలానే ఈ స్కాటిష్ ఎంపీ పదేళ్లు నిరీక్షించి మరీ కేరళ మహిళను పెళ్లాడాడు స్కాటిష్ రాజకీయ నాయకుడు. దేశం దాటిన ఈ దంపతుల ప్రేమ కథ ఏంటో చూద్దామా..!స్కాటిష్ నేషనల్ పార్టీ (SNP) రాజకీయ నాయకుడు , పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే కేరళకు చెందిన నిధిన్ చంద్ను అక్కడ ప్రఖ్యాత గాంచిన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఎర్నాకులం జిల్లాలోని పిరవంకు చెందిన నిధిన్ చిరకాల కోరిక ఇన్నేళ్లకు నెరవేరిందట. ఈ వివాహ వేడుక మంగళవారం నాడు గురువాయూర్ దేవాలయ ప్రాంగణంలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను మార్టిన్ డే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్చేసుకోవడంతో నెట్టింట వైరల్గా మారింది. పదేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదు..నిజానికి ఈ జంట 2016లోనే యూకేలో వివాహం చేసుకున్నారు. కానీ నిధిన్ చాలా కాలంగా గురువాయుర్లో తన వివాహతంతుని పూర్తి చేయాలని కోరుకున్నారు. 2018 కేరళ వరదలు, కోవిడ్ 19 మహమ్మారి వంటి కారణాల వల్ల ఈ జంట వివాహ వేడుక చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు తమ వివాహం రిజిస్టర్ అయిన తొమ్మిదేళ్ల తర్వాత, తన నాలుగవ పర్యటనలో ఆ దంపతులు గురువాయురు ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇది తన భాగస్వామి చిరకాల కోరిక అని చెబుతున్నారు స్కాటిష్ ఎంపీ మార్టిన్ డే.ఎవరీ మార్టిన్ డే..55 ఏళ్ల మార్టిన్ డే, స్కాటిష్ నేషనల్ పార్టీకి చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన లిన్లిత్గో ప్రాంతానికి స్థానిక, జాతీయ స్థాయిలలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1999లో వెస్ట్ లోథియన్ కౌన్సిల్కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2015లో లిన్లిత్గో ఈస్ట్ ఫాల్కిర్క్ నియోజకవర్గం నుంచి ఎంపీగా యూకే హౌస్ ఆఫ్ కామన్స్లోకి ప్రవేశించారు. ఆయన 2024 వరకు ఎంపీగా పనిచేశారు. ఆరోగ్యం, సామాజిక సంరక్షణ వంటి రంగాలతో సహా SNP ఫ్రంట్బెంచ్ బాధ్యతలను నిర్వహించారు.2026 స్కాటిష్ పార్లమెంట్ ఎన్నికలలో, డే తిరిగి ఎన్నికై పదవిలోకి వచ్చి, ఫాల్కిర్క్ ఈస్ట్ అండ్ లిన్లిత్గో నియోజకవర్గం నుంచి MSPగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం స్కాటిష్ పార్లమెంట్ క్లైమేట్ యాక్షన్ కమిటీ అండ్ ఎకానమీ, టూరిజం అండ్ ఎనర్జీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. కాగా, ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు,బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. అలాగే వెస్ట్ లోథియన్లోని స్థానిక ప్రభుత్వంలో పాలుపంచుకున్నారు.ఎవరీ నిధిన్ చందన్..ఎర్నాకుళంలోని పిరవం ప్రాంతానికి చెందిన నిధిన్ చంద్, ఉన్నత విద్య కోసం నవంబర్ 2008లో యూకేకి వెళ్లారు. ఆమె యూకేలో ఐటీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె తండ్రి కే.ఎన్. చంద్రన్ ఒక రిటైర్డ్ వెటర్నరీ అధికారి, తల్లి రాజమ్మ పంపాకుడ మాజీ గ్రామ పంచాయతీ సభ్యురాలు.అలా పరిచయమైంది..యూకేలో ఆమె పీహెచ్డీ చేస్తున్న సమయంలో, కొత్త వలస నిబంధనల వల్ల ఆమె వీసాతో సహా వేలాది విద్యార్థి వీసాలు రద్దు చేయబడ్డాయి. నిధిన్ అక్కడినుంచి వెళ్ళిపోకుండా, పార్లమెంటులో లాబీయింగ్ చేసి, కమిటీల ముందు భారతీయ విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించారు. అక్కడే ఆమె లిన్లిత్గో అండ్ ఈస్ట్ ఫాల్కిర్క్ ఎంపీ అయిన మార్టిన్ డేను కలిశారు.మే నెలలో అతను ప్రపోజ్ చేసిన తర్వాత, 2016లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. తనకు 12 ఏళ్ల కొడుకు ఉన్నాడని, తాను విడాకులు తీసుకున్న మహిళనని నిధిన్ చెప్పినప్పుడు, మార్టిన్ చాలా విశాల హృదయంతో తన జీవితంలోకి ఆహ్వానించి, తన పేరెంట్స్ మార్గరెట్, రాన్ డేలకు ఆమెను పరిచయం చేశారు. ఆమె వీసా, ఉద్యోగ పరిస్థితి అనిశ్చితంగా ఉన్నప్పటికీ, వాళ్లు ఆమెను ఆప్యాయంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. తర్వాత మార్టిన్, నిధిన్, ఆమె కుమారుడు వేద్దిక్తో కలిసి యూకే వెళ్ళాడు.అలాగే ఆమె కుమారుడు వేద్దిక్, ఎడిన్బర్గ్లోని కంప్యూటర్షేర్లో సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాడు. నిధిన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేస్తూ, స్కాటిష్ నేషనల్ పార్టీ ప్రచారాలలో కూడా చురుకుగా పాల్గొంటుంది. కాగా, మార్టిన్ డే 1999 నుంచి ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. అంతేగాదు తొమ్మిదేళ్లలో మూడు పర్యాయాలు యూకే పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. ఆయన స్కాటిష్ పార్లమెంట్లో భారతదేశం తరపున అఖిల పక్ష పార్లమెంటరీ గ్రూపుకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by jith (@jith__uday) (చదవండి: లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!) -
మహేష్బాబు సినిమా చూసి.. హత్యకు స్కెచ్!
మంచి కంటే చెడు త్వరగా ఆకర్షిస్తుంది. అందుకే సినిమాల్లోనూ హీరోలను గ్యాంగ్స్టర్లుగా, మాఫియా డాన్లుగా చూపించే ట్రెండ్ పెరుగుతోంది. తెరపై చూపించే క్రైమ్ సన్నివేశాలు, వాటి ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందనే చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే సందేశాత్మక చిత్రాల నుంచి కూడా చెడునే స్వీకరిస్తుండడం.. ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కేరళలో వెలుగుచూసిన ఓ హత్య కేసు ఈ అంశంపై మరోసారి చర్చకు తెరలేపింది. తెలుగు సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమా.. అక్కడ ఓ దారుణ హత్యకు స్ఫూర్తినివ్వడమే అందుకు కారణం. కేరళలోని అలప్పుజ జిల్లాలో జరిగిన 65 ఏళ్ల వృద్ధుడి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ దొంగతనం కేసుగా మొదలైన ఈ ఘటన వెనుక.. మొదట ప్రొఫెషనల్ హంతకుల ప్రమేయం ఉందేమోనని పోలీసులు అనుమానించారు. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు చేస్తే మైనర్లు, అందునా పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా నిర్ధారించుకున్నారు. అయితే తన తాత హత్యకు 13 ఏళ్ల మనవరాలే సహకరించడం.. ఈ కేసులో మరో కీలక అంశంగా వెల్లడైంది. కరువత్తలో శివన్కుట్టి(65) హత్య కేసులో మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. హత్యకు 2017లో విడుదలైన ‘స్పైడర్’ చిత్ర స్ఫూర్తిగా నిలిచిందని మైనర్ నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. మహేష్ బాబు నటించిన ఈ బైలింగువల్ చిత్రంలో దర్శకనటుడు ఎస్జే సూర్య.. సైకో విలన్ పాత్ర భైరవలో అలరించాడు. మురగదాస్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రం కమర్షియల్గా ఫెయిల్యూర్గా నిలిచింది. అయితే సూర్య విలనిజానికి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. అదుగో ఆ క్యారెక్టర్ నుంచి.. అందునా ఓ సీన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని.. ఈ దారుణానికి ప్రణాళిక రచించినట్లు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. సినిమా చూసి హత్యకు ప్లాన్?పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు తొలుత శివన్కుట్టి ఇంటి పైకప్పు పెంకులు తొలగించి లోపలికి ప్రవేశించాలని భావించారు. నిద్రలో ఉన్న సమయంలో పెద్ద రాయితో దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనకు 2017లో వచ్చిన తమిళ సినిమా ‘స్పైడర్’లోని ఓ హత్య సన్నివేశమే ప్రేరణగా నిలిచిందని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అయితే ఇంటి పైకప్పు కింద చెక్కతో నిర్మించిన సీలింగ్ ఉండటంతో వారి మొదటి ప్రయత్నం విఫలమైంది. దీంతో మరో మార్గంలో ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.వాట్సాప్ చాట్లే కీలక ఆధారంఈ కేసులో కీలక ఆధారాలు నిందితుల వాట్సాప్ సంభాషణల ద్వారా లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి మనవరాలు, ఆమె స్నేహితుడి మధ్య జరిగిన చాట్లలో హత్యకు సంబంధించిన పలు ప్రణాళికలు చర్చించినట్లు గుర్తించారు. విషం పెట్టడం, వాహనంతో ఢీకొట్టడం వంటి పద్ధతుల గురించి కూడా వారు మాట్లాడుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా కరునాగప్పల్లి ప్రాంతానికి చెందిన ఓ కిరాయి ముఠాను సంప్రదించి హత్య చేయించేందుకు ప్రయత్నించారని.. అయితే డబ్బు ఆఫర్ చేసినా ఆ ముఠా అంగీకరించలేదని దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు.రాత్రి రైల్లో వచ్చి.. దాడిపోలీసుల ప్రకారం.. నిందితులు శనివారం రాత్రి కొల్లం నుంచి రైలులో కరువట్టకు చేరుకున్నారు. శివన్కుట్టి నిద్రపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పైకప్పు నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం విఫలమైన తర్వాత.. వెంటిలేటర్ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశం ద్వారా లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒకరు ఇంట్లోకి వెళ్లి తలుపు తెరవడంతో మిగతావారు లోపలికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. శబ్దం విని శివన్కుట్టి లేచి రావడంతో ఆయనపై దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత లైవ్ మర్డర్ ఫొటోలను బాలికకు నిందితుడు పంపించాడు.ఐఫోన్, బైక్ల కోసం దొంగతనం?హత్య తర్వాత ఇంట్లో ఉన్న ఆరు సవర్ల బంగారాన్ని నిందితులు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బంగారాన్ని అమ్మి బాలికకు ఐఫోన్, ఇతర నిందితులకు బైక్లు కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇంతలో పోలీసులకు దొరికిపోయాడు.తప్పుడు కథనం సృష్టించారా?కేసు దర్యాప్తులో మరో కోణం కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. శివన్కుట్టి తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక ఆరోపించినట్లు సమాచారం. అయితే అది నిజమైన కారణమా? లేదంటే శిక్ష నుంచి తప్పించుకునేందుకు సృష్టించిన కథనా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.కుటుంబంతో కలిసి జీవనం..శివన్కుట్టి కుటుంబం రెండేళ్ల క్రితం కొల్లం నుంచి కరువట్టకు మారింది. ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవరాలు తొలుత అద్దె ఇంట్లో ఉండేవారు. అనంతరం శివన్కుట్టి అదే ప్రాంతంలో భూమి కొనుగోలు చేసి కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈ ఘటనలో చిన్న వయసులో ఉన్న నిందితులు ఇంత పక్కా ప్రణాళికతో.. అదీ సినిమా చూసి హత్యకు పాల్పడ్డారన్న విషయం కేరళలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. -
బాయ్ఫ్రెండ్ సాయంతో తాతను చంపించి.. బాలిక పైశాచికం!
అలప్పుజ: కేరళలోని అలప్పుజ జిల్లా హరిపాడ్ బ్లాక్ పంచాయతీ పరిధిలో అత్యంత దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. ఐఫోన్, బైక్ కొనుగోలు కోసం 13 ఏళ్ల బాలిక తన 15 ఏళ్ల బాయ్ఫ్రెండ్, మరో ఇద్దరు మైనర్ స్నేహితుల సహకారంతో తన తాతను హత్య చేయించింది. యూట్యూబ్లో హత్య చేసే విధానాలను చూసి, పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి నిందితులు ఒడిగట్టారు.బాధితుడు తన భార్య, గర్భిణి అయిన కుమార్తె, మనవరాలితో కలిసి నివసిస్తున్నారు. కూతురు పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరగా, బామ్మ కూడా అక్కడే ఉన్నారు. ఇదే అదనుగా భావించిన మనవరాలు.. పరీక్షల ప్రిపరేషన్ సాకుతో స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తాత తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాయ్ఫ్రెండ్ను నమ్మించి, హత్యకు పురిగొల్పింది. నిందితులు ఇంటి వెనుక వెంటిలేటర్ ద్వారా లోపలికి ప్రవేశించి, తాతను తీవ్రంగా కొట్టి, కాళ్లు చేతులు కట్టేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ బాలిక ఈ దారుణాన్ని వీడియో కాల్ ద్వారా లైవ్లో వీక్షించింది. అనంతరం ఆధారాలు దొరక్కుండా కారం పొడి చల్లి, 4.5 సవర్ల (సుమారు 36 గ్రాములు) బంగారం, నగదుతో ఉడాయించారు.మొబైల్ వాడవద్దని మందలించిన తాతపై కక్ష పెంచుకున్న ఆ బాలిక.. బంగారం అమ్మి తాను ఐఫోన్ కొనుక్కోవాలని, బాయ్ఫ్రెండ్కు బైక్ కొనివ్వాలని ఈ పథకం వేసింది. పోలీసులు విచారణలో బాలిక పొంతనలేని సమాధానాలు చెప్పడంతో, సాంకేతిక ఆధారాల ద్వారా 24 గంటల్లోనే కేసును ఛేదించారు. కొల్లాంలో విక్రయించిన ఉంగరంతో సహా మిగిలిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.ఇది కూడా చదవండి: శవం సాయంతో నది దాటి.. తులసీదాస్ జీవితాన్ని మార్చిన ఘటన! -
వాట్సాప్లో ఒక్క మెసేజ్ .. నిమిషాల్లో వెబ్సైట్ సిద్ధం!
ఇడుక్కి: కేవలం వాట్సాప్లో ఓ చిన్న సందేశం పంపడం ద్వారా ప్రొఫెషనల్ వెబ్సైట్ను రూపొందించే సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. కేరళకు చెందిన ఓ టెక్ స్టార్టప్ ఈ వినూత్న ఆవిష్కరణను సాకారం చేసింది. ‘Eezix.ai’ పేరుతో రూపొందించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్లాట్ఫామ్ ద్వారా ఒక్క కోడింగ్ లైన్ కూడా రాయకుండా, డెవలపర్లతో పనిలేకుండా నిమిషాల వ్యవధిలోనే ఎవరైనా తమ వెబ్సైట్ను సులభంగా నిర్మించుకోవచ్చు.ఇడుక్కి జిల్లా వెన్మణికి చెందిన షిజో వి. జోస్, తన స్నేహితులు రంజు సెబాస్టియన్, గిసిన్ జోసెఫ్లతో కలిసి ఈ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు డిజిటల్ గుర్తింపును సులభతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. దీని పనితీరు అత్యంత సరళంగా ఉంటుంది. వినియోగదారులు స్టార్టప్ వాట్సాప్ నంబర్కు సందేశం పంపగానే, అందులోని ఏఐ చాట్బాట్ వ్యాపారానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక వివరాలను అడుగుతుంది. వివరాలు అందించిన కొద్ది నిమిషాల్లోనే ఏఐ ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ను రూపొందించి, ఆ లింక్ను నేరుగా యూజర్ వాట్సాప్ చాట్కే పంపుతుంది.రూపకల్పనలో మార్పులు చేసుకోవాలనుకునే వారి కోసం అంతర్నిర్మిత ఎడిటింగ్ టూల్స్ను కూడా ఇందులో అందించారు. వినియోగదారులు స్వయంగా మార్పులు చేసుకోవచ్చు లేదా డిజైన్ బృందం సహాయం కోసం సపోర్ట్ ప్యాకేజీని తీసుకోవచ్చు. వినియోగదారులకు నిరంతరం అండగా ఉండేందుకు 24 గంటల కస్టమర్ సపోర్ట్ను కూడా ఈ స్టార్టప్ కల్పిస్తోంది.ఈ ముగ్గురు వ్యవస్థాపకుల ప్రయాణం 2010లో బీసీఏ పూర్తి చేసిన తర్వాత మొదలైంది. 2014లో ‘ఐడర్ ప్రో టెక్నాలజీస్’ స్థాపించి సర్వర్ మేనేజ్మెంట్, వెబ్ డెవలప్మెంట్ సేవలు అందించారు. కొవిడ్ లాక్డౌన్ల సమయంలో వచ్చిన ఆటంకాలను అధిగమిస్తూ, క్రమంగా ఈ-విజిటింగ్ కార్డు ప్లాట్ఫామ్ను రూపొందించి, ఆ అనుభవంతో చివరకు ‘Eezix.ai’ను ఆవిష్కరించారు. ఈ-కామర్స్ బ్రాండ్లు, చిన్న వ్యాపారులు, స్థానిక వర్తకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యవస్థాపకులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్కు సుమారు 3,000 మంది యాక్టివ్ వినియోగదారులు ఉన్నారని, విశేష స్పందన లభిస్తోందని వారు వెల్లడించారు.ఇది కూడా చదవండి: జైల్లో ఒకరిపై ఒకరు పడుకోవాల్సిందే: శిల్పా శెట్టి భర్త -
శబరిమలలో సినిమా షూటింగ్లు బంద్: కేరళ ప్రభుత్వం
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సాధారణ కమర్షియల్ సినిమాల షూటింగ్కు ఇకపై అనుమతులు ఇవ్వబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. మోహన్లాల్ నటిస్తున్న ‘అతిమనోహరం’ షూటింగ్కు అనుమతి ఇవ్వడంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కేరళ దేవస్వం మంత్రి కే. మురళీధరన్ ఈ కీలక ప్రకటన చేశారు. శబరిమలను సాధారణ సినిమా షూటింగ్ లొకేషన్గా ఉపయోగించేందుకు అనుమతించబోమని ఆయన తెలిపారు.శబరిమలలో సినిమా షూటింగ్కు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయ్యప్ప స్వామికి సంబంధించిన సినిమాలు, మతపరమైన చిత్రాలకు మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి ఇవ్వవచ్చని పేర్కొన్నారు. సాధారణ కమర్షియల్ సినిమాల షూటింగ్కు మాత్రం అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఆలయాలను సినిమా షూటింగ్ కోసం వినియోగించేందుకు అనుమతించడం సరికాదని అన్నారు.శబరిమలలో షూటింగ్కు సంబంధించిన నిబంధనలను తాను పూర్తిగా పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. ఆలయ పవిత్రత, భక్తుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు.మోహన్లాల్ మూవీతో వివాదంఈ వివాదానికి కారణం మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అతిమనోహరం సినిమా. తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శబరిమలలోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. పంపా నుంచి సన్నిధానం వరకు కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు సంబంధించి పలు షరతులు విధించినట్లు సమాచారం. శబరిమల లేదా హిందూ మత విశ్వాసాలను ప్రతికూలంగా చూపించకూడదని, షూటింగ్కు అవసరమైన ఇతర శాఖల అనుమతులు కూడా తీసుకోవాలని నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అనుమతుల్లో కీలకమైన అటవీ శాఖ అనుమతి విషయంలో సమస్య ఏర్పడింది. షూటింగ్కు అటవీ శాఖ అనుమతి నిరాకరించడంతో అక్కడ చిత్రీకరణకు బ్రేక్ పడింది. దీంతో అసలు దేవస్వం బోర్డు సాధారణ సినిమాకు అనుమతి ఎలా ఇచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి.ప్రభుత్వ విధానంపై ప్రశ్నలుదేవస్వం బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత.. అటవీ శాఖ దాన్ని తిరస్కరించడంతో వివాదం మరింత ముదిరింది. శబరిమల వంటి అత్యంత సున్నితమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో సినిమా షూటింగ్కు వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకుండా అనుమతులు ఇవ్వడంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సాధారణ కమర్షియల్ సినిమాలకు షూటింగ్ అనుమతులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది.మరో చోటులో షూటింగ్ తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తున్న అతిమనోహరంలో మోహన్లాల్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాలు అలెక్స్, మనోజ్ కే. జయన్, జగదీష్, ఇర్షాద్, సుధీష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో ఎక్కువ భాగం పూర్తయింది. కొచ్చితో పాటు పలు చోట్ల కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మిగిలిన షూటింగ్ను కొచ్చి, శబరిమలతో పాటు హైదరాబాద్, ముంబైలో నిర్వహించాలని చిత్ర బృందం భావించింది. ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే శబరిమలలో షూటింగ్కు అనుమతి నిరాకరణతో చిత్ర బృందం ప్రత్యామ్నాయ లొకేషన్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇంతకు ముందు..గతంలోనూ శబరిమల, పంబా పరిసరాల్లో పలు సినిమాల షూటింగ్ జరిగింది. తమిళ చిత్రం ‘నంబినార్ కేడువతిల్లై’ (1986)లోని ఓ పాటను శబరిమలలోని 18 మెట్ల వద్ద చిత్రీకరించారు. మలయాళంలో ‘స్వామి అయ్యప్పన్’ (1975), ‘మాలికప్పురం’ (2022) వంటి చిత్రాల్లో శబరిమల ప్రాంతాల్లో షూట్ చేశారు. కన్నడ చిత్రం ‘సీజర్’ (2018)లోనూ ఆ పరిసర ప్రాంతాల్లోనే క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు.ఆలయ పవిత్రతే కీలకంశబరిమల కేవలం ఒక పర్యాటక ప్రదేశం లేదా సాధారణ షూటింగ్ లొకేషన్ కాదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివచ్చే నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో సినిమా చిత్రీకరణ వల్ల భక్తుల రాకపోకలు, భద్రత, ఆధ్యాత్మిక వాతావరణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.మోహన్లాల్ సినిమా షూటింగ్ అనుమతి వివాదం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో శబరిమలలో కమర్షియల్ సినిమాల షూటింగ్కు దాదాపు తలుపులు మూసేసినట్లయింది. ఇకపై అయ్యప్ప, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ప్రత్యేక అనుమతుల అవకాశముంటుందని కేరళ దేవస్వం మంత్రి స్పష్టం చేశారు. -
కేరళలో మొదలైన ఓనం సంబారాలు.. 10 రోజుల సందడికి శ్రీకారం!
తిరువనంతపురం: కేరళలో ఆదివారం ఓనం వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు సాగే ఈ సంబరాలకు ‘అథం’వేడుకతో అంకురార్పణ జరిగింది. ఎర్నాకులం జిల్లాలోని త్రిప్పుణితురలో నిర్వహించిన ‘అథచమయం’ ఊరేగింపుతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయ కళారూపాలు, సంగీత వాయిద్యాల నడుమ సాగిన ఈ వేడుక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. త్రిప్పుణితురలోని అథం నగర్లో జరిగిన అధికారిక వేడుకలను ముఖ్యమంత్రి వీడీ సతీశన్ జ్యోతి వెలిలించి ప్రారంభించారు.ప్రముఖ నటుడు జలదిష్ ఈ భారీ ఊరేగింపును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంబరాల్లో రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సుమారు 2,000 మంది కళాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పులికళి, వేళకళి, చెండమేళం వంటి అద్భుతమైన కేరళ సంప్రదాయ కళారూపాలు ప్రదర్శనశాలను కనువిందు చేశాయి. అథం నగర్ నుంచి ప్రారంభమై శ్రీ పూర్ణత్రయీశ ఆలయం మీదుగా వడక్కెకోట్ట వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఈ ఘనమైన ఊరేగింపు సాగింది. ఆదివారం కావడంతో భారీ జనసందోహం వస్తుందని అంచనా వేసి, అధికారులు త్రిప్పుణితురలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.మలయాళ మాసమైన చింగంలో వచ్చే అథం... తిరువోణం రాకను సూచిస్తుంది. ఈ రోజు నుంచే ఇళ్ల ముంగిట పూలజల్లులు కురిపిస్తూ పూలపల్లెలు (పూకోలం) తీర్చిదిద్దడం ప్రారంభిస్తారు. రానున్న పది రోజుల పాటు కేరళలోని ప్రతి ఇల్లు, కూడలి పండుగ శోభతో కళకళలాడనుంది. రాబోయే ఆగస్టు 26న కేరళ ప్రజలు అత్యంత వైభవంగా 'తిరువోణం' జరుపుకోనున్నారు. మహారాజు మహాబలి జ్ఞాపకార్థం జరుపుకునే ఈ సుందర పండుగ కేరళ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: పానీపూరీ ప్రియులకు హెచ్చరిక -
‘‘దేవుడి నుంచి ఫోన్ వచ్చింది.. అమ్మ, నాన్నను స్వర్గానికి పంపించా’’
తిరువనంతపురం: కన్న తల్లిదండ్రులను చంపాడు ఓ యువకుడు. అంతేగాక, వారిని స్వర్గానికి పంపించానని వ్యాఖ్యలు చేశాడు. కేరళలోని ఇడుక్కిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల వ్యక్తి తన తల్లిదండ్రులను కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఎళుకుంవయల్లోని తమ ఇంట్లో తన తండ్రి ఆంటోనీ (59) తల్లి వల్సమ్మ (55)ను హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో అజీష్ను పోలీసులు అరెస్టు చేశారు. అజీష్కు గతంలో మద్యం, మాదకద్రవ్యాల వినియోగం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో అతడు వ్యసన విముక్తి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కేంద్రం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడని పోలీసులు తెలిపారు.శుక్రవారం రాత్రి అతడు తన తల్లిదండ్రులను పలుసార్లు కత్తితో పొడిచిన తర్వాత, గాయాలతో ఉన్న ఆ దంపతుల వీడియోను చిత్రీకరించి ఓ బంధువుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆ బంధువు పారిష్ పూజారికి, పొరుగువారికి సమాచారం అందించారు. వారు వెంటనే ఇంటికి చేరుకునే సరికి ఆ దంపతులు మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తొలుత తన తల్లిని తన పక్కన కూర్చోబెట్టి ప్రార్థన చేయాలని కోరాడు. ఆమె చేసిన ప్రార్థనతో సంతృప్తి చెందక ఆమెపై దాడి చేశాడు. ఆంటోనీ అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అజీష్ ఆయనపై కూడా దాడి చేశాడు.అజీష్ను అదుపులోకి తీసుకున్న తర్వాత, “దేవుడి నుంచి ఫోన్ రావడంతో” తన తల్లిదండ్రులను “స్వర్గానికి పంపించానని” పోలీసులతో చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లోనే ఉన్న తన అమ్మమ్మకు మాత్రం ఎలాంటి హాని చేయలేదని పోలీసులు తెలిపారు.అజీష్ అమ్మమ్మ మంచానికే పరిమితమై ఉన్నారు. ఆమెకు వినికిడి, చూపు సమస్యలు ఉన్నాయి. బంధువులు ఇంటికి చేరుకున్న తర్వాతే ఆమెకు ఘటన గురించి తెలిసిందని పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన నెడుంకండం పోలీసులు అజీష్ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని న్యాయ రిమాండ్కు పంపినట్లు అధికారులు తెలిపారు. అతడి సోదరుడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
బీజేపీ ఆఫీస్లో అలా.. రైల్వే ఉద్యోగి ఇలా!
పంద్రాగస్టు వేడుకలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. జాతీయ పతాకం గౌరవంపై రెండు ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కేరళలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పతాకాలు మూలన పడేసినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో వివాదం రేగింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరో వీడియో ద్వారా జాతీయ జెండా పట్ల గౌరవం, బాధ్యతపై చర్చ మొదలైంది.కేరళలోని కాసర్గోడ్ బీజేపీ జిల్లా కార్యాలయంలో కొన్ని త్రివర్ణ పతాకాలు ఒక మూలన పడేసినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ డీవైఎఫ్ఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.జాతీయ పతాకాన్ని అవమానించడం చట్టం ప్రకారం ‘Prevention of Insults to National Honour Act, 1971’ కింద నేరమని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే వైరల్ వీడియోపై బీజేపీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.BJP faces allegations of disrespecting Indian flag in Kerala's KasaragodSeveral Indian national flags were allegedly found piled up at the BJP district office in Kasaragod after a Tiranga Yatra under the Har Ghar Tiranga campaign. DYFI sought strict action and filed a complaint… pic.twitter.com/munNIIQwcJ— South First (@TheSouthfirst) August 12, 2026మరోవైపు.. రైల్వే ఉద్యోగి చేసిన ఓ చిన్న పని మాత్రం ప్రశంసలు అందుకుంది. దుమ్ముతో నిండిపోయిన రైలింజిన్ ముందు భాగంలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఓ ఉద్యోగి నీటితో శుభ్రం చేసి, వస్త్రంతో తుడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాతీయ పతాకం పట్ల చూపిన గౌరవానికి నెటిజన్లు అభినందనలు తెలిపారు. సాధారణ విధుల్లో భాగంగా చేసిన పని అయినప్పటికీ.. జాతీయ చిహ్నాల పట్ల బాధ్యతను గుర్తుచేసేలా ఉందని పలువురు స్పందించారు.Yes, there may be dirt on the locomotive but the flag should be clean. Small gesture, big message! 🙏🤎 #HarGharTiranga #IndianRailways pic.twitter.com/iGlLXEtMM3— Ananth Rupanagudi (@AnanthOnTrack) August 12, 2026ఒకవైపు పతాకాల నిర్లక్ష్యంపై వివాదం.. మరోవైపు పతాకానికి గౌరవం తెలిపిన చర్య.. జాతీయ జెండా పట్ల మన బాధ్యతపై మరోసారి చర్చకు దారితీశాయి. -
భర్తని వదిలేసి కండక్టర్ తో జంప్..!
-
కేరళం బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, ఢిల్లీ: కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించింది. బుధవారం రాజ్యసభలో ఈ బిల్లును వాయిస్ ఓటుతో ఆమోదించారు. అంతకుముందు మంగళవారం లోక్సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో కేరళ పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చే ప్రక్రియ తుదిదశకు చేరుకుంది.రాష్ట్రం పేరును మార్చాలని కోరుతూ కేరళ అసెంబ్లీ 2024లో తీర్మానం చేసింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేరళ ప్రభుత్వం 2024 జూన్లో కేంద్రానికి పంపించింది. రాష్ట్ర ప్రజల భాషా, సాంస్కృతిక గుర్తింపుకు అనుగుణంగా ‘కేరళం’ పేరును అధికారికంగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.అనంతరం రాష్ట్రపతి ఈ పేరు మార్పు బిల్లును కేరళ శాసనసభకు పంపించి, దానిపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తెలియజేయాలని కోరారు. దీనిపై కేరళ అసెంబ్లీ మరోసారి చర్చించి, బిల్లుకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. రాష్ట్ర శాసనసభ నుంచి వచ్చిన ఈ అంగీకారంతో కేంద్రం పేరుమార్పు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది.కేరళ (పేరు మార్పు) బిల్లు ప్రకారం రాష్ట్రం పేరును ‘కేరళ’ నుంచి ‘కేరళం’గా మార్చేందుకు రాజ్యాంగంలో అవసరమైన సవరణలు చేయనున్నారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో, ఆర్టికల్ 3 ప్రకారం ‘కేరళ’ పేరును ‘కేరళం’గా మార్చేలా సవరణలు ఉంటాయి. రాష్ట్రం పేరు మార్పుతో సంబంధం ఉన్న ఇతర రాజ్యాంగ నిబంధనల్లోనూ అవసరమైన మార్పులు, తదనుగుణమైన నిబంధనలను బిల్లు కలిగి ఉంది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించింది ఇక రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఇక రాష్ట్రం పేరు అధికారికంగా ‘కేరళం’గా మారనుంది. -
లుంగీ వాలా వ్యాఖ్యలపై రాజ్యసభలో రచ్చ బీజేపీ ఎంపీ పై కేరళ ఎంపీ సీరియస్
-
ఆమె కండక్టర్తో వెళ్లిపోయింది.. అంతే!
వివాహేతర సంబంధాల మోజులో.. నేరాలు-ఘోరాలు జరుగుతున్న కాలం ఇది. కట్టుకున్న బంధాలను పక్కన పెట్టి క్షణిక సుఖాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. అనుమానాలు, ఆవేదనలు, ఆగ్రహాలతో పలు ఘటనలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి.. అందునా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి, అందమైన తన భార్య ఓ కండక్టర్కి మనసిచ్చి వెళ్లిపోయిందంటూ నేరుగా వీడియో రిలీజ్ చేయడం సంచలన చర్చకు దారి తీసింది.మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటుడు అఖిల్ NRD వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తన భార్య మేఘా ఓ కండక్గర్తో వెళ్లిపోయిందని నేరుగా ఆయనే వీడియో విడుదల చేయడం నెటిజన్లను షాక్కు గురి చేసింది. నైటీలో లగేజీతో ఆమె స్పీడ్గా వెళ్లి.. ఓ వ్యక్తితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వివాహేతర సంబంధాల నేరాల నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. CCTV visuals are currently going viral on social media, claiming that Kerala YouTuber Akhil NRD's wife, Megha Nair, has run away with a bus conductor. Watch the video to see the reality behind it! 👇 pic.twitter.com/N9WUns571W— Vijitha (@Vijitha96) August 11, 2026అయితే భర్తను చంపకుండా వదిలేసి వెళ్లిపోయింది ఆమె గ్రేట్ అంటూ కొందరు.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇదేం పని? అని మరికొందరు.. ఆ కండక్టర్లో ఆమెకేం నచ్చిందో అని మరికొందరు ఇలా కామెంట్ల రచ్చతో చర్చకు దారి తీశారు. ఈ నేపథ్యంలో.. ఈ పరిణామంపై అఖిల్ స్నేహితుడు, మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ సాయి కృష్ణ స్పందించడంతో మరింత ఆసక్తి నెలకొంది. అఖిల్-మేఘా వివాహానికి తాను హాజరయ్యానని చెప్పిన సాయి కృష్ణ.. ఈ వార్త విని తాను షాక్కు గురయ్యానని తెలిపారు. ఈ విషయంపై అఖిల్తో మాట్లాడానని, అయితే ఈ విషయంలో ఎవరినీ నిందించేందుకు అఖిల్ ఇష్టపడటం లేదని పేర్కొన్నారు.“ఆమె వెళ్లిపోయింది.. అంతే!”భార్య చేసిన నమ్మక ద్రోహంపై అఖిల్ రియాక్షన్ను సాయి కృష్ణ మీడియాకు వెల్లడించాడు. ఆమె వెళ్లిపోయింది అంతే అని ఒక్క ముక్కలో తేల్చేశాడు. ‘‘ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టను..నిందించను. దేవుడు నాకు ఇలా రాసిపెట్టాడు. ఇలాంటి పరిస్థితులు ఎవరి జీవితంలోనైనా ఎదురవుతాయి. నా తల్లిదండ్రులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిననే అనుకుంటున్నా. ఈ విషయాన్ని మరింతగా చర్చించడం ఇష్టం లేదు’’ అంటూ అఖిల్ అన్నాడట.సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై వస్తున్న చర్చలపై కూడా సాయి కృష్ణ స్పందించారు. పరిచయమైన వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటిని సంచలనంగా మార్చకుండా, కొంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.మెర్చంట్ నేవీ నుంచి సోషల్ మీడియా స్టార్..అఖిల్ ఎన్ఆర్డీ ప్రయాణం కూడా ప్రత్యేకమైనదే. తొలుత ఆయన మెర్చంట్ నేవీలో పనిచేశాడు. ఆ తర్వాత డిజిటల్ కంటెంట్పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టాడు. టిక్టాక్ ద్వారా వీడియోలు చేయడం ప్రారంభించి.. కామెడీ వీడియోలు, లైఫ్స్టైల్ కంటెంట్, వ్లాగ్స్తో భారీగా ఫాలోవర్స్ను సంపాదించుకున్నాడు. తర్వాత యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానల్కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా పాపులారిటీతో నటుడిగానూ అవకాశాలు అందుకున్నాడు.సినిమాల్లోకి ఎంట్రీసోషల్ మీడియా స్టార్ నుంచి మాలీవుడ్లో చిన్నాచితకా అవకాశాలు అందుకున్నాడు అఖిల్. 2026లో మలయాళ చిత్రం ‘ఆశకల్ ఆయిరం’ ద్వారా నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘మహారాజా హాస్టల్’ చిత్రంలోనూ నటించాడు. సోషల్ మీడియా స్టార్ నుంచి సినిమా నటుడిగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది.2024లో వివాహం..అఖిల్, మేఘా కొంతకాలం ప్రేమలో ఉన్న అనంతరం 2024లో వివాహం చేసుకున్నారు. మేఘా కూడా అఖిల్ సోషల్ మీడియా పోస్టుల్లో కనిపించేవారు. వీరి జంటకు అభిమానుల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జరిగిన దానిపై మేఘగానీ, ఆమె కుటుంబంగానీ ఇంకా స్పందించలేదు. అయితే.. అఖిల్ వీడియో రిలీజ్ చేశాక ‘‘ఇది కూడా సోషల్ మీడియా స్టంటేనా?’’ అని కొందరు అనుమానం సైతం వ్యక్తం చేశారు. -
టీజీ మోహన్దాస్ అరెస్ట్
తిరువనంతపురం: మితవాద రాజకీయ వ్యాఖ్యాత టీజీ మోహన్దాస్ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలోని కూవపదంలో తన నివాసంలో ఉన్న ఆయనను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి తిరువనంతపురం సైబర్ పోలీస్ స్టేషన్కు ఆయనను తరలించారు. ఆయనను ఈ రోజు సాయంత్రం సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారని పోలీసులు తెలిపారు. ఆయన నివాసం నుంచి డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీటిని కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపుతామని తెలిపారు. తదుపరి దర్యాప్తు జరిపిన తర్వాత మోహన్దాస్పై మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది.నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల పోరాటంపై మోహన్దాస్ (TG Mohandas) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన యూట్యూబ్ చానల్ ‘పత్రిక’లో పోస్ట్ చేసిన వీడియోలో ఈ మాటలు మాట్లాడారు. తానే గనక తాను నియంత్రించే బాధ్యతలో ఉండి ఉంటే విద్యార్థి ఆందోళనకారులపై భద్రతా బలగాలతో కాల్పులు జరిపించి చెదరగొట్టే వాడినని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా యువతలు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడారు. మహిళా ఆందోళనకారులను "అత్యాచారాలను ఇష్టపడే మహిళలు" అంటూ వ్యాఖ్యానించారు. వారిపై సామూహిక అత్యాచారాలు జరుగుతాయంటూ నోరు పారేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై గత నెల చివరి వారంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అరెస్టు జాప్యంపై విమర్శలుమోహన్దాస్ను అరెస్ట్ చేయడంలో యూపీఎఫ్ ప్రభుత్వం తాత్సారం చేసిందని ప్రతిపక్ష ఎల్డీఎఫ్ ఆరోపించింది. గత నెలలో కేసు నమోదైతే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. మోహన్దాస్ అరెస్ట్ విషయంలో పోలీసులు చట్టప్రకారమే ముందుకు వెళ్లారని హోం మంత్రి రమేష్ చెన్నితాల చెప్పారు. ఇదే అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకునే సామర్థ్యం కేరళ పోలీసులకు ఉందని వ్యాఖ్యానించారు. చదవండి: 'ఆమెకు ఏమైనా జరిగితే సుప్రీంకోర్టు జడ్జిదే బాధ్యత'ఆర్ఎస్ఎస్తో సంబంధం లేదుతమ సంస్థతో మోహన్దాస్కు ఎటువంటి సంబంధం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రకటించింది. తమ సంస్థలో ఎలాంటి పదవిలో గానీ, బాధ్యతలో గానీ ఆయన లేరని దక్షిణ కేరళం ప్రాంత సహ కార్యవాహ కె.బి. శ్రీకుమార్ తెలిపారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలతో తమకు సంబంధం లేదన్నారు. ఇటువంటి అభిప్రాయాలను ఆర్ఎస్ఎస్ అత్యంత తీవ్రంగా ఖండింస్తుందని చెప్పారు. -
‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు
వడకంచెరి: కేరళలోని వడకంచెరికి చెందిన నీట్-యూజీ(NEET-UG) 2024 అభ్యర్థి అంజలి ఎస్ ప్రవేశ పరీక్షలో 640 మార్కులు సాధించినప్పటికీ, ప్రభుత్వ మెడికల్ సీటు పొందలేకపోయానని, ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీలో ఏటా రూ. 10 లక్షలు చెల్లించి చదువుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. పరీక్షలో జరిగిన అక్రమాల వల్లే తనకు ఈ దుస్థితి దాపురించిందని ఆమె వాపోయారు. కాగా ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అంజలి ఆరోపించారు.తాము ముందుగా అంచనా వేసిన ర్యాంకులు, లభ్యత ఉన్న సీట్ల ఆధారంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు ఖాయమని ఎంతో ధీమాగా ఉన్నామని, కానీ అనూహ్యంగా ప్రభుత్వ సీటు రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్య కోటాలో చేరాల్సి వచ్చిందని, దీనివల్ల తమ కుటుంబంపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వైఫల్యానికి కారణమైన బాధ్యులు స్పందించి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి శనివారం ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం పంపినట్లు అంజలి వెల్లడించారు. నీట్-2024 పరీక్షల వివాదాలు, గ్రేస్ మార్కుల కేటాయింపు వంటి అంశాలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలకు దారితీసిన సంగతి తెలిసిందే.ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్? -
కేరళలో బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
-
రాజేష్ మృతిపై సీఎం వీడీ సతీషన్ తీవ్ర దిగ్భ్రాంతి
తిరువనంతపురం : కేరళలోని కన్నూర్ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో రైతును కాపాడుతూ తిరువనంతపురానికి చెందిన 36 ఏళ్ల రెస్క్యూ వాలంటీర్ ఆర్.రాజేష్ వీరమరణం పొందారు. తాను కాపాడిన రైతు మునిగిపోతుండటం గమనించి, తన ఒంటిపై ఉన్న లైఫ్ జాకెట్ను తీసి అతనికి తొడిగి, తాను మాత్రం వరద ఉధృతికి ప్రాణాలు కోల్పోవడంపై కేరళ సీఎం వీడీ సతీషన్ విచారం వ్యక్తం చేశారు. ఈమేరకు రాజేష్ సహాసాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో రాజేష్ నిస్వార్థ గుణం, ఆయన చూపిన అసాధారణ హీరోయిజం కేరళ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. సమాజం ఆయనను ఎప్పటికీ మరువదు’అని భావోద్వేగంతో పోస్టు చేశారు. ఆగస్టు 1 కురిసిన భారీ వర్షాలకు కన్నూర్ జిల్లా చెరుపుళా పరిధిలోని కరియాంగోడ్ నది ఉప్పొంగింది. కొండచరియలు విరిగిపడ్డాయనే సమాచారంతో తన కాఫీ తోటను పరిశీలించేందుకు వెళ్లిన రైతు బెన్నీ (61) ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయారు. మీన్తుల్లి జలపాతం వద్ద రాపెల్లింగ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న రాజేష్, తన తోటి వాలంటీర్లు షిబిన్, జితిన్లతో కలిసి సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కరియాంగోడ్ నదిని ఈదుకుంటూ వెళ్లి రైతు బెన్నీని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.తిరుగు ప్రయాణంలో నది ఒడ్డుకు చేరుకునే క్రమంలో వృద్ధుడైన బెన్నీ నీటిలో మునిగిపోతూ కొట్టుమిట్టాడుతుండటాన్ని రాజేష్ గమనించారు. ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రాణాలకు రక్షణగా ఉన్న లైఫ్ జాకెట్ను విప్పి బెన్నీకి తగిలించారు. ఆ తర్వాత సేఫ్టీ రోప్ పట్టుకుని ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తుండగా, నది ఒడ్డున పట్టు తప్పి రాజేష్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. రెండు రోజుల తర్వాత రాజేష్ మృతదేహం లభ్యమైంది.విపత్తుల్లో ముందుండే హీరోరాజేష్ కేవలం ఈ ఒక్కసారే కాదు, కేరళను ముంచెత్తిన గత విపత్తుల్లోనూ వందలాది ప్రాణాలను కాపాడారు.2018 కేరళ మహా వరదలు, అలాగే 2024 వయనాడ్ కొండచరియలు విరిగిపడిన దారుణ ఉదంతాల్లో ఆయన రెస్క్యూ వాలంటీర్గా ముందుండి సేవలందించారు.ఆయన 'అడ్వెంచర్ డిజాస్టర్ సొసైటీ'లో సభ్యుడిగా ఉంటూ, ఇతరులకు వాటర్ సేఫ్టీ, రోప్ రెస్క్యూలపై శిక్షణ ఇచ్చే నిపుణుడు. రాజేష్ మృతిపై కేరళ ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వీడీ సతీషన్ మాట్లాడుతూ.. రాజేష్ అత్యున్నత త్యాగం చేశాడు. ఆయన కుటుంబానికి నా గాఢ సానుభూతి. రాజేష్ నిర్మించుకుంటున్న ఇంటిని ప్రభుత్వమే పూర్తి చేస్తుంది. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం" అని ముఖ్యమంత్రి ప్రకటించారు.Paying tributes to disaster response trainer R. Rajesh, who made the ultimate sacrifice by giving his life jacket to save another during flash floods in Cherupuzha. Met his grieving family to offer deepest condolences.The Govt will complete the construction of his unfinished… pic.twitter.com/6GsC9K9V1g— V D Satheesan (@vdsatheesan) August 5, 2026 ఆగస్టు 1 నుండి కేరళను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటివరకు వర్షాల కారణంగా కనీసం 20 మంది మరణించగా, నలుగురు గల్లంతయ్యారు. 12,000 మందికి పైగా ప్రజలను 300 సహాయక శిబిరాలకు తరలించారు. పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, కన్నూర్, వయనాడ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సుమారు 165 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. -
‘రక్త సంబంధం’.. ఇది సీరియల్ కాదు.. సినిమా కానే కాదు!
