‘ది కేరళ స్టోరీ2’ సినిమాపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడుదలకు ముందే ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. ఈ సినిమా సెన్సార్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. సాధారణంగా కోర్టులు సినిమాలకు సంబంధించి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో అంతగా కల్పించుకోదు. కానీ ఈ సినిమా టైటిల్లో రాష్ట్రం పేరు ఉపయోగించారని, అందుకే ఈ కేసును విచారణకు అంగీకరించినట్లు కోర్టు తెలిపింది. ఈ నెల 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాతే సెన్సార్ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం తేల్చి చెప్పింది.
2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న చిత్రమిది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారని ఆరోపణలు చేస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. ఫిబ్రవరి 25 తర్వాత హైకోర్టు తన తీర్పుని వెలువరించనుంది. ఫిబ్రవరి 27న ఈ చిత్రం విడుదల కాబోతుంది.