చెన్నై: తమిళనాడుకు చెందిన నలుగురు తోబుట్టువులు అనుకోని విషాదాల కారణంగా చిన్నతనంలోనే విడిపోయారు. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఒక పెళ్లి ఫొటో సాయంతో మళ్లీ ఒక్కటయ్యారు. కేరళలోని ఆశ్రయ్ చిల్డ్రన్స్ హోమ్లో కనిపించిన ఈ భావోద్వేగ ఉదంతం అందరినీ కంటతడి పెట్టించింది. తమిళనాడులోని కళ్లకురిచ్చికి చెందిన ఈ కుటుంబంలో తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు అనాథలయ్యారు. తండ్రి మద్యానికి బానిస కావడంతో పెద్ద కుమార్తె సరస్వతి (5), శరణ్య (4), కుమారులు సురేష్, ఉమేష్ రోడ్డుపాలయ్యారు.తండ్రి తన కుమార్తె శరణ్యను వేరే కుటుంబానికి విక్రయించి, మిగతా ముగ్గురు పిల్లలతో కేరళకు వలస వెళ్లాడు. 2002లో కన్నూరులో చిన్నారుల దుస్థితిని చూసిన కొల్లంనకు చెందిన అధికారి కలయపురమ్ జోస్, ఆయన భార్య మినీ వారిని చేరదీసి 'ఆశ్రయ్ చిల్డ్రన్స్ హోమ్'ను ఏర్పాటు చేసి పెంచారు. సరస్వతి సోషల్ వర్క్లో మాస్టర్స్ పూర్తి చేసి, రెండేళ్ల క్రితం కన్నూరుకు చెందిన నితిన్ను వివాహం చేసుకుంది. తమ్ముళ్లు సురేష్, ఉమేష్ ఐటీఐ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.మరోవైపు శరణ్య సేలంలో పెరిగి, ఎం.ఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా స్థిరపడి హైదరాబాద్కు చెందిన రఘురామ్ను వివాహం చేసుకుంది. తోబుట్టువుల కోసం వెదుకుతున్న తరుణంలో శరణ్యకు రెండేళ్ల క్రితం జరిగిన సరస్వతి వివాహ వార్త, ఫొటోలు దొరికాయి. ఆ ఫొటోలోని మహిళతో తనకు ఉన్న పోలికల ఆధారంగా ఆమె కేరళలోని ఆశ్రయ్ను సంప్రదించింది. చివరకు శరణ్య తన భర్త, పిల్లలతో హైదరాబాద్ నుంచి రాగా, సరస్వతి తన భర్తతో కన్నూరు నుంచి వచ్చి ఆశ్రయ్లో కలుసుకున్నారు. 26 ఏళ్ల తర్వాత నలుగురు తోబుట్టువులు ఒకరినొకరు హత్తుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసిన నిర్వాహకులు, స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.ఇది కూడా చదవండి: ‘బిగ్ బీ’ రికార్డు: 83 ఏళ్ల వయసులో 24 గంటల షిఫ్ట్! -
కేరళ వరదల్లో అమ్మ సాహసం!
బయట కుండపోత వర్షం. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో మృత్యువు ఆ ఇల్లాలి తలుపు తట్టింది. క్షణాల్లో ఇల్లు కూలిపోతోంది. ఆమె తల పగిలి రక్తం కారుతోంది. కానీ, ఆమెలో ఎక్కడ లేని బలం వచ్చింది. నొప్పినీ, భయాన్నీ పక్కన పెట్టి కాలంతో పరుగు తీసింది. కుప్పకూలుతున్న ఇంటి శిథిలాల నుంచి తన కుటుంబాన్ని ప్రాణాలతో బయటకు లాక్కొచ్చింది. కేరళలోని పయ్యన్నూరులో భయానక వరద విపత్తులో 54 ఏళ్ల ఇందూ దామోదరన్ చూపిన మాతృహృదయం ఇది.కేరళను గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉప్పొంగుతున్న నదులు. విరిగిపడుతున్న కొండచరియలు. అతలాకుతలమవుతున్న సామాన్య జీవితాలు. కానీ, ప్రకృతి సృష్టించిన ఈ మహా బీభత్సంలో ఒక సామాన్య మహిళ సృష్టించిన అద్భుతం ఇవాళ కేరళ వ్యాప్తంగా వైరల్గా నిలిచింది. కన్నూర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పయ్యన్నూర్ మున్సిపాలిటీలోని కేలోత్ గ్రామంలో నివసిస్తున్న ఇందూ దామోదరన్ అనే మహిళ ఒక తల్లిగా, ఇల్లాలుగా విపత్కర పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం ఐదుగురు ప్రాణాలను కాపాడింది. అది కేవలం సమయస్ఫూర్తి కాదు, మరణాన్ని సైతం ఎదిరించిన మాతృమూర్తి ధైర్యం.అర్ధరాత్రి ప్రళయం.. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేలోత్ గ్రామంలోని లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. ఆగస్టు 3 అర్ధరాత్రి దాటిన సమయం. ఇందూ దామోదరన్ తన పూర్వీకుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తోంది. ఆ సమయంలో భర్త దామోదరన్ ఏదో పని మీద వేరే ఊరిలో ఉన్నారు. బయట వర్షం బీభత్సంగా కురుస్తుండగా ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దంతో ఇంటి పైకప్పు భాగం కూలి ఇందూ తలపై పడింది.ఆ దెబ్బకు ఆమె తల పగిలి, రక్తం ధారగా కారడం ప్రారంభమైంది. తీవ్రమైన నొప్పితో కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి. సాధారణంగా ఏ మనిషైనా ఆ సమయంలో భయంతో కేకలు వేస్తూ పడిపోతారు. కానీ, ఇందూ చుట్టూ చూసింది. పక్కనే గాఢ నిద్రలో ఉన్న వృద్ధురాలైన తల్లి, సోదరి, 14 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల మేనల్లుడు ఉన్నారు. ఇంకా ముఖ్యం ఐదేళ్ల వయసున్న చిన్న మేనల్లుడు నిద్రపోతున్నాడు. తాను పడిపోతే వీరంతా ఈ శిథిలాల కింద సమాధి అయిపోతారని ఆమెకు అర్థమైంది. అంతే, తల నుంచి కారుతున్న నెత్తుటిని తుడుచుకునే తీరిక కూడా లేకుండా ఆమె కదిలింది.మృత్యుగృహం నుంచి సురక్షిత తీరానికి...నెత్తురు ఓడుతున్న శరీరంతోనే ఇందు ఒక్కొక్కరినీ నిద్ర లేపింది. ఇల్లు కూలిపోతోంది, వెంటనే బయటకు రండంటూ కేకలు వేసింది. ఆ సమయంలో బయట ఊరంతా వరద నీరు చేరడం, అర్ధరాత్రి గాఢాంధకారం కావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా తమ ఇళ్లను కాపాడుకునే కంగారులో ఉన్నారు.ఎవరి సహాయం కోసం ఎదురుచూడకుండా భయంతో వణికిపోతున్న చిన్నపిల్లాడు పార్థివ్ను, నడవలేని స్థితిలో ఉన్న తన తల్లిని చేతుల్లోకి తీసుకుని, కాంక్రీట్ ముక్కలు పడుతున్నా లెక్కచేయకుండా వాకిట్లోకి పరుగెత్తింది ఇందూ. ఆమె వెనుకే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ప్రాణభయంతో బయటకు వచ్చారు. వారు వాకిట్లోకి వచ్చి, అడుగు దూరంలో ఉన్న సురక్షితమైన తోటలోకి చేరుకున్నారో లేదో... పెద్ద శబ్దంతో ఆ ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధి. ఇందూ గనుక ఆ నెత్తురు చూసి భయపడి ఉంటే, ఆ కొన్ని సెకన్లు ఆలస్యమై ఉంటే... ఇవాళ ఆ కుటుంబం ప్రాణాలతో ఉండేది కాదు.మాతృత్వపు అసాధారణ శక్తిప్రకృతి విపత్తుల ముందు మనుషులు ఎంత బలహీనులో మనం చూస్తూనే ఉంటాం. కానీ, అదే ప్రకృతి విపత్తును ఒక స్త్రీ తన సంకల్పబలంతో ఎలా ఎదిరించిందో ఈ ఘటన నిరూపించింది. పక్కన భర్త లేకపోయినా, ఊరంతా వరద ముంచెత్తినా, తీవ్రమైన గాయాలతో ఒంటరిగా పోరాడి గెలిచింది.ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇందూను చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆ సమయంలో ఆమెకు కలిగిన శారీరక నొప్పి కంటే, తన కుటుంబం ఏమైపోతుందనే మానసిక ఆందోళనే ఆమెను నడిపించిందన్నారు. కేరళ వరదల్లో ఇందూ దామోదరన్ ఒక సాధారణ బాధితురాలిగా మిగిలిపోలేదు; విపత్తుల కంటే మనుషుల ఆత్మవిశ్వాసం, బంధాల మీద ఉండే ప్రేమ చాలా శక్తిమంతమైనవని నిరూపించింది. సెల్యూట్ ఇందూ దామోదరన్! -
కేరళలో కుండపోత.. ఎడ తెగని వానలు
-
Kerala: ఎడతెగని వర్ష బీభత్సం.. విద్యా సంస్థలకు సెలవు
తిరువనంతపురం: కేరళలో ఎడతెగని విధంగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానల కారణంగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం కేరళలోని మొత్తం 14 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. భారీ వర్షాల ధాటికి పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా కాసరగోడ్, కన్నూర్, వాయనాడ్, పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం తదితర జిల్లాల్లోని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగాలు సెలవు ప్రకటించాయి.అలాగే ఆలప్పుళ జిల్లాలోని చెంగన్నూర్, కుట్టనాడ్ తాలూకాలు, ఎర్నాకులం పరిధిలోని విద్యాసంస్థలను మూసివేశారు. ఈ సెలవు పాఠశాలలు, వృత్తి విద్యా సంస్థలు, అంగన్వాడీలు, మతపరమైన విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుందని కలెక్టర్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు భారీ వర్షాల కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గల్లంతు కాగా, 13 మంది గాయపడ్డారు. వరదలు, కొండచරلలు విరిగిపడటం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 27 ఇళ్లు పూర్తిగా, 196 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 209 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, 5,792 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిరాశ్రయులైన వారికి, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందిస్తుందని అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో వర్షాల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.ఇది కూడా చదవండి: మనిషి డీఎన్ఏలో అజ్ఞాత పూర్వీకుల ఆనవాళ్లు! -
కేరళలో వర్ష బీభత్సం
తిరువనంతపురం: కేరళలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్రనష్టం మిగిల్చాయి. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 8 మంది చనిపోగా మరో 8 మంది గల్లంతయ్యారు. కనీసం 13 మంది గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మొత్తం 27 నివాసాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 209 సహాయక శిబిరాల్లో వేల మంది ఆశ్రయం పొందుతున్నారని సీఎం సతీశన్ తెలిపారు. కర్ణాటకలో కుండపోత వానలు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొప్పాల్ జిల్లాలో కొండపక్కనున్న నివాసంపై మట్టి పెళ్లలు విరిగిపడి మూడేళ్ల చిన్నారి సహా ముగ్గురు చనిపోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శివమొగ్గ జిల్లా అగుంబెలో 24 గంటల వ్యవధిలో 197 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. కొడగు, ఉడుపి, చిక్కమగళూరు, సిర్సి, మంగళూరుల్లోనూ కుండపోతగా వాన కురిసింది. గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లోనూ ఆదివారం విస్తారంగా వర్షాలు ముంచెత్తాయి. -
బ్లాక్ డ్రెస్లో దివ్య పిళ్లై స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి!
ఇడుక్కి: కేరళలోని ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి కారణంగా పలుచోట్ల సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇడుక్కి జిల్లా వాగమండ్లో కొండచరియలు విరిగిపడి ఒక ఇంటిపై పడటంతో వైకోమ్కు చెందిన ప్రభాకరన్ నాయర్ మృతి చెందారు. అయితే ఆయన మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అదూర్మలలో మరో కొండచరియ విరిగిపడటంతో ఒక వ్యక్తి గల్లంతయ్యారు. కొచ్చి-ధనుష్కోడి జాతీయ రహదారిపై అడిమాలి సమీపంలోని మాచిప్లావు వద్ద కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Keralam: Heavy rainfall triggers widespread damage in Idukki district. One person was killed after a landslide struck a house at Vagamon in the district. The deceased has been identified as Prabhakaran Nair, a native of Vaikom. His body has not yet been recovered.A… pic.twitter.com/0TVGJSQjE8— ANI (@ANI) August 1, 2026మరోవైపు కొట్టాయం జిల్లా పయ్యనితోటంలో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మరణించగా, అతని తల్లి శిథిలాల కింద కూరుకుపోయారు. జోసెఫ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, అతని తల్లి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉప్పుతుర ప్రాంతంలో పుల్లకాయరు నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొక్కయార్ వంతెన మునిగిపోయింది. చుట్టుపక్కల ఆరు ఇళ్లు జలమయం కావడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఎరట్టుపేట, కాంజిరపల్లి, కూట్టిక్కల్, ఎరుమేలి ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. వందలాది నివాసాలు నీట మునిగాయి. ఎరట్టుపేటలో అర్ధరాత్రి ఒక్కసారిగా వరద నీరు పెరగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలోని చిన్న ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేశారు.ఇది కూడా చదవండి: కుల్గామ్ ఉగ్రదాడి: ఆస్పత్రిలో మరో కార్మికుడు మృతి -
శబరిమలలో భారీ వరదలు..
పతనంతిట్ట: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొండ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహాలు పంబా నదిలోకి చేరాయి. దీంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రాణి పట్టణంలో నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో వరద పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, శబరిమల యాత్రికులు, పంబా నది పరిసర ప్రాంతాల వారికి అధికారులు కీలక సూచనలు జారీ చేశారు.పతనంతిట్టలోని ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చిన ఆకస్మిక వరదలు పంబా నది ప్రవాహాన్ని మరింత ఉధృతం చేశాయి. సాధారణ స్థాయితో పోలిస్తే నీటి మట్టం వేగంగా పెరగడంతో నది పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు, అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కూడా అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. పంబా నది పరిసర ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నది తీరాలు, స్నాన ఘాట్ల వద్దకు వెళ్లే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో పంబా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉండటంతో భక్తులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ప్రయాణాలు కొనసాగించాలని అధికారులు తెలిపారు. నది ఒడ్డున ఫొటోలు తీసుకోవడం, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.#WATCH | Pathanamthitta, Keralam: Following extremely heavy rainfall, flash floods from the hilly regions of Pathanamthitta have caused the Pamba River to overflow, with water levels rising rapidly in Ranni town. Rescue operations by the administration and emergency teams are… https://t.co/ofHArZmlo2 pic.twitter.com/XsdaHedHdb— ANI (@ANI) August 1, 2026పంబా నది శబరిమల యాత్రలో కీలక ప్రాంతం కావడంతో ప్రస్తుత వరద పరిస్థితులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. భక్తుల రాకపోకలు, భద్రతా పరిస్థితులను బట్టి అవసరమైన చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇటీవల కాలంలో కేరళలో కొండ ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు కారణమవుతున్నాయి. కొండల నుంచి వేగంగా దిగివచ్చే నీరు నదుల ప్రవాహాన్ని ఒక్కసారిగా పెంచుతుండటంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రాణి ప్రాంతంలో పెరుగుతున్న నీటిమట్టం, పంబా నది ప్రవాహాన్ని అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజలు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. Ranni flooded.Pathanamthitta district seems to have been hit hard, receiving reports of flooding pic.twitter.com/hr4hM1ZMps— West Coast Weatherman (@RainTracker) August 1, 2026🚨Multiple flash flood reports, landslides, and ghat road blockages have been reported during the early morning hours across Central #Kerala interiors, especially in #Kottayam, #Pathanamthitta, and #Idukki districts.📸 from Mundakayam#StayAlert#KeralaRains #KeralaFloods2026 pic.twitter.com/5fWPqgPf2B— Jeev Dain Varughese (@jeev_dain) August 1, 2026 -
అధిక ప్రోటీన్ ఆహారంతో జస్ట్ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్ ఇదే..
బరువు తగ్గడంలో సత్వర ఫలితాలు కోసం క్రాష్ డైట్లు జోలికిపోకుడండా పలువురు క్రమశిక్షణతో కూడిన జీవినశైలితో అమాంతం స్మార్ట్గా మారి ఆశ్చర్యపరుస్తున్నారు. కొందరు స్ట్రిక్ట్ డైట్ల జోలికపోకుండా చేస్తే..కొందరు కఠినమైన డైట్లతో కడుపు నిండిన అనుభూతికి ప్రాధాన్యత ఇస్తూ కిలోల కొద్దీ బరువు తగ్గి చూపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వాడు ఈ వ్యాపారవేత్త. జస్ట్ నెల రోజుల్లోనే 22 కేజీల పైనే బరువు తగ్గడం విశేషం. ఆ వెయిట్లాస్ జర్నీలో హెల్ప్ అయిన ఆహార పదార్థాల గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఆయనే కేరళకు చెందిన వ్యాపారవేత్త డాక్టర్ షిబిన్ మాథ్యు. ఒకప్పుడు దాదాపు 110 కేజీల బరువు ఉండేవారు. కఠినమైన దినచర్య, పటిష్టమైన ఆహార ప్రణాళిక, జీవనశైలి మార్పులు చక్కటి పరివర్తనకు దారితీస్తాయని అన్నారు. క్రమశిక్షణ సవ్యంగా ఉంటే దాని ఫలితమే చెబుతుందని అంటున్నారు. సరైన ఆహార ప్రణాళిక, చక్కటి జీవనశైలి మార్పులు మంచి రూపుకి దారితీస్తుందని నమ్మకంగా చెప్పారు. తనకు బరువు తగ్గడంలో సహాయపడిన రోజువారి అధిక ప్రోటీన్ ఆహారం గురించి ఇలా చెప్పుకొచ్చారు. బరువు తగ్గడానికి రోజువారీ ఆహారంఆయన తన రోజును ఒక కప్పు కాఫీ, రెండు గుడ్లు, మిరప నూనెతో కలిపిన రెండు స్కూప్ల అధిక ప్రోటీన్ పెరుగుతో ప్రారంభిస్తారు. ఈ భోజనం కడుపు నిండిన అనుభూతిని కలిగించి, జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది. అధిక ప్రోటీన్ ఆహారాలు, కెఫిన్, కారమైన కొవ్వులను మిళితం చేస్తుంది. ఈ అల్పాహారం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి, ఉదయం పూట వచ్చే నీరసాన్ని నివారిస్తుంది.మధ్యాహ్న భోజనానికి, మాథ్యూ ఎక్కువగా ఒక చికెన్ బ్రెస్ట్తో పాటు ఒక గుడ్డు, ఒక స్కూప్ అధిక ప్రోటీన్ ఉన్న పెరుగు తీసుకునేవాడు. సలాడ్ల కోసం, అతను తాజా దోసకాయలను ఎంచుకున్నాడు. ఈ కలయిక కడుపు నిండుగా ఉంచడానికి అవసరమైన లీన్ ప్రోటీన్ను అందిస్తుంది.బరువు తగ్గడానికి సహాయపడటానికి, ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక నీటి శాతం ఉన్న తక్కువ కేలరీల కూరగాయలు కూడా ఉంటాయి. శాకాహారులైతే గుడ్లకు బదులుగా అర కప్పు గట్టిగా, ముక్కలుగా చేసి, పెనంపై వేయించిన టోఫును, చికెన్కు బదులుగా మసాలాలతో కాల్చిన టెంపే లేదా సీటాన్ను తీసుకోవడం మంచిదని సూచించారు.మధ్యాహ్న భోజనం తర్వాత అతను సాధారణంగా తక్కువ మోతాదులో ఆహారం తీసుకునేవాడినని అన్నారు. రాత్రి పడుకునే ముందు, అతను ఒక కప్పు కాఫీ.ఒక ఆపిల్కు మాత్రమే పరిమితమైనట్లు తెలిపారు.తన కఠినమైన డైట్ దినచర్య గురించి వివరిస్తూ అతను ఇలా అన్నాడు, కఠినమైన ఆహార లోటు, అధిక ప్రోటీన్ తోపాటు సాకులకు తావివక్కపోతే..కచ్చితంగా బరువు తగ్గుతారు. నిర్దిష్ట లక్ష్యాల కోసం తీవ్రమైన ఆహార కోత తప్పనిసరని అంటున్నారు.అలాగే ఏ డైట్ రొటీన్ను గుడ్డిగా అనుసరించవద్దని, తమ శరీరం చెప్పేది వినాలని హెచ్చిరిస్తున్నారు. అంతేగాదు ఇలాంటి తీవ్రమైన ఆహార నియమాన్ని ప్రారంభించే ముందు నిపుణులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు కూడా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Shibin Mathew (@mathewdotin) (చదవండి: Ravi Kishan Weight Loss: ‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్లాస్ జర్నీ..! ఓమాడ్తో ఏకంగా 18 కేజీలు..) -
2 + 2 + 2 + 2
ఇదో అపురూపమైన వివాహం...ఊహూ.. హంగు ఆర్భాటాల కోసమో...చవులూరించే విందు, వీనుల విందైన సంగీతం..ఆకాశమంత పందిరి.. భూదేవంత లోగిళ్లేమీ లేవు. అయినా సరే.. ఇది అత్యంత అరుదైన, అపురూపమైన పెళ్లే:ఎందుకంటారా... చదివేయండి!!!కేరళలోని చెంగనశెరిలో జరిగింది ఇది. పెళ్లికొడుకులు కవలలు. పెళ్లి కూతుళ్లు కూడా! ఆ.. ఇందులో విశేషమేముంది.. అప్పుడప్పుడు.. అక్కడక్కడ జరిగేవే కదా అంటున్నారా? నిజమే కానీ.. పురోహితులు.... వారి అసిస్టెంట్లు కూడా కవలలైతే అది వెరీ వెరీ స్పెషల్ కాకుండా పోతుందా? ఇప్పుడు ఎవరు? ఎక్కడ? ఏమిటి? అన్న వివరాలకు వద్దాం.. ముందే చెప్పినట్టు వివాహం జరిగింది గురువారం చెంగనశెరి మెట్రోపాలిటన్ చర్చ్లో. అనిల్ కే.థామస్, మ్యాగీ మేరీ థామస్ చేయి పట్టుకుని నడుస్తూంటే... అతడి కవల సోదరుడు నిఖిల్ కే.థామస్... మ్యాగీ కవల సోదరి మారియా మేరీ థామస్ చేయి పట్టుకుని ఆల్టర్వైపు కదిలాడు. ఈ రెండు జంటలకు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిపించింది ఫాదర్ ఆంటో పెజుమ్కట్టిల్, ఫాదర్ అజో పెజుం కట్టిల్! వీరిద్దరూ కవలలని వేరుగా చెప్పనవసరం లేదనుకుంటా. ఈ కవలల వ్యవహారం ఇక్కడితో అయిపోలేదు. వివాహ ఏర్పాట్లలో పురోహితులకు సహాయంగా నిలిచిన జెరోన్ జేమ్స్, జొహాన్ జేమ్స్లు కూడా కవలలే కావడం విశేషం. అబ్బా... ఎంత యాదృచ్ఛికంగా జరిగాయి ఇవన్నీ అనుకుంటూంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే టోమిచాన్, మేరికుట్టీల సంతానమైన మ్యాగీ, మారియాల ఐడియా ఇది. కుంజుమోన్ థామస్, జమోల్ల కవల సంతానమైన అఖిల్, నిఖిల్లను పెళ్లాడాలన్న ఆలోచన మొదలుకొని వివాహాన్ని కవల పురోహితులతోనే జరిపించుకోవాలని కూడా వీరు ప్లాన్ చేశారు. ఇందుకోసం వారు కవలలు ఎక్కువగా కలిసే కోథనల్లూర్ చర్చి సాయం తీసుకున్నారు. ‘‘చుట్టూ కవలల సమక్షంలో పెళ్లి చేసుకోవాలన్నది మా చిన్నప్పటి కల. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆశించారు. జీసస్ క్రైస్ట్ అది అయ్యేలా చేశారు’’ అని మ్యాగీ, మారియాలు ముసి ముసి నవ్వులతో చెప్పుకొచ్చారు. ఇలాంటి వివాహం జరిపించడం తాము చిరకాలం గుర్తుపెట్టుకుంటామని పురోహితులు తమ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘మేము కూడా కలిసి పుట్టాం. పెరిగాం. అలాగే కలిసి ప్రీస్ట్హుడ్లోకి ప్రవేశించాం’’ అని వివరించారు. అఖిల్, నిఖిల్లు ఇద్దరూ మర్చెంట్ నేవీ అధికారులు కాగా.. మ్యాగీ, మారియాలు ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. పెళ్లికి హాజరైన అతిథులు ఒక అపురూపమైన ఘట్టానికి సాక్షులుగా నిలిచిపోతే... పిల్లల చిరకాల స్వప్నం ఈడేరినందుకు వధూ వరుల తల్లిదండ్రులు కూడా హాయిగా నిట్టూర్చి ఉంటారు! –సాక్షి, నేషనల్ డెస్క్ -
అమ్మ కోసం ఆవిష్కరణ..సాక్షాత్తు సీఎం సైతం ఫిదా!
అమ్మ రోజువారీ పనుల్లో కష్టాన్ని చూసి తను సాయం చేయాలనుకోలేదు. కానీ టెక్నాలజీ సాయంతో ఆమెకు సహకరించే ఆవిష్కరణలు చేశాడు. అందుకోసం పెద్ద పెద్ధ ఖరీదైన పరికరాలను కూడా ఉపయోగించలేదు. చుట్టూ ఉండే వస్తువులు, పనికిరాని కార్డుబోర్డులాంటి వాటితోనే అద్భుత ఆవిష్కరణలు చేసి అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు శెభాష్ అని ప్రశంసలందుకుంటున్నాడు. అతడే కేరళకు చెందిన 12 ఏళ్ల లెవిన్ పౌలోస్. రోజువారీ సమస్యలను పరిష్కరించడానికి రూపొందించిన అతడి చేసిన ఆవిష్కరణలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వాటలో కొన్ని వాక్యూమ్ క్లీనర్, ఒక బటన్ నొక్కగానే కర్టెన్లను తెరిచి మూసే మోటార్తో నడిచే ఆటోమేటెడ్ కర్టెన్ సిస్టమ్, అలాగే స్టవ్ నుంచి దూరంగా వెళ్లిన ఆటోమేటిగ్గా గరిట పట్టుకుని తిప్పే ఆటోమేటిక్ ఫుడ్ స్టిరర్ తదితరాలు. ఆచరణాత్మకమైన రూపకల్పన, రోజువారీ పనుల్లో ఉపయోగపడే అతడి ఆవిష్కరణలు అందర్నీ అబ్బురపరుస్తున్నాయి. వీటన్నింటి తోపాటు తాజాగా పారేసిన కార్డ్బోర్డ్తో నిర్మించిన ఒక హ్యూమనాయిడ్ రోబోట్, అతడి క్రియేటివిటీకి, ఇంజనీరింగ్ నైపుణ్యలను నిదర్శనం. పూర్వినయోగ వస్తువులు, ప్రాథమిక ఎలక్ట్రానిక్ భాగాలతో ఆకర్షణీయంగా రూపొందించడం విశేషం. అతడు రూపొందించిన ఈ రోబోట్ తన తల్లికి రోజువారీ పనులలో ఉపయోగపడుతుంది. ఇవననీ తన తల్లి పడే కష్టాన్ని చూసి చేసిన అద్భుతమైన ఆవిష్కరణలు. పొద్దున లేస్తే ఇంటి పనులతో, వంటతో అమ్మ పడుతున్న అలసటను తగ్గించాలనే ఉద్దేశంతో చేసినవే. అంతేగాదు అతడి ఆవిష్కరణల కారణంగా సాక్షాత్తు తన రాష్ట్ర సీఎంనే కలిసే అవకాశం దక్కించుకున్నాడు. ఆయన సైతం అతడి ప్రతిభకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు. లెనిన్ కథ యువతను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం వంటి (STEM) రంగాలను ఆచరణాత్మక అభ్యాసం ద్వారా అన్వేషించేలా చేస్తున్నాడు. అంతేగాదు లెవిన్ ఆవిష్కరణలు విద్యావేత్తలు, టెక్నాలజీ ఔత్సాహికులు, సోషల్ మీడియా వినియోగాదారులందరినీ ఆకట్టుకుంది. పైగా ఉత్సుకత, పట్టుదల సమయస్ఫూర్తి సాధారణ గృహోపకరణాలను అద్భుతమైన ఆవిష్కరణలుగా ఎలా మారుస్తుందో చూపించింది. View this post on Instagram A post shared by levin paulose (@ppv931680) (చదవండి: నందన్-రోహిణి నీలేకనిల ప్రేమ కథ: అలా మొదలైంది..!) -
విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు సరఫరా బంద్!
తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగానికి కీలకమైన రఫ్ స్టోన్, ఎం-శాండ్, మెటల్ జెల్లీ వంటి నిర్మాణ సామగ్రిని పొరుగు రాష్ట్రాలకు తరలించడంపై తమిళనాడు ప్రభుత్వం మూడు నెలలు తాత్కాలిక నిషేధం విధించింది. రాష్ట్రంలో పెరుగుతున్న నిర్మాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, తమిళనాడు నిర్ణయం దక్షిణ రాష్ట్రాల మధ్య మౌలిక వసతుల అభివృద్ధి, వనరుల వినియోగం, ప్రాంతీయ ఆర్థిక సమతుల్యతపై ప్రభావం చూపే నిర్ణయంగా మారింది.అయితే, ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, రహదారులు, గృహ నిర్మాణాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల కారణంగా తమిళనాడులో నిర్మాణ సామగ్రికి డిమాండ్ భారీగా పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పనిచేస్తున్న క్వారీల నుంచి లభిస్తున్న రాళ్లు, నిర్మాణ అగ్రిగేట్లు స్థానిక అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయని పేర్కొంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి తరలిపోవడం వల్ల రాష్ట్రంలో సరఫరా తగ్గి, ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడింది.ఈ నిషేధం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వెళ్లే నిర్మాణ సామగ్రిపై వర్తించనుంది. అయితే.. పుదుచ్చేరి, కారైకాల్కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. నిషేధాన్ని అమలు చేసేందుకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అక్రమ మైనింగ్, ఖనిజ రవాణా చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ముఖ్యంగా కేరళలో నాణ్యమైన రాయి అగ్రిగేట్ల లభ్యత పరిమితంగా ఉండటంతో తమిళనాడులోని తిరునెల్వేలి, తెంకాసి, కన్యాకుమారి ప్రాంతాల నుంచి వచ్చే నిర్మాణ సామగ్రిపై అనేక ప్రాజెక్టులు ఆధారపడుతున్నాయి. జాతీయ రహదారులు, విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం వంటి కీలక ప్రాజెక్టుల పనులకు సరఫరా అంతరాయం కలగవచ్చని కేరళ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కోరింది.ఎందుకు ఈ నిర్ణయం?కాగా, తమిళనాడులో ప్రస్తుతం భారీ స్థాయిలో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కొత్త రహదారులు, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలు, గృహ నిర్మాణాల కోసం రాళ్లు, ఇసుక, ఇతర అగ్రిగేట్ల అవసరం పెరిగింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నిర్మాణ సామగ్రిలో కొంత భాగం పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో స్థానిక మార్కెట్లో సరఫరా తగ్గుతోందని ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల ధరలు పెరిగి నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయని వాదిస్తోంది.తమిళనాడు నిర్ణయం సహజ వనరుల నిర్వహణ, రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను ముందుకు తెస్తోంది. ఒక రాష్ట్రంలోని ఖనిజ వనరులు మరో రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలు-ప్రాంతీయ అభివృద్ధి అవసరాల మధ్య సమతుల్యతపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ అంశం కేవలం నిర్మాణ సామగ్రి రవాణా సమస్యగానే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల మధ్య వనరుల వినియోగం, మౌలిక వసతుల అభివృద్ధి సమన్వయానికి సంబంధించిన అంశంగా మారింది. మూడు నెలల నిషేధ కాలంలో నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా పరిస్థితులు, ప్రాజెక్టులపై ప్రభావాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాత నిషేధాన్ని కొనసాగించాలా, సడలింపులు ఇవ్వాలా అన్నదానిపై నిర్ణయం తీసుకోవచ్చు. -
ఆకాశమే హద్దుగా స్కై ఫార్మింగ్!
తక్కువ భూమి, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్లు, ముఖ్యంగా అడవి పందుల దాడులు... చిన్న, సన్నకారు రైతులను నిరంతరం వేధించే ప్రధాన సమస్యల్లో ఇవి కొన్ని. వీటన్నింటికీ ఒకే ఒక్క సృజనాత్మక పరిష్కారం చూపారు రత్నం అనే మహిళా రైతు. కేరళలోని త్రిస్సూర్ జిల్లా ముల్లాస్సేరికి చెందిన ఆమె క్యాన్సర్ మహమ్మారినే కాదు సాగులో సవాళ్లనూ జయించారు. అడవిపందులు తదితర వ్యవసాయంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ‘స్కై ఫార్మింగ్‘ విధానాన్ని రూపొందించారు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల దృష్టిని ఆమె కృషి ఆకర్షించింది. నేడు చిన్న రైతులకు, ఇంటిపంటలు, పెరటి/మిద్దె తోటలు పెంచే వారికి గొప్ప వరంగా మారింది.కొబ్బరి ఆకులతో కుండీలురత్నం ప్లాస్టిక్ గ్రో బ్యాగ్లకు స్వస్తి చెప్పి పూర్తిగా కుళ్లి మట్టిలో కలిసిపోయే పర్యావరణహిత కుండీలను తయారు చేశారు. స్థానికంగా విరివిగా దొరికే కొబ్బరి ఆకులతో కుండీలను అల్లారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ కుండీలకు లోపలి వైపు నాన్–వోవెన్ ఫ్యాబ్రిక్ను పరచి, దృఢత్వం కోసం స్వల్పంగా సిమెంట్తో లేపనం చేస్తారు. ఈ కుండీలు దాదాపు 5 సంవత్సరాల కాలం మన్నికగా ఉంటాయని ఆమె నిరూపించారు. సాధారణంగా 2–3 గ్రో బ్యాగ్లు పెట్టే చిన్న స్థలంలో కొబ్బరి ఆకుల కుండీలను నిలువుగా దృఢమైన స్తంభాలకు వేలాడదీయటం ద్వారా ఏకంగా 12 కుండీలను అమర్చవచ్చని రత్నం చెప్పారు.అడవి పందుల నుంచి రక్షణ నేలపైన కొన్ని అడుగుల ఎత్తులో వేలాడే కుండీల్లో పంటలు పండిస్తున్నారు. దీని వల్ల అడవి పందులు, ఇతర జంతువుల దాడి నుంచి పంటకు 100% రక్షణ లభిస్తోంది. అంతేకాదు, నేల ద్వారా వ్యాపించే అనేక తెగుళ్లు, శిలీంధ్ర వ్యాధులు రాకుండా పంటలు సురక్షితంగా పెరుగుతున్నాయి. రత్నం అభివృద్ధి చేసిన వినూత్న సాగు పద్ధతిలో సొంత ఆర్గానిక్ కంపోస్టు వాడతారు. కోళ్ల పెంట, మేకల ఎరువు, కొబ్బరి పొట్టు, ఎండిన/పచ్చి ఆకులు, ఆవు మూత్రంతో ఇంట్లోనే 45 రోజుల్లో అత్యంత పోషకాలతో కూడిన కంపోస్ట్ తయారు చేస్తారు. ఈ కంపోస్టును కుండీల్లో నింపి, అందులో ఆకుకూరలు, బెండ, వంగ, మిరప, సొర వంటి కూరగాయలతో పాటు కంద, ఔషధ గుణాలున్న అరుదైన బూడిద గుమ్మడి వంటి పంటలను రత్నం సాగు చేస్తున్నారు. వివిధ రకాల పంటలను ఏడాదంతా సాగు చేస్తున్నారు. నిరంతరం దిగుబడి పొందుతూ అదనపు ఆదాయంతో పాటు కుటుంబ పోషకాహార భద్రతను సాధిస్తున్నారు. రైతులకు మార్గదర్శనంరత్నం కేవలం తన పనులకే పరిమితం కాకుండా, ఊళ్లోని ఇతర రైతులకు, పెరటి/మిద్దె తోటల పెంపకం దారులకు తోడ్పాటునందిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, నారు అందిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్థలా భావం ఉన్న పట్టణ పరిసర ప్రాంత రైతులకు, టెర్రస్ గార్డెన్ ప్రియులకు, చిన్న రైతులకు ఆమె ఆవిష్కరించిన ‘స్కై ఫార్మింగ్’ ఒక విప్లవాత్మకమైన మార్గదర్శిగా మారిందని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కేపీ స్మిత ప్రశంసించారు. -
‘‘ఆందోళనకు దిగిన విద్యార్థులను కాల్చిపడేయాలని ఆదేశించేవాడిని’’
తిరువనంతపురం: నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనను తాను నియంత్రించే బాధ్యతలో ఉండి ఉంటే విద్యార్థి ఆందోళనకారులపై కాల్పులు జరపాలని భద్రతా బలగాలకు ఆదేశించేవాడినని ఓ ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యాత చెప్పడంతో కేరళలో తీవ్ర వివాదం చెలరేగింది.పత్రిక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలో టీజీ మోహన్దాస్ మాట్లాడుతూ.. ముందుగా జంతర్ మంతర్ చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో కర్ఫ్యూ విధించేవాడినని చెప్పారు. ఆ తర్వాత ఆందోళనకారులను 3 సార్లు వెళ్లిపోవాలని హెచ్చరించేవాడినని, అయినా వినకపోతే వారిపై కాల్పులు జరపాలని ఆదేశించేవాడినని అన్నారు."ప్రజలు చెదిరిపోయి పరుగులు తీస్తారు. కొందరు చనిపోతారు. కొందరు చనిపోరు. ఇంకొందరికి తీవ్రగాయాలు అవుతాయి. 4 గంటల్లో పరిస్థితి ప్రశాంతంగా మారుతుంది. మృతదేహాలను తీసుకుని ఆసుపత్రికి తరలిస్తాం" అని మోహన్దాస్ అన్నారు.మహిళా ఆందోళనకారులపై కూడా ఆయన అవమానకర వ్యాఖ్యలు చేశారు. వారిని "అత్యాచారాలను ఇష్టపడే మహిళలు" అంటూ వ్యాఖ్యానించారు. "సామూహిక అత్యాచారాలు జరుగుతాయి. దేవుడి దయతో ఎలాంటి ఫిర్యాదులు రావు. ఎందుకంటే అత్యాచారాలను ఇష్టపడే వారు ఉన్నారు. ముఖ్యంగా వామపక్షాలు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారు" అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మహిళా ఆందోళనకారులపై హింసను ప్రోత్సహిస్తున్నారని పలువురు మోహన్దాస్పై నెటిజన్లు ఆరోపణలు చేశారు.టీజీ మోహన్దాస్ ఎవరు?టీజీ మోహన్దాస్ కేరళకు చెందిన రచయిత, కాలమిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి. ఇంజనీర్, న్యాయవాదిగా శిక్షణ పొందిన ఆయన పాత్రికేయుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, సామాజిక విమర్శకుడిగానూ పని చేశారు.గతంలో బీజేపీ మేధావుల విభాగం రాష్ట్ర కన్వీనర్గా పని చేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ విచార కేంద్రంలో కూడా నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. 2012లో ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక కేసరిలో బీజేపీ, సీపీఐ(ఎం) మధ్య రాజకీయ సహకారం సాధ్యాసాధ్యాలపై వ్యాసం రాశారు. ఆ వ్యాసం రెండు వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.పోలీసులకు ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదుసీపీఐ అనుబంధ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) సోమవారం కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్కు ఫిర్యాదు చేసింది. మోహన్దాస్ వ్యాఖ్యలు హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది.శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరపాలని బహిరంగంగా చెప్పడం రాజకీయ అభిప్రాయ వ్యక్తీకరణ కాదని, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసే హక్కుపై నేరుగా దాడి చేసినట్టేనని విద్యార్థి సంఘం ఆరోపించింది.డిజిటల్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వ్యాఖ్యలు అడ్డుకోకపోతే హింసను రెచ్చగొట్టే అవకాశం ఉందని, ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయవచ్చని, చట్టవ్యతిరేక పరిస్థితులకు దారితీయవచ్చని కూడా పేర్కొంది. విద్యార్థి ఆందోళనకారులను "కాల్చి చంపాలని" మోహన్దాస్ పిలుపునిచ్చారని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. ఆయనపై తగిన చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని పోలీసులను కోరింది. -
ఇప్పుడు కేరళలో ఆందోళనలు.. సినీనటుల మద్దతు
తిరువనంతపురం: కేరళ సచివాలయం ఎదుట నిరవధిక ఆందోళన చేస్తున్న కేరళ పీఎస్సీ ర్యాంక్ హోల్డర్లకు పలువురు మలయాళ సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ఈ అంశంపై సినీ ప్రముఖులు మౌనం పాటిస్తున్నారంటూ విమర్శలు పెరగడంతో వారు స్పందించారు. నీట్ పరీక్ష వివాదం, ఇతర జాతీయ అంశాలపై దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలకు మద్దతు తెలిపిన పలువురు ప్రముఖులు కేరళలో పీఎస్సీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనపై ఎందుకు మాట్లాడటం లేదని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు రావడం తర్వాత ఈ మద్దతు వ్యక్తమైంది.నటులు రంజిని హరిదాస్, టోవినో థామస్, నస్లెన్, చందు సలీంకుమార్, లియోనా లిషోయ్, దీపా థామస్ ఆందోళనకారులకు సంఘీభావం ప్రకటించారు. వీడియోలు షేర్ చేస్తూ అభ్యర్థుల డిమాండ్లను సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావించారు.మొదట స్పందించిన వారిలో టెలివిజన్ వ్యాఖ్యాత, నటి రంజిని హరిదాస్ ఒకరు. ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న తర్వాత పీఎస్సీ ర్యాంక్ హోల్డర్ల ఆందోళనపై ఎందుకు మాట్లాడలేదని తనకు అనేక సందేశాలు వచ్చాయని ఆమె చెప్పారు. ఈ అంశంపై చాలా మంది తన దృష్టికి తీసుకువచ్చే వరకు పూర్తి అవగాహన లేదని అంగీకరించారు. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునేంత సమాచారం ఆన్లైన్లో అందుబాటులో లేదని, బహిరంగంగా తన అభిప్రాయం చెప్పే ముందు దీనిని అధ్యయనం చేయాలనుకున్నానని తెలిపారు. ఆందోళనకారులు లేదా వారి ప్రతినిధులు తనను సంప్రదించాలని, వారి సమస్యలను నేరుగా వినాలని ఆమె కోరారు.ఇదే సమయంలో నటుడు చందు సలీంకుమార్ స్పందిస్తూ.. జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందిన అంశాలపై మాత్రమే మాట్లాడి, ఇంటి దగ్గరే ఉన్న అంతే ముఖ్యమైన సమస్యలపై మౌనం పాటించడం సరికాదని కొందరు ప్రముఖులను విమర్శించారు."నీట్ ప్రశ్నపత్రం లీక్ పై స్పందించడం ముఖ్యమే. అలాగే పీఎస్సీలో పరిపాలనా లోపాలపై స్పందించడం కూడా ముఖ్యమే. ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని, అవసరమైన చోట మన గొంతు వినిపిద్దాం. భారత యువత, వారి కృషి సరిహద్దులతో సంబంధం లేకుండా ఉండడం ముఖ్యమే. ఆలోచించండి" అని ఆయన రాశారు. -
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మిల్మా పాలకమండలి రద్దు
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ పాలకమండలిని రద్దు చేసింది.శబరిమల ఆలయానికి సరఫరా చేసిన మిల్మా నెయ్యిని దారి మళ్లించి, తిరిగి విక్రయించడం, మహారాష్ట్ర నుంచి పాలు రవాణా చేసేందుకు టెండర్లుఆహ్వానించకుండానే అధిక ధరకు మిల్క్ ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించడం వంటి తీవ్రమైన ఆర్థిక అవకతవకలు బయటపడటంతో పాలక మండలిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చైర్ పర్సన్ మణి విశ్వనాథన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) మద్దతుగల పాలకమండలిపై పాడి అభివృద్ధి శాఖ డైరెక్టర్ శాలిని గోపినాథ్ ఈ చర్య తీసుకున్నారు. బోర్డు రద్దు అనంతరం, పాడి అభివృద్ధి శాఖ జాయింట్ డైరెక్టర్ (ప్రణాళిక) సినీ ఉన్నికృష్ణన్ను నిర్వాహకురాలిగా నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, చట్టం ప్రకారం ఆరు నెలల్లోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి, ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలు స్వీకరిస్తుంది.శబరిమల నెయ్యి స్కామ్ట్రావెన్ కోర్ దేవస్థానం, మిల్మా మధ్య కుదిరిన అధికారిక ఒప్పందం ప్రకారం, శబరిమల మరియు పంపాలకు 1.7 లక్షల లీటర్ల నెయ్యిని సరఫరా చేయాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో మిల్మా నెయ్యి లీటరుకు రూ.720 లకు అమ్ముడవుతుండగా , దానిని దేవస్థానం బోర్డు అంగీకరించిన ధర లీటరుకు రూ.540 కే సరఫరా చేశారు. కాగా విచారణలో డెయిరీ నుండి పంపిన అత్యుత్తమ నాణ్యత గల మిల్మా నెయ్యిని శబరిమలకు చేరకముందే దారి మళ్లించి, ప్రైవేట్ ఏజెన్సీలకు మరియు బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు విచారణలో తేలింది.దానికి బదులుగా , తమిళనాడు నుండి తెప్పించిన నాసిరకం నెయ్యిని శబరిమలకు సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లీటరుకు కేవలం ₹350 విలువ కలిగిన సుమారు 70,000 లీటర్ల ఈ నాసిరకం నెయ్యిని ఆలయానికి సరఫరా చేసి, భక్తులను మోసం చేసినట్లు పాడి అభివృద్ధి శాఖ కనుగొంది.టెండర్ లేకుండానే పాల ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించారు.మిల్మాలో పాల కొరతను తీర్చడానికి మహారాష్ట్ర నుంచి కేరళకు పాలు రవాణా చేసే కాంట్రాక్టుల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది.ప్రభుత్వ టెండర్లను ఆహ్వానించకుండా నిర్దేశిత టెండర్ ప్రక్రియను పాటించకుండా , అధిక ధరలకు ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లకు కాంట్రాక్టును అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకార ఆడిట్లో , ఈ ఒక్క అవకతవక వల్లే మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్కు రూ. 93.40 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లిందని తేలింది.కందల సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు, మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ మాజీ ఛైర్మన్ అయిన ఎన్. భాసురంగన్ ఏర్పాటు చేసిన పరిపాలనా కమిటీ హయాంలో వివాదాస్పద ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించారు. కందల సహకార బ్యాంకు ఆర్థిక మోసం కేసులో భాసురంగన్ను ఆ తర్వాత ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఆ సమయంలో కేఆర్ మోహనన్ పిళ్లై, విఎస్ పద్మకుమార్ ఆ కమిటీలోని ఇతర సభ్యులుగా ఉన్నారు. -
శబరిమల భక్తులకు గుడ్న్యూస్.. రైల్వేలైన్ పనులు ప్రారంభం
తిరువనంతపురం: సంవత్సరాల తరబడి నెలకొన్న అనిశ్చితి, జాప్యం తర్వాత, కేరళ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించడంతో అంగమాలి - శబరి రైల్వే ప్రాజెక్టుకు పెద్ద ఊపు వచ్చింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు కోసం భారతీయ రైల్వే ₹505 కోట్లు కేటాయించింది.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు కేరళ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించిందని, శబరి రైల్వే లైన్ నిర్మాణానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని మంత్రి తెలిపారు. జూలై 22న లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ ప్రకటన చేశారు. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు.అంగమాలి-శబరి రైల్వే ప్రాజెక్ట్ మరియు ఆలస్యానికి గల కారణాలు1997-98లో ఎరుమేలి మీదుగా వెళ్లే 111 కిలోమీటర్ల అంగమాలి-శబరి రైల్వే లైన్ను మంజూరు చేశారు. 7 కిలోమీటర్ల అంగమాలి-కాలడి సెక్షన్ నిర్మాణం , 10 కిలోమీటర్ల కాలడి-పెరుంబవూర్ సెక్షన్పై ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుండి తగినంత మద్దతు లేకపోవడం, భూసేకరణ మరియు రైల్వే అలైన్మెంట్కు సంబంధించిన నిరసనలు , న్యాయపరమైన వివాదాల కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది.సవరించిన ప్రాజెక్టు వ్యయం ₹3,801 కోట్లకు పెరిగిందని, ఈ సవరించిన అంచనా ఆమోదం , ప్రాజెక్టు వ్యయ పంపిణీ కోసం కేరళ ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించినట్లు మంత్రి తెలిపారు.2024 ఆగస్టులో , కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు షరతులతో కూడిన ఆమోదం ఇచ్చింది. అయితే, ప్రాజెక్టు వ్యయంలో 50% భరించడానికి రాష్ట్రం బేషరతుగా అంగీకరించాలని రైల్వే మంత్రిత్వ శాఖ కోరింది. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రానికి ఉన్న 50% వాటాను ఉపయోగించి అవసరమైన భూమిని సేకరించాలని రైల్వే మంత్రి ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించారు.ప్రాజెక్టుకు అవసరమైన 302 హెక్టార్ల భూమిలో , ఇప్పటివరకు కేవలం 25 హెక్టార్లను మాత్రమే సేకరించారు. మిగిలిన 279 హెక్టార్లను ఇంకా సేకరించాల్సి ఉంది.అంగమలీ-శబరి రైల్వే ప్రాజెక్ట్ 14 ప్రతిపాదిత స్టేషన్లు అంగమలీ, కాలడి, పెరుంబవూరు, ఊడక్కలి, కొత్తమంగళం, మువాట్టుపుజా, వజకులం, తొడుపుజా, కరీంకున్నం, రామాపురం, భరణంగానం, చెమ్మలమట్టం, కంజిరపల్లి , ఎరుమేలి. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత శబరిమల యాత్రికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చడంతో పాటు, మధ్య కేరళ వ్యాప్తంగా అనుసంధానాన్ని, అభివృద్ధిని గణనీయంగా మెరుగుపరుస్తుందని అంతా భావిస్తున్నారు. -
మిల్మా తిరువనంతపురం యూనియన్ రద్దు
తిరువనంతపురం: శబరిమల ఆలయానికి సరఫరా చేసిన మిల్మా నెయ్యిని దారి మళ్లించి, తిరిగి విక్రయించడం, మహారాష్ట్ర నుంచి పాలు రవాణా చేసేందుకు టెండర్లు ఆహ్వానించకుండానే అధిక ధరకు మిల్క్ ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించడం వంటి తీవ్రమైన ఆర్థిక అవకతవకలు బయటపడటంతో , మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ పాలకమండలిని రద్దు చేశారు.చైర్ పర్సన్ మణి విశ్వనాథ్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) మద్దతుగల పాలకమండలిపై పాడి అభివృద్ధి శాఖ డైరెక్టర్ శాలిని గోపినాథ్ ఈ చర్య తీసుకున్నారు. బోర్డు రద్దు అనంతరం, పాడి అభివృద్ధి శాఖ జాయింట్ డైరెక్టర్ (ప్రణాళిక) సినీ ఉన్నికృష్ణన్ను నిర్వాహకురాలిగా నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, చట్టం ప్రకారం ఆరు నెలల్లోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి, ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలు స్వీకరిస్తుంది.పాడి అభివృద్ధి శాఖ సంయుక్త సంచాలకులు సమర్పించిన విచారణ నివేదిక ప్రకారం, గత నాలుగేళ్లుగా ప్రాంతీయ యూనియన్ పాలకవర్గం పాల్పడిన అవినీతి, ఆర్థిక అవకతవకల స్థాయి చాలా విస్తృతమైనదిగా గుర్తించారు. పాలకవర్గంలోని కొందరు సభ్యులు అక్రమ ప్రయోజనాలు పొందేందుకు అధికారులను ప్రభావితం చేశారని దర్యాప్తులో తేలింది. నిర్ణయాలను తారుమారు చేయడాన్ని లేదా కీలకమైన సాక్ష్యాలను నాశనం చేయడాన్ని నివారించడానికి, బోర్డును తక్షణమే రద్దు చేసి పరిపాలనా నియంత్రణలోకి తీసుకున్నారు.ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) -మిల్మా మధ్య కుదిరిన అధికారిక ఒప్పందం ప్రకారం, శబరిమల మరియు పంపాలకు 1.7 లక్షల లీటర్ల నెయ్యిని సరఫరా చేయాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో మిల్మా నెయ్యి లీటరుకు రూ. 720 చొప్పున అమ్ముడవుతుండగా , దానిని దేవస్వం బోర్డుకు అంగీకరించిన ధర అయిన లీటరుకు ₹540 కే సరఫరా చేశారు.డెయిరీ నుండి పంపిన అత్యుత్తమ నాణ్యత గల మిల్మా నెయ్యిని శబరిమలకు చేరకముందే దారి మళ్లించి, ప్రైవేట్ ఏజెన్సీలకు మరియు బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు విచారణలో తేలింది.దానికి బదులుగా , తమిళనాడు నుండి తెప్పించిన నాసిరకం నెయ్యిని శబరిమలకు సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లీటరుకు కేవలం ₹350 విలువ కలిగిన సుమారు 70,000 లీటర్ల ఈ నాసిరకం నెయ్యిని ఆలయానికి సరఫరా చేసి, భక్తులను మోసం చేసినట్లు పాడి అభివృద్ధి శాఖ కనుగొంది.టెండర్ లేకుండానే పాల ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించారు. మిల్మాలో పాల కొరతను తీర్చడానికి మహారాష్ట్ర నుంచి కేరళకు పాలు రవాణా చేసే కాంట్రాక్టుల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది.ప్రభుత్వ టెండర్లను ఆహ్వానించకుండా , నిర్దేశిత టెండర్ ప్రక్రియను పాటించకుండా , అధిక ధరలకు ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లకు కాంట్రాక్టును అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకార ఆడిట్లో , ఈ ఒక్క అవకతవక వల్లే మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్కు రూ. 93.40 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లిందని తేలింది.కందల సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు, మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ మాజీ ఛైర్మన్ అయిన ఎన్. భాసురంగన్ ఏర్పాటు చేసిన పరిపాలనా కమిటీ హయాంలో వివాదాస్పద ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించారు. కందల సహకార బ్యాంకు ఆర్థిక మోసం కేసులో భాసురంగన్ను ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఆ సమయంలో కేఆర్ మోహనన్ పిళ్లై, విఎస్ పద్మకుమార్ ఆ కమిటీలోని ఇతర సభ్యులుగా ఉన్నారు. -
శబరిమల ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్
పతనంతిట్ట: తిరువనంతపురంలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో , ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డ్ కందరారు రాజీవర్ కుమారుడైన బ్రహ్మదత్తన్ శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన తంత్రిగా నియమించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని బోర్డు సోమవారం కేరళ హైకోర్టుకు తెలియజేస్తుంది. బ్రహ్మదాతన్ చింగం 1 (ఆగస్టు 16) నాడు బాధ్యతలు స్వీకరించనున్నారు.బ్రహ్మదతన్ తాంత్రిక కర్మలలో అవసరమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడని నిర్ధారించిన అక్కిరామోన్ కాళిదాస్ భట్టతిరిపాడ్ , తరాయిల్ కుజిక్కట్టు అగ్నిశర్మన్ వాసుదేవన్ భట్టతిరి మరియు కడియకోల్ సుబ్రహ్మణ్యన్ నంబూతిరిలతో కూడిన ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ సిఫార్సును అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది.బ్రహ్మదాతన్ ఒక తాంత్రిక సంస్థలో అధ్యయనంతో సహా తంత్రంలో అధికారిక శిక్షణ పొందారని, అలాగే శబరిమలలో తన తండ్రికి సహాయకుడిగా కూడా పనిచేశారని కమిటీ దేవస్థానం బోర్డు అధ్యక్షుడికి తెలియజేసింది. కమిటీ అంచనా ఆధారంగా , బోర్డు నేటి సమావేశంలో తన తుది నిర్ణయం తీసుకుంది.ఇంతకుముందు , కందరారు రాజీవర్ తన స్థానంలో తన కుమారుడు బ్రహ్మదాతన్ను ప్రధాన పూజారిగా నియమించాలని కోరుతూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు లేఖ రాశారు. బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్కు రాసిన తన లేఖలో , రాజీవర్ అనారోగ్యాన్ని కారణంగా చూపి పదవి నుంచి తప్పుకుంటున్నారు.శబరిమలలో తాంత్రిక హక్కులను కలిగి ఉన్న తళమోన్ మఠం కుటుంబంలో , కందరారు మోహనారు మరియు కందరారు రాజీవర్ ప్రధాన పురోహితులుగా పనిచేశారు. గతంలో , జస్టిస్ పరిపూర్ణన్ కమిషన్ సిఫార్సుల మేరకు , మోహనారును ఆ పదవి నుండి తొలగించి , అతని కుమారుడు మహేష్ మోహనారును ప్రధాన పురోహితుడిగా నియమించారు. అయితే , శబరిమలకు సంబంధించిన అన్ని నిర్ణయాలకు కేరళ హైకోర్టు ఆమోదం అవసరం.2018 శబరిమల దేవప్రశ్నంలో సిఫార్సు చేయబడిన పరిహార కర్మలు, ప్రాయశ్చిత్త పూజలను నిర్వహించాలని బోర్డు సమావేశం నిర్ణయించింది. ఆలయ పవిత్ర కొలను (తీర్థకుళం) దిశ వాస్తు శాస్త్రానికి అనుగుణంగా లేదని దేవప్రశ్నం ఎత్తి చూపింది. దేవప్రశ్నంలోని పరిశీలనల ఆధారంగా , నివేదికలో పేర్కొన్న సుమారు 40 పరిహార కర్మలు మరియు ప్రాయశ్చిత్త పూజలను నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.ఈ పరిహార చర్యలను అమలు చేసే బాధ్యతను శబరిమల కార్యనిర్వహణాధికారి పి.ఎస్. శాంతకుమారు అప్పగించగా , ఇందుకోసం బోర్డు రూ. 5 లక్షలు మంజూరు చేసింది. కందరారు రాజీవరు, కందరారు మహేష్ మోహనారు, మరియు ప్రఖ్యాత జ్యోతిష్కుడు , తాంత్రిక పండితుడు కాళిదాసన్ భట్టతిరిపాద్లతో సంప్రదించిన అనంతరం క్రతువులు, సంబంధిత కార్యక్రమాలు నిర్వహించబడతాయి. -
76 ఏళ్ల వయసులో జిప్లైన్పై రయ్యి!
మళప్పురం: బామ్మ వయసు 76 ఏళ్లే కానీ... మనసు మాత్రం పదహారుకు మించదు. అందుకేనేమో... కొడుకు, కోడళ్లు.. మనుమలు, మనుమరాండ్రు అందరితో విహారయాత్రకు వెళ్లి... జిప్లైన్ సవారీ చేస్తానని పట్టుపట్టింది. కుటుంబ సభ్యులు వద్దని వారించినా... ప్రమాదమని హెచ్చరించినా అస్సలు పట్టించుకోలేదు. ‘‘అదేంటో (జిప్లైన్ సవారీ) నాకు తెలియదు. కానీ చూడగానే సవారీ చేయాలని అనిపించింది. ఇంట్లోవాళ్లందరూ పడవలో తిరుగుతూండగా చూశా జిప్లైన్ను. అక్కడి వెళ్లా. అక్కడున్న వ్యక్తి ఏం ఫర్వాలేదు. నేను తీసుకెళతా. భయపడొద్దు అన్నాడు. సరే అని సవారీ మొదలుపెట్టా. భయమేమీ కాలేదు. సగం దూరం వెళ్లిన తరువాత... నా చేయి వదిలేయమని ఆ వ్యక్తికి చెప్పాను. నేనే స్వయంగా తాడు పట్టుకుని సవారీ మొత్తం పూర్తి చేశా’’అని బోసినవ్వుతో తన అనుభవాన్ని వెల్లడించింది. సవారీ మొత్తం పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందంటూనే... ఎప్పుడు ఇలాంటి సాహసాలు ఎదురపడ్డా వదిలేది లేదని ధీమాగా చెప్పింది. ఊరూ.. పేరు చెప్పనే లేదు కదూ... బామ్మది కేరళలోని మళప్పురం వద్ద ఉన్న తనూర్. పేరు లక్ష్మి. పొన్నాని నదిపై జిప్లైన్పై బామ్మ సవారీ ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్! -
బీజేపీ జెండాలతో ధర్మేంద్ర రాజీనామా డిమాండ్
-
కూటమిలో తిరుగుబాటు.. యంగెస్ట్ చైర్పర్సన్కు బిగ్ షాక్!
దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్పర్సన్ దియా బినుకి(21) బిగ్ షాక్ తగిలింది. ప్రతిపక్ష ఎల్డీఎఫ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో.. కేవలం ఏడు నెలలకే ఆమె పదవికి ముగింపు పడింది. అయితే ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ సభ్యుల క్రాస్ ఓటింగ్ కారణంగానే ఆమె కుర్చీని వీడాల్సి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేరళ కొట్టాయం జిల్లా పాలా మున్సిపాలిటీలో 26 మంది సభ్యులున్నారు. మున్సిపల్ కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 17 మంది ఓటు వేశారు. దీంతో అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు రావడంతో తీర్మానం ఆమోదం పొందింది. ఈ పరిణామం అధికార యూడీఎఫ్కు భారీ ఎదురుదెబ్బగా మారింది.కాంగ్రెస్ తిరుగుబాటుతోనే.. పాలా మున్సిపాలిటీలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్కు చెందిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ విప్ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం దియా ఓటమికి కారణమైంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు బిజు మాథ్యూస్, టోనీ థైపరంబిల్, లిస్సీకుట్టి మాథ్యూ, రాజిత ప్రకాశ్లు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. డిప్యూటీ చైర్పర్సన్ మాయా రాహుల్ కూడా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. తమకు పార్టీ విప్ అందలేదని తిరుగుబాటు కౌన్సిలర్లు చెబుతూ.. స్థానిక ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.ఎవరీ దియా బిను పులిక్కకండం?21 ఏళ్ల దియా బిను పులిక్కకండం దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్పర్సన్గా రికార్డు సృష్టించారు. చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఎకనామిక్స్ చదివిన ఆమె.. ఉన్నత చదువులకు సిద్ధమవుతున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం తన తండ్రి బిను పులిక్కకండం, మేనమామ బిజు పులిక్కకండంతో కలిసి స్వతంత్ర వర్గంగా ఏర్పడ్డారు. ఈ మూడు సభ్యుల బ్లాక్కు యూడీఎఫ్ మద్దతు ఇవ్వడంతో గత డిసెంబర్లో దియా పాలా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.యూడీఎఫ్కు అధికారం తెచ్చిన కుటుంబ బ్లాక్పాలా మున్సిపాలిటీలో సుదీర్ఘకాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న కేరళ కాంగ్రెస్(ఎం)కు వ్యతిరేకంగా బిను పులిక్కకండం రాజకీయంగా ఎదిగారు. స్వతంత్ర వర్గం కీలకంగా మారడంతో యూడీఎఫ్కు మున్సిపల్ పీఠం దక్కింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్, పులిక్కకండం కుటుంబం మధ్య విభేదాలు పెరిగాయి. పలు పాలనా నిర్ణయాలు, రాజకీయ అంశాలపై ఇరు వర్గాల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.వివాదాల తర్వాత అవిశ్వాస తీర్మానండీవైఎఫ్ఐ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం వంటి అంశాలపై కాంగ్రెస్, దియా వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల కాంగ్రెస్ కౌన్సిలర్ బిజు మాథ్యూస్పై దియా ఫిర్యాదు చేయడం కూడా వివాదానికి దారితీసింది. తన కార్యాలయం నుంచి ఖరీదైన వాచ్, కొన్ని అధికారిక ఫైళ్లు కనిపించకుండా పోయాయని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బిజు మాథ్యూస్ ఖండించారు."ప్రజాస్వామ్య తీర్పును గౌరవిస్తున్నా"పదవి కోల్పోయిన అనంతరం దియా బిను స్పందించారు. ప్రజాస్వామ్య తీర్పును గౌరవిస్తున్నానని తెలిపారు. తనపై అవినీతి, నిధుల దుర్వినియోగం, లంచాలు, బంధుప్రీతి లేదా చట్ట ఉల్లంఘన వంటి ఎలాంటి నిరూపిత ఆరోపణలు లేవని చెప్పారు. "నా పదవీకాలంలో పారదర్శకత, చట్టబద్ధత, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాను. పదవులు తాత్కాలికం.. విలువలు శాశ్వతం" అని దియా పేర్కొన్నారు.పాలా మున్సిపాలిటీ భవిష్యత్పై ఉత్కంఠదియా తొలగింపుతో పాలా మున్సిపాలిటీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో తదుపరి పాలనపై ఉత్కంఠ నెలకొంది. అవిశ్వాస తీర్మానంతో యూడీఎఫ్ పాలన ముగియగా.. ఎల్డీఎఫ్ మద్దతుతో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. -
సిక్కిం సొరంగ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి
నామ్చి: సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మిస్తున్న ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం కూలిన దుర్ఘటనలో కేరళలోని కోట్టాయం జిల్లాకు చెందిన జియాలజిస్ట్ అనీష్ మోహన్ గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. సమర్దుంగ్ ప్రాంతంలోని సొరంగంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. సొరంగంలో చిక్కుకున్న వారిని, గల్లంతైన అనీష్ మోహన్ను వెలికితీసేందుకు ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. #WATCH | Gangtok, Sikkim: Rescue operations are underway in Sikkim's Namchi district after a tunnel collapsed, trapping at least 12 workers. More details awaited. (Source: Sikkim government) pic.twitter.com/DTWs7KLtDa— ANI (@ANI) July 20, 2026సహాయక చర్యలను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్), సిక్కిం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్హెచ్పిసి అధికారులు సంయుక్తంగా ముమ్మరం చేశారు. సవాళ్లతో కూడిన వాతావరణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల కుటుంబాలకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తమాంగ్ సానుభూతి తెలిపారు. సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
జంట హత్యల కేసులో మరణశిక్ష
పాలక్కాడ్: కేరళలో గత ఏడాది సంచలనం సృష్టించిన నెన్మర జంట హత్యల కేసు నిందితుడికి మరణశిక్ష పడింది. పాలక్కాడ్ అదనపు సెషన్స్ జడ్జి కెన్నెత్ జార్జ్ సోమవారం ఈ మేరకు తీర్పు ప్రకటించారు. జంట హత్యలను అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన న్యాయమూర్తి 61 ఏళ్ల నిందితుడు చెన్తామర రూ.20 లక్షల జరిమానా కూడా కట్టాలని ఆదేశించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1), సెక్షన్ 126 (2)ల కింద ఈ శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. గత ఏడది జనవరి 27న చెన్తామర తన పొరుగింటి సుధాకరన్తోపాటు తల్లి లక్ష్మిని హత్య చేశారు. చెన్తామర ఒకే కుటుంబంలోని వారిని హత్య చేసినందున ఈ కేసును అరుదైనదిగా భావిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. తన దాంపత్య సమస్యలన్నింటికీ కారణమని ఆరోపిస్తూ చెన్తామర పొరుగింటి సుధాకరన్ భార్య సజితను 2019లో హత్య చేశాడు. ఈ కేసులో డబుల్ జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే గత ఏడాది జనవరిలో బెయిల్పై విడుదలైన సందర్భంగా మరోసారి ఆ ఇంటిపై దాడి చేసి సుధాకరన్తోపాటు అతడి తల్లిని చంపేశాడు. ఈ ఘటన కాస్తా నెన్మర జంట హత్యల కేసుగా ఖ్యాతి చెందింది. పోలీసులు చాలా వేగంగా నిందితుడిని అరెస్ట్ చేయగలిగారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం సుమారు 81 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అలాగే దాదాపు 28 వస్తువులను పరిశీలించింది. సోమవారం ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి కెన్నెత్ జార్జ్ చెన్తామరకు మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. బాధితుడి పెద్ద కుమార్తెకు ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఆ ఇంటికెళ్లం నెన్మర జంట హత్యల కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును బాధితుడు సుధాకరన్ కుమార్తెలు అతుల్య, అఖిల స్వాగతించారు. నిందితుడికి తగిన శిక్ష పడటంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు వెలువడిన తరువాత వారిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ తల్లిదండ్రులతోపాటు నానమ్మను కూడా కోల్పోయిన ఆ ఇంటికి మళ్లీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘‘నాన్న, మిగిలిన వారందరి జ్ఞాపకా>లున్నాయి అక్కడ. మళ్లీ అక్కడికి వెళ్లలేము. వెళితే ఆ జ్ఞాపకాలు చుట్టుముడతాయి.’’అని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ బంధువుల ఇంట్లోనే ఉంటున్నారు. తీర్పు వెలువడిన తరువాత కూడా చెన్తామర ముఖంలో ఎలాంటి పశ్చాతాపమూ కనిపించలేదని అతుల్య వ్యాఖ్యానించగా న్యాయప్రక్రియ పూర్తయ్యేంతవరకూ భయం తమను వెంటాడుతూనే ఉంటుందని అఖిల ఆందోళన వ్యక్తం చేసింది. -
‘రేర్ ఆఫ్ ది రేరెస్ట్’.. నెన్మారా కేసులో సంచలన తీర్పు
కేరళలో సంచలనం సృష్టించిన నెన్మారా డబుల్ మర్డర్ కేసులో సోమవారం కీలక తీర్పు వెలువడింది. తల్లీకొడుకులను దారుణంగా హత్య చేసిన కేసులో 61 ఏళ్ల నిందితుడు చెంతమరాకు కోర్టు మరణశిక్ష విధించింది. అంతకు ముందు అదే కుటుంబంలోని వ్యక్తిని హత్య చేసిన చెంతమరా.. బెయిల్పై బయటకు వచ్చి జంట హత్యలకు పాల్పడడం గమనార్హం. దీంతో ఈ కేసు అత్యంత అరుదైన కేసుల (రేర్ ఆఫ్ ది రేరెస్ట్) పరిధిలోకి వస్తుందని భావించిన న్యాయస్థానం కఠిన శిక్షను ఖరారు చేసింది.పాలక్కాడ్ జిల్లా నెన్మారా పరిధిలోని పొతుండి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2025 జనవరి 27న సుధాకరన్ (55), ఆయన తల్లి లక్ష్మి (75)పై నిందితుడు చెంతమరా (Chenthamara) దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. నిందితుడిని దోషిగా తేల్చింది.భార్య దూరం కావడంపై అనుమానంతో.. చెంతమరా నేర చరిత్ర మొదలైంది 2019 ఆగస్టు 31న. ఆ రోజు అతను తన పొరుగింటి మహిళ సజిత (35)ను హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. తన భార్య, కుమార్తె తనను విడిచిపెట్టి వెళ్లడానికి సజిత కుటుంబం చేసిన చేతబడే కారణమని చెంతమరా అనుమానించాడు. ఈ అనుమానంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడు. బెయిల్పై బయటకు వచ్చాక ఘాతుకంసుధాకరన్ భార్య సజిత హత్య కేసులో అరెస్టైన చెంతమరా.. బెయిల్పై బయటకు వచ్చాడు. సరాసరి సజిత ఇంటికి వెళ్లి.. ఆమె భర్త సుధాకరన్, తల్లి లక్ష్మిలను హత్య చేశాడు. నేర తీవ్రత, హత్య చేసిన తీరు, బాధిత కుటుంబంపై పడిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ కేసును అత్యంత అరుదైన నేరంగా పరిగణించింది. సాధారణంగా జీవిత ఖైదు విధించే పరిస్థితుల్లో కాకుండా.. అరుదైన సందర్భాల్లో మాత్రమే విధించే మరణశిక్షను పాలక్కాడ్ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు–IV అదనపు సెషన్స్ జడ్జి కెన్నెత్ జార్జ్ (Kenneth George) ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు.తీర్పుతో ముగిసిపోలేదా?నెన్మారా జంట హత్యల కేసు కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా కోర్టు తీర్పుతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా నిందితుడికి అప్పీల్ అవకాశాలు ఉండనున్నాయి. -
శబరిమల వెళ్లే భక్తులకు ఐఎండీ కీలక సూచన
తిరువనంతపురం: కేరళ శబరిమల భక్తులకు వాతావరణ శాఖ కీలక సూచన జారీ చేసింది. ఈ జూలై 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.దీంతో అక్కడికి వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని రెయిన్ కోట్, గొడుగులు తమ వెంట తీసుకెళ్లాలని సూచించింది. గతంలో నాలుగు జిల్లాలకు జారీ చేసిన హెచ్చరికను ఈ రోజు (శనివారం) ఏడు జిల్లాలకు పెంచి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రానున్న 24 గంటల వ్యవధిలో 64.5 మిల్లీమీటర్ల నుండి 115.5 మిల్లీమీటర్లు వరకు భారీ వర్షపాతం కురుస్తుందని హెచ్చరిక జారీ చేసింది. పతనంతిట్ట , కొట్టాయం , ఇడుక్కి, మలప్పురం , కోజికోడ్ , కన్నూర్ , కాసరగోడ్ జిల్లాలకు ఇదివరకే ఎల్లో అలర్డ్ జారీ చేయగా తాజాగా మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ కాసరగోడ్లలో ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.నైరుతి రుతపవనాలు బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం మీదుగా, ఉత్తర తమిళనాడు,దక్షిణ అంతర్గత కర్ణాటక ,ఉత్తర కేరళ వరకు విస్తరిస్తాయని అల్పపీడన ప్రాంతం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
శబరిమల సన్నిధానంలో కొత్త తీర్థకుళం..! కానీ ఆ పేరు వద్దు..
శబరిమల సన్నిధానంలో ప్రస్తుతం ఉన్న భస్మకుళం వాస్తు శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా లేదని ఇటీవల జరిగిన ఒక అంచనాలో తేలింది. దీని ఫలితంగా , ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సన్నిధానంలో కొత్త తీర్థకుళం (పవిత్ర కొలను) నిర్మించాలని యోచిస్తోంది.2014 దేవప్రశ్నం కొత్త ఆలయ చెరువు తవ్వకాన్ని సిఫార్సు చేసింది. కానీ దానికి "భస్మకుళం" అని పేరు పెట్టకూడదని పేర్కొంది. ఈ సిఫార్సును అనుసరించి , ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రతిపాదిత చెరువుకు "తీర్థకుళం" అని పేరు పెట్టాలని నిర్ణయించింది.ప్రతిపాదిత చెరువును లార్జ్ నడపండల్ బరి గెస్ట్ హౌస్ మధ్య , కొబ్బరి నిల్వ యార్డులో భాగంగా ఉన్న ప్రాంతంలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు బోర్డు ఆరన్ముళ వాస్తు విద్యా గురుకులాన్ని కన్సల్టెంట్గా నియమించింది.వాస్తు శాస్త్రం ప్రకారం, ఆలయ చెరువు ఆలయానికి ఈశాన్య దిశలో ఉండాలి. అయితే, ప్రస్తుతం ఉన్న భస్మకుళం ఆలయం వెనుక భాగంలో ఉంది. అంతేకాకుండా , సన్నిధానం నుంచి వచ్చే మురుగునీరు భస్మకులం సమీపంలో ప్రవహించడం వల్ల , కలుషితమైన నీరు చెరువులోకి చేరుతున్నట్లు కూడా గుర్తించారు. అలాగే గతంలో సన్నిధానంలో నిర్వహించిన దేవప్రశ్నం (దేవాలయ జ్యోతిష్య అంచనా) కూడా భస్మకులం ఉన్న ప్రదేశం అనువైనది కాదని సూచించింది.వాస్తవానికి, భస్మకులం ఆలయానికి వాయువ్య దిశలో ఉండేది. కారణాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా సన్నిధానం విస్తరణలో భాగంగా దానిని మూసివేసి, చివరికి పూడ్చివేశారు. తదనంతరం, దాని ప్రస్తుత ప్రదేశంలో కొత్త భస్మకులాన్ని నిర్మించారు.2018 దేవప్రశ్న ప్రకారం, అయ్యప్ప స్వామి అసలైన భస్మకుళాన్ని దాని అసలు ప్రదేశంలో పునరుద్ధరించాలని కోరుకున్నట్లు సమాచారం.కాగా, అధ్యక్షుడు పి.ఎస్. ప్రశాంత్ నేతృత్వంలోని గత ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు హయాంలో , కొబ్బరి నిల్వ యార్డు సమీపంలో ఒక కొత్త భస్మకుళం నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. ప్రాయోజకుల నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. అయితే , ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ స్పెషల్ కమిషనర్ కేరళ హైకోర్టుకు నివేదిక సమర్పించడంతో నిర్మాణం నిలిచిపోయింది. ఆ తర్వాత ఎటువంటి పనులు చేపట్టలేదు.ప్రస్తుత అధ్యక్షుడు కె. జయకుమార్ నేతృత్వంలోని కొత్త బోర్డు , ఆ స్థలంలో కొత్త భస్మకుళం బదులుగా తీర్థకుళం నిర్మించాలని ఇప్పుడు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో ముందుకు సాగడానికి దేవస్వం బోర్డు కేరళ హైకోర్టు నుంచి కూడా అనుమతి కోరుతోంది.(చదవండి: శబరిమలలో ఏఐ సాంకేతికత.. భక్తుల మిస్సింగ్కి చెక్) -
విజయ్కు త్రిష.. నాకేమో నవ్వు!
సాక్షి సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష కృష్ణన్ బంధంపై తరచూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. తన తాజా చిత్రం 'విజిటర్' ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన ధ్యాన్.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకను పరోక్షంగా ప్రస్తావిస్తూ వేసిన సరదా పంచ్లు ప్రేక్షకులను నవ్వించాయి. అయితే ఈ వ్యాఖ్యలు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ ఈవెంట్లో తన సహనటి నవ్యా నాయర్ను ఉద్దేశించి ధ్యాన్ మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం. నవ్యాకు పెళ్లై, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినా నేను ఒకరోజు కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. నువ్వు తెల్లచీర కట్టుకుని ముందు వరుసలో కూర్చొని, కళ్లలో నీళ్లతో నన్ను చూస్తూ ఉండాలి" అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో సభలో నవ్వులు పూశాయి.Trisha emotions were on high during Vijay oath ceremony. An emotional moment ❤️ pic.twitter.com/GrJcW88bwg— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 10, 2026ఆ తర్వాత మైక్ అందుకున్న నవ్యా నాయర్ కూడా అదే స్థాయిలో స్పందించింది. "నువ్వు సీఎం అయితే.. నువ్వు చెప్పినట్టే తెల్లచీరకు ఆకుపచ్చ అంచు, డైమండ్ నెక్లెస్ వేసుకుని ముందు వరుసలో కూర్చుంటా. కళ్లలో ఆనందబాష్పాలతో నీకు జైకొడతా. కానీ ముందు వరుసలో నాకు సీటు మాత్రం రిజర్వ్ చేయాలి" అంటూ చమత్కరించింది. దీంతో సభలో మరోసారి నవ్వుల వెల్లువ ఎగిసింది.ఇదంతా సరదా సంభాషణలా అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తప్పు బడుతున్నారు. ఈ వ్యాఖ్యలను విజయ్ ప్రమాణ స్వీకార వేడుకతో పోలుస్తున్నారు. వాళ్లిద్దరిపైనా మండిపడుతున్నారు. The day I take the oath as CM... I think Navya will be there in the front row wearing a saree...!!- Dhyan Sreenivasan 😂 pic.twitter.com/UT5GvyK8Fq— Trollywood 𝕏 (@TrollywoodX) July 16, 2026 తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు త్రిష.. ఆయన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభతో కలిసి ముందు వరుసలో కూర్చోవడం, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురికావడం అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ ఘటననే ధ్యాన్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ప్రస్తావించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ కార్యక్రమంలో ధ్యాన్ మరో సరదా వ్యాఖ్య కూడా చేశాడు. విజయ్ ముఖ్యమంత్రి అయినట్లే.. తానూ రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అవుతానని జోక్ చేశాడు. అలాగే తన స్నేహితుడు, నటుడు అజు వర్గీస్ను ఈ సంభాషణలోకి లాగుతూ.. తనకి గవర్నర్ పదవి బాగుంటుందని నవ్వించాడు. వెంటనే అజు వర్గీస్ మీ అమ్మగారికి రాష్ట్రపతి పదవి దక్కుతుందని జోక్ చేశాడు.అయితే ఈ ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందని అనుకున్నాడో ఏమో.. అజు వర్గీస్ వేదిక మీదకు వచ్చి "విజయ్ సార్, నా ఫ్రెండ్ కొంచెం పిచ్చోడు.. దయచేసి క్షమించండి" అంటూ వ్యాఖ్యానించాడు. ఆ మాటతో అక్కుడున్నవాళ్లంతా కడుపుబ్బా నవ్వుకున్నారు.ఎవరీ ధ్యాన్-నవ్యా?ధ్యాన్ శ్రీనివాసన్(Dhyan Sreenivasan) మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన శ్రీనివాసన్ కుమారుడు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన వినీత్ శ్రీనివాసన్కు సోదరుడు. 2013లో వచ్చిన తీరా సినిమాతో నటుడిగా పరిచయమైన ధ్యాన్, 2013లో 'తీరా' చిత్రంతో నటుడిగా పరిచయమైన ధ్యాన్ శ్రీనివాసన్.. 'ఆది కాప్యారే కూటమణి', 'కుంజిరామాయణం', 'గూడలోచన', 'వర్షంగళ్క్కు శేషం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక.. నవ్యా నాయర్ మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి. 'నందనం', 'ఇష్టం', 'కళ్యాణరామన్', 'పందిప్పాడ' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె, మలయాళంతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్ 2017లో అర్పితా సెబాస్టియన్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్యా నాయర్ 2010లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త సంతోష్ మీనన్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. -
కుమారుడి సర్ప్రైజ్ గిఫ్ట్..! కన్నీటి సంద్రంలో తండ్రి
తలిదండ్రులు తమ పిల్లల చదవుల కోసం, వారి ఉన్నతి కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమ పడతారు. ఆ బిడ్డ ప్రయోజకుడై వాళ్ల కష్టాన్ని గుర్తించి..కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వగలిగితే..ఆ పేరెంట్స్కి మించిన అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు. అలాంటి ఆనందాన్నే తిరిగి ఇచ్చాడు కేరళకు దీప్ నీలమ్. అంతేగాదు కుమారుడి ఊహించని చర్యకు ఆ తండ్రి కళ్లలలో నీళ్లు తిరిగాయ్.అసలేం జరిగిందంటే..కేరళకు దీప్ నీలిమ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో నెటిజన్లకు తెగ ఆకట్టుకుంది. ఆ వీడియోలో తనను ఎప్పటికీ వీడిపోని జ్ఞాపకాలతో మొదలవుతుంది. అతన పాఠశాలలో చదువుతున్నప్పుడు తన తండ్రి తాను ఎప్పటికీ ఎస్యూవీని కొనని అమ్మతో చెప్పడం విన్నానని చెప్పుకొచ్చాడు.ఎందుకంటే తన చదువుకి పెట్టుబడి కోసం తక్కువ ఖరీదైన కారుతో సరిపెట్టుకున్నట్లు తెలిపాడు. అయితే తాను కచ్చితంగా ఆయన పదవీవిరమణ సమయానికి తన డ్రీమ్ వాహనాన్ని కొంటానని తండ్రికి వాగ్దానం చేసినట్లు చెప్పుకొచ్చాడు నీలిమ్. ఆరోజు నుంచే తన తండ్రి కోరికను ఎలాగైన నెరవేర్చాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడట. అయితే అనుకోకుండా తన జీవితం కాస్త ముందుగానే ఆ అవకాశం ఇచ్చిందని చెప్పాడు. తాను ఐఐఎం కోజికోడ్ నుంచి పట్టభద్రుడైన కేవలం ఆరు నెలలకే, తన చిన్ననాటి వాగ్దానం నిజం చేసుకోగలిగానని ఆనందంగా చెప్పాడు. ఎందుకంటే తాను కేపీఎంజీలో జాబ్ సంపాదించడంతో అది సులభమైందని అన్నాడు. అందుకే తన తండ్రి కోరికను నెరవేర్చిన క్షణం చిరస్మరణీయం ఉండేలా టెస్ట్ డ్రైవ్ చేద్దామనే నెపంతో ఆయనను ఒక కార్ షోరూమ్కు తీసుకువెళ్లినట్లు చెప్పాడు. ఆ ఎస్యూవీ వాహనం చూశాక గానీ ఆ తండ్రికి తెలియలేదు అప్పటికే కొడుకు ఆ కారుని కొనుగులు చేసినట్లు. అంతే ఒక్క క్షణం సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేగాదు నీలమ్ ఇది తనకు జాబ్ ఆఫర్, ప్రమోషన్ కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే విషయం అంటూ తన పోస్ట్ని ముగించాడు. పైగా నీలమ్ ఆ వీడియోకి తమ కలల కన్నా పిల్లల కలలకే ప్రాధాన్యత ఇచ్చే ప్రతి తల్లిదండ్రులకు తలవంచి నమస్కరిస్తున్నా అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు నీలమ్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ..ఈ పోస్ట్ మా పేరెంట్స్ త్యాగాలను గుర్తు చేసిందంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Dip Nilim | IIM Kozhikode (@miles.and.mindset__) (చదవండి: స్లోవేకియా నాయకుడు రిచర్డ్ 'థేకువా స్వీట్'రుచికి ఫిదా! ఎలా తయారు చేస్తారంటే..) -
సైన్స్కు షాక్ ఇచ్చిన గణేశుడు.. ఆర్నెల్లు నలుపు.. ఆర్నెల్లు తెలుపు
మనం ఇప్పటి వరకు ఆధ్యాత్మకతకు సైన్స్ను జోడిస్తూ.. సైన్స్ కూడా ఛేదించలేని కొన్ని ఆలయాల విశేషాలు తెలుసుకున్నాం కదా? నేను ఈరోజు మీకు అలాంటి మరో అద్భుతాన్ని చూపించబోతున్నాను. ఒక్కసారి ఊహించుకోండి..! దేవుడు ఉన్నాడా? అని ప్రశ్నించే నాస్తికులను సైతం ముక్కున వేలువేసుకునేలా చేస్తున్న బ్లాక్ అండ్ వైట్ గణేశుడి గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఆ గణపతి విగ్రహం ఇప్పటికీ సైన్స్కు అంతు చిక్కలేదు. విశేషం ఏంటనుకుంటున్నారా?సంవత్సరంలో రెండు ఆయనాలుంటాయి. అవి ఉత్తరాయణం, దక్షిణాయనం. ఆ గణపతి విగ్రహం ఉత్తరాయణంలో నలుపు రంగులో.. దక్షిణాయనంలో తెలుపురంగులో ఉంటుంది. ఆ విగ్రహం ఎదుట ఉండే బావిలో నీరు విగ్రహం రంగుకు వ్యతిరేక వర్ణంలో ఉండడం గమనార్హం..! అంటే.. విగ్రహం తెల్లగా ఉన్నప్పుడు బావినీళ్లు నల్లగా.. విగ్రహం నలుపు రంగులో ఉన్నప్పుడు బావినీళ్లు తెల్లగా ఉంటాయి. అంతేకాదు.. ఆ ఆలయంలోని మర్రిచెట్టు వింత కూడా సైన్స్కు చిక్కడం లేదు.తమిళనాడు – కేరళ సరిహద్దుల్లో ఉన్న కన్యాకుమారి జిల్లా సమీపంలో.. నాగర్కోయిల్కు దగ్గర్లోని కేరళపురం అనే గ్రామంలో ఉన్న 'శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం' ఈ కోవలోకే వస్తుంది. పేరులోనే ఉంది కదా.. 'అతిశయ వినాయకర్'.. అంటేనే అద్భుతాలు చేసే వినాయకుడు అని అర్థం. ఈ రోజు ఈ వీడియోలో ఆ ఆలయం గురించి తెలుసుకుందామా? -
కండక్టర్ను దోచుకుని.. 36 ఏళ్ల తర్వాత దొరికిపోయి..
కోజికోడ్: కేరళలో బస్సు కండక్టర్ను తుపాకీతో బెదిరించి టికెట్ విక్రయ నగదును దోచుకుని పరారైన ఒక వ్యక్తిని ఏకంగా 36 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు కేరళ నుంచి పారిపోయి కర్ణాటకలోని మైసూరులో మారుపేరుతో జీవిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య పెట్టిన వేధింపుల కేసు ఇతడిని ఎట్టకేలకు పట్టిచ్చింది. 71 ఏళ్ల వయస్సులో అనుకోకుండా ఇతను పోలీసులకు దొరికిపోయాడు. కేరళలోని మలప్పురం జిల్లా అరికోడ్కు చెందిన వీకే జోస్ 1990లో కేరళ కేఎస్ఆర్టీసీ బస్సు థిరువంబాడీ నుంచి కూంబారా పట్టణానికి వెళ్తున్నప్పుడు అందులోని కండక్టర్ను తుపాకీతో బెదిరించి కండక్టర్ వద్ద ఉన్న రోజువారీ టికెట్ కలెక్షన్ సొమ్మును నిందితుడు లాక్కొని పరారయ్యాడు. ఈ కేసులో ఇతనిపై కోర్టు అప్పట్లోనే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఇతడు శివకుమార్ అనే మారుపేరుతో మైసూరులోని నరసింహరాజా ప్రాంతంలో జీవించడం మొదలెట్టాడు. పెళ్లిచేసుకుని భార్య, పిల్లలతో ఉంటున్నాడు. అయితే తనను భర్త వేధిస్తున్నాడంటూ ఇతని భార్య జూలై 8వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇతని ఇంట్లో సోదాలు చేయగా ఒక తుపాకీ లభించింది. తుపాకీ లైసెన్స్ వివరాలు ఆరా తీయగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఇతని వివరాలను కేరళ పోలీసులకు మైసూరు పోలీసులు పంపించారు. దీంతో ఇతనిపై మూడు దశాబ్దాల క్రితం చోరీ కేసు నమోదైనట్లు గుర్తించి వెంటనే అరెస్ట్చేశారు. తర్వాత కేరళలోని థిరువంబాడీకి తీసుకొచ్చి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
ధగ ధగ మెరిసే ఆభరణాలు లేకుండానే..పెళ్లికూతురు రూపం!
భారతీయ వివాహాలు అంటే ఏ రేంజ్లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ పెళ్లి కూతురు అలంకరణ అంటే..అందరి దృష్టి ఆమెపైనే అన్నంత అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కళ్లు చెదిరిపోయే రేంజ్ ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే వస్త్రాలంకరణ తప్పనిసరి. అలాంటిది ఈ కంటెంట్ క్రియేటర్ పెళ్లి కూతురు రూపానికి సరికొత్త అర్థం ఇచ్చేలా రెడీ అయ్యింది. స్వచ్ఛతకు మరో రూపంలా కనిపించిన తీరు అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.కేరళకు చెందిన కంటెంట్ క్రియేటర్, మేకప్ ఆర్టిస్ట్ హర్ష పత్తు నజీమ్ మహమ్మద్ అనే వ్యక్తితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ఆమె తన బ్రైడల్ షూట్, వివాహా వేదికకు సంబంధిచిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. అవి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాయి. ఎందుకంటే ‘క్లీన్ గర్ల్’ లుక్లో కనిపించడం విశేషం. కనీసం ఆ లుక్లో కూడా చెవికి ఇయర్ స్టడ్స్ అయినా ఉంటాయి. కానీ ఈ మేకప్ ఆర్టిస్ట్ హర్ష అవి కూడా ధరించలేదు. కేరళకు చెందిన ఈ వధువు ఎలాంటి బంగారం, వెండి లేదా వజ్రాల ఆభరణాలు ధరించకుండా పెళ్లి పీటల మీద నడచి తన చిరకాల ఆచారాన్ని సవాలు చేసింది. చాలా నిరాడంబరంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కనీసం ఝంకాలు, మాంగ్ టిక్కా, లేదా ఒక సాధారణ బిందీ వంటి ప్రాథమిక ఆభరణాలకు కూడా చోటివ్వలేదామె. స్వచ్ఛమైన పెళ్లికూతురు ఇలానే ఉంటుంది అని చాటిచెప్పేలా ముస్తాబైంది. ఆఖరికి మేకప్ విషయంలో కూడా నేచురల్గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఎలాంటి ఆభరణాలు ధరించకపోయినా..పెళ్లికూతురు దుస్తులు పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉండగలవని తన ఆహార్యంతో నిరూపించిందామె. ఆమె పెళ్లి కూతురు లుక్ని హైలెట్ చేసింది ధరించిన చీర. హర్ష ధరించిన శారీ రిచ్గా డిటైల్డ్గా ఉండటమే దీనికి కారణం. సాధారణంగా నవవధువు ధరించే ఎరుపు రంగునే ఎంచుకుంది. ఇక్కడ హర్ష్ దానిపై క్లిష్టమైన పూల ఎంబ్రాయిడరీ, ఫుల్-స్లీవ్ బ్లౌజ్తో స్టైల్ చేశారు. అలాగే ఆభరణాలు, మేకప్ లేకుండా కనిపించినప్పటికీ..ఓ విలక్షణమైన పెళ్లి కూతురు లుక్తో అక్కడున్న వారందర్నీ ఆకట్టుకోవడం విశేషం. ప్రీ వెడ్డింగ్ షూట్లో సైతం ఇలానే నిరాడంబరమైన లుక్తో అలరించింది. నెటిజన్లు సైతం ఆమె లుక్కి ఫిదా అవుతూ..ఆభరణాలు లేని అందమైన వధువు అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Harsha Pathu (@harsha_pathu_)(చదవండి: పాటలు పాడటం.. నిజంగానే ఊపిరితిత్తులకు మంచిదా?) -
చార్టర్డ్ ప్లైట్లలో పనస పండ్ల ప్రయాణం!
మన దేశంలోని చాలా ప్రాంతాల్లో చెట్టుకు కాసి, వృథాగా రాలిపోయే పనస పండుకు అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు అత్యధిక డిమాండ్ పలుకుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల అధికారిక ఫలమైన పనసపండు (జాక్ఫ్రూట్) ప్రస్తుతం సరిహద్దులు దాటి చార్టర్డ్ విమానాల్లో విదేశాలకు ఎగుమతి అవుతోంది. స్థానికంగా కేవలం రూ.10 పలుకుతున్న కిలో పనస ధర, విదేశీ మార్కెట్లలో ఏకంగా రూ.500 నుండి రూ.600 వరకు పలుకుతుండటం విశేషం. ముఖ్యంగా కేరళకు చెందిన ‘వరిక్క’ రకం పనస పండ్లకు గల్ఫ్, యూరప్ దేశాలలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది.చార్టర్డ్ విమానాల్లో.. పండగ సీజన్లలో గల్ఫ్, యూరప్ దేశాల నుండి వచ్చే డిమాండ్ను అందుకోవడానికి పనసపండ్ల విక్రయదారులు ఏకంగా చార్టర్డ్ విమానాలను కూడా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా పండగ రోజుల్లో కేరళ నుండి ప్రతిరోజూ 500 కిలోల నుండి ఒక టన్ను వరకు పనస పండ్లను విదేశాలకు విమానాల ద్వారా తరలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 దేశాలకు ఈ పండ్లు ప్రధానంగా ఎగుమతి అవుతున్నాయి. ఇతర దేశాల నుండి కూడా పనస పండ్లు గల్ఫ్, యూరప్ మార్కెట్లకు వస్తున్నప్పటికీ, కేరళ పనసకు ఉన్న ప్రత్యేక క్రేజ్ వల్ల దీనికే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.పెరిగిన కార్గో ధరలు - ఎగుమతులపై ప్రభావంప్రస్తుత అంతర్జాతీయ యుద్ధ వాతావరణం కారణంగా కార్గో రవాణా ఛార్జీలు రెట్టింపయ్యాయి. దీనివల్ల గత కొన్ని నెలలుగా పనస ఎగుమతులు కొంత మేర తగ్గాయని పనస ఎగుమతిదారుడు ఆర్ అశోక్ తెలిపారు. విదేశీ ఎగుమతులతో పాటు, ఉత్తర భారత రాష్ట్రాలలో వేగన్ (పాలు, వెన్న, తేనె వంటి జంతుసంబంధిత ఉత్పత్తులను కూడా తీసుకోని వారు) ఆహారానికి ఆదరణ పెరగడంతో, వారికి అవసరమైన పచ్చి పనసకాయలను రైళ్ల ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.సీజన్ ఆధారిత ఎగుమతులుపనస పండ్ల ఎగుమతి పూర్తిగా సీజన్లపై ఆధారపడి ఉంటుంది. కేరళలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పనస పండ్లను ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ఆ తర్వాత మే నుండి జూలై వరకు కేరళలో వర్షాకాలం (మాన్సూన్) ప్రారంభం కావడంతో, ఎగుమతిదారులు సరఫరా కోసం తమిళనాడుపై ఆధారపడతారు. వాతావరణ మార్పుల వల్ల కేరళలో పనస ఉత్పత్తిపై కొంత ప్రభావం పడినప్పటికీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో హైబ్రిడ్ పనస చెట్లను విస్తృతంగా సాగు చేస్తుండటంతో ఎగుమతులకు ఎలాంటి ఆటంకం కలగడం లేదు.కొల్లి హిల్స్ పనస ప్రత్యేకతతమిళనాడులోని నామక్కల్ జిల్లాలో సముద్ర మట్టానికి 1,300 మీటర్ల ఎత్తులో ఉన్న ‘కొల్లి హిల్స్’ ప్రాంతం పనస సాగుకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జూన్ నుండి ఆగస్టు వరకు పనస కోతల సీజన్ సాగుతుంది. కొల్లి హిల్స్ పనస పండ్లు వాటి పెద్ద తొనలు, అమితమైన తీపి, ప్రత్యేకమైన సువాసనకు మార్కెట్లో ఎంతో గుర్తింపు పొందాయి.నాణ్యమైన సేకరణ విధానంకొల్లి హిల్స్లో పనస పండ్లను సేకరించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎత్తైన, పెద్ద పెద్ద చెట్ల నుండి పండ్లు కింద పడి పాడవకుండా, నేలను తాకకుండా చాలా జాగ్రత్తగా తాడు సాయంతో కిందికి దించుతారు. ఇలా సేకరించిన నాణ్యమైన పండ్లను కొనుగోలుదారులు నేరుగా రైతులకు చెందిన తోటల వద్ద నుండి కానీ లేదా మధ్యవర్తుల ద్వారా కానీ కొనుగోలు చేస్తుంటారు. -
30 ఏళ్లు తర్వాత రుణం తీర్చుకున్న వ్యక్తి ఎందుకో చుడండి
-
18 నెలల చిన్నారికి గుండెపోటా? వైద్యుడిపై కేసు
కేరళలోని కన్నూర్లో ఒక ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ ఏకైక కుమారుడు, 18 నెలల చిన్నారి కన్నుమూశాడు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.కన్నూర్లోని ఎరమామ్-కుట్టూర్ నివాసులైన టి. సూరజ్, విజయషాల ఏకైక కుమారుడు ఏడాదిన్నర బాలుడు దేవాన్ష్ శౌర్య. జూలై 5న ఇంటి బయట ఆడుకుంటుండగా కిందపడి పెదవికి గాయమైంది. తొలుతు బాలుడిని మాతమంగళంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.ఆ తర్వాత అతడిని పయ్యన్నూర్లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ అనస్థీషియా ఇచ్చి గాయానికి కుట్లు వేశారు. ఆ తర్వాత అతను స్పృహ కోల్పోయినట్లు సమాచారం.పరిస్థితి మరింత విషమించడంతో అనంతరం కన్నూర్లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా, శుక్రవారం రాత్రి సుమారు 9 గంటలకు శౌర్య ప్రాణాలు విడిచాడు. అనస్థీషియా ఇచ్చిన తర్వాత స్పృహ కోల్పోయి, తమ బిడ్డ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ అంజలి పొడువాల్ నిర్లక్ష్యమే తమ బిడ్డ చావుకు కారణమని వాపోయారు. #WATCH | Keralam: A toddler from Kannur died five days after undergoing anaesthesia for a procedure to treat a cut lip at Kannur Government Medical College. Post-mortem examination has been completed, and police have registered a case investigating the circumstances surrounding… pic.twitter.com/EsW9Zmt3pp— ANI (@ANI) July 11, 2026అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి ఖండించింది. అనస్థీషియా ఇచ్చిన వెంటనే ఆ బిడ్డకు ఊహించని విధంగా గుండెపోటు వచ్చింది. వెంటనే వెంటిలేటర్పై ఉంచి, మెరుగైన క్రిటికల్ కేర్ కోసం తమ కన్నూర్ ఆసుపత్రికి తరలించామని యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సరైన మోతాదులో అనస్థీషియా ఇచ్చినా, సరైన వైద్య సంరక్షణ అందించినా సమస్యలు తలెత్తవచ్చని ఆసుపత్రి పేర్కొంది. బిడ్డ ప్రాణాలను కాపాడటానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశామని ఆసుపత్రి వాదిస్తోంది. ప్రస్తుతం దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
భారత మెడికో మృతి.. గాయాల గుర్తులతో మిస్టరీగా మరణం!
తిరువనంతపురం: కేరళకు చెందిన విద్యార్థిని ఉజ్బెకిస్థాన్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, తమ కుమార్తెను చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, మత మార్పిడికి ఒత్తిడి చేయడం కూడా ఘటనకు కారణమై ఉండొచ్చని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో భారత అధికారులు, ఉజ్బెకిస్థాన్ దర్యాప్తు సంస్థలు కలిసి కేసును పరిశీలిస్తున్నాయి. దీంతో, ఆమె మృతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన సవారియా బసంత్ (22) ఉజ్బెకిస్థాన్లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు సమాచారం. ఆమె అక్కడ తన వైద్య విద్య కొనసాగిస్తుండగా ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమె మృతదేహం స్వదేశానికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహంపై ఉన్న గాయాలను చూసి అనుమానాలు వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, సవారియాను కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఒక వ్యక్తి ఆమెపై మత మార్పిడికి ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. అందుకు ఆమె నిరాకరించడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. మృతదేహంపై గాయాల గుర్తులు కనిపించాయని, ఇది సాధారణ మరణం కాదని కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది.కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కోణంతో పాటు కుటుంబం చేసిన ఇతర ఆరోపణలను కూడా దర్యాప్తులో పరిశీలిస్తున్నారు. ఈ ఘటన ఉజ్బెకిస్థాన్కు చెందినది కావడంతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. భారత రాయబార కార్యాలయం కూడా ఈ అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు.. ఉజ్బెకిస్థాన్లోని స్థానిక అధికారులు కూడా ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. అసలు విద్యార్థిని ఎలా మృతి చెందింది, దానికి కారణాలు ఏమిటి, కుటుంబం చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత అన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుంది.కాగా, ఈ ఘటన విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయ విద్యార్థులు వైద్య, ఇంజినీరింగ్ తదితర కోర్సుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ వారి భద్రత, స్థానిక చట్టాలపై అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే వ్యవస్థలపై మరింత దృష్టి అవసరమని నిపుణులు చెబుతున్నారు. -
25 ఏళ్ల స్నేహం, రూ. 25 వేల అప్పు : ధర్మపురికి చేరిన ఇంట్రస్టింగ్ స్టోరీ
నిజాయితీకి, స్నేహానికి ప్రతీకగా నిలిచే ఒక అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడం కోసం కేరళకు చెందిన ఒక వ్యక్తి వందల కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణకు వచ్చిన వైనం ప్రశంసల్ని దక్కించుకుంటోంది. అసలు ఏం జరిగిందంటే..కేరళలోని పాలక్కాడ్కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్, తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన తన స్నేహితుడు ఎడ్ల లచ్చన్నకు రూ. 25,000 తిరిగి ఇవ్వడానికి ఇక్కడికి చేరుకున్నారు. దశాబ్దాల క్రితం వీరిద్దరూ సౌదీ అరేబియాలో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ డబ్బును అప్పుగా తీసుకున్నారు.అసలేంటీ అప్పు?సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలోని ఒకే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఇస్మాయిల్, లచ్చన్న మంచి స్నేహితులయ్యారు. ఆ సమయంలో ఇస్మాయిల్కు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడటంతో, లచ్చన్న అతనికి రూ. 25,000 ఇచ్చి సహాయం చేశారు. భారతదేశానికి తిరిగి వెళ్లేముందు ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని ఇస్మాయిల్ మాట ఇచ్చారు. అయితే, ఇద్దరూ సౌదీ విడిచి స్వదేశానికి వచ్చిన తర్వాత ఒకరి ఫోన్ నంబర్లు, చిరునామాలు మరొకరి వద్ద లేకపోవడంతో పూర్తిగా పరిచయాలు తెగిపోయాయి.గూగుల్ మ్యాప్స్ సాయంతో లచ్చన్న కాంటాక్ట్ లేకపోయినా, ఇస్మాయిల్కు తాను చేసిన అప్పు, ఇచ్చిన మాట మాత్రం ఎపుడూ మర్చిపోలేదు. అతని అప్పు ఎలా తీర్చాలా మధనపడుతూ వచ్చాడు. అయితే తన దగ్గర ఎలాంటి ఆధారం లేదు.కానీ లచ్చన్నది "ధర్మపురి" అనే విషయం మాత్రమే అతనికి గుర్తుంది. ఎలాగైనా అప్పు తీర్చాలనే పట్టుదలతో, ఇస్మాయిల్ గూగుల్ మ్యాప్స్ (Google Maps) సహాయంతో ఆ ఊరిని వెతుక్కుంటూ కేరళ నుండి తెలంగాణలోని ధర్మపురి చేరుకున్నాక, స్థానికులను అడిగి మొత్తం మీద లచ్చన్న ఆచూకీని కనిపెట్టారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందిభావోద్వేగ కలయికఇస్మాయిల్ అక్కడికి వెళ్లేసరికి, లచ్చన్న మళ్లీ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లినట్లు తెలిసింది.దాంతో ఇస్మాయిల్ తనను తాను లచ్చన్న కుటుంబ సభ్యులకు పరిచయం చేసుకుని, ఫోన్ ద్వారా లచ్చన్నతో మాట్లాడారు. తాను ఇచ్చిన అప్పు సంగతినే పూర్తిగా మర్చిపోయిన లచ్చన్న, 25 ఏళ్ల తర్వాత తన స్నేహితుడి గొంతు విని ఆశ్చర్యపోయారు. ఇద్దరూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం ఇస్మాయిల్ ఆ రూ. 25,000 నగదును లచ్చన్న కుటుంబ సభ్యులకు అందజేశారు.ఇదీ చదవండి: 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!భారం దిగిపోయింది"ఇన్నాళ్లుగా నా గుండెల్లో ఒక పెద్ద భారాన్ని మోస్తున్నట్లు అనిపించేది. ఈరోజు నా స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా ప్రశాంతంగా ఉంది." అంటూ ఇస్మాయిల్ చాలా రిలీఫ్గా ఫీలవ్వడం విశేషం. ఇస్మాయిల్ చూపిన ఈ గొప్ప నిజాయితీకి లచ్చన్న కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. స్థానిక ప్రజలు కూడా ఇస్మాయిల్ నిబద్ధతను, స్నేహాన్ని ఎంతో అభినందించారు. కాలం ఎంత మారినా నమ్మకం, కృతజ్ఞత, నిజమైన స్నేహం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని ఈ ఘటన నిరూపించింది.ఇదీ చదవండి: లక్ష ఉద్యోగాల కోత, ప్లాంట్లు మూసివేత : వెల్లువెత్తిన నిరసన -
‘పాంచ్ సాహెబ్’ గా హార్మోజ్ను గెలిచింది
తల పైనుంచి దూసుకెళ్తున్న క్షిపణులు.. కింద మందుపాతర్ల సముద్రం.. నౌకలోని 24 మంది సిబ్బందిలో ఆమె ఒక్కతే స్త్రీ. అయినా భయపడలేదు. షిప్లో అందరూ ఆమెను ‘పాంచ్ సాహెబ్‘ (ఫిఫ్త్ ఇంజనీర్) అని పిలుస్తారు. ఆమే కేరళకు చెందిన ధీర వనిత హిఫా సలీమ్. స్ట్రయిట్ ఆఫ్ హార్మోజ్లో యుద్ధం మధ్య 100 రోజుల పాటు చిక్కుకుపోయినా భయానికి ఆస్కారం ఇవ్వని ధైర్యశాలి.‘ఆ రోజు మర్చిపోలేను. మా షిప్ మీద నుంచి పెద్ద శబ్దంతో క్షిపణి ఒకటి దూసుకు వెళ్లింది. నేను ఇంజన్ రూమ్లో ఉన్నాను. అది నౌకకు గుండెకాయ. నా డ్యూటీ అక్కడే. అయినా కదల్లేదు. నా స్టాఫ్ వచ్చి పాంచ్ సాహెబ్... మనం ఈ పరిస్థితిని ఎదుర్కొందాం అన్నారు. అందరం ఒక టీమ్గా నిలబడ్డాం’ అంది హిఫా సలీమ్.మొన్నటి అక్టోబర్ చివర్లో ఆమె పని చేస్తున్న కార్గో షిప్ హార్మోజ్ జల«సంధిలో ఇరుక్కున్నప్పుడు కేవలం 200 మీటర్ల దూరంలో క్షిపణులు, డ్రోన్లు పడ్డాయి. ఒక క్షిపణి తలపై నుంచే పోయింది. ‘భయం వేసింది... కానీ ΄్యానిక్ అవలేదు. డ్యూటీనే ముఖ్యం అనుకున్నాను’ అంది హిఫా. ‘క్షిపణి సమస్యలే కాదు... రాత్రిళ్లు ‘దాడులు ఎక్కువ కావడంతో జీపీఎస్ జామ్ అయిపోయింది. శాటిలైట్ కమ్యూనికేషన్, మాన్యువల్ కో ఆర్డినేట్స్తో మందుపాతర్లు తప్పించుకుంటూ నౌకను నడిపించాం’ అంది.మధ్యతరగతి అమ్మాయి..కేరళలోని సాధారణ కుటుంబం నుండి వచ్చిన హిఫా సలీమ్, చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ నుంచి మెరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అక్టోబర్ 15న హ్యూస్టన్ లో ‘బిడబ్ల్యూ కిజోకు’ నౌకలో తన మొదటి సీ అసైన్ మెంట్ను ప్రారంభించింది. ఆ రోజు ఎంతో సంతోషంగా తన డైరీలో ‘ఎక్సైట్మెంట్ ప్లస్ ఆందోళన.. నా మొదటి షిప్’ అని రాసుకుంది. కానీ చేరిన మూడు వారాల్లోనే అంతర్జాతీయ పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హార్మోజ్ జలసంధిలో 13 భారతీయ నౌకలు, 550 మందికి పైగా భారతీయ నావికులు చిక్కుకుపోయారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 1% మాత్రమే మహిళా నావికులు ఉన్న ఈ రంగంలో, ఆ క్లిష్ట పరిస్థితుల్లో హిఫా ఒంటరిగా పోరాడింది. ఇంట్లో చెప్పని ’100 రోజులు’..యుద్ధక్షేత్రం లాంటి అంతర్జాతీయ జలాల్లో వంద రోజులు గడిచినా హిఫా తన ఇంట్లో ఒక్క మాట కూడా చెప్పలేదు. ‘అమ్మకు బీపీ ఉంది, నాన్న టెన్షన్ పడతారు‘ అని ప్రతి విషయాన్నీ దాచేసింది. రోజూ నవ్వుతూ వీడియో కాల్స్ చేస్తూ ‘ఇక్కడ అంతా బాగుంది’ అని అబద్ధం చెప్పేది. కానీ, లోపల మాత్రం ఆమెకు ప్రతి రాత్రి ‘ఈ రోజు బతికి బయటపడతామా?’ అనే భయం వెంటాడేది. నౌకకు గుండెకాయ లాంటి ఇంజిన్ ఒక్క నిమిషం ఆగినా అందరి ప్రాణాలూ గాల్లో కలవడం ఖాయం. ఆ క్లిష్ట సమయంలో హిఫా చేతులే, ఆమె నైపుణ్యమే మిగిలిన 23 మంది నావికుల ప్రాణాలకు బలమైన ఆధారం అయ్యాయి. జపాన్ లో సైన్ ఆఫ్.. ఎట్టకేలకు 2026 జనవరి చివర్లో ఉద్రిక్తతలు కాస్త తగ్గాక ఆమె జపాన్ తీరంలో సురక్షితంగా ‘సైన్ ఆఫ్’ (విధుల నుంచి విరామం) చేసింది. హార్మోజ్ నరకంలో 3 నెలల పాటు మృత్యువుతో పోరాడి, క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులు ‘మీకు ఇప్పుడు మొదట ఏం కావాలి?’ అని అడిగారు. దానికి ఆమె నవ్వుతూ ‘నాకు రెస్ట్ వద్దు, సెలబ్రేషన్స్ వద్దు.. కేవలం అమ్మ చేతి వంట చాలు’ అని బదులిచ్చింది. సాగర విజేతప్రస్తుతం హిఫా సలీమ్ తన తదుపరి ఉన్నత ర్యాంక్ (ఫోర్త్ ఇంజనీర్) పరీక్షల కోసం సన్నద్ధమవుతోంది. నాడు హార్మోజ్ జలసంధిలో ఇరుక్కుపోయిన 550 మంది భారతీయులలో హిఫా కథ అత్యంత ప్రత్యేకం. హార్మోజ్ జలసంధిలో చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద యుద్ధానికే దారితీస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన చోట, కేవలం 20 ఏళ్ల ప్రాయంలోనే ‘పాంచ్ సాహెబ్’గా క్షిపణుల మధ్య నిలబడి 23 మంది మగవాళ్లకు భరోసానిచ్చింది. ‘ఆడపిల్లలు సముద్ర ప్రయాణాలకు, మెరైన్ రంగానికి పనికిరారు‘ అనే పాతకాలపు అపనమ్మకాలను హిఫా సలీమ్ తన నమ్మకంతో, ధైర్యంతో సముద్రపు లోతుల్లో ముంచేసింది! -
విజింజం పోర్టులో అదానీ వాటా విక్రయంపై కమిటీ
దేశీయ నౌకాయాన రంగంలో వ్యూహాత్మకమైన విజింజం అంతర్జాతీయ పోర్టులో అదానీ గ్రూప్ తన 49 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదిత వాటా విక్రయం వల్ల రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కేరళ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.రాష్ట్ర ప్రయోజనాలే పరమావధికేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి సతీశన్ విలేకరులతో మాట్లాడారు. విజింజం పోర్టు కేరళ ఆర్థిక ప్రగతికి కీలకమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్నీ ప్రభుత్వం తీసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో కథనాలు వచ్చేంత వరకు అదానీ గ్రూప్ తలపెట్టిన ఈ వాటా బదిలీ వ్యవహారం తమ ప్రభుత్వ దృష్టికి రాలేదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ షిప్పింగ్ దిగ్గజం ఎంఎస్సీ గ్రూప్తో అదానీ సంస్థ దాదాపు ఏడాది కాలంగా ఈ వ్యవహారంపై చర్చలు జరుపుతోందనే నిజాన్ని ప్రభుత్వం ఆ తర్వాతే గుర్తించిందని ఆయన వెల్లడించారు.‘వాటా బదిలీకి సంబంధించిన ప్రతిపాదనను అదానీ గ్రూప్ సెబీకి సమర్పించిన రోజే.. ముందస్తుగా రాష్ట్రానికి సమాచారం ఇవ్వకపోవడంపై అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేశాం. ఆ తర్వాతే కన్సెషన్ ఒప్పంద నిబంధనల ప్రకారం వాటా బదిలీకి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరుతూ అదానీ గ్రూప్ అధికారికంగా ప్రభుత్వం వద్దకు వచ్చింది’ అని ముఖ్యమంత్రి అన్నారు.గుత్తాధిపత్యం అసాధ్యంవిపక్ష నేత పినరయి విజయన్ చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి పూర్తిగా కొట్టిపారేశారు. విజయన్ అసలు కన్సెషన్ అగ్రిమెంట్ (రాయితీ ఒప్పందం) చదవకుండానే గుడ్డిగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ డీల్ వల్ల ఎమ్మెస్సీ గ్రూప్ గుత్తాధిపత్యం ఏర్పడుతుందన్న వాదనలో వాస్తవం లేదన్నారు. ఏ ఒక్క సంస్థా దీనిపై పూర్తి ఆధిపత్యం చలాయించలేదని సీఎం స్పష్టం చేశారు.కేంద్ర అనుమతులు వస్తేనే డీల్ పూర్తి!ప్రస్తుతానికి వాటా బదిలీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, కాబట్టి రాయితీ ఒప్పందాన్ని అదానీ గ్రూప్ ఉల్లంఘించిందని చెప్పలేమని సీఎం వివరించారు. ఈ లావాదేవీ ముగియాలంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మాత్రమే సరిపోదని.. దీనికి అనేక రకాల భద్రతా, వ్యూహాత్మక కోణాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
Watch Video: కొట్టుకుపోయిన మనుషులు, బస్సులు, లారీలు, ట్యాంకర్లు.. కేరళలో ఊహకందని ఘోరం..
-
వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి
-
వర్ష విలయం.. వయనాడ్ లో విషాదం
-
వయనాడ్: సెకన్ల వ్యవధిలో చావును జయించి..
కల్లాడి (కేరళ): ‘అసలు ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. బురద, నీరు మెరుపు వేగంతో మా వైపు దూసుకురావడం చూసి ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగెత్తాం. ఎంత వేగంగా పరిగెత్తినా, అసలు కదలడం లేదనే భావన కలిగింది. భయంతో కాళ్లు పూర్తిగా సహకరించలేదు’ అని వయనాడ్ సమీపంలోని మేప్పాడిలో సంభవించిన ఘోర కొండచరియల విపత్తు నుండి ప్రాణాలతో బయటపడిన కూడమ్మాల్ ఆ ఘోర ఉదంతాన్ని గుర్తుచేసుకున్నారు. #Video | At least three killed and many feared missing after a major #landslide was reported at #Kalladi near #Meppady in #Wayanad on Tuesday.https://t.co/K2LFCFlrVP pic.twitter.com/BqyYxP4RvG— Deccan Herald (@DeccanHerald) July 7, 2026బ్యాంకుకు వెళ్లే ఉద్దేశ్యంతో బస్సు ఎక్కేందుకు కూడమ్మాల్, ఆమె భర్త స్థానిక బస్టాప్ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. బస్ షెల్టర్ వద్ద మరో కొన్ని నిమిషాలు ఉండి ఉంటే, తాము సజీవ సమాధి అయ్యేవాళ్లమని ఆమె పేర్కొన్నారు. మీనాక్షి వంతెన సమీపంలోని ఒక దుకాణంలో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ ఈ విపత్తు తీవ్రతను కళ్లకు కడుతోంది. వంతెనను తాకుతూ బురద, నీరు ఉధృతంగా ప్రవహించడాన్ని అందులో చూడవచ్చు. వారి వెనుకే ఒక భారీ వాటర్ ట్యాంకర్ లారీ బురద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా, దంపతులిద్దరూ ప్రాణభయంతో పరుగెత్తడం ఆ వీడియోలో నమోదైంది. అదృష్టవశాత్తూ, కూడమ్మాల్, ఆమె భర్త ఇద్దరూ ఎటువంటి పెద్ద గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు.ఇది కూడా చదవండి: ముంబై రన్వేపై తృటిలో తప్పిన విమాన ప్రమాదం -
భారీ వర్షాలకు కూలిన మట్టిదిబ్బ
వయనాడ్/తిరువనంతపురం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కేరళలోని వయనాడ్లో భారీ విపత్తుకు కారణమైంది. కోజికోడ్ – వయనాడ్ జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన భారీ జంట సొరంగ మార్గం కోసం తవి్వన మట్టి వర్షం కారణంగా అకస్మాత్తుగా జారిపోవడంతో ముగ్గురు మరణించగా పదిమంది గాయపడ్డారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. వయనాడ్ జిల్లాలోని కల్లడి ప్రాంతంలోని మేప్పడి గ్రామం వద్ద నిర్మాణమవుతున్న మీనాక్షి వంతెన వద్ద మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.కుప్పగా పోసిన మట్టిని తొలగించాలని జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సొరంగం నిర్మిస్తున్న కాంట్రాక్టర్లను చాలాకాలం క్రితమే హెచ్చరించినా పట్టించుకోక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కేరళ ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ వ్యాఖ్యానించారు. ‘‘ఇదో దురదృష్టకర సంఘటన. సహాయక చర్యలు చేపట్టాము’’అని తెలిపారు. వాతావరణ హెచ్చరికలు జారీ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనడం సరికాదని సకాలంలో మట్టి తొలగించకపోవడం కారణమని వివరించారు. ఉన్నట్టుండి కుప్పకూలిన మట్టిదిబ్బ... ప్రమాద దృశ్యాలతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది... ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం... బ్యారికేడ్లన్నింటినీ తోసేసుకుని మట్టిదిబ్బ అకస్మాత్తుగా కుప్పకూలి పోయింది. ఈ ధాటికి ఒక ట్యాంకర్ లారీ కొట్టుకుపోయింది. అదే సమయంలో ఇంకో ప్రైవేట్ బస్సు నదిలో పడిపోయింది. పాదచారులైతే ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోతూ కనిపించారు. కొందరు మట్టిలో కూరుకుపోగా... మరికొందరు ఇరుగుపొరుగు సాయంతో బయటపడ్డారు. స్నిఫర్ డాగ్ల సాయంతో మట్టిలో కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.కశ్మీర్లో మెరుపు వరదలు జమ్మూ: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. మంగళవారం ఉదయం కొండ ప్రాంతాల నుంచి ప్రవేశించిన వరదతో థాత్రి పట్టణంలో పలు దుకాణాలు, ఇళ్లు, వాహనాలకు నష్టం వాటిల్లింది. భారీగా దొర్లి పడ్డ రాళ్లు, కొట్టుకువచ్చిన మట్టి, వేళ్లతో సహా పెకిలించుకువచ్చిన చెట్లు పట్టణంలో ఎక్కడ చూసినా మేట వేశాయి. థాత్రి పట్టణంలో దోడా–కి‹Ù్తవార్ రహదారి మూసుకుపోయింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాలు పెద్ద సంఖ్యలో మట్టి, బురదలో కూరుకుపోయాయి. మట్టిదోడా, కిష్త్వార్ జిల్లాల్లో రెండు రోజుల వ్యవధిలో ఇలా మూడు చోట్ల మెరుపు వరదలు సంభవించాయి.ప్రాణం దక్కించిన పరుగువయనాడ్లో జరిగిన ప్రమాదం నుంచి దంపతులిద్దరు భలే తప్పించుకున్నారు. మట్టిదిబ్బ కూలే క్రమంలో కట్టలు తెంచుకుని అడ్డంకులను దాటుకుని బురద శరవేగంగా దూసుకొస్తూంటే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పలువురు పరుగురు పెట్టడం వీడియోలో కనిపించింది. అందరి ప్రాణాలు ఆ మట్టిలోనే కలిసిపోతాయని అందరూ అనుకున్నారు.బురద మనుషులతోపాటు ట్యాంకర్ వంటి భారీ వాహనాలను కూడా తనతో ఈడ్చుకెళ్లింది. ట్యాంకర్ కాస్తా బ్రిడ్జికి ఆవల నిలిపిన జీప్ను గుద్దుకోవడమూ కనిపించింది. ఆ దంపతులు కూడా కొట్టుకుపోయారని అందరూ అనుకున్నారు కానీ సెకన్ల తరువాత ఇద్దరూ లారీకి, జీపుకు మధ్య నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ‘‘నిర్మాణం జరిగే చోట బస్సు కోసం ఎదురు చూస్తున్నాం. అకస్మాత్తుగా మట్టి మావైపు దూసుకొస్తూ కనిపించింది. వంతెనకు అడ్డంగా పరుగెత్తాం. వెనుక నుంచి చుట్టేసిన మట్టి మమ్మల్ని దూరంగా తోసేసింది. ఇద్దరం పడిపోయాం. లారీతోపాటు కొట్టుకుపోతున్నాం.లారీ కింద పడిపోతానేమో అనిపించింది. కానీ దాని పక్కన నుంచి వెళ్లిపోయాం. ప్రాణాలతో ఎలా బయటపడ్డామో ఇప్పటికీ తెలియడం లేదు’’అని బాధిత మహిళ తన భయంకర అనుభవాన్ని వివరించింది. మట్టి కనిపించగానే పరుగు లంకించుకున్నామని, బురదలో కొట్టుకుపోతున్న తమకు లారీ కనిపించలేదని ప్రమాదం నుంచి బయటపడ్డ భర్త తెలిపారు. -
బావిలో పడిన ఏనుగు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
కొచ్చి: కేరళలోని ఎర్ణాకులం జిల్లా మలయాట్టూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఒక అడవి ఏనుగు ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. అయితే, ఈ ప్రాంతంలో తరచూ జరుగుతున్న మానవ- వన్యప్రాణి సంఘర్షణలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అటవీ శాఖ అధికారుల రెస్క్యూ ఆపరేషన్ను అడ్డుకోవడంతో ఏనుగు రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.అటవీ శాఖ సమాచారం ప్రకారం.. మంగళవారం ఉదయం 5- 6 గంటల మధ్య ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన సిబ్బంది సహాయక చర్యల కోసం ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ ఈ ప్రాంతంలో అడవి జంతువుల దాడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారుల వాహనాలను, సహాయక చర్యలను అడ్డుకున్నారు.ఈ నిరసనల మధ్యే అటవీ శాఖ సిబ్బంది ఏనుగును రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బావి నుంచి ఏనుగు సురక్షితంగా పైకి రావడానికి వీలుగా ఎర్త్మూవర్ సహాయంతో వాలుగా ఉండే మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, వీలైనంత త్వరగా ఏనుగును సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్లు శ్రమిస్తున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
కేరళ: విరిగిపడిన కొండచరియలు.. ప్రమాదంలో 50 మంది కార్మికులు!
వయనాడ్: కేరళలోని వయనాడ్ టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో మంగళవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా కల్లాడిలోని మీనాక్షి బ్రిడ్జి సమీపంలో ఉన్న సొరంగం నిర్మాణ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 నుంచి 50 మంది వరకు కార్మికులు భూగర్భంలో చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. నిర్మాణ సంస్థకు చెందిన తాత్కాలిక కార్యాలయ కంటైనర్లు, బస్సులు, కార్లు, జెసిబి యంత్రాలు పూర్తిగా మట్టి దిబ్బల కింద పూడుకుపోయాయి.స్థానికులు కొందరు బాధితులను రక్షించి హారిసన్ మలయాళం ఎస్టేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. భారీ వృక్షాలు కూలిపోవడం, సమీపంలోని చిన్న నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతోంది. ముందస్తు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అత్యవసర సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. Several people are feared to be trapped under the debris after a landslide hit Kerala’s Wayanad. The landslide occurred after a portion of the hill caved in at the entrance of the under-construction Kozhikode-Wayanad twin-tunnel road.The incident was reported in the Meenakshi… pic.twitter.com/R0RKO6b3TT— The Indian Express (@IndianExpress) July 7, 2026 -
ఉజ్బెకిస్తాన్లో కేరళ విద్యార్థిని హత్య: మలప్పురం యువకుడి అరెస్ట్
హరిపాడ్: ఉజ్బెకిస్తాన్లో వైద్య విద్య అభ్యసిస్తున్న కేరళకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని సవారియా తోటి విద్యార్థి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఉజ్బెకిస్తాన్లో ఉంటున్న మలప్పురంలోని పెరింతల్మన్నకు చెందిన విద్యార్థి సధారుల్ అనామ్ను ఉజ్బెకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.సవారియా, నిందితుడికి మధ్య నాలుగు రోజుల క్రితం ఒక చిన్న వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అనామ్.. సవారియా తలపై ల్యాప్టాప్తో బలంగా బాదాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, అంతర్గత రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ సవారియా మృతి చెందింది.కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఉజ్బెకిస్తాన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మంగళవారం నాటికి సవారియా మృతదేహం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ నుంచి కొచ్చి మీదుగా ఆమె స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కువైట్లో పనిచేస్తున్న సవారియా తండ్రికి అవసరమైన పత్రాలు లభించకపోవడంతో నేరుగా కేరళకు చేరుకోగా, ఆమె బాబాయ్ ఉజ్బెకిస్తాన్ వెళ్లి మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చే ప్రక్రియను పూర్తి చేశారు. మృతురాలికి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నారు.ఇది కూడా చదవండి: మూకాంబికా భక్తుల కోసం సురేష్ గోపి డిమాండ్ -
మరో ‘పరీక్ష కుంభకోణం’: సమాధానాలు దిద్దకుండానే ఉద్యోగాలు!
తిరువనంతపురం: స్టేట్ ప్లానింగ్ బోర్డులోని చీఫ్ లెవెల్ పోస్టుల భర్తీకి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ) నిర్వహించిన నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై ‘విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో’ (విఏసిబి) చేత దర్యాప్తు జరిపించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. పీఎస్సీ అంతర్గతంగా జరుపుతున్న విచారణపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.రాజ్యాంగబద్ధమైన పీఎస్సీపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించడంలో ఏవైనా చట్టపరమైన చిక్కులు ఉన్నాయా అనే కోణంలో హోంశాఖ న్యాయ సలహా కోరింది. తదుపరి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్లానింగ్ బోర్డు పరిధిలోని మూడు విభాగాల పోస్టుల కోసం నిర్వహించిన ఈ ఉమ్మడి పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో 10 సమాధానాలను అసలు పరిశీలించనే లేదని పీఎస్సీ స్వయంగా అంగీకరించింది. అప్పటికే రెండు పోస్టులకు సంబంధించిన ర్యాంక్ జాబితాలు విడుదలై, ఇద్దరు అభ్యర్థులు విధుల్లో చేరిపోవడం గమనార్హం.కేరళ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో దాఖలైన ఒక ఫిర్యాదుతో ఈ ఘోర తప్పిదం వెలుగుచూసింది. దీంతో పరీక్ష రాసిన 200 మందికి పైగా అభ్యర్థుల సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి, ర్యాంక్ జాబితాలను సవరిస్తామని పీఎస్సీ ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీనితో పాటు ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, కేఏఎస్ వంటి పలు ఇతర నియామకాలపై కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందడంతో, వాటన్నింటినీ విజిలెన్స్ దర్యాప్తునకు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఇది కూడా చదవండి: ఎన్కౌంటర్లో ఇద్దరు బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లు హతం -
ఏనుగు దంతాల వివాదం: చిక్కుల్లో మోహన్ లాల్
కొచ్చి: కేరళ ప్రభుత్వ వన్ టైమ్ అమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం కింద తన వద్ద ఉన్న ఏనుగు దంతాలను డిక్లేర్ చేయడానికి, తద్వారా చట్టపరమైన చర్యల నుండి మినహాయింపు పొందడానికి నటుడు మోహన్లాల్ కేరళ అటవీ శాఖను ఆశ్రయించినట్లు ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది. ఇటీవల ఒక సీనియర్ అటవీ శాఖ అధికారి కొచ్చిలోని మోహన్లాల్ నివాసానికి వెళ్లి, వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 లోని సెక్షన్ 41 ప్రకారం విచారణ జరిపినట్లు సమాచారం. ఈ విచారణలో భాగంగా, ఆ ఏనుగు దంతాలను ఆయన ఎలా సేకరించారు? వాటి వయసు ఎంత? అంతకుముందు వాటిని ఎందుకు డిక్లేర్ చేయలేదు? అనే అంశాలపై మోహన్లాల్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.యాజమాన్య పత్రాలను రద్దు చేసిన హైకోర్టుమోహన్లాల్ వద్ద ఉన్న ఏనుగు దంతాలకు జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలను కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ 2025 అక్టోబర్లో రద్దు చేసింది. అలాగే ఆయన వద్ద ఏనుగు దంతాలు ఉండటాన్ని చట్టబద్ధం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు కొట్టివేసింది. 2015 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్ అధికారిక గెజెట్లో ప్రచురించలేదని, ఈ విధానపరమైన లోపం కారణంగానే ఆ యాజమాన్య ధృవీకరణ పత్రాలు, లైసెన్స్కు చట్టబద్ధత లేకుండా పోయిందని కోర్టు పేర్కొంది.అయితే ఇలాంటి వన్యప్రాణి వస్తువులు కలిగి ఉన్నవారు వాటిని డిక్లేర్ చేసి, మినహాయింపు పొందేలా వన్ టైమ్ అమ్నెస్టీ పథకాన్ని ఉపయోగించుకోవచ్చని హైకోర్టు బెంచ్ అప్పట్లో అభిప్రాయపడింది. హైకోర్టు యాజమాన్య పత్రాలను రద్దు చేసినప్పటికీ, అక్రమంగా ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అటవీశాఖ మోహన్లాల్పై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఈ తరుణంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.కొనసాగుతున్న న్యాయపోరాటంమోహన్లాల్పై ఉన్న ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మోహన్లాల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న క్రిమినల్ విచారణను ఎత్తివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉంది. -
కదిలొచ్చిన దేవతలు
రోడ్డంతా ట్రాఫిక్ జామ్. వాహనాలు అంగుళం కూడా కదలడం లేదు. ఆ సమయంలో ఓ కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రికి చేరుకునే ప్రయత్నంలోనే ఆయన స్పృహ కోల్పోయాడు. చుట్టూ ఉన్నవారికి ఏం చేయాలో అర్థం కాక అయోమయం నెలకొంది. కారులో ఉన్నవాళ్ల కేకలు.. ఆర్తనాదాలు. ఏ దేవుళ్లను తల్చుకున్నారో.. ఏమో ఇద్దరు యువతులు హఠాత్తుగా అక్కడ దర్శనమిచ్చారు. ఆ వ్యక్తిని రక్షించారు.హృదయాన్ని కదిలించే ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం థన్నిపుజ సమీపంలోని ఒక్కల్ ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల సినోజ్ కారులో కుటుంబంతో వెళ్తుండగా.. తీవ్ర ఛాతినొప్పి వచ్చింది. అలా తానే నడిపించుకుంటూ కారులోనే ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే కలాడి వంతెన సమీపంలో భారీ ట్రాఫిక్లో చిక్కుకుపోయాడు. నొప్పి మరింత పెరగడంతో కారులోనే స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. అదే సమయంలో పక్కనే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు నర్సులు ఆ పరిస్థితిని గమనించారు. వెంటనే బస్సు దిగి కారువద్దకు పరుగెత్తారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా సినోజ్కు సీపీఆర్ ప్రారంభించారు. అంతటితో ఆగలేదు. సినోజ్ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న కారులోనే నిరంతరం సీపీఆర్ కొనసాగించారు. దీంతో ఆస్పత్రికి చేరేసరికి ఆయనలో మళ్లీ కదలిక వచ్చింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమని పూర్తిగా బ్లాక్ కావడంతో.. వెంటనే అత్యవసర యాంజియోప్లాస్టీ నిర్వహించి వైద్యులు రక్షించారు. సకాలంలో సీపీఆర్ చేసి సినోజ్ ప్రాణాలు కాపాడినందుకు వైద్యులు ఆ ఇద్దరినీ అభినందించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ల పేర్లు అంజలి బైజు, ఆర్ధ్ర రాజ్. అంజలి అంగమాలిలోని ఎల్ఎఫ్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తోంది. ఆర్ధ్రరాజ్ ఏమో బెంగళూరులో నర్సింగ్ విద్యార్థి. ఈ మొత్తం ఎపిసోడ్లో.. స్థానికుల పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. సినోజ్కు గుండెనొప్పి వచ్చిందని తెలుసుకున్న ఓ వ్యక్తి వెంటనే ఆ కారు స్టీరింగ్ చేపట్టి ఆస్పత్రి వైపు నడిపించాడు. మరికొందరు ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో సహకరించగా, ఇంకొందరు అంబులెన్స్ ఏర్పాటుకు కృషి చేశారు. అందరి సమిష్టి సహకారంతో విలువైన సమయం ఆదా కావడంతో ఒక ప్రాణం నిలిచింది. వైద్య వృత్తి అంటే ఉద్యోగం మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే బాధ్యత కూడా అని అంజలి, ఆర్ద్ర మరోసారి నిరూపించారని నెటిజన్లు కొనియాడుతున్నారు. సరైన సమయంలో అందించిన సీపీఆర్ ఒక మనిషి ప్రాణాన్ని ఎలా కాపాడగలదో ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపించింది. -
లాటరీ టిక్కెట్ల దొంగ అరెస్ట్.. దివ్యాంగుల హర్షం!
త్రిసూర్: కేరళలోని త్రిసూర్ జిల్లాలో దివ్యాంగులైన లాటరీ విక్రేతలను మోసం చేసి, డబ్బులు చెల్లించకుండా లాటరీ టిక్కెట్లతో పరారైన 57 ఏళ్ల వ్యక్తిని అంతికాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడని చొవ్వల్లూరుకు చెందిన కబీర్గా గుర్తించారు. గురువాయూర్లో పోలీసులు కబీర్ను అదుపులోకి తీసుకున్నారు. జూన్ 21న ఉదయం అంతికాడ్కు చెందిన దివ్యాంగులైన నటరాజన్, ప్రియ అనే ఇద్దరు లాటరీ విక్రేతల వద్దకు నిందితుడు కస్టమర్గా వచ్చి ఈ మోసానికి పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కబీర్ స్కూటర్పై వచ్చి, టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి వారి నుండి లాటరీ టిక్కెట్లను సేకరించాడు. ఆ తర్వాత వాటికి డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుండి స్కూటర్పై వేగంగా పరారయ్యాడు. బాధితుడైన నటరాజన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అంతికాడ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సేకరించిన సమాచారంతో నిందితుడిని గురువాయూర్లో గుర్తించి అరెస్ట్ చేశారు. అంతికాడ్ సబ్-ఇన్స్పెక్టర్ విష్ణు నేతృత్వంలోని పోలీస్ బృందం అతనిని అదుపులోనికి తీసుకుంది. నిందితుడు కబీర్ గతంలోనూ ఇదే పద్ధతిలో లాటరీ విక్రేతలను లక్ష్యంగా చేసుకుని టిక్కెట్లు దొంగిలించేవాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. -
నైవేద్యం ఆలస్యమైతే కరిగిపోయే విగ్రహం!.. ఈ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?
ఆకలి.. జీవులకు ఓ గొప్ప వరం.. ఒక్కోసారి అదే పెద్ద శాపం! ‘క్షుధాతురాణాం న రుచి న పక్వమ్’ అన్నారు పెద్దలు. అంటే ఆకలి వేసినప్పుడు రుచులు, పక్వాలు చూడరని అర్థం. ఉదర నిమిత్తం బహుకృత వేషం అని శంకరుల వారే చెప్పారు. కానీ.. ఈ ఆకలికి ఆ దేవుడు అతీతుడా? అసలు దేవుడికి కూడా తీవ్రమైన ఆకలి వేస్తుందా? గ్రహణం పడితే ప్రపంచంలో ఏ గుడైనా మూసేస్తారు.. కానీ, గ్రహణ సమయంలో కూడా ఆకలి తట్టుకోలేక, నైవేద్యం స్వీకరించే వింత దేవుళ్లు ఎక్కడైనా ఉన్నారా?మన దేశంలోని కొన్ని పురాణ క్షేత్రాలు... 'అవును.. దేవుడికి కూడా ఆకలి వేస్తుంది!' అని నిరూపిస్తున్నాయి. ఒక్క 10 నిమిషాలు నైవేద్యం ఆలస్యమైతే చాలు.. అక్కడ దేవుడి విగ్రహం ఆకలితో చిక్కిపోతుంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం! ఆ అద్భుత క్షేత్రాల రహస్యాలు ఏంటో తెలుసా?గ్రహణం అనగానే అందరికీ గుర్తొచ్చేది.. దేవాలయాల తలుపులను మూసివేయడం.. గ్రహణం విడుపు తర్వాత శుద్ధి కార్యక్రమాలు జరిపి, నిత్య సేవలను ప్రారంభించడమే..! కానీ, కొన్ని ఆలయాల్లో దేవుడి ఆకలి కారణంగా.. గ్రహణ సమయంలోనూ ఆలయాల తలుపులు తెరుచుకునే ఉంటాయి. కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఈ కోవలో ముందంజలో ఉంటుంది. ఇక్కడ కొలువుదీరిన కన్నయ్యకు ఆకలి చాలా ఎక్కువ. రోజుకు 10 సార్లు నైవేద్యం పెడతారు. అంతేకాదు.. ఈ ఆలయంలోని గర్భగుడి వెలుపల పెద్ద గొడ్డలి ఉంటుంది. ఉదయం ఆలయం తెరవడానికి తాళం మొరాయిస్తే.. దాన్ని ఈ గొడ్డలితో పగులగొట్టి మరీ.. దేవుడి ఆకలిని తీర్చేలా వెనువెంటనే నైవేద్యాలు పెడతారు. ఈ ఆలయంలో 10 నైవేద్యాల్లో ఏ ఒక్కటి తగ్గినా.. స్వామివారు సన్నబడతారట..! సైన్స్కు కూడా ఈ వింత అంతుచిక్కలేదట..! అందుకే.. ఇక్కడి పూజారులు గ్రహణ సమయంలో కూడా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. స్వామివారు ఆకలిని తట్టుకోలేరనే ఉద్దేశంతో.. గ్రహణ పట్టు.. విడుపులతో సంబంధం లేకుండా నైవేద్యం సమర్పిస్తారు.రాజస్థాన్లోని బికనీర్లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయాన్ని కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంచుతారు. ఓసారి ఇక్కడి ఆలయాన్ని గ్రహణ సమయంలో మూసివేస్తే.. స్వామివారు ఆ పక్కనే ఉన్న మిఠాయి దుకాణం వ్యాపారి కలలోకి వచ్చి.. ‘‘నాకు చాలా ఆకలిగా ఉంది’’ అని చెప్పారట. అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి క్షేత్రంలో శివలింగం స్వయంభూ. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడు నవగ్రహాలను, 27 నక్షత్రాలను కవచంగా ధరించి ఉంటాడు. ఆయనకు గ్రహాలను శాసించే స్వామిగా పేరుంది. అలాంటి స్వామికి గ్రహణ దోషం ఎందుకుంటుంది? అందుకే.. ఇక్కడ గ్రహణ సమయంలో రాహు-కేతులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ఉజ్జయినిలోని మహాకాళుడికి కాలాతీతుడు.. అంటే కాలానికి అతీతుడు అనే పేరుంది. అందుకే.. ఈ స్వామివారికి గ్రహణ ప్రభావం అంటదు. గ్రహణ సమయంలో ఈ జ్యోతిర్లింగ దర్శన సమయాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక దివి నుంచి భువికి గంగాప్రవాహం వచ్చేప్పుడు.. ఆ ఉధృతిని తన జటాజూటంతో నిర్బంధించిన శివుడు ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయంలో కొలువుదీరాడు. ఈయనకు కూడా గ్రహణ సమయంలో పూజలు ఆగవు. ఇక ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో అమ్మవారు కల్కాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆమె సాక్షాత్తూ కాలచక్రానికే అధిపతి. అంటే.. గ్రహాలు, నక్షత్రాలు ఆమె కనుసన్నల్లోనే కదులుతాయి. అందుకే.. గ్రహణ ప్రభావం అమ్మవారిపై ఉండదనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక గయలోని విష్ణుపాద ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. ఇక్కడ గ్రహణ సమయంలో పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. -
కేరళ లాటరీపై ‘కాగ్’ సంచలన నివేదిక
కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే కేరళ స్టేట్ లాటరీ డిపార్ట్మెంట్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రికార్డు స్థాయిలో టికెట్ల విక్రయాలు జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే అసలు లాభాలు (నికర రాబడి) క్రమంగా తగ్గిపోతున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా ఆడిట్ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు అంతర్గత లోపాలు ఈ అదృష్ట వ్యాపారాన్ని తీవ్రంగా వేధిస్తున్నాయి.ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుకేరళ రాష్ట్ర పన్నేతర ఆదాయంలో లాటరీ విభాగం ఇప్పటికీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర మొత్తం పన్నేతర ఆదాయంలో ఈ శాఖ నుంచే ఏకంగా 76.66 శాతం లభించడం దీని ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అంతేకాకుండా, 2024-25 నాటికి లాటరీ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం రాబడి రూ. 12,711.18 కోట్లకు చేరుకుంది.జీఎస్టీ రూపంలో భారీ పన్నులుఈ లాటరీ కేవలం రాష్ట్ర ఖజానాను నింపడమే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయాన్ని కూడా సమకూరుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే లాటరీ విక్రయాల ద్వారా మొత్తం రూ. 3,559.34 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి నేరుగా ఆదాయాన్ని అందించే ఒక ద్వంద్వ ప్రయోజన ఆర్థిక వనరుగా నిలిచింది.తగ్గిన నికర లాభాలుటికెట్ల అమ్మకాలు భారీగా పెరిగినప్పటికీ, ప్రభుత్వం చేతికి వచ్చే నికర లాభం (Net Yield) మాత్రం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో లాటరీ ద్వారా వచ్చిన నికర లాభం రూ. 140.51 కోట్లు తగ్గింది. పెరిగిన అమ్మకాలతో సంబంధం లేకుండా లాభాల శాతం క్షీణించడం వెనుక నిర్వహణ ఖర్చులు పెరగడమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.బహుమతులు, కమీషన్ల భారంలాభాలు తగ్గడానికి గల కారణాలను పరిశీలిస్తే, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఇచ్చే బహుమతి మొత్తం, ఏజెంట్ల నెట్వర్క్ను నిలబెట్టేందుకు ఇచ్చే కమీషన్లు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైజ్ మనీ, కమీషన్ల కోసం డిపార్ట్మెంట్ ఏకంగా రూ. 11,721.98 కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నా, ప్రభుత్వానికి దక్కే వాటా మాత్రం స్వల్పంగానే ఉంటోంది.భారీ వర్షాలు, మెషిన్ల కొరతకేరళ లాటరీ ఆదాయ వృద్ధి రేటు గతంలో నమోదైన 5.36 శాతం నుండి ఒక్కసారిగా 1.44 శాతానికి పడిపోయింది. ఈ మందగమనానికి ప్రధాన కారణం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలేనని అధికారులు పేర్కొన్నారు. దీనికి తోడు కొత్త లాటరీ సిరీస్లను ప్రారంభించడానికి అవసరమైన డ్రాయింగ్ మెషిన్ల కొరత కూడా అమ్మకాల విస్తరణకు ప్రతిబంధకంగా మారింది.ఆడిట్ లోపాలు, నిధుల దుర్వినియోగంఆర్థిక పరమైన సవాళ్లతో పాటు, శాఖలోని పరిపాలనా లోపాలను కూడా ‘కాగ్’ ఎండగట్టింది. జూన్ 2024 నాటికి రూ. 7.30 కోట్లకు సంబంధించిన 77 ఆడిట్ పారాగ్రాఫ్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిపై కనీసం ఒక్క సమీక్షా సమావేశం కూడా జరగలేదు. అంతేకాకుండా, గత 15 ఏళ్లుగా రూ.49.03 లక్షల నిధుల దుర్వినియోగం కేసు ఇప్పటికీ పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోవడం అంతర్గత పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తోంది.ఇది కూడా చదవండి: ఎల్ నినో ముప్పు: ఆ 10 రాష్ట్రాల్లో ‘ప్లాన్ బి’! -
చిప్పలు చెప్పే కథ
వేసవొస్తే కొబ్బరి నీళ్లకు యమగిరాకీ ఉంటుంది. వీధి చివరన, హైవే రోడ్ల మీద, మార్కెట్ యార్డుల దగ్గర.. ఇలా ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి బోండాలు ఎడాపెడా తాగేసి ఖాళీ చేసి పడేస్తాం. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. అయితే తాగి పడేసిన ఖాళీ బోండాల గురించి మాత్రం ఆలోచించం. కాని కేరళకి చెందిన ఓ అమ్మాయి ఆలోచించింది. పనికిరాని చెత్త అనుకున్న కొబ్బరి చిప్పలను కళాకృతులుగా మలిచింది. ఉపయోగం లేదనుకున్నవాటినే ఉపాధిగా ఎంచుకుంది. బ్యాక్ టు హోం...కేరళలోని పాలక్కాడ్కు చెందిన మరియా కురియాకోస్ ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేయడానికి ముంబై వెళ్లింది. ఆ తర్వాత స్పెయిన్లో ఎంబీఏ చేసింది. కార్పొరేట్ రంగంలో రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత ఆమెకు ఏదైనా భిన్నంగా చేయాలి, ఏం చేసినా సొంతంగా గుర్తింపు పొందేలా ఉండాలి అని నిర్ణయించుకుంది. ప్రకృతి జీవవైవిధ్యాన్ని దెబ్బతీయకుండా సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా వ్యాపారం చేయాలని తన స్వస్థలానికి చేరుకుంది.‘తేంగా కోకో’ ప్రారంభం...తొలుత మరియా కొబ్బరి ఆకులతో చిన్నచిన్న ఉత్పత్తులను మొదలుపెట్టింది. అయితే ఆ వ్యాపారం ఆశించినంతగా ప్రాచుర్యం పొందలేదు. కాని ఒకరోజు ఇంట్లో కొబ్బరి చిప్పలను చూసి ఒకదానిని తీసుకుని శుభ్రం చేసింది. సాల్ట్ పేపర్తో బ్రష్ చేసి దానిపై కాస్త ఆయిల్ వేసి రబ్ చేయగా ఆ కొబ్బరి చిప్ప ఓ కళాకృతిలా మరియాకి అనిపించింది. తన తండ్రికి చూపించగా ఆయన కూడా ‘వావ్’అనడంతో కొబ్బరి చిప్పల కళాకృతుల కోసం ‘తేంగా కోకో’ అనే సంస్థను 2019లో ప్రారంభించింది.విదేశాలకు ఎగుమతి...ప్రస్తుతం తేంగా కోకో ఉత్పత్తులు ఇటలీ, స్పెయిన్, బల్గేరియా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి అవుతున్నాయి. హోటళ్లు, రీసార్టులు, కార్పొరేట్ గిఫ్టింగ్ సంస్థలు, రెస్టారెంట్లు ఈ కంపెనీ చెందిన సుమారు 110 రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ వార్షిక ఆదాయం రూ.3.5 కోట్లకు పెరిగింది. వచ్చే ఏడాదికి ఈ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మరియ పేర్కొంది. చిన్న ఆలోచనతో ప్రకృతికి ఏమాత్రం హాని కలగకుండా... పర్యావరణానికి మేలు చేసే వ్యాపారం ఒకవైపు, సంప్రదాయ కళావృత్తులకు జీవం పోసిన వైనం మరోవైపు... రెండింటినీ సాధించి చూపించిన మరియ ప్రతిభ ప్రశంసనీయమని సోషల్ మీడియా సాక్షిగా దేశవిదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలకు ఉపాధికొబ్బరి చిప్పలతో కళాకృతులు తయారుచేసే సంప్రదాయ కళాకారులు కేరళలో ఉన్నప్పటికీ, ప్లాస్టిక్, మెటల్ వస్తువుల రాకతో వారికి సరైన మార్కెట్ లేదు. దీంతో మరియా అలాంటివారిని వెతికి పట్టుకుంది. టీ కప్పులు, స్మూతీ బౌల్స్, సర్వింగ్ స్పూన్లు, ఇతర అలంకరణ వస్తువులను తయారుచేసేలా వారికి అవగాహన కల్పించింది. మెల్లగా తెంగా కోకో ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండడంతో మరింతమంది కళాకారులను చేరదీసి 2024లోపాలక్కాడ్ జిల్లా సరిహద్దులో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. విషయమేమిటంటే ఇక్కడ పని చేసేవారంతా మహిళలే. -
ఘోర ప్రమాదం చిన్నారులపై టిప్పర్ బోల్తా
-
లక్ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్ సీసీటీవీ విజువల్స్
కేరళలోని తిరువనంతపురంలోని కిలిమనూర్ వద్ద MC రోడ్డు వద్ద క్షణాల్లో మృత్యుముఖం నుంచి తప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన ఒక ట్రైలర్ ట్రక్బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ తల్లీబిడ్డల తోపాటు, తండ్రి కూడా ఆ భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారురోడ్డు పక్కన నిలిపిన కారు నుండి ఓ మహిళ తన బిడ్డతో దిగిన మరుక్షణమే, వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఆ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు తునాతునాకలైపోయింది. కానీ కారులో ఉన్న వారిద్దరికీ ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. ఈ భయంకరమైన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.जाको राखे साइयाँ मार सके ना कोईA mother and child had a miraculous narrow escape📍KERALA pic.twitter.com/gYmHVUg1zx— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 22, 2026 నిజంగా లక్ అంటే వీరిదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు గాను ట్రక్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..? -
కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే
-
మహా శివమ్: చెంగల్ శివ పార్వతి క్షేత్రం
మహేశ్వరా! మహాశివా పరమ శివా అని ఈశ్వరుని ఆరాధిస్తాం. అంటే మహాపర్వతం మీద వాసం ఉండేవాడు అని అర్ధం. అంతటి మహాశివుడికి పెద్ద మహా శివాలయాన్ని కేరళలో నిర్మించారు. నిరూపధారిగా లింగ రూపంలో మహా మహా రుద్రాలను తనలో ఆవహించుకున్న మహాదేవుడు లోక రక్షకుడు పరమ శివుడు. మన పుణ్యభూమిలో పలుచోట్ల జ్యోతిర్లింగాలు... ఆత్మలింగాలుగా కొలువుదీరాడాయన. అలాంటి మహాలింగం కేరళలో నిర్మించారు.కేరళ రాజధాని తిరువనంతపురానికి దగ్గర నెయ్యాటింకర అనేప్రాంతంలో ఉంది. నూట పదకొండు అడుగుల ఎత్తు గల శివలింగాన్ని ప్రతిష్టించారు.అక్కడ ఎనిమిది అంతస్థులలో మన దేశంలోకెల్ల పెద్ద శివ క్షేత్రం. దీని పేరు చెంగల్ శివ పార్వతి క్షేత్రం. ఈ స్థల మహాత్మ్యం చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ రెండు సార్లు అతి రుద్ర యజ్ఞం చేశారు. అలాగే మరెన్నో సార్లు అతిరుద్ర యజ్ఞం చేయాలనే సంకల్పం కూడా ఉంది. ఒకసారి అతి రుద్ర మహా యజ్ఞం చేయడమే గొప్ప విషయం. చెంగల్ శివ పార్వతి క్షేత్రం ఉన్న ప్రదేశం ఎంతో పుణ్యభూమిగా భావిస్తారు.ఈ స్థలానికి ఉండే మహత్వాన్ని గమనించి స్వామి మహేశ్వరానంద సరస్వతి ఈ మహా శివలింగ ప్రతిష్ట కోసం పూనుకున్నారు. వీరికి కంచికామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి మంత్ర దీక్ష ఉపదేశించారు. ఈ పుణ్యస్థలం పేరు పుట్టురాకల్. ఇక్కడే శివపార్వతులు పుట్టరూపంలో వెలిశారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో దొరికిన ఆధారాల వలన దేవాలమం 5 వేల ఏళ్ళ పురాతనమైనది అని తెలిసింది. దేశం నలుమూలల నుంచి మట్టి, పవిత్ర నదీ జలాలు వనమూలికలు తెచ్చి నిర్మించారు. మూలాధారంగా వినాయకుడు సరస్వతి బ్రహ్మ రూపాలను ప్రతిష్టించారు. మొదటి అంతస్థు భూ మట్టానికి కింద నిర్మించారు.64 మహారూపాలలో శివుని విగ్రహాలను ఉంచారు. భక్తులు కూర్చుని ధ్యానం చేయడానికి వీలు కల్పించారు అలాగే ప్రతి అంతస్థులో ఓంకారనాదం వినిపిస్తుంటుంది. పంచభూతాలు తనలో ఇమిడి ఉన్నట్టుగా ప్రకృతి అందాలను చిత్రీకరించారు. ఏడవ అంతస్తులోకి వెళితే కైలాసానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది మనకి. సహస్రదళ పద్మాకృతి కింద శివ పార్వతి విగ్రహం ముందు నిలబడి ధ్యానంలోకి వెళ్లడం మనస్సుకి ప్రశాంతంగా ఉండడం గమనించవచ్చు. కింద అంతస్థులో శివలింగ ప్రతిష్ట ఉంది ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. పన్నెండు జ్యోతిర్లింగాల భావన కలిగిన శివ ప్రతిష్ట అద్భుతం. శివపార్వతుల తనయునికి ఇక్కడ చాలప్రాధాన్యత ఉంది. అందుకే 32 విఘ్నేశ్వర రూపాల ప్రతిష్ట ఉంది. బాల గణపతి నుండి యోగ గణపతి వరకు ఉన్న రూపాలకి నిత్యపూజలు జరిపే దేవాలయం ఇక్కడ మాత్రమే ఉంది.అసామాన్య శిల్పకళాచాతుర్యంమహాబలి పురం నుండి వచ్చిన శిల్పుల కళాచాతుర్యం ఇక్కడ ఉన్న విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతుంది. రుద్రుడు అంటేనే మానవ కష్టాలను హరించేవాడు అని అర్ధము. మహా రుద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతి రుద్ర మహా యజ్ఞం చేశారు ఈ యజ్ఞం చేయడం నిజంగా ఎంతో మహత్తర విషయం. పదకొండు రోజులపాటు 121 మంది వేద పండితులు 121 కలశాలతో అభిషేకం, పదకొండు సార్లు రుద్రా మంత్రం జపిస్తే ఫలప్రాప్తి కలుగుతుంది .అటువంటిది రెండుసార్లు జరగడం శివుని శక్తికి నిదర్శనం అని నమ్ముతారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా భావంతో ఇక్కడకు భక్తులు వస్తుంటారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంచెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం 111.2 అడుగుల ఎత్తుతో, ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన శివలింగం గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇంతకుముందు, కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయంలోని 108 అడుగుల ఎత్తైన శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైనది గా ఉండేది.10 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తు గల శివలింగం నిర్మాణం 2012 లోప్రారంభమైంది, దీని నిర్మాణం పూర్తి కావడానికి 6 సంవత్సరాలు పట్టింది. దాని ఎత్తు మాత్రమే కాదు, దాని విశిష్టమైన స్థూపాకార నిర్మాణం, దానిలోపల దాగి ఉన్న అద్భుతమైన ఆశ్చర్యాలు కూడా చూడటానికి ఒక అద్భుతం.కాశీ, గంగోత్రి, రిషికేశ్, రామేశ్వరం, ధనుష్కోడి, బద్రీనాథ్, గోముఖ్, కైలాసం వంటి వివిధ పుణ్యక్షేత్రాల నుండి నీరు, ఇసుక, మట్టిని కూడా నిర్మాణ సామగ్రిలో కలిపారు. అందువల్ల, చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం ఒక దైవిక నిర్మాణంగా భావిస్తారు. ఈ కట్టడంలో 8 అంతస్తులు ఉన్నాయి, వాటిలో ఆరు అంతస్తులు మానవ శరీరంలోని ఆరు చక్రాలు లేదా శక్తికేంద్రాలకుప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ అంతస్తులలో భక్తులు, యాత్రికులు, పర్యాటకులు ఆయా చక్రాలపై ధ్యానం చేయడానికి 6 ధ్యానమందిరాలు ఉన్నాయి. ఈ కట్టడం మొదటి అంతస్తులో 108 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి, ఇక్కడ భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు.భక్తులు మహా శివలింగంలోకి ప్రవేశించవచ్చు. ఈ శివలింగం లోపల, శివలింగం విశ్వ ప్రభావాన్ని అనుభవించడంతో పాటు, శరీరంలోని చక్రాల శక్తిని పెంచుకోవడానికి ధ్యానం కూడా చేయవచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం -
ఆ హక్కులు మావే.. కేరళ ముఖ్యమంత్రి
తిరువనంతపురం: కేరళ సీఎం వీడీ సతీషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలకు సంబంధించిన సిలబస్ రూపకల్పణలో పూర్తి హక్కులు రాష్ట్రాలకే ఉంటాయన్నారు. ఈ అంశంలో కేంద్రానికి ఎటువంటి జోక్యం ఉండకూడదన్నారు. పీఎం శ్రీపథకంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారుకేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం శ్రీ స్కూళ్ల పథకంపై కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రత్యేక కేబినేట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆయన మాట్లాడుతూ" పాఠశాలల పాఠ్యప్రణాళికను నిర్ణయించే రాష్ట్రాల స్వేచ్ఛలో కేంద్రం జోక్యం చేసుకోవడానికి అనుమతించబోము, పాఠశాలల సిలబస్ను నిర్ణయించే రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు" అని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం పీఎం శ్రీ ఒప్పందంపై సంతకం చేసి, కేంద్రం నుంచి రూ. 99 కోట్ల నిధులను సైతం స్వీకరించిందని అందుకోసమే ఈ పథకంలో కొనసాగుతున్నామని తెలిపారు.పీఎంశ్రీపీఎం శ్రీ అనేది దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి, ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. అయితే ఈ పథకం వల్ల జాతీయ విద్యా విధానం అమలుపై వ్యతిరేకత దక్షిణాదిన పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత ఎదురవుతోంది. హిందీని బలవంతంగా బలవంతంగా రుద్దుతోందని తమిళనాడు, కేరళ లాంటి పలు రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీని ద్వారా మాతృభాషకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి మరోసారి ఈ అంశంపై చర్చ లేవనెత్తారు. -
రేపు అర్జెంటీనా మ్యాచ్.. కేరళలో మెస్సీ మేనియా!
ఫిఫా ప్రపంచకప్-2026లో బుధవారం డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ను ఆడనుంది. గ్రూప్-ఐలో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్లో అల్జీరియాతో తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రేపు ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. మెస్సీ ఆఖరి ఫిఫా అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతడి ఆట కోసం ప్రపంచం మొత్తం వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. భారత్లో కూడా మెస్సీకి వీరాభిమానులు ఉన్నారు. కేరళలో మెస్సీ అంటే పడిచచ్చిపోయేవాళ్లు లెక్కలేనంత మంది ఉంటారు. అసలే ఫిఫా ప్రపంచకప్, ఆపై డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో అర్జెంటీనా బరిలోకి దిగుతుండడంతో కేరళలో ఫిఫా కళ వచ్చేసింది. ముఖ్యంగా కేరళలోని పుల్లవూర్ గ్రామంలో మెస్సీ మేనియా మాములుగా లేదు. ఆ ఊర్లో ఎక్కడ చూసినా ఫుట్బాల్ ఆటగాళ్ల కటౌట్లే కనిపిస్తాయి. ఇక్కడ మెస్సీ అభిమానులే కాదు రొనాల్డో, నెయ్మర్, ఎంబాపె, సాలా, లామినే యమాల్ వంటి ఆటగాళ్లకు కూడా విపరీతమైన ఆదరణ ఉంది. అక్కడి ఇళ్లకు కూడా ప్రజలు తమకిష్టమైన జట్ల రంగులను పెయింటింగ్ వేసుకోవడం విశేషం. ఇక రేపు అర్జెంటీనా మ్యాచ్ ఉండడంతో ఆ జట్టు అభిమానులు పుల్లవూరు గ్రామంలో ఉన్న నది మధ్యలో ప్లోటింగ్ బోర్డుపై అర్జెంటీనా జట్టు మొత్తాన్ని కటౌట్ల రూపంలో ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మొత్తం మీద ఫిఫా ప్రపంచకప్ మేనియా ఇప్పుడు భారత్లో కూడా టాప్ గేర్కు చేరుకున్నట్లయింది. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్ను షూటౌట్లో ఓడించి మూడోసారి ఫిఫా టైటిల్ను కైవసం చేసుకుంది.Frome Viral Kerala #Argentina pic.twitter.com/PLUUUWK9Fc— FIFAHighlightsTV (@Worldcupcatcher) June 13, 2026అసలు సమరం మొదలు..మరో విషయమేంటంటే.. బుధవారం ఒక్కరోజే ముగ్గురు బిగ్స్టార్స్ మ్యాచ్లు ఆడనుండడంతో ఫిఫాలో అసలు సమరం మొదలుకానుంది. బుధవారం తెల్లవారుజామున ఫ్రాన్స్, సెనెగల్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత ఉదయం 6.30 గంటలకు మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా అల్జీరియాతో తలపడనుంది. ఇక అదే రోజు రాత్రి 10.30 గంటలకు పోర్చుగల్ కాంగో రిపబ్లిక్తో తలపడనుంది. ఇలా త్రిమూర్తులు ఒకేరోజు మ్యాచ్ ఆడనుండడంతో అభిమానుల్లో ఎనలేని జోష్ వచ్చింది.చదవండి: కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్! -
కేరళ: 3,125 బస్సుల్లో ఉచిత సేవలు షురూ!
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్జెండర్లకు కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ)ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించే ‘ప్రియదర్శిని’ పథకాన్ని సోమవారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ తిరువనంతపురంలోని తంబానూర్ బస్ టెర్మినల్లో ఈ పథకాన్ని ప్రారంభించి, మహిళా ప్రయాణికులకు సరికొత్త కానుకను అందించారు.ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభంఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర రాజధానిలో అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ రిబ్బన్ కట్ చేసి, ఈ సేవలను ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు వీలుగా, కేరళవ్యాప్తంగా ఉన్న అన్ని కేఎస్ఆర్టీసీ డిపోల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమాలను సైతం నిర్వహించారు. VIDEO | Kerala: Chief Minister VD Satheesan formally inaugurates the state government’s flagship ‘Priyadarshini’ free travel scheme for women and transgender individuals.This scheme is part of the UDF government’s ‘Indira Guarantee’ initiative that opens up free transit across… pic.twitter.com/r8ABPsSSS8— Press Trust of India (@PTI_News) June 15, 2026గుర్తింపు కార్డులు అవసరం లేదుఈ పథకానికి సంబంధించి రవాణా సంస్థ నిబంధనలను వెల్లడించింది. ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందడానికి మహిళలు లేదా ట్రాన్స్జెండర్లు ఎలాంటి గుర్తింపు కార్డులను చూపించాల్సిన అవసరం లేదు. అయితే, ప్రయాణం ఉచితమే అయినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య, రికార్డుల కోసం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ‘జీరో-ఫేర్’ టికెట్ను మాత్రం తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, పథకం అధికారికంగా ప్రారంభమైన సమయం నుంచే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు.3,125 బస్సుల్లో ఉచిత సేవలుప్రస్తుతానికి కేరళ రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న 3,125 కేఎస్ఆర్టీసీ సాధారణ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు ఈ బస్సులను సులభంగా గుర్తించేందుకు వీలుగా, వీటికి ప్రత్యేకంగా ‘ప్రియదర్శిని’ అనే స్టిక్కర్లను కూడా అంటించారు. కేరళ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా లోకం నుంచి హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు ఈ పథకంపై రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. అలాగే ప్రైవేట్ బస్సుల యూనియన్ల నుంచి సమ్మె హెచ్చరికలు కూడా వస్తున్నాయి. -
కేరళలో ‘నిపా’: తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్
చెన్నై: పొరుగు రాష్ట్రమైన కేరళలోని కోజికోడ్లో నిపా వైరస్ అనుమానిత కేసు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ రాష్ట్రంలోకి వ్యాపించకుండా నిరోధించేందుకు కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని నీలగిరి జిల్లా యంత్రాంగం నిఘా చర్యలను చేపట్టింది. ఇరు రాష్ట్రాల మధ్య నిరంతరాయంగా జరిగే రాకపోకల దృష్ట్యా, ముందస్తు జాగ్రత్తగా సరిహద్దులను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలునీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మి భవ్య తన్నేరు ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. తాళూర్, నాడుగని, నంబియార్కున్ను, సోలాడి, పట్టవాయల్ వంటి కీలక సరిహద్దు చెక్పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను మోహరించారు. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులలో నిపా వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అని నిశితంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార, ఉపాధి నిమిత్తం ప్రతిరోజూ కేరళకు వెళ్లి వచ్చే సరిహద్దు గ్రామాల ప్రజలు, వలస కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.ఆస్పత్రులకు అత్యవసర ఆదేశాలుపరిస్థితిని అదుపులో ఉంచేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రైవేట్ ఆసుపత్రులను యంత్రాంగం అప్రమత్తం చేసింది. నిపా వైరస్ లక్షణాలతో కూడిన ఏ ఒక్క అనుమానిత కేసు వచ్చినా, వెంటనే ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలని వైద్య సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేరళ నుండి వచ్చే వారికి జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలు ఉంటే స్వచ్ఛందంగా వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.ఆందోళన చెందవద్దుతమిళనాడులో ఇప్పటివరకు ఎలాంటి నిపా వైరస్ ముప్పు నిర్ధారణ కాలేదని, ఈ చర్యలన్నీ కేవలం ముందస్తు జాగ్రత్తలు మాత్రమేనని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఆమె కోరారు. కేరళలో మారుతున్న పరిస్థితులను తాము నిరంతరం సమీక్షిస్తున్నామని, జిల్లా యంత్రాంగం ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉందని తెలిపారు.ఇది కూడా చదవండి: నోయిడా ఎయిర్పోర్ట్: భూములిచ్చిన దాతలకు తొలి విమాన యోగం.. -
పుట్టుకతో ముంజేయి లేని ఐఐటీ గ్రాడ్యుయేట్ సివిల్స్ విజయగాథ..!
ఎన్నో సివిల్స్ విజయగాథలు చూసుంటాం. కానీ పుట్టుకతో ముజేయి లేని ఈ దివ్యాంగురాలి కథ అత్యంత విభిన్నం. సివిల్స్లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా..అనుకున్న ఐఏఎస్ పదవీ మాత్రం దక్కించుకోలేకపోయింది. దాంతో మరోసారి సివిల్స్కి సన్నద్ధమైంది. కానీ ఈ సారి వరుస వైఫల్యాలు ఎదురవ్వుతున్నా.. వెనక్కి తగ్గకుండా ప్రయత్నించి ఐఏఎస్ అధికారి అయ్యింది. అపజయం అంటే విజయానికి ముగింపు కాదని..ప్రయత్నం ఆపకపోవడం అని చాటిచెప్పి యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ అమ్మాయే కేరళకు చెందిన కాజల్ రాజు. ఆమె పుట్టుకతో ఫోకోమెలియా సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి కారణంగా కుడి ముంజేయి లేకుండా జన్మించింది. ఆమె చిన్ననాటి నుంచి చదువులో ముందంజలో ఉండేది. అలా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన ఐఐటి మద్రాస్లో డెవలప్మెంట్ స్టడీస్లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిందామె. అయితే క్యాంపస్లో ఉన్నప్పుడే ప్రజా సేవపై మక్కువ ఏర్పడింది. అలా సివిల్స్ వైపు అడుగులు వేసింది. అయితే తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుని ఆల్ ఇండియా 910వ ర్యాంకు దక్కించుకుని ఐఆర్ఎస్కు ఎంపికైంది. అయితే కాజల్ అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. అందుకే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో చేరడమే లక్ష్యంగా మరోసారి సివిల్స్కి సన్నద్ధమైంది. ఈసారి మరింతగా ర్యాంకును మెరుగుపరుచుకోవాలనుకుంటే..మరింతగా ర్యాంకు దిగజారగా, మూడోసారి ఏకంగా ప్రిలిమ్స్లోనే ఓటమిని చవి చూసింది. నిజానికి ఈ వరుస వైఫల్యం ఎవ్వరికైనా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయేలా చేస్తుంది. కానీ కాజల్కి మరింతగా బలంగా ప్రిప్రేరవ్వాలన్న కసి అంతకంతకు పెరిగింది. అలా ఆమె సివిల్స్లో చివరికి ఆల్ ఇండియా ర్యాంక్ 167కి మెరుగుపరుచుకుని ఐఏఎస్ అధికారి అయ్యింది. ఇక్కడ కాజల్కి రైల్వే సర్వీస్ శిక్షణ, యూపీఎస్సీ ప్రిపరేసన్ అత్యంత సవాలుగా మారింది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ చదవడం అత్యంత కష్టంగా ఉన్నా..ఏదోరకంగా ప్రిపరేషన్ కొనసాగించేది. తనకు ఏ కాస్త చిన్న సమయం దొరికినా..పుస్తకాలతో కుస్తీ పట్టేది. అంతేగాదు ఉద్యోగ బిజీ షెడ్యూల్ని, ప్రిపరేషన్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి క్రమశిక్షణతో కూడిన నిలకడ అవసరం. ఈ కథ ఎదురుదెబ్బలు విజయాన్ని ఆలస్యం చేయొచ్చేమో గానీ అందుకోసం ప్రయత్నం మాత్రం ఆపకూడదనే స్ఫూర్తిని సివిల్స్ ఔత్సాహికుల్లో నింపుతోంది కదూ..!.(చదవండి: 92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..) -
మాట జారిన రాహుల్.. ఇండియా కూటమిలో దుమారం
తిరువనంతపురం: ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలపై విజయన్తో పాటు సీపీఎం అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇండియా కూటమిలో ఐక్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఇంతకీ రాహుల్ ఏమన్నారంటే..ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో మిత్రపక్షాల మధ్య సంబంధాలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేరళ రాజకీయాలను ప్రస్తావిస్తూ..‘కేరళలో మేము సీపీఎంతో రాజకీయంగా పోరాడుతున్నాం. అక్కడ పినరాయి విజయన్ మా ప్రధాన ప్రత్యర్థి. అందుకే నేను వెళ్లి ఆయనను హగ్ చేసుకోలేను, చేయను కూడా’ అని కామెంట్స్. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.పినరాయి ఘాటు స్పందన..రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన పినరాయి విజయన్.. తనకు హగ్ చేయడం లేదా చేయకపోవడం అసలు సమస్య కాదన్నారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశమే ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు.‘నన్ను హగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ గతంలో పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హగ్ చేసిన విషయం దేశం మొత్తం చూసింది. ఇప్పుడు నన్ను హగ్ చేయలేనని చెప్పడం ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పే కాంగ్రెస్ నాయకత్వం, అదే సమయంలో మిత్రపక్షాలపై దాడి చేయడం సరైన రాజకీయ విధానం కాదని విమర్శించారు.సీపీఎం నుంచి తీవ్ర ప్రతిస్పందన..రాహుల్ వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేజీ కూడా తీవ్రంగా స్పందించారు. ‘పినరాయి విజయన్ను హగ్ చేయమని ఎవరూ రాహుల్ గాంధీని అడగలేదు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణలను బలపరిచేలా మాట్లాడటం మాత్రం మానుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడులు బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అనవసర వివాదాలకు దారితీస్తాయని అన్నారు.Mr Rahul Gandhi said in INDIA alliance meeting that he cannot hug his alliance partner CPM’s ex-CM Mr Pinarayi Vijayan because he has an ongoing political fight with him. pic.twitter.com/8G9OE0npcm— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) June 14, 2026కేరళలో కాంగ్రెస్-సీపీఎం ప్రత్యర్థులేఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఎం జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ, కేరళలో మాత్రం రెండు పార్టీలు దశాబ్దాలుగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. కేరళలో ఎల్డీఎఫ్కు సీపీఎం నాయకత్వం వహిస్తుండగా, యూడీఎఫ్కు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. ప్రతి ఎన్నికలోనూ ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ జరుగుతుంది. అందువల్ల జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తున్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో పరస్పరం విమర్శించుకోవడం కొనసాగుతోంది.కూటమికి కొత్త తలనొప్పి..ఇప్పటికే ఇండియా కూటమిలోని పలు మిత్రపక్షాల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ మధ్య, పంజాబ్లో కాంగ్రెస్-ఆప్ మధ్య, కేరళలో కాంగ్రెస్-సీపీఎం మధ్య రాజకీయ పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూటమి ఐక్యతపై కొత్త సందేహాలకు తావిచ్చాయి. 2029 లోక్సభ ఎన్నికల దిశగా ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో మిత్రపక్షాల మధ్య బహిరంగ విమర్శలు కూటమికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇండియా కూటమి నాయకుల మధ్య పరస్పర విమర్శలు అధికార బీజేపీఒకి రాజకీయ అస్త్రంగా మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు వేదికలపై ఐక్యంగా ఉన్నామని చెబుతూనే, మరోవైపు పరస్పరం విమర్శించుకోవడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా రాహుల్ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం కాంగ్రెస్-సీపీఎం మధ్య మాటల యుద్ధానికి దారితీయగా, ఇండియా కూటమి భవిష్యత్తుపై కూడా కొత్త చర్చకు తెరలేపింది. -
నిపా కలకలం: క్షీణించిన బాధితుడి ఆరోగ్యం.. అబ్జర్వేషన్లో 100 మంది !
కోజికోడ్: కేరళను మరోసారి నిపా వైరస్ వణికిస్తోంది. కోజికోడ్లో నిపా పాజిటివ్గా తేలిన 43 ఏళ్ల వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ తీవ్ర అప్రమత్తమైంది. బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య నిపుణులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటిలేటర్పై బాధితుడు.. మెడికల్ బోర్డ్ భేటీఫారూఖ్ కాలేజీ ప్రాంతానికి చెందిన ఈ బాధితుడికి ప్రస్తుతం చికిత్సా ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన అన్ని రకాల మందులను అందజేస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 48 గంటల తర్వాత బాధితుడి ఆరోగ్య పరిస్థితిని మెడికల్ బోర్డ్ నిశితంగా సమీక్షించనుంది. ఆ తర్వాతే ఆయనకు రెండో డోస్ ‘మోనోక్లోనల్ యాంటీబాడీ’ చికిత్సను అందించాలా వద్దా అనే దానిపై వైద్యులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.కొత్తగా ఇద్దరు స్నేహితులు చేరికమరోవైపు బాధితుడికి అత్యంత సమీపంగా ఉన్న భార్య, కుమారుడు, సోదరిల నుంచి సేకరించిన నమూనాల పరీక్షల్లో నిపా నెగెటివ్గా తేలడం కాస్త ఊరటనిచ్చే అంశం. శనివారం నాడు మరో నలుగురు లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా, ప్రస్తుతం మొత్తం ఏడుగురు అనుమానితులు కోజికోడ్ మెడికల్ కాలేజీలో అబ్జర్వేషన్లో ఉన్నారు. బాధితుడితో పరిచయం ఉన్న ఇద్దరు స్నేహితులకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో వారిని కూడా ఆసుపత్రిలో చేర్చారు. అలాగే బాధితుడు వెళ్లిన రెడ్ క్రెసెంట్ ఆసుపత్రిని సందర్శించిన 9 ఏళ్ల చిన్నారికి కూడా జ్వరం, దగ్గు రావడంతో ఐసోలేషన్కు తరలించి నమూనాలను పరీక్షలకు పంపారు.100కి చేరిన నిఘా జాబితావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ను ముమ్మరం చేశారు. కొత్తగా మరో 13 మందిని ఈ జాబితాలో చేర్చడంతో, ప్రస్తుతం నిఘాలో ఉన్న వారి సంఖ్య 100కు పెరిగింది. ఇందులో అత్యంత ప్రమాదకర విభాగం (వెరీ హై-రిస్క్)లో నలుగురు, హై-రిస్క్ విభాగంలో 14 మంది, తక్కువ ప్రమాదం (లో-రిస్క్) ఉన్న విభాగంలో 82 మంది ఉన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. -
తల్లిదండ్రుల మధ్య వివాదం.. చిన్నారికి పేరు పెట్టిన కోర్టు!
తల్లిదండ్రుల మధ్య వివాదం ఓ చిన్నారికి ‘పేరు’ సంకటాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులిద్దరూ చెరో పేరూ చెప్పడంతో ఏ పేరూ ఖరారు కాలేదు. తల్లిదండ్రులిద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని రిజిస్ట్రార్ చెప్పడం వివాదానికి కారణమైంది. చివరికి ఆ చిన్నారి తల్లి కోర్టును ఆశ్రయించింది. ఆ కుటుంబ సమస్యకు పరిష్కారమే కాదు.. ‘పేరెంట్’ అనే పదానికి ఉన్నత న్యాయస్థానం అర్థం చెప్పింది.కేరళకు చెందిన సంగీత, బాలగంగాధరన్ నాయర్ దంపతులకు 2020లో ఓ పాప జన్మించింది. తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. చిన్నారికి ఏ పేరు పెట్టాలనే అంశంపై వారి మధ్య సయోధ్య కుదరక ఏ పేరూ పెట్టలేదు. రోజులు గడిచాయి. పాపను స్కూల్లో చేర్చాల్సిన సమయం వచ్చింది. జనన ధ్రువీకరణ పత్రంలో చిన్నారి పేరు లేకపోతే అడ్మిషన్ ఇవ్వడం కుదరదని యాజమాన్యం చెప్పింది. దీంతో ‘పేరు’ తప్పనిసరి అయింది.కోర్టును ఆశ్రయించిన తల్లిపేరు నమోదు కోసం తల్లి జనన, మరణ ధ్రువీకరణ రిజిస్ట్రార్ను కలిసింది. ‘ఫుణ్యనాయర్’ పేరుతో తన కుమార్తెకు జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరింది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని ఆ అధికారి చెప్పాడు. దీంతో కుమార్తెకు పేరు పెట్టేందుకు తన భర్త సహకరించేలా ఆదేశించాలని కోరుతూ ఆమె మొదట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వాలని, పేరు నమోదుకు సహకరించాలని తండ్రిని కోర్టు ఆదేశించింది. ఇరువురు కలిసి నమోదు కేంద్రానికి వెళ్లాలని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులు పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.ఉన్నత న్యాయస్థానానికి చేరిన సమస్యహైకోర్టులో ఆ చిన్నారి పేరు విషయమే కాదు, జనన, మరణాల నమోదు చట్టం–1969లోని సెక్షన్ 14 ప్రకారం పేరు నమోదుకు తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు వెళితే సరిపోతుందా? పేరు నమోదుకు ఇద్దరి అంగీకారం అవసరమా? ‘ది పేరెంట్’ అంటే అర్థం ఏమిటి? అనే ప్రశ్నలు కేసు విచారణ సందర్భంగా తలెత్తాయి. వీటిపై కోర్టు లోతుగా విశ్లేషించింది.‘ది పేరెంట్’ ఏకవచనమే‘ది పేరెంట్’ లేదా గార్డియన్ అని దరఖాస్తులో ఉంది. పేరెంట్ అంటే తల్లి లేదా తండ్రి అని డిక్షనరీ సూచిస్తోంది. బ్లాక్స్ లా డిక్షనరీ ప్రకారం పేరెంట్ అంటే ‘ఒక వ్యక్తికి చట్టబద్ధమైన తండ్రి లేదా తల్లి’. అందువల్ల పేరెంట్ అనే పదం తండ్రిని గాని తల్లిని గాని సూచించవచ్చు అని కోర్టు పేర్కొంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇద్దరినీ కలిపి కూడా సూచించవచ్చని తెలిపింది. ఈ పదానికి ఏ అర్థం ఇవ్వాలనే కేసు పరిస్థితుల ఆధారంగా కొన్ని సందర్భాల్లో నిర్ణయించాల్సి వస్తోందని పేర్కొంది.చట్టంలో పేరెంట్ అనే పదానికి ముందు ‘ద’ అనే ఆర్టికల్ను ఉపయోగించారు. పేరెంట్ అనే పదాన్ని పేరెంట్స్ అనే బహువచన రూపంలో ఇవ్వలేదు. కావున ‘ద పేరెంట్’ అనే పదానికి ఏకవచన అర్థం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. ‘బోత్ పెరెంట్స్’ అని ఎక్కడా లేదు. అందువల్ల తల్లి లేదా తండ్రి వారిలో ఎవరైనా పేరు నమోదుకు హక్కు కలిగి ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. చట్టంలో లేని విధంగా ఇద్దరూ కలిసే దరఖాస్తు చేయాలి. ఇరువురి అంగీకారం కావాలని రిజిస్ట్రార్ కొత్త నియమాన్ని పెట్టలేడని పేర్కొంది. ఈ వ్యాఖ్యానం ఆధారంగా తల్లి లేదా తండ్రి తొందరపడి తనకు నచ్చిన పేరుతో పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఆపేరు నచ్చకపోతే చట్టపరంగా సవరణలు కోరే అవకాశం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.పాప భవిష్యత్తే ముఖ్యం‘పుణ్య నాయర్’ అని తన కుమార్తెకు పేరు పెట్టాలని తల్లి కోరింది. ‘పద్మ నాయర్’ పేరును తండ్రి సూచించాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్న సమయంలో ‘పిల్లల ప్రయోజనాలనే పరిగణన’లోకి తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది. పాప భవిష్యత్తే ముఖ్యమని పేర్కొంది. పేరు విషయంలో తల్లిదండ్రులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ‘పేరెన్స్ పాట్రీ’ కింద కోర్టే తుది నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారి తన తల్లి సంరక్షణలోఉన్నందున ఆమె సూచించిన పేరుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. పితృత్వం విషయంలో ఎలాంటి వివాదం లేనందున తండ్రి పేరును కూడా చేర్చాలని అభిప్రాయపడింది. ‘పుణ్య బాలగంగాధరన్ నాయర్’ సంక్షిప్తంగా ‘పుణ్య బి.నాయర్’ గా ఆ చిన్నారికి పేరు పెట్టింది. ఈ పేరుతో కొత్తగా దరఖాస్తు చేయాలని సూచించింది. దరఖాస్తు అందిన 15 రోజుల లోపు ఆ పేరుతో జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.ఈ కేసులో కోర్టు కేవలం ‘పేరు’ వివాదాన్ని మాత్రమే పరిష్కరించలేదు. పిల్లల హక్కులు, వారి భవిష్యత్తు, చట్టంలో పేర్కొన్న పదాలకు ఇవ్వాల్సిన సరైన అర్థం గురించి స్పష్టత ఇచ్చింది. కన్నబిడ్డకు తల్లిదండ్రులే పేరు నిర్ణయించలేని స్థితిలో కోర్టే స్వయంగా ఓ చిన్నారికి పేరు పెట్టడంతో న్యాయవ్యవస్థలో ఇది ఆసక్తికరమైన, అరుదైన తీర్పుల్లో ఒకటిగా నిలిచింది. - దిలీప్ మాదిరెడ్డి -
యుద్దంలో పాక్ ఓడిపోతే అదే చేయాలి
తిరువనంతరపురం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో చర్చలు జరపాలని RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గతంలో చేసిన వ్యాఖ్యలు సమర్ధిస్తున్నానని తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ ఇలా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ "మనం హిట్లర్ లాంటి వాళ్లం కాదు, అది మన స్వభావం కూడా కాదు. ఒకవేళ భవిష్యత్తులో జరిగే యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోతే.. అక్కడ ఉన్న ప్రజలను భారత్లో భాగం చేయడమో లేదా వారు ప్రశాంతంగా జీవించేలా చూడడమో చేయాలి. అందుకోసం వారితో చర్చలు జరిపే మార్గాలను (తలుపులను) ఎప్పుడూ తెరిచే ఉంచాలి" అని భగవత్ పేర్కొన్నారు. అన్యాయాన్ని, నియంతృత్వాన్ని అంతమొందించాలని అదే సమయంలో మంచిని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.పాకిస్తాన్లో మారుతున్న ఆలోచనలుదేశ విభజన జరగడం తప్పని భావించే ప్రజలు పాకిస్తాన్లో చాలా మంది ఉన్నారన్నారు. అక్కడ ఉన్న పలువురు జర్నలిస్టులు కూడా ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారని, 'రెండు దేశాల సిద్ధాంతం తప్పని, కలిసి ఉంటేనే బాగుండేదనే భావన అక్కడ అంతర్గతంగా బలంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏ దేశంతోనైనా విదేశీ సంబంధాల విషయంలో ఆర్ఎస్ఎస్కు విడిగా ఎలాంటి ప్రత్యేక విధానాలు ఉండవని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకే సంఘ్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ, అత్యంత అపార్థానికి గురైన సంస్థ కూడా ఇదేనని వ్యాఖ్యానించారు. యూనిఫామ్ వేసుకుని చేసే రూట్ మార్చ్లను చూసి కొందరు దీనిని పారామిలిటరీ సంస్థ అనుకుంటారని, వ్యాయామాలు చూసి వ్యాయామశాల అనుకుంటారని, కానీ బయట నుండి చూస్తే సంఘ్ అర్థం కాదని, దానిని లోపలికి వచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన కోరారు. -
హ్యాపీ రీరిలీజ్.. కేరళలో భాయ్ సెన్సేషన్
-
కేరళ ఆర్టీసీ బస్సుల్లో రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం
తిరువనంతపురం: ఎన్నికల వాగ్దానం ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన ప్రియదర్శిని పథకం అమలవుతుందని తెలిపింది. ఈ పథకం కింద కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన ఆర్డీనరీ బస్సుల్లోని ఏడు కేటగిరీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వివరించింది.ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఆర్డినరీ బస్సుల్లోని ఏడు కేటగిరీల్లో ట్రాన్స్జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రియదర్శిని పథకం కింద ఉచిత ప్రయాణానికి ఎంపిక చేసిన బస్సులపై ప్రత్యేకంగా స్టిక్కర్లను అంటిస్తామని అధికారులు తెలిపారు. ఈ పథకం అమలుతో అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించనుంది. -
శబరిమలలో రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ
తిరువనంతపురం: వచ్చే శబరిమల యాత్రా సీజన్లో జనసమూహ నిర్వహణ , డిజిటలైజేషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో సహా పలు కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ శుక్రవారం తెలిపారు.ఇక్కడ జరిగిన టీడీబీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అనేక సన్నాహక పనులు చాలా ముందుగానే చేపడుతున్నామని జయకుమార్ తెలిపారు.‘మేము వివిధ వ్యవస్థలను డిజిటలైజ్ చేసే దిశగా కృషి చేస్తున్నాము. శబరిమలలో నగదు లావాదేవీలకు తావు ఉండదు; ప్రతిదీ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీలకే పరిమితం కాదు, పరిపాలనా ప్రక్రియలకు కూడా వర్తిస్తుంది’ అని ఆయన అన్నారు.జనసమూహ నిర్వహణకు సంబంధించిన మరో ముఖ్యమైన కార్యక్రమం ఉందని ఆయన అన్నారు. ‘జూన్ 20న, పోలీసు శాఖ సహకారంతో, జన సమూహాల నిర్వహణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించడంపై కొచ్చిలో ఒక ప్రధాన వర్క్షాప్ను నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో సుమారు ఆరుగురు గుర్తింపు పొందిన ఏఐ నిపుణులు పాల్గొంటారు’ అని ఆయన అన్నారు.వాస్తవ రద్దీ పరిస్థితుల ఆధారంగా నీలక్కల్, పంపా, మరకూట్టం మరియు సన్నిధానానికి యాత్రికుల రాకపోకలను నియంత్రించే ఒక ప్రొటోకాల్ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ‘ రియల్ టైమ్లో ఏఐని ఉపయోగించి, ఏ సమయంలోనైనా ఎంత మందిని ముందుకు వెళ్లడానికి అనుమతించాలనే దానిపై నిర్ణయాలు తీసుకోబడతాయి. ఈ వర్క్షాప్ జూన్ 20న కొచ్చిలోని ఐఎంఏ హాల్లో జరుగుతుంది’అని స్పష్టం చేశారు. జూన్ 14న టీడీబీ హరిత శబరిమల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం శబరిమల యాత్రకు సంబంధించి దానికి అనుగుణంగా జల ప్రాధికార సంస్థ, విద్యుత్ బోర్డు, అటవీ శాఖ, పోలీస్ శాఖ మరియు ఇతర ఏజెన్సీల అధికారులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ టీడీబీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు. ‘అన్ని విభాగాలను సమన్వయం చేసి, శబరిమల కోసం సమగ్రమైన గ్రీన్ ప్రోటోకాల్స్ను అమలు చేయడమే లక్ష్యం. గ్రీన్ ప్రోటోకాల్తో పాటు, మేము ప్రత్యేక పారిశుధ్య ప్రోటోకాల్ను కూడా ప్రవేశపెడుతున్నాము. సుచిత్వ మిషన్తో కూలంకషంగా చర్చలు జరిగాయి," అని ఆయన అన్నారు.తగినంత పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడమే అతిపెద్ద ఫిర్యాదులలో ఒకటిగా ఉందని జయకుమార్ అన్నారు. ‘ఇప్పటివరకు కొన్ని ప్లాస్టిక్ డబ్బాలను పెట్టడమే సాధారణ పద్ధతిగా ఉండేది, కానీ అది సరిపోలేదు. మేము మూడు డబ్బాల విధానానికి మారుతున్నాము," అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి మద్దతుగా టీడీబీ తగినన్ని స్టీల్ వ్యర్థాల డబ్బాలను సమకూరుస్తుంది. వ్యర్థాలను వాటి మూలం వద్దనే జీవవిచ్ఛిన్నమయ్యేవి, జీవవిచ్ఛిన్నం కానివి మరియు ప్రమాదకర వ్యర్థాలు అనే మూడు వర్గాలుగా విభజిస్తారు.‘సరైన వ్యర్థాల విభజన బాధ్యతను దుకాణ యజమానులకు అప్పగిస్తాము, ఇందుకోసం ఇప్పటికే ఒప్పందాలు సిద్ధం చేశాము. మేము వ్యర్థాల సరైన శుద్ధిని కూడా నిర్ధారించి, బయో-ట్రీట్మెంట్ సౌకర్యాలను పూర్తిస్థాయిలో పనిచేసేలా చేస్తాము’ అని ఆయన అన్నారు. ఈ దిశగా గణనీయమైన పురోగతి సాధించబడుతోందని అన్నారు. ‘ ఈ ఏడాది శబరిమల యాత్రను అత్యంత వృత్తిపరంగా నిర్వహించాలన్నదే మా కల, దానిని సాధించేందుకు బోర్డు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు. -
రూ. 12 కోట్ల గంజాయి : అడ్డంగా బుక్కైన కేరళ బ్యూటీ
పేరుకే అందాల సుందరి. చేసేది మాత్రం గలీజ దందా. 28 ఏళ్ల మోడల్, 'మిసెస్ కేరళ' 2025 పోటీదారు హర్ష సన్నీ దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా బుక్కైంది. బ్యాంకాక్ నుండి విమానంలో ముంబైకి వస్తూ పోలీసులకు చిక్కింది.కస్టమ్స్ అధికారుల ప్రకారం, హర్ష సన్నీ జూన్ 10-11 తేదీల రాత్రి ఎయిర్ ఇండియా విమానం TG-351లో బ్యాంకాక్ నుండి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. బ్యాంకాక్నుంచి 11 కిలోలకు పైగా హై క్వాలిటీ 'హైడ్రోపోనిక్ గంజాయి'ని గుట్టుచప్పుడు కాకుండా బాగానే తీసుకొచ్చింది. కానీ ఆమె ప్రవర్తనను గమనించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU), కస్టమ్స్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా అసలు గట్టు రట్టైంది. ఇదీ చదవండి: ఒకే ఒక్కడు మృత్యుంజయుడు.. ఇపుడెలా ఉన్నాడు?ఆమె ట్రాలీ బాగ్లో 12 వాక్యూమ్-సీల్డ్ ప్లాస్టిక్ ప్యాకెట్లు లభించాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) కిట్ను ఉపయోగించి అక్కడికక్కడే జరిపిన రసాయన పరీక్షలో, ఆ పదార్థం'హైడ్రోపోనిక్ గంజాయి' అని నిర్ధారణ అయింది. విలువ రూ. 11.82 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఆమెను ఎన్డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ సరుకును ముంబైలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కడకు చేరవేయాలనుకున్నారనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ! -
కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం : హై అలర్ట్
కేరళలో మరో సారి నిపా వైరస్ (Nipah Virus) కలకలం రేపుతోంది. కోజికోడ్లోని ఫెరోక్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేరళ ఆరోగ్య అధికారులు అప్రమత్త మయ్యారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగానే ఉందని పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు.ప్రాథమిక పరిశీలన ప్రకారం, రోగికి మొదట మామూలు జ్వరం వచ్చి తగ్గింది, ఆ తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. నిపా అనుమానిత కేసుగా గుర్తించడానికి ముందు పలు ఆసుపత్రిలను సందర్శించిన తరువాత సదరు రోగి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్పేషెంట్ విభాగానికి వచ్చారు. దీంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక గిడ్డంగిని శుభ్రం చేస్తున్నప్పుడు అతనికి ఈ ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశంలో వైరస్ సోకిన గబ్బిలాలు ఉండటమే వైరస్ వ్యాప్తికి ప్రాథమిక కారణమని దర్యాప్తు అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన మూలాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇదీ చదవండి: రూ. 954 కోట్ల స్కాం : భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకోనేందుకు గురువారం తిరువనంతపురంలోని ఆరోగ్యమంత్రి కె. మురళీధరన్ కార్యాలయంలో సీనియర్ ఆరోగ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్య అధికారులు ఇప్పటికే కాంటాక్ట్-ట్రేసింగ్ చర్యలను ప్రారంభించారని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ఆందోళన వద్దు : కేరళ ఆరోగ్య మంత్రిబాధిత వ్యక్తి చాలా మందిని కలిసినప్పటికీ, ప్రస్తుత దశలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. సంబంధిత రోగి చికిత్స కోసం వెళ్లిన ప్రైవేట్ ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించారని, దీనివల్ల ఇతరులకు కూడా వైరస్ వ్యాపించి ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా, ఆ రోగి వెళ్లినఆసుపత్రి సిబ్బందిని క్వారంటైన్లోకి వెళ్లాలని ఆదేశించినట్లు చెప్పారు.ఇదీ చదవండి: వాహనదారులకు గుడ్ న్యూస్, ఆ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం రద్దు -
Kerala: చొరబాట్ల కలకలం.. 10 వేల మంది నకిలీ పౌరులు?
తిరువనంతపురం: కేరళలో వలస కూలీల ముసుగులో భారీ ఎత్తున బంగ్లాదేశ్ పౌరులు అక్రమంగా నివసిస్తున్నారనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొల్లాం జిల్లాలోని కొట్టారక్కరలో ఇటీవల పోలీసులు పది మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకోవడంతో ఈ నకిలీ గుర్తింపు పత్రాల రాకెట్ గుట్టురట్టయింది. కేవలం 700 రూపాయలకే అసలైన వాటిని పోలిన నకిలీ ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను సృష్టిస్తూ, సుమారు 10,000 మందికి పైగా బంగ్లాదేశీయులు భారతీయ పౌరులుగా చలామణి అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామం దేశ రక్షణ, ఇంటెలిజెన్స్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.రూ.700లకే గుర్తింపు పత్రాలుపోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, అక్రమ వలసదారులు మొదట పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ సరిహద్దు ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ ప్రాథమిక నకిలీ పత్రాలను సంపాదించిన తర్వాత, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కేరళకు చేరుకుంటున్నారు. కేరళలోని స్థానిక చిరునామాలను ఉపయోగించుకుని, పూర్తి స్థాయి నకిలీ ఐడీలను సృష్టిస్తున్నారు. దీని వెనుక బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలించి, వాటిలో బంగ్లాదేశ్ పాస్పోర్ట్ల కాపీలను కనుగొనడంతో వారి అసలు పౌరసత్వం బయటపడింది.గొలుసుకట్టు వలసల గుట్టుఈ అక్రమ వలసల్లో గొలుసుకట్టు (చైన్ మైగ్రేషన్) విధానం సాగుతున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. 13 ఏళ్ల క్రితం కేరళకు వచ్చిన ముగల్ ఖాతూన్ అనే బంగ్లాదేశ్ మహిళ, ఇక్కడ ‘మామ్దాస్’ అనే నకిలీ పేరుతో అన్ని రకాల గుర్తింపు పత్రాలను పొందింది. ఆ తర్వాత ఆమె తన బంధువులను కూడా ఇక్కడికి రప్పించింది. అరెస్ట్ కావడానికి రెండు నెలల ముందే ఆమె బంగ్లాదేశ్ పాస్పోర్ట్ ఉపయోగించి ఇద్దరు పిల్లలతో కలిసి స్వదేశానికి వెళ్లివచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ కూలీలకు, బంగ్లాదేశీయులకు మధ్య ఉన్న స్వల్ప భాషా వ్యత్యాసాల ద్వారా వీరిని గుర్తించవచ్చని, అయితే భయం కారణంగా స్థానికులు సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది.భద్రతా ఆందోళనలు ఈ వ్యవహారాన్ని కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థలు అత్యంత తీవ్రమైన భద్రతా సమస్యగా పరిగణిస్తున్నాయి. దేశ వ్యతిరేక శక్తులు లేదా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కూడా ఈ నకిలీ పత్రాలను వాడుతున్నారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, పోలీసుల నిఘా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశీయులు కేరళను విడిచి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో కేరళలోని వలస కార్మికులందరి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్రమ చొరబాటుదారులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు.ఇది కూడా చదవండి: సువేందు దూకుడు.. 2,980 అక్రమ వలసదారుల ఏరివేత! -
ఎత్తయిన ఏనుగుపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు!
న్యూఢిల్లీ: కేరళలోనే అత్యంత ఎత్తయిన ఏనుగుగా పేరొందిన ‘రామన్’ సంరక్షణపై దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కీలక నిర్ణయం తీసుకుంది. నోరులేని మూగజీవాల సంక్షేమమే పరమావధి అని స్పష్టం చేస్తూ, రామన్ను తక్షణమే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపి, రామన్ను ఒక సరైన పునరావాస కేంద్రానికి తరలించాలని స్పష్టం చేసింది.కోర్టు ధిక్కరణ..వాణిజ్య దోపిడీ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ రామన్ ఏనుగును వాణిజ్య అవసరాలకు, ఉత్సవాలు, వివిధ ఆచారాల ఊరేగింపుల కోసం విపరీతంగా ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ, ఏనుగును నిర్బంధంలో ఉంచిన కృష్ణన్కుట్టి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ క్రమంలోనే అతనికి రూ. 2,000 జరిమానా కూడా విధించింది. నోరులేని మూగజీవాల పట్ల జరుగుతున్న ఇటువంటి ఉల్లంఘనలపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేమని, మూగ ప్రాణుల సంక్షేమం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.మాతా అమృతానందమయి మఠంతో.. జయకృష్ణ మీనన్ అనే వ్యక్తి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ఆధారంగా ఈ విచారణ జరిగింది. పిటిషనర్ వాదనల ప్రకారం.. ఈ రామన్ ఏనుగు వాస్తవానికి 'మాతా అమృతానందమయి మఠం'నకు చెందినది. దాని సంరక్షణ, నిర్వహణ బాధ్యతల కోసం మాత్రమే తాత్కాలికంగా కృష్ణన్కుట్టి అనే వ్యక్తికి అప్పగించడం జరిగింది. అయితే, కృష్ణన్కుట్టి ఒక వివాదాస్పద విలునామా (ఉయిల్), గిఫ్ట్ డీడ్స్ ఆధారంగా ఈ ఏనుగు చట్టబద్ధంగా తనకే దక్కిందని, గత 10-12 ఏళ్లుగా తానే దాన్ని నిరంతరాయంగా పోషిస్తున్నానని కోర్టుకు తెలిపాడు.కేరళ ప్రభుత్వానికి తాత్కాలిక బాధ్యతలుప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్వాధీన ఆదేశాలు కేవలం తాత్కాలికమైనవని, కోర్టు వెలువరించే తుది తీర్పునకు ఇవి లోబడి ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 లోని చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా కేరళ ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ఈ ఏనుగును తాత్కాలికంగా సంరక్షించాలని, ఇందుకు అవసరమైన పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేయవచ్చని పేర్కొంది. మరోవైపు, ఏనుగుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నించిన కేరళ రాష్ట్ర అధికారులను కోర్టు ధిక్కరణ ఆరోపణల నుండి న్యాయస్థానం విముక్తి కల్పించింది.ఇది కూడా చదవండి: ‘దీదీ’కి భారీ షాక్: ఢిల్లీలో టీఎంసీ ఆఫీస్ ఖాళీ -
పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు
తిరువనంతపురం: మనీలాండరింగ్ కేసులో కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె వీణాకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం కొచ్చిలోని తమ కార్యాలయానికి హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. వీణాతో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థకు చెందిన అధికారులు సహా మొత్తం తొమ్మిది మందికి ఈ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.కాగా, గత నెల పినరయి విజయన్ నివాసంలో ఈడీ ఆకస్మిక తనీఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విజయన్ నివాసంతో పాటు ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ భారీ సోదాలు చేసింది. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈడీ దర్యాప్తు కేరళంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.కొచిన్ మినలర్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్ను శాఖ కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో సోదాలు నిర్వహించిన తరువాత.. సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, చెల్లింపుల వివరాలు బయటపడ్డాయి. అందులో అవకతవకలు బయటపడ్డాయి. కొన్ని లావాదేవీలు నిజమైన వ్యాపార సేవలకు సంబంధం లేకుండానే జరిగాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సీపీఎం, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. నిరసనల సమయంలో ఈడీ సిబ్బంది, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడులు జరిగాయని ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే పోలీసుల చర్యను కేరళ ప్రభుత్వం సమర్థించగా, దర్యాప్తును అడ్డుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. -
మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు!
తిరువనంతపురం: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న భారతీయ హెల్త్కేర్ కార్మికులు, ముఖ్యంగా కేరళకు చెందిన నర్సులు, పారామెడికల్ సిబ్బంది ప్రస్తుతం ఊహించని వీసా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అక్కడ నివసిస్తున్న వేలాది మంది నర్సులు, ఇతర వైద్య సిబ్బంది వీసా సమస్యల కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, దేశం విడిచి వెళ్లాల్సిన (డిపోర్టేషన్) పరిస్థితి తలెత్తింది. ఈ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చిత భవిష్యత్తుపై కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మానవీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక అత్యవసర లేఖ రాశారు.ఇరాన్ ఆస్పత్రి ఉద్యోగుల ఆందోళనప్రాంతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ ఉద్రిక్తతల ప్రభావం దుబాయ్లోని ఇరానియన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కేరళ వైద్య సిబ్బందిపై పడింది. ఇక్కడి ఆంక్షల కారణంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని సీఎం సతీశన్ లేఖలో పేర్కొన్నారు. యూఏఈ నిబంధనల ప్రకారం వీరికి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ముగిసిపోతుండటంతో, గడువులోగా వీసా హోదాను క్రమబద్ధీకరించుకోకపోతే డిపోర్టేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వారి కెరీర్ను దెబ్బతీయడమే కాకుండా, భవిష్యత్తులో ఉద్యోగ, ప్రొఫెషనల్ లైసెన్సింగ్ అవకాశాలను కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించారు.కుటుంబాల భవితవ్యం ప్రమాదంలో..ఈ అకస్మాత్తు వీసా ఇబ్బందుల వల్ల ఉపాధి వీసాలు, విజిట్ వీసాలు, డిపెండెంట్ వీసాలు పొందడం కష్టంగా మారింది. యూఏఈలో స్థిరపడిన అనేక మలయాళీ కుటుంబాలు తమ పిల్లల విద్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో అక్కడి జీవితానికి అలవాటు పడ్డాయి. ఇప్పుడు ఉద్యోగాల ముప్పు, దేశ బహిష్కరణ భయాల నేపథ్యంలో వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వం పూర్తిగా ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి వివరించారు.మానవీయ కోణంలో జోక్యం చేసుకోవాలిఈ సంక్షోభానికి తగిన పరిష్కారం కనుగొనేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తక్షణమే యూఏఈలోని భారత రాయబార కార్యాలయం, అక్కడి అధికారులతో చర్చలు జరపాలని సీఎం కోరారు. కోవిడ్-19 మహమ్మారి వంటి క్లిష్ట సమయాల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఫ్రంట్లైన్ వారియర్లుగా ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించిన భారతీయ వైద్య సిబ్బంది సహకారాన్ని ఆయన గుర్తుచేశారు. కాబట్టి ఈ సమస్యను మానవీయ కోణంలో, న్యాయబద్ధంగా పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు: గగనతలాన్ని మూసేసిన ఇరాక్, సిరియా -
లుక్స్, భాష పరంగా..అభద్రతా భావంతో ఉండేదాన్ని..!
కజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ కేరళ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే ఈ టైటిల్ను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె అరుదైన రికార్డును సృష్టించారు. అయితే ఆమెను ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ గెలుపు ఎలా సాధ్యమైందని ప్రశ్నించగా..అందుకు కజియా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారామె. మిస్ యూనివర్స్ ఇండియాకు సిద్ధమవుతున్న ఈ 19 ఏళ్ల యువతి..తన లుక్స్, సంభాషణ పరంగా అభద్రతా భావంతో ఉండేదాన్ని అని చెప్పింది. దాంతో ఆత్మవిశ్వాసంగా ఉండలేకపోయాదాన్ని అని వాపోయారు. అయితే దీన్ని అధిగమించడం రాత్రికి రాత్రే జరిగిపోలేదన్నారు. ఇలా కాదు మొదట తాను కాన్ఫిడెంట్ని డెవలప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాని అన్నారామె. అందుకోసం తనపై తాను ఫోకస్ పెట్టడం ప్రారంభించానని అన్నారామె. అంటే నా సంభాషణ నైపుణ్యాలు, వ్యక్తిత్వం, రూపం ఇలా మొత్తం తనపై తాను ఎక్కువ దృష్టి పెట్టి మెరుగయ్యేలా చేసుకున్నానని అన్నారు. అయితే తనకు బాగా హెల్ప్ అయిన విషయం ఏంటంటే..సాధించే వరకు ఆపొద్దు అనే సూత్రంం. ఈ భూమ్మీద నేనే అత్యంత ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని అని తన బ్రెయిన్ని పూర్తిగా నమ్మించి వేదికలపైకి కాన్ఫిడెన్స్గా నడవగలిగానని అన్నారు. ఇక తనకు ఈ అందాల పోటీలపై ఆసక్తి మొదలైంది..2021లో భారతదేశం మిస్ యూనివర్స్ గెలవడాన్ని చూసిన తర్వాతేనని అన్నారామె. అంతవరకు అందాల పోటీల గురించి పెద్దగా తెలియదని అన్నారు. భారత్ ఆ పోటీల్ల గెలవడంతో తనలో ఏదో స్ఫూర్తి రగిలిందన్నారు. అదీగాక హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ 2021ను గెలుచుకోవడంతో భారత్ 21 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లైందని పేర్కొంది. అంతకుముందు 1994లో సుష్మితా సేన్, 2000లో లారా దత్తా ఈ టైటిల్ని గెలుచుకున్నారు. అయితే చాలామంది ఈ అందాల పోటీలను కేవలం శారీరక సౌందర్య ప్రదర్శనగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. అయితే ఈ అందాల పోటీలు గెలిచినా, గెలవకపోయినా..మీ గొంతుని కనుగొనడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వంటివి ఎన్నో నేర్పిస్తుందన్నారు. పైగా ఈ జర్నీలోని ఎంతో మెరుగవుతాం అంటూ తన సంభాషణను ముగించారామె.(చదవండి: అంతా అయిపోయాక కాదు..ముందుగా తెలుసుకోవాల్సిన ఆరోగ్య పాఠాలు..!) -
కేరళ, కర్ణాటకలో అలర్ట్ ఐఎండీ భారీ వర్ష హెచ్చరిక
-
‘లింగ వివక్ష బస్సులు’.. ఉచిత బస్సులపై రచ్చ!
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం మహిళలు, విద్యార్థినులకు కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. 2026, జూన్ 15 నుంచి అమలు కానున్న ఈ పథకాన్ని ఎల్డీఎఫ్ (డీఎల్ఎప్) కూటమి భాగస్వామ్య పక్షమైన కేరళ కాంగ్రెస్ (ఎం) ఛైర్మన్ జోస్ కె. మణి స్వాగతించారు. అయితే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కేవలం అమ్మాయిలకే పరిమితం చేయడం వల్ల విద్యార్థుల మధ్య లింగ వివక్ష తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక వర్గానికే కాకుండా, అబ్బాయిలకూ ఈ ఉచిత సౌకర్యాన్ని వర్తింపజేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా విజ్ఞప్తి చేశారు.విద్యార్థుల్లో వివక్ష వద్దు పాఠశాలలు, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు వంటి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించేటప్పుడు అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఎలాంటి తేడాలు చూపడం లేదని జోస్ కె. మణి గుర్తుచేశారు. కేవలం రవాణా సౌకర్యం విషయంలోనే ఇలాంటి భేదాలు చూపడం సమంజసం కాదని ఆయన తన ఫేస్బుక్ పోస్ట్, వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఒకే తరగతిలో కలిసి చదువుకునే విద్యార్థుల్లో ఒకరికి ఉచిత ప్రయాణం, మరొకరికి కాదనడం వల్ల వారి మధ్య తారతమ్యాలు ఏర్పడతాయని, అందువల్ల లింగభేదం లేకుండా విద్యార్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.ఉచిత రవాణా ఒక పెట్టుబడి విద్యా రంగంలో కేరళ ఎప్పుడూ ముందుంటుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఉచిత రవాణా విధానాన్ని తీసుకురావాలని జోస్ కె. మణి ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో సుమారు 33 లక్షల మంది విద్యార్థులు వివిధ ప్రయోజనాలను పొందుతున్నారని, దీనికి అదనంగా ఇల్లు - పాఠశాల మధ్య ఉచిత ప్రయాణ గ్యారంటీని కూడా జోడించాలన్నారు. ఈ పథకానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం ఆర్థిక భారంగా భావించకూడదని, ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని ఆయన హితవు పలికారు.కేఎస్ఆర్టీసీ ముందడుగు వేయాలి ఈ ఉచిత ప్రయాణ విధానాన్ని ప్రభుత్వ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులకూ వర్తింపజేయాలని జోస్ కె. మణి సూచించారు. ప్రస్తుతానికి ప్రైవేట్ ఆపరేటర్లకు ఈ పథకాన్ని విస్తరించడం సాధ్యం కాకపోతే, కనీసం కేఎస్ఆర్టీసీ బస్సుల్లోనైనా హయ్యర్ సెకండరీ స్థాయి వరకు ఉన్న విద్యార్థులందరికీ తక్షణమే ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చదువుకోవడానికి రవాణా అనేది ఒక ముఖ్యమైన అవసరమని, ఇల్లు దాటి విద్యాసంస్థకు వెళ్లి, మళ్లీ సురక్షితంగా ఇళ్లకు చేరుకునే పూర్తి బాధ్యతను ప్రభుత్వమే భరించాలని ఆయన స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: సురేష్ గోపీ రాజీనామా?.. సస్పెన్స్కు ఎండ్ కార్డ్! -
‘గ్రాండ్ఫేర్వెల్’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!
ఎవరైనా ఉద్యోగం నుంచి రిటైర్ అయితే శాలువా కప్పి సన్మానం చేసి నాలుగు మంచి మాటలు చెప్పడం చాలా కామన్ అయితే మంచి చెప్పడం కన్నా చేతల్లో చూపించడం అరుదు. అదే చేశారు కేరళలోని కొందరు పూర్వ విద్యార్థులు. కాసరగాడ్లోని చెన్మాద్ వెస్ట్ గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో హెడ్మాస్టర్గా పని చేసిన పీటీ. బెన్నీ గతవారం రిటైర్ అయ్యారు. పూర్వ విద్యార్థులు, స్కూల్ ఉపాధ్యాయ బృందంతో పాటు గ్రామస్తులందరూ కలిసి ఓ కారుని బెన్నీకి బహుమానంగా అందజేశారు.నూట ఇరవై ఏడు సంవత్సరాల స్కూల్చెన్మాద్ స్కూల్ను ఏర్పాటు చేయడానికి 1899లో చెన్మాద్ జమాద్ కమిటీ కొంత స్థలాన్నిచ్చింది. ఆ తర్వాత క్రమక్రమంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కాని పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా సదుపాయాలు, ఉపాధ్యాయులు, ఇతర వసతులు అందుబాటులోకి రాలేదు. పీటీ బెన్నీ ఎక్కడ పని చేసినా ఎవరో ఇచ్చే విరాళాల కోసం చూడకుండా తన సొంత ఖర్చులతో స్కూలును బాగు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావర ణాన్ని అందించేవారు. ఆయన గురించి తెలిసి 2019లో చెన్మాద్ స్కూల్కి రప్పించారు. హెడ్మాస్టర్గా బెన్నీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాలను పూర్తిగా మార్చివేశారు. ఆయన ప్రయత్నం చూసి స్థానికులు కూడా తమ వంతు సాయం చేశారు. ఫలితంగా అతి తక్కువ కాలంలోనే తరగతి గదులు పెరిగాయి. పాఠశాలకు రెగ్యులర్గా 25 మంది ఉపాధ్యాయులను నియమించారు. విద్యార్థుల సంఖ్య 550 నుంచి 850కి పెరిగింది. ప్రముఖ పోగటీ పరీక్షలలో పాఠశాల విద్యార్థులు టాపర్స్గా నిలిచారు. నూట ఇరవై ఏడు సంవత్సరాల పాఠశాల చరిత్రలో ఉత్తమ గురువుగా బెన్నీ పేరు సంపాదించారు. తమ గురువు రిటైర్మెంట్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులే కాదు పూర్వ విద్యార్థులతో పాటు మొత్తం గ్రామమంతా పండగలా నిర్వహించి పదమూడు లక్షల విలువైన కారును బహుమతి ఇచ్చి తమ గురు భక్తిని చాటుకున్నారు. తమ గురువు రిటైర్మెంట్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులే కాదు పూర్వ విద్యార్థులతో పాటు మొత్తం గ్రామమంతా సంబరంలా నిర్వహించి పదమూడు లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చి తమ గురు భక్తిని చాటుకున్నారు. (చదవండి: ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..) -
ఎల్డీఎఫ్లో చిచ్చు.. కేరళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్
కేరళలో ఎన్నికల పరాజయం తర్వాత ఎల్డీఎఫ్లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా అసెంబ్లీలో డిప్యూటీ ప్రతిపక్ష నేత పదవిపై సీపీఎం–సీపీఐ మధ్య తీవ్ర పోటీ చెలరేగడంతో లెఫ్ట్ కూటమిలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. ఒకవైపు ఈ పదవి తమకే దక్కాలని సీపీఐ గట్టిగా పట్టుబడుతుండగా, మరోవైపు సంప్రదాయాలను చూపిస్తూ సీపీఎం వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది.కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష డిప్యూటీ నేత పదవిపై ఎల్డీఎఫ్లో భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తాయి. రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తమకే ఈ పదవి దక్కాలని సీపీఐ స్పష్టం చేస్తూ.. ఈ విషయంలో జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని కూడా కోరింది. ఇక సీపీఎం మాత్రం గత సంప్రదాయాలను ప్రస్తావిస్తూ, ఈ పదవిని ఎప్పటినుంచో తమ పార్టీనే నిర్వహిస్తోందని వాదిస్తోంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న నేపథ్యంలో కీలక పదవుల పంపకంలో మార్పులు అవసరం లేదని సీపీఎం నేతలు చెబుతున్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చేతిలో ఎల్డీఎఫ్ ఓటమి పాలైన తర్వాత కూటమిలో అంతర్గత సమీక్షలు, చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు సమావేశాలు జరుగుతూ, ఎన్నికల పరాజయానికి కారణాలపై విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఈ అంతర్గత చర్చల మధ్యే సీపీఎం–సీపీఐ మధ్య పదవుల వివాదం మరింత వేడెక్కింది. అంతకుముందే ప్రతిపక్ష నేత పదవిపై కూడా పినరయి విజయన్ పేరుకు సీపీఐ అభ్యంతరం తెలిపిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఓటమికి నాయకత్వమే కారణమన్నది సీపీఐ వాదనగా ఉంది. మొత్తంగా, ఎన్నికల పరాజయం తర్వాత ఎల్డీఎఫ్లో మొదలైన అంతర్గత చిచ్చు ఇప్పుడు కీలక పదవుల పంపకంపైకి చేరి, కూటమి ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. -
ఇక వర్షాతిరేకం
న్యూఢిల్లీ: వేసవి ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తూ నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం ప్రకటించింది. సాధారణంగా ఈ రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. నైరుతి రుతుపవన కాలం(జూన్–సెపె్టంబర్) ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కాస్త ఆలస్యంగా రుతుపవనాలు కేరళను తాకాయి. ‘‘నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, మొత్తం లక్షదీ్వప్ దీవులు, కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు, కొమరిన్ ప్రాంతంలోని మిగిలిన భాగాలు, ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి విస్తరిస్తున్నాయి’’అని ఐఎండీ వెల్లడించింది. మే 26న కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ గతంలో అంచనా వేసింది. అయితే, ఎల్నినో ప్రభావంతో రుతుపవనాల రాక ఆలస్యమైంది. వీటి ప్రభావంతో కేరళ, తమిళనాడు తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న కొన్ని రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రుతుపవనాలు మరో వారం రోజుల్లోగా పొరుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. -
పొట్టకూటి కోసం వెెళితే.. రూ. 52 కోట్ల లాటరీ
మనామా: ఆ భారతీయుడు పొట్టకూటి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. ఆ దేశంలో చిన్నచితకా వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే అంతలోనే ఆ చిరువ్యాపారిని అదృష్టలక్ష్మీ వరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 52 కోట్ల లక్కీడ్రాలో అతనికి దక్కింది. దీంతో ప్రవాస భారతీయుడు ఆనందంతో ఉబ్బితబ్బయ్యాడు.కేరళ త్రిసూర్కు చెందిన కృష్ణకుమార్ అనే వ్యక్తి గత 23 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం బహ్రెయిన్కు వెళ్లాడు. అప్పటి నుండి అక్కడ పలురకాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఏలాగైనా తన జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని భావించిన కృష్ణకుమార్ లాటరీ టికెట్లను కొనడం ప్రారంభించాడు. అప్పటి నుంచి తరచుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన కొనుగోలు చేసిన లాటరీ టికెట్ బంఫర్ డ్రాలో రూ. 52 కోట్ల ఫ్రైజ్మనీ గెలుచుకుంది. దీంతో బహ్రెయిన్ కరెన్సీ ప్రకారం రూ. రెండు కోట్ల దిర్హమ్లు ( రూ. 52 కోట్ల) రుపాయల ఫ్రైజ్మనీ గెలుచుకున్నారు. అయితే తను కొన్న టికెట్ లక్కీడ్రాలో ఎంపికవడంతో నిర్వాహకులు తనకు ఫోన్ చేశారని ఆసమయంలో తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని కృష్ణకుమార్ తెలిపారు. అయితే ఇన్నేళ్లుగా తన స్నేహితులతో కలిసి లాటరీ టికెట్లు కొనేవాడినని ఇప్పుడు స్వంతంగా టికెట్ కొనడం దానికి లాటరీ తాకడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఇంతపెద్దమెుత్తంలో డబ్బు చూడడం ఇదే తొలిసారని బహుమతి డబ్బులతో ఏం చేయాలనే విషయం తన కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని కృష్ణకుమార్ అన్నారు. అయితే ఈ లాటరీలో మెుదటి బహుమతి 25 మిలియన్ల దిర్హమ్లు కాగా ఐదుగురికి ఒక మిలియన్, లగ్జరీ కార్లు బహుమతులుగా ఉన్నాయి. -
నాటి రోజుల్లో కేరళ రుతుపవన సంకేతాలు
నేడు శాటిలైట్లు, డాప్లర్ రాడార్లు, స్మార్ట్ఫోన్ అలర్ట్లు వాతావరణాన్ని ముందుగానే చెబుతున్నాయి. కానీ, టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే కేరళ ప్రజలు నైరుతి రుతుపవనాల రాకను అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేసేవారు. గ్రామాలు, వరి పొలాలు, అడవులు, నదీ తీరాల వెంబడి నివసించే మలయాళీలు ప్రకృతిని నిశితంగా గమనించడం ద్వారా వర్షాన్ని పసిగట్టే పద్ధతులను గ్రహించారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయ పరిజ్ఞానం కేరళ వ్యవసాయ సంస్కృతితో గాఢంగా ముడిపడి ఉంది.కీటకాల కదలికలే వాతావరణ అలర్ట్లువర్షం రాకను సూచించడంలో కీటకాల ప్రవర్తన కీలక పాత్ర పోషించేది. స్థానికంగా ‘ఈయం పాట’ అని పిలిచే రెక్కల చెదపురుగులు నేల నుండి ముదురు రంగులో పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఎగిరితే, త్వరలోనే వర్షం పడుతుందని పెద్దలు నమ్మేవారు. ఒకవేళ తెల్లటి చెదపురుగులు ఎగిరితే వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయని సంకేతంగా భావించేవారు. అలాగే, వరి పొలాలపై ‘తుంబి’ (తూనీగలు) గుంపులుగా నేల నుండి ఒక నిర్దిష్ట ఎత్తులో తిరుగాడితే, దానిని వర్షపాతానికి నమ్మదగిన సూచికగా రైతులు గుర్తించేవారు.చీమల వేగం.. పక్షుల అరుపులుసంప్రదాయ వాతావరణ పరిజ్ఞానంలో చీమల క్రమశిక్షణ కూడా ఒక అద్భుతమైన హెచ్చరికగా పనిచేసేది. చీమలు తమ గుడ్లను నోట కరుచుకుని సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలకు వేగంగా తరలిస్తూ కనిపిస్తే, ఒకటి లేదా రెండు రోజుల్లో భారీ వర్షం కురుస్తుందని గ్రామస్థులు బలంగా నమ్మేవారు. ప్రకృతి అందించే అత్యంత నమ్మదగిన హెచ్చరికలలో ఇది ఒకటి. వీటితో పాటు, పక్షుల అరుపులు, వాటి అసాధారణ కదలికలు కూడా వాతావరణంలో రాబోయే మార్పులకు సంకేతాలుగా నిలిచేవి.వృక్ష సంపదలో వర్షపు ఛాయలుకేరళలోని రైతులు కేవలం జంతువులనే కాకుండా మొక్కలు, చెట్ల మార్పులను కూడా నిశితంగా గమనించేవారు. బ్రహ్మజెముడు (క్యాక్టస్) వంటి కొన్ని అడవి మొక్కలు పూయడం రుతుపవనాల కాలానికి స్వాగత గీతంగా భావించేవారు. అలాగే, విషు పండుగతో ముడిపడి ఉన్న ‘కొన్న’ (రేల చెట్టు) పుష్పించే నమూనాలను బట్టి వర్షాన్ని అంచనా వేసేవారు. కొన్ని ప్రాంతాలలో మర్రిచెట్టు ఊడలను కోసి, వాటి లోపల తేమను పరిశీలించేవారు. అక్కడ తేమ కనిపిస్తే వర్షం త్వరలోనే కురవనుందని చెప్పేవారు.అంతరిక్ష విజ్ఞానం: న్యాట్టువేల క్యాలెండర్సంప్రదాయ అంచనా వ్యవస్థలలో అత్యంత అధునాతనమైనది 'న్యాట్టువేల' క్యాలెండర్. ఇది 27 నక్షత్రరాశుల గుండా సూర్యుని గమనాన్ని బట్టి సంవత్సరాన్ని నిర్దిష్ట వ్యవసాయ కాలాలుగా విభజిస్తుంది. పంటలు విత్తడానికి, నాట్లు వేయడానికి, కోతలకు రైతులు ఈ చక్రాన్నే నమ్ముకునేవారు. ముఖ్యంగా జూన్ నెలలో వేసవి కాలం ముగిసే సమయంలో (సమ్మర్ సోల్స్టిస్) వచ్చే ‘తిరువాతిర న్యాట్టువేల’ అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ కాలం ప్రారంభమైన తదుపరి 14 రోజులు బలమైన, స్థిరమైన వర్షాలు కురుస్తాయని, ఇది పంటల వృద్ధికి ఎంతో అవసరమని భావిస్తారు.ఆధునిక కాలంలోనూ సజీవ సాక్ష్యంప్రస్తుత ఆధునిక యుగంలో అత్యాధునిక వాతావరణ నమూనాలు, సైన్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఈ పురాతన జ్ఞానం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. కేరళలోని చాలా మంది రైతులు తమ వ్యవసాయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేటికీ ఆధునిక వాతావరణ అంచనాలతో పాటు, ఈ 'న్యాట్టువేల' క్యాలెండర్ పరిశీలనలను కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. సాంకేతికత ఎంత పెరిగినా పూర్వీకుల అనుభవానికి ఉన్న విలువను ఇది నిరూపిస్తోంది.అంతరిస్తున్న అపురూప వారసత్వంప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా రుతుపవనాల నమూనాలు అనూహ్యంగా మారుతున్నాయి. దీనివల్ల కాలక్రమేణా ఈ సాంప్రదాయ అంచనా పద్ధతులు జ్ఞాపకాల నుండి కనుమరుగవుతున్నాయి. అయినప్పటికీ, కేరళ పర్యావరణ, సాంస్కృతిక వారసత్వంలో ఇవి ఎంతో విలువైనవని పరిశోధకులు, చరిత్రకారులు చెప్తున్నారు. శాటిలైట్లు తూనీగలను, వెదర్ యాప్లు చీమలను భర్తీ చేసినా.. మానవుడు ప్రకృతితో ఎంత మమేకమై జీవించవచ్చో చెప్పడానికి కేరళ రైతుల ఈ పురాతన విజ్ఞానమే ఒక సజీవ నిదర్శనం. ఇది కూడా చదవండి: కేరళం తీరాన్ని తాకిన నైరుతి.. దంచికొడుతున్న వర్షాలు -
కేరళం తీరాన్ని తాకిన నైరుతి.. దంచికొడుతున్న వర్షాలు
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రాథమిక సమాచారం వెలువడుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఒక్కసారిగా పెరిగి, అనేక జిల్లాల్లో భారీ వర్ష సూచనలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత పెరగడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ ప్రవేశాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.కేరళలోని సుమారు 15 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షాలు, తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరగవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇదే సమయంలో కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ తమిళనాడు, చెన్నై ప్రాంతాల్లో కూడా వర్ష సూచనలు వెలువడుతున్నాయి. అక్కడ కూడా మేఘావృత వాతావరణం నెలకొని, రాబోయే గంటల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ఆలస్యంగా, దాదాపు పది రోజుల ఆలస్యంతో కేరళ తీరాన్ని తాకినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి తీవ్రత ఆశించినంత బలంగా లేదని భారత వాతావరణ శాఖ ప్రాథమిక విశ్లేషణలో పేర్కొంది. రుతుపవనాల ప్రస్తుత దశ బలహీనంగానే కొనసాగుతోందని ఐఎండీ అంచనా వేస్తోంది.ఇక రాబోయే వారం రోజుల్లో ఈ రుతుపవనాలు క్రమంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు విస్తరించే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి. మరో వారం తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే చాన్స్ కనిపిస్తోంది. దక్షిణ భారతంలో వర్షపాతం పెరుగుతుందా లేదా అన్నది రుతుపవనాల బలం, దిశపై ఆధారపడి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం కేరళలో వర్షాలు మొదలైన నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాబోయే రోజుల్లో రుతుపవనాల వేగం ఎలా మారుతుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
మోనాలిసా దంపతులకు ఊరట
కొచ్చి: కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన మోనాలిసా భోస్లేకు, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్కు ఊరట లభించింది. వాళ్లను అరెస్ట్ చేయొద్దని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.మోనాలిసా మైనర్ అని, ఆమెను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు.. అలాగే ఈ వివాహం చట్టబద్ధం కాదనే మధ్యప్రదేశ్ పోలీసుల అభ్యంతరాల నేపథ్యంలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ అభియోగాలను తోసిపుచ్చుతూ అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ మోనాలిసా, ఫర్మాన్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నెలరోజుల పాటు ఫర్మాన్ ఖాన్ను అరెస్ట్ చేయొద్దని మద్యప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఈలోగా.. అక్కడి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఈ జంటకు కోర్టు సూచించింది. 2025 కుంభమేళా సందర్భంగా పూసలు విక్రయిస్తూ వైరల్ అయిన మోనాలిసా భోస్తే Monalisa Bhosle ఈ ఏడాది ప్రారంభంలో కేరళలో మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకుంది. మతాంతర వివాహం కావడంతో ఈ వ్యహారం పెను దుమారం రేపింది. అయితే మోనాలిసా వివాహం సమయంలో కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఉన్నారని ఆరోపణలు రావడంతో వివాహ చట్టబద్ధతపై వివాదం చెలరేగింది. దీంతో పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. ఇక మోనాలిసా తండ్రి పోలీసులకు కిడ్నాప్ ఫిర్యాదు చేయడంతో ఫర్మాన్ ఖాన్పై కేసు నమోదైంది. తాము ఎలాంటి అక్రమానికి పాల్పడలేదని, మోనాలిసా మైనర్ కాదని దంపతులు కోర్టులో వాదించారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు, మోనాలిసా వయస్సుకు సంబంధించిన పత్రాల్లో ఫోర్జరీ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె జననం 2009 డిసెంబర్లో జరిగిందని, దంపతులు చెబుతున్నట్లుగా 2008 జనవరిలో కాదని వాదించారు. అయితే ఈ ఆరోపణలను మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు ఖండించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్.. ఒక నెలపాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.ఇదీ చదవండి: కేరళలో ఉండడం మీ అదృష్టం! -
కేరళలో ఉండడం మీ అదృష్టం!
కొచ్చి: కుంభమేళా సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే కేసులో కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోనాలిసా, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ ముగిసింది. బుధవారం(ఇవాళ) ఈ కేసు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న తీర్పు రిజర్వ్ చేసే సమయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.విచారణలో భాగంగా న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ “మీరు కేరళలో ఉన్నందుకు అదృష్టవంతులు” అని వ్యాఖ్యానించారు. దానికి మొనాలిసా తరఫు న్యాయవాది.. అందువల్లే వీళ్లు ఇంకా బతికి ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై నెట్టింట దుమారం రేగింది. జడ్జి వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..న్యాయ వర్గాల ప్రకారం కోర్టు ఉద్దేశం కేసుపై ప్రత్యక్ష అభిప్రాయం వ్యక్తం చేయడం కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ కేసు చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, ఒత్తిళ్లు, భద్రతా పరిస్థితులను పరోక్షంగా సూచించడమేనని భావిస్తున్నారు. కేరళలో న్యాయ ప్రక్రియ తక్కువ ఒత్తిడితో, మరింత నిష్పక్షపాత వాతావరణంలో సాగుతోందన్న సందేశాన్ని ఆ వ్యాఖ్య ద్వారా ఇచ్చినట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఈ కేసు ఒక సాధారణ వివాహ వివాదం నుంచి ఇప్పుడు ఇంటర్ఫెయిత్ వివాహం, వయస్సు నిర్ధారణ(ఆమె మైనర్ అనే ఆరోపణలు), ఫోర్జరీ ఆరోపణలు, కిడ్నాప్ కేసులు వంటి పలు తీవ్రమైన ఆరోపణలతో కేరళ-మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెద్ద న్యాయ వివాదంగా మారింది. మోనాలిసా వివాహం, ఆమె వయస్సు నిర్ధారణ, మతాంతర వివాహ చట్టబద్ధతతో పాటు పలు రాష్ట్రాల్లో నమోదైన క్రిమినల్ కేసులు వంటి పలు క్లిష్ట అంశాలు ఒకేసారి విచారణ జరిగాయి.ఇక మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమపై వివిధ వర్గాల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వయస్సు తప్పుడు నమోదు, ఫోర్జరీ ఆరోపణలు సహా కేసు తీవ్రమని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు కేవలం వ్యక్తిగత వివాదంగా కాకుండా రెండు రాష్ట్రాల అంశంగా మారింది. తీర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. -
పశ్చాత్తాపంతో 40 ఏళ్ల తర్వాత లొంగిపోయిన కిల్లర్
తిరువనంతపురం: నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఉదంతం ఇప్పుడు హంతకుడి ఆత్మప్రబోధంతో బయటపడింది. కేరళలో 40 ఏళ్ల క్రితం జరిగిన హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి, ఆ హత్యను తానే స్వయంగా చేశానని తెలియజేసి లొంగిపోయాడు. కోజికోడ్ జిల్లా కూడరంజికి చెందిన 55 ఏళ్ల మహమ్మద్ అలీ గత ఏడాది పోలీసులను ఆశ్రయించాడు. 1980ల కాలంలో తాను రెండు హత్యలు చేశానని, తనను అరెస్ట్ చేయాలని కోరాడు.అవి తాను తెలియక చేసిన తప్పులని, ఇప్పుడు పశ్చాత్తాపంతో లొంగిపోతున్నానని మీడియాకు తెలిపాడు. కోర్టు విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే ఈ వింత కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మహమ్మద్ అలీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. 1986లో కూడరంజి వద్ద బాధితుడు తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం అతడిని నీటిలో ముంచి చంపేశానన్నాడు. ఈ క్లూ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించగా, డిసెంబర్ 1986లో ఒక పత్రికలో వచ్చిన వార్త కీలకమైంది. కూడరంజి మిషన్ హాస్పిటల్ వెనుక పొలాల్లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఆ వార్త సారాంశం.తిరువంబడి పోలీసులు 1980ల కాలంలో మలబార్ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ కేసుల డేటాను పరిశీలించారు. సుదీర్ఘ శాస్త్రీయ విచారణ అనంతరం ఆ మృతుడు కన్నూర్ జిల్లా ఇరిట్టికి చెందిన మోహనన్గా గుర్తించారు. నిందితుడి వాంగ్మూలానికి, ఘటనా స్థలాలకు సరిగ్గా సరిపోలడంతో ఈ కేసును ధృవీకరించారు. కాగా, 1989లో కోజికోడ్ బీచ్లో చేసినట్లు చెబుతున్న మరో హత్యకు సంబంధించిన వివరాలను, బాధితుడి గుర్తింపును కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ‘నీట్’ టెన్షన్: ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తూనే.. -
రిటైర్ అయిన కొన్ని నిమిషాల్లోనే ప్రమోషన్.. ఇదేమి వింత గోల?
తిరువనంతపురం: కేరళలోని కన్నూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న బిందు అనే మహిళకు ఉద్యోగ జీవితంలో చివరి రోజున ఊహించని అనుభవం ఎదురైంది. 2026 మే 30న ఆమె చివరి పని దినం. ఇన్నేళ్లు సేవలు అందించిన ఆమెకు సహోద్యోగులు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్న సమయంలో, పదవీ విరమణకు సంబంధించిన ప్రక్రియలు పూర్తిచేసిన కొన్ని నిమిషాల్లోనే ఆమెకు ఆశ్చర్యకరమైన సమాచారం అందింది.సాయంత్రం 5 గంటల సమయంలో కళాశాల నుంచి బయలుదేరి, 5.30 గంటలకు ఇంటికి చేరుకున్న బిందుకు వాట్సాప్ ద్వారా సందేశం వచ్చింది. అందులో ఆమెకు పదోన్నతి కల్పించి, త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్గా నియమించినట్టు పేర్కొన్నారు. మరుసటి రోజే విధుల్లో చేరాలని కూడా ఆదేశించారు.ఈ పదవి సాంకేతిక విద్యాశాఖ పరిపాలనా విభాగంలో ఉన్నత హోదా. సాధారణంగా ఇలాంటి నియామకాలు, పదోన్నతి ఉత్తర్వులు ఈ-ఆఫీస్ వ్యవస్థ ద్వారా జారీ అవుతాయి. అయితే నిర్ణయం చివరి క్షణంలో తీసుకోవడంతో వాట్సాప్ ద్వారా సమాచారం పంపించారు.తాను స్వస్థలం చేర్తలాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ సమాచారం రావడంతో ఆమె ప్రణాళికలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే మరో సమస్య ఎదురైంది. మే 31 ఆదివారం కావడంతో కొత్త ఉద్యోగంలో అధికారికంగా ఎలా చేరాలనే ప్రశ్న తలెత్తింది.బిందు వెంటనే తిరువనంతపురంలోని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్ను సంప్రదించారు. అనంతరం త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల సూపరింటెండెంట్తో మాట్లాడారు. అప్పటికే ఆమె నియామకంపై డైరెక్టరేట్ నుంచి సూపరింటెండెంట్కు ఆదేశాలు చేరాయి. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు కూడా తెలియజేశారు.స్వస్థలానికి వెళ్లేందుకు బిందు ముందుగానే మావేలి ఎక్స్ప్రెస్లో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే చేర్తలాలో దిగకుండా త్రిస్సూర్లో దిగారు. అక్కడ ఒక బంధువు రైల్వే స్టేషన్ వద్ద ఆమెను తీసుకెళ్లి బస ఏర్పాట్లు చేశారు.సూపరింటెండెంట్ సూచనల మేరకు ఆదివారం ఉదయం ఒక క్లర్క్ ప్రత్యేకంగా కళాశాలకు వచ్చి కార్యాలయాన్ని తెరిచారు. ఉదయం 10 గంటలకు బిందు త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఆమె ఉద్యోగ సర్వీసు అధికారికంగా ముగిసింది. దీంతో ఆ పదవి నుంచి కూడా విరమించారు.అలాగే, 24 గంటల్లోనే బిందు రెండు సార్లు పదవీ విరమణ చేసిన అరుదైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. మొదట కన్నూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అకౌంట్స్ అధికారిగా, ఆ తర్వాత త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్గా పదవీ విరమణ చేశారు.పదోన్నతి వస్తుందని బిందు ఆశించినప్పటికీ, ఉత్తర్వులు ఆలస్యం కావడంతో మే మధ్య నాటికే ఆశలు వదులుకున్నారు. అయితే చివరి క్షణంలో పదోన్నతి రావడంతో, ఆ హోదాతోనే పదవీ విరమణ చేయగలిగినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. లలిత అంబికా దేవి, దివంగత రామచంద్ర పణిక్కర్ దంపతుల కుమార్తె అయిన బిందు, చేర్తలాలోని పట్టణక్కడ్లో నివసిస్తున్నారు. ఆమె భర్త అనిల్ కుమార్ రిటైర్డ్ సైనిక అధికారి. వీరికి వైశాఖ్, డాక్టర్ వైష్ణ శ్యామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. -
స్కూళ్లు తెరుచుకున్న రోజే ఘోరం.. విచారణకు ఆదేశాలు
తిరువనంతపురం: కేరళలో జూన్ ఒకటిన కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. అయితే ఇంతలోనే తిరువనంతపురంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత పురాతన విద్యాసంస్థల్లో ఒకటైన అట్టాకుళంకర సెంట్రల్ హైస్కూల్ భవనంలోని ఒక భాగం ఊహించని రీతిలో కుప్పకూలింది. అయితే, అదృష్టవశాత్తూ తరగతులు ముగిసి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిన తర్వాత ఈ ఘటన జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.పెను ప్రమాదం తప్పిందిసాయంత్రం 5 గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కూలిపోయిన ఆ భాగంలో సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కార్యాలయం ఉంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి హాని జరగలేదు. ఒకవేళ స్కూల్ వేళల్లో గనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే, పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిజనిర్ధారణకు విచారణఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఎన్. షంసుద్దీన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. భవనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? క్రమ పద్ధతిలో భద్రతా తనిఖీలు జరిగాయా? లేదా? అనే అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాతబడిన నిర్మాణాల కండిషన్పై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.భయపెడుతున్న పురాతన భవనాలుతిరువనంతపురంలోని అత్యంత పురాతన విద్యాసంస్థల్లో అట్టాకుళంకర స్కూల్ ఒకటి. ఈ భవనాల దుస్థితిపై గతంలోనే పలుమార్లు ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాత స్కూల్ భవనాల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. పాఠశాల ప్రాంగణం మొత్తం పరిశీలించి, తదుపరి భద్రతా చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త: లైవ్లోకి సీబీఎస్ఈ రీ ఎవాల్యుయేషన్ పోర్టల్ -
రిటైర్మెంట్ వయసులో నియామక ఉత్తర్వు
మలప్పురం: కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ముచ్చికల్ అబ్దుల్ మజీద్కు ఎదురైన పరిస్థితి ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయనకు పీఎస్సీ ఉద్యోగ నియామక ఉత్తర్వు అందింది. అయితే ప్రస్తుతం మజీద్ వయస్సు 60 ఏళ్లు దాటడంతో, ఉద్యోగంలో చేరడమా లేదా రిటైర్మెంట్ తీసుకోవడమా అన్న సందిగ్ధంలో ఆయన చిక్కుకుపోయారు.2005లో పీఎస్సీ పరీక్ష రాసి..2005లో మజీద్ పార్ట్-టైమ్ జూనియర్ ఎల్పీఎస్ అరబిక్ లాంగ్వేజ్ టీచర్ పోస్టు కోసం పీఎస్సీ పరీక్ష రాశారు. ఆ ర్యాంక్ లిస్టులో ఆయన 12వ స్థానంలో నిలిచారు. నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగం ఆయనకు దక్కాల్సింది. కానీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ ప్రక్రియ 18 ఏళ్ల పాటు సాగదీతకు గురైంది. 2022లో ఆ ఖాళీని పీఎస్సీ గుర్తించినప్పటికీ, ఉత్తర్వు రావడానికి మరో నాలుగేళ్లు పట్టింది.పరిపాలనా వైఫల్యాలకు పరాకాష్టఒక నియామక ప్రక్రియ గరిష్టంగా ఏడాదిలోపు పూర్తి కావాల్సిన చోట, దాదాపు రెండు దశాబ్దాలు పట్టడం వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది. 2026 ఏప్రిల్ 26న మజీద్కు నియామక ఉత్తర్వు అందినప్పటికీ, అప్పటికే ఆయన పదవీ విరమణ వయసు చేరుకోవడంతో అది అపహాస్యం పాలైంది. అధికార యంత్రాంగం, పీఎస్సీ వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.న్యాయం కోసం పోరాటంప్రస్తుతం తన రికార్డుల్లో పుట్టిన తేదీకి సంబంధించి ఉన్న చిన్న తప్పును సరిదిద్దాలని మజీద్ కోరుతున్నారు. తన అసలు పుట్టిన తేదీ ఆధారంగా, కనీసం ఒక్క ఏడాది పాటు సర్వీసులో ఉండే అవకాశం కల్పించాలని ఆయన ముఖ్యమంత్రిని ఆశ్రయించారు. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. పట్టు వదలని ఈ ఉపాధ్యాయుని పోరాటపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చసాగుతోంది.ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ? -
‘వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు
మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో.. అదీ పోలీసుల సమక్షంలోనే జనాలు నిందితుల మీద దాడి చేసే దాకా తీసుకెళ్లింది.. కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగాడ్లో.. ఏడాదిన్నర వయసున్న అర్షిద్ మరణం అందరితో ‘అయ్యో పాపం’ అనిపిస్తోంది. భోజనం చేస్తుండగా.. దగ్గు, వాంతులు చేసుకుంటూ ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడని.. ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ కన్నుమూశాడని తల్లి అఖిల(24) మీడియా ముందు వాపోయింది. అయితే ఆమె కన్నీళ్లంతా కట్టుకథ అని తేలడానికి 24 గంటలు కూడా పట్టలేదు. అర్షిద్ మాములు చిన్నారేం కాదు. కొన్ని నెలల కిందట.. రెండు చేతులకు బ్యాండ్లతో తల్లి చంకలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాడు. ఆడుకుంటుండగా సైకిల్ మీద నుంచి పడిపోయాడని చెబుతూ.. ఆమె పలువురి సాయం కోరడం నెట్టింట వైరల్ అయ్యింది. అలా ఆ తల్లికి చాలామంది డబ్బు కూడా పంపించారు. కట్ చేస్తే.. మే 29వ తేదీన ఆ చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. Tragic incident from God’s own countryHere is a 2-week-old video of 1-and-a-half-year-old Arshad with both hands fractured. In the video, his mother Akhila lies, claiming he broke his hands by falling off a bicycle.Tragically, little Arshad passed away 2 days ago at the… pic.twitter.com/j1WnUTE2fU— Revolutionary Monk (@RevolutionMonk) May 31, 2026అన్నం తింటుండగా ఆ చిన్నారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అఖిల, ఆమె స్నేహితుడు అష్కర్ అర్షిద్ను హుటాహుటిన పనవూర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. ఈలోపు ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానంతో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో షాకింగ్ విషయాలు బయటపెట్టాయి. అర్షిద్ ఒంటిపై సుమారు 50కి పైగా గాయాల గుర్తులు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు.. సిగరెట్లతో ఒంటి నిండా కాల్చిన గాయాలు ఉండడం వైద్యుల్ని విస్మయానికి గురిచేసింది. పైగా ఈ గాయాలు ఒక్కరోజులో జరిగినవి కావని.. చాలా కాలంగా కొనసాగుతున్న హింసకు సంబంధించినవని తేల్చారు.నెలల వయసు నుంచే..అఖిల కడుపుతో ఉన్నప్పుడు ఆమె భర్త అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె అష్కర్(31) అనే వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. ఈ సంబంధం కారణంగానే ఆమె పుట్టిన బిడ్డను తల్లికి అప్పగించింది. అయితే అఖిల భర్త తరఫున బంధువుల అభ్యంతరాలతో తిరిగి చిన్నారిని తన దగ్గరకు తెచ్చుకుంది. అప్పటి నుంచే చిన్నారి అర్షిద్కు వేధింపులు మొదలయ్యాయి. ఆ సమయంలోనూ శరీరంపై తరచూ గాయాలు కనిపించేవని.. అడిగితే గాయాలపాలవుతున్నాడని చెప్పేదని అఖిల తల్లి పోలీసులకు చెబుతోంది. అంతేకాదు.. మే నెలలో వైరల్ అయిన వీడియోను కూడా అర్షిద్ అమ్మమ్మ గుర్తు చేసింది. మనవడి చేతులు విరిగిన సందర్భంలోనూ కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఇక.. చుట్టుపక్కల వాళ్లు చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంపై చాలాసార్లు అఖిలను నిలదీసినట్లు చెబుతున్నారు. ఆగ్రహంతో దంచి కొట్టారు!పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా మార్చారు. కేసు తీవ్రత దృష్ట్యా మే 30న అఖిల, అష్కర్లను అరెస్ట్ చేశారు. చిన్నారిపై నిరంతరం హింస కొనసాగుతున్న విషయం తెలిసినా తల్లి అడ్డుకోలేదని, అధికారులకు సమాచారం ఇవ్వలేదని స్పష్టమైంది. అందుకే ఆమెపైనా హత్య కేసు నమోదు చేశారు. అంతేకాదు.. గతంలో చేతులు విరిగిన ఘటనలోనూ ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఆదివారం అష్కర్ను ఘటనాస్థలికి తీసుకెళ్లి సాక్ష్యాలు సేకరిస్తుండగా.. స్థానికులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు కూడా వాళ్లను నిలువరించలేపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని అర్షిద్ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ అర్షిద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.തിരുവനന്തപുരം നെടുമങ്ങാട് ഒന്നര വയസ്സുകാരൻ കൊല്ലപ്പെട്ട സംഭവത്തിൽ പ്രതികളിൽ ഒരാളായ അഷ്കറുമായി തെളിവെടുപ്പ് നടത്തുന്നതിനിടെ പ്രതിയെ കയ്യേറ്റം ചെയ്ത് നാട്ടുകാർ #nedumangad #ashkar #crime #kerala pic.twitter.com/4MEuPTbAXl— DD News Malayalam (@DDNewsMalayalam) May 31, 2026 -
మమత ఓటమితో.. కేరళ ప్లైవుడ్ పరిశ్రమలకు 2వేల్ కోట్ల నష్టం
-
సౌదీ నుంచి సజీవంగా వస్తాడనుకోలేదు..!
రెండు దశాబ్దాల ఆ తల్లి నిరీక్షణకు తెరపడింది. కోట్ల రూపాయల ‘బ్లడ్ మనీ’.. దీర్ఘకాల న్యాయపోరాటం, అంతర్జాతీయ స్థాయిలో సాగిన చర్చల అనంతరం అబ్దుల్ రహీమ్ చివరికి స్వదేశానికి చేరాడు. అదీ ఈద్ అల్ అదా రోజున!. ఇంకేం కోజికోడ్ విమానాశ్రయంలో ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు అల్లా సమాధానం ఇచ్చాడు” అంటూ తల్లి ఫాతిమా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని కదిలించాయి.కేరళలోని కోజికోడ్ జిల్లా ఫెరోక్కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఆయన డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో, ఆయన సంరక్షణలో ఉన్న ఓ ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారి మరణించిన ఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సౌదీ మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం.. ఆ చిన్నారి సౌదీ వ్యాపారవేత్త అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి కొడుకు. ఆ బాలుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో, వైద్య సహాయక పరికరాలపై ఆధారపడి చికిత్స పొందుతున్నాడు. ఒక సందర్భంలో ఆ చిన్నారికి అమర్చిన వైద్య సహాయక పరికరాన్ని రహీమ్ అనుకోకుండా తాకాడు. దీంతో అస్వస్థతకు గురైన ఆ బాలుడు.. మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.తాను కావాలని చేయలేదని రహీమ్ చెప్పినా కోర్టులు వినలేదు. ఈ ఘటనపై సౌదీ కోర్టు విచారణ జరిపి 2012లో ఆయనకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు తర్వాత కేసు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కొడుకు మీద ఆశలు వదిలేసుకున్న టైంలో.. దగ్గరి బంధువు ద్వారా బ్లడ్ మనీ గురించి తెలుసుకుంది రహీమ్ తల్లి ఫాతిమా. కొందరు అధికారులు, మత పెద్దలు ద్వారా కొడుకు విడుదల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా నెలల తరబడి చర్చల తర్వాత.. రహీమ్కు క్షమాభిక్ష ప్రసాదించేందుకు అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి బ్లడ్మనీకి అంగీకరించింది. కేరళలో పెద్ద ఎత్తున మానవతా సహాయ ప్రచారం ప్రారంభమైంది. ప్రవాస భారతీయులు, వ్యాపారులు, విద్యార్థులు కలిసి నిధులు సేకరించారు. మొత్తం సుమారు రూ.47 కోట్లు సమీకరించగా, అందులో రూ.34 కోట్లు ‘బ్లడ్ మనీ’గా బాధిత కుటుంబానికి చెల్లించారు. అనంతరం బాధిత కుటుంబం క్షమాభిక్ష ఇవ్వడంతో 2014లో మరణశిక్ష రద్దయింది. అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.సౌదీ చట్టాల ప్రకారం పబ్లిక్ రైట్స్ కింద ఆయనకు అప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. దీంతో.. ఆ శిక్ష పూర్తయ్యేదాకా ఆయన ఆగాల్సి వచ్చింది. ఇటీవల ఆ శిక్షపూర్తి కావడంతో రహీమ్ విడుదల అయ్యాడు. ఈద్ పండుగ రోజున ఆయన కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, వందలాది మంది కుటుంబ సభ్యులు, మద్దతుదారులు అక్కడికి వచ్చి ఘన స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆ క్షణం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.ఇంటివద్ద కూడా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. తల్లి ఫాతిమా కన్నీళ్లతో కుమారుడిని ఆలింగనం చేసుకుని, “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు ఈ రోజు సమాధానం లభించింది” అని చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. భారత రాయబార కార్యాలయం, లీగల్ కమిటీ సహకారంతో అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తిచేసి ఆయన స్వదేశానికి రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఘటన కేరళలోనే కాకుండా విదేశాల్లో ఉన్న మలయాళీ సమాజంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది.నిమిషా ప్రియా పరిస్థితి?రహీమ్ ఘటన నేపథ్యంలో.. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియా కేసు కూడా కొనసాగుతోంది. 2017లో ఓ యెమెన్ పౌరుడి మరణ ఘటనలో ఆమెపై కేసు నమోదై కోర్టు మరణశిక్ష విధించింది. అయితే కుటుంబ సభ్యులు, మానవ హక్కుల సంఘాలు, భారత ప్రభుత్వ వర్గాలు కలిసి ఆమె శిక్షను నిలిపివేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ‘బ్లడ్ మనీ’ ద్వారా క్షమాభిక్ష సాధించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, కేసు ఇంకా తుది దశకు చేరలేదు. -
నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎల్నివో ప్రభావంతో ఐఎండీ అంచనాలు తలకిందులయ్యాయి. నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యమవుతోంది. నెమ్మదిగా కదులుతున్న నైరుతి రుతు పవనాలు... జూన్ 4,5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళను తాకిన మూడు రోజుల తర్వాత తెలంగాణలో రుతు పవనాలు ప్రవేశించనున్నాయి.మే చివరి వారంలో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ భావించింది. అయితే, ఈ ఏడాది ఇంకా అక్కడ విస్తరించలేదు. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ సీజన్లో వర్షపాతం తక్కువగా ఉండవచ్చని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రుతు పవనాల రాక ఆలస్యం కావడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. రుతుపవన గాలులు అరేబియా సముద్రంలోని చాలా భాగాలు, లక్షద్వీప్ ప్రాంతం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోకి మరింత ముందుకు సాగాయి. రుతుపవనాల గమనం ప్రస్తుతం నెమ్మదిగా ఉన్నప్పటికీ.. అవి సహజంగానే మళ్లీ పుంజుకుంటాయని ఐఎండీ పేర్కొంది.రుతుపవనాల విస్తరణకు ఆటంకం కలిగించిన సముద్ర, వాతావరణ పరిస్థితులు ఇప్పుడు క్రమంగా తొలగిపోతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడానికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం.. రుతుపవనాల వ్యవస్థ నైరుతి అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం మీదుగా మయన్మార్ వరకు విస్తరించి ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది.సాధారణంగా జూన్ 1న ప్రవేశించే రుతుపవనాలు.. ఈసారి దాదాపు ఐదు రోజులు ముందుగానే.. మే 26 నాటికే కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ గతంలో అంచనా వేసింది. అయితే.. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా రుతుపవన గాలులు తాత్కాలికంగా బలహీనపడ్డాయి. కాగా, ప్రస్తుత మందగమనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. రుతుపవనాలు ఇప్పటికే దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తరించాయి. ఇప్పుడు వాయవ్య దిశగా వేగంగా కదులుతున్నాయి. ప్రారంభ అంచనాతో పోలిస్తే స్వల్పంగా ఆలస్యమైనప్పటికీ.. రుతు పవనాల ప్రస్తుత కదలిక సాధారణంగానే ఉన్నాయి.సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 27 నాటికి రాజధాని ఢిల్లీకి చేరుకుంటాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా.. జూన్ 25 నుండి 30 మధ్య రుతుపవనాలు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మందగమనం జూన్ మొదటి వారం వరకు కొనసాగకపోతే.. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాల గమనం చాలా వరకు సాధారణంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
కేరళ అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ సతీశన్-విజయన్!
కేరళ రాజకీయాల్లో మరోసారి “వందేమాతరం” వివాదం చెలరేగింది. కొత్త అసెంబ్లీ సమావేశాల తొలి రోజే జాతీయ గీతం ఆలాపన చుట్టూ మొదలైన వివాదం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. గవర్నర్ సమక్షంలో పూర్తి “వందేమాతరం” వినిపించాల్సిన కేంద్ర మార్గదర్శకాలను పాటించలేదంటూ బీజేపీ మండిపడుతుండగా.. ఇది ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న సంప్రదాయమేనని ప్రభుత్వం సమర్థించుకోవడం, దానికి ప్రధాన ప్రతిపక్షం మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.తిరువనంతపురంలోని అసెంబ్లీలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రసంగానికి ముందు “వందేమాతరం”లో తొలి రెండు చరణాలనే ఆలపించారు. అయితే 2026 ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాల్లో పూర్తి ఆరు చరణాలు వినిపించాలని సూచించిందని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై గవర్నర్ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ షమ్షీర్ దృష్టికి ప్రోటోకాల్ అంశాన్ని తీసుకెళ్లారు.VIDEO | Thiruvananthapuram: Kerala Governor Rajendra Vishwanath Arlekar on truncated 'Vande Mataram' being reportedly played ahead of his address in the state Assembly, says, "What we had insisted that there has to be, whenever Governor is present, it is the protocol, you are… pic.twitter.com/liuZK9IBsx— Press Trust of India (@PTI_News) May 29, 2026అయితే ఈ వ్యవహారంపై కేరళ ప్రభుత్వం మాత్రం ఇది కొత్త విషయం కాదని స్పష్టం చేసింది. అసెంబ్లీలో గతం నుంచే “వందేమాతరం”లో తొలి రెండు చరణాలనే ఆలపిస్తున్న సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత పినరయి విజయన్ కూడా ప్రభుత్వ వైఖరినే సమర్థించారు. పూర్తి “వందేమాతరం” ఆలాపన తప్పనిసరి కాదని, 2026 మార్చిలో సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. దీంతో ఇది కేవలం ప్రోటోకాల్ వివాదమా? లేక రాజకీయ సంకేతమా? అన్న చర్చ మొదలైంది.ఇక బీజేపీ నేతలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. “వందేమాతరం”కు 150 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఇలా చేయడం జాతీయ గీతానికే అవమానమని విమర్శించారు. గవర్నర్ను, లోక్భవన్ను, జాతీయ వారసత్వాన్ని కూడా అవమానించినట్లేనని ఆరోపించారు. అంతేకాదు.. ప్రభుత్వం జమాత్-ఏ-ఇస్లామీ, సీపీఎం అభిప్రాయాలకు తలొగ్గుతోందంటూ ఆరోపణలు గుప్పించారు.ചരിത്രത്തിൽ ആദ്യമായി കേരള നിയമസഭയിൽ❤️ വന്ദേ മാതരം ❤️For the first time in history, “Vande Mataram” was sung in the Kerala Legislative Assembly.🔥🔥 pic.twitter.com/f0URhQmPGd— ശിവ (@Rathees19362122) May 29, 2026మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వివాదం తలెత్తడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ 102 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి అసెంబ్లీలో “వందేమాతరం” ఆలాపన కూడా చారిత్రక పరిణామమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. 1957 తర్వాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. “వందేమాతరం”లో ఎన్ని చరణాలు పాడాలి అనే అంశం ఇప్పుడు కేరళలో రాజకీయ, సాంస్కృతిక, రాజ్యాంగ చర్చకు దారితీసింది. -
పంపా నదిలో ఇక ‘నో డంపింగ్’!
శబరిమల యాత్ర నేపథ్యంలో పరమపవిత్రంగా భావించే పంపా నది కాలుష్య కూపంగా మారడంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నదిలో బట్టలు, ఇతర వ్యర్థాలు పడేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని పేర్కొంటూ.. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.శబరిమల యాత్రకు వచ్చే భక్తులు సంప్రదాయాల పేరుతో పాత బట్టలు, తువాళ్లు పంపా నదిలో వదిలిపెడుతుండడం, అలాగే చెత్తను పారబోస్తుండడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. దీనివల్ల నది కాలుష్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ దృశ్యాలు బయటకు రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా హైకోర్టు స్వయంగా (సుమోటోగా) ఈ అంశాన్ని విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కేసును విచారించిన హైకోర్టు.. అధికారులపై గత విచారణల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యంత్రాంగం కదిలి క్లీన్ డ్రైవ్ చేపట్టింది. ఇప్పటికే నదిలో పేరుకుపోయిన బట్టలు, వ్యర్థాల్లో 97 శాతం వరకు తొలగించినట్లు కోర్టుకు శుక్రవారం నివేదించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. పరిస్థితి మెరుగుపడిందని పేర్కొంటూ సుమోటో పిటిషన్ను ముగించింది.అయితే భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డుతో పాటు పాటు స్థానిక సంస్థలు, పోలీసులు, సంబంధిత అధికారులు కలిసి పనిచేసి పంపా నదిలో బట్టలు, ఇతర వ్యర్థాలు పారబోయకుండా నిరోధించాలని ఆదేశించింది.అలాగే శబరిమల యాత్రికుల్లో అవగాహన పెంచాలని, నది పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదని కోర్టు వ్యాఖ్యానించింది. నదీ తీరాల్లో పర్యవేక్షణ పెంచడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది.కేరళలోని అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన నదుల్లో పంపా నది ఒకటి. ఈ నది పశ్చిమ కనుమలలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న పులచిమల కొండల ప్రాంతంలో పుట్టి.. పథనంతిట్ట, అలప్పుజా గుండా సుమారు 175 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. చివరకు వెంబనాడ్ సరస్సులో కలిసే ఈ నది, అక్కడి నుంచి అరేబియా సముద్రాన్ని చేరుతుంది.శబరిమల అయ్యప్ప స్వామి యాత్రలో పంపా నదికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. అయ్యప్ప భక్తులు ఆలయ దర్శనానికి ముందు ఈ నదిలో పవిత్ర స్నానం చేసి, పాప విమోచనం కలుగుతుందని విశ్వసిస్తారు. అందుకే పంపాను “దక్షిణ గంగ” అని కూడా పిలుస్తారు. అంతేకాదు.. కేరళలో తాగునీరు, సాగు, మత్స్యకార రంగాలకు కూడా ఈ నది కీలక ఆధారంగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో యాత్రికుల రద్దీ, వ్యర్థాల పారవేత, కాలుష్యం కారణంగా పంపా నది పరిశుభ్రతపై పర్యావరణవేత్తల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. -
రెండు దశాబ్దాల తరువాత..
కేరళలోని కోజికోడ్ సమీపంలో ఉన్న ఫెరోక్లోని ఆ ఇంట్లో బక్రీద్ నాడు అసలైన వేడుక జరిగింది. సౌదీ జైలులో రెండు దశాబ్దాలు గడిపి, మరణశిక్షను ఎదుర్కొన్న వ్యక్తి కేరళకు తిరిగి వచ్చాడు. టీనేజర్ మృతికి కారణమయ్యారనే అభియోగంతో మరణశిక్ష పడిన వ్యక్తి.. ఉరిశిక్ష నుంచి తృటిలో తప్పించుకుని ఇంటికి తిరిగొచ్చాడు. డ్రైవర్గా వెళ్లి కేర్ టేకర్గా..సౌదీ అరేబియాకు వెళ్లడానికి ముందు రహీం కేరళలో ఆటోరిక్షా, స్కూల్ బస్సు నడిపాడు. ఆరుగురు తోబుట్టువులలో అందరికంటే చిన్న వాడైన అతను, డ్రైవర్గా ఉద్యోగం సంపాదించి తర్వాత 2006 నవంబర్ 28న రియాద్కు వెళ్లాడు. కానీ, పక్షవాతంతో బాధపడుతూ శ్వాస పరికరంపై ఆధారపడి జీవిస్తున్న 17 ఏళ్ల వ్యక్తికి కేర్టేకర్గా పని ఇచ్చారు. 2006 డిసెంబర్ 24న, ఆ బాలుడిని వెనుక కూర్చో బెట్టుకుని రహీమ్ వాహనం నడుపుతుండగా శ్వాస సహాయక పరికరం ఊడిపోవడంతో ఆ బాలుడు మరణించాడు. అప్పుడు 26 ఏళ్ల వయసున్న రహీం, సౌదీ అరేబియాకు వచ్చిన కేవలం 28 రోజులకే అరెస్టయ్యాడు. 2011లో సౌదీ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ శిక్షను సమర్థించాయి.పరిహారంతో పరిష్కారం...అతనికి మరణశిక్ష ఎప్పుడైనా పడొచ్చని అతని కుటుంబం అనుక్షణం భయంతో జీవించింది. అయితే రూ. 34 కోట్ల పరిహారం ఇస్తే రహీంను క్షమించడానికి ఆ కుటుంబం అంగీకరించింది. దీంతో అతని మరణ శిక్షను రద్దు చేశారు. పొట్టకూటి కోసం అంతదూరం వెళ్లిన రహీం అంతమొత్తాన్ని ఎలా ఇవ్వగలడు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీ సమాజం అతనికి సాయం చేసింది. భారీ క్రౌడ్ఫండింగ్తో విరాళాలు వెల్లువెత్తాయి. నాలుగు రోజుల్లోనే విరాళాలు సేకరించి పరిహారం పూర్తిగా చెల్లించారు. అయితే, రహీం 20 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేయాలని సౌదీ అధికారులు ఆదేశించారు. అరబిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మే 20న ఆ శిక్ష ముగిసింది.తండ్రిని కోల్పోయి.. కోజికోడ్లో రహీం కుటుంబానికి ఈ సమయం పరీక్షలా నిలిచింది. అతను జైలు పాలైన ఆరు నెలలకే తండ్రి ముహమ్మద్కుట్టి మరణించారు. క్షమాభిక్ష మంజూరైన తర్వాత 2024 నవంబర్లో తల్లి ఫాతిమా అతన్ని ఒక్కసారి మాత్రమే కలవగలిగింది. వీడియో కాల్స్ వారికి ఊరటనిచ్చాయి. ఈ సుదీర్ఘ నిరీక్షణకు గురువారం తెరపడింది. తనకు పునర్జన్మను ప్రసాదించిన వారందరికీ రహీం కృతజ్ఞతలు తెలిపాడు. ఇంటికి చేరుకున్న రహీం ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. తన ప్రాణాలు నిలబెట్టి, తన విడుదలను సుసాధ్యం చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులందరికీ రహీం ధన్యవాదాలు తెలిపాడు. బక్రీద్ పండుగ సమయంలోనే రహీం తిరిగి రావడం తమ ఆనందాన్ని రెట్టింపు చేసిందని అతని స్నేహితులు, స్థానికులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ఇది కూడా చదవండి: పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు -
పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి
-
విజయన్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఈడీ అధికారుల వాహనంపై దాడి
తిరువనంతపురం: కేరళం మాజీ ముఖ్యమంత్రి విజయన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారుల వాహనంపై విజయన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తిరువనంతపురంలో ఆందోళనకారులను అదుపు చేసే సమయంలో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. విజయన్పై ఈడీ దాడి బీజేపీ-కాంగ్రెస్ ఒప్పందంలో భాగమని సీపీఎం ఆరోపణలు చేస్తోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి తిరువనంతపురం, కన్నూరులో విజయన్ ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కేసులో పినరయి విజయన్ ఇళ్లు సహా కేరళంలోని 10 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు.వందలాది పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు, మాజీ మంత్రులు విజయన్ ఇంటి ఎదుట గుమిగూడారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా పార్టీ కార్యకర్తలు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీలు చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ మాట్లాడుతూ.. ఈడీ దాడులు కాంగ్రెస్-బీజేపీ ఒప్పందంలో భాగమని అన్నారు. సీపీఎంను బలహీనపర్చే ప్రయత్నాలను ఆందోళనలు, న్యాయ పోరాటాలతో ఎదుర్కొంటామని చెప్పారు. -
విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
కేరళం మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత పినరయి విజయన్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆకస్మిక తనీఖీలకు దిగింది. విజయన్ నివాసంతో పాటు ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ భారీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఉదయం మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు జరుపుతున్నట్లు ఏఎన్ఐ సంస్థ ఓ కథనం ఇచ్చింది. ఈ సోదాల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం కూడా ఉందని ఆ కథనం పేర్కొంది. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో.. పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. విజయన్ కుమార్తె వీణ అవినీతి కేసులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.ఏంటీ సీఎంఆర్ఎల్ కేసు?కేరళ రాజకీయాల్లో ఇటీవల తరచూ చర్చకు వచ్చిన అంశాల్లో సీఎంఆర్ఎల్ కేసు ఒకటి. కొచిన్ మినలర్స్ అండ్ రూటిలె లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో సోదాలు నిర్వహించిన తరువాత, సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, చెల్లింపుల వివరాలు బయటపడ్డాయి. అందులో అవకతవకలు బయటపడ్డాయి. కొన్ని లావాదేవీలు నిజమైన వ్యాపార సేవలకు సంబంధం లేకుండానే జరిగాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఈ చెల్లింపులు ప్రధానంగా కన్సల్టెన్సీ/సర్వీస్ ఫీజుల పేరుతో జరిగినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆ సేవలు నిజంగా అందించబడ్డాయా? లేదా? అనేది ప్రధాన వివాదాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రాజకీయ, మీడియా వర్గాలు ఈ లావాదేవీలపై ప్రశ్నలు లేవనెత్తాయి.విజయన్ కూతురి పేరుతో..ఈ వివాదంలో ముఖ్యంగా వీణా విజయన్కు సంబంధించిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ (Exalogic Solutions) అనే సంస్థ పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని అప్పటి ప్రతిపక్ష పార్టీలు విజయన్ సర్కార్పై విరుచుకుపడ్డాయి. అయితే ఈ ఆరోపణలను వీణా విజయన్ ఇప్పటికే ఖండించారు. తమపై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరితమని, అన్ని లావాదేవీలు చట్టబద్ధంగా, పారదర్శకంగా జరిగాయని ఆమె చెప్పారు. అయినప్పటికీ.. ఈ మొత్తం వ్యవహారం కేరళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. నాడు అధికార పక్షంగా ఉన్న విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఈ ఆరోపణలను రాజకీయ దాడిగా అభివర్ణించింది. ప్రతిపక్షాలు మాత్రం అవినీతి అనుమానాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశాన్ని తమ ఆయుధంగా యూడీఎఫ్ మల్చుకుంది. అలా విజయన్ ఓటమిలో ఈ ఆరోపణలు కూడా ఓ భాగం కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ కేసులో కోర్టు స్థాయిలో(హైకోర్టులో విచారణ దశలో ఉంది) నేరం నిర్ధారణ కాలేదు. అయితే ఈడీ సోదాల నేపథ్యంలో ఈ కేసు మరోసారి ప్రాముఖ్యతను సంతరించుకుంది. -
టాయిలెట్లో బిడ్డను కని.. వెంటిలేటర్ నుంచి విసిరేసి..
హరిపాడు: కేరళలోని అలప్పుజ జిల్లా, హరిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కడుపునొప్పిగా ఉందని చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన 19 ఏళ్ల విద్యార్థిని, టాయిలెట్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత ఆ నవజాత శిశువును ఆస్పత్రి టాయిలెట్ వెంటిలేటర్ గుండా బయటకు విసిరేసింది.ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తతతో..తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో విద్యార్థిని టాయిలెట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే, బయట నుంచి పసికందు ఏడుపు వినిపించడాన్ని డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది గమనించారు. డాక్టర్లు తిష, డాక్టర్ ఆల్ఫీ, నర్సింగ్ ఆఫీసర్ జిషా, సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలో గాలించారు. ఆస్పత్రి భవనం వెలుపల పడి ఉన్న శిశువును గుర్తించి రక్షించారు.ప్రాణాపాయం నుంచి..ఆ ప్రాంతంలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉండటం వల్ల, చిన్నారికి ప్రమాదం పొంచి ఉండేది. కానీ, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, వేగంగా స్పందించడం వల్ల శిశువు ప్రాణాలతో దక్కింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, పసికందు సురక్షితంగా ఉంది. ప్రస్తుతం చిన్నారి, ఆమె తల్లి ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే తల్లికి, బిడ్డకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వారిద్దరినీ ఆలప్పుజ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.ఇది కూడా చదవండి: గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు! -
‘షిగెల్లా’ మళ్లొచ్చింది.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్
కోజికోడ్: కేరళలోని కోజికోడ్ జిల్లా పెరుమన్నలో ఇద్దరు చిన్నారులకు షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. రెండుమూడేళ్ల వయస్సు గల ఈ ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పెరుమన్న పంచాయతీ పరిధిలోని పరక్కండం, పుతియోటిల్ ప్రాంతాలకు చెందిన ఈ చిన్నారులకు అనారోగ్య లక్షణాలు కనిపించడంతో, మొదట స్థానిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని మెడికల్ కాలేజీకి తరలించారు.తీసుకుంటున్న జాగ్రత్తలుషిగెల్లా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతంలో ఆరోగ్య శాఖ, పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే నివారణ చర్యలు చేపట్టారు. గతంలో కోజికోడ్లోని పెరువయల్ గ్రామ పంచాయతీలో షిగెల్లా ప్రబలి, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా, నివారణ చర్యలతో దానిని అదుపులోకి తెచ్చారు. అదే తరహా చర్యలను ఇప్పుడు పెరుమన్నలో కూడా అమలు చేస్తున్నారు.షిగెల్లా అంటే ఏమిటి?‘షిగెల్లా’ బ్యాక్టీరియా గ్రూపు వల్ల కలిగే పేగు సంబంధిత ఇన్ఫెక్షన్నే ‘షిగెల్లోసిస్’ అని పిలుస్తారు. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది. ప్రధానంగా విరేచనాలు, తీవ్రమైన సందర్భాల్లో రక్తంతో కూడిన విరేచనాలు దీని ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధి వల్ల కలిగే ‘డీహైడ్రేషన్’ అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోతే ఇది ప్రాణాపాయానికి దారితీయవచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, సరైన సమయంలో చికిత్స అందిస్తే దీనిని పూర్తిగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.లక్షణాలుషిగెల్లా బ్యాక్టీరియా పేగు పొరలకు సోకినప్పుడు, అది ‘షిగెల్లా టాక్సిన్’ అనే విషాన్ని విడుదల చేస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన ఒకటి నుండి మూడు రోజులలోపు (కొన్ని సందర్భాల్లో వారం రోజులలోపు) లక్షణాలు కనిపిస్తాయి.* రక్తం, శ్లేష్మంతో కూడిన విరేచనాలు* తీవ్రమైన కడుపు నొప్పి* వాంతులు, వికారం* మల విసర్జన తర్వాత కూడా ఇంకా అవ్వాలనే భావన కలగడం* కొన్ని సందర్భాల్లో ఫిట్స్ వంటి నాడీ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.చికిత్సడీహైడ్రేషన్ నివారణ: శరీరంలో కోల్పోయిన నీరు, లవణాలను భర్తీ చేయడం ప్రధాన చికిత్స. ఓఆర్ఎస్ ద్రావణం, ఉప్పు కలిపిన గంజి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. సాధారణ విరేచనాలకు యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. కానీ షిగెల్లోసిస్ విషయంలో ఇన్ఫెక్షన్ తీవ్రతను, వ్యాప్తిని తగ్గించడానికి వైద్యులు వీటిని సూచించవచ్చు. సకాలంలో వ్యాధిని గుర్తించకపోవడం వల్లే సమస్య తీవ్రమవుతోందని, రోగులు ఆసుపత్రికి వచ్చేసరికి తీవ్రమైన నిర్జలీకరణకు లోనవుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క కాఫీ.. చిన్న పేస్ట్రీ.. పెద్ద ఉపశమనం! -
లాటరీ టికెట్ల విక్రేతకు రూ.12 కోట్ల జాక్పాట్
కొల్లాం(కేరళ): కేరళకు చెందిన ఓ లాటరీ టికెట్ల విక్రేత ఏకంగా రూ.12 కోట్ల జాక్పాట్ గెల్చుకున్నారు. శనివారం ప్రకటించిన విష్ణు బంపర్ లాటరీలో ఈయన తన కోసం ఉంచుకున్న టికెట్ కోట్లు కురిపించింది. కొల్లాంకు చెందిన పొన్నన్ రోడ్డు పక్కన లాటరీ టికెట్లను అమ్ముతుంటారు. ఆయన భార్య, కుమారుడు చేసేదీ ఇదే. ‘నా లక్కీ నంబర్ 2, నేను సొంతానికి ఉంచుకున్న టికెట్ చిట్టచివరి నంబర్ కూడా ఇదే‘అని పొన్నన్ అన్నారు. లాటరీ వచ్చిందని చెబితే తానస్సలు నమ్మలేకపోయానన్నారు. ‘ఒకటికి పదిసార్లు చూసుకున్నా..కచ్చితంగా అది నా దగ్గరున్న టికెట్కే వచ్చిందా అని, నేను నమ్మకలేకపోయా’అంటూ ఆయన ఉద్వేగంతో చెప్పారు. ‘పేదలకు పిల్లనిచ్చే వారే దొరకడం లేదు. ఇకనైనా నా కుమారుడిని తగిన వధువు దొరుకుతుందం’టూ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మా ఆయన ఇప్పుడు కోటీశ్వరుడు. మాకున్న అప్పులన్నీ తీరుతాయి’అంటూ పొన్నన్ భార్య అంటోంది. -
‘దేశ అస్థిరతకే ‘కాక్రోచ్’ పార్టీ: బీజేపీ మండిపాటు
తిరువనంతపురం: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కేవలం ఒక వ్యంగ్య ప్రచారం కాదని, దీని వెనుక సరిహద్దు ఆవల నుండి జరుగుతున్న ఒక క్రమబద్ధమైన కుట్ర ఉందని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి, దేశాన్ని అస్థిరపరచడమే ఈ ప్రచారంలోని ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.డిజిటల్ యుద్ధంలో కొత్త ఎత్తుగడరాజీవ్ చంద్రశేఖర్ ఈ వ్యవహారాన్ని ‘క్లాసిక్ క్రాస్-బోర్డర్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్’గా అభివర్ణించారు. బాట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డిజిటల్ మానిప్యులేషన్ ఉపయోగించి, సహజమైన ప్రజా ఉద్యమంలా సోషల్ మీడియాలో కథనాలను అల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం సాధిస్తున్న ఆర్థిక ప్రగతిని ఓర్వలేని శక్తులే ఇలాంటి అశాంతిని ప్రేరేపిస్తున్నాయని, ఇవన్నీ దేశాభివృద్ధిని దెబ్బతీయలేవని ఆయన స్పష్టం చేశారు.కేరళలో ఊపందుకున్న ప్రచారంగత వారం వెలుగులోకి వచ్చిన ఈ సీజేపీ ఉద్యమం సోషల్ మీడియాలో వేగంగా విస్తరించింది. ‘ ఎక్స్’ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసినా, 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' పేరుతో మరో ఖాతా పుట్టుకొచ్చింది. కేరళకు చెందిన పలువురు యువ ఎమ్మెల్యేలు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం గమనార్హం. విద్యాశాఖ మంత్రిని తొలగించాలన్న డిమాండ్తో వీరు చేస్తున్న ఆన్లైన్ ప్రచారాలు చర్చనీయాంశంగా మారాయి.బెంగళూరు పోలీసుల హెచ్చరికఈ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. మే 24న బెంగళూరు టౌన్ హాల్ వద్ద ‘శాంతియుత మానవ గొలుసు’ నిర్వహిస్తామని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. బాధ్యతారహితమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ వ్యంగ్యం పేరుతో జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. -
ఆ ముఖం అయితే కచ్చితంగా గెలిచేవాళ్లం
కేరళం రాజకీయాల్లో ఒకప్పుడు “విజయానికి బ్రాండ్”గా కనిపించిన పార్టీ.. విమర్శలు, ఓటమి అనే ఎదురుదెబ్బతో ఆత్మపరిశీలనలో పడింది. సాధారణంగా.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థులపైనే విమర్శలు వినిపిస్తాయి. కానీ అక్కడ మాత్రం అక్కడి రాజకీయాల్లో మునుపెన్నడూ కనిపించని వాతావరణం కనిపిస్తోంది. బహిరంగంగా తమ నాయకత్వ నిర్ణయాలను సీపీఎం కార్యకర్తలే తప్పుబడుతున్నారు. పార్టీ ఓటమికి “కమ్యూనలిజం”, “మైనారిటీ ఓట్ల ధ్రువీకరణ” కారణమంటూ సీపీఎం రాష్ట్ర నాయకత్వం ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే క్షేత్రస్థాయి కేడర్ మాత్రం ఆ వాదనను నేరుగా తిరస్కరిస్తున్నారు. “మైనారిటీ ఓటు కాదు.. సీపీఎం సంప్రదాయ ఓటర్లే దూరమయ్యారు” అంటూ గణాంకాలతో సహా చెబుతున్నారు. తాళిపరంబ ఏరియా కమిటీ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు సీపీఎంలో పెరుగుతున్న అసహనాన్ని బహిర్గతం చేశాయి.కన్నూర్ జిల్లాలోని తాళిపరంబ నియోజకవర్గం సీపీఎంకు కంచుకోటగా ఉంటూ వచ్చింది. విజయన్కు అత్యంత సన్నిహితుడైన ఎంవీ గోవిందన్ ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే ఈ ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ను అధిష్టానం పరిగణనలోకి తీసుకోలేదు. గోవిందన్నే అక్కడ బరిలోకి దింపాలని కిందిస్థాయి శ్రేణులు అధిష్టానానికి విజ్ఞప్తి చేశాయి. అయితే పీకే శ్యామలను అభ్యర్థిగా దింపి ప్రయోగం చేసింది. అయితే అనూహ్యంగా.. యూడీఎఫ్ మద్దతుతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగిన టీకే గోవిందన్ ఇక్కడ ఘన విజయం సాధించారు. దీంతో దశాబ్దాల తర్వాత ఇక్కడ సీపీఎం అభ్యర్థి ఓటమిపాలైనట్లయ్యింది. “ప్రజల్లో ఆదరణ లేని ముఖాలను ముందుకు తెచ్చారు. నిజంగా ప్రజలు నమ్మిన నాయకత్వాన్ని పక్కన పెట్టారు” అంటూ మండిపడ్డారు. ఈ చర్చల్లో ఎక్కువగా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ పేరు ఎక్కువగా వినిపించింది. నిపా, కరోనా వైరస్ సమయాల్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆమెను ముఖ్యమంత్రి ముఖంగా ముందుకు తెచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వాళ్లంతా బహిరంగంగానే అభిప్రాయపడ్డారు. “ఆమె ముఖం అయితే గెలిచేవాళ్లం” అన్న వ్యాఖ్య ఇప్పుడు కేరళ రాజకీయాల్లో వైరల్గా మారింది.అయితే ఈ అసంతృప్తి కేవలం సీపీఎం లోపలే కాదు.. మిత్రపక్షమైన సీపీఐ వరకూ చేరడం కేరళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా మళ్లీ పినరయి విజయన్కే ప్రాధాన్యం ఇవ్వడంపై మిత్రపక్షమైన సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. యువ నాయకత్వాన్ని లేదంటే ప్రజల్లో మరింత ఆమోదం ఉన్న కొత్త ముఖాన్ని(కొంత మంది శైలజ పేరునే ప్రస్తావించారట) ముందుకు తేవాల్సిన అవసరం ఉందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఓటమికి విజయన్ నాయకత్వ శైలే ప్రధాన కారణమన్న వాదనను వారు కూడా పరోక్షంగా ప్రస్తావించినట్లు సమాచారం.అయితే సీపీఎం మాత్రం సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పినరయి విజయన్కే మళ్లీ ప్రధాన ప్రతిపక్ష ముఖంగా అవకాశం ఇచ్చింది. పార్టీని కట్టిపడేసే శక్తి ఇంకా ఆయనకే ఉందన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. కానీ గ్రాస్రూట్ స్థాయిలో మాత్రం ఈ నిర్ణయంపై అసంతృప్తి పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. ఇంత హైప్ ఉన్న కేకే శైలజ, పెరవూర్ నుంచి ఓటమి పాలయ్యారు. కేరళ పీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్(ప్రస్తుతం మంత్రి) చేతిలో ఆమె పరాజయం చెందారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు ఉన్న ఇమేజ్, కరోనా సమయంలో చూపించిన నాయకత్వం ఇప్పటికీ ప్రజల్లో బలంగానే ఉందని సీపీఎం వర్గాలు భావిస్తున్నాయి.వాస్తవానికి.. పినరయి విజయన్, ఎం.వి. గోవిందన్ లపై అధికార ధోరణి, అహంకారం, బంధుప్రీతి ఆరోపణలు ఉన్నాయి. శైలజా ప్రజాదరణ ఉన్నప్పటికీ, ఆమెను బలహీనమైన నియోజకవర్గంలో పోటీకి పంపడం ఓటమికి దారితీసిందనేది సీపీఎం కిందిస్థాయి శ్రేణుల వాదన. ఫలితంగా.. పార్టీ 2021లో 99 సీట్ల నుండి 2026లో 35కి పడిపోయింది. శైలజా ప్రజాదరణను ఉపయోగించుకోలేకపోవడం, నాయకత్వంపై అసంతృప్తి CPI(M)లో లోతైన సంక్షోభానికి దారితీసింది. ఇప్పటికైనా ఆ పని చేయాలని సీపీఎం నాయకత్వంపై తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి.ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. కేరళలో ఎల్డీఎఫ్ ఎదుర్కొంటున్న సమస్య కేవలం ఎన్నికల ఓటమి మాత్రమే కాదని స్పష్టమవుతోంది. నాయకత్వ శైలి, అభ్యర్థుల ఎంపిక, ప్రజల్లో పార్టీ ఇమేజ్, మిత్రపక్షాల అసంతృప్తి, గ్రాస్రూట్ కార్యకర్తల తిరుగుబాటు.. ఇవన్నీ ఇప్పుడు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ఈ అసంతృప్తి ఇక్కడితో ఆగుతుందా? లేక సీపీఎంలో మరింత పెద్ద మార్పులకు దారితీస్తుందా? అన్నదే ఇప్పుడు కేరళ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. -
నీ తొక్కుడు.. సాటెవ్వడూ!
మీరు ఎప్పుడైనా రెండు చక్రాల సైకిల్ తొక్కారా? ఏమిటీ పిచ్చి ప్రశ్న.. సైకిల్కు రెండు చక్రాలు కాకపోతే నాలుగు ఉంటాయా? సింగిల్ వీల్ సైకిల్ ట్రై చేశారా? తొక్కడం మాట అటుంచి కనీసం ఎప్పుడు చూడలేదు అంటారా? ఒంటి చక్రం సైకిల్ కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు యువ రైడర్ సనీద్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎవరితడు, ఏమిటి అతడి ప్రత్యేకత?కేరళం రాష్ట్రానికి చెందిన సనీద్ సైకిల్పై నేపాల్కు యాత్ర చేపట్టాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అతడు ఒక చక్రం ఉన్న సైకిల్పై (one wheel cycle) ఈ సాహసయాత్ర చేస్తున్నాడు. ప్రత్యేకంగా మార్పులు చేసిన సింగిల్ వీల్ సైకిల్ తొక్కుతూ జాతీయ రహదారులు, పబ్లిక్ రోడ్లపై అతడు దూసుకుపోతుంటే జనాలంతా వింతగా వీక్షిస్తున్నారు. తాజాగా అతడి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంకల్పానికి సెల్యూట్సైకిల్ ముందు భాగాన్ని పైకి లేపి, సీటుపై కూర్చుని బ్యాలెన్స్ చేసుకుని ఎంతో సహనంతో సనీద్ సాహసయాత్ర కొనసాగిస్తున్నాడు. సైకిల్ వెనుక భాగంలో సామాను పెట్టుకున్నాడు. ముందు-వెనుక కేరళ టు నేపాల్ బోర్డు తగిలించుకుని, జాతీయ జెండాలు పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇది చూసిన వాళ్లందరూ సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. పిచ్చితనం అని కొందరు, సాహసం అని మరికొందరు వ్యాఖ్యానించారు. మామూలు మనుషులు ఇలాంటి సాహసాలు చేయలేరని చాలా మంది పేర్కొన్నారు. అతడి అంకితభావం, సంకల్పాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. రహదారులపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.సాహసాలతో సావాసంఇలాంటి సాహస యాత్రలు సనీద్కు కొత్త కాదు. స్టంట్ పెర్ఫార్మర్ అయిన ఈ యువ రైడర్ గతంలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఒంటి చక్రం సైకిల్పై 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన గురించి లోకానికి చాటాడు. ఇదే విధంగా అతను కేరళ అంతటా దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణించినట్టు తన సోషల్ మీడియా బయోలో పేర్కొన్నాడు. సింగిల్ వీల్ సైకిల్ దేశమంతా చుట్టిరావాలన్నది తన కల అని వెల్లడించాడు. సనీద్ తన కలను సాకారం చేసుకోవాలని మనమంతా కోరుకుందాం. View this post on Instagram A post shared by Nafsil Ap (@nafsilpt)


